Vizianagaram
-
జాబ్మేళాకు విశేష స్పందన
రాజాం సిటీ: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. 213 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 90 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఐటీఐ ప్రిన్సిపాల్ బి.భాస్కరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకుంటే జీవితంలో వేగంగా స్థిరపడగలరన్నారు. బైక్ ఢీ కొని వ్యక్తి మృతివిజయనగరం క్రైమ్: స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కామాక్షినగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సై లక్ష్మీ ప్రసన్న కుమార్ వెల్లడించారు. కణపాక ప్రాంతానికి చెందిన కోరాడ శంకరరావు అనే వ్యక్తి ముస్లింల శ్మశాన వాటికకు వెళ్లి తిరిగి వస్తుండగా కామాక్షినగర్ వద్దకు చేరుకునే సరికి ఓ మోటార్ సైకిల్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్రావుకు తీవ్ర గాయాలు కావడంతో తక్షణమే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. బైక్ నడిపిన వ్యక్తిని ‘ఢిల్లీ డేవిడ్’గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుని బంధువు, కోరాడ అరవింద్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బైక్ నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రాజుల పాలనలో రాక్షసకాండ
పక్క చిత్రంలో పూరిగుడిసెలో బిక్కుబిక్కుమంటూ కనిపిస్తున్నది ఓ గిరిజన కుటుంబం. బొబ్బిలి మండలంలోని కాశిందొరవలస పంచాయతీ పరిధి డొంగురువలసలోని పోరంబోకు స్థలంలో పూరిపాక వేసుకుని ఎన్నికల కల్యాణ్, సీతాలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో 11 ఏళ్లుగా నివసిస్తున్నారు. కల్యాణ్ బొబ్బిలి కేంద్రంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తూ వస్తున్నారు. ఇటీవల వీరి ఇంటి సమీపంలో రామమందిరం నిర్మించారు. నిర్మాణ సమయంలో ఆలయానికి ఈ ఇల్లు ఎలాంటి అడ్డంకి కాలేదు. కానీ, ఆ కుటుంబంపై రాజకీయ కక్షగట్టి ఇంటి సమీపంలో చాలా ఇళ్లు ఉన్నా వీరి పూరిగుడిసెను ఖాళీ చేయించాలని అధి కార పార్టీ నాయకులు పూనుకున్నారు. అధికారులకు ఫిర్యాదుచేసి ఒత్తిడి పెంచారు. నోటీసులిప్పించారు. తనకు సరైన గూడు చూపి ఇల్లు ఖాళీ చేయించాలని ఆ కుటుంబం అధికారుల వద్ద ప్రాథేయపడింది. అప్పటివరకు ఖాళీ చేయొద్దంటూ వేడుకుంది. గ్రామ పెద్దల మాటను ధిక్కరించారన్న కారణంతో ఆ గిరిజన కుటుంబాన్ని ఓ వర్గం వెలివేసింది. వారితో ఎవరూ మాట్లాడవద్దని గ్రామ స్తులకు హెచ్చరికలు చేసింది. దీంతో వారిని ఎవరూ పిలవరు.. వారు పిలిచినా ఎవరూ పలుకరు. చివరకు ఆ ఇంటిలో ఉన్న చిన్నారిని అంగన్వాడీ కేంద్రానికి కూడా రానీయడం లేదు. కుటుంబం ఒంటరిగా ఆవేదనతో జీవిస్తోంది. మేమేం పాపం చేశాం. అంతా ఒకటై మమ్మల్ని ఇలా వెలివేస్తారా? మాకు రాజకీయాలు ఆపాదించకండి!.. మమ్మల్ని మా గుడిసెలోనే ఉండనీయాలంటూ ఆ గిరిజన కుటుంబం ప్రాథేయపడుతోంది. విషయం తెలుసుకున్న సామాజిక వేత్తలు, గిరిజన సంఘాల నాయకులు రాజుల పాలనలో సాగుతున్న రాక్షసకాండను దుమ్మెత్తిపోస్తున్నారు. పేద కుటుంబాన్ని వెలివేసేంత తప్పు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. – బొబ్బిలి -
కేరళ రాష్ట్ర పంచాయతీల పాలనపై అధ్యయనం
విజయనగరం: సుపరిపాలనకు నిదర్శనంగా నిలిచే గ్రామ పంచాయతీల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఉమ్మడి విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) పేర్కొన్నారు. అటువంటి గ్రామ పంచాయతీలను మరింత ప్రగతి పథంలోకి నడిపిస్తూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం జిల్లా పరిషత్ నిరంతరం ఎన్నో సమీక్షలు, సమావేశాలు నిర్వహించిందని తెలిపారు. తద్వారా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకు మంచి సుపరిపాలన అందించామన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రజలకు ఇంకా మెరుగైన సుపరిపాలన అందించే లక్ష్యంతో, అందుకు అవసరమైన మరిన్ని ప్రణాళికలు రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో, గ్రామ పంచాయతీ ద్వారా ఉత్తమమైన సుపరిపాలనను అందిస్తున్న కేరళ రాష్ట్రంలోని అలుప్పుజా జిల్లాలో గల కంజికుజి గ్రామ పంచాయతీ గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాదేశిక సభ్యులతో కలిసి మంగళవారం కంజికుజి గ్రామ పంచాయతీని సందర్శించినట్టు తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నేతృత్వంలో జెడ్పీటీసీ సభ్యుల బృందానికి అలుప్పుజా జిల్లాలోని కంజికుజి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షులు, వార్డు సభ్యులు, డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అశ్విన్, పంచాయతీ కార్యదర్శి డీఎఫ్ సుభాష్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. పంచాయతీ ప్రజలతో జెడ్పీటీసీల ఆరా జెడ్పీటీసీ సభ్యుల బృందం తొలుత గ్రామ సందర్శన చేసి, కంజికుజి గ్రామంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించింది. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పౌర సేవలు, సంక్షేమ పథకాల గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంజికుజి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అక్కడి పంచాయతీ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై గ్రామ పంచాయతీల బలోపేతం గురించి పలు అంశాలను వారి నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల బలోపేతంగ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును జెడ్పీటీసీల బృందం అధ్యయనం చేసింది. స్థానిక సంస్థల బలోపేతానికి కృషి ఈ పర్యటన ద్వారా అనేక అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం తమకు లభించిందని జెడ్పీటీసీ సభ్యులు తెలిపారు. కేరళలో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తమ ప్రాంతాల్లో కూడా స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించేలా తమకు మరింత అవగాహన పెంపొందించుకునేందుకు తన సొంత ఖర్చులతో కేరళ టూర్ ప్రోగ్రాం నిర్వహించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు జెడ్పీటీసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలుప్పుజా జిల్లా కంజికుజి గ్రామాన్ని సందర్శించిన జెడ్పీటీసీలు మరింత మెరుగైన సుపరిపాలన అందించే లక్ష్యంతో పర్యటన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
1438
బ్యానర్... ● జల్జీవన్ మిషన్ పనులపై చంద్రబాబు సర్కారు కినుక ● నిధుల విడుదలలో జాప్యం ● ముందుకు సాగని పనులు ● పల్లెల్లో తాగునీటికి కటకట రూ.137 కోట్లు రూ.395 కోట్లు మంజూరైన నిధులు జల్జీవన్ మిషన్ కింద జిల్లాకు మంజూరైన పనులు ఇప్పటి వరకు ఖర్చుచేసిన నిధులు -
శ్రీరస్తు.. శుభమస్తు
విజయనగరం: శుభముహూర్తాల సందడి ప్రారంభమైంది. వరుస మహూర్తాలు వస్తుండడంతో జిల్లాలో పెళ్లి సందడి ప్రారంభమైంది. అధిక జ్యేష్ఠ మాసంతో ఆగిన శుభ ముహూర్తాలు..మళ్లీ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. నిజ జ్యేష్ఠ శుద్ధ పాఢ్యమి నుంచి బహుళ త్రయోదశి జులై 12 వరకు సుముహూర్తాలు ఉన్నాయని వేద పండితుడు కామేశ్వర శర్మ పేర్కొన్నారు. శుభకార్యాలతో జిల్లా అంతటా సందడి మొదలు కానుంది. నిశ్చితార్థాలు, వివాహాలతో పాటు..నూతన గృహ ప్రవేశాలు, దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు చేపట్టనున్నారు. పలు పనుల శంకుస్థాపనకు ఇదే మంచి సమయం. జూన్ నెలలో 16,17, 19,20,21, 22, 24,25, 26,27, 28 తేదీల్లో జులై నెలలో 1,6,7,9,10, 12 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రెండు, మూడు నెలల ముందే వివాహ సంబంధాలు కుదుర్చుకున్న వారు ప్రస్తుతం కల్యాణ మంటపాలను మాట్లాడుకోవడంలో నిమగ్నమయ్యారు. బంగారు ఆభరణాలు, కొత్త దుస్తులు ఇతర సామగ్రి కొనుగోలు చేసే వారు వస్తుండడంతో జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో వ్యాపారాలు జోరందుకోనున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి గిరాకీ పెరిగింది.మంచి ముహూర్తాలు ఉన్నాయి ఈనెల 16 నుంచి మంచి ముహూరాలు ప్రారంభమవుతున్నాయి. జులై 14 వరకు జిల్లా వ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లతో పాటు వివిధ శుభ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా మంది వివాహ ముహూర్తాలను నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జులై 14 నుంచి మూఢం ప్రారంభం అవుతుండగా..మళ్లీ శ్రావణం వరకు మంచి రోజులు లేవు. –పి.కామేశ్వర శర్మ, వేదపండితుడు ప్రారంభమైన శుభముహూర్తాల సందడి జులై 12 వరకు అన్నీ మంచి రోజులే -
ఐఐబీఎంిపీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ–గురజాడలో అంతర్జాతీయ సమగ్ర బ్యాచిలర్ – మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐఐబీఎంపీ) 2026 ప్రవేశాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. జేఎన్టీయూ జీవీ జర్మనీలోని నాలెడ్జ్ ఫౌండేషన్–ర్యూట్లింగెన్ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐఐబీఎంపీతో విద్యార్థులు జేఎన్టీయూ–జీవీ నుంచి బీటెక్ డిగ్రీతో పాటు జర్మనీ ర్యూట్లింగెన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందే అరుదైన అవకాశాన్ని పొందనున్నారు. ఈ అంతర్జాతీయ విద్యా కార్యక్రమం విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య, విదేశీ విద్యా అనుభవం, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిందని జేఎన్టీయూ జీవీ అధికారులు తెలిపారు. జర్మనీ విద్యావిధానం, పరిశోధన, పరిశ్రమలతో అనుసంధానమైన అభ్యాసంతో విద్యార్థుల భవిష్యత్తుకు మరింత బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు. అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లు బీటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – ఎంఎస్సి (ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్) బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్) – ఎంఎస్సి (డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్) కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు జేఎన్న్టీయూ–గురజాడ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో ర్యూట్లింగెన్ యూనివర్సిటీ, జర్మనీ నుంచి మాస్టర్స్ డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఫోన్ 78915 88999, 78914 88999 నంబర్లను, విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. -
ఉపాధి వేతనదారుకు పాముకాటు
వంగర: మండల పరిధి ఓనె అగ్రహారం గ్రామంలో ఉపాధిహామీ పనులు చేస్తుండగా గ్రామానికి చెందిన పెడన ఈశ్వరమ్మ పాముకాటుకు గురైంది. ఈ మేరకు మంగళవారం స్థానిక బందకాలువ గట్టుపై పనులు చేస్తుండగా రక్తపింజర ఆమెను కాటు వేయడంతో వేతనదారులు పామును హతమర్చారు. బాధితురాలిని వంగర పీహెచ్సీకి తీసుకువెళ్లగా వైద్యాధికారిణి సుస్మిత దయానా ప్రాథమిక చికిత్స అనంతరం రాజాం సీహెచ్సీకి 108 వాహనంలో తరలించారు. సెల్ఫోన్ల రికవరీశృంగవరపుకోట: చోరీకి గురైన సెల్ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడంలో ఎస్.కోట పోలీసులు చురుగ్గా ఉన్నారు. ఇటీవల చోరీకి గురైన సెల్ఫోన్లను ట్రేస్ చేసి రూ.60వేల ఐక్యూ00, రూ.25వేల మోటోరోలా, రూ.16వేల వివో, రూ.20వేల రెడ్మీ, రూ.20వేల ఒప్పో, రూ.15వేల వివో, రూ.19వేల రియల్మీ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని ఎస్.కోట సీఐ నారాయణమూర్తి స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదుదారులకు అందజేశారు. ఫోన్ల వాడకంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, తెతిసీతెలియక చేసే తప్పిదాలతో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు. సెప్టిక్ ట్యాంకర్ ఢీకొని ముగ్గురికి గాయాలుసీతంపేట: సెప్టిక్ ట్యాంకర్ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. సీతంపేటలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. నాయుడు మల్లి గ్రామం నుంచి సీతంపేటకు విద్యుత్ లైన్మన్ పాలక నాగేశ్వరరావు ఆయన కుమారుడు రోహిత్ ద్విచక్రవాహనంపై వస్తున్నారు. కొత్తూరు నుంచి పాలకొండవైపు ఎదురుగా వస్తున్న సెప్టిక్ ట్యాంకర్ కొండపల్లి గ్రామం వద్దకు వచ్చేసరికి వారి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఇదే క్రమంలో సైకిల్ తొక్కుకుని పక్క నుంచి కె.శివశంకర్ అనే విద్యార్థి వస్తుండగా ట్యాంకర్ తగిలి కిందపడడంతో స్వల్పగాయాలైనట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
శరవేగంగా పైడితల్లి చదురుగుడి ప్రారంభ ఏర్పాట్లు
విజయనగరం టౌన్: స్థానిక మూడులాంతర్లు వద్దనున్న పైడితల్లి చదురుగుడి ఆలయ ప్రారంభ ఏర్పాట్లను దేవాదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఈ నెల 23, 24, 25 తేదీల్లో అమ్మవారి చదురుగుడి ప్రారంభోత్సవం కనులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 25న శిఖర ప్రతిష్ట మహోత్సవం తర్వాత నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులందరూ మూడురోజుల పాటు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొని, తరించాలని కోరారు. -
ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం
● తప్పిన పెనుప్రమాదంరాజాం సిటీ: మండల పరిధి సోపేరు రోడ్డులోని ఎస్ఆర్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం వేకువజామున 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు రావడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బంది అంతా అప్రమత్తమై ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే రాజాం ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ ఘటనలో ఒక ట్రాన్స్ఫార్మర్తోపాటు ప్రయోగశాల పరికరాలు, ఎలక్ట్రికల్ ఫ్యానళ్లు, ఇండోర్ వీసీబీ, విద్యుత్ వైరింగ్ కాలిపోగా శ్లాబ్ కొంతభాగం పాడైంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఎస్సై అశోక్ తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 కోట్లు మేర ఆస్తినష్టం సంభవించిందని అంచనా వేశామన్నారు. -
రోడ్డుపైనే ‘కూటమి’ రచ్చ
విజయనగరం గంటస్తంభం: అధికారం ఉంది.. మనల్ని ఆపేదెవరు అన్న చందంగా నేతలు వ్యవహరిస్తున్నారు. విజయనగరంలో మైదానాలు, ఖాళీ ప్రదేశాలు కోకొల్లలుగా ఉన్నా, కూటమి రెండేళ్ల పాలనపై సిటిజెన్ ఔట్ రీచ్ అండ్ గవర్నెన్స్ రివ్యూ ప్రోగ్రాంను బాలాజీ కూడలి సమీపంలో రోడ్డుపై మంగళవారం నిర్వహించడంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాకపోకలకు నరకయాతన పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధుల్లోనే నిమగ్నం కావాల్సి వచ్చింది. రోడ్డుకు అడ్డంగా భారీ స్టేజ్ వేసి, అటు ఇటు వాహనాలు వెళ్లకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై నగర వాసులు పెదవి విరిచారు. రాచరికపు దర్పనాన్ని చూసి నగర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఉన్నట్టా.. లేనట్టా.. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన జనసేన నాయకులకు స్టేజ్పై చోటు కరువైంది. విజయనగరం ఎమ్మెల్యే అదితి అన్నీ తానై వ్యవహరిస్తూ జనసేన నాయకులను విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం నామినేటేడ్ పదవుల్లో ఉన్న జనసేన ముఖ్య నేతలను కూడా వేదికపైకి పిలవకపోవడంపై మండిపడ్డారు. రాచరికపు బుద్ధులు పోలేదని, ప్రజాస్వామ్యంలో ఓటు వేసే ప్రజలే రాజులని గుర్తించడం మరిచిపోయారని జనసేన కార్యకర్తలు గుసగుసలాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తాచూపుతామంటూ సభ వద్దే హెచ్చరికలు చేశారు. రాకపోకలకు తప్పని కష్టాలు జనసేనకు చేదు అనుభవం స్టేజ్పైకి ఆహ్వానం కరువు స్థానిక సమరంలో తేల్చుకుంటామన్న జనసేన శ్రేణులు -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రం ప్రదర్శన
విజయనగరం అర్బన్: స్థానిక గాజులరేగలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్, డీన్ (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) డాక్టర్ వీజీ ప్రసూన అంతర్జాతీయ స్థాయి సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించి విశేష గుర్తింపు పొందారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయం సహకారంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ‘డీప్ టెక్ స్టార్టప్ల కోసం ఆవిష్కరణ, వ్యవస్థాపకత: వ్యవస్థాపక విశ్వవిద్యాలయాల పాత్ర’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో డాక్టర్ ప్రసూన ‘ఫాగ్–ఎడ్జ్ డీప్–టెక్ ఎకోసిస్టమ్స్ కోసం ఏఐ–ఆధారిత స్వీయ–స్వస్థత సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్’ అనే శీర్షికతో పరిశోధన ప్రత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసూనను సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి అభినందించారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రను అడ్డుకుంటాం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) వ్యతిరేకించింది. ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా ఉద్యమిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందింరంలో విజయనగరం జోన్ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి జేఏసీ కన్వీనర్ వై.శ్రీనివాసరావు (ఎన్ఎంయూఏ), కో–కన్వీనర్లు జీవీనరసయ్య (ఎంప్లాయీస్ యూనియన్), సీహెచ్ సుందరయ్య (ఎస్డబ్ల్యూ), ఎస్.వి.శేషగిరిరావు (కేపీ), కేఎస్పీరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల కొనుగోలుకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, భారీ రాయితీలను ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. ఆ రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుని సొంతంగా విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. విద్యుత్ బస్సులతో పాటు ఆర్టీసీకి చెందిన అత్యంత విలువైన డిపో స్థలాలను సైతం లీజుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని, ఇది సంస్థను శాశ్వతంగా ప్రైవేటీకరణ వైపు నెట్టడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. సీ్త్ర శక్తి పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య పెరిగి ఉద్యోగులపై భారం పడుతోంది... అయినా సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేటీకరణ విధానాలు తీసుకురావడం ఉద్యోగులను వంచించడమే అని ఆర్టీసీ జేఏసీ కమిటీ పేర్కొంది. 23వ తేదీ నుంచి నిరసనలు జేఏసీ ప్రధాన డిమాండ్లు ఇవే.. ప్రైవేటు ఆపరేటర్ల విధానాన్ని వీడి, ప్రభుత్వమే నేరుగా విద్యుత్ బస్సులను కొనుగోలు చేయాలి. సీ్త్ర శక్తి పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా వెంటనే 4 వేల కొత్త డీజిల్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలి. గత 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను దృష్టిలో ఉంచుకుని కనీసం 10 వేల మంది సిబ్బందిని కొత్తగా నియమించాలి. పెండింగ్ డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ డబ్బులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 11నే ఆర్టీసీ వైస్చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కు, ప్రభుత్వానికి వినతి పత్రంతో కూడిన ఉద్యమ కార్యాచరణను అందజేశామని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ నెల 20వ తేదీ లోపు రాష్ట్రంలోని అన్ని జోన్లలో సదస్సులు పూర్తి చేసి ఉద్యోగులను సన్నద్ధం చేస్తామన్నారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే... ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలు, యూనిట్లలో ఉద్యోగులంతా ఎర్ర రిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతారని గేట్ ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తదుపరి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ నెల 28వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. సదస్సులో జేఏసీ నాయకులు పి.భానుమూర్తి, కేఎస్రావు, బాసూరి కృష్ణమూర్తి (ఈయూ), నర్సింగరావు, ప్రదీప్కుమార్, బీఎస్ రాములు, పీజీరాఫెల్ (ఎన్ఎంయూఏ), వి.రాములు, సుజాత (ఎస్డబ్ల్యూఎఫ్) తదితర సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి విలువైన డిపో స్థలాలను ప్రైవేట్ ఆపరేటర్లకు లీజుకిస్తారా? 24, 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, గేట్ ధర్నాలు విజయనగరం జోన్ ఆర్టీసీ జేఏసీ సదస్సులో నాయకుల హెచ్చరిక -
ఎల్నినో పరిస్థితులను అధిగమిద్దాం
విజయనగరం ఫోర్ట్: ఎల్నినో పరిస్థితులను అధిగమించేందుకు రైతాంగాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయశాఖ అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం మాట్లాడారు. వర్షాధార భూము ల్లో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమిచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. ఎరువులు పక్కదారి పట్టించే డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు, డీడీ జి.రామారావు, పశు సంవర్థక శాఖ జేడీ డాక్టర్ మన్మథరావు, తదితరులు పాల్గొన్నారు. న్యాయ సేవా కేంద్రం ఏర్పాటు విజయనగరం లీగల్: కక్షిదారులకు అవసరమైన న్యాయసేవా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత న్యాయ సేవా కేంద్రంలో మన దేశంలో ఈశాన్య రాష్టాలకు చెందిన కక్షిదారులు, బాధితులకు ఉచిత న్యాయసేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఒ.విజయకల్యాణి, మొదటి శ్రేణి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అప్పలస్వామి, ఫ్యామిలీ కోర్టు మూడవ అదనపు జిల్లా జిడ్జి శ్రీధర్, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ.దుర్గయ్య, జడ్జిలు కృష్ణప్రసాద్, రమేష్నాయుడు, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, ఎన్ఎస్హెచ్ఆర్ తేజా చక్రవర్తి, మేజిస్ట్రేట్ బుజ్జి, మొబైల్, ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బెల్లాన రవి, విజయనగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నలితం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాముల తనిఖీ నెల్లిమర్ల: నెల్లిమర్ల ఈవీఎం గోదాములను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మంగళవారం త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. గోదాం షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను తెరిపించి లోపలి గదులను, సీళ్లను పరిశీలించారు. మొదటి అంతస్తులో ఉన్న గోదామును సైతం తనిఖీ చేశారు. పోలీసు బందోబస్తుపై సమీక్షించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. తనిఖీల్లో ఆర్డీఓ ఎస్.సుధాసాగర్, నెల్లిమర్ల తహసీల్దార్ శ్రీకాంత్, ఎన్నికల విభాగం డీటీ పి. కీర్తన, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ప్రసాదరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సముద్రపు రామారావు, ఇతర పార్టీల నాయకులు బి.వి.రమణ, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ● హాజరుకానున్న 1801 మంది అభ్యర్థులు విజయనగరం అర్బన్: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న రీ–నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1,801 మంది విద్యా ర్థులు హాజరుకానున్నారని, ఆదివారం మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్షను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే 08922–236947 నంబర్ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. నీట్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం నీట్ రీ–ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్టీసీ ప్రత్యేక ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయనగరం నుంచి శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, విశాఖపట్నం, గాజువాక, కూర్మన్నపాలెం, ఎస్.కోట, ఆండ్ర, జక్కువ, సింహాచలం, అనకాపల్లి ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. వసంత, షికారుగంజి, బొప్పడాం, గరికివలస, కొండగండ్రేడు, కందివలస, చింతపల్లి, తిప్పలవలస తదితర గ్రామాల అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సు నడపనున్నట్లు వెల్లడించారు. -
బిల్లులు రావాల్సి ఉంది
జల్జీవన్ మిషన్ పథకం కింద జిల్లాకు 1438 పనులు మంజూరయ్యాయి. 1218 పనులు పూర్తయ్యాయి. 220 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.395 కోట్లు మంజూరుకాగా రూ.137 కోట్లు ఖర్చయ్యాయి. రూ.40 కోట్ల వరకు బిల్లులు అప్లోడ్ చేశారు. బిల్లులు చెల్లించాల్సి ఉంది. – కవిత, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ విజయనగరం ఫోర్ట్: జల్జీవన్ మిషన్ (జేజేఎం) పథకంపై చంద్రబాబు సర్కారు కినుక వహిస్తోంది. పనులకు నిధులు విదల్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పల్లెల్లో ప్రతిఇంటికి కులాయి కనెక్షన్లు ఏర్పాటు చేసి సురక్షితమైన తాగునీరు సరఫరా చేయాలన్న పథక లక్ష్యానికి తూట్లుపొడుస్తుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రం సాయంతో ప్రతిష్టాత్మకంగా తాగునీటి సరఫరా పనులు చేపట్టిందన్న అక్కసుతోనే పథకాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ● జిల్లాకు 1438 పనులు మంజూరు జల్జీవన్ మిషన్ పథకం కింద జిల్లాకు 1438 పనులు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 1218 పనులు పూర్తయ్యాయి. 220 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనుల కోసం రూ.395 కోట్లు కేటాయించగా, ఇందులో ఇంతవరకు రూ.137 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే అత్యధికశాతం రూ.124 కోట్లు ఖర్చుచేశారు. టీడీపీ సర్కారు వచ్చిన రెండేళ్లలో జల్జీవన్ మిషన్ పనులకు చేసిన ఖర్చు రూ.13 కోట్లే కావడం గమనార్హం. ● బిల్లులు చెల్లించని వైనం జల్జీవన్ మిషన్ పనులకు సంబంధించి గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు 8 నెలల కిందట రూ.40 కోట్లకు పైబడి బిల్లులు అప్లోడ్ చేశారు. వీటికి సంబంధించి ఇంతవరకు టీడీపీ సర్కారు బిల్లులు చెల్లించలేదు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జల్జీవన్ మిషన్ పథకాన్ని నీరుగార్చేందుకే టీడీపీ సర్కారు బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.13 కోట్లు ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలో పనులకు వెచ్చించిన సొమ్ము పథకాలు ఉన్నా.. జిల్లాలో పీడబ్ల్యూస్కీమ్స్ (ఒక్క గ్రామానికి తాగునీరు అందించే ) పథకాలు 951 ఉన్నాయి. సీపీడబ్ల్యూ స్కీమ్స్ (ఒకటి కంటే ఎక్కువ గ్రామాలకు తాగునీరు అందించే ) పథకాలు 30 ఉన్నాయి. జల్జీవన్ మిషన్ పనులు శతశాతం పూర్తి కాకపోవడం వల్ల గ్రామీణ ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ దూర ప్రాంతాల నుంచి తెచ్చిన నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. -
వేతనదారులకు ఉద్వాసన...!
● గణనీయంగా తగ్గిన ఉపాధి వేతనదారులు ● గత ఏడాది కంటే 61 వేల మంది తొలగింపు ● తగ్గిన 19 వేల జాబ్ కార్డులువిజయనగరం ఫోర్ట్: అడిగిన వారికి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ జాబ్ కార్డు ఇస్తున్నాం. అడిగిన వెంటనే పని కల్పిస్తున్నామంటూ టీడీపీ సర్కార్ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అడిగిన ప్రతి ఒక్కరికీ జాబ్కార్డు ఇచ్చి పని కల్పించినట్లయితే జాబ్ కార్డుల సంఖ్య ఏటా పెరగాల్సి ఉంది. తద్వారా వేతనదారుల సంఖ్య కూడా పెరగాలి. పెరగ డం మాట దేవుడెరుగు చంద్రబాబు ప్రభుత్వంలో జాబ్ కార్డులు, వేతనదారులు గణనీయంగా తగ్గిపోయారు. జాబ్కార్డులు, వేతనదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 61 వేల మంది తగ్గిన వేతనదారులు జాతీయగ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే వేలాది మంది వేతనదారులను టీడీపీ సర్కార్ తొలగించేసింది. 2025–26లో జిల్లాలో 3.53 లక్షలు జాబ్ కార్డులు ఉండేవి. 2026–27 నాటికి అందులో 19 వేల జాబ్ కార్డులను తొలిగించేశారు. దీంతో జాబ్ కార్డుల సంఖ్య 3.34 లక్షలకు చేరింది. 2025 –26 లో వేతనదారులు 5.95 లక్షలు ఉండేవారు. 2026–27 నాటికి 61 వేల మంది వేతనదారులను తొలిగించేశారు. దీంతో వేతనదారుల సంఖ్య 5. 34 లక్షలకు చేరింది. వలసలు వెళ్లారని వేతనదారుల తొలగింపు బతుకు తెరువు కోసం తాత్కాలికంగా వలస వెళ్లిన వారిని శాశ్వతంగా వెళ్లినట్లు నిర్ధారించి వేతనదారులను, జాబ్ కార్డులను తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంలో వేల సంఖ్యలో తొలగించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. వేతనదారుల సంఖ్యను తగ్గించడం ద్వారా వారికి పని కల్పించడం ద్వారా వెచ్చించే వ్యయం తగ్గుతుందనే వేతనదారులను తొలగించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సర్కార్ హయాంలో ఇబ్బందులే టీడీపీ సర్కార్ హాయంలో అనేక ఇబ్బందులు ఎదురువుతున్నట్లు వేతనదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో టీడీపీ నేతలు చెప్పిన వారికే పని కల్పించడం. టీడీపీ నేతలు చెబితే పని ఆపివేయడం వంటివి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకంలో పనిచేసిన మేట్లను పూర్తి స్థాయిలో మార్చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలను పక్కన బెట్టి టీడీపీ నేతలు సూచించిన వారిని మేట్లుగా నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.డబుల్ ఎంట్రీలు తొలిగించాం శాశ్వతంగా వలస వెళ్లిన వారిని, మృతి చెందిన వారు, డబుల్ ఎంట్రీ ఉన్న వారి జాబ్ కార్డులు, వేతనదారులను తొలగించాం. – ఎస్. శారదాదేవి, డ్వామా పీడీ -
అంతా సొంత డబ్బా...
సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ‘రెండేళ్ల పాలన–సంక్షేమం, అభివృద్ధి’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సెల్ఫ్డబ్బా కొట్టేందుకే అధిక ప్రాధాన్యమివ్వడాన్ని జనం అసహ్యించుకున్నారు. రెండేళ్లలో ఏం చేశాం.. ఏం చేయబోతున్నామన్నది చెప్పకుండా... గత ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమయ్యారు. రెండేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, సున్నావడ్డీ వంటి హామీలు అమలుచేయకపోవడం, ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందజేయకపోవడం, ఉచిత పంటల బీమాకు మంగళం పాడేయడం, తల్లికి వందనంలో కోతపెట్టడం, తదితర ప్రజావ్యతిరేక విధానాలతో అన్నివర్గాల ప్రజల నుంచి చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో రెండేళ్ల పాలనపై సభలు నిర్వహించేందుకు నేతలు సైతం భయపడి.. ఆ బాధ్యతలను కలెక్టర్లపై నెట్టేసి సమా వేశాలకు హాజరవుతున్నారు. మైకు దొరికిన వెంటనే రెండేళ్లుగా చేసింది.. చెప్పేందుకు.. విషయం లేక గత ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ.. అబ్బబ్బ బాగా మాట్లాడేశాం.. ఇక మా మంత్రి పదవులకు డోకా లేదు అన్నట్టుగా జబ్బలు చర్చుకుంటున్నారు. జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత పాటు సీనియర్ ఎమ్మెల్యే కళా వెంకట్రావు, కూన రవికుమార్ తదితరులు ఇదే ఒరవడి సాగించడంపై జనం నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పటిలానే అభివృద్ధి రాజధాని అంటూ రెడీమేడ్ డైలాగులతో స్క్రిప్టు నడిపించేశారు. రెండేళ్లలో జిల్లాకు ఒక సాగినీటి ప్రాజెక్టు కానీ, చిన్న తరహా పరిశ్రమ కానీ జిల్లాకు తేలేకపోయారు. రెండేళ్లలో జిల్లాలో మూసివేతకు గురైన చిన్న పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయి. సూక్ష్మ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయంలో తాను ఎంత కృషి చేశారో ఏం పురోగతి సాధించారో చెప్పుకోలేక గత ప్రభుత్వంపై సులువైన కామెంట్లు చేస్తూ స్పీచ్ ముగించేశారు. కార్యక్రమం మొత్తం ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా కలెక్టర్, ఎస్పీ బలవంతన్న నడిపించగా.. జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు మొక్కుబడికి వచ్చినట్లు వచ్చి మిక్చర్ తిని వెళ్లిపోయారు. బలవంతం మీద తీసుకొచ్చిన డ్వాక్రా మహిళలు, ఉపాధిహామీ వేతనదారులు కూడా నాయకుల ప్రసంగాలు వినలేక ఏ పక్కనుంచి వెళ్లిపోదామా అని ఎదురుచూశారు. చివరివరకు ఉన్నవారికి భోజనాలు అందక అవస్థలు పడ్డారు. ఏం చేశారో చెప్పలేరు.. ఏం చేస్తారో చెప్పరు.. రెండేళ్ల పాలనపై మంత్రుల డబ్బా ప్రొగ్రాం మత్తుజోలికి పోవద్దు విజయనగరం క్రైమ్: యువత మత్తులోకి పోవద్దని, జైలులో మగ్గిపోవద్దని హోంమంత్రి అనిత హితవుపలికారు. పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గంజాయి కేసులో దొరికిన వారికి నాన్బెయిలబుల్ కేసులు నమోదుచేస్తున్నారని, యువత జాగ్ర త్తగా ఉండాలన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సభ ప్రారంభమయ్యే ముందు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ సాంస్కృతిక కార్యక్రమాలు పోలీస్ శాఖ నిర్వహించింది. ‘రుద్ర’అనే పోలీస్ డాగ్ గంజాయిని ఎలా గుర్తిస్తుందో ఎస్పీ దగ్గరుండి ఇన్చార్జి మంత్రి, ప్రజాప్రతినిధులకు చూపించారు. అయితే, ఆ సమయంలో ప్రజాప్రతినిధులందరూ కూర్చొని ఉండగా, కలెక్టర్ నిల్చొని ఉన్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం అధికార వర్గాలను విస్మయపరిచింది. -
ప్రారంభమైన సర్
విజయనగరం అర్బన్: జిల్లాలో సర్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. దీనిని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఓటరుకు ఫారం–2 పంపిణీ చేసి, వాటిని పూర్తిగా నింపించి బీఎల్ఓలకు అందజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఓటరు మ్యాపింగ్ అంతా 2002 ఓటరు జాబితా ఆధారంగానే జరుగుతోందని కలెక్టర్ గుర్తుచేశారు. 2002 సంవత్సరం తర్వాత ఓటరుగా నమోదైన వారు, ఆనాటి ఓటరు జాబితాలో తమ తండ్రి, తల్లి పేరు, సీరియల్ నంబర్ను తెలుసుకొని ఆ వివరాలను బూత్ లెవెల్ అధికారికి అందజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బూత్ లెవెల్ అధికారులు అత్యంత బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లాలో అంతర్జాతీయ యోగా కార్యక్రమం నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 10,704 మంది ట్రైనర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన వారి రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మొత్తం 3 లక్షల 91 వేలమంది పాల్గొనేలా రిజిస్ట్రేషన్ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు లక్షా 79 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో జేసీ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు పాల్గొన్నారు. -
అప్పట్లో ప్రతీ ఆరు నెలలకు కొత్తపింఛన్ల మంజూరు
విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే 50 ఏళ్లు నిండిన బడుగు, బలహీన వర్గాల వారికి పింఛన్ అందజేస్తామని చంద్రబాబుతో సహా కూటమి నేతలు ఊరూరా ప్రచారం చేశారు. అధికారం చేజిక్కాక నాలుక మడతపెట్టారు. పింఛన్ల హామీని పక్కనపెట్టేశారు. అర్హుల నుంచి రెండేళ్లుగా దరఖాస్తులు స్వీకరించకుండా, పింఛన్లు మంజూరు చేయకుండా ఏడిపిస్తున్నారు. 50 ఏళ్లవారిని పక్కనపెడితే కనీసం 60 ఏళ్లు నిండిన వారికి, వితంతువులకు, దివ్యాంగులకు పింఛన్లు ఇవ్వాలని వేడుకుంటున్నా కనికరించని పరిస్థితి. ఇలాంటి పాలన ఎన్నడూ చూడలేదంటూ లబ్ధిదారులు గోడువెల్లబోస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఉత్తుత్తి ప్రచారం.. నమ్మించడం.. మోసం చేయడం టీడీపీ నేతలకు అలవాటైన విద్య అన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. రెండేళ్లుగా ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడే జనం నిలదీస్తున్నారు. మీ పాలనకో దండం అంటూ చీవాట్లు పెడుతున్నారు. దీనిని పక్కదారి పట్టించేందుకు ఈ నెల 12వ తేదీ నుంచి కొత్తగా పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వైబ్సైట్ ఓపెన్ అవుతుందంటూ టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఆ మాటలు నమ్మిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు పింఛన్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన అన్ని పత్రాలు సిద్ధం చేసి సచివాలయాలకు పరుగుతీశారు. తీరా అక్కడి సిబ్బంది వెబ్సైట్ ఓపెన్ కాలేదని చెప్పడంతో మళ్లీ మోసపోయామని నిట్టూర్చుతూ వెనుదిరుగుతున్నారు. పింఛన్ కోసం అర్హుల ఎదురుచూపు ఇంతవరకు కొత్తవి మంజూరు చేయని ప్రభుత్వం సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం శూన్యం వెబ్సైట్ ఓపెన్ కాలేదన్న సమాధానం సోషల్ మీడియాలో పింఛన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు బాహాటంగా ఉత్తుత్తి ప్రచారం ఆరునెలల్లో జిల్లాలో 2,681 మంది పింఛన్ల కోత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకు ఒకసారి (జనవరి, జూలై) అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. 50 ఏళ్లు నిండిన మత్య్సకారులు, గీత, చేనేత కార్మికులకు పింఛన్ అందించేవారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులు, 18 ఏళ్లు దాటిన వితంతవులు, వయసుతో సంబంధం లేకుండా సదరం ధ్రువపత్రాలు ఉన్న దివ్యాంగులకు, 50 ఏళ్లు నిండిన ఒంటరి మహిళలకు, డప్పు కళాకారులకు, 19 ఏళ్లు నిండిన ట్రాన్స్జెండర్స్కు, వయసుతో సంబంధం లేకుండా డయాలసిస్ రోగులకు, డీఎంహెచ్ఓకు పింఛన్లు అందించేవారు. అర్హత ఉంటే చాలు ఎవరి ప్రమేయం లేకుండా పింఛన్ మంజూరవుతుందన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నది అర్హుల నుంచి వినిపిస్తున్న మాట. వెబ్సైట్ ఓపెన్ కాలేదు కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, తదితర పింఛన్ల కోసం దరఖాస్తు చేసేందుకు వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. – శ్రీనివాసపాణి, డీఆర్డీఏ పీడీ విజయనగరం మండలం రాకోడు గ్రామానికి చెందిన బి.సంతోష్కు పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఏడాది కిందట ఆయన పింఛన్కు అర్హుడిగా సదరం సర్టిఫికెట్ను వైద్యులు ఇచ్చారు. దానిని పట్టుకుని పింఛన్కు దరఖాస్తు చేసేందుకు సచివాలయం, కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ను సంప్రదించినా ఫలితం శూన్యం. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదన్న సమాధానమే ఉద్యోగుల నుంచి వినిపించింది. –––––––––––––––––––––––––––– గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన డి.నాయుడు అనే వ్యక్తి రెండేళ్ల కిందట మరణించాడు. అతని భార్య వితంతు పింఛన్ కోసం రెండేళ్లుగా సచివాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. ఆమెకు ఇంతవరకు పింఛన్ మంజూరు కాలేదు. -
తవ్వేద్దాం.. అమ్మేద్దాం..
రాజాం: రాజాం, పరిసర ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ సంపాదనకు కాదేది అనర్హం అన్న చందంగా తవ్వకాలు చేపడుతున్నారు. ప్రశ్నించే రైతులు, పల్లె ప్రజలపై అధికార బలంతో బెదిరిస్తున్నారు. సాగునీటి చెరువులు, కొండలను కరగదీస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ గ్రావెల్ లోడును రూ.800లు నుంచి రూ.1500ల విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ● రాజాం మండలంలో కొత్త కంచరాం, ఆగూరు, వీఆర్ అగ్రహారం తదితర ప్రాంతాల్లోని సాగునీటి చెరువుల్లో గ్రావెల్ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పాగుగార్రాజు చీపురుపల్లి, గోపాలపురం గ్రామాల్లోని చెరువుల్లో మట్టి రోజురోజుకూ మాయమవుతోంది. రాత్రి సమయాల్లో పొక్లెయిన్లతో తవ్వి విచ్చలవిడిగా తరలిస్తున్నారని, చెరువులు రూపుకోల్పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలే సహజవనరులను కొల్లగొడుతూ సొమ్ముచేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ● రేగిడి మండలంలో ఉంగరాడమెట్ట వద్ద ఓ కొండను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారు. ఇప్పటికే కొండలో సగభాగం తరిగిపోయింది. పచ్చనేతలే మట్టి తవ్వకాల్లో ముందుండి నడిపిస్తున్నారు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా మిన్నకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ● వంగర, సంతకవిటి మండలాల్లోనూ పలుచోట్ల మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి మట్టి తవ్వకాలు నిలుపుదలచేయాలని, అక్రమ గ్రావెల్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమ శంఖారావం
● నేడు జేఏసీ సన్నాహక సదస్సు విజయనగరం అర్బన్: ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనే ధ్యేయంగా ఉద్యోగ సంఘాల జేఏసీ (విజయనగరం జోన్–1) ఉమ్మడి పోరాటానికి సిద్ధమైంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసేందుకు మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘జేఏసీ ఉద్యమ సన్నాహక సదస్సు’ నిర్వహించనుంది. ఉద్యోగుల సమస్యలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్టీసీ పరిరక్షణ, ‘సీ్త్ర శక్తి’ పథకంలో పెరిగిన భారం– రక్షణ కరువు, 10 వేల ఖాళీల భర్తీ, ఆర్థిక హక్కుల సాధన, తదితర డిమాండ్లను వేదిక సాక్షిగా వినిపించనున్నాయి. రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. విజయనగరం జోన్లోని అన్ని జిల్లా, డివిజన్, డిపో, గ్యారేజీ కమిటీలు, నాన్ ఆపరేషన్ యూనిట్ ప్రతినిధులు, మహిళా నాయకులు, అన్ని స్థాయిల కార్యకర్తలు సకాలంలో హాజరై సన్నాహక సదస్సును జయప్రదం చేయాలని ఏపీ పీటీడీ విజయనగరం జోన్–1 ప్రతినిధులు పిలుపునిచ్చారు. ‘ఐక్యతే బలం– ఉద్యమమే మార్గం’ అనే నినాదంతో ఆర్టీసీ పరిరక్షణే లక్ష్యంగా సాగనున్న సదస్సుపై ఉద్యోగవర్గాలు శ్రద్ధ చూపుతున్నాయి. సాగు పట్టాల కోసం పోరుబాట వేపాడ: దశాబ్దాల కాలంగా, తాత ముత్తాత్తల నుంచి భూములు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాం.. సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వ రాయితీలు వర్తింపజేయాలంటూ వేపాడ మండలం కొండగంగుబూడి పంచా యతీ పరిధిలోని గిరిజన గ్రామాల రైతులు సోమవారం ఆందోళన చేశారు. వేపాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి తమ ఆవేదనను అధికారులకు వినిపించారు. తక్షణమే పట్టాలు ఇవ్వాలంటూ నినదించారు. సమా ధానం చెప్పేవరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఉపతహసీల్దార్ రామకృష్ణ జిల్లా కేంద్రంలోని పీజీఆర్ఎస్లో పాల్గొన్న తహసీల్దార్ రాములమ్మతో మాట్లాడారు. ఆమె సూచనల మేరకు మూడు నెలల్లో భూములు సర్వేచేసి హక్కులు కల్పిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. నిరసన కార్యక్రమంలో కొండగంగుబూడి పంచాయతీ పరిధిలోని బంగార్యపేట, బందవలస, పాతవూరు, శొంఠివానిపాలెం, సారవానిపాలెం, కోటయ్యగరువు తదితర గ్రామాలకు చెందిన 60 కుటుంబాలు, ఏపీ రైతు సంఘం నాయకుడు చల్లా జగన్, సీపీఎం నాయకుడు చలూమూరి శ్యామ్, గిరిజన సంఘం నాయకుడు ఎస్.గంగులు తదితరులు పాల్గొన్నారు. -
మృత్యు పిడుగు
● పిడుగుపాటుకు ఇద్దరు బలి ● విషాదంలో కుటుంబ సభ్యులు భామిని/మెరకముడిదాం: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు చోట్ల సోమవారం సాయంత్రం పిడుగుల వాన కురిసింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేటకు చెందిన పెనుగుదురు రాజశేఖర్(20) భామిని మండల సొలికిరి గ్రామంలోని తాతగారి ఇంటికి వేసవిసెలవుల కోసం వచ్చాడు. సొలికిరి గ్రామ యువకులతో కలిసి వంశధార తీరంలో సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాజశేఖర్ పిడుగుపాటుకు గురయ్యాడు. వెంటనే మిగిలిన జట్టు సభ్యులు బాలేరు పీహెచ్సీకి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో తోటి స్నేహితులు, తాత, అమ్మమ్మలు పూడి సింహాచలం, సరస్వతి బోరున విలపించారు. -
●ఇద్దరి మృతి ●ఒకరికి తీవ్ర గాయాలు ●పరిస్థితి విషమం
సంతకవిటి: మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. పగలంతా మండే ఎండ.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు కురిసిన వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. అయితే కురిసిన వర్షానికి పిడుగులు తోడవడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన పాండ్రంకి రామినాయుడు(55) మల్లయ్యపేట పొలాల్లో వరి విత్తనాలు చల్లుతుండగా పిడుగు పడింది. దీంతో ఆ రైతు తన పొలంలోనే మృతి చెందాడు. ఈయనకు భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా ఇంకో కుమార్తెకు వివాహం కావాల్సి ఉంది. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్న కాస్త పొలంను సాగు చేస్తూ జీవిస్తున్న ఈ కుటుంబానికి రామినాయుడు మృతి ఆశనిపాతంగా మారింది. ఇక ఎలా జీవించేదని, తమ కుటుంబానికి దిక్కెవరని రోదిస్తున్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్ఐ ఎం.వాసుదేవరావు తెలిపారు. మామిడిపల్లి పంచాయతీ లింగాపురంలో తాతామనవళ్లు లింగాపురంను ఆనుకుని ఉన్న శ్రీకాకుళం జిల్లా జి.జిగడాం మండలం పెంట గ్రామ పొలాల్లో తమ గొర్రెలను మేతకు తీసుకువెళ్లారు. ఇదే సమయంలో పిడుగు పడింది. దీంతో ఇద్దరూ ఆ ప్రదేశంలో కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో మనవడు కోనారి యుగంధర్(18) అక్కడికక్కడే మృతి చెందాడు. తాత కోనారి అప్పన్న తీవ్రంగా గాయపడడంతో రాజాంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. యుగంధర్ పదో తరగతి వరకు చదివి ఆర్థిక స్థోమత లేక తమకున్న గొర్రెలను కాపాల కాస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కోనారి రామప్పడు, దుర్గమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం కాకినాడలో పోటీ పరీక్షలకు సమాయత్తమవుతున్నాడు. చిన్న కుమారుడు యుగంధర్ అకాల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికందొచ్చిన కొడుకు పిడుగు పాటుకు గురై మృతి చెందడంతో కుమిలిపోతున్నారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. జిల్లాలో రెండు రోజుల్లో కురిసిన పిడుగుల వానకు నలుగురు మృత్యువాత పడడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. వర్షం పడితే చాలు ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావం ఇలా అకాల వర్షాలకు పిడుగుల వానకు కారణం కావడంతో ప్రజల్లో ఆదోళన నెలకొంది. కోనారి యుగంధర్, పాండ్రంకి రామినాయుడు మృతదేహాలుజిల్లాలో కురుస్తున్న పిడుగుల వర్షం ప్రజల ప్రాణాలు తీస్తుంది. దీంతో వర్షం అంటే ప్రజలు భయపడుతున్నారు. కురిసిన వర్షం కంటే పిడుగులు, మెరుపులే ఎక్కువగా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. పగలంతా మండే ఎండలతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు సాయంత్రానికి కురిసే ఓ మోస్తరు వర్షంతో ఉపశమనం పొందుతున్నారంటే... అదే సమయంలో పడుతున్న పిడుగులు ప్రాణాలు తీస్తుండడంతో తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. జిల్లాలో శనివారం కురిసిన పిడుగుల వానకు ఇద్దరు మృతి చెందగా.. ఆదివారం సాయంత్రం కురిసిన పిడుగుల వానకు మరో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే... -
మీ ఓటు భద్రం.. మ్యాపింగ్ ముఖ్యం!
● నేటి నుంచే ‘సర్’ ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ ప్రక్రియ ● జూలై 14 వరకు మ్యాపింగ్కు అవకాశం.. నిర్లక్ష్యం చేస్తే ఓటు గల్లంతే! ● వివాహిత మహిళలు తప్పనిసరిగా చేసుకోవాల్సిన ప్రక్రియ విజయనగరం అర్బన్: కచ్చితమైన, పారదర్శకమైన, తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబి తా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత కీలకంగా భావిస్తున్నారు. సోమ వారం నుంచి జూలై 14 వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ కొన సాగనుంది. ఈ లోగా మ్యాపింగ్ పూర్తి చేసుకోకపో తే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మ్యాపింగ్ ప్రక్రియ ముఖ్యంగా 2002 తర్వాత వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్లిన మహిళల కోసం ఉద్దేశించబడింది. ప్రస్తుతం జరుగుతున్న ఓటరు మ్యాపింగ్ అంతా 2002 ఓటరు జాబితా ఆధారంగానే సాగుతుంది. వివాహం తర్వాత వేరే ఊరికి వెళ్లిన మహిళల పేర్లు ప్రస్తుతం వారు నివసిస్తున్న ఊరిలోని 2002 ఓటరు జాబితాలో ఉండవు. కాబట్టి వారు తమ ఓటు హక్కును భద్రపరుచుకోవడానికి ఈ మ్యాపింగ్ చేయించుకోవడం తప్పనిసరి. ‘సర్’లో మూడు రకాల మ్యాపింగ్ పద్ధతులు ఉంటాయి. ఓటరు తన ప్రస్తుత పరిస్థితిని బట్టి మూడు కేటగిరీల్లో ఒక దానిని ఎంచుకుని మ్యాపింగ్ చేయించుకోవాలి. వ్యక్తిగత పరిశీలన (సెల్ఫ్ మ్యాపింగ్) 2002 సర్ ఓటరు లిస్టులో పేరు ఉండి, అదే విధంగా ప్రస్తుత 2025 ఓటరు లిస్టులో కూడా పేరు ఉన్నవారు నేరుగా బూత్ లెవెల్ అధికారి దగ్గరకు వెళ్లి ‘సెల్ఫ్ మ్యాపింగ్’ చేయించుకోవాలి. సంతానాన్ని జోడించడం (యాడ్ ప్రొజెన్సీ) 2002 సమయంలో ఓటు హక్కు వయస్సు రాకపోవడంతో ఆ నాటి జాబితాలో పేరు లేకపోయినా, ప్రస్తుత (2025) ఓటరు లిస్టులో పేరు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. తాత, అమ్మమ్మ, నానమ్మ, తండ్రి, అమ్మ పేర్లలో ఏదైనా ఒకటి 2002 సర్ జాబితాలో ఉంటే.. మీరు తప్పనిసరిగా ‘యాడ్ ప్రొజెన్సీ’ మ్యాపింగ్ చేయించుకోవాలి. 2002 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉన్నా, ఏదై నా కారణంతో నాటి 2002 సర్ లిస్ట్లో మీ పేరు లేకపోతే ఇది వర్తిస్తుంది. తల్లిదండ్రులు లేదాపూర్వీ కుల (తాత, అమ్మమ్మ, నానమ్మ) పేర్లు 2002 జాబి తాలో ఉంటే.. మీరు బీఎల్వో ద్వారా ‘సెల్ఫ్ ప్రొజె న్సీ’ మ్యాపింగ్ చేయించుకోవాలి. సొంత గ్రామానికి/పుట్టిన ఊరికి వెళ్లి, అక్కడ 2002 ఓటరు జాబితా లో మీ తల్లి లేదా తండ్రి పేరు ఎక్కడ ఉందో చూసుకుని, వారి సీరియల్ నంబరు తెలుసుకోవాలి. ఆ సీరియల్ నంబరును మీరు ఇప్పుడు నివసిస్తున్న (అత్తగారి ఊరు లేదా ప్రస్తుత నివాసం) ఊరిలోని బీఎల్వో/డీఎల్వోకు అందించాలి. అధికారులు ఆ నంబర్ ఆధారంగా మిమ్మల్ని ఇక్కడి ప్రస్తుత ఓట రు జాబితాలోకి మ్యాపింగ్ ద్వారా చేరుస్తారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఈ జాబితాలను ఇప్పటికే బీఎల్వోలు/అంగన్వాడీ కార్యకర్తలకు అందించారు. కాబట్టి మీ పుట్టిన ఊరి బీఎల్వోను సంప్రదిస్తే ఈ జాబితా లభిస్తుంది. బీఎల్వోల వద్ద స్పష్టంగా చెప్పాలి. క్షేత్ర స్థాయిలో బీఎల్వోలుగా ఎక్కువగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు.కాబట్టి ఓటర్లు స్వయంగా బీఎల్వోల వద్దకు వెళ్లినప్పుడు.. మీ కేటగిరీని బట్టి సెల్ఫ్ మ్యాపింగ్, యాడ్ ప్రొజెన్సీ లేదా సెల్ఫ్ ప్రొజెన్సీ అనే పదాలను స్పష్టంగా చెప్పి మ్యాపింగ్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటు కోల్పోకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత. జూలై 14లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకొని ప్రజాస్వామ్య హక్కును భద్రపరుచుకోవాలి. -
రక్తదానం ప్రాణదానం
● రెడ్ క్రాస్ చైర్మన్ వెంకటరమణ విజయనగరం ఫోర్ట్: రక్తదానం ప్రాణదానమని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కె. వెంకటరమణ అన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో సాధన యువజన సంఘం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అత్యధికసార్లు రక్తదానం చేసిన వ్యక్తులను సన్మానించారు. మనిషి మాత్రమే ఆపదలో ఉన్న సాటిమనషికి రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడగలడన్నారు. రక్తాన్ని తయారు చేయలేం కాబట్టి రక్తదానం ద్వారానే రక్తం కొరతను తీర్చవచ్చునన్నారు. రక్తదానంపై అపొహలు విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ రావు, అకోక్, మణికంఠ, స్వామి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. అదుపులో ఇద్దరు అనుమానితులు● స్వర్ణకారుడిపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం పార్వతీపురం రూరల్: చౌకగా బంగారం ఇప్పిస్తానని నమ్మించి..విజయవాడకు చెందిన స్వర్ణకారుడిపై ఇటీవల ఆంధ్ర–ఒడిశా సరిహద్దు బట్టివలస వద్ద దుండగులు దాడి చేసి రూ.2 లక్షలు దోచుకెళ్లిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒడిశాలోని అలమండ బ్లాక్ పిప్పల భద్ర గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నేరానికి ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీ వెనుక సుమారు పది మంది హస్తం ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. బాధితుడికి ’డమ్మీ రాజు’ పేరుతో వలవేసిన ఈ ముఠాకు గతంలో సదరు వ్యాపారితో ఏవైనా లావాదేవీలు ఉన్నాయా? లేక ఇతర చీకటి వ్యాపారాల నేపథ్యం ఉందా? అన్న కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కేవలం ఈ ఘటనే కాకుండా, ఇటీవల సరిహద్దుల్లో జరిగిన పలు ఇతర నేరాలతో వారికి ఉన్న సంబంధాలపై కూడా విచారణ చేస్తున్నారు. ఒడిశా వైపు వెళ్లే మార్గాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తూ, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. -
బొల్లినేని విద్యార్థుల ప్రతిభ
శ్రీకాకుళం రూరల్: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్కేర్ సైన్సెన్స్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర ఫలితాల్లో రాగోలులోని బొల్లినేని మెడిస్కిల్స్ విద్యార్థులు విజయదుందుభి మోగించారని కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో వివిధ కోర్సుల్లో ఆరుగురు విద్యార్థులు మొదటి ర్యాంకులు సాధించగా, ముగ్గురు రెండో ర్యాంకు, ఒకరు మూడో ర్యాంకు, ఇద్దరు నాలుగో ర్యాంకు, ఒకరు ఐదో ర్యాంకు, ముగ్గురు ఆరో ర్యాంకు, ఒకరు ఏడో ర్యాంకు, ముగ్గురు ఎనిమిదో ర్యాంకు, ఇద్దరు తొమ్మిదో ర్యాంకు, మరొకరు పదోర్యాంకు సాధించారని వివరించారు. తృతీయ ఏడాదిలో తొమ్మిది మంది ఉన్నత శ్రేణిలో, 45 మంది ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 20 మంది ఉన్నత శ్రేణిలో, 35 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. -
పేదల బియ్యం పందికొక్కుల్లా..!
విజయనగరం ఫోర్ట్: ఈనెల 6వతేదీన గంట్యాడ మండలం రామభద్రపురంలో పీడీఎస్ బియాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా సీఎస్డీటీ పట్టుకున్నారు. ఆటోలో ఉన్న 731 కేజీల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసిన ముమ్మిడి శెట్టి నూకరాజుపై 6ఎ కేసు నమోదు చేశారు. ● రాజాం నుంచి పొందూరు వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అందులో ఉన్న 1040 కేజీల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. పీడీఎస్ బియ్యం విక్రయించిన వెంకటరావు, సురేష్, కృష్ణారావులపై కేసులు నమోదు చేశారు. ● గత ఏడాది బొండపల్లి మండలం కొండకిండాం, కిండాం ఆగ్రహారంలో 149 క్వి్ంటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు. అయితే మొత్తం బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేసిన నార సంచులతోనే అక్రమంగా తరలించడం అప్పట్లో సంచలనమైంది. అయినప్పటికీ నార సంచులతో నేరుగా తరలించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇవి అధికారులు అడపాదడపా చేసిన తనిఖీల్లో పట్టుబడినవి. గుట్టుగా జిల్లాలో పీడీఎస్ బియ్యం రాకెట్ పెద్ద ఎత్తున జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం వ్యాపారులకు పచ్చ నేతల అండదండలు ఉన్నాయని సమాచారం. అందుచేతనే జిల్లాలో పీడీఎస్ బియ్యం తరలించే వ్యాపారులు జంకూబొంకు లేకుండా ఇష్టారాజ్యం అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలకు అనుకూలంగా ఉన్నవారు పట్టుబడినా వారిని గుట్టుగా విడిపించేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపును అరికట్టాల్సి న పౌరసరఫరాల శాఖ అధికారులకు ప్రతినెలా వ్యాపారులు వాటాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే తనిఖీలు కూడా తూతుమంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల కళ్ల ముందే పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం తరలిపోతున్నా పట్టించుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం తరలించే వ్యాపారుల వివరాలు కూడా పౌరసరఫరాల అధికారుల వద్ద ఉన్నప్పటికీ అక్రమ తరలింపు ఆగడం లేదంటే ఏమనుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కన్నెర్ర చేస్తే కచ్చితంగా పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపునకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయ పడుతున్నారు. రీసైక్లింగ్ చేసి తరలింపు పీడీఎస్ బియ్యాన్ని బియ్యం వ్యాపారులు కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బియ్యాన్ని వారు రీ సైక్లింగ్ చేసి ప్రభుత్వానికే మళ్లీ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం చాలా మంది అధికారులకు కూడా తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రైస్ కార్డులు 5,77,487 జిల్లాలో 1249 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో 5,77,487 రైస్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులకు నెలకు సుమారు 8,222 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతాయి. అందులో నెలకు సుమారు 4 వేల మెట్రిక్ టన్నుల వరకు పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతల కనుసన్నల్లో పీడీఎస్ బియ్యం దందా ప్రభుత్వం సరఫరా చేసిన సంచులతోనే పక్కదారి పట్టుబడిన వారిపై చర్యలు శూన్యం రెచ్చిపోతున్న బియ్యం వ్యాపారులుప్రతినెలా ఆకస్మిక తనిఖీలు ప్రతినెలా సీఎస్డీటీలు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. పీడీఎస్ బియ్యంతో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పీడీఎస్ బియ్యం తరలించడం నేరం. జి.మురళీ నాథ్, జిల్లా పౌరసరఫరా అధికారి, విజయనగరంజిల్లాలోనే అత్యధికంగా బియ్యం దందా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కంటే విజయనగరం జిల్లాలోనే రేషన్ బియ్యం అక్రమ తరలింపు దందా ఎక్కువగా జరుగుతోందని సమాచారం. పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసిన వ్యాపారులు జిల్లా నుంచి విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఒడిశాలోని జిల్లాలకు బియ్యం తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొరుగున ఉన్న విశాఖపట్నం జిల్లాలోని రైస్ మిల్లులకు అత్యధికంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆ ఇంటికి దిక్కెవరు?
రాజాం సిటీ: భార్య అనారోగ్యంతో ఉన్నా ఆ కుటుంబపెద్ద ఏనాడూ అధైర్యపడలేదు. దివ్యాంగురాలైన ముప్పైఏళ్ల కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కుటుంబాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నాడు. తీర్థయాత్రలకు వెళ్లే వారికి వంటలు చేసేందుకు టూరిస్టు బస్సుతో వెళ్లేవాడు. ఖాళీ సమయాల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆ కుటుంబంపై విధి కన్నెర్ర జేసి విధి వంచితురాలైన కుమార్తెకు తండ్రిని, మంచంపట్టిన భార్యకు భర్తను దూరం చేసింది. ఈ విషాదకర ఘటన రాజాం మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ విషాద ఘటనపై గ్రామస్తులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉంగటి లక్ష్మునాయుడు (55), అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురు ఈ నెల 3న కాశీ యాత్రకు టూరిస్టు బస్సుతో వెళ్లారు. అక్కడ యాత్రికులతో సరదాగా గడిపి అన్ని తీర్థయాత్రలు ముగించుకుని బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లా అఃతపుర పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం వేకువజామున 4గంటల సమయంలో తీర్థయాత్ర బస్సు రోడ్డు ప్రమాదానికి గురికాగా ఈ ప్రమాదంలో లక్ష్ము నాయుడు మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. రాజాం పరిసర ప్రాంతాలైన నందబలగ, బొద్దాం, ఇప్పిలిపేట గ్రామాలకు చెందిన మరో ఇరవై మంది వరకు అదే బస్సులో యాత్రకు వెళ్లారు. వారంతా క్షేమంగా ఉన్నట్లు కొత్తవలస నుంచి వెళ్లిన యాత్రికులు తెలిపారు. గ్రామంలో విషాదం.. అందరితో కలివిడిగా ఉండే లక్ష్మునాయుడు తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. దివ్యాంగురాలైన కుమార్తె ఆదిలక్ష్మితో పాటు అనారోగ్యంతో బాదపడుతున్న భార్య అసిరప్పకు ఇకపై దిక్కెవరంటూ గ్రామస్తులంతా నిట్టూరుస్తూ శోకసంద్రంలో మునిగిపోయారు. చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలంలోని ఎం.దుగ్గివలస గ్రామంలో ముచ్చర్ల గొల్లోడుకు చెందిన మూడు మేకలు పిడుగు పడి ఆదివారం మృతి చెందాయి. గ్రామానికి చెందిన పొదిలాపు సింహాచలం ఆమె భర్త సాంబయ్యతో పాటు ముచ్చర్ల గొల్లోడు ఆవులు, మేకలను తీసుకుని పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కురిసిన వర్షం, గాలులకు వారు ఉండే ప్రాంతంలో పిడుగులు పడడంతో గొల్లోడుకు చెందిన మూడు మేకలు మృతి చెందాయి. అదే విధంగా పక్కనే ఉన్న మహిళ సింహాచలం స్పృహ కోల్పోయింది. ఇంటికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేయగా స్పృహ నుంచి ఆమె కోలుకుంది.అనకాపల్లి టౌన్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో శంకరం గ్రామం వద్ద రైలు నుంచి జారి పడి ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీఎఫ్ ఎస్సై కేటీఆర్ లక్ష్మి తెలిపారు. విశాఖపట్నం– విజయవాడ ట్రాక్ మధ్యలో మృతదేహాన్ని గుర్తించామని, మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. బ్లాక్ కలర్ ట్రాక్ ఫ్యాంట్, మెరూన్ రంగు టీషర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వద్ద టచ్ ఫోన్, ఆధార్ కార్డు, చిరిగిన జనరల్ రైల్వే టికెట్ లభించాయని, వాటి ప్రకారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామంలోని కీర్తివీధికి చెందిన ఇట్లా భాస్కరరావుగా మృతుడిని గుర్తించామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్సై చెప్పారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబపెద్ద మృతి -
విజయనగరం
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026రామభద్రపురంలో పీడీఎస్ బియాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా సీఎస్డీటీ పట్టుకున్నారు. –8లోరాజాం మండలం బొద్దాం వద్ద అధ్వానంగా తోటపల్లి ప్రధాన కాలువ రాజాం: ఒకప్పుడు కళకళలాడే సాగునీటి కాలువలు గత రెండేళ్లుగా ఆయకట్టు రైతులకు కన్నీటిని తెచ్చిపెడుతున్నాయి. సకాలంలో వర్షాలు పడితే పర్వాలేదు అన్న చందంగా వ్యవసాయం సాగుతోంది. సాగుకు అండగా ఉండాల్సిన సాగునీటి కాలువల్లో పూడికలు తీయక, కాలువ గట్లు బలహీనంగా మారడం, ప్రాజెక్టుల్లో సరిపడే నీటి మట్టం సక్రమంగా ఉంచకపోవడం, ప్రతీ ఏడాది చేపట్టాల్సిన నిర్వాహణ పనులు చేయకపోవడంతో ఆయకట్టు రైతులకు నీరు కనికట్టుగా మారుతోంది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎమ్) వర్క్లతో టీడీపీ కార్యకర్తలకు ఉపయోగపడే పనులు మినహా కాలువలో పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ నిధులు విడుదల కాకపోవడం, పనులు చేయకపోవడం రైతులకు తలనొప్పిగా మారుతోంది. ప్రధానంగా రాజాం నియోజకవర్గంలో పంటల సాగుకు ఆధారమైన సాగునీటి కాలువల పరిస్థితి దయనీయంగా మారింది. ఖరీఫ్లో రైతులకు సాగునీటి కష్టాలు తప్పవన్నట్టుగా పరిస్థితులు మారాయి. -
సరిహద్దులు దాటుతున్న పీడీఎస్ బియ్యం!
పార్వతీపురం రూరల్: పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం పక్కదారి పడుతున్నాయి. పార్వతీపురం పట్టణ, మండల పరిధిలో కొందరు వ్యక్తులు అధికార పార్టీ అండదండలతో సిండికేట్గా ఏర్పడి ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్డుదారుల నుంచి తక్కువ ధరకు సేకరిస్తున్న ఈ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒత్తిడి తెచ్చి సేకరణ పార్వతీపురం ప్రాంతంలో సుమారు 10 మంది వరకు చిరు వ్యాపారులు కార్డుదారుల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరుడైన పట్టణ నాయకుడి ప్రమేయం పెరగడంతో ఈ వ్యాపార శైలి మారింది. సేకరించిన బియ్యాన్ని వేరే ఎవరికీ అమ్మకుండా, కేవలం తనకే విక్రయించాలంటూ సదరు వ్యక్తి చిరు వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అధికారులతో కేసులు పెట్టిస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నట్లు స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిల్వలు ఇక్కడే..ఒడిశాకు రవాణా ఈ విధంగా అత్యంత చవకగా (కిలో రూ.20 లోపు) సేకరించిన రేషన్ బియ్యాన్ని స్థానిక మార్కెట్ యార్డ్ ఎదురుగా గల వివేకానంద కాలనీలో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి అనుకూల సమయాల్లో ఆటోల ద్వారా నేరుగా ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్కడ కిలో రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నట్లు తెలుస్తోంది. కరువైన తనిఖీలు గతంలో రెవెన్యూ, విజిలెన్న్స్, పోలీస్ అధికారులు నిరంతరం దాడులు నిర్వహించి బియ్యం అక్రమ తరలింపును అడ్డుకుని స్వాధీనం చేసుకునేవారు. నిందితులపై 6–ఎ కింద కేసులు నమోదు చేసేవారు. కానీ, కొద్ది నెలలుగా తనిఖీలు గానీ, కేసుల నమోదు గానీ లేకపోవడంతో ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీల నిర్వహణ
పార్వతీపురం: యోగాంధ్ర జిల్లాస్థాయి పోటీలను కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించారు. జూనియర్ విభాగం విద్యార్థులకు సోలోయోగా, ప్రాణాయామం, గ్రూప్ యోగా విభాగాల్లో పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయి పోటీలకు విజేతలను ఎంపిక చేయనున్నట్లు జిల్లానోడల్ అధికారి డా. టి. జగన్మోహన్రావు తెలిపారు. యువతలో యోగా పట్ల ఆశక్తి పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశాల మేరకు జిల్లాస్థాయి యోగాంధ్ర పోటీలను నిర్వహించినట్ల తెలిపారు. కార్యక్రమంలో ఆయుష్శాఖ జిల్లా ఇన్చార్జ్ అధికారి డా.టి. హేమాక్షి యోగా గురువులు మోహన్ గంతాయత్, కె.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. మహరాజుపేట గాయత్రి స్కూల్ గుర్తింపు రద్దుపూసపాటిరేగ : భోగాపురం మండలంలోని మహరాజుపేట గాయత్రి ఇంగ్లీషు మీడియం స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడినట్లు ఆ మండల విద్యాశాఖ అధికారి రమణమూర్తి తెలియజేశారు. పాఠశాలను ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వేరే చోటకు మార్పు చేయడంతో విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినందున గుర్తింపు రద్దు చేసినట్లు తెలిపారు. అడ్మిషన్లు, తరగతులు నిలిపివేయాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. పాఠశాలలో ఇప్పటివరకు చదివిన విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలలోను లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాలని తెలియజేశారు. గుర్తింపు లేని పాఠశాలలో విద్యార్థులను చేర్చవద్దని తల్లిదండ్రులకు ఎంఈఓ సూచించారు. బంగారం మారు తాకట్టు పెట్టి దంపతుల పరారీబొబ్బిలి: పట్టణంలోని దావాల వీధి తదితర ప్రాంతాలకు చెందిన ఐదుగురి నగలను ప్రైవేట్ బ్యాంకులో అధిక ధరలకు కుదువ పెట్టి పాత బొబ్బిలికి చెందిన జిల్లెళ్ల ప్రతాప్ అతని భార్య సరోజినిలు పరారయ్యారు. దీంతో బాధితులు బి.సాయికృష్ణ, సొండి లత, కంచెర్ల శ్రీను, శివకుమార్, తులసి తదితరులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రతాప్, సరోజినిలు డబ్బులు అప్పుగా ఇస్తామని సాయికృష్ణ తదితరులకు చెందిన 18గ్రాములు, 30 గ్రాములు, 12 గ్రాములు బంగారం కుదువ పెట్టుకున్నారు. అలాగే ఇతరులు కూడా వారి వద్ద బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బు తీసుకున్నారు. అయితే ఆ దంపతులు కుదువ పెట్టుకున్న బంగారాన్ని ఓ ప్రైవేట్ బ్యాంకులో అధిక డబ్బుకు కుదువ పెట్టి ఆడబ్బుతో పరారయ్యారు. దీంతో ఆ దంపతుల దగ్గర బంగారం కుదువ పెట్టిన వారంతా లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి దంపతుల ఆచూకీ కనుగొని తమ బంగారం తిరిగి ఇప్పించాలని పోలీసులను ఫిర్యాదులో కోరారు. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యపార్వతీపురం రూరల్: తనకు ప్రమేయం లేని విషయంలో ఇతరులు అనుమానిస్తున్నారనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిన్నింటిరాంనాయుడు వలస గ్రామ శివారులో ఆదివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చందనపల్లి రాము (32) అలియాస్ రవి అనే యువకుడిని గ్రామంలోని ఓ విషయమై కొందరు అనుమానించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రాము గ్రామ శివారులో ఉన్న జీడిమామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి అన్న చందనపల్లి మురళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
●రైతుకు ముంపే..
సాయన్నచానల్, నారాయణపు రం కాలువల మధ్యలో వేలాది ఎకరాలు మా ప్రాంతంలో ఉన్నాయి. ఈ రెండు కాలువలు ద్వారా ప్రతీ ఏడాది వరద ముంపు వస్తుంది. ఖరీఫ్లో చుక్క నీరు ఉండదు. వర్షాకాలం వస్తే పొలాలు నీటిలో మునిగిపోతున్నాయి. గత రెండేళ్లుగా అధికారులు మెయింటెనెన్స్ పనులు కూడా చేయడంలేదు. – గురుగుబెల్లి స్వామినాయుడు, వాల్తేరు, సంతకవిటి మండలం. మడ్డువలస ఆయకట్టులో సకాలంలో నీరు రాదు. ఎవరికి ఫోన్ చేసినా ఫలితం ఉండదు. అధికారులు అందుబాటులో ఉండరు. పంటలు పోయాక మాకు సంబంధం లేదు...వ్యవసాయ శాఖను కలవండి అంటారు. వ్యవసాయానికి గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. – ముంజేటి కిషోర్, వండానపేట, రేగిడి మండలం అంతకాపల్లి, పొగిరి, వీఆర్ అగ్రహారం ప్రాంతాల్లో తోటపల్లి కాలువలు ఉన్నాయి. ఖరీఫ్ కు చుక్క నీరు ఇవ్వవు. అధికారులకు ఫోన్ చేస్తే మేం కాదు మరొకరు వచ్చారు అంటారు. కొత్తగా వచ్చిన జేఈలు ఇదిగో అదిగో అంటూ కాలం నెట్టుకొస్తుంటారు. తోటపల్లి పిల్ల కాలువల న్నీ దయనీయంగా మారాయి. – వాకముల్ల చిన్నంనాయుడు, అంతకాపల్లి, రాజాం మండలం -
ఎస్సీ నిరుద్యోగ యువతకు అవగాహన మేళాలు
విజయనగరం అర్బన్: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక అవగాహన మేళాలు నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు (ఈడీ) వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జిల్లాలో ‘ప్రధాన మంత్రి అనుసూచిత్ అభ్యుదయ యోజన’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి, జిల్లా పరిశ్రమల శాఖ, ఏపీ ఖాదీ బోర్డు, ఐటీఐ, వివిధ శిక్షణా భాగస్వాములు, కుటీర, హస్తకళల పరిశ్రమల సంఘాలు, బ్యాంకులు, ‘పీఎం అజయ్’ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కో–కంపోనెంట్ కింద గుర్తింపు పొందిన ప్లేస్మెంట్ ఏజెన్సీల సమన్వయంతో ఈ మేళాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేళాల ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు ఇంటర్న్షిప్, ఉపాధిని కోరుకునే ఎస్సీ యువతకు స్పాట్ రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి అవకాశాలు, స్వయం ఉపాధి, వివిధ రకాల వ్యాపార పథకాలపై నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఈ నెల 16న విజయనగరం వీటీ అగ్రహారంలోని టీటీడీసీ మహిళా ప్రాంగణం, 17న బొబ్బిలిలోని మండల పరి షత్ అభివృద్ధ్ది మహిళా ప్రాంగణంలో అవగా హన మేళాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. విజయనగరం అర్బన్: జిల్లా ప్రజల సమస్యల ను త్వరితగతిన పరిష్కరించేందుకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ సోమవారం నిర్వహించనున్నట్టు కలెక్ట ర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. అర్జీదారు లు దరఖాస్తుల్లో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలను స్పష్టంగా నమో దు చేయాలని, సమస్యకు సంబంధించిన ఆధారాలను జతపరచాలని సూచించారు. కలెక్టరే ట్కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయడం ద్వారా లేదా ‘మీకోసం.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యా దు చేయవచ్చని తెలిపారు. కలెక్టరేట్కు రాలేని వారు మండల, మున్సి పల్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందులో తహసీల్దార్లు, ఆర్డీఓలు పాల్గొంటారని పేర్కొన్నారు. రైతులు తమ భూ వివాదాలు, మ్యుటేషన్లు, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆశాజనకంగా లే వు. వర్షాలుపైనే నీటి నిల్వ ఆధారపడి ఉంది. ఈ నెల ఆరంభంలో స్వల్పంగా వర్షపాతం నమోదు కావడంతో ప్రాజెక్టులో అనుకున్న స్థాయిలో నీటి నిల్వలు లేవు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు మడ్డువలస కుడి, ఎడమ కాలు వల నుంచి సాగునీటి విడుదల మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఇలా.. మడ్డువలస ప్రాజెక్టులో 65 మీటర్లు లెవెల్ కెపాసిటీ నీటి మట్టం ఉండాల్సి ఉంది. ప్రస్తుతం 62.19 మీటర్లు లెవెల్ నీటిమట్టం ఉంది. ఈ లెక్కన 1.22 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో ఉంది. ప్రాజెక్టు పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో 31వేల ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. వీటన్నింటికీ సాగు నీరందించాలంటే సుమారు రెండు టీఎంసీల నీరు తక్షణ అవసరం. ప్రస్తుతం నీటినిల్వ తక్కువగా ఉండడంతో మరో 15 రోజులు నీటి సరఫరాలో ఆలస్యం ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ భాగంలో వర్షాలు తక్కువగా ఉండడంతో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి ఇన్ఫ్లో పూర్తిగా లేదు. వర్షాలు కురిస్తే తప్ప నీటి లభ్యతకు ఆస్కారం లేదు. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు వర్షాలపైనే తమ ఆశలు పెంచుకుంటున్నారు. వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. -
సాగు సాగేదెలా...!
వంగర మండలంలోని గొర్లె శ్రీరాములనాయుడు మడ్డువలస ప్రాజెక్టు ద్వారా వంగర, రేగిడి, సంతకవిటి మండలాల్లో 19 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. కాలువలో ఎక్కడికక్క డే ప్రాజెక్టు ద్వారా వరదల సమయంలో వచ్చిన గుర్రపుడెక్క చేరింది. ఇది కాలువలతో పాటు పరిస ర ప్రాంతాల్లో దిబ్బలుగా ఏర్పడి నీరు ప్రవహించని పరిస్థితి ఉంది. ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలు వలు సైతం గుర్రపుడెక్క, రెల్లిగడ్డి, నల్లతుమ్మ వంటి కలుపుజాతి మొక్కలతో అస్తవ్యస్తంగా మారింది. కాలువలో పరిసర గ్రామాల రైతులు ఉపాధి పను లు ద్వారా వీటిని ప్రతీ ఏడాది తొలగించేవారు. ఈ ఏడాది ఆ పనులు లేవు. కాలువలో ఆధునికీకరణ తోపాటు ఇతర అభివృద్ధి పనులు ప్రభుత్వం చేయ కపోవడంతో పాటు ఇరిగేషన్ శాఖ నిర్వహణను పక్కన పడేసింది. ఖరీఫ్లో ఈ కాలువ ద్వారా థైలాండ్ ప్రాంతాలతో పాటు ఆయకట్టుకు కూడా సాగునీరు అందని పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది ఖరీఫ్ ప్రారంభైన తరువాత ఆబరాగాబరగా ఓ అండ్ ఎమ్ ద్వారా రూ. 17 కోట్లతో కాలువలో పనులు చేసి మమ అనిపించారు. ఈ పనులు టీడీపీ కార్యకర్తలకు కలసివచ్చాయే తప్పా రైతుకు మేలు జరగదు. -
●రైతు సంక్షేమం పట్టదా..
ఈ ప్రభుత్వానికి రైతు సంక్షే మం అక్కర్లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. వేసవిలో సాగునీటి కాలువలు బాగు చేయడం, మెయింటెనెన్స్ చేయ డం చేస్తారు. ఇక్కడ మాత్రం అలా జరగడంలేదు. ఖరీఫ్ వరకూ కాలయాపన చేయడం, ఖరీఫ్లో తూ తూ మంత్రంగా పనులు చేసి, యంత్రాల వెల్డర్స్కు నిధులు కట్టబెట్టడం పరిపాటిగా మారింది. మడ్డువలస ఆయకట్టులో ఆధునికీకరణ పనులు లేవు. రేగి డి సాయన్న ఓపెన్ హెడ్ కాలువలు పూర్తిగా పాడయ్యాయి. షట్టర్లు మూలకు చేరాయి. నారాయఫు రం ఆనకట్ట కుడి, ఎడమ కాలువలకు జైకా ఇస్తున్న నిధులను సక్రమంగా వినియోగించలేకపోయారు. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ నారాయణపురం కుడి కాలువలో జైకా నిధులు పనులు ఆగిపోయాయి. గత ప్లాన్ బాగోలేదు. దిగు వ ప్రాంతాలకు నీరు అందడం లేదు. అందుకే ఏజె న్సీ ఆపేసాం. ఓ అండ్ ఎమ్ నిధులతో కొత్తగా పను లు చేస్తున్నాం. సాయన్నచానల్ పరిధిలో పెద్ద ఎత్తు న పనులు చేయాల్సి ఉంది.ప్రస్తుతం నిధులు లేవు. – డి.రవీంద్ర, డీఈఈ, నారాయణపురం ఆనకట్ట -
దారుణంగా ఓపెన్హెడ్ చానల్స్
రాజాం నియోజకవర్గంలో రాజాంలో సారధిగెడ్డ, రేగిడిలో ఏకెఎల్గెడ్డ, రేగిడి, సంతకవిటి మండలాల్లో సాయన్నగెడ్డలు ప్రధాన సాగునీటి కాలువ లు కంటే కూడా మంచిగా ఆయకట్టుకు సాగునీరు అందించే కాలువలుగా గతంలో ఖ్యాతి ఉండేది. ప్రస్తుతం ఈ కాలువలు ఆయకట్టుకు కూడా నీరు అందివ్వలేని పరిస్థితి ఉంది. ఓపెన్హెడ్ చానల్స్గా ఉన్న సాయన్న చానల్ పూర్తిగా కలుపుతో నిండిపోయింది. రేగిడి, సంతకవిటి మండలాల్లో వీటి షట్టర్లు పూర్తిగా పాడవ్వడం, మదుములు అంతరించిపోవడంతో ఖరీఫ్లో ఆయకట్టుకు పంట విషయం పక్కనపెడితే ముంపు అధికమౌతుంది. వరదలు నిత్యం ఆయకట్టును ముంచేస్తున్నాయి. గతంలో ఉపాధి పనులు నిర్వహించే ఈ కాలువల్లో ఈ ఏడాది ఆ పనులు కూడా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజాంలో సారధిగెడ్డ ద్వారా ఆయకట్టుకు పూర్తిగా నీరు అందని పరిస్థితి ఉంది. రాజాం నుంచి సంతకవిటి మండలంలో మండాకురిటి వరకూ ఈ కాలువ ద్వారా 2 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉండగా, కాలువ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. -
చాకుతో బెదిరించి బంగారం, డబ్బు దోపిడీ
కొత్తవలస: తన ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చున్న ఒక వ్యక్తి వద్దకు ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి చాకు, బీరు బాటిల్ చూపించి భయపెట్టి ఆ వ్యక్తి జేబులో గల రూ.800 నగదు, చేతికి ఉన్న పావుతులం బంగారు ఉంగరం, సెల్ఫోన్ దోచుకుని పారిపోతూ పోలీసులు వెంబడిస్తున్నారన్న ఆందోళనలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ప్రధాన నిందితుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు గాయాల పాలయ్యాడు. కొత్తవలస పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై ఎస్సై జోగారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరానికి చెందిన అముజురు శంకర్సాయి అనే యువకుడు ఆఫ్టింగ్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో శనివారం రాత్రి వేరొకరికి చెందిన కారులో ప్రయాణికులను అనకాపల్లిలో దింపి అక్కడే కారును వదిలేసి వేరే వ్యాన్లో కొత్తవలస వరకు వచ్చాడు. అప్పటికే తెల్లవారుజాము సుమారు 3 గంటలైంది. అక్కడి నుంచి వేరే వాహనం దొరికితే విజయనగరం వెళ్లిపోదామనే ఉద్దేశంతో కొత్తవలస జంక్షన్లో వేచి ఉండగా ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి శంకర్సాయిని బెదిరించి దోచుకున్నారు. ఇంతలో అటుగా వస్తున్న పోలీసులను చూసి తమను వెంబడిస్తున్నారని భావించి ఆందోళన చెంది ఎస్.కోట రూట్లో జోరుగా వెళ్తుండగా ఫైర్స్టేషన్ వద్దకు వెళ్లే సరికి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో స్కూటీ నడుపుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.రోహిత్(19) అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న విశాఖపట్నం జిల్లాకు చెందిన గొంప కుమార్స్వామి(22) తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు గుర్తించారు.అలాగే ఆటో డ్రైవర్ బి.కొండలరావు, అందులో ప్రయాణిస్తున్న ఆయన భార్య చిన్నతల్లికి గాయాలు కావడంతో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన నిందితుడు రోహిత్పై విశాఖపట్నం, విజయనగరం,అనకాపల్లి జిల్లాల్లో గల పలు పోలీస్స్టేషన్లో 8 కేసులు నమోదైనట్లు ఎస్సై తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆటో ఢీకిని ఒక నిందితుడి మృతి -
రెండేళ్ల పాలనలో జిల్లాకు ఒరిగిందేమిటి?
విజయనగరం గంటస్తంభం: రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో విజయనగరం జిల్లాకు జరిగిన అభివృద్ధిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎల్బీజీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాకు కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి నిధులు ఎంత మేరకు వచ్చాయో ప్రభుత్వం వెల్లడించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోందని, మండల స్థాయి ఆస్పత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా కొత్త పరిశ్రమలు తీసురావాలని సూచించారు. అభివృద్ధి పేరుతో భూముల సేకరణకు బదులుగా స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరే చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే ప్రజల తరఫున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు పాల్గొన్నారు. -
నాయనా కళ్లు తెరువు నాయనా..!
● నువ్వే ఆశ, ఆధారమనుకున్నాం ● రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి ● విషాదంలో తల్లిదండ్రులుచీపురుపల్లిరూరల్(గరివిడి): మా కొడుకు బాగా చదివి మంచి స్థాయికి చేరాలని ఎన్నో కలలు కన్నాం, మా కుటుంబానికి మా కొడుకే ఆశ, ఆధారం అనుకున్నాం. నాయనా..లే.. కళ్లు తెరువు..అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు రోదిస్తుంటే చూపరుల కళ్లు చెమ్మగిల్లాయి. ఈ విషాద వార్త వివరాలిలా ఉన్నాయి. గరివిడి పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన పదో తరగతి విద్యార్థి గుంటు అవినాష్(15) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్థి అవినాష్ గరివిడిలో గల గోదావరి దేవి షరాఫ్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 12న స్కూల్ ప్రారంభం రోజున పాఠశాల ముగిసిన అనంతరం సైకిల్పై ఇంటికి వెళ్తుండగా చీపురుపల్లి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న మ్యాక్సీక్యాబ్ అవినాష్ సైకిల్ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అవినాష్ను వెంటనే విజయనగరంలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశాడు. తల్లిదండ్రులు మోహన్, పుష్పలకు ఒక కుమార్తె, కుమారుడు కాగా కుమారుడు మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుమారుడిని పట్టుకుని తల్లిదండ్రులు విలపించిన తీరు అందరికీ కన్నీళ్లు తెప్పించింది. కుమారుడి జ్ఞాపకాలను తలుచుకుంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
సంపూర్ణ కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు ప్రణాళిక
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ వెంకట అప్పారావు రచించిన సంపూర్ణ కన్యాశుల్కం ఎనిమిది గంటల నాటక ప్రదర్శన సెప్టెంబరు 20న కాకినాడలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని నాటక నిర్మాత, అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మొలకల పేర్కొన్నారు. ఈ మేరకు మహాకవి స్వగృహంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. నవయువ ఆర్ట్స్ సొంటినేని కిశోర్ దర్శకత్వంలో కాకినాడలో కన్యాశుల్కం పదో సంపూర్ణ నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 45 మంది నటీనటులతో ప్రదర్శన ఉంటుందన్నారు. కార్యక్రమంలో దర్శకులు రామకృష్ణ, పెద్దింటి అప్పారావు, రౌతు వాసుదేవరావు, చీకటి దివాకర్,ఆర్.సూర్యపాత్రో, జిఎస్.చలం నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. -
రక్తదాతే.. ప్రాణదాత
● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ● వైద్య రంగంలో రక్తదాతల పాత్ర కీలకంవిజయనగరం ఫోర్ట్: సమాజంలో వైద్యులకు ఎంత ప్రాధాన్యత ఉందో రక్తం దానం చేసే రక్తదాతలకు అంతటి ప్రాధాన్యత ఉంది. ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగికి వైద్యుడు చికిత్స అందించి ప్రాణాలు పోస్తే, రక్తదాతలు రక్తం దానం చేసి ప్రాణాలు నిలుపుతారు. రక్తం అవసరమైన రోగికి సకాలంలో రక్తం ఎక్కించకపోతే మరణించే ప్రమాదం ఉంది. ఆపదలో ఉన్న సాటి మనిషి ప్రాణాలు నిలబెట్టాలన్న గొప్ప మనసు ఉన్న వ్యక్తే రక్తదాత. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కధనం. చాలా మంది తమ కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్నా సరే రక్తదానం చేయడం ముందుకు రారు. రక్తదానం చేస్తే అనారోగ్యం వచ్చేస్తుందనే భ్రమ ఇప్పటకీ చాలా మందిలో ఉంది. కానీ ఇది అవాస్తవం. రక్తదాతల మానవత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రక్తదాతలు లేని సమాజం ఊహించలేం రక్తాన్ని మిగతా వస్తువులు మాదిరి పరిశ్రమల్లో తయారు చేయలేం. రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేం. రక్తదాతలు రక్తం దానం చేయడం ద్వారా మాత్రమే సమాజంలో ఆపదలో ఉన్న రోగులు బ్రతికి బట్టగట్టగలుగుతున్నారు. రక్తదాన శిబిరాల్లో రక్తదాతలు దానం చేసిన రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ల్లో భద్రపరిచి రక్తం అవసరమైన రోగులకు అందిస్తున్నారు. ఏటా 25 వేల మంది రక్తదానం జిల్లాలో ఏటా వేలాది మంది రక్తదానం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న బ్లడ్బ్యాంక్లు, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో ఏటా 22 వేలు నుంచి 25 వేలు మంది వరకు రక్తదానం చేస్తున్నారు. దీనిని బట్టి రక్తదాతలు అవసరం ఎంతో ఉందో అర్ధం అవుతుంది. జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం, నెల్లిమర్ల మిమ్స్ రక్తనిధి కేంద్రం, ఎన్వీఎన్ బ్లడ్ బ్యాంక్, రోటరీ బ్లడ్ బ్యాంక్, విజయ బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంక్, బొబ్బిలి బ్లడ్ బ్యాంక్, జీఎంఆర్ బ్లడ్ బ్యాంక్లు ఉన్నారు. వీరు రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తం సేకరిస్తూ ఉంటారు. అరుదైన బ్లడ్ గ్రూపు రక్తదాతలు రక్తదాతల్లో అరుదైన గ్రూపు ఉన్న రక్తదాతల పాత్ర అత్యంత కీలకం. ఏ పాజిటివ్, బీ పాజిటివ్, ఓ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కువ మందిలో ఉంటుంది. ఈ గ్రూపు రక్తం సులభంగా లభిస్తుంది. ఏ నెగిటివ్, బీనెగిటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్ గ్రూపు రక్తం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇటువంటి అరుదైన గ్రూపు రక్తం వివరాలు బ్లడ్ బ్యాంక్ల వద్ద ఉన్నాయి. అవసరమైనప్పుడు వీరు ఆ రక్తదాతలకు ఫోన్ చేస్తే వచ్చి రక్తం దానం చేస్తున్నారు. -
కేరళ పర్యటనకు జెడ్పీటీసీ సభ్యులు
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సొంత నిధులతో పర్యటన ఏర్పాట్లు విజయనగరం రూరల్: ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు కేరళ పర్యటనకు శనివారం బయలుదేరి వెళ్లారు. నిరంతరం ప్రజా సేవలో, ప్రజల మధ్యనే ఉంటూ, గత ఐదేళ్లుగా జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీటీసీ సభ్యులందరికీ ప్రత్యేక గుర్తింపుగా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు తన సొంత ఖర్చులతో ఐదు రోజుల కేరళ పర్యటనకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి జెడ్పీ చైర్మన్తో పాటు సభ్యులు ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు వి.నరసింహమూర్తి, జెడ్పీటీసీ ప్రతినిధి వల్లి రెడ్డి శ్రీను జన్మదిన వేడుకలను హైదరాబాద్ విమానాశ్రయంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సమక్షంలో అందరూ కలిసి కేక్ కట్ చేసి ఆనందంగా జరిపారు. పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు సీతానగరం: మండలంలోని చినబోగిలి పొలిమేరల్లో పామాయిల్ తోటలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ హేమలత తెలిపారు. వీరి నుంచి రూ.3,130లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. డ్రోన్ కెమెరా సాయంతో పేకాట ఆడుతున్న ప్రదేశాన్ని గుర్తించి సిబ్బందితో వెళ్లి దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. సిరిపురంలో వీధికుక్కల స్వైర విహారం రాజాం/సంతకవిటి : సంతకవిటి మండలంలోని సిరిపురం గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం అధికమైంది. కుక్కల బాధ తాళలేక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆరునెలలు క్రితం ఈ వీధి కుక్కల స్వైర విహారంతో పలువురు గ్రామస్తులు గాయాల పాలయ్యారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో వీధి కుక్కలు కళ్లాల్లోని మూగజీవాలపై విరుచుకుపడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఈ కుక్కల దాడిలో గ్రామానికి చెందిన పలువురు రైతులకు సంబంధించి 12 లేగ దూడలు మృతి చెందాయి. అప్పుడే పుట్టిన దూడలు, రెండు మూడు వారాలు వ్యవధి ఉన్న లేగదూడలపై దాడి చేసి హతమార్చుతున్నాయి. కళ్లాల్లో పశువుల శాలల్లో కడుతున్న దూడలపై దాడి చేసి గాయపర్చడం, ఒక్కోదపా పొలాల్లోకి లాక్కెళ్లి తినేయడం చేస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో వీధి కుక్కల అధికమయ్యాయని, ఇతర గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సంచరించడమే కాకుండా రాత్రిళ్లు పెద్దపెద్ద అరుపులతో ప్రజలకు ఇబ్బందులు కల్గిస్తున్నాయని గ్రామస్తులు వెల్లడించారు. వీటిని అదుపు చేయాలని, యాంటీ బర్త్ ఇంజక్షన్లు చేయాలని పంచాయతీ సచివాలయలంలో ఫిర్యాదు చేసామని, ఇంతవరకూ ఏ ఒక్కరూ పట్టించుకోలేదని గ్రామానికి చెందిన రైతు రాంబాబు వెల్లడించారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ● వారం రోజుల వ్యవధిలో 12 లేగదూడలు మృతి ● ఫిర్యాదు చేసినా పట్టించుకోని పంచాయతీ శాఖ -
ప్రాణం తీసినపిడుగుల వాన
● పిడుగుపాటుకు క్రికెట్ ఆడుతున్న విద్యార్థి, ఓ మహిళ దుర్మరణం ● వారి కుటుంబాల్లో విషాదం ఓ వైపు ఎల్నినో ప్రభావంతో ఉదయమంతా భగభగమండే ఎండలు... మరో వైపు సాయంత్రం పిడుగుల వాన మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. విభిన్నవాతావరణ పరిస్థితులు జిల్లా ప్రజల్లో దడపుట్టిస్తున్నాయి. జిల్లాలో శనివారం సాయంత్రం వేర్వేరు ప్రదేశాల్లో పిడుగుపాటుకు ఓ విద్యార్థి, పశువుల కాపరి ప్రాణాలు విడిచారు. భవిష్యత్తును బంగారం చేసుకునేందుకు ముందుకు సాగుతున్న విద్యార్థి... పశువులు మేపుతూ కుటుంబ భారాన్ని మోస్తున్న మహిళ మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ● ఆడుతూనే మృత్యు ఒడిలోకి.. రేగిడి: పాఠశాలలు, కళాశాలలకు రెండో శనివారం సెలవు కావడంతో రేగిడి మండలం కొండవలస గ్రామానికి చెందిన విద్యార్థులందరూ ఒక చోటకు చేరారు. సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నారు. మేఘావృతమైనా ఆటలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే పిడుగుల వాన ఆరంభమైంది. తలదాచుకునేందుకు పరుగు తీసే సమయంలో క్రికెట్ ఆడుతున్న విద్యార్థుల్లో ఆమిటి పవన్ (17)ను పిడుగుతాకింది. అంతే అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పవన్ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకెండియర్ సీఈసీ చదువుతున్నాడు. ఆదుకుంటాడనుకున్న కొడుకు అకాల మరణంతో ఆర్ఎంపీ అయిన తండ్రి సత్యనారాయణ, తల్లి సత్యవతి బోరున విలపిస్తున్నారు. -
● పొలంలోనే తనువుచాలించి..
బాడంగి: మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన లచ్చుపతుల భవాని(42) తమ ఆవులను మేత కోసం చినమంత పొలానికి తీసుకువెళ్లింది. అక్కడ ఆవులు మేస్తుండగా సాయంత్రం 4.30 సమయంలో వర్షం ఆరంభమైంది. ఇంటికి ఆవులను తోలుకెళ్లేందుకు సిద్ధపడుతున్న సమయంలో పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతురాలి భర్త వెంకటరమణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూర్యకుమారి తమ సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. తల్లి మృతితో బీటెక్, డిగ్రీ చదువుతున్న సాయి, మహేష్లు బోరున విలపిస్తున్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
రాజాం సిటీ: ఏం కష్టం వచ్చిందో ఏమో మండల పరిధి గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన కోడూరు రాము (35) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజయ్యపేట సమీపంలోని తోటపల్లి కాలువ గట్టు పక్కన చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అందరితో కలసిమెలసి సరదాగా ఉండే రాము ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడేశారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతునికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి ర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
చేపల వేటకు వేళాయె..
● నేటి నుంచి సముద్రంలో చేపల వేటకు గ్రీన్సిగ్నల్ ● మత్స్యశాఖ నుంచి వెలువడిన ఉత్తర్వులు పూసపాటిరేగ: మత్స్యసంపద వృద్ధిలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను నిషేధించారు. గడువు ముగియడంతో చేపల వేటకు పచ్చజెండా ఊపుతూ మత్స్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 14వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపలవేట సాగించుకోవచ్చని ఉత్తర్వు ల్లో పేర్కొన్నట్టు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ లావణ్య తెలిపారు. వేట సాగేదిలా.. జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 21 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మత్స్యకారులు 885 బోట్లలో వేట సాగిస్తు న్నట్లు రికార్డులు చెబుతున్నాయి. చింతపల్లిలో 412 బోట్లు, తిప్పలవలసలో 226, పతివాడబర్రిపేటలో 163, కోనాడలో 4 బోట్లు, తమ్మయ్యపాలెంలో 25, పులిగెడ్డలో10, ముక్కాంలో 91, చోడిపల్లిపేటలో 38, కొండ్రాజుపాలెంలో 60, చేపల కంచేరులో 91 బోట్లు ఉన్నాయి. వేటనిషేధ కాలానికి ప్రభు త్వ ఆంక్షలతో చాలామంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందలేదు. ఇంజిన్ బోటుకు ఐదుగురు, సంప్రదాయ బోటుకు ముగ్గురు చొప్పున సాయం అందజేయడంతో అర్హులకు భృతి అందలేదని జిల్లా మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షుడు బి.చిన అప్పన్న తెలిపారు. నాకాబందీ ● శిక్షణ కానిస్టేబుళ్లతో వాహన తనిఖీలు విజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు డెమోలో భాగంగా శనివారం ఏఆర్ ఏఎస్పీ కల్యాణ్ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో రెండు గంటల పాటు నాకాబందీ నిర్వహించారు. మొత్తం 160 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు, 700 మంది పోలీస్ సిబ్బంది 150 చోట్ల వాహన తనిఖీలు చేపట్టారు. వై జంక్షన్, వీటీ అగ్రహారం, ఎత్తుబ్రిడ్జి, ఆర్అండ్బీ, మహిళా పోలీస్ స్టేషన్, కలెక్టరేట్, ద్వారపూడి బ్రిడ్జి, కంటోన్మెంట్, గూడ్స్ షెడ్, సీఎంఆర్ కూడలి, గంటస్తంభం, ఆర్టీసీ కాంప్లెక్స్, రింగ్రోడ్డు, కోట, సింహాచలం మేడ తదితర చోట్ల ఏకకాలంలో వాహనతనిఖీలు జరి పారు. వాహనదారుల వివరాలు నమోదుచేశారు. తనిఖీల్లో డీపీటీసీ డీఎస్పీ వీర్ కుమార్, ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి, సీఐలు ఆర్.వి.కె.చౌదరి, శ్రీనివాస్, ఎస్ఐలు సురేంద్ర నాయుడు, మురళీ, కృష్ణమూర్తి, భవానీ, సూర్యకుమారి, లీలావతి, తదితరులు పాల్గొన్నారు. -
● సత్ఫలితాలివ్వని ‘బడిబాట’ ● సర్కారు బడుల్లో ప్రవేశాలు అంతంతమాత్రమే.. ● జిల్లాలో లక్ష్యానికి దూరంగా ప్రవేశాలు ● ఒకటో తరగతి ప్రవేశాల లక్ష్యం 8 వేలు... సాధించినది సగమే! ● రాష్ట్ర సగటు కంటే వెనకడుగు... 17వ స్థానానికి పతనం ● ప్రైవేట్ పాఠశాలల హవా... సర్కారు
విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గత రెండేళ్లుగా దిగజారుతున్నాయి. ఊరిలో బడి ఉన్నా ప్రైవేటు పాఠశాలల వైపే పిల్లలు మొగ్గుచూపుతున్నారు. చదువుతోనే భవిత మారుతుందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు సైతం తాహతకు మించి ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ బడుల్లో బోధనా నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నా వసతుల కల్పనలో నిర్లక్ష్యం, పాఠశాలల అడ్డగోలు విలీనం వంటివి ప్రైవేటు విద్యను ప్రోత్సహించేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. విద్యాశాఖ ఏటా ఆర్భాటంగా నిర్వహించే ‘బడిబాట’ కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలివ్వకపోవడం ఉపాధ్యాయ వర్గాలను కలవరపెడుతోంది. ఇంటింటి ప్రచారాలు చేసినా ఫలితం లేకపోయిందన్న నిట్టూర్పు కనిపిస్తోంది. చాలా పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలు లేకపోవడం పాఠశాలల మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. ● సర్కారుపై నమ్మకం శూన్యం ప్రభుత్వ బడుల కంటే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకే తల్లిదండ్రులు జై కొడుతుండడం విద్యాశాఖ అసమర్ధతను ఎత్తిచూపుతోంది. 1100లకు పైగా ఉన్న ప్రభుత్వ అన్ని యాజమాన్యాల బడుల్లో ఒకటో తరగతిలో చేరిన వారు 36.47 శాతంతో 5,912 మంది... అయితే కేవలం 302 సంఖ్యలో ఒకటో తరగతి ఉన్న ప్రైవేటు బడుల్లో ఏకంగా 63.53 శాతంతో 8,759 మంది చేరారు. గడిచిన మూడేళ్లలో పరిశీస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతూ, ప్రైవేటు పాఠశాలల్లో పెరుగుతూ వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు 2024–25 విద్యాసంవత్సరలో 7,438 మంది ఉంటే మరుచటి 2025–26 విద్యాసంవత్సరానికి 359 మంది తగ్గుతూ 7,079 మంది, 2026–27 సంవత్సరానికి ఏకంగా 1,167 మంది తగ్గుతూ కేవలం 5,912 మంది మాత్రమే నమోదయ్యారు. ● వైఫల్యానికి కారణాలు ఎన్నో.... ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆంగ్ల మాధ్యమం ఇప్పడు నడుస్తున్నా... దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులకు సరైన శిక్షణ, పర్యవేక్షణ లేకపోవడం, పుస్తకాలు, విద్యార్థి కిట్లు సకాలంలో అందకపోవడం, పాఠశాలల విలీనంతో ప్రయాణ సదుపాయాలు లేకపోవడం, ఉపాధాయులను వివిధ యాప్లు, సర్వేలలో నిమగ్నం చేసి బోధనకు దూరం చేయడం వంటివి ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు తగ్గేందుకు కారణంగా కనిపిస్తున్నాయి. 17వ స్థానానికి పతనం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలో విజయనగరం జిల్లా 17వ స్థానానికి పడిపోయి అట్టడుగున కొట్టుమిట్టాడుతోంది. ఒకటో తరగతి ప్రవేశాల రాష్ట్ర సగటు 39.12 శాతం కాగా జిల్లా కేవలం 36.47 శాతానికి పరిమితమై రాష్ట్ర సగటున కూడా అందుకోలేకపోయింది. లక్ష్య సాధనలో రాష్ట్ర సగటు 71.12 శాతం ఉంటే మన జిల్లాలో 66.31 శాతంతో వెనుకబడి ఉంది. పొరుగున ఉన్న పోలవరం (80.21 శాతం), ఏఎస్ఆర్ (71.09 శాతం) జిల్లాలో ప్రవేశాల సగటు బాగుంది. లక్ష్యం 8 వేలు... చేరికలు సగమే.. జిల్లాలో ఒకటో తరగతిలో చేరే వయస్సు (5 ఏళ్లు దాటాలి) గల పిల్లలు 16,211 మంది ఉన్నారు. అందులో కనీసం 55 శాతం 8,916 మందిని ప్రభుత్వ బడుల్లో చేర్చాలని విద్యాశాఖ కనీస లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 11 నాటికి చేరిన వారు కేవలం 5,912 మంది మాత్రమే. ప్రవేశాలకు ఆసక్తి చూపిన వారిలో చాలా మంది మళ్లీ ప్రైవేటు బడులవైపు వెళ్లిపోయేందుకు సిద్ధపడుతుండడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటికి రావడంతో పేరిచ్చామని, పిల్లలను ప్రైవేటు బడికే పంపిస్తామంటూ కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. -
పిడుగుపాటుకు ఎద్దు మృతి
వంగర: మండల పరిధి శ్రీహరిపురం గ్రామానికి చెందిన గార కంచినాయుడు అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగు పాటుకు శనివారం మృతి చెందింది. గ్రామ సమీపంలోని దేవకివాడ పొలంలోకి పశువులను మేతకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు కోరాడు. విద్యుత్ షాక్తో చూడు గేదె.. వేపాడ: మండలంలో బొద్దాం పంచాయతీ శివారు కొత్త బొద్దాం గ్రామానికి చెందిన ఎర్రా అప్పారావు చూడు గేదె విద్యుత్ షాక్తో మృతి చెందిన సంఘట చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు... శనివారం గ్రామానికి చెందిన ఎర్రా అప్పారావు చూడు పశువును గంగువాని చెరువు వద్ద మేపుతున్నారు. గేదె మేస్తూ విద్యుత్ స్తంభం వద్ద తెగి పడిపోయిన విద్యుత్ తీగను తాకడంతో విద్యుత్ షాకు గురై అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో సరఫరా నిలుపు చేశారు. విద్యుత్ షాకు గురై మృతి చెందిన చూడు గేదె సుమారు రూ.లక్షా 50వేలు విలువ వుంటుందని స్థానికులు తెలిపారు. -
ఆదుకుంటామన్నారు.. ఆవేదన మిగిల్చారు..!
● ఉత్తుత్తిదిగా మారిన ఉచిత గ్యాస్ అధికారంలోకి వస్తే మహిళకు ఏడాదికి మూడు సిలిండర్ల చొప్పు న ఉచితంగా ఇస్తామని చంద్రబాబు సర్కార్ గొప్పగా ప్రచారం చేసింది. తీరా పథకాన్ని ఉత్తిగ్యాస్గా మార్చేసింది. ఇప్పుడు సిలిండ్ అందితే చాలన్న స్థితికి చేర్చింది. ఇప్పటివరకు 30,862 మంది లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ అందలేదు. మొదట విడతలో 5073 మంది, రెండో విడతలో 2,993 మంది, మూడో విడతలో 4389 మంది, నాలుగో విడతలో 18,407 మందికి కోత విధించింది. ● తల్లికి వందనం లోనూ కోతలే... గత ప్రభుత్వం అమలుచేసిన అమ్మఒడి పథకానికి టీడీపీ సర్కార్ తల్లికి వందనం అని పేరు మార్చింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికివందనం పథకం అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది పథకాన్ని ఎగ్గొట్టింది. జనవరి నెలలో తల్లికి వందనం ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వలేదు. గతేడాది సాంకేతిక సమస్యలు కారణంగా జిల్లాలోని 16 వేల మంది లబ్ధిదారులు తల్లికి వందనం డబ్బులు రాలేదని అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. విజయనగరం ఫోర్ట్: ‘అక్కచెల్లెమ్మలూ గుర్తుపెట్టుకోండి... మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మలను లక్షాధికారులను చేసే బాధ్యత మాది’ అంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడుతో పాటు నారా లోకేశ్, పవన్కల్యాణ్, కూటమి నాయకులు ఎన్నికల్లో హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక పథకం ప్రకారం మోసం చేశారు. 18 ఏళ్లు నిండిని ప్రతీ మహిళకు ఆడబిడ్డనిధి కింద నెలకు రూ.1500 ఇస్తామన్న హామీని పూర్తిగా ఎగ్గొట్టారు. జిల్లాలోని 18 ఏళ్లు నుంచి 59 ఏళ్ల వయసు గల సుమారు 7.50 లక్షల మంది మహిళలను మోసం చేశారు. హామీని అమలుచేస్తే ఒక్కో మహిళకు రెండేళ్ల బకాయి నెలకు రూ.1500 చొప్పున రూ.36వేలు చెల్లించాల్సి ఉంది. ఒక్క రూపాయి ఇవ్వలేదు.. ఎన్నికల ప్రచారంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పన ఇస్తామని చంద్రబాబు చెప్పారు. నా వయసు 26 సంవత్సరాలు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు అయింది. ఇచ్చిన హామీ ప్రకారం రూ.36 వేలు అందాలి. ఒక్క నెల కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇస్తారన్న నమ్మకం కూడా పోయింది. నమ్మించి మోసం చేశారు. – బోను భవాని, లోతు గెడ్డ గ్రామం, మెంటాడ మండలం సున్నా వడ్డీ రాలేదు రుణాలు సక్రమంగా కడితే సున్నా వడ్డీ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశారు. తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించినా సున్నా వడ్డీ ఇవ్వలేదు. తీసుకున్న రుణానికి అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తామని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. – గొల్లు రమాదేవి, మధుపాడ గ్రామం, గంట్యాడ మండలం రెండేళ్లుగా.. ‘ఆడబిడ్డ’ల ఆవేద‘నిధి’.. మహిళలను దగా చేసిన టీడీపీ సర్కార్ అమలుకాని ఆడబిడ్డ నిధి మహిళలకు అందని నెలకు రూ.1500 ఉచిత గ్యాస్కు తూచ్ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ హామీ గాలికి... -
వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని విడిచిపెట్టేది లేదు..
సాలూరు: తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన, చేయించిన వారిని విడిచిపెట్టేది లేదని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర హెచ్చరించారు. పట్టణంలోని తన గృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి తన స్థాయిని మరచి మా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అత్యంత హేయమైన రీతిలో విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాజాగా ఆమె కొందరు గిరిజనులతో తనపై కూడా వ్యక్తిగత విమర్శలు చేయిచారని పేర్కొన్నారు. తానెప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్పై రాజకీయ విమర్శలే చేశాను తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. తన భార్య లేదా పిల్లలు ఏనాడూ ఏ అధికారికి ఫోన్లు చేయలేదన్నారు. ప్రస్తుత మంత్రి సంధ్యారాణి ఇంట్లో మంత్రి కాకుండా వారి కుటుంబీకులు అధికారులతో ఏమేమి మాట్లాడుతున్నారో అందరికీ తెలుసునన్నారు. మంత్రి సంధ్యారాణి, ఆ పార్టీ నేతలు ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని లేకుంటే తాము అటువంటి విమర్శలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలు ప్రజలకు తెలుసునని చెప్పారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు పనులను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. నియోజకవర్గంలో నాసిరకంగా పనులు చేపట్టి బిల్లులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కలెక్టర్ను అనేక రకాలుగా టీడీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. నాసిరకం పనులపై కలెక్టర్ స్పందించి విచారణ చేయించి పీఆర్, ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే నాసిరకం పనులపై ఆధారాలతో కేంద్ర విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
కన్నబిడ్డను చూసేందుకు వెళ్తూ.. మృత్యు ఒడిలోకి...
కళ్లేదుటే.. కన్నబిడ్డ దుర్మరణం● మోటార్ సైకిల్ను ఢీకొన్న కారు ● మృతి చెందిన ఓ వ్యక్తిగజపతినగరం రూరల్ : కన్నబిడ్డను చూసేందుకని వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఇటీవలె తండ్రి కావడంతో బిడ్డను చూసొద్దామని వెళ్తే విధికి కన్నెర్ర చేసింది. బిడ్డను చూడకుండానే అనంతలోకాలకు తీసుకుపోయింది. దీంతో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మరుపల్లి సమీపాన గల ఓలౌ కంపెనీ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు కథనం ప్రకారం... రామభద్రపురం గ్రామానికి చెందిన చొక్కాపు శేఖర్రావు (29) మండలంలోని గుడివాడ గ్రామం నుంచి మోటార్సైకిల్పై గజపతినగరం వైపు వస్తుండగా... విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న కారు స్థానిక ఓలౌ కంపెనీ వద్ద బలంగా ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన శేఖర్రావును గజపతినగరం ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఇటీవలే తండ్రి అయిన శేఖర్ తన కుమారుడిని చూసేందుకు మెంటాడ మండలం గుర్ల తమ్మిరాజుపేట గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శేఖర్కు భార్య ధనలక్ష్మి ఉన్నారు. తల్లి చొక్కాపు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెరకముడిదాం: కన్నబిడ్డ కళ్లేదుటే మృతి చెందిన ఘటన ఓ తండ్రికి విషాదం మిగిల్చింది. మండలంలోని పులిగుమ్మి గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడి బాలుడి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని పులిగుమ్మి గ్రామంలో శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన బెజవాడ కృష్ణ తన మామిడితోట దున్నడానికి తన కుమారుడు బెజవాడ జశ్వంత్(13)తో కలిసి వెళ్లాడు. తోట దున్నిన తరువాత వెళ్లిపోయేందుకు ట్రాక్టర్ డ్రైవర్ చిన్నంనాయుడు గట్టుఎక్కించే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పడంతో బోల్తా పడింది. అదే సమయంలో అదే గట్టుపై కృష్ణ కుమారుడు జశ్వంత్ వుండడంతో ట్రాక్టర్ జశ్వంత్పై పడిపోయింది. దీంతో జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కన్నబిడ్డ కళ్లేదుటే మృతి చెందడంతో తండ్రి గొల్లుమన్నాడు. జశ్వంత్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న బుదరాయవలస ఎస్ఐ జె.లోకేష్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బంధువుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు విద్యార్థి మృతి బొబ్బిలి రూరల్: మండలంలోని అలజంగి గ్రా మంలో చోటుచేసుకున్న ప్రమాదంలో మున్సిపాలిటీలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన రాంబా ర్కి పవన్కుమార్ (13) అనే విద్యార్థి మృతి చెందాడు. ఇటీవల వేసవి సెలవులు కాగా తాతగారి గ్రామమైన అలజంగి వెళ్లగా శ శనివారం గ్రామంలోని శివాలయం వద్ద స్నేహితులతో ఆడుతుండగా అక్కడే ఉన్న కూర్చునే పలకపై కూర్చున్నాడు. ఇంతలో పలక పగిలిపోయి విద్యార్థి గుండెల మీద పడింది. దీంతో స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి తల్లిదండ్రులు సావిత్రమ్మ, శంకర్రావులు బోరున విలపిస్తున్నారు. సోమవారం నుంచి పాఠశాలకు వెళతానని ఈ రెండు రోజులు తాతగారి ఇంటి విద్దనే ఉంటానని చెప్పి మృత్యువాత పడ్డాడని గొల్లుమంటున్నారు. విద్యార్ధి పవన్ గొల్లపల్లి హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. దీనిపై సీఐ నారాయణరావు వద్ద ప్రస్తావించగా తమకెలాంటి సమాచారం లేదని, ఫిర్యాదు అందలేదని తెలిపారు. ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి -
బయోఫోర్టిఫైడ్ రైస్తో పోషకలోపాల నివారణ
మక్కువ: గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపాల నివారణ, రైతుల ఆదాయాభివృద్ధి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో బయోఫోర్టిఫైడ్ వరి రకాల సాగు కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ అన్నారు. వర్సిటీ, భారతీయ వరి పరిశోధన సంస్థ (హైదరాబాద్) సంయుక్తంగా గిరిజన ఉప ప్రణాళిక కింద నిర్వహిస్తున్న అవగాహన, విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా అనసభద్ర, మరిపివలస గ్రామాల్లో గిరిజన రైతులకు శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో వ్యవసాయం, ఆరోగ్యం, పోషకాహారం పరస్పర అనుసంధానిత అంశాలని పేర్కొన్నారు. బోటనీ విభాగాధిపతి డాక్టర్ అనిరుధ్ కుమార్ మాట్లాడుతూ బయోఫోర్టిఫైడ్ వరి రకాలు, సాధారణ వరి రకాల కంటే అధిక పోషక విలువలను కలిగి ఉండడంతో పాటు ఐరన్, జింక్ వంటి సూక్ష్మపోషకాల లోపాలను తగ్గించడంలో ఉపయోగపడతాయని వివరించారు. రైతులకు విత్తనాల ఎంపిక, సాగు నిర్వహణ, దిగుబడి మెరుగుదల, మార్కెట్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. భారతీయ వరి పరిశోధన సంస్థ ప్రిన్సిపాల్, సైంటిస్ట్ డాక్టర్ సి.ఎన్.నీరజ, శాస్త్రవేత్తల బృందం విశ్వవిద్యాలయంతో కొనసాగుతున్న సహకార కార్యక్రమంలో భాగంగా సాంకేతిక మార్గదర్శకత్వం అందించారు. బయోఫోర్టిఫైడ్ వరి రకాల ఎంపిక, గిరిజన ప్రాంతాలకు అనువైన సాగు విధానాలు, రైతులకు శిక్షణ కార్యక్రమాల రూపకల్పన తీరును వివరించారు. గతంలో మక్కువ మండలంలోని జగ్గుదొరవలస గ్రామంలో 2026 ఫిబ్రవరి మార్చి నెలల్లో ఇలాంటి అవగాహన, పరిశోధన, రైతు–శాస్త్రవేత్తల పరస్పర చర్చా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు ఇన్చార్జి వీసీ శ్రీనివాసన్ తెలిపారు. కార్యక్రమంలో భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, సీటీయూఏపీ అధ్యాపకులు ఎం.గంగునాయుడు, రైతులు పాల్గొన్నారు. -
తప్పిన ప్రమాదం
గుమ్మలక్ష్మీపురం: మండల కేంద్రంలో ఆర్టిసీ బస్సుకు, అందు లోని ప్రయానికులకు ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం వచ్చిన ఆర్టీసీ బస్సు యూనియన్ బ్యాంకు దగ్గరికి చేరుకోగా ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి ముందరి టైరు దిగిపోయింది. దీంతో బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ ఒరిగిన బస్సును నిలుపుదల చేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఒడిశాలో ఎకై ్సజ్ దాడులు
పార్వతీపురం రూరల్ : నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా ఏపీ ఎకై ్సజ్ అధికారులు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పార్వతీపురం ఏఈఎస్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో కోరాపుట్ జిల్లా బండుగం బ్లాక్ పరిధిలోని గ్రామాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. ఒడిశాలోని గుణుపూర్ పోలీసుల సహకారంతో పార్వతీపురం ఎకై ్సజ్, ఈఎస్టీఎఫ్, విజయనగరం ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాడుల్లో అక్రమ మద్యం తయారీకి నిల్వ ఉంచిన 4 వేల లీటర్ల బెల్లం ఊట (ఎఫ్జే వాష్), 1000 కిలోల నల్లబెల్లం, 100 కిలోల అమ్మోనియా, 50 లీటర్ల సారాను గుర్తించి ధ్వంసం చేశారు. సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేశామని, అక్రమ మద్యం రవాణా, తయారీపై దాడులు కొనసాగుతాయని ఏఈఎస్ సంతోష్ స్పష్టం చేశారు. 4 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం -
విజయనగరంలో నిరసన హోరు
చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా విజయనగరం జిల్లా కేంద్రంలో చేపట్టిన మహా నిరసన ర్యాలీకి జనం పోటెత్తారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన తెలిపారు. ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వంలో న్యూపూర్ణ కూడలి నుంచి మూడులాంతర్ల కూడలి వరకు సాగిన ర్యాలీలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినదించారు. దగాకోరు పాలనపై ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ బృందం సీఎం చంద్రబాబు మోసకారి పాలనకు వ్యతిరేకంగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఆలపింపిచన జానపద గేయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిరసన ర్యాలీలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, మాజీ కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ శెట్టి వీరవెంకట రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, తదితరులు పాల్గొన్నారు. -
నిరంకుశ పాలనలో నలిగిపోతున్నాం
రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న నిరంకుశ పాలనలో నలిగిపోతున్నామంటూ రాజాం నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్ ఆధ్వర్యంలో రాజాంలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. హామీలను నమ్మి మోసపోయామంటూ వాపోయారు. నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటుకుంటూ మాధవ బజార్లోని వైఎస్సార్ విగ్రహం వరకు సాగారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కె.వి.సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు టి.అచ్చియ్యనాయుడు, కార్యదర్శి ఉత్తరావల్లి సురేష్ముఖర్జీ, నాలుగు మండలాల పార్టీ కన్వీనర్లు పాల్గొన్నారు. -
గర్జించిన బొబ్బిలి
చంద్రబాబు వెన్నుపోటు పాలనపై బొబ్బిలి ప్రజలు గర్జించారు. అధికారం కోసం అబద్ధపు హామీలతో నమ్మించి మోసం చేశారంటూ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో కదం తొక్కారు. శాంతియుత ర్యాలీని అడ్డుకున్న పోలీసులను ప్రశ్నించారు. ప్రజల గళాన్ని పోలీసులతో నొక్కించేస్తున్న ప్రభుత్వ చర్యలపై మండిపడ్డారు. కూటమి పాలనకు వ్యతిరేకంగా నినదించారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యులు ఇంటి గోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, జెడ్పీటీసీలు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, ఎంపీపీలు, ఎంపీటీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. -
సర్వజన ఆస్పత్రిలో.. నిలిచిన కల్చర్ పరీక్షలు..!
విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బ్లడ్, యూరిన్ కల్చర్ పరీక్షలు కొద్ది రోజులుగా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇటీవల కాలంలో బ్లడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ల బారిన ఎక్కువ మంది పడుతున్నారు. వీరికి ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గదు. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి బ్లడ్ కల్చర్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వారికి యూరిన్ కల్చర్ చేయాలి. కల్చర్ పరీక్షలో ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఏ యాంటి బయాటిక్ మందులు వాడాలో తెలుస్తుంది. ఆ మందులు వాడితే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అంతటి ప్రాధాన్యత గల కల్చర్ పరీక్షల విషయంలో సర్వజన ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 20 రోజులుగా నిలిచిన కల్చర్ పరీక్షలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గత 20 రోజులుగా యూరిన్, బ్లడ్ కల్చర్ పరీక్షలు నిలిచిపోయాయి. బోధనాస్పత్రి కావడంతో అన్ని వసతులు ఉంటాయని జిల్లా నలుమూలలు నుంచి అధిక సంఖ్యలో ఇక్కడకు రోగులు వస్తారు. జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కూడా రోగులు ఇక్కడకు వస్తారు. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉంటాయని రోగులు ఇక్కడకు వస్తారు. ఏదైనా వైద్య పరికరం పని చేయకపోతే వాటిని సకాలంలో బాగు చేయించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రోగులు ప్రైవేటు ల్యాబ్లను ణాశ్రయించాల్సిన పరిస్థితి. ఘోషాస్పత్రి నుంచి కూడా బ్లడ్, యూరిన్ కల్చర్ పరీక్షల కోసం ఇక్కడకు శాంపిల్స్ పంపిస్తారు. ప్రస్తుతం పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత 20 రోజులుగా జరగని వైనం అవస్థలు పడుతున్న రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు బ్లడ్, యూరిన్ కల్చర్ పరీక్షలకు రూ.500 నుంచి రూ.800 వరకు వెచ్చింపు గంట్యాడ మండలానికి చెందిన అప్పలనాయడుకు జ్వరం రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు బ్లడ్ కల్చర్ పరీక్ష రాశారు. అది పట్టుకుని ఆస్పత్రిలోని మైక్రో బయాలజీ ల్యాబ్కు వెళ్లగా కల్చర్ పరీక్ష చేయడం లేదని చెప్పడంతో ప్రైవేటు ల్యాబ్లో రూ.700 పెట్టి చేయించాడు. విజయనగరం పట్టణానికి చెందిన గణేష్కు మూత్ర విసర్జన ఎక్కువ కావడంతో కొద్ది రోజులు క్రితం సర్వజన ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు యూరిన్ కల్చర్ పరీక్ష చేయమని చెప్పారు. మైక్రో బయాలజీ ల్యాబ్లో యూరిన్ పరీక్ష చేయాలని అడగ్గా యూరిన్ కల్చర్ చేయడం లేదని చెప్పడంతో ప్రైవేటు ల్యాబ్లో రూ.600 పెట్టి కల్చర్ పరీక్ష చేయించుకున్నాడు.ప్రైవేటు ల్యాబ్లకు.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కల్చర్ పరీక్షలు నిలిచిపోవడం వల్ల రోగులు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి కల్చర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. యూరిన్ కల్చర్ పరీక్షకు రూ.500 నుంచి రూ.600, బ్లడ్ కల్చర్కు రూ.700 నుంచి రూ.800 వరకు వెచ్చిస్తున్నారు. వాస్తవమే.. సర్వజన ఆస్పత్రిలో యూరిన్, బ్లడ్ కల్చర్ పరీక్షలు నిలిచిన మాట వాస్తవమే. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్య వచ్చింది. త్వరలో సమస్య పరిష్కరించి యూరిన్, బ్లడ్ కల్చర్ పరీక్షలు అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
పిడుగుపాటుకు 31 గొర్రెలు, మేకలు మృతి
వీరఘట్టం: మండలలలోని హుస్సేనుపురం పంచాయతీ పరిధిలోని నీలంపేట సమీపంలో పొలాల్లో శుక్రవారం సాయంత్రం పిడుగు పడడంతో అక్కడ ఉన్న 10 గొర్రెలు, 21 మేకలు మృతి చెందాయి. హుస్సేనుపురం గ్రామానికి చెందిన చిన్ని చిట్టిబాబు, గణపతి, దుర్గారావు పంట పొలంలో మందవేశారు. ఇంతలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇంతలో పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో గొర్రెలు, మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.5 లక్షల నష్టం ఉంటుందని బాధితులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. -
నమ్మించి గొంతు నులిమేశాడు..
చికెన్పాలకొండ/పాలకొండ రూరల్: మండలంలో సంచలనం సృష్టించిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి(32) హత్య కేసు మిస్టరీ వీడింది. ఐదేళ్ల పాటు ప్రేమాయణం నడిపి, శారీరకంగా అనుభవించి పెళ్లి అనగానే ప్రియుడే గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని కారులో ఉంచి సినీ పక్కీలో చక్కెర్లు కొట్టారు. ఈ హత్యకు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఓ స్టాఫ్నర్సు, మరో మిత్రుని సహకారం తీసుకున్న నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ఒక్క రోజులోనే పోలీసులకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పాలకొండ డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం వెల్లడించారు. పాలకొండ మండలం జంపరకోట పంచాయతీ బర్నసీతంపేట గ్రామానికి చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణికి, ఎం.సింగుపురం గ్రామానికి చెందిన రెడ్డి భువనేశ్వరకుమార్ అలియాస్ భువన్కు ఐదేళ్ల క్రిందట పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఉషారాణిని శారీరకంగా అనుభవించాడు. ఇంతలో ఎం.సింగుపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న వీరఘట్టం మండలం బొడ్లపాడు గ్రామానికి చెందిన కృపారాణితో భువన్కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య కూడా శారీరక సంబంధం కొనసాగుతోంది. తనను దూరం పెడుతున్నాడని గ్రహించిన ఉషారాణి తనను పెళ్లి చేసుకోవాలని భువన్పై వత్తిడి చేసింది. ఈ విషయం స్టాఫ్నర్సు కృపారాణితో భువన్ చెప్పడంతో అందుకు ఉషారాణి అడ్డు తొలగించుకునేందుకు హత్య చేయాలని కృపారాణి సలహా ఇచ్చింది. పక్కా ప్లాన్తో హత్య తన ప్రేయసి ఉషారాణిని హత్య చేసేందుకు ప్రియుడు భువన్, స్టాఫ్నర్స్ కృపారాణితో కలిసి పక్కా ప్లాన్ చేశారు. ఉషారాణి స్పృహలో లేకుండా చేసి సులువుగా హత్య చేయవచ్చునని కృపారాణి సలహా ఇచ్చింది. ఇందులో భాగంగా రెండు స్ట్రిప్పుల నిద్రమాత్రలను కృపారాణి భువన్కు ఇచ్చింది. ఈ నిద్ర మాత్రలను డ్రింక్లో కలిపి ఉషారాణిచే తాగించాలని చెప్పింది. ఈ పథకం మేరకు ఈ నెల 5న సాయంత్రం ఉషారాణికి ఫోన్ చేసి 6వ తేదీన ఉదయం రాయిగఢ వెళదామని భువనేశ్వర్ పిలిచాడు. అప్పటికే తన తమ్ముడు వరసైన ఎం.సింగుపురం గ్రామానికి చెందిన సవిరిగాన తేజకు హత్య పధకం విషయాన్ని భువనేశ్వర్ తెలియజేశాడు. ఇందుకు తేజ ఓకే చెప్పి తన అన్నయ్యకు చెందిన ఎర్టిగా కారును తీసుకువచ్చాడు. భువనేశ్వర్ మాటలు నమ్మిన ఉషారాణి ఈ నెల 6న ఉదయం 9 గంటల సమయంలో బర్నసీతంపేట నుంచి బయలుదేరి డోలమడ గ్రామ సమీపానికి చేరుకుంది. అప్పటికే భువనేశ్వర్, తేజ కారుతో సిద్ధంగా ఉన్నారు. ఉషారాణిని కారులో ఎక్కించుకున్న వీరు దారిలో పల్పి ఆరెంజ్ డ్రింక్ కొనుగోలు చేసి ఆ డ్రింక్లో నిద్రమాత్రలు కలిపారు. వీరఘట్టం చేరుకునే సరికి ఉషారాణికి వాంతులు కావడంతో నిద్రమాత్రలు కలిపిని పల్పీ ఆరెంజ్ ఇచ్చారు. కొంచెం డ్రింక్ తాగిన ఉషారాణి సరే పదండి అనడంతో రాయిఘడ చేరుకున్నారు. అప్పటికే రాయిఘడ ఆలయం మూసివేసి ఉంది. దీంతో తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యలో భోజనం చేద్దామని భువనేశ్వర్ అడగగా తనకు ఆకలిగా లేదని ఉషారాణి తెలపడంతో కనీసం ఈ పల్పీ ఆరెంజ్ అయినా తాగు అని చెప్పి నిద్ర మాత్రలు కలిపిన డ్రింక్ మొత్తం ఉషారాణితో తాగించారు. అక్కడి నుండి పాలకొండ మండలం నవగాం సెంటర్కు చేరుకుని ఉషారాణి తెలివిలో ఉందా.. లేదా.. అని పరీక్షించారు. అప్పటికే ఆమె పలుకుతుండడంతో ఈ విషయాన్ని స్టాఫ్నర్సు కృపారాణికి తెలిపారు. తాను బూర్జ సెంటర్ వద్ద ఉన్నానని, మీరు ఉషారాణిని తీసుకుని ఇటువైపు రమ్మని కృపారాణి తెలిపింది. బూర్జ సెంటర్కు వచ్చిన కారులో కృపారాణి ఎక్కింది. అక్కడి నుంచి శ్రీకాకుళం వైపు వీరంతా కారులో ప్రయాణం చేశారు. కొల్లివలస చేరే సరికి ఉషారాణి పూర్తిగా స్పృహ కోల్పోయిందని గుర్తించారు. కొల్లివలస దాటిన తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం వైపు కారు తీసుకువెళ్లారు. అక్కడ భువనేశ్వర్, తేజలు ఉషారాణి ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఉషారాణి చనిపోయిందని కృపారాణి నిర్దారించిన తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లి ఆమదాలవలస సమీపంలో ఉన్న జియో పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న చెరువులో ఉషారాణి మృతదేహాన్ని, ఆమె సెల్ఫోన్ను అక్కడ పడేసారు. ఇంతలో కారు యజమాని తనకు బేరం ఉందని కారు కావాలని ఫోన్ చేసి అడగడంతో శ్రీకాకుళంలో కారును అప్పగించేశారు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు. మృతదేహం అక్కడుంటే దొరికిపోతామని నర్సు కృపారాణి చెప్పింది. దీంతో భువనేశ్వర్, తేజ గ్రామంలో తెలిసిన వారి వద్ద కారు తీసుకుని అదే రోజు రాత్రి 1 గంట సమయంలో మృతదేహం వద్దకు వెళ్లారు. మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని పాలకొండ వైపు తీసుకువచ్చారు. దారిలోనే ఓ పెద్ద రాయిని సేకరించి కారులో పెట్టుకున్నారు. తొలుత పాలకొండలోని వెంకటరాయుని కోనేరులో పడేద్దామని అనుకున్నారు. అక్కడ జనసంచారం ఉండడంతో తుమరాడ సమీపంలో ఉన్న కామినాయుడు చెరువు వద్దకు వచ్చి మృతదేహం కాళ్లు చేతులు వెనక్కికట్టి, నడుముకు రాయికట్టి చెరువులో ఉషారాణి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. పక్కా ప్లాన్తో ఉషారాణిని భువనేశ్వర్, కృపారాణి, తేజ హత్య చేశారు. ఒక్కరోజులోనే నిందితులు అరెస్టు ఉషారాణి కనిపించడం లేదని ఈ నెల 10న తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇంతలో తుమరాడ సమీపంలోని చెరువులో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో ఆ మృతదేహం ఉషారాణిదేనని అందరూ గుర్తించారు. దీంతో డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో సీఐ ప్రసాదరావు, ఎస్ఐ డోల వెంకన్న ఉషారాణి కాల్డేటా ఆధారంగా వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులను గుర్తించిన పోలీసులు శుక్రవారం సాయంత్రం కారులో వెళ్తున్న ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన హత్యానేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ మాధవరెడ్డి వివరించారు. ఈ ముగ్గురుపై హత్యా నేరం నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేనును త్వరితగతిలో ఛేధించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పక్కా ప్లాన్తో ప్రియురాలి హత్య తన స్నేహితుడు, మహిళా నర్సు సాయంతో యువతి హత్య 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ మాధవరెడ్డి -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
● శరత్ బాబు కుటుంబానికి ఫోన్లో పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొమరాడ: అధైర్య పడొద్దు.. కుటుంబ సభ్యుల వలే మేమంతా అండగా ఉంటామని, పార్టీ తరఫున సహకారం అందిస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామానికి చెందిన నంగిరెడ్డి శరత్బాబు గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన ఇంటికి మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, శత్రుచర్ల పరీక్షిత్రాజు దంపతులను పంపించి ఫోన్లో శరత్బాబు భార్య స్వర్ణ ప్రియ, తల్లి పార్వతమ్మ, తమ్ముడు శ్రావణ్కుమార్తో జగన్మోహన్రెడ్డి ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న వయస్సులోనే మృతిచెందడం బాధాకరమన్నారు. మీకు తోడుగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు కళింగ మల్లేశ్వరరావు, మాజీ సర్పంచ్ కెంగువ పోలినాయుడు, ఏగిరెడ్డి సింహాచలం, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. సీ్త్ర‘నిధి’ స్వాహాపై విచారణ కొత్తవలస: మండలంలోని పాతసుంకరపాలెం పొదుపు సంఘాల మహిళల నుంచి ‘సీ్త్రనిధి’ రుణాల వాయిదా చెల్లింపుల్లో అదనపు వసూళ్లపై సీ్త్ర‘నిధి’ స్వాహా శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 9న ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. సీ్త్ర నిధి డీజీఎం కృష్ణంనాయుడు, ఏజీఎం సత్యనారాయణ గ్రామంలో శుక్రవారం విచారణ చేపట్టారు. పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలు, తిరిగి చెల్లింపులపై ఆరా తీశారు. రుణం తీసుకున్న ప్రతి సారీ ఒకటిన్నర నెల అదనంగా వాయిదాలు వసూలు చేసి రూ.లక్షల్లో నిధులు కై ంకర్యం చేసినట్టు మహిళలు తెలిపారు. అనంతరం సీ్త్ర నిధి నుంచి రుణం పొందే తీరు, తిరిగి చెల్లించే పద్ధతులపై డీజీఎం కృష్ణంనాయుడు మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం ఎ.వెంకటరమణ, సీసీలు అప్పలనాయుడు, అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు. చదువుతోనే భవిత విజయనగరం క్రైమ్: బాలలను పనికి పంపించరాదని, చదివిస్తే ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తల్లిదండ్రులకు సూచించారు. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, ఏపీ ప్రో చైల్డ్ గ్రూప్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆట, పాటలు పిల్లలకు... పని, పాటలు పెద్దలకు’ అనే వాల్ పోస్టర్ను తన చాంబర్లో శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల వయస్సులోపు పిల్లలతో పనిచేయించడం నేరమన్నారు. అనంతరం పలువురు పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు పి.చిట్టిబాబు పాల్గొన్నారు. -
బాల కార్మిక వ్యవస్థ అంతం అందరి బాధ్యత
● రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజువిజయనగరం ఫోర్ట్: బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడం అందరి బాధ్యత అని ప్రభుత్వంతో పాటు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వి.సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువుకునే వయసులో చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తూ కనపడితే చైల్డ్హెల్ప్ లైన్ 1098కు ఫోన్ చేయాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చిన్న వయసులోనే పిల్లలను ఇటుక బట్టీల్లో, హోటల్స్, ఫ్యాక్టరీల్లో పెట్టడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుందన్నారు. తల్లిదండ్రులు పేదరికం, నిస్సహాయత, సరైన అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణమన్నారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి కె.వి.బాలామణి, కార్మిక శాఖ ఉప కమిషనర్ ప్రసాదరావు, జెడ్పీ సీఈఓ నాగమణి, డీఈఓ మాణిక్యంనాయుడు, సీడబ్ల్యూసీ చైర్మన్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
నెల్లిమర్లలో నినాదాల జోరు
చంద్రబాబు పాలనపై నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ సురేష్బాబు, నియోజకవర్గ పరిశీలకులు నాయుడు బాబు, పార్టీ శ్రేణులుప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ఈఎస్ఐ ఆస్పత్రి నుంచి మొయిద కూడలి మీదుగా స్టేట్బ్యాంక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నయవంచక పాలనను ఎమ్మెల్సీ సురేష్బాబు జనానికి వివరించారు. కార్యక్రమంలో డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల పట్టణం, నెల్లిమర్ల మండలానికి చెందిన పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకుడు నెక్కల నాయుడుబాబు, యువజన విభాగం నాయకులు బడ్డుకొండ మణిదీప్నాయుడు, బడ్డుకొండ ప్రదీప్నాయుడు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం
● ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా శాఖ హెచ్చరిక ● రెండో రోజు కొనసాగిన గేట్ మీటింగ్ విజయనగరం అర్బన్: ఆర్టీసీ జోన్ పరిధిలో ఉన్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కమిటీ హెచ్చరించారు. జోనల్ కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని డిపోల కార్యాలయాల ఎదుట రెండో రోజు శుక్రవారం కూడా కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. స్థానిక విజయనగరం డిపో ఎదుట నిర్వహించిన గేట్ మీటింగ్లో పలువురు మాట్లాడారు. గత ఆరు నెలలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి పలుమార్లు మెమోరాండం ఇచ్చినప్పటికీ సరైన స్పందన లేకపోవడం వల్లే తాము ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందన్నారు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సర్క్యులర్లను సైతం ఈ జోన్లో అమలు చేయకపోవడం విచారకరమన్నారు. సీ్త్ర శక్తి పథకంతో విపరీతమైన ఒత్తిడి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సీ్త్ర శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు. 50 మంది ఎక్కవలసిన బస్సులో 150 మంది వరకు ఎక్కుతున్నారని దీనికి తోడు టికెట్లు జారీ చేసే టిమ్లు సరిగా పని చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మొత్తం 26 డిమాండ్లతో కూడిన నోటీసులు యాజమాన్యానికి అందించామని తెలిపారు. డిమాండ్లలో షెడ్యూళ్లను ‘మోటార్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్’ చట్టం ప్రకారం రూపొందించాలి. డిపోల మేనేజర్లు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను, ఇతర యూనియన్లకు అనుకూలంగా వ్యవహరించే విధానాలను విడనాడాలన్నారు. జిల్లా కార్యదర్శి పీజీరాఫెల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జోనల్ సహాయ కార్యదర్శి డీఎస్రావు, జోనల్ కమిటీ సభ్యులు బి.రామారావు, జిల్లా కమిటీ సభ్యులు ఎల్డీ ప్రసాద్, డిపో ముఖ్య కార్యదకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
● అంతా ‘బూట’కమే...
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు శుక్రవారం ప్రారంభమైనా విద్యార్థులకు కిట్లు మాత్రం అందలేదు. కొందరు విద్యార్థులు కాళ్లకు షూస్లేకుండా, చిరిగిన బ్యాగులు, దుస్తులతోనే తొలిరోజు పాఠశాలలకు హాజరయ్యారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే ‘జగనన్న విద్యా కానుక’ కింద యూనిఫారాలు, షూస్, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ తదితర సామగ్రిని విద్యార్థులకు అందజేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 1,11,700 మంది విద్యార్థులకు ‘స్టూడెంట్ కిట్’లు అందజేయాల్సి ఉంది. ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. – విజయనగరం అర్బన్ -
సిబ్బంది సమస్యలు సత్వరమే పరిష్కారం : ఎస్పీ
పార్వతీపురం రూరల్: పోలీసు సిబ్బంది సంక్షేమానికి, వారి శాఖాపరమైన, ఆరోగ్య సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పోలీస్ వెల్ఫేర్(గ్రీవెన్స్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బంది తమ సమస్యలను ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. సిబ్బందితో విడివిడిగా సమావేశమైన ఎస్పీ వారి అర్జీల పూర్వాపరాలను పరిశీలించి సానుకూల చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కాగా, సిబ్బంది నుంచి ప్రధానంగా బదిలీలు, అనారోగ్య సమస్యలకు సబంధించిన విజ్ఞాపనలే ఎక్కువగా వచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో సీసీ సంతోష్కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తెర్లాం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడిన సంఘటన ఇది. దీనికి సంబంధించి ఎస్ఐ సాగర్బాబు శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఆమిటి గ్రామానికి చెందిన కరణం రామకృష్ణ, బి.గౌరవ్ అనే ఇద్దరు యువకులు గురువారం రాత్రి మండలంలోని గొలుగువలస–సతివాడ గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గురువారం ఉదయం ఆమిటికి చెందిన రామకృష్ణ, గౌరవ్లు మోటార్ సైకిల్పై వంగర మండలం కురుంపురం గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. అక్కడ నుంచి గురువారం రాత్రి సొంత గ్రామమైన ఆమిటి మోటార్ సైకిల్పై వస్తుండగా తెర్లాం మండలం గొలుగువలస–సతివాడ గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి పొలాల్లోకి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో వాహనం వచ్చి చికిత్స నిమిత్తం రాజాంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరికి చికిత్స చేసి గౌరవ్కు తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. రామకృష్ణ ప్రస్తుతం రాజాం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే ఎస్ఐ సాగర్బాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన యువకుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. మద్దాల వంశీపై పీడీ యాక్ట్ విజయనగరం క్రైమ్ : గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణా నిరోధక చట్టం క్రింద నిందితుడు మద్దాల వంశీ(24 )కి ఏడాది పాటు బెయిల్ లేకుండా జైలు శిక్ష విధించడం జరిగిందని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మరోసారి హెచ్చరించారు. 2 గంజాయి కేసుల్లో సుమారు 540 కిలోల గంజాయి తరలిస్తూ నిందితుడిగా అరెస్టు అయి ప్రస్తుతం సంవత్సర కాలం నిర్భంధించేందుకు సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. నిందితుడు మద్దాల వంశీపై ఇప్పటికే జిల్లాలో సస్పెక్ట్ షీట్ ఉందన్నారు. విజయనగరం జిల్లా, ఎస్.కోట మండలం, తెన్ను బోడ్డవర గ్రామానికి చెందిన మద్దాల వంశీపై పి.డి.యాక్ట్ (గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణా నిరోధక చట్టం) చట్టాన్ని ప్రయోగించామని ఎస్పీ తెలిపారు. వంశీ చెడు వ్యసనాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, వ్యవస్థీకృత నేరస్తుడు శెట్టి ఉమా మహేశ్వరరావుతో కలిసి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడేవాడన్నారు. వంశీ కూడా వ్యవస్థీకృత నేరగాడిగా మారాడని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. వంశీ ప్రవర్తన సమాజానికి హానికరంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తిగా మారాడని భావించి పి.డి.యాక్ట్ ప్రయోగించి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
గజపతినగరం భారీ ర్యాలీ
గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ కూటమి మోసపూరిత పాలనపై గజపతినగరం నియోజకవర్గ ప్రజలు నిరసన తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి నాలుగు రోడ్ల కూడలిలోని వినాయకుని గుడి వరకు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను అధిగమిస్తూ ముందుకు సాగారు. ఇచ్చిన హామీలు అమలుచేయాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు సిరిపురపు జగన్మోహనరావు, ఎస్సీ, ఎస్టీసెల్ చైర్మన్ పీరుబండి జైహింద్కుమార్, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మంత్రి అప్పలనాయుడు, నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
చీపురుపల్లిలో టీడీపీ రాజ్యాంగం అమలు
● ఆ సీటులో మీరు కూర్చోవద్దు.. ● తహసీల్దార్కు టీడీపీ నేతల హుకుం ● డీటీ కుర్చీలో కూర్చుంటున్న తహసీల్దార్ ● కలెక్టర్ ఉత్తర్వులు బేఖాతరు ● పోస్టింగ్ ఆర్డర్ పడి వారం గడుస్తున్నా.. ఇదే పరిస్థితి ● ఎమ్మెల్యే కళా నియోజకవర్గంలో తహసీల్దార్ దుస్థితి ● నిలిచిపోయిన రెవెన్యూ సేవలు చీపురుపల్లి: ‘తహసీల్దార్ కుర్చీలో మీరు కూర్చోవద్దు.. మీకు ఎవరు పోస్టింగ్ ఇచ్చారు... మేము వేరొకరికి పోస్టింగ్ ఇస్తాం.. మీరు అంతవరకు తహసీల్దార్ కుర్చీలో కూర్చోవద్దు... అంతే కాదు.. ఎక్కడికై నా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండండి..’ ఇదీ ఎమ్మెల్యే కళా వెంకటరావు సొంత నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లిలో టీడీపీ నాయకుల మార్క్ పాలన. ఇక్కడ కొత్తగా పదోన్నతి పొంది తహసీల్దార్ పోస్టింగ్ ఆర్డర్తో వచ్చిన సూర్యకాంతంకు టీడీపీ నేతలు పై విధంగా హుకుం జారీ చేశారు. ఇదేంటి ఇలా జరిగిందని తహసీల్దార్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే మా వాళ్లు ఏం చెబితే అదే.. అనడంతో ఆమెకు అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో చేసేదేమీ లేక తహసీల్దార్గా స్వయాన కలెక్టర్ ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్ ఉన్నప్పటికీ డిప్యూటీ తహసీల్దార్ కుర్చీలోనే కూర్చుంటూ ఎలాంటి సంతకాలు చేయకుండా ఎక్కడ పోస్టింగ్ వేస్తారో తెలియక లోలోపల మదన పడుతూ వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. వారం క్రితమే పోస్టింగ్ జిల్లా వ్యాప్తంగా 11 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ ఈ నెల 4న కలెక్టర్ రాంసుందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగానే చీపురుపల్లి డిప్యూటీ తహసీల్దార్కి తహసీల్దార్గా పదోన్నతి లభించింది. దీంతో అప్పటికే తహసీల్దార్గా ఉన్న ధర్మరాజు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి లభించడంతో క్లియర్ వెకెన్సీగా ఉన్న చీపురుపల్లి తహసీల్దార్గా ఆమెను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. కలెక్టర్ ఆర్డర్ బేఖాతరు సాక్షాత్తూ కలెక్టర్ ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్కు గౌరవం లేదని రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినా ఎమ్మెల్యే చెబితే తప్ప అధికారులు కుర్చీలో కూర్చునే పరిస్థితి జిల్లాలో లేకుండా పోయిందని వాదన వినిపిస్తోంది. తహసీల్దార్ స్థాయి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పోస్టు పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ ఉద్యోగుల సంగతి ఏంటనే ప్రశ్న రెవెన్యూ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. తప్పని అవస్థలు ఇదిలా ఉంటే తహసీల్దార్గా పోస్టింగ్ ఆర్డర్తో వచ్చినప్పటికీ టీడీపీ నాయకులు ఆ కుర్చీలో కూర్చోవద్దని చెప్పడంతో జిల్లా అధికారులు సదరు తహసీల్దార్కు డిజిటల్ సిగ్నేచర్ అనుమతి కూడా ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల కుల, ఆదాయ ధ్రువీకరణలు నుంచి ఇతర రెవెన్యూ పనులు అన్ని నిలిచిపోయినట్టు తెలుస్తోంది. వారం రోజులుగా డీటీ కుర్చీలోనే.. తహసీల్దార్గా పదోన్నతి లభించడం, వెంటనే పని చేస్తున్న చోటే పోస్టింగ్ రావడంతో తహసీల్దార్ సూర్యకాంతం అదే రోజు సాయంత్రం వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. వెంటనే అధికార టీడీపీ నేతలను కలిసేందుకు వెళ్లారు. పాపం పూలబోకెలు, జీడిపప్పు ప్యాకెట్లు తీసుకు వెళ్లినప్పటికీ అక్కడి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. మీరు ఎందుకు వచ్చారు.. మాకు అవసరం లేదు. కుర్చీలో కూర్చోవద్దు అంటూ టీడీపీలో మూడు మండలాల్లో పదవులు అలంకరించిన ఓ నాయకుడు ఆమెకు తేగెసి చెప్పేశాడు. పదోన్నతి పొంది సంతోషంలో ఉన్న ఆమెకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడంతో ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు, ఎమ్మెల్యే కార్యాలయానికి చెప్పుకున్నప్పటికీ ఎలాంటి సపోర్టు లేకపోవడంతో వారం రోజులుగా డీటీ కుర్చీలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఎంపీ ల్యాడ్స్ పనుల్లో తీవ్ర జాప్యం
● కలెక్టర్ సమీక్షలో తేలిన వైనం ● విశాఖ ఎంపీ నిధుల పనుల్లో పురోగతి సున్నా.. విజయనగరం అర్బన్: జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో మంజూరైన వివిధ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం కారణంగా అనేక పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ ల్యాడ్స్ పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఈ నిశ్చల స్థితి స్పష్టంగా బయటపడింది. ప్రకటనలకే పరిమితం.. 18వ లోక్సభకు సంబంధించి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ నిధులతో జిల్లాలో మొత్తం 67 అభివృద్ధి పనులు మంజూరు కాగా, వాటిలో ఏకంగా 27 పనులు ఇప్పటి వరకు అసలు ప్రారంభానికే నోచుకోకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. మంజూరైన పనులను త్వరితగతిన ప్రారంభించడంలో సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్క పనీ మొదలవ్వలేదు మరోవైపు విశాఖపట్టణం లోక్సభ ఎంపీ నిధుల నుంచి జిల్లాకు నాలుగు పనులు మంజూరు కాగా వాటిలో ఒక్కటంటే ఒక్క పని కూడా కనీసం ప్రారంభం కాలేదు. ఈ పనుల పురోగతి ‘సున్నా’గా ఉండటంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు లోపల ఎలాగైనా ఈ నాలుగు పనులను కచ్చితంగా ప్రారంభించి తీరాలని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. రాజ్యసభ సభ్యుల నిధుల నుంచి మంజూరైన ఎనిమిది పనుల్లో కేవలం మూడు మాత్రమే పూర్తి కాగా మిగిలినవి పెండింగ్లోనే మూలపడ్డాయి. ఆన్లైన్ అప్డేట్స్లోనూ నిర్లక్ష్యమే పనులు సకాలంలోనే పూర్తి చేయకపోవడమే కాకుండా పూర్తయిన వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలోనూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు సమీక్షలో తేలింది. దీనికి కలెక్టర్ స్పందిస్తూ పూర్తయిన పనులను వెంటనే ఆన్లైన్లో అప్డేట్ చేయాలని, ఒక వేళ సాంకేతిక లేదా ఇతర సమస్యల వల్ల పనులు ప్రారంభించడం సాధ్యం కాకపోతే వాటికి తగిన రిమార్కులు రాసి ఆయా పార్లమెంట్ సభ్యులకు నివేదికలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, ఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ‘కిట్’కట..!
విజయనగరం అర్బన్: విద్యకు సంబంధించి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ ఆర్భాటాలకూ, క్షేత్ర స్థాయి వాస్తవాలకూ పొంతన లేకుండా పోయింది. శుక్రవారం నుంచి జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. మొదటి రోజే విద్యార్థుల చేతుల్లో ‘స్టూడెంట్ కిట్లు’ పెడతామంటూ అమాత్యులు, అధికారులు చేసిన ప్రగల్భాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. విద్యా సామగ్రి సరఫరాలో తీవ్ర గందరగోళం నెలకొంది. కీలకమైన యూనిఫాంలు, బ్యాగులు, బెల్టులు, బూట్లు, నోట్బుక్స్ పాఠశాలలకు చేరనేలేదని నివేదికలు చెబుతున్నాయి. వేలాది మంది పేద విద్యార్థులు మొదటి రోజే పాత బట్టలతో, ఒట్టి చేతులతో బడికి వెళ్లాల్సిన దయనీయ స్థితిని కూటమి ప్రభుత్వం కల్పించిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్టుల కొరత జిల్లాలో విద్యార్థులకు 72,302 బెల్టులు అవసరం కాగా.. వచ్చింది కేవలం 33,988 మాత్రమే. దాదాపు 38 వేల మందికి పైగా విద్యార్థులకు బెల్టులు లేవు. బూట్ల బేజారు జిల్లాలో 1,11,199 జతల బూట్లకుగాను కేవలం 36,910 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 74 వేల మందికి పైగా విద్యార్థుల కాళ్లకు రక్షణేది? పుస్తకాలకూ కటకట విద్యార్థులకు అత్యంత కీలకమైన నోట్బుక్స్ సరఫరాలోనూ భారీ లోటు కనిపిస్తోంది. జిల్లాకు 7,16,762 నోట్బుక్స్ అవసరం కాగా ఇప్పటి వరకు 4,54,935 మాత్రమే వచ్చాయి. ఇంకా 2.61 లక్షల నోట్బుక్స్ ఎప్పుడొస్తాయో? ఎవరికిస్తారో అధికారులకే తెలియాలి. డిక్షనరీలు ఇచ్చామని చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అని ఉపాధ్యాయ సంఘాలు నిలదీస్తున్నాయి. 19 మండలాల్లో యూనిఫాం ‘సున్నా’! జిల్లాలోని బాడంగి, బొండపల్లి, చీపురుపల్లి, దత్తిరాజేరు, డెంకాడ, గజపతినగరం, గంట్యాడ, కొత్తవలస, మెంటాడ, రామభద్రపురం, రాజాం తదితర 19 మండలాల్లో యూనిఫాంల సరఫరా అసలు ప్రారంభమే కాలేదు. పాఠశాలల రీ–ఓపెనింగ్ తేదీ ముందుగా నిర్ణయించినా ఇంతవరకు సరఫరా సంస్థలను ఎందుకు గద్దించలేదు? కొట్లాది రూపాయల టెండర్లలో జరిగిన లోపాయికారీ ఒప్పందాల వల్లే విద్యార్థులకు ఈ దుస్థితి దాపురించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేడు మోగనున్న బడి గంట కిట్ల జాడ లేదు.. బ్యాగులు నిల్.. బూట్లు, యూనిఫాం సగమే.. నోట్ పుస్తకాలూ అరకొరగానే.. విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటం తల్లిదండ్రుల ఆగ్రహం తల్లిదండ్రుల ఆందోళన.. అధికారుల దాటవేత పాఠశాలలు తెరచుకుంటున్నాయి... కానీ మా పిల్లల కిట్లు మాత్రం ఇంకా మండలాలకు కూడా చేరలేదు. ఈ ఏడాది అసలు స్టూడెంట్ కిట్లు ఇస్తారా? లేక పాత వాటితోనే సరిపెట్టుకోవాలా..? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలు నిర్లక్ష్యం వహించాయని ఉపాధ్యాయు, విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి. అధికారులు మాత్రం త్వరలోనే అన్ని వస్తాయి.. అంటూ సగటు సమాధానాలతో దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.ఒక్క బ్యాగూ రాలేదు.. జిల్లాలో మొత్తం 1,11,199 మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. పంపిణీ తీరు దారుణంగా ఉంది. జిల్లాలోని 27 మండలాల్లో ఒక్కటంటే ఒక్క మండలానికి కూడా ఇప్పటివరకు బ్యాగులు సరఫరా కాలేదు. లక్షకు పైగా విద్యార్థులు తమ పుస్తకాలను ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. యూనిఫాంల పరిస్థితి మరింత ఘోరం. అవసరమైన కిట్లలో కేవలం 46,759 యూనిఫాంలు మాత్రమే మండలాలకు చేరాయి. అంటే ఇంకా 64,440 మంది విద్యార్థులకు యూనిఫాంలు అందే పరిస్థితి లేదు. బడి తెరిచే నాటికి కనీసం సగం మందికి కూడా బట్టలు కుట్టించలేకపోయారంటే ప్రభుత్వ పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్న పాలకుల మాటలు నీటి మూటలుగా మిగిలాయనే విమర్శలు వస్తున్నాయి. -
హక్కుల సాధనకు ఉద్యమానికి సిద్ధం కావాలి
● ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కమిటీ పిలుపు విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, న్యాయమైన హక్కుల సాధన కోసం జిల్లాలో ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేయనున్నట్టు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కమిటీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక రెవెన్యూ సంఘం సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగుల ఐక్యతను చాటుతూ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు ఉంచిన ముఖ్యమైన డిమాండ్లను వివరించారు. వెంటనే పీఆర్సీ కమిషనర్ను నియమించాలని, తక్షణమే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డీఏ, పీఆర్సీ, ఎస్ఎల్ బకాయిలతో పాటు, నిలిచిపోయిన డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న రెండేళ్ల చైల్డ్కేర్ లీవ్ను, రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా తక్షణమే వర్తింపజేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల ఆర్థ్ధిక బకాయిల వివరాలను వారి పే–స్లిప్లోనే స్పష్టంగా చూపించాలని, పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులందరికీ వారానికి 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు సరెండర్ లీవులు నగదును ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డిమాండ్ల బ్రోచర్లను ప్రదర్శించారు. సమావేశంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.భానుమూర్తి, చైర్పర్సన్ పి.ఆదిలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఎస్.రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ బంగార్రాజు, అసోసియేట్ చైర్మన్ బి.సాయికుమార్, వర్క్చార్జ్డ్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు పి.చంద్రశేఖర్రాజు, క్లాస్ ఫోర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాల మహేష్, డి.అరుణ పాల్గొన్నారు. -
● వెన్నుపోటు పాలనకు రెండేళ్లు
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో వెన్నుపోటు పాలనకు రెండేళ్లు సందర్భంగా లక్కవరపుకోట మండలంలోని గోల్డ్స్టార్ జంక్షన్లోని వెంకటసాయి కల్యాణ మండపంలో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణ అధ్యక్షతన గురువారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రెండేళ్ల చంద్రబాబు పాలనను నిరసిస్తూ నల్ల కండువాలు వేసుకొని నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. – శృంగవరపుకోట -
అన్నీ ఉంటేనే తల్లికి వందనం..!
● నిబంధనలు వర్తిస్తాయి ● గత ఏడాది అర్హత ఉన్నా పలువురికి లబ్ధి సున్నాసాంకేతిక సమస్య పేరిటమాది మధ్య తరగతి కుటుంబం. నేను రోజువారీ పనులు చేసి కుటుంబాన్ని పోషించడంతో పాటు నా బిడ్డ తనుశ్రీని చదివిస్తున్నాను. అర్హత ఉన్నా గత ఏడాది పథకం వర్తించలేదు. నా బిడ్డకు తల్లి పేరు మారడంతో వారి ఆస్తులు మా అకౌంట్కు లింక్ అయ్యాయి. ఇది సాంకేతిక సమస్య. అప్పట్లో అన్నీ సరిచేయించాను. సచివాలయంలో నగదు జమ చేయనున్న అర్హుల జాబితాలో మా పేర్లు వచ్చాయి. అయినా నగదు జమకాలేదు. దీంతో ఈ ఏడాది పరిస్థితిని ముందుగానే సరిచేసుకునేందుకు క్రమం తప్పకుండా ఉపాధ్యాయులను సంప్రదిస్తున్నాను. బి.లక్ష్ముంనాయుడు, విద్యార్థిని తండ్రి, పాలకొండ మండలంపాలకొండ రూరల్: అన్నీ ఉన్నా అర్హుల నోట్లో శని అన్నట్లుంది సర్కారు తీరు. అన్నివర్గాల పిల్లల తల్లిదడ్రులు వారి బిడ్డల చదువులకు ఆర్థిక భారం అడ్డుకాకూడదని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘అమ్మ ఒడి’ పేరిట బృహత్తర పథకాన్ని రూపొందించారు. నాడు వలంటీర్ల వ్యవస్థ ఇంటింటి సర్వే చేపట్టి చదువుతున్న పిల్లను గుర్తించి, వారికి సంబంధించిన వివరాలను సచివాలయాల ద్వారా నమోదు చేయించారు. అప్పట్లో అర్హత ఉన్న ఏఒక్క తల్లి ఈ పథకాన్ని కోల్పోకుండా జగన్ ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు చేపట్టింది. ఆపై అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఈ పథకం పేరు మార్చింది. ఇంట్లో ఎంత బిడ్డలు చదువుకుంటే అంతమందికి రూ.15వేలు అందిస్తామంది. అధికారం చేపట్టిన ఏడాది పథకం ఎగ్గొట్టిన బాబు ప్రభుత్వం గత ఏడాది అర్హత ఉన్నా వందల సంఖ్యలో తల్లులకు నగదు జమచేయలేదు. యంత్రాంగం చేసిన తప్పులకు తల్లితండ్రులనే బాధ్యులుగా చేసి లబ్ధికి దూరం చేశారు. ఈ ఏడాది మళ్లీ పథక వర్తింపునకు నిబంధనలు వర్తిస్తాయని..ప్రభుత్వం చూపిస్తున్న అన్ని రూల్స్ అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోంది. దీంతో అర్హత ఉండి లబ్ధి కోల్పోయిన అర్హులు ఈ ఏడాదైనా తమకు న్యాయం జరుగుతుందా? లేదా? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఉండాల్సిందే.. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే తల్లికి వందనం పథకం వర్తింపచేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో అర్హుల జాబితా ప్రదర్శించిన వెంటనే అర్హులు సచివాలయ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. మై ఆధార్ సెక్షన్లోకి వెళ్లి ఆధార్ సర్వీసెస్లో చెక్ ఆధార్ బ్యాంక్ లింకేజీ స్టేషన్ ఎంపిక చేయాలి. ముఖ్యంగా తల్లి, లేదా విద్యార్థి ఆధార్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఆపై సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆధార్కు లింక్ అయిన సెల్ఫోన్కు మెసేజ్ వస్తుంది. తద్వారా మీ ఆధార్ ఏ బ్యాంక్ ఖాతాకు అనుసంధానమై ఉందో తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో అర్హులు తమ బ్యాంక్ ఖాతా ఏశాఖ పరిధిలో ఉందో తెలుసుకుని ఖాతా ప్రస్తుతం మనుగడలో ఉందో లేదో సరిచూసుకోవాలి. సమస్యలు గుర్తిస్తే అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో బ్యాంక్కు వెళ్లి అప్డేట్ చేయించాలి. ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, సెల్ నంబర్ అనుసంధానం ఒకేలా ఉండేలా సరి చేయించాలి. లేకుంటే గత అనుభవాలను మళ్లీ చవిచూడాల్సి ఉంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు మీ ఖాతా వివరాలు అనుసంధానమైన వెంటనే మీ సెల్ఫోన్కు లబ్ధికి సంబంధించిన సమాచారం వస్తుందని గుర్తించాలి.నాడు అర్హతే ప్రామాణికంగా.. నాడు జగనన్న హయాంలో తల్లులకు ఎటువంటి జంఝాటం లేకుండా అర్హతే ప్రామాణికంగా తల్లుల ఖాతాలకు చెప్పిన సమయానికి నగదు జమ అయ్యేందని లబ్ధి పొందిన వారు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో వలంటీర్ల వ్యవస్థ, సచివాలయ అధికారులు సమన్వయంతో విద్యాశాఖ పర్యవేక్షణలో తల్లులకు నగదు అందింది. నేడు ఈ పరిస్థితి లేదు. ముఖ్యంగా గ్రామాల్లో అవగాహన లేక అర్హత ఉన్నా సమస్యలు తప్పడం లేదు. దీనిని అదిగమించే ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది అవస్థలు పడుతున్నారు. దీంతో గత అనుభవాలను గుర్తు చే సుకుంటున్నారు. నాడు అర్హత ఉన్నా లబ్ధి కోల్పోయిన తల్లులకు నేటికీ తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదైనా అర్హుల జాబితాల్లో తామ పిల్లలు ఉండాలని అన్నీతామై ఏ యాప్లో ఏం చెక్ చేయమన్నా తక్షణమే స్పందిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని, పాఠశాలల యాజమాన్యాలను, ఉపాధ్యాయులను సంప్రదించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే విషయమై విద్యాశాఖ అధికారులు ఏమంటున్నారంటే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. గత అనుభవాలను దష్టిలో పెట్టుకుని ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లిడండ్రులకు ముందస్తు సమాచారం అందిస్తున్నామంటున్నారు. జిల్లాలో పరిస్థితి.. పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 1,507 పాఠశాలల్లో ఈ ఏడాది లక్షా 30వేల మంది బోధన పొందుతున్నారు. ఇదే క్రమంలో జూనియర్ కళాశాలలు 30 ఉండగా వాటిలో 19వేల మంది అభ్యసిస్తున్నారు. మొత్తంగా జిల్లా పరిధిలో లక్షా 49వేల మంది ఒకటి నుంచి ఇంటర్ మధ్య చదువుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది జిల్లా పరిధిలో లక్షా 22వేల మందికి పథకం వర్తింపజేశామని, 8వేలకు పైచిలుకు మందికి వివిధ కారణాలతో లబ్ధి చేకూరలేదని అధికారులు చెబుతున్నారు. -
ఇరాన్లో చిక్కుకున్న చింతపల్లి యువకుడు
పూసపాటిరేగ: మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఇరాన్ సమీపంలోని బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలో తాను పనిచేస్తున్న ఎంవీ పాస్కల్ అనే నౌక మరమ్మతులకు గురవడంతో చిక్కకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. గ్రామానికి చెందిన కొమర సోమరాజు 12 నెలల క్రితం ఇరాన్కు ఏజెంట్ ద్వారా పని నిమిత్తం వెళ్లాడు. అక్కడ నౌకలో పనిచేస్తుండగా యుద్ధం నేపథ్యంలో బిక్కుబిక్కు మంటూ గడిపాడు. తాజాగా తాను ట్రైనీ వైపర్గా పనిచేస్తున్న ఎంవీ పాస్క్ల్ అనే నౌక మరమ్మతులకు గురవడంతో సముద్రంలోనే నౌకలో గడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ఎంవీ పాస్కల్ నౌక మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పినట్లు చింతపల్లికి చెందిన మత్స్యకార నాయకుడు బర్రి చినఅప్పన్న తెలియజేశారు. సోమరాజుకు తల్లి కొమర అప్పమ్మ, తండ్రి కొమర అప్పన్న ఉన్నారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత ఇరాన్లో చిక్కకున్న చింతపల్లి గ్రామానికి చెందిన కొమర సోమరాజును స్వదేశానికి తెప్పించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవికి సోమరాజు కుటుంబసభ్యులు వినతిపత్రం అందజేశారు. సురక్షితంగా స్వదేశానికి వచ్చే విధంగా తమ వంతు సహకారం అందిస్తామని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
మూడు గడ్డివాములు దగ్ధం
తెర్లాం: మండలంలోని గొలుగువలస గ్రామంలో మంగళవారం రాత్రి మూడు గడ్డివాములు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయని వీఆర్ఓ ఎల్.గణపతి బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన పల్ల శ్రీరాములు, సాకేటి సూర్యనారాయణ, సాకేటి జనార్దన అనే ముగ్గురు రైతులకు సంబంధించిన గడ్డివాములు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా? మరేవిధంగా జరిగిందా? అనేది తెలియడంలేదని బాధిత రైతులు అంటున్నారు. ఏడాది పొడవునా పశువులకు గ్రాసంగా ఉపయోగించేందుకు సిద్ధం చేసుకున్న గడ్డివాములు కాలిపోవడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిడుగుపాటుతో పాడి ఆవు మృతినెల్లిమర్ల రూరల్: మండలంలోని గొర్లిపేట గ్రామంలో పిడుగుపాటుకు ఓ పాడి ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన గొర్లి ఎల్లంనాయుడు తన పాడి ఆవును కళ్లంలోని చెట్టు కింద కట్టి ఉంచగా బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో చెట్టు కింద ఉన్న ఆవు ఒక్కసారిగా కుప్పకూలి మృత్యువాత పడగా రైతు కు టుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గరివిడి మండలంలో మరో ఆవు.. చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని నీలాద్రిపురం గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో గ్రామంలోని నాకమ్మ చెరువు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభంపై పిడుగు పడడంతో విద్యుత్ వైర్లు తెగి పక్కనే మేత మేస్తున్న ఆవుపై పడ్డాయి. ఈ ఘటనలో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన ఆవు ఆరు నెలలు చూడితో ఉందని, ఆవు విలువ రూ.80వేల వరకు ఉంటుందని బాధితురాలు చందక బారతి తెలిపింది. ఆవు మృతితో తమ కుటుంబానికి తీవ్ర ఆర్థిక నష్టం జరిగిందని, జీవనాధారంగా ఉన్న పాడి సంపదను కోల్పోయామని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వం,పశు సంవర్థకశాఖ అధికారులు స్పందించి నష్టపరిహారం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఎండ వేడికి 200 కోళ్లు మృతిగుర్ల: మండలంలోని దమరసింగి గ్రామంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటున్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అంతరాయం, భరించలేని ఎండ కారణంగా గ్రామంలో 200 కోళ్లు మృతి చెందాయని ఫారం నిర్వాహకుడు సంచాన ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కోళ్ల మరణంతో ఆర్థిక నష్టం జరిగిందని వాపోయాడు. ఉపాధి హామీ పనులు ముగించుకుని మండుటెండల్లో ఇంటికి చేరుకుంటున్న కూలీలు విద్యుత్ కోతల కారణంగా తీవ్ర అసౌకార్యానికి గురవుతున్నారు. సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. యువతి అదృశ్యంసంతకవిటి: మండలంలోని మల్లయ్యపేట గ్రామానికి చెందిన యువతి(22) మతి స్థిమితం లేక మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఇదివరకు రెండు సార్లు అదృశ్యం కావడం వేరే చోట ఆచూకీ లభ్యమైందని, అనంతరం హైదరాబాద్లోని సిటీ నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశామని, 15 రోజుల క్రితం ఇంటికి వచ్చి మళ్లీ ఎటో వెళ్లి పోయిందని తండ్రి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
శివరాంలో హత్య
● కూలి డబ్బుల పంపకంలో వివాదం ● బావను హత్య చేసిన బావమరిది ● నిందితుడి అరెస్టు చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలం శివరాం గ్రామంలో కూలి డబ్బుల పంపకం విషయంలో తలెత్తిన వివాదం ఒకరి హత్యకు దారితీసింది. సొంత బావనే బావమరిది హత్య చేశాడు. సంచలనం సృష్టించిన దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు, ఎస్ఐ బి.లోకేశ్వరరావు తెలిపిన వివరాలు.. శివరాంలోని ఎస్సీ కాలనీకి చెందిన మజ్జి శ్రీను అతని బావ, చెల్లి పచ్చిపాల కనకరాజు, సుజాత విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం సమీపంలోని ఇసుకపాలెంలో కూలి పనుల కోసం వెళ్లి కొద్ది నెలలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. పనులు పూర్తయిన తరువాత ఇటీవల వారు స్వగ్రామమైన శివరాం చేరుకున్నారు. ఈ నెల 8న కూలి డబ్బుల పంపకంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. బావ కనకరాజు రోజుకు రూ.110 చొప్పున కూలి ఇవ్వగా.. రూ.130లు చొప్పున చెప్పి పనులకు తీసుకువెళ్లి తక్కువ ఎలా ఇస్తావని బావమరిది శ్రీను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన శ్రీను సమీపంలో ఉన్న చెక్క పలకతో కనకరాజు తలపై బలంగా కొట్టాడు. దీంతో బావ కనకరాజు తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే విశాఖపట్నం కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనును హత్యానేరం కింద అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. -
ఉద్యోగాల పేరుతో టోకరా
బొండపల్లి: రైల్వేలోను, షిప్యార్డులోను ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి తన నుంచి రూ.8 లక్షలు నగదు తీసుకున్న వ్యక్తుల నుంచి తన నగదు ఇప్పించాలని కోరుతూ కనిమెరక గ్రామానికి చెందిన మలిసెట్టి మహేశ్వర్రావు స్థానిక ఎస్సై యు.మహేష్కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరానికి చెందిన పోట్టా వీర్రాజు, పోట్టా శ్రీనివాసరావుతో పాటు, పోట్టా గుణరాజులు తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి తన వద్ద నుంచి దఫా ధఫాలుగా రూ.8 లక్షలు తీసుకున్నారని ,ఉద్యోగాలు ఇప్పించకపోగా, డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులను ఆరశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఽబాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మరిపల్లి ప్రాంతంలో ఏనుగుల సంచారంసాలూరు రూరల్: మండలంలోని మరిపల్లి, రేగాపువలస గ్రామాల మధ్యలో ఏనుగులు సంచరిస్తున్నాయి. బుధవారం మరిపల్లి, గంగన్న దొర వలస గ్రామాల మధ్యలో ఏనుగుల గుంపు రోడ్డు పైకి వచ్చింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వచ్చిపోయే వారంతా కొంత సమయం ఆగిపోయారు. అలాగే పంటపొలాల్లో వ్యవసాయ బోర్లు, డ్రిప్ పైపులను ఏనుగులు ధ్వంసం చేసినట్లు రైతులు తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంపూసపాటిరేగ : భోగాపురం మండలం చేపలకంచేరు తుఫాన్ బిల్డింగ్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు భోగాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ బుధవారం తెలియజేశారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఎయిర్పోర్టులో పనుల నిమిత్తం వచ్చి వడగాడ్పుల కారణంగా తట్టుకోలేక గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఎరుపురంగు బనియన్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు భోగాపురం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామంలో బుధవారం విజిలెన్స్ ఎస్సై రామారావు తన సిబ్బంది, మండల వ్యవసాయాధికారితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా విత్తనాలు అమ్ముతున్న ఓ వ్యక్తి వద్ద రూ.5.33 లక్షల విలువచేసే అమూల్య గోల్డ్ వరి విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదే గ్రామంలో మరో ప్రైవేట్ ఎరువుల దుకాణంలో దాడులు చేసి 1334 యూరియా బస్తాలు ఉండాల్సిన చోట 1260 బస్తాలు మాత్రమే ఉండడంతో 74 బస్తాలు తేడా రాగా ఆ షాప్లోని 1260 బస్తాలు స్వాధీనం చేసుకుని 6ఎ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
స్మార్ట్ పోలీసింగ్తో మెరుగైన సేవలందించాలి
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్విజయనగరం క్రైమ్: స్మార్ట్ పోలీసింగ్తో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్హెచ్ఓలతో బుధవారం జిల్లాపోలీస్ కార్యాలయంలో ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తులో ఉన్న లాంగ్ పెండింగ్, గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్డీపీఎస్, పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్, చోరీ, రోడ్డు ప్రమాద, సోషల్ మీడియా కేసులను సమీక్షించి, అధికారులకు దర్యాప్తుపరమైన పలు సూచనలు చేసి, దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందించిన 360 డిగ్రీ మొబైల్ యాప్ లో మిస్సింగ్, ఓవీ క్రిమినల్స్, పోయిన వాహనాల ఫొటోలను అప్లోడ్ చేసి, ఫేస్ రికగ్నైజింగ్ కెమెరాలతో వచ్చిన అలెర్ట్ మెసేజ్ లకు తక్షణమే స్పందించి మిస్సింగ్, ఓవీ క్రిమినల్స్, పోయిన వాహనాల ఆచూకీని కనుగొనాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. సీసీ కెమెరాల వినియోగం పెంచాలి క్షేత్రస్థాయిలో సాంకేతికతను, డ్రోనన్స్, సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత పెంచి, నేరాలను నియంత్రించాలన్నారు. మహిళల భద్రత, గంజాయి, రహదారి భద్రత, సైబర్ భద్రత పట్ల ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో మహిళా సంరక్షణ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. చోరీ వస్తువులు, బంగారు ఆభరణాలను వ్యాపారులు కొనుగోలు చేయకుండా చర్యలు చేపట్టాలని, పాత బంగారు వస్తువులు కొనుగోలు చేసేందుకు బంగారు వ్యాపారులు ప్రత్యేకంగా ఒక రికార్డులో కొనుగోలు చేసే వస్తువుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఏవైనా నేరాలు జరిగినప్పుడు నేర స్థలం నుంచి ఆధారాల సేకరణకు తప్పనిసరిగా క్లూస్ టీం సహాయం తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్ సైన్స్ నివేదికలను సంబంధిత కార్యాలయాల నుంచి త్వరితగతిన పొందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా పెట్టాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నేరాలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, డీటీపీసీ డీఎస్పీ నారాయణరావు, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
● జేసీ సేతుమాధవన్ విజయనగరం అర్బన్: జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, సర్వే అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ జిల్లాలో అమలవుతున్న వివిధ రెవెన్యూ సేవలు, ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూ వివాదాల పరిష్కారానికి అత్యంత కీలకమైన ‘రీసర్వే’ పురోగతి, జాయింట్ ఎల్పీఎంల ప్రక్రియపై ప్రత్యేక సమీక్ష జరిపారు. రీ సర్వే పనుల్లో వేగం పెంచాలని ఎక్కడా జాప్యం జరగకుండా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని సర్వే విభాగాన్ని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన 22ఏ నిషేధిత భూముల జాబితా దరఖాస్తుల స్థితిగతులపై ఆరా తీశారు. తహసీల్దార్, ఆర్డీవో అర్హమైన వాటికి వెంటనే ఆమోదం తెలపాలని స్పష్టం చేశారు. రైతులకు ఉపయోగపడే పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, ఈ–కేవైసీ ప్రక్రియపై జేసీ ప్రత్యేక దృష్టి సారించారు. జనవరి నుంచి ఆగస్టు వరకు మంజూరైన పాస్ పుస్తకాల పంపిణీ స్టేటస్ను సమీక్షిస్తూ ఇంకా ఈ–కేవైసీ పూర్తికాని రైతుల వివరాలను సేకరించి నూరు శాతం ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో ‘రెవెన్యూ క్లినిక్ల’ పనితీరును మెరుగుపరిచి ప్రజల నుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన అర్జీలపై జాయింట్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని భూముల బదిలీలు, మ్యుటేషన్ల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, జిల్లాలోని ఆర్డీవోలు, సెక్షన్ అధికారులు, తహసీల్దార్లు పెద్ద సంఖ్యంలో పాల్గొన్నారు. -
ఒకదానికే దిక్కులేదు..మరొకటా..?
● ఎంఎస్ఎంఈ పార్కుకు భూములివ్వం ● కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన రైతులుబొండపల్లి: ఒక పక్క ఎంఎస్ఎంఈ పార్కు పేరుతో పార్కును ఏర్పాటు చేసి అక్కడ ఒక్క పరిశ్రమ కూడా రాని పరిస్థితుల్లో రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న జిరాయితీ, డీపట్టా భూముల్లో మరో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి భూములు లాక్కునే ప్రయత్నం విరమించుకోవాలని రైతు సంఘం, సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తూ తహఽసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతుల నుద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కొండకిండాంలో ఏడాది క్రితం ప్రారంభించిన పార్కుకే ఇంతవరకు దిక్కు లేదని ఇప్పడు కొండకిండాం, కిండాం అగ్రహారం, రాచకిండాం గ్రామాల పరిధిలో 175 ఎకరాలు పార్కు పేరుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి అరఎకరం,ఎకరం ఉన్న సన్న, చిన్న కారు రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మూడు గ్రామాలకు చెందిన రైతులు వారం రోజులుగా అందోళనలు చేడుతున్నా,సంబంధింత మంత్రి, నియోజకవర్గం ఎమ్మేల్యే కనీసం బాధిత రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి సమీక్షా సమావేశం నిమిత్తం వచ్చిన కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అలాగే తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావుకు కూడా వినతిపత్రం అందజేసి కార్యాలయం వద్దనే భోజనాలు చేసి సాయంత్రం వరకు నిరసన తెలియ చేసి తమకు న్యాయం చేయాలని అధికారులును కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తొత్తడి పైడిపు నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొర్లె శ్రీనివాసరావు, పోరాట కమిటీ నాయకులు, మూడు గ్రామాలకు చెందిన బాధిత రైతులు పాల్గొన్నారు. -
ఒడిశా విలేకరులపై మంత్రి ఆగ్రహం
సాలూరురూరల్: ఆంధ్రా ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రామాల్లో బుధవారం జరిగిన రహదారి ప్రారంభ సమావేశంలో మంత్రి సంధ్యారాణి ఒడిశా నుంచి వచ్చి కవరేజ్ చేస్తున్న పత్రికా విలేకరులపై విరుచుకు పడ్డారు. వివాదాస్పద గ్రామాల్లో ఒకటైన నేరెళ్ల వలసలో నిర్వహించిన బహిరంగ సభకు గంజాయి భద్ర, సారిక తదితర పంచాయతీల్లోని గిరిజనులను తీసుకువచ్చారు. వివాదాస్పద గ్రామాలు కావడంతో ఒడిశాకు సంబంధించిన విలేకరులు కూడా ఈ సభకు హాజరయ్యారు. వారు విధి నిర్వహణలో భాగంగా కార్యక్రమాన్ని ఫొటోలు వీడియోలు తీసుకుంటున్న సమయంలో వేదికపై కూర్చున్న మంత్రి సంధ్యారాణి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? ఎందుకు ఫొటోలు తీస్తున్నారని ప్రశ్నించారు. దీంతో పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కుతారా? అంటూ ఒడిశా పత్రికా విలేకరులు అంతా అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు మంత్రి సంధ్యారాణి ఒడిశా విలేకరులను ప్రశ్నించిన తీరును మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తప్పుబట్టారు. వివాదాస్పద గ్రామాల విషయంలో తొలి తప్పు తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. ప్రశాంతంగా ఉన్న గిరిజన గ్రామాల్లో జన్మ భూమి కార్యక్రమాన్ని పెట్టి ఒడిశా ప్రభుత్వంతో గొడవకు కారణమయ్యారన్నారు. అప్పటినుంచి ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా వివాదాస్పద గ్రామాల్లోకి వెళ్లింది లేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాలి నడకన వివాదాస్పద గ్రామాలు తిరిగి అక్కడికి చేరుకున్న విషయం గుర్తు చేశారు. ఆర్టికల్ 19 ప్రకారం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకూడదన్న విషయం మంత్రి సంధ్యారాణి తెలుసుకోవాలని హితవు పలికారు. -
ఉసురు తీసిన ఉపాధి
బొబ్బిలి రూరల్: ఉపాధినిస్తున్న డ్రైవర్ కొలువే ఓ డ్రైవర్ ఉసురు తీసింది. బాడంగి మండలం పినపెంకికి చెందిన బోనకల సింహాచలం(55) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో బొబ్బిలి పట్టణానికి కుటుంబంతో వచ్చి ఇక్కడే పనిచేస్తున్నాడు. సింహాచలానికి సొంత వాహనం లేకపోవడంతో ఇతరుల వాహనాలకు డ్రైవర్ లభ్యత లేనిపక్షంలో వెళ్తుంటాడు.ఈ క్రమంలోనే బుధవారం మరొకరి వాహనానికి డ్రైవర్గా స్టోన్ క్రషర్ వద్ద లభించే బుగ్గి(క్రషర్ బుగ్గి) కోసం మండలంలోని భోజరాజపురం రోడ్డులో గల క్రషర్కు వెళ్లాడు. ఆ సమయంలో ట్రాక్టర్కు ఉండే వెనుక హైడ్రాలిక్ తొట్టె ఆకస్మాత్తుగా మీదకు లేచి ఉండిపోయింది. ఇది గమనించిన సింహాచలం ట్రాక్టర్ను నిలిపి లేచిన తొట్టెను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తొట్టె కిందికి వాలుతూ సింహాచలంపై పడిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సింహాచలం భార్య లక్ష్మి కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. వారికి ఇద్దరు కుమార్తెలుండగా పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. రెండో కుమార్తె సంధ్యారాణి ఇంటివద్దనే సహాయకారిగా ఉంటోంది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటనపై సింహాచలం కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ కాశి దర్యాప్తు చేస్తున్నారని సీఐ కె.నారాయణ రావు విలేకరులకు తెలిపారు. -
ఎంపీడీవోపై విచారణ
జియ్మమ్మవలస(రూరల్): మండల పరిషత్ కార్యాలయంలో వివిధ పద్దుల కింద ఉన్న రూ.పది లక్షల నిధులను ఎంపీడీవో హనుమంతు శశిభూషణరావు దుర్వినియోగం చేశారన్న విషయమై జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి బుధవారం విచారణ చేపట్టారు. గడిచిన నాలుగు రోజులుగా ఎంపీడీవో విధులకు హాజరు కాకపోవడం, సీనియర్ అసిస్టెంట్ కె.రామారావు కూడా అనారోగ్యం పేరిట విధులకు హాజరు కాకపోవడంతో ఓఎస్టీడీ చొక్కాపు శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ ప్రసాద్ల స్టేట్మెంట్లు తీసుకున్నారు. దీనిపై తగు చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నారు. ఇదిలా ఉండగా ఎంపీడీవో కార్యాలయంలో నిధుల దుర్వినియోగంపై సాక్షిలో బుధవారం ప్రచురితమైన ‘ఎంపీడీవో కార్యాలయంలో వార్’ కథనం చర్చనీయాంశమైంది. ఈ నిధుల విషయమై కార్యాలయంలోనే ఉద్యోగుల మధ్య కొట్లాట జరిగిందన్న తీరు.. దీని వెనుక ఓ రాజకీయ నాయకుడి ప్రోద్బలం ఉందనే విషయాలు వెలుగులోకి రావడం.. ఈ క్రమంలో విచారణ జరగడం ఆసక్తికరంగా మారింది. మున్ముందు ఏం జరగనుందో వేచి చూడాలి. వసతిగృహాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం అర్బన్: జిల్లా రూరల్ పరిధిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి చర్యలు చేపట్టినట్టు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి (ఏఎస్డబ్ల్యూఓ) వీఎల్ఎం స్వరూప్కుమారి తెలిపారు. ఈమేరకు ఎస్సీ విద్యార్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ పరిధిలో మొత్తం తొమ్మిది సాంఘిక సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయని, వాటిలో ఆరు ప్రీ మెట్రిక్, మూడు పోస్ట్ మెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రీ మెట్రిక్ వసతిగృహాలలో బొండపల్లి బాలికల వసతి గృహంలో 50 సీట్లు, గజపతినగరం బాలికల వసతిగృహంలో 72 సీట్లు, గర్భాం బాలుర వసతిగృహంలో 75 సీట్లు, గంట్యాడ బాలుర వసతిగృహంలో 16 సీట్లు, లోగిస బాలుర వసతిగృహంలో 200 సీట్లు ఉన్నాయని తెలిపారు. పోస్ట్ మెట్రిక్ వసతిగృహాల (ఇంటర్మీడియట్ మరియ ఆపై తరగతులు)లో గజపతినగరం బాలికల వసతిగృహంలో 55 సీట్లు, గజపతినగరం బాలుర వసతిగృహంలో 74 సీట్లు, చీపురుపల్లి బాలుర వసతిగృహంలో 50 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంబంధిత వసతిగృహాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. నిబద్ధతతో పనిచేస్తేనే సత్ఫలితాలు ● జేవీవీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ విజయనగరం అర్బన్: ఏ రంగంలోనైనా నిబద్దతతో పని చేస్తేనే మంచి విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగవచ్చని జనవిజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ అన్నారు. స్థానిక గురజాడ పాఠశాలలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదికతో తమకున్న సుదీర్ణ ప్రయాణాన్ని అనుభవాలను పంచుకున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ సమాజ శ్రేయస్సు కోసం అనేక విజయాలను సాధించామని వారు గుర్తు చేసుకున్నారు. సంస్థ దివంగత నాయకులు పల్లి తిరుపతిరావు, మండల సత్యనారాయణ జేవీవీ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, జన్మభూమి వంటి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో జనవిజ్ఞాన వేదిక చేసిన కృషి ఎనలేదని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మిరియాల కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేదిక జాతీయ నాయకులు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పైల రమేష్ రాజు, సుజాత, యోహాన్, జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్, జిల్లా ట్రెజరర్ శివాజీ, డప్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ ఒడి నుంచే అనంతలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం ● తల్లికి గాయాలుశృంగవరపుకోట: పేగుతెంచి జన్మనిచ్చిన తల్లి తన చిన్నారి బిడ్డను తాను చూస్తుండగానే కోల్పోవడంతో ఆ తల్లి పేగు తల్లడిల్లిపోయింది. ఈ ప్రమాద ఘటన ఆ తల్లి కడుపు తరుక్కుపోయేలా చేసింది. అప్పటి వరకూ ఆడిపాడిన చిన్నారిని తల్లిదండ్రులు చూస్తుండగానే మృత్యువు తన ఒడిలోకి లాక్కుపోయింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన తోనంగి రామదాసు–కుసుమలు తమ రెండవ కుమార్తె భారతిని విశాఖ జిల్లా, పద్మనాభం మండలం, చిన్నాపురం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి కడుభట్ల రాంబాబుకు ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. ఇటీవల రాంబాబు ఆర్మీ నుంచి రిటైర్ అయి గ్రామంలోనే ఉంటున్నారు. వారికి ఐదేళ్ల రిత్విక్రోషన్, పదకొండు నెలల చిన్నారి కౌశిక్లు ఉన్నారు. రాంబాబు భార్యాబిడ్డలతో ఆదివారం కృష్ణాపురంలో గ్రామదేవత మొక్కు తీర్చుకునేందుకు అత్తారింటికి వచ్చారు. గ్రామంలో మొక్కులు తీర్చుకున్న దంపతులు గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సీతంపేట గ్రామంలోని బండెమ్మ అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి పల్సర్బైక్పై పిల్లలతో బయల్దేరారు. ఆలయానికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న రిగ్బోరు లారీని తప్పించే క్రమంలో బైక్ రోడ్డు పక్క ఉన్న చిన్న గుంతలో పడి అదుపుతప్పి స్కిడ్ అయ్యింది. దీంతో బైక్పై వెనుక చిన్నకొడుకు కౌశిక్ను ఎత్తుకుని కూర్చున్న భారతి కింద పడిపోయింది. ఆమె చేతిలో నుంచి చిన్నారి కౌశిక్ తూలిపోయాడు. భారతి కుడి చేయి లారీ టైర్ కింద పడి ఫ్రాక్చర్ అయ్యింది. కింద పడి స్వల్ప గాయాలపాలైన కౌశిక్ స్పృహ కోల్పోయాడు. దీంతో హుటాహుటిన స్థానికుల సహాయంతో తల్లీ బిడ్డలను ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే చిన్నారి కౌశిక్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భారతి చేతికి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. కాగా చిన్నారి కౌశిక్ మరణం గ్రామంలో విషాదం నింపింది. తమ బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనతో ఆస్పత్రి వాతావరణం గంభీరంగా మారిపోయింది. ముక్చుపచ్చలారని ముద్దులొలికే చిన్నారి మృతదేహాన్ని పట్టుకుని కుటుంబసభ్యులు ఏడుస్తున్న తీరు చూపరుల కళ్లు చెమర్చేలా చేసింది. -
ఏసీబీకి చిక్కిన మహిళా కార్యదర్శి
● సాల్వెన్సీ సర్టిఫికెట్ కోసం డబ్బులు డిమాండ్ డెంకాడ : మండలంలోని మోదవలస ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శి టి.రజని రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. మోదవలస పంచాయతీలోని ఒక కేసులో 12 మందికి సాల్వెన్సీ పత్రాలు మంజూరుకు లంచం డిమాండ్ చేసిన మోదవలస ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శి టి.రజనిని బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏసీబీ అడిషినల్ ఎస్పీ ఎన్.రమ్య, డీఎస్పీ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మండలంలోని గుణుపూరుపేట పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న టి.రజని, ప్రస్తుతం మోదవలస పంచాయతీకి ఇన్చార్జ్ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈ క్రమంలో మోదవలస పంచాయతీ పరిధిలోని ఒక కేసు విషయమై కోరాడ నాగరాజుతో పాటు 12 మంది సాల్వెన్సీ సర్టిఫికెట్ల కోసం కొద్ది రోజులుగా ఆమె వద్దకు తిరుగుతున్నారు. ఆమె సర్టిఫికెట్ల కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో కోరాడ నాగరాజు ఏసీబీని ఆశ్రయించాడు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో నాగరాజు నుంచి 12 సాల్వెన్సీ సర్టిఫికెట్లకు పంచాయతీ కార్యదర్శి రజని రూ.30వేలు లంచం తీసుకుంటుండగా అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
చంద్రబాబు పాలనలో అవినీతిపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం
పార్వతీపురం రూరల్ : రాష్ట్రంలో సాగుతున్న చంద్రబాబు పాలనలో అవినీతి ఏ రకంగా జడలు విప్పిందో, అధికారుల ఇష్టారాజ్యం ఏ స్థాయికి చేరిందో అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడే స్వయంగా బట్టబయలు చేశారు. పార్వతీపురం నియోజకవర్గంలో విద్యా శాఖ అధికారుల అక్రమ సంపాదనే ధ్యేయంగా సాగుతున్న వ్యవహారాలపై సొంత పార్టీ ఎమ్మెల్యే బోనెల విజయ్చంద్ర తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఈఓ కార్యాలయంలో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన బుధవారం మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలోనే అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్షేత్ర స్థాయి పాలనా వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. నిబంధనలను కాదని.. బంధుప్రీతికి పీఠం విద్యా శాఖలో ప్రక్షాళన జరుగుతోందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, లోపల మాత్రం నిధుల దోపిడీ నిరాటంకంగా సాగుతోందని ఎమ్మెల్యే ఆరోపణల ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ‘యూనిక్ కనస్ట్రక్షన్’ అనే ప్రైవేట్ సంస్థకు డీఈఓ కార్యాలయం నుంచి ఏకంగా రూ.19 లక్షల 55 వేలను నేరుగా బదిలీ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారుల బంధువులకు ఇలాంటి కాంట్రాక్టులు ఇవ్వకూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి, సదరు కార్యాలయంలోనే పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుని భార్యకు చెందిన సంస్థకు ఈ నిధులను కట్టబెట్టారని ధ్వజమెత్తారు. యోగా మ్యాట్లు ఏవి? నిధులు ఏమయ్యాయి? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన యోగాంధ్రా పేరుతో ఈ నిధుల మాయాజాలం సాగిందని ఎమ్మెల్యే విజయ్చంద్ర వివరించారు. విద్యార్థుల కోసం యోగా మ్యాట్లు, టీ షర్టులు కొనుగోలు చేసేందుకు ఈ నిధులను విడుదల చేసినప్పటికీ, సొమ్ము చెల్లించి 45 రోజులు దాటినా ఇంతవరకు ఆఫీసుకు ఒక్క మ్యాట్ కానీ, టీషర్టు కానీ రాలేదని ఆరోపించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి కనీసం టెండర్ ప్రక్రియ నిర్వహించారా, కొటేషన్లు పిలిచారా, ఎల్–1గా ఎలా ఖరారు చేశారు అనే వివరాలు కూడా లేవని, అధికారులు ఇష్టానుసారంగా నిధులను దండుకుంటున్నారని విమర్శించారు. గుట్టు రట్టు చేసిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల డీఈఓ కార్యాలయంలో నిధుల గోల్మాల్పై మండిపాటు సొంత వారికే రూ.19.55 లక్షల దోపిడీ జిల్లా విద్యా శాఖపై సంచలన ఆరోపణలు పత్రాలు ఇవ్వకుంటే నేరుగా కార్యాలయానికే.. ఈ అక్రమ వ్యవహారాలపై గత నెల రోజులుగా డీఈఓను వివరణ కోరుతున్నా ఆయన సమాధానం దాటవేస్తున్నారని, కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఎమ్మెల్యే వాపోయారు. ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్న కలెక్టర్ ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని, ఈ దోపిడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల అవినీతి పత్రాలను తాము లిఖితపూర్వకంగా అడిగామని, రేపటికల్లా ఆ డాక్యుమెంట్లను బయటపెట్టకపోతే తామే స్వయంగా డీఈఓ ఆఫీసుకు వెళ్లి ఫైళ్లను స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. సొంత పార్టీ అధికారంలో ఉండీ, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఈ స్థాయిలో అవినీతిపై వీధికెక్కి ఆరోపణలు చేయడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
ప్రభుత్వ పాఠశాలలకు దాతలే దిక్కా...!
–8లోఅన్నీ ఉంటేనే తల్లికి వందనం..! అన్నీ ఉన్నా అర్హుల నోట్లో శని అన్నట్లుంది సర్కారు తీరు. దీంతో తల్లికి వందనంపై ఆందోళన నెలకొంది.అమ్మ ఒడి నుంచే అనంతలోకాలకు పేగుతెంచి జన్మనిచ్చిన తల్లి తన బిడ్డను కళ్ల ముందే కోల్పోవడంతో తల్లడిల్లిపోయింది. రామభద్రపురం: జిల్లాలో రెండో విడత నాడు – నేడు పనులకు మంగళం పాడే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. చంద్రబాబు సర్కారు కొలువు దీరి రెండేళ్లు అయినా నేటికీ పాఠశాలల అభివృద్ధికి ఒక్క పైసాను సైతం విదల్చలేదంటే సర్కారు పాఠశాలలపై చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలో రెండో విడత కింద పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు 738 ఎంపిక చేసి రూ.231 కోట్లతో పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది. అయితే ఎన్నికల ముందు వరకు పనులు వేగంగా సాగినా, ఎన్నికల తర్వాత ఆ పనులు నిలిచిపోయాయి. ఆయా పాఠశాలల్లో పెండింగ్ పనులు సైతం చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలి నిర్దయగా వ్యవహరిస్తోంది. ఫలితంగా నిధుల్లేక జిల్లా వ్యాప్తంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ● దాతలను గుర్తించాలంటూ ఆదేశాం.. ప్రభుత్వ స్కూళ్లలో మైనర్ రిపేర్లకు సైతం నిధులను విడుదల చేయకుండా దాతలను గుర్తించాలంటూ సమగ్రశిక్ష అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుర్తించిన దాతల వివరాలను విద్యాంజలి పథకం పేరుతో డోనర్ యాప్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దాతల సహకారంతో పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలనే ఉచిత సలహా ఇస్తోంది. ఈ తరుణంలో సంబంధిత అధికారులు దాతలను వెతికే పనిలో నిమగ్నమై ఉన్నారు. దాతల ముందుకొచ్చి మైనర్ రిపేర్లను పూర్తి చేయడం ఈ విద్యా సంవత్సరంలో సాధ్యం కాదనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. ● పాఠశాలల్లో సమస్యలు.. జిల్లా వ్యాప్తంగా 1766 ప్రభుత్వ ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ఇటీవల విద్యాశాఖాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఏఏ సమస్యలు ఉన్నాయి.. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ఏవి ప్రధానంగా కల్పించాలి? అన్న అంశాలపై పాఠశాలల హెచ్ఎంలను కోరింది. పాఠశాలల వారీగా హెచ్ఎంలు ప్రధాన సమస్యల వివరాలు అందించారు. 312 పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు లేదని, 450 పాఠశాలల్లో ఆడపిల్లలకు మరుగుదొడ్లు, 440 పాఠశాలల్లో మగ పిల్లలకు మరుగుదొడ్లు కొరత ఉందని తెలిపారు. అలాగే ర్యాంప్స్ లేని పాఠశాలలు 282 ఉన్నాయని, 141 పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేదని, 167 పాఠశాలల్లో ఫర్నిచర్ కొరత ఉందని, 430 పాఠశాలలకు అదనపు తరగతి గదులు కావాలని, 630 పాఠశాలల్లో మేజర్, మైనర్ మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రహరీలు, సైన్స్ ల్యాబ్లకు గదులు, కంప్యూటర్ రూంలు, కిచెన్ షెడ్లు అవసరమని పలు పాఠశాలల హెచ్ఎంలు నివేదిక ఇచ్చారు. నాడు ఎంతో సజావుగా.. రూ.488 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం.. నాడు – నేడుకు చంద్రబాబు సర్కార్ మంగళం మైనర్ మరమ్మతులకూ ఎదురు చూపులు విద్యాంజలి పథకం పేరిట డోనర్ యాప్ కింద దాతల నమోదు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా పైసా విదల్చని వైనం ఎక్కడి పనులు అక్కడే... అదనపు తరగతి గదులు, సరైన సదుపాయల్లేక విద్యార్థుల అవస్థలు రేపే పాఠశాలల పునఃప్రారంభం ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో నాడు–నేడు కార్యక్రమానికి అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొదటి విడత కింద 841 పాఠశాలలో రూ.185 కోట్లుతో చేసిన పనులతో తొమ్మిది రకాల వసతులు కల్పించింది. దీంతో విద్యార్థులు, ఉపాద్యాయులు, తల్లిదండ్రులు మారిన బడులను చూసి సంబరమాశ్చర్యాలకు లోనయ్యారు. తల్లిదండ్రులకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్నామనే భావనను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కల్పించారు. ఇక రెండో విడత కింద పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు బాగుకు నిధులు మంజూరు చేసిన తరువాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పాఠశాలలకు ఏఏ వసతులు అవసరమో ఎంఈవోల ద్వారా నివేదికలు తీసుకున్నాం. వాటికి ఇంజినీరింగ్ అధికారుల ద్వారా అంచనాలు వేయించి సుమారు రూ.488 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ప్రభుత్వం విద్యాంజలి పేరుతో డోనర్ యాప్ను ఏర్పాటు చేసింది. అందులో పాఠశాలల్లో ఉన్న అవసరాలను పొందుపరిచాం. ఇందులో అదనపు తరగతి గదులు ఆవశ్యకత కూడా ఉంది. డోనర్ యాప్ ద్వారా దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ బడుల అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. – యు.మాణిక్యంనాయుడు, డీఈఓ, విజయనగరం -
కార్యకర్త కుటుంబానికి జెడ్పీ చైర్మన్ ఆసరా
● ఇంటర్ విద్యకోసం రూ.లక్షా, 10 వేలు ఆర్థిక సాయంవిజయనగరం: కార్యకర్తలే ఏ పార్టీకై నా పునాదులు. పునాది లాంటి కార్యకర్తల హదయాలు గెలుచుకున్న వారే నేతలుగా, నాయకులుగా నాలుగు కాలాలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. పార్టీలో ఉండే ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిగా భావించిన నాయకుడు మాత్రమే వారిని, వారి కుటుంబాలను కష్టకాలంలో ఆదుకుంటాడు. అలాంటి అరుదైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా, తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునే నాయకుడు విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ భీమిలి నియోజకవర్గం ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా మరోసారి తమ పార్టీ కార్యకర్త కుటుంబం పట్ల తనకున్న వాత్సల్యాన్ని, ఉదారతను ఆయన చాటుకున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం, పద్మనాభం గ్రామానికి చెందిన వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటుభుక్త శ్రీను కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి నియోజకవర్గ నాయకుల ద్వారా తెలుసుకున్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మానవతా ధృక్పథంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. మృతి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కుమార్తె కంటుభుక్త మాధురిని ఇంటర్మీడియట్ విద్యలో చేర్పించడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించారు. బోయపాలెం శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఆమెను ఇంటర్ విద్య కోసం చేర్పించి విద్యాభ్యాసానికి అవసరమైన రూ. లక్షా, 10 వేలు ఫీజును చెల్లించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థిని మాధురి, ఆమె తల్లితో కలిసి వచ్చి క్యాంప్ కార్యాలయంలో చిన్న శ్రీను, సిరిసహ్రలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, మాధురి ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్నశ్రీను ఆకాంక్షించారు. కార్యక్రమంలో పద్మనాభం ఎంపీపీ కంటుభుక్త రాంబాబు, పద్మనాభం సర్పంచ్ తాలాడ పద్మనాభం ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిళా సాధికారత ఎక్కడ?
● ఎమ్మెల్సీ విక్రాంత్రాజాం: రాష్ట్రంలో మహిళా సాధికారత కనిపించడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం రాజాంలో ఓపైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల నాలుగు పార్లమెంట్ స్థానాలు కూటమికి భర్తీచేసే అవకాశం వస్తే నాలుగింటిలో ఒక్కటి కూడా మహిళలకు కేటాయించలేదని ఆరోపించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 50 శాతం దాటి మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. గ్రామ వలంటీర్లలో 53 శాతం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, స్థానిక సంస్థల్లో 50 శాతం అమలుచేశారని గుర్తుచేశారు. అప్పట్లో మంత్రివర్గంలో ఐదుగురికి మించి మహిళలు మంత్రులుగా ఉన్నారన్నారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల్లో 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మహిళలు కాగా, 7 శాతంగా నమోదైందని వివరించారు. కూటమి క్యాబినెట్లో కేవలం ఇద్దరు మాత్రమే మంత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు రాజ్యసభ సీట్లలో ఒకటి నుంచి రెండు సీట్లు మహిళలకు ఇస్తే ఎంతో బాగుండేదని, మహిళల అభివృద్ధిని చంద్రబాబునాయుడు ఓర్వలేకనే సీట్లు కేటాయించలేదని ఆరోపించారు. ‘తోటపల్లి’ పునః ప్రారంభించక పోతే రైతులకు తీవ్రనష్టం వంగర: తోటపల్లి ఆధునికీకరణ పనులు పునః ప్రారంభించకపోతే ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మంగళవారం మండల పరిధి మగ్గూరు గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గడిచిన రెండేళ్లుగా తోటపల్లి ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో వంగర మండల రైతాంగం సాగునీటికి ఇబ్బందులు పడతున్నారన్నారు. కుడి ప్రధాన కాలువ ఎగువ భాగంలో కాలువ మరమ్మత్తులకు గురైందని, గడిచిన రెండేళ్లుగా సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో అన్నదాతలు సాగునీటికి అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. రైతు సేవా కేంద్రాల ద్వారా సకాలంలో రైతులకు ఎరువులు విత్తనాలు అందడంలేదని, రైతుల పట్ల ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని హితవు పలికారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు పుష్కలంగా అందించారని గుర్తు చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, షూస్ పాఠశాలలు తెరిచే నాటికి అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కరణం సుదర్శనరావు, మండల పార్టీ యూత్ అధ్యక్షుడు బొక్కేల వెంకటప్పలనాయుడు, పార్టి నాయకులు గేదెల రామకృష్ణ, పోలిరెడ్డి రమేష్, ఏగిరి ముత్యాలరావు పాల్గొన్నారు. -
నెత్తుటి మడుగులో ఆవు.. తల్లడిల్లిన లేగదూడ
పార్వతీపురం రూరల్: తల్లికి ఏమైందో ఆ లేగ దూడకు తెలియదు.. రక్తపు మడుగులో చలనం లేకుండా పడి ఉన్న తల్లిని చూసి లేగదూడ తల్లడిల్లిపోయింది. ఎవరైనా వచ్చి తన తల్లికి ప్రాణం పోస్తారేమోనని రోడ్డు వైపు దీనంగా చూసిన ఆ మూగజీవి ఆవేదన పాదచారులను సైతం కంటతడి పెట్టించింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పరిధిలోని రాయగడ రహదారిపై ఈ హృదయ విదారక ఘటన మంగళవారం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం రోడ్డుపై ఉన్న ఆవును బలంగా ఢీకొట్టి, కనీసం ఆపకుండా అక్కడి నుంచి పరారైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ గోమాత సుమారు మూడు గంటల పాటు ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపైనే నరకయాతన అనుభవించింది. తల్లి ఎంతకీ కదలకపోవడంతో ఆవేదనకు గురైన దూడ.. పక్కనే కాపలాగా ఉంటూ తన మూతితో పదేపదే తట్టి లేపేందుకు ప్రయత్నించింది. కళ్లలో నీళ్లు నింపుకుని సాయం కోసం అటుగా వెళ్లే వారి వైపు ఆశగా చూసింది. గుండె బరువెక్కే ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, పాదచారులు తీవ్రంగా చలించిపోయారు. ప్రమాదానికి కారకుడైన వాహనదారు కర్కశత్వంపై మండిపడుతూనే.. లేగదూడ ఆవేదనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో గాదెలవలస ఉద్యోగి మృతి
సీతానగరం: విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం జరిగిన ప్రమాదంలో పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం, గాదెలవలస గ్రామానికి చెందిన గొట్టాపు త్రినాఽథ్ (50) మృతి చెందడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. మృతుడు త్రినాథ్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు పవన్ విజయవాడలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండవ కుమారుడు భరత్ చైన్నెలోని కాంగో కంపెనీలో సాఫ్టవేర్ ఉద్యోగం చేస్తున్నాడని కుటుంబసభ్యులు తెలియ జేశారు. సామాన్యరైతుకుటుంబానికి చెందిన త్రినాథ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న సమయంలో ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కు పోయిందని బోరున విలపిస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..పాలకొండ రూరల్: మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన అల్లు సీతారాం(46) శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. దీనిపై పోలీసులు అందించిన వివరాల మేరకు తీవ్ర ఆనారోగ్యం కారణంగా పది రోజుల క్రితం సీతారాం తన ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అప్పట్లో ఆయనను కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా వైద్య సేవలు పొందుతూ మరణించినట్లు ఎస్సై డోల వెంకన్న తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. మృతుడికి భార్య భవాని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్యా పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు.విద్యుత్ షాక్తో ఆవు..తెర్లాం: మండలంలోని లింగాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం విద్యుత్ షాక్కు గురై పాడిఆవు మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు కునుకు వెంకటరావు మేత కోసం గ్రామానికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలానికి ఆవును తోలుకుని వెళ్లాడు. అదే స్థలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వైర్లకు ఆవు తగలడంతో వెంటనే విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎన్నోఏళ్లుగా కష్టపడి పెంచుకున్న ఆవు విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో రైతు వెంకటరావు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయంపై గ్రామ రెవెన్యూ అధికారి తహసీల్దార్కు సమాచారం ఇచ్చారు. మండల ట్రాన్స్కో ఏఈ తెంటు శ్రీనివాసరావు, మండల పశువైద్యాధికారి డాక్టర్ జె.నరేంద్రకుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన ఆవును పరిశీలించారు. ఏడుగురు గంజాయి నిందితుల అరెస్ట్విజయనగరం క్రైమ్: రెండున్నర కిలోల గంజాయితో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని విజయనగరం రూరల్ ఎస్సై అశోక్ మంగళవారం తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన ఎల్.కల్యాణ్ అరకు నుంచి మూడు కిలోల గంజాయిని తెచ్చి నాగరాజు అనే వ్యక్తికి అమ్మినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ మేరకు ఇద్దరినీ పట్టుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయగా ఎం,సతీష్ వర్మ(24), ఎం.సాయి వర్మ(22) వై. తిరుపతి దాలయ్య (33), కె.గణేష్ (23),పి.అశోక్ (22) పట్టుబడ్డారన్నారు. ఇందులో కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాడు కాగా విజయనగరంలోని అలకానంద కాలనీలో ఉంటూ స్నేహితులకు అరకు నుంచి తెచ్చిన గంజాయిని కొండకరకాం వద్ద అమ్ముతున్నాడన్న సమాచారంతో అదుపులో తీసుకుని అరెస్ట్ చేశామని ఎస్సై అశోక్ తెలిపారు. వారి దగ్గర నుంచి సుమారు రెండున్నర కేజీల గంజాయి, నాలుగు బైక్ లు, ఏడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై అశోక్ వివరించారు. -
‘ప్రత్యేక’ విద్యార్థులకు సహాయక పరికరాల పంపిణీ
విజయనగరం అర్బన్: ప్రత్యేక అవసరాలు (దివ్యాంగులు)గల విద్యార్థులను అత్యంత శ్రద్ధతో చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మొత్తానిదని కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, ఎమ్మెల్యే పి.అదితి గజపతిరాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్ధులకు అవసరమైన విద్య, వైద్య, పునరావాస సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి వారి అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. శారీరక పరిమితులు ప్రతిభకు అడ్డంకి కాదని, ప్రతి చిన్నారి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. డీఈఓ, సమగ్ర శిక్ష ఏపీసీ యూ.మాణిక్యం నాయుడు మాట్లాడుతూ జిల్లాలోని 27 మండలాల్లో భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్పీడబ్ల్యూడీ చట్టం–2016 ప్రకారం 1 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వివిధ రకాల వైకల్యాలున్న పిల్లలకు ప్రత్యేక విద్య అందిస్తున్నట్లు చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రవాణా భత్యం, సహాయక భత్యం, ఇంటి వద్ద విద్యాభత్యం, దివ్యాంగ బాలికల ఉపకార వేతనాలు డీబీటీ విధానంలో వేలాది మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. 518 సహాయ పరికరాల పంపిణీ అనంతరం జిల్లాలోని 474 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మొత్తం 518 సహాయక పరికరాలను పంపిణీ చేశారు. వాటిలో 56 డిజిటల్ హియరింగ్ ఎయిడ్లు, 41 కమోడ్ వీల్ చైర్లు, 53 వీల్ చైర్లు, 337 టీఎల్ఎం కిట్లు, 17 క్రచ్లు, 12 ట్రైసైకిళ్లు, ఒక స్క్రీన్ రీడర్ సదుపాయం కూడిన స్మార్ట్ఫోన్, ఒక బ్రెయిలీ కిట్ ఉన్నాయి. కార్యక్రమం అనంతరం కలెక్టర్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు జి.చంద్రిక, సమగ్ర శిక్ష అకౌంట్స్ అధికారి ఆర్ఏఎస్కుమార్, కో ఆర్డినేటర్లు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
● అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడువిజయనగరం ఫోర్ట్: నేలల్లో కర్బన శాతాన్ని పెంచడానికి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ సీహెచ్. ముకుందరావు అన్నారు. ఈ మేరకు గాజులరేగ వ్యవసాయ పరిశోధన స్థానంలో గిరిజన రైతులకు గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా వ్యవసాయ ఉప కరణాలు పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్నారు. జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువుల వినియోగాన్ని పెంచాలని కోరారు. సిఫార్సు మేరకు మాత్రమే ఎరువులు వేయాలని సూచించారు. ప్రకృతి సాగు పద్ధతిలో వ్యవసాయం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో అఖిల భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ప్రతినిధి కె. శ్రీనివాసబాబు, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి. టీఎస్ఎస్కే పాత్రో, జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు, ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, శాస్త్రవేత్తలు డాక్టర్ కె.తేజేశ్వరావు, డాక్టర్ ఎంవీవీ శ్రీనివాస రావు, డాక్టర్ ఎన్.అనూరాధ, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
సర్తో ఓటర్లకు శిరోభారమే..!
విజయనగరం అర్బన్: ప్రభుత్వాల మనుగడ, ప్రజల భవిష్యత్తును శాసించే ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు జిల్లాలో పెను సంచలనంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియ పారదర్శకత పేరుతో సాగుతున్నప్పటికీ తెరవెనుక వేలాది మంది అర్హులైన ఓటర్ల హక్కుకు ముప్పు తెచ్చేలా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఓటరుగా సజీవంగా ఉన్న సామాన్యుడికి ఈ ప్రక్రియ శాపంగా మారబోతోందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఏజెంట్ల ఇష్టారాజ్యం–రాజకీయ పక్షపాతం? ఈ సర్వేలో బూత్ లెవెల్ ఏజెంట్లదే (బీఎస్ఏ) కీలక పాత్ర కానుంది. ఇంటింటి సర్వేలో వారి సమ్మతి ప్రకారమే మార్పులు జరుగుతాయి. అధి కార పార్టీతో పాటు ప్రతిపక్షాలు తమకు అనుకూలమైన ఓటర్లను ఉంచుకుని, ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరుల ఓట్లను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఏజెంట్లు లేని ప్రాంతాల్లో ఓటర్ల జాబితా తారుమారయ్యే ప్రమాదం ఉంది. ఏజెంట్ల నియామకంలో ఫారం–2 పూరించడంతో జరుగుతున్న హడావుడి చూస్తుంటే అర్హులైన ఓటర్లు చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో 1.5లక్షల మంది ఓట్లు గాల్లో కలిసే ప్రమాదం ఫారం–2 నింపడం సామాన్యుడికి తలనొప్పి ఏజెంట్ల ఇష్టారాజ్యంతో ఓట్ల తొలగింపు -
ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించాలి
● దిశానిర్దేశం చేసిన డీఈవోపార్వతీపురం రూరల్: ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందిస్తూ ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను నూరుశాతం సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) పి.బ్రహ్మాజీరావు పేర్కొన్నారు. ఈ మేరకు పార్వతీపురంలోని డీవీఎం మున్సిపల్ హైస్కూల్లో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. కోర్సు డైరెక్టర్, బలిజిపేట ఎంఇఓ–1 సామల సింహాచలం అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారుల్లో కనీస విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. శిక్షణ విజయవంతానికి సహకరించిన ఉపాధ్యాయులు, సంఘం నాయకులకు కోర్సు డైరెక్టర్ సింహాచలం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శిక్షణకు కీ రిసోర్స్ పర్సనన్స్ (కేఆర్పీలు)గా వ్యవహరించిన వనజాక్షి, జి.రవికుమార్లతో పాటు డీఆర్పీలను ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో బి.రాజకుమార్, ఏఎంవో కోటేశ్వరరావు, ఎంఈఓలు వై.విమలకుమారి, సూరిదేముడు, కర్రి ప్రసాదరావు, మువ్వల వెంకటరమణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పువ్వుల ధనంజయరావు, గంట శశికుమార్, జగన్నాథం, కూర్మినాయుడు, రెడ్డి రమణ, ప్రసాదరావు, గోపాలకృష్ణ వివిధ మండలాల నుంచి వచ్చిన సుమారు 260 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుతో పాడి గేదె మృతి, పశువుల శాల దగ్ధం
కొత్తవలస: మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. పెద్ద పెద్ద ఉరుములుతో కూడిన వర్షం కురవగా పిడుగుపడడంతో మండలంలోని చీపురువలస గ్రామానికి చెందిన ఉల్లి అక్కమ్మ పాడిగేదె మృతి చెందింది. గేదె సుమారు రూ 70వేలకు పైగా ఉంటుందని జీవనాధారమైన గేదె మృతి చెందడంతో అక్కమ్మ లబోదిబో మంటూ రోదించింది.అలాగే వర్షం మరికొద్ది సమయంలో కురుస్తుందన్నప్పుడు పడిన భారీ పిడుగుకు తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేట గ్రామం సమీపంలో పొలమరశెట్టి పద్మజ్యోతికి చెందిన పశువుల పాక దగ్ధమైంది. ఆ సమయంలో పాకలో ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. -
జిల్లాపై జ్వరాల పంజా..!
కేజీహెచ్లో మృతి వాస్తవమే.. రామభద్రపురం మండలానికి చెందిన గాయిత్రి అనే బాలిక కేజీహెచ్లో మృతి చెందింది. ఆమె మృతికి సంబంధించి పూరి స్థాయి రిపోర్టులు తెప్పించుకుని పరిశీలించిన మీదట ఏ వ్యాధితో మరణించిందో చెబుతాం. జ్వరాల వ్యాప్తితో అప్రమత్తంగా ఉన్నాం. జ్వరపీడితులకు సకాలంలో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెల నుంచే జ్వరాల వ్యాప్తి ప్రారంభం అయింది. దీంతో ఐదు నెలల వ్యవధిలో లక్షలాది మంది జ్వరాల బారిన పడ్డారు. వైరల్ జ్వరంతో కొందరు, మలేరియాతో కొందరు, డెంగీ, టైఫాయిడ్ బారిన మరికొందరు పడుతున్నారు. జ్వరాల బారిన పడినవారు కొంతమంది పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకొంతమంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. రెండు లక్షలకు పైగా జ్వరాల కేసులు నమోదు ఈ ఏడాది జనవరి నెల నుంచి మే నెలఖారు నాటికి జిల్లాలో లక్షలాది మంది జ్వరాల బారిన పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన జ్వరాల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ నమోదు చేస్తుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదు అయిన జ్వరాల వివరాలు వైద్య ఆరోగ్య శాఖ నమోదు చేయదు. ఈ ఏడాది ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 1,66,248 జ్వరాల కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 70 వేల నుంచి 80 వేల వరకు జ్వరాల కేసులు నమోదయ్యాయి. ఇందులో 110 మలేరియా కేసులు, 25 డెంగీ కేసులు ఉన్నాయి. గతంలో మలేరియా కేసులు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అయ్యేవి. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి. చికిత్స అందించడంలో నిర్లక్ష్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జ్వర పీడితులకు వ్యాధి నిర్ధారణలోనూ, చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు సకాలంలో ఇవ్వక పోవడం, చికిత్స అందించడంలో జాప్యం వల్ల రోగులు కొంత మంది మృత్యువాత పడుతుండగా, మరి కొంతమంది ప్రాణాల మీదకు వస్తుంది. జ్వర పీడితులకు అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ కొరవడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తగ్గిపోతున్న ప్లేట్లెట్స్ గతంలో డెంగీ, మలేరియా బారిన పడిన వారికి ప్లేట్లెట్స్ తగ్గిపోయేవి. ఇప్పుడు వైరల్ ఫీవర్స్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి. ప్లేట్లెట్స్ దొరక్క రోగుల బంధువులు బ్లడ్ బ్యాంక్లకు పరుగులు పెడుతున్నారు. అయినా కష్టాలు తప్పడం లేదు. మలేరియాతో రామభద్రపురం మండలానికి చెందిన ఓ బాలిక మృతి! వివరాలు గోప్యంగా ఉంచిన వైద్య శాఖ అధికారులు ఐదు నెలల్లో జ్వరాల బారిన పడినవారు రెండు లక్షల మంది 120 మలేరియా కేసులు నమోదు 25 డెంగీ కేసులు నమోదు జ్వరపీడితులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు తగ్గిపోతున్న ప్లేట్లెట్స్ -
23 నుంచి పైడిమాంబ ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు
● మూడు రోజుల పాటు ఉత్సవాలు విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు చదురుగుడి పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి 25 వరకూ మూడు రోజుల పాటూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని దేవదాయ శాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీషా తెలిపారు. స్థానిక చదురుగుడి ప్రాంగణంలో విజయనగరం ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు ఆధ్వర్యంలో ఉత్సవాల కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది నవంబర్ 10వ తేదీన సోమవారం అమ్మవారి చదురుగుడి విస్తరణ పనుల్లో భాగంగా కళాప్రకర్షణ చేపట్టి, పక్కనే బాలాలయం నిర్మించామని, అప్పటి నుంచి నేటి వరకు బాలాలయంలోనే అమ్మవారి దర్శనం కల్పించామన్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే చదురుగుడి విస్తరణ పనులు శరవేగంగా చేపట్టగలిగామన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ రూ.కోటీ 80లక్షల వ్యయంతో ఆలయ అభివృద్ధిపనులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన విశ్వ విద్యాలయంలో భగవాన్ బిర్సా ముండా వర్ధంతి
విజయనగరం రూరల్: కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయంలో గిరిజన అధ్యయనాల విభాగం ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 126వ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా గిరిజనుల స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన నడిపిన ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించిందని పేర్కొన్నారు. గిరిజనుల సామాజిక, సాంస్కతిక, ఆర్థిక అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా ప్రారంభోపన్యాసం చేస్తూ, భగవాన్ బిర్సా ముండా భారతదేశ గిరిజన సమాజ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయుడని పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు, భూమి, సంస్కతి, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఆయన సాగించిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో గిరిజన అధ్యయనాల విభాగం ఇన్చార్జ్ విభాగాధిపతి డాక్టర్ దివ్య.కె, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, అతిథి అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
చంద్రబాబుది నయవంచక పాలన
బొబ్బిలి/గజపతినగరం : చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్సీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో బొబ్బిలి, గజపతినగరంలో రౌండ్ టేబుల్ సమావేశాలు మంగళవారం నిర్వహించారు. బొబ్బిలిలో జరిగిన సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, నియోజకవర్గ పరిశీలకుడు రొంగలి జగన్నాధం, రాజాం నియోజకవర్గ పరిశీలకుడు కేవీ సూర్యనారాయణ పాల్గొన్నారు. గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
● వాటాల్లో తేడాలా? పంపకాల్లో పేచీలా? ● వెనకుండి నడిపించిన ఎంపీపీ ● మన్యం జిల్లాలో వైరల్ అవుతున్న వీడియోలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ పాలనలో అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు చక్రాల్లా? జోడెడ్ల మాదిరి సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రగతి రధాన్ని నడిపించాలి. కానీ మన్యం జిల్లాలోని ఓ మండలంలో మండల స్థాయిలోని ఓ అధికారికి, సదరు ప్రజాప్రతినిధికి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ ఏకంగా మండల పరిషత్ కార్యాలయంలోనే రౌడీల మాదిరి బూతులు తిట్టుకుని చిల్లర మనుషుల మాదిరిగా కొట్టుకునే వరకు వచ్చింది పరిస్థితి. దీని వెనుక వాటాల పంపిణీలో తేడాలు వచ్చాయా? ఇద్దరి ఇగోలు గట్టిగా ఢీకొన్నాయా తెలియదు కానీ దరువులు మాత్రం పడ్డాయి. అక్కడే ఉన్న కొందరు ఔత్సాహికులు దీన్ని ఉత్సుకతతో చూడడమే కాకుండా వారి మధ్య సంవాదాన్ని వీడియోలు కూడా తీశారు. దీంతో అవి కాస్తా వీధికెక్కాయి. ● ఎంపీడీవో వస్తూనే నిధులపై కన్ను అల్లూరి సీతారామరాజు జిల్లాలో పని చేస్తూ సస్పెండ్ అయి చాన్నాళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న శశిభూషణరావు మూడు నెలల క్రితం జియ్యమ్మవలస ఎంపీడీవోగా వచ్చారు. వస్తూనే ఎంపీడీవో ఖాతాలో ఎంత డబ్బు ఉంది.. దాని లెక్కలేమిటి ? తేల్చేయాలన్న ఆలోచనల్లో పడ్డారు. ఈ క్రమంలోనే వివిధ పథకాలు, పనులకు సంబంధించి తన ఖాతాలో ఉన్న ప్రభుత్వ నిధులు దాదాపు రూ.10 లక్షలను మే 5 నుంచి 21 తేదీ మధ్య డ్రా చేసి సొంతానికి వాడుకున్నారు. ఎందుకు నిధులు తీశారు.. దేనికి ఖర్చు చేశారన్న దానికి సంబంధించి ఆయన ఎవరికీ, కనీసం మండల పరిషత్కు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా చెక్కులతో నిధులు వాడేశారు. ఈ అవినీతికి సూపరింటెండెంట్ కొండగొర్రె రామారావు, ఆఫీస్ సబార్డినేట్ చొక్కాపు శ్రీనివాసరావు సైతం సహకరించినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు డ్రా చేసిన అంశం తనకు తెలియలేదన్న కోపమో, అందులో తనకు వాటా రాలేదన్న ఆగ్రహమో తెలియదు కానీ మండల పరిషత్ అధ్యక్షుడు బొంగు సురేష్ ఈ అంశం మీద ఎంపీడీవోను ప్రశ్నించారు. దీనికి ఆయన సరైన సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా నీకెందుకు చెప్పాలి.. ఇదంతా నా ఇష్టం అన్నట్లుగా మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఆఫీస్ సబార్డినేట్ శ్రీనివాస్ కూడా ఇరుక్కోవడంతో ఆయన్ను రెచ్చగొట్టి ఆయనతో ఎంపీడీవోను ఏకంగా ఆఫీసులో కొట్టించినట్లు తెలిసింది. అందులో తనకు వాటా రాకపోగా అవినీతిలో మాత్రమే తనకు భాగం దక్కడాన్ని సహించలేకపోయిన శ్రీనివాస్ ఏకంగా ఎంపీడీవోపై దాడి చేసారని తెలుస్తోంది. అయితే ఈయన వెనుక ఎంపీపీ సురేష్ ఉన్నారని, ఆయన ప్రోద్బలంతోనే శ్రీనివాస్ ఇలా దాడి చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా కార్యాలయం మొత్తం గలాటా నెలకొనగా ఈ తంతు చూస్తున్న వాళ్లు వాటికి సంబంధించిన వీడియోలు సైతం రికార్డ్ చేయడంతో ఈ వ్యవహారం కాస్త రచ్చకెక్కింది. సురేష్ అక్కడితో ఆగకుండా నిధుల దుర్వినియోగం మీద ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ టివి.తిరుపతిరావు కేసు నమోదు చేశారు. మరోవైపు నిధులు డ్రా చేసిన ఎంపీడీవో రెండ్రోజులుగా పరారీలో ఉన్నారు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ వస్తోందని తెలుస్తోంది. ఈ అంశం ఉమ్మడి విజయనగరం జెడ్పీ సీఈవో వరకు చేరడంతో శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఎంపీడీవో, ఎంపీపీల మధ్య రగడ ఏమిటి? కొట్లాట ఎందుకు.. డబ్బుల పంపిణీల తేడాలొచ్చి తన్నుకున్నారా? ఆ వ్యవహారం వెనుక ఏం జరిగిందన్న అంశాలను సీఈవో దర్యాప్తు చేసినట్లు తెలిసింది. వాటాల్లో తేడాలే తన్నులాటకు దారి తీసిందా? ఇదిలా ఉండగా ఎంపీపీ, ఎంపీడీవోల మధ్య డబ్బుల పంపకాల్లో వచ్చిన పొరపొచ్చాలు ఏకంగా కొట్లాటకు దారి తీసిందని స్థానికంగా విషయం తెలిసిన ఉద్యోగులు అంటున్నారు. మొత్తం పది లక్షలు ఎంపీడీవో ఒక్కరే మింగేయడంతో ఎంపీపీకి ఆగ్రహం వచ్చి అప్పటికే కేసులో ఇరుక్కున్న ఆఫీస్ సబార్డినేట్ శ్రీనివాస్ను రెచ్చగొట్టి ఎంపీడీవో మీద దాడికి పురిగొల్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మన్యం ఎంపీడీవో ఆఫీసులో ‘పెది’్ద తరహా కుస్తీ సీన్లు జరుగుతున్నాయని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. -
సమస్యల పరిష్కారానికి వినతి
● డీఎఫ్ఓకు అగ్నిమాపక సంఘం విన్నపం విజయనగరం క్రైమ్: అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సాయిరాజేష్ను విజయనగరం ఉమ్మడి జిల్లా అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు విజయనగరం అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఇటీవల జిల్లాలో పునః ప్రారంభించిన సిబ్బంది ముఖ హాజరు వల్ల తలెత్తే సమస్యలను డీఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లినట్టు అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అధికారి రమేష్ తెలిపారు. తమ శాఖలో సిబ్బంది కొరత వల్ల 24 గంటలూ విధుల్లో ఉంటున్నామని, అగ్ని ప్రమాదాలు రెస్క్యూ, అవుట్ డ్యూటీలు, బందోబస్తు, వీఐపీ కాన్వాయ్ ఇతర విధుల నిమిత్తం బయటకు వెళ్లే పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ప్రతీ కేంద్రంలో సిబ్బంది కొరత ఉందని, విధుల్లో కాస్త సడలింపు ఇవ్వాలని డీఎఫ్ఓను కోరామని తెలిపారు. తమ సమస్యలపై డీఎఫ్ఓ సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి వి.కృష్ణమోహన్, ఉపాధ్యక్షుడు డి.ప్రకాష్, కోశాధికారి జి.ఆదినారాయణ, సలహాదారుడు ఎల్.ఉమామహేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఎస్కే జగదీష్, కేంద్ర ప్రతినిధులు, పలు కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. సాక్షి, గజపతినగరం సెల్ : 90102 04447 -
సర్వజన ఆస్పత్రి పరిశీలన
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్డీఎస్) సభ్యులు డాక్టర్ జయచంద్రనాయుడు, అనురాధ బేగం, ఇమంది సుధీర్ మంగళవారం ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. ఓపీ విభాగాలను, క్యాజువాలటీ, ఐసీయూ, హోమియో, యునాని, నేచురోపతి విభాగాలను పరిశీలించారు. వైద్యులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆస్పత్రి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకిచ్చిన హామీలు అమలు చేయాలి ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు విజయనగరం గంటస్తంభం: విద్యార్థులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో జూలై 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయం అమర్ భవన్లో శిక్షణా తరగతుల కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ విద్యార్థులకు ఇబ్బందిగా మారిన జీవో నెం.77ను రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం విద్యను బలోపేతం చేయకుండా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రోత్సహిస్తోందన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి విద్యా దోపిడిని అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం, ఉపాధ్యక్షుడు సుమన్, సహాయ కార్యదర్మి గౌరీశంకర్, పట్టణ నాయకులు చరణ్, గణేష్ పాల్గొన్నారు. -
బతుకు నేర్పిన.. బామ్మలు
విజయనగరం గంటస్తంభం: నేటి సమాజంలో పాతికేళ్లు కూడా నిండని యువకులు తమ చిన్నచిన్న అవసరాల కోసం తల్లిదండ్రుల వైపు చూస్తున్నారు. చేతిలో పనిఉన్నా చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇంకొందరు జీవిత పోరాటానికి దూరంగా ఉండి సులభమైన మార్గాల కోసం వెతుకుతున్నారు. ఆ కోవలో తప్పుదారి పడుతూ అప్పులపాలవుతున్నారు. మరికొందరు ఈజీ మనీకోసం తప్పుదారి పడుతున్నారు. బతుకులను దుర్భరం చేసుకుంటున్నారు. అలాంటి వారందరికీ వయసు పైబడినా ఆత్మగౌరవాన్ని ఏమాత్రం కోల్పోకుండా చెమటోడ్చి బతుకుతున్న ఈ బామ్మలే నిలువెత్తు స్ఫూర్తి. వయస్సు 70 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్నా, శరీరం ముడతల పడినా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విజయనగరం పట్టణంలో చిరు వ్యాపారులు చేస్తూ తమ సంపాదన తమదే అని నిరూపిస్తున్నారు. ఒకరికి పెట్టేచేతులే కాని చాచే చేతులు కావని చెబుతున్నారు. ప్రతిరోజూ వచ్చిన కొద్ది సంపాదనే తమకు రూ.కోట్లతో సమానమని గర్వపడుతున్నారు. చేయి చాచడం కంటే పని చేయడం మేలు... ఒకప్పుడు కుటుంబ సభ్యులందరికీ వండి పెట్టిన చేతులు ఇవి. పిల్లలను పెంచి పెద్ద చేసి, బంధువులు, అతిథులకు ఆతిథ్యం ఇచ్చిన గౌరవం మాది. అలాంటి చేతులు ఇప్పుడు తమ అవసరాల కోసం ఎవరిముందూ చాచడానికి సిద్ధంగా లేవు. వయసు పెరిగిందనే కారణంతో ఇతరులపై ఆధారపడాలని భావించడం లేదు. తమకు చేతనైనంత వరకు నిజాయితీగా కష్టపడి సంపాదించి తినడమే గౌరవమని నమ్ముతున్నారు. సమాజం నుంచి జాలి కోరడం కాదు. తమ శ్రమకు తగిన గౌరవం కోరుతున్నారు. మా వయసు కాదు... మాధైర్యం చూడండి.. వీరిలో ప్రతి ఒక్కరి జీవితం ఒక పాఠం. ప్రతి అడుగు ఒక సందేశం. ప్రతి చెమట చుక్క ఆత్మగౌరవానికి ప్రతీక. ఎండను లెక్కచేయకుండా రోడ్డుపక్కన కూర్చుని సరుకులు అమ్ముకుంటున్న వీరిని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఈ వయసులో ఎందుకమ్మా ఈ కష్టం అని అడుగుతుంటారు. అప్పుడు వారి సమాధానం జీవితానికి అర్ధం చెప్పేలా ఉంటుంది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు, కాలక్షేపాలతో రోజులు గడిపే యువతకు ఈ బామ్మలు నిశ్శబ్ద సందేశం ఇస్తున్నారు. పని చిన్నది కాదు.. వయసు అడ్డంకి కాదు.. ఆత్మగౌరవమే అసలు సంపద అని చేతలతో చెబుతున్నారు. కష్టపడే మనిషికి వయసుతో సంబంధం లేదని, గౌరవంగా బతకాలనే సంకల్పం ఉంటే పరిస్థితులు కూడా ఓడిపోతాయని నిరూపిస్తున్నారుసంకల్పానికి సలాం చేయాల్సిందే.. ఎండలు మండుతున్నా, ఒంట్లో ఓపిక లేకపోయినా ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోను. నా ముఖం మీద ముడతలు నా వయసునే చూసిస్తాయి కానీ మనసులోని కష్టపడే తత్వాన్ని కాదు. ఎవరి ముందైనా తలవంచి నిలబడడం కంటే, ఇలా రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటూ గౌరవంగా బతకడమే ఇష్టం. – జాగులు రాములమ్మ(73), గుణపూరుపేట ఈ చేతులు శ్రమిస్తాయే కానీ సాయం కోసం చాచవు ఈ చేతులు ఒకప్పుడు ఎందరికో అన్నం పెట్టాయి నాయనా... ఇప్పుడు నా ఒక్కదాని కడుపు నింపుకోలేనా.. చేతిలో కర్ర పట్టుకున్నా బతుకుపోరాటంలో వెనకడుగు వేయను. ఎవరి ముందైనా చేయిచాచి యాచించడం కంటే, ఈ మల్లెపూలు, తమలపాకులు అమ్ముకుంటూ వచ్చే పది రూపాయల సంపాదనతోనే నా ఆత్మగౌరవం నిలుస్తోంది. – సోము ఆదిమ్మ(75), కోరాడ వీధి, విజయనగరం ముడతలు పడిన చర్మం.. మురిసిపోయే ఆత్మాభిమానం కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. అందుకే ఈ వయసులోనూ రోడ్డు పక్కన చిన్న దుకాణం పెట్టుకున్నా. నా పిల్లలను, కుటుంబాన్ని నేనే రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేశా. ఈ చివరి రోజుల్లో ఎవరికీ భారం కాకూడదన్నదే నా కోరిక. నా కష్టార్జితంతో తినే బువ్వే నాకు కొండంత తృప్తిని ఇస్తుంది. – గోక అప్పయ్యమ్మ(78), ఎల్బీకాలనీ, విజయనగరం -
అర్హత ఉన్నా డీఎస్సీలో పోస్టు రాలేదు
విజయనగరం అర్బన్: నిబంధనల ప్రకారం డీఎస్సీ–2025లో దరఖాస్తు చేసుకుని మెరిట్లో నిలిచిన అభ్యర్థులను నట్టేట ముంచేశారని, అదే తప్పుడు సమాచారంతో వ్యవస్థను మోసం చేసేవారికి రెడ్కార్పెట్ పరిచి ఉద్యోగం ఇచ్చారంటూ విజయనగరం జిల్లాకు చెందిన డీఎస్సీ అభ్యర్థి నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పీఈటీ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలతో పోస్టుకు దూరమయ్యాయని వాపోయారు. ఆయన ఏమన్నారంటే... ‘‘విజయనగరం జిల్లాలో స్పోర్ట్స్ కోటా కింద కేవలం ఒకే ఒక్క పీఈటీ పోస్టు ఉంది. ఈ పోస్టు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ రేసులో ముందు వరుసలో ఓ యువతి, నేను ఉన్నాం. వెయిట్లిఫ్టింగ్ క్రీడాంశంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన ట్రాక్ రికార్డు ఉండడంతో ఆ యువతికి పోస్టు దక్కింది. అయితే, ఇక్కడ ఒక పెద్ద అక్రమమే చోటుచేసుకుంది. ఆమెది పాఠశాల రికార్డు ప్రకారం పుట్టిన తేదీ 1992 సెప్టెంబర్ 20. పోటీలకు సరిపోయేందుకు సృష్టించిన తప్పుడు పుట్టిన రోజు 1992 మార్చి 10. పాఠశాల విద్య రికార్డుల్లో ఉన్న అసలు పుట్టిన రోజు ప్రకారం చూస్తే... ఆమె పాల్గొన్న సదరు జాతీయ, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఆమెకు అసలు వయస్సే సరిపోదు (అర్హత లేదు). ఆ పోటీల్లో పాల్గొనేందుకు వీలుగా వయసును మార్చుతూ పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని సృష్టించారు. ఆ తప్పుడు పత్రంతోనే రిజ్రస్టేషన్ చేయించుకుని పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఇప్పుడు అవే పతకాలను చూపి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీలో పీఈటీ కొలువును దక్కించుకున్నారు. ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్... స్పోర్ట్స్ సర్టిఫికెట్లలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్పై స్పష్టమైన ఆధారాలతో సహా డీఎస్సీ నిర్వహణ ఉన్నతాధికారులకు, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను. కానీ లాభం లేకుండా పోయింది. దానిపై ఎలాంటి విచారణ చేయలేదు. వేర్వేరు పుట్టిన రోజులతో ఎలా చలామణి అవుతుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కనీసం ఆ పత్రాన్ని పరిశీలించే ప్రయత్నం కూడా ఏ స్థాయిలోనూ చేయలేదు. ఆమె తప్పుడు పత్రాలతో పతకాలు కొట్టి, ఆ అర్హతతోనే డీఎస్సీ పోస్టుకు ఎంపికైంది. దీంతో తర్వాత స్థానంలో ఉన్న నాకు పోస్టు దూరమైంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పేందుకు నాకు జరిగిన నష్టమే నిదర్శనం’’ అని నరసయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డీఎస్సీ అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం» వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ వెల్లడి» డీఎస్సీ– 2025లో ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలి» కృష్ణా జిల్లా టాపర్ నవీన్ ఉద్యోగం పొందకపోవడం వెనుక కారణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి» డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు స్పందించడం లేదు?» ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి విమర్శలు చేయించడం తగదుసాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేయాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటి నిర్ణయించింది. అక్రమాలపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని నిర్ణయించింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన డీఎస్సీ పోరాట కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ–2025 పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారంలో చోటుచేసుకున్న అనేక అవకతవకలపై విస్తృతంగా చర్చించారు. డీఎస్సీలో అక్రమాల కారణంగా నష్టపోయిన అభ్యర్థుల తరపున న్యాయ పోరాటం కొనసాగించాలని, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తి, దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని నిర్ణయించారు. బాధిత అభ్యర్థులతో త్వరలోనే మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎందుకు స్పందించడం లేదని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి మించిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. ఎస్సీఈఆర్టీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నవీన్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి కృష్ణా జిల్లా టాపర్గా నిలవడం, అయినా డీఎస్సీలో ఉద్యోగం పొందకపోవడం వెనుక కారణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఫలితాలపై 30 వేలకుపైగా గ్రీవెన్సులు వచ్చినప్పటికీ, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తున్న బాధిత అభ్యర్థులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొందరు ఉన్నతాధికారులు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఇప్పటికే పదుల సంఖ్యలో కోర్టులో రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి, డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయించడం కూడా ప్రజాస్వామ్య విరుద్ధ చర్యేనని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. డీఎస్సీ– 2025లో వెలుగులోకి వచ్చిన ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.నా ఉద్యోగం వేరే వాళ్లకు ఎలా కేటాయించారు ? » మార్కాపురం జిల్లా పాతచెరువు తండాకు చెందిన క్రాంతి » ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్లో » అర్హత ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు » న్యాయం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు వినతి యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తూనే ఉంది. మెగా డీఎస్సీ–2025లో ఉమెన్స్ కోటాలో అర్హత ఉన్నప్పటికీ ఓ ఎస్టీ మహిళకు పోస్టు దక్కలేదు. ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్లో తనకు దక్కాల్సిన పోస్టు ఇతరులకు ఏ విధంగా కేటాయించారని మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలంలోని పాతచెరువు తండాకు చెందిన మూడ క్రాంతి ప్రశ్నిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు మెయిల్ ద్వారా శనివారం వినతి పత్రం పంపింది. అందులో.. ‘‘నేను డీఎస్సీ–25లో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్స్) పోస్టుకు ప్రకాశం జిల్లాలో ఎస్టీ (ఉమెన్) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నాను. ఏపీ మెగా డీఎస్సీ ప్రకారం మహిళల రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ రూపంలో అమలు చేయాల్సి ఉంది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్స్)గా ఎస్టీ కేటగిరిలో 5 పోస్టులు కేటాయించినా ఎస్టీ ఉమెన్ అభ్యర్థులకు తగిన విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలైందా? అనే అంశంపై సందేహం ఉంది. నేను ఎస్టీ ఉమెన్ కేటగిరీలో మెరిట్ జాబితాలో 2వ ర్యాంక్ సాధించినా నాకు ఉద్యోగం రాలేదు’’ అని పేర్కొంది. రోస్టర్, హారిజాంటల్ రిజర్వేషన్ అమలులో సరైన విధానం అనుసరించారో లేదో పరిశీలించాలని, ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమేటిక్) పోస్టులకు పూర్తి రోస్టర్ వివరాలు వెల్లడించాలని, ఎస్టీ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలును పరిశీలించి ఆ రోస్టర్ పాయింట్ల ప్రకారం తనకు న్యాయం చేయాలని క్రాంతి కోరింది. ప్రతి 100 రోస్టర్ సైకిల్లో ఎస్టీలకు మొత్తం 6 రోస్టర్ పాయింట్లు ఉంటాయని, వాటిలో 2 పాయింట్లు ఎస్టీ ఉమెన్గా గుర్తించబడ్డాయని క్రాంతి తెలిపారు. జిల్లాలో ఉన్న 92 పోస్టుల్లో 8, 58వ రోస్టర్ పాయింట్ ఎస్టీ ఉమెన్కు దక్కాల్సి ఉండగా 58వ పాయింట్(తనకు దక్కాల్సిన పోస్టు) ఓపెన్ కేటగిరీలో చేర్చి ఎస్టీ అభ్యరి్థకి పోస్టు ఇచ్చారని ఆమె తెలిపింది. -
విద్యార్థుల కలలకు లీకేజీ గండి
● నీట్ లీకేజీపై భగ్గుమన్న విదార్థులు ● ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం విజయనగరం గంటస్తంభం: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం విజయన గరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి బందెల నాసర్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి నీట్ పరీక్షకు సిద్ధమైతే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారి భవిష్యత్తు అని శ్చితిలో పడిందన్నారు. గతంలోనూ నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్మించారు. పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ పూర్తిగా విఫలమైందని, విద్యార్థుల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఎన్టీఏను రద్దు చేసి పారదర్శకమైన విధానంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్మి ఎన్.నాగభూషణం, ఉపాధ్యక్షుడు ఎ.సుమన్, సహాయ కార్యదర్మి పి.గౌరీశంకర్, జిల్లా నాయకులు వి.గణేష్, సత్యనారాయణ, చరణ్ తేజ, మాధవి, రాము, తదితరులు పాల్గొన్నారు. -
‘యోగాంధ్ర’ వేడుకలకు ఏర్పాట్లు
విజయనగరం అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026ను పురస్కరించుకొని జిల్లాలో ఈ నెల 21న చేపడుతున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 6.45 నుంచి 7.30 గంటల వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గ్రామ/వార్డు సచివాలయాల్లో యోగా శిక్షణా తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 14న 500 మంది ఉపాధి హామీ వేతనదారులతో ‘థిమేటిక్ యోగా’, 18, 20 తేదీల్లో రామనారాయణం, చింతపల్లి బీచ్ వద్ద 500 మందితో ‘టూరిజం యోగా’, జిల్లాలోని 6 ప్రముఖ దేవాలయాల్లో ‘టెంపుల్ యోగా’ ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం రాజీవ్ స్టేడియంలో మూడు వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలతో భారీ ఎత్తున ‘మెగా యోగా’ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 9న గ్రామస్థాయి, 10న మండల స్థాయి, 14న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తామని, విజేతలు ఈ నెల 18న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషధమని, జిల్లా ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో డిజిటల్ నమోదు చేసుకొని యోగాంధ్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. విలువ ఆధారిత ఉత్పత్తులతో ఆదాయం ● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: రైతులు పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి ఆదాయం పొందాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి–సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం కింద ఏర్పాటుచేసే యూనిట్లకు 10 శాతం అర్జీదారుడు పెట్టుబడితే బ్యాంకుల నుంచి మిగిలిన 90 శాతం రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. రూ.10 లక్షల విలువైన యూనిట్కు 35 శాతం వరకు రాయితీ అందుతుందన్నారు. 18 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి, కనీస విద్యార్హత కలిగిన వ్యక్తులు, సంఘాల సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో 547 యూనిట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. 1100 మంది చెరకు రైతులకు రూ.1.58 కోట్ల రుణం మంజూరు చేశామన్నారు. ఈ ఏడాది లక్ష్యానికి మించి యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళా సమాఖ్యలను ప్రోత్సహించాలన్నారు. సంఘాల వద్దకే అధికారులు వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఉద్యానశాఖాధికారి కె.చిట్టిబాబు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, మెప్మా పీడీ జి.వి.చిట్టిరాజు, తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ నియామక ప్రకటనలు నమ్మొద్దు
● కేంద్రీయ గిరిజన వర్సిటీ ఇన్చార్జి వీసీ శ్రీనివాసన్ విజయనగరం రూరల్: కేంద్రీయ విశ్వ విద్యాలయం పేరుతో సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ వేదికల్లో కొన్ని నకిలీ నియామక ప్రకటనలు, ఉద్యోగ అవకాశాల సమాచారంతో తప్పుడు సందేశాలు ప్రచారంలో ఉన్నట్లు విశ్వవిద్యాలయం దృష్టికి వచ్చిందని, నిరుద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్సిటీ ఇన్చార్జి వీసీ టి.శ్రీనివాసన్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఇటువంటి సమాచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అభ్యర్థులు నకిలీ ప్రకటనలు నమ్మొద్దని, తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలకు సంబంధించి ధ్రువపత్రాలు అందించవద్దని, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరపొద్దని ఆయన కోరారు. విశ్వవిద్యాలయం పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా వ్యక్తులు, సంస్థలు సంప్రదిస్తే వర్సిటీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయంలో జరిగే అన్ని నియామకాలు, ఉద్యోగ ప్రకటనల సమాచారం విశ్వ విద్యాలయం వెబ్సైట్లో అధికారికంగా జారీచేస్తామన్నారు. -
ఇదెక్కడి ఘోరమయ్యా...
మేము నిరుపేదలం... మా ఇల్లు చూడండి.. కూలి చేస్తేగానీ కడుపునిండదు.. మేము రాజకీయాలు చేయగలమా?.. మాపై వైఎస్సార్సీపీ సానుభూతిపరులమంటూ రాజకీయ ముద్రవేశారు. రోడ్డు పక్కన చిన్నస్థలంలో పూరిపాక వేసుకుని తొమ్మిదేళ్లుగా ఇద్దరు పిల్లలతో జీవిస్తుంటే ఇప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసి ఖాళీ చేయిస్తున్నారు. ఇది న్యాయమేనా.. ఇదెక్కడి ఘోరమయ్యా.. పేదలం ఎలా బతకాలయ్యా.. గూడుకు చోటుకూడా కరువేనా?.. ఇక్కడేమైనా ఆఫీసులు కడతారా?.. అంటూ బాధితురాలు ఎన్నికల సీత విలేకరుల ముందు వాపోయింది. తమ కష్టాల జీవనాన్ని చెబుతూ విలపించింది. నిరుపేద గిరిజన కుటుంబాన్ని గ్రామబహిష్కరణకు పూనుకోవడం సరికాదంటూ వాపోయింది. ఇప్పటికిప్పుడు ఎక్కడకు పోవాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు స్పందించి గూడు చూపాక ఖాళీచేయించాలంటూ ప్రాథేయపడింది. -
విచారణ జరుగుతోంది
విజయనగరం మండలంలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడినట్టు అందిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. రామభద్రపురంలో మేట్లు రూ.100 అడుగుతున్న అంశంపై కూడా విచారణకు ఆదేశించాం. వేతనదారుల్లో కూడా మార్పు రావాలి. పనిచేసిన దానికి సంబంధించి వేతనాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అలాంటిప్పుడు డబ్బులు తిరిగి ఎందుకు ఇవ్వాలని వేతనదారులు ప్రశ్నించాలి. అప్పుడే పూర్తి స్థాయిలో అక్రమాలకు అడ్డుకట్ట వేయగలం. – ఎస్.శారదాదేవి, పీడీ, డ్వామా● బినామీ మస్తర్లతో ఉపాధిహామీ నిధుల దోపిడీ ● అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు శూన్యం ● విచారణ పేరుతో సాగదీత ● అధికార బలంతో నిధుల కై ంకర్యం ● ముఖ ఆధారిత హాజరు ప్రవేశపెట్టినా ఆగని ఆక్రమాలు విజయనగరం ఫోర్ట్: పథకం ఏదైనా ‘అధికార’ బలంతో నిధులు కొల్లగొడుతున్నారు. జేబులు నింపుకుంటున్నారు. అవినీతి, అక్రమాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రెండేళ్లుగా ఉపాధిహామీ పథకంలో అక్రమాలు కో కొల్లలుగా కనిపిస్తున్నా చర్యలు శూన్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బినామీ మస్తర్లు వేసి వేతనదారుల నుంచి అక్రమవసూళ్లు, పనిచేయకుండానే చేసినట్టు రికార్డుల్లో ఏమార్చి నిధులు పెద్దమొత్తంలో కై ంక్యర్యం చేయడం పరిపాటిగా మారింది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న’ సామెత చందాన అధికార పార్టీ నాయకులు ఉపాధిహామీ నిధులతో దోచుకునే పనిలో పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరికి కొందరు అధికారులు సైతం సాయంచేస్తూ వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ ఆధారిత హాజరును తప్పనిరిసరి చేసినా వివిధ సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని నిధులు కాజేస్తుండడం ఉన్నతాధికారులను కలవరపెడుతోంది. ● పని కల్పించేందుకు చేయి తడపాల్సిందే... ఉపాధి హామీ పథకంలో పని అడిగిన ప్రతీ ఒక్కరికి పని కల్పిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, ఉపాధి హామీ పథకం మేట్ (మేసీ్త్ర)ల ద్వారా వేతనదారుల నుంచి పని కల్పించడానికి డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. మేట్లు అడిగినంత ఇవ్వకపోతే పని కల్పించమని చెప్పడంతో చేసేది లేక వేతనదారులు అడిగినంత ముట్టజెపుతున్నారు. చాలాచోట్ల ఒక్కో వేతనదారు నుంచి వారానికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే రేపటి నుంచి పని కావాలంటే ఇవ్వు.. లేదంటే మానేయ్ అన్న సమాధానమే వినిపిస్తోంది. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాచోట్ల పాత మేట్లను తొలగించి అధికారపార్టీకు అనుకూలంగా ఉన్నవారిని నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. ● సిబ్బంది సహకారంతోనే.. అధికార పార్టీ నాయకుల దోపిడీకి కొందరు ఉపాధిహామీ సిబ్బంది సహకరిస్తున్నట్టు సమాచారం. బినామీ మస్తర్లు వేయడం, వేతనదారుల ఖాతాల్లో జమైన డబ్బులను తిరిగి తీసుకుని కొందరు అధికారులు, పాలకులు పంచుకుంటున్నారన్న చర్చ జిల్లాలో జోరందుకుంది. అధికార పార్టీ వారు కావడంతో చేసేది లేక ఉపాధి హామీ సిబ్బంది కూడా తలాడిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులకు మస్తర్లు వేయాలని కొన్నిచోట్ల ఒత్తిడి వస్తున్నట్టు డ్వామాకు చెందిన ఓ అధికారి సైతం చెప్పడం గమనార్హం. రామభద్రపురం మండలంలో ఉపాధి పని కల్పించడానికి మేట్లు వారానికి ఒక్కో వేతనదారుడి నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నట్టు ఆరోప ణలు ఉన్నాయి. విచారణలో అంతా సక్రమమే అంటూ అధికారులు తేల్చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం మండలంలో కూడా మస్తర్ వేయడానికి ఒక్కో వేతనదారుడు నుంచి వారానికి రూ.100 చొప్పన వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఒక ఏపీఓ రూ.58 లక్షల వరకు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో అతనిపై విచారణకు ఆ శాఖ అధికారులు ఆదేశించారు. రెండేళ్లవుతున్నా ఆయనపై చర్యలు లేవు. విచారణ సా...గుతూనే ఉండడంపై ఆ శాఖలోనే చర్చసాగుతోంది. విజయనగరం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో సుమారుగా రూ.2 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ఉపాధి హామీ ఉన్నతాధికారులకు ఎంపీపీ మామిడి అప్పలనాయుడు ఫిర్యాదు చేశారు. సుమారు 8 నెలలు అవుతున్నా చర్యలు శూన్యం. -
జిందాల్ భూముల పరిశీలన
శృంగవరపుకోట: మండలంలో ఎంఎస్ఎంఈ పార్కుకు ప్రతిపాదించిన జిందాల్ భూములను శనివారం ఏపీఐఐసీసీ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్కుమార్, జెడ్ఎం కృష్ణప్రసాద్తో కలిసి పరిశీలించారు. జిందాల్ భూముల వెనుకున్న ట్రస్టు గురించి ఆరా తీయగా అది పార్కు బయట ఉందని స్థానిక అధికారులు చెప్పారు. మాస్టర్ప్రింట్లో ముందుగా 150 ఎకరాలు మార్కింగ్ చేయాలని సూచించారు. భూ విస్తరణ, నీటి వనరుల లభ్యత, తాటిపూడి రిజర్వాయర్ ఎంత దూరంలో ఉంది వంటి వివరాలపై ఆరా తీశారు. జిందాల్ ప్రతినిధులు విక్టర్, శివారెడ్డిలు మోడల్ ప్రాజెక్టు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఫస్ట్ఫేజ్లో 550ఎకరాలు అభివృద్ధి చేశామని, ఇప్పటికే రోడ్లు, కాలువలు, ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశామన్నారు. 540ఎకరాలు, మరో ప్యాచ్లో 160 ఎకరాలు మొత్తంగా 700 ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించామని, ఐదు ప్రాంతాల్లో మొత్తం జిందాల్ భూములు 1166 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. తహసీల్దార్ డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిపాదిత ఎంఎస్ఎంఈ పార్కుకు ఒకవైపు 516బి విశాఖ–అరుకు హైవే, మరోవైపు 516ఇ విజయనగరం–అరుకు హైవేలు ఉన్నాయని చెప్పారు. తిరిగివెళ్తున్న సమయంలో ఎం.డి.దినేష్కుమార్ సీఎం ప్రొగ్రాం ఎప్పుడు ఫిక్స్ చేశారని అడగ్గా, జిందాల్ ప్రతినిధి విక్టర్ స్పందిస్తూ ‘సార్ వస్తామన్నారు. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు’ అంటూ బదులిచ్చారు. ఈ నెల మూడవ వారంలో ముఖ్యమంత్రి జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు భూమిపూజ చేసేందుకు వస్తారని రెవెన్యూ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో పార్క్ భూములు ఎలా ఉన్నాయి.. ఎక్కడున్నాయి.. ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న వ్యూహరచన కోసమే అధికారుల పరిశీలనల హడావిడి అన్న ప్రచారం సాగుతోంది. ఏడాది గోడు గాలికేనా? ఏడాది కాలంగా జిందాల్ నిర్వాసితులు చేస్తున్న పోరాటాలు, వారి గోడు గాలికేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జిందాల్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానంటూ రాష్ట్రహోంమంత్రి వంగలపూడి అనిత ఇచ్చిన హామీ మట్టిలో కలిసిపోయినట్టేనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇటీవల ఇచ్చిన భరోసా కూడా నీటిమూటగానే మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్వాసితులను ఆదుకునే పరిస్థితి కనిపించడంలేదన్న వాదన వినిపిస్తోంది. -
రాజుల పాలనలో పేదలకు కష్టాలు
బొబ్బిలిరూరల్: బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల పైత్యం పెచ్చుమీరుతోంది. మూడుపూటలూ తిండికి లేక, నిస్సహాయులైన నిరుపేద గిరిజన కుటుంబాలపై జలుం ప్రదర్శిస్తున్నారు. రాజకీయ కక్షతో ఏళ్లతరబడి నివాసముంటున్న పూరిపాకలను ఖాళీ చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇటీవల బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో పూజారి రాపాక జోగినాయుడు కుటుంబం పంచాయతీ స్థలంలో నివసిస్తోందంటూ గెంటే యత్నం చేయగా, ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా కాశిందొరవలస పంచాయతీ డొంగురువలసలో అలాంటి దుశ్చర్యకు మళ్లీ పూనుకున్నారు. గ్రామంలో గెడ్డ పోరంబోకు స్థలంలో చిన్న పూరిపాకను వేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న ఎన్నికల కళ్యాణ్, సీతపై వైఎస్సార్సీపీ సానుభూతిపరులన్న ముద్రవేసి కక్షసాధింపులకు దిగారు. గెడ్డపోరంబోకు స్థలంలో అక్రమంగా పూరిపాక వేసుకున్నారని, దానిని తొలగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశా రు. చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ నేతతో ఒత్తిడి చేయించారు. ఆర్డీఓ ఆక్రమణను సీరియస్గా తీసుకుని వెంటనే ఇల్లు ఖాళీ చేయించాలని, వారికి నోటీసులు పంపాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఆ మేరకు శనివారం ఆర్ఐ రామకుమార్, వీఆర్వో సుధాకర్, పోలీసులు అక్కడకు చేరుకుని పూరిపాకను తొలగించాలంటూ నిరుపేదకుటుంబానికి నోటీసులిచ్చారు. రెండు రోజుల్లో ఖాళీ చేయకుంటే తామే పూరిల్లును కూల్చేస్తామని, బలవంతంగానైనా ఖాళీ చేయిస్తామని కళ్యాణ్ భార్య సీతకు నోటీసులిచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమయం ఇవ్వలేమని, వెంటనే ఖాళీ చేయాల్సిందేనని హుకుంజారీచేశారు. దీంతో బాధిత కుటుంబం గగ్గోలుపెడుతోంది. ఉన్నఫలంగా ఎక్కడ తలదాచుకోవాలో తెలియక తల్లడిల్లుతోంది. అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం, ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన టీడీపీ నేతలు... ఇప్పుడు పేదలపై ప్రతాపం చూపుతున్నారని, సభ్యసమాజం తలదించుకునే పనులకు పూనుకుంటున్నారంటూ గ్రామస్తులు పలువురు విమర్శిస్తున్నారు. రోడ్డుపక్కన చాలా పూరిపాకలు, పశువుల శాలలు ఉండగా కేవలం గిరిజన కుటుంబం పూరిపాకనే ఖాళీ చేయాలని ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొబ్బిలిలో అరాచక పాలన.. బొబ్బిలిలో రెండేళ్లుగా అరాచక పాలన సాగుతోంది. అధికార బలంతో పదవులను లాక్కోవడమే కాదు పేద గిరిజనులు సాగుచేస్తున్న భూములను దౌర్జన్యంగా కాజేస్తున్నారు. వారి ఇళ్లను కూలదోస్తున్నారు. పథకాలు అందకుండా చేస్తున్నారు. రాజరికం కాదు మాది రాక్షసపాలన అంటూ చేతల్లో చూపిస్తుండడంపై బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. పేదలను ఆదుకోవాల్సిన చేతులు కష్టాలపాలచేస్తుండడంపై జనం మండిపడుతున్నారు. కోటలు చూసి మురిసిపోవడం కాదని... పేదల కష్టాలు చూడాలని, వారిపై కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని హితవుపలుకుతున్నారు. వీరు పూర్వీకుల వలే రాజులు కాదు.. రాక్షసులంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి నిలువ నీడలేకుండా గెంటే యత్నం పూరిపాకను కూల్చివేయాలని కలెక్టర్కు ఫిర్యాదు రెవెన్యూ అధికారుల నోటీసుతో ఆందోళనలో గిరిజన కుటుంబం తిండికి లేనివారం రాజకీయాలు చేయగలమా అంటూ నిట్టూర్పు ఆదుకోవాలంటూ వేడుకోలు డొంగురువలసలో పూరిపాక ఖాళీచేయాలని గిరిజనురాలిని హెచ్చరిస్తున్న ఆర్ఐ రామకుమార్, సిబ్బంది -
అక్కడ రూ.21,500.. ఇక్కడ రూ.15 వేలు..
● సర్వజన ఆస్పత్రి ఈసీజీ టెక్నీషియన్ల ఆవేదన ● మిగతా జిల్లాలో కంటే వీరికి తక్కువ జీతం చెల్లిస్తున్న వైద్యాధికారులు ● ప్రతినెలా రూ.6,500 చొప్పున నష్టపోయే పరిస్థితి విజయనగరం ఫోర్ట్: రోగుల గుండెలో ఉన్న లోపాలను ఈసీజీ తీసి నిర్ధారించే టెక్నీషియన్లను వేతన వ్యత్యాసం ఆవేదన కలిగిస్తోంది. వారి వేతన కష్టాలు తీర్చే నాథుడే కరువయ్యాడు. న్యాయం చేయాలంటూ ఆస్పత్రి అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం శూన్యమే. రాష్ట్రంలోని మిగతా జిల్లాలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఈసీజీ టెక్నీషియన్లు అందరికీ ఒకలా జీతం వస్తే, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఆస్పత్రి పరిధిలోని ఘోషా ఆస్పత్రిలో పనిచేసే ఈసీజీ టెక్నీషియన్లకు మాత్రం మరోలా జీతం రావడం గమనార్హం. వాస్తవంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఈసీజీ టెక్నీషియన్లకు రూ.21,500 జీతం చెల్లించాలి. రాష్ట్రంలో విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోను రూ.21,500 చెల్లిస్తున్నారు. ప్రభుత్వ సర్వజన, ఘోషాస్పత్రిల్లో పనిచేస్తున్న ఈసీజీ టెక్నీషియన్లకు మాత్రం రూ.15 వేలు చెల్లిస్తున్నారు. నెలకు రూ.6,500 చొప్పున ఏడాదికి రూ.78వేలు నష్టపోతున్నారు. దీనిపై ఆస్పత్రి అధికారులను ప్రశ్నించినా ఫలితం కనిపించడం లేదు. ప్రతిపాదనలు పంపించాం ఈసీజీ టెక్నీషియన్లకు మిగతా జిల్లాలో కంటే తక్కువ జీతం వస్తున్నమాట వాస్తవమే. వీరికి కూడా రూ.21,500 జీతం చెల్లించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే వీరికి కూడా వేతనం పెరుగుతుంది. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
స్కూల్ బస్సులపై కొరడా..!
● జిల్లాలో 518 స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు ● 90 బస్సుల్లో లోపాల గుర్తింపు..నోటీసులు జారీ ● స్కూల్స్ తెరుచుకునేలోపు ప్రతి బస్సుపై నిఘాపిల్లల ప్రాణాలపై ప్రయోగాలు వద్దు స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్వషర్, ఎమర్జెన్సీ డోర్, సురక్షిత సీట్లు, సరైన బ్రేక్ వ్యవస్థ, అనుభవజ్ఞులైన డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని తల్లిదండ్రులు సూచిస్తున్నారు. కేవలం పత్రాల పరిశీలనతో సరిపెట్టకుండా వాహనం రోడ్డుపై ఎలా పనిచేస్తోందో కూడా పరీక్షించాలని కోరుతున్నారు.తూతూ మంత్రం తనిఖీలు వద్దంటున్న తల్లిదండ్రులు: గతంలో కొన్ని సందర్భాల్లో తనిఖీలు కేవలం నామమాత్రంగా జరిగాయనే విమర్శలు వినిపించాయి. ఈసారి మాత్రం ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పేపర్ మీద సర్టిఫికెట్ ఇచ్చేయడం కాకుండా బస్సు నిజంగా సురక్షితమా కాదా అనేది చూడాలని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. -
ఫిజియో టీ20 లీగ్ విజేత ’హంగ్రీ చీతాస్’
● మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పార్వతీపురం వైద్యుడు ఉమాకాంత్ పార్వతీపురం రూరల్: ఆంధ్ర ఫిజియో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుంటూరులోని డీఎస్ఏ, ఎంఎస్కే మైదానాల్లో ఐదు రోజుల పాటు జరిగిన ’ఆంధ్ర ఫిజియో క్రికెట్ లీగ్ టీ20 (సీజన్–1)’లో గుంటూరుకు చెందిన హంగ్రీ చీతాస్ జట్టు విజేతగా నిలిచింది. రెండు రాష్ట్రాలకు చెందిన పది ఫిజియోథెరపీ డాక్టర్ల జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో 33 బంతుల్లో 59 పరుగులు చేసిన హంగ్రీ చీతాస్ ఆటగాడు, పార్వతీపురం వాసి డాక్టర్ జీరు ఉమాకాంత్ రెడ్డి ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యారు. ఈయన పార్వతీపురం జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్యాధికారి డాక్టర్ జీరు నగేష్ రెడ్డి చిన్న కుమారుడు. గతంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పలు క్రికెట్ పోటీల్లో పాల్గొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించారు. టోర్నీకి స్పాన్సర్లుగా వ్యవహరించిన గుంటూరు చంద్ర హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రవితేజ చేతుల మీదుగా విజేత జట్టుకు ట్రోఫీ, నగదు బహుమతి అందజేశారు. -
పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులివ్వండి
● ఏపీఐఐసీ అధికారులకు ఎం.డి దినేష్ కుమార్ ఆదేశాలు బొబ్బిలి: స్థానిక గ్రోత్సెంటర్లోని భూములను ఏపీఐఐసీ ఎం.డి దినేష్ కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామమోహన రావు, ఏపీఐఐసీ అధికారులతో ఆయన మాట్లాడుతూ ఎన్ని పరిశ్రమలున్నాయి? ఎంతమందికి భూములు కేటాయించారన్న వివరాలను నోట్ ద్వారా తెలుసుకున్నారు. అనంతరం భూములను తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఆర్వీఆర్ పరిశ్రమలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ ఏపీఐఐసీకి సంబంధించి ఎవరూ ఉండడం లేదని, సమస్యలు తెలుపుకునేందుకు శ్రీకాకుళం, విజయనగరం వెళ్లాల్సి వస్తోందని పారిశ్రామిక వేత్తలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాగే నీరు, విద్యుత్ సమస్య ఉందని వాపోయారు. వెంటనే ఆర్డీఓ రామమోహన రావుతో ఎం.డి మాట్లాడుతూ ఇక్కడ తహసీల్దార్ స్థాయి అధికారిని స్పెషలాఫీసర్గా నియించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా వచ్చి అలా వెళ్లపోతారా? ఏపీఐఐసీ ఎం.డి లాంటి అధికారి ఎన్నో సమస్యలున్న గ్రోత్ సెంటర్కు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకర రావు, మండల కార్యదర్శి సింగిరెడ్డి గోపాలం విమర్శించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ స్థానిక గ్రోత్సెంటర్లో కార్మికులకు తాగునీరు లేక, పరిశ్రమలకు విద్యుత్, నీటి వసతి, రోడ్లు లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఎవరిని కలిసి వినతిపత్రం ఇద్దామన్నా ఎవరూ లేని పరిస్థితుల్లో ఎం.డి వచ్చి వెంటనే వెళ్లిపోవడం, కనీసం మీడియాకు కూడా సమాచారం లేకపోవడం దారుణమన్నారు. -
ప్రారంభ దశలో గుర్తిస్తే నియంత్రణ సాధ్యం:
ఫైలేరియా వ్యాధి ఒక రోజులో వచ్చేది కాదు. దీని ప్రభావం కొన్ని సంవత్సరాల తరువాత కనిపిస్తుంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే నియంత్రించడం సాధ్యమవుతుంది. ప్రజలు ఇంటి ముందు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వైద్య సిబ్బంది పంపిణీ చేసే ఫైలేరియా నియంత్రణ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి. ఒమ్మితో పాటు అన్ని గ్రామాల్లోనూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. –డాక్టర్ అనిల్కుమార్, వైద్యాధికారి, సతివాడ పీహెచ్సీ -
అమ్మో ఫైలేరియా..!
● చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి ● 45 గ్రామాల్లో మొత్తం 169 మంది బాధితులు ● ఒక్క ఒమ్మి గ్రామంలోనే 69 కేసులు ● ప్రజల్లో కొరవడిన అవగాహన నెల్లిమర్ల రూరల్: ఒకప్పుడు అరుదుగా కనిపించే ఫైలేరియా వ్యాధి ఇప్పుడు నెల్లిమర్ల మండలంలో ఆందోళన కలిగించే స్థాయిలో కొనసాగుతోంది. వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం మండలంలోని 45 గ్రామాల్లో ప్రస్తుతం 169 మంది ఫైలేరియా బాధితులు ఉన్నారు. ముఖ్యంగా ఒమ్మి గ్రామంలోనే 69 మంది బాధితులు ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రజారోగ్య వ్యవస్థతో పాటు గ్రామీణ పారిశుద్ధ్య పరిస్థితులపై ఈ గణాంకాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రెండు పీహెచ్సీల పరిధిలో బాధితులు ఇలా మండలంలో రెండు పీహెచ్సీలు ఉండగా..సతివాడ పీహెచ్సీ పరిధిలోని 31 గ్రామాల్లో 149 ఫైలేరియా కేసులు ప్రస్తుతం ఉన్నాయి. అందులో ఒమ్మిలో అత్యధికంగా 69 మంది బాధితులుండగా, సతివాడలో 21 మంది, మిగిలిన 28 గ్రామాల్లో 59 మంది బాధితులు ఉన్నారు. కొండవెలగాడ పీహెచ్సీ పరిధిలోని 15 గ్రామాల్లో మరో 20 కేసులు ఉన్నాయి. అందులో కొండవెలగాడలోనే 11 మంది బాధితులు ఉండడం గమనార్హం. ప్రజల్లో కొరవడిన అవగాహన ఫైలేరియా దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వ్యాధి శరీరంలోని లింఫ్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. మొదట్లో సాధారణ జ్వరం, వాపు వంటి లక్షణాలు కనిపించినా, క్రమంగా కాళ్లు, చేతులు లేదా ఇతర అవయవాలు అసాధారణంగా వాపుగా మారతాయి. వ్యాధి తీవ్రమైతే బాధితులు జీవితాంతం శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇన్ని కేసులు ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం అవగాహన కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగానే పారిశుద్ధ్య పనులు గ్రామాల్లో తూతూమంత్రంగానే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారనే విమర్శలు ప్రజల నుంచే వినిపించడం గమనార్హం. వాస్తవానికి ఎక్కడా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. ఫాగింగ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆ విధానం అమలు కావడం లేదు. కొన్ని గ్రామాల్లో తాగునీటి పైపు లైన్ల వద్ద లీకులను అరికట్టకపోవడంతో ఆ నీరే మురుగుగా మారే పరిస్థితి ఉంది. ప్రజల సహకారం కూడా లేకపోవడం వ్యాధి వ్యాప్తికి మరో కారణంగా తెలుస్తోంది. ఎక్కడబడితే అక్కడ చెత్త వేయడం, కాలువలను ఆక్రమించి భవనాలు కట్టడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో దోమల సంతతి పెరిగి రోగాలకు కారణమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజల నిర్లక్ష్యం కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని అధికారులు చెబుతున్నారు. ఎంపీపీ చొరవతో ప్రైవేట్ కంపెనీ సేవలు: ఒమ్మి గ్రామంలో వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతో ఎంపీపీ అంబళ్ల సుధారాణి, ఏంఎసీ మాజీ చైర్మన్ శ్రీరాములు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. జర్మనీకి చెందిన కంపెనీ ప్రతినిధులను సంప్రదించడంతో వారు మూడేళ్లుగా గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు కూడా గతంలో వ్యాధి తీవ్రతపై ఎన్నో అధ్యయనాలు చేశారు. దోమ తెరలు, దోమలను ఆకర్షించే అధునాతన బుట్టలు ఇంటింటీకీ పంపిణీ చేశారు. కాలువల వద్ద దోమల నియంత్రణకు ఫాగింగ్ చర్యలు కొంత కాలం పాటు నిర్వహించారు. కలెక్టరేట్లో ఫిర్యాదుతో ఫైలేరియా పరీక్షలు: ఇటీవల ఒమ్మి గ్రామానికి చెందిన పలువురు.. ఫైలేరియా వ్యాధి విజృంభణపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉందని, ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఉన్నతాధికారుల స్పందనతో ఎన్ఎఫ్సీపీ యూనిట్ జిల్లా అర్బన్ రూరల్ బృందాలు ముమ్మరంగా రక్త నమూనాల సేకరణ చేపట్టారు. సుమారు 400 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించగా ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. -
జర్మన్ సంస్థతో జేఎన్టీయూ జీవీ ఒప్పందం
విజయనగరం రూరల్: ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే దిశగా స్థానిక జేఎన్టీయూ జీవీ కీలక ముందడుగు వేసింది. జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ విద్యాసంస్థ రోత్లాంగేన్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఫౌండేషన్ (కెఎఫ్ఆర్యు)తో శనివారం విద్యా సహకార ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఇరు సంస్థల ప్రతినిధులు జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది నుంచే అంతర్జాతీయ సమగ్ర డిగ్రీ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఒప్పందంతో విద్యార్థులు కేవలం ఐదేళ్లలోనే భారతీయ డిగ్రీతోపాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన జర్మన్ ఎంఎస్సీ డిగ్రీని సొంతం చేసుకునే అవకాశం లభిస్తుందని జేఎన్టీయూ జీవీ ప్రతినిధులు తెలి పారు. పలు కోర్సులు అందుబాటులో ఉంటాయ ని, నాణ్యమైన విద్య, తక్కువ ఫీజు, పరిశ్రమలతో అనుసంధానమైన విద్యావిధానం, ప్రపంచ ప్రఖ్యా త పరిశ్రమల్లో భారతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. ఇంటర్మీ డియట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల్లో ఎంపీసీ గ్రూపులో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు వాటికి ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది ఈ కోర్సుల్లో ప్రవేశాలకు కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 7288873337 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
10 కేజీల గంజాయితో ఇద్దరు నిందితుల అరెస్ట్
విజయనగరం క్రైమ్ : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని స్థానిక రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంలపై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీనిపై జీఆర్పీ ఎస్ఐ బాలాజీ రావు చెప్పిన వివరాల ప్రకారం...ప్లాట్ ఫాంలపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ లు తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం పాత హుబ్లీ, ధర్వాద్ జిల్లాలకు చెందిన అఖిలేష్ యార్మశల్, షబాజ్ రఫీ అమ్మద్ ఖాతిబ్లు ఒడిశా రాష్ట్రంలోని టికిరి నుంచీ పది కేజీలు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. ప్లాట్ ఫాం లపై తనిఖీలు చేస్తున్న పోలీస్ సిబ్బందిని చూసి వారు కంగారు పడటంతో జీఆర్పీ ఎస్సై బాలాజీరావుకు అనుమానం వచ్చి ఆర్పీఎఫ్ సిబ్బందితో ఇద్దరి వద్ద ఉన్న బ్యాగ్ లను తనిఖీ చేయగా గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్ట్ కు తరలించామని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు.లారీ బోల్తా● త్రుటిలో తప్పిన ప్రమాదం జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పెదమేరంగి కూడలి సమీపాన గల గౌరవంపేట మలుపు వద్ద మామిడి పండ్లతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. శనివారం ఉదయం విజయనగరం నుంచి ఒడిశా మీదుగా ఢిల్లీ వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించబోయి అదుపుతప్పింది. దీంతో అటువైపు వస్తున్న ప్రయాణికులు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని స్థానికులు తెలిపారు. పిడుగు పడి ఆవు మృతిజామి: మండల కేంద్రమైన జామిలో పిడుగుపడి ఆవు మృతి చెందింది. ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెద్ద వర్రి వాని కళ్లాల వద్ద శనివారం మధ్యాహ్నం పిడుగుపడి రైతు కె. పరసన్న ఆవు మృతిచెందింది. పశువైద్యాధికారి సంతోష్కుమమార్ మృతి చెందిన ఆవును పరిశీలించారు. సుమారు రూ. 60వేలు ఖరీదు అయిన ఆవు మృతిచెందిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తి పరారీబొండపల్లి: మండలంలోని బి.రాజేరు గ్రామానికి చెందిన బండారు వెంకటేష్ తన ఇద్దరు కూతుళ్ల వద్ద నుంచి అప్పుగా తీసుకున్న నగదు ఇవ్వకుండా పరారీ అయినట్లు అంబటివలస గ్రామానికి చెందిన నరవ సత్యం వాపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బి.రాజేరు గ్రామానికి చెందిన వెంకటేష్ అదే గ్రామానికి చెవిన ఇసినిగిరి బంగారమ్మ, ధర్మవరపు పార్వతిల నుంచి నాలుగు లక్షల రుపాయలు అప్పుగా తీసుకుని గ్రామం నుంచి పరారీ అయ్యాడు. వెంకటేష్ మామ గ్రామంలోనే ఉన్నా, తనకు అప్పుకు ఏమీ సంబంధం లేదని చెబుతున్నాడని, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా అప్పు తీసుకున్న వ్యక్తి ఆచూకీ కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారని నరవ సత్యం చెప్పాడు. తన కూతుళ్ల వద్ద తీసుకున్న అప్పుకు గ్రామంలో గానీ, పోలీసుల వద్ద గానీ ఎటువంటి న్యాయం జరగలేదని న్యాయం చేసేలా చూడాలని కోరాడు. -
కింగ్ కోబ్రా చేతుల్లో ప్రభుత్వ భూములు..!
చీపురుపల్లి: దాదాపు రూ.25 కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం అటువైపు చూడడం లేదు. రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నప్పటికీ రికార్డులు చూస్తున్నారు తప్ప భూముల పరిరక్షణను పట్టించుకోవడం లేదు. బహుశా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదనేనేమో భీమిలికి చెందిన ఓ కింగ్ ఆ ప్రభుత్వ భూముల్లో గెస్ట్హౌస్, ప్రహరీ, గేటు ఏర్పాటు చేసి రైతులను పంట పొలాలకు సైతం వెళ్లనీయకుండా అడ్డంగా గోడ నిర్మాణం చేశాడు. కర్లాం రెవెన్యూ పరిధిలో 87.34 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఇంత జరుగుతున్నా గ్రామ స్థాయి రెవెన్యూ అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎవరూ పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు విపిస్తున్నాయి. సదరు కింగ్ వెనుక అధికార టీడీపీలోని ఓ పెద్ద తలకాయ అండదండలు ఉండడంతోనే రెవెన్యూ యంత్రాంగం అటు వైపు చూడడం లేదనే చర్చ బహిరంగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎంఎస్ఏంఈ పార్కుల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున భూములు సేకరించింది కానీ ఇక్కడ 87.34 ఎకరాలు మాత్రం రెవెన్యూ యంత్రాంగానికి కనిపించకపోవడం వెనుక ఆ పెద్ద తలకాయ అండదండలే కారణమని చర్చ జరుగుతోంది. సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాల ప్రభుత్వ భూమి చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం గయాలు భూమిగా పేర్కొన్నారు. ఆ భూములకు సంబంధించి గతంలో ఎలాంటి పట్టాలు మంజూరు చేయలేదు. రికార్డుల్లో 87.34 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ భూములు మాత్రం వేరే వ్యక్తుల చేతుల్లో ఉండడం గమనార్హం. పంట పొలాలకు వెళ్లకుండా గోడ నిర్మాణం మండలంలోని కర్లాం, నిమ్మలవలస, మోదుగులపేట తదితర గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. దీంతో వ్యవసాయ భూములు సైతం కలిసే ఉంటాయి. వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఈ మూడు గ్రామాల రైతులు సర్వే నంబర్ 408 లో నుంచే వెళ్లి వస్తుంటారు. అయితే ఈ భూముల్లో నుంచి రైతులను వెళ్లనివ్వకుండా సదరు కింగ్ అడ్డంగా గోడ నిర్మించారు. దీంతో రైతులు భూములకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఇదేంటని రైతులు అడిగితే ఆ భూమి తనదేనని రికార్డుల ప్రకారం ఎలాంటి దారి లేదని సదరు కింగ్ బదులిస్తున్నాడు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధం పంట పొలాలకు దారి లేకుండా గోడ నిర్మించడం, ప్రభుత్వ భూములను చేతిలో ఉంచుకోవడంపై గ్రీవెనన్స్ సెల్ ఫిర్యాదు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎంఎస్ఏంఈ పార్కుల ఏర్పాటు కోసం ఎక్కడా లేని భూములను సేకరించిన ప్రభుత్వం కర్లాంలో 87.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ వదిలేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే సదరు కింగ్ మాత్రం ఆ భూములు తనవేనని తాను కొనుగోలు చేశానని చెప్పుకుంటున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూముల్లోనుంచి రైతులు వెళ్లకుండా ‘ఆడ్డుగోడ’..! ఆ భూముల్లో గెస్ట్ హౌస్, ప్రహరీ నిర్మాణం కర్లాంలో 87.34 ఎకరాలు ప్రభుత్వ గయాలు భూములు87.34 ఎకరాలు ప్రభుత్వ భూములే చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 408లో 87.34 ఎకరాలు ప్రభుత్వ భూములే. రెవెన్యూ రికార్డుల ప్రకారం 87.34 ఎకరాలు గయాలు భూములుగా నమోదై ఉన్నాయి. అందులో ఎలాంటి పట్టాలు మంజూరు కాలేదు. ఆ భూముల్లో అక్రమ కట్టడాలపై ఇంతవరకు మా దృష్టికి రాలేదు. – డి.ధర్మరాజు, తహసీల్దార్, చీపురుపల్లి -
అన్నింటా ఆమెదే ‘విజయ’ం
● తెలంగాణ లా–సెట్లో స్టేట్ ఫస్ట్ ● ఇటీవల గ్రూప్–2 పరీక్షలోనూ విజయం ● డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం ● నెల్లిమర్ల యువతి అరుదైన ఘనతన్యాయమూర్తిగా సేవలందించడమే లక్ష్యం నా విజయ ప్రస్థానంలో తల్లిదండ్రులు వెంకట్రావు, రామలక్ష్మిల ప్రోత్సాహంతో పాటు కాబోయే జీవిత భాగస్వామి శ్రావణ్ కుమార్ పటేల్ కృషి దాగి ఉంది. శిక్షణలో గురువుగా, మార్గదర్శకుడిగా ఆయన కీలకపాత్ర పోషించారు. డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక కావడంతో పాటు టీజీ లాసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రజాసేవతో పాటు న్యాయరంగంలోనూ విశిష్ట స్థానాన్ని సంపాదించి, సమాజానికి ఉపయోగపడే న్యాయమూర్తిగా ఎదిగి ప్రజాసేవకు అంకితమవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాను. –మీసాల విజయదుర్గనెల్లిమర్ల రూరల్: ఎక్కడో మారుమూల గ్రామం..సాధారణ రైతు కుటుంబం..ప్రభుత్వ పాఠశాలలోనే చదువు..కానీ అసాధారణమైన లక్ష్యాలు, అచంచలమైన పట్టుదల విజయనగరం జిల్లా యువతి మీసాల విజయదుర్గను తెలంగాణ లా–సెట్లో తొలి ర్యాంక్ సాధించేలా చేశాయి. నెల్లిమర్ల మండలం ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి చెందిన విజయదుర్గ గురువారం విడుదలైన తెలంగాణ లా–సెట్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకు కై వసం చేసుకుంది. తండ్రి మీసాల వెంకట్రావు రైతు కాగా, తల్లి రామలక్ష్మి గృహిణి. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కుమార్తె చదువుకు తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం ఆమె విజయానికి బలమైన పునాది అయింది. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం రామతీర్థం ఉన్నత పాఠశాలలో చదివిన విజయదుర్గ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చింది. పదోతరగతిలో 568 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది అక్కడే ఆరేళ్లు బీటెక్ విద్యను పూర్తి చేసింది. చదువు అనంతరం క్యాంపస్ ప్లేస్మెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి ఐదేళ్ల పాటు ఆ రంగంలో పనిచేశారు. ఉన్నత లక్ష్యాలే ముఖ్యమని భావించిన విజయదుర్గ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్–2కు సన్నద్ధమయ్యారు. గ్రూప్–2లో సత్తా..డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం.. పట్టుదలతో కష్టపడి చదువుకున్న విజయదుర్గ 2023 ఏపీపీఎస్పీ గ్రూప్–2 నోటిఫికేషన్ పరీక్ష రాశారు. ఇటీవల ఆ ఫలితాలు విడుదల కాగా ఉత్తమ ప్రతిభ కనబరిచి డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత కూడా చదువును కొనసాగించి న్యాయవృత్తిపై ఉన్న ఆసక్తి కారణంగా తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 పరీక్షకు హాజరై రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ ర్యాంకు సాధించారు. పోటీ తీవ్రంగా ఉన్న పరీక్షలో అగ్రస్థానంలో నిలవడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఆమె విజయం ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. సరైన లక్ష్యం, కృషి ఉంటే ఏ నేపథ్యం నుంచైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విజయదుర్గ నిరూపించారు. -
పీహెచ్సీల్లో ప్రసవాలు ఎక్కువగా జరగాలి
తెర్లాం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) ప్రసవాలు ఎక్కువగా జరిగేలా వైద్యులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్ జీవన్రాణి అన్నారు. ఈ మేరకు మండలంలోని తెర్లాం, పెరుమాళి పీహెచ్సీలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెర్లాం పీహెచ్సీలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీకి సంబంధించిన రికార్డులను, ల్యాబ్లో అందిస్తున్న సేవలను తనిఖీ చేశారు. ప్రతినెలా ఎంతమంది గర్భిణులకు ప్రసవాలు చేయిస్తున్నారని పీహెచ్సీ డాక్టర్లు రెడ్డి స్వాతి, వంశీలను అడిగారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పీహెచ్సీలో ప్రతీ గర్భిణి తప్పనిసరిగా ప్రసవం చేయించుకునేలా వారికి వైద్య అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెరుమాళి పీహెచ్సీకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. రోగులకు, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కేన్సర్ వ్యాధి నివారణ వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులు డాక్టర్ వెంకటేశ్, మనోజ్ఞరమణిలను ఆదేశించారు. యోగా డే విజయంతమైయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని, సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది యోగా డేలో పాల్గొనేలా చూడాలని పెరుమాళి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శ్రీనివాస్కు సూచించారు. పీహెచ్సీలో గల ల్యాబ్ ద్వారా చేస్తున్న పరీక్షలపై ల్యాబ్ టెక్నిషియన్ శివను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన్ రాణి -
11మందికి గంజాయి పరీక్షలు
● ఏడుగురికి పాజటివ్ ● గంజాయి డిటెక్షన్ కిట్స్ ద్వారా గుర్తింపువిజయనగరం క్రైమ్ : గంజాయి డిటెక్షన్ కిట్స్ ద్వారా గంజాయి వినియోగించే వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నామని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు చేపడుతున్నామని యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న గంజాయి వినియోగం అరికట్టేందుకు ఇటీవల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి డిటెక్షన్ కిట్లను పంపిణీ చేశామన్నారు. గంజాయి డిటెక్షణ్ కిట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, మూత్ర పరీక్ష ద్వారా కేవలం ఒక నిమిషంలోనే వ్యక్తి గంజాయి వినియోగించాడో లేదో అని నిర్ధారణ చేయవచ్చన్నారు. గంజాయి వినియోగించే వారిని గుర్తించేందుకు యాంటీ గంజాయి టీమ్, ఈగల్ టీమ్ గంజాయి డిటెక్షన్ కిట్స్తో పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. 11మందికి పరీక్షలు నిర్వహించగా, ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని, వాళ్లంతా గంజాయి వినియోగించినట్లు నిర్ధారణ అయిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలను సేకరించి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను గాలిస్తున్నట్లు తెలిపారు. -
ఓణీల ఫంక్షన్కు కలెక్షన్ల తంటా..!
● పాలకురాలి కమార్తె ఫంక్షన్ కోసం అధికారులపై ఒత్తిడి ● మండలాల వారీగా టార్గెట్లు ● విస్తుపోతున్న ఉద్యోగవర్గాలు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే మరి... మన నాయకురాలి ఇంట్లో ఫంక్షన్ ఉంది.. మనమంతా దారుకోవాలి.. పూనుకోవాలి.. రాసుకోవాలి.. పూసుకోవాలి అని పూనకాలు తెచ్చుకున్న పచ్చపార్టీ నాయకులు అలవిమాలిన స్వామిభక్తిని చాటుకోవడం.. దీనికోసం మండలాల వారీగా అధికారులకు టార్గెట్లు ఇవ్వడం మన్యంలో చర్చనీయాంశంగా మారింది. అసలే గిరిజన ప్రాంతం... ఆపై ప్రైవేటు కార్యక్రమానికి టార్గెట్లు ఇవ్వడం ఉద్యోగ వర్గాలను కలవరపెడుతోంది. అమ్మగారి ఇంటిలో ఓణీల ఫంక్షన్ ధూమ్ధామ్ అయిపోవాలి.. మూడు జిల్లాల్లో హోరెత్తిపోవాలి.. ‘ఈశ్వరి’ని ఆశీస్సులు అందేలా.. రెండు మూడు తరాలు చెప్పుకునేలా ఉండాలి అంటూ వేపకొమ్మలతో కొట్టుకునే రేంజిలో పచ్చపార్టీ నేతలు ఊగిపోవడం... ఆ ఖర్చు భరించాలంటూ ఉద్యోగులపై రుద్దడం విమర్శలకు తావిస్తోంది. ఏకంగా నియోజకవర్గ నేత ఇంటిలో ఇటీవల ఐదు మండలాలకు చెందిన అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి మండలానికి రూ.4లక్షల చొప్పున కలెక్షన్ చేయాలంటూ టార్గెట్లు ఇచ్చారన్న ప్రచారం జోరందుకుంది. మండలాధికారులకు టార్గెట్లు అంటే అది ఆయన పరిధిలోనే ఉపాధి హామీ సిబ్బందితోపాటు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడిపడుతుంది. మండలాధికారి ఆదేశాల మేరకు ఆయా ఉద్యోగులు చందాలు వేసుకుని ఆ నాలుగు లక్షలు పోగేసి ఇవ్వా ల్సిన పరిస్థితి. ఇప్పటికే పంచాయతీరాజ్ , గ్రామీణాభివద్ధి శాఖల ఉద్యోగులు అలవిమాలిన పని ఒత్తిడి.. దండగమారి సర్వేలు, సమీక్షలతో నలిగిపోతున్న తరుణంలో ఓణీ ఫంక్షన్ కోసం ఇప్పుడు ఏకంగా చందా వసూళ్ల బాధ్యతలు పెట్టడంతో వారు అవుననలేక.. కాదనలేక లోలోన కుమిలిపోతున్నారు. మొత్తం మీద అమ్మవారి ఇంట ఫంక్షన్లో డీజేల ముందు డ్యాన్స్లు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులను అనివార్యంగా కార్యకర్తలు ముందుకు నెడుతున్నారంటూ కొందరు బహిరంగంగానే మండిపడుతున్నారు. ఇదెక్కడి తీరు.. పచ్చపార్టీ కార్యకర్తలు.. నాయకులకు రోకు ఉంటే వాళ్లువెళ్లి టెంట్లువేయాలి... పందిరి బొంగులు పాతాలి.. గాడి పొయ్యిలు తవ్వాలి... నీళ్ల కావిళ్లు మోయాలి కానీ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మేమెందుకు ఈ పాలేరు పనిచేయాలంటూ ఉద్యోగులు లోలోన మదనపడుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇలాంటి చందాల సంస్కృతి ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఎవరైనా నాయకుల ఇళ్లలో ఫంక్షన్ ఉంటే అధికారులు తమ భక్తికొద్దీ త్రుణమోపణమో సీక్రెట్గా సమర్పించుకుని వచ్చేవారు. ఇప్పటిలా ఏకంగా సిబ్బంది మొత్తం పులివేషాలు వేసుకుని ఆటాడే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలా అని మండలాధికారులు ఆలోచనలు చేస్తుండగా, కొత్తగా ఓ మండలానికి వచ్చిన అధికారి ఆ స్థాయిలో కలెక్షన్ చేయలేనని కరాఖండిగా చెప్పడంతో టార్గెట్లో రూ.లక్షన్నర తగ్గించారట. మరికొన్ని శాఖలకు కూడా వేర్వేరుగా టార్గెట్లు ఫిక్స్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఊరి సొమ్ము రాంభజన అన్నట్లుగా ఉద్యోగుల చందాలతో ఫంక్షన్ చేసేందుకు పూనుకున్న నేత ‘ఛీప్’ట్రిక్స్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోజనం కోసం పిలవాలే గానీ చందాలు పట్టుకుని భోజనానికి రండి అంటూ ఆర్డర్వేయడంపై మండిపడుతున్నారు. మొత్తానికి అమ్మగారింట్లో ఫంక్షన్ అటు నాయకులకు మోదం.. ఉద్యోగులకు ఖేదంగా మారింది. -
49 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
గజపతినగరం రూరల్: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారంపై గజపతినగరంలో మెరుపు దాడి చేశారు. ఏకకాలంలో మూడు చోట్ల దాడులు చేసి మూడు ఆటోలతో తరలిస్తున్న 49 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం నుంచి మూడు ఆటోలతో వేరువేరు ప్రాంతాలకు పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం ఉదయమే పకడ్బందీగా ప్లాన్ చేసిన విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రామారావు ఆధ్వర్యంలో దాడులు చేసి లింగాలవలస బ్రిడ్జి, గజపతినగరం పీఏసీఎస్, గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో మూడు ఆటోలతో తరలిస్తున్న 48 బస్తాలు పట్టుకున్నారు. నిందితులపై 6ఎ కేసు నమోదు చేసి పట్టుబడిన బియ్యాన్ని లింగాలవలస రేషన్ డిపోకు, ఆటోలను గజపతినగరం పోలీసులకు అప్పగించారు. ఈ బియ్యం ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఇదే దాడుల్లో, 10 బస్తాల రాగులు కూడా దొరికినట్లు తెలుస్తోంది. దాడుల్లో గజపతినగరం పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చిరంజీవి, రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొన్నారు. రాజాంలో.. రాజాం: పట్టణంలోని చీపురుపల్లిరోడ్డులో ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఎస్డీటీ అనంత్కుమార్ తెలిపారు. మండలంలోని గడిముడిదాం గ్రామం నుంచి గణపతి అనే వ్యక్తి ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్నారు. శుక్రవారం చీపురుపల్లి రోడ్డులో ఆర్ఐ మహేష్తో కలిసి వాహనాలు తనిఖీచేయగా బియ్యం పట్టుబడ్డాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో 5 క్వింటాళ్ల బియ్యం దొరకగా బియ్యాన్ని సీజ్ చేసి, ఎంఎల్ఎస్ గోదాంకు తరలించామని, ఆటోను సీజ్చేసి, పోలీసులకు అప్పగించామని వివరించారు. ఈ మేరకు కేసు నమోదుచేసినట్లు సీఎస్డీటీ పేర్కొన్నారు. -
సుపారీ గ్యాంగ్ అరెస్ట్
విజయనగరం క్రైమ్: సుపారీ ఇచ్చి సొంత అన్ననే హత్య చేయాలని తమ్ముడు ఏర్పాటు చేసుకున్న గ్యాంగ్ను విజయనగరం టూటౌన్ పోలీసులు పక్కా ప్రణాళికతో శుక్రవారం పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం..గుర్లకు చెందిన బుచ్చినాయుడికి విజయనగరంలో కొన్ని భవనాలు ఉన్నాయి. వాటి మరమ్మతుల కోసం ఫోన్ ద్వారా కుమార్, శివ, బాలు అనే ముగ్గురిని సంప్రదించాడు. వారు చెప్పిన స్థలం రింగ్ రోడ్లో గల లెజెండ్ బార్ లైన్ లోకి వచ్చిన బుచ్చినాయుడిని వారు ముగ్గురూ చితక్కొట్టి రూ.15 వేలు లాక్కుని పారిపోయారు. దీంతో హాస్పిటల్ పాలైన బుచ్చినాయుడు ఫిర్యాదుతో సీఐ శ్రీనివాస్, ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బుచ్చినాయుడికి తమ్ముడు పిన్నింటి రాముతో ఊరిలో భూ తగాదాల ఉన్న కారణంగా సొంత అన్ననే అంతం చేయాలనుకున్నట్లు విచారణలో తేలిందని సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాల్ డేటా ఆధారంగా పిన్నింటి రాముతో పాటు దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. -
ఐఎన్ఐ–ఎస్ఎస్ ఫలితాల్లో మెరిసిన ‘బోధన్’
● ఢిల్లీ ఎయిమ్స్లో సూపర్ స్పెషాలిటీ చేయడమే లక్ష్యం విజయనగరం అర్బన్: వైద్యవిద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఐ–ఎస్ఎస్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విజయనగరం పట్టణానికి చెందిన డాక్టర్ ముడిలి సాయిబోధన్ అద్భుత ప్రతిభ కనబరిచారు. డీఎం క్రిటికల్ కేర్ సూపర్ స్పెషాలిటీ విభాగంలో 3వ ర్యాంక్ సాధించారు. పూల్బాగ్ కాలనీకి చెందిన సాయిబోధన్ చిన్నతనం నుంచే చదువులో దిట్ట. పదో తరగతి వరకు బాబామెట్ట కేంద్రీయ విద్యాలయంలో చదివారు. ఇంటర్ కార్పొరేట్ సంస్థలో చదివి నీట్లో 1,500 ర్యాంక్ సాధించి తొలి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు తెచ్చుకున్నారు. పీజీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా 305 ర్యాంక్ సాధించి భువనేశ్వర్లో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తిచేశారు. తాజాగా ఐఎన్ఐ ఎస్ఎస్ పరీక్షలో ప్రతిభ చూపి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్లో డీఎం పూర్తిచేయాలనే తన జీవిత కలను నిజం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే చదువులో రాణించగలిగానని బోధన తెలిపారు. కుమారుడు చదువులో రాణించడంపై తల్లిదండ్రులు జ్యోతి(టీచర్), నాగభూషణరావు, విశ్రాంత హెచ్ఎం అయిన తాతయ్య లక్ష్మణరావు సంతోషం వ్యక్తంచేశారు. -
డంపింగ్ యార్డు కథ మొదటికి!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలో చెత్తశుద్ధి నిర్వహణ అంటూ కొన్నాళ్లు హడావిడి చేసినా.. ’చెత్త’ కథ మళ్లీ మొదటికే వచ్చింది. గుత్తేదారు సంస్థ కాలపరిమితి ముగియడంతో తమ వాహనాలను, యంత్రాలను తీసుకుని వెనుదిరిగింది. పార్వతీపురం పట్టణంలో సుమారు 62 వేల మంది జనాభా నివసిస్తున్నారు. దాదాపు 13 వేల నివాస గృహాలుండగా.. ఆవాసాలు, వ్యాపార సంస్థల నుంచి రోజుకు 25 టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. పట్టణ శివారులో ఉన్న డంపింగ్ యార్డులోనే దీన్ని పారబోస్తున్నారు. డంపింగ్ యార్డు సమస్య పట్టణ వాసులను ఏళ్లుగా వేధిస్తోంది. గతంలో పట్టణంలోని చెత్తశుద్ధి నిర్వహణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంస్థ తరుణి ఏజెన్సీకి పనులు అప్పగించింది. ఆ మేరకు కొన్నాళ్ల కిందట యార్డు సమీపంలోనే పనులు ప్రారంభించారు. చెత్తను నాలుగు భాగాలుగా ప్లాస్టిక్, మట్టిరాళ్లు, రబ్బరు, గాజు వ్యర్థాలను వేర్వేరు యంత్రాలతో విభజించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ను విక్రయానికి తరలించి, మిగిలిన పనికిరాని వ్యర్థాలను తిరిగి భూమిలో కలిపేస్తారు. ఇలా పట్టణంలో 12 వేల టన్నుల వరకు వ్యర్థాలను విభజించాలి. వ్యర్థాలను మళ్లీ పట్టణంలోనే పారబోయడంపై విమర్శలు వ్యక్తమైన విషయం విదితమే. తాజాగా సదరు సంస్థకు అప్పగించిన కాంట్రాక్టు ముగియడంతో పనులు మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తదుపరి మున్సిపల్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా వెంకటరమణ
విజయనగరం ఫోర్ట్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడిగా కంది వెంకటరమణ ఎన్నికయ్యారు. ఈ మేరకు కలెక్టరేట్లోని ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నూతన కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ప్రొసీడింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, రాష్ట్ర పరిశీలకులుగా శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు వ్యవహరించారు. వైస్ చైర్మన్గా డాక్టర్ కేపీ వరలక్ష్మి, కోశాధికారిగా డాక్టర్ పొగరు విశ్వేశరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా బి.రామకృష్ణారావు, ఎస్. రాజు, పి.దుర్గాప్రసాద్, డి.సూర్యారావు వై.వీర్రాజు, కె.ఎర్నాయుడు, వెన్నెల చంద్రశేఖర్, ఎం.తిరుపతిరావు, బీవీ గోవిందరాజులు ఎన్నికయ్యారు. పదో తరగతి షార్ట్మార్క్స్ మెమోలు విడుదల విజయనగరం అర్బన్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల షార్ట్ మార్స్క్ మెమోలు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ మాణిక్యంనాయుడు తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ ద్వారా మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసి, సంతకం చేసి విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మార్క్స్ మెమోల్లో విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, ఇతర సమాచారం విషయంలో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని స్కూల్ లాగిన్లో సరిచేసుకునేందుకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోపు వివరాలను పరిశీలించి, తప్పులు ఉంటే వెంటనే సవరించాలని డీఈఓ సూచించారు. పల్స్పోలియోను విజయవంతం చేయండి సంతకవిటి: జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి వైద్యసిబ్బందికి సూచించారు. మండలంలోని మండవకురిటి పీహెచ్సీని ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. పీహెచ్సీలో నమోదైన ఓపీ, అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పీహెచ్సీకి వచ్చిన రోగులకు సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి ప్రశాంత్, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలు తప్పనిసరి విజయనగరం అర్బన్: జిల్లాలోని సినిమా థియేటర్ల యజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జేసీ సేతుమాధవన్ సూచించారు. థియేటర్ల నిర్వహణ, ఎన్ఓసీ నమోదు, ప్రభుత్వ ప్రజా అవగాహన చిత్రాల ప్రదర్శన తదితర అంశాలపై తన చాంబర్లో శుక్రవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లు విధిగా ఏపీఎస్ఎఫ్టీవీడీసీ వద్ద నమోదు చేసుకొని ఎన్ఓసీ పొందాలని స్పష్టం చేశారు. ఫారం–బీ లైసెన్స్ మంజూరుకు, అలాగే దాని పునరుద్ధరణకు ఎన్ఓసీ కచ్చితంగా తీసుకోవాలన్నారు. సమావేశంలో సీ–సెక్షన్ పర్యవేక్షకులు డి.శేఖర్, జిల్లాలోని పలు సినిమా థియోటర్ల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం: జిల్లాలో ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు ‘యోగాంధ్ర – 2026’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. ‘ఒక జిల్లా–ఒకే ఇతివృత్తం’ నినాదంతో యోగా ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జూన్ 11న తోటపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, 15న సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వెంజర్ పార్క్, 20న పాలకొండ, పార్వతీపురం, సాలూరులలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
ఓటర్ల జాబితా మ్యాపింగ్ వేగవంతం చేయాలి
● లక్ష్యాలు చేరుకోకపోతే కఠిన చర్యలు విజయనగరం అర్బన్: జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, బూత్స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో పురోగతిసాధించకపోవడం, రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లా వెనుకబడడంపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న ఇంటింటి ఓటర్ల సర్వేకు ముందే మ్యాపింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా 2002నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత 2025 ఓటర్ల జాబితాతో కచ్చితంగా మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నిక విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు. ● రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద ఉన్న ఏపీఐఐసీ పరిధిలోని 64.67 ఎకరాల భూమిని రాధిక వెజిటబుల్ ఆయిల్స్ కంపెనీకి రిజిస్టర్ చేసి అప్పగించినట్లు పరిశ్రమలశాఖ సమీక్షా సమావేశంలో కలెక్టర్ తెలియజేశారు. సమావేశంలో పరిశ్రమ శాఖ మేనేజర్ కరుణాకర్, విజయనగరం ఆర్డీఓ సుధాసాగర్, చీపురుపల్లి ఆర్డీఓ సుధారాణి, ఏపీఐఐసీ లైజన్ అధికారి సత్యనారాయణతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు -
దివ్యాంగులపై కక్షసాధింపు..!
విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు పింఛన్ కష్టాలు తప్పడంలేదు. రాజకీయ కక్షసాధింపు చర్యలతో నలిగిపోతున్నారు. మొన్నటివరకు దివ్యాంగత్వం నిర్ధారణ కోసం జిల్లాలోని సుమారు 35వేల మంది ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వ్యయప్రయాసలకు గురయ్యారు. దివ్యాంగత్వ నిర్ధారణను పూర్తిచేసుకున్నారు. పింఛన్ పొందేందుకు అర్హత సాధించారు. తాజాగా గజపతినగరం నియోజకవర్గంలో కొందరు దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి మళ్లీ తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్షతో అర్హుల పింఛన్లను తొలగించేందుకు పూనుకోవడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. మంత్రి ఇలాకాలో దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు... రాష్ట్ర ఎన్ఆర్ఐ, సెర్ప్ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలో దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి సర్టిఫికెట్స్ తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దివ్యాంగ పింఛన్ పొందుతున్న వారిలో అనర్హులు ఉన్నారని టీడీపీ నేతలు ఏపీ రాష్ట్రసోషల్ ఆడిట్ అథారిటీ( ఏపీఎస్ఏఏటీ) డైరెక్టర్కు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు సోషల్ ఆడిట్ అథారిటీ టీమ్ ఇద్దరు సభ్యులను క్షేత్రస్థాయి తనిఖీల కోసం పంపించింది. కేవలం గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు అయిన దివ్యాంగులు 16 మంది ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేపట్టారు. దివ్యాంగుల పింఛన్లు తొలగించాలనే కుట్రతోనే తరచూ తనిఖీలు చేపడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ నిట్టూర్చుతున్నారు. పింఛన్లను అన్యాయంగా తొలగిస్తే న్యాయస్థానం తలపుతట్టేందుకు దివ్యాంగులు సిద్ధమవుతున్నారు. ఇదే విషయంపై డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి మాట్లాడుతూ దివ్యాంగుల సర్టిఫికెట్ల క్షేత్రస్థాయి తనిఖీ విషయం తెలియదన్నారు. ఏపీఎస్ఏఏటీ డైరెక్టర్ నేరుగా తనిఖీ బృందాన్ని పంపించి ఉండవచ్చన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్ ప్రభుత్వం నిర్వహించిన పింఛన్ రీవెరిఫికేషన్ పూర్తి ప్రజాప్రతినిధి ఒత్తిడితో మళ్లీ దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు ఆందోళనలో దివ్యాంగులు -
ముడతలు పడిన చర్మం.. మురిసిపోయే ఆత్మాభిమానం
విజయనగరం గంటస్తంభం: నేటి సమాజంలో పాతికేళ్లు కూడా నిండని యువకులు తమ చిన్నచిన్న అవసరాల కోసం తల్లిదండ్రుల వైపు చూస్తున్నారు. చేతిలో పనిఉన్నా చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇంకొందరు జీవిత పోరాటానికి దూరంగా ఉండి సులభమైన మార్గాల కోసం వెతుకుతున్నారు. ఆ కోవలో తప్పుదారి పడుతూ అప్పులపాలవుతున్నారు. మరికొందరు ఈజీ మనీకోసం తప్పుదారి పడుతున్నారు. బతుకులను దుర్భరం చేసుకుంటున్నారు. అలాంటి వారందరికీ వయసు పైబడినా ఆత్మగౌరవాన్ని ఏమాత్రం కోల్పోకుండా చెమటోడ్చి బతుకుతున్న ఈ బామ్మలే నిలువెత్తు స్ఫూర్తి. వయస్సు 70 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్నా, శరీరం ముడతల పడినా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విజయనగరం పట్టణంలో చిరు వ్యాపారులు చేస్తూ తమ సంపాదన తమదే అని నిరూపిస్తున్నారు. ఒకరికి పెట్టేచేతులే కాని చాచే చేతులు కావని చెబుతున్నారు. ప్రతిరోజూ వచ్చిన కొద్ది సంపాదనే తమకు రూ.కోట్లతో సమానమని గర్వపడుతున్నారు. చేయి చాచడం కంటే పని చేయడం మేలు... ఒకప్పుడు కుటుంబ సభ్యులందరికీ వండి పెట్టిన చేతులు ఇవి. పిల్లలను పెంచి పెద్ద చేసి, బంధువులు, అతిథులకు ఆతిఽథ్యం ఇచ్చిన గౌరవం మాది. అలాంటి చేతులు ఇప్పుడు తమ అవసరాల కోసం ఎవరిముందూ చాచడానికి సిద్ధంగా లేవు. వయసు పెరిగిందనే కారణంతో ఇతరులపై ఆధారపడాలని భావించడం లేదు. తమకు చేతనైనంత వరకు నిజాయితీగా కష్టపడి సంపాదించి తినడమే గౌరవమని నమ్ముతున్నారు. సమాజం నుంచి జాలి కోరడం కాదు. తమ శ్రమకు తగిన గౌరవం కోరుతున్నారు. మా వయసు కాదు... మాధైర్యం చూడండి.. వీరిలో ప్రతి ఒక్కరి జీవితం ఒక పాఠం. ప్రతి అడుగు ఒక సందేశం. ప్రతి చెమట చుక్క ఆత్మగౌరవానికి ప్రతీక. ఎండను లెక్కచేయకుండా రోడ్డుపక్కన కూర్చుని సరుకులు అమ్ముకుంటున్న వీరిని చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఈ వయసులో ఎందుకమ్మా ఈ కష్టం అని అడుగుతుంటారు. అప్పుడు వారి సమాధానం జీవితానికి అర్ధం చెప్పేలా ఉంటుంది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు, కాలక్షేపాలతో రోజులు గడిపే యువతకు ఈ బామ్మలు నిశ్శబ్ద సందేశం ఇస్తున్నారు. పని చిన్నది కాదు.. వయసు అడ్డంకి కాదు.. ఆత్మగౌరవమే అసలు సంపద అని చేతలతో చెబుతున్నారు. కష్టపడే మనిషికి వయసుతో సంబంధం లేదని, గౌరవంగా బతకాలనే సంకల్పం ఉంటే పరిస్థితులు కూడా ఓడిపోతాయని నిరూపిస్తున్నారుకూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. అందుకే ఈ వయసులోనూ రోడ్డు పక్కన చిన్న దుకాణం పెట్టుకున్నా. నా పిల్లలను, కుటుంబాన్ని నేనే రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేశా. ఈ చివరి రోజుల్లో ఎవరికీ భారం కాకూడదన్నదే నా కోరిక. నా కష్టార్జితంతో తినే బువ్వే నాకు కొండంత తృప్తిని ఇస్తుంది. – గోక అప్పయ్యమ్మ(78), ఎల్బీకాలనీ, విజయనగరం వయసు నిండుగా... ఆత్మాభిమానం మెండుగా.. ముదిమి వయసులోనూ శ్రమనే నమ్ముకున్న బామ్మలు ఇవి ఒకరికి పెట్టే చేతులే కానీ సాయం కోసం చాచేవి కాదన్న సందేశం -
‘పచ్చని చెట్లు –ప్రగతికి మెట్లు
● జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయ మూర్తి విజయ కల్యాణి విజయనగరం లీగల్: పచ్చని చెట్లు–ప్రగతికి మెట్లు అని మొక్కలను నాటి పెంచి పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని, రోజురోజుకూ పెరుగుతున్న వేడి వాతావరణం తగ్గించడం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను పెంచాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి విజయ కల్యాణి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం‘ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. భూమి మీద వేడి ని కొంత మేరకు అయినా తగ్గించగలమని, ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల ఏర్పడిన గ్లోబల్ వార్మింగ్ ను నివారించగలమన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే వాటి నుంచి మొక్కల పెంపకం కొంత వరకు దోహద పడుతుందన్నారు. కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషనన్స్ జడ్జి, ప్లాపూస్ చైర్మన్ జి.దుర్గయ్య, సీనియర్ సివిల్ జడ్జి అండ్ ఇన్చార్జి రమేష్ నాయుడు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి. శ్రీనివాసరావు, బీబీఆర్ వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మాజీ, సెక్రటరీ గడి.మురళి, ప్రభుత్వా న్యాయవాది రెడ్డి సత్యనారాయణ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గేదెల సత్యం, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ బెల్లాన రవి, సీనియర్ అడ్వకేట్ బొడ్డు సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఇతర జూనియర్, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. -
వెన్నుపోటు పాలనపై ప్రజాగ్రహం
సాక్షిప్రతినిధి, విజయనగరం: వెన్నుపోటు రాజకీయాలకు సీఎం చంద్రబాబు కేరాఫ్ అడ్రస్గా చరిత్రలో నిలిచిపోయారని జనం మండిపడ్డారు. నాడు పిల్లనిచ్చిన మామ దివంగత ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడుచి పార్టీని, పదవిని లాక్కున్న చంద్రబాబు.. నేడు ఎన్నికలకు ముందు ప్రజలకు సాధ్యం కానీ హమీలు గుప్పించి వాటిని అమలు చేయకుండా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ రెండేళ్లుగా వెన్నుపోటు పొడుస్తున్నారని దుమెత్తిపోశారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు గురువారం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి పంచిన బాండ్లతో పాటు సూపర్ సిక్స్ పేరిట ప్రకటించిన మేనిఫెస్టో జాబితాలను దహనం చేశారు. చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలి.. వెన్నుపోటుబాబు.. చంద్రబాబు... ఇచ్చిన హమీలన్నీ తక్షణమే అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ● ఎగసిన నిరసన సెగ చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా విజయనగరం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జనం ఆందోళన చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు మోసపూరిత పాలనను ఎండగట్టారు. మాకొద్దీ రాక్షసపాలన అంటూ నినదించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన బాండ్లు, ప్రకటించిన మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ మండలాధ్యక్షుడు కెల్ల త్రినాథరావు, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్లీడర్ శెట్టి వీరవెంకటరాజేష్, తదితరులు పాల్గొన్నారు. ● మీ పాలనకో దండం ఎన్నిల్లో లబ్ధికోసం ఉత్తుత్తి హామీలిచ్చి మోసం చేశారంటూ రాజాం నియోజకవర్గ ప్రజలు మండిపడ్డారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన తెలిపారు. రెండేళ్లుగా దగాకోరు పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా రాజాం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పొనుగుటివలస కూడలిలో మానవహారం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్ట్రోపతులను చించివేసి నిరసన తెలిపారు. సంతకవిటి, రేగిడి, వంగర మండలాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, జెడ్పీ వైస్చైర్మన్ సిరిపురపు జగన్మోహనర్రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలపై కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు, నాయకులు వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు నాడు పిల్లనిచ్చిన మామకు... నేడు ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ప్రజలను వంచిచుస్తున్న వైనం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన టీడీపీ మేనిఫెస్టో ప్రతుల దహనం -
● బొబ్బిలిలో నిరసన హోరు
అధికారం కోసం ఉత్తుత్తి హామీలిచ్చి.. ఓట్లు దండుకున్నాక జనాన్ని నిలువునా ముంచేశారంటూ చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంపై జనం నిప్పులుచెరిగారు. సూపర్ సిక్స్ అంటూ జనానికి మోసం ఫిక్స్చేశారన్నారు. రెండేళ్లుగా చంద్రబాబు సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనకు నిరసనగా బొబ్బిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. పార్టీ బొబ్బిలి సమన్వయకర్త శంబంగి వెంకట చినప్పలనాయుడు సమక్షంలో బొబ్బిలిలోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ టీడీపీ మేనిఫెస్టో ప్రతులు, బాండ్లను దహనం చేశారు. ప్రజలను చంద్రబాబు వంచిస్తున్న తీరును వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యులు ఇంటి గోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు తమ్మిరెడ్డి ధామోదరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.వి.మురళీకష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. -
● దగాకోరు పాలన ఇంకెన్నాళ్లు?
ప్రజలను మోసం చేసే దగాకోరు పాలన మాకొద్దు.. కర్షక, కార్మిక, నిరుద్యోగ, ఉద్యోగ, మహిళ, విద్యార్థి లోకాన్ని వంచిస్తున్న చంద్రబాబు సర్కారును గద్దెదించుతాం అంటూ జనం నినదించారు. ఎస్.కోట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ ఉత్తుత్తి గ్యాస్గా మార్చేశారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు మంగళం పాడేశారని విమర్శించారు. చంద్రబాబు రెండేళ్లుగా సాగిస్తున్న వెన్నుపోటు పాలన తీరును ఎస్.కోట, వేపాడ, కొత్తవలస, ఎల్.కోట, జామి మండలాల పార్టీ నేతలు మోపాడు కుమార్, మమ్ములూరు జగ్గుబాబు, గుమ్మడి సత్యనారాయణ, మాజీ జెడ్పీ చైర్పర్సన శోభ స్వాతిరాణి, తదితరులు ఎండగట్టారు. మేనిఫెస్టో ప్రతులు, ప్రజలకిచ్చిన హామీల బాండ్లను దహనం చేశారు. -
‘ఎఫ్ఎన్ఎన్’ ఉపాధ్యాయుల శిక్షణ ప్రారంభం
● 10 కేంద్రాల్లో 1,980 మంది టీచర్లకు శిక్షణ ● తొలిరోజున అసౌకర్యాల నడుమ ‘శిక్ష’ణ విజయనగరం అర్బన్: విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమెరసీ–ఎఫ్ఎల్ఎన్) మెరుగుపరచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఆరు రోజులపాటు శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా విజయనగరం, బొబ్బిలి, రామభద్రపురం, చీపురుపల్లి, రాజాం నియోజకవర్గ కేంద్రాల పరిధిలో మొత్తం 10 కేంద్రాల్లో 1980 మందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాల నిర్వహణను డీఈఓ యు.మాణిక్యంనాయుడు సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు శాతం, బోధనా పద్ధతులు, గ్రూప్ యాక్టివిటీస్, శిక్షణ సామగ్రి వినియోగాన్ని పరిశీలించారు. గణిత నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. అసౌకర్యాల ‘శిక్ష’ణ ఆరు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ తొలిరోజున అసౌకర్యాల నడుమ జరిగిందని ఉపాధ్యాయులు వాపోయారు. పట్టణంలోని పూల్బాగ్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఇరుకు గదులు, పిల్లలకు వినియోగించే బెంచీలు, తిరగని ఫ్యాన్ల నడుమ శిక్షణ ఇవ్వడంపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. అయితే, పదో తరగతి సప్లిమెంట్ పరీక్షల కారణంగా తరగతి గదులు ఖాళీగా లేవని, 5వ తేదీ తర్వాత సమస్య ఉండదని సమగ్రశిక్ష అధికారులు తెలిపారు. -
సర్వజన ఆస్పత్రి ఇన్చార్జి ఏడీగా ఎర్రాజీరావు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఇన్చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్)గా సుంకర ఎర్రాజీరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏడీగా పనిచేసిన పి.ఎన్.అప్పారావు ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన బాధ్యతలను ఎర్రాజీరావుకు అప్పగించారు. ఏడీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కార్యాలయం ఉద్యోగులు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు. ఆదాయార్జనలో వెనుకబాటు తగదు ● వివిధ శాఖల అధికారులపై కలెక్టర్ సీరియస్ విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రభుత్వానికి రావలసిన ఆదాయ వనరుల సమకూర్పులో వివిధ ప్రభుత్వ శాఖలు వెనుకబడడం సరికాదని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. నిర్దేశించిన వార్షిక లక్ష్యాల సాధనలో వెనుకంజలో ఉన్న శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో రిజిస్ట్రేషన్, రవాణా, మైనింగ్, ఎకై ్సజ్, అటవీ, వాణిజ్య పన్నలశాఖ ఉన్నతాధికారులతో కలెక్టర్ బుధవారం అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల నత్తనడక తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేస్తూ టార్గెట్లు రీచ్కాకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలు, సాంకేతిక వైఫల్యాల వల్లే ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోందని మండిపడ్డారు. సమావేశంలో నోడల్ అధికారి రేవతి, రవాణా డిప్యూటీ కమిషనర్ మణికుమార్, ఎకై ్సజ్ కమిషనర్ బి.శ్రీనాథుడు, జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మలాజ్యోతి, గనుల శాఖ డీడీ సూర్యచంద్రరావు పాల్గొన్నారు. ‘జలధార–జలహారతి’ పనులపై సమీక్ష జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధి– పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ వర్చుల్గా సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల సమాచారం, నిర్వహణ వ్యవస్థ (రిమ్స్) యాప్లో నమోదైన పనుల వివరాలను పరీశీలించారు. పరిపాలన ఆమోదం పొంది ఇంకా ప్రారంభం కాని 2,815 పనులు వెంటనే గ్రౌండ్ అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డ్వామా పీడీ శారదాదేవి, జిల్లా పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. మెరకముడిదాం వీఏఏ సస్పెన్షన్● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ● ఎరువుల డబ్బులు మార్క్ఫెడ్కు చెల్లించకపోవడమే కారణం మెరకముడిదాం: స్థానిక సచివాలయంలో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ మల్లేడ భాస్కరరావుపై సస్పెన్షన్ విధిస్తూ కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి రెండురోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం మెరకముడిదాం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ మల్లేడభాస్కరరావు ఎరువుల పంపిణీకి చెందిన రూ.1 లక్షా 25 వేలు మార్క్ఫెడ్కు చెల్లించకపోవడంతో మార్క్ఫెడ్ అధికారులు పలుమార్లు డబ్బులు చెల్లించాలని కోరారు. అయితే వీఏఏ భాస్కరరావు తరచూ వాయిదాలు వేస్తుండడంతో మార్క్ఫెడ్ అధికా రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ భాస్కరరావుపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే భాస్కరరావు సస్పెన్షన్ విషయాన్ని మండలానికి చెందిన అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
● ఉత్తుత్తి హామీలతో మోసం చేశారు
ఉత్తుత్తి హామీలతో చంద్రబాబు, కూటమి నాయకులు మోసం చేశారంటూ జనం మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనపై చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చీపురుపల్లి, గరివిడి మండలాల్లో శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కుమారుడు డా.బొత్ససందీప్, గుర్ల, మెరకముడిదాం మండలాల్లో కుమార్తె బొత్స అనూష పాల్గొన్నారు. చంద్రబాబు సూపర్సిక్స్ హామీ ప్రతులను చింపి నిరసన తెలిపారు. హామీలు అమలుచేయలేని చేతగాని నాయకులు గద్దె దిగాలంటూ నినదించారు. కూటమి వెన్నుపోటు పాలనను అనూష ఎండగట్టారు. -
విద్యుత్ షాక్తో విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ మృతి
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని బొండపల్లి గ్రామానికి చెందిన విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ (వీఈడబ్ల్యూ) లోచర్ల సాయిబాబు విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సాయిబాబు సిరుగుడుపేట వద్ద గల ఏబీ స్విచ్ను ఆఫ్ చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్ పక్కనే ఉన్న హెవీ లైన్కు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ ప్రమాదానికి గురైన సాయిబాబును రాజాం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే సాయిబాబు ప్రాణాలు కోల్పోయాడు. సాయిబాబు చీపురుపల్లి ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 20 ఏళ్లుగా సొంత గ్రామంలోనే విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్గా పనిచేస్తున్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో భార్య, పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇరవై ఏళ్లుగా చీపురుపల్లిలో ఆర్ఈసీఎస్ ఉన్నప్పటి నుంచి విధులు నిర్వహిస్తూ విద్యుత్ షాక్తో మరణించిన సాయిబాబు కుటుంబాన్ని ఆదుకోవాలని ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న వీఈడబ్ల్యూలు, జేఎల్ఎమ్, ఎనర్జీ అసిస్టెంట్ల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. -
వ్యసనాలకు అలవాటు పడి.. దొంగలుగా మారి
నరసన్నపేట: ఉత్తరాంధ్రలో పలు చోరీ కేసుల్లో నిందితులైన విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన మండూరి సంతోష్ కుమార్, బూర అశోక్ ఎట్టకేల కు నరసన్నపేట పోలీసులకు చిక్కారు. సత్యవరం సర్వీసు రోడ్డుపై అనుమానాస్పదంగా ఉన్న వీరిని పోలీసులు పట్టుకుని తమదైన శైలిలో ఆరా తీయగా పలు కేసుల్లో నిందితులుగా తేలింది. వీరి నుంచి రూ.23.64 లక్షల విలువైన 157 గ్రాముల బంగారం ఆభరణాలు, ఒక బజాజ్ పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావులు నరసన్న పేట సర్కిల్ స్టేషన్లో గురువారం విలేకరుల కు వివరాలు వెల్లడించారు. ఈ ఇద్దరు యువకులు కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ కాలం గడుపుతూ వ్యసనాలకు బానిసలుగా మారారు. కార్పెంటర్ వృత్తిలో అంతగా డబ్బులు రాకపోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నాల్లో భాగంగా దొంగతనాలకు పాల్పడ్డారు. ముఖానికి మాస్క్లు పెట్టుకొని రోడ్డుపై ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారని వివరించారు. వారిపై నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్, పోలాకి, రామభద్రపురం, పెందుర్తి, గోపాలపట్నం పోలీసు స్టేషన్లలో 7 చోట్ల చోరీలకు పాల్పడగా కేసులు నమోదయ్యాయని అన్నారు. వీరిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేయ డంలో కృషి చేసిన నరసన్నపేట ఎస్ఐ బలివాడ గణేష్తో పాటు పలువురు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని అన్నారు. సమావేశంలో నరసన్న పేట సీఐ మరడాన శ్రీనివాసరావులతో పాటు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి..
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఇరిడి సెంటర్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్నా ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జోళ్ల గూడ గ్రామానికి చెందిన ఎన్. జగన్, మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇరిడి వెళ్తుండగా.. తోలుఖర్జ గ్రామానికి చెందిన పాలక సహదేవుడు గుమ్మలక్ష్మీపురం వస్తుండగా మార్గమధ్యంలో ఇరిడి గ్రామం దాటాక ఇరిడి సెంటర్ సమీపంలో రెండు వాహానాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో సహదేవుడు (46) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ద్విచక్ర వాహన చోడకుడు జగన్కు తీవ్ర గాయాలవడంతో భద్రగిరి ఆస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం జగన్ను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. కాగా సహదేవుడు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భద్రగిరి ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్విన్ పేట పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరొకరికి గాయాలు -
నేటి మొక్క రేపటి ఊపిరి..!
● మొక్కలు నాటుదాం..పుడమి తల్లికి కానుకిద్దాం ● ప్రకృతితో సహజీవనమే పర్యావరణ పరిరక్షణ ● నేడే ప్రపంచ పర్యావరణ దినోత్సవం విజయనగరం గంటస్తంభం: మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అసలు ఒడి మాత్రం ప్రకృతిదే. గాలి, నీరు, నీడనిచ్చేది ప్రకృతి. అలాంటి ప్రకృతినే మనిషి తన చేతులతో నాశనం చేస్తున్నాడు. ఒకప్పుడు ఊరి బయట పెద్ద పెద్ద మర్రిచెట్లు ఉండేవి. వాటి కింద రైతులు సేద తీరేవారు. ప్రయాణికులు కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. పక్షులు గూళ్లు కట్టుకునేవి. ఇప్పుడు ఆ చెట్ల స్థానంలో సిమెంట్ కట్టడాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు నిండుగా కళకళలాడిన చెరువులు ఇప్పుడు ఎండిన మైదానాలుగా మారుతున్నాయి. అభివృద్ధి పేరుతో మనిషి ప్రకృతిని దూరం చేసుకుంటున్నాడు. కానీ ప్రకృతిని కోల్పోతే అభివృద్ధి కూడా నిలవదనే విషయాన్ని మరిచిపోతున్నాడు. ప్రకృతి విలాపం వినిపించదా? ఈ వేసవిలో విజయనగరం జిల్లాలో మండిపోయిన ఎండలకు మధ్యాహ్నం పూట రోడ్లపై జనాలు కనిపించలేదు. చెట్టు నీడ కోసం వెతికే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు..ప్రకృతి మనకు ఇస్తున్న హెచ్చరిక. మనిషి అవసరాల కోసం ప్రకృతిని వాడుకోవడం సహజమే. కానీ స్వార్థం కోసం దోచుకోవడం ప్రమాదకరం. చెట్లు నరికేస్తున్నాం. అడవులను మాయం చేస్తున్నాం. ప్లాస్టిక్తో భూమిని నింపేస్తున్నాం. అయినా ప్రకృతి ప్రతీకారం తీర్చుకోవడం లేదు. కానీ తన బాధను ఎండల రూపంలో, తుఫాన్ల రూపంలో, వరదల రూపంలో మనకు చూపిస్తోంది. 2026 థీమ్..ప్రకృతే భవిష్యత్తుకు దారి ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ‘ఇన్స్పైర్డ్ బై నేచర్..ఫర్ క్లైమేట్...ఫర్ అవర్ ఫ్యూచర్’’ అంటే ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని వాతావరణ మార్పులను ఎదుర్కొని భావితరాలకు సురక్షిత భవిష్యత్తు అందించాలన్నదే ప్రధాన సందేశం. చెట్లు, అడవులు, చెరువులు, జీవవైవిధ్యం రక్షించడమే వాతావరణ సంక్షోభానికి అసలైన పరిష్కారమని ఈ థీమ్ చెబుతోంది. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అకాల వర్షాలు, కరువు పరిస్థితులు, వేడిగాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీనిని నియంత్రించకపోతే భవిష్యత్తులో మరిన్ని విపత్తులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పచ్చదన ఉద్యమం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో అటవీశాఖ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో మొక్కల నాటడం, అవగాహన ర్యాలీలు, పర్యావరణ ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అడవుల విస్తీర్ణం పెంచడం, చెరువులను సంరక్షించడం, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చని భవిష్యత్తు పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతగా మొక్కలు నాటడం, నీటిని ఆదా చేయండం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టాలి. అప్పుడే భావితరాలకు పచ్చని భవిష్యత్తు అందించగలం. నాటిన మొక్కను కాపాడితే పర్యావరణానికి మేలు.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి. జిల్లాలో లక్షలాది మొక్కల పెంపకానికి లక్ష్యాలు నిర్దేశించాం. పచ్చదనం పెరిగితేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. ప్రతి ఇంటి ముందూ ఒక మొక్క, ప్రతి గ్రామంలో ఒక పచ్చని ఉద్యమం అవసరం బిర్లంగి రామ్నరేష్, ఫారెస్ట్ రేంజ్ అధికారి, విజయనగరం -
ఇంటింట పింఛన్ల పంపిణీకి మంగళం..!
● అందరికీ ఒకే చోట అందజేస్తున్న పరిస్థితి ● వృద్ధులనూ పంచాయతీ కార్యాలయాలకు రప్పిస్తున్న సిబ్బంది ● సర్కారు తీరుతో విస్తుపోతున్న పింఛన్దారులు ● వైఎస్సార్సీపీ హాయంలో ఉదయం 5 గంటలకే తలుపుతట్టి అందజేతఇంటింటికీ వెళ్లి పింఛన్ ఇవ్వాలి అందరినీ ఒకచోటకు పిలిచి పింఛన్లు పంపిణీ చేయకూడదు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేయాలి అలా ఎక్కడైనా అందజేయకపోతే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస పాణి, డీఆర్డీఏ పీడీ ఒకేచోటకు రప్పించి అందజేత ప్రస్తుత టీడీపీ సర్కార్ పింఛన్దారులను రచ్చబండ వద్దకు, పంచాయతీ కార్యాలయం వద్దకు, లేదా వీధిలో ఒకచోట కూర్చుని వారి వీధిలో ఉన్న పింఛన్ దారులందరినీ పిలిపించి అక్కడ ఇస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులను సైతం రప్పించుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇబ్బందికరమైనా పింఛన్దారులకు తప్పని పరిస్థితి. జిల్లాలో 2,68,072 ఫించన్లు జిల్లాలో వివిధ కేటగిరిలకు చెందిన పింఛన్లు 2,68,072 ఉన్నాయి. వాటిలో వృద్ధాప్య 1,28,623, వితంతు 73,727, దివ్యాంగ 35, 538, అభయహస్తం 10,044, ఒంటరి మహిళలు 5,117, డప్పు కళాకారులు 4,005, చేనేత 2,844, గీతకార్మికులు 2,876, మత్య్సకారులు 2,129, చర్మకారులు 1548, డీఎంహెచ్ఓ 870, డయాలసిస్ 469,కళాకారుల 253, టాన్స్జెండర్స్ 26, సైనిక్ వేల్ఫేర్ పింఛన్లు 3 ఉన్నాయి. -
8న అంబేడ్కర్ గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో (జోన్–1 పరిధిలో) వివిధ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి విజయనగరం జిల్లా సమన్వయ అధికారి ఎం.మాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ సీట్ల భర్తీకి సంబంధించి ఈ నెల 8న జిల్లాలోని చీపురుపల్లిలో గల డాక్టర్ బీఆర్అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. తరగతుల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు ఇలా.. 5వ తరగతి ప్రవేశాల్లో బాలుర పాఠశాలల్లో 255 సీట్లు, బాలికల పాఠశాలల్లో 341 సీట్లు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ప్రవేశాల్లో భాగంగా బాలుర కళాశాలల్లో 224 సీట్లు, బాలికల కళాశాలల్లో 202 సీట్లు ఖాళీగా ఉన్నాయి. బ్యాక్లాగ్ సీట్లుగా 6వ తరగతి బాలుర పాఠశాలల్లో 162, బాలికల పాఠశాలల్లో 169 ఖాళీలు ఉన్నాయి. 7వ తరగతిలో బాలుర పాఠశాలల్లో 47 సీట్లు, బాలికల పాఠశాలల్లో 86, 8వ తరగతి బాలుర పాఠశాలల్లో 19, బాలికల పాఠశాల్లో 84, 9వ తరగతి బాలుర పాఠశాలల్లో 45, బాలికల పాఠశాలల్లో 9 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. సీట్లు అన్నీ కేవలం ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు మాత్రమే అని, అర్హత ఆసక్తిగల విద్యార్ధులు తమకు సంబంధించిన అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ఈ నెల 8న చీపురుపల్లిలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల కౌన్సెలింగ్ కేంద్రానికి నేరుగా హాజరుకావాలని ఆమె కోరారు. -
పిడుగుపాటుతో మూగజీవాలు..
వేపాడ: మండలంలోని కొండగంగుబూడి గ్రామం సమీపంలో గురువారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో పిడుగుపడి తొమ్మిది మేకలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రామస్వామిపేట గ్రామానికి చెందిన పత్రి శ్రీను మేకలను మేతకోసం కొండగంగుబూడి గ్రామం సమీపంలో విజయరామసాగరం చెరువు వద్దకు తోలుకెళ్లాడు. మధ్యాహ్నం వర్షం కురిసిన సమయంలో పిడుగు పడి రెండు మేకపోతులు, ఏడు మేకలు చనిపోయాయి. కె.జి.పూడి గ్రామానికి చెందిన చలుమూరి వెంకటరావుకు చెందిన ఒక మేక పిడుగుపాటుతో చనిపోయింది. జీవాల మరణంతో సుమారు రూ.3లక్షల మేర నష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
4.5 కిలోల కణితి తొలగింపు
మహారాణిపేట (విశాఖ): కేజీహెచ్లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన టి.రజని ఏడాది కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ గత నెల 14న కేజీహెచ్ యూరాలజీ విభాగంలో చేరారు. పరీక్షల అనంతరం ఆమె కడుపులోని అడ్రినల్ గ్రంథిలో కుడివైపు 6 సెం.మీ, ఎడమవైపు 28 సెం.మీ మేర కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. లక్ష మందిలో నలుగురికి మాత్రమే వచ్చే ‘బైలాటరల్ అడ్రినల్ మైలోలిపోమా విత్ కంజెనిటల్ అడ్రినల్ హైపర్ప్లాసియా’ అనే అరుదైన వ్యాధిగా దీనిని నిర్ధారించారు. యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో, ఎండోక్రినాలజీ, అనస్తీషియా విభాగాల సహకారంతో గత నెల 19న రజనికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న 4.5 కిలోల భారీ కణితను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రశేఖర్, అనస్తీషియా వైద్యులు కె.శ్రీలక్ష్మి, శరత్ చంద్ర, అప్పలరాజు, వెంకటకృష్ణ, దత్తాత్రేయ బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు.జులై 1న డీఈఈ సెట్● ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారావు నెల్లిమర్ల: డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీఈఈ సెట్) జులై 1వ తేదీన జరుగుతుందని వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 11 నుంచి తమ హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. జులై 4న ఫలితాలు వెలువడతాయన్నారు. 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షనన్ కోసం అవకాశం ఉంటుందన్నారు. 16న సీట్ల కేటాయింపు, 19 నుంచి 23 వరకు ధ్రువీకరణపత్రాల పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. రెండు లారీలు ఢీకొని డ్రైవర్కు గాయాలుగజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ 26వ నంబర్ జాతీయ రహదారి వద్ద బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఓ లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి సాలూరు నుంచి వస్తున్న లారీ, ఎదురుగా విజయనగరం నుంచి వస్తున్న లారీ మధుపాడ జాతీయరహదారి వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాలూరు నుంచి వస్తున్న కేరళ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీలను పోలీసులు క్రేన్ సహాయంతో పక్కకు తీశారు. ఫుట్బాల్ ఏపీ జట్టు కెప్టెన్గా నవీన్విజయనగరం అర్బన్: జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు కెప్టెన్గా స్థానిక సత్య డిగ్రీ/ పీజీ కళాశాల విద్యార్ధి పి.నవీన్ ఎంపికయ్యాయడని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవ మణి తెలిపారు. అనంతపురం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీగ్స్’ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీల్లో నవీన్ అద్భుతమైన ఆటతీరు కనబరిచి విజేతగా నిలిచాడు. త్వరలో జెంషెడ్పూర్లో జరగబోయే జాతీయ స్థాయి ఫుట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో గురువారం జరిగిన కార్యక్రమంలో నవీన్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణ్రావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవ మణి, కళాశాల అధ్యాపక బృందం అభినందించారు. -
నీట్ అవకతవకలపై విద్యార్థులఆగ్రహం
విజయనగరం గంటస్తంభం: నీట్, యూజీ తదితర ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై విద్యార్థులు భగ్గుమన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా జాతీయ పరీక్షల నిర్వహణ పేరుతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విద్యార్థుల భవిష్యత్తును తాకట్టుపెడుతోందని ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు నిరసనగా భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ కూడలి వద్ద బుధవారం ఆందోళన చేశారు. ర్యాలీ, మానవహారం చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తక్షణమే మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పూడి రామ్మోహన్రావు మాట్లాడుతూ లీకేజీల విషయంలో వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. ఎన్నిసార్లు ప్రశ్నపత్రాలు లీకవుతున్నా ప్రభుత్వం మాత్రం నిందితులను శిక్షించడం కంటే వివరణలు ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందని విమర్మించారు. కోట్లాది మంది విద్యార్థుల కష్టం, ప్రతిభ, ఆశయాలను కొందరి అక్రమాలకు బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పరీక్షల అవకతవకల వల్ల నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు వి.చిన్నబాబు, గర్ల్స్ కన్వీనర్ ఆర్.శీరీష, ఉపాధ్యక్షుడు ఎం.వెంకీ, సహాయ కార్యదర్ములు ఎస్.సోమేశ్, పి.రమేష్,జిల్లా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


