breaking news
Vizianagaram
-
నేటి నుంచి కనకదుర్గమ్మ జాతర
పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆదివారం మహిళా శక్తి కదం తొక్కింది. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీని కలెక్టర్ ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థినులు, మహిళా పోలీసు లు, అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా హక్కులపై నినాదాలు చేశా రు. కోలాటాలు, థింసా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో జేసీ యశ్వంత్కుమార్రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, ఐసీడీఎస్ అధికారి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన రామనారాయణంలో ద్వాదశ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఎన్సీఎస్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానప్రతులను ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు చాణిక్య హర్ష, మేనేజర్ రమణ, తదితరులు పాల్గొన్నారు. -
క్రైమ్ కార్నర్..
డెంకాడ: విజయనగరం – విశాఖ జాతీయ రహదారిపై మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఎ.సన్యాసినా యుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా ఆనందపురంలో జరగనున్న వాహనాల వేలంలో పాల్గొనేందుకు విజయనగరానికి చెందిన పులప అప్పారావు శనివారం ఉదయం బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో విజయనగరం వస్తుండగా.. రాత్రి 9.30 గంటల సమయంలో అయినాడ జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. దీంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పారావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవు తున్నారు. భామిని: మండలంలోని సతివాడ గ్రామానికి చెందిన పున్నాన తేజ (7) చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. తేజ తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని కర్ర చెరువు వద్ద ఆటలాడుతూ.. చేపలు పట్టే క్రమంలో చెరువులో దిగారు. ఈక్రమంలో తేజ ప్రమాదవశాత్తూ చెరువులో కూరుకుపోయి మృతి చెందాడు. దీంతో భయాందోళనలకు గురైన స్నేహితులు కేకలు వేశారు. దీంతో స్థానికులు చెరువులో దిగి గాలించారు. తేజను చెరువు ఒడ్డుకు చేర్చారు. అప్పటికే తేజ మృతి చెందాడు. ఇదిలా ఉండగా తేజ తండ్రి లక్ష్మణరావు రెండేళ్ల కిందటే మృతి చెందాడు. దీంతో తల్లి జయలక్ష్మి బోరున విలపిస్తోంది. భర్త చనిపోయి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు తేజపైనే ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తున్నానని రోదిస్తోంది. ఇక తాను ఎవరి కోసం జీవించాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆమె రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. -
షేడ్నెట్స్ ఏర్పాటులో..నత్తే నయం..!
విజయనగరం ఫోర్ట్: ఆధునాతన వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన షేడ్ నెట్ పథకం లక్ష్యానికి అనుగుణంగా సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ షేడ్ నెట్ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో చేపడుతున్నట్టు గొప్పగా చెప్పారు. కానీ వాటి ఏర్పాటులో శ్రద్ద చూపడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్ష్యంలో సగం కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ లక్ష్యం నేరవేరడం లేదు. స్వయం సహాయక సంఘాల మహిళల (డ్వాక్రా మహిళ)తో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే వీటి ఏర్పాటుకు రాయితీ లేకపోవడంతో మహిళలు ముందుకు రావడం లేదు. ఆసక్తి చూపని లబ్ధిదారులు షేడ్ నెట్ యూనిట్లను 400 –500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాగు చేసేలా రుపొందించారు. అందుకుగాను రూ.2.15 లక్షల ఖర్చు అవుతుంది. రూ.లక్ష వరకు రాయితీ వర్తిస్తుందని, మిగిలిన మొత్తం సెర్ప్ ద్వారా రుణంగా ఇస్తారని గతంలో వెల్లడించారు. వీటి ఏర్పాటును కేతి అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. గతంలో 450 మంది షేడ్ నెట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. 78 మందికి ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు రావని తెలియడంతో వారు కూడా ఆగిపోయారు. వ్యయం తగ్గించినా అదే పరిస్థితి షేడ్ నెట్ వ్యయం రూ.2.15 లక్షలతో ఏర్పాటు చేయడానికి మహిళలు ముందుకు రాకపోవడంతో ఆ వ్యయాన్ని తగ్గించారు. అయినప్పటకీ అదే పరిస్థితి ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 50 శాతం వరకు వ్యయాన్ని తగ్గించారు. 6, 10 సెంట్లు రూపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆరు సెంట్లుకు రూ.1,04,400 లు, 10 సెంట్లుకు రూ.1,37,100 గా నిర్ణయించారు. వెలుగు, సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి, సీఐఎఫ్ ద్వారా వడ్డీకి రుణాలు ఇస్తుంది. 100 యూనిట్లకుగాను ఇప్పటి వరకు 42 ఏర్పాటు చేశారు. మార్చి నెలఖారులోగా వీటిని పూర్తి చేయాల్సి ఉంది. అయితే గడువు కేవలం 23 రోజులే ఉంది. మరి శతశాతం షేడ్ నెట్స్ ఏర్పాటు చేస్తారా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది. షేడ్ నెట్ ఏర్పాటుకు లబ్ధిదారులు రూ.34,100 భరించాల్సి ఉంటుంది. షేడ్ నెట్స్లో పండించేవి.. షేడ్ నెట్స్లో కూరగాయాలు, ఆకుకూరలు, పువ్వులు, నారు పెంచుతారు. షేడ్ నెట్లో పండించడం వల్ల అధిక ఎండ, వేడి పంటలను మొక్కలను రక్షిస్తుంది. 75 శాతం వరకు రాయితీ ఇస్తుంది. నేల నుంచి తేమ ఆవిరి కాకుండా తగ్గిస్తుంది. దీని వల్ల నీటి అవసరం తగ్గుతుంది. పక్షులు, కీటకాలు, వడగండ్ల నుంచి పంటలను రక్షిస్తుంది. కావాల్సినంత కాంతి, తేమను అందించడం ద్వారా పూలు, పండ్లు, కూరగాయాలు నాణ్యత పెరుగుతుంది. రాయితీ లేకపోవడంతో ముందుకు రాని మహిళలు 100 యూనిట్లకుగాను 42 మాత్రమే ఏర్పాటు ఇంకా 23 రోజులే గడువు42 ఏర్పాటు ఇప్పటి వరకు జిల్లాలో 42 షేడ్ నెట్స్ ఏర్పాటు చేశాం. మిగతావి కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసపాణి, డీఆర్డీఏ పీడీ -
వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం
శృంగవరపుకోట : జిల్లాలో వైఎస్సార్సీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా కేంద్ర కార్యాలయం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలకులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజాం – కె.వి.వి.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి – పేడాడ రమణకుమారి, బొబ్బిలి – రొంగలి జగన్నాధం, నెల్లిమర్ల – నెక్కల నాయుడుబాబు, శృంగవరపుకోట – మాజీ ఎమ్మెల్యే కొట్టుగిల్లి భాగ్యలక్ష్మి, విజయనగరం – తూముల భాస్కరరావు, గజపతినగరం – శోభా స్వాతిరాణిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారని కేంద్ర పార్టీ కార్యాలయం సూచించింది. -
కార్డన్ సెర్చ్లో 22 వాహనాలు స్వాధీనం
విజయనగరం క్రైమ్ : విజయనగరం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధి జొన్నగుడ్డిలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో ఈగల్ టీమ్తో పాటు విజయననగరం వన్ టౌన్, టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆర్వీకే చౌదరి, శ్రీనివాసరావు 150 మంది సిబ్బందితో బాలాజీ జంక్షన్ ఏరియా, జొన్నగుడ్డిలో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. ప్రతీ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆధార్, రేషన్, గ్యాస్, కరెంట్ బిల్లులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జొన్నగుడ్డి ప్రాంతాన్ని 14 వీధులుగా విభజించిన పోలీసులు అణువణువు గాలించారు. ఎస్ఐ లీలావతి, నవీన్ పడాల్, కనకరాజు ఐదుగురేసి కానిస్టేబుళ్లుతో బృందాలుగా విడిపోయి ఇళ్లల్లో ఉన్న వారి ఆధారాలు సేకరించారు. జొన్నగుడ్డిలో రామమందిరం వద్ద నిర్మాణంలో ఉన్న రెండస్తుల భవనంలో రెండు రోజుల కిందటే కొందరు కుర్రాళ్లు గంజాయి సేవించి పంపకాల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని అలెర్ట్ చేయడంతో పాటు గంజాయి సేవించిన స్థలాన్ని కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే జొన్నగుడ్డి మహిళలతో ఏఎస్పీ సమావేశమయ్యారు. మీ ప్రాంతంలోకి అనుమానితులు వచ్చినా... అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, మద్యం సేవించినా, మత్తు పదార్ధాలు రవాణ జరిగినా తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తనిఖీల్లో రికార్డులు సరిగా లేని 22 బైక్లను పోలీస్స్టేషన్కు తరలించారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే దిగ్బంధం చేశారు. ఎటువంటి నిషేధిత వస్తువులు, గంజాయి, సారా వంటివి లభ్యం కాలేదని ఏఎస్పీ తెలిపారు. ఈగల్ టీం ఆర్ఐ టి.ధనంజయనాయుడు, విజయ్కుమార్, వన్ టౌన్, టూ టౌన్ పోలీస్స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. -
అనారోగ్యంతో నాలుగో తరగతి విద్యార్థిని మృతి
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పి.టి మండ గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని కొండగొర్రి సాయి సార్విని మలేరియా, పచ్చ కామెర్లు వ్యాధితో విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్ను మూసింది. కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు కొండగొర్రి నూకం దొర, జయశ్రీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల కురుపాం రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు అంజలి, కల్పన, కవితలే కాకుండా పలువురు గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మొదటి సంతకం ఏమైందో కానీ ఇప్పటి వరకు ఒక్క ఆరోగ్య కార్యకర్తను వేసిన దాఖలాలు లేవని, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో, వసతిగృహాల్లో ఆరోగ్య కార్యకర్తను వేసి ఉంటే ఇంత మంది గిరిజన విద్యార్థుల చావులు ఉండేవి కాదని తమ కుమార్తె జ్వరమే అనుకున్నాం కానీ పచ్చకామెర్లు వచ్చిన సంగతి గుర్తించలేక పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మొదటి సంతకాన్ని నిలబెట్టుకుంటే ఇంతమంది గిరిజన విద్యార్థులు చనిపోయేవారు కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. చనిపోయిన విద్యార్థిని సాయి సార్విని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
వలపు వల నిందితుల అరెస్టు
విజయనగరం క్రైమ్: ఫేస్బుక్లో పరిచయంతో ఓ యువకుడికి గాలం వేసి, బంగారు చైన్ను దోచుకున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను విజయనగరం ఏఎస్పీ సౌమ్యలత వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తంపురానికి చెందిన పాండ్రంకి కిరణ్, ఉష భార్యాభర్తలు. భర్త కిరణ్ సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ను పరిశీలించి, ఎంపిక చేసుకున్న కొంతమంది వ్యక్తులకు యువతిగా నమ్మించి మెసేజ్లు చేస్తారు. వారితో పరిచయం పెరిగాక దగ్గర ఉండి తన భార్య ఉషతో వాట్సాప్కాల్ మాట్లాడిస్తాడు. ఆ ట్రాప్లోనే భీమిలికి చెందిన వెలవలపల్లి సాయిరమేష్ (28) అనే కుర్రాడు చిక్కుకున్నాడు. సాయిరమేష్తో వాట్సాప్ కాల్లో ఉష తరచూ మాట్లాడేది. ఆమె కోరిక మేరకు గతనెల 14న జామి మండలం అలమండ సంత వద్దకు వెళ్లాడు. పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న ఉష, కిరణ్తో పాటు ప్రసాద్, జామికి చెందిన బోని ఎర్నిబాబుతో కలిసి ఒక్కసారిగా రమేష్పై దాడిచేశారు. తన భార్యకు మెసేజ్లు, వాట్సాప్ కాల్స్చేసి వేధిస్తున్నాడంటూ స్థానికులను నమ్మించి బలవంతంగా బైక్పై రమేష్ ను భీమసింగివైపు తీసుకెళ్లారు. అక్కడ కత్తితో బెదిరించారు. మెడలోని 18 గ్రాముల బంగారు చైన్ను బలవంతంగా తీసుకొని, అదనంగా మరో రూ.80 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ భయపెట్టారు. యువకుడు తేరుకుని తన తప్పులేదని భావించి మార్చి 3న జామి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వై.వీర జనార్దన్ కేసునమోదు చేసి, ఫేస్బుక్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్టు ఏఎస్పీ సౌమ్యలత తెలిపారు. వారి నుంచి మొబైల్, పల్సర్ బైకు, బంగారం చైన్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. సోషల్ మీడియాలో పరిచయాలను నమ్మవద్దని, గుర్తు తెలియని వ్యక్తుల ప్రలోభాలకు గురికావద్దని ఆమె హెచ్చరించారు. సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్.కోట రూరల్ సీఐ ఎల్.అప్పలనాయుడు, జామి ఎస్ఐ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో డ్రైవర్ దుర్మరణం
కొత్తవలస : మండలంలోని కొత్తవలస – విజయనగరం రహదారిలో అర్ధన్నపాలెం గ్రామ జంక్షన్ సమీపంలో శనివారం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ అప్పికొండ పరదేశి(38) అక్కడికక్కడే మృతి చెందాదు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. లక్కవరపుకోట మండలం భీమాళి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అప్పికొండ పరదేశి కొత్తవలస ప్రాంతంలో సర్వీసు చేసుకొని మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సు అర్ధన్నపాలెం జంక్షన్ సమీపంలో ఆటోను ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం, ఆటో పూర్తిగా నుజ్జయ్యాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ పరదేశి తుళ్లిపడి రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అధిక రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే 108 వాహనానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 108 వాహనానికి ఫోన్ చేయగా అందుబాటులో లేదని సిబ్బంది సమాధానం చెప్పారు. సుమారు అర్ధ గంటకు పైగా క్షతగాత్రుడు రోడ్డుపై ఉండిపోయి అధిక రక్తస్రావం కావడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య శశి, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె రేష్మ, మూడో తరగతి చదువుతున్న జైరామ్ ఉన్నారు. భార్య రేష్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్సీకి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జోగారావు తెలిపారు. -
రూ.49 కోట్లతో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి
రామభద్రపురం: జిల్లాలోని రూ.49 కోట్ల అంచనాలతో సీహెచ్సీ భవనాల నిర్మాణాల పనులతో పాటు ఆధునీకరణ పనులు, ఆయుష్ భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నామని ఏపీఎంఎస్ ఐడీసీ ఈఈ నాగిరెడ్డి భారతి అన్నారు. స్థానిక పీహెచ్సీ ఆవరణలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న ఆయుష్ భవన నిర్మాణ పనులు శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఎస్.కోట, భోగాపురం, నెల్లిమర్ల, బాడంగి, గజపతినగరం తదితర ప్రాంతాలలో రూ.46.78 కోట్లతో సీహెచ్సీ భవనాలు నిర్మాణాలు జరగుతున్నాయన్నారు. వీటిలో పలు చోట్ల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరికొన్ని చోట్ల పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. జిల్లాలోని ఎనిమిది చోట్ల ఆయుష్ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిని పీహెచ్సీల ఆవరణలో నిర్మాణం చేపడుతున్న ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.20 లక్షలు, వేరే ప్రాంతాలలో నిర్మాణాలకు ఒక్కో భవనానికి రూ.30 లక్షలు చొప్పున్న నిధులు మంజూరయ్యాయన్నారు. పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనులు పరిశీలించి నాణ్యత ఉండేలా చూడాలని సంబంధిత డీఈ ప్రసన్నకుమార్కు సూచించారు. ఏపీఎంఎస్ ఐడీసీ ఈఈ భారతి -
మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి
● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి సుబ్బారావు విజయనగరం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఆండ్ గ్రీవెన్స్సెల్ ఆధ్వర్యంలో శనివారం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది మహిళాశక్తి అని అన్నారు. ఏ పనినైనా ధైర్యంగా చేయాలని, కష్ట, నష్టాలను పోరాటపటిమతో ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉందని అన్నారు. సీ్త్ర ఎల్లప్పుడు సూర్యునిలా ప్రకాశవంతంగా ఉండాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అలాగే విశ్వవిద్యాలయం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రిజిస్ట్రార్ జి.జయసుమ అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన విశాఖ జిల్లా కన్జూమర్స్ డిస్పూట్స్ రెడ్రస్సుల్ కమిషన్ సభ్యులు రహీమున్నీసా బేగం మాట్లాడుతూ విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యా ర్థినులకు బహుమతులు, ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు వి.లక్ష్మి, ఎం.రమ్య, బి.దేవి మాధవి, వివిధ విభాగాల అధిపతులు, ఆచార్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
● అన్నింటా ‘ఆమె’..
‘అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా.. పరుగులు తీస్తావు ఇంటా బయటా!’ అని సమాజంలో మహిళల ప్రస్తుత పాత్రను వర్ణించాడు ఓ సినీ కవి. అంతగా శ్రమిస్తున్నా, ఆమెలో అలుపు రాదు.. చిరునవ్వు తప్ప! ఆమె నడిచే దారంతా వెలుగులు పూస్తాయి. అమ్మగా.. భార్యగా.. తోబుట్టువుగా.. బిడ్డగా.. ఓ కుటుంబానికి దారి దీపం ఆమె. సమాజంలో ఏ పాత్ర అయినా తనకు కొట్టిన పిండే. ఆమె లేని చోటు లేదు.. ఆమె చేయని పని లేదు.. ఆమె లేకుండా ఈ జగతే లేదు! అవనిని మోసే భూమాత సీ్త్ర. నేడు మహిళా దినోత్సవం. ఆమె గురించి ఈ ఒక్క రోజు కాదు.. ఏడాదంతా కేటాయించినా తక్కువే. అటువంటి ‘అతివ’రథ మహారథులందరికీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుదాం. – రామభద్రపురం/సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
సర్వేత్రా ఆందోళన..
విజయనగరంఅతివ దుఃఖీభవ..! ● సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ● జిల్లాలో పనిచేస్తున్న సర్వేయర్లలో కనీసం 70 శాతం మందికి గ్రేడ్–1 ప్రమోషన్ ఇవ్వాలి. ● గ్రామ సర్వేయర్ పోస్టుకు ఉన్న అర్హతను పెంచి ఐటీఐ స్థానంలో డిప్లమో లేదా బీటెక్(సివిల్) అర్హతగా నిర్ణయించాలి. ● రీ–సర్వేలో సాంకేతిక పనులు నిర్వహిస్తున్నవారికి టెక్నికల్ అలెన్స్ ఇవ్వాలి. ● ఫీల్డ్లో చేసే పనులకు టీఏ, డీఏతో పాటు ఇతర ఫీల్డ్ అలవెన్సులు చెల్లించాలి. ● ఏడేళ్ల సర్వీసు పూర్తయితే ఉద్యోగోన్నతలు కల్పించాలి. ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026విజయనగరం గంటస్తంభం: తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సర్వేయర్ల కలెక్టరేట్ వేదికగా ఆందోళనకు దిగారు. రెండోరోజు శనివారం కూడా చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలపై నిరసన గళం వినిపించారు. కలెక్టరేట్ లోపల ధర్నా చేపట్టేందుకు ప్రయత్నించిన సర్వేయర్లను పోలీసులు అడ్డుకొని బయటకు నెట్టివేయడంతో ప్రధాన ద్వారం వద్దే ధర్నా కొనసాగించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల ఇద్దరు గ్రామ సర్వేయర్లకు షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేయడంపై సర్వేయర్లు మండిపడ్డారు. కారణం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం మిగతా సర్వేయర్లను భయపెట్టడానికేనంటూ ఆరోపించారు. జిల్లాలో మొత్తం 478 మంది గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్లు ఉన్నారని, ఇద్దరిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. సస్పెండ్ చేయాలంటే అందరినీ చేయండి.. ఇద్దరిని బలిపశువులుగా చేయడం తగదని, తక్షణమే సస్పెన్షన్ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మేము కూడా ప్రభుత్వంలో భాగమే.. ప్రభుత్వ ఉద్యోగులమే అని, మాపై ఎందుకు ఇంత చిన్న చూపు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే సోమవారం చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్వేయర్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సర్వేయర్ల డిమాండ్లు ఇవే... మహిళలకు చంద్రబాబు సర్కార్ శఠగోపం ‘పథకం’ ప్రకారం మోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ వీడని ఆవేదన సస్పెన్షన్తో భయపెడతారా? టమాటా పంట కొనుగోలుకు చర్యలు కూరగాయల రైతులతో ముఖాముఖి రైతు బజారులో విక్రయాలకు ఏర్పాట్లు రామభద్రపురం: రైతులు పండించిన టమాటా పంటను రైతు బజారు వ్యాపారులు నేరుగా కొనుగోలు చేసేందుకు బొబ్బిలి మార్కెట్ కమిటీ అధికారులు చర్యలు చేపట్టారు. టమాటా పంటకు మార్కెట్లో ధర లేకపోవడం, పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఇదే అంశంపై ఈ నెల 6వ తేదీన ‘రైతన్నకు కూర‘గాయాలు’ అనే శీర్షికన ‘సాక్షి’ లో ప్రచురితమైన వార్తకు వ్యవసాయమార్కెట్ కమిటీ కమిషనర్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు ఏఎంసీ కార్యదర్శి కాళేశ్వరరావు, సూపర్వైజర్ తిరుపతిరావు రామభద్రపురానికి చెందిన కోట సోములు సాగుచేస్తున్న టమాటా పంటను శనివారం పరిశీలించారు. పంటను కోయకుండా వదిలేయడం చూసి అవాక్కయ్యారు. విజయనగరం రైతు బజారు వ్యాపారులు నేరుగా ఇక్కడి టమాటా పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. పంటలకు ధరలు లేకపోవడం వాస్తవమేనన్నారు. కలెక్టరేట్ వద్ద సర్వేయర్ల నిరసన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కూటమి ప్రభుత్వం వైఖరిపై మండిపాటు కలెక్టరేట్ లోపల ధర్నాను అడ్డుకున్న పోలీసులు స్పందించకపోతే సోమవారం చలో విజయవాడ -
సివిల్స్లో సత్తా చాటిన ప్రమోద్విష్ణు
● జాతీయ స్థాయిలో 640 ర్యాంకు విజయనగరం ఫోర్ట్: తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆ యువకుడు నిలబెట్టాడు. రెండుసార్లు సాధించలేకపోయినా మూడో ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించి తల్లిదండ్రులతో పాటు జిల్లాకే గుర్తింపు తీసుకొచ్చాడు. కొద్ది నెలల కిందట తల్లి మరణించినప్పటకీ ఆ దుఃఖాన్ని మనసులో దిగమింగుతూ పరీక్షలకు సిద్ధమై యూపీఎస్సీలో జాతీయ స్థాయిలో 640 ర్యాంకు సాధించాడు పట్టణంలోని కామాక్షినగర్లో నివాసం ఉంటున్న పల్లి ప్రమోద్ విష్ణు. విష్ణు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విజయనగరంలోని సెయింట్జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివాడు. 6నుంచి 8వ తరగతి వరకు విజయనగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివాడు. 9, 10 తరగతులు విజయవాడలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదివాడు. ఇంటర్మీడియట్ విజయవాడలోని గోశాల వద్ద చైనా బ్యాచ్ కళాశాలలో చదివాడు. ఢీల్లీలోని ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్ చదివాడు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎయిర్ఫోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారిగా పని చేస్తున్నారు. విష్ణు తల్లిదండ్రులు స్వస్థలం గంట్యాడ మండలం కొర్లాం గ్రామం. తండ్రి పల్లిశ్రీనివాస్ గొట్లాం హైస్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లి లత గంట్యాడ మండలంలోని కొఠారుబిల్లి ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయరాలుగా పని చేసేవారు. అనారోగ్యంతో కొద్ది నెలలు క్రితం మరణించారు. ప్రమోద్విష్ణు యూపీఎస్సీలో మూడో ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించాడు. ఈయనకు ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని తండ్రి పల్లి శ్రీనివాసరావు తెలిపారు. విష్ణును కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందించారు. ఇదిలా ఉండగా విష్ణు సొంత గ్రామం కొర్లాంలో సందడి నెలకొంది. విష్ణు తన ప్రతిభతో గ్రామానికే కాక జిల్లాకే గర్వకారణంగా నిలిచాడని పలువురు అభినందించారు. -
దుబాయ్లో చిక్కుకున్న రేగిడి వాసి
● ఆందోళనలో తల్లిదండ్రులు రేగిడి: మండల పరిధిలోని సంకిలి గ్రామానికి చెందిన గుండ లావణ్యకుమార్ దుబాయ్లో చిక్కుకున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకుని జీవనోపాధి కోసం 2025 జనవరిలో దుబాయ్ వెళ్లాడు. అక్కడ వెల్డర్ పనులు చేసుకుంటూ అబుదాబిలో ఉంటున్నాడు. శుక్రవారం తల్లిదండ్రులు గుండ శ్రీను, భవానీలకు లావణ్యకుమార్ దుబాయ్ నుంచి ఫోన్ చేసి యుద్ధ వాతావరణంతో ఇక్కడ చాలా భయంగా ఉందని, ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలను అరచేత పట్టుకుని గడుపుతున్నామని ఫోన్లో తెలిపాడని తల్లిదండ్రులు విలేకరులకు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు దేశం కాని దేశంలో చిక్కుకోవడం తమకెంతో బాధకలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ చొరవ తీసుకుని అబుదాబిలో ఉన్న తమ కుమారుడుని సురక్షితంగా స్వగ్రామానికి తీసుకువచ్చేవిధంగా చూడాలని కోరారు. -
సమస్యలు చెబితే సస్పెండ్ చేస్తారా..!
విజయనగరం గంటస్తంభం: తమ సమస్యలు చెబుతామని వస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని.. అకారణంగా సస్పెండ్ చేస్తున్నారని గ్రామ, వార్డు సర్వేయర్లు ఆందోళనకు దిగారు. అధికారులు తమపై ఒత్తిడి పెంచుతున్నారని సమస్యలు చెబుదామంటే వినకుండా తిరిగి తమపై చర్యలు తీసుకుంటున్నారని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రభుత్వం మారిన తరువాత సర్వే పనులతో పాటు అనేక రకాల అదనపు సర్వేలు, ఇతర పనులు అప్పగిస్తూ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి తగ్గ వేతనాలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వచ్చిన సందర్భంలో సర్వేయర్ల యూనియన్కు చెందిన ఇద్దరు గ్రామ సచివాలయ సర్వేయర్లను సస్పెండ్ చేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. డెంకాడ మండలం డెంకాడ గ్రామ సచివాలయ సర్వేయర్ జి.లక్ష్మీప్రసాద్, నెలిమర్ల మండలం బూరాడపేట గ్రామ సచివాలయ సర్వేయర్ జి.శరత్లను ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే టి.యజ్ఞేశ్వరరావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది కాస్త సర్వేయర్ల ఆందోళనకు దారి తీసింది. ● ప్రశ్నిస్తే శిక్షా...? కలెక్టరేట్ వద్ద ఆందోళనలో సర్వేయర్లు మాట్లాడుతూ యూనియన్లో ఉన్న ఇద్దరిని లక్ష్యంగా చేసుకుని సస్పెండ్ చేయడం ద్వారా మిగతా సర్వేయర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవడమేమిటని ప్రశ్నించారు. తమ కష్టాలు చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా ఇలా హింసించడం ఎంత వరకు న్యాయమని నిలదీశారు. తమ అసలు పని భూముల సర్వే చేయడమేనని, అయినా ఇతర శాఖలకు సంబంధించిన అనేక పనులు కూడా అప్పగిస్తున్నారని తెలిపారు. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి ఉద్యోగం చేయడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పెరిగినా.. వేతనాలు మాత్రం పెరగలేదని వాపోయారు. సస్పెన్షన్లు ఎత్తేయాలి.. తమ యూనియన్కు సంబంధించి ఇద్దరు సర్వేయర్లపై వేసిన సస్పెన్షన్ వేటును తక్షణమే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారుల చర్యలు తమలో భయాందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సర్వేయర్లు హెచ్చరించారు. అంతకు ముందు ఉన్నతాధికారులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్ ముందు సర్వేయర్ల ధర్నా సమస్యలు చెప్పనీయకుండా గొంతు నొక్కేస్తున్నారు.. అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నాం.. తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం.. -
పీహెచ్సీల్లో సక్రమంగా సేవలు అందాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సక్రమంగా అందించాలని, అవుట్ పేషేంట్ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను విస్తృతం చేయాలన్నారు. వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు నమ్మకం కలిగేలా పని చేయాలన్నారు. ప్రతి ిపీహెచ్సీలో నెలకు 1500 మందికి సేవలు అందించాల్సి ఉండగా చాలా పీహెచ్సీల్లో నెలకు 50 శాతం కూడా సేవలు అందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్సీడీ స్క్రీనింగ్ శతశాతం పూర్తి చేయాలన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు తప్పనిసరిగా చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సహకాలు గురించి ప్రచారం చేయాలన్నారు. మాతృ, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైరిస్క్ గర్భిణులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రసవ తేదీకి ముందుగానే ఆస్పత్రిలో చేర్చాలన్నారు. డయేరియా కేసులు వస్తే వెంటనే ఎంపీడీఓకు సమాచారం అందజేసి అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి తదితరులు పాల్గొన్నారు. త్వరలో పశువుల మందుల విక్రయ కేంద్రాలు విజయనగరం కలెక్టరేట్: రాష్ట్రంలో పశువైద్య సేవలను మరింత చేరువ చేస్తూ, పశుపోషకులకు నాణ్యమైన, చవకైన మందులను అందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి పశు ఔషధి విక్రయ కేంద్రాల ద్వారా పశువుల మందులను అందించేందుకు శ్రీకారం చుట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వెల్లడించారు. ఈ పథకం ద్వారా జెనరిక్ మందులను సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, గ్రామ స్థాయిలో మహిళా సాధికారతను పెంపొందించడం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం అమలుపై కలెక్టరేట్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష, జిల్లా జంతు సంక్షేమ సంఘ సమావేశాలను నిర్వహించారు. జిల్లాలో జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఉపాధి హామీ పథకం నిధులతో ప్రతి నియోజకవర్గంలో రక్షించబడిన, నిరాశ్రయ జంతువుల కోసం యానిమల్ హాస్టల్స్ నిర్మించి, నిర్వహణను ఎంపిక చేసిన స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘కై ండ్నెస్ క్లబ్స్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.మురళీకృష్ణ, జెడ్పీ సీఈఓ బివి.సత్యనారాయణ, డీపీఓ మల్లికార్జునరావు, ఎఫ్ఆర్ఓ వివిఎస్ఎన్.రాజు, ఆర్టీఓ యు.దుర్గాప్రసాద్, డీఎస్పీసీఏ నోడల్ అధికారి డాక్టర్ ఎల్.విష్ణు, వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
మహిళా దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: పోలీసు బ్యారెక్స్లో ఈ నెల 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. అధికారులతో ఆయన శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలను దృష్టిలో ఉంచుకుని జిల్లా, మండల స్థాయి వేదికల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను, మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. అంబులెన్స్ వాహనాలను, అత్యవసర మందులను వీలైతే మహిళ వైద్యులను కూడా ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్, తాగునీరు ఏర్పాట్లును మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలు చూడాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరం జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య కళాశాలలో పీజీ అకడమిక్సెల్ ప్రారంభం విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ విద్యార్థుల ప్రవేశాలకు సంబంఽధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ అకడమిక్ సెల్ను ప్రారంభించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేవి మాధవి శుక్రవారం తెలిపారు. అకడమిక్ సెల్ చైర్మన్గా డాక్టర్ కె.వెంకటాచలం, పోగ్రామ్ కో ఆర్డినేటర్గా డాక్టర్ కె.శారద వ్యవహరిస్తారని తెలిపారు. డీఆర్ఓగా సత్తిబాబు విజయనగరం కలెక్టరేట్: జిల్లా రెవెన్యూ అధికారిగా సి.హెచ్.సత్తిబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విశాఖపట్నం హౌసింగ్ పీడీగా పని చేస్తూ ఇక్కడకు వచ్చారు. ఇక్కడ ఇంతకు ముందు పని చేసిన శ్రీనివాసరావు జనవరి నెలలో ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో కేసీఆర్ డిప్యూటీ కలెక్టర్ ఇ.మురళి అదనంగా బాధ్యతలు చూస్తున్నారు. 15లోగా సీఎస్సీ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ పార్వతీపురం: జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్(సీఎస్సీ) పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ డా.ప్రభాకర్రెడ్డి అధికారులను ఆదేశించారు. తన కార్యాలయం నుంచి ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంజినీరింగ్ అధికారి తమ రోజువారీ ప్రగతిని వివరించాలన్నారు. పనుల నిర్వహణలో ప్రతీ అధికారికి ఒక స్పష్టమైన ప్రణాళిక, వ్యూహం ఉండాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐటీడీఏ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం తప్పని సరిగా చేయాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర–2047 క్యాలెండర్ ఆవిష్కరణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన స్వర్ణాంధ–2047 క్యాలెండర్ను కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్రెడ్డి, జేసీ సి.యశ్వంత్కుమార్రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలితో పాటు పలువురు అధికారులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లా అధికారుల చొరవ, సహకారంతో మన్యం జిల్లా ముందంజలో ఉందన్నారు. జిల్లా ముందంజలో ఉండాలి స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ప్రాధమిక రంగాల్లో పురోగతి కనిపించాలన్నారు. రాష్ట్ర స్థాయి డేటాను పరిశీలించి దానిని మండలాల వారీగా విశ్లేషించుకొని క్షేత్ర స్థాయి లక్ష్యాలను చేరుకొనేందుకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ప్రతీ జిల్లా అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ముస్తాబు గ్రామంగా తయారు చేయాలన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయడానికి వినూత్నంగా ‘ఈ–టామ్టామ్’ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సమీక్షలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్ఓ హేమలత పాల్గొన్నారు. -
వేతనదారుల యాతన..!
విజయనగరం మండలం దుప్పాడలో పని చేస్తున్న వేతనదారులువిజయనగరం ఫోర్ట్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లిన వారికి సరిగా వేతనాలందక అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పనికి వెళితే సకాలంలో వేతన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అవస్థలు పడుతున్నామని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన వేతనదారులకు కోట్లాది రుపాయిలు వేతన బకాయిలు అందాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం కోసం ఉపాధి హామీ పథకాన్ని చేపట్టారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఉపాధి హామీ లక్ష్యానికే తూట్లు పడుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనికి వెళ్లిన వారికి నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వల్ల వేతనదారులు మళ్లీ వలసబాట పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మళ్లీ వలసబాటేనా... ఉపాధి హామీ పథకం రాక ముందు ఉపాధి కోసం జిల్లా నుంచి హైదరాబాద్, చైన్నై, విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాలకు జిల్లా ప్రజలు వలస వెళ్లేవారు. పొరుగు జిల్లా అయిన విశాఖపట్నం కూడా వెళ్లేవారు. నెలలు, సంవత్సరాలు తరబడి అక్కడే కూలీ, నాలీ చేసుకుని అక్కడే ఉండేవారు. ఉపాధి హామీ పథకం చేపట్టిన తర్వాత కొంతవరకు వలసలు తగ్గాయి. అయితే చంద్రబాబు సర్కార్ వైఖరి వల్ల మళ్లీ వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. 1.07 కోట్ల పని దినాలు తగ్గింపు జిల్లాలో వేతనదారులు 6,26,094 జిల్లాలో జాబ్ కార్డులు 3.45 లక్షలు కాగా.. జిల్లాలో వేతనదారులు 6,26,094 మంది ఉన్నారు. జిల్లాలో అధికశాతం మంది వేతనదారులు నిరుపేదలే. గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనులకు వెళ్లి వాటి ద్వారా వచ్చే వేతనంతో జీవిస్తారు. ఇటువంటి వారికి వేతనాలు సకాలంలో రాకపోవడం వల్ల వారి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో వారు కుటుంబ పోషణ కోసం వలస బాట పడుతున్నట్టు తెలుస్తుంది. నాలుగు నెలలుగా అందని వేతనాలు ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లిన వారికి నాలుగు నెలలుగా వేతనాలు అందని పరిస్థితి. 2025 నవంబర్ నెల నుంచి వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. పనికి వెళ్లినా నాలుగు నెలలుగా వేతనాలు అందక పోవడంతో వేతనదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో సుమారు 10 లక్షల పని దినాలకు సంబంధించి రూ.30 కోట్లు వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఉపాధి హామీ వేతనదారులకు అందని వేతనాలు నాలుగు నెలలుగా ఎదురుచూపులు రూ.30 కోట్ల వరకు బకాయిలు జిల్లాలో జాబ్ కార్డులు 3.45 లక్షలు వేతనదారులు 6.26 లక్షలు పథకం పేరు మార్పుతో వేతనాలపై అనుమానం మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ జీ రామ్ జీగా ప్రస్తుతం ప్రభుత్వం మార్చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వీబీజీరాంజీ పథకంగా అమలు కానుంది. దీంతో 2025 సంవత్సరంలో వేతనదారులకు చెల్లించాల్సిన వేతన బకాయిలు చెల్లింపులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత పథకంతో పని చేసినా వేతనాలు చెల్లిస్తారా.. లేదా.. అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేతన బకాయిలు నిజమే.. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వేతనదారులకు గత ఏడాది నవంబర్ నెల నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. సుమారు రూ.30 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వేతనాలు నేరుగా వేతనదారుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. – ఎస్.శారదాదేవి, డ్వామా పీడీ 2023 సంవత్సరానికీ... ఇప్పటకీ కోట్లాది పనిదినాలు తగ్గిపోయాయి. 2023 – 24 సంవత్సరానికి సంబంధించి 2.18 కోట్ల పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.502.36 కోట్లు వెచ్చించారు. 2025 – 26సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 1.11 కోట్లు పనిదినాలు కల్పి ంచారు. ఇందుకుగాను రూ.242.64 కోట్లు వెచ్చించారు. 1.07 కోట్ల పనిదినాలు 2023–24 సంవత్సరం కంటే తక్కువగా పనిదినాలు కల్పించారు. పనిదినాలు తగ్గించడం వల్ల ఎంతో మంది వేతనదారులకు పని దొరకని పరిస్థితి. దీంతో వారికి ఉపాధి కూడా పోయింది. ఉపాధి వేతనదారుల సంక్షేమానికి పాటుపడుతున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్ మాటలకు.. చేతలకు పొంతన ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పరీక్ష కేంద్రాల వద్ద ‘ప్రత్యేక’ ఏర్పాట్లు
పాలకొండ రూరల్: మరికొద్ది రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ పి. బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ మేరకు ఆయన పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచనలు చేస్తున్నారు. ● ఈ నెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా నుంచి ఈ ఏడాది 10,644 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 15 మండలాల పరిధిలో 68 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 99 మంది ఉన్నారు. వీరి సౌకర్యార్థం మార్కుల్లోనూ మార్పులు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ● శారీరకంగా దివ్యాంగులైన విద్యార్థులకు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్ష రాయకుండా మినహాయింపు కల్పించారు. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ● కంటిచూపు సరిగా లేని విద్యార్థులకు ఒక లాంగ్వేజ్ పరీక్ష మినహాయింపుతో పాటు మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు రావాలి. ● వినికిడి లోపం గల వారు రెండు లాంగ్వేజ్ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు పొందాలి. ● మాట లోపం గలవారు ఒక్కో సబ్జెక్ట్లో 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అభ్యసనా వైకల్యం గల విద్యార్థులకు ఆంగ్లం మినహా మిగిలిన సబ్జెక్ట్ల్లో 15 మార్కులు పొందాల్సి ఉంటుంది. ● ఈ తరహా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల వద్ద వీల్చైర్లు, ర్యాంపులు, వైద్య పరమైన సేవలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సదరు విద్యార్థులు సహాయకుల కోసం (స్రైబ్) దరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డీఈఓ బ్రహ్మాజీరావు -
త్వరితగతిన ఈ పంట నమోదు
డెంకాడ: రబీ సీజన్లో ఈ పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి వ్యవసాయ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పెదతాడివాడలో శుక్రవారం ఆయన పర్యటించి, సాగులో ఉన్న నువ్వు పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యానవన పంటల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు, ఏడీఏ నాగభూషణరావు, ఆర్.శ్రీనివాసరావు, ఏఓ సంగీత, ఉద్యానవన అధికారి ఉమాభారతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి -
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు
రేగిడి: జలవనరుల శాఖలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీనియార్టీ జాబితా తయారుచేసి ఉద్యోగోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ శాసనమండలిలో శుక్రవారం కోరారు. మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. జోన్ –1, జోన్ –4లకు సంబంధించి వాటర్ రిసోర్స్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. 1975లో వెనుబడిన ప్రాంతాల అభ్యున్నతికి రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో విద్య, ఉద్యోగ, పదోన్నతులు ఆ ప్రాంత ప్రజలకు, ఉద్యోగులకు వర్తించేలా ఉత్తర్వులు జారీచేయడం జరిగిందన్నారు. ఈ ఉత్తర్వుల వల్లే వెనుకబడిన ప్రాంతాలు, వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. 1975 నుంచి ఈ ఉత్తర్వులు అన్నిశాఖల్లో అమలులో ఉన్నాయన్నారు. 2017లో గత ప్రభుత్వం 6 పాయింట్ ఫార్ములా ఫ్రెసిడెన్సియల్ ఆర్డర్ని తుంగలోకి తొక్కి, సుమారు 50 మంది ఉత్తరాంధ్ర ఇంజినీర్లను రివర్స్ చేసిందన్నారు. ఇది కేవలం జలవనరులశాఖలో మాత్రమే జరుగుతోందని సభ దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన ఇంజినీరింగ్ అధికారులు హైకోర్టు, సుప్రీంకోర్టులలో అప్పీల్ చేయగా, హైకోర్టులో 2019లో జడ్జిమెంట్ వచ్చిందనన్నారు. ఆ తీర్పు ప్రకారం 2017లో ఇచ్చిన అడ్డగోలు ప్రమోషన్లు రద్దుచేసి, రాజ్యాంగం ప్రకారం జోనల్ సిస్టమ్, సీనియార్టీ జాబితాలు తయారు చేసి ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ విక్రాంత్ -
నిర్ణీత గడువులోగా పరిష్కారం
● ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి పార్వతీపురం రూరల్: గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ సి. యశ్వంత్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని ‘గిరిమిత్ర’ హాల్లో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ ఏ.మురళీధర్, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. 224 మంది గైర్హాజరు పార్వతీపురం రూరల్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. జంతుశాస్త్రం, అర్ధశాస్త్రం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 224 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ విద్యాశాఖాధికారి వై. నాగేశ్వరరావు తెలిపారు. 5,987 మంది విద్యార్థులకు గాను 5,763 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. -
వన్యప్రాణులకు అండగా..మేమున్నాం...
పార్వతీపురం అటవీ రేంజ్ పరిధిలో అగ్నిప్రమాద నివారణకు చర్యలు చేపడుతున్న అధికారులుపాలకొండ రూరల్: అడవుల్లో సంచరించే వన్యప్రాణులు వేసవిలో వాటి మనుగడ కోసం అనేక సమస్యలు అధిగమించాల్సి ఉంటుంది. నీరు, ఆహారం కొరత వల్ల ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటాయి. మరోవైపు ఎండలకు చెట్లు, ఆకులు ఎండి రాలిపోతుంటాయి. కొందరు తమ స్వలాభాల కోసం అడవులను తగలబెట్టం పరిపాటిగా మారింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. సమీపంలో జీవించే జీవరాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో వన్యప్రాణులు తమ దాహార్తిని తీర్చుకోవడానికి, కడుపు నింపుకోవడానికి జనావాసాల వైపు అడుగులు వేస్తుంటాయి. ఏనుగుల గుంపులు జనావాల్లోకి తరచూ వస్తుండడమే ఇందుకు నిదర్శనం.. దీనిని ఆసరాగా చేసుకుని వేటగాళ్లు ఉచ్చు బిగిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఫైర్ లైన్స్.. ఫైర్ బ్లోయర్స్.. అడవిలో అగ్ని ప్రమాదాలు తలెత్తే సమయంలో వాటిని అధిగమించేందుకు 3 మీటర్ల వెడల్పులో గడ్డిని చెక్కి ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫైర్ బ్లోయర్ అనే ప్రత్యేక పరికరాలు వినియోగించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయనున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మానటరింగ్ సెల్లో అడవికి సంబంధించి ఒక కోడ్ను నమోదు చేస్తారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేపట్టారు. 20 చోట్ల నీటి కుంటలు.. వేసవిలో వన్యప్రాణులు తాగునీటి సమస్యతో మృత్యువాత పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చుక్కల దుప్పులు, అడవి మేకలు, కుందేళ్లు, తదితర జీవాలు దాహార్తిని తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వస్తూ ప్రమాదాలకు గురికావడం, మృత్యువాత పడడం జరుగుతుంది. దీనిని అధిగమించేందుకు కనీస నీటివసతి లేని ప్రాంతాల్లో 20 చోట్ల సాసర్పిట్లు (నీటి కుంటలు) ఏర్పాటు చేశారు. నీటి కోసం వచ్చే జంతువులకు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయి. కుంటల్లో నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంక్లతో నీటిని నింపుతున్నారు. భద్రతకై నిఘా.. జీవరాశుల కదిలికలు ఎక్కువగా ఉన్నచోట, దాహార్తిని తీర్చుకునే ప్రాంతాల్లో భద్రతకు ప్రాధాన్యత కల్పించారు. వేటగాళ్ల ఉచ్చులకు చిక్కకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు వారాలకోసారి వీటిని పరిశీలిస్తున్నారు. నిరంతరం ఈ కెమెరాల ద్వారా అటవీ ప్రాంతానికి విజుబుల్ రక్షణ అందిస్తుంది. గతేడాది చివరి నుంచి ప్రత్యేక యాప్ సహాయంతో జీవాల కదలికలు, వాటి ఆనవాళ్లు గుర్తించి ఫొటోలు తీసి విశ్లేషిస్తున్నారు. అడవి పందులు, కుందేళ్లు, పునుగు పిల్లులు, చుక్కల దుప్పులు, అడవి మేకలు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు వేస్తున్నారు.స్వీయ పర్యవేక్షణ.. ఉన్నతాధికారుల సూచనలతో జిల్లాలోని నాలుగు రేంజ్లలో మా సిబ్బంది అడవి జంతువులు, వన్యప్రాణుల రక్షణకు స్వీయ పర్యవేక్షణ చేపడుతున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా.. జీవాల దాహార్తి తీర్చేలా.. వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అటవీ సంరక్షణకు ప్రజాల సహకారం అవసరం. – జీఏపీ ప్రసూన, జిల్లా అటవీ శాఖాధికారి, పార్వతీపురం మన్యం 1,07,721 హెక్టార్లలో.. మన్యం జిల్లాలోని పార్వతీపురం, పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాల పరిధిలో 1,07,721 హెక్టార్ల వరకు అడవులు విస్తరించి ఉన్నాయి. ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో చింతపండు, విప్పపువ్వు, జీడిపిక్కలు, కొండ మామిడి, ఇతర అటవీ ఫలసాయం సేకరణకు పలువురు అడవుల్లో సంచరిస్తుంటారు. వీరిలో కొంతమంది అనుకోకుండా చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. -
విజ్ఞానంతో మానసిక వికాసం
వీరఘట్టం: విజ్ఞానంతోనే మానవ వికాసం సాధ్యమని పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విజ్ఞాన వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప విద్యాశాఖాధికారి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సుకు శాస్త్ర విజ్ఞానం ఎంతో దోహదపడుతుందన్నారు. సృజనాత్మక, నూతన ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఫ్యాన్సీ డ్రెస్, సెమినార్స్, క్విజ్, డిబేట్, పోస్టర్ ప్రజెంటేషన్లలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా.. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జి,లక్ష్మణరావు, విద్యాశాఖాధికారులు సీహెచ్ రత్నాకరరావు, జి.రవిప్రసాద్, బి.సొంబర, ఎం.ఈశ్వరరావు, కేపీ నాగమణి, పెంట రామకృష్ణ, చొక్కాపు శ్రీనివాసరావు, కె.శివ, శిర్లాపు ఉమామహేశ్వరరావు, మరడాన సంపత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. సీనియర్స్ పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో విజేతలు వీరే.. పోస్టర్ ప్రజంటేషన్లో గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్ఎస్కు చెందిన కె,ప్రసన్న మొదటి బహుమతి.. సాలూరు మండలం బోరబంద జెడ్పీహెచ్ఎస్కు చెందిన జి.హారిక రెండో బహుమతి, భామిని మండలం ఏపీఎంఎస్కు చెందిన ఎస్.రేష్మ తృతీయ బహుమతి పొందారు. ఫ్యాన్సీ డ్రెస్ విభాగంలో.. సాలూరు జెడ్పీహెచ్ఎస్కు చెందిన కె.భువనచంద్ర, పాచిపెంట మండల పాంచాలి జెడ్పీహెచ్ఎస్కు చెందిన కె.వంశీకృష్ణ, వీరఘట్టం మండలం రేగులపాడు కేజీవీకి చెందిన ఎం.గీత విజేతలుగా నిలిచారు. డిబేట్లో.. గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్ఎస్కు చెందిన జి.తేజశ్వని, వీరఘట్టం మండలం పాలమెట్ట యూపీ స్కూల్ విద్యార్థిని పి.సౌజన్య వరుస స్థానాల్లో నిలిచారు. క్విజ్ పోటీలో.. సీతానగరం జెడ్పీహెచ్ఎస్కు చెందిన వై.తేజశ్వని, బి.కీర్తి, పి.అక్షయలు మొదటి స్థానంలో.. పార్వతీపురం మండలం ములగ జెడ్పీహెచ్ఎస్కు చెందిన సీహెచ్, భవిక, వై.గాయత్రి, వై.సంతోషికుమారి ద్వితీయ స్థానంలో.. గరుగుబిల్లి మండలం రావివలస జెడ్పీహెచ్ఎస్కు చెందిన బి.కావ్య, సీహెచ్.సుధీర్, బి.గుణశేఖర్ తృతీయ స్థానాలు సాధించారు. జూనియర్స్ విభాగం పోస్టర్ ప్రజెంటేషన్లో.. పాలకొండ నగరపంచాయతీలోని వెంకమ్మపేట జెడ్పీహెచ్ఎస్కు చెందిన జె.కారుణ్య, సీతంపేట జీటీడబ్ల్యూఏహెచ్ఎస్కు చెందిన ఎం.హిమశ్రీ, సాలూరు ఎంపీఎల్పీఎస్కు చెందిన జి.నికేష్నందన్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో.. పార్వతీపురం మున్సిపల్ ప్రైమరీ స్కూల్కు చెందిన రితిక్ రెడ్డి, జీఎల్ పురం జీటీడబ్ల్యూఏజీహెచ్ఎస్కు చెందిన ఎం.సుమతి, సాలూరు ఎంజేపీఎస్కు చెందిన వై.శరణ్య విజేతలుగా నిలిచారు. క్విజ్ పోటీల్లో.. వీరఘట్టం మండలం పాలమెట్ట యూపీ స్కూల్ విద్యార్థులు ఎన్.అక్షయ, ఎం,హిమశ్రీ, జేఆర్ లాస్యప్రియ మొదటి స్థానంలో.. పాలకొండ నగరపంచాయతీలోని వెంకమ్మపేట జెడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థులు టి.జ్ఞానశ్రీ, జి.మోక్షిత, డి.శిరీషా ద్వితీయ స్థానంలో.. పార్వతీపురం దత్తుపేట ఎంపీఎల్పీఎస్కు చెందిన ఎం.లీలాకుమార్ తృతీయ స్థానాల్లో నిలిచారు. ఘనంగా విజ్ఞాన వారోత్సవాలు -
గంజాయితో ఇద్దరి అరెస్ట్
రామభద్రపురం: మండలంలోని బాడంగి రూట్లో ఎస్సై వి.ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టగా.. ఇద్దరు వ్యక్తులు రెండున్నర కిలోల గంజాయితో పట్టుబడ్డారు. ఈ మేరకు స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి కుమ్మరివీధికి చెందిన గొండేల దిలీప్, గరివిడి మండలం బాగువలసకు చెందిన నడిమింటి అఖిల్ మరికొంతమందితో కలిసి సుమారు మూడేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. వీరు గంజాయికి బానిసలు కావడంతో పాటు మరికొంతమందికి విక్రయిస్తున్నారు. ఒడిశాలోని సుంకి నుంచి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వీరిపై నిఘా ఉంచిన పోలీసులు తనిఖీలు చేపట్టగా దిలీప్, అఖిల్ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. గొండేల దిలీప్పై పెదమానాపురం పోలీస్స్టేషన్లో గంజాయి అక్రమ రవాణాపై గతంలో కేసు నమోదైంది. జాతీయ విలువిద్య పోటీల్లో గిరిజన క్రీడాకారుల ప్రతిభ పార్వతీపురం రూరల్: కేరళలో ఇటీవల నిర్వహించిన 38వ తలక్కల్ చందు మెమోరియల్ జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. విజేతలను జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్కుమార్ రెడ్డి శుక్రవారం తన చాంబర్లో అభినందించారు. ఈ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపిక కాగా.. మహిళల విభాగంలో పువ్వల వసంత తృతీయ బహుమతి సాధించారు. మరో క్రీడాకారుడు దంగభద్ర పవన్కుమార్ కూడా విజేతగా నిలిచారు. గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి విజయాలు దోహదపడతాయని పీఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎ. విజయశాంతి, ఏపీఓ ఎ.మురళీధర్, తదితరులు పాల్గొన్నారు. నేడు ఎస్సీ కమిషన్ సభ్యుడి రాక పార్వతీపురం రూరల్: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం శనివారం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో ఎస్సీ సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం. శ్యామల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి సంతకవిటి: గడ్డిమందు తాగిన మహిళ చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మామిడిపల్లి గ్రామానికి చెందిన టి. లక్ష్మి (60) గురువారం రాత్రి పొరపాటున ఇంటిలో ఉన్న గడ్డిమందు తాగేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రాజాంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతురాలి కుమార్తె రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణపల్లికి చెందిన వృద్ధురాలు.. పార్వతీపురం రూరల్: గుర్తు తెలియని వ్యక్తి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణపల్లి పంచాయతీకి చెందిన పోరాపు తెరీజమ్మ (81) ఫిబ్రవరి 28న పింఛన్ తీసుకుంది. అదేరోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొరబడి ఫించను నగదుతో పాటు ఇంట్లో ఉన్న మరికొంత నగదు దోచుకునే క్రమంలో వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన తెరీజమ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. క్లూస్ టీమ్ ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 4న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
కారు బోల్తా..
గజపతినగరం రూరల్: మండలంలోని మరుపల్లి గ్రామ సమీపంలో గల పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై కిరణ్కుమార్ నాయుడు తెలియజేసిన వివరాల ప్రకారం.. దత్తిరాజేరు మండలం మానాపురం గ్రామానికి చెందిన రౌతు ధనుంజయరావు, రౌతు సాయిశంకర్, రౌతు చంద్రశేఖర్ తమ స్నేహితుడితో కలిసి విజయనగరం వైపు నుంచి మానాపురం కారులో వస్తున్నారు. తెల్లవారుజాము రెండున్నర గంటల సమయంలో మరుపల్లి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రౌతు ధనంజయరావు అక్కడికక్కడే మృతి చెందగా.. సాయిశంకర్, చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే డ్రైవర్కు, మరో వ్యక్తిగి పెద్దగా గాయాలు కాలేదు. క్షతగాత్రులిద్దరూ ప్రస్తుతం విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడి తండ్రి రౌతు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు -
నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలి
సీతంపేట: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతిగృహాలకు నాసిరకం సరుకులు పంపిణీ చేస్తున్నారని ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు అన్నారు. జీసీసీ ద్వారా నిర్వహించే టెండర్ల ప్రక్రియలో నాణ్యమైన శాంపిల్స్ చూపించి సరఫరాలో మాత్రం కొందరు చేతివాటం చూపిస్తున్నారని అన్నారు. ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిత్యవసర సరుకుల పంపిణీకి (కంది, వేరుశనగ, ఇడ్లీనూక, మినపగుళ్లు, నూనెలు) శుక్రవారం టెండర్లు నిర్వహించారు. మొత్తం 26 సరుకుల సరఫరాకు 12 మంది కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ.. పలు ఆశ్రమ పాఠశాలల వసతిగృహాలు సందర్శించినప్పుడు నాణ్యత లేని సరుకులు కనిపించాయన్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యత ఉన్న సరుకులు అందించకపోతే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం దాసరి కృష్ణ, మేనేజర్ గొర్లె నరసింహులు, హెచ్డబ్ల్యూఓలు పాలక అమల, హెచ్.శారద, పి.రాజారావు పాల్గొన్నారు. ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు -
ఈ నెల 22న బాడీబిల్డింగ్ పోటీలు
విజయనగరం: మహాబలుడు కోడి రామ్మూర్తినాయుడు స్ఫూర్తిని యువతలో కలిగించేందుకు విజయనగరం జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 22న ఉమ్మడి విజయనగరం జిల్లా బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శంకరరావు తెలిపారు. స్థానిక గురజాడ కళాభారతిలో పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక బాడీ ఫిట్నెస్ జిమ్లో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావుతో కలిసి పోటీలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించార. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ..55 నుంచి 75 కిలోల విభాగాల్లో ఆరు కేటగిరీల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. పోటీల్లో బాడీబిల్డర్లు పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు నమ్మి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ అజయ్, అసిస్టెంట్ సెక్రటరీ డి.సన్నిబాబు, ఎల్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో విధి నిర్వహణే ఉద్యోగులకు రక్షణ
విజయనగరం అర్బన్: ఉత్తమ క్రమశిక్షణతో విధులు నిర్వహించడం ఉద్యోగుల రక్షణకు శ్రీరామరక్షగా ఉంటుందని ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా తరగతులకు గురువారం హాజరై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూఏ ఉద్యోగులకు బలపరుస్తూ క్రమశిక్షణతో విధులు నిర్వహించడం, యూనియన్ బలోపేతానికి ఇదే ప్రధాన మార్గమని తెలిపారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తరువాత వచ్చిన మార్పులు, వాసా రూల్స్ ప్రకారం జారీ అయిన జీవోలలో ఉన్న మార్పులను వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న సౌకర్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. ఎన్ఎంయూఏను రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 96 ద్వారా గుర్తింపు సంఘంగా ప్రకటించిందని అలాగే జీవో నెంబర్ 129 ద్వారా స్టాఫ్ కౌన్సిల్లో అవకాశం కల్పించి ఉద్యోగుల సమస్యలను నేరుగా ప్రభుత్వానికి విన్నవించుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. అందువల్ల ప్రతి ఉద్యోగి సర్క్యులర్లు తెలుసుకుని యాజమాన్యంతో సంప్రదింపులు జరిపేటప్పుడు సర్క్యులర్ ప్రకారం మెమోరాండం ఇవ్వాలని సూచించారు. ఉద్యోగుల ఆర్థిక అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీ రమణారెడ్డి, కోశాధికారి పీవీమోహన్, జోనల్ అధ్యక్షుడు బీఎస్రాములు, జోనల్ కార్యదర్శి ప్రదీప్కుమార్, జిల్లా కార్యదర్శి పీజీరాఫెల్ తదితరులు పాల్గొన్నారు. జోన్ పరిధిలోని 18 డిపోల ముఖ్య నాయుకులు, వర్క్షాప్ నాయకులు కూడా హాజరయ్యారు. ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ -
వీడిన రాజాం చోరీ మిస్టరీ
● చోరీ సొత్తులో 470 గ్రాముల రికవరీ ● పోలీసుల అదుపులో ఇద్దరు ● పరారీలో మరో ఇద్దరు ● ఏఎస్సీ సౌమ్యలత వెల్లడి విజయనగరం క్రైమ్ : రాజాం జీఎంఆర్ క్వార్టర్స్లోని రెండిళ్లలో గత నెల 1వ తేదీన జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు, వారి నుంచి 470 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు. స్థానిక డీపీఓలోని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. రాజాం జీఎంఆర్ క్వార్టర్స్లో జీఎంఆర్ కేర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ నగేష్ దసర్వార్, జీఎంఆర్ ఐటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న గడ్డం మాధవ కృష్ణారెడ్డి ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫిబ్రవరి 1న చోరీకి పాల్పడ్డారని చెప్పారు. ఒక ఇంట్లో 1279 గ్రాముల బంగారు ఆభరణాలు, మరో ఇంట్లో 245 గ్రాముల ఆభరణాలు దొంగిలించుకుపోయినట్టు అందిన ఫిర్యాదుల మేరకు సంతకవిటి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారన్నారు. వీటిని ఛేదించేందుకు సీసీఎస్ పోలీసుల సహకారంతో నలుగురు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో 12 మంది ఎస్ఐలతో ఐదు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను ట్రాక్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సాంకేతికతతో సీసీటీవీ పుటేజ్తో చోరీకి పాల్పడిన వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన గ్యాంగ్గా గుర్తించామని తెలిపారు. ఆ గ్యాంగ్ను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు ధార్ జిల్లాకు వెళ్లాయన్నారు. గ్యాంగ్లోని ఇద్దరు నిందితులైన ధార్ జిల్లా సర్దార్పూర్ తహశీల్, ధకన్బారికి చెందిన రక్ష ఉరఫ్ రాక్సింగ్(36), ఖనియాంబాకు చెందిన మోహన్సింగ్ దౌదావే(28)లను పట్టుకున్నామని తెలిపారు. ఈ ఇద్దరూ మళ్లీ దొంగతనం చేసేందుకు రాజాం వచ్చినట్టు అందిన సమాచారంతో బూరాడపేట జంక్షన్ వద్ద ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి సుమారు రూ.70 లక్షల విలువ చేసే 470 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశామన్నారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయని, వీరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. సమావేశంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు, సీసీ ఎస్ ఎస్ఐ కె.లక్ష్మణరావు, సంతకవిటి ఎస్ఐ ఆర్.గోపాలరావు, హెడ్ కానిస్టేబుళ్లు ఇమ్రాన్ఖాన్, డి.శంకరరావు పాల్గొన్నారు. -
ఆత్మాన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా ‘రవం’
విజయనగరం టౌన్: ఆత్మల అన్వేషణే ప్రధాన ఇతివృత్తంగా రవం చిత్ర నిర్మాణం చేపట్టామని సినీనటి కళ్యాణి పేర్కొన్నారు. తారక్ ఫిల్మ్ హౌస్ బ్యానర్పై నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం ఆహా ఓటీటీ ద్వారా విడుదలవుతుందన్నారు. సౌండ్ ఆఫ్ సోల్ క్యాప్షన్తో ప్రశాంత్, అనుశ్రీవర్మలు హీరోహీరోయిన్లుగా శ్రీరామ్ దర్శకత్వంలో అద్భుతంగా చిత్రం రూపుదిద్దుకుందన్నారు. నిర్మాత, సంగీత దర్శకునిగా తారక్ వ్యవహరిస్తున్నారన్నారు. నిర్మాతలుగా తారక రామారావు, కళ్యాణిలు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రెస్క్లబ్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రం ఫస్ట్లుక్ టీజర్ను ఆవిష్కరించారు. నిర్మాత తారకరామారావు మాట్లాడుతూ హారర్ , థ్రిలర్స్, సస్పెన్స్తో సాగే ఈ చిత్రం ఆద్యంతం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. శ్రీగురునారాయణ కళాపీఠం వ్యవస్థాపకులు బిఎ.నారాయణ మాట్లాడుతూ విద్యలనగరమైన విజయనగరంలో హరికథ, సంగీతంలో రాణించి సినీ ఇండస్ట్రీలో జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన కళ్యాణి, ఆమె సోదరుడు తారక్లు తొలిసారిగా నిర్మాతలుగా తీసిన రవం చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఈపు విజయకుమార్, గెద్ద వరప్రసాద్, భోగరాజు సూర్యలక్ష్మి, థీరజ్ వజ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
కమాండెంట్ను కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు
డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వై.రవిశంకర్రెడ్డిని 5వ ఏపీఎస్పీ మినిస్టీరియల్ నూతన అసోసియేషన్ కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ జె.హరిబాబు, వైస్ ప్రెసిడెంట్ టి.తవిటినాయుడు, సెక్రటరీ కేజేవీ ప్రసాదరావు, ట్రెజరర్ బి.బాబీశ్యామిలి, జాయింట్ సెక్రెటరీ బి.గీత, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జి.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఐ.భవాని, ఎం.ప్రవీణ్, వి.రోహిణి, ఎం.సీత, యు.గోవింద తదితరులు ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్గా శ్రీరాములనాయుడు విజయనగరం కలెక్టరేట్: డిప్యూటీ కలెక్టర్గా శ్రీరాములనాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడకు వచ్చారు. ఇదిలా ఉండగా మెంటాడ తహసీల్దార్గా విజయ్ భాస్కర్ను నియమించారు. దత్తిరాజేరు తహసీల్దార్గా ఉన్న ఆయన గత కొన్ని నెలలుగా సెలవులో ఉన్న విషయం తెలిసిందే. కుక్కల దాడిలో 18 మందికి గాయాలు బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామంలో వీధి కుక్కలు గ్రామస్తులపై దాడి చేసి పలువురిని గాయపరిచాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు.. నెలివాడలో గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో 18 మందిని వీధి కుక్కలు గాయపరిచాయి. వీరంతా జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందారు. కుక్కల దాడిలో గ్రామానికి చెందిన నెట్టి అనురాధ, ముడిదాన కనకమహాలక్ష్మి, పెండి అరసవల్లి, శివుడు రాజు, కోమ్మా రమ, లక్ష్మి, కె.నూకరాజు, సత్తిబాబుతో పాటు పురమనేని లక్ష్మినాయుడు ఉన్నారు. దీనిపై స్పందించిన సర్పంచ్ తాళ్లపూడి కీర్తి, ఈఓపీఆర్డీ ఎ.రఘుపతిరావు కుక్కల నుంచి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఆలయ చోరీ నిందితుల పట్టివేత నెల్లిమర్ల: పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో చోరీ చేసిన నిందితులను పట్టుకున్నట్టు ఎస్ఐ బి.గణేష్ తెలిపారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నిందితులు ఇద్దరూ జిల్లా కేంద్రంలోని లంకాపట్నంకి చెందిన మైనర్లని, వీరికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని తెలిపారు. వీరిద్దరూ మద్యానికి బానిసలుగా మారి చెడు వ్యసనాలతో దొంగతనాలు చేస్తున్నారని, వాహన తనిఖీల్లోభాగంగా ఇద్దరినీ పట్టుకున్నామని చెప్పారు. నిందితులు నుంచి దొంగతనానికి ఉపయోగించిన ఒక పల్సర్ బైక్ సీజ్ చేశామన్నారు. నిందితులు హుండీలో దొంగిలించిన సొమ్మును పూర్తిగా ఖర్చు చేశారని, వారిని కోర్టు ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించినట్టు తెలిపారు. రైల్వే ట్రాక్పై మృతదేహం విజయనగరం క్రైమ్ : విజయనగరం – కోరుకొండ రైల్వేస్టేషన్ల మధ్య, జొన్నవలస రైల్వేగేట్ రైల్వే ట్రాకై ్ప గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని జీఆర్పీ హెచ్సీ శ్రీనివాస్ ప్రసాద్ గురువారం తెలిపారు. సుమారు 60 సంవత్సరాల వయస్సు కలిగిన మృతదేహం 5 అడుగుల 2 అంగుళాల పొడవు కలిగి ఉంటాడరన్నారు. చామన ఛాయ రంగుతో, నీలం రంగు గల రౌండ్ నెక్ టీ షర్టు, వైలెట్ కలర్ నిక్కర్ ధరించి ఉందన్నారు. మృతదేహం పక్కనే తెలుపు, ఎరుపు గీతల గల తువ్వాలు ఉందన్నారు. మృతదేహాన్ని గుర్తించిన వాళ్లు 9247585742, 9440170317 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్ఐ బాలాజీరావు ఆదేశాలతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
బ్యాంకింగ్ సేవల్లోని మోసాలపై చైతన్యం కావాలి
● ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సులో బ్యాంక్ అధికారులువిజయనగరం అర్బన్: బ్యాంకింగ్ సేవల్లో మోసాలపై ఖాతాదారులు చైతన్యం కావాలని ఆర్బీఐ మేనేజర్ ఎ.రామకృష్ణ అన్నారు. భారతీయ రిజర్వు బ్యాంక్ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేందుకు స్థానిక ప్రైవేటు హాటల్లో ఐటీఐ, కళాశాల విద్యార్థులు, బ్యాంక్ల నూతన ఖాతాదారులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిఽథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్బీఐ అధికారులు ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ భద్రత, బీమా పథకాలపై విస్తృ తంగా అవగాహన కల్పించారు. కేవైసీ ప్రక్రియ ప్రాముఖ్యత, బ్యాంకు ఖాతాలలో నామినేషన్ అవసరం, ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ పొందే విధానాలపై అధికారులు వివరించారు. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్ల లక్షణాలు, నకిలీ నోట్లను గుర్తించే పద్ధతుల గురించి కూడా తెలియజేశారు. బీమా మరియు పొదుపు పథకాలైన పీఎంజేజేబీవై, అటల్ పెన్షన్ యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ప్రయోజనాలపై కూడా పాల్గొనే వారికి అవగాహన కల్పించారు. ప్రస్తుతం పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలు, స్పామ్ మెసేజీలు, ఓటీపీ/డేటాషేరింగ్, అనుమానాస్పద లింక్ల ద్వారా జరిగే సైబర్ మోసాల గురించి కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వీవీ రమణమూర్తి, నాబార్డ్ డీఓఎం టి.నాగార్జున, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి జిజేంద్ర శర్మ, మెప్మా పీడీ జి.యు.చిట్టిరాజు, ఆర్సెట్ డైరెక్టర్ డి.భాస్కరరావు, సైబర్ క్రైమ్ ఎస్ఐ ప్రసన్నకుమార్, ఎస్బీఐ ప్రాంతీయ మేనేజర్ ఎం.సురేష్ బాబు, ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీ గిరి, బ్యాంకు అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఐటీఐ విద్యార్థులు పాల్గొన్నారు. -
ముగిసిన జాతీయ స్థాయి సదస్సులు
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ – గురజాడ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి సాంకేతిక సదస్సులు మెక్నో– ఎంఎం–2026, ఎలక్ట్రిక్ – 2026 గురువారం ముగిశాయి. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్టీయూ – జీవీ ఉపకులపతి వి.వి. సుబ్బారావు మాట్లాడుతూ యువ విద్యార్థులు సమాజానికి వారి పూర్తి సామర్థ్యానికి సేవ చేయడానికి నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమలు, సమాజ అభివృద్ధిలో మెకానికల్ ఇంజినీరింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. రిజిస్ట్రార్ జి.జయసుమ, ప్రిన్సిపాల్ కె.సి.బి.రావు, వైస్ ప్రిన్సిపాల్ డా. జి.జె.నాగరాజు, డాక్టర్ కె.శ్రీనివాస ప్రసాద్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు వి.మణికుమార్, డాక్టర్ సి.నీలిమా దేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న గిరిజన విద్యార్థులు
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పీడమండ గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని కొండగొర్రి సాయి సార్విని మలేరియా జ్వరంతో బాధపడుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అనారోగ్యానికి గురైన సాయి సార్వినిని పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి కుటుంబ సభ్యులు మంగళవారం తీసుకురాగా వైద్యులు పరీక్షించారు. పరిస్థితిని గమనించి చిన్నారిని విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. అయితే చిన్నారికి సరైన వైద్యం అందడం లేదని తల్లిదండ్రులు కొండగొర్రె నూకందొర, జయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి కొన్నాళ్లుగా పాఠశాలకు రాకపోవడంతో సాధారణ జ్వరమేనని పాఠశాల సిబ్బంది అనుకున్నారు. ఆరా తీయగా మలేరియాగా గుర్తించడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సార్వినిని కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య విషయమై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొని గిరిజన చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
మండలిలో డోలపేట భూముల అంశాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్సీ
రాజాం : పట్టణ పరిధి డోలపేట గ్రామానికి సంబంధించిన భూములు ఎన్నో ఏళ్లుగా దేవదాయ శాఖ పరిధిలో ఉండడంతో గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ప్రస్తావించారు. గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో డోలపేట భూముల అంశాన్ని సభాధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లారు. బొబ్బిలి ఎస్టేట్ ఉద్యోగిగా పనిచేసిన అయ్యగారి పాపయ్య పంతులు 1848లో డోలపేట (అప్పటి సీతారాంపురం అగ్రహారం) గ్రామంలో ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించారని పేర్కొన్నారు. అయితే 1941 మరియు 1944లలో ఆస్తి రిజిస్టర్ రూపొందించినా ఈ ఆలయం పేరుతో ఎటువంటి భూములు లేవని అందులో పేర్కొన్నారని తెలిపారు. 2002, 2012 సంవత్సరంలో దేవదాయ శాఖ తయారు చేసిన ప్రాపర్టీ రిజిస్టర్లో రైతుల జిరాయితీ భూమి 207.33 ఎకరాలను ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణ దేవాలయం పేరున రెవెన్యూ అధికారులు చట్టవిరుద్దంగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి రైతుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అప్పటి బొబ్బిలి సర్వే సెటిల్మెంట్ అధికారి రైతులు, ప్రజలతో ఎలాంటి గ్రామసభ నిర్వహించకుండా, రైతులకు తెలియకుండా అనేక దిద్దుబాటులతో చట్టవిరుద్దంగా ఇందులో కొన్ని భూములకు స్వామివారి పేరున పట్టా ఇచ్చారని తెలిపారు. దేవదాయ శాఖ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈ భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని సబ్రిజిస్ట్రార్కు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ అనుమతులు ఇవ్వొద్దని పురపాలక సంఘానికి ఆదేశాలు ఇవ్వడంతో వేల మంది డోలపేట గ్రామప్రజలు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని డోలపేట గ్రామ ప్రజలకు భూములపై సర్వ హక్కులు కల్పించేలా చట్టం తీసుకురావాలని కోరారు. -
కార్మిక నమోదుతో ఆర్థిక భరోసా..!
విజయనగరం గంటస్తంభం: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన కార్మికులు వినియోగించుకోవాలని జిల్లా కార్మిక శాఖ అధికారులు సూచిస్తున్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివాహం, ప్రసూతి, సహజ మరణం, దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించే పథకాలను అమలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఉపాధి హామీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇటుక బట్టీలలో పని చేసే వారు, రాయి పనులు చేసే వారు, వెల్డర్లు తదితరులు రూ.110 చెల్లించి ఐదు సంవత్సరాలకు కార్మికులుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. రెన్యువల్కు మరో అవకాశం 2019 నుంచి 2025 వరకు కార్డు రెన్యువల్ చేయించుకోని కార్మికులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రూ.110 చెల్లించి కార్డులను రెన్యువల్ చేసుకోవాలని కార్మిక శాఖ అధికారులు సూచించారు. కార్డు రెన్యువల్ చేసుకుంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. వివాహ కానుకగా రూ.40 వేల సాయం భవన నిర్మాణ కార్మికుల పిల్లల వివాహాలకు ప్రభుత్వం రూ.40 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. కార్మికుడికి లేబర్ కార్డు ఉండి వివాహ సమయానికి రెన్యువల్ అయి ఉండాలి. ఏపీ సేవా పోర్టల్ నుంచి వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకొని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా నకలు కాపీలతో కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. 2026 మార్చి నుంచి జరిగే వివాహాలకు ఈ పథకం వర్తిస్తుంది. జిల్లాలో 90వేల కార్మికుల నమోదు ఇప్పటి వరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 90 వేల మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మీసేవా కేంద్రాలు, గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోని ఏపీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కార్మికులకు అవగాహన దీనికి సంబంధించి కార్మికుల్లో అవగాహన పెంపొందించేందుకు కార్మిక శాఖాధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇటీవల విజయనగరం పెద్ద చెరువు వద్దనున్న దివంగత వైఎస్సార్ విగ్రహం వద్ద పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు సభ్యత్వ నమోదు విధానం, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. జిల్లా కార్మిక శాఖ కమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు, ఏఎల్ఓ జీఎస్ఎస్కే శ్రీనివాసరావు, లేబర్ అసిస్టెంట్ కమిషనర్ బి.రమాదేవి, సిబ్బంది అవగాహన కల్పించిన వారిలో ఉన్నారు. 18 – 60 ఏళ్ల కార్మికుల నమోదుకు సువర్ణావకాశం రూ.110తో నమోదు..కార్మికులకు అనేక సంక్షేమ ప్రయోజనాలు లేబర్ కార్డు ఉంటే పెళ్లి, ప్రసూతి, మరణానికి ఆర్థిక సాయం రెన్యువల్ చేసుకోని కార్మికులకు మరో అవకాశం ఉమ్మడి విజయనగరం జిల్లాలో 90 వేల మంది కార్మికుల నమోదుప్రసూతి సాయం భవన నిర్మాణ కార్మికుల కుమార్తెలకు రెండు కాన్పులకు ప్రభుత్వం రూ.20 వేల చొప్పున సాయం అందజేస్తుంది. ఆస్పత్రి ప్రసూతి ధ్రువపత్రం, డిశ్చార్జి సర్టిఫికెట్, శిశువు జనన ధ్రువపత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. సహజ మరణానికి రూ.60 వేల సాయం నమోదైన కార్మికుడు మరణిస్తే అతని కుటుంబానికి ప్రభుత్వం రూ.60 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. మరణ సమయానికి కార్డు రెన్యువల్ అయి ఉండాలి. మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేయాలి. దహన సంస్కారాలకు తక్షణ సాయం మరణించిన కార్మికుడి దహన సంస్కారాల కోసం ప్రభుత్వం రూ.20 వేల తక్షణ సాయం అందజేస్తుంది. సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. -
వంగర ఏపీఓ సస్పెన్షన్
వంగర: ఉపాధి హామీ పథకం ఏపీఓ మర్రాపు సత్యవతి సస్పెండ్ అయినట్టు డ్వామా ఏపీడీ చంద్రకుమారి గురువారం తెలిపారు. విధుల నిర్వహణలో లోపాలను గుర్తించి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నెల 3వ తేదీన ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. రేగిడి ఏపీఓ ఎస్.హరినాథ్ను ఇన్చార్జి ఏపీఓగా నియమించారన్నారు. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో గత రెండు నెలలుగా జ్వరాల కేసులు పెరగడం, ఆస్పత్రుల కు రోగుల తాకిడి అధికమైందన్న అంశంపై ఈ నెల 4వ తేదీన ‘జిల్లాకు జ్వరమొచ్చింది ..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి వైద్యశాఖ అధికారులు స్పందించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిల్యాబ్ను జిల్లా మలేరియా అధికారి ఎం.సింహాచలం గురువా రం పరిశీలించారు. జ్వరాల వ్యాప్తి, కేసుల నమోదుపై ఆరా తీశారు. మలేరియా, డెంగీ కేసుల నమోదు వివరాలను ల్యాబ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నేరడిలో ఘీం‘కరి’ంపు భామిని: మండలంలోని నేరడి గ్రామ సమీపంలో ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. రెండు జతలుగా వీడి సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒక జత ఏనుగులు వంశధార నదీ పరివాహక ప్రాంతంలో ఎగువ భాగానికి వెళ్లి పంటలకు నష్టం కలిగించాయి. మరోజత బిల్లుమడ వైపు పంటపొలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేశాయి. జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులను స్థానికులు దారిమళ్లించే యత్నం చేస్తున్నారు. సాలూరు: జీతాలు పెంచాలని, పనిగంటలు తగ్గించాలని, వసతులు కల్పించాలని కోరుతూ సాలూరు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్ల ధర్నాకు మాజీ డిప్యూటీసీఎం పీడిక రాజన్నదొర గురువారం సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయా యాజమాన్యాలను కోరారు. -
కూరగాయాలు
రైతన్నకు ● కూరగాయల ధరలు పతనం ● నష్టాల ఊబిలో రైతన్నలు ● మార్కెట్లో ఏ ఒక్క కూరగాయకు గిట్టుబాటు ధరలేని వైనం ● కోత ఖర్చులు రాని దుస్థితి ● పంట కోయకుండా పొలాల్లో వదిలేస్తున్న రైతులు ● రైతన్న గోడును పట్టించుకోని చంద్రబాబు సర్కారు ఈ చిత్రంలో టమాటా పంటను చూపిస్తున్న రైతు రామభద్రపురానికి చెందిన కోట సోములు. ఈయన తనకున్న 50 సెంట్లలో సుమారు రూ.60 వేలు పెట్టుబడి పెట్టి టమాటా పంటను సాగు చేశాడు. పంట దిగుబడి బాగుండడంతో సంతోషపడ్డాడు. పంట చేతికందే సరికి మార్కెట్లో ధర కిలో రూ.3లకు పడిపోవడం, పంటను కొనుగోలు చేసేవారు లేకపోవడంతో లబోదిబోమంటున్నాడు. ఒక కూలి మనిషి రోజంతా 10 క్రేట్ల టమాటా ఏరుతుంది. వాటిని మార్కెట్లో విక్రయిస్తే రూ.500 నుంచి రూ.600 వస్తున్నాయి. కూలీకి రూ.300, రవాణా ఖర్చులు రూ.100, ఆశీలు రూ.100 పోతున్నాయి. రైతుకు మిగిలింది సున్నా. పంట సాగుచేసిన రైతు కుటుంబం ఎలా బతకాలి, పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి అంటూ రైతు గగ్గోలుపెడుతున్నాడు. కూలిఖర్చులు రాకపోవడంతో పొలంలోనే పంటను వదిలేయాల్సి వస్తోందంటూ కన్నీరుపెట్టాడు. -
ఇదేంశిక్షణ..
మెరకముడిదాం: డీఆర్డీఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరకముడిదాం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో మండలానికి చెందిన వీఓఏలు, జండర్, ఆరోగ్య కమిటీ సభ్యులకు గురువారం ఒకరోజు శిక్షణ తరగతులను ఏర్పాటుచేశారు. శిక్షణ కోసం సభ్యులందరూ ఉదయం 10 గంటలకే హాజరుకాగా, శిక్షణ తరగతులు నిర్వహించాల్సిన ఇన్చార్జి ఏపీఎం గీత 11.30 గంటల వరకూ హాజరుకాలేదు. ఆమె రాకకోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో సీసీలు సూర్యనారాయణ, కోటేశ్వరరావు శిక్షణను కొనసాగించారు. శిక్షణ తరగతుల నిర్వ హణపై అధికారి నిర్లిప్తతను పలువురు సభ్యులు తప్పుబట్టారు. -
మిషన్ హార్టివిజన్తో ఉద్యానసాగు విస్తరణ
విజయనగరం ఫోర్ట్: మిషన్ హార్టివిజన్ అమలుచేసి ఉద్యాన పంటల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. దీనికోసం పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రభుత్వశాఖల సమన్వయంతో సమష్టిగా కృషిచేయడం ద్వారా దీనిని సాధించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మసేద్యం, డీఆర్డీఏ, విద్యుత్, మార్కెటింగ్శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి పంటకు బదులు ఉద్యాన పంటలను సాగు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక మిషన్ను రుపొందించినట్టు తెలిపారు. వచ్చే ఖరీఫ్లో 6 వేల ఎకరాల్లో అదనంగా వివిధ ఉద్యాన పంటల సాగు చేపట్టడం మిషన్ లక్ష్యమని పేర్కొన్నారు. కనీసం ఐదు ఎకరాలు ఒక క్లస్టర్గా రుపొందించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు, ఉద్యానశాఖాధికారి చిట్టిబాబు, మార్కెటింగ్శాఖ ఏడీ రివికిరణ్, ప్రకృతి వ్యవసాయం మేనేజర్ ఆనందరావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్పాణి, తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చిమొక్కల్లో ప్రజారోగ్యం
కొత్తవలస: ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వం కినుకవహిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం చేస్తోంది. అసంపూర్తిగా ఉన్న ఆస్పత్రి భవన నిర్మాణాలు పూర్తిచేయడంలో జాప్యం రోగులకు శాపంగా మారింది. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీటవేసింది. ఎస్.కోట నియోజకవర్గం పరిధిలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఐదు పీహెచ్సీలకు నూతన భవనాల నిర్మాణానికి రూ 8.25 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో పనులు చకచకా సాగాయి. సుమారుగా 60 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయాయి. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఆధారమైన భవనాలు పిచ్చిమొక్కల నడుమ దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ తీరును ఎత్తిచూపుతున్నాయి. ఇదీ పరిస్థితి... నియోజకవర్గంలోని జామి, అలమండ, లక్కవరపుకోట, కొత్తవలస, వియ్యంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. దీంతో గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చొరవతో ఐదు పీహెచ్సీలకు నూతన భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవ న నిర్మాణాన్ని రూ.కోటి65లక్షల వ్యయంతో తలపెట్టారు. రోగులకు వైద్యసేవలందించేందుకు వీలుగా విశాలమైన వార్డులు, వైద్యులకు ప్రత్యేక గదులు, ఓపీ విభాగం, లేబొరేటరీ ఇలా.. ఆధునిక సదుపా యాలతో భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఈ భవనాల పూర్తిచేయడంలో ప్రస్తుత కూటమి ప్రభు త్వ నిర్లక్ష్యం రోగులకు ఇబ్బందులు కలిగిస్తోంది. పరాయి పంచన ఆస్పత్రులు.. ప్రస్తుతం కొత్తవలస పీహెచ్సీ చెంతనే గల ఎన్జీఓ కార్యాలయంలోను, వియ్యంపేట పీహెచ్సీ సాంఘీక సంక్షేమ హాస్టల్లో నిర్వహిస్తున్నారు. పీహెచ్సీలకు వచ్చే రోగులకు సరైన సౌకర్యాలు లేవు. మంచాలు లేకపోవడంతో బల్లలపైనే పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. చీకటి గదుల్లోను మందులను దాచుకునే దుస్థతి నెలకొంది. కూటమి ప్రభుత్వం రాజకీయ వివక్షను వీడి ప్రజారోగ్యానికి అవసరమైన పీహెచ్సీ భవన నిర్మాణాలపై శ్రద్ధ చూపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. అసంపూర్తి నిర్మాణాలపై ఇంజినీరింగ్ అధికారి ఇ.శ్రీనివాసరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కొద్దిపాటి బిల్లులు పెండిగ్లో ఉండడంతో నిర్మాణాలు నిలిచిపోయాయని, బిల్లులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఆస్పత్రి భవనాల నిర్మాణా లు అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని పూర్తిచేస్తే గత ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. దీనివల్ల రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – పల్లా భీష్మ, చింతలపాలెం మాజీ సర్పంచ్, కొత్తలస మండలం కూటమి ప్రభుత్వం ప్రజా రోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం కొత్తవలస ప్రజానీకానికి ప్రభుత్వ వైద్యసేవలు అందని ద్రాక్షగా మారిపోయాయి. ఇప్పటిౖకైనా పాలకులు కళ్లుతెరిచి భవన నిర్మా ణాలు పూర్తిచేసి పేదప్రజలకు మెరుగైన వైద్యసేవలందేలా చూడాలి. – వెంకన్నపాత్రుడు, కొత్తవలస -
మేము అప్పుచేస్తాం... మీరు వడ్డీ చెల్లించండి!
రాజాం సిటీ: ‘విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు మేము అప్పుచేస్తున్నాం.. దానికి అయ్యే వడ్డీ 7.5 శాతం భారాన్ని కళాశాలల యాజమాన్యాలే భరించాలి.. అలా అయితేనే 2024–25 సంబంధించి ఆర్టీఎఫ్లు విడుదల చేస్తాం... మీకు చెల్లించాల్సిన మొత్తంలో 7.5 శాతం వడ్డీ మినహాయించి మిగిలినది కళాశాల బ్యాంకు ఖాతాలకు జమచేస్తాం.. దీనికి మీరు అగ్రిమెంట్ ఇవ్వాలి.. దీనికి సమ్మతమైతే ఆర్టీఎఫ్ విడుదల అవుతుంది.’ అంటూ ఇటీవల రౖపైవేటు కళాశాలల అసోసియేషన్ సభ్యులు సంప్రదించిన సమయంలో సీసీఈ సభ్యుడు భరత్గుప్తా చెప్పిన మాట. దీనిపై ప్రైవేటు కళాశాలల అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటికే రెండేళ్లుగా వడ్డీలకు అప్పులుతెచ్చి కళాశాలలు నిర్వహిస్తున్న సమయంలో ఆర్టీఎఫ్లు విడుదలకు తెచ్చిన సొమ్ముకు 7.5 శాతం వడ్డీ చెల్లించాలంటే కష్టమని, ఇలా అయితే కళాశాలల యాజమాన్యాలు నష్టపోతాయని తేల్చిచెప్పామనే విషయాన్ని అసోసియేషన్ సభ్యులు వాట్సాప్ గ్రూపుల ద్వారా మిగతా కళాశాలల యాజమాన్యాలకు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేసేదని, వారు ఫీజులు చెల్లించేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందంటూ ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు సర్కారు నేరుగా కళాశాలల బ్యాంకు ఖాతాలకే ఆర్టీఎఫ్ నిధులు జమచేస్తామని చెప్పి ఇప్పుడు ఈ మెలిక పెట్టడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదీ పరిస్థితి... జిల్లాలో ఉన్న సుమారు 35 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 20వేల మంది, 11 ఇంజినీరింగ్ కళాశాలల్లో 15వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం కళాశాలలకు నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తుందన్న భరోసాతో విద్యార్థులు ఆయా కళాశాలల్లో చదువుకుంటున్నారు. విద్యాసంవత్సరం ముగిసే సమయం దగ్గరపడుతున్నా ఇంత వరకు చంద్రబాబు సర్కారు కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదు. దీంతో అటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కళాశాలలపై భారమా.. విద్యావ్యవస్థ బలోపేతం చేయాలంటే ఎంతో పారదర్శకత అవసరం. చంద్రబాబు సర్కారులో అది లోపించింది. కళాశాలల్లో విద్యార్థుల చదువులు చక్కగా సాగాలంటే ఆర్టీఎఫ్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలి. దీనికోసం తెచ్చిన అప్పులపై వడ్డీ భారం కళాశాలల యాజమాన్యాలపై మోపేందుకు చూడడం ఎంత వరకు సమంజసం. ప్రభుత్వానికి చేతకాకే వడ్డీ భారాన్ని కళాశాలల యాజమాన్యాలపై వేయాలని చూస్తోంది. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ చెల్లించేది. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ ఇబ్బందులకు గురిచేయడమేనా అజెండా? ïœk ÈÆ‡$$…-ºÆŠ‡Þ-Ððl$…sŒæ Ñyýl$-§ýlÌS ^ólĶæ$-MýS$…yé MýSâêÔ>-ÌSÌS¯]l$ Cº¾…-§ýl$-ÌSMýS$ VýS$Ç-^ól-Ķæ$yýlÐól$ ^èl…{§ýl-»êº$ çÜÆ>PÆý‡$ Agñæ…-yéV> MýS°í³Ýù¢…¨. VýS™èl ¯ðlÌSÌZ ïœk ÈÆ‡$$…ºÆŠ‡ÞÐðl$…sŒæ °«§ýl$Ë$ Ñyýl$§ýlÌS ^ólÔ>Ð]l$° ^ðl糚-MýS$…-r$¯]l² {糿¶æ$™èlÓ… C…™èl Ð]lÆý‡MýS$ BĶæ* MýSâê-Ô>ÌS-ÌSMýS$ °«§ýl$Ë$ fÐ]l$-^ól-Ķæ$-MýS-´ùÐ]lyýl… Ððl¯]l$MýS B…™èl-Æý‡Å-Ðól$-Ñ$sìæ. Cr$ ѧéÅ-Æý‡$¦-ÌS¯]l$, Ar$ MýSâê-Ô>ÌS-ÌS¯]l$ B…§øâýæ¯]lMýS$ VýS$Ç-^ól-Ķæ$yýl… ™èlVýS§ýl$. MýSâê-Ô>-ÌS-ÌSOò³ Ð]lyîlz-¿êÆý‡… ÐólĶæ*ÌS° ^èl*yýlyýl… çÜÇ-M>§ýl$. ˘ – డాక్టర్ తలే రాజేష్, వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి ప్రైవేటు కళాశాలలకు చంద్రబాబు సర్కారు సరికొత్త ఆఫర్ 7.5 శాతం వడ్డీ చెల్లిస్తేనే ఫీజురీయింబర్స్మెంట్ విడుదల! అప్పుతెచ్చిన నిధులకు కళాశాలలే వడ్డీ చెల్లించాలని మెలిక నిధుల విడుదలలో జాప్యం దిక్కుతోచని స్థితిలో కళాశాలల యాజమాన్యాలు -
‘కోట’లో చోరీ
శృంగవరపుకోట: పట్టణంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘరానా చోరీ పట్టణ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ప్రధాన రహదారిలో జనం తిరిగే సమయంలో షాపులకు ఉన్న షట్టర్లు తెరిచి దర్జాగా చోరీ చేసి నిందితుడు పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.కోట ప్రధాన రహదారిలో ఉన్న సీతారామ మెడికల్స్ దుకాణంలో చోరీకి యత్నం చేసి షట్టర్ బలంగా ఉండడంతో ప్రయత్నం విరమించుకుని పైన మేడపైన ఉన్న డాక్టర్ సీతారత్నంకు చెందిన సీతారామ మెడికల్ ల్యాబ్లో చోరీకి పాల్పడ్డాడు. ల్యాబ్లో రూ.4వేలు చోరీ చేసినట్టు డాక్టర్ సీతారత్నం పోలీసులకు తెలిపారు. తరువాత తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రధాన రహదారిలో ఉన్న జైశ్రీరామ మెడికల్స్ దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. ఈ దుకాణంలో ఎక్కువ మొత్తంలో సొమ్ము చోరీకి గురైనట్టు ఫిర్యాదుదారు తెలిపారు. విజయనగరం నుంచి వచ్చిన క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రధాన రహదారిలో ఉన్న పలు దుకాణాలు, మాల్స్ నుంచి సీసీ పుటేజీలను పరిశీలించారు. చోరీకి పాల్పడింది ఒకే వ్యక్తి అని నిర్దారణకు వచ్చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నారాయణమూర్తి తెలిపారు. -
రూ.1.32 కోట్లు
● ప్రభుత్వంపై నమ్మకం లేక... గతేడాది బీమా ప్రీమియం చెల్లించిన మామిడి, జీడిమామిడి రైతులు 10,670 మంది రైతులు చెల్లించిన ప్రీమియం మొత్తం జిల్లాలో సాగులో ఉన్న మామిడి పంట 32 వేల హెక్టార్లు గతేడాది పంటల బీమా రాకపోవడంతో ఈ ఏడాది ఒక్క రైతు కూడా బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రాలేదు. బీమా ప్రీమియం వసూలులో చూపుతున్న శ్రద్ధ చెల్లింపులో ప్రభుత్వం చూపడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఒక్క రైతు కూడా బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. జిల్లాలో సాగులో ఉన్న జీడి మామిడి పంట 5,600 హెక్టార్లు విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. విపత్తు సమయంలో సాయం అందక విలవిల్లాడుతున్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ఉచిత పంటల బీమాకు మంగళం పాడేసిన కూటమి సర్కారు.. ప్రీమియం చెల్లించిన రైతులు పంట నష్టపోయినా పరిహారం అందించడంలో నిర్లక్ష్యంవహిస్తోంది. రైతన్నను ఆవేదనకు గురిచేస్తోంది. ఉద్యానసాగును ప్రోత్సహిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు వాస్తవానికి భిన్నమని, విపత్తుల సమయంలో ఎలాంటి సాయం అందడంలేదంటూ రైతులు గగ్గోలుపెడుతున్నారు. బీమా కంపెనీ నుంచి రైతులకు చెల్లించాల్సిన బీమా సొమ్మును ఇప్పించడంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. ● బీమా ప్రీమియం చెల్లించినా... 2025–26లో మామిడి తోటలకు ఎకరాకు రూ.2, జీడి మామిడి తోటలకు ఎకరాకు రూ.1500 చొప్పున రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. 10,104 మంది రైతులు 6,358 ఎకరాల మామిడితోటలకు రూ.1,27,16,000లు, జీడి మామిడి రైతులు 566 మంది 378 ఎకరాలకు రూ. 5,67,000లు బీమా ప్రీమియంగా చెల్లించారు. పంట నష్టపోతే మామిడి పంటకు ఎకరాకు రూ.40 వేలు, జీడిమామిడికి రూ.30 వేలు బీమా అందాలి. గతేడాది కొన్ని తోటలు పూర్తిగా పూతపూయకపోగా, మరికొన్నిచోట్ల తుఫాన్ వర్షాలకు నష్టంవాటిల్లింది. మామిడి, జీడి మామిడి పంటలు దెబ్బ తిన్నాయి. పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంట దెబ్బతినడంతో బీమా వర్తిస్తుందని మామిడి, జీడిమామిడి రైతులు ఆశించినా ఇంతవరకు పైసా కూడా అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు బీమా ప్రీమియం డబ్బులు, మరోవైపు పంట నష్టపోయామని చెబుతున్నారు. బీమా.. లేదండి ధీమా..! గతేడాది పంటలు నష్టపోయిన రైతులకు అందని బీమా ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్న వైనం ఆవేదనలో రైతాంగం 0రైతులు నష్ట పోయారు.. గతేడాది మామిడికి ఎకరానికి రూ.2 వేలు, జీడి మామిడికి రూ.1500 చొప్పున రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. తుఫాన్ వర్షాలకు పంట నష్టపోయినా ఒక్క రూపాయి బీమా చెల్లించకపోవడం దారుణం. రైతులు రెండు విధాలా నష్టపోయారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదు. వారి సమస్యలను పరిష్కరించడం లేదు. – బుద్దరాజు రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బీమా డబ్బులు అందలేదు... ఈ ఏడాది మామిడి, జీడిమామిడి పంటలకు రైతులు పంటల బీమా ప్రీమియం కట్టలేదు. గతేడాది పంటల బీమా కోసం వివరాలు అడిగితే కమిషనర్ కార్యాలయానికి పలు మార్లు పంపించాం. ఒక్క రైతుకు కూడా బీమా డబ్బులు అందలేదు. – కె.చిట్టిబాబు, జిల్లా ఉద్యానశాఖాధికారి -
క్షుద్రపూజల కలకలం
● ఏడాదిలో మూడుసార్లు వివిధ ప్రదేశాల్లో పూజలు ● భయాందోళనలో పల్లెప్రజలు ● చంద్రగ్రహణం రోజున పూజల కలవరం బొండపల్లి: బొండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గెద్దపేట గ్రామానికి ఆనుకొని ఉన్న సిరి చెరువులో బుధవారం వేకువజామున క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపాయి. ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చంద్రగ్రహణం అనంతరం చెరువులో మూడు చోట్ల నిమ్మకాయలతో పాటు మనిషిబొమ్మ, ఇతర సామగ్రి, నల్లని కోడిపెట్టలను అక్కడే చంపివేసి పూజలు నిర్వహించడం, ఏడాదిలో ఇదే రీతిన మూడు సార్లు ఈ ప్రాంతంలో పూజలు చేయడంపై భయపడుతున్నారు. అటువైపుగా వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించడంలేదు. పూజలు చేసిన వారిపై నిఘాపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఎస్ఐ యు.మహేష్ మాట్లాడుతూ పూజల సమాచారం అందిందని, నిఘా వేసి సబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. కింతలివానిపేటలో... బొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస పంచాయతీ పరిధిలోని కింతలివానిపేటలో మంగళవారం రాత్రి క్షుద్రపూజలు చేశారన్న అంశం కలకలం రేపింది. గ్రామంలోని ఎస్సీ వీఽధి నాలుగురోడ్ల కూడలిలో పెద్దగా ముగ్గులువేసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రగ్రహణం అనంతరం అర్ధరాత్రి పూట ఈ పూజలు నిర్వహించారని, ఇది దేనిసంకేతమో తెలియడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారమిచ్చారు. -
శతశాతం ఫలితాల సాధనే లక్ష్యం
● డీఈఓ మాణిక్యంనాయుడు రామభద్రపురం: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి పారదర్శకంగా నిర్వహించాలని డీఈఓ యు.మాణిక్యంనాయుడు సిబ్బందికి సూచించారు. బొబ్బిలి డివిజన్ పరిధిలోని డీఓలు, సీఎస్లకు పరీక్షల నిర్వహణపై బుధవారం ఒక రోజు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో 5 నిమిషాలు ఆలస్యం అయినా అనుమతించాలని సూచించారు. జిల్లాలో 440 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 22,961 మంది విద్యార్థులు 119 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారన్నారు. మొత్తం 1350 మంది ఇన్విజిలేటర్లు, ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక్కో డీఓ, సీఎస్లను నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఇన్విజిలేటర్ల నియామకంలో విమర్శలకు తావులేకుండా రాష్ట్ర విద్యాశాఖ నుంచే ర్యాండమ్గా నియమిస్తూ జాబితా తయారైందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ రామ్మోహనరావు, డీఈసీ మెంబర్ సన్యాసిరాజు, ఎంఈఓ తిరుమలప్రసాద్, ఏఎస్ఓ బి.లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి విజయనగరం ఫోర్ట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోను, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించాలని సూచించారు. విజయనగరం పోలీస్బ్యారెక్స్లో నిర్వహించే ఉత్సవాలకు సుమారు 3 వేల మంది వరకు మహిళలు హాజరవుతారని, వారికి తాగునీరు, స్నాక్స్, శానిటేషన్ తదితర ఏర్పాట్లు చూడాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. మహిళా పారిశ్రామిక వేత్తలను సన్మానించేందుకు, వారి విజయగాథలను వివరించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఆర్డీఏ పీడీకి తెలిపారు. సమావేశంలో జేసీ సుతుమాధవన్, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఆర్డీఓ వెంకటేశ్వరావు, సీపీఓ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు. తలసేమియా వ్యాధితో విద్యార్థి మృతి జామి: మండలంలోని శాసనపల్లి గ్రామానికి చెందిన గంధవరపు భరత్(9) తలసేమియా వ్యాధితో బుధవారం మృతి చెందాడు. భరత్ స్థానిక ప్రాధమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. అప్పారావు, లక్ష్మీ దంపతుల కుమారుడైన భరత్ చిన్నప్పటి నుంచే ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. విశాఖ, చైన్నె, బెంగళూరు తదితర చోట్ల వైద్యం చేయించారు. బెంగళూరులో శస్త్రచికిత్సకు రూ.15లక్షల వరకు అవుతుందని వైద్యులు చెప్పడంతో పేదలు కావడంతో డబ్బుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతలోనే విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భరత్ మృతితో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. పారదర్శకంగా పది పరీక్షల నిర్వహణ ● ఆర్జేడీ విజయభాస్కర్ విజయనగరం అర్బన్: పది పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా నిర్వహణ జరగాలని విద్యా శాఖ ఆర్జేడీ బి.విజయభాస్కర్ అన్నారు. స్థానిక ఫోర్ట్ సిటీ స్కూల్లో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, విభాగాధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సక్రమంగా పారదర్శకంగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. పరీక్షల సమయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోసుకోకుండా అప్రత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. -
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని ప్రతి మహిళకు భద్రత, సాధికారిత కల్పించడమే మన లక్ష్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 20 వరకు నిర్వహించే కార్యక్రమం పోస్టర్లను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో మహిళలు సాంకేతికతను వినియోగించుకుంటూనే ఆన్లైన్ వేదికలపై పొంచి ఉన్న సైబర్ ముప్పులు పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా వేధింపులు, లోన్ యాప్ మోసాలు, ఇతర ఆన్లైన్ ఆర్థిక నేరాల నుంచి మహిళలు తమకు తాము ఎలా రక్షించుకోవాలో ఈ పోస్టర్ల ద్వారా వివరించారు. సైబర్ నేరాలకు గురైన వారు భయపడకుండా వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, ఐసీడీఎస్ పీడీ కె.వెంకట బాలామణి, వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పి.సాయివిజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గ్రహణం ఎఫెక్ట్
విజయనగరం టౌన్: చంద్రగ్రహణం పురస్కరించుకుని జిల్లాలో ఉన్న ఆలయాలన్నింటిని మూసివేశారు. కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో మంగళవారం ఉదయం నుంచే ఆలయాలు మూసివేశారు. బుధవారం వేకువజామునుంచి సంప్రోక్షణ పూజలు అనంతరం ఉదయం 8 గంటల నుంచి ఆలయాలు తెరచుకోనున్నాయి. గ్రహణం పడిన వేళ.. రాజాం: పట్టణంలోని నరసింహనాయుడు కాలనీలో మహిళలు చంద్రగ్రహణం తెలుసుకునేందుకు పూర్వీకులు ఆచరించే సంప్రదాయాన్ని కొనసాగించారు. పాలపర్తి స్వాతి ఇంటి వద్ద ఇత్తడి పల్లెంలో పసుపునీళ్లుపోసి రోకలిని నిలబెట్టి గ్రహణ సమయాన్ని తెలుసుకున్నారు. గ్రహణం ఉన్న సమయంలో నిలిచిన రోకలికి హారతిచ్చి పూజలు చేశారు. -
ప్రపంచ మేధావి అంబేడ్కర్
● మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు విజయనగరం రూరల్: భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి, ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య విలువలను తెలియజేసిన ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు జూపూడి ప్రభాకరరావు అన్నారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో మంగళవారం నిర్వహించిన జిల్లా దళిత సమ్మేళన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ముందుగా మాలమహానాడు, శ్రీ పైడిమాంబ అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన అంబేడ్కర్ విగ్రహాన్ని జూపూడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దురలవాట్లు మానుకొని, పిల్లలను చదివించి ఉన్నత విలువలతో పెంచితేనే అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషిచేసినట్లు అవుతుందన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేసి సమాజంలో అసమానతలు, కులబేధాలు లేకుండా మెలగినప్పుడే నిజమైన రాజ్యాంగం అమలు జరిగినట్టుగా భావించాలని పేర్కొన్నారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు లోగిశ రామకష్ణ మాట్లాడుతూ జిల్లాలో దళితులపై అంటరానితనం, హత్యాచారాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దళిత సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కల్యాణ్రావు మాట్లాడుతూ ఎస్సీలంతా ఏకమై రాజ్యాధికారం సాధించే దిశగా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి సియ్యాదుల శ్రీనివాసరావు, ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు మరువాడ ఈశ్వరరావు, కార్యవర్గ సభ్యులు జూరిరాజు, జిల్లా మాలమహానాడు అధ్యక్షురాలు వర్రి సంతోషి, కార్యదర్శి తాలాడ పైడిరాజు, విజయనగరం జిల్లా నియోజకవర్గం కన్వీనర్ భీమపల్లి సంధ్యారాణి, పైడిమాంబ అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కోరాడ నారాయణరావు, కోరాడ రమణ, బంగార్రాజు, మెట్ట కార్తీక్, కె.సత్యనారాయణ, పొన్నకాయల రామలక్ష్మి, చందక నూకరాజు, చీడి రామకృష్ణ, అక్కివరపు రాజు, తదితరులు పాల్గొన్నారు. -
● కిలో టమాటా రూ.3లు
టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. బొబ్బిలిలో కిలో టమాటా రూ.3లు పలుకుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. 25 కిలోల బరువున్న కేట్ టమాటాలు బొబ్బిలి మార్కెట్లో రూ.60 నుంచి రూ.75 పలుకుతోందంటూ గొల్లపల్లి, పాతబొబ్బిలి, మల్లంపేట, మెట్టవలస, పారాది, గొర్లె సీతారాంపురం, రంగరాయపురం, దిబ్బగుడివలస తదితర గ్రామాల రైతులు వాపోతున్నారు. ఆటోచార్జీ తీసేస్తే కిలోకు రైతు చేతికి రూ.2 వస్తోందన్నారు. బొబ్బిలిలో రైతు బజారు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పంట కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – బొబ్బిలి -
అధికారమిస్తే.. అరెసు ్టచేస్తారా..
చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా బొబ్బిలిలో అంగన్వాడీల మానవహారం తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ సిబ్బందిని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆందోళనలను అడ్డుకోవడం, అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో మంగళవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అధికారమిస్తే అరెస్టుచేస్తారా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. తక్షణమే అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచాలని, మినీ కేంద్రాలన్నీ మెయిన్ కేంద్రాలుగా మార్చాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. రెండు జిల్లాల్లోని కలెక్టరేట్లు, కాంప్లెక్స్లు, ప్రధాన కూడళ్లలో మానవహారాలు నిర్వహించి తమ నిరసన గళం వినిపించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. – విజయనగరం ఫోర్ట్/బాడంగి/బొబ్బిలి/బలిజిపేట -
ముగిసిన కల్యాణోత్సవం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో గడిచిన ఐదు రోజులుగా నిర్వహించిన భూభుజంగ వరాహలక్ష్మీనరసింహస్వామి, మాధవస్వామి వారి వార్షిక కల్యాణోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. వేకువజామున స్వామివారికి ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో పూర్ణాహుతి జరిపారు. అనంతరం స్వామివారి సుదర్శన పెరుమాళ్లను రామకోనేరు ప్రధాన ఘాట్ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రతీర్థస్నానం నిర్వహించారు. అనంతరం ధ్వజావరోహణ చేపట్టి ఉత్సవాలకు ముగింపు పలికారు. నేడు ‘గురుదేవా’కు ఒడిశా గవర్నర్ రాక కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామ సమీపంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టును ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం సందర్శంచనున్నట్టు ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేన్సర్ ఆస్పత్రిని, దివ్యాంగులకు ట్రస్టు తరఫున అందిస్తున్న సేవలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి జియ్యమ్మవలస (రూరల్): పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి పోలీసులను ఆదేశించారు. చినమేరింగి పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం సందర్శించారు. కేసుల రికార్డులు పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. మండలంలో క్రైమ్ రేటు తగ్గించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ టి.వి.తిరుపతిరావు, ఎస్ఐ అనిషి, తదితరులు పాల్గొన్నారు. మందకొడిగా వ్యవసాయ రుణాల రెన్యువల్స్ వీరఘట్టం: వీరఘట్టం పీఏసీఎస్లో వ్యవసాయ రుణాలు రెన్యువల్స్ మందకొడిగా సాగుతున్నాయని సీఈఓ బలరాం అన్నారు. మంగళవారం సెలవు రోజు కూడా రైతుల నుంచి రుణాలను వసూలు చేశారు. వీరఘట్టం పీఏసీఎస్ నుంచి రూ.29 కోట్లు రుణాలు ఇవ్వగా రూ.4కోట్లే రెన్యువల్ అయిందన్నారు. -
అప్రమత్తతే ప్రధానం
వాతావరణంలోని మార్పులవల్లే జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వైరల్ ఫీవర్స్ బారిన జనం పడుతున్నారు. ఎండతీవ్రత పెరిగినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండలో తిరగకూడదు. ఎండలోకి వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి ధరించాలి. చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలో తిరగకుండా చూసుకోవాలి. ఓఆర్ఎస్ ద్రావణం, నీరు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం, దగ్గు జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే గ్రామంలో ఉన్న ఎంఎల్హెచ్పీ, లేదంటే పీహెచ్సీ వైద్యుడిని సంప్రదించాలి. జ్వరతీవ్రత ఎక్కువగా ఉంటే ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ ● అదే మండలానికి చెందిన అశ్విని అనే మహిళకు జ్వరం, వాంతులు కావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు వైరల్ ఫీవర్గా నిర్ధారించి చికిత్స అందించారు. ● గంట్యాడ మండలానికి చెందిన మౌళి అనే బాలుడు జ్వరం, తలనొప్పి బారిన పడడంతో కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి మంగళవారం తీసుకువెళ్లారు. బాలిడిని పరీక్షించిన వైద్యుడు వైరల్ ఫీవర్గా నిర్ధారించి మందులు అందజేశారు. విజయనగరం ఫోర్ట్: జిల్లా ప్రజలు అధికమంది జ్వరాల బారినపడుతున్నారు. వీరితో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జనవరి నెల నుంచే జ్వరాల వ్యాప్తి ఆరంభమైంది. ప్రస్తుతం రోగుల సంఖ్య అమాంతం పెరిగింది. సాధారణంగా మే, జూన్ నెల నుంచి జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఆరంభం నుంచే వ్యాప్తి అధికంగా ఉంది. జ్వరాలబారిన పడినవారు కొంతమంది పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమంది సర్వజన ఆస్పత్రిలో సేవలు పొందుతున్నారు. వాతావరణంలో మార్పులు, కలుషిత తాగునీరు వంటివి జ్వరాల వ్యాప్తికి ప్రధాన కారణమని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ● వృద్ధులు, పిల్లలపైనే అధిక ప్రభావం.. గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ప్రాంతాల్లోనూ జ్వరాల కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. వైరల్పీవర్స్తో పాటు, టైఫాయిడ్, మలేరియా, కామెర్లు వంటి వ్యాధులతో అస్వస్థతకు గురవుతున్నారు. వసతిగృహాల్లో ఉన్న విద్యార్థులనూ జ్వరాలు వెంటాడుతున్నాయి. వాతావరణంలో మార్పులే కారణం.. ఈ ఏడాది తొందరగా జ్వరాల వ్యాప్తికి వాతావరణంలో మార్పులే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు డీహైడ్రేషన్కు గురవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరాలతో అధికమంది బాధపడుతున్నారు. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో జనవరి, ఫిబ్రవరి నెలలో 48,801 జ్వరపీడిత కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఉన్న 300 ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 50 వేలు పైబడి జ్వర కేసులు నమోదైనట్టు సమాచారం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. అప్పుడే ప్రారంభమైన జ్వరాల వ్యాప్తి గతనెల నుంచే అధికం రెండు నెలల్లో లక్ష జ్వరపీడిత కేసుల నమోదు వాతావరణంలో మార్పులే కారణమంటున్న వైద్యులు -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి : ఎన్టీఏ
విజయనగరం గంటస్తంభం: ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్(ఎన్టీఏ) డిమాండ్ చేసింది. విజయనగరం యూత్ హాస్టల్లో జిల్లా అధ్యక్షుడు కె.జోగారావు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక హామీలను అమలు చేయడంలో ఆలస్యం జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ పలువురు ఉపాధ్యాయుల బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. 12వ పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ 30 శాతం ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. పీఆర్సీ ఎరియర్లు, సరెండర్ లీవులు, పీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. వేసవి సెలవుల్లోనే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమగ్రశిక్షలో పని చేస్తున్న ఐఈఆర్పీ ప్రత్యేక ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఒత్తిడిని తగ్గించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర అదనపు కార్యదర్మి ఎం.మురళి, రాష్ట్ర కార్యదర్మి చిప్పాడ సూరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు వై.శ్రీనివాసరావు, పి.రాంబాబు, జి.రవి, జిల్లా కార్యదర్ములు టి.నాగేశ్వరరావు, జి.కోటరావు, నాయుడు, ఐఈఆర్పీ ఉపాధ్యాయులు అప్పలనాయుడు, గీత పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి : యూటీఎఫ్
విజయనగరం గంటస్తంభం: బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా యూటీఎఫ్ తరఫున కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ భాస్కరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మోహనరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగాన్ని సంరక్షించడం యూటీఎఫ్ బాధ్యతని అన్నారు. ఉపాధ్యాయుల 12వ వేతన సంఘం నియామకం సహా ఆర్థిక డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలని సూచించారు. డిమాండ్ల సాధనకు మార్చి 24న నియోజకవర్గ కేంద్రాల్లో, ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో, ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రాష్ట్ర స్థాయిలో నిరాహార దీక్షలు, ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
పేదలకు ఇక సాధారణ బియ్యమే..!
● ఫోర్టిఫైడ్ రైస్ తాత్కాలికంగా నిలిపివేత ● జీఓ జారీ చేసిన ప్రభుత్వంవిజయనగరం కలెక్టరేట్: పోషకాలు తక్కువగా ఉండే బియ్యం పేదలు మళ్లీ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఇన్నాళ్లు సాధారణ బియ్యంలో కలిపే ఫోర్టిఫైడ్ నిలిపివేయడం ఇందుకు కారణం. ఇది ఒకవైపు పేదలకు నష్టం కలిగిస్తే మిల్లర్లకు కాస్తా మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రి గరబీ కళ్యాన్ అన్నయోజన పథకం కింద పేదలకు కోటా ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం, విద్యార్థులకు వసతిగృహాల్లో అందిసున్న బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేస్తుంది. అందులో అదనంగా కలిపేందుకు కూడా ఫోర్ట్టిఫైడ్ రైస్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది. పోషకాహారం ఎక్కువగా అందించేందుకు ఈ బియ్యం ఇస్తోంది. క్వింటా బియ్యంలో కేజీ ఫోర్టిఫైడ్ రైస్ కలపడం జరుగుతోంది. తాత్కాలికంగా నిలిపివేత ఈ బియ్యం తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓ విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఏడాది 4.11 మెట్రిక్ టన్నులు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. దాదాపు ధాన్యం అన్నీ సేకరణ పూర్తయి మిల్లులకు కూడా తరలించారు. వీటిని మిల్లింగ్ చేసి సుమారు 2.33 లక్షల బియ్యం ఇవ్వాలి. ఇందులో ఇప్పటికి సుమారు 60వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. సాధారణ బియ్యంలో కలిపేందుకు తయారు చేసే పోర్టుఫైడ్ రైస్ కెనల్ రాకపోవడం అందుకు సరఫరా రావడం ఇందుకు కారణం. దీంతో మిల్లింగ్ కూడా ఆగింది. కేంద్ర ప్రభుత్వం జీఓతో ఇక ఈ సమస్య లేకపోవడంతో మిల్లింగ్ వేగం పెరిగి ధాన్యం మిల్లింగ్ పెరిగి బియ్యం రానున్నాయి. పేదలకు ఇబ్బందే.. ఫోర్టిఫైడ్ రైస్ రావడంతో మిల్లింగ్కు ఇబ్బందులు తొలిగాయి. దీంతో మిల్లులు వద్ద కుప్పలుగా నిల్వ ఉన్న ధాన్యం మరపట్టి ఇచ్చేందుకు మిల్లర్లుకు సమస్య తీరింది. డిపోలకు వచ్చే నెలకు ఇచ్చేందుకు బియ్యం ఏమి చేయాలన్న అధికారులు సమస్య తీరింది. కానీ పేదలకు నాణ్యమైన రైస్ రావడం కష్టమే. ఫోర్ట్టిఫైడ్ రైస్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాధారణ బియ్యం వల్ల పోషకాహార లోపం పెరుగుతుంది.జీఓ వచ్చింది ఫోర్టిఫైడ్ రైస్ తాత్కాలికంగా నిలిపి వేసినట్టు జీఓ వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టత రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత మిల్లర్లు నుంచి మరపట్టి మూమూలు బియ్యం తీసుకుంటాం. దీనిపై తదుపరి ఆదేశాలు ఇస్తాం. – బి.శాంతి, డీఎం, పౌర సరఫరాల సంస్థ -
అనుమానిత స్థావరాలపై ఎకై ్సజ్ శాఖ దాడులు
పార్వతీపురం రూరల్: ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో పెదరేల్లివీధి, ఇందిరాకాలనీ, బాలగుడబ గ్రామాల్లోని అనుమానిత స్థావరాలపై దాడులు నిర్వహించారు. నాటుసారా అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇటీవల నాలుగు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను డ్రోన్ కెమెరాల సాయంతో నిర్వహించడంతో పాటు 23 అంతర్రాష్ట్ర దాడులు చేపట్టినట్టు అధికారులు మంగళవారం తెలిపారు. సారా విక్రయాలకు పాల్పడుతున్న పెదరేల్లివీధికి చెందిన వ్యక్తిపై జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ అమలు చేసి, విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్టు తెలిపారు. గతంలోనూ ఇదే తరహాలో ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు ఏఎస్పీ సంతోష్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలుడెంకాడ: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదకర మలుపులు, ప్రాంతాల వద్ద స్టాపర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరం–విశాఖపట్నం జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు, ఏకే ఇన్ఫ్రా ప్రతినిధి బీబీ ప్రభూజీలు కలిసి రాజపులోవ నుంచి చింతలవలస ఏపీఎస్పీ బెటాలియన్ వరకు 26 నంబర్ జాతీయ రహదారిలోని అత్యంత ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామంలో ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనం గత ఏడాది ఫిబ్రవరి 15న అపహరణకు గురైంది. అప్పట్లో వాహనం మిస్సింగ్పై సంతకవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సంతకవిటి ఎస్సై ఆర్.గోపాలరావు వద్ద ప్రస్తా వించగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
మహిళా రక్షక భటులకు ఆరోగ్య రక్షణ
● కేన్సర్పై అప్రమత్తతే ఆయుధం: ఎస్పీపార్వతీపురం రూరల్: మహిళా సాధికారిత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్లో మహిళా అధికారులు, సిబ్బందికి సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార), బ్రెస్ట్ (స్తన) క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వృత్తిపరమైన సవాళ్లతో పాటు కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకునే మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భాశయ, స్తన క్యాన్సర్ల బారిన పడకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముప్పును నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా కేవలం సిబ్బందికే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో పాల్గొన్న వైద్యులు డాక్టర్ రజిని ప్రియ, సౌజన్యలు కేన్సర్ వ్యాధులపై సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. ప్రతి మహిళ నెలకు ఒకసారి స్వీయ స్తన పరీక్ష చేసుకోవాలని, అవసరమైతే మెమోగ్రఫీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శిబిరంలో సివిల్, ఏఆర్, డీపీవో, కమ్యూనికేషన్ విభాగాలకు చెందిన మహిళా సిబ్బందితో పాటు హోంగార్డులు, నాలుగో తరగతి ఉద్యోగులు పరీక్షలు చేయించుకున్నారు. అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, పట్టణ సీఐ వెంకట్రావు, ఏఆర్ ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
గొల్జాంలో అగ్ని ప్రమాదం
● కాలిబూడిదైన వరి గడ్డివాములు ● పాక్షికంగా కాలిపోయిన ఆవు ● రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టంలక్కవరపుకోట: మండలంలో గొల్జాం గ్రామ సమీపంలోని జామివారి కల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరు గడ్డివాములు పూర్తిగా కాలి బూడిదవగా ఒక ఆవు పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి గ్రామస్తులు, వీఆర్ఓ గణేష్ తెలిపిన వివరాలు.. జామి వారి కల్లాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మండ వెంకటరావు, తూర్పాటి సూర్యప్రకాష్, తూర్పాటి కనకమహేశ్వరరావు, తూర్పాటి విజయరామగణపతి, తూర్పాటి నీలకంఠం, తూర్పాటి కోటేశ్వరరావులకు చెందిన ఆరు గడ్డి వాములు కాలి బూడిదయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి ప్రమాద స్థలానికి వెళ్లే దారి లేకపోవడంతో మిన్నకున్నారు, చెంతనే గల గెడ్డలో నీటి ఇంజిన్లు ఏర్పాటు చేసి పెద్ద పెద్ద పైప్లతో రైతులే మంటలను అదుపు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో తూర్పాటి నీలకంఠంకు చెందిన ఒక ఆవు పాక్షికంగా కాలిపోయింది. కాగా వేసవి కాలం ప్రారంభంలోనే పలు గ్రామాల్లో ఇప్పటికే జరిగిన అగ్నిప్రమాదాలతో గడ్డివాములు కాలిపోయాయి. వరుస ప్రమాదాలు కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. -
కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
● విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ● ఏపీటీఎఫ్ (1938) డిమాండ్విజయనగరం గంటస్తంభం: విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్–1938) ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. జిల్లా నాయకత్వం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపింది. కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవని, ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం, 30 శాతం ఐఆర్ ప్రకటించడం, పెండింగ్ బకాయిలు చెల్లించడం అత్యవసరమని పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నెం.57ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయడం, హైస్కూల్ ప్లస్ ఖాళీల భర్తీ, కారుణ్య నియామాకాలు చేపట్టడం, జీవో 342 ప్రకారం ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయులకు ఉన్నత విద్యాభ్యాసానికి అనుమతులు ఇవ్వడం, ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచడం వంటి అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జీసీసీ డీఎంగా అదనపు బాధ్యతలు
సీతంపేట: సీతంపేట గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్గా దాసరి కృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఈయన స్థానిక బ్రాంచ్ మేనేజర్గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు డీఎం పోస్టులో ఎఫ్ఏసీగా నియమించారు. ఇప్పటి వరకు జీసీసీ జనరల్ మేనేజర్ జి.సంధ్యారాణి ఇక్కడ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహించే వారు. యువకుడి అదృశ్యంపై కేసు సంతకవిటి: మండలంలోని వాసుదేవపట్నం గ్రామానికి చెందిన మజ్జి గిరిబాబు(35) 2024వ సంవత్సరంలో ఇంటి నుంచి పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అనంతరం కొద్ది రోజులు తల్లి దండ్రులతో ఫోన్లో సంభాషణలు జరిపారు. కొద్ది నెలల నుంచి గిరిబాబు తల్లిదండ్రులతో మాట్లాడడం లేదు. దీంతో తోడు చాలా రోజుల నుంచి ఇంటికి తిరికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల నుంచి సమాచారం సేకరించారు. ఎవరింటికీ రాలేదని చెప్పడంతో తండ్రి వెంకన్న స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. అందిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం భామిని: మండలంలోని మనుమకొండకు చెందిన బిడ్డిక వెంకన్న(55) శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్టు బత్తిలి ఎస్ఐ జి.అప్పారావు తెలిపారు. సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంలో బత్తిలి నుంచి మనుమకొండ వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడు వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 వాహనంలో సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భార్య బిడ్డిక రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చెరువులో పడి వివాహిత మృతి శృంగవరపుకోట: పట్టణంలోని స్థానిక జగ్గు చెరువులో పడి వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పుణ్యగిరి రోడ్డులో నివాసం ఉంటున్న కోట దేవి(33) మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తానంటూ భర్తతో చెప్పి చెరువుకి వెళ్లింది. కాగా ఆమె ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవటంతో భర్త కోట గోపి చెరువు వద్దకు వెళ్లి చూడగా భార్య దేవి చెరువులో పడి శవమై తేలి ఉంది. మృతురాలి భర్త గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి తెలిపారు. 18.54 లీటర్ల మద్యం ధ్వంసం సీతానగరం: పార్వతీపురం అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరిటెంటెండ్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో మంగళవారం సీతానగరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో వివిధ దాడుల్లో పట్టుబడి అక్రమ మద్యం 18.54 లీటర్లు ధ్వంసం చేసినట్టు ఇన్స్పెక్టర్ డి.పద్మావతి తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు తన సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 18.54 లీటర్లఅక్రమ మద్యం ధ్వంసం చేసినట్టు తెలిపారు. -
హైకోర్టు తీర్పును అమలు చేయాలి
సాలూరు రూరల్: హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే కలెక్టరేట్ను, అసెంబ్లీని ముట్టడిస్తామని షెడ్యూల్డ్ ఏరియా న్యాయపోరాట సభలో గిరిజన నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని జగ్గుదొరవలస గ్రామంలో షెడ్యూల్డ్ ఏరియా న్యాయపోరాట సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు నిమ్మక జయరాజు, నిమ్మక సింహచలం, మండల గిరిధర్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో షెడ్యూల్డ్ గ్రామాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. షెడ్యూల్డు ఏరియా భూభాగాల జాబితాను వెంటనే అధికార వెబ్సైట్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్యే, మంత్రులు నివాసాల వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు నిమ్మక అన్నారావు, మంచాల ఈశ్వరరావు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో యువతే కీలకం
● ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడువిజయనగరం రూరల్: దేశానికి యువ జనాభా గొప్ప ఆస్తి అని, దేశాభివృద్ధిలో యువతదే కీలకపాత్ర అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. స్థానిక జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో జేఎన్టీయూ జీవీ, మేరా యువభారత్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వికసిత్ భారత్ యువజన పార్లమెంట్– 2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత తమ జ్ఞానాన్ని, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి వినియోగించాలన్నారు. యువజన పార్లమెంట్ కార్యక్రమాలు ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంట్ విధానాలపై అవగాహన పెంచుతాయని అభిప్రాయపడ్డారు. నేటి యువతే, రేపటి దేశ నాయకులని.. ప్రతిఒక్కరూ నాయకత్వ లక్షణాలతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఉపకులపతి వీవీ సుబ్బారావు మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో రాణించి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని కోరారు. అనంతరం జిల్లాలోని వివిధ యువ క్లబ్ల ప్రతినిధులకు ఎంపీ కలిశెట్టి చేతులమీదుగా క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేరా యువభారత్ జిల్లా యువజన అధికారి ఎన్పీ భారత్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీదారులు
● 200 వినతులు స్వీకరించిన అధికారులువిజయనగరం కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్), ’రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. మొత్తం 200 వినతులు రాగా అత్యధికంగా 95 అర్జీలు రెవెన్యూ శాఖకు చెందినవి కావడం విశేషం. ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ ఎం.రామ్సుందరరెడ్డి రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటలో భాగంగా చీపురుపల్లిలో ఇచ్చిన హామీల అమలుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్య తీవ్రత తెలుసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి ఇ.మురళి, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, బి.శాంతి, కళావతి, ఆర్డీఓలు, జిల్లా సర్వే శాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, సీపీఓ బాలజీ, డీఆర్డీఏ, హౌసింగ్, మైక్రో ఇరిగేషన్ పీడీలు, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, మార్క్ఫెడ్ మేనేజర్ డి.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. శాఖల వారీగా వచ్చిన వినతులు.. రెవెన్యూ శాఖకు సంబంధించి 95 వినతులు వచ్చాయి. అలాగే డీఆర్డీఏ–24, పంచాయతీరాజ్: 17, మున్సిపల్–6 విద్యుత్ శాఖ–5, హౌసింగ్–4, డీఎంహెచ్ఓ–1, డీసీహెచ్ఎస్–3, గ్రామ సచివాలయ శాఖ–4, విద్య శాఖ–1, ఇతర శాఖలకు సంబంధించి 40 వినతులు అందాయి. -
భద్రతా ప్రమాణాలు పాటించాలి..
● జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలంపార్వతీపురం రూరల్: జిల్లాలోని మందుగుండు త యారీ కేంద్రాల్లో తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల మందుగుండు తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాల మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని పార్వతీపురం మండలం తాళ్లబురిడిలోని అగ్ని గంగమ్మ ఫైర్ వర్క్స్.. పాచిపెంట మండలం శ్యామలగౌరీపురంలోని అమూల్య మేఘన ఫైర్ వర్క్స్.. సీతానగరం మండలం సుభద్ర గ్రామంలోని రుగడ పోలమాంబ ఫైర్ వర్క్స్ కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి దుకాణం వద్ద ఫైర్ ఎగ్జిట్ డోర్లు, ఇసుక బస్తాలు, నీటి డ్రమ్ములు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా బాల కార్మికుల నిర్మూలన అధికారి సువర్ణ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
బలిజిపేట: మండలంలని వంతరాం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పి. చిన్నారావు (25) గాయపడినట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సతివాడ పంచాయతీ గొలుగువలస గ్రామానికి చెందిన చిన్నారావు ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం వంతరాం నుంచి గొలుగువలస వైపు వెళ్తుండగా.. రాజాం నుంచి బలిజిపేట వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారావుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి రాజాం కేర్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
● 20 మందికి గాయాలుగజపతినగరం: ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో సుమారు 20 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సాలూరు నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గజపతినగరం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని ఒక్కసారిగా ఢీ కొట్టింది. లారీ సడన్ బ్రేక్ వేయడంతో జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సుమారు 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన గూడెపు సంతోష్, వర్రి లక్ష్మి, కె.పార్వతి, కె.లచ్చమ్మ, తూ ముల రామకృష్ణ, అలమండ కొండ, ఎం.నాగ మణి, జి.సత్తెమ్మ, పి.నిర్మల, కె.సత్తయ్య, కె.రాము, ఎం.నాగమణి, కె.వాసు, ఎ.కొండమ్మ, జి.పార్వతి, గౌరినాయుడు, తదితరులను స్థానిక సీహెచ్సీకి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రంగుపడుద్ది..
తేడా వస్తేఇటువంటి రంగులతో ప్రమాదంకళ్లల్లో పడితే ప్రమాదం.. మార్కెట్లో లభిస్తున్న రంగుల్లో రసాయనాలు కలుస్తున్నాయి. ఇవి కళ్లల్లో పడితే కంటి చూపునకే ప్రమాదం. కళ్లకు రక్షణగా అద్దాలు ధరించాలి. కళ్లల్లో రంగుపడితే వెంటనే నీటితో కడిగి వైద్యులను సంప్రదించాలి. – ఎస్.వసంతరావు, ఆప్థాలమిక్ అధికారి, రాజాంరాజాం సిటీ: హోలీ అందరిలో ఉత్సాహం నింపుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలుతుంటారు. నాటి తరం జరుపుకునే వేడుకలకు నేటి యువత చేసుకుంటున్న సంబరాలకు పోలిక ఉండడం లేదు. గతంలో సహజ రంగులతో హుందాగా జరుపుకుంటే.. నేడు రసాయనాలతో తయారుచేసిన రంగులు పూసుకుంటున్నారు. ప్రస్తుతం వాడుతున్న రంగుల్లో ప్రమాదకరమైన క్రోమియం, అల్యూమినియం, మెర్క్యురీ ఆకై ్సడ్లు కలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. చేయండిలా.... పలు రకాల పూలు, పండ్లతో ఇళ్లల్లోనే సహజసిద్ధమైన రంగులు తయారుచేసుకోవచ్చు. వీటితో చర్మానికి మేలు కలగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఎర్ర గులాబీ, మందారం పూలు, ఎర్రచందనం, టమాటా గుజ్జు, క్యారెట్, బీట్రూట్లతో ఎరుపు రంగు తయారవుతుంది. పసుపు పొడి, తంగేడు, బంతి, చామంతి, తుమ్మ పూలతో పసుపురంగు ద్రావకం సిద్ధమవుతుంది. వేసవిలో విరివిగా లభించే మోదుగ పూలతో కాషాయరంగు ద్రావణం తయారుచేసుకోవచ్చు. ఎండిన గోరింటాకు పొడి లేదా పచ్చి గోరింటాకు, పాలకూర, పుదీనా, కొత్తిమీర వంటి ఆకు కూరలను మెత్తగా రుబ్బి నీరు కలిపితే ఆకుపచ్చ రంగు తయారుచేసుకోవచ్చు. ఇవీ సూచనలు.. హోలీ ఆడడానికి ముందు శరీరానికి మాయిశ్ఛరైజర్ని, తలకు నూనెను రాసుకోవాలి. దీని వల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. ముఖంపై పడిన రంగులను శుభ్రంగా కడుక్కోవాలి. చాలా మంది హోలీ ఆడే సమయంలో రంగులలో ఆయిల్స్ కలుపుతారు. ఈ కారణంగా రంగులను శుభ్రం చేసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. రంగుల్లో ఎలాంటి నూనెలు, నీళ్లు కలపకుండా చల్లుకుంటే మంచిది.చిన్నపిల్లలు దూరం.. హోలీ అంటే చిన్నపిల్లల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. రంగులు ఎలా చల్లుకోవాలో వారికి తెలియదు. నోరు, ముక్కులోకిపోయే అవకాశం ఉంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లలను హోలీకి దూరంగా ఉంచడం మంచిది. – డాక్టర్ కె.హరిబాబు, సూపరింటెండెంట్, ప్రాంతీయ ఆస్పత్రి, రాజాం. -
సత్వర పరిష్కారమే లక్ష్యం..
● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పార్వతీపురం రూరల్: ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుకూ సత్వర పరిష్కారం చూపడమే అధికారుల లక్ష్యం కావాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తితో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి సమస్యలను స్థానికంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి అధికారీ జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులు అత్యంత సున్నితమైనవని, వాటిని నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారుడి సమస్య క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మొత్తం 106 అర్జీలు రాగా అందులో రెవెన్యూ విభాగానికి సంబంధించినవి 50, ఇతర శాఖలకు చెందినవి 56 ఫిర్యాదులున్నాయని తెలిపారు. -
కష్టపడ్డారు..
కొలువులు సాధించారు..● ఒక్కొక్కరికీ నాలుగేసి బ్యాంక్ పోస్టులుబొబ్బిలి: వారంతా కష్టాన్ని నమ్ముకున్నారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఒకేసారి నాలుగేసి ఉద్యాగాలకు ఎంపికై పలువురికి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. బొబ్బిలి పట్టణంలోని నాయుడు కాలనీకి చెందిన కళ్యంపూడి భానుప్రకాష్ ఎన్ఐటీలో చదువు పూర్తి చేసి నాలుగు నెలలుగా బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు. మొదటి ప్రయత్నంలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా పీఓగా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పీఓగా, ఎస్బీఐ క్లర్క్గా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్గా ఎంపికయ్యాడు. భానుప్రకాష్ తండ్రి సూర్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి జయలక్ష్మి గృహిణి. అలాగే ఇదే కాలనీకి చెందిన పెంట రాకేష్కుమార్ కూడా కెనరా బ్యాంక్ పీఓగా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పీఓగా, ఎస్బీఐ క్లర్క్గా, యూనియన్ బ్యాంక్ క్లర్క్గా ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికయాడు. ఈయన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి సుశీల గృహిణి. దీంతో విజేతలను పలువురు అభినందిస్తున్నారు. గృహిణిగా ఉంటూ... చీపురుపల్లికి చెందిన మారోజు గాయత్రి స్థానిక నాయుడు కాలనీలో నివసిస్తోంది. ఈమె బీఎస్పీ చదువుకుంది. తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సపర్యలు చేసుకుంటూ ఎటువంటి కోచింగ్ లేకుండా ఇంటివద్దనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా జూనియర్ మేనేజర్గా ఎంపికై ంది. దీంతో ఈమెను పట్టణ వాసులు అభినందిస్తున్నారు. -
జీడితోటలతో ఆర్థిక భరోసా..
● ఏజెన్సీలో విస్తారంగా సాగుగుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీ ప్రాంత రైతులు జీడిమామిడి సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. గిరిజనులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ‘సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ’ (ఐటీడీఏ– పార్వతీపురం) 1980 – 90 సంవత్సరాల మధ్య చేపట్టిన బృహత్తర ప్రణాళికే జీడితోటల పెంపకం. ఇందుకు బీజం వేసింది మొదటిగా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో కాగా తర్వాత రోజుల్లో జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సాలూరు, తదితర సబ్ప్లాన్ ఏరియా అంతటా విస్తరించారు. అయితే రైతుల కష్టపడే తత్వం, అధికారుల చిత్తశుద్ధితో అనతికాలంలోనే మంచి ఫలితాలు రాబట్టారు. ఈ ప్రక్రియలో అప్పటి ప్రాజెక్ట్ అధికారులైన ఆర్పీ సిసోడియా, బి.జగన్నాఽథం, తదితరుల నిరంతర కృషి ప్రసంశనీయం. ఇదే తరహాలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో గల గిరిశిఖర గ్రామాలైన పొల్ల, దొనుబాయి, పెదరాం మొదలుకొని ఏజెన్సీ ప్రాంతమంతటా జీడితోటల పెంపకం విరివిగా చేపట్టి గిరిజనుల ఆర్థిక పరిపుష్టికి బాసటగా నిలిచారు అక్కడి ప్రాజెక్ట్ అధికారులు. గిరిజన రైతులు జీడి తోటల పెంపకంపై మరింత ఆశక్తి కనబరచడంతో పార్వతీపురం – సీతంపేట ఏజెన్సీ ప్రాంతమంతటా జీడిమామిడి తోటలు విస్తరించాయి. ఈ ఏడాది మంచి పూత రావడంతో గిరిజన రైతులు జీమిమామిడిపై ఆశలు పెంచుకున్నారు. తాడికొండలో పూతతో నిండిన జీడిమామిడి చెట్టు -
ఫిర్యాదులపై చర్యలు చేపట్టండి
● ఎస్పీ మాధవరెడ్డిపార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ ఎస్సై సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని మాజీ సర్పంచ్ దుర్మరణం
పార్వతీపురం రూరల్: లారీ ఢీ కొనడంతో సంగంవలస మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గంట రామకృష్ణ (58) దుర్మరణం పాలైన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. రామకృష్ణ ఉదయం 6 గంటల సమయంలో బెలగాం అగ్రహారం వీధి సమీపంలోని ప్రధాన రహదారిపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలివిజయనగరం టౌన్: విద్యార్థులకు అందివ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, గండేటి శ్రీను, టి.వి.దుర్గారావులు ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయమై వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరై, కనీస సదుపాయాలు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికీ జిల్లాలోని చాలా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలకు సొంత భవనాలు లేవని, చాలాచోట్ల విద్యార్థులకు బెడ్లు లేక నేలమీదే నిద్రిస్తున్నారని, సరిపడ మెస్ చార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెంచాలని కోరారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీఎఫ్ చెల్లించకపోవడంపై జేసీకి ఫిర్యాదువిజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలంతా తమకు పీఎఫ్ చెల్లించకపోవడంపై జేసీ సేతుమాధవన్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం జేసీని కలిసి తమ సమస్యలు విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 72 ఆరోగ్యమిత్రలకు శ్రీమేన్ పవర్ సర్వీసెస్ అనే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారని, అయితే సదరు ఏజెన్సీ గత ఏడు నెలలుగా ఆరోగ్యమిత్రల పీఎఫ్ను జమ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు రావాల్సిన పీఎఫ్ బకాయిలను తమ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆరోగ్యమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు జెర్రిపోతుల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా పనులెలా? విజయనగరం ఫోర్ట్: పెదవేమలి గ్రామంలోని ఎస్సీల శ్మశానవాటికలో అక్రమంగా పనులు చేపడుతుండడంపై ఆ గ్రామ సర్పంచ్ వర్రి పాపునాయుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయన వెళ్లి, గ్రామసభ, పంచాయతీ తీర్మానం లేకుండానే శ్మశానవాటికలో పనులు చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెరుగైన పశువైద్యం అందించండి నెల్లిమర్ల: నగరపంచాయతీలోని పాడిరైతుల పశువులకు మెరుగైన వైద్యం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కిల్లంపల్లి రామారావు డిమాండ్ చేశారు. స్థానిక పశుసంవర్థక శాఖ ఏడీ చక్రవర్తిని ఆయన సోమవారం కలిసి పాడి పశువుల ఆరోగ్య సమస్యలను వివరించారు. పశువులు అనారోగ్యానికి గురై పాల దిగుబడి తగ్గిపోతోందన్నారు. ముఖ్యంగా దేశవాళీ ఆవుల్లో నట్టలు చేరడం వల్ల పాల దిగుబడి తగ్గిపోతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి పశువు ఆరోగ్యం తనిఖీ చేసి, అవసరమైన వాటికి మందులు అందివ్వడం జరుగుతుందని ఏడీ తెలిపారు. -
గోపాలపల్లి ఘటనపై చర్యలేవీ?
● జంతు కళేబరాలతో నదీ జలాలు కలుషితం ● పెదవి విప్పని ప్రజాప్రతినిధులు ● గోవధపై స్పందించని సంఘాలు శృంగవరపుకోట: హిందువుల ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే గోమాతను నిర్దయగా వధిస్తూ వ్యాపారం చేస్తున్న ఉదంతం గోపాలపల్లి సాక్షిగా సభ్యసమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. గ్రామంలో కొందరు పెద్దలు, ఉద్యోగుల మద్దతుతో సాగుతున్న గోవధను గ్రామస్తులు ఆదివారం బయటపెట్టారు. ఈ ఘటనపై జిల్లాస్థాయి అధికారులు స్పందించకపోవడం, చట్టవ్యతిరేక వ్యాపారానికి కొమ్ము కాసిన వారిపై చర్యలకు ఉపక్రమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ అనుమతులు లేకుండా గ్రామంలో గొర్రెల ఫారం ఎలా ఏర్పాటైంది? తొలుత పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సర్పంచ్లు అడ్డుకున్న షెడ్ నిర్మాణం తర్వాత ఎలా పూర్తయ్యింది..? పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సచివాలయ ఉద్యోగులకు తెలియకుండానే ఐదు నెలలుగా గోవధ జరుగుతోందా? గోవుల కళేబరాలను గోస్తనీ తీరంలో ఖననం చేస్తున్నా ఎందుకు పట్టించుకోలేదు..? ఇంటికోసం తీసుకున్న విద్యుత్ కనెక్షన్తో గొర్రెల ఫారం నడుపుతున్నా విద్యుత్శాఖ ఎందుకు మౌనం దాల్చింది..? గోవధలో సూత్రధారులు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు పారిపోయిన పాత్రధారులు ఐదుగురిని ఎప్పుడు పట్టుకుంటారు..? అన్న ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. అందరికీ అన్ని స్థాయిల్లో పెద్ద మొత్తంలో సొమ్ములు చేతులు మారడంతోనే ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని విమర్శిస్తున్నారు. నదిలోని చెలమల నుంచి తెచ్చుకున్న నీటినే తాగునీరుగా వినియోగిస్తున్నామని, నదిలో గోవుల కళేబరాలను ఖననం చేయడం, విచ్చలవిడిగా పడేయడం తగదని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన సూరీడమ్మ, ఉష, నారాయణమ్మ తదితరులు సోమవారం డిమాండ్ చేశారు. లేదంటే జిల్లాస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
● దివ్యాంగులతో పరేషన్
చిత్రంలో నడవలేని స్థితిలో బియ్యం కోసం రేషన్ దుకాణానికి వెళ్తున్న వృద్ధురాలి పేరు రంపం సూరీడమ్మ. ఆమె రైస్ కార్డు వీర ఘట్టం డిపో–2 పరిధిలో ఉంది. ప్రతినెలా బియ్యం కోసం డీలర్ ఇంటివద్దకు వచ్చి వేలిముద్ర తీసుకుంటాడు. బియ్యం మాత్రం డిపో వద్ద ఇస్తారు. ఇంటికి తెచ్చి బియ్యం ఇవ్వాలని ఎన్నిసార్లు ఆమె మొరపెట్టినా ఫలితం లేకపోతోంది. వాస్తవంగా దివ్యాంగులు, వృద్ధులకు ప్రతినెల వారి ఇంటి వద్దకే రేషన్ బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదనేందుకు సూరీడమ్మ ఎదుర్కొంటున్న కష్టాలే నిలువెత్తు నిదర్శం. ప్రతినెలా బియ్యం తీసుకునేందుకు నడవలేని స్థితిలో అష్టకష్టాలుపడుతూ రేషన్ డిపోకు వెళ్తున్నట్టు ఆమె వాపోతోంది. – వీరఘట్టం -
వైద్యాధికారుల నిర్లక్ష్యం..!
● వెనక్కి మళ్లిన రూ.54లక్షల నిధులు విజయగనరం ఫోర్ట్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా తయారైంది వైద్యాధికారుల పరిస్థితి. నిధులు లేక కొన్ని శాఖలు ఏ కార్యక్రమాలు చేపట్టకపోగా.. నిధులున్నా ఖర్చుచేయడంలో వైద్యశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పథకం కింద మంజూరైన రూ.54లక్షల నిధులు వెనుకకు వెళ్లిపోవడంపై వైద్యవర్గాల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకాలకు నిధులు విడుదల ఎస్ఎన్సీయూ (నవజాతి శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం), ఎన్ఆర్సీ (పౌష్టికాహార పునరావాస కేంద్రం), జేఎస్ఎస్కే (జననీ శిశు సురక్ష కార్యక్రమం), జేఎస్వై (జననీ సురక్ష యోజన), ఎన్ఆర్సీపీ (నేషనల్ రేబీస్ కంట్రోల్ ప్రొగ్రాం), రక్తసేకరణ, రవాణ వాహనానికి వినియోగించేందుకు ఎన్హెచ్ఎం కింద నిధులు విడుదలవుతాయి. 2024–25 సంవత్సరానికి సంబంధించి జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి కార్యాలయం (డీసీహెచ్ఎస్)కు రూ.54 లక్షల నిధులు విడుదలయ్యాయి. ఆ నిధులు సకాలంలో ఖర్చు చేయక పోవడం వల్ల వెనక్కి వెళ్లిపోయాయి. ● ప్రయోజనం కల్పనలో విఫలం జేఎస్వై నిధులను ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు మందులు, ఆహారం, రవాణ సౌకర్యం, రక్తం వంటి వాటికి వినియోగిస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు పట్టణ ప్రాంతానికి చెందిన వారికి రూ.600, గ్రామీణ ప్రాంతానికి చెందిన వారికి రూ.1000 చొప్పున ఇస్తారు. ఎస్ఎన్సీయూకు కేటాయించిన నిధులను అక్కడ చికిత్స పొందే నవజాతి శిశువులకు అవసరమైన పరికరాలు, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి. ఎన్ఆర్సీ నిధులను పౌష్టికాహార లోపంతో ఉండే పిల్లల చికిత్సకు, పౌష్టికాహారానికి వెచ్చించాలి. ఎన్ఆర్సీపీ నిధులను కుక్కకాటుకు గురైన వారికి ఇచ్చే రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక గది, అందులో సౌకర్యాల కల్పనకు వినియోగించాలి. కేటాయింపుల్లో నిర్లక్ష్యంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. రక్తసేకరణ, రవాణ వాహనంఖర్చుచేయలేదు.. 2024–25 సంవత్సరానికి సంబంధించి డీసీహెచ్ఎస్కు రూ.54 లక్షలు నిధులు ఎన్హెచ్ఎం కింద విడుదలయ్యాయి. వాటిని ఖర్చు చేయక పోవడం వల్ల వెనక్కి వెళ్లి పోయాయి. – కె.అరుణ్, ఎన్హెచ్ఎం ఏఓ -
● నిరసన హోరు
విజయనగరం జిల్లా కలెక్టరేట్ సాక్షిగా వివిధ వర్గాల ప్రజలు నిరసన గళం వినిపించారు. పీఎఫ్, గ్రాట్యుటీ బకాయిలు రూ.9కోట్లు వెంటనే చెల్లించాలని భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 1976–77లో 16,862 మంది రైతుల షేరుధనంతో ప్రారంభమైన ఫ్యాక్టరీ ఇప్పుడు మూతపడడంతో సుమారు 300 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కలెక్టర్కు వివరించారు. ● టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) విషయంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కలెక్టరేట్ గేట్ ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. కొత్తపేట రామమందిరం సమీపంలో సర్వే నంబర్ 107–3ఎలో 20 గజాలు టీడీఆర్ను శ్రీనివాసరావు కొనుగోలు చేసినప్పటికీ, అదే హక్కులను మరొకరి పేరిట వినియోగించారని నగర కార్యదర్మి రెడ్డి శంకరరావు ఆరోపించారు. – విజయనగరం గంటస్తంభం -
పైడితల్లి ఆలయం మూసివేత
విజయనగరం టౌన్: కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం 3.19 నుంచి సాయంత్రం 6.46 గంటల వరకు పైడితల్లి అమ్మవారి చదురుగుడి, వనంగుడిలో అర్చనలు, దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీ బుధవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనం యథాతథంగా కల్పిస్తామన్నారు. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఉదయం 9.30 గంటలకే రామతీర్థం ఆలయం మూసివేత నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి వారి దేవస్థానాన్ని మంగళవారం మూసివేస్తున్నామని ఈఓ వై.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని రోజంతా మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.21 నుంచి సాయంత్రం 6.42 గంటల వరుకు గ్రహణం పడుతుందని ఈ కారణంగా ఉదయం 9.30 గంటలకే ఆలయ తలుపులు మూసివేస్తామన్నారు. గ్రహణం అనంతరం సంప్రోక్షణ పూజలు జరిపిస్తామన్నారు. బుధవారం నుంచి యథావిధిగా దర్శనాలు ఉంటాయని, భక్తులు గమనించాలని కోరారు. తోటపల్లి కాలువలో పూడికలు తెర్లాం: మండల పరిధిలోని తోటపల్లి కుడి ప్రధాన కాలువలో పూడికతీత పనులకు రూ.5కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని ప్రాజెక్టు డీఈ సుబ్బారావు, ఏఈ రఘు తెలిపారు. తోటపల్లి కాలువను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కాలువల్లో పూడిక తీసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కుట్ర
శ్రీకాకుళం అర్బన్: ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్లకు కట్టబెట్టేందుకే కేంద్రప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు ఆరోపించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ అతిథిగృహంలో ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ.. ఏఐబీఈఏకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 వేల సభ్యత్వం ఉందన్నారు. ప్రధానంగా బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని కోరుతూ ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగులు దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారన్నారు. అయితే కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేందుకే కార్మిక చట్టాల్లో మార్పులు చేశారన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని అదాని, అంబానీలకు కట్టబెట్టేందుకు కేంద్రప్రభుత్వం యత్నిస్తోందని దుయ్యబట్టారు. బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేటర్ల చేతిలో పెడితే పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే తాము సమ్మె చేపట్టాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణ కోసం ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఉద్యోగుల సమస్యల పట్ల కనీస స్పందన లేకుండా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బ్యాంకులలో తగినన్ని నియామకాలు చేపట్టకపోవడం వల్ల బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి పెరగడమే కాకుండా నిరుద్యోగ సమస్యలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం పర్మినెంట్ రిక్రూట్మెంట్లు చేయకుండా తాత్కాలిక నియామకాలు చేపట్టి యువతను మభ్యపెడుతోందన్నారు. వీటన్నిటినీ తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఏఐబీఈఏ ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగుల సమస్యలపై మరిన్ని పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పార్వతీపురం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు టి. రవీంద్రనాథ్, ఉదయ్కుమార్, కమలాకర్, వసంతరావు, తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం.. పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిగా ఎస్. సాయి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎం. చైతన్యతేజ, బి. సోమశేఖర్, కె. బాలకృష్ణ, రజనాన వినారాజ్, సెక్రటరీగా దిలీప్కుమార్ చౌదరి, డిప్యూటీ సెక్రటరీగా కె. కిశోర్కుమార్, జాయింట్ సెక్రటరీలుగా కె. పల్లవి, జి. మధుసూదనరావు, ఎం.సంతోష్, కె.శోభారాణి, ఎంవీ రవికుమార్, ఎస్. సింహగిరి, ఎం. చలపతిరావు, డి.జయశంకర్, ట్రెజరర్గా ఎం.రాధాకుమారి, జాయింట్ ట్రెజరర్గా జి. తేజేశ్వరరావు, కమిటీ మెంబర్స్గా ఆర్.రాజేశ్వరి, పి.నవీన్, వై.విద్యాసాగర్, కె.శ్రీనివాసరావు, శివ శ్రీను, భాస్కరరావు, బి శ్రీనివాసరావు, టి. సతీష్కుమార్ తదితరులు ఎన్నికయ్యారు. దెబ్బతిననున్న పేద, మద్యతరగతి ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకే ఈ సమావేశాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● డీఎస్పీ గోవిందరావు విజయనగరం క్రైమ్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని స్థానిక మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ గోవిందరావు ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా నగరంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. కోట వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గురజాడ సర్కిల్, మూడు లాంతర్ల జంక్షన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ.. మహిళా సాధికారత వారోత్సవాలను ఈ నెల 8 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలన్నారు. మహిళలు, బాలల రక్షణకు పోలీస్ శాఖ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం, రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ శక్తియాప్ను మొబైల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్, టూటౌన్ సీఐలు చౌదరి, శ్రీనివాస్, ఎస్సైలు శిరీష, లీలావతి, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం: జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విజయనగరంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఇటీవల జరిగిన 7వ పారా బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన యాళ్ల సత్తిబాబు (కొత్తవలస ).. ఆరికతోట నాగభూషణరావు (బొబ్బిలి ).. సుంకర లీల (నెల్లిమర్ల ) వివిధ విభాగాల్లో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. మార్చి 6 నుంచి 10 వరకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఇన్స్పైర్ అవార్డులకు 90 ప్రాజెక్ట్లు వీరఘట్టం: జిల్లా వ్యాప్తంగా ఇన్స్పైర్ అవార్డులకు 90 ప్రాజెక్టులను ఎంపిక చేస్తూ కేంద్ర మానవ వనరులశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా నుంచి 1120 సైన్స్ ప్రాజెక్ట్లను పంపించగా వీటిలో 90 ప్రాజెక్ట్లను ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. ఎంపికై న ప్రతి ప్రాజెక్ట్కు కేంద్రం రూ.10 వేలు మంజూరు చేస్తుందని జిల్లా సైన్స్ అధికారి జి. లక్ష్మణరావు తెలిపారు. ఈ 90 ప్రాజెక్ట్లను జిల్లా స్థాయిలో ప్రదర్శిస్తే ఇందులో 10 శాతం ప్రాజెక్ట్లను రాష్ట్ర స్థాయికి.. అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏప్రిల్లో విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని ఇన్స్పైర్ అవార్డులకు వివిధ మండలాల నుంచి ఎంపికై న పాఠశాలల వివరాలు ఇలా ఉన్నాయి. -
గోపాలపల్లిలో ఏమిటీ దారుణం!
విశ్వమానవాళికి ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణుని మరోపేరు గోపాలుడు. గోపాలుని పేరనున్న గోపాలపల్లి గ్రామంలో మాత్రం నిత్యం గోవధ యథేచ్ఛగా సాగుతోంది. ఐదు నెలలుగా గొంతులు కోసే వేళ గోమాతల ఆర్తనాదాలతో, గోకళేబరాలతో గోస్తనీ తీరం ఎరుపెక్కుతోంది. గోస్తనీ జలాలు విషతుల్యం అవుతున్నాయి. ఉద్యోగుల నిర్లక్ష్యంతో గోవుల అరుపులు, గోస్తనీ గుండె చప్పుళ్లు నిశీధిలో కలిసిపోతున్నాయి. చేశారని ప్రశ్నిస్తే మాకేమీ తెలియదని చెప్పారు. గ్రామంలో ఏం జరిగినా పట్టించుకోని గుడ్డి వ్యవస్థ నడుస్తోందని, అధికారులకి అన్నీ తెలుసని పెద్దల అండతోనే అన్నీ సాగుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. గోస్తనీలో జంతు కళేబరాలు గోపాలపల్లిలో అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాలో ఆవుల్ని నరికేసిన తర్వాత మిగిలిన కళేబరాలు, తోళ్లను పక్కనే ఉన్న గోస్తనీ నదిలో రెండు అడుగుల మేర గోతులు తీసి పూడ్చేశారు. గోస్తనీలో ఉన్న కళేబరాలను, దుమ్ములను గ్రామస్తులు మీడియాకు చూపారు. గోస్తనీ నదిలో నీటిని చెలమలు తీసుకు ని తాగటానికి వాడుకుంటున్నామని, నది నీటిని ఇలా అన్యాయంగా పాడు చేశారని, ప్రభు త్వంలో పెద్దలు, గ్రామ ఉద్యోగులు అండతోనే ఇదంతా జరుగుతోందని మహిళలు శాపనార్ధాలు పెట్టారు. అక్రమ షెడ్ను కూల్చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. కళ్లు, చెవులు మూసుకుని పాలన సాగిస్తున్న జిల్లా యంత్రాంగం ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి గౌరమ్మ, వీఆర్వో అప్పలరాజు, ఎస్.ఐ చంద్రశేఖర్ తదితరుల సమక్షంలో పంచనామా చేసి గో కళేబరాలను పూడ్చి పెట్టారు. శృంగవరపుకోట : మండలంలోని గోపాలపల్లి గ్రామంలో అడ్డగోలుగా ఆవుల్ని నరికేస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఈ వ్యాపారం ఐదు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. షీప్ ఫారం పెట్టి దాని చాటున విశాఖకు చెందిన సుల్తాన్, షేక్భాషా లు యథేచ్ఛగా ఆవుల్ని నరికి మాంసం వ్యాపారం సాగిస్తున్నారు. శనివారం రాత్రి గ్రామానికి చెందిన అల్లూరి కిషోర్రాజు, తగరంపూడి రమణ, ఇప్పిలి నాయుడు, ఉప సర్పంచ్ గణేష్, మళ్లా రమేష్, మళ్ల సూరిబాబు, ఆవుల ఆర్తనాదాలు విని అర్ధరాత్రి 1 గంట వేళలో షీప్ ఫారం వద్దకు వెళ్లగా ఏడుగురు వ్యక్తులు మూడు ఆవుల్ని నరికేసి మాంసం తీసే పనిలో ఉండటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్ఐ రావటంతో ఆయన వెంట షీప్ ఫారం వద్దకు వెళ్లి కేకలు వేయటంతో కొందరు వ్యక్తులు పరారయ్యారు. పోలీసులు సుల్తాన్, భాషాలను అదుపులోకి తీసుకున్నారు. తెల్లవార్లూ ఘటనాస్థలిలో గ్రామానికి చెందిన కొందరు కాపు కాశారు. ఆవుల్ని నరికేస్తున్నారని తెలిసి ఊరంతా ఒక్కసారి ఉలిక్కి పడింది. మహిళలు వచ్చి గోకళేబరాలు చూసి ఊరికే అరిష్టం అని కంటనీరు పెట్టుకున్నారు. అడ్డగోలు వ్యాపారానికి అండగా.. గోపాలపల్లిలో ఏర్పాటు చేసిన షీప్ ఫారంకు పంచా యతీ నుంచి ఎలాంటి అనుమతులు, ప్లాన్ అప్రూవ ల్స్ లేకున్నా అక్రమ నిర్మాణాన్ని, దొంగచాటు వ్యాపారాన్ని గ్రామ స్థాయి ఉద్యోగులు లంచాల మత్తులో ఏనాడూ అడ్డుకోలేదు. ఇంటి కోసమని తీసుకున్న విద్యుత్ కనెక్షన్ను షీప్ ఫారం కోసం వాడుకుంటున్నా విద్యుత్ అధికారులూ పట్టించుకోలేదు. ఆర్నెళ్ల క్రితం షెడ్ నిర్మాణం అడ్డుకున్నామని చెప్పిన వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు తర్వాత ఎందుకు వదిలేశారంటే సమాధానం లేదు. ఐదు నెలలుగా సాగుతున్న గోవధను ఎందుకు నిర్లక్ష్యం గోపాలపల్లి గ్రామంలో గొర్రెల పెంపకం పేరుతో అక్రమంగా కబేళా నడుపుతూ గోవధకు పాల్పడుతున్న సుల్తాన్, షేక్ భాషాలపై కేసు నమోదు చేశామని సీఐ నారాయణమూర్తి చెప్పా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. -
ఏనుగుల తరలింపునకు ముమ్మర ఏర్పాట్లు
● చురుగ్గా ఏనుగుల సంరక్షణ కేంద్రం పనులు సీతానగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలో దీర్ఘకాలంగా పలు గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగులను కొండ ప్రాంతాలకు తరలించడానికి అటవీశాఖ ఉన్నతాధికారులు చేస్తున్న పనులు పూర్తి కావొచ్చాయి. చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతాల్లోనున్న కుంకి ఏనుగుల రాక కోసం గుచ్చిమి వద్ద ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. కుంకి ఏనుగులు వచ్చిన తర్వాత గుచ్చిమి బీట్ వద్ద సంచరిస్తున్న ఏనుగులను మచ్చిక చేసుకుని తరలించడానికి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లాలోని రెండు దశాబ్దాలుగా సంచరిస్తూ పంట, ప్రాణ నష్టం కలిగిస్తున్న ఏనుగుల గుంపును దూరప్రాంత కొండలకు (చిత్తూరులో వన్యమృగాల సంరక్షణా కేంద్రానికి) తరలించడానికి పార్వతీపురం రేంజ్ గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్లో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్పయ్యపేట, రేపటివలస, గుచ్చిమి, జోగింపేట గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగులు జనావాసాల్లోకి రాకుండానిరోధించేందుకు అత్యాధునికమైన ఏనుగు నిరోధక కందకాలు, పోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పట్టుబడిన ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఎలిఫెంట్ షెడ్లు, వాటర్టబ్ల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అలాగే మావటిల కోసం ప్రత్యేక క్వార్టర్లు, కిచెన్ షెడ్లు, ఏనుగుల ఆరోగ్య సంరక్షణ కోసం అత్యాధునిక వెటర్నరీ కేర్ సెంటర్ (వైద్య కేంద్రం), అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్వతీపురం ప్రాంతంలో గత పదేళ్లలో మానవ, వన్యప్రాణి సంఘర్షణల వల్ల 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు 9 ఏనుగులు మృతి చెందాయి. ఈ పరిస్థితుల్లో ఏనుగుల సంరక్షణ కేంద్రం అందుబాటులోకి వస్తే కుంకీ ఏనుగుల సహాయంతో ఏనుగుల గుంపును సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. -
పదండి.. మన ఆస్పత్రికి..!
విజయనగరం ఫోర్ట్: ఈ ఇద్దరు రోగులే కాదు.. సర్వజన ఆస్పత్రిలో నిత్యం ఇదే తంతు జరుగుతున్నట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు సమాచారం. 108, ప్రైవేట్ అంబులెన్సుల్లో వచ్చే అత్యవసర రోగులు బెడ్పైకి రాకముందే ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించుకుపోతున్నారు. కొంతమంది రోగులకు ఓపీ తీయించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేట్ సిబ్బంది.. పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులను తరలించేందుకు ఉద్యోగులను నియమించుకున్నారు. వారంతా సర్వజన ఆస్పత్రిలో తిష్ట వేసి రోగులను మభ్యపెడుతూ తమ ఆస్పత్రులకు తరలించుకుపోతున్నారు. వీరి హడావిడిని చూసి ఎవరైనా ప్రశ్నిస్తే తాము సర్వజన ఆస్పత్రి సిబ్బందిమని చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రోగుల తరలింపు విషయంలో సర్వజన ఆస్పత్రికి చెందిన కొంతమంది వైద్యుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోగులను తరలించే వైద్యులకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కమీషన్లు ముట్టజెప్పుతాయి. చేతిచమురు వదిలించుకోవాల్సిందే.. అమాయక రోగులు ఒకవేళ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే చేతి చమురు వదులించుకోవాల్సిందే. ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలకు అక్కడ లక్షల రూపాయలు గుంజేస్తున్నారు. ఎవరైనా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వైద్యం అందించాలని కోరితే.. ఈ రోగానికి ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి మోసగిస్తున్నారు. మరికొంతమంది విషయంలో ఆరోగ్యశ్రీ వర్తించినా.. ఏదో ఒక పేరు చెప్పి డబ్బులు లాగేస్తున్నారు. సర్వజన ఆస్పత్రికి వస్తున్న రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలింపు ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బంది నియామకం వారికి సహకరిస్తున్న ఆస్పత్రి సిబ్బంది ఉచితంగా అందాల్సిన వైద్యానికి రూ. లక్షల్లో ఖర్చు ఎస్.కోట మండలానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తికి కొద్ది రోజుల కిందట పక్షవాతం రావడంతో సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. బెడ్పై రోగిని దించిన వెంటనే అక్కడే కాపు కాసిన ఓ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన వ్యక్తి తమ ఆస్పత్రిలో అయితే మెరుగైన వైద్యం అందిస్తాం.. రోగి త్వరగా కోలుకుంటాడని చెప్పి వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. గంట్యాడ మండలానికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ చేయి వాపు వచ్చిందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యుడు నీకు వెంటనే ఆపరేషన్ జరగాలని.. అయితే మెరుగైన వైద్యం త్వరగా అందాలంటే తాను ప్రైవేట్గా నిర్వహిస్తున్న క్లినిక్కు వెళ్లమని సూచించారు. అక్కడ ఎవరిని సంప్రదించాలో సదరు వ్యక్తి ఫోన్ నంబర్ కూడా చీటీపై రాసి ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తులను నిలువరిస్తాం.. సర్వజన ఆస్పత్రికి వచ్చే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదు. అయినా ప్రైవేట్ వ్యక్తులు ఆస్పత్రిలోకి రాకుండా కట్టడి చేస్తాం. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస సాయికృష్ణ కోల్డ్ స్టోరేజ్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన కల్లూరి బైరాగి (67) మెంటాడ మండలంలోని కుంటినవలస గ్రామంలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లాడు. అక్కడ నుంచి ఆదివారం ఉదయం తిరిగి స్వగ్రామానికి నడుచుకుంటూ వస్తుండగా.. సాయికృష్ణ కోల్డ్ స్టోరేజ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైరాగి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు హెచ్సీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డోలోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
● ఈ నెల 5 నుంచి ఏడు వరకు గుళ్ల సీతారాంపురంలో ఉత్సవాలు ● సీతారాముల ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర సంతకవిటి: మండలంలోని గుళ్ల సీతారాంపురంలో వెలిసిన సీతారాముల ఆలయంలో ఈ నెల 5 నుంచి ఏడో తేదీ వరకు డోలోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ఈఓ మాధవరావు తెలిపారు. వాస్తవానికి ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి డోలోత్సవాలు నిర్వహించాల్సి ఉన్నా.. గ్రహణం సంభవిస్తుండడంతో ఉత్సవాలను ఐదో తేదీ నుంచి ఏడు వరకు నిర్వహించనున్నారు. అయితే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారిని ఆంజనేయ, సర్ప వాహనాలపై ఉత్తరముఖ మంటపానికి తీసుకువచ్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవదాయశాఖాధికారులు, గ్రామపెద్దలు ఏర్పాట్లు చేశారు. 500 ఏళ్ల చరిత్ర గుళ్లసీతారాంపురంలో వెలిసిన సీతారాముల ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం ఆనాడు ఈ ప్రదేశం నిర్మానుష్యంగా అడవితో ఉండేది. బొబ్బిలి రాజులు వేటకై ఈ ప్రదేశానికి వచ్చి సేద దీరే సమయంలో సీతారాములు కలలో కనిపించి, తాము ఇక్కడ వెలిశామని, ఆలయం నిర్మించాలని అనుగ్రహించారు. దీంతో బొబ్బిలి రాజులు వెంటనే అతిసుందరమైన సీతారాముల ఆలయంతో పాటు గ్రామాన్ని కూడా నిర్మించి సీతారాంపురంగా నామకరణం చేశారు. అయితే సీతారాంపురం గ్రామాలు ఎక్కువగా ఉండడంతో ఈ గ్రామం గుడి సీతారాంపురంగా.. కాలక్రమంలో గుళ్లసీతారాంపురంగా పేరుగాంచింది. ఈ ఆలయ నిర్మాణం మొత్తం రాళ్ల పేరుతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. దాదాపు 65 అడుగుల ఎత్తు గల గాలిగోపురం ఉంది. గాలి గోపురం పైకి ఎక్కి చూస్తే బొబ్బిలిలోని వేణుగోపాలుని ఆలయం కనిపిస్తుందని ప్రాశస్త్యం. ఇక్కడ సీతారాములు ఏకశిలపై ఉండడం విశేషం. ఏ ఆలయంలో అయినా సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉంటారు. కాని ఈ ఆలయంలో లక్ష్మణుడు, ఆంజనేయుడు, ధనుర్బాణాలు, శంఖుచక్రాలు ఉండక పోవడం విశేషం. గోడలపై చెక్కిన శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ప్రధాన ఆలయం చుట్టూ ప్రత్యేక బేడా మంటపం ఏర్పాటు చేశారు. ఈ బేడాను ఆనుకుని అళ్వారులు, రాధాకాంతలు, రామానుజలవారు, నమ్మళ్వాల్, మానవాళ్ల మహాముని, దాసాంజనేయులకు ప్రత్యేక సన్నిధులు ఏర్పాటు చేశారు. ఆలయానికి చేరుకోవడమిలా... రాజాం – సంతకవిటి ప్రధాన రహదారిలో ఉన్న గుళ్లసీతారాంపురం రాజాం పట్టణం నుంచి 8 కిలోమీటర్లు, సంతకవిటి మండల కేంద్రం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరు పక్కల నుంచి గ్రామానికి బస్సు, ఆటోల ద్వారా చేరుకోవచ్చు. -
సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షలో జిల్లా విద్యార్థుల సత్తా
నెల్లిమర్ల రూరల్: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో నెల్లిమర్ల మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సత్తా చాటారు. అలుగోలు శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నరౌతు ప్రేమ్సాయి 267 మార్కులు, అంబళ్ల కార్తికేయనాయుడు 253 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు విద్యార్థులను హెచ్ఎం కృష్ణకూర్మ, కరస్పాండెంట్ చందక వెంకటరమణ, తదితరులు అభినందించారు. విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని శైలజ విద్యానికేతన్లో శిక్షణ తీసుకున్న హన్షిత్ 285 మార్కులు సాధించి తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచాడు. ఈ మేరకు విద్యార్థినిని విద్యానికేతన్ నిర్వాహకులు అభినందించారు. -
పోలీస్ దందా..!
విజయనగరంసోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026సర్వజన ఆస్పత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘ఊళ్లో ఒకడే రౌడీ నాకొడుకు ఉండాలి.. వాడు పోలీసోడు అయ్యుండాలి..’ అనే సినిమా డైలాగును చీపురుపల్లిలో పోలీసులు అక్షరాలా అమలు చేస్తున్నారు. గ్రామాల్లో ఏ సందర్భం వచ్చినా ‘అయితే మాకేంటి..?’ అనే కాన్సెప్ట్ కిందకు మార్చేసి దందా చేస్తున్నారు. గ్రామ దేవతల పండ గ వచ్చిందంటే చుట్టాలకు భోజనాలకు, మందుకు పెట్టాల్సిన ఖర్చు కన్నా పోలీసోళ్లకు ఇచ్చే మామూళ్ల ఖర్చే ఎక్కువైపోతుందని చిరు వ్యాపారాలు భీతిల్లుతున్నారు. లేదంటే జీపులో మార్కెట్లో తిరుగుతూ స్టైల్గా లాఠీ తిప్పుతూ సినిమా సెకలు పోతున్నార ని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఆఖరుకు నైట్ పెట్రోలింగ్ సందర్భంగా ఊళ్లో రోడ్డు పక్కన ఏదైనా బైక్ కనిపిస్తే దాన్ని కూడా స్టేషన్కు ఎత్తుకెళ్లి దాన్ని ఇవ్వడానికి రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. ఇక ఊళ్లో పండగల సందర్భంగా వసూళ్లకు అంతూ పంతూ లేకుండా పోతోంది. చీపురుపల్లి మండలంలో గ్రామదేవత పండగలు.. అమ్మవారి జాతరలు ఘనంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ జాతరలు సందర్భంగా ఊళ్లో ఆటల పోటీల వంటివి నిర్వహించడం పరిపాటి. ఈ మధ్య చీపురుపల్లి కనకమహాలక్షి అమ్మవారి జాతర సందర్భంగా జాతరలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో జూదం నిర్వహించారు. బహిరంగంగా బోకు ఆటలు, గుండాట లు, ఇతర ఆటలు మూడు రోజుల పాటు యథేచ్ఛగా నిర్వహించారు. వీటిని కంట్రోల్ చేయాల్సిన ఎస్సై దామోదరరావు, ఆయన సిబ్బంది ఈ దందాను ఏమాత్రం చూడకుండా కళ్లకు గంత లు కట్టుకుని ఊరుకున్నారు. కట్ చేస్తే ఒక్కో జూదశాల నిర్వాహకుడి నుంచి భారీగానే ముడుపులు లాగేసినట్టు చీపురుపల్లిలో చెప్పుకుంటున్నారు. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం మా చిన్నప్పుడు.. ఇలాంటి పెద్ద జూదాలు ఉండేవి.. అవి కూడా ఊళ్లో ఎక్కడో చివరన.. తోటలు, కల్లాల్లో జరిగేవి.. ఇప్పుడు మూడు రోజుల పాటు రాత్రి పగలు ఊరు నడిబొడ్డున ఈ దందా చేస్తున్నారని పెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మూడు రోజులూ చీపురుపల్లి పోలీసులు నిద్ర నటించినందుకు ఫీజుగా రూ.రెండు లక్షలు ముట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో మెట్టపల్లిలో జరిగిన గొల్లపేరంటాల అమ్మవారి జాతరలోనూ ఇలాగే బోకు ఆటలు, గుండాటలు ఆడుకునేందుకు అక్కడికి జూదశాల నిర్వాహకులు మరో రూ.2 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది. చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో శివరాత్రికి జరిగిన జాతరలో కూడా బోకు ఆటలు, రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టుకోవడానికి భారీగా ఫీజు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ జూదం చూసేవాళ్లకు ఎంటర్టైనింగ్గా ఉన్నప్పటికీ యువత ఈ జూదానికి అలవాటు పడి ఆ నాలుగైదు రోజుల్లో రూ.వేలు.. లక్షల్లో నష్టపోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర పేరు మీద కూడా పోలీసులు బాగానే దండుకున్నట్టు చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. పండక్కి బోలెడుమంది పోలీసులు వస్తారు.. అందరికీ భోజ నాలు పెట్టాలి అంటూ చిరు వ్యాపారాలు.. హోటళ్లు, లాడ్జిలు.. .బట్టల దుకాణాలు, చికెన్ షాపుల నుంచి భారీగా దండేసినట్టు చెబుతున్నా రు. బందోబస్తు బాధ్యత పోలీసులది అయినపుడు మానుంచి రౌడీ మామూళ్లు ఎలా వసూళ్లు చేస్తారని వ్యాపారాలు లోలోన బాధపడుతున్నా బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఏమైనా ప్రశ్నిస్తే పోలీసు సార్ మళ్లీ ఏదైనా కేసు పెట్టి ఇబ్బంది పెడతారేమో అనే భయం వారిని మాట్లాడనివ్వలేదు. దీంతో పాటు చీపురుపల్లి లాడ్జీల్లో జరిగే అనైతిక కార్యకలాపాలకు సహకరించేలా లాడ్జ్ ఓనర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఏ లాడ్జిలో ఎవరు వచ్చి వెళ్తున్నారు.. ఎంతసేపు ఉంటున్నారు.. అనేది ఎక్కడా రికార్డ్ కావడం లేదు. ఈ చుట్టుపక్కల చదువుకునే కాలేజీ విద్యార్థులు దారితప్పి ఇలా గంట.. రెండు గంటలు చొప్పున లాడ్జీల్లో గడుపుతున్నా దీనిపై అక్కడా తనిఖీలు లేవు.. ఎందుకంటే ఎస్సై గారికి నెలవారీ మామూళ్లు వచ్చేస్తున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన వచ్చే జీతంతో బతకడం ఎస్సై గారికి కష్టమైపోతోంది.. అందుకే మైనింగ్ వ్యాపారాలు.. లిక్కర్ వ్యాపారాలు.. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసే వాళ్లతో సంబంధం పెట్టుకున్నారు. ఒకటో తేదీకి ప్రభుత్వ జీతం పడినా పడకున్నా ఈ వ్యాపారాలు మాత్రం తమ వాటా బుద్ధిగా స్టేషన్కు తెచ్చి ఇవ్వాల్సిందే. లేకుంటే సారుకు కోపం వస్తుంది. లారీల మీద కేసులు పడతాయ్. లిక్కర్ షాపులు టైం దాటాక ఓపెన్ చేసారంటూ కేసు రాస్తారు. ఓవర్ లోడ్ అంటూ మైనింగ్ వాళ్ల మీదకు పోలీసులు వెళ్తారు. అందుకే వ్యాపారులంతా గంపగుత్తగా తమ వాటా చెల్లించుకుంటూ ఆయన్ను సంతుష్టులని చేస్తున్నారు. చీపురుపల్లి ఎస్ఐ దామోదర్ వ్యవహారం మీద ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామదేవత ఉత్సవాల్లో విచ్చలవిడి జూదాన్ని ప్రభుత్వం.. చట్టం అనుమతించదు. ఇది నేరం కూడా. అలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను చూస్తూ ఉపేక్షించిన ఎస్ఐ కూడా దీనికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిందే. ఈ వ్యవహారాన్ని ఎస్పీ గారికి కూడా తెలియపరిచాం. ఎస్ఐకి సంజాయిషీ నోటీసు ఇస్తున్నాం. – ఎస్.రాఘవులు, సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్, చీపురుపల్లి. పోలీసులు నైట్ పెట్రోలింగ్ ఎందుకు చేస్తారు..? ఊళ్లో దొంగలు.. ఆకతాయిలు.. రౌడీలు ఏమైనా అసాంఘిక కలాపాలు.. తప్పుడు పనులు చేస్తారేమో అని చూసి.. వాళ్లను పట్టుకుని ప్రజల ఆస్తులకు భద్రతా కల్పించడానికి రాత్రి గస్తీ తిరుగుతారు. కానీ ఈ ఎస్సై ఈ మధ్య గస్తీ తిరుగుతూ అర్థరాత్రి నిద్ర మానుకుని గస్తీ తిరిగితే ఏమీ గిట్టుబాటు కాకపోతే ఎలా అనుకున్నాడో ఏమో.. ఒక షాప్ ముందు పార్క్ చేసి ఉంచిన బులెట్ బైక్ను స్టేష్టన్కు పట్టుకెళ్లిపోయారు. మర్నాడు బాధితులు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కమలాసన్ రేంజిలో యాక్టింగ్ మొదలెట్టి అరె.. అగ్ని.. అగ్ని.. ఇక్కడ.. నేను ఉండగా దొంగతనామా.. తేల్చేద్దామ్.. అని తల అటూ ఇటూ తిప్పి.. నీ బైక్ రాజమండ్రిలో ఉన్నట్లు తెలిసింది.. దాన్ని తేవాలంటే పాతిక వేలు అవుతుంది అని చెప్పారు.. ఓహో అనుకుంటూ బాధితులు ఇంటికి వచ్చేసారు. తరువాత చూస్తే ఆ బైక్ చీపురుపల్లి స్టేషన్లోనే ఉంది. ఈ దొంగ పోలీస్ అంశం పెద్ద వివాదాస్పదం అయింది. అయినా సరే చీపురుపల్లికి నేనే పోలీస్.. అంతా నేనే..అంటూ ఆయన వీరవిహారం చేస్తున్నారు. -
బస్సు ఒకటే..ప్రారంభోత్సవాలు రెండు..
● ముందుగా ఎమ్మెల్యే, ఆ తర్వాత ఆర్టీసీ జోనల్ చైర్మన్ సర్వీస్ను ప్రారంభించిన వైనం వేపాడ: మండల కేంద్రమైన వేపాడ నుంచి విశాఖపట్నానికి వేసిన ఆర్టీసీ బస్సును స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి.. ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఎస్.దొన్నుదొర ఆదివారం వేర్వేరుగా ప్రారంభించారు. ఉదయం 10.45 గంటలకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వేపాడ చేరుకుని బస్సును ప్రారంభించి, మొదటి టికెట్ కొనుగోలు చేశారు. అక్కడకు గంట తర్వాత ఆర్టీసీ జోనల్ చైర్మన్ దొన్నుదొర, ఆర్టీసీ డీఎం సుదర్శనరావు గ్రామానికి చేరుకుని జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల సమన్వయ లోపమో.. అధికారుల అలసత్వమో తెలియదు కాని ఒకే సర్వీస్ను రెండు సార్లు ప్రారంభించడం మాత్రం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఈ బస్సు ఎస్.కోటలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 6.15కు వేపాడ చేరుకుని పదిహేను నిమిషాల తర్వాత విశాఖకు బయలుదేరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే ఇదే బస్సు సాయంత్రం 6.30 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 8.20 గంటలకు వేపాడ చేరుకుని అక్కడ నుంచి ఎస్.కోట చేరుకుంటుందని చెప్పారు. -
వృద్ధురాలిపై దాడి
పార్వతీపురం రూరల్: పింఛన్ సొమ్ము కోసం గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలిపై దాడి చేసిన సంఘటన మండలంలోని కృష్ణపల్లి పంచాయతీలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోరాపు తెరీజమ్మ (81) ప్రభుత్వం అందజేసిన పింఛన్ సొమ్మును శనివారం తీసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న ఆమైపె అదే రోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. నగదు కాజేసే క్రమంలో ఆమె తలపై బలంగా గాయపరిచారు. ఆదివారం ఉదయం రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న వృద్ధురాలిని స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని తొలుత స్థానిక ప్రభుత్వాస్పత్రికి.. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీఐ రంగనాథం, ఎస్సై రాజేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, వివరాలు సేకరించారు. -
ఎల్.కోటలో అగ్ని ప్రమాదం
● 60 ధాన్యం బస్తాలు, రెండు గడ్డి వాములు దగ్ధం ● సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టంలక్కవరపుకోట: మండల కేంద్రంలోని అరకు – విశాఖ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కళ్లాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన జామి అప్పలనారాయణకు చెందిన గడ్డివాము, సుమారు 60 బస్తాల ధాన్యం కాలిపోగా ,బూర్లు సూరిబాబుకు చెందిన గడ్డివాము కాలి బూడిదయ్యాయి. గడ్డివాము దగ్గర ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో గుర్తించిన రైతులు అప్రమత్తమై ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే వారు వచ్చి మంటలను అదుపు చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు వీఆర్ఓ గణేష్ అంచనా వేశారు. నీలగిరి తోట దగ్ధం.. గజపతినగరం రూరల్: మండలంలోని గుడివాడ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నడిమంటి గాంధీకి చెందిన నీలగిరి తోట దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 15 వేల రూపాయల ఆస్తినష్టం జరిగి నట్లు అగ్నిమాపక అధికారి ప్రసాద్ తెలిపారు. ఎవ రో సిగరెట్/బీడీ తాగి పడేయడం వల్ల ఈ ప్రమా దం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
నిధులున్నా.. నిర్లక్ష్యం..!
నిధులున్నా.. నిధులు లేకపోతే ఏదైనా కార్యక్రమం చేపట్టలేక పోవచ్చు. కానీ కోట్లాది రుపాయిలు నిధులు ఉన్నప్పటకీ మహిళ మార్ట్లు ఏర్పాటు చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా యి. స్వయం సహాయక సంఘాల మహిళలతో మార్ట్లు ఏర్పాటు చేయడం ద్వారా వారు ఆర్థికాభివృద్ధితో పాటు వ్యాపార వేత్తలుగా అవుతారన్న ది లక్ష్యం. ఉపాధి కూడా దొరుకుతుంది. టీడీపీ సర్కార్ మాటల్లో చూపించినశ్రద్ధ చేతల్లో చూపించడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో 40,203 గ్రూపులు జిల్లాలో స్వయం సహాయక సంఘాలు 40,203 ఉన్నాయి. ఇందులో ఎస్సీ సంఘాలు 3,751 ఉన్నాయి. ఎసీ్ట్రగూపులు 731, బీసీ 34,639, ఓసీ 1063, మైనార్టీ గ్రూపులు 19 ఉన్నాయి. స్వయం సహాయక సంఘాల్లో 4,34,776 మంది మహిళలు ఉన్నారు. వీరిలో ఎస్సీ సభ్యులు 39,614 మంది, ఎస్టీ 7,911 మంది, బీసీలు 3,75,719 మంది, ఓసీలు 11,237 మంది మైనార్టీలు 186 మంది ఉన్నారు. విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడతామని, వారిని వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెప్పింది. ఎన్నికల సమయంలో మహిళలను లక్షాధికారులను చేస్తాం.. వారికే పెద్దపీట వేస్తాం... అంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబుతో పాటు, టీడీపీ నాయకులు అంతా గొప్పగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ను పట్టించుకోవడం లేదని, కూటమి నేతలు తమను మోసం చేస్తున్నారని మహిళలు ఆరోపి స్తున్నారు.డ్వాక్రా మహిళలకు ఇస్తామన్నా సున్నా వడ్డీ ఎగ్గొట్టారు. ఎస్సీ, ఎస్టీల స్వయం సహాయక సభ్యులకు ఇచ్చే ఉన్నత రుణాలను కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. మహిళ మార్ట్ల ఏర్పాటులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు చోట్లే ఏర్పాటు మహిళలను వ్యాపారవేత్తలుగా చేయాలనే ఉద్దేశంతో ప్రతీ మండలంలో మహిళ మార్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో రెండు చోట్ల మాత్రమే వీటిని ఏర్పాటు చేశారు. మిగిలిన 25 మండలాల్లో ఏర్పాటు చేయలేదు. గరివిడి, ఎస్. కోటల్లో మహిళ మార్ట్లు ఏర్పాటు చేశారు. మహిళ మార్ట్లు ఏర్పాటు కోసం ప్రతి డ్వాక్రా మహిళ నుంచి రూ.310 చొప్పన వసూలు చేశా రు. ఒక్కో మండలం నుంచి సుమారు రూ. 35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా రూ.10.10 కోట్లు వసూలు చేశారు. మార్ట్లు ఏర్పాటుకు నిధులు ఉన్నాయి. ఎస్.కోట, గరివిడి మండలాల్లో మార్ట్లు నడుస్తున్నాయి. మిగిలిన మండలాల్లో కూడా మార్ట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస పాణి, పీడీ, డీఆర్డీఏ -
భద్రత కట్టుదిట్టం
విజయనగరం క్రైమ్: సీఎం పర్యటన 1200 మంది పోలీసుల భద్రత నడుమ కట్టుదిట్టంగా సాగింది. రోడ్లన్నీ మూసేశారు. సీఎం కాన్వాయ్ వెళ్లేవరకు ప్రధాన కూడళ్లలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో అత్యవసర వేళ వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పింఛన్ల సొమ్ములో చిరిగిన నోట్లు వంగర: మండలంలోని వివిధ గ్రామాల్లో పెన్షన్లు పంపిణీలో చిరిగిన నోట్లు బయటపడ్డాయి. మద్దివలస, ఎం.సీతారాంపురం, శివ్వాం, తలగాం తదితర గ్రామాల్లో రూ.500 నోట్లు కట్టల్లో చిరిగిన నోట్లు ఉండడంతో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ససేమిరా అన్నారు. అధిక సంఖ్యలో నోట్లు సరిగ్గా లేకపోవడంతో పెన్షన్ సొమ్మును సోమవారం ఇస్తామని సచివాలయాల ఉద్యోగులు లబ్ధిదారులకు తెలియజేశారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
లక్కవరపుకోట : మండలంలోని తలారి గ్రామంలో అచ్చియ్యమ్మ పేరంటాలు తీర్థం సందర్భంగా శనివారం నిర్వహించిన ఎడ్లు పరుగు పందెం పోటీలు ఉల్లాసంగా సాగాయి. ఈ పోటీల్లో అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు చెందిన 11 ఎడ్లు బళ్లు పాల్గొన్నట్టు నిర్వాహుకులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన ఎడ్లు బళ్లు యజమానులకు వరుసగా రూ.12వేలు, రూ.10వేలు, రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు చొప్పున నగదు బహుమతులను అందజేశారు. ఫైర్ అండ్ సేఫ్టీ డిగ్రీకి సువర్ణావకాశం విజయనగరం గంటస్తంభం: పారిశ్రామిక భద్రత రంగంలో నిపుణులను తీర్చిదిద్దే దిశగా ఐఐఎఫ్ఎస్ఈ, కళింగ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఐఐఎఫ్ఎస్ఈ డైరెక్టర్ శ్రీను మహంతి, కళింగ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.సందీప్ గాంధీ సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంతో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్లో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సు ప్రారంభమైంది. యూజీసీ గుర్తింపు పొందిన ఈ కోర్సు ఎన్ఎస్క్యూఎఫ్ లెవల్–7 సమాన హోదాను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు ఉద్యోగం వదలకుండా ఆన్లైన్ విధానంలో చదివే అవకాశం కల్పించారు. ఇండస్ట్రీయల్ సేఫ్టీ, హజార్డ్ మేనేజ్మెంట్, ఫైర్ ఇంజినీరింగ్ రంగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఇది మార్గం చూపుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కోర్సులలో చేరాలనుకున్న ఆసక్తి గల అభ్యర్థులు 9704106261 నంబరును సంప్రదించాలని సూచించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఐఎఫ్ఎస్ఈఇండియా.ఇన్లో వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ప్రాణాధారమైన నీళ్లు కలుషితమవుతున్నాయని, ఆరోగ్యాన్నిచ్చే పాలు కల్తీ కావడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయే దుస్థితి నెలకొందని తూర్పారబట్టారు. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. ధర్మపురిలోని సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని పరిస్థితిని సమీక్షించి, సురక్షిత నీటి సరఫరా, ఆహార భద్రత పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేసి, మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి అద్భుతాలు ఆశించడం లేదని, కనీసం ప్రాణ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ● ఎవరైనా బతకడానికి పాలు, నీళ్లు తాగుతారని, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రెండూ ప్రాణాంతకంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటుంటే ప్రజాప్రతినిధులు ఆట విడుపు కార్యక్రమాల్లో ఆనందిస్తున్నారని, అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరించాల్సింది పోయి... ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ● ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే.... శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయి, దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారని తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాలు తాగి ఏడుగురు మరణించగా, మరికొందరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రాణాలు నిలపాల్సిన నీరు, పోషణ ఇవ్వాల్సిన పాలు మరణానికి కారణమవడం ప్రభుత్వ నిర్లక్ష్యపాలనకు నిదర్శనమన్నారు. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయనగరం జిల్లా గుర్ల మండలం డయేరియా ప్రబలి 11 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వంలో చలనంలేకపోవడం ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందన్నారు. అప్పట్లో గుర్లలో పర్యటించిన డీప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఈవిషయంపై దృష్టి సారించకపోవడం అటువంటి పరిస్థితులే మరల పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మరణించిన కుటుంబాలకు ఆర్థిక ఆసరా కల్పించి అండగా నిలిచామని గుర్తు చేశారు. ● ఈ ఘటనలకు బాధ్యులు ఎవరు చంద్రబాబు..? టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 22 నెలల్లో రాాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు, అపరిశుభ్రత కారణంగా దాదాపు 25 ఘటనలు చోటుచేసుకున్నాయని జెడ్పీచైర్మన్ పేర్కొన్నారు. 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఈ అంశాన్ని జాతీయ మీడియా కూడా ప్రధానంగా ప్రస్తావించిందన్నారు. విజయనగరంతో పాటు చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందని, వందలాది మంది అస్వస్థతకు గురై, డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయని తెలిపారు. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రతే ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ఈ ఘటనలకు బాధ్యులెవరని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అంటే ఎందుకంత వివక్ష కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబుకు గిరిజనలున్నా... ఉత్తరాంధ్ర ప్రాంతమన్నా నిర్లక్ష్యం తగదని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో గల కురుపాం గిరిజన ఆశ్రమపాఠశాలలో ఇటీవల 16 మంది విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురై, వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో కలుషిత నీటి కారణంగా ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారని గుర్తుచేశారు. ఇంతటి దారుణ ఘటనల అనంతరం కూడా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇదే విషయమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్తో పాటు హ్యూమన్రైట్స్ ప్రతినిధులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు. సాక్ష్యాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. కలుషిత నీటి ఘటన తరువాత వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు వసతి సౌకర్యాలు మెరుగుపరుస్తామంటూ జారీ చేసిన జీవో నీటిపై రాతల్లా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. విద్యార్ధులకు అవసరమైన సదుపాయాలు కల్పించకపోగా.... మధ్యహ్న భోజనపథకాన్ని భ్రష్టుపట్టిస్తోందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించకపోవడంతో పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చేతి చమురువదిలించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఒక్క యూరియా బస్తా ఇవ్వలేని ప్రభుత్వం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని చెప్పారు. మొక్కజొన్నలు క్వింటా రూ.2400 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో సిండికేట్గా ఏర్పడిన దళారులు రూ.1500కే రైతుల నుంచి పంటను దోచుకుంటున్నారని వాపోయారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి. సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్రి నర్సింహమూర్తి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు భరోసా కరువు కల్తీ పాలు, కలుషిత నీళ్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నా వీడని నిర్లక్ష్యం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల జీవితాలతో ఆటలు డయేరియా ప్రభలుతున్నా కానరాని నివారణ చర్యలు స్పందించని ప్రజాప్రతినిధులు.. కనిపించని అధికార యంత్రాంగం ప్రజల ప్రాణాలు కాపాడండి: జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో అదరగొట్టారు..
శృంగవరపుకోట: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో దొగ్గపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వజ్రపు శశికుమార్, చుక్క శశాంక్, తొత్తడి రిషిత సత్తా చాటి అర్హత సాధించినట్టు హెచ్ఎం సురేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిని హెచ్ఎంతో పాటు ఇతర ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఇదిలా ఉండగా వీరికి అదే పాఠశాలకు చెందిన నాగుబిల్లి ప్రసాద్ శిక్షణ ఇవ్వగా హెచ్ఎం సురేష్, సహోపాధ్యాయిని ఆర్.సాయిగీత సహకరించారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.4.30లక్షల జరిమానా విజయనగరం క్రైమ్ : మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విధిస్తూ విజయనగరం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి తీర్పు ఇచ్చినట్టు ఇన్చార్జ్ ఎస్పీ మహేశ్వరరెడ్డి శనివారం తెలిపారు. విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు డీడీలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి, వాహనాలు నడిపిన వారిపై 43 కేసులు నమోదు చేశారు. వీరికి విజయనగరం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరచగా ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున మొత్తం 43 మందికి రూ.4.30 లక్షల జరిమానా విధించారని తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో ఒకరిపై మాల్ప్రాక్టీస్ వేటు పార్వతీపురం రూరల్: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (బాటనీ, హిస్టరీ) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని 33 కేంద్రాల్లో మొత్తం 5,257 మంది విద్యార్థులకుగాను 5,066 మంది (96.3%) హాజరు కాగా, 191 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 2,615 మంది, వృత్తి విద్యా విభాగంలో 2,451 మంది పరీక్ష రాశారు. పాలకొండ డివిజన్ పరిధిలోని భామిని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో హిస్టరీ–2 పరీక్ష రాస్తూ అక్రమాలకు పాల్పడిన ఒక విద్యార్థి మాల్ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, పకడ్బందీ తనిఖీల మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మార్చి 14 నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు పార్వతీపురం రూరల్ : రాష్ట్ర స్థాయి మాస్టర్స్ క్రీడా పోటీలు మార్చి 14 నుంచి 29 వరకు వివిధ జిల్లాల్లో నిర్వహించనున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డా. కె.శ్రీధర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు శాప్ లీగ్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. అథ్లెటిక్స్ పోటీలు మార్చి 14, 15 తేదీల్లో గుంటూరు డీఎస్ఏ మైదానంలో 40 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులకు నిర్వహిస్తారని, బ్యాడ్మింటన్ పోటీలు మార్చి 21, 22 తేదీల్లో కోనసీమ డీఎస్ఏ స్టేడియంలో 35 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులకు, 45 ఏళ్లు పైబడిన పురుషులకు జరుగుతాయని తెలిపారు. టెన్నిస్ పోటీలు మార్చి 28, 29 తేదీల్లో విజయనగరం డీఎస్ఏ స్టేడియంలో 35, 45 ఏళ్లు పైబడిన పురుషులకు నిర్వహిస్తారని, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులన్నారు. ఆసక్తి గల వారు ముందే(హెచ్టిటిపిఎస్://స్పోర్ట్స్.ఏపి.జిఓవి.ఇన్//రిజిస్ట్రేషన్/శాప్–లీగ్–రిజిస్ట్రేషన్) వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుని, నేరుగా పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు 7396423490 నంబరును సంప్రదించాలని సూచించారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య శృంగవరపుకోట: మద్యానికి బానిసైన వ్యక్తి భార్య మందలించిందని మనస్తాపానికి గురై తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి శనివారం తె లిపారు. పట్టణానికి చెందిన చుక్క శ్రీను(45) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం మద్యం తాగి ఇంటికొచ్చిన శ్రీను భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడని, ఎంతకూ బయటకు రాకపోవడంతో భార్య సత్యవతి ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు విరగ్గొట్టి చూడగా శ్రీను ఫ్యాన్కు చీరతో ఉచి వేసుకొని మృతి చెందినట్టు కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
రామతీర్థంలో వైభవంగా పునర్వసు నక్షత్ర పూజలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో శ్రీమద్రామాయణ పారాయణం నిర్వహించి ఆస్థాన మంటపంలో ఉత్సవమూర్తుల వద్ద రామాయణంలో పట్టాభిషేక సర్గ విన్నవించి శ్రీరామచంద్రమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకం, పట్టాభిషేక మహోత్సవం జరిపించారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
గిరిజనదారుల్లో ప్రసవ వేదన
ఆక్రమణలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది ● మార్గంమధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చిన గిరిజన మహిళ కొమరాడ: గిరిజన గ్రామాల గర్భిణులకు సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. పురిటి కష్టాలు వీడడం లేదు. రాళ్లదారుల్లోనే నరకయాతన పడుతూ పిల్లలకు జన్మనిస్తున్నారు. దీనికి కొమరాడ మండలంలో శనివారం చోటుచేసుకున్న ఘటనే నిలువెత్తు నిదర్శనం. పూడేసు పంచాయతీ కోన గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఆరిక వనితకు తెల్లవారు జామున పురిటినొప్పులు వచ్చాయి. కూనేరు రామభద్రపురం ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు వెంటనే ఫీడర్ అంబులెన్స్కు ఫోన్చేసి సమాచారం ఇచ్చారు. అంబులెన్సు చేరుకునేసరికి కాస్త ఆలస్యమైంది. అప్పటికే పురిటినొప్పులు ఎక్కువైనా... ఆస్పత్రికి చేర్చేదారిలేక అంబులెన్స్లోనే తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. కప్పలవాడు గ్రామ సమీపంలోకి వచ్చేసరికి నొప్పులు ఎక్కువ కావడంతో స్థానిక మహిళల సాయంతో ప్రసవం జరిపారు. ఆడబిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యసేవల కోసం ఇద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రాజకీయ కక్షతో నిలిపేసిన పింఛన్ల పంపిణీ
గుర్ల: రాజకీయ కక్షతో నిలిపేసిన పింఛన్లను హైకోర్టు తీర్పుతో తిరిగి పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పున్నపురెడ్డిపేట, గరికివలస, పాలవలస, చోడవరం, గుజ్జింగివలస గ్రామాల్లో ఎనిమిది స్పౌజ్ పింఛన్లను ఆయా గ్రామాలకు చెందిన కూటమి నేతలు రాజకీయ కక్షతో ఏడాది క్రితం నిలిపివేశారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికి కూటమి నేతలకు తలొగ్గి మండల, జిల్లా అధికారులు ఎనిమిది మంది పింఛన్లు పంపిణీ చేయడానికి నిరాకరించారు. బాధితులు మండల, జిల్లా అధికారులకు అనేకసార్లు ఈ సమస్యపై విన్నవించుకున్నప్పటికి స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేయడానికి చొరవ చూపలేదు. దీంతో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు అర్హత ఉన్న ఈ ఎనిమిది పింఛన్లు మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిలిపేసిన పింఛన్లు వెంటనే పంపిణీ చేయాలని శుక్రవారం తీర్పునిచ్చింది. ఏడుగురు పింఛన్దారులకు ఫిబ్రవరి నెల నుంచి పింఛన్ నగదు అందించాలని తీర్పులో పేర్కొంది. గరికివలసకు చెందిన పింఛన్దారుడు కేసు ఇంకా పెండింగ్లో ఉంది. పునరుద్ధరించిన ఏడు పింఛన్ల నగదును వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, జెడ్పీటీసీ శీర అప్పలనాయుడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం అందజేశారు. హైకోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురు దెబ్బని వారు పేర్కొన్నారు. పేదలకు అందుతున్న పింఛన్లను రాజకీయం చేసి నిలిపివేయడం దుర్మార్గమన్నారు. హైకోర్టు తీర్పుతో పింఛన్లు నగదు అందుకోవడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు పేర్కొన్నారు. పేదల కోసం పోరాటం చేసిన వైఎస్సార్సీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గుర్ల మండలంలో ఎనిమిది పింఛన్లు నిలిపివేత హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నేతలు పింఛన్లు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశం -
అంతర్వర్సిటీ చెస్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు
రాజాం సిటీ: తమిళనాడు రాష్ట్రం భారతీదశన్ యూనివర్సిటీలో ఈ నెల 2 నుంచి 5 వరకు జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల చెస్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు షణ్ముఖ శ్రీనివాస్, మణికంఠ ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ శనివారం తెలిపారు. ఇటీవల టెక్కలి ఐతమ్ కళాశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపారన్నారు. చెస్ జట్టుకు కెప్టెన్గా షణ్ముఖ శ్రీనివాస్ బాధ్యతలు నిర్వర్తించనున్నారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్తో పాటు ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, పీడీ బీహెచ్ అరుణ్కుమార్, విద్యార్థులు అభినందించారు. టీచర్కు ఉమెన్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డు విజయనగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (మార్చి 8వ తేదీ) పురస్కరించుకుని హైదరాబాద్లో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఉత్సవాల్లో అందజేసే ఉమెన్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డుకు విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన సముద్రాల గిరిజా ప్రసన్న ఎంపికయ్యారు. హర్యానా పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె, తెలంగాణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సురభివాణిదేవి, సినీనటి ఆమని తదితరుల చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేయనున్నారు. ఉపాధ్యాయ, సామాజిక రంగంలో చేస్తున్న కృషికి ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు. -
పావలా కోడికి రూపాయి మసాలా..!
రూ.4వేల పింఛన్ పంపిణీకి రూ.2కోట్ల ఖర్చు..! ● పెన్షన్ పంపిణీకి ఇంత బిల్డప్ అవసరమా అధ్యక్షా..? ● ఫొటో షూట్లు.. డ్రామా పలకరింపులు ● చీపురుపల్లిలో బాబు పర్యటన ఆద్యంతం ఒక కామెడీ స్కిట్ ● వ్యాక్సినేషన్ పేరుతో రాజకీయ ప్రచారం చంద్రబాబు మాట్లాడుతుండగా సభ నుంచి వెళ్లిపోతున్న జనంసాక్షి ప్రతినిధి, విజయనగరం: ఏమీ తోచనమ్మ అర్ధరూపాయి విలువైన ఆకుచెక్క ఇవ్వడానికి అరవై మైళ్లు వెళ్లొచ్చిందట... అలా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం అన్నది జనం నుంచి వినిస్తున్న మాట. ప్రతినెలా ఏదో ఒక నెపంతో జిల్లాల పర్యటనకు వెళ్తున్న చంద్రబాబునాయుడు ఆయా జిల్లాలకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమిటి? వాటి అమలు ఏ స్థాయిలో ఉందన్నదానిమీద ఎలాంటి కసరత్తు చేయకుండానే నేరుగా వచ్చేస్తున్నారు. ప్రజల జ్ఞాపకశక్తి సన్నగిల్లిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వాళ్లకు గుర్తు లేదని.. మళ్లీ తాను జిల్లాలకు వెళ్లి కాస్త షో చేస్తే సరిపోతుందన్న భావనలో ఉన్న చంద్రబాబు ఏమాత్రం మొహమాటం లేకుండా గ్రాండ్గా పర్యటనలు చేస్తున్నారన్న గుసగుసలు చీపురుపల్లిలో శనివారం నిర్వహించిన ప్రజావేదికలో కనిపించాయి. ● అంతా షో... ప్రతినెలా ఒకటో తేదీన ఏదో జిల్లాకు వెళ్లడం.. ఎంపిక చేసి, ట్రైనింగ్ ఇచ్చిన కొద్దిమంది పెన్షన్దారులకు డబ్బులు చేతిలో పెట్టి అక్కడ ముందుగా ఏర్పాటు చేసిన వీడియో గ్రాఫర్లతో వీడియో షూట్ చేయడం.. అదే ఇంట్లో కాఫీచేసి ఇస్తున్నట్లు నాలుగు ఫొటోలు జనంలోకి వదులుతూ తానూ ప్రజలకు దగ్గరయ్యానని చెప్పుకునేందుకు తాపత్రయ పడడం. అంతా ముందు అనుకున్నట్లుగా స్కిట్ చేసేసి టింగురంగా అనుకుంటూ మళ్లీ విజయవాడ వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాక కోసం వారం ముందు నుంచే అధికారుల ఏర్పాట్లు.. జనాన్ని బలవంతంగా రప్పించడానికి ఏయే శాఖలను అందులో భాగస్వాములను చేయాలనే అంశంపై జిల్లా అధికారుల్లో ఒక చర్చ. జిల్లా అధికారులు రెండుమూడుసార్లు ఆ సభావేదికను పరిశీలించడం.. ఈ జనాన్ని సభ వద్దకు తరలించడానికి పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సుల వినియోగం.. వీళ్లంతా ఎండల్లో మరిగిపోతూ అటుఇటు ప్రయాణం. దీంతోబాటు బందోబస్తు నిమిత్తం ఇరుగుపొరుగు జిల్లాల నుంచి పదుల సంఖ్యలో పోలీస్ సిబ్బంది తరలింపు.. ఇదంతా ఎంత ఖర్చు.. ఎన్ని కోట్ల ప్రజాధనం వృధా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. ఒక్కరికై నా కొత్తపింఛన్ మంజూరు చేయని సీఎం పర్యటనల పేరుతో ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై జనం మండిపడుతున్నారు. లబ్ధిదారులు ఆయన వాహనశ్రేణివైపు చూస్తూ... బాబు ప్రచార డాబునూ చూస్తూ ముక్కనవేలేసుకుని ఉండిపోతున్నారు. పెళ్లిని ఘనంగా చేసుకుంటారు కానీ ప్రతినెలా పెళ్లిరోజును ఎవరైనా అంత ఘనంగా చేసుకుంటారా అనే ప్రశ్నకు.. డబ్బు మనది కాకపోతే ప్రతి నెలా ఏమి ఖర్మ. ప్రతిరోజూ రూ.లక్షలు, రూ.కోట్లు తగలేసి సంబరాలు చేసుకుంటారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నడ్డి నాది కాకపోతే కాశీదాకా అయినా దేక్కుంటూ పోతాను.. అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా... పింఛన్ల పంపిణీని మాత్రం ఘనతగా చెప్పుకుంటూ ప్రతినెలా రాజకీయ సభలు నిర్వహించడం.. సెల్ఫ్ డప్పు కొట్టుకుంటూ సెలబ్రేషన్స్ చేస్తుండడాన్ని చూసి జనం నిశ్చేష్టులవుతున్నారు. అధికారం కట్టబెట్టాం.. మరో మూడేళ్లు భరించాల్సిందే అంటూ కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. బాబు గారూ... బోరు కొడుతోంది.... సీఎం ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లిపోయిన జనం ఖాళీయిన కుర్చీలు మంత్రి కొండపల్లిని మాజీ మంత్రి అంటూ సీఎం సంబోధన ఊరొచ్చి ఉసూరుమనిపించారంటూ తమ్ముళ్ల ఆవేదన వేదికపై కనిపించని గ్రామ సర్పంచ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున నాటి పారదర్శకత నేడు ఏదీ? గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో సింపుల్గా వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందించి వచ్చేవారు. ఇన్ని కామెడీ స్కిట్లు.. రెడీమేడ్ ఆర్టిస్టులు లేరు.. డ్రామా లేదు. చంద్రబాబూ.. నువ్వే మా పెద్ద కొడుకువు అంటూ కన్నీళ్లు తుడుచుకునే కుటుంబం లేదు. మీకు నేనున్నాను.. మీ కష్టాలు తీరుస్తా... అనే డైలాగులు సైతం ఆ ఐదేళ్లు వినిపించలేదు. కానీ ప్రతి ఇంటికి సంక్షేమం అందింది. ప్రతి పేదవాడి ఇంటా చిరునవ్వు విరిసింది. అప్పట్లో ఇన్ని డ్రామాలు.. భావోద్వేగ సన్నివేశాలు లేవు. స్వచ్ఛమైన ప్రభుత్వ సేవ మాత్రమే సమాజంలో కనిపించేది. కానీ నేడు ప్రజలకు దక్కేది పావలా అయితే ప్రచారం మాత్రం రెండురూపాయలు దాటుతోందని అధికారులు.. సామాన్య జనం సైతం లోలోన గుసగుసలాడుతున్నారు. చీపురుపల్లి: ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి అంటూ చెబుతుంటారు.. మన ప్రాంతానికి వచ్చారు.. ఏం వరాలు ఇస్తారో.. అభివృద్ధి కోసం ఎంతెంత నిధులు విదుల్చుతారో అంటూ వచ్చిన చీపురుపల్లి ప్రాంత ప్రజలకు చేదు అనుభవమే ఎదురైంది. కనీసం ముఖ్యమంత్రి ప్రజావేదిక నిర్వహించిన రావివలస పంచాయతీ పైలపేట గ్రామానికై నా ఏదోఒకటి ప్రకటిస్తారని ఎదురు చూసిన గ్రామస్తులకు నిరాశ తప్పలేదు. ముఖ్యమంత్రి మా ఊరి వచ్చి ఏం ప్రయోజనం కనీసం ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదంటూ సాక్షాత్తూ అదే పార్టీకు చెందిన ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ అసహనం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి పాతపాటే పాడడంతో వినే ఓపిక లేక ప్రసంగం మధ్యలోనే మహిళలు, కార్యకర్తలు లేచి వెళ్లిపోయారు. వెళ్లిపోతున్నవారిని వెలుగు సిబ్బంది నిలువరించినప్పటికీ ఆ మాటలు ఎంతకని వింటాం.. వినలేం బాబోయ్.. బైబై బాబూ అంటూ జారుకున్నారు. దీంతో సీఎం ప్రసంగం 30 నిమిషాలు దాటకముందే చాలా కుర్చీలు ఖాళీగా కనిపించాయి. మాజీ మంత్రి అప్పలనాయుడు అంటూ... వేదికపై ఉన్న వారి కోసం సీఎం చంద్రబాబు చెబుతూ జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోసం మాట్లాడుతూ మాజీ మంత్రి అప్పలనాయుడు అంటూ సంబోధించడంతో వేదికపై ఉన్న వారు ముఖాలు చూసుకున్నారు. కేన్సర్ వ్యాధి కోసం మాట్లాడుతూ సర్వైకల్ కేన్సర్ను పలుమార్లు సర్వైవల్ కేన్సర్ అంటూ సీఎం మాట్లాడుతుంటే అంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. రావివలస పంచాయతీ పరిధిలోని పైలపేటలో జరిగిన ప్రజావేదికపై ఆ గ్రామ సర్పంచ్ పనస మణికంఠ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునకు చోటు దక్కలేదు. ప్రజావేదికపై సర్పంచ్కు కుర్చీవేయకపోవడంపై ఆయన వర్గీయులు నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. నియోజకవర్గంలో టీడీపీను నిలబెట్టి ఆరేడేళ్లుగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్న కిమిడి నాగార్జునకు వేదికపై స్థానం లేకపోవడంతో ఆయన వర్గీయులు రుసురుసలాడుతున్నారు. -
సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య ఆహారం
పార్వతీపురం రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత కల్పించేందుకు ఫుడ్ బాస్కెట్ (ఆహార బుట్ట) విధానం ఎంతగానో దోహదపడుతుందని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.సుధారాణి తెలిపారు. జిల్లా సమాఖ్య కార్యాలయంలో వీఓ ఉప కమిటీలు, ఆరోగ్య పోషణ ఐసీఆర్పీలకు శనివారం నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై సిబ్బంది ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించవచ్చని ఆర్వైఎస్ఎస్ డీపీఎం ఎం.శ్రావణకుమార్ నాయుడు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఏడాది పొడవునా పోషక వనాలు (న్యూట్రీ గార్డెన్) పెంచేలా రైతులకు సహకరించాలన్నారు. ఆర్టీఓ హేమసుందర్ మాట్లాడుతూ ఫుడ్ బాస్కెట్ ప్రయోజనాలను వివరించారు. సెర్ప్, ఆర్వైఎస్ఎస్ సిబ్బంది సమన్వయంతో సేవలందించాలని డీపీఎం జయశ్రీ కోరారు. ప్రకృతి వ్యవసాయంలో మహిళల పాత్ర, బయో ఇన్పుట్ కేంద్రాల ప్రాముఖ్యతపై ఏడీపీఎం పి.ప్రవీణ్కుమార్, ఉత్పత్తుల మార్కెటింగ్పై తిరుపతి, శిక్షణ అంశాలపై శోభ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల ఏపీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని పాతబగ్గాం గ్రామానికి చెందిన పల్లి ప్రసాద్ శనివారం తెల్లవారుజామున కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలో ప్రమాదవశాత్తు లారీ నుంచి జారిపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... లారీ క్లీనర్గా పని చేస్తున్న ప్రసాద్ సాలూరు నుంచి లారీ లోడ్తో శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. గుడివాడ సమీపానికి వచ్చేసరికి క్లీనర్ సమీపంలో ఉన్న డోరు ఓపెన్ కావడంతో నిద్రమత్తులో ఉన్న ప్రసాద్ ఒక్కసారిగా రోడ్డుపై పడ్డాడు. ఈ క్రమంలో కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ గమనించి వెనక్కి రాగా అప్పటికే ప్రసాద్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పల్లి రాము, దేవుడమ్మ కన్నీటి పర్యాంతమయ్యారు. దీంతో పాతబగ్గాంలో విషాదం అలుముకొంది. ప్రసాద్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి..గుమ్మలక్ష్మీపురం: రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన విద్యార్థి బిడ్డిక రాహుల్ (13) విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మలక్ష్మీపురం మండలం గాజులగూడ గ్రామానికి చెందిన రాహుల్ సమీపంలో గల కొత్తగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇంటికెళ్లిన రాహుల్ స్నేహితులతో కలిసి ఈ నెల 26న బొద్దిడి జంక్షన్ వద్ద జరిగిన జాతరకు ద్విచక్ర వాహనంతో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఒంటరిగా ద్విచక్ర వాహనంపై వస్తుండగా డుమ్మంగి సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపు తప్పడంతో రాహుల్ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ముఖం, తల భాగాల్లో గాయాల పాలైన రాహుల్ను సమాచారం అందుకున్న కుటుంబీకులు భద్రగిరి ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. అనంతరం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాహుల్ మృతి చెందినట్టు తల్లిదండ్రులు వనిత, అర్జున్ తెలిపారు. శతాధిక వృద్ధురాలు.. బాడంగి: మండలంలోని గొల్లాది గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు ఇజ్జాడ పోలమ్మ(105) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఆమె కుటుంబం మునిమనవులు, ముని మనవరాళ్లుతో ఉంది. పోలమ్మ అంత్యక్రియలు శనివారం ఆమె స్వగ్రామం గొల్లాదిలో జరిగాయి. రామభద్రపురం : రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది. ఎస్సై వెలమల ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 24న తారాపురం అయ్యప్పస్వామి ఆలయం వద్ద పాచిపెంటకు చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తూ సాలూరు మండలం పురోహితునివలసకు చెందిన పి.శ్రీనివాస్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ను సాలూరు సీహెచ్సీకి తరలించగా అక్కడి నుంచి వైద్యులు విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రసాదరావు తెలిపారు. -
కష్టపడి పని చేసే వారికి గుర్తింపు
● వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుబలిజిపేట: ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) సమక్షంలో, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో అజ్జాడకు చెందిన అక్కేన ఎల్లంనాయుడు, కాగాన అప్పలనాయుడు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన బలిజిపేట మండల మాజీ మండల ఉపాధ్యక్షురాలు అక్కేన చెల్లెమ్మ భర్త ఎల్లంనాయుడు, అజ్జాడ ఉప సర్పంచ్ కాగాన అప్పలనాయుడులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి గెలుపు కోసం అందరితో కలిసి కష్టపడి పని చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, పి.చాకరాపల్లి సర్పంచ్ కె.మోహనరావు, యువజన విభాగం బలిజిపేట మండలం అధ్యక్షుడు రణదేవ్ లక్ష్మణరావు, ఉమ్మడి జిల్లా పార్టీ సీనియర్ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ ఇలా..
ఐటీడీఏను నిర్వీర్యం చేశారు.. ఐటీడీఏను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుంది. గిరిజన ప్రాంతాల్లో పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. ఐటీడీఏకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయనేది లేదు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల పథకాలు అమలు కాని పరిస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కొండపోడు పట్టాలతో పాటు, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకై నా కనిపించడం లేదు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ, మాజీ ఎమ్మెల్యే సీతంపేట: ఐటీడీఏ అంటే గిరిజనులకు అండగా ఉండి, వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ఐటీడీఏ రానురాను ఇటీవల కాలంలో ప్రాభవం కోల్పోతుంది. చంద్రబాబు సర్కార్ గద్దెనెక్కి 20 నెలలు కావస్తున్నా ఐటీడీఏకు దిశానిర్దేశం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో ప్రత్యేకంగా ఐటీడీఏకు పీఓలను శాశ్వతంగా నియమించింది. ఇన్చార్జ్లతో నడిపించిన దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆన్చార్జ్ పీఓలతో నెట్టుకొస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ప్లాన్ మండలాలు ఉన్నాయి. 1250 వరకు గిరిజన గ్రామాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా పరిధిలో 16, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. రెండు లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. 13కు పైగా ప్రభుత్వ శాఖలు పని చేస్తున్నాయి. ఇంజినీరింగ్, గిరిజన సంక్షేమ శాఖ, వైద్య శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సహకార సంస్థ వంటివి నిర్వహించబడుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నప్పటకీ ఇప్పటి వరకు ఒక గవర్నింగ్ బాడీ సమావేశం కూడా నిర్వహించలేదు. పాలకవర్గ సమావేశాల ద్వారా గిరిజనులకు ఏఏ పథకాలు అవసరం, ఉన్న పథకాలు ఏమేరకు ఉపయోగపడుతున్నాయో.. క్షేత్ర స్థాయిలో పథకాల పనితీరు మంత్రులు, శాసనసభ్యులు చర్చించడానికి వీలుంటుంది. గవర్నింగ్ బాడీ సమావేశం కూడా ఇంతవరకు నిర్వహించకపోవడం గమనార్హం. మౌలిక వసతులు అంతంతమాత్రమే... గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా రహదారులు, భవనాలు నిర్మించాల్సి ఉంది. 120కు పైగా గ్రామాలకు పూర్తి స్థాయిలో కనెక్టివిటీ దారులు లేవు. ఇప్పటికీ కొన్నిచోట్ల రహదారులు రాళ్లు తేలి ఉన్నాయి. చేసిన పనులకు సైతం బిల్లులు లేవంటూ సంబంధిత కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రహదారి సౌకర్యాలు లేక అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు తరలించాలన్నా.. మార్కెట్కు అటవీ ఉత్పత్తులు తీసుకువెళ్లాలంటే బాధలు వర్ణణాతీతం. ఇంకా వరద గోడలు, మల్టిపర్పస్ భవనాల నిర్మాణాలు పూర్తిగా లేవు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల పనులు పూర్తి కాలేదు. వైద్యసేవలు గగనం అవుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది కొరత వేధిస్తుంది. కొన్ని పీహెచ్సీల్లో ఒక్కో డాక్టర్తోనే నెట్టుకొస్తున్నారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు సక్రమంగా జరగడం లేదు. మలేరియా నివారణలో భాగంగా దోమ తెరల పంపిణీ లేదు. వెఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2లక్షలకు పైగా దోమతెరలను గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేశారు. అటు తర్వాత పంపిణీ లేదు. అన్నదాత సుఖీభవ పథకం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులకు 7వేల మందికిపైగా వర్తించలేదు. నిధులు బ్యాంకుల్లో జమకాక అవస్థలు పడుతున్నారు. గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. కొండచీపుర్లు, చింతపండు వంటి వాటికి సరైన మద్దతు ధరలు లేక గిరిజనులు అల్లాడుతున్నారు. గిరిజన విద్యా సంస్థల్లో హెల్త్ వాలంటీర్లు లేరు... గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వాలంటీర్లు లేరు. ఐటీడీఏ పరిధిలో 60 గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో సుమారు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థినీ, విద్యార్థుల ఆరోగ్యాలను పరిరక్షించే ఏఎన్ఎంలు లేరు. అత్యవసర సమయాల్లో జ్వరం, ఇతర వ్యాధులు వస్తే విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. కనీసం ప్రాధమిక చికిత్స చేసే వారు లేకపోవడంతో విద్యార్థులు దీనావస్థలో ఉన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదు. కాగా పాఠశాలలు పర్యవేక్షించే ఏటీడబ్ల్యూఓ పోస్టులు కూడా రెండు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఇన్చార్జ్లతోనే నెట్టుకువస్తున్నారు. విద్యార్థులకు వండి వడ్డించే వంట సిబ్బంది కొరత కూడా ఉంది. ఖాళీ అవుతున్న శాఖలు నిర్వీర్యమవుతున్న సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ గవర్నింగ్ బాడీ సమావేశాలు నిల్ క్షేత్ర స్థాయిలో పథకాల అమలు అంతంతమాత్రమే..ఖాళీ అవుతున్న శాఖలు వెలుగు కార్యక్రమాలు సన్నగిల్లాయి. ట్రైబుల్ ప్రాజెక్టు మానటరింగ్ యూనిట్ను ఎత్తివేశారు. ఈ విభాగం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలను బలోపేతం చేయడం, వారికి జీవనోపాధి మార్గాలు చూపడం వంటివి చేసేవారు. ఏడాది కిందట ఆ శాఖను కూడా ఎత్తివేశారు. మానటరింగ్ చేసే ఏపీడీ పోస్టుతో పాటు ఏపీఎం పోస్టులు కూడా లేకుండా పోయాయి. అలాగే కొన్నేళ్ల క్రితం ఎస్ఎంఐ విభాగం శ్రీకాకుళం క్వాలిటీ కంట్రోల్ విభాగంలో కలిసింది. ఈ శాఖ ద్వారా గతంలో చెరువులు, చెక్డ్యాంలు వంటివి నిర్మించే వారు. తద్వారా ఖరీఫ్, రబీ పంటలకు సాగునీరు సక్రమంగా అందేది. పుష్కలంగా పంటలు పండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగునీరు గిరిజన ప్రాంతాల్లో గగనమైంది. రేపో, మాపో ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ కార్యాలయం శ్రీకాకుళంకు తరలివెళ్లిపోనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇందుకు అక్కడ ప్రత్యేక కార్యాలయాన్ని కూడా కలెక్టరేట్లో కేటాయించినట్టు తెలిసింది. -
బ్యానర్...
కునారిల్లుతున్న సాగునీటి ప్రాజెక్టులు జిల్లాలో ప్రధానమైన తోటపల్లి, తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టులు నిధులు లేక కునారిల్లుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల దిశ దశ మార్చుతానని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబునాయుడు పట్టించుకున్న పాపానపోవడం లేదన్నది రైతులమాట. ప్రాజెక్టుల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కోరుతూ సాక్షాత్తూ ఇరిగేషన్ అధికారులు చేసిన ప్రతిపాదనకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. 2026–27 సంవత్సరానికి తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి రూ.256.20 కోట్లు అవసరమని ప్రతిపాదనలు చేయగా కేవలం రూ.47.81 కోట్లు, తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు కోసం రూ.302.89 కోట్లు అవసరమని ప్రతిపాదనలు చేయగా రూ.68 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అభివృద్ధికి నోచుకోని తోటపల్లి కుడి ప్రధాన కాలువ గరివిడి ఫేకర్ పరిశ్రమ ఫెర్రో అల్లాయీస్లకు షాక్.. -
టెన్త్ పరీక్షల ఏర్పాట్లు పూర్తి : డీఈఓ
విజయనగరం అర్బన్: వచ్చే నెల మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈఓ మాణ్యికంనాయుడు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వాహణలో భాగంగా నియమితులైన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు స్వయంగా సందర్శించి మౌలిక వసతులు సమృద్ధిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలన్నారు. ప్రతి కేంద్రాన్ని నోఫోన్ జోన్గా పరిగణించి మొబైల్ ఫోన్ తీసుకు రాకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష ప్రారంభమైన అర్ధ గంట తర్వాత విద్యార్థులను అనుమతించరాదన్నారు. -
కష్టపడి పనిచేసినా టీడీపీలో గుర్తింపు ఉండదు
● అందుకే పార్టీని వీడుతున్నాం ● సీహెచ్సీ మాజీ చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ గజపతినగరం: తెలుగుదేశం పార్టీలో 1989వ సంవత్సరం నుంచి క్రీయాశీలక సభ్యత్వం తీసుకొని పార్టీ ఆదేశాలకు అనుగుణం కష్టపడి పనిచేశాం... పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేశాం... ఎంత కష్టపడి పనిచేసినా పార్టీలో గుర్తింపు ఉండదు.. కొత్తగా వచ్చిన నాయకులకు ఉన్నంత విలువు సీనియర్లకు ఇవ్వరు.. అవమానాలు భరించి పార్టీలో ఇమడలేమని అర్థమైంది.. అందుకే పార్టీని వీడుతున్నామంటూ గజపతినగరం కమ్యూనిటీ హెల్త్సెంటర్ (సీహెచ్సీ) మాజీ చైర్మన్ మిత్తి రెడ్డి వెంకటరమణ, విశ్రాంత అధ్యాపకుడు యడ్ల పైడిపునాయుడు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కర్రి సత్యనారాయణ పేర్కొన్నారు. గజపతినగరంలోని ఓ ప్రైవేటు భవనంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీలో చేరిన కొంతమంది నాయకులు వ్యక్తిగత కక్షతోను, స్వార్థపూరిత రాజకీయాలతో తమను మంత్రి నుంచి దూరం చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పార్టీ కార్యకర్తలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని, ఇక పార్టీకి శాశ్వతంగా దూరమవుతామని స్పష్టంచేశారు. మంత్రి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం గుర్తించలేకపోతున్నారన్నారు. టీడీపీలో కలుషిత రాజకీయం ఎక్కువైందని వాపోయారు. చాలామంది పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మదుపాడకు చెందిన వలిరెడ్డి మురళి, ఇ.గడ్డినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తం కావాలి
జియ్యమ్మవలస రూరల్: వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం అందించాలని ఎస్సీ వసతిగృహ సంక్షేమ అధికారి శంకర్రావు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.శ్యామల ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం చినమేరంగి హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇస్తున్న మెనూ, వారు వినియోగిస్తున్న రూంల ను ఆమె పరిశీలించారు. స్టడీ అవర్స్ నిర్వహించి శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూఓ స్వర్ణమని, సంక్షేమ అధికారి కె.శంకర్రావు పాల్గొన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా సాలూరు: డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఒక్కొక్కరికి పదివేల రుపాయిలు చొప్పున ఏడుగురికి 70 వేల రుపాయిలను జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జరిమానా విధించినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో ఏడుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా వారికి జరిమానా విధించారని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి డ్రైవ్లు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ ఐటీఐ కళాశాల నైపుణ్య కేంద్రంలో జూనియర్ సాఫ్ట్వేర్ డెవలెపర్ కోర్సుకు మూడు నెలల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి, ఇంటర్, అంతకంటే పై చదువులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత ధృవపత్రాలు, తాధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలతో విటి.అగ్రహారం, విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు వచ్చే నెల 5వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 413 మంది విద్యార్థులు గైర్హాజరు పార్వతీపురం రూరల్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర మూడో పరీక్షకు మొత్తం 413 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 840 మంది విద్యార్థులకుగాను 760 మంది హాజరు కాగా, 80 మంది పరీక్షకు రాలేదు. ఒకేషనల్ విభాగంలో 2,957 మందికి గాను 2,624 మంది హాజరు కాగా, 333 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 3,797 మంది విద్యార్థుల్లో 3,384 మంది పరీక్షకు హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి వై.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. -
మీరిచ్చిన హామీలే.. నెరవేర్చేదెన్నడో చెప్పండి...
చీపురుపల్లి: అధికారంలోకి వస్తే.. బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం.. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3వేలు భృతి చెల్లిస్తాం.. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తాం.. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.. విద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్ను ఠంచన్గా చెల్లిస్తాం.. వలంటీర్లకు నెలకు రూ.10వేలు చెల్లిస్తాం.. రైతన్నలను ఆదుకుంటాం.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం.. పాలనలో ‘సూపర్ సిక్స్’ కొడతామంటూ ప్రచారం చేశారు. జనాన్ని నమ్మించి ఓట్లు కొల్లగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక జనానికి మోసం ఫిక్స్ చేశారు. 50 ఏళ్లకు పింఛన్ మాట పక్కనపెడితే 60 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛన్ మంజూరుకాని పరిస్థితి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వేలాది మంది పింఛన్లకోసం ఎదురుచూస్తున్నా పట్టించుకోని దుస్థితి. సుమారు రెండేళ్ల పాలనలో ఏ ఒక్క హామీని అమలుచేయకుండా పింఛన్ల పంపిణీ పేరుతో హామీల బాబు.. మళ్లీ డాబు కొట్టేందుకు చీపురుపల్లి ప్రాంతానికి వస్తున్నారంటూ జనం నవ్వుతున్నారు. జిల్లాను పరిశ్రమల హబ్గా తీర్చిదిద్ది నిరుద్యోగులు వలసలు వెళ్ల్లకుండా ఇక్కడి నుంచే ఉద్యోగం చేసుకునే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పిన చంద్రబాబు మాటలు గాలి మాటలుగానే మిగిలిపోయాయని విమర్శిస్తున్నారు. ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా జిల్లాల పర్యటనలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవాచేస్తున్నారు. జిల్లాలో ఒక్క హామీనీ పూర్తిస్థాయిలో నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వం నిధులు లేక కునారిల్లుతున్న సాగు నీటి ప్రాజెక్టులు కనిపించని పారిశ్రామిక ప్రగతి నిర్వీర్యం దిశగా సచివాలయాలు, అగ్రిల్యాబ్లు పాత పింఛన్ల పంపిణీకి జిల్లా పర్యటనలు కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయాలని సర్కారు నేడు చీపురుపల్లికి రానున్న సీఎం చీపురుపల్లి నియోజకవర్గంలో మూతపడిన ఫెర్రో పరిశ్రమలు తెరిపిస్తామని, ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు లేవు. ఏపీఈపీడీసీఎల్లో విలీనమైన గ్రామీణ విద్యుత్ సహకార సంఘం(ఆర్ఈసీఎస్)ను తిరిగి పునురుద్ధరించి సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. చీపురుపల్లి 100 పడకల ఏరియా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఆచరణ శూన్యంగానే కనిపిస్తోంది. రాజాం మున్సిపాలిటీలో టిడ్కో ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికీ పూర్తికాలేదు. మడ్డువలస, తోటపల్లి, నారాయణపురం సాగు నీటి కాలువలు అభివృద్ధి మాట రైతులనడిగితే తెలుస్తుంది. నాగావళి నదిపై బలసలరేవు వంతెన నిర్మాణం నీటిమూటగానే మారింది. బాడంగి మండలంలోని గొల్లాది వద్ద వేగావతి నదిపై వంతెనతో పాటు భోజరాజపురం వద్ద మరో వంతెన నిర్మిస్తామన్నారు. పనులే లేవు. బొబ్బిలికి ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఎండమావిగానే మారింది. చిలకపాలెం నుంచి రామభద్రపురం మీదుగా రాయగడ రోడ్డును విస్తరించి అభివృద్ధి చేస్తామన్నారు. పనులు ప్రారంభంకాలేదు. ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖపట్టణం జిల్లాలో విలీనం చేస్తామన్నారు. ఎస్.కోటలో ఐటీ పార్క్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగులు వలస వెళ్లకుండా చూస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు. గజపతినగరం నియోజకవర్గంలోని సారవగెడ్డ మినీ రిజర్వాయర్ నిర్మాణం కలగానే మారింది. రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు ఇప్పటికీ నత్తేనయంగా సాగుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్కు, విజయనగరం ప్రజలకు తాగునీటి సరఫరా ఎప్పటికి అవుతుందో తెలియని పరిస్థితి. కురుపాంలోని ఇంజినీరింగ్ కళాశాల, ఏనుగుల తరలింపు, గుమ్మలక్ష్మీపురంలో జీడి పరిశ్రమ ఏర్పాటు హామీలకే పరిమితమయ్యాయి. పూర్ణపాడు–లాభేసు వంతెన అసంపూర్తిగా మారింది. -
అరాచక శక్తుల అడ్డాగా బొబ్బిలి
చికెన్బొబ్బిలి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో బొబ్బిలి ప్రాంతం అరాచక శక్తులకు అడ్డాగా మారిందని, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, వేధింపుల అధికార పార్టీ అండగా నిలబడుతోందని, ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి అక్రమార్జనకు పాల్పడుతున్న పాలకులకు ప్రభుత్వ యంత్రాంగం తలూపుతోందని, పోలీసు యంత్రాంగాన్ని చెప్పుచేతల్లోకి తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ శంబంగి వెంకటచినప్పలనాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కోమటిపల్లిలో ఒకే రోజు జరిగిన రెండు సంఘటనల్లో గంజాయితో దొరికిన నిందితులను తమ పార్టీ సానుభూతిపరులని ఎమ్మెల్యే చొరవతో పోలీసులు వదిలేశారనాన్నరు. అక్కడే ఫార్మా విద్యార్థులను వేధించిన ఆ గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షుడి కుమారుడుని పోలీసులు ఏమీ చేయలేక ఎమ్మెల్యే చెబితే విడిచిపెట్టారన్నారు. ఇటీవల మున్సిపల్ వైస్చైర్మన్ కారు డ్రైవర్ తన భార్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, అతడి కుమారుడే సాక్ష్యం చెప్పినా నిందితుడు డ్రైవర్పై కేసు పెట్టలేదన్నారు. అభ్యుదయ పాఠశాలలో విద్యార్థుల మధ్య కొట్లాటను కోటలో రాజీ చేశారన్నారు. ఇలా వరుస సంఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. పోలీసులను సొంత యంత్రాంగంలా.. ఎమ్మెల్యే పోలీసు యంత్రాంగాన్ని సొంత జాగీరులా వాడుకుంటున్నారని శంబంగి ఆరోపించారు. నేరాల్లో నిందితులను కాపాడేందుకు వారి చెప్పుచేతల్లో ఉన్న వారినే ఉంచుతున్నారని, మాట వినకపోతే సాగనంపుతున్నారన్నారు. ఇటీవల పట్టణ సీఐ సతీష్కుమార్ ఉదంతమే ఇందుకు సాక్ష్యమన్నారు. ఎమ్మెల్యే మాట వినకపోవడంతో సీఐని సాగనంపి, వారి కనుసన్నల్లో ఉండే రూరల్ సీఐని టౌన్కు తెచ్చుకున్నారని, దీంతో అరాచకవాదులకు, నేరప్రవృత్తి ఉన్న వారికి ధైర్యం వస్తోందన్నారు. భూకబ్జాల్లో నెంబర్ వన్ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి భూకబ్జాలు పెరిగిపోయాయని, ఏకంగా పాలకులే కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భైరిసాగరం వద్ద గ్రామ కంఠంలో ఉన్న సంతతోట భూమిని ఆక్రమించి పక్క సర్వే నెంబరుతో విక్రయించేశారని, గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్న చెలికాని వెంకటరావు ఆ భూమిని రైతుల కోసం సంతతోటగా కేటాయిస్తు గ్రామకంఠంలో చేర్చారని ఇప్పుడు దాన్ని నిర్భయంగా తప్పుడు సర్వే నెంబర్లతో విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. మల్లంపేట రైతులకు 1991లో నాటి మంత్రి పెద్దింటి జగన్మోహనరావు హయాంలో 9 ఎకరాల డీ పట్టా భూమలును కేటాయించగా దాన్ని రైతుల నుంచి తిరిగి లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, బాధిత రైతులు లబోదిబోమంటు నిత్యం నిరసనలు తెలియజేస్తున్నారని తెలిపారు. రామన్నదొరవలసలో గిరిజనులకు ఇచ్చిన 20 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూములను తిరిగి వారి నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. కలెక్టర్ దృష్టి సారించాలి.. బొబ్బిలిలో జరుగుతున్న అరాచకాలు, అధికార దుర్వినియోగం, భూకబ్జాలపై కలెక్టర్ దృష్టి సారించాలని శంబంగి కోరారు. గంజాయి, మహిళల పట్ల జరుగుతున్న వేధింపులు, అధికార పార్టీ ఆగడాలను కట్టడి చేయాలన్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అనైతిక కార్యక్రమాలను ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించి దౌర్జన్యాలు, ఆక్రమణలు, భూకజ్జాలు, పోలీసుల పనితీరుపై విచారణ జరపాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు ఇంటి గోపాలరావు, సావు మురళీకృష్ణ, వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ శంబంగి వేణుగోపాలనాయుడు, కౌన్సిలర్లు కోట పెదరాములు, పాలవలస ఉమాశంకర్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బొద్దల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గంజాయి ముఠాలు, మహిళలపై దౌర్జన్యాలు, వేధింపులు రూ.వందల కోట్ల భూకబ్జాలు ఎమ్మెల్యే చెప్పుచేతల్లో పోలీసు యంత్రాంగం కలెక్టర్ దృష్టి సారించాలి పాలకుల పాపాలపై మాజీ ఎమ్మెల్యే శంబంగి ధ్వజం -
గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలు విస్తృతం
● డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డైరెక్టర్ రామమోహన్విజయనగరం టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో సైతం బీఎస్ఎన్ఎల్ మరింత విస్త్రతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డైరెక్టర్ కె.రామమోహన్ (విజయవాడ) పేర్కొన్నారు. స్థానిక టెలిఫోన్ భవన్లో శుక్రవారం డీజీఎం, ఏజీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిజిటల్ భారత్ నిధిలో భాగంగా సిగ్నల్ వ్యవస్థ లేని గ్రామీణ ప్రాంతాలలో 48 కొత్త టవర్స్ను ఏర్పాటు చేశామన్నారు. కొండకరకం, బడుకొండపేట గ్రామాల్లో సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేదని అందిన వినతుల మేరకు స్వీయ పర్యవేక్షణ చేసి, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సిగ్నల్ వ్యవస్థ లేని ప్రాంతాలను సైతం కవర్ చేస్తూ మరో 70 టవర్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ సంస్థ రెండు లక్షల మందికి పైగా వినియోగదారులను కలిగి ఉందన్నారు. ఫోర్జీ నెట్వర్క్తో ఇతర నెట్వర్క్లకు ధీటుగా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీజీఎం దాలినాయుడు, ఏజీఎం మురళి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం మారింది.. రహదారి నిర్మాణం ఆగింది...
● గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రారంభమైన పనులు ● కూటమి పాలనతో పడకేశాయి.. ● నెరవేరని గిరిజనుల కల శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల ప్రజల దశాబ్దాల కల ఆ రహదారి. వైఎస్సార్సీపీ పాలనలో తొలిసారిగా దారపర్తి పంచాయతీలో గిరిశిఖర గ్రామాలకు రోడ్డు వేయాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. నిధులు కేటాయించింది. భూములు బదలాయించింది. పనులు కూడా ప్రారంభించింది. ఇంతలోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ పనులపై కక్ష కట్టింది. పనులు పూర్తయితే ఎక్కడ గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని ఆలోచన చేసింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఎక్కడి పనులు అక్కడే వదిలేసింది. దీంతో గిరిజనం దశాబ్దాల కల నెరవేరలేదు. మళ్లీ ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. జగనన్న పాలనలో రోడ్డు పూర్తవుతుందని సంబరపడ్డ ఆ గిరిజనానికి నిరాశే మిగిలింది. జగనన్న పాలనలో.. మండలంలోని దారపర్తి పంచాయతీ పరిధి గిరిశిఖర గ్రామాలకు రోడ్డు వేయాలని దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడ వరకూ ఉన్న 12 గ్రామాలకు 7.5కి.మీ దారిలో రహదారి నిర్మాణం చేయాలన్న గిరిజనులు కొన్ని దశాబ్దాలుగా కోరుతున్నా చంద్రబాబు సర్కారు హయాంలో ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సదరు రోడ్డుకు పి.ఎం.జి.ఎస్.వై–11లో రూ.489.08లు లక్షలు మంజూరు చేసిన పీఆర్ అధికారులు అటవీ శాఖ అనుమతులను కోరారు. అటవీశాఖ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయి. ముఖం చాటేసిన చంద్రబాబు ప్రభుత్వం దారపర్తి రోడ్డు పనులు ప్రారంభమై తొలుత ఎర్త్ వర్క్ శరవేగంగా జరిగింది. ఇచ్చిన సమయం అయ్యిందన్న నెపంతో అధికారులు పనులకు మోకాలడ్డారు. తర్వాత ప్రభుత్వం మారింది. కూటమి సర్కారు గిరిజనం సమస్యలపై ముఖం చాటేసింది. దీంతో ఎక్కడి గొంగళి అక్కడే అన్న తీరుగా వర్షాలకు చేసిన ఎర్త్ వర్క్ దెబ్బతింది. రోడ్డులో రాళ్లు రప్పలు తేలాయి. గిరిజనానికి కష్టాలు మిగిలాయి. డోలీ మోతలు మళ్లీ మొదలయ్యాయి.తొలిసారిగా గిరిజనానికి పలకరింపు చరిత్రలో తొలిసారిగా మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కాలినడకన 2020 ఫిబ్రవరి 1వ తేదీన దబ్బగుంట గ్రామానికి వెళ్లి రోడ్డు పరిశీలించారు. 2023 సెప్టెంబర్ 19న గిరిశిఖర గ్రామాలకు వెళ్లి గడప గడపకు వైఎస్సార్సీసీ కార్యక్రమం నిర్వహించి గిరిజనం వెతలు చూసి, పట్టుబట్టి రోడ్డు పనులపై పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులకు, లేఖలు రాసి, అనుమతులు సాధించటంతో దబ్బగుంట–పల్లపుదుంగాడ రోడ్డులో కదలిక వచ్చింది. అటవీశాఖ రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్న 6హెక్టార్లు భూమిని ఎస్.కోట మండలంలో పెదఖండేపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నెం.108లో ఉన్న 15ఎకరాల భూముల్ని అప్పగించటంతో దబ్బగుంట రహదారి సమస్యకు అడ్డంకి తొలగింది. -
గోకులం ముసుగులో.. భూముల కబ్జా
● మధుపాడలో కొనసాగుతున్న కొత్తతరహా దందా ● గ్రామకంఠంలో పశుషెడ్ల నిర్మాణం ● విస్తుపోతున్న గ్రామస్తులు గంట్యాడ: అధికార బలం ఉంది.. ఆపై ప్రభుత్వ స్కీమ్ ఉంది.. చేతికి మట్టి అంటకుండా.. ఇంటిలోని డబ్బులు పెట్టుబడి పెట్టకుండా గోకులం నిర్మాణాల పేరుతో గ్రామకంఠాలను గుట్టుచప్పుడుగా కబ్జా చేసేస్తున్నారు. పశువుల షెడ్ల పేరుతో ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారు. ఈ ఆక్రమణల పర్వానికి గంట్యాడ మండలంలోని మధుపాడ గ్రామం వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే... గోకులం షెడ్ల పథకం కింద గ్రామానికి 12 షెడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఆరు షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రెండు పశువుల ఉన్న షెడ్కు రూ.1.15 లక్షలు, నాలుగు పశువుల యూనిట్ షెడ్కు రూ.1.85 లక్షలు, ఆరు పశువుల యూనిట్ షెడ్ నిర్మాణానికి రూ.2.30 లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. వీటిలో 10 శాతం రైతు వాటాకాగా, మిగిలిన 90 శాతం నిధులు ప్రభుత్వం రాయితీకింద ఇస్తుంది. ఇదే అదునుగా గ్రామానికి చెందిన కొందరు గోకులం షెడ్లను వివాదాస్పద, ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్నారు. వాస్తవంగా రైతుల సొంత జిరాయితీ భూముల్లోనే షెడ్లు నిర్మించాలి. కానీ, ఇక్కడ మాత్రం డీ పట్టాభూములు, గ్రామకంఠాలు స్వాధీనం చేసుకునే క్రమంలో పశుషెడ్లు ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పశుషెడ్లు సాక్షిగా గ్రామకంఠం భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఇది చూసిన గ్రామస్తులు నివ్వెరపోతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో... ప్రభుత్వ భూముల ఆక్రమణల పర్వం చూసి అవాక్కవుతున్నారు. తాటిపూడి రిజర్వాయర్ కింద ఉన్న కాలువ భూముల్లోనూ పశుషెడ్లు నిర్మాణాలు తలపెట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరికి ఆవులు లేకపోయినా యూనిట్లు మంజూరయ్యాయని, వారు ఆ సొమ్ముతో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విష యం అధికారులకు తెలిసినా మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. పశుషెడ్ల నిర్మాణంలో ఆక్రమణలు, అక్రమాల ఆరోపణలు తనదృష్టికి రాలేదు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయితే వెంటనే స్థల పరిశీలన చేపట్టి సంబంధితులపై తగిన చర్యలు తీసుకుంటాం. – బి.రమణమూర్తి, ఎంపీడీఓ, గంట్యాడ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
రామభద్రపురం: మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయలైన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రామభద్రపురం చొక్కాపు వీధికి చెందిన చొక్కాపు రామారావు పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై బుసాయవలస వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. దాంతో రామారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రధమ చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బాడంగి సీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
చిన్నారికి సాయం
బలిజిపేట: కిడ్నీ వ్యాధితో బాదపడుతున్న చిన్నారి భారతి కుటుంబానికి సంజీవనాయుడు సేకరించిన మొత్తం రూ.22వేలు వితరణగా అందించారు. ఈ నెల 23వ తేదీన సాక్షి దినపత్రికలో ‘సాయం కోసం చిన్నారి ఎదురుచూపు’ శీర్షికన ప్రచురితమైన కథనంకు స్పందించిన పెదపెంకి గ్రామానికి చెందిన నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకుడు సంజీవనాయుడు గ్రామస్తుల నుంచి రూ.22,616లు సేకరించారు. ఈ మొత్తాన్ని రేగిడి మండలం సంకిలి గ్రామం వెళ్లి బాధిత చిన్నారి భారతి కుటుంబానికి అందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన పెదపెంకి ప్రజలకు సంజీవనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉన్నతి లక్ష్యం..!
నీరుగారిన విజయనగరం ఫోర్ట్: స్వయం సహాయక సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల జీవనోపాధులు మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన పథకమే ‘ఉన్నతి’. పథకం రుణాల మంజూరులో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం చూపుతోంది, రుణాల మంజూరు లక్ష్యాన్ని నీరుగార్చుతోంది. జీవనోపాధుల మెరుగుకు కనీస చొరవ చూపకపోవడం లబ్ధిదారులకు శాపంగా మారింది. ఎస్సీ,ఎస్టీలను ఆదుకుంటున్నామంటూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో శూన్యమని, వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధమని ఆయా వర్గాలు విమర్శిస్తున్నాయి. ● ఇదీ పరిస్థితి.. జిల్లాలో 40,203 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 3,751 ఎస్సీ, 731 ఎస్టీ గ్రూపులు ఉన్నాయి. బీసీ గ్రూపులు 34,639, ఓసీ గ్రూపులు 1063, మైనార్టీ గ్రూపులు 19 ఉన్నాయి. జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో 4,34,667 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఎస్సీ వర్గానికి చెందిన మహిళలు 39,614 మంది, ఎస్టీ మహిళలు 7,911 మంది, బీసీలు 3,75,719 మంది, ఎస్టీలు 11,237 మంది, మైనార్టీ మహిళలు 186 మంది ఉన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఉన్నతి పథకం కింద అర్హులైన 1,837 మంది లబ్ధిదారులకు రూ.9.18 కోట్లు రుణాలు మంజూరు చేయాలి. ఇంతవరకు 676 మందికి రూ.4.31 కోట్లు ఇచ్చారు. మరో రూ.4.87 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నెలరోజులే ఉంది. నెలరోజుల్లో రూ.4.87 కోట్లు రుణాలు మంజూరు చేయడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ మహిళల ఆర్థిక ప్రగతికి ఆధారమైన రుణాల మంజూరులో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనేందుకు ఉన్నతి పథకం అమలులో నిర్లక్ష్యమే నిదర్శనమని ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ● ఒక మహిళకు రూ.50వేల వరకు రాయితీ ఉన్నతి పథకానికి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 25 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న మహిళలు అర్హులు. ఉన్నతి పథకం కింద జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. యూనిట్ విలువ ఎంత అయినా రూ.50 వేలు వరకు రాయితీ వర్తిస్తుంది. తీసుకున్న రుణంపై వడ్డీ ఉండదు. ఉన్నతి పథకం కింద డెయిరీ యూనిట్ మినహా కూరగాయలు, చీరలు విక్రయించుకునే దుకాణాలు, ఆకుల తయారీ మిషన్, పిండిమిల్లులు, ఆయిల్ మిల్లులు వంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, రుణాల మంజూరులో ప్రభుత్వ అలసత్వం మహిళలకు శాపంగా మారింది. రుణాల మంజూరుకు కొందరు మహిళల నుంచి ఖర్చుల నిమిత్తం సిబ్బంది రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా మహిళలకు అందని ‘ఉన్నతి’ పథకం రుణాలు మెరుగుపడని జీవన ప్రమాణాలు ఆవేదనలో పొదుపు మహిళలు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు -
ఏఐ ఇండియా సమ్మిట్లో చీపురుపల్లి విద్యార్థుల ప్రతిభ
విజయనగరం అర్బన్: న్యూఢిల్లీలో ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక ఏఐ ఇండియా సమ్మిట్లో చీపురుపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. పాఠశాలకు చెందిన ఆర్.హర్షిత (9వ తరగతి), పి.వి.ఎల్.ప్రణవి (8వ తరగతి) ఏఐ ప్రాజెక్టులను ప్రదర్శించారు. పాఠశాలలో ఏఐ అభ్యసన అనుభవాలను వివరించారు. జాతీయ స్థాయిలో ఏఐ ప్రాజెక్టులతో ఆకట్టుకున్న బాలికలతో పాటు గైడ్ టీచర్స్ ఎ.వి.ఆర్.డి. ప్రసాద్, పి. అనూరాధలను డీఈఓ యు.మాణిక్యంనాయుడు, జిల్లా సైన్స్ అధికారి రాజేష్, హెచ్ఎం ధనుకొండ ఉమామహేశ్వరి అభినందించారు. ఇక్కడి పాఠశాలలో గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏఐ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రొగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇన్నోవేషన్ వంటి ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇప్పించింది. విద్యార్థులు ఏఐలో రాణిస్తుండడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. -
సీఎం పర్యటనకు 1200 మంది పోలీసులతో బందోబస్తు
● రావివలస వద్ద హెలిప్యాడ్ను పరిశీలించిన రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి విజయనగరం క్రైమ్: చీపురుపల్లి మండలం రావివలసలో పింఛన్ల పంపిణీ, వ్యాక్సిన్ ప్రారంభం కోసం సీఎం చంద్రబాబునాయుడు శనివారం రానున్నారు. దీనికోసం 1200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి శుక్రవారం తెలిపారు. ఏర్పాట్లను ఇన్చార్జి ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్, సభాస్థలం, పార్కింగ్, కాన్వాయ్ వెళ్లే మార్గాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలా రావు, ఇతర పోలీస్ అధికారులు, పాల్గొన్నారు. పెద్దల ఆక్రమణలో ప్రభుత్వ భూమి సీతానగరం: మండలంలోని బగ్గందొరవలస గ్రామంలోని ప్రభుత్వ భూమిపై పెద్దల కన్ను పడింది. అంతే.. యంత్రాలతో పగలురాత్రీ తేడా లేకుండా చదును చేయించేస్తున్నారు. రూ.కోట్ల విలువైన భూమిని సాగుభూమిగా మార్చేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... బగ్గందొరవలస గ్రామంలో 1/1 సర్వే నంబర్లో 15.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దానిని గయ్యాల భూమిగా రెవెన్యూ రికార్డులో నమోదుచేశారు. దానిపై పెద్దల కన్నుపడింది. అధికార బలంతో జేసీబీల సాయంతో చదును చేసేశారు. పనిలోపనిగా పక్కనే ఉన్న మరో 4.84 ఎకరాల భూమిని ఆక్రమణదారుల చేతుల్లోకి తీసుకున్నారు. 1/8లో 1.11 ఎకరాలు, 1/10 లో 1.04 ఎకరాలు, 1/11లో 1.11 ఎకరాలు, 1/14లో 1.14 ఎకరాలు, 2/1లో 0.44 ఎకరాల భూమి బ్యాంకర్ల వేలంలో రాజమండ్రికి చెందిన భద్రగిరి దివాకర్ దక్కించుకున్నారు. దివాకర్ సంబంధిత భూమిని ఎవరికి అప్పగించారా? విక్రయించారా? తెలియదు కానీ లోకాయుక్తలో ఉన్న భూమిపై ఉన్నమట్టిని తీయడం, మడులుగా తయారుచేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆ భూమి కూడా వదలకుండా చదునుచేస్తున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆక్రమణల అంశాన్ని తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా అది ప్రభుత్వ భూమి అని, ఎవరు ఆక్రమించినా శిక్షతప్పదని హెచ్చరించారు. వీఆర్వోను పంపించి ఆక్రమణలను అడ్డుకుంటామన్నారు. పార్వతీపురం రూరల్: సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 2న విజయవాడలో నిర్వహించనున్న ‘మహాధర్నా’ను జయప్రదం చేయాల ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. కలెక్టరేట్ వద్ద గత మూడు రోజులుగా చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. -
హెచ్ఓలపై పని భారం
● ఒక హెచ్ఓ ఐదు మండలాల ఇన్చార్జ్ ● ఉద్యానవన సాగుపై నీలినీడలుసీతంపేట: జిల్లాలో హార్టీకల్చర్ ఆఫీసర్ల పోస్టులు, హార్టీకల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు ఎక్కువగా ఖాళీలు ఉండడంతో మిగిలిన వారికి పనిభారం ఎక్కువగా పడుతుంది. జిల్లాలో ఏడు ఉద్యానవనాధికారుల పోస్టులకు ఐదుగురు ఉన్నారు. వీరిలో ఒకరు ప్రసూతి సెలవులో ఉన్నారు. నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఐదు మండలాలు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యానవన సాగుపై నీలినీడలు అలముకుంటున్నాయి. దీనిలో భాగంగా సీతంపేట హెచ్ఓ పి.జయశ్రీ ఏకంగా ఐదు మండలాలు ఇన్చార్జ్ విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు సీతంపేటతో పాటు పాలకొండ, వీరఘట్టం, భామిని, గురుగుబెల్లి మండలాలు పర్యవేక్షిస్తున్నారు. మిగతా మండలాల హెచ్ఓలది కూడా ఇదే పరిస్థితి. క్షేత్ర స్థాయిలో పండ్లతోటల పెంపకం పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు వివిధ ఉద్యానవన సాగు పంటలు, కూరగాయాల పంటలపై రైతులకు సలహాలు సూచనలు ఇవ్వచం వంటివి చేయాలి. రైతులకు అవగాహన, శిక్షణ వంటివి ఏర్పాటు చేయాలి. దీంతో తలకు మించిన భారంగా పరిణమిస్తుందని లోలోపల వారు మదనపడుతున్నారు. ఇక ఉద్యానవన విస్తరణాధికారుల పోస్టుల్లో ఒక్కరు కూడా లేకపోవడంతో వీరు పనులు కూడా హెచ్ఓలే నిర్వర్తించడం గమనార్హం. -
రోడ్డు ప్రమాదంలో ఆర్మీ మాజీ హవల్దార్ మృతి
గజపతినగరం : మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ హవల్దార్ తాలాడ గోపాలరావు(70) విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కొన్నాళ్లుగా విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంలో నివాసం ఉంటున్న గోపాలరావు పనుల నిమిత్తం బీహెచ్వీ వైపు వెళ్లారు. మార్గమద్యలో జీవీఎంసీ చెత్త లోడు లారీ వెనుక భాగం నుంచి గోపాలరావు స్కూటీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించినట్టు చెప్పారు. గోపాలరావుకు భార్య రమణమ్మతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆర్మీ జవాన్ దుర్మరణం
గరుగుబిల్లి: మండలంలోని గిజబ గ్రామ పరిధిలో శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ మలుపులో గుర్తు తెలియని వాహనం గురువారం ఢీకొన్న సంఘటనలో ఆర్మీ జవాన్ దవళసింగి చంద్రమౌళి(29) మృతి చెందారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్ఐ ఫకృద్ధీన్ తెలిపిన వివరాలు.. జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన చంద్రమౌళి తన స్నేహితుని వివాహానికి బుధవారం మండంలోని వల్లరగుడబ గ్రామానికి వెళ్లాడు. తిరిగి గురువారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై శిఖబడి గ్రామం వెళ్తున్న సమయంలో గిజబ శివాలయం సమీపంలోని మలుపు వద్ద చినమేరంగి నుంచి పార్వతీపురం వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఆయన ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో పాటు కాలు విరిగి పోవడంతో ఘటనా స్థలంలోనే చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక ఎస్ఐ ఫకృద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు గంగారావు, సత్యవతి తమ కుమారుడ్ని ప్రభుత్వ ఉద్యోగిగా చేయాలనే తలంపుతో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చదివించారు. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు 2015లో నిర్వహించిన ఆర్మీ పరీక్షల్లో ప్రతిభ కనబరచి జవాన్గా ఎంపికయ్యాడు. పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్కోట్లో ఉద్యోగిగా విధులను నిర్వహిస్తున్నారు. 2022లో సునీతతో వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో నిర్వహించే అగ్నిగంగమ్మ పండగ నిమిత్తం సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. స్నేహితుని వివాహానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చేతికందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, భార్య సునీత గుండెలు పగిలేలా విలపించారు. మృతునికి ఏడాది వయస్సు గల కుమార్తె ఉంది. అందరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరున్న చంద్రమౌళి మృతితో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ప్రొఫెసర్ లోక్నాఽథ్కు గోల్డ్ మెడల్
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చెందిన ఎముకల విభాగం హెచ్ఓడీ డాక్టర్ లాడి లోక్నాథ్ గోల్డ్ మెడల్ సాధించారు. కర్నూల్లో కొద్ది రోజులు క్రితం 56వ ఎముకల వైద్యుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రానికి చెందిన సీనియర్ ఎముకలు వైద్యులు 20 మంది పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వీరిలో గోల్డ్ మోడల్ పేపర్గా డీఆర్యూజే సమస్యకు పరిష్కారాన్ని డాక్టర్ లోక్నాఽఽథ్ కనుగొన్నారు. ఇందుకుగాను ప్రెస్టీజియస్ వాగ్యేశ్వరుడు మోమోరియల్ గోల్డ్మెడల్ను ఆయనకు అందించారు. ఈ మేరకు లోక్నాఽథ్ను సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. కార్యక్రమంలో ఎముకల విభాగం వైద్యులు బాలాజీ, వంశీకృష్ణ, ప్రభు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చెక్బౌన్స్ కేసులో జైలుశిక్ష గజపతినగరం రూరల్: చెక్బౌన్స్ కేసులో నిందితుడు పూసర్ల రామలింగేశ్వరరావుకు ఏడాది జైలు, రెండు లక్షల 40 వేల రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.విజయ్రాజ్కుమార్ గురువారం తీర్పు చెప్పారు. కోర్టు కార్యాలయ సిబ్బంది అందించిన వివరాలు.. గజపతినగరానికి చెందిన కొల్లా కనకవెంకట సత్యనారాయణ అదే గ్రామానికి చెందిన పూసర్ల రామలింగేశ్వరరావుకు 2022లో 2 లక్షల 40 వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఇందుకు బదులుగా రామలింగేశ్వరరావు రూ.2,40,000 మొత్తానికి సత్యనారాయణకు చెక్కు అందజేశాడు. ఈ చెక్కు బ్యాంకులో బౌన్స్ కావడంతో సత్యనారాయణ కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో అనేక వాదోపవాదాలు అనంతరం స్థానిక మెజిస్ట్రేట్ విజయ రాజ్కుమార్ ఈ కేసుకు సంబంధించి పై విధంగా తుది తీర్పు వెల్లడించారు. పూరిల్లు దగ్ధం గుర్ల: మండలంలోని పల్లిగండ్రేడులో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పెనుమాల రాములమ్మ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. రాములమ్మ గురువారం తెల్లవారుజామున కర్రల పొయ్యిలో వంట చేస్తుండగా అగ్ని జ్వాలలు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో పురిల్లుకు తాకాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూరిల్లు మొత్తం కాలిపోయింది. స్థానికులు వచ్చి మంటలు అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో సుమారుగా రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు గొల్లుమంది. ప్రమాదం జరిగిన పురిల్లును రెవెన్యూ అధికారులు పరిశీలించారు. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా విజయనగరం క్రైమ్ : మద్యం సేవించి బైక్ నడిపి, పట్టుబడిన వాహనదారుల ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి ఆదేశాలు ఇచ్చారని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది డీడీలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 53 కేసులు నమోదు చేశారు. వారందరినీ విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా మొత్తం 53 మందికి రూ.5.30 లక్షలను జరిమానాగా విధించారని ఎస్పీ తెలిపారు. మూడు నెలల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలుశిక్ష పడిందన్నారు. హత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్స్టేషన్ పరిధి గంట్యాడలో ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కాళ్ల వెంకటరమణపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేశామని సీఐ లక్ష్మణరావు గురువారం తెలిపారు. మద్యం సేవించి కానిస్టేబుల్పై దాడి చేసి ఆపై హత్యాయత్నం చేశాడని సీఐ పేర్కొన్నారు. ఈ మేరకు గంట్యాడలో అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ కోర్టు విధించిందని సీఐ లక్ష్మణరావు పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
లక్కవరపుకోట : మండలంలోని లక్కవరపుకోట – ఖాసాపేట గ్రామాల మధ్య ఉన్న గెడ్డపై గల బ్రిడ్జి కింద వేపాడ మండలం గుడివాడ గ్రామానికి చెందిన గుడివాడ కిశోర్(19) అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మృతుడు తన స్నేహితుడు మహేష్తో కలిసి తన తాతగారి గ్రామమైన లక్కవరపుకోట మండలం కొట్యాడ గ్రామానికి బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చారు. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఖాసాపేట బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనంతో పాటూ బ్రిడ్జి కింద గల గెడ్డలో పడిపోయాడు. దీంతో ద్విచక్ర వాహనంతో పాటు మృతుడు కిశోర్ గెడ్డలో మునిగిపోయారు. అక్కడ నుంచి స్వల్ప గాయాలతో స్నేహితుడు మహేష్ కొట్యాడ గ్రామానికి గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకున్నాడు. కాగా తనకు తగిలిన దెబ్బలు, జరిగిన ప్రమాదం గురించిగాని మహేష్ బంధువులకు చెప్పలేదు. గురువారం మధ్యాహ్నం గెడ్డ సమీపంలో పశువులు కాపర్లు నీటిలో ద్విచక్ర వాహనాన్ని గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని గాలించి ద్విచక్ర వాహనాన్ని, నీటిలో మునిగిపోయిన కిశోర్ను వెలుపలకు తీశారు. మృతుడి జేబులో గల సెల్ఫోన్ ఆధారంగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడి స్నేహితుడు మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నవీన్పడాల్ తెలిపారు. భార్య మందలించిందని.. విజయనగరం క్రైమ్: కట్టుకున్న భార్య మందలించిందన్న కారణంతో భర్త పురుగుల మందు తాగి మృత్యువాత పడ్డాడు. ఇందుకు సంబంధించి విజయనగరం రూరల్ ఎస్ఐ అశోక్ గురువారం తెలిపిన వివరాలు.. కోరుకొండ పాలెంకు చెందిన సిరిపురపు వెంకటసత్యం(40) రోజూ మద్యం సేవించి ఇంటికొచ్చేవాడు. రోజూలాగే గురువారం మందుకొట్టి ఇంటికొచ్చిన భర్త సత్యాన్ని తాగుడు మానమని భార్య కాస్త మందలించింది. దీంతో కట్టుకున్న భార్యే తనను మందలించిందన్న కోపంతో మనస్తాపానికి గురై గడ్డిమందు తాగి ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్ఐ అశోక్ తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
లిక్విడ్ గంజాయి స్వాధీనం
● ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో... ● రూ. 210 కోట్ల విలువైన సొత్తు సీజ్ ● నలుగురు అరెస్ట్పార్వతీపురం రూరల్ : కొరాపుట్ జిల్లాలో పోలీసులు నిర్వహించిన వేర్వేరు దాడుల్లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఒడిశా–ఆంధ్రా సరిహద్దులోని జోలాపుట్ రిజర్వాయర్ పరిసర అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న లిక్విడ్ గంజాయి (హషీష్ ఆయిల్) తయారీ కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్లో సుమారు 1800 లీటర్ల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. వీటితో పాటు రూ.5 కోట్ల విలువైన వెయ్యి కిలోల ఎండు గంజాయిని, తయారీకి ఉపయోగించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుర్భేద్యమైన అటవీ ప్రాంతం కావడంతో నిందితులు పట్టుబడకుండా ఉండేందుకు తరచూ స్థావరాలను మారుస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసు బృందాలు రహస్యంగా పడవల్లో ప్రయాణించి, అనంతరం కాలినడకన వెళ్లి ఈ తయారీ యూనిట్పై దాడి చేశాయి. ఈ దందాకు సంబంధించి అంతరాష్ట్ర ముఠాల ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. కీలక సూత్రధారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో ఘటనలో 1143 కిలోల గంజాయి సీజ్ జిల్లాలోని నంద్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన మరో దాడిలో పోలీసులు 1143 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రెండు పికప్ వాహనాల్లో ప్లాస్టిక్ ట్రేల కింద రహస్యంగా తరలిస్తుండగా వీటిని గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ కేసులో హర్యానా రాష్ట్రానికి చెందిన ఇద్దరు రిసీవర్లు, సెమిలిగూడ ప్రాంతానికి చెందిన ఇద్దరు సరఫరాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వాహనాలను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలవరం..!
విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగులు కల్పిస్తామని చంద్రబాబు సర్కార్ గొప్పగా సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామిలను గాలికి వదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టేసి విధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తుంది. చైల్డ్లైన్ 1098 సంస్థలో పని చేసే ఉద్యోగులను చంద్రబాబు సర్కార్ అయోమయ స్థితిలోకి నెట్టేసింది. దీంతో వారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. గత మూడేళ్లుగా పని చేస్తున్న తమ ఉద్యోగాలు ఉంటాయో, ఉండవో తెలియక సతమతమవుతున్నారు. ఏజెన్సీకి అప్పగించే ప్రయత్నం 18 ఏళ్లలోపు పిల్లల రక్షణ, సంరక్షణ కోసం ఏర్పాటైన చైల్డ్లైన్ 1098 సంస్థ ఐసీడీఎస్ ఆధీనంలో నిర్వహిస్తుంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. 2023 జూలై 7వ తేదీ నుంచి వీరు పని చేస్తున్నారు. అయితే చైల్డ్లైన్ 1098 సంస్థ నిర్వాహణ బాధ్యతలను ఏజెన్సీకి ఇవ్వాలని టీడీపీ సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే టెండర్ కూడా పిలిచేసింది. ఒకటి రెండు రోజుల్లో టెండర్ కూడా ఖరారు కానుంది. టీడీపీకి చెందిన అస్మదీయులకు ఏజెన్సీని కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీకి చైల్డ్లైన్ నిర్వాహణను అప్పగిస్తే తమ ఉద్యోగాలు పరిస్థితి ఏంటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 31 వరకే కొనసాగించాలని ఆదేశాలు చైల్డ్లైన్ 1098 సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మార్చి 31 వరకు మాత్రమే కొనసాగించాలని తర్వాత చైల్డ్లైన్ 1098 సంస్థ బాధ్యతలను ఏజెన్సీ చూసుకుంటుందని ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. ఐసీడీఎస్ అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో కొత్తగా వచ్చే ఏజెన్సీ వారు ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు గుర్తించి ఏమి ప్రస్తావించలేదని తెలిసింది. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. చైల్డ్లైన్ 1098 సంస్థలో ఇద్దరు సూపర్వైజర్లు, ముగ్గురు కేస్ వర్కర్లు పని చేస్తున్నారు. వీరిలో సూపర్ వైజర్కు రూ.19,500, కేస్ వర్కర్కు రూ.15,600 చెల్లిస్తున్నారు. విధులు ఇలా... బాల్య వివాహాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ట్రోల్ ఫ్రీ నంబరు 1098కు ఫోన్ వస్తే సంబంధిత ప్రాంతానికి పోలీసులు, అంగన్వాడీ, ఐసీడీఎస్ అధికారులతో కలిసి వెళ్లి ఈ వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరమని ఇరువురి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బాల్య వివాహాన్ని నిలుపుదల చేస్తారు. తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయి దొరికినట్టయితే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లలు దొరికినట్టయితే తల్లిదండ్రులకు అప్పగించడం, బాలలను ఎవరైనా పనిలో పెట్టుకున్నట్టు సమాచారం వస్తే కార్మిక శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక దాడులు చేసి బాలలకు విముక్తి కల్పించడం, 18 ఏళ్లలోపు పిల్లలు ఆపదలో ఉంటే వారికి రక్షణ, సంరక్షణ కల్పించడం వీరి విధి. చైల్డ్లైన్ ఉద్యోగుల్లో అయోమయం 1098 నిర్వహణను ఏజెన్సీకి అప్పగించే యత్నం ఏజెన్సీ కోసం టెండర్ పిలిచిన చంద్రబాబు ప్రభుత్వం మార్చి 31తో ముగియనున్న కాలపరిమితి తమను తొలగిస్తే ఎలా బతికేదని ఆవేదన! మార్చి 31 వరకే.. ఈ ఏడాది మార్చి 31 వరకే చైల్డ్లైన్ సిబ్బందిని కొనసాగించాలని ఆదేశాలు వచ్చాయి. సిబ్బంది గురించి అందులో ఏమి చెప్పలేదు. – ఎల్.సుజాత, ఇన్చార్జ్ పీడీ, ఐసీడీఎస్ -
ముగిసిన పారా బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు
● జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటాలి : ఖలీల్ బాబు విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయనగరం రాజీవ్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న 7వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరత్ ఖాదర్ వలి బాబా పుణ్యక్షేత్రం ధర్మకర్త డాక్టర్. మహమ్మద్ ఖలీల్ బాబు హాజరై విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పారా క్రీడాకారుల సంకల్పం గొప్పదని, జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలైన వారు మార్చి 6 నుంచి 10 వరకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరగబోయే జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో పాల్గొంటారని అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు (శాప్) వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది నాలుగెస్సులరాజు పాల్గొన్నారు. -
స్కూల్ బ్యానర్ కడుతున్న యువకునికి విద్యుత్ షాక్
● తృటిలో తప్పిన ప్రాణాపాయం ● 11 కేవీ పక్కనే ఏర్పాటు చేసిన హోర్డింగ్వీరఘట్టం: స్థానిక మేజరు పంచాయతీలోని తెలగవీధి మలుపు వద్ద ఓ బిల్డింగ్పై ఉన్న హోర్డింగ్పై స్కూల్ బ్యానర్ కడుతున్న శివ అనే యువకునికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ బ్యానర్ కడుతుండగా పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు పాక్షికంగా యువకునికి తగలగా హోర్డింగ్ నుంచి కింద పడిపోయాడని స్థానికులు చెబుతున్నారు. కరెంట్ షాక్ తగలడంతో యువకుని వీపు భాగం బాగా కాలిపోయింది. ప్రమాదం బిల్డింగ్పైన జరగడంతో ఎవరూ పైకి వెళ్లేందుకు మార్గం లేక సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. అటుగా వస్తున్న కిమ్మి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నేదూరి శంకరరావు వెంటనే బిల్డింగ్ పైకి ఎక్కి క్షతగాత్రుడు శివను లైన్మెన్ అప్పలనాయుడు సహయంతో కిందకు దించాడు. తన ఆటోలో వీరఘట్టం పీహెచ్సీకి తరలించి వైద్య సేవలు అందేలా చేశాడు. అనంతరం 108 వాహనంలో క్షతగాత్రుడుని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడడంతో పాటు ఆసుపత్రికి తన ఆటోలో తీసుకువెళ్లిన డ్రైవర్ శంకరరావును అందరూ అభినందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడు బలజిపేట మండలం గంగాడ గ్రామానికి చెందిన పెదపెంకి శివగా గుర్తించారు. ప్రమాదకరంగా హోర్డింగ్... స్థానిక మేజరు పంచాయతీలోని తెలగవీధి జంక్షన్ వద్ద ఓ బిల్డింగ్పై కడుగుతున్న హోర్డింగ్ ప్రమాదకరంగా ఉందని, పక్కనే 11 కేవీ విద్యుత్ వైర్లు ఉన్నాయని, అనుమతులు లేకుండా కడుతున్న ఈ హోర్డింగ్ను తొలగించాలని ఈ నెల 13న సాక్షిలో కధనం ప్రచురితమైంది. సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇటువంటి ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. మరో ప్రమాదం జరగక ముందే పంచాయతీ అధికారులు, ట్రాన్స్కో అధికారలు స్పందించి ఈ హోర్డింగ్ను తొలగించాలని పలువురు కోరుతున్నారు. -
పరీక్ష కేంద్రాల్లో డీఆర్ఓ తనిఖీ
పార్వతీపురం రూరల్: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ తీరును జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) కె.హేమలత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ఆర్.కె.జూనియర్ కళాశాల, పి.ఎస్.ఎం.వాసవి జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఆమె, పరీక్షల సరళిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గదుల్లోని గాలి, వెలుతురు, తాగునీరు వంటి కనీస సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్న్ అమలులో ఉన్నందున ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మాల్ప్రాక్టీస్కు తావులేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బంది ఎవరూ సెల్ఫోన్లు లోపలికి తీసుకురాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఆయన వెంట కళాశాలల ప్రిన్సిపాళ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 222 మంది గైర్హాజరు జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 8,395 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వై.నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. జనరల్ విభాగంలో 6,067 మందికిగాను 5,968 మంది, వొకేషనల్ విభాగంలో 2,550 మందికిగాను 2,427 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 8,617 మంది విద్యార్థులకుగాను 222 మంది గైర్హాజరైనట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. -
మాజీ మంత్రి జోగి రమేష్కు ఎమ్మెల్సీల పరామర్శ
నెల్లిమర్ల రూరల్: మాజీ మంత్రి జోగి రమేష్ను ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు, పాలవలస విక్రాంత్ గురువారం పరామర్శించారు. ఇటీవల కొంతమంది టీడీపీ నాయకులు, పచ్చమూకలు రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసంలో కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇంటిని తగలబెట్టి కుటుంబ సభ్యులను హతమార్చే కుట్ర జరిగిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలన్నారు. ప్రశ్నించే గొంతుకులను నొక్కేసే ప్రయత్నం చంద్రబాబు సర్కార్కు సరికాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
తప్పని డోలీ కష్టాలు
శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల ప్రజలకు డోలీ కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రోడ్డు కష్టాలు తీరడం లేదు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హడావుడి చేయడమే తప్ప చేసిన పనులు కనిపించడంలేదంటూ గిరిజనులు ఆరోపిస్తున్నారు. అత్యవసర వేళ వైద్యం కోసం రాళ్లదారిలో కిలోమీటర్ల మేర డోలీలో రోగులను తరలించాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గురువారం ఉదయం ఎస్.కోట పంచాయతీ శివారు రేగపుణ్యగిరి గ్రామానికి చెందిన గమ్మెల రేవతి ఉదయం జీడితోటలో పనిచేస్తుండగా విషపురుగు కాటుకు గురైంది. స్పృహకోల్పోయింది. ఆమెను స్థానికులు డోలీ సాయంతో హుటాహుటిన ఎస్.కోటలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె కోలుకోవడంతో తిరిగి సాయంత్రం డోలీలో గిరిశిఖరాన ఉన్న గ్రామానికి తరలించారు. ఓట్లు దండుకోవడం మినహా తమ కోసం పాలకులు చేసింది శూన్యమని గ్రామస్తులు జి.సంజు, ఎం.నాగేశ్వరరావు, బి.చిన్న, ఎం.కృష్ణ, వి.రాములమ్మ, తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
పోలిపల్లి పైడితల్లి జాతర ఆదాయం రూ. 27.15 లక్షలు
రాజాం సిటీ: ఎంతో వైభవంగా నిర్వహించిన పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతవార్షిక జాతర ఆదాయం రూ.27,15,381లు సమకూరిందని ఈఓ బీవీ మాధవరావు తెలిపారు. ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు జరిగిన జాతరలో వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల అమ్మకంతో రూ.4,62,600, శీఘ్రదర్శనం టికెట్ల విక్రయంతో రూ.3,94,500, మొక్కుబడుల రూపంలో రూ.1,75,240, కానుకలు రూపంలో రూ.1,78,711లు, అద్దాలు, బరినెలు విక్రయించగా రూ.5వేలు, ప్రసాదం విక్రయంతో రూ.92వేలు, మూడు నెలల ఆదాయంతో కలిపి హుండీల నుంచి రూ.14,07,330ల ఆదాయం వచ్చిందన్నారు. గతేడాది రూ.23,94,054లు రాగా ఈ ఏడాది అదనంగా రూ.3,21,327లు వచ్చిందని వెల్లడించారు. లెక్కింపు ప్రక్రియలో సీఎఫ్ఓ, నవదుర్గ ఆలయ ఈఓ పి.శ్యామలరావు, ఆలయ ట్రస్టీ వాకచర్ల దుర్గాప్రసాద్, వాకచర్ల పైడిరాజు, అర్చకులు వేమకోటి సూర్యనారాయణశర్మ, సలాది తులసీదాస్, వెంపల లక్ష్మణరావు, ఆర్నిపల్లి వెంకటినాయుడు, భక్తులు పాల్గొన్నారు. -
కలలన్నీ కన్నీరుగా మారి..
గంట్యాడ: ఆమెకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి. గ్రామీణ క్రీడ అయిన కుస్తీ (రెజ్లింగ్) పోటీలపై మక్కువ పెంచుకుంది. ఇంటర్ చదువుతున్న రోజుల్లో కఠోర సాధన చేసింది. జాతీయ స్థాయి పోటీల్లో తలపబడి ప్రతిభ చూపింది. పతకాలతో మెరిసింది. రక్షణ దళాల్లో చేరి దేశసేవలో తరించాలని తలచింది. ఆమె ఆశలపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆశలన్నీ అడియాసలుగా మిగిల్చింది. ఈ నెల 6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన కుస్తీ క్రీడాకారిణి వర్రి హేమలత కాలిని తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు తొలగించడంతో కన్నీరుపెడుతోంది. ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురు చూస్తోంది.ఆటలో దిట్ట..హేమలత బరిలో దిగిందంటే ప్రత్యర్థిలో వణుకుపుట్టాల్సిందే. రెండేళ్లపాటు నిరంతర సాధనతో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. అదే దూకుడుతో జాతీయ స్థాయిలో ఎనిమిది టోర్నమెంట్లలో పాల్గొని మెరుగైన ప్రదర్మనతో గుర్తింపు పొందింది. సైనికురాలిగా దేశానికి సేవ చేయాలన్న సంకల్పం ఆమె అడుగులకు బలం ఇచ్చింది. అవకాశాలు త్రుటిలో చేజారినా నిరాశకు లొంగకుండా ముందుకు సాగింది. ఈ నెల 6న ఉద్యోగ దరఖాస్తు కోసం నగరానికి వెళ్తుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. క్షణాల్లోనే కుడి కాలిపై వాహన చక్రం దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన హేమలత ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు కుడి కాలును పూర్తిగా తొలగించారు. మరిన్ని శస్త్రచికిత్సలు అవసరమని తెలిపారు. కాలు కోల్పోయినా ఆమె మనసు మాత్రం కూలలేదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మధ్య జీవితం వైపు మళ్లీ నిలబడాలని తపిస్తోంది.సర్కారు ఆదుకుంటే..ఆశలకు రెక్కలు..ప్రతిభావంతురాలైన ఈ యువ క్రీడాకారిణికి ప్రభుత్వం సహాయం అందించాలని గ్రామస్తులు కుటుంబీకులు వేడుకుంటున్నారు. ప్రమాదం అడుగులను ఆపేసినా... సంకల్పాన్ని కాదు. జీవిత పోరాటంలో హేమలత మళ్లీ గెలుస్తుందనే ఆశతో అందరూ ఎదురు చూస్తున్నారు. -
న్యాయంచేసే వరకు పోరాటం
ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు తక్షణమే అమలుచేయాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీతాల పెంపు, వేసవి సెలవులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఖాళీ పోస్టులు తక్షణమే భర్తీచేయాలన్నారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రమణమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, టి.వి.రమణ, కోశాధికారి జగన్మోహన్, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్ -
‘ఆశ’లు నెరవేర్చండి..
ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని సంఘ జిల్లా కార్యదర్శి బొత్స సుధారాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఇన్చార్జి డీఎంహెచ్ఓ కె.రాణికి వినతి పత్రం అందజేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ను ఆశ వర్కర్లుగా మార్చాలన్నారు. సమాన వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. అన్నిరకాల సెలవులు మంజూరు చేయాలని, దహన సంస్కారాల ఖర్చులు చెల్లించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశ వర్కర్ల సంఖ్యను పెంచాలని, పీహెచ్సీకి వెళ్లిన ప్రతి సందర్భంలో టీఏ, డీఏలు ఇవ్వాలని, రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పించాలని, నాణ్యమైన మొబైల్స్, యూనిఫాం ఇవ్వాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 5వ తేదీన విజయవాడలో ధర్నా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో డి.ఆశాభాను, కె.సత్యవతి, వి.మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్ -
122 పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదన
● డీఆర్వో మురళి విజయనగరం కలెక్టరేట్: జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఇ.మురళి తెలిపారు. తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ తొందరగా పూర్తిచేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలన్నీ బీఎల్ఏలను నియమించుకోవాలన్నారు. ఓటర్ల సవరణల జాబితాల ప్రకారం ఫిబ్రవరి 26 నాటికి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారని , ఇందులో రెండుచోట్ల ఓట్లు కలిగిన వారు 2,975 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. విచారణ అనంతరం వీరి ఓట్లను ఒకచోట ఉంచి మరో చోట తొలగిస్తామని చెప్పారు. జిల్లాలో 1847 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటికి ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు వి.నర్సింహమూర్తి, ఎ.శ్రీనివాసరెడ్డి, సీహెచ్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు
విజయనగరం క్రైమ్: చీపురుపల్లి మండలం రావివలస పంచాయతీలో ఈ నెల 28న సామాజిక పింఛన్ల పంపిణీకి సీఎం చంద్రబాబునాయుడు రానున్నారు. ఈ మేరకు భద్రతాఏర్పాట్లను ఇన్చార్జి ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి గురువారం పర్యవేక్షించారు. సీఎం పర్యటన స్థలాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందరరెడ్డి, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పరిశీలించారు. హెలిప్యాడ్, ప్రజావేదిక, పెన్షన్లు పంపిణీ చేసే ఇళ్లు, కార్యకర్తలతో సమావేశం కానున్న ప్రాంగణాన్ని సందర్శించారు. పరిశీలనలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ జి.శంకరరావు, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
ప్రతి ఫైల్కు ఒక రేటు... అదే ఆ సెక్షన్ రూటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పొరపాటునో.. గ్రహపాటులో ఏవైనా భూములు వివాదాస్పద భూముల జాబితాలో చేరితే వాటిని రెవెన్యూ అధికారులు సరి చేస్తారు. అసలు హక్కుదారులకు భూమిని.. యాజమాన్య హక్కు పత్రాలను అందిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. వివాదాలు పరిష్కరించుకోండి అంటూ ప్రభుత్వం ఇచ్చిన ఒక సర్క్యులర్ను ఆధారం చేసుకుని విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారులు చెలరేగిపోతున్నారు. ఆ సర్క్యులర్ను అడ్డం పెట్టుకుని తమకు నచ్చిన వారి ఫైళ్లు... దశాబ్దాలుగా పరిష్కారంకాని ఫైళ్లను వెతికి మరీ సెటిల్ చేసేస్తున్నారట. దానికి ప్రతిగా రూ.లక్షల్లో... ఇంకా పెద్ద ఫైల్ అయితే రూ.కోట్లలో బేరాలు కుదుర్చుకుని క్లియర్ చేస్తున్నట్టు సమాచారం. గతంలో తలపండిన రెవెన్యూ అధికారులు సైతం టచ్ చేయడానికి భయపడిన వివాదాస్పద భూములకు చెందిన ఫైళ్లను నేడు సునాయాసంగా క్లియర్ చేసేసి తమ ఉడతాభక్తిని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో అందిన ముడుపులు జిల్లాలోని ఒక ప్రధాన సెక్షన్ అఽధికారుల నుంచి పైస్థాయి అధికారులకు, పాలకులకు అందజేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.వివాదాస్పద భూమి ఫైల్కు ఇప్పుడు కదలిక..అప్పటి అధికారులకు తప్పు అనిపించిన ప్రక్రియ ఇప్పుడు అధికారులకు ఒప్పు అనిపించింది. అంతే 22ఏ జాబితా నుంచి తొలిగించడానికి పైల్రెడీ చేసేశారు. తహసీల్దార్, ఆర్డీఓ, సెక్షన్ సూపరింటెండెంట్ ఫైల్ సిద్ధం చేసి కలెక్టర్కు పంపినట్లు సమాచారం. ఈ విషయంలో డీఆర్వో, జేసీ సంతకాలు చేయనట్లు తెలిసింది. సెక్షన్ సూపరింటెండెంట్ నుంచి నేరుగా కలెక్టర్ మెయిల్కు పంపారన్న చర్చ సాగుతోంది. ఈ విషయంలో భారీగా కాసులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఫైల్ మీద ఇప్పటివరకు సంతకాలు చేసిన అందరికీ సదరు నేత డబ్బులు ఇచ్చారని రెవెన్యూ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయం సమర్దించుకునేందుకు కూడా అధికారులు రెడీగా ఉన్నట్లు సమాచారం. 22ఎ జాబితా నుంచి అర్హులు భూములు తొలిగించడానికి ప్రభుత్వం జనవరి 1న ఒక సర్కిలర్ జారీ చేసింది. ఈ ప్రకారం ఈ బాధ్యత ఆర్డీఓలు, తహసీల్దార్లకు ఇచ్చింది. ముందే జాగ్రత్తపడిన కలెక్టరేట్లో కొందరు అధికారులు ఫైల్లు తొందరగా క్లియర్ చేస్తున్నట్లు చెప్పడం ఇందులో ఒకటి. రెండోది మాజీ సైనికుల వద్ద సరైన ఆధారం ఉంటే 22ఎ నుంచి తొలగించాలని ప్రభుత్వ ఆదేశం ద్వారా సమర్దించుకోవడం. ఏదైనా కాసులు చేతులు మారడం, భూమి మారిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.భూమి కథ ఇదీ..భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూలో సర్వే నంబర్ 21, 27లో ఉన్న ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని దశాబ్దాల కిందట నలుగురు రైతులకు మాజీ సైనికుల కోటాలో ఇచ్చినట్లు అధికారులు చెబుతున్న మాట. ఒక్కొక్కరికి 1.5 ఎకరాల చొప్పున ఇచ్చినట్లు రికార్డులో నమోదు చేశారు. వాస్తవానికి వారు కూడా మాజీ సైనికులు కాదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ భూ మిని పోలిపల్లికి చెందిన అధికార పార్టీ నాయ కుడు ‘రాజు’లా వ్యవహరిస్తూ తన సోదరుడు పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ మేరకు ఫైనల్ చెక్ ఆపరేషన్ (ఎఫ్సీఓ) రికార్డులో నమోదు చేశారు. కానీ తర్వాత అధికారులు ఆ భూమిని ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా 22ఎలో చేర్చారు. ఇదంతా జరిగి దాదాపు 15 ఏళ్లు గడిచిపోయింది. అప్పటినుంచి ‘సత్యం’ను మరుగున పెట్టి ఆ భూమికి 22ఏ జాబితా నుంచి తొలగించాలని అధికారులను అడుగుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు అక్కడ పని చేసిన తహసీల్దార్లు ఫైల్ పంపలేదు. తహసీల్దార్ పంపినా ఆర్డీఓలు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చినా కలెక్టరేట్లో సెక్షన్ సూపరెండెంట్ నుంచి డీఆర్వో, జేసీ, కలెక్టర్లలో ఎక్కడో చోట ఆగడంతో పని జరగలేదు. -
ఐసీడీఎస్ పీడీగా బాలామణి బాధ్యతల స్వీకరణ
విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ విజయనగరం ప్రాజెక్టు డైరెక్టర్గా కొత్తకోట వెంకట బాలామణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పీడీగా బాధ్యతలు స్వీకరించిన బాలామణికి సీడీపీఓలు, కార్యాలయం ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఇక్కడ పీడీగా పనిచేసిన విమలారాణి మెడికల్ లీవు పెట్టడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు బాలామణిని నియమించారు. ఈమె కర్నూలు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు ఏసీడీపీఓగా పనిచేసి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. లబ్ధిదారులకు శతశాతం పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. 665 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం విజయనగరం ఫోర్ట్: జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి 665 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. బాడంగిలో 10 ఎకరాల్లోను, బొండపల్లి మండంలో 25, దత్తిరాజేరులో 200, గజపతినగరంలో 230, నెల్లిమర్లలో 70, రామభద్రపురంలో 130 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగినట్టు గుర్తించారు. పాలకేంద్రం ఆకస్మిక తనిఖీ పూసపాటిరేగ: భోగాపురం మండల కేంద్రంలోని పాలకేంద్రాన్ని జిల్లా ఆహారభధ్రతా అధికారి ఎస్.కె.నాగుల్మీరా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాల కేంద్రంలో శాంపిల్స్ సేకరించారు. ల్యాబ్కు పంపిస్తామని, నివేదికలో కల్తీ జరిగినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాలను కల్తీ చేయకుండా కేంద్రాలకు పాలు సరఫరా చేయాలని రైతులకు సూచించారు. సీతంపేట: గిరిజనుల నుంచి సేకరించిన కొండచీపుర్లు, కుంకుడికాయలు, నల్లజీడి, పసుపుకొమ్ముల విక్రయానికి వచ్చేనెల 4న సీతంపేట ఐటీడీఏలో అడ్వాన్స్ టెండర్లు నిర్వహిస్తామని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు సెల్:88972 23650ను సంప్రదించాలని కోరారు. -
భర్త ప్రేరేపించడంతోనే మాధవి ఆత్మహత్య
బొబ్బిలి: స్థానిక కుమ్మరివీధికి చెందిన మాధవీదేవిని తన భర్త నిత్యం వేధించడంతో పాటు చనిపొమ్మని కూడా పలుమార్లు అనడం, తగాదా పడ్డ రోజు కూడా అదే విధంగా వేధించడంతో ఆమె ఉరి వేసుకుని మృతి చెందిందని సీఐ కె.నారాయణరావు అన్నారు. స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుడు మర్రి నరేష్ను అరెస్టు చేసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైతన్య స్కూల్లో గణితోపాధ్యాయినిగా పని చేస్తున్న మాధవీదేవిని తరచూ అనుమానంతో వేధించడమే కాకుండా సిబ్బంది ఎప్పుడయినా ఫోన్ చేసినా వివాహేతర సంబంధం అంటగట్టేవాడన్నారు. తరచూ కొట్టేవాడన్నారు. నీ బాధలు భరించలేకపోతున్నాను చనిపోతానంటే నువ్వు చనిపో అనేవాడన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న రాత్రి గొడవ జరిగిందని, మాధవీదేవి తను చనిపోతానంటే నువ్వు చనిపో అని పలుమార్లు నరేష్ అనడంతో ఆమె అక్కడున్న ఊయల వైర్కు ఉరి వేసుకుని మృతి చెందిందన్నారు. వెంటనే మాధవీదేవి చిన్నాన్న కుమారుడుకి ఫోన్ చేసి మీ చెల్లి ఉరి పోసుకుంది అని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మాధవీదేవి మృతి చెందినట్టు వైద్య సిబ్బంది ధృవీకరించారన్నారు. నరేష్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని సీఐ చెప్పారు. ఎస్సై ఆర్.రమేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. మనస్తాపంతో యువతి ఆత్మహత్యా యత్నం పార్వతీపురం రూరల్: పట్టణంలోని ఒక హోటల్లో వెయిటర్గా పని చేస్తున్న యువతి, గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే, సదరు యువకుడి సెల్ఫోన్లో వేరొకరితో సన్నిహితంగా ఉన్న సందేశాలను (మెసేజ్లు) చూసిన ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో చీమల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. దీనిని గమనించిన సన్నిహితులు హుటాహుటిన ఆమెను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
ఆల్ ఇండియా తైక్వాండో పోటీలకు అభిలాష్
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి అవంతీ సెయింట్ థెరిసా ఇంజినీరింగు కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ట్రిపుల్ ఈ విభాగం విద్యార్థి జె.అభిలాష్ ఆల్ ఆండియా తైక్వాండో పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రన్సిపాల్ జె.బాలభాస్కరరావు తెలిపారు. ఈ నెల 24వ తేదీన విశాఖపట్నం చైతన్య ఇంజినీరింగు కళాశాలలో గురజాడ స్పోర్ట్సు కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఎన్టీయూ గురజాడ అంతర కళాశాల యూనివర్సిటీ సెలక్షన్ ట్రయల్స్ పోటీల్లో 54 కేజీల విభాగంలో అభిలాష్ ప్రతిభ చాటారన్నారు. ఒడిశా రాష్ట్రంలోని డీఏవీ యూనివర్సిటీ జలంధర్లో మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే ఆల్ ఇండియా తైక్వాండో పోటీల్లో అభిలాష్ ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపారు. అభిలాష్ను ప్రిన్సిపాల్ డా.బాలబాస్కరరావుతో పాటుగా వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ, ఏఓ జి.అనిల్కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు సీహెచ్.శంకరరావుటివి.సోంబాబులు అభినందించారు. బైక్ల దొంగ అరెస్ట్ ● ఆరు బైక్ల స్వాధీనం విజయనగరం క్రైమ్ : విజయనగరం పరిధిలో పలుచోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడిన నిందితుడు గుమ్మడి ఆదినారాయణను బుధవారం అరెస్టు చేసినట్టు టూ టౌన్ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. సుంకరి వీధిలో ఉంటున్న ఆదినారాయణను అరెస్టు చేసి ఆరు మోటారుసైకిళ్లను రికవరీ చేశామని చెప్పారు. వన్టౌన్, టూటౌన్ పీఎస్ పరిధిలో ఇటీవల పలు బైక్లు పోయామంటూ ఆయా బైక్ల యజమానులు స్టేషన్లలో ఫిర్యాదు చేశారన్నారు. టూ టౌన్ పీఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజి ద్వారా నిందితుడిని గుర్తించి బాబామెట్ట వద్ద పట్టుకున్నామని తెలిపారు. రికవరీ చేసిన మోటారుసైకిళ్ల విలువ సుమారు రూ.2.5లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటకు చెందిన వాడని, గడిచిన ఆరేళ్ల నుంచి విజయనగరం సుంకరివీధిలో కుటుంబంతో ఇక్కడే ఉంటున్నాడని తెలిపారు. డ్రైవరుగా పని చేస్తూ హ్యాండిల్ లాక్ వేయని మోటారుసైకిళ్లను దొంగిలించి తాకట్టుపెట్టి డబ్బులు సంపాదించడం వృత్తిగా అలవాటు చేసుకున్నాడని తెలిపారు. వన్టౌన్లో మూడు కేసుల్లో మూడు మోటారుసైకిళ్లు, టూటౌన్లో మూడు కేసుల్లో మూడు మోటారుసైకిల్లు దొంగిలించాడని చెప్పారు. వీటిని కోర్టు ఆదేశాలతో బైక్ యజమానులకు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ప్రమీలాదేవి పాల్గొన్నారు. -
పాలల్లో నాణ్యత ఎంత..!
విజయనగరం ఫోర్ట్: మానవుని జీవనాధారంలో గాలి, నీరు మాదిరి పాలు కూడా తప్పనిసరి. ప్రతీ రోజు ఆహారంలో భోజనంతో పాటు పాలు తాగడం కూడా అలవాటు చేసుకున్నారు. పసి పిల్లలు దగ్గర నుంచి పెద్దవారు వరకు అందరికి పాలు అవసరం పెరిగింది. సమాజంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. అయితే రాజమండ్రిలో జరిగిన ఘటనతో జనంలో వణుకు మొదలైంది. కల్తీపాలు తాగడం కారణంగా ఇప్పటికే ఐదుగురు మృత్యువాత పడగా, మరికొంతమంది ప్రాణాప్రాయ స్థితిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలు తాగుతున్న పాలల్లో నాణ్యత ఎంత దానిపై సర్వత్రా సందేహాం నెలకొంది. పాలు, పాల ఉత్పత్తులు నాణ్యమైనవేనా, నాణ్యత లేనివా.. అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం పరుస్తున్నారు. పాల వినియోగం ఎక్కువే.. ప్రతీ ఇంటిలోనూ నిత్యం పాలు, పాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా పాలు వినియోగించని ఇల్లు ఏది ఉండదు. ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగడానికి పాలు వినియోగిస్తారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, ఇలా ప్రతీ ఒక్కరూ పాలు తాగుతారు. అదే విధంగా వివిధ డెయిరీలు పాలతో వివిధ ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నారు. కోవా, బ్రెడ్, మజ్జిగ, నెయ్యి, పన్నీరు, బిస్కెట్స్, లస్సీ వంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. వీటిలో పాల ప్యాకెట్లు కూడా 200 మి.లీ నుంచి, అరలీటరు, లీటరు పాల ప్యాకెట్లు వివిధ డెయిరీ కంపెనీలు ఔట్లెట్స్ పెట్టి విక్రయిస్తున్నారు. అనుమతులు లేకుండానే విక్రయాలు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు డెయిరీ పాల ప్యాకెట్లు కంటే వ్యాపారులు బైక్లపై తెచ్చి విక్రయించే పాలును ఎక్కువగా కొనుగోలు చేస్తారు. పాడి రైతులు దగ్గర నుంచి కొనుగోలు చేసి తెస్తారని వీరి దగ్గర ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే ఇలా పాలు విక్రయించేవారు ఎటువంటి అనుమతులు లేకుండా విక్రయించడం గమనార్హం. పాలు, పాల ఉత్పత్తులపై కొరవడిన పర్యవేక్షణ రాజమండ్రి ఘటన చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. ప్రజలు ఆహారంలో ప్రధానమైన పాలు తాగడం వల్ల మనుషులు చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పడు ఎక్కడ చూసినా పాలు, పాల ఉత్పత్తులపై చర్చ జరుగుతుంది. వివిధ డెయిరీలు, పాలు, ఉత్పత్తులపై పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెయిరీలు, పాల వ్యాపారులు విక్రయించే పాలు సురక్షితమైనవేనా, లేదా పాలు చిక్కగా, రుచిగా కనిపించడానికి యూరియా, ఇతర రసాయనాలు ఏమైనా కలుపుతున్నారా.. అనే తనిఖీలు చేపట్టిన దాఖలా లు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలు తా గడం సురక్షితమేనా.., లేదంటే ప్రాణపాయామా.. అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఏడాదికి 8.36 లక్షల మెట్రిక్ టన్నులు పాల ఉత్పత్తి జిల్లాలో 4,75,805 పాడి పశువులు ఉన్నాయి. వీటిలో ఆవులు 3,77,960, గేదెలు 97,845 ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి 8,36,800 మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలో వివిధ పాల డెయిరీలు, వ్యాపారులు ద్వారా ఏడాదికి 3,65,000 మెట్రిక్ టన్నులు పాల సేకరణ జరుగుతుంది. జిల్లాలో సుమారుగా 19 లక్షల మంది జనాభా ఉన్నారు. ఒక వ్యక్తికి 570 ఎం.ఎల్ పాలు రోజుకి అవసరం పడుతుంది. రాజమండ్రి ఘటనతో జిల్లా ప్రజల్లో టెన్షన్ జిల్లాలో ఏడాదికి 8.36 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి డెయిరీలు, పాల వ్యాపారులు సేకరిస్తున్నది 3.65 లక్షల మెట్రిక్ టన్నులు డెయిరీలు, పాల వ్యాపారులు విక్రయించే పాలు, ఉత్పత్తులపై కొరవడిన పర్యవేక్షణ ఎటువంటి అనుమతులు లేకుండా పాలు విక్రయించేస్తున్న వ్యాపారులునాణ్యత తనిఖీ చేయాలి.. వివిధ డెయిరీలు, పాల వ్యాపారులు విక్రయించే పాలు, వాటి ఉత్పత్తుల నాణ్యతను ఆహార తనిఖీ అధికారులు చేపట్టాలి. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సి ఉంది. – డాక్టర్ మురళీకృష్ణ, జేడీ, పశు సంవర్ధక శాఖ శాంపిల్స్ తీశాం.. జిల్లాలో వివిధ డెయిరీలు విక్రయించే పాల ప్యాకెట్ల నుంచి శాంపిల్స్ తీశాం. వాటిలో నాణ్యత లోపించినట్టు కనిపించలేదు. – ఈశ్వరి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, విజయనగరం -
రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ మూడో ఫ్లాట్ఫామ్పై గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు బుధవారం కనుగొన్నారు. షాలీమార్–చైన్నె వెళ్తున్న ట్రైన్ నుంచి జారి పడినట్టు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ బాలాజీ తన సిబ్బందిని ఘటనా స్థలికి పంపించారు. మృతుని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బైక్ ఢీకొని రైతు దంపతులకు గాయాలు వీరఘట్టం: మండలంలోని నడిమికెల్ల గ్రామానికి చెందిన వూళ్ల రామారావు ,ప్రమీల దంపతులు తమ పొలంలో పనులు ముగించుకుని ఇంటికి నడిచి వెళుతుండగా రమేష్ అనే వ్యక్తి బైక్తో వారిని ఢీకొట్టడంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. నడిమికెల్ల సీఎస్పీ రహదారిపై వెళుతున్న వీరిద్దరినీ మద్యం మత్తులో బైక్తో వస్తున్న వ్యక్తి వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను వైద్య చికిత్సల కోసం వీరఘట్టం పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం తరలించారు. ఈ ప్రమాదంపై జిల్లా ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ షణ్ముఖరావు తెలిపారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
● ప్రారంభమైన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలు ● నేడు విజేతలకు బహుమతుల ప్రదానం విజయనగరం: ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం వేదికగా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. నగరంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన 148 మంది పారా క్రీడాకారులు పాల్గొనగా.. పోటీలను రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆర్థో, వీల్చైర్ కేటగిరీ క్రీడాకారులకు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించగా... క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు శాయశక్తులా కృషి చేశారు. రెండురోజుల పాటు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు గురువారం బహుమతులు ప్రదానం చేయనుండగా... ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల ను మార్చి 6 నుంచి 10వ తేదీవరకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరగనున్న జాతీయస్థాయి పారా బాడ్మింటన్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక చేస్తామని పారా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవాధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. పోటీలను ప్రారంభించిన రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు పరిశీలకులుగా స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ప్రతినిధి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. పోటీలను వివిధ జిల్లాలకు చెందిన పారా క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు పర్యవేక్షించారు. -
గంజాయి రహిత సమాజమే లక్ష్యం : డీఐజీ
విజయనగరం క్రైమ్ : గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పోలీసు శాఖ చర్యలు చేపడుతోందని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాధ్ జెట్టి అన్నారు. తన రేంజ్ పరిధిలో ఐదు జిల్లాల ఎస్పీలతో ఆయన బుధవారం సమీక్షించి 20 నెలల ప్రగతి నివేదికను వెల్లడించారు. 2024 జూన్ నుంచి 2026 జనవరి వరకు రేంజ్ పరిధిలో ఐదు జిల్లాలో సాగిన గంజాయి వ్యతిరేక పోరాట వివరాలను వివరించారు. మొత్తం 24 అంతర్రాష్ట్ర ముఠాలను గుర్తించి, 129 మంది సభ్యులపై నిరంతర నిఘా ఉంచామన్నారు. వారి ఆర్థిక మూలాలపై దెబ్బ తీసే విధంగా సుమారు రూ.9.19 కోట్ల ఆస్తుల జప్తు చేశామన్నారు. ఇప్పటివరకు 14 మంది ప్రధాన నిందితులకు సంబంధించి రూ.9,19,17,290 విలువైన ఆస్తులను గుర్తించి, వాటిని ఫ్రీజ్ చేస్తూ కన్ఫర్మేషన్ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు జి.ఆర్.ఆర్.మోహన్, వి.విష్ణు స్వరూప్, ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, బి.మోహనరావు, పరవాడ ఇన్స్పెక్టర్ ఆర్.మల్లికార్జునరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్.బాల సూర్యారావు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
భర్త ప్రేరేపించడంతోనే మాధవి ఆత్మహత్య
బొబ్బిలి: స్థానిక కుమ్మరివీధికి చెందిన మాధవీదేవిని తన భర్త నిత్యం వేధించడంతో పాటు చనిపొమ్మని కూడా పలుమార్లు అనడం, తగాదా పడ్డ రోజు కూడా అదే విధంగా వేధించడంతో ఆమె ఉరి వేసుకుని మృతి చెందిందని సీఐ కె.నారాయణరావు అన్నారు. స్థానిక పోలీసుస్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుడు మర్రి నరేష్ను అరెస్టు చేసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైతన్య స్కూల్లో గణితోపాధ్యాయినిగా పని చేస్తున్న మాధవీదేవిని తరచూ అనుమానంతో వేధించడమే కాకుండా సిబ్బంది ఎప్పుడయినా ఫోన్ చేసినా వివాహేతర సంబంధం అంటగట్టేవాడన్నారు. తరచూ కొట్టేవాడన్నారు. నీ బాధలు భరించలేకపోతున్నాను చనిపోతానంటే నువ్వు చనిపో అనేవాడన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న రాత్రి గొడవ జరిగిందని, మాధవీదేవి తను చనిపోతానంటే నువ్వు చనిపో అని పలుమార్లు నరేష్ అనడంతో ఆమె అక్కడున్న ఊయల వైర్కు ఉరి వేసుకుని మృతి చెందిందన్నారు. వెంటనే మాధవీదేవి చిన్నాన్న కుమారుడుకి ఫోన్ చేసి మీ చెల్లి ఉరి పోసుకుంది అని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మాధవీదేవి మృతి చెందినట్టు వైద్య సిబ్బంది ధృవీకరించారన్నారు. నరేష్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని సీఐ చెప్పారు. ఎస్సై ఆర్.రమేష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. మనస్తాపంతో యువతి ఆత్మహత్యా యత్నం పార్వతీపురం రూరల్: పట్టణంలోని ఒక హోటల్లో వెయిటర్గా పని చేస్తున్న యువతి, గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. అయితే, సదరు యువకుడి సెల్ఫోనన్లో వేరొకరితో సన్నిహితంగా ఉన్న సందేశాలను (మెసేజ్లు) చూసిన ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో చీమల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. దీనిని గమనించిన సన్నిహితులు హుటాహుటిన ఆమెను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. సీఐ నారాయణరావు -
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎమ్మెల్సీల పరామర్శ
నెల్లిమర్ల రూరల్: మాజీ మంత్రి అంబటి రాంబాను ఎమ్మెల్సీలు డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు, పాలవలస విక్రాంత్ బుధవారం పరామర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇటీవల అరెస్టు కాబడి బెయిల్పై విడుదలైన రాంబాబును గుంటూరులోని ఆయన నివాసంలో కలిసి యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలనే ధోరణి సరికాదన్నారు. మాజీ మంత్రిని అన్యాయంగా అరెస్ట్ చేసి, ఇంట్లో మహిళలు ఉన్న సమయంలో దాడికి తెగబడడం బాధాకరమన్నారు. అక్రమ అరెస్ట్లతో ప్రశ్నించే గొంతులను ఆపలేరన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బొలెరో వ్యాన్
చికెన్● మూడు బైక్ల ధ్వంసం ● మహిళకు తీవ్ర గాయాలు బొండపల్లి: వర్షం పడుతుందని తాటాకు టీకొట్టులో తలదాచుకున్న మహిళపై విద్యుత్ స్తంభం పడడంతో తీవ్ర గాయాలు కావడంతో పాటు మూడు బైక్లు ధ్వంసం అయిన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్ఐ యు.మహేష్ తెలిపిన వివరాలు.. మండలంలోని బిల్లలవలస జంక్షన్ వద్ద పూరి పాకలో నిర్వహిస్తున్న టీకొట్టుకు అనుకోని ఉన్న విద్యుత్ స్తంభాన్ని మానాపురం నుంచి విజయనగరం పశువులు లోడుతో వెళ్తున్న బొలెరో వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగి పడటంతో అక్కడ పార్కు చేసి ఉన్న మూడు బైక్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే ప్రమాదంలో విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన రెడ్డి సింహచలంకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో విజయనగరంలోని కేంద్ర ఆస్పత్రికి తరలించారు. స్తంభాన్ని ఢీకొట్టిన తరువాత వ్యాన్ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారైనట్టు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
టమోటా ధరలు ఢమాల్
బొబ్బిలి: నెలరోజుల కిందట కిలోకు రూ.50ల పైనే పలికిన టమోటా ధరలు నేడు రూ.5కి పడిపోయాయి. పండగ సీజన్ ఉన్నంత వరకూ ఆకాశంలో ఉన్న టమోటా ధరలు పెళ్లిళ్ల సీజన్ సమీపించిన తరుణంలో ధరలు తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నా రు. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతులతో పాటు ఉత్తరాంధ్ర నుంచి ఎగుమతి చేసుకునే ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా టమోటా ఉత్పత్తులు పెరగడంతో అన్ని ప్రాంతాల్లో ధరలు తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతులకు అవకాశం లేక ధరలు నేలచూపులు చూస్తున్నాయని పేర్కొంటున్నారు. రైతు వద్ద కిలోకు రూ.5కు కొనుగోలు చేసిన వ్యాపారులు వినియోగదారులకు రూ. 10కి విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రాఫ్ట్ పద్ధతిలో 80 ఎకరాల్లోను, సాధారణ సాగులో 300 ఎకరాల్లో టమోటా సాగవుతోంది. సాధారణ సాగులో హెక్టారుకు 25 నుంచి 30 టన్నులు, గ్రాఫ్ట్ పద్ధతిలో 50 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. బొబ్బిలి, రామభద్రపురం, రాజాం, చీపురుపల్లి, ఎస్.కోట, విజయనగరం, గజపతినగరం ప్రాంతాల్లో టమోటా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఒత్తిడికి గురయ్యే వైద్య విద్యార్థులను గుర్తించాలి
● ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్విజయనగరం ఫోర్ట్: ఒత్తిడికి గురియ్యే వైద్య విద్యార్థులను ముందుగా గుర్తించి వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను బుధవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య విద్యార్థులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వైద్య విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఒకపై అటువంటి పరిస్థితి రాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమాజంలో కొత్త కొత్త జబ్బులు వ్యాప్తి చెందుతున్నాయని, వీటిపై వైద్య విద్యార్థులు పరిశోధన చేయాలన్నారు. వైద్య రంగంలో వచ్చే ఆధునాతన సాంకేతిక పద్ధతులు గురించి వైద్య విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం నుంచి బేసిక్ లైఫ్ సపోర్టుపై వైద్య విద్యార్థులకు చెప్పాలన్నారు. అనంతరం వైస్ చాన్సలర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎం.జయచంద్రనాయుడు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేవీమాధవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లోక్నాధ్, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తదితరులు పాల్గొన్నారు.


