breaking news
Vizianagaram
-
అతి కిరాతకంగా భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త..
విజయనగర జిల్లా: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలో వరుసగా హత్యలు జరగడంతో నగర ప్రజలు హడలెత్తుతున్నారు. ఇటీవల తాలూకాలోని కారిగనూరు వద్ద పురుషుడు, కమలాపుర సమీపంలోని వెంకటాపుర క్యాంప్లో వివాహిత హత్య ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు హత్య కేసులను మరువక ముందే నగరంలోని చాపలగడ్డ ప్రాంతంలో మంగళవారం ఉదయం మరో మహిళ గొంతు కోసి హత్య చేసిన ఘటన నగరంలో చర్చనీయంగా మారింది. హత్యకు గురైన మహిళ ఉమా (35) నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చాపలగడ్డ ప్రాంతవాసి. ఆమె భర్త ఖాజా హుస్సేన్ ని చిత్తవాడ్గి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే రెండో పెళ్లి.. ఉమాకు 13 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్కు చెందిన రఘు అలియాస్ రామాంజినితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉమా గత 6 ఏళ్లుగా తన భర్త నుంచి విడిపోయి చాపలగడ్డలోని తన ఇంట్లో ఉంటోంది. ఉమా నాలుగు నెలల క్రితం నగరానికి చెందిన ఖాజా హుస్సేన్ అనే వ్యక్తిని పరిచయం చేసుకొని కొండనాయకనహళ్లిలోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకొంది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో ఖాజా హుస్సేన్ కోపోద్రేకంలో ఉమాను కత్తితో గొంతు కోసి చంపినట్లు చిత్తవాడిగి పోలీసులు తెలిపారు. విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి, ఏఎస్పీ మంజునాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై చిత్తవాడిగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.భర్తపై భార్య దాడి బనశంకరి: రెండో భార్యను వదిలేయాలని మొదటి భార్య.. భర్తపై (రౌడీషిటర్) దాడికి పాల్పడింది. ఈ ఘటన జేజే నగర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. దాడికి గురైన భర్త మొదటి భార్యపై జేజే నగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. జేజే నగర నివాసి సయ్యద్ అస్గర్ చోరీలు, డ్రగ్స్ విక్రయాల కేసులో జైలు పాలయ్యాడు. ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్యను వదిలేయాలని భర్త సయ్యద్ అస్గర్ను మొదటి భార్య కోరింది. భర్త ఒప్పుకోక పోవడంతో మొదటి భార్య దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ అస్గర్ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేజే నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జాతర నాటికి నిర్మాణం పూర్తిచేస్తాం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ పనులు పైడితల్లి సిరిమాను జాతర నాటికి పూర్తిచేస్తామని దేవదాయశాఖ రాష్ట్ర కమిషనర్ కె.రామచంద్రమోహన్ అన్నారు. అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను మంగళవారం స్వీయపర్యవేక్షణ చేశారు. బాలాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చుట్టుపక్కల సేకరించిన స్థలాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా నిర్మాణాలు చేయాలన్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ సహాయ కమిషనర్, పైడితల్లి ఆలయ ఇన్చార్జి ఈఓ కె.శిరీష, ఉపకార్యనిర్వహక ఇంజినీరు కేవీసీ కృష్ణ, సహాయ ఇంజినీరు సాయికృష్ణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
బినామీ రవాణా ఏజెన్సీలపై చర్యలు తీసుకోండి
● మంత్రి నాదెండ్లకు రైతు సంఘం నాయకుల వినతి విజయనగరం ఫోర్ట్/డెంకాడ/భోగాపురం/బొండపల్లి: జిల్లాలోని రైతులు వాహన చార్జీలు చెల్లించి ధాన్యాన్ని మిల్లులకు తరలించారని, పీఏసీఎస్ సిబ్బంది బినామీ రవాణా ఏజెన్సీల ద్వారా ఆ చార్జీలను దుర్వినియోగం చేశారని ఏపీ రైతు సంఘం కార్యదర్శి బి.రాంబాబు, ఆదినారాయణ ఆరోపించారు. వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు జెడ్పీ అతిథిగృహంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. మంత్రి డెంకాడ మండలం పెదతాడివా డ, భోగాపురం, బొండపల్లి మండలోని రాచకిండాం గ్రామాల్లో పర్యటించారు. ధాన్యం కొనుగోళ్లుపై ఆరా తీశారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను సంక్రాంతికి ముందే రైతు ల ఖాతాలకు జమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యంను మిల్లుకు తరలించే క్రమంలో చాలా చోట్ల మిల్లర్లు ఇబ్బందులు కలిగిస్తు న్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అధికారులు అటువంటివారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు జిల్లా రైతుల నుంచి రూ.607కోట్లు విలువైన ధాన్యం సేకరించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగమాధవి, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఢిల్లీరావు, కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జేసీ సేతుమాధవన్, పౌర సరఫరాల జిల్లా మేనేజెర్ శాంతి, ఆర్డీఓ కీర్తి పాల్గొన్నారు. -
పాపం.. పసిబిడ్డ..!
● చెత్త కుండీపక్కన శిశువు మృతదేహం లభ్యం జామి: పాపం.. ఏ కన్నతల్లి బిడ్డో.. తల్లిపేగు తెగనేలేదు.. కళ్లు తెరవక ముందే మృతశిశువుగా మారింది. తల్లిప్రేమకు దూరమై చెత్తకుప్పల్లో దర్శనమిచ్చింది. ఈ హృదయవిదారక చిత్రం జామి మండలం ఎం.కె.వలస గ్రామంలో మంగళవారం కనిపించింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొటాన పార్వతి ఆవులు కట్టేందుకు వెళ్తూ చెత్తకుండీ పక్కనే ఉన్న మగ శిశువు మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు తెలియజేసింది. వారు పోలీసులకు, వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ వీరజనార్దన్, అలమండ పీహెచ్సీ వైద్యాధికారి వినీ త, ఐసీడీఎస్ సూపర్వైజర్ రామయ్యమ్మ ఘటనా స్థలానికి చేరుకుని శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున శిశువు మృతదేహాన్ని పడేసి ఉంటారని వైద్యాధికారి తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డ మృతిచెందితే ఖననం చేయా ల్సింది పోయి ఇలా చెత్తకుండీలో పడేయడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ వైఎస్సార్సీపీదే..
విజయనగరం రూరల్: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కృషి చేసినది నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదని, 100 శాతం క్రెడిట్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ధర్మపురిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 4న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి అంతర్జాతీయ వాణిజ్యవ్యాలిడేషన్ విమానం ల్యాండ్ కావడం ఆనందంగా ఉందన్నారు. ఎప్పుడూ వెనుకబడిన ప్రాంతమని చెప్పుకునే ఉత్తరాంధ్రకు నేడు ప్రపంచపటంలో ఓ స్థానం దొరికిందన్నారు. భోగాపురంలో రూ.4,500 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కృషి చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన జీఎంఆర్ సంస్థకు, నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయ నిర్మాణానికి ఎయిర్పోర్ట్ అథారిటీకి కౌలువాడ, సవరవిల్లి, కంచేరు, రావాడ, గూడెపువలస, ఎ.రావివలస రెవెన్యూ గ్రామాల్లో 2756.15 ఎకరాల భూ బదలాయింపు జరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్, తాగునీరు, ఫెన్సింగ్ నిర్మాణం, భూ బదలాయింపు జరిగిన భూముల్లో 5 గ్రామాల ప్రజలకు పునరావాసం, ఇతరత్రా పనులకు అప్పటి ప్రభుత్వం రూ. 900 కోట్లు మంజూరు చేసిందని జెడ్పీ చైర్మన్ తెలిపారు. భూసేకరణ, న్యాయచిక్కులు తదితర అన్ని అడ్డంకులు తొలగి, ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న అప్పటి సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. 2024 ఎన్నికల ముందే విమానాశ్రయం పనులు సుమారు 40 శాతం పూర్తయ్యాయని, జీఎంఆర్ సంస్థతో ఒప్పందాలు, నిర్మాణ పనుల ప్రగతి అంతా ఆ సంస్థ వెబ్సైట్ తెరిస్తే తెలుస్తుందన్నారు. ● చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెట్టడంలో ఆరితేరిపోయారని, ఇదంతా రాష్ట్ర ప్రజలకు ఎరుకేనని అన్నారు. రైతులకు యూరియా ఇవ్వలేని నాయకులు విమానాశ్రయం నిర్మించారంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నాటి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపనలో ఉన్నానని అంటున్నారని, ఒక్కసారైనా దీనిపై సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు. ● జీఎంఆర్ సంస్థ అన్ని అనుమతులు పొంది విమానాశ్రయం నిర్మాణం పనులు వేగవంతం చేస్తే, విమానాశ్రయానికి అన్ని ప్రాంతాల అనుసంధానానికి వీలుగా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది శూన్యమన్నారు. కేవలం విశాఖ నుంచి 7 రోడ్లు కనెక్టివిటీ అని చెబుతున్నా ఇప్పటివరకు 10 శాతం పనులు పూర్తి కాలేదని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు ఆరోపించారు. వేరొకరి పథకాలకు పేరుమార్చి కొనసాగించడం, వేరొకరి చేపట్టిన అభివృద్ధిని తమ గొప్పగా చెప్పుకోవడం టీడీపీ నాయకుల నైజమని విమర్శించారు. ముందుగా ప్రజా సంక్షేమం, పాలనపై దృష్టి సారించాలని, విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన పనులను మంజూరు చేసి, వాటిపై దృష్టి సారించాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి బీచ్ కారిడార్ అభివృద్ధికి 6 వేల కోట్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు ఫొటోలకు ఫోజులు, ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజాసంక్షేమంపై దృషి లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జైహింద్కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణ, పతివాడ అప్పలనాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ● అప్పుడే మౌలిక సదుపాయాల కల్పన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే తలంపుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి బీజం పడింది 2020 జూన్ 12న అని, దీనికి సంబంధించి జీఎంఆర్ సంస్థ రాష్ట్ర ఏపీఏడీసీతో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఒప్పందం చేసుకుని, ఎల్వోఏ తీసుకున్నారని తెలిపారు. జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్సస్ కింద నిర్మాణానికి ముందుకు వచ్చారని తెలిపారు. విమానాశ్రయం నిర్మాణానికి 100 శాతం కృషి చేసింది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని అనుమతులు పూర్యయ్యాక 2023లో శంకుస్థాపన మౌలిక వసతుల కల్పనకు వైఎస్సార్సీపీ హయాంలో రూ.900 కోట్లకు పైగా ఖర్చు జీఎంఆర్ సంస్థ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉంటాయి 18 నెలల కాలంలో చంద్రబాబు సర్కారు చేసింది శూన్యం రైతులకు యూరియా ఇవ్వలేరు.. విమానాశ్రయం నిర్మాణమా? ఎవరో చేసిన అభివృద్ధిని తానే చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు -
దివ్యాంగత్వం 40 శాతం లోపుంటే పింఛన్ కట్
● డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి రామభద్రపురం: ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దివ్యాంగత్వం 40 శాతం లోపు ఉన్నవారికి పింఛన్ ఇవ్వబడదని డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రామభద్రపురం మండలం కొట్టక్కిలో నిర్మించిన వ్యవసాయ గోదాంను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు మంజూరువుతుందని, వితంతువులకు కొత్తగా పింఛన్ మంజూరుకు ఉత్తర్వులు రాలేదన్నారు. 40 శాతంలోపు దివ్యాంగత్వం ఉన్నవారు మళ్లీ సదరం ధ్రువపత్రం తెచ్చుకోవాలని నోటీసులు జారీచేశామన్నారు. జిల్లాలో 28 ఎఫ్పీఓల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. పంటల నిల్వకు వీలుగా గోదాంల నిర్మింస్తామని చెప్పారు. వసతిగృహం సదుపాయాలపై ఆరా రామభద్రపురం: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమమే లక్ష్యమని జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ ఎం.అన్నపూర్ణ అన్నారు. రామభద్రపురంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఆమె సందర్శిచారు. వసతిగృహం ఆవరణతో పాటు రికార్డులు పరిశీలించారు. వంట గది నిర్వహణ, మెనూ అమలు తీరుపై ఆరా తీశారు. వేడివేడి భోజనం వడ్డించాలని వసతి గృహం నిర్వాహకుడు జి.వెంకటరమణకు సూచించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 30 వసతి గృహాలు 2,098 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ట్యూటర్లను నియమించామని చెప్పారు. గతేడాది 97 శాతం ఫలితాలు సాధించామని, ఈ ఏడాది శతశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ట్యూటర్లకు ఈ ఏడాది జూలై నుంచి రెమ్యూన్రేషన్ రాలేదని, త్వరలో వచ్చే అవకాశం ఉందన్నారు. వైభవంగా రాములోరి తిరువీధి నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ సీతారామస్వామివారి తిరువీధి ఉత్సవాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని పల్లకిలో గ్రామ పురవీధుల్లో ఊరేగింపుచేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు విజయనగరం అర్బన్: సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి భీమవరం, కాకినాడ, రాజమండ్రి, రావులపాలెం, విజయవాడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా సాధారణ చార్జీలతో ప్రత్యేక సర్వీసులు వేసినట్టు పేర్కొన్నారు. ‘ఏపీఎస్ఆర్టీసీఆన్లైన్.ఐఎన్’ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రయాణికులు రెండు వైపులా ఒకేసారి టికెట్ బుక్చేసుకుంటే 10 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. -
వైభవంగా పెదపోలమాంబ ప్రధానోత్సవం
● నేడు అనుపోత్సవం మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మేనత్త, పెదపోలమాంబ అమ్మవారి ప్రధానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. చదురుగుడిలో అమ్మవారి ఘటాలకు బంగారుపూత పూసి, పూజలు నిర్వహించారు. చ దురుగుడి నుంచి అమ్మవారి ఘటాలను మేళతాళా లు, మంగళవాయిద్యాలు, భక్తులు జయజయధ్వానాల మధ్య శంబర గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద నున్న అమ్మవారి గద్దెవద్దకు తీసుకువచ్చారు. ముందుగా రెవిన్నాయుడు, పూడి,కరణం, కుప్పిలి వారింటికి ఆనవాయితీ ప్రకారం అమ్మవారి ఘటాలు చేరుకున్నాయి. అక్కడ పూజలు జరిపించిన అనంతరం గ్రామంలోని అన్నివీధుల్లో అమ్మవారి ఘటాలకు తిరువీధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 9.30గంటల సమయానికి అమ్మవారి గద్దె వద్దకు అమ్మవారి ఘటాలు చేరుకుంటాయి. గద్దెవద్ద అమ్మవారికి ఉయ్యాల కంబాల కార్యక్రమం నిర్వహించి, అనంతరం అనుపోత్సవం చేపడతారు. శంబరపోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తెచ్చేందుకు బుధవారం చాటింపు వేస్తారు. కార్యక్రమంలో ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్బోర్డుచైర్మన్ తిరుపతిరావు, సభ్యులు, మాజీట్రస్ట్బోర్డు చైర్మన్లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
టార్పాలిన్లు ఎక్కడ?
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తుఫాన్ సమయంలో పంట తడిసిపోకుండా రైతులకు గతేడాది ఇచ్చిన అరకొర టార్పాలిన్లు కూడా తిరిగిరాకపోవడంతో వ్యవసాయ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. రైతుల నుంచి సేకరించిన టార్పాలిన్లను టీడీపీ నాయకులు ఉంచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం తెలిసినా అధికారులు అడగలేకపోతున్నారంటూ ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అవసరం తీరాక రైతులు తిరిగి అప్పగించినా.. నాయకులు ఉంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది తుఫాన్ సమయంలో రైతులకు సుమారు వెయ్యి టార్పాలిన్లు అందజేయగా తిరిగి వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు పదుల సంఖ్యలో మాత్రమే చేరాయి. ఇప్పుడు ఈ టార్పాలిన్లపై ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతామని సిబ్బంది మదనపడుతున్నారు. కొందరు మాత్రం అధికార పార్టీ నాయకులే టార్పాలిన్లు ఉంచుకున్నారన్న విషయాన్ని చెప్పేద్దామని చెబుతుంటే.. మరికొందరు వారి నోరునొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి.తారకరామారావు వద్ద ప్రస్తావించగా వెయ్యి టార్పాలిన్లను మండల వ్యవసాయశాఖ అధికారులకు అందించామని, తిరిగి ఎన్ని వచ్చాయన్నది వారికే తెలుస్తుందన్నారు. ఈ ఏడాది టార్పాలిన్ల సరఫరాను ఏఎంసీకి అప్పగించారని తెలిపారు. గంట్యాడ మండలంలో గతేడాది 42 టార్పాలిన్లు వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి తుఫాన్ సమయంలో రైతులకు అందించారు. వీటిలో 20 మాత్రమే వెనుకకు వచ్చాయి. మిగిలిన 22 ఎక్కడ ఉన్నాయో వ్యవసాయ సిబ్బందికి తెలియని పరిస్థితి. విజయనగరం మండలంలో 8 టార్పాలిన్లు అందజేయగా ఒక్కటీ వెనుకకు రాలేదు. -
ఎలక్ట్రిక్ బగ్గీ విరాళం
విజయనగరం రూరల్: జేఎన్టీయూ, గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ మేనేజ్మెంట్ (ఏఐటీఏఎం) కళాశాల మంగళవారం ఎలక్ట్రిక్ బగ్గీని విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో ఉపకులపతి వీవీ సుబ్బారావు బగ్గీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బగ్గీ విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ ఎలక్ట్రిక్ బగ్గీ అందించిన ఏఐటీఎఎం యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, బగ్గీ రూపొందించడానికి కృషి చేసిన ఏఐటీఏఎం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఇటువంటి నూతన ఆవిష్కరణలు చేపట్టి సమాజానికి, దేశానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. ఇటువంటి నూతన ఆవిష్కరణలు చేపట్టి మిగిలిన విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థులు రూపొందించిన బగ్గీని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి సుబ్బారావు స్వయంగా నడిపారు. ఈ బగ్గీలో రిజిస్ట్రార్ జి.జయసుమ, ఏఐటీఎఎం డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు బి.రాజేష్ ప్రయాణించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ జీవీ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసంపై ఫిర్యాదు
రామభద్రపురం: మండలంలోని ఆరికతోటలో ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజనేయ స్వామి విగ్రహ ధ్వంసానికి పాల్పడిన ఘటనపై చర్యలు తీసుకోవాలని గ్రామపెద్దలు, ప్రజలు, హిందూ భక్తులు మంగళవారం బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, తహసీల్దార్ అజూ రఫీజాన్లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ఆరికతోట నుంచి పాతరేగ గ్రామానికి వెళ్లే జంక్షన్ పక్కన ఉన్న స్థలం యజమాని బోదంకి రామేశ్వరరావు గడిచిన 40 ఏళ్ల క్రితం ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించారు. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత గజపతినగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సత్యనారాయణకు ఆ స్థలం విక్రయించగా ఆంజనేయ విగ్రహం ఆ స్థలంలో నిర్మాణాలకు అడ్డుగా ఉందన్న ఉద్దేశంతో రియల్ఎస్టేట్ వ్యాపారి ఆ విగ్రహాన్ని గునపాలతో తవ్వేసి ఇటీవల తొలగించాడు. దీంతో గ్రామ పెద్దలు, ప్రజలు, హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తంచేసి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన స్థల యజమానిపై చర్యలు తీసుకుని మళ్లీ విగ్రహం ప్రతిష్టించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ భవ్యరెడ్డి, సీఐ కె. నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావులు స్పదించి ఆరికతోట గ్రామ పెద్దలు, ప్రజలతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించిన బాధ్యుడు సత్యనారాయణను స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిచి విచారణ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మళ్లీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించేలా చర్యలు తీసుకోవాలని గ్రామపెద్దలు వారి అభిప్రాయం తెలియజేయగా, పూర్తి దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని డీస్పీ చెప్పారు. -
9న జిల్లాస్థాయి నృత్య పోటీలు
పార్వతీపురం: జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు–2026ను పురస్కరించుకుని నృత్యపోటీలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ పోటీలు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పోటీలను రెండు కేటగిరీల్లో నిర్వహించాలని 15ఏళ్ల లోపు వారు ఒక కేటగిరిలోను 15ఏళ్లకంటే ఎక్కువ ఉన్నవారిని రెండో కేటగిరిగా విభజించనున్నట్లు తెలిపారు. పోటీల్లో గిరిజన నృత్యాలు, జానపద నృత్యాలు, దేశభక్తి నృత్యాలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి పోటీలను జనవరి 7లోగా నిర్వహించి విజేతలను ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి విజేతలకు జిల్లాస్థాయిలో జనవరి 9న మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ. 2,500లు, తృతీయ బహుమతి రూ.1500లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డీఈఓను నోడల్ అధికారిగా నియమించి ఎంపీడీఓలు, ఎంఈఓలు, సాంస్కృతిక కమిటీ సభ్యులతో ఈ పోటీలను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. -
పంట మార్పిడి విధానంతో ప్రయోజనాలు
● జిల్లా వ్యవసాయ అధికారిణి అన్నపూర్ణకురుపాం: పంట మార్పిడి విధానంతో రైతులకు పలు ప్రయోజయనాలు కలుగుతాయని జిల్లా వ్యవసాయాధికారిణి రెడ్డి అన్నపూర్ణ అన్నారు. ఈ మేరకు కురుపాం మండలంలోని దురిబిలి గ్రామంలో ఖరీఫ్లో వరి పంట తరువాత పంట మార్పిడి విధానంలో భాగంగా రబీలో ప్రధాన పంట మినుముతో పాటు పెసలు, వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు, కూరగాయలు, ఆకుకూరలు, తదితర 12 రకాల పంటలు సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడి విధానం రైతులు పాటించడం వల్ల భూమి సారవంతం చెందుతుందని, పంటలకు పురుగులు, తెగుళ్లు తట్టుకునే సామర్థ్యం కలిగి, అధిక దిగుబడులు సాధించే అవకాశం కలుగుతుందన్నారు. మొక్కలలో జీవవైవిద్యం పెంపొందుతుందని చెప్పారు. మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ నేల చిన్న పదును ఉన్నా ఏదో ఒక పంట వేస్తే మధ్యలో వర్షం చిన్నగా పడినా, లేదా మంచు ద్వారా పంట ఎంతో కొంత వస్తుందని, భూమి ఖాలీగా ఉండకుండా చూసుకోవాలని అందరూ రైతులు తమకున్న పూర్తిస్థాయి విస్తీర్ణంలో పంట సాగు చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏఈఓ భార్గవ్, మాస్టర్ ట్రైనర్ బి.శ్రీరామ్, సత్యం, రైతులు పాల్గొన్నారు. -
రెండు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
● జిల్లాకేంద్రంలోని ఎత్తు బ్రిడ్జిపై ప్రమాదం ● మినీవ్యాన్ను ఢీకొన్న బైక్ ● బోల్తాపడిన వ్యాన్విజయనగరం క్రైమ్: స్థానిక ఎత్తు బ్రిడ్జిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. కొత్తవలస నుంచి బలిజిపేటకు మట్టి పెంకులను తీసుకువెళ్తున్న మినీవ్యాన్ను ఎదురుగా సాలూరు నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో వ్యాన్ రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్ను ఢీ కొట్టిన ద్విచక్రవాహన చోదకుడు ఘటనా స్థలి నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో సాలూరు రోడ్డు నుంచి విజయనగరం వస్తున్న హైవే మొత్తం వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రెండు గంటల పాటు ఎత్తు బ్రిడ్జి ప్రాంతంలో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదంలో గాయాల పాలైన మినీ వ్యాన్ డ్రైవర్ గోపీని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
క్రీడా పోటీలు
ఉత్సాహంగా అంతర్ కళాశాలల చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో అంతర కళాశాలల క్రీడా సాంస్కృతిక పోటీలు ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగుతున్నాయి. కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను ఆధ్వర్యంలో జరుగుతున్న 14వ విశ్వవిద్యాలయ క్రీడాసాంస్కతిక పోటీల్లో వివిధ కళాశాలల నుంచి 530 మంది విద్యార్థులు పాల్గొనగా మంగళవారం పలు కళాశాలలకు చెందిన విద్యార్ధులకు పలు క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. ఈ క్రీడా పోటీల్లో తొలి దశలో బాలుర విబాగంలో వాలీబాల్ క్రీడాంశంలో గరివిడి, ప్రొద్దుటూరు కళాశాలలు విజేతగా నిలిచాయి. కేరమ్స్లో గన్నవరం వెటర్నరీ కళాశాల, టేబుల్ టెన్నిస్లో తిరుపతి, గరివిడి వెటర్నరీ కళాశాలలు విజేతలుగా నిలిచాయి. వాలీబాల్ రెండో దశలో ప్రొద్దుటూరు కళాశాల విజేతగా నిలిచింది. అదేవిధంగా బాలికల విబాగంలో బాస్కెట్బాల్, వాలీబాల్ క్రీడాంశాల్లో గరివిడి వెటర్నరీ కళాశాల విజయం సాధించగా బాల్ బ్యాడ్మింటన్లో గన్నవరం వెటర్నరీ కళాశాల, టేబుల్ టెన్నిస్లో తిరుపతి వెటర్నరీ కళాశాల విజయం సాధించాయి. -
విజయనగరం విజేత
వీరవాసరం: కీర్తిశేషులు కొల్లా భాస్కరమ్మ, గుండా లక్ష్మీ రత్నావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరవాసరంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి. 25 జిల్లాల నుంచి వచ్చిన కబడ్డీ జట్లు అత్యద్భుత ప్రతిభ చూపగా విజయనగరం జిల్లా జట్టు మొదటి స్థానం సాధించి విజేతగా నిలిచింది. 2వ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా, 3వ స్థానంలో కృష్ణా, అనంతపురం (కంబైన్డ్) జట్లు నిలిచాయి. విజేతలకు రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ ట్రోఫీలను అందజేశారు. చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడి మృతి డెంకాడ: మండలంలోని వెలంపేట గ్రామానికి చెందిన ఒనుము పాపయ్య(42) తాటిచెట్టు పైనుంచి పడిపోయి మరణించినట్లు ఎస్సై ఎ.సన్యాసినాయుడు మంగళశారం తెలిపారు. వెలంపేట గ్రామం శివారులో ఉన్న తాటిపెండిలో తాటిచెట్టు ఎక్కి పడిపోయిన పాపయ్య తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన పాపయ్యను చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తల్లి ఒనుము తౌడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
● గురుకులాల జిల్లా సమన్వయకర్త చీపురుపల్లి: సమాజంలో ప్రతి అంశంలోనూ పారదర్శకతే లక్ష్యంగా ఏర్పడిన సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలు, పాఠశాలల జిల్లా సమన్వయకర్త ఎం.మాణిక్యం అన్నారు. చీపురుల్లి పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో మంగళవారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో పని చేస్తున్న ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వచ్చాక వ్యవస్థల్లో పారదర్శకత పెరిగిందన్నారు. గురుకుల కళాశాలలు, పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది చట్టంపై పూర్తిస్థాయిలో పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎ.రాణీశ్రీ పాల్గొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేతసంతకవిటి: మండలంలోని మల్లయ్యపేట గ్రామంలో సోమవారం సాయంత్రం 980 కేజీల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ ఎస్సై బి.రామారావు పట్టుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మూల కృష్ణమూర్తి అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో దాడి చేసి స్వాధీనం చేసుకుని స్థానిక డీలర్కు అందజేశారు. పట్టుకున్న బియ్యం విలువ దాదాపు రూ.44,500 అని విజిలెన్స్ ఎస్సై బి.రామారావు తెలిపారు. రోడ్డు ప్రమాద మృతుడి గుర్తింపువిజయనగరం క్రైమ్: పట్టణ సమీప ధర్మపురిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడిని గుర్ల మండలానికి చెందిన పిన్నింటి రాంబాబుగా పోలీసులు మంగళవారం గుర్తించారు. ఎంవీజీఆర్ కాలేజీవద్ద రాడ్ బైండింగ్ షాప్లో పని చేస్తున్న ధర్మపురికి చెందిన ముగ్గురు వ్యక్తులు ధర్మపురం నుంచి బైక్పై విజయనగరం వస్తుండగా విజయనగరం నుంచి ధర్మపురికి జావా బైక్పై వస్తున్న వ్యక్తి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై హాస్పిటల్కు తీసుకువెళ్తుండగా రాంబాబు మృతిచెందాడని ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించామన్నారు. -
బరోడా, పంజాబ్ జట్ల విజయం
విజయనగరం రూరల్: బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–15 మహిళల వన్డే టోర్నీలో (ఎలైట్ గ్రూప్) బరోడా, పంజాబ్ జట్లు విజయం దుందుభి మోగించాయి. స్థానిక విజ్జి క్రికెట్ మైదానంలో బరోడా, హైదరాబాద్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో బరోడా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి నిర్ణీత 35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు సాధించింది. హైదరాబాద్ జట్టు ఓపెనింగ్ బ్యాటర్లు పి.శాన్వి (44 పరుగులు), భవిష్యరెడ్డి (41 పరుగులు) తొలి వికెట్కు 16 ఓవర్లలో 80 పరుగులు భాగస్వామ్యం అందించారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమవడంతో స్వల్ప స్కోర్కే పరిమితమవుతుంది. అనంతరం 138 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా జట్టు 24.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి 141 పరుగులు చేసి విజయం సాధించింది. 27 పరుగుల తేడాతో పంజాబ్ విజయం డెంకాడ మండలంలోని చింతలవలసలో గల డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రికెట్ మైదానంలో పంజాబ్, విదర్భ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్లో 27 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు నిర్ణీత 35 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించింది. అనంతరం 167 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ జట్టు 33.1 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ పంజాబ్ బౌలర్లలో కౌర్ సంధూ 3 వికెట్లు, ఆస్తా 4 వికెట్లు సాధించి జట్టు విజయానికి కృషి చేశారు. -
జాతీయ స్థాయి పోటీలకు బాలికల పాఠశాల విద్యార్ధిని
విజయనగరం అర్బన్: న్యూఢిల్లీలో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు రాష్ట్రం తరఫున పోటీపడే జట్టులో పట్టణంలోని దాసన్నపేటకు చెందిన ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థిని ఎన్.లావణ్య ఎంపికై ంది. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.రమణమ్మ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో 38 కేజీల విభాగంలో లావణ్య బంగారు పతకం సాధించి ఈ పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో లావణ్యను ప్రధానోపాధ్యాయురాలితో పా టు సీనియర్ ఉపాధ్యాయులు ఈ.రామునాయుడు, వ్యాయామ ఉపాధ్యాయురాలు పి.ప్రమీల, బి.ఆషారాణి, సీహెచ్వీ రత్నం అభినందించారు. -
ప్రచారం మీదా?
ఘనత మాది..● ప్రభుత్వంపై మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే ధ్వజంపార్వతీపురం రూరల్: గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు, ఆస్పత్రులు, ప్రాజెక్టులకు రంగులు మార్చి, రిబ్బన్లు కట్ చేసి తామే నిర్మించామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఎద్దేవా చేశారు. ఈ మేరకు పార్వతీపురంలోని ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అప్పుల్లో రికార్డు..అభివృద్ధిలో శూన్యం అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. గత ప్రభుత్వంపై అప్పుల నిందలు వేసిన వారు, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వద్ద క్యూ కట్టి మరీ అప్పులు తెస్తున్నారని దుయ్యబట్టారు. సాలూరు ఆస్పత్రికి ఒక్క ఇటుక కూడా వేయని మంత్రి, ఇప్పుడు 80 శాతం పనులు పూర్తయిన తర్వాత తానే కట్టించానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పనులను నిలిపివేసి, పార్టీ మారితేనే రోడ్లు వేస్తామంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘పర్మిషన్లు తెచ్చింది జగన్..ఫోజులు బాబువి భోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు ‘క్రెడిట్ చోర్’లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జోగారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2019కి ముందు ఎలాంటి అనుమతులు లేకుండా కొబ్బరికాయ కొట్టిన చంద్రబాబు, ఇప్పుడు తానే విమానాశ్రయాన్ని కట్టానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కోర్టు కేసులను పరిష్కరించి, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు సాధించి, 2,751 ఎకరాల భూసేకరణ జరిపి, రైతులకు పరిహారం అందించి పనులు పరుగులు పెట్టించింది తమ అధినేత జగన్మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి కృషిని ప్రశంసించిన వీడియోలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2026 నాటికి విమానాశ్రయం పూర్తి చేస్తామని ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని, ఆ దిశగానే పనులు సాగాయని గుర్తు చేశారు. అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి ‘తల్లికి వందనం’ అని పేరు మార్చిన చంద్రబాబు, అచ్చమైన ‘నేమ్ చేంజర్’ అని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావుడి శ్రీనివాసరావు, జెడ్పీ వైస్ చైర్మన్ బాపూజీ నాయుడు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
● ‘సహకారం’ ఏది బాబూ?
● ఉపాధి చూపండయ్యా.. సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా పీఏసీఎస్ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా సోమవారం నిరసన తెలిపారు. డీసీసీబీ కార్యాలయాల వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2019 తరువాత విధుల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, జీఓ నంబర్ 36ను అమలు చేయాలని కోరారు. పూసపాటిరేగ డీసీసీబీ కార్యాలయం వద్ద చేపల్టిన నిరసన శిబిరంలో కుమిలి పీఏసీఎస్ ఈఈఓ వి.సత్యనారాయణ, భోగాపురం, డెంకాడ, పోలీపల్లి, పూసపాటిరేగ పీఏసీఎస్ ఉద్యోగులు ఈశ్వరరావు, ఎ.వి.సత్యనారాయణ, ఆర్.మహేశ్వరరావు, కె.శ్రీను, నరేష్ పాల్గొన్నారు. – పూసపాటిరేగ చిత్రంలో రెండేళ్లుగా అధికారులకు అందజేస్తున్న అర్జీలను చూపిస్తూ ఆవేదన వ్యక్తంచేస్తున్న వ్యక్తిపేరు గుడివాడ రామారావు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని ఇదాంవలస గ్రామం. అదే గ్రామానికి తన తండ్రి తవిటయ్య తలయారీగా పనిచేసేవారు. తండ్రి చనిపోయిన తరువాత ఆ ఉద్యోగం కల్పించాలంటూ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. సుమారు రెండేళ్లుగా తిరుగుతున్నా ఉపాధి కల్పించడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టరేట్లో మళ్లీ అర్జీ అందజేసేందుకు సోమవారం వచ్చారు. తన గోడు వినిపిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం రాజాం పట్టణ పరిధిలోని బుచ్చింపేట గ్రామానికి చెందిన సర్వేనంబర్ 70/2లో 70 సెంట్లు విస్తీర్ణంలో రుద్రభూమి ఉంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికార బలంతో ఈ భూమిని కబ్జాచేసేందుకు పూనుకున్నారు. గతంలో రుద్రభూమిగా పేర్కొన్న భూమిని వీఆర్వో సాయంతో 1బీగా మార్చేసి రియల్ ఎస్టేట్ వేసి ప్లాట్గా విక్రయించేందుకు చూస్తున్నారు. తక్షణమే రుద్రభూమిని కాపాడాలంటూ గ్రామస్తులందరూ కలిసి వార్డు సచివాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. రుద్రభూమి వద్ద కూడా కాసేపు ఆందోళన చేశారు. శ్మశానవాటికను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పెద్దలకు నచ్చజెప్పారు. శ్మశాన వాటిక ఆక్రమణ అడ్డుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. – రాజాం -
వలసవెళ్లిన వారి పేర్లు తొలగిస్తున్నాం
గ్రామాల నుంచి శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు ఉపాధిహామీ పథకం నుంచి తొలగిస్తున్నాం. జిల్లాలో 1,08,968 మంది వేతనదారులు ఈకేవైసీ చేయించుకోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనిదినాల కల్పనకు కృషి చేస్తున్నాం. తాత్కాలికంగా వలసవెళ్లిన వారు ఎప్పడు వచ్చినా ఈకేవైసీ చేస్తాం. – ఎస్.శారదాదేవి, డ్వామా పీడీ భారీగా పనిదినాల తగ్గింపు ఆవేదనలో వేతనదారులు 2023–24కు ఇప్పటికి జిల్లాలో 1.07 కోట్ల పనిదినాల కుదింపు 2023–24లో కల్పించిన పనిదినాలు: 2.18 కోట్లు 2025–26లో 1.11 కోట్ల పనిదినాల కల్పన పనుల కల్పనలో చంద్రబాబు సర్కారు విఫలమైందన్న ఆరోపణలు ఈకేవైసీ పేరుతో పథకం నుంచి వేతనదారుల తొలగింపు -
చేతికి అందివచ్చాడనుకుంటే..
● ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణంపార్వతీపురం రూరల్: విధి ఆ కుటుంబంపై పగబట్టింది. చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమైన ఆ బిడ్డ.. పెరిగి పెద్దవాడై చేతికి అందివచ్చాడనుకునేలోపే మృత్యువు కబళించింది. కష్టాల కడలిని ఈది రెండు కుటుంబాలకు ’పెద్ద దిక్కు’గా నిలిచిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మరణం ఎత్తుకెళ్లిపోయింది. గరుగుబిల్లి మండలం తోటపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు.. తోటపల్లి గ్రామానికి చెందిన రాయపల్లి సతీష్(29) బొబ్బిలిలోని ఓ నిర్మాణ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే ఆదివారం విధులు ముగించుకుని, రాత్రి 10.30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై స్వగ్రామం బయలుదేరాడు. మార్గమధ్యంలో అడ్డాపుశీల గ్రామం వద్దకు రాగానే.. ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ సతీష్ బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సతీష్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచాడు. ’అమ్మ లేని లోటు తెలియకుండా.. సతీష్ చిన్నతనంలోనే కన్నతల్లిని కోల్పోయాడు. తండ్రి రాయపల్లి సుదర్శనన్రావు కూలి పనులు చేస్తూ కొడుకును చదివించాడు. మరోవైపు సతీష్ చిన్నాన్న, పిన్నిలకు సంతానం లేకపోవడంతో..సతీష్నే తమ కన్నబిడ్డగా పెంచుకున్నారు. రెండు పేద కుటుంబాలకు సతీష్ ఒక్కడే ఆధారం. సూపర్వైజర్గా స్థిరపడి, తన జీతంతో రెండు ఇళ్లనూ పోషిస్తూ, వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ఇంతలోనే మృత్యువు ఆ ఇంటి వెలుగును ఆర్పివేసింది. ‘మా కష్టాలు తీరుస్తాడనుకున్న కొడుకు.. కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ‘ తండ్రి సుదర్శన్నరావు, కుటుంబసభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులను కలిచివేసింది. -
భోగాపురం విమానాశ్రయంపై.. రాజకీయ డ్రామాలు వద్దు
● ప్రజలకు వాస్తవాలు తెలుసు, మభ్యపెట్టలేరు ● భోగాపురం విమానాశ్రయం ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే ● ఎమ్మెల్సీ సురేష్బాబు నెల్లిమర్ల రూరల్: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తమ ఘనతే అంటూ చంద్రబాబు ప్రభుత్వం క్రెడి ట్ చోరీకి ప్రయత్నిస్తోందని, వాస్తవాలు ప్రజలకు తెలుసని, డ్రామాలు అవసరం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు అన్నారు. మొయి ద విజయరామపురం గ్రామంలోని తన నివాసంలో మీడియాతో సోమవారం మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయంలో మొదటి విమానం ల్యాండ్ కావడం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్ప ఫలితమని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల లబ్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు కొద్ది నెలల ముందు శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఎన్ని కల అనంతరం సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి భోగాపురం విమానాశ్రయంపై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి అవసరమైన అన్ని అనుమతులు తెప్పించారని తెలిపారు. భూ సేకరణకు ఎదురైన న్యాయ చిక్కులను తొలగించారన్నారు. నిర్వాసితులకు పునరావాసం కూడా కల్పించారని చెప్పారు. అన్ని అనుమతులు సిద్ధమైన అనంతరం 2023 మే 3న వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. ఈ పనులను జీఎంఆర్కు అప్పగించడంతో శంకుస్థాపన చేసిన నాటి నుంచే శరవేగంగా సాగాయని పేర్కొన్నారు. 2026 నాటికి విమానాశ్రయం పూర్తి చేస్తామని శంకుస్థాపన సమయంలోనే వైఎస్ జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఫ్లైట్ ల్యాండింగ్ కార్యక్రమం అట్టహాసంగా చేపట్టి ప్రొటోకాల్ మరిచారని దుయ్యబట్టారు. సాయం చేయడం సాధ్యంకాదమ్మా... ● మంత్రి సమాధానంతో విస్తుపోయిన చర్మవ్యాధిగ్రస్త బాలుడి తల్లి విజయనగరం అర్బన్: జామి మండలం గడికొమ్ము గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు బొబ్బిలి జయవర్దన్ పుట్టినప్పటి నుంచి వింత చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. పెలుసుబారిన చర్మంతో పాటు కాళ్లు వంకర్లు తిరిగి నడవలేని స్థితికి చేరాడు. బాలుడి సంరక్షణ కోసం తల్లి జానకి ఇంటివద్దనే ఉండిపోవాల్సి వస్తోంది. తండ్రి అప్పలనాయుడు కూలిచేయ గా వచ్చిన డబ్బులే కుటుంబానికి ఆధారం. బాలుడి మందుల కోసం ప్రతినెలా రూ.4 వేలు నుంచి రూ.5 వేలు ఖర్చవుతోందని, మందుల కోసం సాయం చేయాలంటూ కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను అర్థించింది. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇలాంటి వింత చర్మవ్యాధి ఉన్న వారు రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మంది ఉన్నారని, అందరికీ ఆర్థిక సాయం చేయడం ప్రభుత్వానికి సాధ్యంకాదని స్పష్టం చేశారు. దీంతో బాలుడి తల్లి నిరాశతో వెనుదిరిగింది. -
దాడి చేసిన వ్యక్తులపై చర్యలు
● ఎస్పీ దామోదర్భోగాపురం: దళితులపై దాడి చేసిన వ్యక్తులపై విచారణ చేపడుతున్నామని నేరం రుజువైతే వెంటనే వారిపై కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు మండలంలోని ముంజేరు పంచాయతీ, సిద్ధార్థ్నగర్ కాలనీ చెందిన దళితులు తమపై దాడిచేసి దౌర్జన్యంగా తమ కాలనీ మీదుగా మురుగుకాలువ నిర్మించిన ముంజేరు వాసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గడిచిన 30 రోజులుగా ఎంపీడీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎస్పీ దామోదర్, సీఐ కె దుర్గాప్రసాద్, ఎస్సైలు వి.పాపారావు, సూర్యకుమారిలు సోమవారం దీక్ష శిబిరం వద్దకు చేరుకుని, దీక్ష చేస్తున్న దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ దళితులతో మాట్లాడుతూ మీపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. మీరంతా ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ జరిపి 35 మందిపై కేసులు నమోదు చేసి నోటీసులు కూడా ఇచ్చి కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. తదుపరి కోర్టు అదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకుంటామని, దీక్ష విరమించుకోవాలని దళితులను కోరారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి ప్రమాదాల నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని సిబ్బందిని అదేశించినట్లు తెలిపారు. త్వరలో ఈ ప్రాంతంలో విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దృష్టి పెడుతున్నామన్నారు. సిబ్బందిని ఎక్కడెక్కడ ఏవిధంగా సర్దుబాటు చేయాలనే విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. -
రెడ్బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట
ఎమ్మెల్యే కుమారుడిపై ఫిర్యాదు చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కుమారుడు కిమిడి రామ్మల్లిక్ నాయుడుపై వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం చీపురుపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి పదవీ లేని రామ్మల్లిక్ నాయుడు ప్రభుత్వ భవనాలకు ప్రారంభోత్సవాలు చేయడం చట్ట విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. జెడ్పీ నిధులతో నిర్మించిన డీఎల్డీఓ కార్యాలయానికి 2025 డిసెంబర్ 4న ఏ హోదాలో ప్రారంభోత్సవం చేశారని ప్రశ్నించారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీపీ, జెడ్పీటీసీలు లేకుండా ప్రారంభోత్సవం చేయడం చట్టవిరుద్ధమని, ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు లో కోరారు. ఆధారాలు సమర్పించారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం/చీపురుపల్లి: సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అడగకూడదు.. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించకూడదు.. చివరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోకూడదు.. వైఎస్సార్సీపీ నాయకులు ఏం మాట్లాడినా.. చివరకు ప్రెస్మీట్ పెట్టినా నేరమేనట. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సరిగ్గా అదే జరిగింది. చీపురుపల్లిలోని రాజాం రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే రూ.12.99 కోట్ల నిధులు తీసుకొచ్చామని, పనులు కూడా అప్పట్లోనే 75 శాతం వరకు పూర్తయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం మీడియా సమావేశంలో చెప్పడం నేరంగా ఇక్కడి పోలీసులు భావించారు. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ సహా 35 మంది వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేసి.. వారందరికీ 41 నోటీసులు జారీచేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ విషయం తెలిసి ‘ప్రెస్మీట్ పెట్టి మాట్లాడటం కూడా నేరమేనా?.. ప్రతిపక్ష నాయకులకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా ఇవ్వరా’ అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. క్రెడిట్ చోరీకి యత్నించి.. చీపురుపల్లిలోని రాజాం రోడ్డులో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న ఆర్ఓబీ విషయంలో కొన్ని రోజులుగా కూటమి నాయకులు ఆ ఘనత అంతా తమదేనని క్రెడిట్ చోరీకి తెరలేపారు. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆదివారం ఆర్ఓబీ వద్దకు వెళ్లి పరిశీలించారు. ఆ తరువాత మీడియా సమావేశం నిర్వహించి వాస్తవాలు వెల్లడించారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నేతలపై ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే రంగంలోకి దిగిన ఎస్ఐ ఎల్.దామోదరరావు 35 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు నమోదు చేసి.. వారందరికీ సోమవారం 41 నోటీసులు జారీ చేశారు. పోలీసులను నిలదీసిన మాజీ ఎంపీ బెల్లాన వైఎస్సార్సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సోమవారం రాత్రి చీపురుపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు చేయాలని, ఆ తరువాతే తమకు 41 నోటీసులు ఇవ్వాలని పట్టుబట్టారు. అనంతరం మీడియాతో మాజీ ఎంపీ బెల్లాన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు పెడుతున్న అక్రమ కేసులకు బెదిరేది లేదని కార్యకర్తలు, నాయకులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రెస్మీట్ పెట్టారని మాజీ ఎంపీ బెల్లానతో సహా 35 మందిపై కేసు నమోదు టీడీపీ నేతల ఫిర్యాదుతో వైఎస్సార్సీపీ నాయకుల నోరునొక్కే కుట్రలు ఏ పదవీ లేకపోయినా ప్రారంభోత్సవాలు చేస్తున్న ఎమ్మెల్యే కుమారుడిపై వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు పోలీసులు పట్టించుకోకపోవడంతో మాజీ ఎంపీ ఆధ్వర్యంలో ఆందోళన చీపురుపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత -
అర్జీలు పునరావృతం కాకూడదు: కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు అందిన అర్జీలపై సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావేదికకు 117 వినతులు అందాయి. ఇందులో 39 రెవెన్యూ,79 వివిధ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ అర్జీలపై ఆడిటింగ్ జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు ఆయా వినతులను స్వయంగా పరిశీలించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీ పునరావృతం కారాదన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాధ్, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని ఇలా.. ● జియ్యమ్మవలస పంచాయితీలో ప్రత్యేక నిధులతో కాలువలను శుభ్రం చేసినట్లు, గ్రీన్ అంబాసిడర్లకు 24 నెలల జీతం చెల్లించినట్లు తప్పుడు నివేదికలను ఎంపీడీవో చూపించి నిధులు దుర్వినియోగం చేశారని తక్షణమే దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఏఎంసీ డైరెక్టర్ ఎల్.తాతబాబు దరఖాస్తు చేశారు. ● పార్వతీపురం పట్టణానికి చెందిన పి.గౌరీశంకరరావు చనిపోగా వితంతు పింఛన్ మంజూరు చేయాలని పి.రజని కోరారు. ● పొట్ట కేన్సర్తో బాధ పడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చికిత్సకు అవసరమైన సాయం మంజూరు చేయాలని బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన ఎన్.నర్సింగరావు దరఖాస్తు అందజేశాడు. ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి బాధితుల నుంచి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ వారం కార్యక్రమంలో కుటుంబకలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వేధింపులు, ఆన్లైన్ మోసాలకు సంబంధించి 3 ఫిర్యాదులు అందాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా విచారించి, వాస్తవాల ఆధారంగా చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్ నాయుడు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 10 అర్జీలు సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 10 వినతులు వచ్చాయి. చిన్నబగ్గ ఆశ్రమ పాఠశాలలో స్వీపర్, వాచ్మన్ పోస్టు ఇప్పించాలని గ్రామానికి చెందిన వి.బాజన్న కోరాడు. కిరాణా షాపు పెట్టుకోవడానికి రుణం మంజూరు చేయాలని బుతలగూడకు చెందిన అప్పలమ్మ కోరింది. బైదలాపురం పీహెచ్సీలో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేసినందుకు బెదిరిస్తున్నారని మువ్వల అచ్చమ్మ వాపోయింది. సరడాం ఎంపీపీ స్కూల్కు అదనపు భవనం మంజూరు చేయాలని సవర బాలరాజు వినతిపత్రం అందజేశాడు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, పీహెచ్వో ఎస్.వి.గణేష్, వ్యవసాయాధికారిణి వాహిని తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారుల రుణాలకు వడ్డీ మాఫీ
● జిల్లాలో 113 మందికి లబ్ధి ● జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు డి.వెంకటేశ్వరరావుపార్వతీపురంటౌన్: జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ ద్వారా లబ్ధిదారులు పొందిన రుణాలకు వడ్డీని మాఫీ చేస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు డి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వడ్డీ మాఫీతో జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద రుణం పొందిన 47 మందికి రూ.14.23 లక్షల వడ్డీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకం కింద రుణం పొందిన 66 మందికి రూ.19.32 లక్షలు వడ్డీ మాఫీ కానున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం 31.12.25దీన విడుదల చేసిందని తెలిపారు. అయితే ఈ పధకం కింద వడ్డీ మాఫీ పొందేందుకు బకాయి పడిన అసలు మొత్తాన్ని నాలుగు నెలలలోగా పూర్తిగా జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ, విజయనగరం వారికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆ విధంగా చెల్లించిన వారికి మాత్రమే వడ్డీ మాఫీ వర్తిస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో కోరారు. -
క్రీడలతో స్నేహభావం
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ● ఏపీఎస్పీ 5వ బెటాలియన్ 37వ క్రీడాపోటీలు ప్రారంభండెంకాడ: శారీరక, మానసిక సామర్థ్యంతో పాటు స్నేహభావం పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు చింతలవలస ఏపీఎస్పీ 5 వ బెటాలియన్ లో 37వ క్రీడా పోటీలను ఆయన బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి క్రీడాపోటీల వల్ల పోలీసుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయవచ్చన్నారు. క్రీడల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసులే కాకుండా వారి పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కలెక్టర్ ముందుగా కవాతును తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా 9 బెటాలియన్ బృందాలు మధ్యలో బ్యాండు మేళా వాయిద్యాలతో కన్నుల పండువగా కవాతు ప్రదర్శన నిర్వహించాయి. పోటీల్లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన సురేష్, సత్యారావు, దివాకర్లకు కలెక్టర్ మెడల్స్, ప్రశంసా పత్రాలను బహూకరించారు. కార్యక్రమంలో బెటా లియన్ అడిషనల్ కమాండెంట్ రాజారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు ప్రభాకర్, రమణమూర్తి, లక్ష్మీనారాయణ, బాపూజీ, గోపాలకృష్ణ, టీం కెప్టెన్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, కు టుంబ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం 11 వ్యక్తిగత, సామూహిక క్రీడా పోటీలు నిర్వహించగా, సుమారు 207 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు.80 లీటర్ల సారాతో ఇద్దరి అరెస్ట్కురుపాం: సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జియ్యమ్మవలస మండలంలోని పాత్రునివలస గ్రామ పరిధిలో సారా రవాణా చేస్తున్న చినమేరంగి గ్రామానికి చెందిన బొమ్మాళి అరుణ్ కుమార్ వద్ద 80 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే సారా రవాణాకు సహకరించిన బొత్స అఖిల్ ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు. సారా తయారీకి ముడిసరుకు సరఫరా చేసిన ఒడిశాకు చెందిన మీసాల తిరుపతి రావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యాన్ డ్రైవర్ మృతిపూసపాటిరేగ: మండలంలోని సీహెచ్ అగ్రహారం సమీపంలో గల మేట్రిక్స్ కంపెనీ వద్ద జాతీయరహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యాన్ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..విజయవాడ నుంచి టెక్కలికి సామగ్రితో వెళ్తున్న వ్యాన్ను సీహెచ్ అగ్రహారంలోని మేట్రిక్స్ కంపెనీ సమీపంలో జాతీయరహదారిపై పక్కకు ఆపి కాలకృత్యాలు తీర్చుకోవడానికి డ్రైవర్ గురజాపు నగేష్ (30) రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఈనెల 4వతేదీన ఉదయం విజయవాడలో బయలుదేరిన వ్యాన్ 5 వతేదీ ఉదయం 7 గంటలకు పూసపాటిరేగ మండలం సీహెచ్ అగ్రహారం వద్దకు వచ్చే సరికి ఆపిన డ్రైవర్ రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు మృతుడి భార్య గురజాపు భవాని తెలిపింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. పూసపాటిరేగ ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైక్లు ఢీకొని యువకుడి మృతి విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మపురిలో సోమవారం రాత్రి రెండు బైక్లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి రూరల్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంవీజీఆర్ కాలేజీ నుంచి ముగ్గురు యువకులు బైక్పై విజయనగరం వస్తున్నారు. విజయనగరం నుంచి జావా వెహికల్పై మరో యువకుడు ధర్మపురి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ధర్మపురి దగ్గర రెండు బైక్లు ఢీ కొనగా స్పాట్లోనే బైక్పై వస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు దుర్మరణం చెందాడు. ఆస్పత్రిలో మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతుండగా ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
వందేళ్ల పోరాట చరిత్ర సీపీఐదే
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యవిజయనగరం గంటస్తంభం: చరిత్ర పరిశీలిస్తే దేశానికి ఎవరు సేవ చేశారో స్పష్టంగా తెలుస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ప్రజాహక్కుల పోరాటాల వరకూ వందేళ్లకు పైగా సీపీఐ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈనెల 18న ఖమ్మం పట్టణంలో జరిగే సీపీఐ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే నిమిత్తం స్థానిక అమర్ భవన్లో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముందుండి పోరాడింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలు కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. ఎర్రజెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల రక్షణకు కట్టుబడి ఉంటారన్నారు. వందేళ్ల ఉద్యమ చరిత్రలో భూ పోరాటాలు, ప్రజా ఉద్యమాల ద్వారా పేదలకు న్యాయం జరిగిందని తెలిపారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావించారు. అంతకుముందు పట్టణంలోని మయూరి కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదగా సీపీఐ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, సహాయ కార్యదర్శి బుగత అశోక్, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, మహిళలు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు, కార్మికులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
చీపురుపల్లిరూరల్ (గరివిడి): గరివిడిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో సోమవారం అంతర కళాశాలల క్రీడా సాంస్కృతిక సమ్మేళనం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను ఆధ్వర్యంలో జరగనున్న 14వ విశ్వవిద్యాలయ క్రీడాసాంస్కతిక పోటీల్లో తలపడేందుకు వివిధ కళాశాలల నుంచి 530 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు వివిధ కళాశాలల విద్యార్థులు రంగు రంగుల వస్త్రధారణలతో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే జానపద నృత్యాలతో అలరించారు. క్రీడా, సాంస్కృతిక పోటీల క్రీడా జ్యోతిని ఎచ్చెర్లకు చెందిన ఏపీ స్పెషల్ పోలీస్, ఫస్ట్ బెటాలియిన్ కమాండెంట్ సీహెచ్వీఎస్ పద్మనాభరాజు, తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ డీన్ డా.వి.వైకుంఠరావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ హెడ్ డా.బి.జయచంద్ర వెలిగించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భవిష్యత్కు దారిచూపిస్తాయన్నారు. గరివిడి వెటర్నరీ కళాశాలలో ప్రారంభమైన క్రీడా సాంస్కృతిక సమ్మేళనం 5 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న 14వ క్రీడా సాంస్కృతిక పోటీలు -
ఘనంగా పెద పోలమాంబ తొలేళ్లు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ మేనత్త పెదపోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవాన్ని సోమవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. చదురుగుడిలో పోలమాంబ అమ్మవారి సన్నిధిలో ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్భోర్డు చైర్మన్ నైదాన తిరుపతిరావు, కమిటీ సభ్యులు, మాజీట్రస్ట్బోర్డు చైర్మన్లు, గ్రామపెద్దలు, కుప్పిలి, కరణం, రెవిన్నాయుడు, జన్నివారి కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు పెదపోలమాంబ అమ్మవారి ఘటా లకు వెండిపూతను పట్టించి అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని, అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఘటాలకు గ్రామంలో తిరువీధి నిర్వహించారు. మంగళవారం పెదపోలమాంబ అమ్మవారి ప్రధాన ఉత్సవం నిర్వహిస్తారు. -
అర్జీదారులకు నిరాశ
● పీజీఆర్ఎస్లో మంత్రి పాల్గొన్నా అర్జీదారులకు దక్కని మాట్లాడే అవకాశంవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అర్జీదారులకు నిరాశే ఎదురైంది. కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా పాల్గొన్నప్పటికీ అర్జీదారులు మంత్రితో నేరుగా మాట్లాడి సమస్యలు చెప్పుకునే అవకాశం దక్కకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు. మంత్రితోపాటు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ సహా పదుల సంఖ్యలో జిల్లా అధికారులు ఒకే వేదికపై పాల్గొని తమ అర్జీలను తీసుకుంటున్నారని, మంత్రికి నేరుగా చెప్పుకోవడానికి అవకాశం లభించలేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని ఎలాగైనా కలవాలనుకునే కొందరు కారు దగ్గర నిరీక్షించి సమస్యలు చెప్పుకున్నారు. 297 వినతుల స్వీకరణ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 297 వినతులు స్వీకరించగా వాటిలో అత్యధికంగా 149 వినతులు ఒక్క రెవెన్యూ శాఖకు చెందినవే ఉన్నాయి. డీఆర్డీఏ64, పంచాయతీ రాజ్ శాఖ22, మున్సిపల్ పరిపాలన2, విద్యుత్ శాఖ4, గృహ నిర్మాణ శాఖ2, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ8, డీసీహెచ్ఎస్1, విద్యాశాఖ3, ఇతర శాఖలు 42 అర్జీలు ఉన్నాయి. అయితే మంత్రి పాల్గొన్న నేపధ్యంలో స్వీకరించిన ఈ వినతుల పరిష్కారంలో ఎలాంటి కొత్త చర్యలు గానీ, తక్షణ పరిష్కారాలుగానీ జరగలేదు. గతంలో జరిగిన కార్యక్రమాల్లోలాగానే సాధారణ ఆదేశాలతోనే పరిమితమైందని అర్జీదారులు విమర్శించారు. పీజీఆర్ఎస్కు స్పందన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందని, వినతులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇలాంటి ఆదేశాలు గత కార్యక్రమాల్లోనూ ఇచ్చినవే అని అమలులో ఎలాంటి పురోగతి లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వినతులు త్వరగా పరిష్కరించాలి కలెక్టర్ ఎస్రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆలస్యం చేస్తే సహించేది లేదని ప్రతి వారం సమీక్ష చేస్తామని తెలిపారు. అధికారులు అర్జీదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని టోల్ ఫ్రీ నంబర్ 1100కు వచ్చిన కాల్స్కు సరైన స్పందన అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, సర్వే శాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, డీఈఓ మాణిక్యం నాయుడు, వ్యవసాయ శాఖ జేడీ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణమ్మ, బీసీ సంక్షేమ అధికారిణి జ్యోతిశ్రీ, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పంచాయతీరాజ్ ఎస్ఈ, ఆర్డబ్ల్యూస్ ఎస్ఈ, ఆర్అండ్ బీఎస్ఈ, వివిధ శాఖల జిల్లా అధికారులు, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎస్పీ పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: స్థానిక డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. ఎస్పీ దామోదర్ తన చాంబర్లోనే ఫిర్యాదుదారుల నుంచి విజ్ఙాపనలను స్వీకరించారు. ఏఎస్పీ సౌమ్యలత డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 31 ఫిర్యాదులను స్వీకరించగా అందులో భూతగాదాలకు సంబంధించి 10, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు సంబంధించి 3 నగదు వ్యవహారాలకు సంబంధించి 2, ఇతర అంశాలకు సంబంధించినవి 13 ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత సిబ్బంది ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని ఎస్పీ ఆదేశంచారు. వాటి పూర్వాపరాలపై విచారణ జరిపి, ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
సేవలకు సలాం
సాలూరు: వారంతా అమాయక పేద, మధ్య తరగతికి చెందిన ప్రజలు. చాలామంది నిరక్షరాస్యులు, వృద్ధులే. అనారోగ్యాలతో ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులకు ఆస్పత్రిలో చేరేందుకు ఎక్కడికి వెళ్లాలి? వైద్యపరీక్షల కోసం ఆస్పత్రిలో ఏ విభాగానికి ఏ వైపు గదులకు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి. ఇలా అవస్థలు పడుతున్న వారి గురించి ఆలోచించి, కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్రెడ్డి శ్రీకారం చుట్టిన మరో నూతన కార్యక్రమమే హెల్పింగ్ హ్యాండ్స్. ఆస్పత్రుల్లో సేవలందించేందుకు విద్యార్థులు, యువత, సేవా సంస్థల సభ్యులు తదితరులు స్వచ్ఛందంగా ముందుకురావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గతేడాది డిసెంబరు 16న కలెక్టర్ ట్రయల్ రన్ ప్రారంభించిన ఈ కార్యక్రమం సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో విజయవంతంగా నడుస్తోంది. సేవాభావంతో ముందుకు వస్తున్న వలంటీర్లు, స్వచ్ఛంద సేవాసంస్థల సభ్యులు ఆస్పత్రిలో ఇప్పటివరకు 82 మంది నమోదయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో మంగళవారం హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమాన్ని అధికారులు అధికారికంగా ప్రారంభించనున్నారు. కలెక్టర్ ఆదేశాలు అమలుచేస్తున్న అధికారులుకలెక్టర్ ఇచ్చిన హెల్పింగ్హేండ్స్ ట్రయల్ రన్ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులు అమలుచేస్తుండడంతో ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. సేవాభావంతో ముందుకు వస్తున్న వలంటీర్లకు స్థానిక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.మీనాక్షి తగు రీతిలో మార్గదర్శకం ఇస్తున్నారు.అధిక సంఖ్యలో విద్యార్థులు, సేవాసంస్థల సభ్యులు వచ్చి హెల్పింగ్హ్యాండ్స్లో తమ పేర్లను నమోదుచేసుకుంటున్నారు. వారి సేవలను విడతల వారీగా వినియోగించుకునేందుకు సూపరింటెండెంట్ డా.మీనాక్షి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.ఆ సభ్యులకు చార్ట్ తయారుచేసి,ఏ రోజు ఎవరు సేవలందించాలో సిద్ధం చేసి ముందుగానే తెలియచేస్తున్నారు. దీనివల్ల సభ్యులు కూడా వారికి కేటాయించిన రోజుల్లో వచ్చి రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో ఏ సేవలు ఎక్కడ లభిస్తాయో తెలియక ఇబ్బందులుపడుతున్న వారికి ఓపీ విభాగం, ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలి? వైద్యపరీక్షలకు ఎక్కడికి వెళ్లాలి? తదితర అంశాల్లో తమ వంతు సాయం చేస్తున్నారు. రోగి ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకుని మళ్లీ ఇంటికి వెళ్లేంతవరకు హెల్పింగ్హేండ్స్ సభ్యులు రోగికి అండగా నిలుస్తున్నారు. పట్టణ, పరిసర మండలాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నర్సింగ్, ఒకేషనల్ విద్యార్థులు అధికంగా ఇందులో సభ్యులుగా నమోదవడం వారి సేవాభావానికి అద్దంపడుతోంది. వారి సేవలను గుర్తిస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు సర్టిఫికెట్లు త్వరలో ఇస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. కలెక్టర్ మరో నూతన కార్యక్రమం హెల్పింగ్ హ్యాండ్స్ ఆస్పత్రుల్లో రోగులకు సేవలందించే ట్రయల్రన్ విజయవంతం అధికారికంగా కార్యక్రమం ప్రారంభం రేపు -
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం
విజయనగరం క్రైమ్: ఆర్మ్డ్డ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని సహచర సిబ్బంది ఆర్థికంగా ఆదుకున్నారు. విజయనగరం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ 2000 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ పి.శ్రీనివాసరావు అనారోగ్యానికి గురికావడంతో ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బ్యాచ్ మేట్స్ పోగు చేసిన రూ.81వేల నగదును ఎస్పీ ఏఆర్.దామోదర్ తన చాంబర్లో కానిస్టేబుల్ భార్య పి.లక్ష్మికి ఆదివారం అందజేశారు. ఆర్థికంగా ఆదుకునేందుకు బ్యాచ్ మేట్స్ స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనించదగ్గ విషయమని ఎస్పీ ప్రశంసించారు. అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించ లేకపోతున్న కానిస్టేబుల్ కుటుంబం కొంతకాలంగా ఆర్థిగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తోటి బ్యాచ్ మేట్స్ శ్రీనివాసరావు పరిస్థితిని గమనించి, ఆర్థికంగా ఆదుకునేందుకు కొంత నగదు సమకూర్చారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, 2000 ఏఆర్ బ్యాచ్ మేట్స్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ బయల్దేరిన కార్మిక బృందాలు
● సీఐటీయూ మహాసభల ముగింపు సమావేశానికి హాజరు విజయనగరం గంటస్తంభం: కార్మిక వర్గ హక్కుల సాధన కోసం 1970 నుంచి నిరంతర పోరాటం సాగిస్తున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభల ముగింపులో భాగంగా జనవరి 4న నిర్వహించనున్న మహాప్రదర్శన, బీచ్లో జరిగే బహిరంగ సభకు విజయనగరం జిల్లా నుంచి వేలాది మంది కార్మికులు విశాఖకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా విజయనగరం నుంచి బయలుదేరిన వాహనాలను సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు రెడ్డి శంకరరావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ, రాబోయే కాలంలో కార్మిక వర్గం ఐక్యంగా మోడీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఈ మహాసభలు పిలుపునిచ్చాయని తెలిపారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయడం, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడం కోసం ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ అఖిల భారత మహాసభలు కార్మిక శక్తి ఐక్యతను చాటే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎల్బీజీ నగర్, గురజాడ నగర్, వినాయక నగర్ ప్రాంతాల నుంచి ఐద్వా కార్యకర్తలు, కార్మికులు టాటా ఏస్ వాహనాల్లో విశాఖకు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, సీఐటీయూ నగర కార్యదర్శి బి.రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే ఏపీ బెవరేజెస్, సిమెంట్ కలాసీలు, క్రాంతి జట్టు కలాసీలు కోట ప్రాంతం నుంచి తరలివెళ్లారు. కార్యకరమంలో అంగన్వాడీ, ఆటో, కలాసీలు తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
బొబ్బిలి రూరల్: బొబ్బిలి, మక్కువ మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో విలువైన చెట్లు అక్రమార్కుల వేటుకు గురవుతున్నాయి. నిత్యం జరుగుతున్న ఈ తంతును అడ్డుకునేందుకు స్థానికంగా అటవీ సిబ్బంది లేకపోవడంతో వారి ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. ఇక్కడ పనిచేసిన బీట్ ఆఫీసర్ కొన్నాళ్లుగా శిక్షణ కోసం వేరొక ప్రాంతానికి వెళ్లారు. తాత్కాలికంగా వేసిన బీట్ ఆఫీసర్కు షికారుగంజి, బొబ్బిలి బీట్లను అప్పగించడంతో ఎక్కడా పూర్తిస్థాయి విధులను ఆయన నిర్వహించ లేకపోతున్నారు. దీంతో రాత్రిపగలు తేడా లేకుండా యథేచ్ఛగా అటవీ సంపద నరికి సామిల్లులకు తరలించేస్తున్నారు. రెండు రోజులుగా మక్కువ మండలంలోని అటవీ ప్రాంతంలో చెట్లను నరికి దుంగలను ట్రాక్టర్లతో బొబ్బిలి మీదుగా రాజాం ప్రాంతంలోని సామిల్లులకు తరలిస్తున్నారు. దీనిపై ఇన్చార్జ్ బీట్ ఆఫీసర్ గణేష్ను వివరణ కోరగా.. ప్రస్తుతం తాను షికారుగంజి బీట్లో ఉన్నానన్నారు. రెండు బీట్లను చూడడం కష్టతరంగా మారుతోందని వివరించారు. -
ముగిసిన సబ్ జూనియర్స్ ఖోఖో పోటీలు
● బాలుర విభాగంలో కుమిలి, బాలికల విభాగంలో కెల్ల విజయం విజయనగరం: కబడ్డీ, ఖోఖో పితామహుడు, స్వర్గీయ వై.భగవాన్దాస్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని కస్పా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన జిల్లాస్థాయి సబ్జూనియర్ బాలబాలికల ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి. భగవాన్దాస్ స్పోర్ట్స్ క్లబ్, జిల్లా ఖోఖో అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో కుమిలి జట్టు ప్రథమస్థానంలో నిలవగా.. కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్, పూల్బాగ్ జెడ్పీ ఉన్నత పాఠశాల, నేషనల్ స్కూల్ జట్లు తదుపరి స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో కెల్ల జట్టు విజేతగా నిలిచింది. తదుపరి స్థానాల్లో గంట్యాడ, పూసపాటిరేగ, పూల్బాగ్ జెడ్పీ ఉన్నత పాఠశాల జట్లు నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇజ్జపురెడ్డి ప్రసాద్రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భగవాన్దాస్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు రంగారావు దొర, ఆవాల కృష్ణారావు, చిన్నంనాయుడు, పీఎస్ఎన్వర్మ, అచ్యుతరావు, జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కమలనాభరావు, వరలక్ష్మి, హరీష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో భయం..భయం..!
● శిథిలావస్థలో ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్ ● బిక్కుబిక్కు మంటున్న వైద్యసిబ్బంది ● ఆందోళనలో ఆస్పత్రికి వచ్చే కార్మికులు విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని కార్మికులకు చికిత్స అందించడం కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే కార్మికులతో పాటు ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డయోగ్నోస్టిక్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో భవనాల నుంచి పెచ్చులు ఊడుతున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడు ఏ భవనం కూలుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు కూడా భవనం దుస్థితి చూసి భయపడుతున్నారు. డయోగ్నోస్టిక్ సెంటర్ పరిధిలో 19 వేల మంది కార్మికులు ఉన్నారు. వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డయోగ్నోస్టిక్ సెంటర్కు వస్తారు. రోజుకి 50 మంది వరకు కార్మికులు చికిత్స కోసం ఇక్కడికి వస్తారు. డయోగ్నోస్టిక్ సెంటర్లో ఆర్థో, జనరల్ మెడిసిన్, గైనిక్, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్, డెంటల్, ఈఎన్టీ తదితర విభాగాలు ఉన్నాయి. కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ఈఎస్ఐ పరిధిలో ఉన్న కార్మికుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసతి సమస్యతో ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నప్పటికీ చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డయోగ్నోస్టిక్ సెంటర్ శిథిలావస్థకు చేరి ఉద్యోగులు, కార్మికులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వాపోతున్నారు. భవనాలు శిథిలావస్థకు చేరడంతో డయోగ్నోస్టిక్ సెంటర్లో సమస్యలను కూడా చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. డయోగ్నోస్టిక్ సెంటర్లో ఏడాదిన్నరగా రేడియాగ్రాఫర్ లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. దీంతో ఎక్స్రే అవసరమైన కార్మికులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్స్కు వెళ్లాల్సిన పరిస్థితి. రేడియాగ్రాఫర్ను నియమించాలని డయోగ్నోస్టిక్ సెంటర్ వైద్యాధికారులు పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోయింది. సెంటర్ మార్చేందుకు చర్యలు డయోగ్నోస్టిక్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరడంతో వేరే చోటకు మార్చడానికి చర్యలు తీసుకుంటున్నాం.రేడియో గ్రాఫర్ను నియమించాలని ఉన్నతాధికారులకు లేకరాశాం. డాక్టర్ చక్రవర్తి, సూపరింటెండెంట్, ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్ -
అంతర్ వర్సిటీల యోగా పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థిని
రాజాం సిటీ: రాజాంలోని జీఎంఆర్ ఐటీకి చెందిన విద్యార్థిని ఆర్.భవిత అంతర్ విశ్వవిద్యాలయాల యోగా పోటీలకు ఎంపికై ంది. ఇటీవల అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పోటీల్లో ఆమె ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు పీడీ బీహెచ్.అరుణ్కుమార్ ఆదివారం తెలిపారు. జనవరి 5 నుంచి 8 వరకు బెంగళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన డీమ్డ్ యూనివర్సిటీలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెను ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు అభినందించారు. -
కూటమి ప్రభుత్వం గాడిదలు కాస్తోందా?
చీపురుపల్లి: రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) పనులు పూర్తి చేయడంలో పద్దెనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం గాడిదలు కాస్తోందా? తమ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించి 75 శాతం పనులు పూర్తి చేస్తే కేవలం 25 శాతం మిగులు పనులను ఎందుకు చేయించలేకపోయిందో చెప్పాలని మాజీ ఎంపీ, వైఎస్సార్సిపి పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఈ మేరకు పట్టణంలోని రాజాం రోడ్డులో గల ఆర్ఓబీని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించిన ఆయన అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ)పై కొద్ది రోజులుగా కూటమి నేతలు చేస్తున్న ప్రచారం చూస్తుంటే వారికి సిగ్గు వేయడం లేదా అని ఎద్దేవా చేశారు. ఇదే ఆర్ఓబీకి సంబంధించి రిక్షాకాలనీ వాసులకు సర్వీసు రోడ్డు సమస్య తలెత్తితే ఒక్క కూటమి నాయకుడూ పద్దెనిమిది నెలలుగా కనిపించకుండా ముఖం చాటేసి ఇప్పుడు ఆర్ఓబీ ప్రారంభించే సమయానికి అంతా తామే చేశామన్నట్లు ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధిపై కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ ప్రజా వేదికకు రావాలని సవాల్ విసిరారు. నా హయాంలో నిధుల మంజూరు రైల్వేస్టేషన్ అభివృద్ధి ఎవరి హయాంలో ఎంతెంత జరిగిందో ప్రజావేదికలోనే తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చీపురుపల్లిలో ఆర్ఓబీ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం తాను ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి రైల్వే మంత్రులు పీయూష్ గోయల్, అశ్వనీ వైష్టవ్లు దగ్గరకు పలుమార్లు వెళ్లి 2022 ఆగస్టు 22న రూ.12.99 కోట్లు నిధులు మంజూరు చేయించానని తెలిపారు. బొత్స ఝాన్సీ ఎంపీగా ఉన్నప్పుడు రూ.50 లక్షలతో చీపురుపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, జిల్లా బీసీ విభాగం ఉపాధక్షుడు బెల్లాన త్రినాథరావు, పార్టీ నాయకులు కొసిరెడ్డి రమణ, ఇప్పిలి తిరుమల, గవిడి సురేష్, కరణం ఆది, రేవళ్ల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. క్రెడిట్ చోరీతో 18 నెలలుగా ప్రజలను మభ్యపెడుతున్నారు వైఎస్సార్సీపీ హయాంలోనే ఆర్ఓబీ నిర్మాణానికి నిధులు రైల్వేస్టేషన్ అభివృద్ధిపై టీడీపీ బహిరంగ చర్చకు సిద్ధమా? మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ -
వీటికి మాత్రమే ఈ నిధులు ఖర్చు చేయాలంట..
మెరకముడిదాం: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకొనేందుకు వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నిబంధనల మేరకు 15వ ఆర్థిక సంఘం నిధులను అన్టైడ్ గ్రాంట్ను తాగునీరు, పారిశుధ్య పనులకు, బేసిక్(అన్టైడ్) గ్రాంట్ను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రాధమిక అవసరాలకు (విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వేతనాలు) వెచ్చించుకొనే వెసులుబాటు వుంది. అయితే నిబంధనలను కాదని తాము సూచించి న వాటికే ఈ నిధులు ఖర్చుపెట్టాలని రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం గత నెల 24న పలు సూచనలు జారీ చేసింది. ఈ సూచనల మేరకే జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాలని ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. వీటిపై సర్ప్ంచ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జారీ చేసిన సూచనలు ఆధారంగానే ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాలని జిల్లా పరిషత్ అధికారులు క్షేత్ర స్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయనే నమ్మకంతో పలు గ్రామాల్లో సర్పంచ్లు అంతర్గత రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులను చేయించారు. అయితే ప్రభుత్వం తాజాగా జారీ చేసిన సూచనల ప్రకారం ఆయా పనులకు బిల్లులు విడుదలయ్యే అవకాశాలు లేనట్టే. మరో మూడు నెలల్లో సర్పంచ్ల పదవీకాలం పూర్తవుతున్న సమయంలో కేంద్రం విడుదల చేసిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విధించడం పట్ల మెజార్టీ సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగేందుకు సహకరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో సింహభాగం వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులే..! జిల్లాలోని స్థానిక సంస్థల్లో సింహభాగం వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులే వున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోకుండా చేశా రనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకుందని పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము సూచించిన పనులకు మాత్రమే ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాలని సూచనలు జారీ చేస్తే, ప్రజల అవసరాలను దృష్టిలో వుంచుకొని చేసిన పనులకు బిల్లులు ఎవరు చెల్లిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక సంస్ధల హక్కులను హరిం్చడమేనని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు రూ.26.55 కోట్లు మంజూరు విజయనగరం జిల్లాలో 777 గ్రామ పంచాయతీలకుగాను రూ 26,55,03,050లు 15వ ఆర్ధిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను జిల్లాలో వున్న గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.6 లక్షల నుంచి 40 లక్షల వరకూ సర్దుబాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పేరుతో పెత్తనం చెలాయించడం తగ దు. ఈ నిధులను పంచాయతీల్లో అవసరమైన పనులకు వినియోగించుకొనేలా ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి. పంచాయతీల్లో చాలా వరకు చేయాల్సిన అభివృద్ధి పనులు వున్నాయి. – పెనుమజ్జి అప్పలనారాయణ, సర్పంచ్, నరసయ్యపేట గ్రామం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన అన్ని రకాల చెత్తకుప్పలు, పాతచెత్త సహా, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలకు, 2025 డిసెంబరు వరకూ గ్రీన్ అంబాసిడర్లకు అన్ని రకాల బకాయిలను, విద్యుత్ బిల్లులు, నీటి పఽథకాల నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాల్సి వుంది. మండల పరిషత్లో లింకు రోడ్లు, హ్యాండ్ పంపుల నిర్వహణ, స్వచ్ఛ రథానికి అవసరమై న ఆర్థిక సహాయాన్ని అందించాల్సి వుంది. జిల్లా పరిషత్లో సీపీడబ్ల్యూఎస్ పథకాలకు సంబంధించి సీసీ చార్జీల చెల్లింపు, సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ, అవసరాలకు అనుగుణంగా లింకు రోడ్ల మరమ్మతులు నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాలని ప్రభుత్వం సూచనలను జారీ చేసింది. -
విజయనగరం
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026జిల్లాలోని కార్మికులకు చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో భయానక వాతావరణం నెలకొంది. బొబ్బిలి, మక్కువ మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో విలువైన చెట్లు అక్రమార్కుల వేటుకు గురవుతున్నాయి. ఈ ఫొటోలో ధాన్యం బస్తాల లోడుతో ఉన్న ట్రాక్టర్ విజయనగరం మండలం పినవేమలిలోనిది. ట్రక్ షీట్ జనరేట్ కాకపోవడంతో గడిచిన ఐదు రోజులుగా ఇలానే లోడ్ చేసి ఉంది. దీంతో సంబంధిత రైతు ధాన్యం విక్రయించేందుకు ఎదురు చూస్తున్నాడు. రోజుల తరబడి ధాన్యం ట్రాక్టర్పై ఉండడం వల్ల చోరీకి గురయ్యే అవకాశం ఉందని వాపోతున్నాడు. విజయనగరం ఫోర్ట్: జిల్లా వ్యాప్తంగా ధాన్యం విక్రయాలకు రైతులు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఖరీఫ్లో ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను అన్ని విధాల కష్టాలు పెడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంట నూర్పులు పూర్తయినా ట్రక్ షీట్లు జనరేట్ కాకపోవడం వల్ల రైతులు అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటుంది. చంద్రబాబు సర్కార్ తీరుతో రైతులు విసిగిపోతున్నారు. కళ్లాల్లోనే ధాన్యం ఖరీఫ్ పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా.. ట్రక్ షీట్స్ జనరేట్ కాకపోవడంతో రైతులు పొలాలు, కళ్లాల్లోనే ధాన్యం బస్తాలు దాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రోజుల తరబడి ధాన్యం కళ్లాలు, పొలాల్లో ఉండడం వల్ల వాటికి కపాలా కాయలేక అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో దొంగలు ధాన్యం బస్తాలను ఎత్తుకెళ్లిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ధాన్యం ఎక్కువ రోజులు అలా ఉండిపోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు చెదలు పట్టే అవకాశం ఉందని, దీంతో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసేలా ఎత్తుగడ.. మిల్లర్లు కొత్త ఎత్తుగడకు తెర తీశారు. ట్రక్ షీట్స్ జనరేట్ కాకపోతే రైతులు నూర్పులు పూర్తయిన తరువాత రోజుల తరబడి పొలాల్లో ధాన్యం ఉంచుకోలేరని, వాటిని మిల్లు వద్ద దించేస్తారని మిల్లర్లు భావిస్తున్నారు. ఇప్పటికే రోజుల తరబడి ట్రక్ షీ ట్స్ రాకపోవడం వల్ల కొందరు రైతులు ధాన్యం పాడవుతాయని మిల్లుల వద్దే దించేస్తున్నారు. ఇలా దించేసిన ధాన్యానికి ట్రక్ షీట్స్ రాకపోతే తక్కువ ధరకే రైతుల నుంచి కొనుగోలు చేయవచ్చని మిల్ల ర్లు ఎత్తుగడ వేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా యి.అంతేకాకుండా రైతుల నుంచి అదనపు ధాన్యం కూడా డిమాండ్ చేయవచ్చని మిల్లర్లు యోచిస్తున్న ట్టు తెలుస్తుంది. 80 కేజీల బస్తాకు నాలుగు నుంచి ఐదు కేజీల వరకు అదనంగా తీసుకోవచ్చని మిల్ల ర్లు పాచిక వేస్తున్నట్టు సమాచారం. క్వింటాకు ప్రభు త్వం రూ.2369 చెల్లిస్తుంది. అదే మిల్లర్లు క్వింటాకు రూ.2 వేల నుంచి 2100వరకు మాత్రమే చెల్లిస్తారు. ఓ మిల్లులో అధిక మొత్తంలో దించేసిన ధాన్యం విజయనగరం మండలంలోని ఓ మిల్లులో రైతులు అధిక మొత్తంలో ధాన్యం దించేసినట్టు సమాచారం. సదరు మిల్లు యజమాని బ్యాంకు గ్యారంటీ కట్టకపోవడంతో ఆ మిల్లులో ధాన్యం దించేసిన రైతులు ట్రక్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు ట్రక్ షీట్ల కోసం అడిగితే రైతు సేవా కేంద్రం వారు కొట్టడం లేదని సదరు మిల్లు యజమాని తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమానాశ్రయం బయట ఆవేదన వ్యక్తం చేస్తున్న కవులవాడ టీడీపీ ఎంపీటీసీ భర్త కోరాడ తాతారావు గర్భాం సచివాలయం ఈ ఫొటోలో పొలంలో నిల్వ చేసిన ధాన్యం బస్తాలు గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలోనివి. ఇక్కడ కూడా ట్రక్ షీట్ కాకపోవడం వల్ల ఐదు రోజులు కిందట నూర్పులు పూర్తవడంతో కళ్లంలోనే ధాన్యం బస్తాలు నిల్వ చేశారు. ట్రక్ షీట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు కట్టకుండా కావాలనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పూర్తిగా కట్టకపోతే మిల్లును డీట్యాగ్ చేస్తారని భావించి కొంచెం మొత్తంలో కట్టి ఊరుకుంటున్నారనే విమర్శలున్నాయి. బ్యాంకు గ్యారంటీ మిల్లు యజమానులు కడితేగాని ట్రక్ షీట్ జనరేట్ కాదు. ఈ విషయం తెలిసినా మిల్లర్లు కావాలనే జాప్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏ రైతు సేవ కేంద్రాల పరిధిలో ట్రక్ షీట్లు జనరేట్ కావడం లేదో విచారణ చేపడతాం. అదే నిజమైతే చర్యలు తీసుకుంటాం. బ్యాంకు గ్యారంటీలు అయితే ఉన్నాయి. – బి.శాంతి, జిల్లా మేనేజరు, సివిల్ సప్లై శాఖ -
నేడు పీజీఆర్ఎస్
విజయనగరం అర్బన్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని సూచించారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనపుడు ఫోన్కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ చెక్ చేసుకోవచ్చన్నారు. జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శృంగవరపుకోట : పట్టణానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్, స్థానిక ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్ కోచ్ పి.శ్రీరాము లు డిప్యూటీ రిఫరీగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోషియేషన్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సౌజన్యంతో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకూ రాజమండ్రిలో జరగనున్న దక్షిణ భారత ఇంటర్ యూనివ ర్సిటీ సౌత్జోన్ మహిళల బ్యాడ్మింటన్ పోటీలకు డిప్యూటీ రిఫరీగా ఎంపికై నట్టు ఆయన తెలిపారు. గతంలో కామన్వెల్త్, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు రిఫరీగా పనిచేసిన శ్రీరాములు మరోదఫా డిప్యూటీ రిఫరీగా ఎంపిక కావటంపై స్థానిక బ్యాడ్మింటన్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. -
గెస్ట్ టీచర్లకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న పీజీటీ పోస్టులకు గెస్ట్టీచర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఈఓ యు.మాణిక్యంనాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భాం, షికారుగంజి, బొక్కునాయుడుపేట మోడల్ స్కూల్స్లో ఎకనామిక్స్ పీజీటీ పోస్టు, తెర్లాం మోడల్ స్కూల్లో కామర్స్ పీజీటీ, గర్భాం మోడల్ స్కూల్ బోటనీ పీజీటీ పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, బీఈడీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 4 తేదీలోగా దరఖాస్తులను ఆయా స్కూల్స్ ప్రిన్సిపాళ్లకు అందజేయాలని కోరారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.12,000 వేతనం ఇస్తారని పేర్కొన్నారు. వృద్ధురాలి అన్నవాహికలో ఇరుక్కున్న ఎముక ● ఎండోస్కోప్ విధానంలో తొలగించిన జీజీహెచ్ వైద్యులు విజయనగరం ఫోర్ట్: వృద్ధురాలి అన్నవాహికలో ఇరుక్కున్న చికెన్ బోన్ను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించినట్టు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ తెలిపారు. పి.అప్పయ్యమ్మ అనే వృద్ధురాలు చికెన్ తింటుండుగా ఎముక అన్నవాహికలో ఇరుక్కుపోయింది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఈఎన్టీ విభాగంలో శనివారం చూపించగా అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఎండోస్కోప్ పరికరంతో ఎముకను విజయవంతంగా తొలగించారు. ఈఎన్టీ విభాగం హెచ్ఓడీ దక్షిణామూర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రమేష్, మత్తు వైద్యులను సూపరింటెండెంట్ అభినందించారు. త్వరితగతిన పరిష్కరించండి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం అర్బన్: జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ రెవెన్యూ సమస్యలు, ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ డివిజన్ల వారీగా సమస్యలపై సమీక్షించారు. వివిధ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇనాం భూములు, ఎస్టేట్ భూములు, పట్టాదారు పాసుపుస్తకాల జారీ, వెబ్ల్యాండ్ సమస్యలు, జాయింట్ ఎల్పీఎంలు, రీ సర్వే సమస్యలు, భూమి మ్యుటేషన్ సంబంధిత సమస్యలు, భూ రికార్డుల్లోని తప్పుల సవరణ వంటి అంశాల్లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కలెక్టర్ సూచించారు. అందుబాటులో ఉన్న వివిధ రకాల మాస్టర్ రికార్డులను ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో ఇ.మురళి, ఆర్డీఓలు డి.కీర్తి, సత్యవాణి, మోహనరావు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. లివిరిలో ఏనుగుల విధ్వంసం భామిని: మండలంలోని లివిరిలో శుక్రవారం రాత్రి నాలుగు ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టించాయి. రైతు సోమరాజు గోపాలరావుకు చెందిన కొబ్బరి చెట్లు, పామాయిల్ చెట్లను విరిచేశాయి. రైతు ఇంటి తలుపులు, అద్దాలు విరగ్గొట్టడంతో భయాందోళన చెందారు. ఏనుగులు ఇళ్లపై దాడిచేస్తున్నా అటవీశాఖ సిబ్బంది జాడలేదంటూ రైతు కుటుంబం వాపోయింది. -
ప్రాణం నిలిపిన జీజీహెచ్ వైద్యులు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) వైద్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి ప్రాణాలు నిలిపారు. గుర్ల గ్రామానికి చెందిన వడ్డాది అప్పారావు(75) తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మగత, స్పృహ లేకపోవడం వంటి పరిస్థితిలో సర్వజన ఆస్పత్రిలోని పలమనాలజీ విభాగంలో చూపించగా అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ధూమపానం అలవాటు ఉండడంతో చికిత్స అందించడం కూడా కష్టంగా మారింది. అతనికి చేసిన వైద్య పరీక్షల్లో లో బీపీ ఉన్నట్టు, గుండె పని చేయకపోవడం, సీఓపీడీ, నిమోనియా ఉన్నట్టు నిర్ధారించారు. ఐసీయూలో వారం రోజుల పాటు ఎన్ఐవీ వెంటిలేటర్ సపోర్ట్తో చికిత్స అందించారు. అతను కోలుకోవడంతో శనివారం డిశ్చార్జ్ చేశారు. అప్పారావుకు మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు నిలిపినందుకుగాను పలమనాలజిస్ట్ డాక్టర్ బొత్స సంతోష్ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. -
కుక్క కరిచి 10 మందికి గాయాలు
రామభద్రపురం: మండల కేంద్రంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. శుక్రవారం ఐదుగురు, శనివారం ఐదుగురు చొప్పున్న కుక్క కాటుకు గురై 10 మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రధమ చికిత్స కోసం స్థానిక పీహెచ్సీకీ క్యూ కట్టగా అక్కడ సిబ్బంది ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి చికిత్ప అందించారు. ఇక్కడే కాదు మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామాలలో ఏ వీధిలో చూసినా గుంపులు, గుంపులుగా సంచరిస్తున్నాయి. వీటిని చూసి ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వీధుల్లోని పిల్లలు, వృద్ధులు, గొర్రెలు, మేకలు, ఆవుదూడలు, కోళ్లుపై దాడులు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నా నియంత్రణ ఊసే లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఐటీఐ పాసైన వారికి లేటరల్ ఎంట్రీ అవకాశం విజయనగరం గంటస్తంభం: ఐటీఐ రెండు సంవత్సరాల ట్రేడుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యుర్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పించినట్టు జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ టి.వి.గిరి తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్బీటీఈటీ ఆధ్వర్యంలో నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు పరీక్ష–2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 5లోగా జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్రిడ్జ్ కోర్సు శిక్షణ జనవరి 5 తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుందని, థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 5 తేదీ నుంచి 7 తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు పాలిటెక్నిక్లో రెండో సంవత్సరానికి లేటరల్ ఎంట్రీ ప్రవేశానికి అర్హులని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు, ఆధార్, ఐటీఐ సర్టిఫికెట్, పదో తరగతి, కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ విజయనగరం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. పీడీఎస్ బియ్యం పట్టివేత నెల్లిమర్ల రూరల్: మండలంలోని బొప్పడాం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ గ్రామం నుంచి పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ సిబ్బంది సహకారంతో తనిఖీలు చేపట్టామన్నారు. బొలేరో వాహనంలో తరలిస్తున్న మూడు వేల కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు యజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేశామన్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం నేరమని, ఇలాంటి చర్యలు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు మెంటాడ: మండలంలోని పిట్టాడ నుంచి మెంటాడ తహసీల్దార్ కార్యాలయానికి స్కూటీపై వస్తున్న సివిల్ సప్లయిస్ డీటీ సత్యనారాయణ, పిట్టాడ డీలర్ కుబిరెడ్డి శ్రీనివాసరావులను గుర్తు తెలియని వాహనం శనివారం అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీలర్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలవ్వగా మెరుగైన వైద్యం కోసం తహసీల్దార్ వాహనంలో విజయనగరం తరలించారు. ట్రిపుల్స్తో వస్తున్న వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లి పోయారని బాధితులు తెలిపారు. వ్యక్తి అదృశ్యంపై కేసు సంతకవిటి: మండలంలోని అక్కరాపల్లి గ్రామానికి చెందిన సోనయిల సన్యాసిరావు(40) గత నెల 22న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో తెలిసిన చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య వెంకటలక్ష్మి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 6309990875 నంబరును సంప్రదించాలని తెలిపారు. -
అంతర్ కళాశాలల అథ్లెటిక్స్లో ‘సీతం’కు పతకాలు
విజయనగరం అర్బన్: జేఎన్టీయూ – గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అంతర్ కళాశాల అథ్లెటిక్స్ పోటీలలో గాజులరేగ పరిధిలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి కాంస్య పతకాలు సాధించారు. కళాశాలలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం ఈసీఈ విభాగానికి చెందిన వి.శివ పురుషులు జావలిన్ త్రో ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకోగా, ద్వితీయ సంవత్సరం ఈసీఈ విభాగానికి చెందిన బి.హరీష్ ట్రిపుల్ జంప్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో శనివారం నిర్వహించిన క్రీడా అభినందన సభలో కళాశాల సంచాలకులు మజ్జి శశిభూషణరావు విజేతలు అభినందించారు. కార్యక్రమంలో ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ టి.డి.వి.ఎ.నాయుడు, మెకానికల్ విభాగాధిపతి సి.హెచ్.వెంకటలక్ష్మి, ఇతర అధ్యాపకులు, సీఎస్ఓ సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు జె.మహేశ్వరరావు, టి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
స్వశక్తితో రక్షణ పొందాలి : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : ప్రతీ మహిళ తమను తాము స్వశక్తితో రక్షించుకొనేందుకు స్వచ్ఛందంగా ఆత్మరక్షణ రక్షణ కోసం మెలకువలను నేర్చుకోవాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తుఫాన్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నాంధీ ఫౌండేషన్ ఈ టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. కొన్ని సందర్భాల్లో వివక్షకు గురవుతున్నారన్నారు. వీటిని అధిగమించడానికి మహిళలు మరింత చైతన్యవంతులై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతీ మహిళ విద్యార్థి దశ నుంచే ఆత్మరక్షణ కోసం కొన్ని మెలకువలు నేర్చుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణకు సంబంధించి మెలకువలను నేర్పించే శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షకురాలిని నియమించామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీఎస్పీ అంబేడ్కర్, డీఎస్డీఓ వీఎస్ రమణ, సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, టి.శ్రీనివాసరావు, సీహెచ్ సూరినాయుడు, బి.లక్ష్మణరావు, ఇ.నర్సింహమూర్తి, ఎస్.శ్రీనివాస్, దుర్గాప్రసాద్, జి.రామకృష్ణ, ఆర్య, ఎన్.గోపాలనాయుడు, నాంధీ ఫౌండేషన్ పీఓ భారతి, సింధియా, నెహా, ప్రతిమ తదితరులు పాల్గొన్నారు. -
ఇల్నెస్ కేంద్రం!
సంతకవిటి మండలం కొండగూడేం గ్రామంలోని వెల్నెస్ సెంటర్ నిరుపయోగంగా మారింది. కేంద్రం లోపల మార్బుల్పై చెదలు పట్టాయి. ఇదే క్రమంలో నిరుపయోగంగా ఉన్న ఈ కేంద్రం మందు బాబులకు అడ్డాగా మారింది. గ్రామాల్లో సైతం బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా ఉండడంతో మందుబాబులు ఈ కేంద్రంలోనే మందు సేవిస్తూ కేంద్రం బయట వాటర్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, ఖాళీ మందు సీసాలు పడేస్తున్నారు. కేంద్రం నిరుపయోగంగా మారడంతో చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. గత ప్రభుత్వం ప్రజా ప్రయోజనార్థం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ కేంద్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిరుపయోగంగా మార్చింది. అధికారులు కూడా దీని పర్యవేక్షణను పట్టించుకోకపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోయింది. – సంతకవిటి కొండగూడేంలో తలుపులు తెరిచి ఉంచిన వెల్నెస్ సెంటర్ -
ఉత్సాహంగా ‘వాక్థాన్’
విజయనగరం క్రైమ్: మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పోలీస్శాఖ విశాఖ రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో చేపట్టిన అభ్యదయ సైకిల్యాత్ర ముగింపును పురస్కరించుకుని విజయనగరం జిల్లాలో శనివారం చేపట్టిన ‘వాక్థాన్’ ఉత్సాహంగా సాగింది. విజయనగరం బాలాజీ కూడలి వద్ద ప్రారంభమైన వాక్థాన్కు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పచ్చజెండా ఊపారు. సింహాచలం మేడ, కోట జంక్షన్ మీదుగా మూడులాంతర్ల కూడలి వరకు సాగింది. గంజాయి, మాదక ద్రవ్యాలవల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి రేంజ్ పరిధిలో ‘అభ్యుదయ సైకిల్ యాత్ర’ను నిర్వహించారన్నారు. ఈ యాత్ర విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల్లోనూ సాగిందని, ప్రజలు, యువతకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. ముగింపునకు చిహ్నంగా ‘వాక్ థాన్’ నిర్వహించామన్నారు. గంజాయి అమ్మకాలు, వినియోగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, టి.శ్రీనివాసరావు, సీహెచ్ సూరినాయుడు, బి.లక్ష్మణరావు, ఇ.నర్సింహమూర్తి, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాల జోలికి పోవద్దు రాజాం సిటీ: యువత మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు అన్నారు. రాజాం పట్టణంలో శనివారం వాక్థాన్ నిర్వహించారు. బొబ్బిలి రోడ్డులోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి జీఎంఆర్ ఐటీ వరకు మూడు కిలోమీటర్ల మేర వాక్థాన్ సాగింది. కార్యక్రమంలో సీఐలు అశోక్కుమార్, ఉపేంద్ర, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
విజయనగరం లీగల్: 18 సంవత్సరాల్లోపు బాల బాలికలకు వివాహం చేయటం చట్టరీత్యా నేరమని, అందుకు రెండు సంవత్సరాలు జైలుశిక్షతో పాటు జరిమానా ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. రాష్ట్ర న్యాయసేవాఽధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ అనేక కారణాలు వల్ల చిన్న వయస్సులోనే వివాహాలు చేయటం సరైనది కాదన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేయటం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు శారీరక సమస్యలు ఏర్పడతాయన్నారు. ముఖ్యంగా బాల బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ, ఆశా వర్కర్లు, పారా లీగల్ వాలంటీర్స్ కృషి చేయాలన్నారు. చైల్డ్ లైన్ టోల్ఫ్రీ నంబరు 1098కు లేదా జాతీయ న్యాయసేవా అధికార సంస్థ టోల్ఫ్రీ 15100 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ బిహెచ్.లక్ష్మి, డిస్ట్రిక్ మిషన్ కో ఆర్డినేటర్ ఎల్ సుజాత, నేచర్ ఎన్జఓ కో ఆర్డినేటర్ దుర్గ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత -
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై సమీక్ష
విజయనగరం అర్బన్: విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై నీటి పారుదల శాఖ అధికారులతో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా విజయనగరం జిల్లాలో కొత్తగా రానున్న ఆయకట్టు, కాలువల నిర్మాణం కోసం చేపట్టాల్సిన భూసేకరణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అలైన్మెంట్ను సాంకేతికంగా అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకోవటం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున ఆయకట్టు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని, అవసరమైన మేరకు విడతల వారీగా భూసేకరణను చేపట్టడం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణానికి సంబంధించిన డిజైన్ను మంత్రికి చూపించి, ఈ అంశంపై మరింత లోతైన చర్చను జరిపి తుది రూపు తీసుకొస్తామని వివరించారు. త్వరలో ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే పూర్తిస్థాయి డిజైన్ను రూపొందిస్తామని, విడతల వారీగా భూసేకరణకు తగిన కార్యాచరణ చేపడతామని మంత్రికి వివరించారు. సమీక్ష సమావేశంలో కార్యనిర్వాహక ఇంజినీర్ ఉమేష్కుమార్, డీఈ లక్ష్మీసుధ, ఏఈలు వివేక్, శారద పాల్గొన్నారు. -
మత్తును వీడుదాం.. ముందుకు సాగుదాం..
పార్వతీపురం రూరల్: యువతరం మత్తు కోరల్లో చిక్కుకోకుండా, మహోన్నత లక్ష్యాల వైపు పయనించాలనే సంకల్పంతో శనివారం జిల్లా కేంద్రంలో 3కే రన్ ఉత్సాహంగా సాగింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టీ రూపకల్పన చేసిన అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు వేడుకలను పురస్కరించుకుని, ఎస్పీ మాధవ్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏఎస్పీ మనీషా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పరుగులో విద్యార్థులు, పోలీసులు కదం తొక్కారు. పట్టణంలోని కొత్తవలస ఎస్వీడీ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బెలగం జూనియర్ కళాశాల వరకు సాగింది. ఆర్టీసీ కూడలి వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి, డ్రగ్స్ వద్దు బ్రో అంటూ చేసిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. యువత తమలోని శక్తిని వ్యసనాలకు ధారపోయకుండా, క్రీడల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా 3కే రన్ ఏఎస్పీ మనీషారెడ్డి -
మాధవసేవగా సర్వప్రాణి సేవ జరగాలి
● మన్యంలో ప్రకృతిని కాపాడుకోవాలి ● మనబుద్ధిని పాశ్చాత్య దేశాల వ్యక్తులు పాడుచేశారు ● త్రిదండి చినజియర్ స్వామి సీతంపేట: మానవసేవయే మాధవసేవ కాదని, మాధవసేవగా సర్వప్రాణి సేవ జరగాలని త్రిదండి చినజియర్ స్వామి అన్నారు. సీతంపేట మండలం సీది గ్రామంలో మన్యప్రగతి సంస్థ ఆధ్వర్యంలో శనివారం 3,500ల మందికిపైగా నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతంకాదు ప్రధానం.. మానవత్వం ప్రధానం.. మానవత్వముంటే మనసు, బుద్ధి వికసిస్తే అప్పుడు మిగతా ప్రాణాలన్నీ మనవని భావించడం జరుగుతుంది. ప్రపంచమంతా నాది, కొండలు, కోనలు నదులు నావి అనే భావాన్ని పెంపొందించుకోవాలి... ఇది మనందరి సూత్రం కావాలి. మన్యం ప్రకృతిని కాపాడుకోవాలి. ఇక్కడ అత్యధికంగా పండించే జీడి, మామిడి, చింతపండు, పసుపు, అనాసపనస, ఇతర అటవీ ఉత్పత్తులు ఎంతో ఖ్యాతిని పొందాయి. మైదాన ప్రాంత వాసులు మీ పంటలపై ఆధారపడుతున్నారు. మీ వల్ల దేశమంతా బతుకుతున్నారు. అందుకే గిరిజనులందరికీ మంచి సౌకర్యాలు రావాలి.. మీ ఆందరి ఆరో గ్యాలు బాగుండాలని ఆకాంక్షించారు. పిల్లలను బాగా చదివించాలని పిలుపునిచ్చారు. మనబుద్ధిని పాశ్చాత్యదేశాలకు చెందిన వ్యక్తులు పాడుచేశారన్నారు. మనందరిలో... అన్ని వస్తువుల్లో దేవుడు ఉన్నారని తెలిపారు. చెట్లు, పక్షులు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడితే వాటికి హానితలపెడుతున్నామన్నారు. సంపదను దుబరా చేస్తున్నారన్నారు. కులం, మతం, జాతి, దైవాలు పేరు చెప్పి ఒకరినిఒకరు ఆక్రమించే ప్రయత్నం ఎన్నో రకాలుగా జరుగుతున్నాయన్నారు. మనిషి తోటి మనిషికి తోడు పడుతున్నాడా అని ప్రశ్నించారు. దైవం మీద నమ్మకముంటే ఆ దైవాన్ని మనసులో పెట్టుకోవాలన్నారు. దైవం చూపిన మంచి మార్గంలో పది మందికి తోడు పడాలన్నారు. మనిషిని మార్చేసి ప్రలోభ పెట్టడం తగునా అని ప్రశ్నించారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు... వికాస తరంగణి కేంద్రం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చినజియరు స్వామి తెలిపారు. మహిళలకు ఆరోగ్యాన్ని అందించేందుకు క్యాన్సర్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నామన్నారు. 40 లక్షలకు పైగా మహిళలకు గర్భకోశ వ్యాధులకు వైద్యపరీక్షలు చేసి మందులు అందజేశామన్నారు. కొన్నిచోట్ల ఇప్పటికీ మంచాలపై మోసుకెళ్లి వైద్యం చేయించుకుంటున్నారన్నారు. ఈ ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంధులైన పిల్లల కోసం విశాఖపట్టణంలో పాఠశాల నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్రీడలు నేర్పించడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అహోబిలస్వామి, మన్యప్రగతి నాయకుడు గేదెల రవి, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు. -
● పట్టణాల్లోని రేషన్ లబ్ధిదారులకే గోధుమపిండి పంపిణీ ● కేజీ గోధుమ పిండి ధర: రూ.20 ● జిల్లాలో రైస్ కార్డుదారులు 5.71 లక్షల మంది ● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపాటు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే రూ.4 అదనం
విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు సర్కార్.. గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల వివక్ష చూపుతోంది. విభజించి పాలించు సిద్ధాంతాన్ని అమలుచేస్తోంది. పట్ణణ ప్రజలను ఒకలా, గ్రామీణ ప్రాంత ప్రజలను మరోలా చూస్తోంది. పట్టణాల్లో నివసిస్తున్న రేషన్ లబ్ధిదారులకు మాత్రమే గోధుమ పిండి సరఫరా చేస్తామని చంద్రబాబు సర్కార్ ప్రకటించడంపై పల్లె ప్రజలు మండిపడుతున్నారు. వాస్తవంగా పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే లబ్ధిదారులు అధికం. పేద, మధ్యతరగతి ప్రజలు కూడా అక్కడే ఎక్కువ. పల్లె ప్రజలకు కాకుండా కేవలం పట్టణంలో ఉండేవారికి మాత్రమే గోధుమ పిండి అందజేస్తామని ప్రకటించడాన్ని తూర్పూరబెడుతున్నారు. అన్ని పథకాల్లోనూ కోతవేస్తున్న ప్రభుత్వం.. చివరకు రేషన్ సరఫరాలోనూ కోతపెడుతోందని విమర్శిస్తున్నారు. ● జిల్లాలో 5.71 లక్షల రైస్ కార్డులు... విజయనగరం జిల్లాలో 5.71 లక్షల మంది రైస్ కార్డుదారులు ఉన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసిన ఏ సరుకులైనా కార్డుదారులందరికీ ఒకే విధానంలో పంపిణీ చేయాలి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం విజయనగరం అర్బన్లో ఉన్న వారికి మాత్రమే గోధుమ పిండి పంపిణీకి చర్యలు చేపట్టింది. జిల్లాలోని కార్డుదారులందరికీ కేజీ చొప్పున 571 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి అవసరం కాగా, కేవలం విజయనగరం అర్బన్లో ఉన్న 55 వేలు మంది కార్డుదారులకు 55 మెట్రిక్ టన్నులే సరఫరా చేయడం విమర్శలకు తావిస్తోంది. పల్లె ప్రజలకూ ఇవ్వాలి గోధుమ పిండి పట్టణ ప్రాంత ప్రజలకే కాకుండా మా లాంటి గ్రామీణ ప్రాంత పేదలకూ ఇవ్వాలి. పట్టణ ప్రజలు ఒక్కరికే ఇవ్వడం సరికాదు. మేము కూడా పేదవారమే కదా. మేము కూడా సంక్రాంతి పండగ చేసుకుంటామన్నది గుర్తించాలి. – కరకనాయుడు, పెదవేమలి, లబ్ధిదారుడు ఇది సరికాదు గోధుమ పిండిని విజయనగరం పట్టణంలో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వడం తగదు. పల్లెల్లో నివసించే పేద ప్రజలకు కూడా ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్డుదారులందరికీ పంపిణీ చేసేది. ఇప్పుడు పట్టణ ప్రజలకు మాత్రమే సరఫరా చేయడం ఎంతవరకు సమంజసం. తిరుగుబాటు తప్పదు. – నారాయణమూర్తి, లబ్ధిదారుడు, కోరుకొండపాలెం పట్టణ లబ్ధిదారులకు మాత్రమే... విజయనగరం పట్టణంలో ఉన్న కార్డుదారులకు గోధుమ పిండి ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. 55 మెట్రిక్ టన్నుల గోధుమపిండి వచ్చింది. కేజీ రూ.20 చొప్పన అందించనున్నాం. – బి.శాంతి, జిల్లా మేనేజర్, సివిల్ సప్లై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్డుదారులందరికీ గోధుమ పిండి సరఫరా చేసేంది. అది కూడా కేజీ రూ.16 చొప్పున అందజేసేది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కిలోకు రూ.4 అదనంగా పెంచి రూ.20కి కేవలం పట్టణ లబ్ధిదారులకే పంపిణీ చేస్తోంది. లబ్ధిదారులందరికీ రాయితీపై గోధుమ పిండి అందజేస్తే ఆర్థిక భారం అవుతుందన్న ఉద్దేశంతో కేవలం పట్టణ ప్రజలకు అందజేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండగ వేళ పల్లెప్రజలపై వివక్ష చూపడాన్ని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ధర పెంచి విక్రయం.. -
ముగిసిన స్టెప్కాన్ సదస్సు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్టెప్కాన్–2026 జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ముగింపు సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ స్టెప్కాన్ కేవలం సాంకేతిక అంశం మాత్రమే కాదని, దానికి బహుముఖ ప్రాధాన్యత చేకూరిందన్నారు. నూతన సాంకేతిక విప్లవం ద్వారా కొత్త రకాలైన ఉద్యోగ అవకాశాలు సృష్టించుకునేందుకు వీలుంటుందని తెలిపారు. ప్రతి విద్యార్థి జ్ఞానంతో పాటు నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నించాలని తెలిపారు. ప్రతి రంగంలో విభిన్నంగా ఆలోచించడం ద్వారా గుర్తింపు పొందడమే కాకుండా సెలబ్రిటీలుగా మారవచ్చునని, విద్యార్థులు ఆ దిశగా ఆలోచనలు చేయాలని అన్నారు. విద్యార్థులందరికీ విశేషమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయనడానికి రెండు రోజులుగా నిర్వహించిన సదస్సులో ప్రదర్శనలే నిదర్శనమని అన్నారు. ఈ మెగా ఈవెంట్లో దేశం నలుమూలల నుంచి మంది విద్యార్థులు పాల్గొని వివిధ అంశాలు ప్రదర్శించారన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన స్టెప్కాన్–2026 సదస్సులో 87 మంది సాంకేతిక పత్రాలు సమర్పించగా.. 509 మంది విద్యార్థులు వివిధ వర్క్షాప్లో, 107 మంది ప్రాజెక్టు ఎగ్జిబిషన్ పోటీలోను, 67 మంది స్టార్ట్ ఆఫ్ ఐడియాస్ పోటీలో, 54 మంది జీపీఎల్ వంటి సెంట్రల్ పోటీలతో పాటు వివిద అంశాల్లో, ఏ1 మారథాన్లో 136, వెబ్సాగాలో 179 మంది, బాటిల్ బాట్స్లో 90, డ్రోన్ రైడర్స్ చాంపియన్షిప్లో 58, సీఏడీ కంబాట్లో 54, స్ట్రూక్టో సీ్త్రకేర్లో 108 మంది పాల్గొన్నారని ప్రిన్సిపాల్ తెలిపారు. సదస్సులో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో జీఎంఆర్ వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం.సతీష్ , కో కన్వీనర్ బీవీ సురేష్, నందిని తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాజాం సిటీ: పట్టణ పరిధి పాలకొండ రోడ్డులోని జేజే ఇనోటెల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రేగిడి మండలం ఉణుకూరు గ్రామానికి చెందిన కంటు గణేష్ (36) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సీఐ కె.అశోక్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్విచక్రవాహనంపై రాజాం వచ్చిన గణేష్ పనులు ముగించుకుని స్వగ్రామమైన ఉణుకూరు వెళ్తున్నాడు. జేజే ఇనోటెల్ ఎదురుగా వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో బాధితుని తలకు తీవ్రగాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మృతుని బావ కొనిస రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. జామి: బైక్పై వస్తున్న సమయంలో చెట్టును ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అలమండ సంతకు చెందిన దమ్మేటి మణికంఠ (26) అనే యువకుడు బైక్పై కొత్తవలస నుంచి బైక్పై అలమండ సంతకు వస్తున్న సమయంలో శనివారం మధ్యాహ్నం అలమండ పెట్రోల్ బంకు సమీపంలో రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మణికంఠ తల్లి లోవమణి చిన్నతనంలోనే మృతి చెందింది. సంతకవిటి: మండల కేంద్రానికి చెందిన భోగి కనకరాజు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మండల కేంద్రం కోమటివీధికి చెందిన కనకరాజు కూలి డబ్బులు విషయమై తల్లితో గొడవపడి గడ్డి మందు తాగాడు. శుక్రవారం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందినట్టు తెలిపారు. ఆస్పత్రి వర్గాల సమాచారంతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. -
నోటు పుస్తకాలు అందజేసిన కలెక్టర్
విజయనగరం, అర్బన్: పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి నోట్ పుస్తకాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలు బదులుగా నోట్ పుస్తకాలతో తమకు శుభాకాంక్షలు తెలియజేయాలని కలెక్టర్ సూచించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా అధికారులంతా కలెక్టర్కు విభిన్నంగా నోట్ పుస్తకాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా వచ్చిన సుమారు నాలుగు వేల నోటు పుస్తకాలను డీఈఓ మాణిక్యంనాయుడు సమక్షంలో విద్యాశాఖ అధికారులకు శనివారం తమ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అందజేశారు. విజయనగరం, గంట్యాడ, బొండపల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నాలుగు, ఐదు తరగతి విద్యార్థులకు ఈ నోట్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, విజయనగరం ఎంఈఓ లలిత కుమారి, ఏసీ సన్యాసిరాజు పాల్గొన్నారు. టెక్నికల్ ఉద్యోగుల నైపుణ్యానికి ప్రభుత్వ సర్టిఫికెట్లువిజయనగరం గంటస్తంభం: జిల్లాలోని వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్న టెక్నికల్ అభ్యర్థులకు ప్రభుత్వం సర్టిఫికెట్లు జారీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ప్రభుత్వ ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ టి.వి.గిరి తెలిపారు. అప్రెంటిషిప్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్–1948(ఎంఎస్ఎంఈ) కింద నమోదైన ప్రైవేట్ సంస్థల్లో టెక్నికల్ సంబంధిత ట్రేడ్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులన్నారు. దరఖాస్తుదారులు నిర్దేశిత కనీస విద్యార్హతతో పాటు 21 సంవత్సరాల వయసు ఉండాలని, వయసు పరిమితి లేదని తెలిపారు. 2019లో ఎస్సీవీటీ పాసై, అప్రెంటిస్ పోర్టల్లో నమోదై ఉండాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సమీప ప్రభుత్వ ఐటీఐల్లో ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని, ఇవి ఉద్యోగాల్లో పదోన్నతులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వివరాలకు 9849944654, 9703179119 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు సస్పెన్షన్
● పట్టణంలో విద్యుత్ మీటర్లను తనిఖీ చేస్తున్న అధికారులు విజయనగరం ఫోర్ట్: విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులు బిల్ స్టాప్ మీటర్లను రూ.10 వేలు నుంచి రూ. 20 వేలుకు విక్రయిస్తున్నారన్న అంశంపై ‘బిల్స్టాప్ మీటర్ల తో ఖజానాకు గండి’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విద్యుత్శాఖ అధికారులు స్పందించారు. ఉద్యోగులు అక్రమాలకు పాల్పడడం నిజమేనని తేలడంతో కె.ఎల్.పురం జూనియర్ లైన్మన్ (జెఎల్ఎం) వి.దినేష్, దాసన్న పేటలైన్మన్ ఓ.రాంబాబును సస్పెండ్ చేస్తూ విద్యుత్శాఖ ఈఈ పి.త్రినాథరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పట్టణంలో విద్యుత్శాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి మీటర్లు తనిఖీ చేస్తున్నారు. ఎన్ని బిల్స్టాప్ మీటర్లు మార్చారు అనేదానిపై విద్యుత్శాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటనతో పార్వతీపురం మన్యం జిల్లా విద్యుత్శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ జిల్లాలో కూడా బిల్స్టాప్ మీటర్లు ఎక్కడైనా బిగించారా? అన్నది పరిశీలించాలని ఆ శాఖ సిబ్బందిని అధికారులు ఆదేశించారు. విద్యుత్ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని విద్యుత్శాఖ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. -
● యూరియా అందక ఆందోళన
రైతులందరికీ యూరియా అందజేయాలంటూ రేగిడి మండలం కందిశ గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేశారు. గ్రామంలోని ఆర్ఎస్కే వద్ద యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. రైతుకు బస్తా చొప్పున కేవలం 350 బస్తాలే పంపిణీ చేయడం, సగం మంది రైతులకు యూరియా అందకపోవడంతో ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోశారు. యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటూ దుయబట్టారు. యూరియా అందని రైతులు నిరాశతో వెనుదిరిగారు. – రేగిడి -
నైపుణ్యాలతో కూడిన విద్య అవసరం
–IIలోవిజయనగరం అర్బన్: నైపుణ్యాలతో కూడిన ఉన్నతవిద్య నేటి పోటీ ప్రపంచానికి అవసరమని, ఆ దిశగా విద్యాబోధన సాగాలని సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి అన్నారు. వర్సిటీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం, ఎంఆర్ అటానమస్ కళాశాల జువాలజీ విభాగం సంయుక్తంగా ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్వాంటం సెక్యూరిటీ’ అనే అంశంపై ఎంఆర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఒక రోజు హ్యాండ్స్ ఆన్ శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని, అవసరమైన ప్రాక్టికల్ అనుభవం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో పొందవచ్చని తెలిపారు. వర్సిటీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ రవికుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో స్కిల్ ఇండియా రాబోతుందన్నారు. క్వాంటం టెక్నాలజీ, జీనో సీక్వెన్సింగ్ వంటి నూతన టెక్నాలజీలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్యఅతిథిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాన్సాస్ కరెస్పాండెంట్ ప్రొఫెసర్ కేవీఎల్రాజు, ఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సాంబశివరావు, జువాలజీ విభాగాధిపతి ఎ.గోపాల్, డాక్టర్ శివగణేష్, డాక్టర్ నాగజగ్గయ్య, ఆదిత్య మహిళా కళాశాల, ఎంఆర్కళాశాల, ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాల, సెంచూరియన్ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి ఫోరెన్సిక్ సైన్స్పై ముగిసిన ఒక రోజు శిక్షణ -
సర్వజన ఆస్పత్రిలో నిలిచినసీబీపీ పరీక్షలు..!
● అవస్థలు పడుతున్న రోగులు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సీబీపీ పరీక్షలు జరగక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రికి రోజుకి 40 నుంచి 50 మంది రోగులకు సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) పరీక్షలు చేస్తారు. కొద్ది రోజులుగా ఆస్పత్రిలో సీబీపీ పరీక్షలు జరగడం లేదు. ఆస్పత్రికి వచ్చేరోగులు ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి. జ్వరంతో బాధపడేవారికి, రక్తహీనత, బ్లడ్ ఇనఫెక్షన్స్, శస్త్రచికిత్స అవసరమైన వారికి సీబీపీ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో రోగి శరీరంలో ఎంత రక్తం ఉంది, ఎర్ర రక్తకణాలు, తెల్లరక్త కణాల సంఖ్య వంటివి నిర్ధారణ అవుతాయి. అయితే, పరీక్షలు చేసేందుకు అవసరమైన రియాజన్స్ అయిపోవడంతో ఆస్పత్రిలో పరీక్షలు నిలిచిపోయినట్టు సమాచారం. వాస్తవంగా రియాజన్స్ ముందుస్తుగానే సరఫరాల చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో సరఫరా చేయక పోవడం వల్ల రోగులకు అవస్థలు తప్పడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అధికారం ఉంది.. అంతా వారిదే అనుకున్నారు. ఉపాధిహామీ పథకానికి (పూజ్యబాపు గ్రామీణ రోజ్గార్ యోజన) కన్నం వేశారు. వేతనదారులు పనికి వెళ్లకుండానే పనికి వెళ్లినట్టు మస్తర్లు వేశారు. వారి ఖాతాలో పని డబ్బులు పడాక వారంవారం వసూలు చేశారు. ఇలా రూ.వేయి, రూ.రెండువేలు కాద
● ఇదీ లెక్క... సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం మనది.. మనల్ని ఎవడు ఆపేది అంటూ మంచి జోరుమీదున్న తెలుగుదేశం నాయకులు ఏకంగా ఉపాధి హామీ పథకాన్ని తమ జేబులోని పథకంగా మార్చేశారు. జిల్లా స్థాయి అధికారులను ఏమార్చి పథకంలోని డబ్బులు సొంత జేబుల్లోకి మార్చేశారు. నియోజకవర్గ ముఖ్యనేత అనుచరుడు.. షాడో నేత అండగా ఉంటే ఇక అడ్డేముంది అనుకున్న మండలస్థాయి అధికారి తన కిందనున్న ఉపాధి హామీ సిబ్బందిని.. ఇంజినీరింగ్ స్టాఫ్ను తన ఆధీనంలో పెట్టుకుని కంప్యూటర్లలో లెక్కలు మార్చేసి రూ.కోట్లు కొట్టేశారు. పంచాయతీల్లో తమ మాటవినే వారికి జాబ్కార్డులు ఇచ్చి.. వారు పనికి వెళ్లకుండానే మస్తర్లు వేసేశారు. వారి ఖాతాలో డబ్బులు పడాక వారంవారం కలెక్షన్ చేశారు. ఇలా... ఒక మండలం నుంచి రూ.2కోట్లు వరకు కొట్టేసినట్టు సమాచారం. ఈ అక్రమాలపై విజయనగరం మండల ఎంపీపీ పలుమార్లు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సమక్షంలో ప్రస్తావించినా పట్టించుకునేవారే కరువయ్యారు. విజయనగరం మండలంలోని 22 గ్రామా పంచాయతీల్లో 8,628 మంది వేతనదారులు ఉన్నారు. వారిలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పనికి వెళ్లిన వారికి దాదాపు రూ.12.23 కోట్లను వేతనంగా చెల్లించారు. వీరిలో కొందరు పనికి వెళ్లకపోయినా వెళ్లినట్లు మస్తరు వేయించి వారి బ్యాంకు ఖాతాకు జమైన వేతనం డబ్బులు వసూలుచేసి బంగ్లా మనిషికి అందించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మండలస్థాయి అధికారి కీలకభూమిక పోషించినట్టు తెలిసింది. డబ్బులు రుచిమరిగిన షాడోనేత మండల స్థాయి అధికారికి అపరిమిత స్వేచ్ఛ ఇవ్వడం మొదలెట్టారు. దీంతో ఆయన ఆఫీసులోనే కూర్చుని సర్పంచులు.. ఎంపీటీసీలు.. ఇతర టీడీపీ నేతలను సైతం చిన్నచూపు చూస్తూ.. పాక్షికంగా రాజకేయనేత తరహా వ్యవహారం నడపడం మొదలెట్టారు. ఈ వ్యవహారం ముదిరిపోవడం, తిరిగి టీడీపీ నాయకులకే డబ్బులిస్తే పదవులను కట్టబెట్టేస్థాయిలో ఆ అధికారి మాటలు ఉండడంతో కొందరు నేతలు విషయాన్ని బంగ్లాకు చేర్చారు. షాడోనేత ఆధ్వర్యంలో ఓ ముహుర్తాన వేపచెట్టు కింద కూర్చొని అధికారిపై మూకుమ్మడిగా అధికారిపై తిట్లపురాణం చదివారు. అంతే.. ఇన్నాళ్లూ ఉపాధిహామీ నిధులను షాడోనేతకు అందజేస్తూ దర్జాగడిపిన అధికారి ఉన్నఫలంగా సెలవుపై వెళ్లిపోయినట్టు సమాచారం. నిధుల కై ంక్యర్యం వ్యవహారం బయటపడడంతో మళ్లీ వచ్చేసరికి ఆయన ఆ పోస్టులో ఉంటారా లేదా అన్న చర్చ మండలంలో సాగుతోంది. ఉపాధిహామీ పనులు, మస్తర్లలో అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే అసలు విషయం వెలుగుచూస్తుందని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మా దృష్టికి రాలేదు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.2 కోట్లు కొట్టేసినట్టు సమాచారం వారానికి దాదాపు రూ.20 లక్షల చొప్పున అక్రమార్జన ఓ మండల స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఓ నేత జేబులోకి డబ్బులు పనికి వెళ్లకుండానే మస్తర్లు... ఆనక వసూళ్లు అక్రమ వసూళ్లపై పలుమార్లు మండల సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించిన ఎంపీపీ పట్టించుకోని ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు అధికారి ఆగడాలు శృతిమించడంతో నిలదీసిన ప్రజాప్రతినిధులు సెలవుపై వెళ్లిపోయిన అధికారి విజయనగరం మండలంలో దొంగ మస్టర్లు వేసిన విషయం మా దృష్టికి రాలేదు. ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ విషయంపై దృష్టిసారించి వాస్తవాలు వెలికితీస్తాం. – రవి బాబు, ఏపీఓ, విజయనగరం మండలం -
వైభవంగా సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలు నిర్వహించారు. అనంతరం వెండి మంటపం వద్ద సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపం వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రత్యేక ఊయలలో ఆసీనులను చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి ఊంజల్ సేవ జరిపించారు. -
9వ తేదీలోగా పాసుపుస్తకాల పంపిణీ పూర్తిచేయాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి విజయనగరం అర్బన్: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని ఈ నెల 9వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ట్రాన్స్పోర్ట్, ఆర్అండ్బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం సాయంత్రం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవలు ప్రజాభిప్రాయం, రైల్వే మౌలిక సదుపాయాలు, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, జేసీ సేతుమాధవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పలు ఆదేశాలు జారీ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీతో పాటు, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేయాలని సూచించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఈ నెల 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయండివిజయనగరం అర్బన్: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓడీఎఫ్తో పాటు ఉపాధిహామీ పనుల్లో పురోగతి ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో మంజూరైన 40 సచివాలయ భవనాల్లో ఇప్పటి వరకు కేవలం 17 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలిన భవనాల పనులను ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. 9 భవనాలకు గుర్తించిన ప్రత్యామ్నాయ స్థలాల ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. కొమరాడ: ఇటీవల ఒడిశా సరిహద్దులోని నాగవళి నది ఆవలవైపు సంచరించిన గజరాజుల గుంపు శుక్రవారం జంఝావతి గట్టుదాటి లక్ష్మీపేట, కంచరపాడు గ్రామాల సమీపంలోని చీకటిలోవ కొండ వద్దకు చేరుకున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం తలపెడుతాయోనని కంచరపాడు, పాత కంబవలస, లక్ష్మీపేట గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. రాజ్యలక్ష్మీపురం, కుమ్మరిగుంట, స్వామినాయుడువలస, గంగారేగువలస తదితర గ్రామాల్లో కూరగాయలు, జొన్న పంటల సాగులో ఉన్నాయి. పంట ఏపుగా పెరిగే సమయంలో ఏనుగులు సంచరిస్తే నాశనమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పసుపు ధర ఢమాల్
గిరిజనులు పండిస్తున్న పసుపు నష్టాలే చవిచూస్తున్నాం.. ఈ ఏడాది నష్టాలే చవిచూస్తున్నాం. ఆరుగాలం శ్రమించి పండించిన పసుపు పంటకు కూడా మద్దతు ధర లేదు. ఏం చేయాలో తెలియడంలేదు. మోంథాతుఫాన్ వర్షాలకు పాడైన పంటలకు ఇప్పటివరకు పరిహారం అందలేదు. అన్నదాత సుఖీభవా వంటివి అందలేదు. ఇప్పుడు పసుపు పంటకు ధర ఉంటే చాలనుకున్నాం. మద్దతు ధర లేకపోవడంతో దిగాలుపడుతున్నాం. – ఎస్.ముఖలింగం, జజ్జువ రైతులను ఆదుకోవాలి పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో పసుపు రైతులు పెట్టుబడులు పెట్టి పండించినప్పటికీ పంట చేతికొచ్చిన వేళ ధర లేక పెట్టుబడి కూడా రావడంలేదు. నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి. – మంగయ్య, ఎంపీటీసీ, చిన్నబగ్గ కొనుగోలు కేంద్రాలు నిల్.... గతంలో వెలుగు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి పసుపు రైతులు నష్టపోకుండా మహిళా సంఘాలు పంటను కొనుగోలు చేసేవి. అప్పట్లో కూడా దళారీలు ప్రమేయం ఉండడం, అనుకున్న స్థాయిలో పసుపు కొనుగోలు చేయలేక వెలుగు అధికారుల కూడా చేతులెత్తేశారు. వనధన్ కేంద్రాలు రెండు, మూడు చోట్ల నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. మార్కెటింగ్ సదుపాయం లేక ఇవి ఎక్కువ మొత్తంలో పసుపు సేకరించడంలేదని రైతులు చెబుతున్నారు. గిరిజన సహకార సంస్థ ఉన్నా ఫలితం లేదని వాపోతున్నారు. కావిడ ధర రూ.900 నుంచి రూ.700కు పతనం సీతంపేట ఏజెన్సీలో 1250 ఎకరాల్లో పసుపు సాగు దిగుబడి పెరిగినా ధరలు లేవంటూ గిరిజన రైతుల గగ్గోలు -
జగనన్న కల.. ప్రజలకు అందనున్న వేళ..
సాలూరు: పట్టణంలోని గుమడాం సమీపంలో నిర్మించి న ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ అందుబాటులో కి రానుంది. మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొ ర కృషితో భవన నిర్మాణం పూర్తయింది. దీనిని మంత్రి సంధ్యారాణి శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్ రెడ్డి వైద్యానికి చూపించిన ప్రత్యేక చొరవను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. వైద్యానికి పెద్దపీట.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యవిధానంపై పెద్దపీట వేసింది. మెడికల్ కళాశాలలు, వంద పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ముందడుగు వేసింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా వైద్యాలయాలను ఆధునీకరించింది. ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల వద్దకే వైద్యసేవలు తదితర కార్యక్రమాలను విస్త్రతంగా చేపట్టింది. దీనిలో భాగంగా అప్పటి డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పట్టణంలో 100 పడకల ఆస్పత్రితోపాటు, గుమడాం సమీపంలో ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ మంజూరు చేయించారు. ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి పనులు ప్రారంభించారు. రూ.80 లక్షల అంచనా వ్యయం... ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి సుమారు రూ.80 లక్షలు కేటాయించారు. అనంతరం పనులు పూర్తికి మరో రూ.20 లక్షలు అవసరం అయ్యాయి. ఈ నేపథ్యంలో నిధులు చాల క పనులు నిలిచిపోయాయని తెలుసుకున్న రాజన్నదొర ముందుగా మున్సిపాలిటీ నిధులతో పనులు చేపట్టే కౌన్సిల్ సమావేశంలో చర్యలు తీసుకున్నారు. మరోవైపు డిపార్ట్మెంట్ ద్వారా అదనపు నిధులు మంజూరుకు తోడ్పాటు అందించారు. మున్సిపల్ ఆమోదం, డిపార్ట్మెంట్ ద్వారా కూడా నిధులు రావడంతో పనులకు అడ్డంకి తొలగింది. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నేటికి తుదిదశ పనులు పూర్తయ్యాయి. -
కిడ్నీ రోగులకు రవాణా కష్టాలు..!
● ఆస్పత్రికి వచ్చే రోగులకు 108 సౌకర్యం రద్దు ● అవస్థలు పడుతున్న రోగులు ● వేలాది రుపాయలు ఖర్చు పెట్టి డయాలసిస్ సెంటర్కు వస్తున్న రోగులు ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆటోలో కూర్చున్న మహిళ పేరు కొట్యాడ కొండమ్మ. ఆమెది ఎస్.కోట మండలంలోని శివరామరాజుపేట. గడిచిన మూడు నెలలుగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్కు డయాలసిస్ చేయించుకోవడానికి, నెలకు 8సార్లు ఆమె వస్తోంది. ఒకసారి డయాలసిస్ సెంటర్కు వచ్చి ఇంటికి వెళ్లడానికి రూ.1500 చొప్పన ఖర్చు అవుతుంది ఈలెక్కన నెలకు రూ.12 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇవికాక మందులు ఇతర ఖర్చులకు మరో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు తప్పదు. విజయనగరం ఫోర్ట్: ఇలా ఈ ఒక్క మహిళా రోగే కాదు. అనేక మంది డయాలసిస్ చేయించుకోవడానికి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి రావడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది రోగులకు నెలకు 8 సార్లు డయాలసిస్ అవసరం పడగా, మరి కొంతమందికి 6 సార్లు అవసరం పడుతుంది. విజయనగరంలో ఉన్న డయాలసిస్ సెంటర్కు రావడానికి రవాణా చార్జీలు, భోజనం, ఇతరఖర్చులకు వారికి తడిసిమోపుడుతోంది. కిడ్నీ వ్యాధితీవ్రమైనవారికి డయాలసిస్ చేస్తారు. అటువంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి కానీ చంద్రబాబు సర్కార్ నిర్దయతో కిడ్నీ రోగుల పట్ల వ్యవహరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో 108 ద్వారా తరలింపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కిడ్నీ రోగులను డయాలసిస్ సెంటర్కు 108 అంబులెన్సుల ద్వారా ఉచితంగా తరలించేవారు. దీంతో వారు ఎంతో సంతోషించేవారు. రవాణా చార్జీలు లేకుండా ఉచితంగా డయాలసిస్ సెంటర్కు తరలించడం వల్ల తమకు సమయం, డబ్బు ఆదా అయిందని భావించేవారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 108 సౌకర్యం రద్దు చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే కిడ్నీ రోగులను 108 అంబులెన్సు ద్వారా డయాలసిస్ సెంటర్కు ఉచితంగా తరలించే సౌకర్యానికి మంగళం పాడేసింది. దీంతో కిడ్నీ రోగులు సొంత డబ్బులు పెట్టుకుని ప్రైవేట్ వాహనాల్లో డయాలసిస్ సెంటర్కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ రోగులు వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కిడ్నీ రోగుల సంక్షేమానికి పాటు పడుతున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్ వారికి ఉచితంగా అందే రవాణా సౌకర్యాన్ని రద్దు చేయడం పట్ల కిడ్నీరోగులు ఆవేదన వ్యక్తం అవుతున్నారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఉన్న సౌకర్యాలు రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.తరలించే సౌకర్యం రద్దు కిడ్నీ రోగులను డయాలసిస్ సెంటర్కు 108 అంబులెన్సు ద్వారా తరలించే సౌకర్యం లేదు. ఏడాది క్రితమే ప్రభుత్వం ఈ సదుపాయాన్ని రద్దు చేశారు. ఎస్.మన్మథ నాయుడు, 108 జిల్లా మేనేజర్ -
ఖోఖో పోటీల విజేతలకు అభినందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన సీనియర్స్ పురుషుల ఖోఖో పోటీల్లో ద్వితీయస్థానం దక్కించుకున్న జిల్లా జట్టును జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. ఈ మేరకు స్థానిక సత్య డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశి భూషణరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.సాయిదేవమణిలు క్రీడాకారులను అభినందించారు. గతనెల 24 నుంచి 26వ తేదీ వరకు గుడివాడలో జరిగిన పోటీల్లో జిల్లాక్రీడాకారులు కనబరిచిన ప్రతిభ పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భగవాన్దాస్ ట్రస్ట్ కార్యదర్శి ఎ.రంగారావుదొర, చిన్నంనాయుడు, జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏఎన్ఎం కమలనాభరావు, కె.గోపాల్, కోచింగ్ క్యాంప్ ఇన్చార్జి ఎస్హెచ్ ప్రసాద్, రామకృష్ణ, ప్రసన్న, వరలక్ష్మి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం జేఎన్టీయూ జీవీలో బీటెక్ సెకెండ్ ఇయర్ చదువుతున్న ఓలిశెట్టి వెంకట ఉదయ్ తేజ(20) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి రూమ్మేట్స్, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖలోని అక్కయ్యపాలెం రామచంద్రనగర్కు చెందిన తేజ రెండేళ్ల కిందట విజయనగరంలోని జేఎన్టీ యూ జీవీలో బీటెక్లో ట్రిపుల్ఈ విభాగంలో చేరాడు. ఇక్కడి వంశధార హాస్టల్ రూమ్–13లో నలుగురు స్టూడంట్స్తో కలిసి ఉంటున్నాడు. ప్రతిరోజూ కాలేజీ క్యాంపస్లో జరిగే క్లాస్లకు, లేబొరేటరీలకు కలిసి వెళ్తున్న సహచర విద్యార్థులతో అంతగా కలివిడిగా ఉండేవాడు కాదు. ఈ మధ్య కాలేజీ క్యాంపస్లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారి తీసినట్లు సహచర విద్యార్థులు చెబుతున్నారు. ప్రతి రోజులాగానే తోటి విద్యార్థులు కాలేజీలో జరుగుతున్న క్లాస్లకు వెళ్లినా ఉదయతేజ్ మాత్రం వెళ్లలేదు.సహచర విద్యార్థులు క్లాసులు ముగించుకుని తిరిగి రూమ్కు వచ్చి చూసేసరికి తేజ దుస్తులు ఆరేసుకునే తాడుతో ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించగా వెంటనే హాస్టల్ వార్డెన్కు.. ఆయన పోలీసులకు సమాచారం అందజేశారు. రూరల్ ఎస్సై అశోక్ ఘటనా స్థలికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూమ్లో విద్యార్థి నోట్బుక్లో ఐ లవ్ యూ అని రాసి ఉండడం, ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేసినట్లు ఉన్న స్క్రీన్ షాట్ను పోలీసులు గుర్తించారు. చదువులో దిట్ట ఉదయ్ తేజ జాలరి కులానికి చెందిన విద్యార్థి. తండ్రి శ్రీనివాసరావు కొడుకు అభీష్టం మేరకు తన తాహతుకు మించి ఇంజినీరింగ్లో చేర్పించాడు. కాలేజీలో అడుగుపెట్టిన ఉదయ్ తేజ.. చదువులో మంచి మార్కులు తెచ్చుకుని అందరినీ మెప్పించేవాడు. అనునిత్యం ఫోన్ చేత పట్టుకుని ఉండే ఉదయ్ తేజ.. ఫోన్ స్టేటస్లో ‘ఇన్స్టెంట్ డెత్ ఈజ్ మోర్ మెర్సిఫుల్ దెన్ లైఫ్’ అంటూ ట్యాగ్ పెట్టుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
హైదరాబాద్ విజయం
● విజ్జి క్రికెట్ మైదానంలో అండర్–15 ఉమెన్స్ ఎలైట్ టోర్నీ ● విదర్భ జట్టుపై ఘనవిజయంవిజయనగరం: స్థానిక విజ్జి క్రికెట్ మైదానంలో బీసీసీఐ ఆధ్వర్యంలో అండర్ –15 ఉమెన్స్ క్రికెట్ వన్డే ట్రోఫీ ఎలైట్ మ్యాచ్లు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్, విదర్భ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో విదర్భ జట్టుపై, హైదరాబాద్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జుట్టు 32.4 ఓవర్లలో 111 పరుగులకు ఆలవుట్ అయింది. హైదరాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ శాన్వి 15 పరుగులు, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు షేక్ అయేషా 19, అనన్య 20 పరుగులు సాధించారు. విధర్భ బౌలర్లలో ఆర్య నందన్వార్ 6.4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించింది. అనంతరం 112 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ జట్టు హైదరాబాద్ బౌలర్లు ధాటికి 23.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటయింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనింగ్ బ్యాటర్ ఆర్య అభయ్ పంగ్డే 39 బంతుల్లో 44 పరుగులు చేసినప్పటికీ, ఆమెకు సహకారం అందించేవారు లేకపోవడంతో జట్టు ఓటమి పాలయింది. మిగతా బ్యాటర్ల లో వికెట్ కీపర్ వీర ఓం (10 పరుగులు), కెప్టెన్ వృష్టి దేశ్ పాండే (10) పరుగులతో రెండంకెల స్కోరు సాధించారు. హైదరాబాద్ జట్టు బౌలర్లలో కెప్టెన్ శాన్వి, అనన్యలు రెండేసి వికెట్లు సాధించారు. -
అంతర్ వర్సిటీల బ్యాడ్మింటన్ పోటీలకు జీఎంఆర్ విద్యార్థులు
రాజాం సిటీ: ఈ నెల 4 నుంచి 6 వరకు విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల బ్యాడ్మింటన్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారని పీడీ బీహెచ్ అరుణ్కుమార్ శుక్రవారం తెలిపారు. ఇటీవల రఘు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జట్టు ఎంపికలో జీఎంఆర్ ఐటీకి చెందిన డి.ప్రవీణ్కుమార్, వై.షణ్ముఖ్లు ఉన్నారన్నారు. వారు జేఎన్టీయూ జీవీ తరఫున ఆడనున్నారని పేర్కొన్నారు. వారి ఎంపికపట్ల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూండెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, అధ్యాపకులు తదితరులు అభినందించారు. చెస్ టోర్నమెంట్లో మాధురి మోక్షితకు అంతర్జాతీయ రేటింగ్విజయనగరం అర్బన్: విశాఖలో ఇటీవల జరిగిన ఆలిండియా అంతర్జాతీయ ఓపెన్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్లో విజయనగరానికి చెందిన నారాయణ స్కూల్ విద్యార్ధిని మాధురి మోక్షిత ప్రతిభ కనపరిచి 1487 అంతర్జాతీయ రేటింగ్ పాయింట్లు సంపాదించింది. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభావతి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 20 రాష్ట్రాలు, ఐదు దేశాల నుంచి మొత్తం 582 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో మాధురి మోక్షిత ఆర్వీ 8 రౌండ్లకు గాను నాలుగు రౌండ్లలో విజయం సాధించిందని తెలిపారు. ఈ విజయంలో అంతర్జాతీయ రేటింగ్ 1,487 పాయింట్లు సంపాదించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతను పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. పోక్సో కేసులో ముద్దాయి 20 ఏళ్ల జైలుశిక్షవిజయనగరం క్రైమ్: జిల్లాలోని బాడంగి పోలీస్స్టేషన్లో 2024లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయికి విజయనగరం పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి కె.నాగమణి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం, రాజేరుకు చెందిన బాలిక (14) కనబడడం లేదని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై బాడంగి ఎస్సై జె.తారకేశ్వరరావు డిసెంబర్ 28, 2024న మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో బాడంగి మండలం వాడాడకు చెందిన నిందితుడు వాడాడ వెంకటరమణ (23) ఆ బాలికను ప్రేమిస్తున్నానని వెంటపడుతూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కత్తిపూడి తీసకుని వెళ్లాడు. అక్కడ ఆ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో పోక్సో చట్టం కింద బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆపై నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడిపై విచారణలో నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు. రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహంవిజయనగరం క్రైమ్: విజయనగరం, కోరుకొండ రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని జీఆర్పీ సిబ్బంది శుక్రవారం గుర్తించారు. సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సున్న ఆ వ్యక్తి మృతదేహం పక్కన వాటర్ బాటిల్ ను పోలీసులు కనుగొన్నారు. మృతుడు 5 అడుగుల పొడవు కలిగి, ఎరుపు రంగు శరీర ఛాయ కలిగి, నీలం రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బ్లాక్ కలర్ జీన్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. విజయనగరం గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ హెచ్సీ పి.రవి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్ 9490617089, 9441962879 నంబర్లకు తెలియ జేయాలని ఆయన కోరారు. -
ఇదేం పని మాస్టారూ..!
● పంచాయతీ కాలువను కప్పేస్తున్న టీడీపీ నేతనెల్లిమర్ల రూరల్: ఆయనొక విశ్రాంత ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు. పైగా టీడీపీ సర్పంచ్కు స్వయంగా బావ. ఉద్యోగ విరమణ అనంతరం ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా..నలుగురికీ ఏది మంచి ఏది చెడో చెప్పాల్సిన ఆయనే తన ఇంటివద్ద పంచాయతీ కాలువను ఎటువంటి అనుమతులు లేకుండా కప్పేస్తున్నాడు. ఈ తతంగాన్ని చూసిన స్థానికులు నివ్వెరపోతున్నారు. నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏళ్ల కాలం నుంచి పెను సమస్యగా ఉన్న సీసీలు, డ్రైన్ల నిర్మాణాన్ని సుమారు రూ.కోటి నిధులతో పూర్తి చేశారు. ప్రధాన వీధిలో సదరు టీడీపీ నేత పంచాది సూర్యనారాయణ ఇంటి ఎదురుగా కూడా విశాలమైన సీసీ రహదారితో పాటు డ్రైన్ నిర్మించారు. తన ఇంటి వాస్తుకు విరుద్ధంగా ఉందనే నెపంతో గడిచిన రెండు రోజుల నుంచి ఆయన పంచాయతీ కాలువను తొలగించి ఇంటి కాంపౌండ్ నిర్మాణాన్ని చేపడుతున్నాడని స్థానికులు వాపోతున్నారు. కాలువను మూసేస్తే మురుగునీరు ఎలా ప్రవహిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై స్థానికులు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన శుక్రవారం పరిశీలించారు. సదరు కార్యదర్శి వారించినప్పటికీ సర్పంచ్ తన ఇంట్లో మనిషే కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైంది. కాలువను వేరే మార్గంలో ఏర్పాటు చేస్తానని చెప్పి సదరు టీడీపీ నేత తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అందరికీ చెప్పాల్సిన నాయకులే ఈ విధంగా అడ్డదారులు తొక్కడంపై జనం మండి పడుతున్నారు. కాలువను ఆయనొక్కడే ఆక్రమించినట్లు ఉండదని, గ్రామంలోని మిగిలిన వారంతా ఇక అదే పని చేస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కాలువలను ఆక్రమిస్తే మురుగు నీటి పరిస్థితి ఏమిటని, ప్రజారోగ్యం ఏమవాలని ప్రశ్నిస్తున్నారు. -
పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యం వద్దు
విజయనగరం అర్బన్: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుని పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా అతి త్వరలో పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమల సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు సమర్పించిన తర్వాత చట్టబద్ధమైన గడువు ముగిసేవరకు వేచి చూడకుండా వెంటనే వాటిని పరిశీంచి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏ శాఖ వద్ద అయినా అనుమతులు పెండింగ్లో ఉంటే పరిశ్రమల శాఖ అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. జిల్లాకు వచ్చే పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న 8 ప్రధాన పరిశ్రమల పరోగతిపై ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్, స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్, స్టీల్ ఎక్స్చేంజ్ ఎన్ఫ్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, అన్సుమి స్పేస్ కార్పొరేషన్, జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రీస్ పార్క్ లిమిటెడ్, వైశాఖి గ్రోత్ కారిడార్, రుషిల్ డెకర్స్, ఎలైట్లాజిక్స్ ఎగ్జిమ్ ఏజెన్సీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు జిల్లాలో యూనిట్లు స్థాపించేందుకు ముందుకు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు లభిస్తాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ఇన్చార్జ్ జనరల్ మేనేజర్ ఎంవీ కరుణాకర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం.మురళీమోహన్రెడ్డి ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి -
గురజాడ గృహ పరిరక్షణకు రూ.12.05 లక్షలు మంజూరు
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్విజయనగరం అర్బన్: తెలుగు జాతికి గర్వకారణమైన ప్రముఖ సంఘసంస్కర్త, సాహిత్య యుగపురుషుడు గురజాడ అప్పారావు చారిత్రక గృహాన్ని సాంస్కృతిక వారసత్వ సంపడగా భావించి దాని పరిరక్షణకు ప్రభుత్వం కుట్టుబడి ఉందని ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్ల శ్రీనివాస్ తెలిపారు. గురజాడ గృహానికి తగిన రక్షణ లేక ఆకతాయిలు లోపలికి ప్రవేశిస్తున్నారనే విషయాన్ని గురజాడ వారసులు వెంకట ప్రసాద్, ఇందిర దంపతులు ఈ నెల 25న తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి పేర్కొన్నారు. దీనిపై తాను వెంటనే స్పందించి కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యతో చర్చించానని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఇంజినీర్ గురజాడ గృహాన్ని పరిశీలించి అంచనాలు రూపొందించగా వాటిని పరిశీలించిన అనంతరం గృహ పునరుద్ధరణ, భద్రత చర్యల కోసం మొత్తం రూ.12.05 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి కొండపల్లి వెల్లడించారు. ఈ గృహం కలకాలం నిలిచి గురజాడ ఆలోచనలు, ఆదర్శాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. -
చోరీ బాటలో దంపతులు
రాజాం సిటీ: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో దొంగతనానికి పాల్పడి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. చోరీ చేసిన బంగారు నగలను తాకట్టుపెట్టి ఆ నగదుతో హైదరాబాద్, గోవా, కర్నాటక, భువనేశ్వర్ ప్రాంతాల్లో విలాసంగా గడిపారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటలాపాలయ్యారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజాం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ హెచ్.ఉపేంద్ర శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. రేగిడి మండలం బాలకవివలస గ్రామానికి చెందిన డోల గాయత్రి ఇంటర్మీడియట్ చదువుకుని ఓ కంపెనీలో పనిచేసేది. అదే కంపెనీలో పనిచేస్తున్న బాపట్ల జిల్లా చీరాల మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన దుడ్ల బాలాజీతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వారిద్దరూ బాలకవివలసలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా గత నెల 4న బాలకవివలస గ్రామానికి చెందిన కిల్లారి కమల ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో 13 తులాల బంగారం అపహరణకు గురైందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి సవాల్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గ్రామానికి చెందిన గాయత్రి, బాలాజీలపై అనుమానంతో ఆరా తీసి నిందితులుగా గుర్తించారు. వారు గ్రామంలో లేకపోవడంతో గాలింపు చేపట్టారు. నిందితులు దొంగిలించిన బంగారాన్ని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కొన్ని ఆభరణాలు, బాపట్ల జిల్లా చీరాలలో ఓ ప్రైవేట్ కంపెనీలో కొన్ని ఆభరణాలు తాకట్టు పెట్టారు. ఆ సొమ్ముతో హైదరాబాద్, గోవా, భువనేశ్వర్లలో విలాసాలకు ఖర్చుచేశారు. చిన్నారి కోసం వచ్చి..పట్టుబడిన దంపతులుతమ నాలుగు నెలల చిన్నారిని తీసుకుని వెళ్లేందుకు బాలకవివలస వచ్చిన నిందితులను సమాచారం మేరకు పట్టుకున్నామని సీఐ తెలిపారు. వారి నుంచి రూ.ఒక లక్షతో పాటు రెండు చెవిదిద్దులు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. ఇంకా మిగిలిన బంగారం రికవరీ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన రేగిడి క్రైం సిబ్బంది ఎస్.శ్రీనివాసరావు, ఎస్.రామకృష్ణ, ఆర్.శివరావు, కె.మోహనరావులను సీఐ అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై వి.బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. బాలకవివలసలో నిందితుల అరెస్టు -
వికసిత్ భారత్లో శాస్త్రసాంకేతిక రంగాలే కీలకం
● జీఎంఆర్ ఐటీలో ప్రారంభమైన స్టెప్కాన్ సదస్సురాజాం సిటీ: వికసిత్ భారత్ లక్షసాధనలో శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ఎఫ్అండ్హెచ్ జీఓస్పెషియల్ ఇన్నోవేషన్ సెల్ సైంటిస్ట్ డాక్టర్ కొంగ గోపీకృష్ణ అన్నారు. టెక్నాలజీ అబివృద్ధిలో యువత ఆలోచనా విధానమే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక జీఎంఆర్ ఐటీలో స్టెప్కాన్–2026 సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కొత్తకొత్త ఆవిష్కరణలు ముఖ్యభూమిక పోషించనున్నాయని అన్నారు. 2047నాటికి వికసిత్ భారత్ సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ బయాలజీ వంటి ప్రభుత్వ విభాగాలు, అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్, అలాగే బిల్డ్థాన్–2025, నీతి అయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్, స్కిల్ ఇండియా వంటి కేంద్రప్రభుత్వ పథకాలు శాస్త్రసాంకేతిక అభివృద్ధిలో తోడ్పడే విధానాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ స్టార్టప్ ఐడియాలను తిలకించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, జీఏఆర్వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
6 నుంచి క్రికెట్ టాలెంట్ హంట్ ఎంపిక పోటీలు
విజయనగరం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా కేంద్రంలోనీ విజ్జి క్రికెట్ మైదానంలో టాలెంట్ హంట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి. సీతారామరాజు శుక్రవారం తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి, టాలెంట్ హంట్ సభ్యుడు ఆర్.విష్ణువర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ నెల 6 నుంచి రెండు రోజులపాటు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అండర్–14 విభాగంలో నిర్వహించే టాలెంట్ హంట్ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు ఒకరోజు ముందుగా తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. పోటీలకు హాజరయ్యే సమయంలో ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. అలాగే సొంత కిట్టు, తెలుపు రంగు దుస్తులు ధరించి రావాలని స్పష్టం చేశారు. వీడీసీఎ కార్యదర్శి పి. సీతారామరాజు -
ఏజెన్సీ ఫలసాయాలకు ఒడిశాలో డిమాండ్
● పెరిగిన పుట్టదబ్బ, నారింజ, పెండలం, గుమ్మడి దిగుబడులు ● గిట్టుబాటు ధరలు పూజ్యం ● దళారులే దిక్కుసీతంపేట: ఏటా ఈ సీజన్లో పండే గిరిజనుల ప్రధాన అటవీఫలసాయాలైన పెండలం, పుట్టదబ్బ, గుమ్మడి వంటి వాటికి ఒడిశాలో మంచి డిమాండ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం దిగుబడులు పెరిగినా మద్దతు ధరలు లేవు. దళారులు గుమ్మడి పండు ఒక్కోటి రూ.20కి ఇక్కడ కొనుగోలు చేస్తారు. మైదాన ప్రాంతంలో రూ.80 వరకు పండును బట్టి కిలోల వంతున విక్రయిస్తారు. పెండలం కూడా ఇక్కడ కట్టలుగా అంచనాగా 30 కిలోల పెండలం కట్టను రూ.300కు కొనుగోలు చేస్తే అది రూ.500వరకు ఒడిశాలో అమ్ముతారు. అలాగే దబ్బ కావిళ్ల లెక్కన రూ.200కు కొనుగోలు చేస్తారు. సరాసరి ఒక్కో పుట్ట దబ్బ పండు రూపాయి ధర పలుకుతుంది. అయితే ఈ దబ్బ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు ఒడిశాలోని బరంపురానికి ఎగుమతి అవుతాయి. అక్కడ రూ.3 వరకు ఒక్కో పుట్ట దబ్బను విక్రయిస్తారు. పచ్చళ్ల కంపెనీలకు ఈ తరహా పుట్టదబ్బను విక్రయిస్తారు. ఇక నారింజపండు ధరలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఒక పండు రూ.2కి కొనుగోలు చేసిన వ్యాపారులు మైదాన ప్రాంతాల్లో రూ.6 వరకు విక్రయిస్తారు. ఏజెన్సీలో పెండలం వంద హెక్టార్లలో, పుట్టదబ్బ, నారింజ, సాధారణ దబ్బ 500, గుమ్మడి 50 హెక్టార్లలో పండుతుంది. ఈ సీజన్లో ఇదే గిరిజనులకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం దిగుబడులు ఉన్నా ధరలు లేవని గిరిజన రైతులు వాపోతున్నారు. సోమవారం సీతంపేట, బుధవారం మర్రిపాడు, గురువారం దోనుబాయి, శనివారం పొల్ల, కుశిమి వారపు సంతలకు వాటిని గిరిజనులు తీసుకువస్తారు. లారీలు, వ్యాన్లలో వచ్చిన వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువెళ్తారు. కోల్డ్ స్టోరేజీ లేక అవస్థలు కోల్డ్ స్టోరేజీ సౌకర్యం లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీలో పండే ఉత్పత్తులను నెలలకొద్దీ నిల్వ చేసి ధరలు అత్యదికంగా ఉన్న సమయంలో విక్రయించుకోవడానికి వీలుగా సీతంపేటలో పదేళ్ల క్రితం కోల్డ్ స్టోరేజినీ ఏర్పాటు చేశారు. అయితే దానిపై గిరిజనులకు చైతన్యం లేకపోవడంతో ఎవరూ వినియోగించడం లేదు. దీంతో అది మూలన పడింది. దబ్బ, నారింజ, అరటితో పాటు సీజన్లలో లభ్యమయ్యే పైనాపిల్, చింతపండు వంటివి నిల్వ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అటవీ ఫలసాయాల విక్రయంలో గిరిజనులు నష్టాలు చవిచూస్తున్నారు. మరోవైపు ఈ తరహా ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థ కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉందని పలువురు గిరిజన రైతులు వాపోతున్నారు.ఏజెన్సీలో లభించే గుమ్మడివ్యాపారులు కొనుగోలు చేసిన పెండలం గిరిజనులు విక్రయిస్తున్న నారింజ, పుట్టదబ్బనష్టాలు తప్పడం లేదు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుందనుకున్న సమయంలో నష్టాలు వస్తున్నాయి. దీంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు ధరలు లేకపోవడంతో మిగతా పంటలు ఎలా పండించుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఎస్.మల్లయ్య, వజ్జాయిగూడ దళారులదే హవాఅటవీ ఉత్పత్తులు తీసుకువచ్చినా దళారుల హవా సాగుతోంది. కొన్నేళ్లుగా మన్యంలో పండే పంటలు దళారుల పాలవడంతో మాకు రావాల్సిన ఆదాయ వనరులు తగ్గుతున్నాయి. దీంతో నష్టాలు చవిచూస్తున్నాం. ప్రభుత్వ పరంగా గిరిజన రైతులను ఆదుకోవాలి. ఎస్.సన్నాయి, అక్కన్నగూడ -
బిల్స్టాప్ మీటర్లతో ఖజానాకు గండి
● ఓ ఉద్యోగిపై అనుమానాలు ● రూ.లక్షల్లో గోల్మాల్ ● ఆ శాఖ ఉద్యోగిపై విచారణ విజయనగరం ఫోర్ట్: విద్యుత్ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి సొంతింటికి కన్నం వేసినట్టు ఆ శాఖ సిబ్బంది గుసగుసలాడుతున్నారు. బిల్స్టాప్ మీటర్ల ను ఒక్కొక్కటి రూ.10వేల నుంచి రూ.15వేలకు అమ్మేసి సొమ్ముచేసుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో రూ.20 లక్షల నుంచి రూ. 30లక్షల వరకు గోల్మాల్ జరిగినట్టు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివెనుక ఆ శాఖ అధికారు ల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. బిల్లు స్టాప్ మీటర్లు వినియోగించడం వల్ల ఎంత విద్యుత్ వినియోగించినా బిల్లు రాదు. దీనివల్ల విద్యుత్ వినియోగానికి వినియోగదారుడు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. విద్యుత్శాఖ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. ఇదే విషయాన్ని విద్యుత్శాఖ ఈఈ పెద్దింటి త్రినాథరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా డిస్కనెక్షన్ చేసిన మీటర్లను జూనియర్ లైన్మన్ మార్చినట్టు మా దృష్టికి వచ్చిందని, దీనిపై ఉద్యోగి నుంచి సంజాయిషీ కోరామన్నారు. ఇచ్చిన వివరణ మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కొత్త ఏడాది తీరు మారేనా?
విజయనగరం అర్బన్/రామభద్రపురం: విద్యా సంవత్సరం చివరి దశకు వచ్చింది. మరో మూడు నెలల్లో ముగియనుంది. ఇప్పటికీ ప్రభుత్వ బడుల్లో సమస్యలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. విద్యార్థుల ‘సంక్షేమం’ అందని ద్రాక్షగానే మిగిలింది. ‘తల్లికి వందనం’ అందక విద్యార్థుల తల్లిదండ్రులు వినతులు పట్టుకుని ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు తిరుగుతూనే ఉన్నారు. మరోవైపు డిజిటల్ విద్య అటకెక్కింది. నాణ్యతలేని విద్యాకానుకలతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. పాఠ్యపుస్తకాలు సైతం పూర్తిస్థాయిలో అందని దుస్థితి. వందరోజుల విద్యాప్రణాళిక అమలులో లోపాలు విద్యార్థులకు శాపంగామారాయి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో జాప్యం ప్రభావం విద్యాబోధనపై చూపుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యంచేస్తోందని, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులకు ప్రాధాన్యం తగ్గిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ● పనులు పూర్తయ్యేనా? గత ప్రభుత్వం తలపెట్టిన నాడు–నేడు పథకం రెండో విడత నిర్మాణాలకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 737 విద్యాసంస్థల్లో 60 శాతం మేర పనులు పూర్తయిన నిర్మాణాలు ఇప్పుడు అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. నాడు–నేడు పనుల పేరు ‘మన బడి మన భవిష్యత్తు’గా పేరు మార్చడమే తప్ప నిధుల విడుదల, పనుల నిర్వహణ వంటివి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● డిజిటల్ విద్య గాలికి... పాఠ్యాంశాల బోధనకు సాంకేతికత జోడించి మరింత నాణ్యతను పెంచేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ విద్య తొలి ఏడాదిలోనే టీడీపీ ప్రభుత్వం నీరుగార్చింది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం వేల కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలల స్మార్ట్ టీవీలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ఐఎఫ్పీ (ఇంట్రేక్టివ్ ఫ్లాట్ పానెల్)లు మరమ్మతులకు గురైతే పట్టించుకోకపోవడం వల్ల అవి మూలకు చేరాయి. డిజిటల్ విద్యకు దోహదం చేసే 8వ తరగతి విద్యార్ధుల ట్యాబ్లు పంపిణీ చేయకుండా వాటి వినియోగాన్ని దూరం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక వ్యవస్థను దూరం చేసి కార్పొరేటు విద్యారంగంపై మమకారం చూపుతోందనే విమర్శలు విద్యావేత్తల నుంచి వినిపిస్తున్నాయి. ● టీడీపీ ప్రభుత్వం తొలిఏడాది తల్లికివందనం పథకాన్ని ఎగ్గొట్టింది. రెండో ఏడాది జిల్లాలో కేవలం 60 శాతం మందికి మాత్రమే పథకం వర్తింప చేసి చేతులు దులుపుకుంది. అర్హులందరికీ వర్తింప చేయకపోవడమే కాకుండా భారీగా నిధుల్లో కోత విధించింది. ప్రకటించిన మేరకు రూ.15 వేలు తల్లుల ఖాతాల్లో వేయాల్సి ఉండగా చాలామందికి రూ.8 వేలు, రూ.9 వేలు, రూ.11 వేలు చొప్పున మాత్రమే వేసింది. వీరంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం శూన్యంగానే కనిపిస్తోంది. ● టీచర్లకు ప్రభుత్వం ఇచ్చిన పలు రకాల హామీలుకూడా నెరవేర్చలేదు. గతేడాది జూలైలో చేపట్టిన బదిలీల్లో జరిగిన లోపాలను ఇప్పటివరకు సరిచేయలేదు. 12వ పీఆర్సీ కోసం గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసినా ఇప్పటివరకు నూతన కమిటీని వేయలేదు. దీనిపై ఎన్నోసార్లు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేసినా ఫలితం లేదు. ● జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 16,287 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. గతంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా పరిషత్ నిధులు కేటాయించి స్టడీ మెటీరియల్ అందించేవారు. ఈ ఏడాది చంద్రబాబు సర్కారు నిధులు కేటాయించకపోవడంతో ఎస్సీఈఆర్టీ సిద్ధంచేసిన మోడల్ పేపర్లే దిక్కయ్యాయి. ఆ పేపర్లు కూడా సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఒక్కోస్కూల్కు ఒక్కోసెట్ మోడల్ పేపర్లు మాత్రమే అందజేసింది. ఎస్సీఈఆర్టీ ఇచ్చిన మోడల్ పేపర్లే దిక్కంటూ విద్యార్థులు సొంత డబ్బులతో జెరాక్సులు తీసుకుని చదువుసాగిస్తున్నారు. ప్రభుత్వ విద్యపై నిర్లక్ష్యం విద్యాసంవత్సరం ముగుస్తున్నా అందని తల్లికి వందనం గాలికి వదిలేసిన డిజిటల్ విద్య టీచర్లకు ఇచ్చిన హామీల అమలూ అంతే.. లోపభూయిష్టంగా వంద రోజుల ప్రణాళిక అమలు -
కలియ దున్నితే కలదు లాభం
● వరి వ్యర్థాలను ఉపయోగించుకోవాలి ● రబీకి సిద్ధమవుతున్న రైతులకు సూచన భామిని: ఖరీఫ్ పంటకాలం పూర్తయింది. పొలాల నుంచి ధాన్యం కళ్లాలకు, మిల్లులకు చేరుతున్నాయి. కోత నూర్పిడి యంత్రాల సహాయంతో పొలాల్లో వరి చేను గడ్డి కుప్పలు తెప్పలుగా పడింది. పశువుల పెంపకం తగ్గడంతో వరి గడ్డి అవసరాలు గణనీయంగా పడిపోయాయి. పొలాల్లో పంట వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.ఈ తరుణంలో రబీ పంటలకు సిద్ధమవుతున్న రైతాంగం వరిగడ్డిని తగులబెట్టడాన్ని వ్యవసాయ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. పొలంలోని వరి కొయ్యలతో పాటు మిగతా పంటలైన పత్తి, జొన్న, మిరప వ్యర్థాలను కుప్పలు పోసి తగలబెట్టడంతో కలిగే దుష్పరిణామాలు వివరిస్తున్నారు. ఈ పంట వ్యర్థాలు తగలబెట్టడంతో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, ఆ వేడితో భూమి సారాన్ని కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు. పంట వ్యర్థాలు తగులబెట్టే సమయంలో విడుదలయ్యే పొగ వల్ల తీవ్ర వాతావరణ కాలుష్యంతో పాటు రైతుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని సూచిస్తున్నారు. రబీ వరి కోసం పొలాలను దున్నే క్రమంలో అగ్నికి ఆహుతి చేసి చెడు ప్రభావాలు తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు. వరికోత పొలాల్లో విస్తారంగా పడిన వరిగడ్డి కుప్పలు, ఇతర పంటలు పూర్తయిన తరువాత వచ్చే వ్యర్థాలను తొలగించడానికి ఖర్చులు అవుతాయనే నెపంతో రైతాంగం అగ్నికి ఆహుతి చేయడం తగదని, గడ్డి కుప్పలను తగలబెట్టడంతో భూమి సారం తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. పంటను కాపాడే కోట్ల సంఖ్యంలో సూక్ష్మజీవులు, బాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనం అవుతాయి. మంటల తాకిడి ఫలితంగా పంటను కాపాడవలసిన భూమి పొరల్లోని సూక్ష్మజీవులు నాశనమై పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలియజేస్తున్నారు.కలియ దున్నడం మంచిదిపంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియ దున్నడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. పంట దిగుబడి పది శాతం పెరగవచ్చు. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో సూపర్ఫాస్పేట్ చల్లితే గడ్డి అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు ఎరువుగా మారి పంట దిగుబడులు పెరుగుతాయి. కొల్లి తిలక్, వ్యవసాయాదికారి, భామిని -
రహదారి నిబంధనలు విధిగా పాటించాలి
పార్వతీపురం: రహదారి నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన తన చాంబర్లో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను ప్రారంభించి వాల్పోస్టర్ను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 90శాతం రహదారి నిబంధనలు పాటించకపోవడం వల్లే జరుగుతున్నాయన్నారు. వాహన దారులు తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడిన కుటుంబసభ్యులు, పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని రహదారి నిబంధనలను పాటించాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా రవాణాధికారి దుర్గాప్రసాద్ రెడ్డి, ఆర్టీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి నాల్గవ విడత రీసర్వేపార్వతీపురం: జిల్లాలో నాల్గవ విడత భూ రీసర్వే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవుతుందని కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి గురువారం పేర్కొన్నారు. నాల్గవ విడత రీసర్వేను 120 గ్రామాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రీ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. భూ సమస్యల పరిష్కారం, భూములపై స్పష్టమైన హక్కులు, ఆధునిక మ్యాప్ల రూపకల్పన తదితర ప్రయోజనాలు రైతులకు కలుగుతాయన్నారు. రీ సర్వేకు అవసరమైన భూములకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు, పట్టాలు, ఇతర అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ సర్వేలో రెవెన్యూ సిబ్బందికి రైతులు సహకరించాలని కోరారు. విశాఖసిటీ: విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ జెట్టి పదోన్నతి పొందారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ)గా గురువారం ఆయన రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని ఇతర పోలీస్ అధికారులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని ఎస్పీలు తుహిన్ సిన్హా (అనకాపల్లి), అమిత్ బర్దర్ (అల్లూరి), కేవీ మహేశ్వర్రెడ్డి (శ్రీకాకుళం), ఎస్.వి.మాధవరెడ్డి (పార్వతీపురం), ఏఆర్.దామోదర్ (విజయనగరం) ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందించి పదోన్నతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారుల సమక్షంలో ఐజీ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఐజీ ఆకాంక్షించారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు ఎల్ల ప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, క్యాంపు కార్యాలయం సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్యరామభద్రపురం: మండలంలోని కొట్టక్కి గ్రామంలో పక్కింటి వ్యక్తి తిట్టాడని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తెంటు రమణమ్మ (32)కు చిల్లంగి ఉందని పక్కింటి వ్యక్తి మద్యం తాగి వచ్చి బూతులు తిట్టాడు. దీంతో తననే తిడుతున్నాడని మనస్తాపానికి గురైన ఆమె డిసెంబర్ 31న పురుగు తాగేసింది. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం సాలూరు సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు ఎస్సై వి. ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జెడ్పీలో కొత్త సంవత్సర వేడుకలు
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు విజయనగరం రూరల్: జిల్లా పరిషత్లో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జెడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ సమక్షంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. అనంతరం ఉమ్మడి జిల్లా ప్రజలకు, నాయకులకు, అధికారులకు, అభిమానులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అభిమానులు వందలాది మంది తరలివచ్చి జెడ్పీ చైర్మన్కు పుష్పగుచ్చాలు, బొకేలు అందజే శారు. జెడ్పీ మహిళా ఉద్యోగులు ఆయనకు పూలమొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపా రు. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర, బి.ప్రదీప్నాయుడు దంపతులు పాల్గొని జెడ్పీ చైర్మన్కు కేక్ తినిపించారు. ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ చైర్మన్ ఆరుగురు ఉద్యోగులకు ఉద్యోగోన్నతి ఉత్తర్వులను కానుకగా అందజేశారు. కె.రితిక, ఎం.దినేష్కుమార్, కె.వంశీకృష్ణ, సీహెచ్ ఉదయ్కు జూనియర్ సహాయకులుగా నియామక పత్రాలు అందించారు. మరో ఇద్దరికి రికార్డు అసిస్టెంట్లగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. విజయనగరం అర్బన్: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు గురువారం జిల్లా కేంద్రంలో, కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. అయ్యన్నపేట కూడలి సమీపంలోని కల్యాణ మండపంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబితకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డికి పలువురు అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి పుస్తకాలు, పెన్నులు, పూల మొక్కలు అందజేశారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు పి.గోవిందరాజులు, ఆ శాఖ సిబ్బంది కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంబరం -
నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలి
విజయనగరం క్రైమ్: కొత్త ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఎస్పీ దామోదర్ ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ఎస్పీ బంగ్లాలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరకుమార్, డీటీసీ డీస్పీ పి.నారాయణ రావు, ఎఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఎస్.విద్యాసాగర్, నగర ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఇతర శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ఈ ఏడాదిలో అందరికీ శుభాలు జరగాలని సూచించారు. పోలీస్శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా సమర్థవంతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ప్రజలందరికీ మంచి సేవలందిస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను పెంచే విధంగా పనిచేయాలన్నారు. జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
సాంకేతికతతో సేవలందించి లక్ష్యాలను సాధిద్దాం
పార్వతీపురం రూరల్: కొత్త ఆశలు..కోటి ఆశయాల కలయికతో నూతన వసంతంలోకి అడుగుపెట్టిన వేళ, వృత్తిధర్మంలో సాంకేతికతను జోడించి ప్రజలకు ‘రక్షణ కవచం’లా నిలవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ కేక్ కట్ చేసి, పోలీసు సిబ్బందికి, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, 2026లో పోలీస్ శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ‘సాంకేతికతతో సేవలు–సమర్థవంతమైన పోలీసింగ్‘ అన్న సూత్రంతో ముందుకు సాగాలని, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణం కల్పించడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పౌరులుగా జిల్లా అభివృద్ధికి ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటేశ్వర రావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సంవత్సర సంకల్పాన్ని చాటారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
కిక్ఇచ్చిన మద్యం అమ్మకాలు
● మూడు రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు రూ.21.30 కోట్ల ఆదాయం ● అర్ధరాత్రి దాటిన వరకు అమ్మకాలు విజయనగరం రూరల్: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జిల్లా నుంచి ఆదాయం భారీగా సమకూరింది. నూతన సంవత్సరం వేళ మద్యం అమ్మకాలతో భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ధ్యేయంతో అర్ధరాత్రి ఒంటి గంట వరకు అమ్మకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. జిల్లాలోని అబ్కారీశాఖ పరిధిలో 169 మద్యం దుకాణాలు, 20 బార్లు ఉన్నాయి. గతనెల 29, 30, 31 తేదీల్లో రూ.21.30 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయి. 29న 11,168 ఐఎంఎల్ కేసులు, 3,996 బీరు కేసుల విక్రయాలతో రూ.8.05 కోట్లు, 30న 9,674 మద్యం కేసులు, 3,634 బీరు కేసుల అమ్మకాలతో రూ.6.9 కోట్లు, 31న 8,941 ఐఎంఎల్ కేసులు, 3,464 బీరు కేసుల అమ్మకాలతో రూ.6.35 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. మరోవైపు మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి (డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు) అపరాధ రుసుం రూపంలో భారీగా ఆదాయం సమకూరినట్టు సమాచారం. -
రక్తదానంలో ‘రాముడు’
రాజాం: ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా ఆయన 58 సార్లు రక్తదానం చేశారు. 18వ ఏట ఆరంభించిన రక్తదాన యజ్ఞాన్ని చిత్తశుద్ధితో కొనసాగిస్తూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. రక్తదాతగా పేరుపొందారు. ఆయనే రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన శనపతి రాము. అత్యవసరంగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని పిలుపు రావడంతో రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రికి గురువారం వెళ్లి రక్తదానం చేసినట్టు రాము తెలిపారు. రక్తదాతను ఆస్పత్రివైద్యులు అభినందించారు. రెవెన్యూ సర్వీసెస్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్–2026 డైరీ, క్యాలెండర్ను కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డైరీలో పొందుపరిచిన రెవెన్యూ విభాగానికి సంబంధించిన కీలకమైన చట్టాలు, సర్కులర్లు, మెమోలు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. విధి నిర్వహణలో అవసరమైన సమాచారాన్ని ఒకే చోట పొందగలగడం వల్ల పనిలో వేగం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు దాడ్డి గోవింద్, కార్యదర్శి నూర్యతోపాటు జిల్లా రెవెన్యూ అధికారి మురళి, కలెక్టరేట్ ఏఓ దేవ్ ప్రసాద్, ఇతర రెవెన్యూ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రెవెన్యూ సిబ్బంది కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 17న ‘స్వచ్ఛ రథం’ ప్రారంభం విజయనగరం అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్ధ నిర్వహణే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథం’ పథకాన్ని ఈ నెల 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి గురువారం తెలిపారు. ఈ పథకం వస్తుమార్పిడి (బార్టర్) విధానంలో కొనసాగుతుందని వివరించారు. ప్రజలు అందజేసే పొడి చెత్తకు బదులుగా నిత్యావసర సరుకులు అందిస్తారని, దీనివల్ల గ్రామాల్లో చెత్త వేరు చేసే అలవాటు పెంపొందుతుందని తెలిపారు. జిల్లాలోని 27 మండలాలకు ఒక్కో స్వచ్ఛ రథానికి నెలవారీ అద్దె విధానంలో ఆపరేటర్లను ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి అద్దె చెల్లిస్తామన్నారు. ఔత్సాహికులు తమ దరఖాస్తులను జిల్లా పంచాయతీ అధికారి విజయనగరం కార్యాలయానికి ఈ నెల 7వ తేదీలోగా సమర్పించాలని కలెక్టర్ కోరారు. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అర్హులైన ఆపరేటర్లను ఎంపిక చేస్తుందన్నారు. బాలక్ రామమందిర్కు రూ.లక్ష విరాళం విజయనగరం టౌన్: అయోధ్య బాలక్ రామమందిర్ నమూనాలో నిర్మితమవుతున్న బాలక్ రామమందిర్కు శ్రీ వాసవీ చారిటీ మిత్రుల గ్రూప్, వాసవీక్లబ్ సంయుక్తంగా రూ.లక్షా11వేల111లు ఆలయ అధ్యక్షుడు కుసుమంచి సుబ్బారావుకు గురువారం విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో చారిటీ గ్రూప్ అధ్యక్షుడు ఆలవెల్లి శేఖర్, వాసవీక్లబ్ జిల్లా గవర్నర్ తమ్మన కల్యాణ్రాజు, ఆలయ కన్వీనర్ పువ్వాడ శ్రీహరి, కార్యదర్శి డిమ్స్ రాజు, కోశాధికారి సముద్రాల నాగరాజు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కుంకాల పండు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు నిబంధనలు విధిగా పాటించాలి
విజయనగరం అర్బన్: ప్రతి ప్రయాణికుడు రోడ్డు నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ప్రజలకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఆయన గురువారం అధికారికంగా ప్రారంభించారు. వాల్పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారిపై వాహనాలను జాగ్రత్తగా నడిపితే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 90 శాతం నిబంధనలు పాటించకపోవడం వల్లే సంభవిస్తున్నాయని తెలిపారు. వాహన చోదకులు తమ కుటుంబాలు, పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని బాధ్యతతో వాహనాలను నడపాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ వర్గాల ప్రజలకు, వాహన చోదకులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ డి.మణికుమార్, మోటారు వాహన తనిఖీ అధికారులు మురళీకృష్ణ, దుర్గప్రసాద్, శశికుమార్, రవిశంకర్ ప్రసాద్, వెంకటరావు, శివరామగోపాల్, రమేష్కుమార్, ఉష, శ్రావ్య, ఐశ్వర్యలక్ష్మి, నవీన్, తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి శాపం!
హిరమండలం: సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలుచేసినట్టు కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ హిరమండలం మండలంలో నిరుపేద కుటుంబంలో ముగ్గురు పిల్లలకు ఈ పథకం వర్తించలేదు. దీంతో ఆ కుటుంబం కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. అయినా కనికరించేవారు కరువయ్యారు. జగన్నాథపురంలో లిమ్మక పెంటయ్య, ఈశ్వరి దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరంతా వంశధార నిర్వాసితులు. నిరుపేదలు కావడంతో పూరిగుడిసెలో నివాసముంటున్నా రు. ముగ్గురు పిల్లలూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కనీసం వీరికి విద్యుత్ మీటరు కూడా లేదు. కానీ ఏకంగా ఏడు మీటర్లు ఉన్నట్టు చూపడంతో తల్లికి వందనం పథకం వర్తించలేదు. విద్యు త్ శాఖ అధికారులు వీరికి ఎటువంటి మీటరు లేదని ధ్రువీకరించినప్పటికీ తల్లికి వందనం పథకం మాత్రం అందలేదు. కార్యాలయాల చుట్టూ తిరగడమే కానీ ఫలితం లేకపోతోంది. కొత్త సంవత్సరంలోనైనా అధికారులు స్పందించి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు విశ్వేశ్వరరావు
శ్రీకాకుళం న్యూకాలనీ : జాతీయ బాక్సింగ్ పోటీల కు జిల్లాకు చెందిన బాక్సర్ పి.విశ్వేశ్వరరావు ఎంపికయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడా వేదికగా ఈ నెల 4 నుంచి 10 వరకు తొమ్మిదో ఆలిండియా ఎలైట్మెన్ బాక్సింగ్ చాంపియన్షిప్–2025–26 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం విశ్వేశ్వరరావు గురువారం ఇక్కడి నుంచి పయనమైవెళ్లాడు. ఇటీవ ల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడంతో జా తీయ పోటీలకు ఎంపికయ్యాడు. డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు నేతృత్వంలో కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయికి చేరుకోవడం అభినందనీయమని డీఎస్డీఓ ఎ.మహేష్బాబు సంతో షం వ్యక్తం చేశారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ బీఏ లక్ష్మణ్దేవ్, వంగా మహేష్ ప్రోత్సా హం, శిక్షకుల చొరవ ప్రసంశనీయమని సీనియర్ బాక్సర్లు రాజీవ్, అప్పలరాజు, రాము, మనోజ్కుమార్ తదితరులు పేర్కొన్నారు. -
జేఎన్టీయూ జీవీలో నూతన సంవత్సర వేడుకలు
● హిల్లాక్ వాకింగ్ ట్రాక్ ప్రారంభం ● క్యాలెండర్ను ఆవిష్కరించిన ఉప కులపతి వీవీ సుబ్బారావువిజయనగరం రూరల్: విజయనగరం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప కులపతి వీవీ సుబ్బారావు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం ఉత్తరాంధ్ర ప్రాంతానికే తలమానికమన్నారు. కొత్త ఏడాదిలో విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని, ఈ అభివృద్ధిలో అధికారులు, ఆచార్యులు, విద్యార్థులు, సిబ్బంది భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. దీనిలో భాగంగా గతేడాది ప్రారంభించిన ‘ఆరోగ్యం కోసం ఒక గంట–ప్రకృతితో’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రాంగణంలో కొండపై, పచ్చటి చెట్ల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హిల్లాక్ వాకింగ్ ట్రాక్ను ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయం నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి.జయసుమ, అధికారులు, ఆచార్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
జామి: మండలంలోని కొత్త భీమసింగి గ్రామానికి చెందిన యువకుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు, స్ధానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్త భీమసింగి గ్రామానికి చెందిన పాండ్రంకి వెంకటేష్(35) మంగళవారం సాయంత్రం అత్తవారికి సంబంధించి విజయనగరంలోని జూట్మిల్లు వద్ద గల పాస్ట్ఫుడ్ సెంటర్కు వెళ్లాడు. అక్కడ వారికి సహాయం చేసి తిరిగి మంగళవారం రాత్రి స్వగ్రామానికి 11.45గంటలకు బైక్పై వస్తున్న సమయంలో చిన్నాపురం జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో స్పృహ కోల్పోయి పక్కకు పడిపోయాడు. ఈ విషయాన్ని స్ధానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వచ్చి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పద్మనాభం మండలం పోలీసులు కేసు నమోదుచేశారు. భీమిలి సీహెచ్సీలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహన్ని స్వగామం కొత్త భీమసింగికి తరలించారు. పావుగంటముందే భార్యకు పోన్ మృత్యువాత పడడానికి పావుగంట ముందే వెంకటేష్ భార్యకు ఫోన్ చేశాడు. ఇంతలోనే భర్త మృతిచెందాడన్న విషయం తెలియడంతో భార్యతో పాటు కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడు వెంకటేష్కు భార్య సూర్యకళ ఇద్దరు కుమార్తెలు గాయత్రి(11),యోగితాశ్రీ(10), తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. తండ్రి నాగరాజు ఇటీవల పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు. బైక్ అదుపుతప్పి యువకుడి మృతివేపాడ: మండలంలోని కుమ్మపల్లి జంక్షన్ వద్ద బుధవారం బైక్ అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇందుకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి మండలం కొత్తూరు ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన చౌడువాడ దేముడునాయుడు(25) వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులతో గ్రామంలో నివాసముంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం అదే గ్రామానికిచెందిన స్నేహితుడు గంధం మహేష్తో కలిసి బైక్పై వెళ్లాడు. బిర్యానీ లేకపోవడంతో తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా కుమ్మపల్లి జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపు చేయలేక నడుపుతున్న గంధం మహేష్ సడన్ బ్రేక్ వేయడంతో బైక్ వెనుక కూర్చున్న దేముడునాయుడు బైక్పై నుంచి తుళ్లి పడి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతిచెందాడు. దీనిపై మృతుడి తండ్రి చౌడువాడ సముద్రంనాయుడు వల్లంపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై సుదర్శన్ కేసు నమోదుచేసి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
సౌత్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీల్లో జైత్రయాత్ర
విజయనగరం: చైన్నె వేదికగా డిసెంబర్ 28న నిర్వహించిన సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ కాంపిటిషన్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా పేరును జాతీయస్థాయిలో మార్మోగించారని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన తన నివాసంలో విజయం సాధించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. 80 కేజీల కేటగిరీలో అద్భుత ప్రదర్శనతో బ్రాంజ్ మెడల్ సాధించి జాతీయస్థాయిలో సత్తా చాటిన ఎస్.కె.సుభాన్, అలాగే 55 కేజీల కేటగిరీలో జి.రమేష్ నాలుగవ స్థానం, జూనియర్ విభాగంలో ఆరవ స్థానం సాధించి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయనగరం పేరు మార్మోగేలా కృషి చేసిన క్రీడాకారుల పట్టుదల, శ్రమ ప్రశంసనీయమని కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ హర్షంవిజయనగరం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకల కృష్ణ, సెక్రటరీ బైక్ రమేష్ విజేతలను అభినందిస్తూ, జిల్లా నుంచి ఇలాంటి ప్రతిభావంతులు ముందుకు రావడం ఎంతో ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ విజయాలతో విజయనగరం జిల్లా బాడీ బిల్డింగ్ రంగంలో మరోసారి తన సత్తా నిరూపించిందన్నారు. -
కలలు చెదిరిపోయే..జనం బెదిరిపోయే..
● ఈ ఏడాదైనా బాగుంటే చాలు అంటున్న వివిధ వర్గాల ప్రజలు సాక్షిప్రతినిధి విజయనగరం: రామభద్రపురం మార్కెట్లో కూరగాయల బస్తాలు దించేసి తువ్వాలుతో ముఖం తుడుచుకుని ఆటోలో చేరబడ్డాడు సింహాచలం. పక్కనే సొత్తికూర కావిడితో నిలబడి బీడీ ఊదుతూ నిలబడిన నారాయణతో మాట కలిపాడు. ఏట్రా నారాయణా.. ఇంకొంచెం గడిస్తే కొత్త సంవత్సరం వచ్చేద్ది.. మరేటి లేదేట్రా అన్నాడు. ఎందుకు లేదురా బాబూ.. ఇంట్లో మీ అప్ప నెత్తల్ల ఇగురు.. గుడ్లు పులుసు చేసింది.. సాయంత్రం మా కల్లం కాడికి వచ్చేరా.. ఇద్దరం తలా బుక్కడు ఏసేద్దాం అన్నాడు. జాగర్తరా బాబు.. అసలే ఇది బాబు కాలం.. ఏది సరుకో.. ఏది ఇరుకో తెలీడం లేదు.. బాబు మార్క్ సరుకు తాగినా ఎండ్రిన్ తాగినా ఒకటే అని అంతన్నారు. నీ మందుకు ఒక దండం... నేను మిలట్రీ సరుకు తెచ్చుకున్నాను.. నువ్వే మా కోలగూడు సందుకాడికి వచ్చేయ్.. కూకుందాం అన్నాడు సింహాచలం. సర్లేగానీ కొత్తసంవత్సరం బాగుంటాదంటావా అన్నాడు సింహాచలం. ఆ.. బాబు పాలనలో ఏ సంవత్సరమైనా ఒకటేన్రా... మనం ఏ ఊరికి వెళ్లినా ఆకాశం ఒకేలా కనిపించినట్లు చంద్రబాబు పాలన ఎప్పుడూ ఒకేలా ఉంటాదిరా.. ఆయన భ్రమల్లో ఉంటూ.. జనాన్ని భ్రమల్లో ఉంచగలను అనుకుంటాడు.. ఈ ఏడాది జనాలు మా సెడ్డ సికాకు పడిపోనారనుకో అన్నాడు నారాయణ. ఒసే.. ఏటయ్యిందిరా అన్నాడు సింహాచలం.. ఓర్నీ తింగరి సన్నాసి.. యూరియా కోసం నానా తిప్పలు పడ్డావు.. టీడీపీ వాళ్ల గుమ్మం ముందు, ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాసినావ్.. అప్పుడే మర్చిపోనవేటిరా అన్నాడు నారాయణ.. ఒసే... యాదొచ్చిందిరో.. అన్నాడు సింహాచలం. అది కాకుండా.. పెన్షన్లు కోసం ఎన్ని తిప్పలు.. పడ్డాం. మా ఈరకత్తికి పెన్షన్ కోసం సదరం కోసం ఆస్పత్రులు తిప్పినారు అన్నాడు. 50 ఏళ్లు నిండిన బడుగువర్గాలవారందరికీ పింఛన్ ఇస్తామన్నారు.. ఒక్కరికై నా ఇచ్చార్రా.. ఉన్నది తీసేస్తున్నారు..అన్నాడు నారాయణ.. అవునుకదూ.. జనం గురించి అస్సలు పట్టించుకోవడంలేదు అన్నాడు సింహాచలం. అదొక్కటేనా మా అమ్మికి ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు.. ఏం లేదు పొమ్మన్నారు.. బాబుగారు డబ్బంతా షికార్లకు తగలేసి ఆస్పత్రుల బిల్లులు ఎగ్గొట్టారట. మరేటి చేస్తాం. యాభైవేలెట్టి బయట ఆపరేషన్ చేయించాం. మా మనవడికి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రాలేదు.. ఆ కాలేజీవారు ఈ గుంటడిని గొప్ప ఇబ్బంది పెట్టేశారనుకో.. ఆఖరుకు షావుకారు కాడ మా అమ్మి గొలుసు పద్దుపెట్టి ఫీజు కడితే తప్ప పరీక్ష రాయించలేదు. మా ఊరో ళ్లకు చాలామందికి తల్లికి వందనం పథకం పడలేదురా... వారు రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదట.. ప్రభుత్వం ఇవ్వకపోతే మాకేటి చేయమంటారని విసుక్కుంటున్నారట.. ఒకటా రెండా ఎన్నని చెప్తాను అన్నాడు నారాయణ.. అవునొరే.. ఇవన్నీ ఒకెత్తు కానీ ఈ మందు మాత్రం మరి చెప్పలేమురా అన్నాడు సింహాచలం.. జగనున్నప్పుడు ఎక్కడో ఒకటో రెండో దుకాణాలు ఉండేవి. ఇప్పుడు నీరు లేని ఊరుంది కానీ బీరు లేని వీధి లేదురా అయ్యా.. ఒక్కో ఊరికి మూడేసి బెల్ట్ షాపులు.. ఎవడు తాగేసి ఉన్నాడో. ఎవడు నార్మల్ ఉన్నాడో పట్టుకోలేకపోతున్నాం. చీకటి పడితే వీధిలోకి రావడానికి ఆడోళ్లు భయపడిపోతున్నారు.. అన్నాడు సింహాచలం.. నిజమే.. మొన్న మా వీధిలో ఆ మంగ అలా వెళ్తుంటే తాగుబోతు వెదవలు గోలగోల చేసినారు.. అది పెద్ద పంచాయితీ అయింది.. అన్నాడు నారాయణ. రేషన్ కోసం ముసల్ది కూడా ఎక్కడికో వెళ్లాల్సిన దరిద్రంరా బాబూ.. పింఛన్కోసమూ అంతే కష్టాలు. ఒకటా రెండా. ఎన్నని చెబుతాంలే.. ఓటేసినందుకు దరిద్య్రాన్ని మోయాలి అన్నాడు నారాయణ... అవునోరే జగన్ కట్టిన గవర్న్మెంట్ ఆస్పత్రులు.. మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చేత్తన్నాడట చంద్రబాబు.. ఇలాంటి సెడుబిడకల పనుల్లో బాబు ముందుంటాడు. ఏదీ కట్టలేడు కానీ అమ్ముకోవడంలో మనోడు నంబర్ వన్.. కొత్త ఏడాదైనా మనకు బావుంటాదంటావా అన్నాడు నారాయణ.. అర్రే.. అన్నీ తెలిసి మళ్లీ అడుగుతావేంట్రా బాబు.. బాబుంటే దరిద్రం ఉన్నట్లే.. మనకు దరిద్రం ఉంటే బాబు ఎదురొచ్చినట్లే.. ఐదేళ్లూ మనకు ఇదే సినిమా చూపిస్తాడు అన్నాడు సింహాచలం. ఓరినాయనో.. భయంగా ఉంది.. సర్లే ఉండు సొత్తి కూడా ఇచ్చేసి వస్తాను అంటూ బయటకు వెళ్లాడు నారాయణ. -
మాయమైన డబ్బులు లభ్యం
సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామంలో సోమవారం పెన్షన్ డబ్బుల్లో రూ.50 వేలు మాయమైనట్లు పంచాయతీ కార్యదర్శి సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. అయితే ఈ విషయమై సచివాలయ సిబ్బందిని పోలీసులు సోమవారం రాత్రి విచారణ చేశారు. మంగళవారం పెన్షన్ పంచేందుకు సచివాలయానికి చేరుకునే సరికి సచివాలయంలో రూ.50వేల నోట్ల కట్ట గమనించామని, ఈ నోట్ల కట్టను ఎవరో కిటికీలో నుంచి వేశారని, పోలీసుల సూచన మేరకు రాత్రి కిటికీ తెరిచి ఉంచామని కార్యదర్శి తెలిపారు. 10 ఇసుక లారీలు సీజ్● అపరాధ రుసుం విధింపు పూసపాటిరేగ: మండలంలోని కందివలస జంక్షన్ సమీపంలో జాతీయరహదారిపై అధిక లోడుతో వెళ్తున్న 10 ఇసుక లారీలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సతీష్ బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వాహనాలను రవాణాశాఖ అధికారులకు అప్పగించగా రవాణాశాఖ అధికారి ఐశ్వర్యలక్ష్మి ఆ వాహనాలకు అపరాధ రుసుం విధించారు. అనంతరం పోలీస్స్టేషన్ సమీపంలో ఉన్న ఇసుక లారీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ అనుమతికి మించి అధిక లోడు వేసిన వాహనాలపై చర్యల కు ఉపక్రమిస్తామన్నారు. ఈ విషయాన్ని వా హనదారులు గమనించాలని సూచించారు. -
ఆలయంలో చోరీ కేసు ఛేదన
చికెన్● ఇద్దరు నిందితుల అరెస్ట్ ● రూ.9.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనంపార్వతీపురం రూరల్: సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం ఆవరణలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన భారీ చోరీ మిస్టరీని సీతానగరం పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ. 9.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో గల ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. సీతానగరం మండలం జోగింపేటకు చెందిన పోలా భాస్కరరావు, హిరమండలానికి చెందిన సవర సూర్యం వృత్తిరీత్యా దొంగలు. గతంలో వారిద్దరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో ఒకరికొకరు పరిచయమై, బయటకు వెళ్లాక పెద్ద మొత్తంలో సొత్తును అపహరించాలని పథకం రచించారు. కటకటాల నుంచి విడుదలైన తర్వాత తమ పాత బుద్ధిని పోనిచ్చుకోకుండా, నవంబరు 1వ తేదీ రాత్రి లచ్చయ్యపేట ఆలయంలో చొరబడి నగలను దోచుకెళ్లారు. అయితే, తీగ లాగితే డొంక కదిలినట్లు డిసెంబరు 7న బొబ్బిలి పోలీసులు వేరే కేసులో వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా లచ్చయ్యపేట చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుల అంగీకార నివేదిక ఆధారంగా సీతానగరం పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. జోగింపేట గ్రామ శివారులో నిందితులు దాచి ఉంచిన సుమారు 92 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కేజీల 400 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.10.75 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురవగా, రూ.9.40 లక్షల విలువైన వస్తువులను రికవరీ చేశారు. చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్న పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం, ఎస్సై ఎం.రాజేష్ పోలీసు సిబ్బందిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
‘మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్’ విజేతలకు బహుమతులు
విజయనగరం అర్బన్: జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం (ఏపీఎంఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ‘మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్’లో ప్రతిభచూపి విజేతలుగా నిలిచిన పదిమందికి జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యం నాయుడు బుధవారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ గణితం విద్యార్థుల తార్కిక శక్తిని, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు. ఇటువంటి పోటీపరీక్షలు విద్యార్థుల్లో గణితంపై ఆసిక్తిని పెంచేందుకు ఎంతో దోహదపడతాయన్నారు. వెయ్యిమంది పాల్గొన్న ఈ పోటీల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తరగతికి ఇద్దరు వంతున 10 మంది విజేతలను ఎంపిక చేశారని తెలిపారు. విజేతలలో 10వ తరగతికి సుంకర జ్యోతి (బొండపల్లి జెడ్పీహెచ్ఎస్), జి.గౌస్ (మున్సిపల్ హైస్కూల్ విజయనగరం, 9వ తరగతికి ఎల్.నిత్యసారథి (శ్రీరాంనగర్ హైస్కూల్), జి.శ్రుతి (అయ్యన్న పేట హైస్కూల్), 8వ తరగతికి మజ్జి యోషిత (గర్భాం హైస్కూల్), ఎం.కుసుమ (పెంట జెడ్పీహెచ్స్కూల్), 7వ తరగతికి టి.మోహిత్ కుమార్ (గర్భాం ఏపీ మోడల్ స్కూల్), ఎ.నిహారిక (ఎంపీయుపీ స్కూల్, జీసీపల్లి), 6వ తరగతికి కాళ్ల హర్హప్రియ(జరజాపుపేట హైస్కూల్), వై.మోక్షిత (నెల్లిమర్ల జెడ్పీహెచ్స్కూల్) విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో ఏపీహెచ్ఎం జిల్లా అధ్యక్షుడు ఎం.వేణుగోపాలరావు, ఏపీఎంఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు సిద్ధాంతం త్రినాథరావు, రాష్ట్ర కార్యదర్శి వి.చిన్నంనాయుడు, జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎస్.బంగారయ్య పాల్గొన్నారు. అనంతరం గణిత ఫోరం రూపొందించిన గణిత క్యాలెండర్లను డీఈఓ యూ.మాణిక్యం నాయుడు ఆవిష్కరించారు. -
హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్గా శాన్వి
● విజయనగరంలో ఆంధ్ర జట్టుతో తలపడనున్న హైదరాబాద్ జట్టుగుమ్మలక్ష్మీపురం: మండలంలోని రెల్ల గ్రామానికి చెందిన పత్తిక శాన్వి బీసీసీఐ ఉమెన్స్ అండర్–15 వన్ డే ట్రోఫీ 2025–26 హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికై ంది. ఆమె సారథ్యంలో హైదరాబాద్ జట్టు విజయనరంలోని విజ్జీ స్టేడియంలో 2026వ జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుతో తలపడనుంది. ఈమేరకు రెల్ల గ్రామానికి చెందిన శాన్వి తండ్రి పత్తిక ప్రవీత్ రంజీ ప్లేయర్ కావడంతో హైదరాబాద్లో ఉంటూ..తన కుమార్తె శాన్వి కూడా క్రికెట్లో ప్రతిభ చూపేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. తండ్రి పోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్న శాన్వి ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఉప్పల్) వేదికగా కోచ్ సాలాం బయాష్ అలియస్ తిలక్ వర్మ ఆధ్వర్యంలో రెండున్నరేళ్లుగా పలు బాలికల క్రికెట్ పోటీల్లో అండర్–15 విభాగంలో దేశ, విదేశాల్లో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో పాల్గొని పతిభకనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెలోని ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఉమెన్స్ సెలక్షన్ కమిటీ చైర్మన్, సెలక్టర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా ఆమెను ఎంపిక చేశారు. ఆమె కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల కుటుంబసభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోటీల్లో ఉత్తమంగా రాణించాలని ప్రోత్సహించారు. -
నూతన సంవత్సర శుభాకాంక్షలు
విజయనగరం అర్బన్: జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ముందస్తు నూతన సంవత్సరం–2026 శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు కేవలం నోట్ బుక్స్, పెన్నులు మాత్రమే తీసుకురావాలని, బొకేలు, స్వీట్స్, పూల దండలు తీసుకురావద్దని కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నాయి. పదోతరగతి మోడల్ పేపర్స్ ఆవిష్కరణ విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రూపొందించిన 10వ తరగతి మోడల్ పేపర్స్ను డీఈఓ యు.మాణిక్యంనాయుడు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయ సంఘాల కృషి అభినందనీయమన్నారు. అనంతరం సంఘం రూపొందించిన వార్షిక డైరీ, వాల్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్రావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్.భాస్కరరావు, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు మీసాల అప్పలనాయుడు, జిల్లా కోశాధికారి తిరుపతినాయుడు, సీనియర్ నాయకులు డి.రాము, జే.రమేష్ చంద్రపట్నాయక్, జేఏవీఆర్కే ఈశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్ మాధవీలత పాల్గొన్నారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ విజయనగరం అర్బన్: జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభల ద్వారా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అధికారులు ముందుగా నిర్దేశించిన గ్రామాల్లో ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కొత్తపట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీచేస్తారని చెప్పారు. -
గుట్టుచప్పుడుగా గుట్కా విక్రయాలు
● ఒడిశా నుంచి అక్రమంగా దిగుమతి ● ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కులు పార్వతీపురం: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే పొగాకు ఉత్పత్తులను ఆహార భద్రత చట్టం కింద 2006లో అప్పటి ప్రభుత్వం నిషేధించింది. అయినా పట్టణాలనుంచి పల్లెల వరకు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు వ్యాపారులు నిబంధనలను పక్కన పెట్టి పక్క రాష్ట్రం ఒడిశా నుంచి పట్టణాలకు సరఫరా చేసుకుని అక్కడి నుంచి మండలాలకు, పల్లెలకు పంపిణీ చేస్తున్నారు. ఇలా చేతులు మారేకొద్దీ వాటి ధరలు కూడా అమాంతం పెంచి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పక్కనే ఉన్న ఒడిశా నుంచి పార్వతీపురం మీదుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అక్రమంగా గుట్కా రవాణా చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే గుట్కాను ప్రభుత్వం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ విక్రయాలు యథాతథంగా సాగుతున్నాయి. పార్వతీపురం పట్టణంతో పాటు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో గుట్కా, పాన్పరాగ్, ఖైనీ ప్యాకెట్లను రహస్యంగా విక్రయిస్తూనే ఉన్నారు. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ నుంచి గుట్కా, ఖైనీ ప్యాకెట్లు తెస్తున్న ముఠా.. స్థానికంగా కొంతమంది వ్యాపారుల అండదండలతో యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. గుట్కా ప్యాకెట్లు తరలిస్తూ తరచూ పలువురు పట్టుబడుతున్నా..విక్రయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పార్వతీపురం నేడు గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారింది చడీచప్పుడు లేకుండా విక్రయాలు పార్వతీపురం పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, బడ్డీ దుకాణాల్లో గుట్కా ప్యాకెట్లు, ఖైనీ ప్యాకెట్లు చడీచప్పుడు లేకుండా కూరగాయల బుట్టలు, బస్తాలు, చిన్న చిన్న సంచులలో భద్రపరుచుకుని విక్రయిస్తున్నారు. పోలీసులు తనిఖీ చేసే సమయంలో కూడా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగానే పప్పుధాన్యాల బస్తాల్లో, కూరగాయల బుట్టల్లో భద్రపరుస్తున్నారు. గుట్కాలకు అలవాటుగా మారిన వారు అధిక ధరలు పెట్టి వాటిని కొంటూనే ఉన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యాలతో అక్రమార్కులు చెలగాటమాడుతున్నారు. అనారోగ్యం బారిన పడుతున్న జనం పార్వతీపురం పట్టణం, మండలంతో పాటు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో సైతం నిషేధిత పొగాకు ఉత్పత్తులను తిని పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎక్కువగా యువకులు ఖైనీ, గుట్కాలను తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మానిక్చంద్, డీలక్స్, మిరాజ్, పాన్పరాగ్, రాజాఖైనీ, ఖైనీ వంటి బ్రాండ్లకు చెందిన గుట్కాలు జోరుగా విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలించే బండిళ్లలో తీసుకువచ్చి ఒక్కో ప్యాకెట్ను రూ.15 నుంచి రూ.25వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రాణాంతకమైన వ్యాధులు గుట్కా తింటే నోటి నుంచి జీర్ణవ్యవస్థ వరకు అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. దానివల్ల ప్రాణాంతకమైన జబ్బులబారిన పడే ప్రమాదం ఉంది. కేన్సర్, గుండెజబ్బులు, నోటి కేన్సర్, గొంతు కేన్సర్ వంటి భయంకరమైన రోగాలు వస్తాయి. పళ్లు అరిగిపోయి గారపడతాయి. నాలుక రుచి మొగ్గలు నశిస్తాయి. వాటి వల్ల ప్రాణనష్టం కూడా జరిగే ఆస్కారం ఉంది. – డా.యాళ్ల వివేక్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం -
న్యాయవ్యవస్థపై నమ్మకం గెలిపించింది
● మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ రాఘురాజు శృంగవరపుకోట: న్యాయస్థానంపై ఉంచుకున్న నమ్మకం గెలిచింది. వ్యవస్థలు మమ్మల్ని పట్టించుకోక పోయినా, న్యాయం గెలిపించిందని జిందాల్ నిర్వాసితులు, ఎమ్మెల్సీ రఘురాజు, రైతుసంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ తదితరులు అన్నారు. జిందాల్ నిర్వాసితులను యథాతథంగా వారి భూముల్లో ఉంచాలని, కోర్టు ఇచ్చిన ప్రాథమిక ఆదేశాల ప్రతులతో బుధవారం ఆయన బొడ్డవరలో గల ఎమ్మెల్సీ రఘురాజు ఇంటివద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ 2008నుంచి జిందాల్ భూముల్లో రైతులే ఉన్నారు. వారి భూములు వారే సాగు చేసుకుంటున్నారన్న విషయం అందరికీ తెలుసని, జిందాల్ నాడు భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, దౌర్జన్యంగా భూముల్లోకి చొరబడి, ఏళ్ల వయస్సున్న ఫల వృక్షాలను కూల్చేసిందన్నారు. న్యాయం కోసం 200 రోజులు శాంతియుత పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. నేడు కోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయవ్యవస్థపై నమ్మకం మరోమారు నిలబడిందన్నారు. ఇప్పుడు 33మంది నిర్వాసితులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, మరో 150 మంది రైతులు కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. నిర్వాసితులు అందరికీ న్యాయం జరిగే వరకూ ఉమ్మడి న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్.కోట ఎంపీపీ సొండి సోమేశ్వరరావు, వేర్వేరు పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, జిందాల్ నిర్వాసిత రైతులు పాల్గొన్నారు. -
మాతాశిశు మరణాల కట్టడికి చర్యలు చేపట్టాలి
పార్వతీపురం: జిల్లాలో మాతా శిశుమరణాల కట్టడికి పటిష్టంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో మాతా శిశు మరణాల నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు తరలించేలా ‘102’ 108’ వాహనాలను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. తక్కువ బరువుగల శిశువులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. మాతా శిశుమరణాలపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ పి.భాస్కరరావు, డీసీహెచ్ఓ ఎన్.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. -
మహాకవి గృహానికి మరమ్మతులు
● రూ.12 లక్షలు కేటాయించిన కలెక్టర్ ● హర్షం వ్యక్తం చేస్తున్న సాహితీవేత్తలు విజయనగరం టౌన్: మహాకవి స్వగృహం దీన స్థితిపై కలెక్టర్ రాంసుందర్రెడ్డి స్పందించారు. మరమ్మతుల పనులకు రూ.12 లక్షలు కేటాయించారు. దీనిపై మహాకవి కుటుంబీకులు, సాహితీ వేత్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025 సంవత్సరంలో మహాకవి స్వగృహంలో రెండు సార్లు దొంగలుపడ్డారు. విలువైన గ్రంథాలను చెల్లాచెదురు చేశారు. కుర్చీలు, తలుపులు విరగ్గొట్టారు. 12 అడుగులు పొడవు ఉండే పెరటి గోడ మట్టివేసేయడం వల్ల అదికాస్త నాలుగైదు అడుగులకు ఎగబాకింది. ఇంట్లోకి సులభంగా దూకి, దొంగతనాలకు పాల్పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. గోడవెనుక మట్టి తీసివేసి గోడపై ఐరెన్ పోల్స్వేసి ఇనుప కంచే వేయాలన్న ప్రతిపాదనలను సాహితీవేత్తలు చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మహాకవి వాడిన నూతి గట్టు వద్ద ఉన్న రెండు బాత్రూమ్లను తీసివేసి పూర్తిగా చదును చేయిస్తే సభలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని కోరారు. పాడైన తలుపులు, కిటికీల స్థానంలో కొత్తవి అమర్చాలని, రంగులు వేయాలని విన్నవించారు. ఎట్టకేలకు కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కరించేందుకు అడుగు ముందుకువేయడం శుభపరిణామం. మహాకవి స్వగృహానికి మరమ్మతులు చేపట్టేందుకు అధికార, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం ఆనందంగా ఉంది. గత కొన్నాళ్లుగా మహాకవి స్వగృహంపై వివిధ సంస్ధల ప్రతినిధులు ముందుకు వచ్చి మహాకవి ఇంటిని కాపాడుకోవడానికి పలు తీర్మానాలు చేశారు. అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించారు. నూతన సంవత్సరంలో మహాకవి ఇల్లు మరమ్మతులు పూర్తిచేసుకుని కొత్తరూపును సంతరించుకోనుంది. – గురజాడ ఇందిర, గురజాడ అప్పారావు మునిమనవరాలు, విజయనగరం -
విజయనగరం సబ్ జైలు ఆకస్మిక తనిఖీ
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ (ఎన్ఎఎల్ఎస్ఎ) న్యూఢిల్లీ ఆదేశాలతో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత బుధవారం స్థానిక సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ఖైదీల స్థితిగతులు, వారికి అందుతున్న వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జైలు ఆవరణలో ఖైదీలకు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఖైదీల పట్ల సిబ్బంది గాని, తోటి ఖైదీలు గానీ ఎటువంటి వివక్ష చూపరాదని స్పష్టం చేశారు. వివక్షకు తావులేకుండా చూడాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆమె ఉదహరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని జైలు సూపరింటెండెంట్ను హెచ్చరించారు. ఖైదీలు నేర ప్రవృత్తిని విడనాడి, మారుమనస్సు పొంది సమాజంలో ఉత్తమ పౌరులుగా మెలగాలని హితవు పలికారు. రిమాండ్లో ఉన్న ముద్దాయిలెవరూ న్యాయవాది లేక ఇబ్బంది పడకూడదని, అటువంటి వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఉచిత న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. జైలులోని లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును, పారా లీగల్ వలంటీర్ల సేవలను ఆమె పర్యవేక్షించారు. జైలులోని వంటగది, భోజనశాల, స్టోర్ రూమ్లను జిల్లా జడ్జి స్వయంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్లో ఉన్న పప్పు దినుసులు, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించి, వంటశాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాల్గవ అదనపు న్యాయమూర్తి బి.అప్పలస్వామి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, సబ్జైలు సూపరింటెండెంట్ కేఎస్ఎన్.మూర్తి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. ఖైదీలతో జిల్లా జడ్జి ముఖాముఖి -
పెన్షన్ డబ్బులు మాయంపై ఫిర్యాదు
సంతకవిటి: మండలంలోని మండాకురిటి సచివాలయంలో పెన్షన్ అమౌంట్ నుంచి రూ.50 వేలు మాయం కావడంపై కార్యదర్శి సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం పెన్షన్లు పంచేందుకు సోమవారం సిరిపురం యూనియన్ బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన రూ.33 లక్షల 45 వేల 500ను విలేజ్ సర్వేయర్ సచివాలయానికి తీసుకువచ్చి కార్యదర్శికి అందించారు. అనంతరం క్లస్టర్ వైజ్ పంచగా అందులో రూ.50 వేలు మాయమైయినట్లు గుర్తించారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. బెంగళూరులో యువకుడి మృతిగుర్ల: మండలంలోని గొలగాం గ్రామానికి చెందిన కంది సాయిరాం(26) బెంగళూరులో మృతి చెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు సాయిరాం బెంగళూరులోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వస్తుండగా బెంగళూరులో జరిగిన రైల్వే ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు సమాచారం అందించారని చెప్పారు. -
గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన
విజయనగరం క్రైమ్: విశాఖ రేంజ్ పరిధిలో ఉన్న ఐదు జిల్లాల్లో గంజాయి సాగును సమూలంగా నిర్మూలించామని ప్రత్యామ్నాయం కోసం ఉపాధి కల్పిస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఏడాదిలో గంజాయి సాగుపై తీసుకున్న చర్యలు, ఉపాధి కల్పనపై డీఐజీ వివరాలు వెల్లడించారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన, డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా చేపట్టిన సమగ్ర చర్యలు 2025 లో గణనీయమైన ఫలితాలను సాధించాయన్నారు.గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతాలలో కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల పంపిణీ కార్యక్రమం కింద 29,979 మంది రైతులను 29,839.5 ఎకరాల్లో సాగుచేయగా, 35,011.5 ఎకరాల్లో 34,012 మంది రైతులు వాస్తవంగా పంటలు సాగు చేశారన్నారు. ఈ ఏడాదిలో 0.10 ఎకరాల గంజాయి పంటను పూర్తిగా నాశనం చేశామని, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి రవాణా నివారణతో పాటు హార్టికల్చర్, ఆక్వా కల్చర్, పౌల్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో విశాఖపట్నం/అనకాపల్లి జిల్లాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అత్యాధునిక 4 డ్రోన్లతో 327 గ్రామాల్లో 14,870 ఎకరాలను సర్వే చేయగా, 138 గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతోందని తెలిసిందన్నారు. 24 సీసీ కెమెరాలతో కూడిన చెక్ పోస్టులు, 362 డైనమిక్ తనిఖీ కేంద్రాల ద్వారా భారీగా గంజాయి, హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని వందలాది కేసుల్లో నిందితులను అరెస్టు చేశామన్నారు. గంజాయి నిల్వలను గుర్తించేందుకు 9 ప్రత్యేక డాగ్ స్క్వాడ్లను మోహరించి ప్రతి జిల్లాలో డి అడిక్షన్ సెంటర్లు పెట్టి డ్రోన్ ఆధారిత ఎన్డీపీఎస్ బీట్లతో హాట్స్పాట్లను గుర్తించి, వినియోగదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు 244 మందిని వ్యసన విముక్తి కేంద్రాలకు పంపించామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డీడీసీ ద్వారా 67,000 కిలోల గంజాయి, 77.267 కిలోల హషీష్ ఆయిల్ ధ్వంసం చేసి మొత్తం 509 కేసులు నమోదు చేసి 1,390 మందిని అరెస్టు చేశామని, 28,423 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 341 వాహనాలను సీజ్ చేశామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి వివరించారు. విశాఖ రేంజ్ పోలీస్ డీఐజీ గోపీనాథ్ జెట్టి -
రిపబ్లిక్ డే పరేడ్కు 8మంది విద్యార్థుల ఎంపిక
బాడంగి: రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన విజవాడలో జరగనున్న సీఎం పరేడ్కు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి వివిధ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలకు చెందిన 8 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ కేవీ రమణచెప్పారు. ఈ మేరకు స్థానిక అంబేడ్కర్ బాలుర గురుకులంలో జిల్లాతరఫున విద్యార్థులను మంగళవారం ఎంపికచేశామన్నారు. ఉమ్మడి జిల్లాలోని కొప్పెర్ల, బాడంగి, పార్వతీపురం, సాలూరు, పాలకొండ గురుకుల పాఠశాలలనుంచి 15మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 8మందిని ఎంపికచేశామని తెలిపారు. ఎంపికచేసిన విద్యార్థులు వచ్చేనెల 3వ తేదీన ఏలూరు జిల్లా పెదవేమలిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపికలో పాల్గొననున్నట్లు చెప్పారు. చెరుకు పంట దగ్ధంబలిజిపేట: మండలంలోని పి.చాకరాపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న చెరుకు పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. మురగడాం గ్రామానికి చెందిన కౌలు రైతు ఎం.వెంకటినాయుడు పంట దగ్ధమైంది. రెవెన్యూ లెక్కల ప్రకారం ఈ ప్రమాదంలో 3.95ఎకరాల విస్తీర్ణంలో పండిన చెరుకుపంట సుమారు 200టన్నులు ఉంటుందని అంచనా. దీనిప్రకారం రైతుకు సుమారు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. కౌలు రైతు వెంకటినాయుడు పార్వతీపురానికి చెందిన డి.దాలినాయుడు వద్ద భూమి కౌలుకు తీసుకుని పంట పండిస్తున్నాడని కౌలు రైతుకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం కౌలురైతును ఆదుకోవాలని కోరుతున్నారు. రెచ్చిపోతున్న బ్యాటరీ దొంగలురామభద్రపురం: మండలంలో వాహనాల బ్యాటరీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల రోజూ ఏదో గ్రామంలో వాహనాల బ్యాటరీలు చోరీ జరిగిందంటూ సంబంధిత వాహనచోదకులు లబోదిబోమం టున్నారు. రెండు రోజుల క్రితం బూశాయవలసలో ట్రాక్టర్, ఆటోలకు చెందిన బ్యాటరీలు చోరీచేయగా సోమవారం రాత్రి స్థానిక సాయినగర్లోని గుడ్ల కాంట్రాక్టర్ బండారు నాగరాజుకు చెందిన రెండు వ్యాన్లలోని రెండు బ్యాటరీలు దొంగలు చోరీ చేశారు.గతంలో కూడా ఒక వ్యాన్లో ఉన్న గుడ్లు చిదిమేసి, వ్యాన్కు చెందిన బ్యాటరీని దొంగలు ఎత్తికెళ్లిపోయారని గుడ్ల కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నాగరాజు తెలిపాడు. కొద్ది రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నాయని, పోలీసులు నైట్ బీట్ సమయంలో నిఘాపెట్టాలని బాధితులు కోరుతున్నారు. కౌశల్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థుల సత్తా● విజేతలకు డీఈఓ అభినందనలు నెల్లిమర్ల: కౌశల్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన కౌశల్ రాష్ట్రస్థాయి పోటీలు–2025లో జిల్లా విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. ఈ మేరకు జిల్లా కౌశల్ కో ఆర్డినేటర్ వివరాలు వెల్లడించారు. పోస్టర్ ప్రెజెంటేషన్ విభాగంలో మలిచర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎ. సాయి వైష్ణవి ప్రథమ బహుమతి సాధించింది. జరజాపుపేట విద్యార్థి తనుశ్రీ 3వ బహుమతి సాధించింది. అయ్యన్నపేట విద్యార్థి జి.భార్గవి కన్సొలేషన్ బహుమతి పొందింది. అలాగే రీల్స్ పోటీలో శ్రీరామ్నగర్ పాఠశాల విద్యార్థి సీహెచ్ సూర్యప్రకాష్ రాష్ట్ర స్థాయి 2వ బహుమతి సాధించాడు. ఈ సందర్భంగా విజేతలను జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు, డిప్యూటీ డీఈఓ కేవీ రమణ అభినందించారు. అలాగే జిల్లా కౌశల్ కోఆర్డినేటర్ ఎస్ బంగారయ్యను, గైడ్ టీచర్లను ప్రశంసించారు. -
మత్య్సకార సొసైటీ ఎన్నికలకు రాజకీయ రంగు
విజయనగరం ఫోర్ట్: చేపల వేట సాగించే మత్య్సకారుల సమస్యలు, హక్కుల కోసం ఏర్పాటైన జిల్లా మత్య్సకార సహకారం సంఘం ఎన్నికలకు కూడా టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారు. 100 లోపు సభ్యులు ఉన్న సంఘం ఎన్నికకు కోట్లాది రుపాయలు ఖర్చుచేశారు. అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, నామినేటేడ్ పదవుల్లో ఉన్న నేతలు, టీడీపీ నాయకులు మూడు, నాలుగు రోజుల పాటు క్యాంప్ రాజకీయాలు నడిపారు. సభ్యులను క్యాంపులకు తరలించే బాధ్యతను సైతం టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మత్య్సకార సహకార సంఘం ఎన్నికలు జరగాయని పలువురు మత్య్సకారులు ఆరోపిస్తున్నారు. మత్య్సకార సహకార సంఘం ఎన్నికల్లో ఎప్పుడూ రాజకీయ జోక్యం ఉండేదికాదని చెబుతున్నారు. ఎన్నికల కేంద్రం వద్ద మంత్రి అనుచరులు పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న చేప పిల్లల పెంపకం కేంద్రంలో మంగళవారం జిల్లా మత్య్సకార సహకార సంఘానికి ఎన్నిక నిర్వహించారు. ఈ కేంద్రం వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అనుచరులు అధిక సంఖ్యలో చేరుకుని హడావిడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే మకాం వేశారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్టర్ల ఎన్నిక, ఆ తర్వాత అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. చివరకు ఎన్నికల్లో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా టీడీపీ సానుభూతి పరుడు సింగిడి పాపారావు, ఉపాధ్యక్షుడిగా దాసరి లక్ష్మణలు ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. అధికార దర్పంతో గెలిచారు అధికార దర్పంతో మత్స్యకార సంఘం ఎన్నికల్లో గెలిచారని జిల్లా మత్య్సకార సంఘం మాజీ అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న ఆరోపించారు. చేపపిల్లల పెంపకం కేంద్రం వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వృత్తిపరమైన ఎన్నికలకు కూడ టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సభ్యులను తరలించి క్యాంప్ రాజకీయాలు నడిపారన్నారు. ఓటమి భయంతో టీడీపీ నేతలు ఇంతలా దిగిజారి పోయారని ఎద్దేవా చేశారు. స్వచ్ఛందంగా సభ్యులు ఓటు వేస్తే గెలవలేమని భావించి సభ్యులను నిర్బంధించారని, ఇదే చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరు సిగ్గు చేటు అన్నారు. కార్యక్రమంలో మత్య్సకారులు కె.చిన్నారావు, జి.సింహాచలం, జి. అప్పలరాజు, బి.సుదర్శన్రావు, పి.లక్ష్మణ్, ఎం.గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కేంద్రంవద్ద మంత్రి అనుచరులు, టీడీపీ నేతలు అధికార దర్పంతో గెలుపు 66 మంది సభ్యులున్న ఎన్నికకు క్యాంప్ రాజకీయాలు -
పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ
తెర్లాం: మండలంలోని లోచర్ల రైతు సేవా కేంద్రం వద్ద పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా బస్తాలను వ్యవసాయ సిబ్బంది పంపిణీ చేశారు. మంగళవారం లోచర్ల రైతు సేవా కేంద్రం వద్ద యూరియా పంపిణీ చేయడంతో ఒక్కసారిగా రైతులు అధిక సంఖ్యలో వచ్చి యూరియా కోసం ఎగబడ్డారు. వారిని నియంత్రించడం కష్టమవడంతో వ్యవసాయ సిబ్బంది స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందజేశారు. దీంతో ఎస్సై సాగర్బాబు అక్కడికి సిబ్బందితో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతులందరికీ యూరియా ఇస్తారని, అందరూ వరుస క్రమంలో నిలబడాలని సూచించారు. రైతులంతా వరుస క్రమంలో ఉండి యూరియా తీసుకున్నారు. ఎరువుల పంపిణీ పూర్తయినంతవరకు ఎస్సై అక్కడే ఉండి పర్యవేక్షించారు. రైతులకు కావాల్సినంత యూరియా రైతు సేవా కేంద్రంలో నిల్వ ఉందని, యూరియా అవసరంలేని రైతులు కూడా వచ్చి తీసుకువెళ్తుండడంతో సమస్య ఏర్పడుతోందని మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాల్లోని రైతుల ఆధార్కార్డు, వన్బీ తీసుకుని క్షేత్రస్థాయిలో ఆ రైతు ఏ పంట సాగుచేస్తున్నాడో పరిశీలించిన తరువాత యూరియా పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. -
సమావేశమైన పోలీస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ
● త్వరలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కొత్త భవనం ● సిబ్బంది ఆర్థిక అవసరాలను తీర్చేందుకే సొసైటీవిజయనగరం క్రైమ్: పోలీస్ సిబ్బంది ఆర్థిక అవసరాలను తీర్చేందుకే జిల్లా పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పని చేయాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీసు ఉద్యోగుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి ఆర్థిక అవసరాలను తీర్చేందుకుకే జిల్లా పోలీసు ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ఏర్పడిందని ఎస్పీ అన్నారు. తక్కువ వడ్డీతో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలను పొందే పోలీసు ఉద్యోగులు తమ పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణాలు, రిపేర్లు, అత్యవసర వైద్య ఖర్చులు ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోగలుగుతున్నారని చెప్పారు. ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా 202425 ఏడాదిలో వచ్చిన ఆదాయ, వ్యయాలను, పోలీసు సంక్షేమానికి తీసుకున్న చర్యలను సొసైటీ సభ్యులకు వివరించామని తెలిపారు. పోలీసు ఉద్యోగులు తీసుకున్న సభ్యత్వం, సర్వీసు ఆధారంగా ఇప్పటికే రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలను వ్యక్తిగత రుణాలుగా, ఆడపిల్లల పెళ్లి నిమిత్తం రూ.8 లక్షలు అందజేస్తున్నామన్నారు. సొసైటీ సభ్యుల పిల్లలకు పదో తరగతి, ఇంటర్మీడియట్లో 90 % కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి మెరిట్ స్కాలర్షిప్లను కూడా అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మిగతా జిల్లాలకు ఆదర్శంగా ఉందన్నారు. త్వరలో జిల్లా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కొత్త భవనం నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. సమావేశంలో సొసైటీని మరింత అభివృద్ధి, ప్రగతి పథం వైపు నడిపించేందుకు సభ్యుల నుంచి సలహాలను, సూచనలను స్వీకరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఎస్.విద్యాసాగర్, ఆర్ఐలు ఎన్.గోపాల నాయుడు, రమేష్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, కోఆపరేటివ్ సెక్రటరీ ఎం.నీలకంఠం నాయుడు, డైరెక్టర్లు, కోఆపరేటివ్ సభ్యులు, పోలీసు కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఐదు రోజుల బ్యాంకింగ్ విధులు అమలు చేయాలి
● ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద యూఎఫ్బీయూ ధర్నావిజయనగరం అర్బన్: బ్యాంకింగ్ రంగంలో ఐదురోజుల విధుల విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ కార్యాయలం ఎదుట బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో విజయనగరం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ బ్యాంకు శాఖలకు చెందిన ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా బ్యాంకు ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు బీవీప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయడం న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ మురళీశ్రీనివాస్, స్టేట్ బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రమేష్, రాజశేఖర్ గుప్తా, కమిటీ సభ్యులు నాగభూషణరావు, రవికుమార్, శ్రావణకుమార్, మురళి, భానోజీరావు, హరీష్, మనోజ్ వర్మ, హర్ష, శర్మ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు తీర్పు బేఖాతరు
మెంటాడ: న్యాయస్థానం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా మెంటాడ మండలంలోని పిట్టాడ, వాణిజ గ్రామ వీఆర్వో ఆదిరావు భూమిని మ్యూటేషన్ చేసిన ఘటన మండలంలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహరం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాణిజ గ్రామ రెవెన్యూ పరిధిలో 59/2 సర్వే నంబర్లలో సుమారు నాలుగున్నర ఎకరాల మెట్టభూమిలో వ్యవసాయం చేసుకుంటూ బంటుపల్లి సూర్యనారాయణ పెంటమ్మ దంపతులు నివసించేవారు. వారు లక్కోజి సన్యాసమ్మకు 1996లో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. బంటుపల్లి సూర్యనారాయణ కొన్ని సంవత్సరాల క్రితం మరణించగా గత సంవత్సరం డిసెంబర్లో పెంటమ్మ మరణించింది. ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఇదే అదునుగా అదే గ్రామంలో నివసిస్తున్న బంటుపల్లి సన్యాసిరావు, వీఆర్వో అదిరావులు కలిసి చనిపోయిన దంపతుల భూమిపై కన్నువేశారు. పెంటమ్మ తన సొంత పెద్దమ్మే అని బంటుపల్లి సన్యాసిరావు చేత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్కు వీఆర్వో ఆదిరావు దరఖాస్తు చేయించాడు. అన్నీ తానై సర్టిఫికెట్ చేయించి పెంటమ్మ భూమిని బంటుపల్లి సన్యాసిరావు పేరున మార్చేశాడు. ఈ వ్యవహారంలో వారిద్దరి మధ్య భారీగా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ మేరకు గ్రామంలో సాక్షి విచారణ చేయగా బంటుపల్లి పెంటమ్మకు సన్యాసిరావు ఎలా వారసుడవుతాడంటూ గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు. ఇదిలా ఉంటే భూమికొన్న లక్కోజి సన్యాసమ్మను ఈ భూమిపైకి వస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. మరోదారిలేక సన్యాసమ్మ కోర్టును ఆశ్రయించగా భూహక్కుదారులకు అనుకూలంగా తీర్పునిస్తూ, రికార్డుల్లో మార్పులు చేయవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి రికార్డులు మార్చడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్వో పాత్రపై విమర్శలు ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక వీఆర్వో అన్నీ తానై వ్యవహరించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాల కంటే తమకే అధికారం అన్నట్లు వ్యవహరిస్తూ, అవతలి పక్షం నుంచి లబ్ధి పొంది రికార్డులను ఆన్లైన్లో మ్యుటేషన్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండానే క్షేత్రస్థాయిలో ఈ మాయాజాలం జరిగినట్లు తెలుస్తోంది. న్యాయస్థానం తీర్పు అమలు కాకపోవడమే కాకుండా, అక్రమంగా మ్యుటేషన్ జరగడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై లక్కోజు సన్యాసమ్మ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ కాపీలు చూపించినా అధికారులు పట్టించుకోలేదని వాపోయింది. రికార్డులు ఎలా మారుస్తారని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అక్రమ మ్యుటేషన్పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వీఆర్వో, ఇతర రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని తన భూమిని తనకు అప్పగించాలని కోరుతోంది. వివాదాస్పదంగా మ్యుటేషన్ అనర్హులకు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్ భూహక్కుదారుల ఫిర్యాదుతో వెలుగులోకి నిర్వాకం చక్రం తిప్పిన మెంటాడ మండల వీఆర్వో -
అంగరంగ వైభవంగా మెట్లోత్సవం
● గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు ● ఉత్తరద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు ● అంగరంగ వైభవంగా కోదండరాముని మెట్లోత్సవం ● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం గిరి ప్రదక్షిణలో భాగంగా బోడికొండ చుట్టూ సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలతో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణకు భక్తజనం పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామతీర్థం బోడికొండ చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అంచనాలకు మించి సుమారు 20వేల మంది భక్తులు శ్రీ కోదండ రామస్వామి కొలువై ఉన్న బోదికొండ(నీలాచలం పర్వతం) చుట్టూ 8 కిలోమీటర్లు కాలినడకన ప్రదక్షిణ చేసి తరించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ మహా ఘట్టంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. రామనామాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉత్తర మార్గం – ముక్తి ధామం ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర మార్గం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. మూడు కోట్ల ఏకాదశితో సమానమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామివారికి ఆరాధన, తిరుప్పావై సేవాకాలం, మంగళాశాసనం, తీర్థగోష్ఠి కార్యక్రమాలను నిర్వహించిన తరువాత వేకువజామున 5గంటలకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఆ మార్గం నుంచే లోపలికి ప్రవేశించి స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం శ్రీ సీతారామస్వామి వారి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిధ్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి తిరువీధి ఉత్సవాన్ని జరిపించారు. జనసంద్రం ఈ ఏడాది గిరి ప్రదక్షిణకు భక్తులు సంఖ్య గణనీయంగా పెరిగింది. కోలాటాలు, తప్పెటగుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ అశేష భక్తజనం రామనామాన్ని జపిస్తూ భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఉత్సాహంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలు చేసిన అనంతరం దిగువనున్న ప్రధాన ఆలయంలో ఉత్తర మార్గం నుంచి స్వామి దర్శనం చేసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్, సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిజీ శ్రీనివాసనంద సరస్వతి, ఎమ్మెల్యేలు పూసపాటి అదితి గజపతిరాజు, లోకం మాధవి, నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, నగర పంచాయతీ వైస్ చైర్మెన్ సముద్రపు రామారావు, తదితరులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. రహదారిలో నడిచేందుకు భక్తులు అష్టకష్టాలు గిరి ప్రదక్షిణ రహదారి గతంలో మట్టితో ఉండడంతో భక్తులు ఆ మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నడిచి వెళ్లేవారు. ఏడాదిన్నర క్రితం తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి రహదారిని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేశారు. చిప్స్ వేసి సరిపెట్టడంతో భక్తులు అష్టకష్టాలు పడ్డారు. రాళ్ల పిక్కలు కాళ్లకి గుచ్చుకోవడంతో చాలా మంది మధ్యలోనే నడకను ఆపేశారు. వృద్ధులు, చిన్నారుల పరిస్థితి మరింత కష్టంగా మారింది. రహదారి నిర్మాణానికి ఏడాదిన్నర సరిపోలేదా.. అంటూ పలువురు భక్తులు స్థానిక ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. చిప్స్ వేసి నరకాన్ని చూపించారని.. మట్టి రహదారిగా ఉంచినా సరిపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోడికొండపై కొలువుదీరిన శ్రీ కోదండరామస్వామివారి మెట్లోత్సవం కోలాటాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ కనుల పండువగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన శ్రీవారి సేవా భక్తులు ఆలయానికి చేరుకునే మెట్లను శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు గోపూజను చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించగా వేలాది మంది భక్తులు స్వామి వారి విగ్రహాలతో ఊరేగింపుగా నడిచి వెళ్లారు. వేణుగోపాలస్వామిని దర్శించుకున్న జెడ్పీ చైర్మన్జామి: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పురాతన ప్రసిద్ధిగాంచిన అన్నంరాజుపేట పంచాయతీ పుష్పగిరి వేణుగోపాలస్వామిని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలన కష్టాలమయం
● రెండేళ్లలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: ఎన్నికలకు ముందు అధికారమే ధ్యేయంగా హమీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు కష్టాలమయంగా మారిందని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రెండేళ్లు పూర్తికాక ముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని తెలిపారు. ఇందుకు 2025 సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజల పడిన ఇబ్బందులు, వ్యక్తమైన వ్యతిరేకతలే తార్కాణంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని వివరించారు. సంక్షోభంలో వ్యవసాయ రంగం చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతాంగానికి కష్టలు తప్పవన్న నానుడి మరోసారి నిజమవుతోందని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కకపోగా.. సాగు కోసం చేస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం అందకుండా పోతుందన్నారు. బస్తా యూరియా కోసం రైతులు రోజులు తరబడి నిరీక్షించటంతో పాటు లాఠీ దెబ్బలు తినటం ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీని నిలిపివేసి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద ప్రజలకు సైతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే సత్సంకల్పంతో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకానికి పేర్లు మార్చుకోవటమే కాకుండా చివరికి సేవలు నిలిపివేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని దుమ్మెత్తిపోశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు వైద్యం, వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తే వాటిని ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. క్షీణించిన శాంతిభద్రతలు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛందంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించుకుంటే ఓర్వలేని కూటమి నేతలు వారిపై కక్షపూరితంగా కేసులు పెట్టడం తగదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయన్నారు. హత్యలు, అరాచకాలు, దాడులు, గంజాయి అక్రమరవాణా రోజురోజుకు పెచ్చుమీరుతుందన్నారు. ఎన్నికలకు ముందు రూ.1 కరెంట్ ఛార్జీ పెంచమని చెప్పి వివిధ రూపాల్లో ప్రజల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. పారిశ్రామిక ప్రగతి జాడ లేదని, ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నా పట్టించుకున్న నాధుడు లేడన్నారు. వైఎస్సార్సీపీలో ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మాణ పనులను అంతా తామే చేస్తున్నామంటూ ఫొటోలకు ఫోజులివ్వటం సిగ్గుచేటన్నారు. సూపర్ సిక్స్ లేదు.. కొత్తగా ఒక్క పింఛను మంజూరు లేదు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన సూపర్ సిక్స్ హమీలపై మజ్జి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూపర్ సిక్స్ లేదు... రెండేళ్లలో ఒక్క కొత్త పింఛను మంజూరు చేయలేదని చెప్పారు. 2019 సంవత్సరంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల పింఛన్లు ఉంటే 2024 ఎన్నికల సమయానికి 66.34 లక్షల మందికి ఆ సంఖ్య పెరిగిందన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా సుమారు 5 లక్షలకు పైగా పింఛన్లు నిలిపివేశారన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని, రానున్న ఏడాదిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా పార్టీ కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, ఇప్పిలి అనంత్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘురామారావు పాల్గొన్నారు. -
భూసార పరీక్ష కేంద్రం ఏడీగా శ్రీనివాస్
విజయనగరం ఫోర్ట్: భూసార పరీక్ష కేంద్రం (ఎస్టీఎల్) సహాయ సంచాలకులుగా గాలి శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలను పరీక్షించి వాటి ఫలితాలను సకాలంలో అందిస్తామని తెలిపారు. మట్టి పరీక్షల ఫలితాలు ఆధారంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చునని తెలిపారు. డయాలసిస్ కేంద్రం తనిఖీ విజయనగరం ఫోర్ట్: డయాలసిస్ సెంటర్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే అంశంపై సాక్షిలో మంగళవారం కిడ్నీ రోగులపై నిర్లక్ష్యం..! అనే శీర్షికన ప్రచురించిన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అధికారులు స్పందించారు. ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ తుంపల్లి జనార్ధన్ డయాలసిస్ సెంటర్ను మంగళవారం తనిఖీ చేశారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చూడాలని అక్కడ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ స్పందిస్తూ వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెన్షన్దారుల లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు ఏర్పాట్లు విజయనగరం అర్బన్: పెన్షన్దారులు తమ లైఫ్ సర్టిఫికెట్ (జీవన ప్రమాణ పత్రం) సమర్పించేందుకు జిల్లా ట్రజరీ, సబ్ ట్రజరీ కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు విజయనగరం జిల్లా ఖజానా అధికారి వి.నాగమహేష్ మంగళవారం తెలిపారు. పెన్షన్దారుల సౌకర్యార్ధం ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు, కుటుంబ పెన్షన్దారులు 2026 సంవత్సరానికి సంబంధించిన లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా 2026 జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28 తేదీలోపు మాత్రమే సమర్పించవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 2025 మరియు డిసెంబర్ 2025 నెలల్లో సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్లు 2026 సంవత్సరానికి చెల్లవని తెలిపారు. పెన్షన్దారుల సౌకర్యం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా ఖజానా, సహాయ ఖజానా, ఉప ఖజానా కార్యాలయాల్లో జీవన్ ప్రమణ్ పోర్టల్/యాప్ (జీవన్ ప్రమాణ్) ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు అవసరమైన పత్రాలలో పీపీఓ నెంబర్ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా సంఖ్య, మొబైల్ నెంబర్ (ఓటీపీ కోసం తప్పనిసరి) తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన సూచించారు. అవగాహన ఒప్పందం విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో బెంగళూరుకు చెందిన ఎంఈవో సార్ట్ ల్యాబ్, జేఎన్టీయూ జీవీల మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంతో జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు వీఎస్ఎల్ఐ చిప్ డిజైన్, సెమీ కండక్టర్ టెక్నాలజీలు, ఆధునిక ఎలక్ట్రానిక్స్, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలపై అవగాహన కల్పించనున్నట్టు ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమ – విశ్వవిద్యాలయ సహకారంతో శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాపులు, సర్టిఫికేషన్ కోర్సులు, పరిశోధన కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందన్ననారు. కార్యక్రమంలో విద్యార్థులు సెమీ కండక్టర్, వీఎన్ఎల్ఐ రంగాల్లో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప కులపతి ప్రొఫెసర్ వి.వి.సుబ్బారావు, రిజిస్ట్రార్ జి.జయసుమ, ఎంవో సార్ట్ ల్యాబ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణకాంత్ అవలూరు, జెఎన్టీయూ జీవీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.చంద్రభూషణరావు, ప్రొఫెసర్ జి.స్వామినాయుడు, ప్రొఫెసర్ కె.బాబు, ప్రొఫెసర్ ఎస్కె.వలి, డాక్టర్ జి.జె.నాగరాజు, సీఈవో, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, వివిధ విభాగాల ప్రొఫెసర్లు, విభాగాఽధిపతులు, ఎంవో సార్ట్ ల్యాబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు కలిసిరాని 2025
విజయనగరం ఫోర్ట్: అన్నదాతకు 2025 సంవత్సరం కలిసి రాలేదు. ఏడాది పొడువునా రైతులు సాగు చేయడానికి అష్టకష్టాలు పడ్డారు. విత్తు నుంచి పంట విక్రయం వరకు అవస్థలు పడ్డారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం రాయితీపై ఇచ్చే విత్తనాలు పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోవడంతో మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేశారు. వాటిని విత్తుదామంటే వర్షాలు సకాలంలో కురవకపోవడంతో సాగు ఆలస్యం అయింది. వర్షాలు కురిసిన తర్వాత ఆలస్యంగా పంటల సాగు చేపట్టారు. ఎరువుల కోసం పాట్లు అష్టకష్టాలు పడి సాగు చేసినప్పటకీ పంట ఎదుగుదలకు అవసరమైన ఎరువు దొరక్కా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డీఏపీ, యూరియా ఎరువుల కోసం పడిన అవస్థలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా యూరియా కోసం రైతు సేవ కేంద్రాలు, ప్రైవేటు డీలర్లు వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు వరుసలో నిరీక్షించేవారు. గతంలో ఎన్నడు లేని విధంగా పోలీసు బందోబస్తు మధ్య యూరియా రైతులకు అందించిన పరిస్థితి. అందరికి యూరియా దొరికింది అంటే అదిలేదు. ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసం పడిగాపులు కాసినా రైతులకు దొరికేది కాదు. దీంతో కొంతమంది రైతులు 28–28–0 వంటి కాంప్లెక్సు ఎరువు ధర రూ.1700 అయినా కొనుగోలు చేసి వేసేవారు. యూరియా ఆలస్యంగా వేయడం వల్ల దాని ప్రభావం పంట దిగుబడిపై కూడా పడింది. కొంతమంది డీలర్లు ఇదే అదునుగా యూరియా, డీఏపీ ఎరువులను కృత్రిమ కొరత సృష్టించారు. ఇదే అదనుగా యూరియా, డీఏపీలను అధిక ధరలకు విక్రయించారు. కొంతమంది డీలర్లు అయితే యూరియా కావాలంటే జింక్ గుళికలు అంటగట్టేవారు. యూరియా బస్తా రూ.267 అయితే దానికి అదనంగా రూ.500 విలువ చేసే గుళికలు, జింక్గాని అంటగట్టేవారు. తెగుళ్లతోనూ అవస్థలు అష్టకష్టాలు పడి ఎరువులు పంటకు వేశారు. ఈ తరు ణంలో పంటపై తెగుళ్లు, చీడపీడలు దాడి చేశా యి. వరి పంటకు సంబంధించి ఆకుముడుత, పాముపొడ, అగ్గి తెగులు, సుడిదోమ ఆశించడంతో వాటిని నివారించడానికి రైతులు వేలాది రుపాయిలు ఖర్చు చేశారు. మోంథా తుపాన్తో నష్టం పంట చేతికి వచ్చే సమయంలో మోంథా తుఫాన్ తో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, పత్తి, అరటి వంటి పంటలకు నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటలకు ఇప్పటకీ చంద్రబాబు సర్కార్ పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. పంటల బీమాకు మంగళం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. రైతులు సాగు చేసిన పంటలకు ఈ – క్రాప్ ఆధారంగా ఆయా పంటలకు ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించేది. చంద్రబాబు సర్కార్ ఉచిత పంటల బీమా ప్రీమియంకు మంగళం పాడేసింది. రైతులకు బీమా చెల్లింపు ఆర్థిక భారం కావడంతో పంటల బీమాకు దూరం అయ్యారు. బస్తాకు 2నుంచి 4 కేజీల వరకు కోత రైతుల నుంచి మిల్లర్లు అడ్డంగా దోచేస్తున్నారు. 80 కేజీల బస్తాకు 2నుంచి 4 కేజీల వరకు మిల్లర్లు కోత పెడుతున్నారు. దీని వల్ల రైతులు ఎకరానికి రూ.2 వేలు నుంచి రూ.3 వేల వరకు నష్టపోతున్నారు. మద్దతు ధరలోనూ కోత విధిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2369 చెల్లించాలి. కాని దళారులు క్వింటాకు రూ.2వేలు రూ.2100 మాత్రమే చెల్లిస్తున్నారు. ట్రక్ షీట్లో 40 కేజీల నమోదు ట్రక్ షీట్లో 40 కేజీల బస్తా అని ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది నమోదు చేస్తున్నారు. మిల్లు వద్ద మాత్రం 41 కేజీలు చొప్పన ధాన్యం లెక్కిస్తున్నారు. ఎందుకని రైతులు అడిగితే గోనె సంచు బరువంటున్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దగాని రైతులు సొంతంగా కొనుగోలు చేసిన గోనె సంచులుగాని రూ.50 గ్రాములకు మించి ఉండవు. అవి కూడా 80 కేజీలు సంచులు. 80 కేజీల బస్తాకు 2కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు 2 నుంచి 4 కేజీల వరకు తీసుకుంటున్నారు. ఇలా 2025 అన్నదాతకు అన్ని విధాల చంద్రబాబు ప్రభుత్వంలో అష్టకష్టాలు తప్పలేదు.పంట అమ్ముకోవడానికీ అవస్థలుపంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అవస్థలు పడాల్సిన పరిస్థితి చంద్రబాబు సర్కార్ కల్పించింది. మిల్లర్లు, దళారులు కుమ్మక్కు అయి ధాన్యం ముందే మిల్లు వద్ద దించేస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు కట్టేది మిల్లు యాజమానులే కావడంతో బ్యాంకు గ్యారంటీ కట్టిన వెంటనే దళారులకు చెప్పడంతో వారు ఽ ట్రక్ షీట్స్ జనరేట్ చేసుకుని మిల్లులో ఽముందుగా దించిన ధాన్యంకు అకనాలిడ్జిమెంట్ చేసుకుంటున్నారు. రోజులు తరబడి ధాన్యం బస్తాలు కళ్లాలో ఉంచుకుని నిరిక్షించాల్సిన పరిస్థితి. కొంతమంది నిరిక్షించే ఓపిక లేక దళారులకు తక్కువ ధరకు విక్రయించేస్తున్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అందని వైనం భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుని వాటిపై వచ్చే ఆదాయంతో కౌలు రైతులు జీవనం సాగిస్తారు. అటువంటి కౌలు రైతులను మానవత్వంతో ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కార్ అన్నదాత సుఖీభవ సాయం అందించకుండా హ్యాండ్ ఇచ్చింది. దీంతో కౌలు రైతులతో పాటు సాధారణ రైతులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలో కోత విధించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2.74 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా సాయం అందిస్తే చంద్రబాబు సర్కార్ 2.27 లక్షల మందికి మాత్రమే సాయం అందించింది. 47 వేల మంది వరకు రైతులకు కోత విధించారు. విత్తు దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు అన్నీ కష్టాలే.. వర్షాలు సకాలంలో కురవక సాగు ఆలస్యం తర్వాత ఎరువుల కోసం అవస్థలు తుఫాన్ కారణంగా పంటలకు నష్టం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వని చంద్రబాబు సర్కార్ 80 కేజీల ధాన్యం బస్తాకు అదనంగా 2నుంచి 4 కేజీలు వసూలు మద్దతు ధరలోనూ కోత -
మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్లో.. అత్యాధునిక టోమోథెరపీ సేవలు
విశాఖపట్నం: కేన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, హాస్పిటల్ ఎం.డి డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేన్సర్ రోగులకు ఉపశమనం కలిగించే విధంగా మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతికతను అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు కేన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పిటల్ ఎం.డి మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ దేశంలో లెవెల్ 3 కేటగిరి హాస్పిటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా కేన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కె.కిరణ్కుమార్ అనే వ్యక్తి దీర్ఘకాలంగా (క్రానిక్ కాల్సిఫిక్ప్యాంక్రియాటైటిస్) అనే వ్యాధితో బాధపడుతూ తీవ్రమైన పొట్టనొప్పితో కొద్ది రోజుల క్రితం సర్వజన ఆస్పత్రిలో చేరాడు. కిరణ్కుమార్కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ప్యాంక్రియాస్ గ్రంధిలో రాయిలా ఏర్పడిన కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్సలో భాగంగా ప్యాంక్రియాస్ను తెరిచి అందులో ఉన్న సుమారు 6 గీ6 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న రాయిని జనరల్ సర్జరీ, మత్తు విభాగం వైద్యులు సమన్వయంతో విజవంతంగా తొలగించారు. అనంతరం ప్యాంక్రియాస్ను చిన్న పేగుతో అనుసంధానం చేసే (ప్యాంక్రియాటికో–జేజునోస్టమీ) అతి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స అనంతరం రోగి పూర్తిగా పొట్ట నొప్పి నుంచి ఉపశమనం పొందాడు. కిరణ్కుమార్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. శస్త్రచికిత్సనిర్వహించిన జనరల్ సర్జరీ హెచ్ఓడీ పీఏ.రమణి, డాక్టర్ చైతన్య బాబు, డాక్టర్ వెంకటనాయుడు, డాక్టర్ ఎన్.జగదీష్, డాక్టర్ ధర్మకిశోర్, డాక్టర్ శశిధర్, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ హేమసుందర్, డాక్టర్ రామేశ్వరి ప్రభు డాక్టర్ రాకేష్, డాక్టర్ అరవిందసుప్రజలను సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. -
పదవి కోసం వల..!
సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రజాస్వామ్యయుతమైన అధికారం,కోరంలో బలం లేకపోయినా మున్సిపాలిటీలు, మండల పరిషత్లు.. పంచాయతీలను కేవలం అధికార బలంతో చేజిక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు నేడు మత్స్యకార సహకార సంఘాల ఎన్నికల్లోనూ అదే విధానం అవలంబిస్తోంది. విజయనగరం జిల్లాలోని మత్స్యకార సహకార సంఘానికి సంబంధించి పలు సొసైటీల డైరెక్టర్లు, సంఘాల సభ్యులు ఇప్పటికే వైఎస్సార్సీపీలో కొనసాగుతూ పార్టీ తరఫున పదవుల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ పదవులను లాక్కునేందుకు టీడీపీ.. జనసేన నాయకులు అడ్డదారులు తొక్కు తున్నారు. గత వారం రోజులుగా మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు, చోటా నేతలు గ్రామాల్లోకి దిగిపోయి సొసైటీ నేతలను ప్రలోభపెడుతున్నారు. అధికారం తమది కాబట్టి తమతో ఉంటే అభివృద్ధి ఉంటుందని నమ్మబలుకుతున్నారు. లొంగనివాళ్లని బెదిరిస్తున్నారు. ప్రత్యేకంగా శిబిరాలుపెట్టి వారిని తమ దారిలోకి తెచ్చేందుకు చేస్తున్న విశ్వప్రయత్నాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. నేడు జిల్లా మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడి ఎన్నిక విజయనగరం, పార్వతీపురంమన్యం జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాగానే జిల్లా మత్సకార సహకార సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు మత్సశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయగా.. ఈ నెల 30న మంగళవారం జిల్లా సంఘం అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం అధికారిక లెక్కల ప్రకారం 66 మంది మత్స్యకార ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు ఉన్నారు. విజయనగరం జిల్లాలో 44 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 22 మంది అధ్యక్షులుగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు తుది ఓటర్ల జాబితాను ప్రచరించేశారు. వీరంతా సోమవారం జరిగే ఎన్నికల్లో 11 లంగా ఉండే వారిని ఎన్నుకునేందుకు పావులు కదుపుతున్నారు. గడిచిన పక్షం రోజులుగా పార్టీ జిల్లా నేత గ్రామాల్లో ఉండే నాయకులతో మంతనాలు నిర్వహించి వారి ద్వారా ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులను తమదారిలోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు సైతం సమీక్షలు నిర్వహించి ఎన్నిక ల్లో విజయం కోసం ఆరాటపడుతున్నారు. ప్రాథమి క సహకార సంఘాల అధ్యక్షులు తాము చెప్పినట్లు చేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నా రు. ప్రత్యేక క్యాంప్లు పెట్టి మాట వినిని వారిని బుజ్జగిస్తున్నారు. మంది డైరెక్టర్లను ముందుగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్లుగా ఎన్నికై న వారంతా వారిలోనే ఒక అధ్యక్షుడిని, ఒక ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్టు మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక... జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుని ఎన్ని క ప్రక్రియ చేతులు ఎత్తే విధానంలో ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. ఇదే సువర్ణావకాశంగా భావించిన అధికార టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు, నాయకులు సంఘం అధ్యక్షుడిగా తమకు అనుకూవాస్తవానికి ప్రస్తుతం ఉన్న 66 మత్స్యకార ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల్లో అధిక శాతం మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులే. గడిచిన రెండు ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన వారు సైతం వైఎస్సార్సీపీలో ఉన్న వారే. సదరు వ్యక్తి పార్టీలో రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండడంతో మింగుడు పడని టీడీపీ, జనసేన నాయకులు జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకుని, వారి ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షుల్లో చాలా మంది గ్రామాల్లో నెయ్యిల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, వారి ఆర్ధిక, సామాజిక స్థితి గతులు అంతంతమత్రంగానే ఉండటంతో వారిని అధికార బలంతో బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిని సంబందిత సంఘ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. -
జిల్లా అధికారుల టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ
విజయనగరం అర్బన్: జిల్లా అధికారుల తరఫు న ముఖ్యప్రణాళిక అధికారి బాలాజీ రూపొందించిన టేబుల్ క్యాలెండర్ను కలెక్టర్ రాంసుందర్రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిపాలనలో సమన్వయం, ప్రణాళికాబద్ధమైన పనితీరుకు ఈ క్యాలెండర్ దోహద పడుతుందని చెప్పారు. జిల్లాలో చేపట్టబోయే శాఖాపరమైన కార్యక్రమాలు, తేదీలు, ప్రభుత్వ ప్రాధా న్యతలను క్యాలెండర్లో గుర్తించి, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం అర్బన్: సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న వివిధ కేడర్ సిబ్బంది అందరూ హాజరును బయోమెట్రిక్ విధానంలోనే నమోదు చేయా లని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార పరిస్థితులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి రెవె న్యూ వినతుల్లో ఎక్కువ శాతం తిరస్కారం అవుతున్నాయని, ప్రతి వినతిని మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. అర్జీదారుల వినతులు నాణ్యమైన, స్పీకింగ్ ఆర్డర్ రూపంలో సమాధానం ఇవ్వాలని, అర్జీదారుల సంతృప్తి పెరగాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు వేగంగా జరగాలని, ప్రస్తుతం నూర్చిన ధాన్యం 30వేల మె ట్రిక్ టన్నుల వరకు ఉన్నాయని, బుధవారం మొ త్తం ధాన్యాన్ని సేకరించాలని తెలిపారు. పదో తరగ తి పరీక్షలపై దృష్టి పెట్టాలని, 100 రోజుల ప్రణాళిక అమలు చేసి శతశాతం ఫలితాలు వచ్చేలా చూడాల ని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో మురళి, జిల్లా అధికారులు, వర్చువల్గా ఆర్డీఓలు, మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. గరుగుబిల్లి: ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న జంఝావతి ప్రాజెక్టు నిర్మాణసాధనకు రైతు లంతా కలిసి రావాలని జంఝావతి సాధనసమితి అధ్యక్ష, కార్యదర్శులు చక్క భాస్కరరావు, మరిశర్ల మాలతీకృష్ణమూర్తి నాయు డు కోరారు. గరుగుబిల్లి మండలంలోని ెఉల్లిభద్ర, దళాయివలస, ఉద్దవోలు, శివరాంపురం తదితర గ్రామాల్లో పర్యటించి రైతులు, పెద్దలతో కలిసి మాట్లాడారు. సమస్యపై చర్చించి కరపత్రాలు అందజేశారు. జంఝా వతి ప్రాజెక్టును పాలకులు ఎన్నికల హామీగానే చూస్తున్నారే తప్ప పూర్తిచేసేందుకు శ్రద్ధ వహించడం లేదన్నారు. సాగునీరు అందక, పంటలు పండక ఈ ప్రాంత రైతులు పేదరికాన్ని అనుభవిస్తున్నారన్నారు. రైతులు ప్రశ్నించడంలేదనే సాకుతో పాలకులు పట్టించుకోవడం లేదని తెలిపారు. రైతులు ప్రశ్నించినప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. జంఝావతి నిర్మాణం పూర్తికోసం బాధిత గ్రామాల రైతులతో సమితులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్రమంగా అరటిచెట్ల నరికివేతజియ్యమ్మవలస రూరల్: మండలంలోని బిత్రపాడు గ్రామానికి చెందిన నీరసం చంద్రకళ అనే మహిళా రైతుకు చెందిన అరటి తోటలో శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు యాభై అరటి గెలలతో ఉన్న చెట్లు నరికివేశారు. దీనిపై కొమరాడ ఎస్సై కె. నీలకంఠానికి ఫిర్యాదు చేశారు. -
చదురుగుడికి పెదపోలమాంబ
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త పెదపోలమాంబ సోమవారం చదురుగుడికి చేరుకున్నారు. ముందుగా పెదపోల మాంబ అమ్మవారి ఘటాన్ని జన్నివారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస గ్రామ రహదారి వద్దనున్న అమ్మవారి గద్దె సమీపంలోకి తీసుకువచ్చి పూజలు చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ నైదాన తిరుపతిరావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కరణం కుటుంబీకులు సంప్రదాయ బద్ధంగా అమ్మవారి ఘటానికి పూజలు జరిపారు. అనంతరం మేళ తాళాలు, కోలాట ప్రద్శనలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ పెద పోలమాంబను చదురు గుడికి తీసుకువచ్చారు. అమ్మవారు గ్రామంలోని చదురుగుడిలో వారం రోజులపాటు భక్తులకు దర్శనమిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5న పెదపోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 6న ప్రధాన ఉత్సవం, 7న అనుపొత్సవం నిర్వహిస్తారు. అదేరోజు శంబరపోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానించేందుకు సనప చాటింపు వేస్తారు. జనవరి 12న శంబర పోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తీసుకువస్తారు. 13 రోజుల పాటు పోలమాంబ అమ్మవారు చదురు గుడిలో భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 26న తొలేళ్లు ఉత్సవం, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవం నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బి.శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు తీళ్ల పోలినాయుడు, సర్పంచ్ సింహాచలమమ్మ, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్లు, గ్రామపెద్దలు, జన్ని, కరణం, కుప్పిలి కుటుంబీకులు పాల్గొన్నారు. -
పశుసంవర్థకంతోనే గ్రామీణ ఆర్థికాభివృద్ధి
పార్వతీపురం రూరల్: పశుసంవర్థక రంగం బలోపేతం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖపై సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పశుపాలనలో జెమిని, పెరప్లెక్సిటీ వంటి ఏఐ సాంకేతికతను జోడించి రైతులకు వేగంగా సమాచారం అందించాలని, పాఠశాల విద్యార్థులు, యువతకు ఈ రంగంలోని ఉపాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏడాదికి ప్రతి రైతు 1200 గుడ్ల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని, వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపద సృష్టించే ప్రాజెక్టులను ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళా డైరీ సంఘాలను బలోపేతం చేస్తూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేయాలని, ఎగుమతి నాణ్యత కలిగిన మేత ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో అమలు చేసిన గ్రామ ముస్తాబు, గోపాల సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయని పశుసంవర్థక శాఖాధికారి మన్మథరావు వివరించారు. సమావేశంలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ రామచంద్రరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రజలలో సంతృప్తి స్థాయి పెరగాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల పరిష్కారం పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండలస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 144 వినతులు అందాయి. ఇందులో రెవెన్యూకు సంబంధించి 55 అర్జీలు, 89 అర్జీలు వివిధ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. రీ ఓపెన్ అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జీలను స్వీకరించిన వారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తల్లికి వందనం మంజూరు చేయాలి ● సీతానగరం మండలం సీతానగరం గ్రామానికి చెందిన టి.ఉమ తన కుమారుడికి తల్లికి వందనం పథకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేసింది. ● పార్వతీపురం మండలం హిందూపురం గ్రామానికి బి.వెంకటరమణ తప్పెటగుళ్లు బృందానికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేసి, రిజిస్టర్ చేయాలని, జిల్లాలో నిర్వహించే సంబరాల్లో అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేశారు. ● సీతానగరం మండలం రేపటివలస గ్రామానికి చెందిన పి.సుమలత జీవనోపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేసింది. ● పార్వతీపురం పట్టణానికి చెందిన పి.రజని, భామిని మండలం భామినికి చెందిన టి.సరస్వతి వితంతువు పింఛన్ మంజూరు చేయాలని, సీతానగరం మండలం పాపమ్మవలస గ్రామానికి చెందిన ఎన్.అప్పలనాయుడు దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని కోరారు. ఫిర్యాదులపై చర్యల నివేదిక పంపాలి పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ వారం కార్యక్రమంలో 5 ఫిర్యాదులు అందాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ, ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలపై నివేదికను కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ఈ వేదికను వినియోగించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సై రమేష్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 15 వినతులు సీతంపేట: ఐటీడీఏలో ఏపీఓ జి.చిన్నబాబు సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వివిధ సమస్యలపై 15 అర్జీలు వచ్చాయి. తిడ్డిమికి చెందిన నీలారావు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని కోరారు. పెద్దగుమ్మడ స్కూల్కు ప్రహరీ, మరుగుదొడ్లు నిర్మించాలని బగదల గ్రామస్తురాలు జన్ని వరలక్ష్మి విన్నవించింది. రోలుగుడ్డికి కమ్యూనిటీ భవనం నిర్మించాలని గ్రామానికి చెందిన కె.నరేష్ వినతిపత్రం అందజేశాడు. లోకొండ పంచాయతీని విభజించవద్దని కె.ఎర్రన్నాయుడు కోరాడు. ట్రైకార్ రుణం ఇప్పించాలని మంగయ్య, హౌస్హోల్డ్ మ్యాపింగ్లో పేరు వేరేగ్రామంలో ఉందని తమ గ్రామానికి మార్చాలని కొంటికర్రగూడ గ్రామస్తుడు సవర గోపాల్ విన్నవించారు. కార్యక్రమంలో పీహెచ్వో ఎస్.వి.గణేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈవో రామ్మోహన్రావు, జీసీసీ మేనేజర్ జి.నరసింహులు, పీఆర్ జేఈ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందించండి
● కలెక్టర్ను కోరిన పారా అంతర్జాతీయ క్రీడాకారుడువిజయనగరం: జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహకారంతో పాటు దివ్యాంగ క్రీడాకారులకు (పారా) ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందేలా చూడాలని పారా అంతర్జాతీయ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు సోమవారం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్తో కలిసి కలెక్టరెట్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన పారా బాడ్మింటన్ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు ఇప్పటివరకు జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించి జిల్లాకు పేరు తీసుకుని వచ్చాడని, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచాడని కలెక్టర్కు వివరించారు. భవిష్యత్ లో జరగనున్న జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఆర్ధిక సహకారంతో పాటు దివ్యాంగ క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అందేలా చూడాలని కోరారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు. -
పీజీఆర్ఎస్కు పోటెత్తిన అర్జీలు
● 232 వినతుల స్వీకరణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 232 వినతుల స్వీకరించగా వాటిని వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్ పీజీఆర్ఎస్కు వచ్చిన వినతుల పరిష్కారంలో ఆలస్యం చూపితే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను సకాంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రతి వారం పీజీఆర్ఎస్ పై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలపై వెంటనే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అర్జీదారును తప్పనిసరిగా కలిసి మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్ట్లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే పీజీఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 110పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆ నంబర్కు వచ్చిన కాల్స్ను సరైన సమాధానం అందించాలని సూచించారు. స్వీకరించిన వినతులలో అత్యధికంగా రెవెన్యూశాఖకు 136, పంచాయతీ శాఖ 26, పోలీస్ శాఖ 10, పబ్లిక్ హెల్త్ 10, మున్సిపల్ పరిపాలన 9, సర్వేల్యాండ్ రికార్స్5, వ్యవసాయ శాఖ 4, విద్యుత్ శాఖ 4, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ 3, ఎస్సీ కార్పొరేషన్కు రెండు, దేవాదాయ శాఖ 2, మెడికల్ ఎడ్యుకేషన్ 2, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 2, సమగ్రశిక్షక్ష 2, వాటర్రిసోర్సెస్కు 2 వినతులు స్కీకరిచారు. వినతుల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలా గాంధీ, బి.శాంతి, సర్వేశాఖ ఎ.డి ఎస్వీవిజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవ్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభం ప్రజా ఫిర్యాదుల శ్రీఘ్ర పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్లో భాగంగా విజయనగరం జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ను సోమవారం ప్రారంభించినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా రికార్డుల ఆధారంగా సాధ్యమైనంత వరకు ఆన్ది స్పాట్లోనే ఫిర్యాదులకు పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తహసీల్దార్లు, ఆర్డీఓల సమక్షంలో పిటిషనర్లకు నేరుగా పరిష్కారం అందించడం లేదా ఫ్యాక్టువల్ సమాచారం ఇవ్వనున్నట్లు వివరించారు. అన్ని పిటిషన్లను డేటాబేస్లో నమోదు చేసి, వీక్లీ రివ్యూ నిర్వహించి గరిష్ట సంతృప్తిని సాధించేలా కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గత 3–4 నెలల్లో జిల్లాలో పీజీఆర్ఎస్ సంతృప్తికరమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. పిటిషన్ల పరిష్కారానికి సాధారణంగా ఒక వారం టైమ్లైన్ నిర్ణయించామని, కొన్ని ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) కేసులు మిగహా మిగతావాటిని వేగంగా పరిష్కరించి ప్రజల సంతృప్తిని పెంచుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో అర్హత ఆధారంగా వెరిఫికేషన్ చేసి తగు చర్యలు తసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 19 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ చాంబర్ లోనే సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లిమర్లకు చెందిన ఓ ఫిర్యాదురాలు ఎస్పీ చాంబర్ వద్దే ఆవేదన వెళ్లగక్కింది. తనను చిత్రహింసలు పెడుతున్నారని, బూతులు తిడుతున్నారంటూ తనకు న్యాయం చేయాలని డీపీఓలో ఎస్పీ వాహనం వద్దే ఆందోళనకు దిగింది. అక్కడే ఉన్న వుమెన్ కానిస్టేబుల్ ,ఆ ఫిర్యాదుదారు రాలిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఎస్పీని కలిపించారు. ఇక ఎస్పీ ఛాంబర్ లోనే ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ దామోదర్ 19 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 3, నగదు వ్యవహారాలకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించినవి 7 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
రామతీర్థంలో నేడు ఉత్తర ద్వార దర్శనం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని సీతారామస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పూజలకు సర్వం సిద్ధంమైంది. స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం వేకువజామున 3గంటలకు స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించనున్నారు. అనంతరం తిరుప్పావై సేవాకాలం, మంగళాశాసనం, తీర్ధ గోష్ఠి కార్యక్రమాలను అర్చకులు జరిపిస్తారు. ఉదయం 5గంటలకు సీతారామచంద్ర స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 7.30 గంటలకు స్వామివారి గ్రామ తిరువీధి ఉత్సవాన్ని జరిపించనున్నారు. అనంతరం బోదికొండ మెట్ల మార్గం వద్ద మెట్లోత్సవం, గోపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలనంతరం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. భక్తుల రద్దీ నేపధ్యంలో దేవాదాయ, పోలీస్ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పూర్తికాని గిరి ప్రదక్షిణ రహదారి నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం గిరి ప్రదక్షిణ జరగనుంది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు కాలినడకన చెప్పులు లేకుండా సుమారు ఎనిమిది కిలోమీటర్లు భక్తి శ్రద్ధలతో నడిచి స్వామిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తోంది. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న ఈ రహదారిని ఎనిమిదేళ్ల క్రితమే గ్రావెల్ రహదారిగా మార్చి సిద్ధం చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రహదారిలో మట్టిని వేసి రహదారికి మోక్షం కల్పించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో గిరి ప్రదక్షిణ రహదారి(తారు రోడ్డు) నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చే ముక్కోటి ఏకాదశికే సిద్ధం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. ఈ ఏడాదైనా సిద్ధమవుతుందేమోనని ఎదురు చూసిన భక్తులకు చివరికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం సగం వరకు చిప్స్(రాళ్ల పిక్కలు) మాత్రమే వేసి వదిలేయడంతో ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి చేసేశామంటూ సోషల్మీడియాలో ప్రచారం రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేశామని, ఓ రూపుకు తీసుకువచ్చామని, తామే మార్గం సిద్ధం చేశామని..ఇలా ఎమ్మెల్యే లోకం నాగమాధవి అనుచరులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారాన్ని చూసి భక్తులు నవ్వుకుంటున్నారు. ఆ రహదారిని కొత్తగా వాళ్లే సృష్టించినట్లు ప్రచారం చేసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు తారు వేస్తేనే కదా పూర్తయినట్లు అన్నది భక్తుల అభిప్రాయం. వాస్తవానికి మంజూరైన రూ.2కోట్ల నిధులు సరిపడకపోవడం వల్లనే రహదారి నిర్మాణం పూర్తి కాలేదని ఆ పార్టీ నాయకులే చెప్పడం గమనార్హం. గిరి ప్రదక్షిణ రహదారిలో వేసిన చిన్న చిన్న చిప్స్ కాళ్లకు గుచ్చుకునే ప్రమాదం ఉందని భక్తుల్లో ఆందోళన నెలకొంది. నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పలువురు సూచిస్తున్నారు. -
నల్లబెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎకై ్సజ్ సీఐ శ్రీనివాసరావు ● మండల కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలుకురుపాం: సారా తయారీకి వినియోగించే నల్లబెల్లం విక్రయాలు చేసినా, సరఫరా చేసినా అటువంటి వ్యాపారుల పైన, వ్యక్తుల పైన చర్యలు తప్పవని కురుపాం ఎకై ్సజ్ శాఖ సీఐ పి.శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు సోమవారం సాక్షి దిన పత్రికలో ‘ధాన్యం ముసుగులో నల్లబెల్లం అక్రమ రవాణా’ శీర్షికన వెలువడిన కథనానికి స్పందించిన సీఐ పి.శ్రీనివాసరావు కురుపాం మండల కేంద్రంలోని రావాడ కూడలి, శివ్వన్నపేట తదితర దుకాణాల్లో సోమవారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా బెల్లం నిల్వల పై ఆరా తీశారు. ఇకపై బెల్లం దిగుమతి ఏ మేరకు చేపడుతున్నది తమకు 15 రోజులకు ఒకసారి తెలియజేయాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ఇప్పటి వరకు బెల్లం సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశామని మరో 14 మంది పై బైండవర్ కేసులు నమోదు చేసి వారి నుంచి రూ45 వేల అపరాధ రుసుం వసూలు చేసినట్లు తెలిపారు. సారా నిర్మూలనే లక్ష్యంగా చేపడుతున్న దాడుల్లో పట్టుబడిన వారిని, వారికి బెల్లం సరఫరా చేసేవారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఎర్రజెండా ఎప్పటికీ నేలకొరగదు
విజయనగరం గంటస్తంభం: కమ్యూనిజం అంతరించిపోయిందని భావించే వారికి సీపీఐకి ఉన్న వందేళ్ల ఉద్యమ చరిత్రే గట్టి సమాధానమని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. నగరంలోని పడమర బలిజి వీధిలో సీపీఐ 101వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన..సూర్యచంద్రులున్నంత కాలం కమ్యూనిజం ఉంటుందని, దానికి అంతం లేదని, కమ్యూనిజం గుర్తుగా ఉన్న ఎర్రజెండా ఎప్పటికీ నేలకొరగదన్నారు. అంతకుముందు అమరజీవి, కామ్రేడ్ మొకర అప్పారావు విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, కర్షకుల కోసం ఆ పార్టీ చేసిన పోరాటాలు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రమణమ్మ, పావని, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
వ్యాన్ ఢీ కొనడంతో వ్యక్తికి గాయాలు
సీతానగరం: మండలంలోని హైవే రోడ్డుపై లచ్చయ్యపేట – పాత బొబ్బిలి మధ్య ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లికి చెందిన బొబ్బాది వెంకటరమణ ఆదివారం ఉదయం బొబ్బిలి వైపు నుంచి పాత బొబ్బిలి మీదుగా ద్విచక్ర వాహనం వాహనంపై లచ్చయ్యపేట వైపు వస్తుండగా.. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కోళ్ల వ్యాన్ ఢీ కొనడంతో వెంకటరమణకు గాయాలయ్యాయి. వెంటనే వ్యాన్డ్రైవర్ 108 వాహనానికి ఫోన్ చేయగా.. సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రుడ్ని బొబ్బిలి సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడ్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుడు తవిటినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న లారీ.. దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో పెదమానాపురం నుంచి వస్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పెదమానాపురం ఎస్సై ఆర్.జయంతి తెలియజేసిన వివరాల ప్రకారం.. పెదమానాపురం నుంచి గర్భాం వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మామిడి నాగరాజుకు తీవ్ర గాయాలు కాగా.. ప్రయాణికులు చొక్కపు అప్పలనాయుడు, అల్లు గోరమ్మకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజపతినగరం సీహెచ్సీకి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
●మంచుబారిన పడకుండా జాగ్రత్త
ఉదయం పూట మంచు ఎక్కువగా కురుస్తున్నందున మంచుబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మార్నింగ్వాకింగ్, రన్నింగ్, గేమ్స్కు వెళ్లే వారు మంచు తగ్గిన తర్వాత వెళ్లడం మంచింది. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, నిమోనియా, సీఓపీడీ వంటి వ్యాధులు ఉన్న వారు చలిబారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. చల్లటి పానీయాలు, చల్లటి ఆహారం తీసుకోకూడదు, చలిలో అసలు తిరగకూడదు. చలి కాలంలో సైనసైటిస్, ఆస్తమా, నిమోనియో వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటుంది. చలినుంచి రక్షణగా స్వెట్టర్లు, మంకీక్యాప్లు వంటివి ధరించడం మంచిది. కాచి చల్లార్చిన నీరు తాగాలి. తాజా ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. –డాక్టర్ బొత్స సంతోష్కుమార్, పలమనాజిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
హు..హు..హు..హు..!
విజయనగరం ఫోర్ట్: జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దుప్పట్లు, రగ్గులు ఏవీ కూడా చలి నుంచి రక్షణ అంతగా ఇవ్వడం లేదు. మైదాన ప్రాంతాల కంటే గిరిజన ప్రాంతాల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంది. గిరిజన ప్రాంతాలైన మెంటాడ, ఎస్.కోట, గంట్యాడ మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో చలి తీవ్రత చాలా ఉంది. ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. ఉదయం 8 గంటల వరకు పొగమంచు కమ్మేస్తోంది. దీంతో ఉద యం పూట విధులు నిర్వర్తించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, పేప ర్ బాయ్స్, ఉదయం 7 గంటలకు వివిధ కంపెనీల్లో పనిచేయడానికి వెళ్లే ఉద్యోగులకు అవస్థలు తప్ప డం లేదు. మంచు దట్టంగా కమ్మేయడంతో వాహనాలపై ప్రయాణించేవారికి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట కూడా లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. మంచు కారణంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున వాహనాలను అత్యంత అప్రమత్తంగా నడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రోడ్డు దాటేటప్పుడు కూడా వాహనాలను గమనిస్తూ ఉండాలి. అవస్థలు పడుతున్న వృద్ధులు, పిల్లలు చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో అన్ని వర్గాల ప్ర జలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో ఆస్తమా, సైనసైటిస్, సీఓపీడీ, నిమోనియా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఈ వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాధి తీవ్రత మరింత పెరిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నా రు. చలితీవ్రత బారిన పడకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. చలికాలంలో చర్మ వ్యాధులు కూడా వ్యాప్తి చెందే అవకాశంతో పాటు ఎక్కువయ్యే ఆస్కారం ఉంది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గిపోతున్నా యి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 15 డిగ్రీలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉన్ని స్వెట్టర్లు, మంకీక్యాప్లు, జర్కిన్లు వంటివి ధరిస్తున్నారు. కొంతమంది చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. -
పందెంరాయుళ్ల అరెస్ట్
బాడంగి: మండలంలోని పాల్తేరు శివారులో గొర్రెప్పందాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడి చేసి పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. ఎస్సై తారకేశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాల్తేరు సమీపంలోని తోటలో గొర్రెప్పందాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ఆదివారం దాడి చేశారు. దీంతో ఏడుగురు పందెంరాయుళ్లు పట్టుబడగా.. వారి వద్ద నుంచి 23,160 రూపాయల నగదు, రెండు గొర్రెపోతులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి నేపథ్యంలో ఎవ్వరైనా పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. -
లేబర్ కోడ్లపై సమరం
విజయనగరం గంటస్తంభం: సీఐటీయూ అఖిలభారత జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ విజయనగరం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్ల మీదగా గంటస్తంభం వర కు సాగిన ఈ ర్యాలీలో మహిళా కార్మికులు, నాయకులు ఎర్రచీరలు, ఎర్ర బనియన్లు ధరించి పాల్గొన్నారు. ముందు భాగంలో మహిళలు కోలాటం ప్రదర్శిస్తూ ర్యాలీకి ఆకర్షణగా నిలిచారు. ర్యాలీని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్మి టీవీ రమణ మాట్లాడుతూ, డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో తొలిసారి గా సీఐటీయూ అఖిలభారత జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్లపై విస్తృతంగా చర్చ జరగనుందన్నారు. కట్టు బానిసలుగా కార్మికులు అనేక పోరాటాలతో సాధించిన 29 కార్మిక చట్టాల ను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను హరించారని విమర్శించారు. పనిగంట లు పెంచడం, కనీస వేతనాలు అమలు కాకుండా చేయడం, మహిళా కార్మికులను రాత్రి పనుల్లోకి నెట్టడం ద్వారా కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వైఖరికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నాయకత్వం వహిస్తున్న రెండు వేల మంది కార్మిక సంఘాల నాయకులు ఈ మహాసభల్లో పాల్గొంటా రని తెలిపారు. ఐదు దేశాల నుంచి కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. మహాసభల చివరి రోజు జనవరి 4న విశాఖపట్నంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే శ్రామిక ఉత్సవాలు ప్రారంభమయ్యామని, పుస్తక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీలక్ష్మి, ఎ.జగన్మోహన్రావు, బి.రమణ, పి.రమణమ్మ, సుధారాణి పాల్గొన్నారు. -
మా క్లినిక్కు వచ్చేయండి..
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన ఆర్. దీపక్వర్థన్కు రోడ్డు ప్రమాదంలో చేయి విరగడంతో స్థానిక సర్వజన ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఎముకల వైద్యులు ఫిజియోథెరపీ చేయించుకోవాలని అతడ్ని ఫిజియోథెరపీ విభాగానికి రిఫర్ చేశారు. అయితే అక్కడ ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఆస్పత్రిలో సరైన పరికరాలు లేవని.. అంబటిసత్రం ప్రాంతంలో తనకు సొంత క్లినిక్ ఉందని.. అక్కడకు వస్తే త్వరగా తగ్గిస్తానని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఆ రోగి ప్రైవేట్ క్లినిక్కు వెళ్లారు. ఆ క్లినిక్లో ఒకసారి ఫిజియోథెరపీ చేసినందుకు రోగి నుంచి రూ. 1500 వసూలు చేసినట్లు సమాచారం. అలాగే ఇదే మండలానికి చెందిన ఆర్. వరలక్ష్మి అనే మహిళ మెడనొప్పితో సర్వజన ఆస్పత్రిలోని న్యూరో సర్జరీ విభాగానికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెను కూడా ఫిజియోథెరపీ విభాగానికి రిఫర్ చేశారు. ఈమెను కూడా సదరు ఫిజియోథెరపిస్ట్ తన సొంత క్లినిక్కు వస్తే త్వరగా తగ్గిస్తానని చెప్పాడు. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె అతని క్లినిక్కు వెళ్లలేదు. ఇలా వీరిద్దరిరే కాదు ఫిజియోథెరపీ విభాగానికి వస్తున్న ప్రతి రోగినీ ఆయన తన ప్రైవేట్ క్లినిక్కు వెళ్లాలని సూచిస్తున్నాడు. దీంతో రోగులు బయటకు చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ క్లినిక్కు వెళ్లి చేతిచమురు వదిలించుకుంటున్నారు. ఇదిలా ఉంటే సదరు ఫిజియోథెరపిస్ట్ ఆస్పత్రిలో అందుబాటులో ఉండడని గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఆ సమయంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు రాకపోవడం విశేషం. రోగుల తరలింపే లక్ష్యం.. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగినీ తన క్లీనిక్కు తరలింపే లక్ష్యంగా సదరు ఫిజియోథెరపిస్ట్ ప్రయత్నిస్తున్నాడు. పక్షవాతం బారిన పడిన వారికి, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఫిజియోథెరపీ తప్పనిసరి. ప్రభుత్వాస్పత్రిలో మంచి సదుపాయాలున్నప్పటికీ, ఫిజియోథెరపిస్ట్ స్వార్థం వల్ల రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కోసం వచ్చిన వారికి ఇక్కడే చేయాలి. ఇతర క్లినిక్లకు తరలించడానికి వీల్లేదు. అలా తరలించిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటిండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సర్వజన ఆస్పత్రిలో ఓ ఫిజియోథెరపిస్ట్ నిర్వాకం ఆస్పత్రిలో మంచి పరికరాలు లేవని రోగులను మభ్యపెడుతున్న వైనం గత్యంతరం లేక ప్రైవేట్ క్లినిక్కు వెళ్తున్న రోగులు వారి నుంచి వేల రూపాయలు గుంజుతున్నట్లు ఆరోపణలు -
జానపద కళలకు ఆదరణ
బొబ్బిలి: మనదేశ జానపద కళలకు, సంస్కృతికి ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని ప్రముఖ సినీ, టీవీ నటుడు షకలక శంకర్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కోటలో బొబ్బిలి కళోత్సవ్ పేరిట జానపద కళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ మాట్లాడుతూ.. చరిత్రలో బొబ్బిలికి ప్రత్యేక స్థానముందన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి వీరత్వంపై ఓ పద్యాన్ని ఆలపించారు. అనంతరం రేలారేరేలా గాయకుడు కోరాడ జానకిరామ్ యువతను ఆకట్టుకునే గేయాలు ఆలపించారు. అంతకు ముందు రంగస్థలం ఫేమ్ తప్పెటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం బృంద ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం చెక్కకభజనలు, బుర్రకథ ప్రదర్శనలు, కోలాటం, జాలరిబాగోతం, థింసా నృత్యం, డప్పుల వాయిద్యం, జయదేవుని అష్టపది, బిందెల డాన్స్, సినీ నృత్యాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బేబి నాయన కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర డైరెక్టర్ రౌతు రామమూర్తినాయుడు, కోలాటం డ్యాన్స్ మాస్టర్ జి. కరుణ్కుమార్, శ్రీ కళాభారతి కార్యదర్శి నంబియార్ వేణుగోపాలరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు, స్థానిక కళాకారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ నటుడు షకలక శంకర్ -
ఇద్దరు యువకుల దుర్మరణం
గజపతినగరం: గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మారుతి వ్యాన్ చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు ఆదివారం దుర్మరణం చెందారు. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన పొట్నూరు వినయ్ కు మార్(35), ఎల్లాబిల్లి దినేష్(24)లు శనివారం సాయంత్రం బేకరీ ఐటమ్స్ తీసుకుని విశాఖపట్నం నుంచి ఒడిశాలోని రాయగడ వెళ్లి తిరిగి అదేవ్యాన్లో ఆదివారం విశాఖపట్నం వస్తుండగా గజపతినగరం రైల్వేస్టేషన్ దగ్గర వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. చెట్టును వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో మృతదేహాలు వాహనంలో పోలిక లేకుండా పడి ఉన్నా యి. ప్రమాద సమాచారం అందుకున్న గజపతి నగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాలను, వ్యాన్ను పోలీసులు జేసీబీతో బయటకు తీసి శవపంచనామాకు తరలించారు. వినయ్ కుమార్కు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, దినేష్కు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మృతుడు దినేష్ తల్లి ఎల్లబిల్లి శంకరమ్మ పిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై కె.కిరణ్కుమార్ నాయుడు తెలిపారు. -
శతపతి అన్నపూర్ణకు ఎస్డీజీ చాంపియన్ అవార్డు
రామభద్రపురం: స్థానిక కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ప్రాజెక్టు డైరెక్టర్ శతపతి అన్నపూర్ణకు నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులో ఆదివారం ఎస్డీజీ చాంపియన్ 2025 అవార్డు ప్రదానం చేశారు. ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో నేపాల్ దేశ సీ్త్ర శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి భగవతి చౌదరి చేతుల మీదుగా ఈ అవార్డు తాను అందుకున్నట్లు అన్నపూర్ణ సాక్షికి తెలిపారు. సీడీసీ సుస్థిర గ్రామీణాభివృద్ధిపై గ్రామ స్థాయిలో మహిళా సాధికారత, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర సేవలకు ఈ అవార్డు లభించిదని ఆమె చెప్పారు. ఈ అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావుతో పాటు పలువురు గ్రామ పెద్దలు ఆమెను ఈ సందర్భంగా అభినందించారు.ధాన్యం ఎత్తుకెళ్లిపోతున్న దొంగలు ● ఆందోళనలో రైతులు భామిని: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కళ్లాల్లో నిల్వ చేసిన ధాన్యం బస్తాలను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున వడ్డంగి రోడ్డులో ఉన్న కళ్లంలో 31 బస్తాలను అపహరించుకుపోయారు. దీంతో బాధిత రైతులు ముదుల పోలినాయుడు, కీర్తి మోహనరావు, బోదెపు ప్రదీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల కిందట నేరడి–బికి చెందిన రైతు వలరౌతు దండాసికి చెందిన 13 బస్తాల దాన్యం దొంగలించుకుపోయారు. అలాగే బత్తిలికి చెందిన అప్పన్న అనే రైతు సింగుబై కళ్లంలో వేసిన ధాన్యం రాశి నుంచి పది బస్తాల వరకు ధాన్యం చోరీ చేశారు. సరిహద్దు ఒడిశా గ్రామాలకు చెందిన దొంగలే ధాన్యం దోచుకుంటున్నారని మండల రైతులు ఆరోపిస్తున్నారు. డెంకాడ: మండలంలోని బొడ్డవలస జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొడ్డవలస గ్రామానికి చెందిన అట్టాడ పైడినాయుడు (59) బొడ్డవలస జంక్షన్ వద్ద శనివారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. విశాఖ వైపు నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ ఢీ కొట్టడంతో పైడినాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని విజయనరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11.20 గంటలకు మృతి చెందాడు. మృతుడి మనవడు అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన మహిళ.. భామిని: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. బత్తిలి ఎస్సై జి.అప్పారావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సతివాడకు చెందిన మండల అప్పలమ్మ (54) ఈ నెల 23న సతివాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. వెంటనే ఆమెను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం రాగోలు జెమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతదేహానికి ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ధాన్యం ముసుగులో నల్లబెల్లం..!
● ఒడిశా నుంచి ఆంధ్రాకు దిగుమతి ● బయట ధాన్యం బస్తాలు..లోపల నల్ల బెల్లం ● సారా తయారీలో నల్లబెల్లం వినియోగం కురుపాం: కొన్ని సినిమాలు ఆదర్శంగా నిలుస్తాయి.. మరికొన్ని సినిమాలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలను వివరిస్తాయి.. మరి ఏది ఆదర్శంగా తీసుకున్నారో కానీ కొంతమంది వ్యాపారులు సారా తయారీకి అవసరమయ్యే నల్లబెల్లాన్ని ఒడిశా నుంచి అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుంటున్నారు. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం స్థానికంగా పుష్కలంగా లభిస్తుండడం.. అది ఎక్కడ నుంచి తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల వచ్చిన ఓ సినిమాలో హీరో బయటకు సక్రమంగాను.. లోపల అక్రమంగాను సరుకులు తరలిస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తాడు. సరిగ్గా ఇదే పంథాను స్థానిక వ్యాపారులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతుండడంతో వ్యాపారులు ధాన్యం మాటన నల్లబెల్లాన్ని ఒడిశా నుంచి తీసుకువస్తున్నారు.ఈ బెల్లాన్ని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాలకు చెందిన సారా తయారీ దారులు కొనుగోలు చేస్తున్నారు. అక్రమార్కులకు వేగులుగా సిబ్బంది..? ఈ అక్రమ రవాణాకు కొంతమంది ఎకై ్సజ్ సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వ్యాపారులకు ఎకై ్సజ్ సిబ్బందే వేగులుగా పనిచేస్తుండడంతో బెల్లం రవాణాను, సారాను అర్టికట్టలేకపోతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎకై ్సజ్ శాఖ కురుపాం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా.. ఇకపై తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామన్నారు. -
విజయనగరం
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సర్వజన ఆస్పత్రికి వస్తున్న రోగులను ఇక్కడ సరైన సదుపాయాలు లేవని తన క్లినిక్కు వస్తే బాగు చేస్తానని ఓ ఫిజియోథెపిస్ట్ తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. –8లోరామతీర్థం దేవస్థానం (ఇన్సెట్లో) సీతారామస్వామివారి ఉత్సవ విగ్రహాలువిజయనగరం ఫోర్ట్: కలెక్టరేట్లోని ఆడిటోరి యంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అర్జీ దారులు తమ సమస్య గురించి కచ్చితమైన పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు అధికారులందరూ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలని కోరారు. అర్జీదారులు కలెక్టరేట్కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు 1100 ట్రోల్ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. రాజాం సిటీ: స్థానిక జీసీఎస్ఆర్ కళాశాలలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావుకు గణితంలో పీహెచ్డీ పట్టా లభించింది. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్విస్టిగేషన్ ఆన్ డెస్క్ ఎనర్జీ కాస్మోలాజికల్ మోడల్ ఇన్ సెర్టిన్ థీరీస్ ఆఫ్ గ్రావిటేషన్ అనే పరిశోధనకు గాను గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా ప్రదానం చేసిందని పేర్కొన్నారు. తన ఈ పరిశోధనకు డాక్టర్ వి.గణేష్, డాక్టర్ కె.దాసునాయుడులు గైడ్స్గా వ్యవహరించారన్నారు. శ్రీనివాసరావుకు పీహెచ్సీడీ రావడం పట్ల ప్రిన్సిపాల్ పురుషోత్తం, అధ్యాపకులు అభినందించారు. విజయనగరం టౌన్: జిల్లాకు చెందిన ధర్మాస్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ పీఎస్వీ.కామేశ్వరరావుకు ఉత్తమ నాట్యాచార్య పురస్కారం దక్కింది. జాతీయస్థాయి కూచిపూ డి నృత్యోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా గుడివాడలోని శ్రీ ఉపద్రష్ట ఫంక్షన్ హాల్లో ద్వారకాసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు దక్కినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నృత్యప్రదర్శన చేసిన చిన్నారులకు ఉత్తమ నాట్య ప్రతిభా పురస్కారాలు అందజేశారన్నారు. మచిలీపట్నం ఎమ్మార్వో హరినాథ్ చేతుల మీదుగా తాము పురస్కారా లు అందుకున్నామన్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నేడు చదురుగుడికి పెదపోలమాంబమక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి మేనత్త, పెదపోలమాంబ అమ్మవారు సోమవారం చదురుగుడికి చేరుకోనున్నారు. శంబర పోలమాంబ అమ్మవారి జాతర వచ్చే ఏడాది జనవరి 26, 27, 28 వ తేదీల్లో జరగనున్న నేపథ్యంలో అమ్మవారి జాతర తొలిఘట్టం పోలమాంబ అమ్మవారి మేనత్త పెద పోలమాంబ అమ్మవారిని చదురుగుడికి తీసుకువస్తారు. పోలమాంబ మేనత్త పె ద పోలమాంబ అమ్మవారి ఘటాన్ని జన్ని వారి ఇంటి నుంచి ఎస్.పెద్దవలస గ్రామ రహదారి వద్దనున్న అమ్మవారి గద్దె సమీపంలోకి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తు ల కోలాహం, వాయిద్యాలు, డప్పుల మధ్య పెదపోలమాంబ అమ్మవారిని గ్రామంలోనీ చదురుగుడికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. పెద పోలమాంబ అమ్మవారిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతా రామస్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి సంబ రానికి సిద్ధమవుతోంది. ఈ నెల 30న వైకుంఠ ఏకా దశి పర్వదినం సందర్భంగా ఆలయంలో శ్రీ సీతా రామచంద్రస్వామి ఉత్తర రాజగోపురం ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని వైఖాసన ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించడం దశాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. గడిచిన ఎనిమిదేళ్ల నుంచి రామతీర్థంలోని బోడికొండ(నీలాచలం పర్వతం) చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి నాడు రామగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి ఉత్తర మార్గం గుండా స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో ఏటా ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భక్తుల రాక నేపథ్యంలో దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉచిత దర్శనంతో పాటు స్వామివారి అన్న ప్రసాదా న్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 30న జరిగే కార్యక్రమాలు ముక్కోటి ఏకాదశి(వైకుంఠఏకాదశి)ని పురస్కరించుకుని ఈ నెల 30న అర్చకులు ప్రత్యేక పూజా కా ర్యక్రమాలు జరిపించనున్నారు. వేకువజామున 3 గంటలకు శ్రీ స్వామివారి ఆరాధన, 4 గంటలకు తిరుప్పావై సేవాకాలం, మంగళాశాసనం, తీర్థగోష్ఠి జరిపిస్తారు. సరిగా ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారదర్శనం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉత్తర రాజ గోపురం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పల్లకిలో ఉంచి విశేష పూజలు జరిపిస్తారు. అనంతరం అదేమార్గంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. తరువా త 7.30 గంటలకు స్వామివారి గ్రామ తిరువీధి ఉత్సవం జరిపించి భక్తులతో ఊరేగింపుగా బోడికొండ (నీలాచలం పర్వతం) మెట్లమార్గం వద్దకు చేరుకుని మెట్లోత్సవం, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్య రామతీర్థంలో శ్రీ రామచంద్రస్వామి గిరి ప్రదక్షిణ కు ఏటా భక్తుల తాకిడి పెరుగుతూ వస్తోంది. ఇక్క డ బోడికొండకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కొండపై స్వ యంగా శ్రీరాముడే నడయాడిన ఆనవాళ్లు, పాండవులు సంచరించే చిహ్నాలు..ఇలా ఎంతో చరిత్ర ఉండడంతో కొండ చుట్టూ పాదయాత్ర చేసేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామిజీ శ్రీనివాసనంద సరస్వతి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. అప్పటి నుంచి ప్రతి ఏటా గిరిప్రదక్షిణ విజయవంతంగా కొనసాగుతోంది. రామతీర్థంలో మెట్ల మార్గం వద్ద ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ ప్రధాన ఆలయం మీదుగా సీతారామునిపేట జంక్షన్కు చేరుకుంటుంది. సుమారు ఎనిమిది కిలోమీటర్లు భక్తులు నడుస్తారు. అనంతరం స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు.రామభద్రపురం: ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచడ మే లక్ష్యమని జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు అన్నారు. ఈ మేరకు రామభద్రపురం మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతోనే వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 9గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని, మళ్లీ సాయంత్రం 5.15గంటల వరకు ప్రత్యేక తరగతుల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 16,287 మంది.ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 6,878 మంది 119 పరీక్ష కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రాథమిక తరగతుల విద్యార్థులు పైస్థాయికి వెళ్తున్నా అక్షరాలు, కూడికలు, తీసివేతలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నారని, వారి సామర్థ్యాలు పెంచేందుకు ప్రాథమిక స్థాయి విద్యకు 75 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టామని తెలి పారు. కార్యక్రమంలో డీఈసీ మెంబర్ సన్యాసిరాజు, తదితరులు పాల్గొన్నారు.పుష్పయాగం అలంకరణలో వేంకటేశ్వరస్వామివిజయనగరం టౌన్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విజయనగరంలోని రింగురోడ్డులో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైన స్వామివారికి శ్రీనివాసా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయమంతా సంకీర్తనలు, గోవిందనామ భజనలు, అష్టోత్తర శతనామార్చనలతో భక్తిభావం పెంపొందింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి, తరించారు.రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి పూజలకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశాం. ఆ రోజు ఉత్తర మా ర్గం నుంచి స్వామి దర్శన భాగ్యం ఉంటుంది. వేకువజామున 5 గంటల కు ప్రత్యేక పూజలనంతరం భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. బోడికొండ మెట్ల మార్గం వద్ద మెట్లోత్సవం, గోపూజ అనంతరం గిరి ప్ర దక్షిణ ప్రారంభమవుతుంది. సుమారు 10వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. అందరికీ అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తాం. –వై.శ్రీనివాసరావు, ఈఓ,రామతీర్థం దేవస్థానంవైకుంఠ ఏకాదశి సందర్భంగా రామతీర్థంలో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తాం. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కొండ మార్గంలో, కోనేరు వద్ద, ఆలయంలో విధులు నిర్వర్తి స్తాం. క్యూల వద్ద తోపులాట జరగకుండా ముందస్తుగా చర్యలు చేపడతున్నాం. స్వామి దర్శనానికి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు చేపడతాం. ప్రశాంతంగా ముగి సేందుకు భక్తులు కూడా సహకరించాలి. –గణేష్, ఎస్సై, నెల్లిమర్ల మండలం -
గిరిజన హక్కులను పాలకులు కాలరాస్తున్నారు..
పార్వతీపురం: గిరిజన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణరావు విమర్శించారు. మండల కేంద్రంలోని ఆలిండియా ఆదివాసీ గిరిజన హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ గిరిజన భవనంలో వివిధ ఆదివాసీ, గిరిజన సంఘాల ప్రతినిధుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆయన గిరిజను ల హక్కులు, వారి కోసం రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అవగాహన కల్పించారు. రానురాను గిరి జనులకు భద్రత కరువవుతోందని, ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి కలుగుతోందన్నా రు. గిరిజనులకు రక్షణగా ఉన్న ఎన్నో చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను అటు అధికారు లు, ఇటు పాలకులు దుర్వినియోగం చేస్తున్నారు. గిరిజన హక్కుల రక్షణ కోసం అందరం ఐక్యంగా ఉండి, పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఎక్కడైనా గిరిజనులకు అన్యా యం జరిగితే మూకుమ్మడిగా పోరాటం చేయాలని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి అనునిత్యం పోరాడాలన్నారు. అనంతరం ఆలిండియా ఆదివా సీ గిరిజన హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నారు. -
వన దేవతలకు ప్రత్యేక పూజలు
జియ్యమ్మవలస: మండలంలోని తూర్పుముఠా ప్రాంతంలో గల టీకే జమ్ము, చినదోడిజ, పెదదోడిజ, కొండచిలకాం, పిటిమండ పంచాయతీ పరిధిలోని గిరిజనులు కందికొత్తల పండగలో భాగంగా వన దేవ తలకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా డప్పులు, సాంప్ర దాయ వాయిద్యాల నడుమ గిరిజనులంతా ఒక చోటకు చేరుకుని వనదేవతలైన గొడ్డలమ్మ, సాతారమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. పంటలను వనదేవతలకు నైవేద్యంగా పెట్టిన తర్వాత సామూహిక భోజనాలు చేస్తామని గిరిజనులు తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాలు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి. -
బంగ్లా చెరలో ‘అల’వికాని వేదన
బంగ్లాదేశ్ పరిణామాలు అక్కడి భారతీయులనే కాదు.. ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారుల కుటుంబాలనూ కల్లోలపరుస్తున్నాయి. పొరపాటున తీరం దాటి బంగ్లా దళాల చేతుల్లో చిక్కుకున్న విజయనగరానికి చెందిన 9 మంది మత్స్యకారులు 75 రోజులకుపైగా అక్కడి జైలులో మగ్గిపోతున్నారు. వారి కుటుంబాలు ఇక్కడ తల్లడిల్లిపోతున్నాయి. ఒకవైపు ఇల్లుగడవడం కష్టమైపోతోంది.. ప్రభుత్వమేమో లేఖలు, మాటలతోనే సరిపెడుతోంది తప్పితే విడిపించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. బంగ్లాలో పరిస్థితులు దిగజారిపోతుండటంతో తమవారు జైలులో ఎలా ఉన్నారో.. చెర వీడుతారా.. లేదా... అని ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. – ఏపీ సెంట్రల్ డెస్క్సముద్రంలో వేటకు వెళ్లి దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్గార్డుకు చిక్కిన 9 మంది మత్స్యకారులు 75 రోజులకుపైగా జైలులో మగ్గిపోతున్నారు. వారిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చొరవ చూపకపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగిందంటే.. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన మత్స్యకారులు నక్కా రమణ, వాసుపల్లి సీతయ్య, భోగాపురం మండలం కొండ్రాజుపాలెం గ్రామానికి చెందిన మరుపల్లి చిన్నప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, చిన్నప్పన్న, మైలపల్లి అప్పన్న జీవనం కోసం వైజాగ్కు వలస వచ్చారు. అక్కడే చేపల వేట కొనసాగించే వారు. అక్టోబర్ 13న విశాఖ చేపల రేవు నుంచి (బోటు నంబరు : ఎంఎం 75) సముద్రంలోకి వేటకు వెళ్లారు. దురదృష్టవశాత్తు అక్టోబర్ 14న అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పరిధిలోకి ప్రవేశించడంతో అక్కడి నేవీ అధికారులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.కడుపులో బిడ్డ.. జైలులో భర్తప్రసవ సమయంలో భర్త తన పక్కనే ఉండాలని భార్య కోరుకుంటుంది. భర్త కూడా తన బిడ్డ ఈ లోకంలోకి రాగానే ఎత్తుకుని మురిసిపోవాలనుకుంటాడు. దురదృష్టవశాత్తూ సూరాడ అనిత, అప్పలకొండ దంపతులకు ఆ అవకాశం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ జైలులో బందీగా ఉన్న సూరాడ అప్పల కొండ భార్య అనిత ప్రస్తుతం 9వ నెల గర్భిణి. వచ్చే నెలలో ప్రసవించే అవకాశం ఉందని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో తన భర్త ఆచూకీ కోసం అనిత ఆందోళన చెందుతోంది. పురిటి నొప్పులకు తోడు మనోవేదనతో ఆమె సతమతమవుతోంది. తన భర్త రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.బాధితులను విడిపించేందుకు వైఎస్సార్సీపీ యత్నాలు బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచింది. ఆర్థిక సహాయం అందించడంతోపాటు విడుదల కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. మత్స్యకారుల విడుదల కోసం వైఎస్సార్ సీపీ నాయకుడు, ఈస్ట్కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకీరామ్ బంగ్లాదేశ్ వెళ్లారు. జైలులో ఉన్న మత్స్యకారులకు ఆహారం, నిత్యావసర సరుకుల కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్ చేశారు. వారి విడుదలకు బంగ్లాదేశ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి కోసం ఢాఖాలోని సుప్రీంకోర్టు అడ్వకేట్ మహమ్మద్ రెహ్మాన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే భారత విదేశాంగ శాఖ అధికారులతోనూ సమావేశమై కేసు వివరాల డాక్యుమెంట్స్ను అందజేశారు.నాడు వైఎస్ జగన్ చొరవతో 22 మందికి పాక్ చెర నుంచి స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్లోని ఓ చేపల వ్యాపారి వద్ద పని చేస్తూ 2018 నవంబర్ 31న అరేబియా సముద్రంలో వేటకు వెళ్లారు. గుజరాత్ తీరం నుంచి పాకిస్తాన్ జలాల వైపు వెళ్లి అక్కడి భద్రత దళాలకు ఈ 22 మంది చిక్కారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు మత్స్యకారులను విడిపించేందుకు కనీస చర్యలు చేపట్టలేదు. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చి న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్ర మంత్రులు, అధికారులు కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరిపారు. ఫలితంగా విదేశాంగ శాఖ అధికారులు పాక్ అధికారులతో మాట్లాడి.. 22 మంది మత్స్యకారులను 2020 జనవరి 6న సురక్షితంగా భారత్కు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తంగా కోటీ పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించారు.బంగ్లాలో పరిస్థితులు దిగజారడంతో ఆందోళనబంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటుతో నెలకొన్న అస్థిరత నేటికీ కొనసాగుతోంది. సైన్యం ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఉన్నప్పటికీ భారత్తో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి. మరోవైపు తాజాగా భారత వ్యతిరేకి, ఇంక్విలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా ఓ హిందూ యువకుడు దీపూ చంద్రదాస్ను నిరసనకారులు క్రూరంగా కొట్టి చంపేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అరాచక శక్తుల ఆగడాలు మితిమీరిపోయి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. దౌత్యపరంగానూ భారత్ – బంగ్లాదేశ్ మధ్య దూరం పెరిగిన ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్కడి జైలులో మగ్గిపోతున్న ఆంధ్రా మత్స్యకారుల విడుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాలో పరిస్థితులు పూర్తిగా క్షీణించక ముందే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని బందీలను విడిపించేందుకు చర్యలు చేపట్టాలని బాధితుల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.సర్కారు చర్యలు శూన్యం బంగ్లాదేశ్ జైలులో బందీలుగా ఉన్న మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందే తప్ప ఆ దిశగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ప్రకటనలకే పరిమితమయ్యారు తప్పితే గంగపుత్రులను విడుదల చేయించేందుకు చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. మత్స్యకారులంతా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం పరిధి పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన వారే. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోవడం లేదు. బాధిత కుటుంబాలకు భరోసానివ్వాలి దురదృష్టవశాత్తూ దారి తప్పి బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కిన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి భరోసానివ్వాలి. జైలులో మగ్గిపోతున్న తమ వారు ఎప్పుడొస్తారో తెలియక ఇక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కైన వారు పరాయి దేశంలో బందీలుగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కష్టంగా మారింది. వారికి ఆర్థిక భరోసానివ్వడంతోపాటు బందీలను వీలైనంత త్వరగా విడిపించాలి. – సూరాడ చిన్నారావు, కొండ్రాజుపాలెం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంకా జైల్లో..బంగ్లాదేశ్ జైలులో 75 రోజులకు పైగా మగ్గిపోతున్న మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే జైలు అధికారులతోపాటు బంగ్లా సుంప్రీంకోర్టు న్యాయవాదితో కేసు విషయమై మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 9 మంది నేటికీ జైలులో వున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా బంగ్లా విదేశాంగ శాఖతో చిత్తశుద్ధితో సంప్రదింపులు జరిపి మత్స్యకారులను విడిపించి స్వస్థలాలకు తీసుకురావాలి. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. – వాసుపల్లి జానకీరామ్, ప్రెసిడెంట్, ఈస్ట్కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ -
అవయవదాతకు అంతిమ వీడ్కోలు
రాజాం సిటీ: రాజాం మండలం వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన గెడ్డాపు ఎర్రయ్య (39) స్థానిక వాటర్ ప్లాంట్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ నెల 16న ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు రాగోలు జెమ్స్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 26న బ్రెయిన్డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. గ్రామానికి చెందిన ఆర్మీ విశ్రాంత అధికారి డబ్బాడ వెంకటరమణ సాయంతో కుటుంబ సభ్యులకు అవయువ దానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో శనివారం అవయవ దానం చేసిన అనంతరం ఎర్రయ్య మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. మృతదేహం గ్రామానికి వస్తుందని తెలుసుకున్న గ్రామస్తులు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం–శ్రీకాకుళం రోడ్డుకు చేరుకున్నారు. అవయువ దాత అమర్రహే అంటూ అంతిమయాత్ర నిర్వహించారు. మృతునికి భార్య లక్ష్మితో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
జాబు ఏది బాబూ..?
విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు పూర్తయినా జాబ్క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందంటూ ఏఐవైఎఫ్ నాయకులు విజయనగరంలో శనివారం ఆందోళన చేశారు. ఎన్నికల సమయంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పట్టణంలో భిక్షాటన చేస్తూ ప్రభుత్వం తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూరవాసు మాట్లాడుతూ యువగళం పేరిట జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు చెల్లిస్తామని నేతలు హామీ ఇచ్చారన్నారు. 18 నెలలుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువత నిరాశకు గురై మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదలచేసి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి రూ.3వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్మి వెలగడ రాజేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సుమన్, చరణ్, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. బాబు వచ్చాడు.. జాబుల్లేవు జాబ్క్యాలెండర్ హామీని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లింపు ఊసేలేదు యువత భవిష్యత్తు ఎటు? భిక్షాటనతో ఏఐవైఎఫ్ నిరసన -
● సోషల్ టీచర్ను నియమించండి
మా పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు 90 మంది విద్యార్థులం చదువుతున్నాం.. మాకు సోషల్ టీచర్ లేరు.. పాఠ్యాంశ బోధన జరగడం లేదు.. తక్షణమే సోషల్ టీచర్ను నియమించాలంటూ కొత్తవలస మండలం వీరభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు శనివారం కోరారు. గతంలో ఇక్కడ పనిచేసిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు జె.వి.ఎస్.సన్యాసిరావును తోటి విద్యార్థులు, ఉపాధ్యాయినులపై అనుచిత ప్రవర్తన, లైంగిక ఆరోపణలతో గతేడాది సస్పెండ్ అయ్యారు. కొద్దిరోజుల తర్వాత ఆయన సస్పెన్షన్ రద్దుచేసి తొలుత పూసపాటిరేగ మండలం ముక్కాం జెడ్పీ హైస్కూల్, ఈ ఏడాది జూన్లో మళ్లీ వీరభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాలలో నియమించారు. ఆయనను తాజాగా డీఈఓ మౌఖిక ఆదేశాలతో జామి జెడ్పీ హైస్కూల్కు బదిలీ చేశారు. దీంతో ప్రస్తుతం వీరభద్రపురం పాఠశాలలో శాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు పోస్టు ఖాళీగా ఉంది. ఎఫ్ఏ పరీక్షలు దగ్గర పడుతుండడంతో పాఠ్యాంశ బోధన జరగక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై ఎంఈఓ జి.శ్రీదేవి స్పందిస్తూ సోషల్ టీచర్గా వేరొకరిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని, లేదంటే అదే పాఠశాలో బీఈడీ చేసిన ఉపాధ్యాయులతో పాఠ్యాంశాల బోధనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. – కొత్తవలస -
10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అదనంగా 10 వేల ఎకరాల్లో ఉద్యానసాగుకు ప్రణాళికలు రూపొందించినట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ శాఖలు సమష్టిగా, సమన్వయంతో కృషిచేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యసాయాన్ని లాభసాటి చేయాలన్న ఉద్దేశంతో సంప్రదాయ వరి పంటకు బదులు ఉద్యాన పంటల విస్తరణకు ప్రత్యేక మిషన్ను రూపొందించామన్నారు. ప్రస్తుత రబీ సీజన్లో 4వేలు ఎకరాలు, ఖరీఫ్లో 6 వేలు ఎకరాల్లో సాగు పెంచాలన్నది మిషన్ లక్ష్యమన్నారు. పొలానికి 180 మీటర్ల దూరం లోపు విద్యుత్ సదుపాయం ఉన్న రైతులను ముందుగా ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి. తారకరామరావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి, తదితరులు పాల్గొన్నారు. ● ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్ను అందించే పథకాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఇంటిపై రెండు కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా అందిస్తుందన్నారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు పాల్గొన్నారు. -
శ్రీనివాసుని కల్యాణానికి తలంబ్రాల సేకరణ
రాజాం సిటీ: వచ్చేఏడాది ఏప్రిల్ నెలలో తిరుపతిలో జరగనున్న శ్రీనివాసుని కల్యాణానికి అవసరమైన తలంబ్రాల కోసం భక్తులు శనివారం ధాన్యంసేకరించారు. అగ్రహారంలో శ్రీనివాసుని రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధాన్యం సేకరణ చేపట్టారు. వీటిని గోటితో ఒలవగా వచ్చిన బియ్యాన్ని తలంబ్రాలుగా శ్రీనివాసునికి సమర్పిస్తామని గాయత్రి బ్రాహ్మణ సంఘం సభ్యులు, పనసలవలస గ్రామానికి చెందిన వైష్ణవాచార్యపీఠాధిపతి తిరుమల రంగనాథం, అయ్యప్ప గురుస్వామి శేషు తెలిపారు. ఇలా అయితే గ్రామాల్లో తిరగలేం... ● మంత్రి వద్ద వాపోయిన కార్యకర్తలు దత్తిరాజేరు: మండలంలోని చుక్కపేటలో టీడీపీ మండలాధ్యక్షుడు చప్ప చంద్రశేఖరరెడ్డి సమక్షంలో పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. గదబవలస గ్రామానికి రోడ్డు నిర్మాణంలో జాప్యంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నామని, తమను నిలదీస్తున్నారంటూ సీనియర్ నాయకుడు సూర్యనారాయణ వాపోయారు. అర్హులకు పింఛన్లు మంజూరు కావడంలేదు... సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నారు.. కార్యకర్తలకు కూడా పథకాలు అందడం లేదు.. పల్లెల్లో తిరగలేకపోతున్నామని, ఇలా అయితే భవిష్యత్తులో కష్టమేనంటూ పలువురు నాయకులు మంత్రి వద్ద విచారం వ్యక్తంచేయడం గమనార్హం. -
పర్యాటకుల విడిది.. తాటిపూడి
విజయనగరం గంటస్తంభం: ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా విహరించాలనుకునే పర్యాటకులను గంట్యాడ మండలంలో ఉన్న తాటిపూడి (గొర్రిపాటి బుచ్చిఅప్పారావు) ప్రాజెక్టు ఆకర్షిస్తోంది. అటవీశాఖ, వన సంరక్షణ సమితి సహకారంతో ఇక్కడ నడుస్తున్న ఎకో టూరిజం కేంద్రం పచ్చని అడవులు, కొండలు, విస్తారమైన జలాశయం కలిసిన అద్భుత దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. ప్రకృతి సోయగాల మధ్య అటవీశాఖ నిర్మించిన 10 కాటేజీలు సందర్మకులకు ప్రశాంత వాతావరణంలో బసచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పచ్చని కొండల మధ్య వసతి పట్టణ కాలుష్యానికి దూరంగా, ప్రశాంత వాతావరణంలో కాటేజీలను కొండ పాదాల వద్ద నిర్మించారు. చుట్టూ అడవులు, ఎదురుగా తాటిపూడి రిజర్వాయర్ కనిపించేలా ఏర్పాటు చేయడంతో పర్యాటకులు ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతిని పొందుతున్నారు. కాటేజీల నిర్వహణను ఈడీసీ ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు నిర్వహించడం విశేషం. వేడుకలకు వేదిక... కార్పొరేట్ సమావేశాలు, కుటుంబ వేడుకలు, పుట్టినరోజు కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా మీటింగ్ హాల్ అందుబాటులో ఉంది. మీటింగ్ హాల్ అద్దె రూ.5 వేలు మాత్రమే. ముందస్తుగా తెలియజేస్తే కావాల్సిన ఆహారాన్ని అక్కడే సిద్ధం చేస్తారు. రిజర్వాయర్లో పట్టిన చేపలను పర్యాటకుల ముందే వండి వడ్డించడం ఇక్కడి ప్రత్యేకత. రవాణా సౌకర్యం... ఎకో టూరిజం కేంద్రం ప్రధాన నగరాలకు సులభంగా చేరుకునేలా ఉంది. విజయనగరం నుంచి 32 కి.మీ, విశాఖపట్నం నుంచి 70 కి.మీ.దూరంలో ఉంది. విజయనగరం–ఎస్.కోట జాతీయ రహదారిపై ఐతన్నపాలెం కూడలి నుంచి కేవలం 7 కి.మీ. దూరంలో కాటేజీలు ఉన్నాయి. కాటేజీలకు వెళ్లేందుకు రోడ్డు సదుపాయం ఉంది. మరిన్ని సౌకర్యాలు తాటిపూడి గిరివినాయక ఎకో టూరిజం కేంద్రంలో అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నాం. రిజర్వాయర్లో బోటింగ్ సౌకర్యం, పిల్లల కోసం చిల్డ్రన్ ప్లే పార్క్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రకృతి ఒడిలో ఉన్న ఎకో టూరిజం కేంద్రాన్ని పర్యాటకులు వినియోగించుకోవాలి. – బిర్లంగి రామ్నరేష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిజర్వాయర్ చెంతనే నిర్మించిన కాటేజీలు అందుబాటులో వసతి సౌకర్యం.. పర్యాటకుల కోసం ఇక్కడ మొత్తం 10 కాటేజీలు ఉన్నాయి. ఒక్కో కాటేజీలో రెండు బెడ్ రూమ్లు, అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించారు. రోజుకు కాటేజీ అద్దెను రూ.2,500గా నిర్ణయించారు. చిన్న కుటుంబాలకు ఇది అనువుగా ఉంది. సేంద్రియ పంటలతో తయారు చేసిన రుచికరమైన భోజనం అందించేందుకు ప్రత్యేక రెస్టారెంట్ సదుపాయం ఉంది. బొంగు చికెన్ వంటి స్థానిక వంటకాలు పర్యాటకులకు నోరూరిస్తున్నాయి. గిరిజన నృత్యాల ప్రదర్శన పర్యాటకుల కోరిక మేరకు గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే థింసా, మయూరి నృత్యాలు ప్రదర్మిస్తారు. చలి రాత్రుల్లో క్యాంప్ ఫైర్, సాహస ప్రియుల కోసం ట్రెక్కింగ్ మార్గం అందుబాటులో ఉంది. -
అంతా హడావుడే..!
● చేప పిల్లల విడుదలకు ఇదా సమయం.. ● 546 చెరువుల్లో 14 లక్షల చేప పిల్లలు ● రానున్న వేసవికి నీరు అడుగంటే ప్రమాదం ● మత్స్యశాఖ తీరుపై అసంతృప్తిసీతంపేట: మత్స్యశాఖాధికారులు హడావిడిగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. శనివారం నుంచి పలు గ్రామాల్లోని చెరువుల్లో పిల్లలు విడిచిపెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మరికొద్ది నెలల్లో వేసవికాలం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పుడు చేప పిల్లలను చెరువుల్లో ఎలా విడిచిపెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వేసవిలో నీరు అడుగంటే అవకాశం ఉండడంతో చేప పిల్లలు ఎదుగుదల లేకుండా మధ్యలో చనిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ఇవి ఎంతవరకు రైతులకు ఉపయోగపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. పాలకొండ నియోజకవర్గ పరిధిలో 546 గిరిజనులకు చెందిన చెరువుల్లో 14 లక్షల చేపలు వేయడానికి చర్యలు తీసుకున్నట్లు అధికారుల గణాంకాల ద్వారా తెలిసింది. దీనిలో భాగంగా చేప పిల్లల పంపిణీకి కొద్ది రోజుల కిందట టెండర్లు నిర్వహించగా.. ఎల్వన్ బిడ్డర్ టెండర్ దక్కించుకున్నారు. ఐటీడీఏ నిధులు సుమారు రూ.15 లక్షల వరకు ఇందుకోసం వెచ్చించనున్నారు. సీతంపేట, భామిని, వీరఘట్టం, పాలకొండ మండలాల్లోని చెరువుల్లో చేప పిల్లలు వేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సగానికి పైగా చెరువులు అడుగంటగా, మిగతా చెరువుల్లో నీరు ఉంది. అన్ని చెరువులూ మార్చి నెలాఖరుకు అడుగంటుతాయి. జూన్, జూలై నెలల్లో చెరువుల్లో చేప పిల్లలు వేయాల్సి ఉండగా..ఇప్పుడు వేయడం ఏం ప్రయోజనమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మత్స్యశాఖ జిల్లా అభివృద్ధి అధికారి ఏమన్నారంటే... ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సంతో ష్కుమార్ వద్ద ప్రస్తావించగా టెండర్లు ఆలస్యం కావడం వల్ల చేప పిల్లల పంపిణీ ఆలస్యమైందన్నారు. వర్షాలు ఈ దఫా బాగా పడడంతో చెరువుల్లో నీరు ఉందన్నారు. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడే చేప పిల్లలు వేయనున్నట్లు చెప్పారు.


