breaking news
Vizianagaram
-
అంగన్వాడీ, ఆశా వర్కర్లపై ఖాకీల క్రౌర్యం
విజయనగరం గంటస్తంభం: కనీస వేతనం నెలకు రూ.26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 12 గంటల పనిదినాలను ఉపసంహరించుకుని లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ వెంటనే చేపట్టి ఆశా, అంగన్వాడీ, స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో కలెక్టరేట్ రణరంగంగా మారింది. వేలాదిమంది కార్మికులు ర్యాలీగా విజయనగరం కలెక్టరేట్కు చేరుకున్నారు. సమస్యలు, డిమాండ్ల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంపై నినదించారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు సీఐటీయూ నేతలను పోలీసులు ఈడ్చుకుపోయి, బలవంతంగా అరెస్టుచేశారు. ఆందోళనలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎం.శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్ములు కె.సురేష్, టి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
కేజీకి 900 గ్రాములే..!
రామభద్రపురం: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు గాడి తప్పుతున్నాయని వాటిని పరిష్కరించే నాథుడు కరువయ్యాడని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న లోపాలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించే ఆహార సలహా సంఘాలు కానరావడంలేదు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న నిత్యావసర సరుకులు ఇష్టానుసారం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. బియ్యం పంపిణీలో డీలర్ల ఇష్టారాజ్యం జిల్లాలో రేషన్ 1254 దుకాణాలు ఉండగా వాటి పరిఽథిలో ఉన్న 5,70,980 కార్డులకు 9,02,06 మెట్రిక్ టన్నులు బియ్యం 11 ఎంఎల్ఎస్ గోదాముల నుంచి సరఫరా అవుతున్నాయి. అయితే చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. డీలర్లు తూకాల్లో కిలోకి 100 గ్రాముల పైడి కోత విధించి బియ్యం ఇస్తున్నారని వాపోతున్నారు. మరి కొన్నిచోట్ల 20 కిలోలకు గాను సుమారు 3 కిలోల వరకు తక్కువ ఇస్తున్నట్లు తెలిసింది.ఈ విషయమై డీలర్లను ప్రశ్నిస్తే..ఎంఎల్ఎస్ గోదాంల నుంచే తూకాలు తక్కువ చేసి బియ్యం సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. వాటిని పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిల్వ కేంద్రాల్లోనూ తక్కువగా.. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యాన్ని ఎంఎల్ఎస్ గోదాముల నుంచి డీలర్లు తీసుకుని రేషన్ దుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేస్తారు.అయితే గోదాముల నుంచి సరఫరా అవుతున్న బియ్యంలో పెద్ద తేడా కనపడుతోందని డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గోదాము నుంచి 50 కిలోల బస్తా తీసుకుంటే 48 కిలోలే వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఇదే విషయమై ఇటీవల జిల్లాలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు రేషన్ దుకాణాల్లో అకస్మిక తనిఖీలు చేస్తున్న సమయంలో జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే తూకంలో తేడాలు వస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.తూకాల్లో తేడాలు వస్తే నిల్వ కేంద్రాల నుంచి బియ్యం తీసుకునేటప్పుడు డీలర్లు ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ భారాన్ని గోదాము నిర్వాహకులు, డీలర్లు కలిసి కార్డుదారుల మీదకు నెడుతున్నారని, ఇరు పక్షాలు కలిసి పేదల పొట్ట కొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెత్తి చూడని లీగల్మెట్రాలజీ అధికారులు తూకాల్లో వ్యత్యాసాన్ని పరిశీలించాల్సిన లీగల్ మెట్రాలజీ అధికారులు లబ్ధిదారులు నష్టపోతున్నా కనీసం కన్నెత్తి చూడడం లేదని, మామూళ్ల మత్తులో కార్యాలయాలకే పరిమమతమవుతున్నారని లబ్ధిదారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది మార్చి నెలలో రేషన్ డీలర్లకు చెందిన కాటాలను పరిశీలించి సీళ్లు వేశారు. అందుకు ఒక్కో డీలర్ నుంచి కాటా సీలుకు రూ.600, ఎప్పుడైనా కాటా రిపేరు వస్తే మరమ్మతు చేయడానికి రూ.400లు మొత్తం రూ.1000 తీసుకుని తాత్కాలిక రసీదు ఇచ్చి వెళ్లిపోయారు. ఇప్పటివరకు ఒరిజినల్ లీగల్ మెట్రాలజీ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారైనా తనిఖీలు చేపట్టకపోవడంతో డీలర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. పేదలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకుల పంపిణీని అధికారులు కూడా తనిఖీ మానేశారనే విమర్శలు లేకపోలేదు. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్డీవో అధ్యక్షతన ప్రజా సంఘాలు, అన్ని వర్గాలు, రాజకీయ పార్టీప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఆహార సలహా సంఘం సభ్యులతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించి దీర్ఘకాలికంగా ఉన్న ప్రజా సమస్యలపై చర్చించాల్పి ఉంది. అయితే అధికారులు ఆహార సలహా కమిటీల ఏర్పాటు గాని, సమావేశాలు ఏవీ నిర్వహించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికారుల పర్యవేక్షణతో పాటు తనిఖీలు చేయకపోవడంతో పాటు ఆహార సలహా కమిటీ కానరాకపోవడంతో పేదలకు నిత్యావసర సరుకుల సరఫరా ఇష్టానుసారం చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. ఇష్టాను సారం పేదలకు రేషన్ డీలర్ల బియ్యం పంపిణీ లబ్ధిదారులకు కోత విధిస్తున్న రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ గోదాం నిర్వాహకులు ఇవ్వడం లేదంటున్న డీలర్లు పర్యవేక్షించని ఉన్నతాధికారులు తనిఖీలు చేయని లీగల్ మెట్రాలజీ అధికారులు ఇటీవల అకస్మికంగా గుర్తించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ● పీజీఆర్ఎస్–రెవెన్యూ క్లినిక్లో 210 వినతుల స్వీకరణవిజయనగరం గంటస్తంభం: ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్),రెవెన్యూ క్లినిక్లో వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్–రెవెన్యూ క్లినిక్లో మొత్తం 210 వినతులు స్వీకరించగా..అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే 95 అర్జీలు ఉన్నాయి. భూ, సర్వే సమస్యలను కేవలం కార్యాలయం స్థాయి నివేదికలకే పరిమితం చేయకుండా అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత వ్యక్తులతో మాట్లాడి, రికార్డులను పరిశీలించిన తర్వాత వాస్తవ పరిస్థితుల ఆధారంగా సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రాధాన్యతతో పరిష్కరించి, ప్రజలు ఒకే సమస్యపై పదేపదే కార్యాలయాల చూట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలని ఆదేశించారు. మాట్లాడాకే ఎండార్స్మెంట్.. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీదారుతో నేరుగా మాట్లాడిన తర్వాతే ఎండార్స్మెంట్ ఇవ్వాలి. వారితో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం కాగితాలపై నివేదికలు ఇవ్వకుండా సమస్య వాస్తంగా పరిష్కారమైందా లేదా నిర్ధారించుకోవాలని సూచించారు. 1100 ఫిర్యాదులపైనా దృష్టి 1100 టోల్ఫ్రీ సేవల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారుతో మాట్లాడి సమస్యను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నివేదిక ఇవ్వాలని సూచించారు. 1100 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్.సత్తిబాబు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఇ.మురళి, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్సెల్కు 36 ఫిర్యాదులు విజయనగరం టౌన్: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి చట్టపరిధిలో న్యాయం చేయడానికి గ్రీవెన్స్సెల్ నిర్వహిస్తున్నామని ఎస్పీ ఏఆర్.దామోదర్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించి బాధితులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను విని, వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలకు తక్షణ పరిష్కారమందించాలని సూచించారు. గ్రీవెన్స్సెల్లో భాగంగా 36 పిర్యాదులను స్వీకరించారు. భూతగాదాలకు సంబంధించి 12, కుటుంబ తగాదాలకు సంబంధించి ఆరు, చీటింగ్కు సంబంధించి నాలుగు, ఇతర అంశాలకు సంబంధించి 14 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సై ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపు ● ‘అనే నేను’ ప్రచార కార్యక్రమానికి శ్రీకారంవిజయనగరం గంటస్తంభం: దేశ స్వాతంత్య్ర స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశ నిర్మాణంలో భాగస్వాములు ‘అనే నేను’ ప్రచార కార్యక్రమాలను ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రజలు కేవలం ప్రేక్షకులుగా కాకుండా దేశ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించేలా కార్యక్రమాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆగస్టు 14న జిల్లా వ్యాప్తంగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలు తమ ఇళ్ల వద్ద లేదా ప్రముఖ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. అలాగే ప్రభుత్వ భవనాలు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్య కూడళ్లను జాతీయ రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ‘అనే నేను’ కార్యక్రమాన్ని నిర్వహించి, దేశ భవిష్యత్తు కోసం తాము చేయగలిగే కృషిపై విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు. యువత, విద్యార్ధులు, ప్రముఖలు, క్రీడాకారులు, పౌరులు జాతీయ జెండాను చేతబట్టి ‘అనే నేను...దేశ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను’ అంటూ 30 నుంచి 60 సెకన్ల స్వీయ వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని కలెక్టర్ కోరారు. అభివృద్ధి చెందిన భారత్, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆలోచిద్దాం..ఆచరిద్దాం..అభివృద్ధి చెందిన భారత్ను నిర్మిద్దాం అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని అలమండ పంచాయతీ నిడగల్లు గూడ గ్రామానికి చెందిన బిడ్డిక సుబ్బారావు (42) మద్యానికి బానిసై రోజంతా మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడని భార్య గౌరి, కుమారుడు ప్రదీప్ మందలించడంతో మనస్తాపం చెంది ఆదివారం సాయంత్రం గడ్డి మందు తాగేశాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా, అక్కడ వైద్యులు చికిత్స అందించి పరిస్థితి విషమంచడంతో మెరుగైన చికిత్స కోసం చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేశారు. ఈ మేరకు 108లో తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో సుబ్బారావు మృతి చెందాడు. ఈ ఘటనపై భార్య కుమారుల ఫిర్యాదు మేరకు జియ్యమ్మ వలస ఎస్సై ఎన్.ప్రశాంత్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.దుర్గాదేవి గుడిలో చోరీదత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి ఆటో స్టాండ్ వద్ద ఉన్న దుర్గాదేవి ఆలయంలో సోమవారం తెల్ల వారు జామున హుండీ చోరీకి గురైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై పెదమానాపురం పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిసర ప్రాంతాలను శీలించినట్లు తెలిపారు. హుండీలో సుమారు రూ.20 వేల వరకు భక్తులు వేసిన నగదు ఉంటుందని చెప్పారు. ఈ విషయమై పెదమానాపురం ఎస్సై కళాధర్ వద్ద ప్రస్తావించగా దొంగలు ఎటువైపు నుంచి వచ్చారో తెలియడానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆటోస్టాండ్ వద్ద తెల్ల వారు జామున ప్రయాణికుల కోసం ఉంచిన ఆటోలో కొంత నగదు రెంచీలు దొంగలు తీసుకుని పోయినట్లు ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కాలువలో పడి బాలిక మృతిగరుగుబిల్లి: బట్టలు ఉతికేందుకు వెళ్లిన బాలిక తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధానకాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందింది. ఈ సంఘటన గరుగుబిల్లి మండలంలోని దళాయివలస పంచాయతీ మధుర శివరాంపురం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల నిషా(15) గ్రామ సమీపంలోని కాలువ వద్ద బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. కాలువ ప్రాంతానికి వెళ్లిన కుమార్తె ఇంటికి చేరుకోక పోవడంతో కాలువ ప్రాంతంలో పరిశీలించగా అందులో పడి మృతి చెందిందని నిర్ధారణకు వచ్చిన తండ్రి రాజు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. కొద్దిసేపటి అనంతరం బాలిక మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తె నిషాకు మతిస్థిమితం లేదని తండ్రి చెప్పాడు. తమకు ఉన్న ఇద్దరు కుమార్తెల్లో పెద్దకుమార్తె నిషా చిన్న వయస్సులోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు రాజు, ఇందుతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఫకృద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● కోటలో నిరసన గళం
డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చాలంటూ ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో నిరసన సభ, ర్యాలీ నిర్వహించారు. దేవీ కూడలి వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా సీఐ నారాయణమూర్తి నేతృత్వంలోని పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా చేపట్టే ర్యాలీని అడ్డుకునేలా సర్కారు పెట్టిన ఆంక్షలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకురాలు కె.భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సమాధానం చెప్పలేక సంకెళ్లు
చంద్రబాబు సర్కారు డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేక.. నిరసన తెలిపిన వారికి సంకెళ్లు వేస్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో పూడ్చిపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. చీపురుపల్లి–గరివిడి ప్రధాన రహదారిలోని మామిడికాయలశాల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు బారికేడ్లు, తాళ్లతో మోహరించి అడ్డుకోవడంపై నిలదీశారు. అక్కడే బైఠాయించి సర్కారు తీరును ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పాలని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లేకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
● నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు
చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని, డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులకు అన్యాయం చేసిందని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య విమర్శించారు. చంద్రబాబు పాలనపై యువత తిరుగుబాటు ఆరంభమైందన్నారు. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేయడం, ఫీజురీ యింబర్స్మెంట్ చెల్లించకపోవడంపై యువత పోరుకు సిద్ధమైందన్నారు. గజపతినగరం జూనియర్ కాలేజీ వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. డీఎస్సీలో నిరుద్యోగ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం పోలీసులతో నోళ్లు నొక్కించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకుడు సిరిపురపు జగనన్మోహనరావు పాల్గొన్నారు. -
ఎయిడ్స్పై అవగాహన కల్పించాలి
విజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వైద్యసిబ్బందికి సూచించారు. హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కల్పించడం కోసం రూపొందించిన ఇంటిన్సైఫెడ్ ఐఈసీ క్యాంపైన్ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం తన చాంబర్లో ప్రారంభించారు. వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రచార కార్యక్రమం జిల్లాలో రెండు నెలలు పాటు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఎస్.జీవనరాణి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీమాధవి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ, డీఎల్ఓ రాణి పాల్గొన్నారు. కార్పొరేషన్ తీరుపై నమ్మకం లేదా? ● కమిషనరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు ఒక అర్జీ ● కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్కు మున్సిపల్ సమస్యలపై 15 అర్జీలు విజయనగరం అర్బన్: నగర పాలక సంస్థ అధికారులు, పాలకవర్గంపై నగర ప్రజలకు నమ్మకం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సమస్యలను కార్పొరేషన్ అఽధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకలపోవడంతో నగరవాసులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)’ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. ఏకంగా నగరవ్యాప్తంగా కేవలం ఒక్కటంటే ఒక్క వినతి పత్రం మాత్రమే రావడం గమనార్హం. అయితే, మున్సిపల్ పరిధిలోని సమస్యలపై కలెక్టర్ వేదికలో ఏకంగా 15 వినతి పత్రాలు సమర్పించారు. స్థానిక కార్పొరేషన్ అధికారులపై నమ్మకం సన్నగిల్లడం వల్లే నగరవాసులు కలెక్టరేట్ బాటపడుతున్నట్టు స్పష్టమవుతోంది. మున్సిపల్ కార్యాలయంలో ప్రజారోగ్య విభాగానికి సంబంధించి వచ్చిన ఆ ఒక్క వినతిని కమిషనర్ బాలస్వామి స్వీకరించి, అధికారులకు బదిలీ చేశారు. పంటల బీమా నమోదులో జాప్యం వద్దు విజయనగరం ఫోర్ట్: పంటల బీమా నమోదు లో జాప్యంచేయొద్దని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయశాఖ ఏడీలు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులతో సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 15,600 హెక్టార్లకు మాత్రమే పంటల బీమా జరిగిందని, బీమా కేవలం నాలుగు రోజుల సమయం ఉన్నందున రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో ఎలినినో పరిస్థితుల దృష్ట్యా రైతులతో తక్షణమే పంటల బీమా నమోదు చేయించాలన్నారు. -
న్యాయం జరిగేంతవరకు పోరాడతాం
మొత్తం భూమిపై కోర్టులో కేసు నడుస్తోంది బాడంగి, డొంకినవలస రెవెన్యూ పరిధిలోని మొత్తం 32ఎకరాలభూములపైన కోర్టులో కేసు నడుస్తోంది. మాభూములు మాకు ఇప్పించాలంటూ కోర్టువారిని కోరాం. తీర్పువచ్చేంతవరకు ఎవరూ ఆక్రమణలు చేయడానికి వీలులేదు. – గండిశంకరరావు, రైతు, గ్రామపెద్ద, డొంకినవలస కోర్టులో కేసు ఉండగా దౌర్జన్యం తగదు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామంటేనే భూములిచ్చాం డొంకినవలసలో రైతుల ధర్నా -
దగా డీఎస్సీపై మెగా పోరు
సాక్షిప్రతినిధి, విజయనగరం: డీఎస్సీ అక్రమాలపై యువత సమరభేరి మోగించింది. ఉప్పెనగా ఉద్యమించింది. ప్రశ్నపత్రం లీకేజీ, పోస్టుల నియామకాల్లో అవకవతకలపై నిగ్గుతేల్చాలంటూ సోమవారం విజయనగరం జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో వేలాది మంది రోడ్డు ఎక్కారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ సారథ్యంలో జరిగిన డీఎస్సీ రిక్రూట్మెంట్ మొత్తం అవకతవకల మయమని, మెరిట్ను.. రోస్టర్ పాయింట్లను పక్కనపెట్టి ఇష్టానుసారం పోస్టులు అమ్ముకొని ప్రతిభావంతులకు అన్యాయం చేశారని నిలదీశారు. మెగా డీఎస్సీ పేరిట దగా చేసి, నిరుద్యోగ యువతను నిండా ముంచేసిన చంద్రబాబు సర్కారుపై నిరసన తెలిపారు. అయితే, డీఎస్సీ అవినీతి ప్రజల్లోకి వెళ్లిందని, కచ్చితంగా దీనిపై భారీగా ప్రజా ఉద్యమం ఉంటుందన్న సమాచారం ముందే అందుకున్న ప్రభుత్వం పోలీసు వర్గాలను ఆదివారం రాత్రి నుంచే అప్రమత్తం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు యువత, ఉద్యమకారులపై లాఠీలు గురిపెట్టించింది. నాయకులను హౌస్ అరెస్టు చేయడమే కాకుండా.. నోటీసులు ఇస్తూ కేసులు పెడతామని బెదిరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లవద్ద, పార్టీ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఉద్యమాన్ని ముందుకు కదలనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించింది. అయితేనేం పోలీసులను దీటుగా ఎదుర్కొన్న యువత, పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చాలంటూ నినదించారు. ● అడుగడుగునా ఆంక్షలు విజయనగరం జిల్లా కేంద్రంలోని రామారాయుడు రోడ్డు (పీడబ్ల్యూ మార్కెట్) నుంచి ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వంలో భారీ నిరసన ర్యాలీకి సన్నాహాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తు నోటీసులు లేకుండానే భారీగా మోహరించి ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా నగర పరిధిలోని పలు విభాగాలు, గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, యువత ఉదయం 11 గంటలకే పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ దమనకాండపై నిరసన తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల ఆదేశాలను గౌరవిస్తూ ర్యాలీని విరమిస్తున్నట్లు కోలగట్ల ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు, ప్రజా ఉద్యమాలను చూసి భయపడే పోలీసులతో అడ్డుకుందన్నారు. ఊరూవాడా ఏకం కావడంతో సర్కారు బేజారు శాంతియుత ర్యాలీలపై పోలీస్ ఆంక్షలు నాయకుల హౌస్ అరెస్ట్.. అయినా వెనక్కి తగ్గని యువత ఉద్యమాన్ని ముందుకు నడిపిన నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామాకు డిమాండ్ -
చంద్రబాబు సర్కారుపై తిరుగుబాటు
● స్కీమ్ వర్కర్ల ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్ ● కనీస వేతనాల కోసం కార్మికుల సమరం ● పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట ● సొమ్మసిల్లిన మహిళలు విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు సర్కారుపై అంగన్వాడీ, ఆశ, స్కీమ్ వర్కర్లు తిరుగుబాటు ప్రకటించారు. హామీల అమలులో అలసత్వం, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై సమరభేరి మోగించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు గూడ్స్ షెడ్ కూడలి నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. కనీస వేతనం నెలకు రూ.26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 12 గంటల పనిదినాలను ఉపసంహరించుకుని లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ వెంటనే చేపట్టి ఆశ, అంగన్వాడీ, స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నినదించారు. స్టీల్ ప్లాంట్, ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశౠరు. ఆశ వర్కర్లకు రాత్రి డ్యూటీలను రద్దు చేయాలని కోరారు. అధికారులకు గోడు వినిపించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశ వర్కర్లు సొమ్మసిల్లిపోయారు. సీఐటీయూ నాయకులు 13 మందిని పోలీసులు అరెస్టు చేసి డెంకాడ, విజయనగరం పట్టణ స్టేషన్లకు తరలించారు. ఈ ఆందోళనలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎం.శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్ములు కె.సురేష్, టి.వి.రమణ, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, శ్రామిక మహిళా నాయకురాలు ఎం.ఉమామహేశ్వరి, సీఐటీయూ నాయకులు గౌరినాయుడు, పి.శంకరరావు, లక్ష్మి, ఎ.జగన్మోహన్రావు, రామారావు, వెంకటేష్, వీఆర్ఏలు, ఏఎన్ఎంలు, మున్పిపల్ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు వేలాదిగా పాల్గొన్నారు. ఆందోళనలో స్పృహతప్పి పడిపోయిన మహిళా కార్మికురాలికి నీళ్లు తాగిస్తున్న దృశ్యం పోలీసుల నెట్టివేతతో కిందపడిపోయిన సీఐటీయూ నాయకుడు -
● నిరసన హోరు
డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ తలపెట్టారు. బలిజిపేట కూడలిలో దివంగత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు కూటమి ప్రభుత్వంలో లేదా అని సీఐలను మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చాలంటూ నినదించారు. మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాల నాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
●నెల్లిమర్లలో నోటీసులు, నిర్బంధాలు
డీఎస్సీ అక్రమాలకు నిరసనగా నెల్లిమర్లల్లో చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ముందుగానే నాయకులకు నోటీసులు ఇచ్చారు. కొందరిని గృహనిర్బంధం చేశారు. నెల్లిమర్ల పట్టణ పరిధిలోని జరజాపుపేట శ్రీరాజబంగారమ్మ గుడి ప్రాంగణంలో నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్బాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీకి సన్నాహాలు చేశారు. అక్కడకు పోలీసులు చేరుకుని ర్యాలీని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ శ్రేణులు నినదించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు నెక్కల నాయుడుబాబు, పార్టీ మండలాధ్యక్షులు గేదెల సన్యాసినాయుడు, పతివాడ అప్పలనాయుడు, తమ్మునాయుడు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు. -
‘చట్టం ఏమైనా మీ చుట్టమా?’
విజయనగరం: నిరంకుశ పాలన సాగిస్తున్న కూటమి సర్కారును మరోసారి ఉతికి ఆరేశారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు శాంతియుతంగా నిరసన చేపడితే అడ్డుకోవడమే కాకుండా లాఠీచార్జ్ చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. చట్టం ఏమైనా మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం నుంచి ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన.. ‘కొత్త జీవోలో డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చే వెసులబాటు ఉందా లేదా అని అడుగుతున్నాం.. ఆటలు రాక పోయినా సర్టిఫికెట్లు ఇచ్చారు. లీకేజీ అయింది. అందులో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది.శాంతియుతంగా నిరసన చేస్తుంటే వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిరసన చేసేందుకు వీలు లేదని పోలీసులు అడ్డుకోవడం ఏంటి?, కొన్ని ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చట్టం ఏమైనా మీ చుట్టమా?, ఇదేనా కూటమి పరిపాలన. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, ప్రజలకు వాస్తవాలను చెప్పాలి. ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారు. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు’ అని మండిపడ్డారు.డీఎస్సీ అక్రమాలపై గత 74 రోజులుగా తాము చేస్తున్న పోరాటాలతో పాటు ఈరోజు(సోమవారం, ఆగస్టు 10వ తేదీ) చేపట్టిన ఏపీ వ్యాప్త ర్యాలీలు విజయవంతమయ్యాయన్నారు డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాతో పాటు థర్డ్ పార్టీ విచారణ చేయమని డిమాండ్ చేస్తున్నామన్నారు బొత్స. -
ఏనుగుల సంచారంపై అప్రమత్తం
బొబ్బిలిరూరల్: మండలంలోని పక్కి,రాముడు వలస, శివడవలస పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖాధికారులు సూచిస్తున్నారు.రాత్రిపూట వాటి సంచారం ఎక్కువగా ఉంటుందని, ఎప్పుడు ఏ గ్రామంలోకి ప్రవేశిస్తాయో గమనించడం కష్టంగా మారిందిదని, రాత్రివేళ ఎవరూ బయట తిరగరాదని తెలియజేశారు. ఆదివారం ఆయా గ్రామాల్లోని చెరకు, మొక్కజొన్న పంటలను ఏనుగులు నాశనం చేసి రైతులకు తీరని నష్టం చేకూర్చాయి. కాగా ఏనుగుల గుంపును సీతానగరం మండలంలోని జోగింపేట ఎలిఫెంట్ జోన్కు తరలించేందుకు రెండు కుంకీ ఏనుగులైన జయంత్, అభిమన్యులను రంగంలోకి దించినా పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపువద్దకు అవి చేరే అవకాశం లేక ఆ చర్యలు ఫలించలేదు. కుంకీ ఏనుగులను ఏనుగుల గుంపు వద్దకు తరలించడంలో అధికారుల చర్యలు విఫలమయ్యాయి. ఎప్పటికప్పుడు అవి తమ గమ్యస్థానాన్ని మార్చుకోవడంతో వాటి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా ఉండడంతో ఫారెస్ట్ అధికారులు చేసేది లేక పక్కి గ్రామంలో కుంకీ ఏనుగులను ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఏనుగుల గుంపు రాముడువలస, ముత్తాయివలస మీదుగా తెర్లాం మండలం నందబలగ కొండపైకి చేరుకున్నాయని రేంజర్ రామనరేష్ తెలిపారు.ఏనుగుల కదలికలపై ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని,త్వరలో వాటిని ఎలిఫెంట్ జోన్కు తరలిస్తామని మన్యం జిల్లా అటవీశాఖాధికారి ప్రసన్న తెలిపారు.అంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కవ్వింపు చర్యలకు పాల్ప డవద్దని సూచించారు. అటవీ శాఖాధికారుల సూచన -
అడ్మిట్ అయితేనే.. ఎంఆర్ఐ స్కాన్!
● ఓపీ రోగులకు స్కాన్ లేదంట! ● సర్వజన ఆస్పత్రి వైద్యాధికారుల వింత తీరు ● అవస్థలు పడుతున్న రోగులుఅవును నిజమే... ఎంఆర్ఐ స్కాన్ దుర్వినియోగం అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అందువల్లే ఇన్పేషెంట్లకు తీయాలని నిబంధన పెట్టాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రివిజయనగరం ఫోర్ట్: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోగులకు కష్టాలు ఎక్కువయ్యాయి. థైరాయిడ్, షుగర్ వంటి వ్యాధుల నిర్ధారణకు చేసే హెచ్బీఏ1సీ పరీక్షలు సర్వజన ఆస్పత్రిలో అందుబాటులో లేవు. వీటికి తోడు ఎంఆర్ఐ స్కాన్కు కూడా కొత్త నిబంధనలు పెట్టడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇదేం చోద్యం అంటూ రోగులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందుతాయని వస్తే వైద్యాధికారుల పెట్టిన నిబంధనలు వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి... ఏదైనా వ్యాధి నిర్ధారణ ఎంఆర్ఐ స్కాన్లో కచ్చితంగా వస్తుంది. దీంతో వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ అవసరమైన వారికి ఆస్పత్రిలో ఉన్న గదికి వెళ్లి చేయించుకోవాలని చీటి రాసి ఇస్తారు. కొద్ది రోజుల క్రితం వరకు ఓపీ(ఔట్ పేషెంట్) రోగులకు కూడా ఎంఆర్ఐ స్కాన్ తీసేవారు. స్కాన్లో ఏదైనా సమస్య ఉన్నట్టయితే దానికి సంబంధించిన చికిత్స రోగులకు అందించేవారు. కానీ ఇటీవల ఆస్పత్రి అధికారులు ఔట్ పేషెంట్లకు ఎంఆర్ఐ స్కాన్ రాయొద్దని వైద్యులకు సూచించారు. ఇన్పేషెంట్లుగా ఆస్పత్రిలో చేరిన వారికి మాత్రమే ఎంఆర్ఐ స్కాన్ రాయాలని సూచించడంతో వైద్యులు కూడా ఆస్పత్రిలో చేరిన వారికి మాత్రమే ఎంఆర్ఐ స్కాన్ తీస్తున్నారు. భారం తగ్గించుకునేందుకే.. ఆస్పత్రిలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ నిర్వహణను ఎన్ఆర్ఐ సంస్థ నిర్వహిస్తుంది. రోగులకు తీసే ఎంఆర్ఐ స్కాన్కు రూ.1500 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఎక్కువ స్కాన్లు తీస్తే ఎక్కువ మొత్తం ఎన్ఆర్ఐ సంస్థకు చెల్లించాల్సి వస్తుందని భారం తగ్గించుకోవడం కోసం చంద్రబాబు ప్రభు త్వం ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఇన్పేషెంట్లు అయితే తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఓపీ అయితే ఎక్కువ మంది ఉంటారు. వీరికి స్కాన్ తీస్తే ఎక్కువ స్కాన్లు తీయాల్సి వస్తుంది. అందువల్లే ఇన్పేషెంట్లకు మాత్రమే స్కాన్ తీస్తామని నిబంధన తీసుకొ చ్చారని రోగులు గుసగుసలాడుకుంటున్నారు. గంట్యాడ మండలానికి చెందిన సూర్యనారాయణ హైబీపీతో పాటు, తల తిరుగుతూ కింద పడిపోతుండడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్ (ఇన్పేషేంట్) అయితేగాని ఎంఆర్ఐ స్కాన్ రాయనని చెప్పడంతో చేసేది లేక అడ్మిట్ అయ్యాడు. విజయనగరం పట్టణానికి చెందిన చైతన్య తీవ్రమైన నడుం నొప్పి రావడంతో సర్వజన ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు అతన్ని అడ్మిట్ చేసి ఎంఆర్ఐ స్కాన్ తీశారు. -
సంస్కృతభాష పరిరక్షణకు విద్యార్థులకు పోటీలు
విజయనగరం టౌన్: సంస్కృత భాషను భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైనా ఉందని వాగ్దేవి సమారాధనం స్వచ్ఛంద సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్ష్యురాలు, రాజాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక గురజాడ స్వగృహంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంస్కృత భాషా దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాగ్దేవి, తెలుగు భాషా పరిరక్షణ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించనున్న సంస్కృతభాషా దినోత్సవానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రాలు అందిస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా సంస్థ ప్రతినిధులందరికీ బాధ్యతలు అప్పగించామన్నారు. వ్యాసరచన, వక్తృత్వం, శ్రీరామాయణ పాత్రలు, సంస్కృతభాషా వైశిష్ట్యం, శ్రీమద్భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 7032494988 నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సముద్రాల గురుప్రసాద్, రాంభట్ల సన్యాసిరాజు, అల్లం సూర్యరాజేశ్వరశర్మ, భోగరాజు సూర్యలక్ష్మి, మానాప్రగడ సాహితి, దాసరి పద్మ, కర్రి సంతోషలక్ష్మి, కె.సావిత్రి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
● వరండా చదువులు..!
పాఠశాల వరండాలోనే విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయినిమెరకముడిదాం మండలం బుధరాయవలస జెడ్పీ పాఠశాల విద్యార్థులకు వరండాలే తరగతి గదులయ్యాయి. ఇక్కడ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 195 మంది విద్యార్థులున్నారు. వీరికి అవసరమైన మేరకు తరగతి గదుల్లేవు. దీంతో ఐదు తరగతులకు వరండాల్లోనూ, కళావేదికపైన బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు పునాదులు వేసినా వాటి నిర్మాణ పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. – మెరకముడిదాం -
తగ్గుతున్న పత్తి సాగు
తెల్ల బంగారంగా పేరొందిన పత్తి సాగు జిల్లాలో క్రమేణా తగ్గుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఓ వైపు ఇబ్బంది పెడుతుంటే.. దిగుబడి వచ్చాక తగిన గిట్టుబాటు ధర లభ్యం కాకపోవడం కూడా రైతులను సాగు నుంచి దృష్టి మళ్లించేలా చేస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా తగిన ప్రోత్సాహం కూడా లేకపోవడం మరింత ఇబ్బందులు పెడుతుంది. ఫలితంగా గడిచిన రెండేళ్లుగా పత్తి సాగు తగ్గుముఖం పడుతోంది.● గతేడాది కంటే తగ్గిన సాగు ● కిట్టని గిట్టుబాటు ధర ● దళారుల బారిన పడి ధర కుదేలురాజాం: పత్తి పంట సాగు తగ్గుతోంది. తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తికి గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో డిమాండ్ ఉంది. అక్కడ కాటన్ మిల్లులు అధికంగా ఉండడంతో పాటు సకాలంలో కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు నామమాత్రం కాగా, దళారీలు అధిక లాభాలు ఆశించి, సిండికేట్గా మారుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే పత్తి పంట దిగుబడి గత ఏడాది భారీగా పడిపోయింది. ఎకరాకు 8 నుంచి 9 క్వింటాళ్లు రావల్సి ఉండగా, కేవలం 3 నుంచి 4 క్వింటాళ్లు మధ్య మాత్రమే వచ్చింది. క్వింటా పత్తి ధర రూ.8110లుగా ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత పేరుతో రైతులను ముప్పతిప్పలు పెట్టారు. జిల్లాలో 50 క్వింటాళ్లు మేర పత్తిని కొనుగోలు చేయాల్సి ఉండగా, కొనుగోలు కేంద్రాల వద్ద 25 వేల క్వింటాళ్లు కొనుగోలు మాత్రమే నమోదైంది. ఈ ఏడాది ఆ ప్రభావం సాగుపై పడింది. గతంలో కంటే సాగు తగ్గుముఖం పట్టింది.ఇబ్బందులు ఉన్నాయి.. గతంలో మా పొలాల్లో పత్తి పంట వేసేవాళ్లం. మంచి ఆదాయం ఉండేది. ఇప్పుడు తగ్గించేశాం. పత్తిని సకాలంలో కొనుగోలు చేయడం లేదు. రాజాం మార్కెట్ యార్డుకు తరలిస్తే అక్కడి నుంచి రామభద్రపురం వెళ్లమంటున్నారు. అక్కడ ఏవేవో సాకులు చెప్పి దళారీలను బెత్తాయిస్తున్నారు. ఈ ఏడాది పత్తిపంట సాగును తగ్గించడమే కాకుండా, మిగిలిన భూమిని ఖాళీగా ఉంచేశాం. – ఎస్.వెంకటనాయుడు, రైతు, పొనుగుటివలస, రాజాం మండలం -
విజయనగరం
సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు తప్ప డం లేదు. నెలవారీ జీతాలు అందక పోవడంతో వారి జీవనం కష్టంగా మారింది.ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసే కేంద్రంనోటీసులు జారీ చేశాం.. ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం ఏటీఎస్ అనే సంస్థకు అప్పగించింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ అంతా అక్కడే జరుగుతుంది. స్కూల్ బస్సుల తనిఖీలో 90 వరకు బస్సుల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించాం. వారికి నోటీసులు కూడా జారీ చేశాం. వారు కూడా లోపాలను సరిదిద్దుకున్నట్టు తెలియజేశారు. – మణికుమార్, డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ వాహనాలు అధ్వానంగా ఉన్నా.. ఎఫ్సీలు ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో 580 స్కూలు బస్సులు 90 బస్సుల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించిన రవాణ శాఖ అధికారులు -
దారి దోపిడీ..
పాచిపెంట: ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారుల కళ్ల ముందే ప్రభుత్వ రహదారి ఆక్రమణకు గురైంది. పాచిపెంట మండలంలోని పోతులగెడ్డ సమీపంలో పిండ్రంగివలసకు వెళ్లే పీఆర్ (పీఐయూ) శాఖకు చెందిన బీటీ రహదారిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన లేఅవుట్లో కలిపేశాడు. దీంతో ఏళ్లుగా ప్రజలు వినియోగిస్తున్న పాత రహదారి ఆనవాళ్లు లేకుండా పోయింది. దానికి బదులుగా ప్రభుత్వ భూమిలో కొత్త రహదారిని ఏర్పాటు చేశారు. సుమారు పది ఎకరాల వ్యవసాయ భూమిలో లేఅవుట్ అభివృద్ధి చేసే క్రమంలోనే ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రహదారిని లేఅవుట్లో కలిపేయడంతోపాటు, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిలో రహదారి ఏర్పాటు చేయడంతో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. గతంలోనూ ఈ విషయంపై వార్తలు వచ్చినా సంబంధిత రెవెన్యూ, పీఆర్(పీఐయూ) అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రహదారిని లేఅవుట్లో కలిపేసిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు.. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన కొత్త రహదారికి అనుమతులు ఉన్నాయా? అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ రోడ్డునే మింగేసిన రియల్ ఎస్టేట్ నిర్వాహకుడు లేఅవుట్లో కలిపేసిన పీఆర్(పీఐయూ) శాఖ బీటీ రోడ్డు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూమిలో కొత్తదారి అధికారుల మౌనంపై విమర్శలు -
కోటదుర్గమ్మకు సంబరాలు
పాలకొండ రూరల్: ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆషాడమాస పూజల్లో భాగాంగా ఆదివారం ప్రత్యేక సంబరాలు చేపట్టారు. ముర్రాటలు, ఘటాలతో దేవస్థానానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. ఈ క్రమంలో స్థానిక గురువు గారి వీది, రజకవీధికి చెందిన మహిళలు సామూహికంగా అమ్మవారికి సారె సమర్పించారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మి ప్రసాదశర్మ నేతృత్వంలో భక్తులు సమర్పించిన సారె అమ్మవారికి నివేదన చేసి, ప్రత్యేక పూజలు చేపట్టారు. పట్టణంతోపాటు మండల పరిధి భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. -
చోరీ కేసు ఛేదించిన పోలీసులు
● ముగ్గురు నిందితుల అరెస్ట్ ● బంగారం, నగదు, వాహనాలు స్వాధీనంపాచిపెంట: సాలూరు పట్టణంలోని గుమడాంలో ఏప్రిల్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3 తులాల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లు, రూ.19 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు సాలూరు టౌనన్ సీఐ అప్పలనాయుడు తెలిపారు. -
హాస్టళ్లలో విద్యార్థి సంఘాలపై నిషేధం ఎత్తివేయాలి
విజయనగరం గంటస్తంభం: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థి సంఘాలను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.రాము డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం విజయనగరం కాంప్లెక్స్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యార్థులను కలవకుండా వారి సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు పెంచాలని కోరారు. సర్క్యులర్ను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఐదు బ్యాటరీలు రికవరీవేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీకి గురైన ఘటనలో నిందితులను పట్టుకుని ఐదు బ్యాటరీలను రికవరీ చేసినట్లు ఎస్సై సుదర్శన్ ఆదివారం తెలిపారు. బొద్దాం, పాటూరు, జాకేరు గ్రామాల్లో ఐదు ట్రాక్టర్లకు సంబంధించిన బ్యాటరీ లు చోరీకి గురైనట్లు గురువారం పాటూరుకు చెందిన పి.వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై చెప్పారు. ఆదివారం పాటూరు జంక్షన్ వద్ద బొద్దాం గ్రామానికి చెందిన సయ్యద్ అబ్దుల్లా, గుడిసె తిరుపతిరావు జనపరెడ్డి మోహన్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఐదు ట్రాక్టర్ బ్యాటరీలను రికవరీ చేసి తదుపరిచర్యలు తీసుకున్నట్లు ఎస్సై సుదర్శన్ చెప్పారు. 42 కేజీల గంజాయి స్వాధీనంపాచిపెంట: మండలంలోని కుడుమూరు సమీపంలో పెద్దగెడ్డ జలాశయం బట్టి కుడికాలువ వద్ద తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్న కారులో తరలిస్తున్న 42 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పాచిపెంట ఎస్సై ఎల్.అర్జున్ ఆదివారం వివరాలు వెల్లడించారు. పెద్దగెడ్డ జలాశయం బట్టి కుడికాలువ వద్ద అనుమానాస్పదంగా నిలిపి ఉన్న కారును సమాచారం మేరకు తనిఖీ చేసి కారులో 22 ప్యాకెట్లలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకునామని ఎస్సై పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదు చేసి సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే గుర్తించి అదుపులోకి తీసుకుంటామని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్స్టేషనన్కు తెలియజేయాలని కోరారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంగంట్యాడ: మండలంలోని కొర్లాం గ్రామంలో ఆదివారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చెరుకు కాటా నుంచి గింజేరు వెళ్లే ప్రధాన రహదారి పక్కన మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతుడు పసుపు రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహం నుంచి కుళ్లిన వాసన వస్తుండడంతో రెండు, మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. -
భీమసింగి పరిశ్రమను కాపాడాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వ విధానాల కారణంగానే భీమసింగి చక్కెర పరిశ్రమ మూతపడే పరిస్థితి ఏర్పడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. పరిశ్రమను ఏపీఐఐసీకి అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎల్బీజీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1960లో ప్రారంభమైన ఈ పరిశ్రమ ఆరు దశాబ్దాలుగా వేలాది మంది రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించిందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి చక్కెర దిగుమతులు వంటి విధానాల వల్లే పరిశ్రమ నష్టాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. చెరకు కొరత వల్లే పరిశ్రమ మూతపడిందన్న వాదన సరికాదన్నారు. పరిశ్రమకు చెందిన విలువైన భూములు, ఆస్తులను విక్రయించే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. పరిశ్రమను పునరుద్ధరించి రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులు, ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
‘మీ పోలీస్–మీకు తెలుసా’ పరీక్షకు విశేష స్పందన
పార్వతీపురం రూరల్: చట్టాలపై అవగాహన పెంచుకుందాం.. బాధ్యతగల పౌరులుగా మెలుగుదాం అనే నినాదంతో మన్యం జిల్లా పోలీసులు చేపట్టిన ‘మీ పోలీస్–మీకు తెలుసా’ కార్యక్రమం విజయవంతమైంది. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి ఆదేశాలతో పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన అవగాహన పరీక్షకు విశేష స్పందన లభించింది. అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షలో 21 ఏళ్లలోపు వయసున్న సుమారు 800 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.సైబర్ నేరాల ఉచ్చు..గంజాయి, మాదకద్రవ్యాల మత్తు..ట్రాఫిక్ నిబంధనలు తదితర సమకాలీన అంశాలతో పాటు మహిళలపై నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా నిరోధం వంటి కీలక చట్టాలపై 30 బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్) ప్రశ్నలతో ఈ పరీక్షను రూపొందించారు. విద్యార్థులు ఆసక్తిగా సమాధానాలు గుర్తించి డ్రాప్ బాక్స్లో వేశారు. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు స్థానాల విజేతలకు ఎస్పీ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆనన్లైన్ సర్టిఫికెట్లు అందజేశారు. పట్టణ సీఐ బి.వెంకట్రావు, ఎస్సై గోవింద్, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. పాల్గొన్న 800 మంది విద్యార్థులు -
పిల్లలందరికీ దేశ నాయకుల పేర్లు
● కమ్యూనిస్టు వాది చింతల తిరుపతి రావు అభిమానం ● పెద్దకుమారుడు హోచ్మన్ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటురామభద్రపురం: మండలకేంద్రానికి చెందిన కమ్యూనిస్టు వాది చింతల తిరుపతిరావు తన పిల్ల లందరికీ వివిధ దేశాల నాయకుల పేర్లు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆయనకు ఐదుగురు పిల్లలు కాగా వారిలో ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమారుడికి హోచ్మన్, రెండవ కుమారుడికి లెనిన్, మూడవ కుమారుడికి భగత్ సింగ్, మొదటి కుమార్తెకు ఇందిరాగాంధీ, రెండవ కుమార్తెకు ఝాన్సీలక్ష్మి అని పెర్లు పెట్టారు. దేశ నాయకుల పేర్లు ఎందుకు పెట్టారో ఆయన మాటల్లో.. హోచ్మన్: దండయాత్ర చేసి దోచుకుందాం అన్న దురుద్దేశంతో అమెరికా దాడి చేసి వియత్నం దేశాన్ని రెండుముక్కలుగా ఉత్తరవియత్నం, దక్షిణ వియత్నంగా విడగొట్టింది. దక్షిణ వియత్నాం ఆ యుద్ధంలో అమెరికాకు మద్దతు పలికింది. ఉత్తర వియత్నాం నాయకుడు హోచ్మన్ అగ్ర రాజ్యమైన అమెరికాపై తిరుగుబాటు చేసి స్వాతంత్య్రాన్ని సంపాదించి కమ్యూనిస్టు రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ప్రజాస్వామ్య యుతంగా ఉన్న భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుని అమెరికా నుంచి రాజ్యాన్ని సంపాందించి మంచి పేరు తెచ్చుకోవడంతో పెద్దకుమారుడికి పేరు హోచ్మన్ అని పెట్టాను. లెనిన్: రష్యాదేశంలో నిరంకుశంగా పరిపాలన చేస్తున్న ఆ దేశ రాజులపై లెనిన్ ప్రజా తిరుగుబాటు చేసి కమ్యూనిస్టు ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి మంచి పేరుతెచ్చుకోవడంతో రెండవ కుమారుడికి లెనిన్ అని పేరు పెట్టాను. భగత్సింగ్: బ్రిటిష్ వారికి తలొగ్గకుండా భారత స్వాతంత్య్రం కోసం తృణప్రాయంగా తన ప్రాణాలొడ్డిన వ్యక్తి భగత్ సింగ్. భారతదేశ విముక్తి కోసమే తన ప్రాణాలను అర్పించాడు కాబట్టి మూడవ కుమారుడికి భగత్సింగ్ అని నామకరణం చేశాను. ఇందిరాగాంధీ: అలీన దేశాధ్యక్షురాలిగా,దేశ ప్రధాన మంత్రిగా ఉండి మంచి పరిపాలన అందించి ప్రపంచస్థాయిలో మంచి పేరు సంపాదించినందుకు గాను మొదటి కుమార్తెకు ఇందిరాగాంధీ అనిపేరు పెట్టాం. ఝాన్సీలక్ష్మి: సామ్రాజ్య వాదులైన బ్రిటిష్ వారితో పోరాడి వీరవనితగా ప్రాణాలు వదిలింది కాబట్టి రెండవ కుమార్తెకు ఝాన్సీలక్ష్మి అని పేరు పెట్టాం. గాంధీ విగ్రహం ఏర్పాటు.. పెద్దకుమారుడు హోచ్మన్ తన తండ్రికి ఉండే ఆదర్శభావాలను నిరూపించుకుంటూ మండలకేంద్రంలోని బైపాస్రోడ్డు కూడలిలో తన సొంత నిధులతో 1999లో గాంధీ విగ్రహం స్థాపించారు. ఈ ప్రాంతంలో ఇదే మొదటి విగ్రహం కావడం విశేషం. -
‘సమగ్ర శిక్ష’లో.. జీతాలకు జాగారం..!
● రెండు నెలలుగా నిలిచిన వేతనాలు ● జిల్లాలో 800 మంది ఉద్యోగులు ● కుటుంబ పోషణకు ఆర్థిక కష్టాలు సీతంపేట: సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు తప్ప డం లేదు. నెలవారీ జీతాలు అందక పోవడంతో వారి జీవనం కష్టతాయకంగా మారింది. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కు సతమతం అవుతున్నారు. పార్వతీపురం జిల్లా లో సుమారు 800 మంది ఉద్యోగులకు వేతనాలు నిలిచిపోయాయి. దీంతో ఇంటి అద్దె నుంచి పిల్లల చదువులు, నిత్యావసరాల నుంచి వైద్య ఖర్చులు భారంగా మారాయి. మరోవైపు చాలీచాలని జీతాల తో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 800 కుటుంబాలు సతమతం.. జిల్లాలో ఎల్ఈఆర్పీలు 29, ఎంఐఎస్ కోఆర్డినేట ర్లు 15, సీఆర్ఎం టీచర్లు 108, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 15, 14 కేజీబీవీల్లో టీచింగ్ అండ్ నాన్టీచింగ్ సిబ్బంది 345.. మొత్తం 512 మంది పని చేస్తున్నా రు. మెసేంజర్లు, అక్కౌంట్ సిబ్బంది, ఫిజియోథెర ఫిస్టులు, పార్ట్టైం ఇన్స్ట్రక్లర్లు మరో 300 మంది వరకు పని చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వీరందరికీ జీతాలు పెరిగాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క రూపాయి అధికం కాకపోగా.. నెలనెలా జీతాలు ఇవ్వడం లదేని సిబ్బంది నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. హామీ అమలు ఎక్కడ?.. ఎన్నికల ప్రచార సమయంలో రెగ్యులర్ ఉద్యోగుల తో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యో గులందరికీ ప్రతి నెల ఒకటో తేదీన తప్పనిసరిగా జీతాలు జమ అయ్యేలా తాము బాధ్యత తీసుకుంటామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ హామీ అమలులో కనిపించడం లేదని మండి పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాకార్యక్రమాల అమలు, కేజీబీవీల నిర్వహణ, పిల్లలకు సేవ లు, విద్యాసర్వేలు, డేటా నిర్వహణ, శిక్షణా కార్యక్రమాల అమలు వంటి కీలక విధులు నిర్వర్తిస్తున్నా రు. వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ విధులకు హాజరై తమ బాధ్యత లు నిర్వర్తిస్తున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని పలుమా ర్లు సంబంధిత అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నా.. శాశ్వత పరిష్కారం లేదని సంబంధిత సంఘాల నాయకులు చెబుతున్నారు. ఓఎస్పీ సర్వేలతో తిప్పలు... సీఆర్ఎం టీచర్లను తమ విధులతో పాటు అదనంగా ఓఎస్పీ(అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్) సర్వేలు చేపట్టాలని, ప్రతి గ్రామాన్ని సందర్శించి ఓఎస్సీ సర్వే చేసి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలనే పని అప్పగించారు. అంతేకాకుండా ప్రతి పాఠశాలకు వెళ్లి సర్వేపల్లి రాథాకృష్ణన్ కిట్లు 100 శాతం అందజే సే విధంగా పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నా యి. వీటికి ప్రత్యేక అలవెన్సులు వంటివి లేకపోవడం, వాహన సదుపాయాలు వారే సమకూర్చుకుని వెళ్లాలంటే పెట్రోల్ తదిర ఖర్చులు కూడా వీరే భరించుకోవాలి. ఈ క్రమంలో జీతాలు లేకుండా పనిచేస్తున్న తమకు అదనపు భారం పరిణమించిందని వారు వాపోతున్నారు. ఈ విషయమై సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డి నేటర్(ఏపీసీ) రాజ్కుమార్ వద్ద సాక్షి ప్రస్తావించగా.. త్వరలోనే జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త బడ్జెట్ రావడం ఆలస్యం అవడంతో ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు. -
జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలివ్వాలి
● ఐయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అప్పలనాయుడుబొబ్బిలి: వర్కింగ్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు జి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. యూనియన్ శాఖ నిర్మాణం కోసం ఆదివారం బొబ్బిలి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు వేరే ఉపాధి పొందలేక, స్థిరమైన ఆదాయం లేక అవస్థలు పడుతున్నారన్నారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులున్న అందరికీ అక్రిడిటేషన్లను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా బొబ్బిలి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సోరు సాంబయ్యను ఎంపిక చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని సాంబయ్య అన్నారు. కార్యక్రమంలో నాయకుడు పి.యోగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలకు వేగవంతమైన, పారదర్శక పరిష్కారం అందించేందుకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. అర్జీదారులు తమ పేరు, చిరునామా, మొబైల్ నంబర్తో పాటు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధార పత్రాలను జత చేయాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత అర్జీ రశీదును వెంట తీసుకురావాలన్నారు. ఫిర్యాదుల స్థితిగతులను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని, సమస్య పరిష్కారమైన అనంతరం సంబంఽధిత ఉత్తర్వులు, ఎండార్స్మెంట్లను వాట్సాప్, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపిస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నామని, ఇందులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. భూ వివాదాలు, మ్యుటేషన్లు, సర్వేలు, ఇతర రెవెన్యూ సమస్యలపై రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్కు హాజరు కాలేని వారు 1100 టోల్ఫ్రీ నంబర్ ద్వారా లేదా మీకోసం వెబ్సైట్లో ఆన్లైన్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, మండల, మున్సిపల్ కార్యాలయాల్లోనూ అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. -
ఆదివాసీలకు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు
సీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని గిరిజన సోదర, సోదరీమణులకు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, జీవన విధానం దేశ సాంస్కృతిక వైవిద్యానికి ప్రతీకలన్నారు. గిరిజనుల అభ్యున్నతికి విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, ఉపాది వంటి మౌలిక సదుపాయాలు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు పాలకులు దృష్టి సారించాలని కోరారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
ప్రారంభోత్సవం పేరిట ప్రజాధనం లూటీ!
పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం జీవీఎంసీ, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, రాజాం, పార్వతీపురం పట్టణాల నుంచి దాదాపు 1,130 మంది కార్మికులను రప్పించి రాత్రింబవళ్లు పనిచేయించుకున్నారు. వీరికి భోజనాల ఏర్పాట్లు ప్రజారోగ్య విభాగం అధికారి పర్యవేక్షణలో జరిగింది. అయితే, భోజనం అత్యంత నాసిరకంగా తినడానికి వీలులేని విధంగా ఉందనే విమర్శలు కార్మికుల నుంచి వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందికి ‘తాత్కాలిక ఖర్చులు’ పేరుతో రూ.10 లక్షల రొక్కం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సోమ్ములు ఏ లెక్కన ఖర్చుచేశారో, ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తెలియాల్సి ఉంది. విజయనగరం అర్బన్: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుక... కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్ల సిండికేట్కు ‘కమీషన్ల పండుగ’గా మారింది. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, కనీస సౌకర్యాల కల్పన పేరిట పిలిచిన టెండర్లలో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లు స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో సేవలు అరకొరగా అందించడమే కాకుండా, నిబంధనలను తుంగలోతొక్కి ముందస్తు ప్రణాళికతో ప్రజాధనాన్ని లూటీచేసేలా స్కెచ్ వేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాగితాలపై అంకెల గారడీ చూపి, రూ.కోట్లలో బిల్లులు మంజూరు చేసుకునేందుకు సర్వం సిద్ధంచేశారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అంచనా పెంపు... టెండర్లలో గారడీ! సాధారణంగా ప్రభుత్వ నిర్వహణ పనుల్లో పోటీతత్వం పెంచి, ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు బహిరంగ టెండర్లు నిర్వహిస్తుంటారు. కానీ, విమానాశ్రయం ప్రారంభోత్సవ వ్యవహారంలో విజయనగరం నగరపాలక సంస్థకు చెందిన ఒక కీలక అధికారి నేతృత్వంలో వింత ధోరణి నడిచిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఇవే తరహా మొబైల్ టాయిలెట్లు, నీటి సరఫరా పనులకు కాంట్రాక్టర్లు 20 నుంచి 25 శాతం తక్కువ ధరకే పోటీపడి టెండర్లు దాఖలు చేసేవారు. అయితే, ఈ సారి ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం కేవలం 2 శాతం తగ్గింపునకే టెండర్లను ఖరారు చేయడం వెనుక ఉన్న అంతరార్ధం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారికంగా టెండర్లు పిలిచినప్పటికీ, లోపాయికారీ ఒప్పందాలతో తమకు కావాల్సిన కాంట్రాక్టులకే పనులు దక్కేలా షార్ట్ టెండర్ల ప్రక్రియను వినియోగించుకున్నారని తెలుస్తోంది. జిల్లా అధికారుల పరిధి నుంచి దాదాపు రూ.కోటి నిధులను ముందస్తుగా తెప్పించి కాంట్రాక్టర్లకు అందించడం వెనుక ఉన్న వేగం క్షేత్రస్థాయి పనుల్లో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. దర్యాప్తునకు పెరుగుతున్న డిమాండ్ ప్రజాధనం నీళ్లలా ఖర్చయిపోతున్నా, క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో దారుణంగా విఫలమయ్యారనడానికి ఇక్కడి పరిస్థితులే నిదర్శనం. పనులు సరిగ్గా జరగకపోయినా, అధికార బలాన్ని ఉపయోగించి 100 శాతం బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరు చెప్పి నిర్వహించిన వేడుకల్లో, సేవలు అందించకుండా బిల్లు బొక్కేసేందుకు ప్రయత్నిస్తున్న అధికారుల, కాంట్రాక్టర్ల సిండికేట్పై సమగ్ర విచారణ జరిపించాలని, దుర్వినియోగమైన ప్రజాధనాన్ని రికవరీ చేయాలని స్థానిక ప్రజలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిధుల కేటాయింపు ఇలా.. పారిశుద్ధ్య విభాగం లెక్కల ప్రకారం ఏకంగా రూ.3 కోట్లు నిధులు వ్యయమైనట్లు చూపుతున్నారు. అందులో రూ.1.74 కోట్లు కేవలం మరుగుదొడ్లు, నీటి డ్రమ్ములు, ట్యాంకర్ల సరఫరాకే కేటాయించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం పేరిట నిధుల దుర్వినియోగం పారిశుద్ధ్య విభాగానికి కేటాయించిన రూ.3 కోట్లలో మరుగుదొడ్లు, నీటి సరఫరాకే రూ.1.74 కోట్లు అంచనా పెంపు... టెండర్లలో గారడీ! దర్యాప్తు చేయాలని జనం డిమాండ్ -
ఒడిశా టు నెల్లూరు
● పశువుల అక్రమ రవాణాబొబ్బిలి: పశువుల రవాణా గుట్టు చప్పుడు కాకుండా కాదు.. బహిరంగంగా తరలిస్తున్నారు. ఒడిశా నుంచి పార్వతీపురం అక్కడి నుంచి పట్టణం గుండా పశువులను వధ శాలకు జోరుగా తరలిస్తున్నారు. వీటిని నెల్లూరు తరలిస్తున్నట్టు చెబుతున్నా ఎక్స్పోర్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్వతీపురం, ఒడిశా నుంచి పశువులను చిన్న వాహనాల్లో తరలించడంతో అవి ఆకలి, దాహానికి అలమటించడం బయటకు కూడా కనిపిస్తోంది. చిన్న వాహనంలో ఐదారు పశువులను తరలిస్తున్నా అటు పోలీసులు కానీ, ఇటు ఇతర శాఖల అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. బొబ్బిలి సంత ఉండేటప్పుడు అక్కడి నుంచి తరలించేవారు. ఇప్పుడు పట్టణ శివారు గుండా తరలిస్తూ అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. చిన్న వాహనాల నుంచి పెద్ద వాహనాల్లోకి వీటిని మార్చేందుకు రామభద్రపురం, బొబ్బిలిలోని రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఓ వైపు ఎస్పీ అన్ని దారులూ మూసేశామని చెబుతున్నా అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి సెలవు దినాల్లోనూ, పండగ రోజులు, ప్రముఖుల పర్యటనల సమయాలను ఎంచుకుని మరీ రవాణా జరుపుతున్నారు. అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
మెప్పు కోసమే పాశవిక దాడులు
రామభద్రపురం: వెన్నుపోటు పార్టీ నాయకత్వం మెప్పు కోసమే వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతియుత నిరసన దీక్షలపై విజయవాడలో టీడీపీ శ్రేణులు పాశవిక దాడులకు పాల్పడ్డాయని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మండిపడ్డారు. పార్టీ మండల కార్యాలయంలో విలేకరులతో శనివారం వారు మాట్లాడారు. ఇటీవల కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన బొండా ఉమను వెన్నుపోటు పార్టీ అధినాయకత్వం ప్రశ్నించడంతో అధిష్టానం వద్ద మార్కులు కొట్టేందుకు ఇటువంటి నీచమైన సంస్కృతికి తెరతీశారని ధ్వజమెత్తారు. పోలీసుల సమక్షంలోనే దీక్షా శిబిరాలపై కోడి గుడ్లు, టమాటాలు, నీళ్ల బాటిళ్లు విసిరి బీభత్సం సృష్టించడం హేయమైన చర్యని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, నిరుద్యోగులకు భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేతృత్వంలో శాంతియుత దీక్షలు కొనసాగుతుంటే ప్రజాదరణను చూసి ఓర్వలేక దీక్షా శిబిరాలపై పచ్చమూకలు దాడులకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దిశ చట్టాన్ని తీసుకువస్తే వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. మంత్రి వర్గ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వెంట ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, జెడ్పీటీసీ అప్పికొండ సరస్వతి, మండల జేసీఎస్ కన్వీనర్ చింతల సింహాచలంనాయుడు, తెర్లాం మండల పార్టీ అధ్యక్షుడు తెంటు సత్యంనాయుడు తదితరులు ఉన్నారు. దిశ చట్టాన్ని ఉపసంహరించు కోవడం హేయమైన చర్య మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శంబంగి -
రోడ్డు ప్రమాదంలో పీఏసీఎస్ డైరెక్టర్ దుర్మరణం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన తుమ్మలపేట పీఏసీఎస్ డైరెక్టర్ పతివాడ గోవింద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం సారిపల్లి జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పల్సర్ బైక్ వాహనం బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి, అనంతరం విజయనగరంలో మరో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోవింద్ మృతితో స్వగ్రామమైన కొండగుంపాంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎమ్మెల్యే నాగమాధవి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మార్కెఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగార్రాజు, తదితరులు గోవింద్ పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పక్కిలో ఏనుగుల గుంపు బొబ్బిలి రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చిన ఎనిమిది ఏనుగుల గుంపు బొబ్బిలి, తెర్లాం, మెరకముడిదాం మండలాల్లోని పంట చేలు, మొక్కజొన్న, చెరుకు పంటలను నాశనం చేస్తున్నాయి. శనివారం పక్కి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నాయి. అక్కడే ఉన్న ఓ మామిడి తోటలో తిష్టవేశాయి. గత రెండు రోజులుగా మండలంలోని రాముడువలస, శివడవలస, పక్కి పరిసర ప్రాంతాల్లోని వరినారు, మొక్కజొన్న పంటలను నాశనం చేశాయి. ఏనుగుల గుంపును ఇక్కడి నుంచి సీతానగరం మండలం జోగింపేట ఎలిఫెంట్ జోన్కు తరలించేందుకు కుంకీ ఏనుగును శనివారం పక్కి గ్రామానికి తీసుకువచ్చారు. ఆ కుంకీ ఏనుగు ద్వారా ఏనుగుల గుంపును తరలించేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు.విద్యుత్ షాక్కు గురై ఆవు మృతి మెరకముడుదాం: మండలంలోని చిన బంటుపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ షాక్కు గురై పాడి ఆవు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పల్లి లక్ష్మీనారాయణ ఆవులు మేస్తుండగా గ్రామానికి తాగునీటి సరఫరా చేస్తున్న బోరుబావి ప్యానెల్ బోర్డు విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు ఆవుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో లక్ష్మీనారాయణ తనకు జీవనాధారమైన రూ.50 వేల విలువ చేసే ఆవు మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయానని బోరున విలపిస్తున్నాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. -
భీమసింగి ఫ్యాక్టరీని ఏపీఐఐసీకి అప్పగిస్తే ఉద్యమిస్తాం
రాజాం: జిల్లాలో భీమసింగి సహకార చక్కెర ఫ్యాక్టరీని మూసేసి, ఆ భూములను ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్ట్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్)కు ప్రభుత్వం కట్టబెడితే ఊరుకునేది లేదని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజాంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భీమసింగిలో ఉన్నది కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ అని, విజయరామగజపతి కోపరేటివ్ సుగర్స్ లిమిటెడ్ కింద 1969లో రైతుల అంతా సొసైటీగా ఏర్పడి ఏర్పాటుచేశారన్నారు. 1977లో పరిశ్రమలో చక్కెర తయారీ ప్రారంభమైందన్నారు. ఇది రైతుల భాగస్వామ్యంతో సాధ్యమైందని గుర్తుచేశారు. ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని 18 మండలాల్లోని 16 వేల మంది రైతులు ఇందులో సభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారన్నారు. 1999లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని పట్టించుకోకపోవడంతో 2002లో మూతపడిందని వెల్లడించారు. 2004లో వైఎస్సార్ పాదయాత్ర సమయంలో ఫ్యాక్టరీ పరిస్థితిని రైతులు వివరించారని, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీ తెరిపించారన్నారు. మళ్లీ ఫ్యాక్టరినీ వినియోగంలోకి తేవాలని వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోపరేటివ్తో కమిటీని ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన చంద్రబాబు ఏపీఐఐసీకి ఆ భూములు బదిలీచేసేందుకు తీర్మానాలు చేయడం రైతులను మోసగించడమేనని దుయ్యబట్టారు. ప్రైవేటీకరణ చేయడం, భూములు అమ్మడం చంద్రబాబు సర్కారుకు నిరంతర ప్రక్రియగా మారిపోయిందన్నారు. 65 ఎకరాల పరిధి ఉన్న ఖరీదైన భీమసింగి ఫ్యాక్టరీ భూమిని అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ఫ్యాక్టరీకి 2 కిలోమీటర్ల దూరంలో హైవే గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఉందని, పది కిలోమీటర్లు దూరంలో విజయనగరం ఉందని, 40 కిలోమీటర్లు దూరంలో పోర్టు ఉందని, పక్కనే రైల్వే లైన్ ఉందని గుర్తుచేశారు. ఇన్ని పారిశ్రామిక సౌకర్యాలు ఉన్న ఫ్యాక్టరినీ పునఃఉత్పాదనకు సిద్ధం చేయకుండా ఇలా భూములు అమ్మేస్తామని సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలో భాగస్వామ్యమైన రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా, పబ్లిక్ హియరింగ్ పెట్టకుండా మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం సబబుకాదని హితవుపలికారు. ఈ విషయాన్ని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పోరాడుతామని స్పష్టంచేశారు. ఫ్యాక్టరీ పూర్తిగా సహకార సంఘంతో ఉందని, ఆరోజు ప్రతి రైతు రూ.111లు చెల్లించి 16వేల మంది సభ్యులుగా ఉన్నారని, ఇప్పుడు ఇది రూ.40 కోట్లు షేర్ కేపిటల్గా ఉందని, రూ.32 కోట్ల వరకు ప్రభుత్వ ఈక్విటీ, మిగిలినది రైతుల ఈక్విటీగా ఉందని వివరించారు. అప్పట్లో ఇక్కడ రైతులే భూ సేకరణ చేశారన్నారు. విజయనగరం జిల్లాలోని 15 మండలాలతో పాటు భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభపురం, ఆనందపురం, భీమిలి మండలాల రైతులకు ఈ ఫ్యాక్టరే ఆధారమని వివరించారు. ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు రైతులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సంకిలి ఫ్యాక్టరీ మూసేస్తే ఒప్పుకోం.. సంకిలిలోని ప్రైవేట్ సుగర్ ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఫ్యాక్టరీ పరిస్థితిని ఇప్పటికే ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, పాలవలస విక్రాంత్లు మండలి సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీని యాజమాన్యం ఆకస్మికంగా నిలుపుదలచేస్తే పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఆ రోజు సంకిలి సుగర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి బొత్స సత్యనారాయణ, పాలవలస రాజశేఖరం, సాంభశివరాజు తదితరులు ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్, జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, నియోజకవర్గ పరిశీలకులు కె.వి.సూర్యనారాయణరాజు, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరినీ తెరవాల్సిందే స్థానిక మంత్రి, ముఖ్యమంత్రులదే ఆ బాధ్యత మీడియా సమావేశంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
చెరకు రైతుకు చేదువార్త..!
వాస్తవం: రెండేళ్లలో జిల్లాకు ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. తేలేదు. ఇప్పుడు భీమసింగి చక్కెర కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ‘విజయనగరం జిల్లా జామి మండలంలోని భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాం. చెరకు సాగును ప్రోత్సహిస్తాం. రైతులకు పూర్వ వైభవం తీసుకొస్తాం. 2024 సార్వత్రిక ఎన్నికల సభల్లో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు, ఎంఎస్ఎం, సెర్ప్, ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన హామీ. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ విజయనగరం ఫోర్ట్: చెరకు రైతులకు చేదువార్త ఇది. 1961 ఫిబ్రవరి 9న విజయనగరం జిల్లా జామి మండలంలోని భీమసింగి గ్రామంలో స్థాపించిన చక్కెర కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. వేలాదిమంది చెరకు రైతులకు అండగా, వందలాది మందికి ఉపాధి కల్పించిన కర్మాగారాన్ని కాలగర్భంలో కలిపేసేందుకు పూనుకుంది. ఇది ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులను, కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల సమయంలో భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ హామీ ఇచ్చిన టీడీపీ నేతలు... ఇప్పుడు అదే ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసేందుకు ఉత్తర్వులు జారీచేయడంపై రైతాంగం భగ్గుమంటోంది. ఓ వైపు తెల్ల అన్నంను ఎవరూ తినడంలేదని, వరి పంటను సాగుచేయొద్దని, ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ప్రకటనలు చేస్తున్న వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు... వరికి ప్రత్యామ్నాయంగా చెరకు సాగును ప్రోత్సహించాల్సిన సమయంలో సుగర్ ఫ్యాక్టరీ మూసివేతకు చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూతపడిన సుగర్ ఫ్యాక్టరీని తెరిపించి రైతులను ఆదుకోవాల్సిన సర్కారు శాశ్వతంగా ఫ్యాక్టరీని లేకుండా చేసేందుకు పూనుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ చర్యలతో చెరకు పంట పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● షేర్ హోల్డర్స్గా రైతులు భీమసింగి సుగర్ ఫ్యాక్టరీలో వేలాది మంది రైతులు షేర్ హోల్డర్స్గా ఉన్నారు. ఒక వేల సుగర్ ఫ్యాక్టరీ గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మహాజన సభ ఏర్పాటుచేసి రైతులందరి ఆమోదంతోనే నిర్ణయం తీసుకోవాలి. అయితే, చంద్రబాబు సర్కారు రైతుల ఆమోదం లేకుండా నిర్ణయం తీసుకోవడంపై రైతుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. పెద్దఎత్తున ఉద్యమిస్తాం భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేపడతాం. సుగర్ ఫ్యాక్టరీ రైతుల ఆస్తి. ప్రభుత్వ ఆస్థి కాదు. రైతుల ఆమోదం లేకుండా మూసివేత ఉత్తర్వులు ఎలా ఇస్తారు. సుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చెరకు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మూసివేతకు ఉపక్రమించడం దారుణం. – బుద్దరాజు రాంబాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూసివేయడం సరికాదు భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయడం సరికాదు. ఈ ఫ్యాక్టరీకి ఎంతో చరిత్ర ఉంది. మా ప్రాంతంలో వరి కంటే ఎక్కువగా చెరకు సాగుచేసేవారం. చెరకు పంటను ఫ్యాక్టరీకి విక్రయించేవారం. ఫ్యాక్టరీ మూత పడడంతో చెరకు పంట సాగు చేయడం మానివేశాం. వరి సాగుచేయొద్దని వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. అలాంటి సమయంలో సుగర్ ఫ్యాక్టరీని తెరిపించి చెరకు సాగును ప్రోత్సహించాలి. అలాకాకుండా ఫ్యాక్టరీ మూసివేతకు చర్యలు తీసుకోడం విచారకరం. – కె.రాజు, రైతు, కోరుకొండపాలెం, విజయనగరం మండలం 2004లో ఫ్యాక్టరీని తెరిపించిన వైఎస్సార్ 2004కు ముందు సుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మూతపడిన సుగర్ ఫ్యాక్టరీని తెరిపించే ప్రయత్నం చేయలేదు. 2004లో పాదయాత్ర సమయంలో రైతులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి ఫ్యాక్టరీని తెరిపించాలని విన్నవించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ సుగర్ ఫ్యాక్టరీని తెరిపించారు. రాయితీలు కల్పించారు. ఆయన హయాంలో సుగర్ ఫ్యాక్టరీ బాగానే నిర్వహించారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందక మళ్లీ సుగర్ ఫ్యాక్టరీ మూత పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేదు. ఎప్పటికై నా సుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరిపిస్తుందని ఆశతో రైతులు ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లేలా శాశ్వతంగా ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేయడం రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నాటి అండ నేడు ఏదీ? జిల్లా వ్యాప్తంగా గతంలో సుమారు 50వేల హెక్టార్లలో చెరకు పంట సాగయ్యేది. పండించిన చెరకును భీమసింగి సుగర్ ఫ్యాక్టరీకి రైతులు తరలించేవారు. ముందుగా జిల్లాలోని ఎస్. కోట, కొర్లాం, బొబ్బిలి, గజపతినగరం తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన చెరకు కాటాల వద్ద తూకం వేశాక లారీలపై భీమసింగి చక్కెర కర్మాగారానికి పంటను తీసుకెళ్లేవారు. భీమసింగి ఫ్యాక్టరీ మూతపడ్డాక చెరకు సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గింది. ప్రస్తుతం జిల్లాలో 2,200 హెక్టార్లకే చెరకు సాగు పరిమితమైంది. పండించిన చెరకును బెల్లం క్రషర్ల్కు రైతులు విక్రయిస్తున్నారు. మద్దతు ధర రాకపోయినా గత్యంతరం లేక రైతులు విక్రయిస్తున్నారు. సుగర్ ప్యాక్టరీ టీడీపీ సర్కారు హయాంలోనే మూతపడింది. దీంతో వందలాదిమంది రెగ్యులర్, కాంట్రాక్టు కార్మికులు ఉపాధి కోల్పోయారు. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేతకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం నెరవేరని మంత్రి హామీ ఆవేదనలో రైతాంగం -
హక్కుల కోసం రోడ్డెక్కిన క్రైస్తవులు
విజయనగరం క్రైమ్: దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, హక్కులను పరిరక్షించాలని దక్షిణ భారత బాప్టిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సంఘమిత్ర డాక్టర్ ఆర్.ఎస్.జాన్ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాయాలు, వివక్షకు నిరసనగా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయనగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. కోట కూడలి నుంచి మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం వీధి మీదుగా కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చి వరకు ర్యాలీ సాగింది. మతం మారినంత మాత్రాన కులం మారదు, దళితులు ఎదుర్కొంటున్న సామాజిక అసమానతలు తొలగిపోవు అంటూ నినదించారు. మతం పేరిట దళిత ముస్లింలు, క్రైస్తవుల ప్రాథమిక హక్కులను రద్దుచేసే రాజ్యాంగ విరుద్ధ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మంత్రి వస్తే.. మాకేంటి..!
దత్తిరాజేరు: మండలంలోని వింద్యవాసి గ్రామంలో శనివారం జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రైతులు ముఖం చాటేయడంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని రామమందిరం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వచ్చే సమయానికి కేవలం ముగ్గురు నలుగురు రైతులు తప్ప ఎవరూ హాజరు కాలేదు. దీంతో చేసేది లేక పోలీసులు అక్కడక్కడ ఉన్న వారందరిని పిలిచినా రాకపోవడంతో ఇతర గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలే కుర్చీల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మంత్రి వేదిక మీద కూర్చునే సమయానికి కూడా రైతులను అందుబాటులో ఉంచలేకపోయారని ఆర్డీఓపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఒక సమయంలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గ్రామస్తులకు పథకాలు అందకపోవడంతో బాయ్కాట్ చేశారని కొందరు చర్చించుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా గ్రామంలో రీసర్వే చేసిన తన పేరున ఉండాల్సిన భూమి తక్కువగా ఉందని రైతు కోలా జగదీశ్వరరావు నిలదీయడంతో మంత్రి తరువాత మాట్లాడుదామని రైతుని కూర్చోమని సముదాయించారు. రీసర్వే ప్రొఫైల్ తేలేదని.. రైతులను తీసుకురాలేకపోయారని తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా గొభ్యంలో జరిగిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో గ్రామ నాయకుల మధ్య మంత్రి ఉంటుండగానే తీవ్ర వాగ్వాదం జరగడంతో మంత్రి చేసేది లేక రెండు గృహాలు వద్ద ఫొటోలు తీసుకొని కాసేపు రామమందిరంలో సేదదీరి వెనుదిరిగారు. ముందుగా దత్తిరాజేరు కేజీబీవీ ఆవరణలో డార్మెటరీ గదులను, ఎంఈఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్.తాత, తహసీల్దార్ హరికిరణ్, ఎంఈఓ వెంకటరావు, సుధాకర్, సర్వశిక్ష అభియాన్ ఈఈ మురళి, డీఈ ప్రసాద్, ఏఈ ఉపేంద్ర, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వింద్యవాసిలో పాస్ పుస్తకాల పంపిణీకి ముఖం చాటేసిన రైతులు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కొండపల్లి -
ముగిసిన నైపుణ్యాభివృద్ధ్ధి శిక్షణ
విజయనగరం అర్బన్: స్థానిక మహారాజా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ సహకారంతో ప్రయోగశాల సాంకేతిక నిపుణులు, సహాయక సిబ్బందికి ‘ప్రయోగశాల విధానాలు, భద్రత, దసీ్త్రకరణ, నాణ్యతా వ్యవస్థలు’ అనే అంశంపై నిర్వహించిన ఒక రోజు నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రామయ్య మాట్లాడుతూ.. ప్రయోగశాలల్లో భద్రతా ప్రమాణాలు, నాణ్యతా విధానాలు, ప్రామాణిక కార్యాచరణ పద్ధతులను పక్కాగా అమలు చేయడం వల్ల పనితీరు, విశ్వసనీయత పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీఎంఎస్ లాబొరేటరీస్ క్వాలిటీ కంట్రోల్ హెడ్ కె.లీలాకిరణ్కుమార్, ఎంఐఎంఎస్ క్వాలిటీ అక్రిడిటేషన్ కో ఆర్డినేటర్ జె.విజయ్కుమార్ పాల్గొని ప్రయోగశాల నిర్వహణ, భద్రతపై దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ల్యాబ్ సెక్యూరిటీ, రసాయనాల సురక్షిత నిల్వ, పరికరాల నిర్వహణ, అగ్ని ప్రమాదాల నివారణ, జీవ భద్రత, అత్యవసర పరిస్థితుల ఎదుర్కోవడం వంటి ప్రమాదాల నివారణ వంటి పలు అంశాలపై నిపుణులు ప్రాయోగిక అవగాహన కల్పించారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రయోగశాల సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. -
సాగని రిజిస్ట్రేషన్లు
రీసర్వే పూర్తయినా..● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కనిపించని వివరాలు ● రెండేళ్లుగా రైతుల అవస్థలు ● కొందరికి అందని పాస్ పుస్తకాలుబలిజిపేట: రీ సర్వే ప్రక్రియ పూర్తయింది.. అయినా పలు గ్రామాల భూముల వివరాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కనిపించడం లేదు.. దీంతో ఆయా గ్రామాలకు చెందిన భూములు క్రయ విక్రయాలు జరగడం లేదు. దీంతో ఆ గ్రామాల రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తమ భూములను విక్రయించి కష్టాల నుంచి గట్టెక్కుదామంటే కుదరడం లేదు. రెండేళ్లుగా ఇలా సమస్య నలుగుతూనే ఉంది తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇటు పాలకులుగాని.. అటు అధికారులుగాని దీన్ని పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని ఆ రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... బలిజిపేట మండలం పలగర, తుమరాడ, వెంగాపురం, శివరాంపురం గ్రామాలకు చెందిన రైతుల భూములు రిజిస్ట్రేషన్లు జరగక క్రయ, విక్రయాలకు నోచుకోవడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పోర్టల్లో రీసర్వేకు సంబంధించిన వివరాలు కనిపించకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఓ వైపు రీసర్వే పూర్తయింది. పాస్ పుస్తకాలు కూడా కొద్ది మందికి తప్ప అందరికీ వచ్చేశాయి. అయితే వాటిలో తప్పులు సరి చేసుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే సరిగా ఉన్న వారి భూములను క్రయ విక్రయాలు జరపాలంటే కుదరడం లేదు. దీంతో అత్యవసర ఖర్చుల నిమిత్తం భూములను అమ్ముదామంటే కుదరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీసర్వే పూర్తయి రెండేళ్లు అవుతున్నా.. ఈ పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసర్వేకు సంబంధించి అధికారులు చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా తమ భూములు క్రయ విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
పార్వతీపురం రూరల్: ఆన్లైన్ బెట్టింగ్లు, జల్సాలకు బానిసై రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా గుట్టుచప్పుడు కాకుండా చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని నుంచి సుమారు రూ.71.40 లక్షల విలువైన 42 తులాల బంగారు ఆభరణాలను నూటికి నూరు శాతం రికవరీ చేసినట్లు ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి వెల్లడించారు. స్థానిక మెట్టువీధికి చెందిన సువ్వాడ సతీష్ ఓ టిఫిన్ సెంటర్లో పని చేస్తుంటాడు. సంపాదన చాలక, జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇందులో భాగంగా ఈ నెల 2, 3 తేదీల్లో సీతానగరానికే చెందిన కుర్మదాసు కిశోర్, వక్కలగడ్డ సురేష్ల ఇళ్ల తాళాలను ఇనుప రాడ్డుతో పగులగొట్టి మొత్తం 42 తులాల బంగారం అపహరించాడు. ఈ వరుస చోరీలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బాధితుల ఫిర్యా దుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ పుటేజీ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి దొంగ కదలికలను పసిగట్టారు. శనివారం ఉదయం స్థానిక హనుమాన్ జంక్షన్ వద్ద దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. సతీష్ ఇంట్లో దాచిన మంగళసూత్రాలు, గాజులు, నెక్లెస్లు తదితర 42 తులాల స్వర్ణాభరణాలను సీజ్ చేసి, అతడిని కోర్టు రిమాండ్కు తరలించారు. రూ. 71.40 లక్షల విలువైన 42 తులాల బంగారం స్వాధీనం ఆన్లైన్ బెట్టింగ్ల కోసమే దొంగతనాల బాట -
తాష్కెంట్లో రాణించిన గురునాయుడు
● ఆసియా వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో హ్యాట్రిక్ నెల్లిమర్ల రూరల్: ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో జరుగుతున్న జూనియర్ ఆసియా వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్–2026 పోటీ ల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన యువ వెయిట్లిఫ్టర్ శనపతి గురునాయుడు సత్తాచాటాడు. శనివారం జరిగిన 60 కేజీల విభాగంలో స్నాచ్లో 119 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 146 కేజీల బరువును ఎత్తి రెండు విభాగాల్లోనూ వెండి పతకాలు సాధించాడు. మొత్తం 265 కేజీల బరువును స్కోర్చేసి ఆ విభాగంలోనూ మరో వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో, ఒకే పోటీలో మూడు వెండి పతకాలు సాధించి తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబర్చడంతో గ్రామస్తులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తంచేశారు. మన్యం బంద్ విజయవంతం సీతంపేట: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన మన్యంబంద్ విజయవంతమైంది. సీతంపేటలో ఉదయం నుంచే షాపులు తెరచుకోలేదు. 11 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా గిరిజన సంఘం కార్యాలయం నుంచి సీతంపేట వారపు సంతవరకు ర్యాలీ చేశారు. అనంతరం కొద్ది సేపు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గిరిజన హక్కులను కూటమి ప్రభుత్వం హరిస్తోందని, జీఓ నంబర్ 3ను చట్టం చేయాలని, గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలని, 1/70 చట్టం పకడ్బందీగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. నాన్షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని నినదించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.అశోక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, గిరిజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.తిరుపతిరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, నాయకులు కె.భాస్కరరావు, శ్రీరాములు, బి.అప్పారావు, గంగాధర్, పి.సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. కుంకీ ఏనుగుల తరలింపు సీతానగరం: మండలంలోని జోగింపేట ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఉన్న కుంకీ ఏనుగులను తెర్లాం మండలం రామినాయుడువలస ప్రాంతంలో ఉన్న ఏనుగులను మచ్చిక చేసేందుకు వీలుగా జిల్లా అటవీ శాఖ అధికారి జీఏపీ ప్రసూన పర్యవేక్షణలో ఆ ప్రాంతానికి శనివారం తరలించారు. జయంత్, అభిమన్యు కుంకీ ఏనుగులను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రధాన రహదారిపైకి రావడంతో ట్రాకర్స్ ముందస్తు హెచ్చరికలు చేశారు. ఏళ్లుగా ఈ ప్రాంతంలో తిరుగాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు ఏ మేరకు మచ్చిక చేసుకొని ఈ ప్రాంతం నుంచి తీసుకుపోతాయోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
రోల్ మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలి
గుమ్మలక్ష్మీపురం: మెరుగైన వైద్యసేవలు అందించి భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రోల్ మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఈ మేరకు నాబార్డ్ – 225 నిధులు రూ.8.95 కోట్లతో భద్రగిరిలో నిర్మించిన 50 పడకల నూతన ఆస్పత్రి భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తూ ఉంటే ప్రయోజనం ఏం ఉంటుందని, కావున రిఫర్ చేయకుండా సాధ్యమైనంత వరకూ స్థానిక ఆస్పత్రిలోనే ప్రజలకు వైద్య సేవలు అందివ్వాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో అన్నారు. అవే అబద్దాలు.. ఎన్నికల ముందు చెప్పిన అబద్దాలనే జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు మళ్లీ ఈ సమావేశంలోనూ కొనసాగించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 10.50 లక్షల కోట్లు అప్పు చేసిందని ఓ సారి, రూ.13 లక్షల కోట్లు అప్పు చేసిందని మరోసారి నిడకడలేని మాటలు చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చాం.. అధికారంలోకి వచ్చాక హామీలన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో రివ్యూ చేస్తే గత ప్రభుత్వం చేసిన అప్పులు చూసి గుండె దడ పుట్టిందన్నారు. అన్ని హామీలు అమలు చేయాలంటే డబ్బుల్లేవంటూనే ఒకటి రెండు తప్ప సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి మోదీ సహకారం అందిస్తుండంతోనే రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. దీనికి ముందు ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ భద్రగిరి ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా మార్పు చేయాలంటూ ఇన్చార్జ్ మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఆర్డీఓ మాధురి, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో గుడ్ల పరిశీలన
రాజాం: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి పంపిణీ చేస్తున్న కోడిగుడ్లను ఎంఈఓ యాగాటి దుర్గారావు శుక్రవారం పరిశీలించారు. పెనుబాక, కంచరాం, బొద్దాం తదితర పాఠశాలల్లో గుడ్ల పరిమాణంపై ఆరాతీశారు. వంట ఏజెన్సీతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్న గుడ్ల పరిమాణం చిన్నదిగా ఉండడంపై ఈనెల 7న సాక్షిలో ‘గుడ్డు చిన్నబోయింది’ శీర్షికతో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఎంఈఓ పలు పాఠశాలలో వాటిపై ఆరాతీయడంతో పాటు ఏజెన్సీతో మాట్లాడారు. గుడ్డు పరిమాణం తగ్గితే బిల్లులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపికవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అమరావతి చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలు శుక్రవారం జరిగాయి. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నగర శివారులో గల విజ్జీ స్టేడియంలో బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అండర్–17, 23 వయస్సుల విభాగాల్లో బాలబాలికలకు నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంపిక పోటీలను పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, శాప్కోచ్లు పర్యవేక్షించారు. సెంచూరియన్లో ‘వికసిత్ భారత్ హ్యూమన్ క్యాపిటల్ కాన్క్లేవ్’నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ యూనివర్సిటీలో ‘వికసిత్ భారత్ హ్యూమన్ క్యాపిటల్ కాన్క్లేవ్–2026’ శుక్రవారం నిర్వహించారు. భవిష్యత్ నైపుణ్యాలు, కత్రిమ మేధస్సు, పరిశోధనలు, ఆవిష్కరణలు, పరిశ్రమ–విద్యా భాగస్వామ్యంపై నిపుణులు చర్చించారు. ఏఐతో సాంకేతిక రంగంలో వేగంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని అపిటోరియా ఫార్మా ప్లాంట్ హెడ్ డాక్టర్ కె. సాంబిరెడ్డి సూచించారు. పరిశోధనలు, స్టార్టప్లకు మరింత ప్రోత్సాహం అవసరమని సీఐఐ చైర్మన్ జి.కృష్ణమోహన్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించడం విద్యాసంస్థల బాధ్యతను వీసీ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకట రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రెండు బైక్లు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలుబొబ్బిలి: పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయం జంక్షన్లో శుక్రవారం రాత్రి రెండు బైక్లు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మండలంలోని కృష్ణాపురానికి చెందిన చొక్కాపు ఈశ్వర రావు ఆలయం రోడ్డు నుంచి మెయిన్ రోడ్డులోకి బైక్పై వెళ్తున్నాడు.అదే సమయంలో మెయిన్రోడ్డులో బైక్పై వస్తున్న పట్టణానికి చెందిన బి. వెంకట్రావు, డి.అప్పలనాయుడులను ఈశ్వర రావు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడ్డారు. వారిని స్థానికులు సీహెచ్సీకి తరలించగా సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. తీవ్ర గాయాల పాలైన ఈశ్వర రావును విజయనగరం కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ కె. నారాయణ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దిశ చట్టం రద్దుపై.. మహిళల తిరుగుబాటు
ప్లకార్డులతో నిరసన విజయనగరం: మహిళల భద్రత, రక్షణకోసం గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం రద్దు నిర్ణయంపై మహిళలు భగ్గుమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ మహిళా భద్రత వ్యతిరేక పాలనపై నిరసన తెలిపారు. దిశ చట్టం రద్దుచేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కేబినెట్లో తీసుకున్న దిశ చట్టం రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మహిళలంటే చంద్రబాబుకు ఎందుకంత చులకన అని నిలదీశారు. సీఎం డౌన్డౌన్ అంటూ నినదించారు. దిశ చట్టం రద్దు నిర్ణయ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఆడబిడ్డలకు రక్షణ కవచం లాంటి చట్టాన్ని రద్దు చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. దిశ చట్టం వచ్చిన తరువాత 21 రోజుల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం వల్ల మహిళల్లో ధైర్యం పెరిగిందని, బాధిత మహిళలకు న్యాయం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలు మద్దతుగా చట్టాన్ని రద్దు చేస్తే మహిళాలోకం నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, నగర పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, మాజీ మేయర్ వి.విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఆండ్ర జలాశయాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
మెంటాడ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మహానది జలాలను ఆంధ్రప్రదేశ్ మీదుగా గోదావరికి అనుసంధానించే ప్రతిపాదిత మార్గంలో ఉన్న ఆండ్ర జలాశయాన్ని జాతీయ, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఇంజినీరు దేవానందరావు, అంతరరాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీరు టి.గోవిందరావు నేతృత్వంలోని ఈ బృందం జలాశయం ప్రస్తుత స్థితిగతులను, ఇక్కడ చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రూ. 54,019 కోట్ల మెగా ప్రాజెక్టు సుమారు రూ. 54,019 కోట్ల అంచనా వ్యయంతో నదుల అనుసంధానం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నట్లు బృంద అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని మహానది జలాలను శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం గొట్టా బ్యారేజీ రిజర్వాయర్కు, అక్కడి నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలోని జంఝావతి జలాశయానికి, విజయనగరం జిల్లాలో ఉన్న ఆండ్ర, తాడిపూడి జలాశయాలకు అనుసంధానిస్తారు. ఆపై అనకాపల్లి జిల్లాలోని రైవాడ రిజర్వాయర్కు గోదావరి నది జలాలను మళ్లిస్తామని వివరించారు. తొలివిడత క్షేత్రస్థాయి పరిశీలన నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా ప్రధాన కాలువ ఆండ్ర జలాశయం మీదుగా వెళ్లనుందని, ఈ ప్రాంత భౌగోళిక స్థితిగతులు, సాంకేతిక అంశాలను అధ్యయనం చేయడానికి తొలి పరిశీలన చేపట్టినట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆరా తీసి, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్శనలో నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజినీరు వేణుగోపాల్, ఎస్ఈ అప్పలనాయుడు, ఈఈ గోవిందరావు, ఆండ్ర రిజర్వాయర్ డీఈ రామునాయుడు, ఏఈ కృపాంద్, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్కు ప్రాజెక్టుల ఆహ్వానం
● నమోదుకు ఈ నెల 15 చివరి తేదీ ● జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యం నాయుడువిజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజ్ఞాన, సాంకేతిక మండలి (ఏపీసీఓఎస్టీ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 32వ జాతీయ బాలల విజ్ఞాన కాంగ్రెస్ (ఎన్సీఎస్సీ–2026)కు సంబంధించిన ప్రాజెక్టుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు తమ పాఠశాలల విద్యార్థుల నమోదును తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. అర్హత కలిగిన విద్యార్థుల వివరాలను అధికారిక వెబ్సైట్ లో ‘స్టూడెంట్స్/చిల్డ్రన్ సైంటిస్ట్స్ అండ్ గైడ్స్’ విభాగం ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు. ప్రతి ప్రాజెక్టులో ఇద్దరు విద్యార్ధులు మాత్రమే పాల్గొనాలి. ఒకరిని ‘గ్రూప్ లీడర్’గా, మరొకరిని ‘గ్రూప్ మెంబర్’గా నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ శీర్షిక ఎంపిక చేసిన ఉపాంశానికి అనుగుణంగా ఉండాలి. నమోదు సమయంలో విద్యార్ధుల ఫోటోలు, ప్రధానోపాధ్యాయులు జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాలు, మొబైల్ నంబర్లు, ఈ–మెయిల్ చిరునామాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధన నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేందుకు ఈ జాతీయస్థాయి క్యాక్రమం ఎంతో తోడ్పడుతుందని డీఈఓ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాల ఇందులో చురుగ్గా పాల్గొని అధిక సంఖ్యలో ప్రాజెక్టులను నమోదు చేయాలని, విజయనగరం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల నమోదుకు ఈ నెల 15వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. నమోదు సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా సందేహాలు ఉంటే జిల్లా కో–ఆర్డినేటర్ టి.రాజేష్ (ఫోన్: 9440444674), జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ జి.సన్యాసినాయుడు (ఫోన్:940009294)లను సంప్రదించాలని సూచించారు. -
తూకంలో తేడా... నిర్వహణలో నిర్లక్ష్యం
రామభద్రపురం: రేషన్ డిపోలకు సరుకులు సరఫరా చేస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులు, రేషన్ డీలర్లు కుమ్మకై ్క లబ్ధిదారులకు అన్యాయం చేయడంపై రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ ఆహార భద్రత పథకం అమలులో భాగంగా శుక్రవారం ఆయన రామభద్రపురం మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, సాంఘిక సంక్షేమ బాలుర వలసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న స్టాక్ను పరిశీలించారు. వసతి గృహం, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు వడ్డించే గుడ్డు బరువు, అరటి పండ్ల నాణ్యతపై సిబ్బందిని ప్రశ్నించగా ఎవ్వరికీ తెలియదని సమాధానం ఇవ్వడంతో అసహనం వ్యక్తంచేశారు. మహంతి వీధిలోని రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. తూనికలు, కొలతలకు సంబంధించి లీగల్ మెట్రాలజీ ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంపై ఇన్స్పెక్టర్ మధుసంతోష్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. రేషన్ దుకాణాల జిల్లా అధ్యక్షుడు చొక్కాపు రామారావు డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతుండగా ఫుడ్ కమిషన్ మెంబరు మాట్లాడుతూ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం ఎన్నికిలోలు తెస్తున్నారు? ఎందుకు తక్కువ తూస్తున్నారు? గోదాం నిర్వాహకులను ఎందుకు ఎదిరించి అడగడం లేదని ప్రశ్నించారు. గోదాం నిర్వాహకులు తూకంలో తక్కువ ఇచ్చిన బియ్యంను తీసుకొచ్చి ఇక్కడ లబ్ధిదారులకు తూకంలో తక్కువ తూసి వారిని నష్టపరుస్తున్నారన్నారు. ● రామభద్రపురంలోని 5వ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తూ రికార్డుల నిర్వహణ బాగాలేదని, కేంద్రం నిర్వాహకురాలికి మెమో ఇవ్వాలని సీడీపీఓను ఆదేశించారు. ● రామభద్రపురం సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించి సరుకుల గోదాం పరిశీలించారు. అక్కడ బియ్యం స్టాకు బుక్లో కంటే సుమారు 30 కిలోలు ఎక్కువగా ఉన్నందున హాస్ట్ల్ నిర్వాహకులకు మెమో జారీ చేయాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీని ఆదేశించారు. ● శ్రీరాంనగర్కాలనీలోని పాఠశాలను సందర్శిస్తుండగా పిల్లలకు మధ్యాహ్నభోజనం వండేందుకు సరిపడా గ్యాస్ ఇవ్వడం లేదని అక్కడి హెచ్ఎం ఫిర్యాదు చేశారు. పాఠశాలకు గ్యాస్ ఇవ్వకపోతే డీఎస్ఓ దృష్టికి తీసుకెళ్లాలని హెచ్ఎంకు సూచించారు. రేషన్ డిపోను పరిశిలీస్తూ కొంత అదనపు బియ్యం పౌరసరఫరాల శాఖ ఇచ్చిన గోనె సంచిలో కాకుండా ప్లాస్టిక్ సంచిలో నిల్వ ఉండడాన్ని గుర్తించి డీలర్ను ప్రశ్నించారు. దీనిపై డీలర్ పొంతన లేని సమాధానం చెప్పడంతో ఆమెకు మెమో ఇచ్చి చర్యలు తీసుకోవాలని డీఎస్ఓ మురళీనాథ్ ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఎవ్వరూ గౌరవించడం లేదని, నిబంధనలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో డీఎస్ఓ మురళీనాథ్, సీఎస్డీటీ సాయికృష్ణ, ఎంఈఓలు తిరుమలప్రసాద్, పెంటయ్య, సీడీపీఓలు ఉమాభారతి, సుజాత, తదితరులు పాల్గొన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులు, డీలర్ల కుమ్మకై ్క లబ్ధిదారులకు నష్టం రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు ఒక రేషన్ డిపో డీలర్, అంగన్వాడీ కార్యకర్త, ఎస్సీ హాస్టల్ వార్డెన్లకు మెమోలు జారీకి ఆదేశం -
కామన్వెల్త్ విజేతకు ఘనంగా స్వాగతం
● అజయ్బాబుపై అపూర్వ అభిమానం చూపిన గ్రామస్తులునెల్లిమర్ల రూరల్: కామన్వెల్త్ గేమ్స్లో వెండి పతకం సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చిన వెయిట్లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు శుక్రవారం తన స్వగ్రామం కొండవెలగాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విజయనగరం ఎత్తు బ్రిడ్జి వద్ద నుంచి అజయ్ బాబును ర్యాలీగా కొండవెలగాడకు తీసుకువెళ్లారు. దారిపొడవునా అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అజయ్కు అభినందనలు తెలిపారు. జెడ్పీటీసీ గదల సన్యాసి నాయుడు, ఎంపీటీసీ మొయిద అక్కోజీ, చంద్రంపేట సర్పంచ్ కర్రోతువెంకట రమణ తదితరులు అజయ్ బాబును సత్కరించి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పతకం సాధించడం జిల్లాకు, స్వగ్రామానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. గ్రామానికి చేరుకున్న అజయ్ బాబుకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.విజయనగరంలో సత్కారం విజయనగరం: గ్లాస్గోలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన జిల్లా క్రీడాకారుడు వల్లూరి అజయ్ బాబుకు ఘన స్వాగతం లభించింది. పోటీలు ముగించుకుని శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న అజయ్ను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుశ్శాలువాతో సత్కరించారు. అదేవిధంగా జిల్లా క్రీడాఫ్రాధికార సంస్థ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యా య అవార్డు–2026ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, డైట్లలో పదేళ్ల వృత్తి అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 17 నుంచి 22వ తేదీలోగా ఉపవిద్యాశాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందజేయాలని కోరారు. ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2,400 కోట్లు ● డీసీసీబీ జీఎం కేవీవీఆర్ఎన్ సత్యనారాయణ రామభద్రపురం: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో రూ.2,400 కోట్లు రుణాలు మంజూరు చేయాలన్నది లక్ష్యమని డీసీసీబీ జీఎం కేవీవీఆర్ఎన్ సత్యనారాయణ తెలిపారు. మండలకేంద్రంలోని డీసీసీబీ బ్రాంచ్ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.1980 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ఈ ఏడాది రూ.380 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డీసీసీబీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కంటే డీసీసీబీలో 0.5 శాతం వరకు అధిక వడ్డీ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభా వంతో వర్షపాతం తక్కువగా నమోదు కానుందని వాతావరణ శాఖాధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఖాతాదారులంతా ఈ నెల 15వ తేదీలోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. ఐబీబీఎస్ ద్వారా కొత్తగా 25 మంది సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కర్రి జానకి, సూపర్వైజర్ తెంటు రమేష్, తదితరులు పాల్గొన్నారు. పొటాష్ ఎరువు ధరలు తగ్గించాలి ● రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్కు విన్నవించిన రైతులు డెంకాడ: పొటాష్ ఎరువు ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ మనాజీర్ జిలానీసమూన్కు విన్నవించారు. డెంకాడ మండలం సింగవరంలో ఆయన శుక్రవారం పర్యటించారు. వరి ఉభాలు చేస్తున్న పొలాలను పరిశీలించారు. పంటకు మేలు చేసే అజోస్పిరిల్లమ్ అనే జీవరసాయనిక ఎరువును చల్లించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ను పరిశీలించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ పరిస్థితులు, సాగునీటి లభ్యత, ఎరువుల పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ తదితర వాటిపై రైతులతో ముచ్చటించారు. ఆయిల్ ఇంజిన్లు, నీటిని తరలించే పైపులు రైతులకు అందించాలని రైతులు కోరారు. వర్షాభావం ఇలాగే కొనసాగితే అపరాలు, కొర్రలు, సజ్జలు వంటి చిరుధాన్యాలు సాగు చేయాలని ఆయన రైతులకు సూచించారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోని రైతులు ఈ నెల 15వ తేదీలోగా పంటల బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వీటీ రామారావు, డీడీఏ ఎం.రామారావు, డీపీఎం విజయ్కుమార్, శాస్త్రవేత్త తేజేశ్వరరావు, ఇన్చార్జి ఏడీఏ సంగీత, ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. 11న సీతంపేట ఐటీడీఏలో ఆదివాసీ దినోత్సవంసీతంపేట: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సీతంపేట ఐటీడీఏలో ఈనెల 11న నిర్వహించనున్నట్లు పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో అమరావతిలో ప్రభుత్వం నిర్వహిస్తున్నందున అక్కడికి మంత్రులు,ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఐటీడీఏలో 9వ తేదీకి బదులు 11న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గిరిజన ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తం
● సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ● విద్యుత్ శాఖ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు విజయనగరం: వర్షాకాలం కారణంగా ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సోలార్ విద్యుత్ కోసం సబ్సిడీ ద్వారా అమలవుతున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రెండున్నరేళ్లలో రూ.539 కోట్లతో జిల్లాలో విద్యుత్ అభివృద్ధి పనులు చేయించామని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. ప్రధానంగా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సేవలు జాప్యం అవుతున్నట్లు పత్రికలు ద్వారా వస్తున్నాయని వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెలా 2 తేదీన విద్యుత్ సేఫ్టీ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు అక్కడక్కడ జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు పోలీసుల సహకారంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజి నీర్ పి.హరి, గోపాలరావు నాయుడు, ఈఈ టెక్నికల్ జి.శంకరరావు, సీనియర్ అకౌంటెంట్ ఎస్.అప్పలనాయుడు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
రాజాం సిటీ: విధులకు హాజరై ఇంటికి తిరిగి వస్తు న్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు కాటేసింది. పొందూరు మండలం అంతకాపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో మలుపువద్ద రాజాం నుంచి శ్రీకాకుళం వైపు వె ళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఒడిశా రాష్ట్రంలోని బరంపురానికి చెందిన యువకుడు సమ్మ సా యిసురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. బరంపురానికి చెందిన సమ్మ సాయిసురేష్ (30) కుటుంబంతో సహా ఏడాది క్రితం రాజాం వచ్చాడు. తండ్రి సతీష్బాబు అనారోగ్యానికి గు రికావడంతో రాజాంలో బజాజ్ ఫైనాన్స్లో సేల్స్మేనేజర్గా జాయిన్ అయ్యాడు. ప్రతిరోజూ ఉదయం 9గంటలకు విధులకు వెళ్లి వివిధ ప్రాంతాల్లో సందర్శించి రాత్రి 9గంటల సమయంలో ఇంటికి చేరేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం విధులకు హాజరైన సురేష్ పొందూరు వెళ్లి తిరుగు ప్రయాణంలో బైక్పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో సంఘట నా స్థలంలోనే మృతిచెందాడు. ఈ విషయాన్ని సహోద్యోగి పి.ప్రకాశరావు కుటుంబసభ్యులకు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. మృతునికి తల్లి ధనలక్ష్మి, తండ్రి సతీష్బాబు, ఓ సోదరి ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ధ నలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చే స్తున్నామని ఎస్సై మహ్మద్ సల్మాన్ బేగ్ తెలిపారు. -
లారీ బీభత్సం
● మూడు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్, బైక్ ధ్వంసం భామిని: రోడ్డుపై వాహనాల రాకపోకలు, పొలాల్లో వ్యవసాయ పనుల్లో రైతులు, వరితీతలో వలస కూలీలు. అందరూ చూస్తుండగానే శుక్రవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది.భామిని మండలం నేరడి బ్యారేజీ సమీపంలో ఏబీ రోడ్డుపై బత్తిలి నుంచి భామిని వైపు వస్తున్న సిమెంట్ బస్తాల ఖాళీ లారీ రోడ్డుపై కుడివైపు మితిమీరిన వేగంతో వస్తూ రోడ్డు సైడ్న ఆపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఈడ్చుకుంటూ వెళ్లి కొత్తగా వేసిన భారీ రౌండ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపక్కనే ఉన్న రెండు విద్యుత్ స్తంభాలపై గల పాత ట్రాన్స్ఫార్మర్ను పడగొట్టింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేక పోవడంతో ప్రాణనష్టం తప్పిందని పొలంలో పనిచేస్తున్న అంతా ఊపిరిపీల్చుకున్నారు. రోడ్డుపక్కనే బైక్ను నిలిని పొలం పనులు చేస్తున్న నేరడికి చెందిన రైతు పాతపట్నం కోదండ రావు బైక్ ప్రమాదంలో తునాతునకలైంది. కొద్ది దూరంలో పోలంలోని రైతులు కేకలు వేయడంతో ప్రమాదానికి కారణమైన లారీ నిలిపివేసి డ్రైవర్ పరుగులు తీశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జనసేన నాయకుడిపై దాడివిజయనగరం రూరల్: నగరానికి చెందిన జనసేన నాయకుడు గురాన అయ్యలుపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. నగరంలోని మంగలివీధిలో ఉన్న నూకాలమ్మ ఆలయానికి సంబంధించి జనసేన నేతకు, స్థానికుల మధ్య నెలకొన్న పాత గొడవల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య శుక్రవారం జరిగిన వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. దీంతో స్థానికులు కొందరు అయ్యలుపై దాడి చేసి గాయపరిచారు. దీంతో ఆయన జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. దాడి విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రత్యేక జీఓలతో డీఎస్సీలో అక్రమాలు
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక జీఓలతో డీఎస్సీలో అక్రమాలను ప్రోత్సహించిందని, అర్హులకు అన్యాయం చేసిందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనిసరావు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మొదటి సంతకానికి ఇదేనా విలువ అని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సమగ్రవిచారణ జరపకుంటే నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమం తరహాలో రాష్ట్రంలో మహా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన రెండవ రోజు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న మహిళలకు బత్తాయిరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయపాలనకు వ్యతిరేకంగా, యువత, విద్యార్థులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్టు వెల్లడించారు. ప్రజస్వామ్య ప్రభుత్వంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై శాంతియుతంగా నిరసన చేపడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దౌర్జన్యకాండకు పాల్పడడం దుర్మార్గమన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో 10 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చిన వారిలో ఒకరిని ప్రశ్నిస్తే నిజం బట్టబయలైందని, కర్రాబిల్లా అట ఆడిన వ్యక్తికి ఎలా ఉద్యోగం వచ్చిందో తమకు తెలియదంటూ చుట్టపక్కల వారు చెప్పడం గమనార్హమని పేర్కొన్నారు. సదరు అభ్యర్థితో పాటు తల్లిదండ్రులతో తామే నేరుగా మాట్లాడితే స్థానిక ఎమ్మెల్యేకు తమ ఇబ్బందులు చెప్పుకుంటే ఈ ఉద్యోగం ఇప్పించారంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో 10 మందికి ఉద్యోగాలు వస్తే ఎన్ని పారదర్శకంగా జరిగాయే ప్రభుత్వ పెద్దలకు, ప్రజలకు తెలియాలన్నారు. బాధ్యతగల ప్రతిపక్షంగా యువత కోసం చేపడుతున్న పోరుబాటలో భాగంగా ఈ నెల 10న నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టబోయే నిరసన ర్యాలీల్లో యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ● ఇదెక్కడి రక్షణ.. మహిళల రక్షణ, భద్రత కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమల్లోకి తెచ్చిన దిశ చట్టం రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని జెడ్పీ చైర్మన్ అన్నారు. చట్టాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయాల్సింది పోయి వాటిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేయడం అన్యాయమన్నారు. మహిళలంటే గౌరవం ఉంటే చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, తదితరులు పాల్గొన్నారు. లోకేశ్ రాజీనామా చేయాలి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల మేరకు నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ పథకం బకాయిలు రూ.9,500 కోట్ల తక్షణమే విడుదల చేయాలన్నారు. పేదకుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం సరికాదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. తమ అనుకూల మీడియాతో అబద్ధాలను వాస్తవాలుగా వక్రీకరించడం తగదన్నారు. సమగ్ర విచారణ జరిపి యువతకు న్యాయం చేయకుంటే ఉద్యమం తప్పదు ఢిల్లీలోని జంతర్మంతర్ వేదిక తరహాలో ఉద్యమం చేపడతాం స్పష్టంచేసిన జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
కార్మిక సంక్షోభం..!
విజయనగరం గంటస్తంభం: భవన నిర్మాణ కార్మికులు, గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేంది. కొత్త పథకాలను అమలు చేయకపోగా, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలకు సైతం మంగళం పాడేసింది. సంక్షేమాన్ని విస్మరిస్తూ సంక్షోభంలోకి నెట్టేయడంపై కార్మికలోకం ఆవేదన వ్యక్తంచేస్తోంది. ఇదీ పరిస్థితి.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో దాదాపు 6,09,096 మంది అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు కార్మిక శాఖలో నమోదైన భవన నిర్మాణ కార్మికులు 1,22,502 మంది మాత్రమే. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంపై ఆధారపడిన తాపీ మేసీ్త్రలు, కూలీలు, రాడ్ బెండర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు, మట్టి పని చేసేవారు, ఇటుక బట్టీ వర్కర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తామని, సాధికార సంస్థ ఏర్పాటు చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్ని వర్గాల కార్మికులకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి నేటి వరకు ఆ హామీల ఊసే ఎత్తకపోవడంతో కార్మిక లోకం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అందని సాయం.. ఆవేదనలో కార్మికలోకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో అత్యద్భుతంగా అమలైన వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చారు. అంతకు మించి పథకం అమలుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం కింద విజయనగరం జిల్లాలో దాదాపు లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సాయం అందింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ సాయం పూర్తిగా నిలిచిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందించిన సాయం ఇలా.. ౖవెఎస్సార్ కల్యాణమస్తు: భవన, ఇతర నిర్మాణ కార్మికుల పిల్లల పెళ్లిళ్లకు రూ.20,000 చొప్పున లబ్ధి. ౖవెఎస్సార్ బీమా (ప్రమాద మరణం): బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం. సహజ మరణం, వైకల్యం: సహజ మరణానికి రూ.1 లక్ష, ప్రమాదంలో వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షలు. రిజిస్టర్ కాని కార్మికులకు సైతం: రిజిస్టర్ కాని కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యానికి రూ.2.5 లక్షల సాయం. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు: అసంఘటిత రంగ కార్మిక కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ కింద ఏకంగా రూ.25 లక్షల వరకు పూర్తి ఉచిత వైద్యం. ప్రస్తుతం వివాహ కానుక కింద రూ.20 వేలు, ప్రసూతి సహాయం కింద రూ.20వేలు, సహజ మరణం సహాయం రూ.50వేలు, దహన సంస్కారాల ఖర్చులు రూ.20వేలు మాత్రమే కార్మికులకు అందుతున్నాయి. ప్రమాద బీమాను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలకు సైతం గండి మొత్తం 6,09,096 మంది కార్మికులకు దక్కని భద్రత సార్వత్రిక ఎన్నికల హామీలకు మంగళం! వైఎస్సార్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మార్చడమే తప్ప సాయం సున్నా అవగాహన లేక వేలాది మంది రెన్యువల్కు దూరం -
● వీరు మారరంతే..
ఓ వైపు ప్రమాదాలు జరుగుతున్నా.. వాహన చోదకుల్లో మార్పు రావడం లేదు.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతూ కన్నవారికి కన్నీరు మిగిలిస్తున్నారు.. ముఖ్యంగా యువత ప్రయాణాల్లో నిబంధనలు పాటించడం లేదు.. ద్విచక్ర వాహనాలపై పరిమితికి మించి వెళ్తున్నారు.. పైగా హెల్మెట్ కూడా పెట్టుకోవడం లేదు.. పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి, అవగాహన కల్పిస్తున్నా వారిలో మార్పు రాకపోవడం బాధాకరం. మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఓ ద్విచక్ర వాహనంపై నలుగురు, మరో వాహనంపై ముగ్గురు హెల్మెట్లు పెట్టుకోకుండా ప్రయాణిస్తూ సాక్షి కంటపడ్డారు. – గజపతినగరం -
గుడ్డు చిన్నబోయింది
ఈ ఫొటోలోని గుడ్డు చూసి ఇదేదో కోడి పొల్లు గుడ్డు అనుకుంటే పొరబడినట్టే. రాజాం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీచేస్తున్న కోడిగుడ్లు సైజు ఇలా చిన్నగా మారిపోయింది. సాధారణంగా గుడ్డు 50 గ్రాముల నుంచి 65 గ్రాముల బరువు ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే నాణ్యతలేనట్టుగా భావిస్తారు. పాఠశాలలకు వచ్చే గుడ్లు 50 గ్రాములు కంటే తక్కువగా ఉంటున్నాయి. నాణ్యతతో పాటు సాధారణ పరిమాణం లేని గుడ్లను ఏజెన్సీలు సరఫరా చేస్తున్నా వంట నిర్వాహకులు ఎదిరించలేక విద్యార్థులకు వండిపెడుతున్నారు. కొన్నిసార్లు గుడ్లు పాడవ్వడంతో విద్యార్థులకు వడ్డించలేని పరిస్థితి తలెత్తుతోందని వాపోతున్నారు. – రాజాం -
ఉద్యోగాల పేరుతో టోకరా ..
ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగభృతి అంటూ మాలాంటి బీఈడీ చదివిన విద్యార్థులకు ఆశపెట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుండగా మెగా డీఎస్సీ అంటూ ఏమీ వేయలేదు. గతేడాది భర్తీచేసిన డీఎస్సీ పోస్టులు సైతం గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రకటించినవే. కొత్తగా కొన్ని పోస్టులు కలిపినా, వాటిని అనర్హులు ఇచ్చి, సొమ్ముచేసుకున్నారు. డీఎస్సీ కోసం చదివిన అభ్యర్థులంతా దగా పడ్డారు. – కె.శ్రీరామ్, బీఎస్సీబీఈడీ, రాజాం -
కంపుకొట్టిన ‘గుడ్డు కూర’
సంతకవిటి: మధ్యాహ్నభోజనంలో నాణ్యత కొరవడింది. పర్యవేక్షణ లోపించింది. ఫలితం.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన కష్టాలు తప్పడం లేదు. ఇటీవల అంగన్వాడీ సెంటర్లకు పిల్లలు వచ్చిన గుడ్లును సరఫరా చేసిన విషయం మరువకముందే.. సంతకవిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుళ్లిన గుడ్లును వడ్డించే ఘటన గురువారం చోటుచేసుకుంది. కంపు కొట్టిన గుడ్డు కూరను తినేందుకు విద్యార్థులు ఇష్టపడలేదు. కూరతో పాటు అన్నంను పారబోశారు. ఇంటర్ విద్యార్థులకు గుడ్డుకూర బదులు మిక్చర్ తెప్పించినప్పటికీ చాలామంది భోజనం చేసేందుకు నిరాకరించారు. అప్పటికప్పుడు ఉప్మా తయారు చేయించి వడ్డించారు. పాఠశాల విద్యార్థులకు మరే ఇతర ఏర్పాట్లు చేయక పోవడంతో చాలామంది పస్తులున్నారు. వీరికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. తరచూ పాడైన గుడ్లునే సరఫరా చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారని విద్యార్థులు, భోజన నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఎంఈఓ 2 భాస్కరరావు స్పందిస్తూ విద్యార్థులకు వండిన గుడ్డుకూర కంపు కొట్టిందని తమ దృష్టికి వచ్చిన వెంటనే పాఠశాలను సందర్శించామన్నారు. పీడీ మొదట భోజనం చేసి కూర బాగోలేదని తెలపడంతో ఎవరికీ వడ్డించలేదన్నారు. పాడైన గుడ్లే కారణమన్న భోజన నిర్వాహకులు పస్తులతో విద్యార్థులు బిస్కెట్ ప్యాకెట్లు అందజేసిన ఉపాధ్యాయులు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉప్మా వడ్డింపు -
నేడు స్వగ్రామానికి కామన్వెల్త్ రజత విజేత రాక
● ఘనస్వాగతానికి ఏర్పాట్లు నెల్లిమర్ల రూరల్: గ్లాస్గోలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన జిల్లా క్రీడాకారుడు వల్లూరి అజయ్బాబు శుక్రవారం ఆయన స్వస్థలమైన నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి వస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన అజయ్కు అపూర్వ స్వాగతం పలికేందుకు క్రీడా సంఘాలు, గ్రామస్తులు, యువత సిద్ధమయ్యారు. సాధారణ కుటుంబం నుంచి కఠోర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదలతో ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగిన అజయ్బాబు.. కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించడం ద్వారా జిల్లా చరిత్రలో అరుదైన ఘనతను నమోదు చేశారు. దేశ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తదితర ప్రముఖుల మన్ననలు అందుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విజయనగరం ఎత్తు బ్రిడ్జి నుంచి నెల్లిమర్ల మీదుగా కొండవెలగాడ గ్రామం వరకు ర్యాలీ ఉంటుందని అజయ్బాబు తండ్రి, సీనియర్ వెయిట్లిఫ్టర్ వల్లూరి శ్రీనివాసరావు తెలిపారు. -
ఉసురు తీస్తున్న ఉపాధి
బొబ్బిలి: రాష్ట్రాలు విడిచి వచ్చి ఉపాధి కోసం బొబ్బిలిలోని గ్రోత్ సెంటర్లో పనిచేస్తున్న కార్మికులకు సౌకర్యాలు, వేతనాల కన్నా యజమానుల నిర్లక్ష్యం వల్ల వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. చుట్టుపక్కల ఎంత మంది నిరుద్యోగులున్నా గతంలో జీఓలు విడుదల చేసినప్పటికీ స్థానికులను యాజమాన్యాలు చేర్చుకోవడం లేదు. గ్రోత్ సెంటర్లో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. అదేవిధంగా వివిధ స్కిల్డ్, అన్స్కిల్డ్ తో పాటు ఉన్నతోద్యోగాలు చేసేవారు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వారైతే తక్కువ వేతనం, ప్రమాదాలు జరిగినా అంతదూరం నుంచి వచ్చి అల్లరి చేయరు. పైగా 10 గంటల నుంచి 12 గంటల వరకూ పనిచేయించుకోవచ్చు. ఏమైనా అయితే కంపెనీలకు నచ్చినంత పరిహారం ఇచ్చినా గమ్మునుంటారనే తీరు గ్రోత్సెంటర్లో నడుస్తోంది. స్థానిక గురుదత్త కంపెనీలో మంగళవారం మృతి చెందిన బికాస్ అనే యువకుడికి ఎంతో భవిష్యత్తున్నప్పటికీ చిన్నతనంలోనే ఇక్కడ జరిగిన ప్రమాదంలో మృతి చెంది కుటుంబ సభ్యులను అనాథలను చేయడంలో అధికారులు, యజమానుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. బెర్రీలో ఐదుగురు ఒకేసారి బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్లో నాలుగేళ్ల క్రితం ఇరుకు గదిలో ఉంటున్న 14 మంది గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు బీహార్కు చెందిన యువకులే కాలిన గాయాలతో మృతి చెందారు. అలాగే ఇక్కడున్నపెట్రోల్ బంకులో ముగ్గురు మృతి చెందారు. ఫర్నేస్ కాలిపోయి బాలాజీ కంపెనీలో నలుగురు మృతి చెందారు. సుమారు 12 సంవత్సరాల క్రితం సంక్రాంతి సమయంలో జరిగిన బెర్రీ కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.లక్ష చొప్పున దహన సంస్కారాలకు, పరిహారం కింద ఏడు లక్షలు చొప్పున పరిహారం ముట్టజెప్పారు. అదే గ్రోత్ సెంటర్లో ప్రమాదాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు అందించిన అత్యధిక పరిహారమంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కూడా ఎవరైనా మృతిచెందితే రూ.2లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వీరు కాక గ్రోత్ సెంటర్లోని పలు పరిశ్రమల్లో ఇప్పటివరకూ దాదాపు 20 నుంచి 30 మంది ప్రాణాలు విడిచి ఉంటారని కార్మికులే చెబుతున్నారు. గ్రోత్సెంటర్లో పరిశ్రమల కన్నా యజమానుల నిర్లక్ష్యమే అధికం తక్కువ వేతనంతో ఎక్కువ పని.. మృతి చెందితే సెటిల్మెంట్లు ఇక్కడ పనిలో బిహార్, ఎంపీ ప్రాంతాల వారురక్షణ లేదు.రక్షణ పరికరాలివ్వరు ఇక్కడి కంపెనీల్లో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతోపాటు రక్షణ పరికరాలు ఉండడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే వారు మృత్యువాత పడుతున్నారు. కంపెనీల భవనాలు కూడా నాణ్యత లేకుండా ఉంటున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ కంపెనీ గోడ కూలి మేకల పెంపకదార్లు ఇద్దరు మృతి చెందారు. కంపెనీలపై కేసులుండడం లేదు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సెటిల్మెంట్లు చేస్తున్నారే తప్ప కేసులు ఉండడం లేదు. దీని వల్ల కార్మిక శాఖ, కంపెనీల తరపున రావాల్సిన నాణ్యమైన పరిహారం ఆయా కుటుంబాలకు అందడం లేదు. పైగా మధ్యవర్తులు తలదూర్చి డబ్బులు చేతులు మారుతున్నాయి. దీని వలన ఆయా కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో వారి రక్తసంబంధీకులను ఇక్కడే దహనం చేసి కన్నీళ్లతో తిరిగి వెళ్లిపోతున్నారు. కంపెనీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సోరు సాంబయ్య, అంబేడ్కర్ పోరాట సమితి, బొబ్బిలి ఎదిరించి అడిగితే ముడుపులు ఇచ్చి కామ్ చేస్తారు గ్రోత్ సెంటర్ కార్మికులకు అసౌకర్యాలున్నాయని, భద్రత లేదని, ఇరుకు గదుల్లో పెట్టి ఉంచుతున్నారని ప్రశ్నించిన వారికి ముడుపులు ఇచ్చి కామ్ చేస్తున్నారు. ఏపీఐఐసీ ఎం.డి కాని, స్థానిక పాలకులు కాని ఏనాడైనా గ్రోత్సెంటర్లోని పరిశ్రమలు, సౌకర్యాలపై ఆరా తీశారా? ప్రెస్మీట్లు పెట్టారా? అంటే అదీ లేదు. మరి కంపెనీల యాజమాన్యాలు నిర్లక్ష్యం ఎందుకు వీడుతాయి.? పొట్నూరు శంకర రావుఅధికారులెవరూ ఉండరు గ్రోత్ సెంటర్లో పరిపాలన భవనం దాదాపు ఓ కలెక్టరేట్ను తలపిస్తుంది. కానీ ఇక్కడ అధికారులు ఎవరూ ఉండడం లేదు. ఓ కంప్యూటర్ ఆపరేటర్, వాచ్మన్ మాత్రమే ఉంటారు. వారానికో రెండు వారాలకో వచ్చే అధికారులు ఓ సారి తూతూమంత్రంగా పరిశీలించి వెళ్లిపోతున్నారు. అత్యవసరంగా అధికారుల అవసరం ఉందంటే విజయనగరం లేదా శ్రీకాకుళం వెళ్లాల్సి ఉంటుంది. -
ప్రజాచైతన్య యాత్ర
విజయనగరం గంటస్తంభం: ప్రజాసమస్యల పరిష్కారం, ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర విజయనగరం పట్టణంలో గురువారం ప్రారంభమైంది. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఫైనల్ వీధి, రాళ్లమాలపల్లి, సంజీవయ్యనగర్, బీటీఆర్ నగర్, సాయి కాలనీ, మార్క్స్నగర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పాదయాత్ర ఉద్దేశమన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ, రైతులకు చట్టబద్ధమైన కనీస మద్ధుతు ధర, ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగ యువతకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 వరకు విజయనగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికీ ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. -
మద్యంతర ఉత్తర్వులు..!
వీరఘట్టం: ఎవరేమనుకుంటే మనకేమి? మన పని జరిగిపోతే చాలని భావిస్తోంది టీడీపీ మద్యం సిండికేట్. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ను ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎకై ్సజ్శాఖ అడ్డుగోలుగా నిర్ణయం తీసుకోవడం వెనుక మద్యం సిండికేట్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఒక బార్ను వీరఘట్టం పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు అనుమతి ఇస్తూ ఎకై ్సజ్శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఎకై ్సజ్శాఖ వర్గాలే విస్తుపోయేలా ఉన్న ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నోటిఫికేషన్ లైసెన్స్ పార్వతీపురంలో.. గతంలో బార్ల ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఎకై ్సజ్ పాలసీని ప్రభుత్వం జారీ చేసింది. ఆ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మాత్రమే బార్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించింది. ఆ నిబంధనల మేరకు గతంలో పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం టెండర్లు దాఖలు చేసిన వారికి లాటరీ విధానంలో బార్ల లైసెన్సులు కేటాయించారు. ఆ విధంగా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బార్లు ఏర్పాటయ్యాయి. అయితే ఇదిలా ఉండగా..ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. నిబంధనలను తోసిరాజని వీరఘట్టానికి బదిలీ పార్వతీపురంలో ఏర్పాటు చేసిన ఒక బార్ను వీరఘట్టం పంచాయతీకి మార్చాలని టీడీపీ సిండికేట్ భావించింది. కానీ వీరఘట్టం పంచాయతీ పరిధిలో బార్ ఏర్పాటు చేసేందుకు నిబంధనలు అంగీకరించవు. ఇదే విషయాన్ని ఎకై ్సజ్శాఖ స్పష్టం చేసింది. అయినా సరే టీడీపీ సిండికేట్ రాజధాని స్థాయిలో పావులు కదిపింది. పార్వతీపురంలో ఉన్న బార్ను నిబంధనలకు విరుద్ధంగా నైనా సరే వీరఘట్టం పంచాయతీ పరిధిలోకి మార్చేందుకు ఏకంగా ఎకై ్సజ్శాఖ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసేలా కథ నడిపించింది. టీడీపీ మద్యం సిండికేట్తో కుమ్మకై ్కన ఎకై ్సజ్శాఖ ఉన్నతాధికారులు ఈ అడ్డగోలు జీఓ జారీ చేశారని ఎకై ్సజ్శాఖ వర్గాలే విమర్శిస్తున్నాయి. పంచాయతీల్లో అసాంఘిక పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు బార్లు ఏర్పాటు చేయకూడదన్నది గతంలో తీసుకున్న నిబంధన. అయినా సరే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ టీటీపీ మద్యం సిండికేట్ దోపిడీకి ప్రభుత్వం తలుపులు తెరచింది.దీనిపై వీరఘట్టం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.బార్ ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. పంచాయతీ పరిధిలోకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బార్ తరలింపు ఉత్తర్వులు జారీ చేసిన ఎకై ్సజ్ శాఖ అధికారులు బార్ ఏర్పాటును అడ్డుకుంటామంటున్న వీరఘట్టం ప్రజలు -
జిల్లాలో ఐదు సీహెచ్సీల ఏర్పాటు
● లైవ్లీ హుడ్ ప్రాజెక్టు మేనేజర్ ఎస్.రాజ్కుమార్రామభద్రపురం: జిల్లాలో రైతులకు ఉపయోగపడే విధంగా రూ.75 లక్షలతో ఐదు కస్టమ్స్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా లైవ్లీ హుడ్ ప్రాజెక్టు మేనేజర్ ఎస్.రాజ్కుమార్ అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సీహెచ్సీ షెడ్డు నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన గురువారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 27 కస్టమ్ హైరింగ్ సెంటర్లు మంజూరు కాగా మొదటి విడతలో రామభద్రపురం, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, ఎల్కోట మండలాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే ఈ సీహెచ్సీలలో రైతుల వ్యవసాయ సాగుకు అవసరమైన ట్రాక్టర్లు, రొటొవేటర్లు, పవర్ ట్రిల్లర్స్, స్ప్రేయర్స్ దమ్ము సెట్లు తదితర వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉంచుతూ ఎఫ్పీవోల ద్వారా తక్కువ ధరలకు అద్దెకు ఇవ్వనున్నారన్నారు.ఈ నెల 15 లోగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే జిల్లాలోని 117 ఎకరాల్లో మునగసాగు వేసేలా చర్యలు తీసుకుంటా మన్నారు. పెరియా కులం యూనివర్సిటీ నుంచి పీకేఎం మునగ విత్తనం తెప్పిస్తున్నామని తెలిపారు. ఈ మునగ పంట నుంచి కాయలు కాకుండా ఆకులు కోసి బాగా ఆరబెట్టి పొడి తయారు చేసి విక్రయించనున్నారన్నారు. దత్తిరాజేరు మండలంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే 5 మండలాల్లో 406 మంది రైతులతో వెదురు సాగు చేసేందుకు ఎంపిక చేశామన్నారు. మునగ, వెదురు సాగు చేసే రైతులకు వీబీజీ రామ్జీ పథకం నుంచి ఆర్థిక సాయం అందిచనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీఎం సత్యవతి పాల్గొన్నారు. -
సహజ ఆహారమే పిల్లలకు శ్రీరామరక్ష
పార్వతీపురం: పిల్లల ఆరోగ్యవంతమైన భవిష్యత్కు సహజమైన పౌష్టికాహారమే శ్రీరామ రక్ష అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ఐసీడీఎస్ సమీక్షా సమవేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బిడ్డపుట్టిన గంటలోపు ముర్రుపాలు ఇవ్వడం, రెండేళ్లవరకు తల్లిపాలు అందించడం అత్యవసరమని సూచించారు. రెండేళ్లలోపు పిల్లలకు చక్కెర, అధిక ఉప్పు, మసాలాలు, కూల్డ్రింక్స్, ప్రోపెస్ చేసిన జ్యూస్లకు దూరంగా ఉంచి పండ్లు, కూరగాయలు, సహజ ఆహారాన్ని అలవాటు చేయాలని తెలిపారు. పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపించకుండా స్వయంగా తినే అలవాటు పెంపొందించాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, సీడీపీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబ ఆదాయం రెట్టింపు లక్ష్యంగా కార్యాచరణ జిల్లాలోని ప్రతి కుటుంబం కనీసం రూ. 5లక్షల వార్షిక ఆదాయం సాదించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఒక కొత్త ఆదాయ వనరుల యూనిట్ను ఏర్పాటు చేయాలని, మహిళా సంఘాల రుణాలను ఉత్పాదక రంగాలకే వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఉచిత విద్య, వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని కుటుంబ వ్యయాలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. చిన్నపాటి అనారోగ్యాలకు ఆర్ఎంపీలను ఆశ్రయించకుండా ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సీహెచ్.ప్రభావతి, సీసీలు, వీఓఏలు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల ప్రాణాలతో చెలగాటమా?
విజయనగరం టౌన్: స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ(ఎస్ఎంఎ) టైప్–1 అనే ఒక తీవ్రమైన, జన్యుపరమైన నరాల కండరాల వ్యాధికి సంబంధించిన ఇంజక్షన్కు రూ.కోట్లలో ఖర్చుచేయాల్సి ఉంది. లక్షల్లోనే తట్టుకోలేని నిరుపేద కుటుంబాలకు కోట్లు ఖర్చు అంటే ఆశలు వదులుకోవాల్సిందే. అటువంటి వారికి పునర్విక విషయంలో ప్రపంచమంతా స్పందించడం విశేషం. తాజాగా విజయనగరం జిల్లా కేంద్రంలో పూల్బాగ్ కాలనీలో నివాసం ఉంటున్న లిటిల్ కృష్ణ అనే బాబు ఇదే వ్యాధితో బాధపడుతున్న సంగతి విదితమే. ఆ బాబును కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు తమవంతు బాధ్యతగా సాయమందించారు. ఎందరో సమాజ సేవకులు రోడ్లెక్కి డబ్బులు సేకరించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది సభ్యులుగా ఉన్న కొందరు ఇన్ప్లూయన్సర్స్ ఇదే అదునుగా తీసుకుని డబ్బులు దోచుకోవడానికి తమ ప్రణాళికను సిద్ధం చేసుకుని పని పూర్తికానిచ్చేశారు. అందుకోసం వారు బాబు తల్లిదండ్రులను సైతం మభ్యపెట్టి, డబ్బులు వచ్చే మార్గాలను, ప్రజలను నేరుగా మోసం చేసే ప్రక్రియలో సగటు మనిషిని పూర్తిగా తమ మానవత్వానికి కల్పిత కథలు జోడించి, ఆ వీడియోలను వారు అనుకున్న పథకం ప్రకారం సోషల్ మీడియోలో పోస్టులు పెడుతూ బాబు ఇంజక్షన్కు కావాల్సిన కోట్లరూపాయల టార్గెట్ను పూర్తిచేసుకున్నారు. బాబు తల్లిదండ్రుల నుంచి వాటా వసూలు ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ బాబుకు కావాల్సిన ఇంజక్షన్కు కోట్ల రూపాయలను సమకూర్చడంలో తమకు రావాల్సిన వాటాను సైతం బాబు తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేసినట్లు భోగట్టా. చెక్కుల రూపంలో, నగదు రూపంలో సుమారు రూ. 50 లక్షలపైనే గుంజేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యోపాపమంటూ ఇప్పుడిప్పుడే ప్రజల్లో మంచి పేరుతెచ్చుకుంటున్న సింగర్స్, యాక్టర్స్ సైతం వీరు చేసిన పాపాలకు నెటిజన్లకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తంతు అంతా గమనించిన విజయనగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వ్యవహారాన్ని వెలికి తీయగా అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దోచుకున్న వారంతా రోజుకో కొత్త వెర్షన్లో సమాధానాలు చెబుతుండడంతో కథ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఒక్క విజయనగరమే కాదు..ఏకంగా ఉభయ రాష్ట్రాల్లోనే ఎంతో మంది వద్ద ఇన్ఫ్లూయన్సర్స్ భారీగా దోచుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకడు బైక్ అమ్మేశానని, మరొకరు ఇల్లు, కారు అమ్మేశానని, మరికొందరు తన బంగారం సైతం అమ్మేసి డబ్బులు పంపించానని కట్టుకథలే అల్లారా ? అసలు ఏది నిజం ? చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడడం, శవాలపైన డబ్బులు ఏరుకోవడం, ఈజీమనీ సంపాదించడంలో ఇటువంటి మోసాలకు పాల్పడడం పట్ల నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎవరికై నా సాయమందించాలంటే అందులో వాస్తవమెంత ఉందో కూడా అర్థం కాని పరిస్ధితి తలెత్తింది. ఇదిలా ఉంటే తాజాగా దత్తిరాజేరు మండలానికి చెందిన ఓ ఇద్దరు దంపతులు తమ బిడ్డకు ఇంజ్షన్ కోట్లలో ఖర్చవుతుందని సాయమందించాలని కోరారు. విజయవాడలో రిషి అనే చిన్నారి ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి చిన్నారుల పరిస్ధితి ఏంటి? ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే చేపట్టాల్సిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి సమస్య పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎస్ఎమ్ఏ వ్యాధి నివారణకు రూ.కోట్లలో ఇంజక్షన్ డబ్బులు దోచుకునేందుకేనే ఇన్ప్లూయన్సర్స్ సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారిన వైనం ఎవరినీ ఉపేక్షించేది లేదు: ఎస్పీ -
ఎల్నినో ప్రభావంపై అవగాహన
● ఆత్మ సౌజన్యంతో కార్యక్రమం ● క్షేత్రస్థాయిలో వరిసాగును పరిశీలనవేపాడ: ఖరీఫ్ సీజన్పై ఎల్నినో ప్రభావం వల్ల కలిగే నష్టాలను అధిగమించేందకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై జిల్లా శాస్త్రవేత్త లక్ష్మణ్ రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ మేరకు గురువారం వేపాడ మండలంలోని చినదుంగాడలో వ్యవసాయశాఖ మండల ఏఓ స్వాతి ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా శాస్త్రవేత్త లక్ష్మణ్ రైతు శిక్షణ కేంద్రం అధికారిణి నిర్మల మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా ఉంటాయని దీనికి ప్రత్యామ్నాయంగా చోడి, కొర్ర తక్కువ నీరు అవసరం ఉన్న పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. సైంటిస్ట్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఎల్నినో వల్ల వర్షాలు లేక నారుమడి ఎక్కడైనా ఎండిపోయినట్లయితే 19.19.19ని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడి అంతా పిచికారీ చేసినట్లయితే నీటి ఎద్దడి నుంచి వరి నారును కాపాడుకోవచ్చునని వరి పంటలో స్వల్పకాలిక రకాలు వెద పద్ధతిలో సాగుచేసుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారం కూడా వర్షాలు లేకపోతే చోడి, కొర్ర లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. అలాగే పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోవడం వల్ల 6–8 టన్నుల సేంద్రియ ఎరువు భూమిలో చేరి 50% వరకు ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చునన్నారు. కొత్తవలస ఏడీఏ భానులత మాట్లాడుతూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని వరి పంటకు ఎకరాకు రూ.200 చొప్పున చెల్లిస్తే రూ.40,000 వరకు ఇన్సూరెనన్స్ కవర్ అవుతుందని, నారు వేసిన వారు, వెద పద్ధతిలో సాగు చేసిన వారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేపాడ, వీలుపర్తి, కుమ్మపల్లి వీఏఏలు వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు సామర్థ్య శిక్షణ
● 2027 నాటికి తలసరి ఆదాయం రూ.55 లక్షలకు చేరేలా కృషి చేయాలి విజయనగరం గంటస్తంభం: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు అధికారులు సమష్టిగా, చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రత్యేక కార్మదర్మి శాంతిప్రియ పాండే సూచించారు. 2027 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రణాళికా విభాగం, పాలే ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులకు గురువారం సామర్థ్యపెంపు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ), జిల్లా స్థూల ఉత్పత్తి పెంపుపై క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన అవగాహన అవసరమన్నారు. ప్రాథమిక, పారిశ్రామిక, సేవారంగాల్లో ఉత్పత్తి, పెట్టుబడులు, ఆదాయ వృద్ధిపై దృష్టి సారించి ఆర్ధికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చే దిశగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రణాళికా శాఖ డిప్యూటీ స్టాటిస్టకల్ అధికారి రమేష్, ధార్వాడ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేష్ ఉత్పత్తి, పెట్టుబడి, రాబడి తదితర ఆర్థిక అంశాలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సేఽతుమాధవన్, సీపీఓ బాలాజీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
డీఎస్సీ దగాపై నిరసన దీక్ష
డీఎస్సీ అక్రమాలకు నిరసనగా విజయనగరంలో వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు, నిరుద్యోగుల రిలే నిరాహార దీక్ష డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూ నిరుద్యోగులు కదంతొక్కారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సమరశంఖం పూరించారు. విజయనగరం జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం రిలే నిరాహార దీక్షలు ఆరంభించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేశారని, రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలకు నారా లోకేశ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రం లీకేజీ, నియామకాల్లో అవకతవకల వల్ల వేలాది మంది నిరుద్యోగుల జీవితాలు తారుమారయ్యాయని, ఎంత కష్టపడి చదివినా నిరుద్యోగులుగానే మిగిలిపోయామని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల నిరుద్యోగులకు కష్టాలు తప్పడంలేదన్నారు. జాబ్ క్యాలెండర్ లేదని, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3వేలు భృతిహామీ నెరవేర్చలేదని, విద్యార్థుల చదువులకు ఆధారమైన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం చేస్తున్నారని జెన్జీ యువత మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. చంద్రబాబు పాలనకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలకు చీపురుపల్లిలో జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖరరావు, బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, ఎస్.కోటలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, విజయనగరంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, నెల్లిమర్లలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, రాజాంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలేరాజేష్, పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపేవరకు నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. నాలుగు రోజుల పాటు చేపట్టే రిలే నిరాహార దీక్షల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చేలా జెన్–జీ యువత పోరాటం సాగించాలన్నారు. – సాక్షి నెట్వర్క్ ఉపాధ్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు డీఎస్సీ అంటే ఆంధ్రా సివిల్స్ అనేవారు. అంత కష్టపడి చదివితేనే ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుంది. అటువంటి డీఎస్సీ ఉద్యోగాలను ఈ ప్రభుత్వం హేలనచేసింది. గతంలో ఉపాధ్యాయులుగా చేరి సర్వీసులో ఉన్నవారికి టెట్ తప్పనిసరిగా రాయాలని నిబంధనలు పెట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుందని సంబరపడిన ఉపాధ్యాయులు దగా పడ్డారు. డీఎస్సీలో ఎటువంటి టెట్ లేకుండా అనర్హులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం దారుణం. ఎన్నో కోట్లరూపాయల కుంభకోణంలా అనిపిస్తోంది. తపస్సు చేసి చదివిన టీచర్ ట్రైనీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. న్యాయం జరిగేవరకూ ఈ రిలే దీక్షలు చేస్తాం. – మరిశర్ల గంగారావు, వైఎస్సార్సీపీ ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడు, రాజాం -
ఇది ప్రభుత్వ నిర్ణయం
పార్వతీపురంలో ఉన్న సీఆర్బీ వైన్స్ రెస్టారెంట్ అండ్ బార్ను వీరఘట్టంలో పెట్టుకునేందుకు బార్ యజమాని దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు మేరకు బార్ను వీరఘట్టం తరలించేందుకు అనుమతులు వచ్చాయి.ఇది ప్రభుత్వ నిర్ణయం. బార్ ఏర్పాటుకు ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. కె.సహదేవ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, పార్వతీపురం మన్యం జిల్లా బార్ ఏర్పాటు చేస్తే గొడవలు పెరుగుతాయివీరఘట్టంలో ప్రస్తుతం ఉన్న మూడు మద్యం దుకాణాల వల్ల చీకటి పడితే రోడ్లపై నిత్యం ఏదో ఒక తగాదా జరుగుతూనే ఉంది. ఆ సమయంలో మహిళలు రోడ్డుపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇక బార్ ఏర్పాటు చేస్తే మరిన్ని తగాదాలు ఏర్పడతాయి. బార్ ఏర్పాటును అడ్డుకుంటాం. వీరఘట్టం పట్టణ అభివృద్ధికి ఏదో ఒక మంచి పనిచేయండి తప్ప బార్లు ఏర్పాటు చేసి తగాదాలను పెంచవద్దు. జె.అమర్నాథ్, వీరఘట్టం -
నేడు జాతీయ చేనేత దినోత్సవం
విజయనగరం గంటస్తంభం: జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకురాలు వి.పద్మ తెలిపారు. ఉదయం 10 గంటలకు మహారాజా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ ఆడిటోరియం వరకు హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించి, అనంతరం చేనేత దినోత్సవ సభ జరపనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల ప్రదర్మనతో పాటు సీనియర్ చేనేత కార్మికులను సత్కరించనున్నామన్నారు. మై హ్యాండ్లూమ్..మై ప్రైడ్ నినాదంతో చేనేత వస్త్రాలను వినియోగించి చేనేతకు చేయూతనివ్వాలని ఆమె పిలుపునిచ్చారు. అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణ ● ఎస్సీ ఏఆర్ దామోదర్ విజయనగరం టౌన్: రహదారి భద్రత పట్ల అవగాహన, ఆచరణతోనే ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ 2026లో ఇప్పటివరకూ మోటారు వెహికల్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 20,138 ఈ–చలానాలను విధించామన్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, హెల్మెట్లను విధిగా ధరించాలని కోరారు. ప్రతిరోజూ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. భామిని: ఏనుగుల దాడిలో ఆస్తులు కోల్పోయిన బాధితులందరికీ తగిన పరిహారం అందించనున్నట్లు జిల్లా అటవీశాఖాదికారి జీఏపీ ప్రసూన గురువారం తెలిపారు. ఈ మేరకు భామిని మండలం పాలవలస గిరిజన గ్రామంలో నాలుగు ఏనుగుల దాడిలో సర్వం కోల్పోయిన గిరిజన బాధితులను ఆమె కలిసి ఓదార్చారు. నష్టాలనుంచి బయట పడడానికి నింబంధనల మేరకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ గ్రామంలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు తరలింపుపై బాధిత గిరిజనులు ఆమెకు మొర పెట్టుకున్నారు. తమ ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు వాటిల్లుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎఫ్ఓ ప్రసూన వెంట సబ్ డీఎఫ్ఓ సంజయ్ ఎల్లా, ఎఫ్ఆర్ఓ మణికంఠేష్, ఎఫ్ఎస్ఓ రామకృష్ణ, ఎఫ్బీఓ కేశవరావు, ట్రాకర్స్ ఉన్నారు. -
దుప్పాడలోని భూమి దేవదాయ శాఖదే
● ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు ● అసిస్టెంట్ కమిషనర్ శిరీష హెచ్చరికవిజయనగరం క్రైమ్: మండల పరిధిలోని దుప్పాడలో ఉన్న 4 ఎకరాల 62 సెంట్ల భూమి దేవదాయ శాఖకు చెందిందని దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శిరీష బుధవారం స్పష్టం చేశారు. సదరు భూమిని కొందరు కంచె వేసి ఆక్రమించుకున్నారని ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు రావడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీసుల సహాయంతో ఆ స్థలాన్ని నేరుగా పరిశీలించినట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ స్థలం దుప్పాడ గ్రామస్తుల సంక్షేమానికి ఉద్దేశించినదని, గ్రామస్తులు మినహా వేరెవరైనా ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణలను తొలగించి, సదరు స్థలంలో రామాలయం నిర్మించాలని దుప్పాడ గ్రామస్తులు నిర్ణయించారని.. వారి నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
10,645 హెక్టార్లకే వరి పరిమితం
విజయనగరం మండలం జొన్నవలసలో నారుమడిని ట్యాంకర్ల నీటితో తడుపుతున్న రైతులు విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ప్రధాన ఆహార పంట వరి సాగు ప్రశ్నార్ధకంగా మారింది. ఖరీఫ్ సీజన్లో సాగయ్యే పంటల్లో అధిక శాతం సాగయ్యేది వరి పంటే. ఎలినినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వరితో పాటు మిగతా పంటలు కూడా సాగయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎలినినో ప్రభావం క్రమేణ తీవ్రమవుతుండడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. వరి పంట వేయొద్దని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుండడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఆహార పంట పండించకపోతే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు రైతులు ఆ దిశగా అడుగులు వేస్తే ఆహార సంక్షోభం తప్పదని వారు పేర్కొంటున్నారు. ఎలినినో ప్రభావం అన్ని పంటల సాగుపై కనిపిస్తుంది. జిల్లాలో అధిక శాతం పంటల సాగు వర్షాధారంపైనే ఆధారపడి ఉంది. వర్షాభావం వల్ల చెరువులు, గుంతలు ఎండిపోయాయి. ఉన్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజిన్లు, ట్యాంకర్ల ద్వారా తోడయ్యేడంతో అవి కూడా ఎండిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలపై కూడా ఎలినినో ప్రభావం పడుతోంది. గతంలో కరువు పరిస్థితులు వచ్చినా ఇంత దారుణ పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు. కనీసం 40 నుంచి 50 శాతం వరకు పంటలు చేతికొచ్చేవని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని, కనీసం పది శాతం పంటలు కూడా వచ్చేలా లేవని, ముఖ్యంగా వరి పంట పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరికి ప్రత్యామ్నాయంగా 26,253 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం 6,415 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మినుము పంట 13,570 హెక్టార్లకుగాను 2,996 క్వింటాళ్ల విత్తనాలు, పెసర పంట 9,576 హెక్టార్లకుగాను 2023 కింటాళ్ల విత్తనాలు, చోటి 1161 హెక్టార్లకుగాను 83 క్వింటాళ్ల విత్తనాలు, మొక్కజొన్న 1805 హెక్టార్లకుగాను 775 క్వింటాళ్లు విత్తనాలు, వేరుశనగ 205 హెక్టార్లకుగాను 455 క్వింటాళ్లు, ఉలవ పంట 206 హెక్టార్లకుగాను 83 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం వరి సాగు చేయవద్దని చెప్పడంతో దళారులు, మిలర్లు గతంలో వారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని బ్లాక్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించడం వల్ల నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయి. బియ్యం, వంట నూనెలు, పంచదార ఇలా అన్ని ధరలు పెరిగిపోయాయి. సాంబమసూరి 25 కేజీల బస్తా కు రూ.200 నుంచి 250 వరకు పెరిగింది. రిఫైండ్ ఆయిల్ ధర రూ.190కు చేరింది. పంచదార రూ.50 దాటింది. కందిపప్పు రూ.135 నుంచి రూ.140కు చేరింది. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఎలినినో ప్రభావం నేపథ్యంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేశాం. 26,523 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. – వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారిధాన్యాన్ని బ్లాక్ చేస్తున్న మిల్లర్లు, దళారీలు జిల్లాలో వరి పంట సాగు గణనీయంగా తగ్గిపోయింది. వరి పంట సాధారణ విస్తీర్ణం 1,00,251 హెకార్లు కాగా కేవలం 10,645 హెక్టార్లకే సాగు పరిమితమైంది. ఇందులో కూడా 9787 హెక్టార్లలో వెద పద్ధతిలో సాగు చేసిందే కావడం గమనార్హం. 858 హెక్టార్లు మాత్రమే నాట్లు వేసింది. మిగిలిన పంటల పరిస్థితి కూడా అలానే ఉంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో అన్ని పంటల సాధారణ విస్తీర్ణం 1,23,608 హెక్టార్లు. ఇప్పటి వరకు సాగైంది కేవలం 24,294 హెక్టార్లు మాత్రమే. జిల్లాలో 10,645 హెక్టార్లకే వరి సాగు పరిమితం వరి సాధారణ విస్తీర్ణం 1,00,251 హెక్టార్లు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ -
యువత పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం
చీపురుపల్లి: యువత, నిరుద్యోగులకు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై యువత పక్షాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గరివిడిలోని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందన్నారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన టీడీపీ అనుయాయులకు, డబ్బులు ఇచ్చిన వారిని అడ్డగోలుగా ఉద్యోగాలకు ఎంపిక చేశారన్నారు. జిల్లాలో 10 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయని అందులో ఒక్కరికీ కూడా అర్హత లేదన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలో 14 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు, లోకేష్ ఆటలాడుకున్నారన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల వైజాగ్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను ప్రభుత్వం ఎంతగా అడ్డుకోవాలని చూసినా ఆయన వెంట వచ్చిన జన ప్రభంజనం చూస్తే 2029లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమైందన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలకు సంబంధించి విద్యా శాఖ మంత్రి లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణతో పాటు నిరుద్యోగులకు భృతి, ఫీజు రీయింబర్సుమెంట్ నిధులు విడుదల డిమాండ్లతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నాలుగు రోజులు రిలే నిరాహార దీక్షలు ద్వారా నిరసన చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఈ నెల 6న గురువారం నుంచి 9వ తేదీ వరకు రిలే నిరహార దీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతీ రోజు నియోజకవర్గ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే నిరహార దీక్షలు చేయాలన్నారు. అనంతరం ఈ నెల 10న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్, బొత్స అనూష, నియోజకవర్గ పరిశీలకులు శోభా స్వాతిరాణి తదితరులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ టీడీపీ అనుయాయులకు, డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలు నిరసనగా నేటి నుంచి నాలుగు రోజులు జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు లోకేష్ రాజీనామా చేయాలి, సీబీఐతో విచారణ జరిపించాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు
● సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రివిజయనగరం రూరల్: విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కోరుకొండ సైనిక పాఠశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి అన్నారు. పాఠశాల ఇన్వెస్టిచర్ మహోత్సవాన్ని సైనిక పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వివిధ హౌస్లకు విద్యార్థి నాయకుల నియామకాలను చేపట్టి, వారికి ర్యాంక్ బ్యాడ్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడు తూ.. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతతోనే ఉన్నత స్థాయికి చేరుకోగలమన్నారు. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచి తమ నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం పాఠశాల వార్షిక మ్యాగజైన్ ‘సైకోరియన్’ను ప్రిన్సిపాల్తో పాటు ఆయన సతీమణి రిచాశాస్త్రి ఆవిష్కరించారు. అలాగే 2025 – 26 సంవత్సరానికి ఎన్డీఏ ట్రోఫీని గజపతి హౌస్కు అందించగా, మొఘల్ హౌస్ చాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్ కాక్ హౌస్ బ్యానర్ను కై వసం చేసుకోగా, హౌస్మాస్టర్ కేవీ రవికుమార్కు ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసీ ఉద్యోగుల నిరసనవిజయనగరం క్రైమ్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో కేంద్ర ప్రభుత్వం తన వాటాలను మరింత విక్రయించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎల్ఐసీఈయూ) ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. బుధవారం స్థానిక ట్యాంక్ బండ్ రోడ్డులోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద లంచ్ అవర్లో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 30 మంది ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు శరత్కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 3న కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎల్ఐసీ ఈక్విటీలో 2.5 శాతం వాటాలను విక్రయిస్తామని ప్రకటించిందని తెలిపారు. దీని ప్రకారం మొత్తం విక్రయం విలువ 6.5 శాతానికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాలను బలోపేతం చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
కుళ్లిన కోడిగుడ్ల కలకలం!
మోడల్ స్కూల్లో● మధ్యాహ్న భోజనంలో దారుణం ● నిర్వాహకుల ఆగ్రహం ● కాంట్రాక్టర్లపై చర్యలకు డిమాండ్ విజయనగరం: పాఠశాలల్లో పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. విజయనగరంలోని పూల్బాగ్ ఏపీ మోడల్ పాఠశాలలో సరఫరా చేసిన కోడిగుడ్లు కుళ్లిపోయి ఉండటం బుధవారం తీవ్ర కలకలానికి దారితీసింది. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధం చేసిన గుడ్ల స్టాక్ను పరిశీలించగా, అందులో ఎక్కువ గుడ్లు కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నట్లు భోజన నిర్వాహకులు గుర్తించారు. ఉడకబెట్టిన తర్వాత గుడ్లు రంగు మారి, నాణ్యత లేకుండా ఉండటంతో నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న బాధ్యతారహిత కాంట్రాక్టర్లపై, పర్యవేక్షణ లోపించిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఆదాయవృద్ధికి పకడ్బందీ చర్యలు : కలెక్టర్
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ ఆదాయ సముపార్జన శాఖల అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా అధిగమించాలని స్పష్టం చేశారు. శాఖల వారీగా వసూళ్ల పురోగతిని సమీక్షించి, ఆదాయాన్ని పెంచాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రిజిస్ట్రార్ ఎస్.మోహన్రావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మణికుమార్, భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సూర్యచంద్రరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు, జీఎస్టీవో శివరావు తదితరులు పాల్గొని తమ శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయ వివరాలను కలెక్టర్కు వివరించారు. జిల్లాలో జలశక్తి అభియాన్ పథకం అమలు, వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ చాంబర్లో జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగ పరిస్థితులు, వర్షాధార భూములకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న జలశక్తి – జలహారతి పనులపై సమీక్షించారు. భూగర్భ జల మట్టాలను మరింతగా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నీటి వనరుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఉద్యాన పంటల సాగు విస్తరణకు తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వి.తారకరామారావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.శారదాదేవి, ఇరిగేషన్ ఈఈ గోవిందరావు, భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దినకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఒక మలుపు.. రెండు ప్రాణాలు
● బీచ్ రోడ్డులో ఘోర ప్రమాదం ● ఇద్దరి దుర్మరణం, మరో వ్యక్తికి గాయాలు కొమ్మాది: ఆ పేద కుటుంబంలో పిల్లలను ప్రయోజకులను చేయాలన్న ఆ తల్లి ఆశలు బీచ్రోడ్డు ప్రమాదంలో చిధ్రమయ్యాయి. స్నేహితులను కలిసి సంతోషంగా ఊరికి తిరుగుపయనమైన యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కారు డ్రైవర్ చేసిన తప్పు.. రెండు కుటుంబాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా జామికి చెందిన ఎం.పుష్పారావు, గ్రంధి సూరి బుధవారం ఉదయం విశాఖలోని మిత్రులను కలిసేందుకు వచ్చారు. రోజంతా సరదాగా గడిపి, సాయంత్రం బైక్పై స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో.. బీచ్రోడ్డు మీదుగా వెళ్తుండగా తిమ్మాపురం జంక్షన్ వద్ద నగరం వైపు నుంచి వస్తున్న రాజమండ్రికి చెందిన నాగేశ్వరరావు కారును ఒక్కసారిగా ఎడమవైపునకు తిప్పేశాడు. దాంతో వెనుక నుంచి వస్తున్న బైక్ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టి, అక్కడే ఉన్న సీసీ కెమెరా స్తంభాన్ని, ఆపై రోడ్డు దాటేందుకు నిలబడి ఉన్న కాసరపు కృష్ణవేణిపైకి దూసుకుపోయింది. ఈ దారుణ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న యువకుడు సూరి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బైక్ నడుపుతున్న పుష్పారావు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పిల్లల చదువుల కోసం వెళ్తూ.. జీవీఎంసీ 4వ వార్డు పరిధిలోని తిమ్మాపురానికి చెందిన కాసరపు కృష్ణవేణి (43) దిగువ మధ్యతరగతి గృహిణి. భర్త ధనరాజు క్యాబ్ డ్రైవర్గా పని చేస్తుండగా.. కొడుకు చాణుక్య ఐటీఐ, కూతురు మీనాక్షి 8వ తరగతి చదువుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా పిల్లలను గొప్పగా చదివించుకోవాలన్న ఆరాటంతో కృష్ణవేణి రుషికొండలోని ఒక హోటల్లో పనికి వెళుతున్నారు. బుధవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మృత్యువు బైక్ రూపంలో కబళించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కన్ను మూసింది. అమ్మ లేదని తెలిసి ఆ పిల్లలు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదానికి రాజమండ్రికి చెందిన కారు డ్రైవర్ నాగేశ్వరరావు అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై లీలాదిత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలి : జేసీ
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో చేపట్టనున్న ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ప్రభుత్వానికి సకాలంలో నివేదికలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, సర్వే, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన ప్రాజెక్టుల వారీగా భూసేకరణ పురోగతిని పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నాలుగు లైన్ల రహదారి, ఓబెరాయ్–మేఫైర్ హోటళ్ల అనుసంధాన రహదారులు, పెందుర్తి–బౌడార ఎన్హెచ్–516బి, విజయనగరం–సంబల్పూర్, కొత్తవలస – విజయనగరం రైల్వే లేన్లు, తారకరామ తీర్థసాగరం, తోటపల్లి బ్యారేజ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన భూసేకరణ స్థితిగతులను సమీక్షించారు. భూ యాజమానులకు చట్టప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, అవార్డుల ప్రక్రియ, సర్వేలు, భూ రికార్డుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, శాఖల మధ్య సమన్వయంతో పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసురావాలని సూచించారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
విజయనగరం గంటస్తంభం: పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని, తొలుత భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం భూముల రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, 22–ఎ దరఖాస్తులు, రెవెన్యూ వన్, పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారం వంటి వాటిపై సమీక్షించారు. ఆగస్టు నెలకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను మూడు రోజుల్లోగా పంపిణీ చేయాలని, సెప్టెంబరు నెలాఖరులోపు 50 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి కావాలని, ఫేజ్–3లో పెండింగ్లోని పాస్పుస్తకాల పంపిణీని కూడా వెంటనే చేపట్టాలన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించాలి.. జీవో నంబరు 444 కింద వీఆర్వో, ఎంపీడీవో లాగిన్లలో ఉన్న 22–ఎ దరఖాస్తులను ఈ నెలలోనే పరిష్కరించాలని, ఏ దరఖాస్తు పెండింగ్లో ఉండకూడదని అధికారులకు జేసీ స్పష్టంచేశారు. రెవెన్యూ వన్ స్కానింగ్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఐదో స్ధానంలో ఉందని, మిగిలిన ప్రక్రియను పూర్తి చేసి, మరింత మెరుగైన ర్యాంకు సాధించాలన్నారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలన్నారు. సమావేశానికి డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, సర్వే ఏడీ విజయ్కుమార్, ఆర్డీవోలు, తహసీల్దార్లు ఆన్లైన్లో హాజరయ్యారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తి చేయాలి అధికారులతో సమీక్ష సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్ -
నూతన పెట్టుబడుల అవకాశాలపై సెమినార్
విజయనగరం అర్బన్: స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో చాంబర్ ఆఫ్ కామర్స్, రోటరీ క్లబ్ సెంట్రల్, బీఎన్ఐ సంయుక్త ఆధ్వర్యంలో నూతన పెట్టుబడుల అవకాశాలపై సెమినార్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింబోసిస్ టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ ఒ.నరేష్కుమార్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు అవకాశాలు విస్తృతంగా ఏర్పడ్డాయన్నారు. ముఖ్యంగా విజయనగరంలో సరికొత్త పెట్టుబడులు పెట్టే వారికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అన్నారు. సరికొత్త పారిశ్రామిక టెక్నాలజీ ప్రాజెక్టులపై గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ మేనేజర్ డాక్టర్ రమాదేవి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు జి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ వరాలేవీ?
విజయనగరం గంటస్తంభం: భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఇటీవల వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాంధ్ర వాసులకు ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వెనుదిరిగారని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేయడమంటే ఇదేనా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. మంగళవారం విజయనగరానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి, కాసేపు మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చివరకు ఈ ప్రాంత ప్రజల ఆశలను నీరుగార్చిందని విమర్శించారు. భోగాపురంలో నిర్మించిన విమానాశ్రయానికి భోగాపురం పేరు కాకుండా వైజాగ్–జీఎంఆర్ పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభ ఆద్యంతం పరస్పర ప్రొగడ్తలకే పరిమితమైందన్నారు. విజయనగరం జిల్లా వాసుల మనోభావాలు దెబ్బతీయకుండా విమానాశ్రయానికి భోగాపురం పేరును కొనసాగించాలని కోరారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు.. ఉత్తరాంధ్రలో నాగావళి–వంశధార నదుల వివాదం, కొటియా గ్రామాల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, మూతపడిన పరిశ్రమలు, నిరుద్యోగం వంటి కీలక అంశాలపై ప్రధాని మోదీ స్పందించ లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు డోలీల్లో రోగులను తరలించే పరిస్థితులు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మోదీని పొగిడేందుకే కార్యక్రమం పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం దురదృష్టకరమన్నారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, నాయకులు బుగత అశోక్, అలమండ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చి ఎలాంటి హామీలు ఇవ్వలేదు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎలాంటి హామీలిస్తారోనని వేచి చూసిన వారికి తీవ్ర నిరాశ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య -
పనసవలస విద్యార్థికి గోల్డ్ మెడల్
రేగిడి: మండలంలోని పారంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి కడగల కార్తీక్కు రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్(స్వర్ణ పతకం) లభించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.సునీత ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి రన్నింగ్, షూటింగ్, స్విమ్మింగ్ విభాగాల్లో విద్యార్థి పాల్గొని, విశేష ప్రతిభ కనబరచడంతో స్వర్ణ పతకం వరించిందన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల గుజరాత్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి, ఐదో స్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులంతా సదరు విద్యార్థిని అభినందించారు. అదనపు ఎస్పీ పరిశీలన సీతానగరం: మండల కేంద్రంలోని మెయిన్రోడ్డును ఆనుకుని ఉన్న వక్కలగడ్డ సురేష్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగి బంగారు ఆభరణాలు అపహరణకు గురికాగా ఆ ఇంటిని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. చోరీ జరిగిన తీరును ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని, నిత్యం జనసంచారం ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరస్తులను సులభంగా పట్టుకోవచ్చన్నారు. ఆయన వెంట ఎస్ఐ హేమలత తదితరులు ఉన్నారు. ‘హోటల్ మేనేజ్మెంట్’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంవిజయనగరం క్రైమ్: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా టూరిజం ఇన్చార్జ్ శివరామకృష్ణ ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు సంయుక్తంగా తిరుపతిలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నట్లు స్పష్టం చేశారు. బీఎస్సీ(హెచ్హెచ్ఏ) మూడేళ్ల కోర్సుకు ఇంటర్మీడియట్లో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. క్రాఫ్ట్ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్కు ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు అందుబాటులో ఉందని, ఈ కోర్సులో ప్రవేశానికి ఎటువంటి వయోపరిమితి లేదన్నారు. ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఏపీ పర్యాటక హోటళ్లు, ఫైవ్స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు బ్యాంకు లోన్ సదుపాయం ఉంటుందని, బాలబాలికలకు వేర్వేరుగా వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తులను కళాశాలకు అందజేయాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 9701343846, 9100558006, 9700440604లను సంప్రదించాలని కోరారు. ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలి● జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్పార్వతీపురం రూరల్: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, వరినాట్లకు నీటి కొరత ఏర్పడిందని, రైతులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీ శంకర్ ఓ ప్రకటనలో మంగళవారం సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 28,883 హెక్టార్లలో వివిధ పంటల సాగు జరుగుతోందని, ప్రస్తుతం నారుమడులు సిద్ధంగా ఉన్నప్పటికీ, దమ్ము చేసి వరినాట్లు(ఉభాలు) వేయడానికి తగినంత నీరు లేదన్నారు. ఎల్నినో వల్ల ఏర్పడిన ఈ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. మెట్టు, కాలువ చివరి భూముల్లో రాగులు, కొరల్రు, మినుము, పెసర వంటి పంటలు వేసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా వివాహిత మృతి విజయనగరం టౌన్: అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన స్థానిక పట్టణంలోని కేఎల్ పురంలో మంగళవారం జరిగింది. ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి..కేఎల్ పురంలో నివాసం ఉంటున్న మేడపల్లి లావణ్య(31) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయిందని, ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. మృతురాలి భర్త వృత్తి రీత్యా దుబాయ్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తల్లి రమణి ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ ఏఎస్ఐ రామలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ప్రాణాలను నిలబెట్టే అవయవదానం : ఎస్పీ
విజయనగరం టౌన్: మనిషి ప్రాణాలను నిలబెట్టే మహోన్నతమైన దానమే అవయవదానమని ఎస్పీ ఎఆర్.దామోదర్ పేర్కొన్నారు. అవయవదానంపై రూపొందించిన వాల్పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి అవయవదానం చేయడం ద్వారా పలువురుకి పునర్జన్మ లభించే అవకాశం ఉంటుందన్నారు. మరణాంతరం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప దాతృత్వ కార్యమన్నారు. సమాజంలో అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించి, శాసీ్త్రయ అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కుటుంబం అవయవదానంపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య సిబ్బంది ఈ అంశంపై ప్రజల్లో విస్త్రత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే ప్రతి కార్యక్రమానికి పోలీస్ శాఖ పూర్తి సహకారమందిస్తుందన్నారు. కార్యక్రమంలో అఖిల భారత శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ, సంఘం జిల్లా అధ్యక్షుడు గెద్ద చిరంజీవి, సలహాదారు మమ్ముల తిరుపతిరావు, కోశాధికారి గొర్లె చిన్నమనాయుడు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ లెంక రాణికుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులకు గురవుతున్నారు..
డీఎస్సీ అమలు నాటి నుంచి కాకుండా మధ్యలో ఇలాంటి నిబంధన తెరపైకి తీసుకురావడం సరైంది కాదు. దీని వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 2011కు ముందు టెట్ అమలులో లేదు. ఉపాధ్యాయులు తప్పనిపరిగా టెట్ పరీక్ష రాసి ఉత్తర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే బాగుండేది. ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. – జేసీ రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్, బొబ్బిలి -
టీచర్లకు టెట్ కష్టాలు!
రామభద్రపురం: విద్యార్హత, వృత్తి సామర్థ్యాలను పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ఉత్తీర్ణత నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులతో పాటు టీచర్లకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టీచర్లు ప్రస్తుత సర్వీసు కొనసాగించాలన్నా.. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్ పరీక్ష తప్పకుండా రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. దీంతో ఏమి చేయాలో అర్థంకాక అయ్యవార్లు తలలు పట్టుకుంటున్నారు. ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించడంతో 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయస్సులో టెట్ రాసి ఉత్తీర్ణత ఎలా సాధిస్తామంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా కనీసం పట్టించుకోకుండా, కోర్టులో అప్పీలు చేయకుండా, టీచర్లకు టెట్ కష్టాలు తెచ్చిపెట్టిందని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సవాల్గా మారిన టెట్జిల్లాలో 12,358 మంది అభ్యర్థులు.. జిల్లాలో టెట్ అర్హత లేని ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థులు సుమారు 12,358 మంది టెట్ పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు 3 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. రోజూ రెండు సెషన్స్లో జరగనున్న టెట్ పరీక్షలను మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. -
అసంక్రమిత వ్యాధులతో బాధపడే వారిని గుర్తించండి
మక్కువ: అసంక్రమిత వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న ఎన్సీడీ సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని శంబర, మక్కువ ప్రాంతాల్లోని పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)ల్లో వైద్యారోగ్య సిబ్బందితో మంగళవారం సమావేశమైన ఆయన..వైద్యసేవలు, ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. 4డీ లక్షణాల గుర్తింపు లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆర్బీఎస్కే 2.0 స్క్రీనింగ్ పక్కాగా చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో గుండె జబ్బు, కేన్సర్, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి, తగిన చికిత్స, వైద్య సలహాలు అందేలా చూడాలన్నారు. సంచార చికిత్స శిబిరాలతో పాటు గ్రామగ్రామాన వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ఎల్.శివాజీనాయుడు, ఆర్.చంద్రశేఖర్, బి.ఫణీంద్ర, సీహెచ్వో సరోజిని తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ వసూళ్లను ముమ్మరం చేయాలి
● వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఎంఏ రవీంద్ర విజయనగరం అర్బన్: నగరంలో మున్సిపల్ రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్డీఎంఏ) రవీంద్ర అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న వారి నుంచి వసూలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. వివిధ అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పలు కీలక సూచనలు అందించారు. వీడియో కాన్ఫరెన్స్లో విజయనగరం మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, టీపీఓ అప్పలరాజు, టీపీఎస్ అనిత, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్గా సుజాత విజయనగరం గంటస్తంభం: విజయనగరం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్(ఎఫ్ఏసీ)గా టి.సుజాత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఈమె అనకాపల్లి జిల్లాలో కార్మిక శాఖ సహాయ కమిషనర్గా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా విజయనగరానికి నియమితులయ్యారు. విజయనగరం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్గా పని చేసిన ఎస్డీవీ ప్రసాదరావు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో టి.సుజాత బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శాఖ అధికారులతో సమావేశమైన ఆమె, కార్మిక సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా కృషి చేస్తామని తెలిపారు. శ్రీవారికి రూ. 5 లక్షల విరాళం రాజాం: పట్టణంలోని ఆదర్శనగర్కు చెందిన బాదం చంద్రశేఖర్ అనే భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.5 లక్షల విరాళం అందించి తన భక్తిని చాటుకున్నాడు. టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రకి ఈ విరాళాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ను టీటీడీ అధికారులు అభినందించి వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో పాటు తీర్ధ ప్రసాదాలు అందించి సత్కరించారు. ఈ విరాళంతో భక్తులకు అన్నదానం చేయాలని భక్తుడు ఈ సందర్భంగా కోరాడు. 10న ఆశా వర్కర్ల చలో కలెక్టరేట్ విజయనగరం ఫోర్ట్: ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్సు రూ.10 లక్షలు, అర్హులైన వారికి ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలంటూ ఈ నెల 10న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మహలక్ష్మి తెలిపారు. రాకోడు యూపీహెచ్సీ, అర్బన్ మెడికల్ ఆఫీసర్లకు మంగళవారం నోటీసు అందజేశారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ తదితర డిమాండ్లపై ధర్నాలో పాల్గొంటున్నట్టు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాగమ్మ, ఆదిలక్ష్మి, మంగమ్మ, అప్పయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
యువ గుండెకు ఏమైంది?
యువత గుండె అకస్మాత్తుగా ఆగిపోతోంది..దృఢంగా ఉన్న వారు సైతం కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో గుండెపోటు బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు. ఇటీవల గుండెపోటు మరణాల్లో యువత సంఖ్య అధికంగా ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానం, ఆహారపు అలవాట్లే హార్ట్ ఎటాక్కు కారణం కాగా జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకుంటే హృదయాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.విజయనగరం ఫోర్ట్: విజయనగరం మండలానికి చెందిన లక్ష్మి అనే 35 ఏళ్ల మహిళ గుండెపోటుకు గురికావడంతో బంధువులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఇదిలా ఉంటే ఇదే విజయనగరానికి చెందిన గోపి అనే 34 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటు బారినపడ్డాడు. బంధువులు అప్రమత్తమై విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వారం రోజుల పాటు చికిత్స అనంతరం డిశార్జ్ అయ్యారు. హార్ట్ఎటాక్ లక్షణాలు ఇవీ.. గుండెపోటుకు గురైన సమయంలో ఛాతిలో నొప్పి విపరీతంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా చెమట పడుతుంది. వాంతులు వచ్చే భావన కలుగుతుంది. ఒక్కోసారి వాంతి కూడా అవుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. కాళ్లూ చేతులు చల్లబడతాయి. గుండె ఆగి ఆగి కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా ఏదో బరువు ఛాతిపై పెట్టినట్లు అనిపిస్తున్నా..శ్వాస ఆడడానికి ఇబ్బందిగా ఉన్నా అది గుండెపోటు సూచనగానే భావించాలి. ఛాతిలో వచ్చిన నొప్పి.. ఎడమ చేయి భుజంలోకి పాకుతున్నా, విపరీతంగా చెమట వస్తున్నా హార్ట్ ఎటాక్గానే అనుమానించాలి. కింద దవడ నుంచి బొడ్డు వరకు ఎక్కడ నొప్పి అనిపించినా గుండెజబ్బుగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. గుండెపోటుకు గురవుతున్న యువత పెరుగుతున్న ఆకస్మిక మరణాలు జీవనశైలిలో స్వల్ప మార్పులతో హృదయం పదిలం: వైద్య నిపుణులు అంతా 25 నుంచి 35 ఏళ్లలోపు వారే.. జిల్లాలో తక్కువ వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు గుండెపోటుకు గురియ్యేవారు. ప్రస్తుతం 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అధికంగా గుండె జబ్బుల బారినపడుతున్నారు. గతంలో పౌష్టికాహార విలువలు ఉన్న ఆహారాన్ని తినేవారు. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్కు అలవాటు పడుతున్నారు. ఫలితంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగి హార్ట్ ఎటాక్(గుండెపోటు)కు గురవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. -
డీఎస్సీలో అక్రమాలపై సమరభేరి
విజయనగరం: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అక్రమాలపై బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహిస్తామని, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ఉద్ఘాటించారు. తన నివాసంలో పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ నియామకాల్లో యువతకు జరిగిన అన్యాయంపై మంగళవారం నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఏపీ జెన్ జీ వార్ పేరిట చేపట్టబోయే నిరసన కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. ఈ మేరకు విజయనగరం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోలగట్ల వీరభధ్రస్వామి మాట్లాడుతూ బాధ్యత గల ప్రతిపక్షంగా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దురాగత పాలనలో యువతకు జరిగిన అన్యాయంపై ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు విజయనగరం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించి కష్టపడి చదివిన నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 6వ తేదీన నియోజకవర్గ యువజన, విద్యార్థి విభాగాల సారధ్యంలో, 7న మహిళా విభాగం సారధ్యంలో, 8న నగర పార్టీ/అనుబంధ విభాగాల సారధ్యంలో, 9న మండల పార్టీ సారధ్యంలో రిలే దీక్షలు జరుగుతాయని వెల్లడించారు. 10వ తేదీన నియోజకవర్గ స్థాయిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి అధిక సంఖ్యలో భాగస్వాములను చేయటం ద్వారా విజయవంతం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ శ్రేణులపై ఉందని సూచించారు. హమీల అమలుపై ప్రమాణం చేయగలరా..? ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హమీలు 100 శాతం అమలు చేశామంటూ శాసనసభ సాక్షిగా చేస్తున్న ప్రకటనలపై కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేయాలని కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించిన ప్రభుత్వం అరాచకాలు, అవినీతికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ఏం చేయకున్నా.. అన్నీ తామే చేశామంటూ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసగించటం దుర్మార్గమమన్నారు. ప్రభుత్వం చేస్తున్న చేష్టలపై ప్రజల్లో సందర్భం వచ్చినపుడు చర్చించి వారిని చైతన్యవంతులను చేయాలని కోరారు. సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, మాజీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టి వీరవెంకట రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు కెల్ల త్రినాధరావు, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, జిల్లా పెన్షనర్లు, ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డోలా మన్మధకుమార్ పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అవకతవకలపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలి 6 నుంచి 9 వరకు నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు 10న విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి -
మాజీ సీఎం జగన్ను కలిసిన ఎమ్మెల్సీ విక్రాంత్
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాలకొండకు చెందిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్..తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. – పాలకొండ రూరల్ నకిలీ వైజాగ్ టీఎంటీపై హెచ్చరికవిజయనగరం: వైజాగ్ టీఎంటీ పేరుతో మార్కెట్లో నకిలీ, నాసిరకం టీఎంటీ రీబార్లు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విశాఖ ఉక్కు కర్మాగారం(ఆర్ఐఎన్ఎల్) వెల్లడించింది. గృహ నిర్మాణదారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు అసలైన వైజాగ్ టీఎంటీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది. నాసిరకం ఉక్కు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండకపోవడంతో భవనాల భద్రత, బలం, మన్నికపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రతి అసలైన రీబార్పై వైజాగ్ టీఎంటీ బ్రాండింగ్తో పాటు ఆర్ఐఎన్ఎల్ గుర్తు స్పష్టంగా ఉంటుందని, కొనుగోలు సమయంలో వాటిని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఉత్పత్తి అసలు ధనంపై సందేహాలుంటే సమీప ఆర్ఐఎన్ఎల్ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. ప్రజల భద్రత దృష్ట్యా నకిలీ ఉత్పత్తులకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. -
బ్లేడ్తో గొంతు కోసుకొని..
● వంగర పోలీస్స్టేషన్ వద్ద తలగాం వాసి ఆత్మహత్యాయత్నంవంగర: స్థానిక పోలీస్స్టేషన్ వద్ద తలగాం గ్రామానికి చెందిన కిమిడి సునీల్ గొంతు కోసుకొని మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎస్ఐ షేక్ శంకర్ తెలిపిన వివరాలిలా.. కొన్నాళ్ల క్రితం సునీల్ ఎం.సీతారాంపురానికి చెందిన శ్రీలతను వివాహం చేసుకున్నాడు. భర్త సునీల్, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని శ్రీలత వంగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త సునీల్తో పాటు ఆమె అత్తమామలపై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఇరువర్గాలను మంగళవారం పోలీస్స్టేషన్కు పిలిపించగా ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇస్తుండగా ఈ కేసులో పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారంటూ స్టేషన్లోనే సునీల్ బ్లేడుతో గొంతు, చేయి భాగం కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు అతడిని రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల తాళ లేకనే సునీల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు బంధువుల ఆరోపణ. -
రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటండి
విజయనగరం అర్బన్: రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ‘ది నేషనల్ స్కూల్’కు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికై నట్లు ఆ పాఠశాల కరెస్పాడెంట్ బి.రామారావు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి జావెలిన్ త్రో పోటీల్లో పదో తరగతి విద్యార్థి ఎస్.అఖిల్ ప్రథమ స్థానంలో, అదే తరగతికి చెందిన కె.గౌతమ్ 600 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి సత్తా చాటారు. దీంతో వారిద్దరూ ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘ది నేషనల్ స్కూల్’ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ బి.రామారావు, డైరెక్టర్ డాక్టర్ ఎంవీఎన్ వెంకటరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, ఎల్.మహేష్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి, తమకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ‘ది నేషనల్ స్కూల్’ విద్యార్థులు ఆగస్టు 11 నుంచి తిరుపతిలో జరిగే పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం -
ఆయన కచ్చితంగా వైఎస్ జగన్ను పొగుడుతారు!
భోగాపురం విమానాశ్రయం పనులు ఎవరు ప్రారంభించారు.. ఎవరు మొదలెట్టారు.. ఎవరి హయాంలో ఎక్కువ పనులు అయ్యాయనేది లోకవిదితం. చంద్రబాబు ఆ ప్రాజెక్టును కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే వాడుకోవడం, ఎలాంటి పాలనాపరమైన అనుమతులు, పర్యావరణ, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే 2019 ఎన్నికల ముందు కేవలం ఓట్లకోసమే శంకుస్థాపన చేసేసిన ఘటన అందరికీ తెలిసిందే.ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును జెట్ వేగంతో పరుగులెత్తించి కోవిడ్ వంటి విపత్తు సమయంలో సైతం పనులు వేగవంతంగా పూర్తిచేసిన విషయం అందరికీ గుర్తున్నదే. అయితే, విమానాశ్రయం ప్రారంభ కార్యక్రమంలో ఆ శాఖకు సంబంధం లేని పవన్కల్యాణ్, లోకేశ్ వంటివారు వేదికమీద ప్రసంగించారు. కానీ... దాదాపు రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న సంస్థ ప్రమోటర్ గ్రంథి మల్లికార్జునరావు (జీఎమ్మార్)కు మాత్రం మైక్ ఇవ్వలేదు. ఆయనతో పాటు సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు వేదికమీద ఉన్నారే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాము ఎలాంటి శ్రమపడ్డారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందింది వంటి కొన్ని పాయింట్లు అయినా వారు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సజ్జన్ జిందాల్ ఏమన్నారో గుర్తొచ్చిందా? వాస్తవానికి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో జీఎమ్మార్ మాట్లాడుతూ.. గతంలో తాము వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించామని, నేడు భోగాపురం ప్రాజెక్టు చేపట్టామని, తండ్రీకొడుకుల సారథ్యంలో పనిచేయడం తమకు గర్వకారణమని చెప్పారు. దాంతో బాటు ఈ ప్రాజెక్టుకు బాగా సహకారం అందించి, కోర్టు కేసులు క్లియర్ చేసి, పలు పాలనాపరమైన అనుమతులు తెచ్చి పనులకు ఒక రూపు ఇచ్చింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వ అనేది అందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఒప్పుకున్నారు. దాదాపు 86 శాతం పనులు అప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం పాత్ర ఇందులో కొద్దిగానే ఉందన్నది అందరూ బయటకు చెప్పకపోయినా లోలోన అంగీకరిస్తున్న అంశం అన్నమాట. ఇక కడప జిందాల్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నాటి వైఎస్ జగన్ సర్కారు భూసేకరణ, పలు అనుమతులు తీసుకొచ్చి సజ్జన్ జిందాల్, వైఎస్ జగన్ కలిపి దానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారిపోగానే చంద్రబాబు ఆ ప్రాజెక్టును వివాదాస్పదం చేశారు. అయితే, మళ్లీ తామే ఆ సంస్థను ఉద్దరిస్తున్నట్లు రెండోసారి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా సజ్జన్ జిందాల్ ట్విట్టర్లో పెట్టిన పోస్టు సంచలనం అయ్యింది. మీరిచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొదలైంది అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ అయన ట్విట్టర్లో చేసిన పోస్టు అందరూ చూసి ఓహో.. ఇదంతా వైఎస్ జగన్ కాలంలోనే ఒక రూపు వచ్చిన ప్రాజెక్టా.. దానికి మళ్లీ చంద్రబాబు ఇప్పుడు బాకా ఊదుకుంటున్నారా అని అర్థం చేసుకున్నారు. పరువు పోతుందని... కడప స్టీల్ ప్లాంట్ సందర్భాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు... ఇప్పుడు మళ్లీ జీఎమ్మార్ కూడా విమానాశ్రయ వేదికపై వైఎస్ జగన్ను పొగిడితే, అయన కాలంలోనే పనులన్నీ పూర్తయ్యాయని ప్రధాని సమక్షంలో వేదిక మీద చెబితే తమ పరువు దేశవ్యాప్తంగా పోతుందేమోఅని భయపడి ఏకంగా జీఎమ్మార్ను మాట్లాడకుండా, మైక్ ఇవ్వకుండా అడ్డుకున్నారని అంటున్నారు. లేకుంటే సంస్థ ప్రమోటర్ కనీసం రెండు ముక్కలైనా మాట్లాడకుండా ఎలా?.. కేవలం తానుచేయని పనులకు.. తన పాత్ర తక్కువే అయినా ప్రచారం ఎక్కువ చేసుకుంటున్న చంద్రబాబు తన పరువు పోకుండా ఉండేందుకే జీఎమ్మార్కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రజలు అంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: -
వినతుల పరిష్కారంలో జాప్యం తగదు
● పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో 189 వినతుల స్వీకరణవిజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 189 వినతులు స్వీకరించారు. ఇందులో 78 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రతి వినతిని నిర్దేశిత గడువులో పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రాధాన్యంతో విచారణ చేసి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలతో మాట్లాడిన తర్వాతే నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికల్లో నమోదు చేయాలని సూచించారు. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి భూ వివాదాలు, సర్వే సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నందున క్షేత్రస్ధాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. పీజీఆర్ఎస్ పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిరంతరం సమీక్షించాలని సూచించారు. 1100 ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు రాష్ట్ర ప్రభుత్వ 1100 టోల్ఫ్రీ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రజల్లో ఈ సేవలపై మరింత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. శాఖల వారీగా వినతులు పంచాయతీరాజ్–30, డీఆర్డీఏ– 18, గ్రామ సచివాలయ శాఖ– 15, విద్య–13, ఇతర శాఖలు–12, విద్యుత్–9, మున్సిపల్–8, వైద్య ఆరోగ్య శాఖ–5, డీసీహెచ్ఎస్–1. చట్టపరిధిలో సత్వరన్యాయం: 21 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ దామోదర్ విజయనగరం టౌన్: చట్టపరిధిలో బాధితులకు సత్వరన్యాయం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ అహర్నిశలూ శ్రమిస్తుందని, బాధితులెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా 21 మంది బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను శ్రద్ధగా విని వాటికి సంబంధించిన అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. తమ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సమస్యలను పూర్తిగా విని, వాటి పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
రేకుల షెడ్.. మట్టి గచ్చు...
ఈ చిత్రం చూశారా.. ఇది సాలూరు మండలం పట్టుచెన్నూరు పంచాయతీ నిమ్మలపాడు ప్రాథమిక పాఠశాల. ఈ చిన్న రేకుల షెడ్డే పాఠశాల పక్కా భవనం. తుడిచిన నేలే చిన్నారులకు టైల్స్ గచ్చు. ఇక్కడే ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు విద్యాబోధన. సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గిరిజన పిల్లల చదువు కష్టాలకు ఈ చిత్రమే సజీవసాక్ష్యం. ప్రధాని మోదీ మెప్పుకోసం గిరిజన పిల్లలను మండే ఎండలో థింసా నృత్యం చేయించి సంబరపడిపోయే పాలకులు... పిల్లల చదువు కష్టాలపై దృష్టిసారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – సాలూరు రూరల్ -
పోగొట్టుకున్న బంగారం అప్పగింత
రాజాం సిటీ: ఏమరపాటుగా ఉన్న ప్రయాణికులను టార్గెట్గాచేసుకుని చోరీకి పాల్పడిన నిందితులను రాజాం పోలీసులు పట్టుకున్నారు. ఐదు నెలల క్రితం చీపురుపల్లి నుంచి రాజాం మీదుగా స్వగ్రామానికి ఆటోలో ప్రయాణిస్తున్న భార్యాభర్తల దగ్గర బంగారు నగలు చోరీచేసి పరారైన వారిని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకుని సంబంధిత బాధితులకు సోమవారం బంగారం అప్పగించారు. ఇందుకు సంబంధించిన టౌన్ సీఐ డి.నవీన్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం మండలం సతివాడ గ్రామానికి చెందిన మరిశర్ల భాగ్యలక్ష్మి, భర్త సూర్యనారాయణలు ఈ ఏడాది మార్చి 3న సికింద్రాబాద్ నుంచి రైలులో వస్తూ చీపురుపల్లిలో దిగారు. అక్కడి నుంచి రాజాం మీదుగా స్వగ్రామం వెళ్లేందుకు ఆటో ఎక్కారు. రాజాం చేరుకుని ఆటో దిగి వారితో తీసుకువచ్చిన బ్యాగును చూసుకున్నారు. అందులో ఉన్న ఆరు తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి సీసీ పుటేజీలను పరిశీలించి నిందితులను ఉత్తరప్రదేశ్కు చెందిన మెహర్వాన్ ఆలీ, ఇర్షాద్ ఆలీగా గుర్తించారు. రాజాం ఎస్సై మహ్మద్ సల్మాన్ బేగ్, విజయనగరం సీసీఎస్ బృందంతో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్లి నిందితులను అరెస్టుచేసి వారి నుంచి బంగారునగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత బాధితులకు సోమవారం బంగారం నగలను అప్పగించామని సీఐ తెలిపారు. -
నారు ఎండిపోతున్నా పట్టించుకోరా?
● మడ్డువలస ప్రాజెక్టు అధికారులను నిలదీసిన రైతులు ● ఎండుతున్న నారుమడిని చూపించి ఆవేదన సంతకవిటి: మడ్డువలస ప్రధాన కాలువ పరిధి సంతకవిటి మండలంలో దాదాపు 11 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.. ప్రధాన కాలువ నుంచి సోమన్నపేట వద్ద ఉన్న 24 ఎల్ కాలువకు చుక్కనీరు రావడం లేదు.. వరి నారు ఎండిపోతున్నా పట్టించుకోరా అంటూ శ్రీహరినాయుడుపేట, ఎస్.అగ్రహారం గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. వాస్తవ పరిస్థితిని మడ్డువలస ఈఈ బి.గోవిందరావు, డీఈఈ పి.రవికుమార్, ఏఈఈ బి.కోటేశ్వరరావుకు సోమవారం చూపించారు. కాలువకు నీరు విడిచిపెట్టి 11 రోజులైనా పొలాలకు చేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గండేటి కేసరి, వైఎస్సా ర్సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు దా సరి దాలినాయుడు అధికారులకు తెలియజేశారు. దీనిపై వారు స్పందిస్తూ మంగళవారం నాటికి శ్రీహరినాయుడుపేట, ఎస్.అగ్రహారం భూములకు నీ రందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
వాస్తవాలు చెబుతారన్న భయమా?
● ఎయిర్పోర్టు వేదికపై జీఎంఆర్కు మాట్లాడే అవకాశం కట్ ● ఆయన వాస్తవాలు చెబితే చంద్రబాబు పరువు పోతుందన్న భయం ● వై.ఎస్.జగన్ను పొగుడుతారన్న అనుమానం? ● నిర్మాణ శ్రమ వివరించేందుకు రాని అవకాశం సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం విమానాశ్రయం పనులు ఎవరు ప్రారంభించారు.. ఎవరు మొదలెట్టారు.. ఎవరి హయాంలో ఎక్కువ పనులు అయ్యాయనేది లోకవిదితం. చంద్రబాబు ఆ ప్రాజెక్టును కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే వాడుకోవడం, ఎలాంటి పాలనాపరమైన అనుమతులు, పర్యావరణ, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే 2019 ఎన్నికల ముందు కేవలం ఓట్లకోసమే శంకుస్థాపన చేసేసిన ఘటన అందరికీ తెలిసిందే. ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును జెట్ వేగంతో పరుగులెత్తించి కోవిడ్ వంటి విపత్తు సమయంలో సైతం పనులు వేగవంతంగా పూర్తిచేసిన విషయం అందరికీ గుర్తున్నదే. అయితే, విమానాశ్రయం ప్రారంభ కార్యక్రమంలో ఆ శాఖకు సంబంధం లేని పవన్కల్యాణ్, లోకేశ్ వంటివారు వేదికమీద ప్రసంగించారు. కానీ... దాదాపు రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న సంస్థ ప్రమోటర్ గ్రంథి మల్లికార్జునరావు (జీఎమ్మార్)కు మాత్రం మైక్ ఇవ్వలేదు. ఆయనతో పాటు సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు వేదికమీద ఉన్నారే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాము ఎలాంటి శ్రమపడ్డారు.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందింది వంటి కొన్ని పాయింట్లు అయినా వారు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సజ్జన్ జిందాల్ ఏమన్నారో గుర్తొచ్చిందా? వాస్తవానికి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో జీఎమ్మార్ మాట్లాడుతూ.. గతంలో తాము వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించామని, నేడు భోగాపురం ప్రాజెక్టు చేపట్టామని, తండ్రీకొడుకుల సారథ్యంలో పనిచేయడం తమకు గర్వకారణమని చెప్పారు. దాంతో బాటు ఈ ప్రాజెక్టుకు బాగా సహకారం అందించి, కోర్టు కేసులు క్లియర్ చేసి, పలు పాలనాపరమైన అనుమతులు తెచ్చి పనులకు ఒక రూపు ఇచ్చింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వ అనేది అందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఒప్పుకున్నారు. దాదాపు 86 శాతం పనులు అప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. అంటే కూటమి ప్రభుత్వం పాత్ర ఇందులో కొద్దిగానే ఉందన్నది అందరూ బయటకు చెప్పకపోయినా లోలోన అంగీకరిస్తున్న అంశం అన్నమాట. ఇక కడప జిందాల్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నాటి వైఎస్ జగన్ సర్కారు భూసేకరణ, పలు అనుమతులు తీసుకొచ్చి సజ్జన్ జిందాల్, వైఎస్ జగన్ కలిపి దానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారిపోగానే చంద్రబాబు ఆ ప్రాజెక్టును వివాదాస్పదం చేశారు. అయితే, మళ్లీ తామే ఆ సంస్థను ఉద్దరిస్తున్నట్లు రెండోసారి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా సజ్జన్ జిందాల్ ట్విట్టర్లో పెట్టిన పోస్టు సంచలనం అయ్యింది. మీరిచ్చిన సహకారం, ప్రోత్సాహంతోనే కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొదలైంది అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ అయన ట్విట్టర్లో చేసిన పోస్టు అందరూ చూసి ఓహో.. ఇదంతా వైఎస్ జగన్ కాలంలోనే ఒక రూపు వచ్చిన ప్రాజెక్టా.. దానికి మళ్లీ చంద్రబాబు ఇప్పుడు బాకా ఊదుకుంటున్నారా అని అర్థం చేసుకున్నారు. పరువు పోతుందని... కడప స్టీల్ ప్లాంట్ సందర్భాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు... ఇప్పుడు మళ్లీ జీఎమ్మార్ కూడా విమానాశ్రయ వేదికపై వైఎస్ జగన్ను పొగిడితే, అయన కాలంలోనే పనులన్నీ పూర్తయ్యాయని ప్రధాని సమక్షంలో వేదిక మీద చెబితే తమ పరువు దేశవ్యాప్తంగా పోతుందేమోఅని భయపడి ఏకంగా జీఎమ్మార్ను మాట్లాడకుండా, మైక్ ఇవ్వకుండా అడ్డుకున్నారని అంటున్నారు. లేకుంటే సంస్థ ప్రమోటర్ కనీసం రెండు ముక్కలైనా మాట్లాడకుండా ఎలా?.. కేవలం తానుచేయని పనులకు.. తన పాత్ర తక్కువే అయినా ప్రచారం ఎక్కువ చేసుకుంటున్న చంద్రబాబు తన పరువు పోకుండా ఉండేందుకే జీఎమ్మార్కు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ప్రజలు అంటున్నారు. -
అలసత్వం వద్దు
ప్రజా సమస్యల పరిష్కారంలో పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఫిర్యాదును బాధ్యతగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. ఈ మే రకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రత్యేక ఉపకలెక్టర్ డి.వెంకటేశ్వరరావు, ఎస్డీసీ డి. ధర్మరాజులతో కలిసి మొత్తం 69 వినతులను స్వీకరించారు. వాటిలో 16 రెవెన్యూకు సంబంధించినవి కాగా 53 ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి అర్జీ వెనుక ఒక కుటుంబం ఆశలు ఉంటాయని గుర్తుంచుకుని, సాంకేతిక కారణాలతో కేసులను మూసివేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, ఫిర్యాదుదారు సంతృప్తి చెందిన తరువాతే పీజీఆర్ఎస్ పోర్టల్లో పరిష్కరించినట్లు నమోదు చేయాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారుల పనితీరుపై జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. రోడ్డు నాణ్యత, రైతుభరోసా, విద్యుత్ బిల్లు, గోకులం షెడ్ల బకాయిలు, భూ ఆక్రమణలు, పట్టాదారు పాస్పుస్తకాలు, భూ వివాదాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. గడువులోగా ఫిర్యాదుల పరిష్కారం: ఎస్పీ పార్వతీపురం రూరల్: ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్) ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను చట్టపరిధిలో, నిర్దిష్ట గడువులోగా సత్వరమే పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి ముఖాముఖి మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ..అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదుల్లోని వాస్తవాలను విచారణ చేసి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై శిరీష, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 15 వినతులు సీతంపేట: ప్రతి వారం పీజీఆర్ఎస్కు వచ్చే సమస్యలు తక్షణం పరిష్కరించాలని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐటీడీఏలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఇచ్చిన వినతులు ఎంతవరకు పరిష్కారమయ్యాయనేది వారికి ఫోన్ చేసి అడగాలన్నారు. క్యూఆర్ కోడ్ కూడా ప్రారంభించామన్నారు. అనంతరం మొత్తం 15 వినతులు స్వీకరించారు. కుక్ ఉద్యోగం నుంచి అటెండర్ ఉద్యోగానికి ప్రమోట్ చేయాలని ఎస్ఎస్ మణుగుకు చెందిన కె.శ్రీరాములు కోరాడు. మర్రిపాడు, పూతికవలస రహదారి మరమ్మతులు చేయాలని, బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని పత్తిక కుమార్ వినతిపత్రం అందజేశాడు. పవర్టిల్లర్లు ఇప్పించాలని పెద్దగూడకు చెందిన సవర సాంబయ్య, సుక్కయ్యలు కోరారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, డీపీఎం ఎం.వి.రమణ, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానందం తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్టు ప్రారంభం రాజకీయ ఆర్భాటమే
విజయనగరం గంటస్తంభం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచార వేదికగా మార్చిందని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. రైతుల భూములతో నిర్మించిన విమానాశ్రయానికి విజయనగరం జిల్లా పేరు పెట్టకుండా విశాఖపట్నం పేరు పెట్టడం అన్యాయమన్నారు. నిర్వాసిత రైతులకు పూర్తి పరిహారం, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కల్పించలేదని ఆరోపించారు. ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించి భారీగా ప్రజాధనం ఖర్చు చేయడం అధికార దుర్వినియోగమన్నారు. ఉపాధి కల్పన, స్ధానిక యువతకు ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో సీపీఎం నాయకులు రెడ్డి శంకరరావు, టీవీ రమణ పాల్గొన్నారు. -
డీఎస్సీలో దగాపై సీబీఐతో నిగ్గు తేల్చాలి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డికి కలెక్టరేట్లో సోమవారం వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని రూ.75 వేల పెండింగ్ బకాయిలతో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి తలే రాజేష్, నియోజకవర్గ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, కె.వి.సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడుబాబు, శోభా స్వాతిరాణి, సిరిపురపు జగన్మోహన్రావు, జిల్లా ప్రధాన కార్యదర్ములు ఇప్పలి అనంత్, శంబంగి వేణుగోపాల్ నాయుడు, గొర్లి రవికుమార్, జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ పీరుబండి జైహింద్కుమార్, యువ నాయకుడు కౌశిక్తో పాటు వైఎస్సార్సీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. డీఎస్సీలో భారీ అక్రమాలు కూటమి ప్రభుత్వం డీఎస్సీ నియామాకాల్లో భారీ అక్రమాలకు పాల్పడింది. టెట్ పరీక్ష రాయని వారికి స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిగాయి. విజయనగరం జిల్లాలోనే పది మందికి అర్హతులు లేకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు వెలుగులోకి వస్తాయి. రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. రెండున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి ఊసేలేదు. నిరుద్యోగ యువతను మోసం చేశారు. దీనిపై ఈనెల 6నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తాం. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అభ్యర్థులకు న్యాయం జరగాల్సిందే... డీఎస్సీ అక్రమాల కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కష్టపడి పరీక్షలు రాసిన అఽభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల అన్యాయానికి గురవుతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. – కోటగట్ల వీరభద్రస్వామి, మాజీ డిప్యూటీ స్పీకర్ డీఎస్సీ అక్రమాలకు మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహించాలి ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు చెల్లించాలి సీబీఐ విచారణ కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్సీపీ నేతలు -
కరువు ముప్పు..!
కనుచూపు మేరలో..బొబ్బిలి: జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో ఏటా వరి సాగు కావాల్సి ఉంది. ఈ ఏడాది దాదాపు 30 శాతం కూడా ఉభాలు కాలేదు.వరి నారు వేసిన 21 రోజుల్లో నాట్లు వేసుకోవాల్సి ఉన్నా ఇప్పటికే చాలా చోట్ల 35 నుంచి 40 రోజులుగా వరి నారు ముదిరి పోతోంది. కాలువలు, బావుల్లో నీరు ఇంకిపోతోంది. వరి నారును కొంతమంది మళ్లీ వేసుకున్నారు. అదీ పనికి వచ్చేలా లేదు. కరువు పొంచి ఉంది. రెండు నెలలుగా రైతులు వర్షం కోసం కంటిమీద కునుకులేకుండా ఎదురు చూస్తున్నారు. అల్పపీడనాలు, వాయుగుండాలు వచ్చి వెళ్లిపోతున్నాయే తప్ప చుక్క నీరు రాల్చడం లేదు. ఇటీవల వచ్చిన తుఫాన్ వర్షాలు కూడా అంతే. రెండు రోజులు మేఘావృతమై పూలజల్లులు కురవడం, మరుసటి రోజంతా మాడు పగిలే ఎండలుకాయడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. జిల్లా సగటు వర్షపాతం తక్కువగా నమోదవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తరిగిపోతున్నాయి. రైతులను ఆదుకుని కరువునుంచి గట్టెక్కించే చర్యలుతీసుకోవాలి కానీ అదిశగా కనీసం అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.జిల్లాలో గడిచిన రెండునెలల్లో వర్షపాతం వివరాలు(మి.మీలలో) నెల సాధారణ కురిసిన జూన్ 123.5 96.3జూలై 100.5 41.9 బోర్ల వద్ద ఎండుతున్న వరిపైరు వీఆర్ఎస్, పాల్తేరు చానళ్లలో కానరాని సాగునీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ప్రభుత్వం ఆగస్టు వచ్చేసినా 30శాతం కూడా పడని వరినాట్లు -
ఏడు నెలల్లో 405 కేసులు
● భయపెడుతున్న మలేరియా ● జూలైలో అత్యధికంగా 229 కేసుల నమోదు ● ఆందోళనలో జనం ● భయపెడుతున్న మలేరియా ● జూలైలో అత్యధికంగా 229 కేసుల నమోదు ● ఆందోళనలో జనం విజయనగరం ఫోర్ట్: జిల్లా ప్రజలపై మలేరియా పంజా విసురు తోంది. అస్వస్థతకు గురిచేసి మంచం పట్టిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో అధికంగా వ్యాప్తిచెందే మలే రియా జ్వరాలు ఇప్పుడు మైదాన ప్రాంత ప్రజలను సైతం కలవరపెడుతున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాగా ఉన్నప్పుడు 8 మండలాల్లో గిరిజన ప్రాంతం విస్తరించి ఉండేది. ఇప్పుడు గంట్యాడ, ఎస్.కోట, మెంటాడ మండలంలోని కొన్ని గ్రామా ల్లో మాత్రమే గిరిజన ప్రాంతం ఉంది. అయినప్పటికీ మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కావడం ఇటు ప్రజలు, అటు వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. పారిశుద్ధ్యలోపం, రోజుల తరబడి మురునీరు నిల్వ ఉండడం, కలుషిత నీటి సరఫరా వంటివి జ్వరాల వ్యాప్తికి కారణాలుగా కనిపిస్తున్నాయి. పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జేబులకు చిల్లు.. సాధారణంగా వైరల్ జ్వరం అయితే రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుంది. మలేరియా జ్వరం వారం నుంచి 10 రోజుల వరకు తగ్గడం లేదు. కొంతమందికి అయితే 15 నుంచి 20 రోజులు పడుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో అయితే రోగులకు ఉచితంగా వైద్యం అందుతుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే రోగులకు వైద్యఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. మలేరియా చికిత్సకు కొన్ని ఆస్పత్రుల్లో రూ.20 వేలు నుంచి రూ.30 వేలు వరకు తీసుకుంటున్నారు. మరికొన్ని ఆస్పత్రుల్లో రూ.30 వేలు నుంచి రూ.40 వేలు వరకు తీసుకుంటున్నారు. వెంటిలేటర్పై చికిత్స అవసరం అయితే రూ.లక్షల్లో బిల్లు చెల్లించాల్సి వస్తోంది. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం నెలవారీగా మలేరియా కేసుల వివరాలు... మలేరియా కేసుల సంఖ్య సీజనల్ వ్యాధుల వ్యాప్తి జూలై నుంచి ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది జనవరి నెల నుంచి జ్వరాల వ్యాప్తి సాధారణంగా మారింది. ఇప్పటివరకు జిల్లాలో 405 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఒక్క జూలై నెలలోనే 229 కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులు కూడా ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైనవే. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైనవి పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్యకు రెట్టింపు ఉంటుంది. జ్వరాలతో సతమతం -
దేశభక్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు
● శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలి విజయనగరం గంటస్తంభం: స్వాతంత్య్ర వేడుకలను దేశభక్తి ఉట్టిపడేలా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాట్లను లోపాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాలు, స్టాళ్లు, సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఉండాలని చెప్పారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరిస్తామన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వెల్లడించారు. సంక్షేమాన్ని విస్మరించి.. ప్రచారానికి ప్రాధాన్యమా? విజయనగరం టౌన్: గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించి ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వడం దారుణమని, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేశారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్య దర్శి ఎన్.నాగభూషణం ధ్వజమెత్తారు. విజయనగరంలోని అమర్భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది యోగాంధ్ర పేరుతో సుమారు 45వేల మంది గిరిజన విద్యార్థులను, ఈ ఏడాది భోగాపురం విమానశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా సుమారు 13వేల మంది గిరిజన విద్యార్థులతో థింసా నృత్యం చేయించడం గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడమేనని విమర్శించారు. గిన్నిస్బుక్ రికార్డులు, ప్రచార ఆర్భాటాల కోసం కాకుండా గిరిజన విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్య మివ్వాలని కోరారు. రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాముకాట్లు, విష జ్వరాలతో విద్యార్థులు మరణిస్తున్నారని, అనేక చోట్ల ఫ్యాన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు కూడా లేవన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్యసేవలు లేక విద్యార్థులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాల్సిన పరిస్థితి నెలకొందని ఆవే దన వ్యక్తం చేశారు. గిరిజన వర్సిటీ పనుల పురోగతిపై మంత్రి సంధ్యారాణి దృష్టిపెట్టకపోవడం విచారకరమన్నారు. ప్రచార కార్యక్రమాలకు ఖర్చుచేసే నిధులను గిరిజన విద్యార్థు ల సంక్షేమం, ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, వై ద్యసదుపాయాలు, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్, ఉపాధ్యక్షులు ఎ.చరణ్తేజ, వి.గణేష్, సహాయ కార్యదర్శి గౌరీశంకర్, పాల్గొన్నారు. -
ఉద్యోగుల క్రికెట్ సమరం
పార్వతీపురం రూరల్: జిల్లా పాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆమోదంతో నిర్వహించిన స్పోర్ట్స్ ఈవెంట్స్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఉద్యోగుల మధ్య మైత్రీభావం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ పోటీలకు మంచి స్పందన లభించింది. క్రీడాకారులు మైదానంలో క్రీడాస్ఫూర్తిని చాటగా, క్రికెట్ ఇన్చార్జ్ లక్ష్మణ్ జట్లకు శుభాకాంక్షలు తెలిపారు. టోర్నీలో భాగమైన ‘పూల్–ఎ’ మ్యాచ్ల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. మొత్తం 18 ప్రభుత్వ శాఖల జట్లు ఈ పూల్లో పోటీపడుతున్నాయి. తొలి విడతలో వీబీ–జీ రామ్జీ వర్సెస్ పశుసంవర్ధక, వైద్యారోగ్య వర్సెస్ ఆడిట్, ఇరిగేషన్ వర్సెస్ పంచాయతీరాజ్, కలెక్టరేట్ వర్సెస్ ఏపీఈపీడీసీఎల్, మున్సిపల్ వర్సెస్ అగ్రికల్చర్, ట్రైబల్ వెల్ఫేర్ వర్సెస్ ఎస్సీఎస్డబ్ల్యూ, పౌరసరఫరాలు వర్సెస్ ట్రెజరీస్, రెవెన్యూ వర్సెస్ సర్వే జట్లు తలపడనున్నాయి. విద్యాశాఖ, పీఆర్ ఎడ్యుకేషన్ జట్లు తదుపరి రౌండ్లలో విజేతలతో పోటీపడతాయి. మొదటి రౌండ్ విజేతలు తర్వాతి దశలు, సెమీఫైనల్స్ (ఎం–15, ఎం–16) దాటుకుని ’పూల్–ఎ’ విజేతను నిర్ణయించే ఆఖరి ఫైనల్ (ఎం–17) పోరుకు చేరుకుంటాయి. -
ఓటర్ల జాబితా సవరణ వేగవంతం చేయాలి
పార్వతీపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో క్లెయిమ్లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలకుడు, రాష్ట్ర సీసీఎల్ఏ అదనపు కార్యదర్శి జె.వెంకటరమణ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డితో పాటు ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫామ్–6, 7, 8లు క్షేత్రస్థాయి సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచుకోవాలని, తొలగించిన, సవరించిన పేర్ల జాబితాలను గ్రామ, మండల కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. ఓటర్ హెల్ప్లైన్ యాప్, ఆన్లైన్ సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా 18ఏళ్లు నిండే యువతను గుర్తించి కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఆర్.వైశాలి. డీఆర్ఓ కె. హేమలత, ఆర్డీఓ కె. మాధురి, పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నోటిఫికేషన్తో సరి..!
విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తు న్న తీరు నిరుద్యోగులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు ప్రస్తుతం అవలంభిస్తున్న పాలనా విధానాలతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా వైద్య రంగంలో పోస్టుల భర్తీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరుద్యోగులను టెన్షన్కు గురిచేస్తుంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ వ్యవహారంలోనూ చంద్రబాబు ఇదే తరహాలో వ్యవహరించడం నిరుద్యోగుల నిరాశకు కారణమవుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి సుమారు రెండేళ్ల కిందట నోటిఫికే షన్ ఇచ్చారు. ఆ పోస్టులను నేటికీ భర్తీ చేయలేదు. పోస్టులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ అభ్యర్థులను విధుల్లో చేర్చుకోలేదు. వైద్య కళాశాల అధికారులు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి కూడా విధుల్లో చేర్చుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎంపికై న అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ (సెకండరీ హె ల్త్) వారు జూలై 1వ తేదీన ఆరు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోవడానికి 10వ తేదీవరకు గడువు ఇచ్చారు. జనరల్ డ్యూటీ అటెండెంట్(జీడీఏ) పోస్టులు – 4, ల్యాబ్ అటెండెంట్ పోస్టు–1, థియేటర్ అసిస్టెంట్ పోస్టు–1కి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తేదీ నాటికి జీడీఏ పోస్టులకు 175 దరఖాస్తులు, ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్టుకు 25 దరఖాస్తులు, థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు 70 మంది దరఖాస్తు చేసుకున్నారు. గడువు దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన మీదట ముందుగా ప్రొవిజెనల్ మెరిట్ జాబితా వెబ్సైట్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించాలి. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ మెరిట్ జాబితా వెబ్సైట్లో పెట్టి ఎంపికై న వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. అయితే సెకండరీ హెల్త్ అధికారులు ఈ పక్రియ ఏది చేపట్టకుండా దరఖాస్తుల తీసుకోవడంతోనే సరిపెట్టేశారు. పోస్టులు భర్తీ ఎప్పుడు చేపడతారని దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారులను అడిగితే పోస్టుల భర్తీ పక్రియ నిలిపివేశామని తేల్చి చెప్పారు. దీంతో సదరు అభ్యర్థులు అవాక్కయ్యారు. ఎంతో ఆశతో పోస్టు కోసం దరఖాస్తు చేస్తే భర్తీ నిలిపివేశామని చెప్పడం ఏంటని ఆవేదన చెందుతున్నారు. జిల్లాల పునర్విభజన జరుగుతున్నందున పోస్టు లు భర్తీగాని, బదిలీలుగాని చేపట్టవద్దని ప్రభు త్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుచేత పో స్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేశాం. మళ్లీ ఆదేశాలు వచ్చిన తరువాతే భర్తీ ప్రక్రియ చేపడతాం. – డాక్టర్ పద్మశ్రీ రాణి, డీసీహెచ్ఎస్ -
కొలిక్కిరాని కొత్త పంచాయతీలు
దత్తిరాజేరు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలోని మధుర గ్రామాలను పంచాయతీలుగా మార్పు చేసే ప్రతిపాదనలపై ఇప్పటికి సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు ఉన్న మధుర గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ ద్వారా జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి మండల పరిషత్ అధికారులు అర్హత ఉన్న మధుర గ్రామాల ప్రజలు అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్నారు.అలాగే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తీర్మానాలు చేసి సంబంధిత ఎంపీడీఓల ద్వారా అందిన దత్తిరాజేరు మండలంలోని గదబవలస, మర్రివలస, పోలవంగర, పాపయ్యవలస, జగన్నాథపురం, మజ్జిపేట గ్రామాల ప్రతిపాదనలను గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వానికి పంపించారు. అయితే నేటివరకు కొత్త పంచాయతీల ఏర్పాటు గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభించక పోవడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం కూడా ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అంశాలపై ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో మధుర గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటైన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా పాత పంచాయతీల స్థానంలో నిర్వహిస్తారా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయండిపాపాయ్యవలసతో పాటు అర్హత ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయండి. అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులు నేరుగా మాగ్రామ పంచాయతీకి జమ అవుతాయి. తద్వారా గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రత్యేక పంచాయతీగా ఉండడం వల్ల అధికారులు కూడా అందుబాటులో ఉంటారు. ఎస్. శ్రీనివాసరావు, పాపయ్యవలస గ్రామం ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రతిపాదనలు ప్రభుత్వ ఆదేశాల మేరకే మండలంలోని ఆరు మధుర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు గత ఏడాది డిసెంబర్లో అప్పుడు ఉన్న అధికారులు పంపించారు. కొత్త పంచాయతీలు ఎప్పడు ఏర్పాటు చేస్తారన్నది ఉన్నతాధికారుల నుంచి సమాచారం రాలేదు. వచ్చిన వెంటనే తెలియజేస్తాం. ఎస్.తాత ఎంపీడీఓ దత్తిరాజేరుకొత్త పంచాయతీలతో స్వయం ప్రతిపత్తి అన్ని అర్హతలు ఉన్న గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటైతే స్వయం ప్రతిపత్తి సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మధుర గ్రామాలు అభివృద్ధి విషయంలో చిన్నచూపుకు లోనవుతున్నాయి. అలాగే మధుర గ్రామాల ప్రజలకు గ్రామ పంచాయతీల ద్వారా అందాల్సిన పథకాల విషయంలో ఆన్నాయం జరుగుతోందనే భావన వ్యక్తమ వుతోంది. పెద్ద పంచాయతీల పరిధిలో రెండో మూడో మధుర గ్రామాలకు వచ్చే నిధులు పెద్ద పంచాయతీకే వినియోగించే అవకాశాలే అధికం. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు అర్హతలు ఉన్న మధుర గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గత ఏడాది హడావుడి చేసిన కూటమి ప్రభుత్వం 2025 డిసెంబర్లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు 6 మధుర గ్రామాలపై వీడని సందిగ్ధం -
● సన్మానం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్బాబు కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం సాధించినందుకు గాను ఆయన తండ్రి శ్రీనివాసరావును గ్రామస్తులు ఆదివారం ఘనంగా సత్కరించారు. అజయ్బాబు దేశానికే కాదు..గ్రామానికి కూడా మంచి పేరు తెచ్చారని గ్రామపెద్దలు ప్రశంసించారు. కొడుకును ప్రోత్సహించి, అతడి విజయానికి దోహదపడిన తండ్రిని సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకుడు మొయిద అప్పారావు, నాయకులు ఆదినారాయణ, త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు. -
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బొబ్బిలి రూరల్: మండలంలోని పెంట గ్రామం వద్ద వేగావతి నది నుంచి ఇసుక తవ్వి అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను వీఆర్ఓ వెంకినాయుడు ఆదివారం పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నిఘా పెట్టామని, అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నామని, సెలవు రోజు కావడంతో ఉన్నతాధికారులు అందుబాటులో లేనందున ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉంచామన్నారు. తదుపరి చర్యలు తహసీల్దార్ తీసుకుంటారని చెప్పారు. గిన్నిస్ రికార్డ్స్’లో విజయనగరం వాసివిజయనగరం టౌన్: అమెరికాలో సిలికానాంధ్ర సహకారంతో 300 మంది మృదంగ కళాకారులతో ఒకే వేదికపై 30 నిమిషాల పాటు రూపొందించిన లయవిన్యాసం కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించిన విజయనగరానికి చెందిన డాక్టర్ పత్రి సతీష్ కుమార్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. ప్రస్తుతం చైన్నెలో ఉంటున్న ఆయన తెలుగువాడిగా, విజయనగరం వ్యక్తిగా రికార్డు అందుకోవడం పట్ల విజయనగర సంగీతాభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ మృదంగ విద్వాంసుడు డాక్టర్ మండపాక రవి, సంగీతాభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. 2.5 కిలోల గంజాయి పట్టివేతవిజయనగరం టౌన్: ఒడిశా రాష్ట్రంలోని మునిగుడ ప్రాంతం నుంచి తమిళనాడు రాష్ట్ర రాజధాని చైన్నెకి అక్రమంగా సరఫరా చేస్తున్న సుమారు రూ.లక్షా 25వేల విలువైన 2.5 కిలోల గంజాయిని రైల్వేపోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జీఆర్పీ ఎస్సై వి.బాలాజీరావు మాట్లాడుతూ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది రైల్వేస్టేషన్లోని ఫ్లాట్ఫామ్స్పై తనిఖీ నిర్వహిస్తుండగా ఒడిశాలోని కొంధమాల్ జిల్లాకు చెందిన ధర్మేంద్ర పల్లా అనే వ్యక్తి గంజాయిని చైన్నె తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, గంజాయి స్వాధీనం చేసుకుని నిదితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ నిమిత్తం రైల్వేకోర్టుకు తరలించామని చెప్పారు. శృంగవరపుకోట: మండలంలోని సన్యాసయ్యపాలెం గ్రామంలో 16 కేవీఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కు వస్తున్న విద్యుత్ కనెక్ష న్ కట్ చేసి, ట్రాన్స్ఫార్మర్ దించేసి డీటీఆర్ వైండింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి దొంగిలించి తీసుకుపోయారు. ఉదయం గ్రామానికి విద్యుత్ సరఫరా లేదన్న కంప్లైంట్తో లైన్కు వచ్చిన సిబ్బంది ట్రాన్స్ఫార్మర్ దించేసి విడిభాగాలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి వెంటనే ఎస్.కోట ఏఈ జి.రామారావుకు తెలిపారు. ఈ మేరకు ఆయన వెంటనే ఎస్కోట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాజువాకలో బొబ్బిలి యువతి ఆత్మహత్యబొబ్బిలి: పట్టణానికి చెందిన ముస్లిం యువతి విశాఖ జిల్లా గాజువాకలో ఆత్మహత్యకు పాల్ప డింది. బొబ్బిలికి చెందిన రషీదా బేగం(26) విశాఖలోని ఓ బ్యూటీ పార్లర్లో రెండున్నరేళ్లుగా పనిచేస్తోంది. ఓ పీజీ హాస్టల్లో ఉంటూ తాను పనిచేస్తున్న బ్యూటీ పార్లర్కు నిత్యం వెళ్లి వస్తుంటుంది. అయితే ఆదివారం ఆమె గాజువాకలోని ఓ హోటల్లో రూమ్ తీసుకుని అందులోనే ఉరి వేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ లేదని, పోలీసుల నుంచి త్వరగా రమ్మని సమాచారం వచ్చిందన్నారు. వెంటనే తండ్రి నూర్ఖాన్, తల్లి మున్నీబేగంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బొబ్బిలి తీసుకువచ్చేందుకు విశాఖ వెళ్లారని మృతురాలి పెదనాన్న కుమారుడు విలేకరులకు తెలిపాడు. -
‘ఎల్నినో’ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి
విజయనగరం: ఎల్నినో ప్రతికూల పరిస్థితుల నేప థ్యంలో పశుగ్రాసం, పప్పుధాన్యాలు, నూనెగింజల కొరత ప్రధాన సవాలుగా మారే అవకాశం ఉందని, ఈ సవాళ్లను అధిగమించేందుకు రైతాంగం సన్న ద్ధం కావాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) డాక్టర్ పాలడుగు సత్యనారాయణ సూచించారు. విజయనగరంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ‘ఎల్నినో నేపథ్యంలో సృజనాత్మక రైతులు – శాస్త్రవేత్తల చర్చాగోష్టి’ కార్యక్రమం డాక్టర్ టి.ఎస్.ఎస్.కె.పాత్ర అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడారు. ఎల్నినో వల్ల పంటలు దెబ్బతిన్న గ్రామాల్లో ఆగస్టు 3వ తేదీ నుంచి విస్తృత పర్యటనలు నిర్వహించాల ని ఆదేశించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,000మంది వ్యవసాయ విద్యార్థులు, 400 మంది శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించి, రైతులకు అవసరమైన సలహాలు, సూచన లు అందిస్తారని పేర్కొన్నారు. ‘అంగ్రూ కిసాన్ నెట్వర్క్’ ఏర్పాటు వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికతను వేగంగా చేరవేసేందుకు వీలుగా రాష్ట్రంలో 3,500 మంది సృజనాత్మక (ఆవిష్కరణల) రైతులతో ’అంగ్రూ కిసాన్ నెట్వర్క్’ ఏర్పాటు చేస్తున్నట్లు వీసీ ప్రకటించారు. వీరి ద్వారా నూతన సాంకేతిక పరి జ్ఞానాన్ని ఇతర రైతులకు విస్తతంగా ప్రచారం చేస్తామన్నారు. ముందుగా ఏరువాక కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ కె.లక్ష్మణ్ విజయనగరం జిల్లాలో ఎల్ని నో ప్రభావం – ప్రస్తుత పంటల పరిస్థితిపై నివేదిక సమర్పించారు. అనంతరం సభ్యులు కె.వి. సూర్యనారాయణరాజు, ఎల్.శాంతి, పడాల భూదేవి, సరస్వతి, మరియు అంగ్రూ ప్రతినిధి ప్రకాష్ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సమావేశంలో పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ అనురాధ, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ స్వాతి, డాక్టర్ శ్రీనివాస్, డాక్ట ర్ తేజేశ్వరరావులతో పాటు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
సాహిత్యానికే వన్నెతెచ్చిన సృజనశీలి ‘తులసి’
● చింత అప్పలనాయుడుకు చా.సో కథా పురస్కారం ● తెలంగాణ రచయిత్రి స్వర్ణకు చా.సో అనువాద పురస్కారం విజయనగరం టౌన్: తెలుగు సాహిత్యాన్ని దశ దిశ లా వ్యాప్తి చేసి, తన జీవితాన్ని సాహిత్యానికి అంకి తం చేసిన సాహిత్య సృజన శీలి చాగంటి తులసి అని పలువురు సాహితీవేత్తలు పేర్కొన్నారు. భార త సాహిత్య రంగానికి చాగంటి తులసి చేసిన అవిర ళకృషి మరువలేనిదని కొనియాడారు. తులసి సా హిత్య రచనలను ఆమె సమక్షంలోనే సమీక్షించడం ఎంతో ఆనందంగా ఉందని సాహితీవేత్తలు ఆనందపరవశులయ్యారు. స్థానిక పాల్నగర్లో తులసి స్వగృహంలో చాగంటి తులసి సాహితీ సమాలోచన పేరుతో సాహిత్యంలో విశేష కృషి చేసినటువంటి సాహితీవేత్తలను సముచితరీతిలో ఆదివారం సత్కరించారు. అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు జిఎస్.చలం, రత్నాల బాలకృష్ణ ఆధ్వర్యంలో వారికి చా.సో కథా పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరావు తులసి కథల సంపుటి యాష్–ట్రే పుస్తకావిష్కరణ చేశారు. చాగంటి కృష్ణకుమారి సమీక్షించారు. సచీ రౌత్రాయ్ అనువాద కథల్ని ధవళ సర్వేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త రామసూరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తులసి సాహిత్యంపై యువ సాహితీవేత్తలు దుప్పల రవికుమార్, కూరెళ్ల శ్రేయ, సుభ, గీతా రమాదేవి, రత్నాల బాలకృష్ణ ప్రసంగించారు. 90 ఏళ్ల వయసులో సాహిత్యంపై మక్కువ చూపిస్తున్న చాగంటి తులసి కీర్తిని కొనియాడారు. చింతా అప్పలనాయుడుకు చా.సో కథా పురస్కారం వ్యంగ్య శైలిలో దోపీడి వ్యవస్థను తూర్పారబట్టిన ‘నగ జనకరి నాం నాం..’ అంటూ తన కథల ద్వారా దండోరా మోగిస్తున్న కథకుడు చింతా అప్పలనాయుడు చా.సో కథా పురస్కారం అందుకున్నారు. ఉత్తరాంధ్ర నుడికారాన్ని, యాసను, భాషను ప్రతి కథలోనూ ఇంకించి, రైతులు, దళితుల, గిరిజనుల దోపిడీకి కారణమైన వ్యవస్థలో లోపాలను తన రచనల ద్వారా ఎత్తి చూపారని సాహితీవేత్తలు విశ్లేషించారు. ఉత్తరాంధ్ర సంభాషణలు, వాలకాలు, చతు రోక్తులు, మాటలు, సామెతలు, దుక్కి, ఇలమీద దేవత, అరిసేతిలో బువ్వ, పువ్వు వంటి కవితా సంకలనాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి న చింతా అప్పలనాయుడుకు చాసో కథా పురస్కా రంతో సత్కరించారు. రూ.10 వేలు నగదు పురస్కారం, జ్ఞాపిక, శాలువతో సత్కరించారు. ఆయన రాసిన ‘నకజనకరి నాం..నాం..’ కథల సంపుటిని సరిపల్లి నాగరాజు సమీక్షించారు. తెలంగాణ రచయిత్రి స్వర్ణ కిలారికికి అనువాద పురస్కారం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న తెలంగాణ రచయిత్రి స్వర్ణ కిలారికి చాగంటి తులసి అను వాద పురస్కారం దక్కింది. ఈ మేరకు రూ.15 వే లు నగదు పురస్కారం, జ్ఞాపిక, సాలువతో ఆమెను గౌరవప్రదంగా సత్కరించారు. ద్వారం దుర్గాప్రసా ద్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో లిప్తకాలపు స్వప్నం పుస్తకాన్ని లండ సాంబ మూర్తి సమీక్షించా రు. తొలి అనువాదం లిప్తకాలపు స్వప్నంతో ప్రతిష్టాత్మక తెలుగు యూనివర్సిటీ అనువాద పురస్కారాన్ని అందుకుని, సాహితీ జగత్తులో కథా రచయిత్రిగా, అనువాదకురాలిగా, నవలా రచయిత్రిగా, సంపాదకురాలిగా తనదైన ముద్రతో స్వర్ణ ముందుకు సాగుతున్నారన్నారు. మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలు, సమాజంలోని రక రకాల కోణాలు విశ్లేషించే కథలతో నల్ల బంగారం, గోడ అవతల వంటివి కథా సంపుటులుగా వెలువరించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయన్నారు. -
లెక్కలేని తనం..!
కొత్తవలస: భక్తితో పైసా పైసా కూడబెట్టి అమ్మవారికి సమర్పించుకునే భక్తుల నమ్మకాన్ని దేవాదాయశాఖ అదికారులు నిలువునా దోచుకుంటున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన అధికారులే పక్కా అక్రమాలకు తెరలేపారు. కొత్తవలస మండలంలోని అప్పన్నదొరపాలెం గ్రామం సమీపంలో గల పుణ్యక్షేత్రం ధారపైడితల్లమ్మ అమ్మవారి ఆలయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంవారం లక్షల్లో నగదు, బంగారం, వెండి భక్తులు సమర్పిస్తుండగా కేవలం రూ.4వేలు, రూ.5వేలు వస్తున్నాయని కానుకలు సమర్పించిన భక్తులకు రసీదులు కూడా ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధార పైడితల్లిమ్మ అమ్మవారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచి స్థానికంగా ఉండటే గిరిజనులు అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. ఆలయానికి ప్రతి ఆదివారం, మంగళవారాల్లో వేల సంఖ్యలో భక్తులు కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడే వంటలు చేసుకుని అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో భక్తులు లక్షల్లో కానుకలు చెల్లిస్తూ వస్తున్నారు. దీంతో భక్తులు సమర్పించిన కానుకులకు సరైన లెక్కలు లేకపోవడంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఆలయాన్ని దేవదాయ ధర్మాదాయ శాఖకు అప్పజెప్పారు. దీంతో అప్పట్లో దేవదాయ శాఖ అధికారులు ఆది,మంగళవారాల్లో ఉదయం ఆలయం వద్ద హుండీని ఏర్పాటు చేసి సాయంత్రం కొంతమంది భక్తుల మధ్య హుండీలోని కానుకలను లెక్కించేవారు. కాగా రెండు సంవత్సరాల నుంచి అధికారులు ఈ తంతంగాన్ని పక్కన పెట్టి వారే స్వయంగా సంచుల్లో కానుకలను భక్తుల నుంచి స్వీకరించడం మొదలుపెట్టారు. నిబంధనల ప్రకారంఆలయంలో దేవదాయశాఖ హుండీని ఏర్పాటు చేయాల్సి ఉండగా..ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హుండీలు ఏర్పాటుచేయకపోగా ఆలయానికి వచ్చే భక్తులు సమర్పించుకునే కానుకలకు రసీదులు ఇస్తాం. ఆ కానుకులు మా సంచుల్లో వేయండి అంటూ వసూళ్లకు దిగడం గమనార్హం. అయితే భక్తులు సమర్పిస్తున్న కానుకలకు, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతనలేదు. సంచుల్లో వసూలు చేస్తున్న కానుకలకు, అధికారులు ఇస్తున్న రసీదులకు ఎక్కడా పొంతన లేకుండా పోతోంది. దేవదాయశాఖ అధికారుల్లో కరువైన జవాబుదారీతనం ధార పైడితల్లమ్మ ఆలయంలో కానరాని హుండీ నేరుగా భక్తుల నుంచి కానుకలు స్వీకరిస్తున్న అధికారులుమా శాఖ అధికారులపై భక్తులు నమ్మకం ఉంచాలిహుండీని ఏర్పాటు చేస్తే దొంగలు దోచుకుపోతున్నారు. అందుకే వారం వారం మా సిబ్బంది వచ్చి భక్తుల నుంచి నేరుగా సంచుల్లో కానుకలను సేకరిస్తున్నాం. వంద రూపాయలకు పైబడి కానుక ఇచ్చిన భక్తులకు రసీదు ఇస్తున్నాం. భక్తులు, గ్రామస్తులకు మాపై నమ్మకం ఉండాలి. శ్రీనివాసరావు, ఆలయ ఈఓ లక్షల్లో దోచుకు పోతున్నారుఈ ఆలయానికి వారంలో రెండు రోజుల పాటు వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చిన భక్తులు సమర్పించిన కానుకులు లక్షల్లోనే ఉంటాయి. అలాగే పలువురు భక్తులు బంగారం, వెండి ఆభరణాలు సైతం సమర్పించుకుంటున్నారు. అయినా అదికారులు నిబంధనలకు విరుద్ధంగా సంచుల్లో కానుకలను సేకరిస్తూ 30 మందికో 40 మందికో తూతూమంత్రంగా రసీదులు ఇచ్చి మిగిలిన సొమ్ము దోచుకుపోతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలి. – ఉగ్గిన పద్మనాభస్వామి, అప్పన్నదొరపాలెం, గ్రామపెద్ద ఆగ్రహంలో భక్తులు, గ్రామస్తులు అమ్మవారికికి మేము సమర్పించే కానుకలు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడాలి తప్ప అధికారుల జేబులు నింపడానికి కాదని భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీని ఏర్పాటు చేయకుండా సంచుల్లో కానుకలను స్వీకరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
కాలుజారితే కై లాసమే..!
బలిజిపేట మండలంలోని మురగడాం గ్రామంలో ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. ఈ రహదారిపై కాలువేస్తే ఎక్కడ జారి పడి ప్రాణాలు పోతాయో తెలియదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఏ మూలకు వెళ్లి చూసినా రహదారులు బురదగుమ్ముల్లా ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామకార్యదర్శి కి పలు పర్యాయాలు తెలియపరిచినా ఏమాత్రం పట్టించుకోలేదని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. – బలిజిపేట -
పీజీఆర్ఎస్ సేవలపై ప్రజాభిప్రాయం
● క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సూచనలివ్వాలని కలెక్టర్ పిలుపు విజయనగరం గంటస్తంభం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదు పరిష్కా రం అనంతరం సంబంధిత కార్యాలయాల్లో ఏర్పా టు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. జిల్లాలోని కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దా ర్, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ/వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ను ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. నేడు పీజీఆర్ఎస్ జిల్లా ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా స్థాయి శాఖల అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. అర్జీలతో పాటు పూర్తి వివరాలు, ఆధార పత్రాలు సమర్పించాలని, గతంలో ఫిర్యాదు చేసిన వారు పాత రశీదును తీసుకురావాలని సూచించా రు. కలెక్టరేట్కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, ఆన్లైన్ లేదా మండల, మున్సిపల్ కార్యాలయాల ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. -
ఆగస్టు 5, 6, 7 తేదీల్లో బీసీల ‘చలో ఢిల్లీ’
పార్వతీపురం రూరల్: సగానికి పైగా జనాభా.. చట్టసభల్లో నామమాత్రపు ప్రాతినిధ్యం. ఈ అసమానతలను రూపుమాపుతూ, రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీలకు 34శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలిగాపు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఉత్తరాంధ్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ సమానత్వం, సామాజిక న్యాయం దక్కాలంటే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే రిజర్వేషన్ల బిల్లును ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేలా ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని కోరారు. కులవృత్తుల వికాసానికి రూ.15 వేల కోట్లతో ‘ఆర్టిజన్స్ వెల్ఫేర్ స్కీమ్’, ప్రత్యేక సబ్ప్లాన్న్ చట్టాన్ని తీసుకురావాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ గర్జనకు బీసీలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కృష్ణమూర్తినాయుడు సంఘీభావం తెలిపారు. బాధ్యతల పంపిణీ మన్యం జిల్లా ఉపాధ్యక్షులుగా జి.రవి, పాత గౌరీశంకర్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా బోను మధుయాదవ్, కార్యదర్శిగా కుప్పిలి సంతోష్, విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడిగా మహేష్ నియమితులయ్యారు. కార్యక్రమంలో మోహనన్రావు, తోకాడ రాము, సి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్ యాదవ్ చట్టసభల్లో 3శాతం రిజర్వేషన్లు.. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిమాండ్ -
అథ్లెటిక్స్ ఎంపిక పోటీలకు స్పందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 600మంది కీడాకారులు హాజరయ్యారు. అండర్–14,16,18, 20 విభాగాల్లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించినట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు లీలా కృష్ణ, శ్రీకాంత్ తెలిపారు. -
ఏఐ ఫ్యూజన్ సదస్సులో ‘సీతం’ ప్రతిభ
విజయనగరం అర్బన్: విశాఖపట్నంలో ఏఐ రంగం అగ్రశ్రేణి నిపుణులతో ఆదివారం జరిగిన ‘ఏఐ ఫ్యూజన్ వైజాగ్’ అనే సదస్సులో సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు నాయకత్వంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, బోష్, జేపీ మార్గాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు చెందిన సీనియర్ సాంకేతిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొని, కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో వస్తున్న మార్పులు, జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, భవిష్యత్ ఉద్యోగావకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిశ్రమ నిపుణులతో నేరుగా మాట్లాడే ఇటువంటి అవకాశాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి భవిష్యత్ సాంకేతిక సవాళ్లకు వారిని సిద్ధం చేస్తాయని డాక్టర్ శశిభూణరావు తెలిపారు. ప్రపంచ స్థాయి అనుభవాన్ని విద్యార్థులకు అందించడమే తమ సంస్థల లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ప్రతిభ చూపిన సీతం కళాశాల బృందానికి నిర్వాహకులు జ్జాపికలను అందజేశారు. -
15తులాల బంగారం ఆభరణాల చోరీ
సీతానగరం: మండల కేంద్రంలోని ప్రధాన మార్కెట్లో మెయిన్ రోడ్డును ఆనుకుని నివాసం ఉంటున్న కూర్మదాసు కిరణ్ ఇంట్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 15 తులాల బంగారం ఆభరణాలు చోరీ చేసినట్లు ఎస్సై ఎం.హేమలత తెలిపారు. ఆదివారం ఉదయం నిద్ర లేచిన అనంతరం ఇంట్లో తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి బీరువా తెరిచే సరికి అందులో భద్రపర్చిన బంగారం నగలు లేవపోవడాన్ని గుర్తించి ఇరుగు పొరుగువారికి తెలియజేసి, బాధితుడు కిరణ్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని క్లూస్టీమ్ సందర్శించి వేలిముద్రలను సేకరించినట్లు ఎస్సై చెప్పారు. మార్కెట్లో దొంగతనం జరిగిన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినట్లు తెలిపారు. పార్వతీపురం సీఐ రంగనాథ్ ఆధ్వర్యంలో కేసుమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హేమలత తెలియజేశారు. -
బళ్లారి రాఘవకు పోలీస్ శాఖ నివాళులు
పార్వతీపురం రూరల్: తెలుగు నాటక రంగ పితామహుడు తాడిపత్రి రాఘవాచార్యులు (బబళ్లారి రాఘవ) జయంతి వేడుకలను పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఇతర అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బళ్లారి రాఘవ గొప్ప నటుడే కాకుండా, తెలుగు నాటక రంగానికి జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడని కొనియాడారు. కళ ద్వారా ఆయన ప్రజల్లో తీసుకొచ్చిన సామాజిక చైతన్యాన్ని స్మరించుకున్నారు. వృత్తిరీత్యా గొప్ప న్యాయవాది కూడా అయిన ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఏఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పాచిపోయిన ఉప్మా, బిర్యానీ... ఉండలు కట్టిన పెరుగన్నం
విశాఖపట్నం జిల్లా: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం సుదూర ప్రాంతాల నుంచి తరలించిన ప్రజలకు శనివారం పాచిపోయిన ఉప్మా, బిర్యానీ, పులిహోర, ఉండలు కట్టిన పెరుగన్నం ప్యాకెట్లు అందించింది. ఆనందపురం మండలం పెద్దిపాలెంలో వీటిని శుక్రవారం రాత్రి 11 గంటలకు వండి వేడిగా ఉన్నప్పుడే డబ్బాలలో ప్యాకింగ్ చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయం బ్రేక్ఫాస్ట్కు ఉప్మా అందించారు. రాత్రి ప్యాకింగ్ చేసిన ఉప్మా ఉదయానికి పాచిపోయింది. మధ్యాహ్నం అందించిన 150 గ్రాముల బిర్యానీ ప్యాకెట్లో మీల్మేకర్ తప్ప ఎలాంటి కూరగాయలు వాడలేదు. రాత్రి చేసింది కావడంతో బిర్యానీ కూడా పాచిపోయిన వాసన వచ్చింది. దీంతోపాటు అందించిన 100 గ్రాముల పెరుగన్నం కూడా ఉండలు ఉండలుగా మారడంతో తినడానికి ఎవరూ ఇష్టపడలేదు. -
భూములిచ్చిన రైతులకు వెనుక సీట్లు
పూసపాటిరేగ: అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెనుక సీట్లు కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రొటోకాల్ లేని నేతలను వీవీఐపీ గ్యాలరీలలో కూర్చోబెట్టారు. ఎయిర్పోర్టు సభలో ముందు వరుసలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ఆ తరువాత వరుసలో వీవీఐపీ పాసులు సంపాదించిన కూటమి నేతలు, జీఎంఆర్ ప్రతినిధులు, ఉద్యోగులు, ఆ తరువాత వరుసలో మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చివరి వరుసలో సాధారణ ప్రజలకు సమీపంలో ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతులను కూర్చోబెట్టారు. ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతులను ముందు వరుసలో కూర్చోబెట్టి గౌరవిస్తారని ఆశించినా నిరాశే ఎదురైందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. -
అత్యుత్సాహంతో ఆర్టీసీ స్వామిభక్తి
విజయనగరం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభకు జనాన్ని తరలించేందుకు అధికారులు, ఆర్టీసీ యాజమాన్యం చూపిన అత్యుత్సాహం గ్రామీణ ప్రయాణికులకు కష్టాలు తెచ్చింది. ప్రభుత్వం అడిగిన ప్రతిపాదన కంటే మరో 400 బస్సులు అదనంగా కేటాయించి ఆర్టీసీ అధికారులు తమ స్వామిభక్తిని చాటుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు జోన్లలో కడప మినహా ఏకంగా మూడు జోన్ల నుంచి 2 వేల ఆర్టీసీ బస్సులను ఈ ఒక్క సభకే కేటాయించడం గమనార్హం. దీంతో ఆయా జోన్ల డిపోలను ఖాళీ చేసి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు తరలించారు. కొన్ని బస్సులు జనాలు లేకుండానే ఎయిర్పోర్టుకు ప్రయాణించాయి. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్వే’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రన్వేగా, యువత భవిష్యత్తుకు లాంచ్ప్యాడ్గా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, సెమీకండక్టర్ పరిశ్రమలకు శనివారం ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు, శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి, శ్రీకూర్మనాథ స్వామి, పైడితల్లి అమ్మవారిని స్మరించారు. భోగాపురం వేదిక నుంచి సుమారు రూ.17,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. ఈ రోజు ప్రారంభమైన విమానయానం, రహదారులు, సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం, పోర్టులు, రైల్వేలు, కనెక్టివిటీ తదితర రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశను చూపుతాయని ప్రధాని పేర్కొన్నారు. సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన నేలపైనే కొత్త విమానాశ్రయం ఏర్పాటు కావడం గొప్ప విశేషమన్నారు. ఎయిర్పోర్టును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ దేశంలో పౌర విమానయాన రంగం గత 12 ఏళ్లలో విశేషంగా అభివృద్ధి చెందిందని ప్రధాని వివరించారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు పెరిగిందన్నారు. ఉడాన్ పథకంతో సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించామని చెప్పారు. ఉడాన్ రెండో దశకు రూ.29 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కాశీలో ప్రారంభించిన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఇప్పుడు అమృత్సర్కు విస్తరించి, అక్కడి నుంచి 25కుపైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం కల్పించిందని తెలిపారు.బ్లూ ఎకానమీకి ప్రోత్సాహం దేశంలో బ్లూ ఎకానమీ బలోపేతానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తుందని చెబుతూ విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు తీర ప్రాంతాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడార్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల ఆధునికీకరణతో పాటు, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం–రాయ్పూర్ ఎక్స్ప్రెస్వే సహా రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు నిర్మాణంలో ఉన్నాయని, రైల్వే రంగంలో సుమారు లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. రైల్వే నెట్వర్క్ పూర్తిగా విద్యుదీకరణ కావడంతో పాటు, 70కుపైగా స్టేషన్లు ఆధునికీకరణ జరుగుతోందని వివరించారు.» పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టులు, విమానాశ్రయాల అనుసంధానంతో సమగ్ర లాజిస్టిక్స్ వ్యవస్థ ఏర్పడుతుందని, దీనివల్ల పరిశ్రమలు, రైతులు, వ్యాపార రంగానికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ఈ ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు సెమీకండక్టర్ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్లాంట్కు శంకుస్థాపన చేయడం ఈ దిశగా కీలక ముందడుగని చెప్పారు.» సాఫ్ట్వేర్ రంగంతో పాటు తయారీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంతో భవిష్యత్ సాంకేతిక ఉద్యోగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.» కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్ల రంగంలో ఆంధ్రప్రదేశ్కు విస్తృత అవకాశాలు ఉన్నాయని, గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దీనికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నక్కపల్లిలో భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకు కేంద్రం పూర్తి మద్దతు అందిస్తోందని, దీనివల్ల దేశంలో ప్రముఖ ఔషధ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని తెలిపారు. » ఈ సందర్భంగా 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు, యువతులు ప్రదర్శించిన థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించడం గర్వకారణమని కొనియాడారు. భారత గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ఇది అద్భుత నిదర్శనమని పేర్కొన్నారు.ఇక ఉత్తరాంధ్ర వైపు వలసలు : చంద్రబాబుఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం, ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ద్వారా ఈ ప్రాంతంలో రివర్స్ మైగ్రేషన్కు నాంది పలికిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో ఒకటిగా నిలబెడుతుందని చెప్పారు. గత రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టుల ద్వారా రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని, వీటి ద్వారా 5.57 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముందని వెల్లడించారు. రూ.2,784 కోట్ల వ్యయంతో ఎనిమిది ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నేరడి బ్యారేజ్కు అనుమతులు, నిధులు లభించాయని చెప్పారు. ఆగస్టు 14న గోదావరి జలాలు అనకాపల్లికి చేరనున్నాయని, అలాగే వంశధార–గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా చేపడతామని వెల్లడించారు. పర్యాటకం, ఔషధ పరిశ్రమలు, అరుదైన ఖనిజాలు, జాతీయ రహదారులు, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాల అభివృద్ధితో ఉత్తరాంధ్ర దేశంలో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారానికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీ వంటి నాయకుడిని చూడలేదని చంద్రబాబు కొనియాడారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని, అలాగే 2028 నాటికి అమరావతి తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. » విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణికుల సౌకర్యాలు, చెక్–ఇన్ హాల్, ఆధునిక సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయం మాస్టర్ ప్లాన్, భవిష్యత్ ఏవియేషన్ హబ్, ఏరోసిటీ అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ప్రధానికి వివరించారు.థింసా నృత్యంతో స్వాగతంఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వం, ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రతిబింబించే ప్రదర్శనలను ప్రధాని సందర్శించారు. సంప్రదాయ థింసా నృత్యాలను తిలకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి పొందూరు ఖాదీ శాలువాతో సత్కారం చేయగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను బహూకరించారు.ప్రధానిని తిడుతుంటే కన్నీళ్లొచ్చాయి.. పవన్ కల్యాణ్‘భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కొందరు ఇష్టానుసారం తూలనాడుతుంటే గుండె కదిలిపోయింది. కన్నీళ్లు వచ్చాయి. బాధ పడ్డాను. దేశం కోసం నిస్వార్థంగా కష్టపడే వారికి ఇవా బహుమతులు అనిపించింది’అని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో రూ.17,900 కోట్ల అభివృద్ధి పనులు మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి మోదీ. ఆయన వెనుక మనం ఉండాలన్నారు.ఏపీకి గ్రోత్ ఇంజన్ ఉత్తరాంధ్ర : లోకేశ్ కొందరు ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఎయిర్ పోర్ట్ వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ రోజు కేవలం ఒక ఎయిర్ పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు. మన మోదీ వికసిత్ భారత్, మన సీబీఎన్ విజన్ కలిసిన రోజు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దూసుకెళ్లే రోజు అని అన్నారు.అభివృద్ధికిది సింహద్వారం.. రామ్మోహన్నాయుడు ఒకప్పుడు అవకాశాల కోసం ప్రపంచం వైపు ఉత్తరాంధ్ర చూసేదని.. ఇప్పుడు ప్రపంచం మనవైపు చూసేలా భోగాపురం విమానాశ్రయం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని » ఎయిర్పోర్టు ప్రారంభంతో పాటు ప్రధాని మోదీ రాష్ట్రంలోని పలు రోడ్లు, పారిశ్రామిక సంస్థలను రిమోట్తో ప్రారంభించారు. » విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్–టెస్టింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. » కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. » అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలు ప్రారంభం» కర్నూలు–ఐవీరెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, పెంచలకొన–యరపాడు మధ్యనున్న బ్రిడ్జికి శంకుస్థాపన.» ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నాలుగు లైన్ల ఎక్స్ప్రెస్వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లైన్ల బైపాస్ రోడ్లు ప్రారంభించారు. -
కక్షసాధింపుతోనే మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
● యూనివర్సిటీలను సైతం పాడు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ● మాజీ ఎమ్మెల్యే శంబంగి బొబ్బిలి: ఏయూ మాజీ వీసీ పీవీ జీడీ ప్రసాదరెడ్డిని సస్సెండ్ చేసేందుకు రాత్రికి రాత్రి ఇచ్చిన కమిటీ నివేదికను ఆసరా చేసుకో వడం దారుణమని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. పట్టణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ పీవీ జీడీ ప్రసాదరెడ్డిని పదవీ విరమణ రోజునే సస్సెండ్ చేయడం అనేక రకాల అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆయన పదవీకాలంలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణకు ఆదేశించి ఆఘమేఘాల మీద నివేదిక తెప్పించుకుని కొత్త కమిటీ ద్వారా సస్పెండ్ చేయడం ముమ్మాటికీ రెడ్ బుక్ రాజ్యాంగ నిర్ణయమేనన్నారు. వాస్తవానికి యూనివర్సిటీ అంతర్గత విచారణ పూర్తి కాకముందు విజిలెన్స్ విచారణకు ఆదేశించడం, వెంటనే నివేదిక తెప్పించుకోవడం సస్సెండ్ చేయడం చకచకా జరిగిపోయాయన్నారు. ఇన్నాళ్లుగా యూనివర్సిటీలో అంతా బాగుండి, ఆయన పదవీ విరమణ రోజే చంద్రబాబుకు అక్రమాలు గుర్తొచ్చాయా అని శంబంగి ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ఇప్పుడు యూనిర్సిటీల్లోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగినన్ని అక్రమాలు, అధర్మాలు ఎక్కడా జరగలేదన్నారు. రాత్రి వేళల్లో చీకటి జీఓలు విడుదల చేయడం చంద్రబాబుకు అలవాటైనా మరీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. మరో పక్క పత్రికా ఎడిటర్లపైనా కేసులు నమోదు చేసేందుకు జీఓలు విడుదల చేయడం దేశంలో ఎక్కడా తాను చూడలేదన్నారు. ఇటువంటి చీకటి జీఓలు విడుదల చేయడం మానుకుని ఉన్న మూడేళ్ల కాలం ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలించాలని చంద్రబాబుకు హితవు పలికారు.రైతు సేవా కేంద్రంలో చోరీ బొబ్బిలి రూరల్: మండలంలోని సిహెచ్.బొడ్డవలస గ్రామ రైతు సేవా కేంద్రలో శుక్రవారం రాత్రి దొంగలు పడి విలువైన వస్తువులు దొంగిలించుకుపోయారు. ఈ మేరకు హార్టీకల్చర్ అసిస్టెంటుగా పని చేస్తున్న ఆరికతోట నాగభూషణం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి పది గంటల వరకు తాను విధుల్లోనే ఉన్నానని, అప్పుడే తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆర్ఎస్కే తాళాలు పగిలి ఉన్నాయని లోపలికి వెళ్లి చూస్తే కంప్యూటర్, ప్రింటర్, టీవీ కనిపించలేదని దొంగలు వాటిని పట్టుకుపోయారని సుమారు రూ.లక్షన్నర విలువుంటుందని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, రాజాం ఏరియా ఆస్పత్రిలో మరిన్ని రక్త పరీక్షలురాజాం: రాజాంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లా లేబొరేటరీ ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదర ప్రధాన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. ఈల్యాబ్లో డెంగ్యూ, స్క్రబ్ టైపస్, చికున్గున్యా, లెప్టోస్ఫిరిసోసిస్ వంటి వ్యాధులకు రక్త పరీక్షలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రాజాంతో పాటు చుట్టు పక్కల ప్రజలు, ఆస్పత్రులు ఈ వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. -
700 క్యూసెక్కుల నీరు సరఫరా
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా శనివారం 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. గత కొంత కాలంగా ఖరీఫ్ సీజన్కు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని 24,788 ఎకరాల ఆయకట్టు భూములకు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయకట్టుకు నీటి అవసరం ఉండడంతో మరో 200 క్యూసెక్కుల నీటిని పెంపుదలచేసి మొత్తం 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ నితిన్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 61.96 మీటర్లు లెవెల్ నీటిమట్టం ఉందన్నారు. కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షణ ● ప్రజలు సురక్షితంగా చేరే వరకు నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు విజయనగరం గంటస్తంభం: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న వాహనాల రాకపోకలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి స్వయంగా పర్యవేక్షించారు. సుమారు గంటపాటు అక్కడే ఉండి ఈఎంఎస్ వ్యవస్థతో వాహనాల కదలికలను పరిశీలించారు. ప్రధాని పర్యటనకు వచ్చిన 4,860 బస్సుల్లో ప్రయాణించిన ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, సెర్ప్ డైరెక్టర్(అడ్మిన్) ఎ.కల్యాణ్ చక్రవర్తితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు విజయనగరం టౌన్: అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగించినందుకు జిల్లా ప్రజలకు ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్శాఖ ముందస్తు ప్రణాళికతో చేపట్టిన భద్రతా, బందోబస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయన్నారు. జాతీయ రహదారిపై కాసేపు వాహనాల రద్దీ ఏర్పడినప్పటికీ అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా స్పందించి ట్రాఫిక్ను త్వరితగతిన సాధారణ స్ధితికి తీసుకువచ్చారన్నారు. బందోబస్తు విధులను అత్యంత క్రమశిక్షణతో, నిబద్దతతో నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఎయిర్పోర్టుకు శంఖారావం చేసిన కోడూరు వాసి బాడంగి: మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన యోగా శిక్షకుడు కడిమిశెట్టి రమేష్కు అరుదైన అవకాశం లభించింది. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం తొలుత శంఖానాదం చేశారు. విజయనగరం డిప్యూటీ కలెక్టర్ శర్మ సూచనల మేరకు ప్రధాని మోదీ పాల్గొన్న సభాస్థలి వద్ద శంఖారావంపూరించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు రమేష్ తెలిపారు. -
ఆరోగ్యశ్రీ వర్తించినా.. అదనపు వసూళ్లు..!
● అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ● నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చే మామూళ్ల కోసం మౌనంనెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులువిజయనగరం ఫోర్ట్: ఇది ఈ ఇద్దరు రోగులకు వచ్చిన సమస్యే కాదు. నిత్యం అనేక మంది రోగులకు ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. చర్యలు చేపట్టాల్సిన ఆరోగ్యశ్రీ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది అధికారులకు చెబితే కొన్ని చూసీచూడనట్లు వదిలేయాలని ఓ అధికారి సిబ్బందితో అన్నట్లు తెలుస్తోంది. టీడీపీ సర్కార్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తిగా కమర్షియల్గా మార్చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ట్రస్టు ఇచ్చే నిధులతో పాటు అదనంగా కూడా రాబట్టుకునే పనిలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరిగిన కో పేమెంట్స్ ఆరోగ్యశ్రీ పథకంలో కో పేమెంట్స్ బాగా పెరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదనపు వసూళ్లకే కో పేమెంట్స్ అని నెట్వర్క్ ఆస్పత్రులు పేరు పెట్టాయి. కో పేమెంట్ లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స గాని, శస్త్రచికిత్సలు చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు ఇష్టపడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయనే విషయం ఆరోగ్యశ్రీ అధికారులకు తెలిసినప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చే మామ్మూళ్ల కోసం మౌనం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రోగుల నుంచి నెట్వర్క్ ఆస్పత్రుల అదనపు వసూళ్లుకు అడ్డులేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చీపురుపల్లికి చెందిన ఓబాలుడికి హైడ్రాసిల్ నొప్పి రావడంతో విజయనగరం పట్టణంలోని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) నెట్వర్క్ ఆస్పత్రిలో చూపించగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలో ఇన్పేషేంట్గా చేర్పించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బాలుడికి శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ అదనంగా మరో రూ.8 వేలు బాలుడి కుటుంబ సభ్యుల దగ్గర ఆస్పత్రి సిబ్బంది తీసుకున్నారు. ఉచితంగా వైద్య సేవలు అందించేలా చూడాలి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందించే ప్రతినెట్వర్క్ ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రలు ఉంటారు. వారిని పర్యవేక్షించేందుకు టీమ్ లీడర్లు కూడా ఉంటారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందేవిధంగా చూడాల్సింది వారే. ఆస్పత్రిలో రోగులు చికిత్స పొందే ప్రతిరోజూ రోగుల దగ్గరకు వెళ్లి వైద్య సేవల గురించి ఆరా తీయాలి. అదేవిధంగా డబ్బులు ఎవరైనా తీసుకుంటున్నారా? అని రోగులనుంచి ఆరా తీయాలి. అయితే ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు, ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులు అదనపు వసూళ్లకు పాల్పడడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వద్ద పడిపోవడంతో కాలు విరిగింది. దీంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల్లో అ వ్యక్తికి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది ఆపరేషన్ చేయాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ రూ.50 వేలు అదనంగా అవుతుందని చెప్పడంతో అంత ఇచ్చుకోలేమని చెప్పి, మరో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కూడా రూ.15 వేల వరకు అదనంగా ఇవ్వాలని చెప్పారు. దీంతో ఆ ఆస్పత్రిలో ఆ వ్యక్తిని చేర్పించారు. ఫిర్యాదు చేస్తే చర్యలు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి రోగికి నెట్వర్క్ ఆస్పత్రి వారు ఉచితంగా వైద్యసేవలు అందించాలి. అదనంగా డబ్బులు అడినట్లయితే సంబంధిత ఆస్పత్రి మిత్రాకుగాని, నాకు గానీ లఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. డాక్టర్ కె. సాయిరాం, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ -
మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితవిజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం ద్వారా ఎన్నో కేసుల పరిష్కారం జరుగుతోందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో మధ్యవర్తిత్వం–దేశం కోసం అనే అంశంపై న్యాయమూర్తులు, న్యాయవాదులతో శనివారం చర్చించారు. మనోవర్తి, ప్రమాద బీమా, గృహహింస, చెక్బౌన్స్ తదితర కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణ నుంచి పూల్బాగ్ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించి, మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. 90 రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమం కొనసాగుతుందని, మధ్యవర్తిత్వంపై అవగాహన కోసం కోర్టు ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కోటి రెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ
● రూ.50 వేలు సాయం అందించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్లవిజయనగరం అర్బన్: వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. ఇటీవల అకాల మరణం చెందిన విజయనగరం బాబామెట్ట నివాసి కోటి రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కోటి రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.50 వేలు అందజేశారు. ఆయన వెంట ఐదో డివిజన్ మాజీ కార్పొరేటర్ గాదం మురళి, వర్మరాజు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు కె.సుధాకర్, కాశిరెడ్డి నవీన్, సతీష్, సాయికుమార్, మువ్వల భాస్కర్, శ్రీహరిబాబు, రవి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు
● రైతుల నెత్తిన మరింత భారం ● చెల్లింపునకు పాట్లురామభద్రపురం: ఖరీఫ్ సీజన్లో వరి మినహా పత్తి, మొక్కజొన్న తదితర మిగతా పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే వరి పంటకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉండగా, మిగతా పంటలకు గడువును పొడిగించింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు, తీసుకోని వారితో పాటు కౌలు రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈ గడువు వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,16,990 హెక్టార్లు. ఇందులో వరి 97,500 హెక్టార్లు, మొక్కజొన్న 10,791 హెక్టార్లు, పత్తి 2,200 హెక్టార్లలో సాగు లక్ష్యం. ఇప్పటి వరకు వెదలు, ఉబాలుతో వరి సాగు చేసింది 10,600 హెక్టార్లు, మొక్కజొన్న 7,212 హెక్టార్లలో సాగైంది. పంటల బీమా ప్రీమియం చెల్లింపులో తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ రెండు పంటలకుగాను ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద బ్యాంకులో రుణాలు తీసుకున్న వారు, తీసుకొని వారు కలిపి 6,393 హెక్టార్లకు 56,600 మంది రైతులు సుమారు రూ.31 లక్షలు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. వాతావరణ ఆధారిత పథకం కింద పత్తి 2,112 హెక్టార్లకుగాను 462 మంది రైతులు 81 హెక్టార్లకు మాత్రమే పంటల బీమా ప్రీమియం సుమారు రూ.3,87 లక్షలు చెల్లించారు. చెల్లింపునకు పాట్లు ఎల్నినో పరిస్థితులు ఉన్నందున పంట చేతికిరాని సమయంలో కనీసం బీమా పరిహారమైనా వస్తుందనే ఆశతో ప్రీమియం చెల్లించేందుకు ఎగబడుతున్నారు. అయితే మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీ)ఆర్ఎస్కేలు, డిజిటల్ కేంద్రాలలో సర్వర్లు సరిగా పని చేయకపోవడంతో రైతులు ప్రీమి యం చెల్లింపు కోసం గంటల తరబడి నిరీక్షిస్తూ పా ట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రైతులు తా ము చేసిన పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లిస్తేనే బీమా పథకాలు వర్తించనున్నాయి. అన్నదాతపై బీమా భారం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. ఆ భారాన్ని రైతులపైనే వేసింది. ఒక వైపు ఎలినినో ప్రభావంతో వర్షాలు లేక పొలంలో తాము కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోతుండటం, చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో రైతులే పంటల ప్రీమియం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా అన్నదాత మరిన్ని కష్టాలు పడుతున్నాడు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రైతులపై పైసా భారం మోపకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద ఈ–పంట ఆధారితంగానే బీమా ప్రీమియం చెల్లించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపైనే వేసింది.15లోగా ప్రీమియం చెల్లించాలి రైతు ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పంటల బీమా నమోదు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పెంచింది. రైతులు చివరి వరకు వేచి ఉండకుండా బ్యాంకులో రుణాలు ఉన్న వారు, లేని రైతులు మొబైల్ యాప్ ద్వారా లేక ఆర్ఎస్కేలు, సీఎస్సీల వద్ద ప్రీమియం చెల్లించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మధుసూదనరావు, ఏడీఏ, బొబ్బిలి -
పోటాపోటీగా పొర్లు దండాలు..!
–8లో● మోదీ ప్రాపకం కోసం ముగ్గురు దండకాలు ● చంద్రబాబు, పవన్, లోకేశ్... ఒక్కొక్కరు ఒక్కో బాణీలో పొగడ్తలు ఆరోగ్యశ్రీ వర్తించినా.. అదనపు వసూళ్లు..! ఆరోగ్యశ్రీ వర్తించినా కొన్ని ఆస్పత్రుల సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. మళ్లీ గజరాజుల సంచారం మొరకముడిదాం మండలం నుంచి గరివిడి మండలం వైపు మళ్లిన ఏనుగులు కొత్తకర్ర, బుధరాయవలస గ్రామాల మధ్య తోటలోకి మళ్లీ చేరాయి. సాక్షిప్రతినిధి, విజయనగరం: హూ ఈజ్ మోదీ.. అయామ్ ఫాదరాఫ్ లోకేశ్.. నౌ టెల్ మీ.. హూ ఈజ్ మోదీ.. తల్లిని చూడలేనివాడు దేశాన్ని చూస్తాడా.. గోద్రా నరహంతకుడు మోదీ దేశానికి ప్రధానిగా ఎలా పనికొస్తాడు అంటూ అప్పట్లో హూంకరించిన చంద్రబాబేనా ఈయన.. కొంపదీసి డూప్ చంద్రబాబు గట్రా స్టేజి మీద ఉన్నారా అని ఒక్క క్షణం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరైన జనానికి అనిపించింది. ఈ దేశానికి మోదీలాంటి వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది.. అసలు మోదీ అవసరం దేశానికీ ఉంది.. ఆయన లేకపోతే దేశం లేదు.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీలాంటి నాయకుడిని చూడలేదు అంటూ బాబు ఉన్నఫళంగా మోదీ దండకం అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీని ఏదో మర్యాదకోసం... ప్రొటోకాల్ కోసం అభినందించడం.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు పూర్వకంగా రెండు మాటలు మాట్లాడడం సహజమే.. కానీ శనివారం చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ ఒక్కొక్కరు ఒక్కో రేంజిలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ మోదీ భజన చేస్తుంటే... అసలు ఇది విమానాశ్రయ ప్రారంభమా ? మోదీ భజన కోసం ఇన్ని వేలమందిని తరలించారా అనే సందేహం అందరిలోనూ కలిగింది. ● లోకేశ్ చిడతల భజన చంద్రబాబు, పవన్ ఒక్కోరేంజిలో భజన చేయడంతో... ఇక లోకేశ్ కూడా తనవంతు పాత్ర గట్టిగానే పోషించేశారు. మోదీజీ విజన్.. చంద్రబాబు ఎగ్జిక్యూషన్ అంటూ పావుగంటసేపు చిడతలు వాయించేశారు. ఉన్న సమయమంతా మోదీని పొగడడానికి సరిపెట్టేశారు. రాష్ట్ర, దేశ ప్రగతికి మోదీ చేస్తున్న సేవలు.. ఆయన కృషి అంటూ మొదలెట్టి పలు పథకాలు.. రకరకాల ప్రాజెక్టుల పేర్లు చెబుతూ మోదీజీకి జై అనేలా ప్రజలను బతిమాలి మరీ జై కొట్టించారు. వచ్చీరాని మాటలు, అర్ధంలేని ప్రసంగాలతో తనదైన ‘ముద్ర’ను ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ముగ్గురూ ఒకరిని మించి ఒకరు ప్రధానమంత్రి మోదీని ఉబ్బించేసి తాము ఉబ్బిపోయి వేదిక దిగిపోయారు. సీఎం పవన్ సారథ్యం అవసరం: శ్రీనివాస వర్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుల నాయకత్వం ఎంతో అవసరం అని కేంద్ర పరిశ్రమల శాఖ శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదిక మీద ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతగానో దోహదపడుతోందన్నారు. దీనికి ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఘనత సాధించడానికి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్య మంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కాంబినేషన్ ఇలాగే ఉండాలని అభిలషించారు. పొరపాటున ఆయన ఇలా అన్నారేమో అనుకుని సభికులు కలవరపడ్డారు. ముఖ్యమంత్రి పవన్ అని కేంద్రమంత్రి అనగానే జనంలోంచి కాస్త గుసగుసలు.. కేకలు, అరుపులు వినిపించాయి... కానీ కేంద్ర మంత్రి ఏకంగా రెండుమూడు సార్లు పవన్ను ముఖ్యమంత్రి అని, చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి అని సంబోధించడం వెనుక బీజేపీ నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశంతో మోదీ ఈయనతో ఇలా మాట్లాడించారా అనే గుసగుసలు వినిపించాయి. రాష్ట్రమంత్రులకు నో మైక్ యువత దుమ్మెత్తిపోస్తుంటే... పవన్కు కన్నీళ్లు వచ్చేశాయి సముద్రం ఒకరి కాళ్లదగ్గర మోకరిల్లదు .. పర్వతం ఎవరికీ సలాం చేయదు అంటూ విప్లవ డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ సైతం ఈ రోజు పదిపన్నెండు మెట్లు దిగి మోదీకి భజన కొట్టారు. ప్రభుత్వ వైఫల్యాల మీద యువత మోదీని తిడుతుంటే తనకు కన్నీళ్లొచ్చేశాయి అంటూ సెంటిమెంట్ పండించారు. మోదీని కొట్టేవాళ్లు దేశంలోనే లేరని, ఆయనకు నచ్చినన్నాళ్లు ప్రధాని పదవిలో ఉండచ్చని చెబుతూ ఆయనకు బోర్ కొడితే మాత్రమే పదవిని వదులుకోవాలన్నారు. అలాంటి ప్రధాని సారథ్యంలో పని చేయడం తనకు జన్మజన్మల పుణ్యఫలం అని చెబుతుంటే... గతంలో మనం ఢిల్లీ వాళ్ల ముందు తలవంచుతామా ? ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా అంటూ గొంతు చించుకుని అరచిన పవన్ కల్యాణ్ జనానికి గుర్తొచ్చారు. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు.. పని చేస్తున్నందుకే మోదీజీకి ఈ నిందలు అంటూ పవన్ మ్రాన్పడిపోవడాన్ని చూసి సభికులు విస్తుపోయారు. నటనా చాతుర్యం బాగుందని కితాబిచ్చారు. విమానాశ్రయం ప్రారంభ వేదిక మీద కేవలం ప్రధాని మోదీ, లోకేశ్, పవన్ కల్యాణ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, రామ్మోహన్ నాయుడు మాత్రమే ప్రసంగించారు. మరో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ రాష్ట్ర మంత్రులు టీడీ జనార్దన్, జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్, హోం మంత్రి అనితకు మైక్ దక్కలేదు. ఆఖరుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కానీ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ప్రసంగించేందుకు అవకాశం దక్కలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ , గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సైతం వేదిక మీద ఆసీనులయ్యారే తప్ప మాట్లాడేందుకు మైక్ అందలేదు. దేశవ్యాప్తంగా జెన్జీ యువత అటు బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తోంది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో దేశంలో మోదీ ప్రభ కాస్త మసకబారుతోందన్న సూచనలు సైతం సమాజంలోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు తణమూల్ కాంగ్రెస్ నుంచి పలువురు ఎంపీలు బీజేపీలో కలుస్తుండడంతో ఈ అవకాశవాద చంద్రబాబును మోదీ పక్కనబెడతారు.. ఇక బాబుకు ప్రాధాన్యం తగ్గుతుందన్న వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకు అత్యవసరంగా లోకేశ్ను సీఎంగా చేయాలన్న ఇంటిపోరు సైతం మొదలైంది. మోదీ అనుమతి లేకుండా లోకేశ్ను సీఎం చేయడంకుదరని పని. దీంతో అటు తృణమూల్ రూపంలో కేంద్రంతో తన ప్రాధాన్యాన్ని ముంచుకొచ్చిన ముప్పును తప్పించుకుంటూ ఇంకా మోదీకి విధేయత చూపడానికి బాబు ఎక్కడలేని తంటాలు పడ్డారు. మేకిన్ ఇండియా.. ఆత్మనిర్భర భారత్.. బులెట్ ట్రైన్, డిజిటల్ పేమెంట్స్.. రోడ్లు.. విమానాశ్రయాలు.. జాతీయ రహదారులు అంటూ పలు ప్రాజెక్టులు, పథకాల పేర్లు చెబుతూ వెనువెంటనే మోదీమోదీ అంటూ అరవాల్సిందిగా బాబు సభికులకు ప్రాథయపడ్డారు. ఒకానొకదశలో బాబు పూనకం వచ్చినట్లు గొంతు చించుకుని మోదీమోదీ అని అరవడాన్ని చూసి వీఐపీ గ్యాలరీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం విస్తుపోయారు. ఉన్నఫళంగా ఈ స్థాయి పూనకానికి కారణం ఏమిటో అర్థంకాక ఒకరి మోకాలు ఒకరు చూసుకున్నారు. లోకేశ్ను సీఎంను చేసేందుకే ఇంత ప్రాపకమా అన్న విషయం తెలిసుకున్నాక ముక్కనవేలేసుకున్నారు. -
అందని పనస కలప
● ఆవేదనలో వీణల తయారీదారులు బొబ్బిలి: పట్టణంలోని వీణల తయారీ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులకు పనస కలప కొరత వెంటాడుతోంది. వీణల తయారీ కష్ట సాధ్యంగా మారింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం వపన్కల్యాణ్ అటవీశాఖ కార్పస్ ఫండ్ రూ.10 లక్షలతో కలప కొనుగోలు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు అటవీశాఖ రూ.5లక్షల విలువైన పనస కలప కొనుగోలు చేసి వీణల తయారీ కేంద్రానికి చేర్చింది. మిగిలిన నిధులను ఉమ్మడి ఖాతాలో జమచేశారు. అయితే, కొనుగోలు చేసిన కలప వీణల తయారీ కేంద్రానికి చేరి దాదాపు మూడు నెలలవుతున్నా తయారీ దారులకు అప్పగించలేదు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకిలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాల ప్రారంభానికి పవన్ వస్తారని, పనస కలప అందిస్తారని భావించారంతా! కానీ ఆ పనులు కనీసం 50 శాతం కూడా పూర్తికాలేదని, గత నెల పవన్ రావాల్సిన షెడ్యూల్ను రద్దు చేశారు. ఇటీవల కుంకీ ఏనుగులు వచ్చాయి. వాటిని సంరక్షణ కేంద్రానికి తరలించగా ఆ ప్రాంతాన్ని శంకుస్థాపనతో వర్చువల్గా ప్రారంభించారు. ఇక ఆ అవకాశమూ వాయిదా పడింది. పనస కలపను పవన్ చేతుల మీదుగా ఇస్తారని భావిస్తున్న కార్మికులకు నిరాశే మిగులుతోంది. వర్చువల్గా 50 శాతం రాయితీపై పనసకలప ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని తయారీదారులు కోరుతున్నారు. ఆగస్టులో రావచ్చు! వీణ కార్మికులకు పనస కలప అందించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తారని సమాచారం ఉంది. ఆయన వచ్చాకే పనస కలప కార్మికులకు అందిస్తారు. ఈలోగా పనస కలప పాడవ్వకుండా భద్రపరిచాం. ఆగస్టు 15న కలప ఇచ్చేందుకు అవకాశం ఉంది. – రామకృష్ణ, వీణల తయారీ కేంద్రం ఇన్చార్జి, బొబ్బిలి -
తమ్ముళ్ల ఖాతాలోకి.. పంచాయతీల సొమ్ము!
● గిరిజన పంచాయతీలే టార్గెట్ ● పనులు చేయకుండానే స్వాహా ● రూ.18 లక్షల వరకు పక్కదారి వీణల తయారీ కేంద్రంలో ఉన్న పనస కలప సాక్షి, పార్వతీపురం మన్యం: సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత గిరిజన పంచాయతీల్లో కనీస పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి పనులు జరిగిన దాఖలాల్లేవు. ఇదే సమయంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు.. తెలుగు తమ్ముళ్ల ఖాతాలోకి మళ్లిపోతున్నాయి. వారి సొంత జేబులో సొమ్ములా వాడేసుకుంటున్నారు. ఇదే తరహాలో సాలూరు నియోజకవర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో గల గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కొద్ది రోజుల కిందట డ్రా చేసినట్లు సమాచారం. సాలూరు మండలానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు ఒకరు 12 పంచాయతీల్లో రూ.18 లక్షలు విత్ డ్రా చేసినట్లు భోగట్టా. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీలనే ఇందుకు ఎంచుకున్నారు. పనులు చేయకుండా నిధులు డ్రా చేయడం పట్ల తాము ఇరకాటంలో పడిపోతామేమో అని ఆయా కార్యదర్శులు ఆందోళనలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు కావడం.. మండల అధికారుల సిఫార్సులు కూడా ఉండడంతో నోరు మెదపలేక పోతున్నారు. ఇప్పుడు ఆయా పంచాయతీల్లో నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవని తెలుస్తోంది. గిరిజన పంచాయతీలే అధికం.. నిధులు డ్రా చేసిన పంచాయతీల్లో ఎక్కువ భాగం గిరిజన, గిరి శిఖర ప్రాంతాలే ఉన్నాయి. అది కూడా గతంలో వైఎస్సార్ సీపీ సర్పంచ్లు ప్రాతినిధ్యం వహించిన పంచాయతీలనే ఎంచుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ భాగోతం బయట పడినా నిందను వారి మీదకు నెట్టేయవచ్చన్న ఆలోచన కూడా అయి ఉండొచ్చని గ్రామస్తులు అంటున్నారు. ఈ పంచాయతీల్లో టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ ప్రశ్నించలేని పరిస్థితిలో వారు ఉండటం ఆ ‘తమ్ముడికి’ కలిసి వచ్చింది. కొత్తవలస పంచాయతీ నుంచి రూ.2,00,364, కందులపథం పంచాయతీ నుంచి 1,00,300, తోణాం రూ.1,49,978, సారిక రూ.2,00,482, మరిపల్లి రూ.1,00,300, కురుకుట్టి 2,50,750, అన్నంరాజువలస రూ.2,49,216, తుండ రూ.2,00,010, గంజాయిభద్ర రూ.లక్ష, పట్టుచెన్నూరు రూ.1.50 లక్షలు, కూర్మరాజుపేట రూ.50,622, కొదమ నుంచి రూ.1.20 లక్షల చొప్పున నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ 12 పంచాయతీల్లో రూ.18 లక్షలు విత్ డ్రా కావడం.. మెజారిటీ పంచాయతీలు గిరిజన ప్రాంతానికి చెందినవే అవ్వడం గమనార్హం. పాచిపెంట మేజర్ పంచాయతీలో కూడా పారిశుద్ధ్య నిర్వహణ కోసమని మంత్రి అనుచరుడి పేరు మీద రూ.లక్ష రూపాయల నిధులు డ్రా చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
విద్యార్థినులకు కడుబండి పరామర్శ
శృంగవరపుకోట: మండలంలోని తాటిపూడి వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల కళాశాలలో జ్వరాల బారినపడిన విద్యార్థినులను మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం పలువురు నేతలతో కలిసి పరామర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థినులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. అక్కడే ఉన్న కొ ట్టాం పీహెచ్సీ వైద్యాధికారి హారికతో మాట్లాడి విద్యార్థినులకు అందిస్తున్న సేవల గురించి, ప్రిన్సి పాల్ శారదాబాయితో మాట్లాడి విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం, కళాశాలలో పారిశుద్ధ్యం, తాగునీటి వసతులు,ఇతర సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎటువంటి అవసరం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, నాయకులు వాకాడ రాంబాబు, కె.వెంకటరావు, టి.సాంబరాజు, డి.సన్యా సిదేముడు, ఆల్తి బాబురావు, ఎస్.కనకం, చిన్నా మాస్టర్ ఉన్నారు. -
‘భోగాపురం’ ప్రారంభోత్సవంపై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్
సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘‘భోగాపురం నుంచి 2026లో విమానాలు ఎగురుతాయి. ఈ విషయం 2023లో నేను శంకుస్థాపన చేసిన రోజే చెప్పాను’’ అంటూ పోస్టు చేశారు. అప్పటి వీడియోను కూడా ఎఫ్బీలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.కాగా, శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమైంది. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. అదే ప్రకారం భోగాపురం ఎయిర్పోర్టు శనివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటం గమనార్హం. పలు కోర్టు వివాదాలు, భూ సేకరణ చిక్కుముడులు, పునరావాసం కల్పన, కేంద్రం నుంచి కీలక అనుమతులు రాబట్టడం....ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సాధించడంతోపాటు పనులు కూడా ప్రారంభించడంతో ముందుగా అనుకున్న సమయానికల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాత్రి పూట అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అడ్డంకులు తొలగిపోయి వివిధ దేశాలకు నేరుగా కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభించింది. -
‘భోగాపురం.. చంద్రబాబు పాత్ర ఏమీ లేదు’
సాక్షి, తాడేపల్లి: భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రారంభంపై వైఎస్సార్సీపీ స్పందించింది. రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్ అన్నకు ధన్యవాదాలంటూ పోస్టు చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారని.. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది.వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా..‘రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్ అన్నకు ధన్యవాదాలు. వైఎస్ జగన్ హయాంలో ఎయిర్పోర్టు భూసేకరణకు దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారు. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించటంతోపాటు, అవసరమైన అన్ని అనుమతులు సాధించారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదు. అయిన్పటికీ మొత్తం ఘనతను తనదేనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ఎయిర్పోర్టుకు పునాది వేసి, దాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. అందుకే వారంతా థ్యాంక్యూ జగన్ అన్నా అంటూ మనస్ఫూర్తిగా చెబుతున్నారు’ అని పోస్టు చేసింది. #BhogapuramAirportByJaganA Must Watch Video!🚨Thank you, @ysjagan Anna, for giving Andhra Pradesh an international airport.✈️During YS Jagan Garu's tenure, nearly ₹1,200 crore was spent on land acquisition for the Bhogapuram International Airport, securing all necessary… pic.twitter.com/AFyx2IhGO6— YSR Congress Party (@YSRCParty) August 1, 2026చంద్రబాబు వేసిన విత్తనం ఎలా ఉందో.. పక్కనే ఉన్నా శిలాఫలకం చూపిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు. వైఎస్ జగన్ కృషితో నిర్మితమైన భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ని చంద్రబాబుకి కట్టబెట్టేందుకు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. #CreditChorBabuచంద్రబాబు వేసిన విత్తనం ఎలా ఉందో.. పక్కనే ఉన్నా శిలాఫలకం చూపిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలు వైయస్ జగన్ గారి కృషితో నిర్మితమైన భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ ని చంద్రబాబుకి కట్టబెట్టేందుకు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు… pic.twitter.com/yRFD3E75QV— YSR Congress Party (@YSRCParty) August 1, 2026 -
భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ
సాక్షి, భోగాపురం: ప్రధాని నరేంద్ర మోదీ.. భోగాపురం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ.. ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మోదీకి ఏపీ గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
మరో క్రెడిట్ చోరీకి బాబు యత్నం
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర ఊహలకు రెక్కలు తొడుగుతూ... శంకుస్థాపన రోజే ప్రారంభ సమయాన్ని కూడా ప్రకటిస్తూ రూపుదిద్దుకున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమవుతోంది. వెనుకబడిన ప్రాంతం ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కలల విమానాశ్రయానికి అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలను పరిష్కరించి టెంకాయ కొట్టిన రోజే ప్రారంభమయ్యే సమయాన్ని కూడా కచ్చితంగా ప్రకటించడం మాజీ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టి, నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ 2026 ఏడాది మధ్యలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తామని ముందే ప్రకటించారు. అదే ప్రకారం భోగాపురం ఎయిర్పోర్టు శనివారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుండటం గమనార్హం. పలు కోర్టు వివాదాలు, భూ సేకరణ చిక్కుముడులు, పునరావాసం కల్పన, కేంద్రం నుంచి కీలక అనుమతులు రాబట్టడం.. ఇలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సాధించడంతోపాటు పనులు కూడా ప్రారంభించడంతో ముందుగా అనుకున్న సమయానికల్లా అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. దీంతో రాత్రి పూట అంతర్జాతీయ సర్వీసులు నడపడానికి అడ్డంకులు తొలగిపోయి వివిధ దేశాలకు నేరుగా కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా వేగంగా అడుగులు వేశారు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతోపాటు ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ పార్వతీపురం, విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. మూలపేట పోర్టు, షిప్ ల్యాండింగ్ సెంటర్లతో తీరానికి ఆర్థిక పరిపుష్టి కల్పించి మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందించేలా చర్యలు చేపట్టారు. బాబు పబ్లిసిటీ పీక్స్లో..!భూ సేకరణ చేయలేదు.. పునరావాసం ఊసు లేదు.. కోర్టు కేసులు తేల్చలేదు.. కేంద్రంలో కొనసాగి, పౌర విమానయాన శాఖ దక్కించుకుని కూడా కనీసం ఎన్వోసీలు తేలేదు..! అయినా సరే భోగాపురం ఎయిర్పోర్టును తామే కట్టేశామని ప్రచారం చేసుకుంటూ జబ్బలు చరుచుకోవడం ఒక్క చంద్రబాబు సర్కారుకే చెల్లుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 – 19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం నిర్మాణం విషయంలో తీవ్ర కాలయాపన చేశారు. నాడు టీడీపీ నుంచి గెలిచిన అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కనీసం భూ సేకరణ చేయలేకపోయారు. అనుమతులు సాధించలేకపోయారు. 2,703 ఎకరాలకు గాను కేవలం 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారు. భూసేకరణ, ఎన్వోసీలు, ఎటువంటి అనుమతులు లేకుండానే నాడు ఎన్నికల ముందు హడావుడిగా ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి మమ అనిపించారు. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా విశాఖ – భోగాపురం ఎయిర్పోర్టును అనుసంధానించే ఆరు లైన్ల రోడ్డు పనులను మొదలు పెట్టలేకపోయారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయం చేసిన వైఎస్ జగన్ సర్కారు2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక భోగాపురం ఎయిర్పోర్టు పనులను పరుగులు పెట్టించారు. ఉత్తరాంధ్ర మణిహారంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2200 ఎకరాల్లో నిర్మించే విధంగా 2020 ఏప్రిల్లో జీఎంఆర్తో వైఎస్ జగన్ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వెంటనే భూమిని సేకరించడంతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం లాంటి కీలక ప్రక్రియను చకచకా పూర్తి చేశారు. హైకోర్టు, ఎన్జీటీల్లో దాఖలైన దాదాపు 130 కేసులను పరిష్కరించి ఎయిర్పోర్టు పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమం చేశారు. మూడు గ్రామాల్లో దాదాపు 400 కుటుంబాలను అధునాతనమైన కాలనీలకు తరలించి సరికొత్త ఇళ్లకు యజమానులను చేసింది. ఒక్కో ఇంటికి ఐదు సెంట్ల స్థలంతోపాటు రూ.8.5 లక్షల ఆర్థిక సాయం వెనువెంటనే అందించారు. భూ సేకరణ, పునరావాసం, విద్యుత్, నీరు, రహదారులు లాంటి కీలక మౌలిక వసతుల కల్పన కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.1,200 కోట్లకుపైనే వ్యయం చేసింది. ఈ క్రమంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి కీలకమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ)ని కేంద్రం నవంబర్ 2022లో జారీ చేసింది. ఇలా అన్ని అనుమతులు సాధించి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ 2023 మే 3న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. భోగాపురం ఎయిర్పోర్టులో 3,800 మీటర్లు పొడవైన రన్వే నిర్మించడంతో బోయింగ్ 777, బోయింగ్ 787, డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ ఏ–330, ఎయిర్ బస్ ఏ–340 లాంటి అత్యాధునిక భారీ విమానాలను ల్యాండ్ చేసేందుకు వీలుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్పోర్టును ప్రారంభించనుండగా ఆగస్టు 17 నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు మొదలు కానున్నాయి.క్రెడిట్ తండ్రీ, తనయులదే..!‘‘మా ఫస్ట్ ఎయిర్పోర్టుకు హైదరాబాద్లో వైఎస్సార్ శంకుస్థాపన చేసి.. ఆయనే సీఎంగా ఉండగా నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో కూడా వైఎస్సార్ పాల్గొన్నారు. ఇది భగవంతుడి నిర్ణయమో ఏమో తెలియదు.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం..’’ – 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపనలో జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావుఎయిర్పోర్టుకు అనుబంధంగా మరిన్ని...» 5,000 చ.మీ విస్తీర్ణంలో లాజిస్టిక్ ఎకో సిస్టం, కార్గో టెర్మినల్ నిర్మాణంతో సరకు రవాణాకు విస్తృత అవకాశాలు» ఎయిర్పోర్ట్కు అనుబంధంగా ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్ హాలింగ్ వ్యవస్థల ఏర్పాటు» విమానాశ్రయ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా మరో 10,000 మందికి ఉద్యోగాల కల్పన 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన అనంతరం విమానాశ్రయం నమూనాను పరిశీలిస్తున్న నాటి సీఎం వైఎస్ జగన్ (ఫైల్) -
ఆర్టీసీని ప్రైవేటీకరించేది లేదు..
● మంత్రి ఎం.రాంప్రసాద్రెడ్డి విజయనగరం అర్బన్: ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయబోమని ప్రభుత్వ బస్సులు, కార్మికులు ఉన్నప్పుడే సంస్థ మనుగడ సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి కార్మికులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత సహాయం అందిస్తామని తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ను సందర్శించి, క్షేత్ర స్థాయిలో అందుతున్న సేవలు, పనితీరును తనిఖీ చేశారు. వర్క్షాప్లో ఎఫ్ఐపీ, ఇంజన్, మెషిన్ షాప్, ఎలక్ట్రికల్, బాడీ షాప్, గేర్ బాక్స్, లేత్ మిషన్ సెక్షన్లను దగ్గరుండి పరిశీలించారు. బస్సుల నిర్వహణ, మరమ్మతుల నాణ్యతపై అధికారులను ఆరా తీశారు. ప్రయాణికులకు సురక్షితమైన, మెరుగైన సేవలు అందించేలా నిర్వహణ ప్రమాణాలు పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఖర్చులు తగ్గిస్తూనే నాణ్యతను పెంచడంలో ఆర్టీసీ ముందుండాలని పిలుపునిచ్చారు. విజయనగరం వర్క్షాప్ జోన్ అంతటికీ ఉత్తమ సర్వీసులు అందిస్తోందని అధికారులు మంత్రికి వివరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగానే సంస్థలోకి ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులను ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో భాగంగా ఇటీవల పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మంత్రి రాంప్రసాద్రెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విశాఖపట్నం రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, వర్క్స్ మేనేజర్లు వరుణ్ కుమార్, అరుణ, స్టోర్స్ అధికారి రాజశేఖర్, సెక్యూరిటీ ఆఫీసర్ దుర్గాప్రసాద్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, పలువురు అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘లెక్క’లేని ఓట్లు.. లక్షకు మించి..!
విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రతిపాదించిన ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)–2026 ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ స్థానిక ఓటర్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రాథమిక ఓటరు జాబితాను పరిశీలిస్తే అధికారుల ఉదాసీనత, క్షేత్రస్థాయి సర్వేలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఓటర్ల వివరాలు సేకరించ లేకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షకు పైగా ఓట్లు ప్రశ్నార్థకం..! జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15,78,949 డిజిటలైజ్డ్ గణన ఫారాలను అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ముసాయిదా జాబితాలో 14,51,072 మందికి మాత్రమే చోటు దక్కింది. దీంతో దాదాపు 1.27 లక్షల మంది ఓటర్ల భవిష్యత్తు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడింది. సేకరించలేని ఫారాలలో కేవలం మరణాల పేరిట వేలాది మందిని పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉపాధి కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని, సర్వే సమయంలో ఇంట్లో లేని వారిని ‘శాశ్వత బదిలీ’, ‘గైర్హాజరు’ కింద జమ కట్టేశారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజాం నియోజకవర్గంలో అత్యధికంగా 223,688 ఫారంలు, బొబ్బిలిలో 21,274 ఫారంలు, చీపురుపల్లిలో 19,060 ఫారంలు లభించలేదని రికార్డుల్లో చూపడం క్షేత్రస్థాయి సర్వే ఎంత అసంపూర్తిగా సాగిందో అర్థం పడుతోంది. నోటీసుల పేరుతో సామాన్యుడిపై భారం ఓటరు వివరాలు సమర్పించని వారికి, వ్యత్యా సాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ నోటీసుల ప్రక్రియ నరకంగా మారే ప్రమాదం ఉంది. గుర్తింపు కోసం 11 రకాల కఠినమైన పత్రాలను ప్రతిపాదించడంతో సామాన్యులు, రెక్కాడితేగానీ డొక్కాడని పేద ప్రజలు తహసీల్దార్, ఈఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కేవలం ఆగస్టు 30 వరకు క్లైవ్ఏులు, అభ్యంతరాలకు గడువు ఇవ్వడం వల్ల తక్కువ సమయంలో అర్హులైన ఓటర్లు తమ పేర్లు నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. బీఎల్ఓలు సరిగ్గా ఇళ్లకు రాకుండానే ‘గైర్హాజరు’, ‘బదిలీ’ అని రాసేశారని, ఇప్పుడు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి పనులు వదులుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పలువురు బాధితులు వాపోతున్నారు. ఆగస్టు 30లోపు బాధితులంతా స్పందించి దరఖాస్తులు చేసుకోకపోతే అక్టోబర్ 3న ప్రచురించే తుది జాబితాలో వేలాది మంది ఓటు హక్కును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. 11 రకాల ఽధ్రువీకరణ పత్రాలు.. వివరాలు నింపి ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు సమర్పించిన వారిలో చాలా మంది 2002 నాటి జాబితాలో తమ, తమ సంబంధీకుల వివరాలతో మ్యాపింగ్ చేసుకోలేదు. అలాంటి వారికి నోటీసులిస్తారు. వీరు ఆధార్ కార్డు కాకుండా.. ఎన్నికల సంఘం నిర్ధేశించిన 11 రకాల ఽధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. వాటిలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డు లేదా పింఛను పేమెంట్ ఆర్డర్ ఉంటే సరిపోతుంది. అలాగే 1987 జూలై 1కు ముందు ప్రభుత్వ/స్థానిక సంస్థలు/బ్యాంకులు/జనన ధ్రువీకరణ పత్రం, బోర్డు/విశ్వవిద్యాలయం జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు, శాశ్వత నివాస ధ్రువీకరణ, అటవీ హక్కుల చట్టం సర్టిఫికెట్, కుల ఽధ్రువీకరణ. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(అమల్లో ఉన్న ప్రాంతాల్లోనే). రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన ఫ్యామిలీ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రాలు. జిల్లాలో 1.27 లక్షలకు పైగా ఓట్లకు గండం సర్ ప్రక్రియ తర్వాత భారీగా తగ్గిన ఓటర్ల సంఖ్య నోటీసుల పేరుతో సామాన్యులకు తప్పని తిప్పలు ముసాయిదా జాబితా విడుదల -
చంద్రబాబుది అబద్ధాల పాలన
విజయనగరం: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు నిర్మాణ చరిత ప్రజలకు తెలుసని, సీఎం చంద్రబాబు చెబుతున్న అబద్ధాలను నమ్మే స్థితిలో ఎవరూ లేరని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఎవరైనా తాము చేసింది చెప్పుకుంటారని.. చంద్రబాబు ప్రభుత్వం వారు చేయని పనులు చేసినట్లు చెప్పుకోవడం దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలిచే భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఘనత మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం అంతా తామే చేశామంటూ క్రెడిట్ చోరీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వాఖ్యానించారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎయిర్పోర్ట్ శంకుస్థాపన నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వంలో ఎవరేమి చేశారో ఆధారాలతో సైతం వివరించారు. అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే 2023లో శంకుస్థాపన... భోగాపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మజ్జి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. 2,203 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తరువాతనే 2023 మే నెలలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. శంకుస్థాపనకు ముందు రూ.135 కోట్లతో 14 కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్, విద్యుత్ సబ్స్టేషన్, లైటింగ్ సిస్టమ్, అప్రోచ్ రోడ్లు, తాత్కాలిక నీటిసరఫరా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఫలితంగానే ఎయిర్పోర్ట్ నిర్మాణం నిర్ణీత సమయానికి పూర్తయిందని వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం 2024 జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కేంద్రమంత్రి హోదాలో పర్యటించిన రామ్మోహన్నాయుడు అప్పటి వరకు 23 శాతం పనులు పూర్తయినట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం సదరు జీఎంఆర్ సంస్థ అగ్రిమెంట్ ప్రకారం పనులు చేపట్టడం మినహా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. శంకుస్థాపన రోజునే ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు 2026 నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని వెల్లడించారని, జిల్లా వాసిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. తాజాగా అంతా తామే చేసినట్లు చంద్రబాబు సర్కారు చెబుతుండడంపై ప్రజలు నవ్వుతున్నారన్నారు. ఉత్తరాంధ్రుల ఆర్థిక ప్రగతికి తండ్రీకొడుకులు సాయం రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారని మజ్జి శ్రీనివాసరావు గుర్తు చేశారు. ప్రజల అవసరాలను , సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపిన వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతో మంది ఉన్నత స్థాయి నాయకులున్నా ఎవ్వరూ చేయని అభివృద్ధిని తండ్రీతనయులు చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మూలపాడు పోర్టు, సముద్ర తీరంలో జెట్టీల నిర్మాణం, ఉద్దానంలో మంచి నీటి సరఫరా, భోగాపురంఎయిర్పోర్ట్ నిర్మాణం, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మాణం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారం... భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం వల్ల ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారమవుతుందన్నారు. కార్యక్రమంలో ముఖ్య అథిగా పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మాణాన్ని నిర్ణీత సమయానికి పూర్తిచేసిన జీఎంఆర్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో విజయనగరం జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆకాంక్షించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, ఇప్పిలి అనంత్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణ చరిత ప్రజలకు తెలుసు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఘనత వైఎస్ జగన్ మోహన్రెడ్డిదే.. ఉత్తరాంధ్రుల ఆర్థిక అభివృద్ధే తండ్రీ, తనయుల ఆకాంక్ష అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే 2023లో శంకుస్థాపన అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం 2026 నాటికి నిర్మాణం పూర్తి భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్రుల కల సాకారం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు -
అధికార బలంతో అభిమానులను అడ్డుకోలేరు
విజయనగరం రూరల్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర ప్రజలకున్న అభిమానాన్ని చంద్రబాబు అడ్డుకోవడం, అరచేతితో సూర్యకాంతిని అడ్డుకోవడంలాంటిదేనని మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నా రు. తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శ నేపథ్యంలో విజయనగరం జిల్లా మీదుగా గురు వారం పర్యటన సాగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు, ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివెలుతుంటే అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం విచారకరమన్నారు. యువత, ప్రజలు, అభిమానులు తమ వాహనాలను దూరంగా నిలిపేసి జననేతను చూడటానికి కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి తమ అభిమానాన్ని చాటుకున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారమదంతో ఈ విధమైన అడ్డంకులు సృష్టించడం సరికాదని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేస్తున్న మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ప్రమాదంలో చనిపోయిన కుటుంబానికి కూటమి మంత్రి రూ.10 లక్షలు, ఇల్లు ఇస్తామని ప్రకటించడంతో మాజీ మంత్రిపై వారి అక్కసు తేటతెల్లమవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రమాదాల్లో చనిపోయిన ప్రతీ ఒక్కరికీ ఇదే పరిహారం అందిస్తారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సంకల్పమే నేటి భోగాపురం విమానాశ్రయం గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంకల్పంతోనే నేడు భోగాపురంలో అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సాగుతోందని కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అప్పటివరకు 70 శాతం పనులు పూర్తిచేసిందన్నారు. 2024లో ప్రభుత్వం మారడంతో విమానాశ్రయ పనులు వేగవంతం చేయాల్సిన చంద్రబాబు సర్కారు ఎక్కడ ఆ క్రెడిట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్న దురుద్ధేశంతో పనులు ఆలస్యం చేసి రెండేళ్లు సాగదీసి, క్రెడిట్ను చోరీ చేసిందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే కృషి జరిగిందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నామని, దీనిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాత్ర వెలకట్టలేనిదన్నారు. సూపర్సిక్స్ పథకాలతో మోసగించారు కూటమి నేతలు ఎన్నికల హామీల్లో సూపర్సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీలను ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టేశారని కోలగట్ల విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కారు కలియుగదైవం వేంకటేశ్వరుని ఎదుట ప్రమాణం చేసి చెప్పగల ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు సర్కారు అబద్ధపు ప్రచారాలు చేస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టబోయే పోరుబాటలో ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు ఆశపు వేణు, కెల్ల త్రినాథ్, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ నాయకులు బంగారునాయుడు, ఎస్.వి.వి.రాజేష్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం పోలీసులు అడ్డంకులు సృష్టించడం విచారకరం రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదే.. మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి -
భోగాపురం.. భూములిచ్చిన రైతులు చెప్పింది ఇదే..
సాక్షి, విజయనగరం: భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత ముమ్మాటికీ వైఎస్ జగన్కే దక్కుతుందని.. ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు తేల్చి చెప్పారు. గురువారం.. వైఎస్ జగన్ విశాఖ మీదగా శ్రీకాకుళం వెళ్తున్న సందర్భంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ వద్ద ‘థ్యాంక్యూ జగన్ సార్’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భోగాపురం అభివృద్ధి ఏవిధంగా జరిగిందో తెలిపారు. అసలేం జరిగిందో భూములిచ్చిన తమకు తెలుసన్నారు. వైఎస్ జగన్ కృషితోనే ఇది జరిగిందన్నారు.భోగాపురం ఎయిర్పోర్ట్ వైఎస్ జగన్ కష్ట ఫలితం.. కానీ చంద్రబాబు మేం చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మరన్నారు. ఆనాడు రైతులను మోసం చేయడానికి 15 వేల ఎకరాలు తీసుకుంటానని చంద్రబాబు చెప్పితే.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2500కి తగ్గించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పునరావాసం కల్పించి.. అన్నివిధాలుగా ఆదుకున్నారన్నారు.‘‘సౌకర్యాలు కల్పించి రైతులకు వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ క్రెడిట్ తమదేనని చెప్పుకోవడం దారుణం. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కారణం ఎవరో? ఏం జరిగిందో? భూములిచ్చిన రైతులకు తెలుసు’’ అని స్థానికులు పేర్కొన్నారు. -
నరసాయమ్మ.. మరో గీతాంజలి కాకూడదు!
రాజకీయాల్లో మాటలు ఒక్కోసారి ఆయుధాలుగా మారుతాయి. ఒకరి వ్యాఖ్యలు మరొకరి ప్రచారానికి అస్త్రాలవుతాయి. కానీ ఆ మాటల వెనుక ఉన్న మనిషి జీవితం, ఎదుర్కొన్న పరిస్థితులు మాత్రం చాలాసార్లు కనిపించవు. భోగాపురం ఎయిర్పోర్టు వ్యవహారంలో ఇప్పుడు చర్చకు వచ్చిన నరసాయమ్మ విషయంలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.దాదాపు పదేళ్ల క్రితం భోగాపురంలో జరిగిన ఓ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం చంద్రబాబు సర్కార్ చేపట్టిన భూసేకరణ, రైతులకు పరిహారం అంశాలను ప్రస్తావిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే..నరసాయమ్మ తన భూమి కోల్పోతున్న ఆవేదనను వేదికపై వ్యక్తం చేసింది. ఎర్రబస్సు రాని చోటుకి ఎయిర్బస్ ఎందుకు? సర్.. అంటూ మాట్లాడింది( ఈ వ్యాఖ్యలనే జగన్ ప్రస్తావిస్తే.. జగనే ఆ మాట అన్నారని టీడీపీ మీడియా, సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది). ఆనాడు అయ్యన్నపాత్రుడి భూముల జోలికి పోకుండా.. ప్రభుత్వం తన కుటుంబానికి ఉన్న రెండెకరాల భూమి బాబు సర్కార్ లాక్కుంటుందనే విషయం ప్రస్తావించి.. న్యాయం కావాలని జగన్ సమక్షంలో వేడుకుంది.అయితే భోగాపురం ఘనత ఎవరిది? అనే ప్రస్తుత చర్చ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు, ప్రచారాలకు వేదికగా మారాయి. ఎయిర్పోర్టు విషయంలో ఎవరి పాత్ర ఎంత? ఎవరి నిర్ణయాల వల్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లింది? ఎలా పూర్తైంది? అనే క్రెడిట్ వార్లో నరసాయమ్మ పేరు కూడా తెరపైకి వచ్చింది. నరసాయమ్మ ఎక్కడ?.. ఎయిర్బస్సు వచ్చింది చూడమ్మా?.. జగన్ నీ నెత్తిన చెయ్యి పెట్టాడు.. అంటూ ఇలా ఆమెపై అభ్యంతకర సందేశాలు కనిపిస్తున్నాయి పలు పేజీల్లో.భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో వైస్సార్సీపీ, కూటమి నేతలు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు భూసేకరణలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేశామని, పరిహారం సైతం ఇప్పించామని, శంకుస్థాపనతో పనులు ప్రారంభించిందే తమ ప్రభుత్వమని వైఎస్సార్సీపీ లెక్కలతో చెబుతుంటే.. మరోవైపు ప్రాజెక్టు ప్రతిపాదన చేసింది తమదే కాబట్టి ఎంటైర్ క్రెడిట్ తమదేనని చంద్రబాబు పార్టీ చెబుతోంది. వాస్తవానికి విశాఖ ఎయిర్పోర్ట్ ఉండగా.. బలవంతపు భూసేకరణతో రైతులకు అన్యాయం చేయడం ఎందుకని? మాత్రమే జగన్ అన్నారు. అంతేగానీ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో ఏమాత్రం కాదు. ఆ ఉద్దేశమే ఉంటే.. ఉత్తరాంధ్రను అసలు పట్టించుకునేవారే కాదు కదా!. అధికారంలోకి రాగానే భోగారం ఎయిర్పోర్ట్ భూసేకరణను తగ్గించి.. నష్టపోయిన వాళ్లకు పరిహారం ఇప్పించి.. అన్ని అనుమతులతో శంకుస్థాపన చేసే వారా?.. అయితే ఈ రాజకీయ వాదోపవాదాల మధ్య పాపం నరసాయమ్మ సోషల్ మీడియాకు ఎక్కింది.గతంలో తెనాలికి చెందిన గీతాంజలి ఘటనను గుర్తు చేసుకుంటే.. సోషల్ మీడియా చర్చలు, ట్రోలింగ్లు ఒక వ్యక్తి జీవితంపై ఎంతటి ప్రభావం చూపగలవో అర్థమవుతుంది. వైఎస్ జగన్ వల్లే తన కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరిందని చెప్పినందుకు.. ఆమెను నెట్టింట తెగ ట్రోల్ చేశారు. అది చేసింది ఎవరో అందరికీ తెలుసు. అది తట్టుకోలేక మనస్థాపంతో బలన్మరణానికి పాల్పడిందామె. అంతకు ముందు బెండపూడి విద్యార్థిని విషయంలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు.. నరసాయమ్మను ఆ స్థాయిలోనే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సాధారణ మహిళ మాట్లాడిన మాటలను రాజకీయ కోణంలో చూసి వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రమాదకర ధోరణి. భోగాపురం విషయంలోనూ నరసాయమ్మను ఒక రాజకీయ ప్రతీకగా మార్చకుండా.. ఆమె ఒక సాధారణ మహిళ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు.. రాజకీయ విమర్శలు ఉండొచ్చు.. కానీ ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం సాగకూడదు.క్రెడిట్ కోసం ఒక మహిళను పావుగా మార్చే రాజకీయ ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, నరసాయమ్మ విషయంలోనైనా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త అవసరం. అదే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకునే సంస్కృతి ఎంతటి పార్టీకైనా, ఏ వర్గానికైనా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు విధానాలపై ఉండాలి కానీ వ్యక్తుల జీవితాలపై కాదు. రాజకీయ లాభాల కోసం ఆమెను తెరపైకి తీసుకొచ్చి, తమకు అనుకూలమైన కథనాన్ని నిర్మించే ప్రయత్నాలు జరిగితే అది మరో అన్యాయమే అవుతుంది. -
వైఎస్ జగన్ పట్టుదలకు సాక్ష్యం ఇదిగో..
చంద్రబాబే మొత్తం భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు ఎల్లో గ్యాంగ్ తెగ బిల్డప్ ఇస్తోంది. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డుపరంగా ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు కూటమి నేతలు నానా పాట్లు పడుతున్నారు. వైఎస్ జగన్ పడిన కష్టమేంటి?. ఆయన శ్రమ ఎలా ఫలించింది? అసలు వాస్తవం ఏంటో? పరిశీలిస్తే..వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుంబిగించారు. 2023 మే 3న భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. దాని వెనుక వైఎస్ జగన్ పడిన శ్రమను గుర్తుచేసుకుంటే.. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరో వైపు, రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు.హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు. విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం వైఎస్ జగన్.. ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరో వైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు.ఇదే క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాసప్యాకేజీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్షిప్లను తలదన్నేలా రెండు కాలనీలను వారి కోసం నిర్మించింది. -
2న రాష్ట్రస్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆగస్టు 2న నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు లీలాకృష్ణ, శ్రీకాంత్ గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి నగర శివారులోని విజ్జీ స్టేడియం ప్రాంగణంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు రన్స్, త్రోస్, జంప్స్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చేనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు విధిగా వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని సూచించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల చలో కలెక్టరేట్ విజయనగరం అర్బన్: ఏపీ స్టేట్ సమగ్ర శిక్ష కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ‘చలో కలెక్టరేట్’ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు నాని మాట్లాడుతూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసినపుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సాధ్యం కావడంలేదని ప్రశించారు. కేజీబీవీల గౌరవాధ్యక్షురాలు కె.విజయగౌరి, నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ తక్షణమే జూన్, జూలై నెలల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్టైమ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సమగ్ర హెచ్ఆర్ పాలసీ అమలు, ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లింపు, పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంపు, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, ఆరోగ్య భద్రత కల్పన, డీఎస్సీ నియామకాల్లో సర్వీస్ వెయిటేజీ డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ నెల 24న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఆర్.శ్రీనివాసారవు, లక్ష్మణరావు, దేవుడుబాబు, పోలినాయుడు, జయగణేష్ పాల్గొన్నారు. -
● జననేత రాకకోసం..
విజయనగరం రూరల్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శించేందుకు విజయనగరం జిల్లా మీదుగా వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేతకు విజయనగరం నియోజకవర్గ నేతలు ఘనస్వాగతం పలికారు. నాతవలస, సీహెచ్ అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై జననేతకు మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మేయర్ వి.విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కోలగట్ల శ్రావణిని జననేత ఆశీర్వదించారు.


