breaking news
Economy
-
ఇక ధరల లెక్క కొత్తగా
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ సూచీ.. క్షేత్రస్థాయిలో వాస్తవ ధరలను ప్రతిఫలించడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి సమాధానంగానా అన్నట్టు.. కేంద్ర ప్రభుత్వం వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ)లో కీలక మార్పులు, చేర్పులు చేసింది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్)కు ఇప్పటివరకు 2012 బేస్ ఇయర్గా ఉండగా దీన్ని 2024కు మార్చింది. గృహ వినియోగ, వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) 2023–24ను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. సీపీఐలో కొన్ని వినియోగ వస్తువులను, సేవలను చేరుస్తూ.. అదే సమయంలో కొన్నింటిని తొలగించింది. కొన్నింటి వెయిటేజీ తగ్గిస్తూ.. కొన్నింటికి పెంచింది. కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా చూస్తే ఈ ఏడాది జనవరిలో నిత్యావసర ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతానికి ఎగిసింది. 2012 బేస్ సంవత్సరం ప్రకారం డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.33 శాతమే. సీక్వెన్షియల్గా (నెలవారీ) పెరగ్గా.. 2025 జనవరిలో ఉన్న 4.26 శాతంతో పోలి్చనప్పుడు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జనవరిలో 2.77 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 2.73 శాతంగా నమోదైంది. ముఖ్యంగా ఆహారం, మెటల్స్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణం ఎగిసేందుకు దారితీసింది. దీంతో ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలోనూ పెరిగినట్టయింది. అయినప్పటికీ ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం 4 శాతానికి దిగువనే ఉండడం గమనార్హం. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసింది. → కొత్త సిరీస్ ప్రకారం దేశంలో అత్యధికంగా 4.92 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. ఆ తర్వాత కేరళ, తమిళనాడులో అధిక ద్రవ్యోల్బణం కనిపించింది. → జనవరిలో ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 2.13 శాతంగా, హౌసింగ్లో 2.05 శాతం చొప్పున నమోదైంది. వ్రస్తాలు, పాదరక్షల విభాగంలో 2.98 శాతంగా ఉంది. → వెల్లుల్లి, ఉల్లి, ఆలుగడ్డలు, కందిపప్పు, శనగపప్పు ధరలు తగ్గాయి. → వెండి, బంగారం, వజ్రం, ప్లాటినం ఆభరణాలు, టమాటాలు, కొబ్బరి, కొబ్బరి నూనె ధరలు పెరిగాయి. → కొత్త సిరీస్లో వస్తువులు 259 నుంచి 308కి పెరిగాయి. సేవలు సైతం 40 నుంచి 50కు చే రాయి. ధరల ప్రభావం మరింత వాస్తవికంగా ఉండేందుకు ఈ చేరికలు సాయపడనున్నాయి. → సూచీలో ఆహారం, పానీయాలకు ఇప్పటి వరకు 45.86 శాతం వాటా ఉంటే, కొత్త సిరీస్లో 36.75 శాతానికి తగ్గింది. సీపీఐలో చేరినవి → గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు (అద్దెలు, నిర్వహణ వ్యయాలు) → ఆన్లైన్ మీడియా సర్వీస్ ప్రొవైడర్లు/స్ట్రీమింగ్ సేవలు → విలువ ఆధారిత పాడి ఉత్పత్తులు → బార్లీ, సంబంధిత ఉత్పత్తులు → పెన్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ → వ్యాయామ పరికరాలు → అటెండెంట్, బేబీ సిట్టర్ (ఇళ్లలో సహాయకులు)సీపీఐ నుంచి తొలగించినవి → వీసీఆర్/వీసీడీ/డీవీడీ ప్లేయర్లు → రేడియో, టేప్రికార్డర్ → వినియోగించిన వ్రస్తాలు → సీడీ/డీవీడీలు, ఆడియా/వీడియో క్యాసెట్లు → కాయిర్/రోప్ → హైరింగ్ చార్జీలు (బాడుగకు తీసుకున్న వాటికి చెల్లించేవి) -
జనవరిలోనూ ఎగుమతులు సానుకూలమే
భారత వస్తు, సేవల ఎగుమతులు ఈ ఏడాది ఇప్పటి వరకు సానుకూల వృద్ధిని నమోదు చేసిట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకటించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ జనవరిలోనూ సానుకూలంగానే ఉన్నట్టు తెలిపారు. జనవరి నెలకు సంబంధించి అధికారిక డేటా ఈ నెలలో విడుదల అవుతుందన్నారు. బయోఫాచ్ 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన జర్మనీలోని న్యూరెమ్బర్గ్కు వచ్చిన సందర్భంగా మాట్లాడారు.భారత్లోని 20 రాష్ట్రాలకు చెందిన 100 మంది ఎగ్జిబిటర్లు ఆర్గానిక్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. ఐరోపా సమాఖ్య వీటికి పెద్ద మార్కెట్గా ఉంది. దేశ వస్తు ఎగుమతులు గత డిసెంబర్లో 2 శాతం పెరిగి 38.5 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అదే నెలలో దిగుమతులు 8.7 శాతం పెరిగి 63.55 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు (9 నెలల్లో) వస్తు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలి్చతే 2.44 శాతం పెరిగి 330.29 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వస్తు, సేవల ఎగుమతులు 850 బిలియన్ డాలర్లకు మించి నమోదవుతాయని వాణిజ్య శాఖ అంచనాగా ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
స్వచ్ఛ విద్యుత్కి పెట్టుబడుల పవర్
న్యూఢిల్లీ: భారత్ సమ్మిళిత, సుస్థిర వృద్ధి సాధించడంలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషించనుంది. జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడనుంది. ఈ నేపథ్యంలో శిలాజ ఇంధనాలను వినియోగించని, పర్యావరణహితమైన స్వచ్ఛ విద్యుత్, తటస్థ స్థాయి ఉద్గార (నెట్ జీరో) లక్ష్యాల సాధనకు భారీ పెట్టుబడులు అవసరం కానున్నాయి. 2070 నాటికి రెన్యువబుల్స్, స్టోరేజ్, పంపిణీ మొదలైన విభాగాలకు సంబంధించి విద్యుత్ రంగానికి 14.23 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ ఒక నివేదికలో ఈ విషయాలు వివరించింది. దేశాభివృద్ధి, వాతావరణ లక్ష్యాలన్నీ కూడా విద్యుత్పైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. 2047 నాటికి నిర్దేశించుకున్న వికసిత భారత్ లక్ష్యాలకు సంబంధించి ప్రస్తుత విధానాలను కొనసాగిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, 2070 నాటికి నిర్దేశించుకున్న నెట్ జీరో లక్ష్యాల సాధనకు తోడ్పడే విధానాలను అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే కోణాల్లో నివేదిక రూపొందింది. దీని ప్రకారం .. → 2025 డిసెంబర్ నాటికి 258 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంతో ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ మార్కెట్గా భారత్ నిలి్చంది. → తదుపరి దశ మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పట్టణీకరణ, కూలింగ్, డిజిటలీకరణ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, హరిత హైడ్రోజన్ మొదలైన వాటితో విద్యుత్కి డిమాండ్ భారీగా పెరగనుంది. వివిధ రకాల పునరుత్పాదక విద్యుత్ విభాగాల నుంచి పెరిగే డిమాండ్ని తట్టుకునే విధంగా వ్యవస్థ పటిష్టం కావాలి. → ఇందుకోసం నిల్వ సామర్థ్యాలను, పంపిణీ సామర్థ్యాలను పెంచుకోవాలి. గ్రిడ్ కార్యకలాపాలను ఆధునీకరించాలి. విశ్వసనీయమైన విధంగా, చౌకగా స్వచ్ఛ విద్యుత్ లభించేలా చూసేందుకు పంపిణీ అనేది ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చూడాలి. → దేశవ్యాప్తంగా విద్యుదీకరణ వేగవంతం కావడాన్ని బట్టి భారతదేశ విద్యుత్ పరివర్తన ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. → తలసరి విద్యుత్ వినియోగం 2025లో 1,400 కిలోవాట్అవర్ స్థాయి నుంచి 2070 నాటికి 7,000–10,000 కిలోవాట్అవర్కి పెరగనుంది. ఫ్రాన్స్, కొరియాలాంటి సంపన్న దేశాల స్థాయికి చేరనుంది. → ప్రస్తుత పాలసీలు ఇలాగే కొనసాగితే 2070 నాటికి మొత్తం స్థాపిత సామర్థ్యం తొమ్మిది రెట్లు పెరుగుతుంది. అదే తటస్థ ఉద్గారాల లక్ష్యాలకు అనుగుణమైన నెట్–జీరో విధానాలను అమలు చేస్తే 14 రెట్లు పెరుగుతుంది. → సోలార్ పీవీ సామర్థ్యం 5,500 గిగావాట్లకు చేరుతుంది. ప్రస్తుత పాలసీలను కొనసాగిస్తే ఇప్పుడు నామమాత్రంగా ఉన్న బ్యాటరీ స్టోరేజీ 1,400 గిగావాట్లకు చేరుతుంది. నెట్ జీరో విధానాలతో 3,000 గిగావాట్లకు చేరుతుంది. → దీర్ఘకాలికంగా విద్యుత్ పరివర్తనలో అణు విద్యుత్ వ్యూహాత్మక పాత్ర పోషించనుంది. 2025లో 8.8 గిగావాట్లుగా ఉన్న సామర్థ్యం 2070 నాటికి 300 గిగావాట్లకు పెరుగుతుంది. → ప్రస్తుత పాలసీల ప్రకారం 2070 నాటికి మొత్తం పెట్టుబడులు దాదాపు 8.79 లక్షల కోట్ల డాలర్లకు చేరనుండగా, నెట్ జీరో విధానాలతో 14.23 లక్షల కోట్ల డాలర్లకు చేరతాయి. -
ఖజానా హౌస్ఫుల్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 10 వరకు (2025 ఏప్రిల్ 1 నుంచి) ప్రత్యక్ష పన్నుల నికర ఆదాయం.. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 9.4 శాతం పెరిగి రూ.19.44 లక్షల కోట్లకు చేరింది. ఆదాయపన్ను శాఖ డేటా ప్రకారం రిఫండ్లు తగ్గడం, కార్పొరేట్ పన్ను (కంపెనీలు చెల్లించే) వసూళ్లు బలంగా ఉండడం ఇందుకు అనుకూలించింది. ఈ కాలంలో కార్పొరేట్ పన్నుల వసూలు 14.51% పెరిగి రూ.8.90 లక్షల కోట్లుగా ఉంటే.. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్యూఎఫ్లు) నుంచి ఆదాయం 5.91 శాతం పెరిగి రూ.10.03 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఆదాయపన్ను శాఖ డేటా తెలియజేస్తోంది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) రూపంలో ఖజానాకు రూ.50,279 కోట్లకు సమకూరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎలాంటి వృద్ధి లేదు. పన్ను రిఫండ్లు (తిరిగి చెల్లింపులు) 18.82 శాతం తగ్గి రూ.3.34 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ఇక ఫిబ్రవరి 10 నాటికి స్థూల పన్ను వసూళ్లు 4.09 శాతం పెరిగి రూ.22.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో కార్పొరేట్ పన్నుల స్థూల ఆదాయం రూ.10.88 లక్షల కోట్లుగా, నాన్ కార్పొరేట్ పన్నుల ఆదాయం రూ.11.39 లక్షల కోట్లుగా ఉంది. -
జీఎస్టీ అంటే భయమేలా?
దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి ఏడేళ్లు దాటినా సామాన్య పన్ను చెల్లింపుదారులు, చిరు వ్యాపారుల్లో దీనిపై నెలకొన్న ఆందోళనలు తగ్గడం లేదు. జీఎస్టీ అంటే కేవలం పన్ను విధానం మాత్రమే కాదు, అది ఒక క్లిష్టమైన సవాల్ అనే భావన బలంగా నాటుకుపోయింది. నిజాయితీగా వ్యాపారం చేసే వారు కూడా నోటీసులు వస్తాయేమోనని భయపడే పరిస్థితి ఎందుకు ఉంది? ప్రభుత్వం నుంచి అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇక్కడ చూద్దాం.జీఎస్టీ ఎందుకు భారంగా అనిపిస్తోంది?చాలా మంది వ్యాపారులు జీఎస్టీ వ్యవస్థను తమకు సహకరించే వ్యవస్థగా కాకుండా కేవలం పన్ను వసూలు చేసే యంత్రాంగంగా మాత్రమే చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు..ఆదాయపన్ను రిటర్న్ దాఖలులో చిన్న పొరపాటు జరిగినా లేదా ఆలస్యమైనా ఏటా 18% వడ్డీ భారం పడుతుంది. ఇది చిన్న వ్యాపారుల లాభాలను దెబ్బతీస్తోంది.కొనుగోలుదారు, విక్రేత ఇచ్చే లెక్కల్లో స్వల్ప తేడాలున్నా (జీఎస్టీఆర్-2బీ vs 3బీ) సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది.క్షేత్రస్థాయిలో తప్పులు జరిగినప్పుడు సరిదిద్దే మార్గాల కంటే శిక్షించే నిబంధనలే ఎక్కువగా ప్రచారంలో ఉండటం భయానికి కారణం.నోటీసు అంటే భయపడాలా?వ్యాపారులకు జీఎస్టీ నోటీసు అందగానే అదొక క్రిమినల్ కేసులా భావిస్తుంటారు. అధిక శాతం నోటీసులు అధికారులు స్వయంగా పంపేవి కావు. సాఫ్ట్వేర్ ద్వారా డేటాలో తేడాలను గుర్తించి జారీ అయ్యే స్క్రూటినీ నోటీసులు ఎక్కువగా ఉంటాయి. నోటీసు అంటే కేవలం వివరణ కోరడం మాత్రమే. సరైన ఆధారాలు చూపిస్తే చాలా వరకు సమస్యలు అక్కడితోనే ముగుస్తాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. జీఎస్టీ ప్రారంభ దశలో (2017-19) జరిగిన చిన్న పొరపాట్లకు వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపులు కూడా ఇచ్చారు.జీఎస్టీ చట్టం కింద విధించే జరిమానాల విషయంలో పన్ను చెల్లింపుదారులు అనవసర ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే చట్టం పొరపాట్లకు, మోసాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. సాధారణంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా అవగాహన లోపం వల్ల జరిగే సాధారణ తప్పుల విషయంలో శిక్షలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 10 శాతం లేదా రూ.10,000.. వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. ఇది కేవలం పన్ను చెల్లింపుదారుడిని క్రమశిక్షణలో ఉంచడానికి ఉద్దేశించిన చర్య మాత్రమే.అయితే, పన్నును ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టాలని చూసినా లేదా తప్పుడు లెక్కలతో వ్యవస్థను మోసం చేయాలని ప్రయత్నించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 100 శాతం వరకు, అంటే పన్నుకు సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధించే అధికారం ఉంటుంది. దీనివల్ల నిజాయితీగా ఉండే వ్యాపారులకు రక్షణ కలుగుతుండగా, అక్రమాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అందుతుంది.చాలా మందిలో ఉన్న మరొక ప్రధాన అపోహ ఏమిటంటే.. అధికారులు విధించిన జరిమానాపై అప్పీల్కు వెళ్తే అది మరింత పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పన్ను చెల్లింపుదారుడి వద్ద సరైన ఆధారాలు ఉండి, చట్టబద్ధంగా వారి వాదన బలంగా ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ద్వారా ఉపశమనం పొందే హక్కు వారికి ఉంటుంది. కాబట్టి చట్టంపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఇటువంటి అపోహల నుంచి బయటపడవచ్చు.తెర వెనుక ఏం జరుగుతుంది?జీఎస్టీ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా డేటా అనలిటిక్స్ ఆధారంగా నడుస్తోంది. ఒక వ్యాపారి నిరంతరం తప్పుడు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేస్తున్నా లేదా పదే పదే రిటర్న్లు ఎగ్గొడుతున్నా వారిని మాత్రమే వ్యవస్థ హై రిస్క్ కేటగిరీలో ఉంచుతుంది. అధికారుల జోక్యం తగ్గించేందుకు ‘ఫేస్లెస్ అసెస్మెంట్’(పన్ను చెల్లింపుదారుడు, పన్ను అధికారి ప్రత్యక్షంగా ముఖాముఖి కలవాల్సిన అవసరం లేకుండానే పన్ను మదింపు ప్రక్రియను పూర్తి చేసే ఒక ఆధునిక విధానం) వంటి విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.అవగాహనే రక్షణజీఎస్టీ అనేది చట్టం కంటే దానిపై సమాచార లోపం వల్లే ఎక్కువగా క్లిష్టంగా కనిపిస్తోంది. సకాలంలో రిటర్న్లు దాఖలు చేయడం, నోటీసులకు వెంటనే స్పందించడం, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.- దవనం శ్రీకాంత్ -
బ్యాంకులకు లాభాల కళ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభాల మోత మోగించాయి. ఎస్బీఐ సహా 12 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉమ్మడిగా రూ.52,603 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.44,473 కోట్లతో పోల్చి చూస్తే 18 శాతం మేర (రూ.8,130 కోట్లు) పెంచుకున్నాయి. → అన్నింటిలోకి ఎస్బీఐ వాటా అధికంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో ఎస్బీఐ రూ.21,028 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చతే 24 శాతం పెరిగింది. → చెన్నై కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 35 శాతం అధికంగా రూ.1,365 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. → సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 32 శాతం పెరిగి రూ.1,263 కోట్లుగా ఉంది. → లాభంలో అధిక వృద్ధిని చూపించిన వాటిల్లో ఎస్బీఐతోపాటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (27 శాతం), కెనరా బ్యాంక్ (26 శాతం) ఉన్నాయి. → పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (19 శాతం) యూకో బ్యాంక్ (16 శాతం), పీఎన్బీ 13 శాతం చొప్పున లాభాన్ని డిసెంబర్ త్రైమాసికంలో పెంచుకున్నాయి. → 12 ప్రభుత్వరంగ బ్యాంక్ల ఉమ్మడి లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో 11 శాతం పెరిగి రూ.44,218 కోట్లుగా ఉంది. సెపె్టంబర్ త్రైమాసికంలో 9 శాతం తక్కువగా రూ.49,456 కోట్లుగా ఉండడం గమనించొచ్చు. → ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరి వరకు తొమ్మిది నెలల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం రూ.1,46,277 కోట్లకు చేరింది. అంక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.1,29,994 కోట్లుగా ఉంది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పీఎస్బీల లాభం రూ.2లక్షల కోట్లను అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు వ్యక్తం చేశారు. -
ఏప్రిల్ 1 విడుదల
న్యూఢిల్లీ: ప్రాపర్టీ, వాహన కొనుగోళ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు ఇకపై ప్రతిసారీ పాన్ సమర్పించాల్సిన అవసరం రాదు! ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపన్ను చట్టం కింద పాన్ విషయమై పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట దక్కనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సోమవారం విడుదల చేసింది. సంప్రదింపుల అనంతరం తుది నిబంధనలను మార్చి మొదటి వారంలో సీబీడీటీ నోటిఫై చేస్తుంది. క్రిప్టో ఎక్సే్ఛంజ్లు ఆదాయపన్ను శాఖతో సమాచారం పంచుకోవడాన్ని తప్పనిసరి కానుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆమోదనీయమైన ఎలక్ట్రానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది. కొత్త నిబంధనలు ఇవే.. → ప్రస్తుతం బ్యాంకుల్లో ఒకరోజులో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తుంటే పాన్ కాపీ ఇవ్వడం తప్పనిసరి. అలాగే, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జమలు, ఉపసంహరణలు రూ.20 లక్షలు మించినప్పుడు కూడా ఇవ్వాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు డిపాజిట్, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఇస్తే సరిపోతుంది. ఒక వ్యక్తికి ఒకటికి మించిన ఖాతాలున్నా సరే.. అన్నింటికీ ఉమ్మడిగా రూ.10 లక్షల పరిమితే వర్తిస్తుంది. → ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు లేదా విక్రయం లేదా బహుమతిగా ఇవ్వడం లేదంటే ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు చేసుకునే ఒప్పందం విలువ రూ.10 లక్షలకు మించితే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. ఇకపై (ఏప్రిల్ 1 నుంచి) రూ.20 లక్షలకు మించినప్పుడే ఈ నిబంధన అమలవుతుంది.→ వాహనం కొనుగోలు విలువ రూ.5లక్షల్లోపు ఉంటే ఇకపై పాన్ అవసరం పడదు. కొనుగోలు ధర రూ.5లక్షలకు మించినప్పుడే పాన్ సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వాహనాలకూ ఇకపై ఇదే అమలుకానుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. → హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు లేదా బాంక్వెట్ హాళ్ల (వేడుకల కేంద్రాలు)కు చేసే చెల్లింపులు రూ.లక్షకు మించితే ఇక మీదట పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50వేలు మించినప్పుడే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. → ఇకపై జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమలవుతోంది. → ప్రథమ శ్రేణి మెట్రోలుగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్లను సైతం గుర్తించింది. ఈ నగరాల్లో నివసించే వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)పై మినహాయింపుల పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరగనుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలకే ఈ గుర్తింపు ఉంది. → అధికారిక వాహనాలు, ఉద్యోగులకు సంస్థలు సమకూర్చే భోజనాలకు సైతం పన్ను మినహాయింపుల పరిమితులు పెరగనున్నాయి. వాహనం కోసం ప్రతి నెలా రూ.8,000, ప్రతి భోజనం రూ.200కు పన్ను ఉండదు. → కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచి్చన తర్వాత పన్ను రిటర్నుల దాఖలు కూడా సులభతరం కానుంది. → ప్రస్తుతం రూ.2 లక్షలకు మించి చేసే బంగారం కొనుగోళ్లకు (ఆభరణాలు, కాయిన్లు, ఇతర రూపాల్లోని బంగారం) పాన్ తప్పనిసరి. దీనితోపాటు జాబితాలో లేని ఇతర అన్ని లావాదేవీలకు ప్రస్తుత నిబంధనలే కొత్త చట్టం కింద అమలు కానున్నాయి. -
EPFO 3.0: పీఎఫ్ విత్డ్రా మరింత సులభం!
ఈపీఎఫ్ఓ చందాదారులు.. తమ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా గతంలోనే వెల్లడించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త మొబైల్ అప్లికేషన్ను 2026 ఏప్రిల్ నాటికి ప్రారంభించనున్నారు.ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రారంభించనున్న మొబైల్ అప్లికేషన్ ద్వారానే.. 8 కోట్ల మంది సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా నేరుగా విత్డ్రా చేసుకోవచ్చు. EPFO 3.0 అప్గ్రేడ్లో భాగంగా తీసుకొస్తున్న ఈ కొత్త విధానం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ప్రస్తుతం పీఎఫ్ విత్డ్రా చేసుకోవాలనుంటే.. అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది. దీనిని మరింత సులభతరం చేయడానికి యూపీఐ విత్డ్రా తీసుకురావడం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఆటో సెటిల్మెంట్ మోడ్ లిమిట్ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు.ఈపీఎఫ్ఓ సభ్యులు తమ బ్యాంక్ ఖాతాలకు యూపీఐ పిన్ ఉపయోగించి ఎంత మొత్తం విత్డ్రా చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారో ఆ మొత్తాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు.ఒకసారికి కేవలం రూ. 25వేలు విత్డ్రా చేసుకోవచ్చు.యాప్లో మీరు ఎంత మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది.ప్రస్తుతం ఈ విధానం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ట్రయల్ రన్స్ చేస్తున్నారు. తద్వారా ఏదైనా సాంకేతిక సమస్యలు ముందే గుర్తించి పరిష్కరించవచ్చు. కొత్త యాప్ ప్రధాన మొబైల్ ఇంటర్ఫేస్గా యూపీఐ విత్డ్రా కోసం ఉపయోగిస్తారు. అయితే అధికారిక వెబ్సైట్, ఉమాంగ్ యాప్ కూడా ఇతర సేవల కోసం ఉపయోగించుకోవచ్చు. -
ఆదాయపు పన్ను చట్టంలో కొత్త మార్పులు!
కేంద్ర ప్రభుత్వం.. ఆదాయ పన్ను చట్టం 2025ను.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫారమ్స్ విడుదల చేసింది. ఇందులో అనేక కొత్త నిబంధనలను ప్రతిపాదించారు.కొత్త నిబంధనలలో ప్రతిపాదించిన అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఆదాయపు పన్ను ఫారమ్లకు కొత్త సంఖ్యలు ఇవ్వడం. పాత ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఉపయోగించిన అనేక ఫారమ్లకు.. ఇప్పుడు కొత్త సంఖ్యలు కేటాయిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, గందరగోళాన్ని తగ్గించడం, కొత్త చట్టానికి అనుగుణంగా ఒకే విధమైన నిర్మాణం తీసుకురావడం.కొత్త మార్పులు➤టాక్స్ ఆడిట్కు సంబంధించిన పాత ఫారమ్లు 3CA, 3CB, 3CD ఇకపై విడివిడిగా ఉండవు. వీటన్నింటిని కలిపి ఫారమ్ 26గా మార్చారు.➤ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆడిట్కు ఉపయోగించే ఫారమ్ 3CEB ఇప్పుడు ఫారమ్ 48గా మారుతుంది.➤ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC) కోసం ఉపయోగించే ఫారమ్ 10FAను ఫారమ్ 42గా మార్చారు.➤ఎమ్ఏటీ సర్టిఫికేషన్ కోసం ఉన్న ఫారమ్ 29B ఇప్పుడు ఫారమ్ 66 అవుతుంది.➤డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) సంబంధిత సమాచారానికి ఉపయోగించే ఫారమ్ 10F ఇకపై ఫారమ్ 41గా ఉంటుంది.TDS & TCSకు సంబంధించిన మార్పులు➤TCS రిటర్న్ కోసం ఉన్న ఫారమ్ 27EQ ఇప్పుడు ఫారమ్ 143 అవుతుంది.➤తక్కువ లేదా నిల్ TDS సర్టిఫికేట్ కోసం ఉపయోగించే ఫారమ్ 13ను ఫారమ్ 128గా మార్చారు.➤నాన్-రెసిడెంట్లకు సంబంధించిన TDS రిటర్న్ (ఫారమ్ 27Q) ఇప్పుడు ఫారమ్ 144గా మారుతుంది.➤జీతభత్యాలపై TDS రిటర్న్ అయిన ఫారమ్ 24Q ఇకపై ఫారమ్ 138 అవుతుంది.➤ఉద్యోగులకు ఇచ్చే శాలరీ టీడీఎస్ సర్టిఫికెట్ (ఫారమ్ 16) ఇప్పుడు ఫారమ్ 130గా మారుతుంది.➤రెసిడెంట్లకు సంబంధించిన టీడీఎస్ రిటర్న్ (ఫారమ్ 26Q)ను ఫారమ్ 140గా మారుతుంది.చారిటబుల్ ట్రస్టులు & NGOలకు ఫారమ్ మార్పులు➤తాత్కాలిక నమోదు కోసం ఇప్పటివరకు ఉపయోగించిన ఫారమ్ 10Aను ఇప్పుడు ఫారమ్ 104గా మార్చారు.➤తుది నమోదు లేదా రెన్యువల్ కోసం ఉన్న ఫారమ్ 10AB.. ఇకపై ఫారమ్ 105 అవుతుంది.➤ఆదాయం నిల్వ కోసం ఉన్న ఫారమ్ 10ను ఫారమ్ 109గా మార్చారు.➤ఆడిట్ రిపోర్టుల కోసం ఉపయోగించే ఫారమ్ 10B, 10BB స్థానంలో ఇప్పుడు ఒకే ఫారమ్ 112 ఉంటుంది.➤డోనీ స్టేట్మెంట్ కోసం ఉన్న ఫారమ్ 10BD ఇప్పుడు ఫారమ్ 113గా మారుతుంది.➤డోనర్ సర్టిఫికేట్ కోసం ఉన్న ఫారమ్ 10BEను.. ఫారమ్ 114గా మార్చారు.ఇతర ముఖ్యమైన ఫారమ్ మార్పులు➤విదేశీ రిమిటెన్సుల కోసం సీఏ సర్టిఫికేట్ అయిన ఫారమ్ 15CB ఇప్పుడు ఫారమ్ 146 అవుతుంది.➤యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్గా ఉపయోగించే ఫారమ్ 26AS ఇకపై ఫారమ్ 168గా మారుతుంది.➤ఆర్థిక లావాదేవీల వివరాల కోసం ఉన్న స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ ఫారమ్ 61Aను ఫారమ్ 165గా మార్చారు.➤విదేశీ రిమిటెన్స్ డిక్లరేషన్కు సంబంధించిన ఫారమ్ 15CA ఇప్పుడు ఫారమ్ 145గా ఉంటుంది.ఈ మార్పుల వల్ల పన్ను వ్యవస్థ మరింత సరళంగా ఉంటుందని.. డిజిటల్కు అనుకూలంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపార సంస్థలు ఈ కొత్త ఫారమ్ సంఖ్యలను ముందుగానే అవగాహన చేసుకుని, 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త చట్టానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం.ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే? -
దేశవ్యాప్తంగా కోటి మందికి ఆధార్ అప్డేట్ పూర్తి
దేశంలోని పాఠశాల విద్యార్థుల ఆధార్ డేటా అప్డేట్ ప్రక్రియలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా సుమారు 83,000 పాఠశాలల్లో చదువుతున్న కోటి మందికి పైగా విద్యార్థులకు ‘తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్స్’ (ఎంబీయూ) పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.ఎందుకు ఈ అప్డేట్ తప్పనిసరి?సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం ఫొటో, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను మాత్రమే సేకరిస్తారు. ఆ వయసులో పిల్లల వేలిముద్రలు, కనుపాప (ఐరిస్) గుర్తులు పూర్తిగా పరిపక్వం చెందవు కాబట్టి వాటిని తీసుకోరు. అయితే 5 ఏళ్లు, 15 ఏళ్లు దాటిన తర్వాత పిల్లలు తమ బయోమెట్రిక్ వివరాలను ఆధార్లో అప్డేట్ చేయడం అత్యవసరం. ఈ వివరాలు అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి కూడా ఈ అప్డేట్ తప్పనిసరి.ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశంవిద్యార్థులకు వీలుగా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు అక్టోబర్ 1 నుంచి ఏడాది పాటు ఈ బయోమెట్రిక్ అప్డేట్ను ఉచితంగా అందిస్తోంది. పాఠశాలల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కేంద్రాల్లో కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఇప్పటికే కేంద్రాల ద్వారా సుమారు 1.3 కోట్ల అప్డేట్లు పూర్తయ్యాయి.సాంకేతికతతో వేగవంతంసెప్టెంబర్ 2025లో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) అప్లికేషన్తో ఆధార్ డేటాను అనుసంధానం చేయడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతమైంది. దీని ద్వారా ఏ విద్యార్థికి అప్డేట్ అవసరమో సులభంగా గుర్తించి నేరుగా పాఠశాలల్లోనే శిబిరాలు నిర్వహిస్తున్నారు. ‘దేశంలోని అన్ని పాఠశాలలు కవర్ అయ్యే ఈ ప్రక్రియ కొనసాగుతుంది’ అని యూఐడీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఉడాయ్ సీఈఓ భువనేష్ కుమార్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాస్తూ పాఠశాలల్లో శిబిరాల నిర్వహణకు సహకరించాలని కోరారు.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
రికార్డు దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు
భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) అద్భుతమైన ఆర్థిక ప్రగతితో పటిష్టంగా ఉన్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల ఉమ్మడి లాభం రూ.2 లక్షల కోట్ల మార్కును దాటుతుందని ఆయన అంచనా వేశారు.ఆర్థిక బలం - వృద్ధి గణాంకాలుతాజాగా ఓ సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బ్యాంకింగ్ రంగ వృద్ధిని విశ్లేషించారు. ‘ఈ ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతంగా నమోదైంది. డిపాజిట్ల వృద్ధి కూడా 10 శాతం వద్ద ఆశాజనకంగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు ఉన్న లాభం, 2023-24లో రూ.1.41 లక్షల కోట్లకు, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే దాదాపు రూ. 1 లక్షల కోట్లు లాభాన్ని బ్యాంకులు ఆర్జించాయి’ అన్నారు.‘ఆర్బీఐ పటిష్టమైన పర్యవేక్షణలో మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా సురక్షితంగా ఉంది. అంతర్జాతీయ అంశాలు మన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన చెందడం లేదు’ అని నాగరాజు పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
‘అమెరికాకు భారత్ తలొగ్గలేదు’
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. 18 శాతం సుంకానికి అంగీకరించడం ద్వారా భారత్ అమెరికాకు తలొగ్గిందన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. చైనా ఎగుమతులు 35 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత ఎగుమతులకు లభించే 18 శాతం సుంకం దేశానికి పెద్ద ఊరటనిస్తుందని విశ్లేషించారు. ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోయల్ కొన్ని అంశాలను వెల్లడించారు.బలమైన ఆర్థిక శక్తిగా భారత్ప్రస్తుతం భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎంతో ఆత్మవిశ్వాసంతో చర్చల్లో పాల్గొంటోందని గోయల్ అన్నారు. ‘2047 నాటికి భారత్ 30-35 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. భవిష్యత్తులో మనం అందించే భారీ మార్కెట్ అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో దేశానికి అతిపెద్ద బలం’ అని ఆయన అభివర్ణించారు.అమెరికా నుంచి కొనుగోళ్లువచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయడంపై భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘భారతదేశం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఈ లక్ష్యం చాలా తక్కువ. మొత్తం రెండు ట్రిలియన్ డాలర్ల దిగుమతి డిమాండ్లో అమెరికా వాటా కొంత భాగమే. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కొంటున్న 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను, పోటీతత్వాన్ని బట్టి అమెరికా సరఫరాదారుల నుంచి తీసుకునే అవకాశం ఉంది. విమానయాన రంగం, ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్ వంటి వాటికి భారత్ ప్రాధాన్యత ఇస్తుంది’ అన్నారు.వ్యూహాత్మక చర్చలువాణిజ్య చర్చలంటే కేవలం అంకెలు కాదని, అవి దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని గోయల్ పేర్కొన్నారు. ‘మేము వివిధ దేశాలతో ఇప్పటివరకు కుదుర్చుకున్న తొమ్మిది ఒప్పందాల్లో ఎక్కడా జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదు. చర్చల్లో ప్రశాంతత ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం’ అని ఆయన వెల్లడించారు.భారత్-ఈయూ ఒప్పందంపై మాట్లాడుతూ, ప్రధాని మోదీకి ప్రపంచ దేశాధినేతలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కూటమిలోని 27 దేశాల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ప్రధాని మార్గదర్శకత్వంలో హోం మంత్రి అమిత్ షా, కేబినెట్ సహకారంతో గ్లోబల్ ట్రేడ్ మార్కెట్లో భారత్ కీలకంగా మారుతుందని గోయల్ అన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం
భారత్-యూఎస్ మధ్య ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై దేశంలోని కొన్ని రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), దాని రాజకీయేతర విభాగం, ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) సహా పలు సంఘాలు ఈ ఒప్పందాన్ని భారత వ్యవసాయ రంగాన్ని అమెరికన్ బహుళజాతి సంస్థలకు అప్పగించే చర్యగా అభివర్ణించాయి. దీనికి నిరసనగా వచ్చే వారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.ప్రధానాంశాలు.. ఆరోపణలుఇటీవల విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రైతు నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ఒప్పందంలోని నిబంధనలు భారతీయ రైతులకు గొడ్డలిపెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకటనలోని అంశాలు కింది విధంగా ఉన్నాయి.మధ్యంతర ఒప్పందం ప్రకారం, అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని పారిశ్రామిక వస్తువులు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తొలగించడం లేదా భారీగా తగ్గించాల్సి ఉంటుంది.భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్త్రాలు, తోలు, ప్లాస్టిక్, యంత్రాలు వంటి వస్తువులపై అమెరికా 18 శాతం పరస్పర సుంకాన్ని వర్తింపజేయనుంది. ఇది భారతీయ ఎగుమతిదారులపై భారం మోపుతుంది.కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపిస్తూ.. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది.ఫిబ్రవరి 12న నిరసనరైతు సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయని ప్రకటనలో తెలిపారు. అదే రోజు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సాధారణ సమ్మెకు ఎస్కేఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.వ్యవసాయంపై ప్రభావంఏఐకేఎస్ నేత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘అమెరికా నుంచి సోయాబీన్ నూనె, ఎర్ర జొన్న, పశువుల దాణా వంటివి భారత్లోకి వెల్లువలా వస్తాయి. దీనివల్ల స్థానిక మార్కెట్ దెబ్బతింటుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు ఈ ఒప్పందం వల్ల మరింత సంక్షోభంలోకి వెళ్తారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ వాదనమరోవైపు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసం, ధాన్యాలు, పండ్లు (నారింజ, స్ట్రాబెర్రీ వంటివి) వంటి సున్నితమైన రంగాల్లో భారత్ ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా చర్చలు సాగుతున్నాయని, ఎక్కడా లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక -
ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాలా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సామాన్య పెట్టుబడిదారులను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన ‘ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్’ మొబైల్ యాప్ భారతీయ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. గతంలో కేవలం బ్యాంకులు, పెద్ద సంస్థలకే పరిమితమైన ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. దీన్ని ప్రారంభించి చాలా రోజులైనా దీని గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. దీర్ఘకాలంలో కచ్చితమైన రాబడులను ఇస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాండ్లను కొనుగోలు చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.ఈ యాప్ ద్వారా పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు (ఎస్డీఎల్), ట్రెజరీ బిల్లులు (T-Bills), సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)లో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం ఆర్బీఐ వద్ద ‘రిటైల్ డైరెక్ట్ గిల్ట్’ ఖాతాను తెరవాల్సి ఉంటుంది.లాభాలుఇవి ప్రభుత్వ బాండ్లు కాబట్టి మీ పెట్టుబడికి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. అంటే అసలు, వడ్డీ తిరిగి వస్తుందనే నమ్మకం ఉంటుంది.ఈ ఖాతా తెరవడానికి, దాన్ని నిర్వహించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. బ్రోకరేజ్ ఛార్జీలు కూడా ఉండవు.మధ్యవర్తులు లేకుండా నేరుగా ఆర్బీఐ నిర్వహించే ప్రైమరీ మార్కెట్ వేలంలో సామాన్యులు కూడా బిడ్లు దాఖలు చేయవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కొన్నిసార్లు మెరుగైన వడ్డీ రేట్లను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఇది సాధ్యమవుతుంది.సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా ఫిజికల్ గోల్డ్ కంటే తక్కువ ధరకు, అదనపు వడ్డీతో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. (ఇటీవల కాలంలో బంగారం భారీగా పెరగడంతో ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్లను నిలిపేసిందని గమనించాలి)పరిమితులుషేర్ మార్కెట్తో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో సెకండరీ మార్కెట్ లావాదేవీలు తక్కువగా ఉంటాయి. అంటే అత్యవసరంగా అమ్మాలనుకున్నప్పుడు కొనుగోలుదారులు త్వరగా దొరక్కపోవచ్చు.మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగితే, మీరు గతంలో తక్కువ వడ్డీకి కొన్న బాండ్ల విలువ తగ్గుతుంది. దీన్ని మార్కెట్ రిస్క్ అంటారు.బాండ్ల ద్వారా వచ్చే వడ్డీపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎఫ్డీల మాదిరిగానే దీనికి పన్ను మినహాయింపులు తక్కువ.యాప్ను వాడటం, బిడ్డింగ్ వేయడం వంటి ప్రక్రియలు గ్రామీణ లేదా తక్కువ అవగాహన ఉన్నవారికి కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు.ఎవరికి మేలు?రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి, తమ డబ్బు సురక్షితంగా ఉండాలనుకునే వారికి ఇది మెరుగైన వేదిక.నెలవారీ లేదా వార్షిక ఆదాయం కోసం దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరం.కేవలం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్పైనే ఆధారపడకుండా తమ పెట్టుబడులను వైవిధ్యపరచాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది సరైనది.పిల్లల చదువులు లేదా పెళ్లిళ్ల కోసం 10-30 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టేవారికి ఇది ఉత్తమం. దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లు తక్కువ మొత్తాన్ని సమకూర్చే అవకాశం ఉంది.ప్రభుత్వ సెక్యూరిటీల రకాలుట్రెజరీ బిల్లులు.. ఇవి స్వల్పకాలిక పెట్టుబడులు (మెచ్యురిటీ పీరియడ్ 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజులు).ప్రభుత్వ బాండ్లు.. ఇవి దీర్ఘకాలిక పెట్టుబడులు (5 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉంటాయి). వీటికి స్థిరమైన వడ్డీ వస్తుంది.రాష్ట్ర అభివృద్ధి రుణాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాల కోసం జారీ చేసే బాండ్లు.వడ్డీ ఎంత?ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ఇది మార్కెట్ పరిస్థితులు, ఆర్బీఐ రెపో రేటు, కాలపరిమితిపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. సాధారణంగా వీటిపై వడ్డీ 7% నుంచి 7.5% మధ్యలో ఉండే అవకాశం ఉంది (ఇది మారుతూ ఉండవచ్చు). దీర్ఘకాలిక బాండ్లపై వడ్డీని (దీన్ని కూపన్ అంటారు) సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ట్రెజరీ బిల్లులపై నేరుగా వడ్డీ ఉండదు. ఉదాహరణకు రూ.100 విలువైన బిల్లును ప్రభుత్వం రూ.98 కి అమ్ముతుంది. గడువు తీరాక మీకు రూ.100 ఇస్తుంది. ఆ రూ.2 మీ లాభం.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక -
చైనా దూకుడు.. ఆపకుండా బంగారం కొంటున్న డ్రాగన్!
బంగారం, వెండి ధరలు ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన అనంతరం తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో కొత్త కదలికలకు దారితీసింది. ధరలు తీవ్ర అస్థిరతను చూపుతున్నప్పటికీ, చైనా మాత్రం బంగారం కొనుగోలును దూకుడుగా కొనసాగిస్తోంది. చైనా కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) వరుసగా 15వ నెల కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంది.2,307 మెట్రిక్ టన్నుల బంగారంపీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా విడుదల చేసిన డేటా, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. గత జనవరి నెలలో కూడా చైనా బలమైన బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. జనవరి చివరి నాటికి చైనా మొత్తం బంగారం నిల్వలు 74.19 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు (ఒక ఫైన్ ట్రాయ్ ఔన్సు అంటే 31.1035 గ్రాములు మొత్తం 2,307.56 మెట్రిక్ టన్నులు) చేరాయి. ఇది డిసెంబర్ చివర్లో నమోదైన 74.15 మిలియన్ ట్రాయ్ ఔన్సులతో పోలిస్తే స్వల్ప పెరుగుదలే అయినప్పటికీ, నిల్వల మొత్తం విలువ మాత్రం గణనీయంగా పెరిగింది.ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకే?జనవరి చివరి నాటికి చైనా బంగారం నిల్వల మొత్తం విలువ 369.58 బిలియన్ డాలర్లకు చేరింది. గత నెలలో ఇది 319.45 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఈ భారీ పెరుగుదలకి ప్రధాన కారణాలుగా నెల ప్రారంభంలో ఉన్న అధిక బంగారం ధరలు, అలాగే చైనా నిరంతర కొనుగోలు వ్యూహాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ప్రమాదాల నేపథ్యంలో చైనా తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే భాగంగా బంగారం నిల్వలను పెంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చైనా నుంచి వచ్చిన బలమైన డిమాండ్, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జరిగిన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణంగా జనవరిలో బంగారం ధరలు ఔన్సుకు 5,600 డాలర్ల చారిత్రక గరిష్టాన్ని తాకాయి. అయితే ఈ ర్యాలీ ఎక్కువ కాలం కొనసాగలేదు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్లో తదుపరి కీలక నాయకత్వ పాత్రకు కెవిన్ వార్ష్ను పరిగణనలోకి తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడడంతో మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా స్పాట్ గోల్డ్ ధరలు గణనీయంగా పడిపోయాయి.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,887 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ దిద్దుబాటు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరల దిశపై అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం కొనుగోలు చేస్తుండగా, అదే సమయంలో దేశీయ వినియోగదారుల బంగారం వినియోగం మాత్రం వరుసగా రెండో ఏడాది కూడా తగ్గుముఖం పట్టింది.భారత్ పసిడి నిల్వలు ఇలా..జనవరి 2026 నాటికి, భారతదేశ కేంద్ర బ్యాంకు తన విదేశీ మారక నిల్వలలో సుమారు 880 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. తాజా విదేశీ నిల్వల డేటా ప్రకారం జనవరి చివరి నాటికి భారతదేశ మొత్తం రిజర్వ్ వాల్యుయేషన్కు ఆర్బీఐ బంగారం హోల్డింగ్స్ సుమారు 123 బిలియన్ డాలర్లు దోహదపడ్డాయి. ప్రపంచ ధరల లాభాలతో భారతదేశ బంగారం నిల్వ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ తాజా పసిడి కొనుగోళ్లు గణనీయంగా మందగించాయి. -
ఎంఎస్ఎంఈలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు
న్యూఢిల్లీ: భారత్–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈలు)కు అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్ వ్యవస్థల్లో అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. వ్యాపారాలు, కస్టమర్లపై వ్యయాల భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. ట్రేడ్ డీల్తో పశుపోషణ, మసాల, ప్రధాన ఆహార ఉత్పత్తులకు పూర్తి రక్షణ కలి్పంచడంతో భారతీయ రైతుల ఆదాయాలు పెరుగుతాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సాంకేతిక సహకారం ద్వారా కృత్రిమ మేధ (ఏఐ), డేటా, డిజిటల్ సేవల కేంద్రంగా భారత్ స్థానం మరింత సుస్థిరం అవుతుందని సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
ఎస్బీఐ లాభాలకు ‘డివిడెండ్’ దన్ను
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) డిసెంబర్ త్రైమాసికంలో రికార్డు లాభాలు నమోదు చేసింది. తన అసెట్ మేనేజ్మెంట్ అనుబంధ సంస్థ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ కలుపుకొని... కన్సాలిడేషన్ ప్రాతిపదికన రూ.21,317 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది క్యూ3లో నమోదైన రూ.18,853 కోట్ల నికర లాభంతో పోలిస్తే 13.06 శాతం వృద్ధి నమోదైంది. బ్యాంకు చరిత్రలోనే ఒక క్వార్టర్లో ఇదే అత్యధిక నికర లాభం కావడం విశేషం. మొత్తం వయ్యాలు రూ.1.04 లక్షల కోట్ల నుంచి రూ.1.08 లక్షల కోట్లకు చేరాయి. ఇదే క్యూ3లో నికర వడ్డీ ఆదాయం 9.04% పెరిగి రూ.41,446 కోట్ల నుంచి రూ.45,190 కోట్లకు చేరింది. దేశీయ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) స్వల్పంగా 0.03% తగ్గి 3.12 శాతంగా నమోదైంది. డివిడెండ్ను కలుపుకొని వడ్డీయేతర ఆదాయం 15.65% పెరిగి రూ. 8,404 కోట్లకు చేరింది. → ఆస్తుల నాణ్యతలో బ్యాంకు మెరుగైన పనితీరు కనబరిచింది. డిసెంబర్ 31 నాటికి స్థూల ఎన్పీఏ(మొండి బకాయిలు)లు 2.2% నుంచి 1.57 శాతానికి పరిమితమయ్యాయి. కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ స్థూల ఎన్పీఏలు 1.74% గా ఉన్నాయి. స్లిప్పేజీలు రూ.3,823 కోట్ల నుంచి రూ.4,458 కోట్లకు పెరిగినప్పట్టకీ.., మొత్తం ఎన్పీఏలు నియంత్రణలోనే ఉన్నాయని బ్యాంకు చెప్పుకొచ్చింది. → మొండి బకాయిలకు కేటాయింపులు (ప్రొవిజన్లు) రూ.911 నుంచి రూ.4,507 కోట్లకు పెరిగాయి. భవిష్యత్తు అనిశి్చతులను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఈ కేటాయింపులు చేసినట్లు బ్యాంకు తెలిపింది. → డిసెంబర్ త్రైమాసికంలో రుణాలు 15.14 శాతం పెరిగాయి. ఇందులో కార్పొరేట్ రుణాలు 13.3% వృద్ధి సాధించగా, రిటైల్ రుణ విభాగం కూడా నిలకడగా కొనసాగింది. డిపాజిట్లు 9.02% పెరిగాయి. క్రిడెట్–డిపాజిట్ నిష్పత్తి 72 శాతంగా అనువైన స్థితిలో ఉంది. ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.... ‘‘రుణవృద్ధి గణనీయంగా పెరగడం, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ అంశాలు బ్యాంకు నికర లాభాల వృద్ధికి దోహదపడ్డాయి. కార్పొరేట్ రుణాలు తిరిగి పుంజుకోవడం, రిటైల్ రుణ విభాగం నిలకడైన ప్రదర్శనతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణాల వృద్ధి లక్ష్యాన్ని 13–15 శాతానికి పెంచుతున్నాము. భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ఖరారుతో బ్యాంకులు రుణ వృద్ధి మరింత పుంజుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్)కు రుణాలిచ్చేందుకు బ్యాంకులను అనుమతించాలనే ఆర్బీఐ ప్రతిపాదనను, మోసాలకు గురైన ఖాతాదారులకు రూ. 25,000 వరకు పరిహారం చెల్లింపు నిర్ణయాలను స్వాగతిస్తున్నాము. ఎస్బీఐ ‘‘డిజిటల్–ఫస్ట్’’ బ్యాంకుగా మారే దిశగా ముందుకెళ్తోంది’’ అన్నారు. -
లిస్టింగ్కు 8 కంపెనీలు రెడీ
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలోనూ దేశీయంగా ప్రైమరీ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్యనే కదులుతున్నప్పటికీ పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా 8 కంపెనీల ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఐపీవో చేపట్టేందుకు వీలుగా గతేడాది(2025) సెపె్టంబర్– నవంబర్ మధ్య కాలంలో సెబీకి 9 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటిలో మన్ ఫ్లీట్ పార్ట్నర్స్ ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకోగా.. మిగిలిన 8 కంపెనీలకు సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో ఇన్క్రెడ్ హోల్డింగ్స్సహా.. ఆర్వీ ఇంజినీరింగ్, ఎలివేట్ క్యాంపసస్, శంకేష్ జ్యువెలర్స్, ఆర్మీ ఇన్ఫోటెక్, ఆర్డీ ఇండస్ట్రీస్, సెడెమాక్ మెకట్రానిక్స్, లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా చేరాయి. ప్రాస్పెక్టస్ల ప్రకారం ఇవన్నీ కలసి ఉమ్మడిగా రూ. 10,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఇప్పటికే కొత్త ఏడాది(2026)లో భారత్ కోకింగ్ కోల్, షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్, అమాగీ మీడియా ల్యాబ్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కాగా.. మొత్తం రూ. 4,766 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఎన్బీఎఫ్సీ నుంచి.. ఎన్బీఎఫ్సీ ఇన్క్రెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ఇన్క్రెడ్ హోల్డింగ్స్ గోప్యతా మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసి అనుమతి పొందింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ ద్వారా రూ. 3,000–4,000 కోట్ల మధ్య సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్ధుల వసతి(స్టూడెంట్ ఎకామడేషన్), కే–12 ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఎలివేట్ క్యాంపసస్ ఐపీవో ద్వారా రూ. 2,550 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా కొత్తగా ఈక్విటీ జారీతోపాటు.. ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కే–12 సంస్థల కొనుగోలు, క్యాంపస్ల ఏర్పాటు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులు వెచ్చించనుంది. కేబుళ్ల తయారీ కేబుళ్లు, కండక్టర్ల తయారీ కంపెనీ లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు అందుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఆటో విడిభాగాలు పవర్ట్రెయిన్ నియంత్రిత వ్యవస్థలు, ఆటో విడిభాగాల తయారీ కంపెనీ సెడెమాక్ మెకట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 800–1,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80,43,300 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. లెడ్ అలాయ్స్ లెడ్ స్మెల్టర్ కంపెనీ ఆర్డీ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.76 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలు, రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా అత్యున్నత నాణ్యతగల లెడ్ అలాయ్స్ను తయారు చేస్తోంది. ఐటీ ఇన్ఫ్రా.. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్లు అందించే ఆర్మీ ఇన్ఫోటెక్ ఐపీవో ద్వారా రూ. 250 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్ఫ్రా కన్సెల్టెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ సరీ్వసుల కంపెనీ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 203 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 67.5 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. బంగారు ఆభరణాలు బంగారు ఆభరణాల తయారీ కంపెనీ శంకేష్ జ్యువెలర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో కోటి షేర్లను ప్రస్తుత వాటా దారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 158 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 38 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. -
రేట్లకు బ్రేక్.. వృద్ధే టార్గెట్ రెపోరేటు యథాతథం
ముంబై: అంచనాలకు అనుగుణంగా కీలక పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులకు వెళ్లకుండా, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ యథాతథ స్థితినే కొనసాగించింది. బడ్జెట్లో మూలధన వ్యయాలు పెంచడంతో వృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే ఉంటుందన్న అంచనాలు వ్యక్తం చేస్తూ.. అంతర్జాతీయంగా అనిశి్చతుల నేపథ్యంలో రెపో రేటు తగ్గింపు చేపట్టకుండా తటస్థ వైఖరిని కొనసాగిస్తూ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలను పెంచింది. బ్యాంకు కస్టమర్లు మోసపోతే తక్షణ పరిహారం కింద రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించడం ఖాతాదారులకు ఊరటనిచ్చేది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు (రీట్లు) సైతం బ్యాంక్ల నుంచి రుణ వితరణకు పచ్చజెండా ఊపింది. ఎంఎస్ఈలకు పూచీకత్తులేని రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం మరో కీలక నిర్ణయం. అలాగే, కొన్ని రకాల ఎన్బీఎఫ్సీలకు సైతం నిబంధనల పరంగా వెసులుబాటు కల్పించింది.పాలసీలోని ముఖ్యాంశాలు..→ రెపో రేటును (ఆర్బీఐ నుంచి బ్యాంక్లు తీసుకునే నిధులపై వసూలు చేసే రేటు) 5.25 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన గల ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత డిసెంబర్ సమీక్షలో రెపో రేటును ఆర్బీఐ పావు శాతం తగ్గించడం తెలిసిందే. అంతేకాదు 2025 ఫిబ్రవరి నుంచి మొత్తం మీద రెపో రేటును 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) తగ్గించడం గమనార్హం. రివర్స్ రెపో (బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే నిధులపై చెల్లించే రేటు) రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) 5 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) 5.50 శాతం రేట్లలోనూ మార్పు చేయలేదు.→ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26)లో 2.1 శాతంగా (గత అంచనా 2 శాతం) కొనసాగుతుందని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. 4 శాతానికి పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. 2025–26 క్యూ4లో 3.2 శాతం (గత అంచనా 2.9 శాతం), 2026–27 క్యూ1లో 4 శాతానికి, 2026–27 క్యూ2లో 4.2 శాతానికి పెరుగుతుందని అంచనాలకు వచి్చంది. 2026–27 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను తదుపరి ఏప్రిల్ సమీక్ష సందర్భంగా ప్రకటిస్తామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు.→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 7.3 శాతం నుంచి 7.4 శాతానికి ఆర్బీఐ ఎంపీసీ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) క్యూ1 (ఏప్రిల్–జూన్), క్యూ2 (జూలై–సెప్టెంబర్) వృద్ధి అంచనాలను 6.8 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. రియల్ జీడీపీ సిరీస్ను ఈ నెల చివర్లో విడుదల చేయనుండడంతో పూర్తి ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఏప్రిల్లో ప్రకటిస్తామని మల్హోత్రా పేర్కొన్నారు. → సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) ఆర్థిక భరోసా కల్పిస్తూ పూచీకత్తు లేని రుణ పరిమితిని ప్రస్తుతమున్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్తగా తీసుకునే రుణాలతోపాటు గత రుణాల పునరుద్ధరణలకూ ఇది వర్తిస్తుంది.→ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు (రీట్లు) బ్యాంకుల రుణ వితరణను అనుమతించే ప్రతిపాదనను ఆర్బీఐ ఎంపీసీ తీసుకొచి్చంది. రియల్ ఎస్టేట్ రంగానికి మరింత రుణ వితరణను ప్రోత్సహించేందుకు వీలుగా కొన్ని రక్షణ చర్యలతో రీట్లకు బ్యాంకుల రుణాలను అనుమతించే ప్రతిపాదన చేసింది. → కార్పొరేట్ బాండ్ల మార్కెట్ను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా.. 2026–27 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా, కార్పొరేట్ బాండ్ సూచీల డెరివేటివ్స్కు నియంత్రణ పరమైన కార్యాచరణను ఆర్బీఐ విడుదల చేయనుంది. → తదుపరి ఆర్బీఐ ఎంపీసీ భేటీ ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరుగుతుంది. ఎన్బీఎఫ్సీలకు వెన్నుదన్నురూ.1,000 కోట్ల కంటే తక్కువ ఆస్తులున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), ప్రజల నుంచి నిధులు సమీకరించని వాటిని కొన్ని షరతుల మేరకు తప్పనిసరి రిజి్రస్టేషన్ నుంచి మినహాయింపు కల్పించాలని ఆబీఐ ఎంపీసీ ప్రతిపాదించింది. బంగారంపై రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు–ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీలు (ఐసీసీలు), 1,000 శాఖలకు మించి ఉన్నవి కొత్త శాఖల విస్తరణకు ఇకపై ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక బంగారం రుణాల విషయంలో ఎంలాంటి ఆందోళనల్లేవని, సౌకర్యంగానే ఉన్నామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఆస్తుల లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ/ బంగారం ధరపై రుణ వితరణ) తాము నిర్దేశించిన పరిమితులకు దిగువనే ఉన్నట్టు చెప్పారు. బంగారంపై రుణాలు సహా ఎన్బీఎఫ్సీల రుణాల పోర్ట్ఫోలియోలను ఆర్బీఐ సమీక్షించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2026–27లో రుణ సమీకరణను రూ.17.2 లక్షల కోట్లకు పెంచడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో.. నికర రుణ సమీకరణను చూడాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ.20,000 కోట్లే ఎక్కువన్నారు.డిజిటల్ మోసాలకు పరిహారంబ్యాంక్ కస్టమర్ ప్రమేయంతో, ఓటీపీ తెలుసుకుని లేదా కస్టమర్ ప్రమేయం లేకుండా జరిగే డిజిటల్ మోసాల్లో ఎలాంటి ప్రశ్నలు లేకుండా బ్యాంక్ రూ.25,000ను పరిహారం కింద చెల్లిస్తుంది. కాకపోతే కస్టమర్ ఉద్దేశపూర్వక పాత్ర ఉండకూడదు. కస్టమర్ తన వంతుగా 15 శాతం నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఒకవేళ అధిక విలువ కలిగిన మోసాల్లో పరిహారం రూ.25 వేలకు పరిమితం అవుతుంది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. -
ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశం ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి విధాన సమీక్ష.కీలక రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో వరుస రేటు తగ్గింపుల తర్వాత ఇప్పుడు తటస్థ వైఖరి తీసుకుంది. గత ఫిబ్రవరి నుండి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడు కోతల ద్వారా రెపో రేటును మొత్తం 100 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది.గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటును జూన్ లో 5.5 శాతానికి తగ్గించింది. ఒక బేసిస్ పాయింట్ అంటే ఒక పర్సెంటేజ్ పాయింట్ లో వందవ వంతుకు సమానం. రెపో రేటు తగ్గింపుతో పాటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్ డిఎఫ్) రేటును 5 శాతంగా ఉంచారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎంఎస్ ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు రెండూ 5.50 శాతంగా నిర్ణయించింది. ద్రవ్యోల్బణం టాలరెన్స్ బ్యాండ్ కంటే తక్కువగా ఉంది. అధిక ఫ్రీక్వెన్సీ సూచికలు ఈ సంవత్సరం మరియు అంతకు మించి బలమైన వృద్ధి వేగాన్ని కొనసాగించాలని సూచిస్తున్నాయి.యూరోపియన్ యూనియన్, యుఎస్ తో మైలురాయి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం వల్ల వృద్ధి వేగం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణ ప్రస్తుత ప్రపంచ క్రమాన్ని విప్పుతోంది. ఆర్థిక స్థిరత్వ ఆందోళనలను ప్రతిబింబించే బాండ్ మార్కెట్ సెంటిమెంట్లు బేరిష్ గా ఉన్నాయి.డిసెంబర్ ఎంపీసీ సమావేశంలో ఏం జరిగిందంటే..డిసెంబర్ పాలసీ సమావేశంలో, ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతం నుండి 5.25 శాతానికి తగ్గించింది. ఆ సమయంలో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5.00 శాతంగా నిర్ణయించారు, అయితే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటును 5.50 శాతంగా నిర్ణయించారు. -
ఆర్బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు యథాతథం?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు, దేశీయ బాండ్ మార్కెట్ ఒత్తిళ్ల మధ్య ఆర్బీఐ తన ఫిబ్రవరి పాలసీలో వడ్డీ రేట్లను మార్చకపోవచ్చని తెలుస్తోంది. గతేడాది నుంచి దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగే ఆర్బీఐ మానిటరీ సమావేశంలోని అంశాలు రేపు ఉదయం వెలువడనున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలుగత పాలసీ సమావేశం తర్వాత జరిగిన అతిపెద్ద పరిణామం భారత్-అమెరికా, భారత్-యూరప్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు. దీని ఫలితంగా భారతీయ వస్తువులపై సుంకాలు గతంలో ఉన్న 50% నుంచి 18%కి గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనే అతి తక్కువ టారిఫ్ రేట్లు కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఇది మన ఎగుమతిదారుల పోటీతత్వాన్ని భారీగా పెంచనుంది.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిఅంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. ‘జియో-ఎకనామిక్స్ స్ట్రెస్ ఇండెక్స్’ ప్రకారం అంతర్జాతీయ అనిశ్చితి పెరిగిన 3-4 నెలల తర్వాత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు గత వారం భారీ పతనాన్ని చూసిన లోహాల ధరలు తిరిగి కోలుకోవడం గమనార్హం.అమెరికా ఫెడ్ రేట్ల కోత సంకేతాలుఅమెరికాలో లేబర్ మార్కెట్ మందగించడం, వాస్తవ ఆదాయం స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గడంతో.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.రూపాయి ఒడిదుడుకులుగత రెండు నెలలుగా రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూ.89-92 మధ్య ఊగిసలాడుతోంది. ఏప్రిల్ 2025లో అమెరికా సుంకాలను పెంచినప్పటి నుంచి రూపాయి 5.8% మేర క్షీణించింది. అయితే ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత రూపాయి విలువ కోలుకోవడం సానుకూలాంశం.ద్రవ్యోల్బణంద్రవ్యోల్బణ గణనలో భాగంగా కొత్త సీపీఐ వెయిటేజీలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సాధారణ సమయంలో ద్రవ్యోల్బణం 20-30 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండగా.. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న నెలల్లో మాత్రం కొత్త లెక్కల ప్రకారం సీపీఐ 20-30 బేసిస్ పాయింట్లు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.పైన పేర్కొన్న మిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతానికి కీలక వడ్డీరేట్ల మార్పులపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తుదని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు ఇవేనా..
దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రిజిస్ట్రేషన్, ఆడిట్, రిఫండ్ ప్రక్రియలను భారీగా సరళీకరించేందుకు సిద్ధమవుతోంది. పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.గత ఏడాది సెప్టెంబర్ 3న జరిగిన సమావేశం తర్వాత, ప్రస్తుత బడ్జెట్ ఆమోద ప్రక్రియ ముగిశాక ఈ కీలక భేటీ జరగనుంది. వచ్చే నెలలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారుల స్థాయిలో రెండు విడతలుగా చర్చలు పూర్తికాగా ప్రాథమిక అజెండా సిద్ధమైంది.రిఫండ్లలో ఇబ్బందుల తొలగింపుప్రస్తుతం వస్తువులు, సర్వీసులకు మధ్య ఉన్న విభజన కారణంగా సేవల రంగంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) రిఫండ్లు పొందడంలో వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ నిలిచిపోతోంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిఫండ్లు అంటే.. ఒక వ్యాపారి తన బిజినెస్ కోసం వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన పన్నును, తిరిగి ప్రభుత్వం నుంచి వెనక్కి పొందడం లేదా తదుపరి పన్ను చెల్లింపుల్లో తగ్గించుకోవడం.ఈ నేపథ్యంలో సర్వీసులపై పేరుకుపోయిన ఐటీసీ రిఫండ్లను సులభతరం చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల వ్యాపారాల్లో నగదు లభ్యత పెరిగి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి.ప్రభుత్వ విధానం ఇదే..బడ్జెట్, ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించిన కొత్త నిబంధనలు ‘పన్ను చెల్లింపుదారులపై నమ్మకం’ అనే సూత్రంపై ఆధారపడి ఉన్నాయని సదరు అధికారి తెలిపారు. ముఖ్యంగా ఇప్పటికే సవరించిన రిటర్న్ల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. వీటి ప్రకారం..సెక్షన్ 148 కింద నోటీసు వచ్చినా వివాదాస్పద పన్ను, వడ్డీ చెల్లించి రిటర్న్లను అప్డేట్ చేస్తే ఆ ప్రక్రియను అక్కడితోనే ముగించే అవకాశం ఉంది.ఆడిట్ పరిధిలోకి రానివారు ఏడాదిలోపు సవరించిన రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే డిసెంబర్ 31 తర్వాత దాఖలు చేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.గతంలో రిటర్న్లు దాఖలు చేయకపోయినా సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసిన నాలుగేళ్ల వరకు అప్డేటెడ్ రిటర్న్లను దాఖలు చేసే వెసులుబాటు కల్పించారు.జరిమానాల నుంచి మినహాయింపుఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 440 కింద రక్షణ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆదాయాన్ని తప్పుగా నివేదించిన సందర్భాల్లో నిర్దేశిత అదనపు పన్ను చెల్లిస్తే భారీ జరిమానాల నుంచి మినహాయింపు పొందే అవకాశం పన్ను చెల్లింపుదారులకు లభించనుంది. ‘నిబంధనలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని అమలు చేయడమే తదుపరి అంశం. అధికారులపై పనిభారం పెరిగినప్పటికీ పన్ను చెల్లింపుదారులకు మేలు చేయడమే మా ప్రాధాన్యత’ అని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి తెలిపారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
వ్యవసాయ, పాడి పరిశ్రమలకు పూర్తి రక్షణ: కేంద్ర మంత్రి
భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్పై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో స్పష్టతనిచ్చారు. దేశంలోని అత్యంత సున్నితమైన రంగాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమల ప్రయోజనాలను ఈ ఒప్పందంలో పూర్తిగా కాపాడినట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ప్రతిపక్షాల ఆందోళనల మధ్య వాయిదా పడిన ఈ ప్రకటనను ఆయన తర్వాత ఉభయ సభల్లో చదివి వినిపించారు.ఒప్పందంలోని ప్రధానాంశాలు..ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందని గోయల్ తెలిపారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు..అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది ఇతర పోటీ దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాల కంటే తక్కువ కావడం గమనార్హం.రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై గతంలో విధించిన 25 శాతం ప్రతీకార సుంకాన్ని అమెరికా పూర్తిగా తొలగించింది.భారత దిగుమతులపై ఉన్న 25 శాతం పరస్పర సుంకాన్ని కూడా 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది.కీలక రంగాలకు ఊతంఆగస్టు 2025 నుంచి అమలులో ఉన్న 50 శాతం అధిక సుంకాల కారణంగా వస్త్రాలు, తోలు వస్తువులు, సముద్ర ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా తగ్గింపులతో ఈ రంగాలకు అంతర్జాతీయ మార్కెట్లో తిరిగి పోటీతత్వం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధన భద్రతపై వస్తున్న సందేహాలకు మంత్రి సమాధానమిస్తూ, 140 కోట్లు భారతీయుల ఇంధన అవసరాలను తీర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా చమురు, ఇంధన వనరులను వివిధ మార్గాల ద్వారా సేకరించడం భారత వ్యూహంలో భాగమని చెప్పారు.ఇంధనం, విమానయానం, డేటా సెంటర్లు, అణుశక్తి వంటి రంగాల్లో అమెరికా అగ్రగామిగా ఉందని, ఈ రంగాల్లో వాణిజ్య సహకారం పెంచుకోవడం ద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. ప్రస్తుతం సాంకేతిక ప్రక్రియలు, పత్రాల తయారీ తుది దశలో ఉందని, అవి పూర్తయిన వెంటనే ఒప్పందం పూర్తి వివరాలను తెలియజేస్తామని గోయల్ చెప్పారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
భారత్ కంటెయినర్ షిప్పింగ్ లైన్ ఏర్పాటుకు వీలుగా ఒప్పందం
ముంబై: అంతర్జాతీయంగా షిప్పింగ్కు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో.. దేశంలో సమగ్ర కంటెయినర్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భారత్ కంటెయినర్ షిప్పింగ్ లైన్ (బీసీఎస్ఎల్) ఏర్పాటుకు వీలు కలి్పంచే ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించింది. ఈ పథకం స్ఫూర్తికి అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్తో పోటీపడే కంటెయినర్ తయారీ వ్యవస్థను దేశీయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించడం గమనార్హం. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్పీఏ), వీవో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, చెన్నై పోర్ట్ అథారిటీ, సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. -
టారిఫ్ల కోతపై ఆర్థిక మంత్రి ఏమన్నారంటే..
భారత ఉత్పత్తులపై టారిఫ్లను తగ్గించాలన్న అమెరికా నిర్ణయంతో ఎగుమతులకు ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కొత్తగా మరిన్ని మార్కెట్లు కూడా అందుబాటులోకి రావడంతో ఇకపై మన ఎగుమతులు పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అమెరికాతో ఒప్పందం వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆమె చెప్పారు.‘మేడిన్ ఇండియా ఉత్పత్తులకు గుడ్ న్యూస్. ఇక వాటిపై టారిఫ్లు 18 శాతానికి తగ్గుతాయి‘ అని ఎక్స్లో ఆమె పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం సుంకాలు విధించడంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఉక్కు, అల్యుమినియం, టెక్స్టైల్స్, ఇంజినీరింగ్, ఇతరత్రా కొన్ని వ్యవసాయోత్పత్తుల ఎక్స్పోర్ట్స్ గణనీయంగా తగ్గాయి. తాజాగా వాణిజ్య అవరోధాలను తొలగించి, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కూడా నిలిపివేసి అగ్రరాజ్యం నుంచి క్రూడ్ కొనుగోళ్లు పెంచుకుంటామన్న భారత హామీకి ప్రతిగా టారిఫ్లను 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో 15–19 శాతం స్థాయిలో టారిఫ్లు ఎదుర్కొంటున్న ఇతర ఆసియా దేశాల సరసన భారత్ కూడా చేరుతుంది. మరోవైపు ఫ్యూచర్స్, ఆప్షన్స్పై (ఎఫ్అండ్వో) సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ని పెంచాలన్న నిర్ణయం స్పెక్యులేటివ్ ట్రేడింగ్ వల్ల చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవకుండా కాపాడేందుకే తప్ప ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకున్నది కాదని నిర్మలా సీతారామన్ చెప్పారు.సాగు, డెయిరీ ప్రయోజనాలు పదిలం: గోయల్అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే విషయంలో దేశీయంగా కీలకమైన వ్యవసాయం, డెయిరీ రంగాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. పోటీ దేశాల కన్నా అమెరికాతో భారత్కి ‘చాలా మంచి‘ డీల్ కుదిరిందని మంత్రి చెప్పారు. వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలతో ఇరు దేశాలు సంయుక్త ప్రకటన జారీ చేస్తాయని పేర్కొన్నారు. కీలక రంగాల ప్రయోజనాలను కాపాడుతూ, ప్రజలకు భారీగా అవకాశాలు కల్పించే విధంగా ఒప్పందం ఉంటుందని చెప్పారు. కార్మిక శక్తి ఎక్కువగా ఉండే టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్, దుస్తులు, సేంద్రియ రసాయనాలు, రత్నాభరణాలు తదితర రంగాలకు అవకాశాలు పెరుగుతాయన్నారు.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే.. -
రూపాయి రయ్.. రయ్..!
ముంబై: భారత్–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో మంగళవారం రూపాయి విలువ భారీ ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో ఏకంగా 117 పైసలు బలపడి రెండున్నర వారాల గరిష్టం 90.32 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ 2.50% పెరగడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అంశాలు దేశీయ కరెన్సీ ర్యాలీకి సహకరించాయి.ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 90.30 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 144 పైసలు ర్యాలీ చేసి 90.05 గరిష్టాన్ని తాకింది. అలాగే 90.52 స్థాయి కనిష్టానికి దిగివచి్చంది. ‘‘అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడం ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమనం మొదలవుతుంది. దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల రాకతో రూపాయిపై ఒత్తిడి తగ్గుతుంది’’ అని ఫారెక్స్ నిపుణులు అభిప్రాయపడ్డారు. -
ఇంకా వెనక్కి రాని రూ.2000 నోట్లు!
పెద్దనోట్ల రద్దు జరిగి చాన్నాళ్లవుతోంది. అయితే ఇప్పటికి 98.42 శాతం మేర రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే నాటికి.. రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా, 2026 జనవరి 31 నాటికి రూ.5,609 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. అంటే.. ఇంకా 1.58 శాతానికి సమానమైన పెద్ద నోట్లు వ్యవస్థలోనే ఉన్నట్టు తెలుస్తోంది.తొలుత 2023 అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికీ తమ వద్ద రూ.2,000 నోట్లు ఉంటే, ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో దేనికి అయినా స్పీడ్పోస్ట్ ద్వారా పంపుకోవచ్చు. పంపించే వారు దరఖాస్తుతోపాటు కేవైసీ డాక్యుమెంట్లు, బ్యాంక్ ఖాతా వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు అంత విలువ మేర బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. -
వ్యవసాయం, గ్రామీణ రంగాలకు మొండిచేయి!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవలి బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. అయితే, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.దేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలిచే మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఈసారి రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం. ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు జీడీపీలో కేవలం 11.5% - 12.5% వద్దే స్థిరంగా ఉండటంతో (2004-2008లో ఇది 16% గా ఉండేది), ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి పెట్టుబడులను పెంచాలని నిర్ణయించింది.అంకెలు పెరిగినా.. ఆందోళనలు?వ్యవసాయ శాఖకు కేటాయింపులు రూ.1.23 లక్షల కోట్లు నుంచి రూ. 1.30 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో ప్రధానంగా.. పీఎం కిసాన్, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనకు ఎక్కువ కేటాయింపులు చేశారు. అయితే ఆర్థిక మంత్రి ప్రసంగంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య సంపద, వాల్నట్స్ వంటి అనుబంధ రంగాలపై దృష్టి సారించినప్పటికీ ప్రధాన పంటల రంగం, ఉద్యానవన రంగాల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.దేశంలో విమానాశ్రయాలు, రహదారులు ప్రపంచ స్థాయికి చేరుకున్నా ఢిల్లీలోని ఆజాద్ పూర్ వంటి ప్రధాన వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధునీకరణకు బడ్జెట్ నుంచి ప్రత్యక్ష మద్దతు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పరిశోధన నిధుల్లో కోతవాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు, అధిక ఉత్పాదకత కోసం పరిశోధనలు అవసరమైన తరుణంలో వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డీఏఆర్ఈ) నిధులు రూ.10280 కోట్ల నుంచి రూ.9967 కోట్లకు తగ్గాయి. ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్ మోడ్’లో నిధులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందనేది స్పష్టత లేదు. మరోవైపు, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) నిధులను రూ.1500 కోట్ల నుంచి రూ.2500 కోట్లుకు పెంచడం సానుకూల పరిణామం.ఇదీ చదవండి: పౌరుల గోప్యతను హరించకూడదు: సుప్రీంకోర్టు ఆగ్రహం -
పీఎఫ్, ఈఎస్ఐ విరాళాల చెల్లింపులో ఊరట
వ్యాపార యజమానులకు, సంస్థలకు భారీ ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్), ఈఎస్ఐ (ఈఎస్ఐ) వంటి సంక్షేమ నిధుల విరాళాల విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలిస్తూ ‘ఫైనాన్స్ బిల్లు 2025’లో కీలక ప్రతిపాదనలు చేసింది.ప్రస్తుత సవాలు.. సుప్రీంకోర్టు తీర్పుప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం యజమానులు తమ ఉద్యోగుల నుంచి సేకరించిన పీఎఫ్, ఈఎస్ఐ చందాలను సంబంధిత చట్టాలు నిర్దేశించిన గడువులోపే (సాధారణంగా నెల ముగిసిన 15 రోజుల్లోపు) జమ చేయాలి. ఒకవేళ ఒక్క రోజు ఆలస్యమైనా ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను మినహాయింపు కింద క్లెయిమ్ చేసే అవకాశాన్ని యజమానులు కోల్పోతారు. దీనిపై సుదీర్ఘకాలం సాగిన వివాదానికి సుప్రీంకోర్టు గతంలో తీర్పునిస్తూ నిర్దేశిత గడువు దాటితే పన్ను ప్రయోజనం పొందేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఇది యజమానులకు ఆర్థికంగా అదనపు భారాన్ని కలిగిస్తోంది.ప్రతిపాదిత మార్పు.. సెక్షన్ 29 సవరణతాజాగా ఫైనాన్స్ బిల్లులో ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 29కి సవరణను ప్రతిపాదించారు. దీని ప్రకారం.. ఇకపై ఉద్యోగుల విరాళాల తగ్గింపును క్లెయిమ్ చేయడానికి గడువు తేదీని, ఆయా సంస్థల ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసే గడువు తేదీతో అనుసంధానిస్తారు. సంబంధిత సంక్షేమ చట్టాల ప్రకారం గడువు తేదీ దాటినప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే లోపు ఆ మొత్తాన్ని జమ చేస్తే యజమానులు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.నిపుణుల విశ్లేషణఈ మార్పుపై సుప్రీంకోర్టు న్యాయవాది దీపక్ జోషి స్పందిస్తూ ‘ప్రస్తుతం యజమానులు అత్యంత కఠినమైన ప్రమాణాలను ఎదుర్కొంటున్నారు. గతంలో ఐటీ రిటర్న్ దాఖలు చేసేలోపు విరాళాలు చెల్లించినా మినహాయింపు దక్కేది కాదు. కానీ ఈ ప్రతిపాదిత సవరణ వల్ల కొద్దిపాటి ఆలస్యం జరిగినప్పటికీ, రిటర్న్ ఫైలింగ్ లోపు చెల్లింపు పూర్తి చేస్తే యజమానులకు మినహాయింపు లభిస్తుంది’ అని వివరించారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనవసరమైన కోర్టు వ్యాజ్యాలు తగ్గడమే కాకుండా వ్యాపార నిర్వహణ మరింత సులభతరం కానుంది. చిన్నపాటి సాంకేతిక కారణాల వల్ల లేదా నగదు కొరత వల్ల చెల్లింపులు ఆలస్యమైనా యజమానులు శాశ్వతంగా పన్ను ప్రయోజనాలు కోల్పోకుండా ఈ సవరణ రక్షణ కల్పిస్తుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
రెవెన్యూ గ్రాంట్ల ముగింపుతో రాష్ట్రాలపై ప్రభావం?
రాష్ట్రాలకు ఇంతకాలంగా అందిస్తున్న రెవెన్యూ లోటు గ్రాంట్లను నిలిపివేయాలంటూ 16వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం చూపించదని కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శి వి.ఉల్నమ్ స్పష్టం చేశారు. కేవలం కొన్ని రాష్ట్రాలే ప్రస్తుతం ఈ గ్రాంట్ను అందుకుంటున్నాయంటూ, 2025–26లో రూ.13,000 కోట్లకు తగ్గిపోయినట్టు చెప్పారు.వాస్తవానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం ఇది 2025–26తో నిలిచిపోవాలన్నారు. రెవెన్యూలోటు గ్రాంట్ను క్రమంగా తగ్గించుకుంటూ వెళ్లాలని 15వ ఆర్థిక సంఘం సూచించినట్టు గుర్తు చేస్తూ ఆ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది రూ.13 వేల కోట్లకు పరిమితం అవుతున్నట్టు చెప్పారు. 2026 ఏప్రిల్ 1 నుంచి ఐదు సంవత్సరాల పాటు కేంద్రం పన్నుల్లో 41 శాతాన్ని రాష్ట్రాలకు వాటా కింద పంపిణీ చేయాలంటూ అరవింద్ పనగరియా అధ్యక్షతన గల 16వ ఆర్థిక సంఘం సూచించడం తెలిసిందే.వికేంద్రీకరణ అనంతరం రెవెన్యూ లోటు గ్రాంట్లను ఎత్తివేసి, స్థానిక సంస్థలకు అందించే నిధులను రెట్టింపు చేయాలని సిఫారసు చేసింది.ఆర్థిక సంఘం వికేంద్రీకరణ సూత్రం ప్రకారం రాష్ట్రాల పన్నుల వాటా రూ.14 లక్షల కోట్లుగా ఉంటుందని ఉల్నమ్ తెలిపారు. గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల వాటా కూడా కలుపుకుంటే ఈ మొత్తం రూ.25 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
ప్రభుత్వ బ్యాంకులకు పెట్టుబడుల పుష్
న్యూఢిల్లీ: పీఎస్యూ బ్యాంకులలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐలు) పరిమితిని పెంచే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత 20 శాతం పరిమితిని 49 శాతానికి పెంచాలని చూస్తున్నట్లు ఆర్థిక సరీ్వసుల కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనస్థాయిని బలపరిచేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇందుకు అంతర్మంత్రిత్వ శాఖలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.ప్రస్తుతం పీఎస్యూ బ్యాంకు(పీఎస్బీ)లలో ఎఫ్డీఐ పరిమితి 20 శాతంకాగా.. ప్రయివేట్ రంగ బ్యాంకులకు 74 శాతంగా అమలవుతోంది. అయితే 49 శాతంవరకూ ఆటోమేటిక్ మార్గంలో అను మతిస్తారు. ఆపై 74 శాతంవరకూ ప్రభుత్వ అనుమతిని పొందవలసి ఉంటుంది. నిజానికి 2020 నుంచి 12 పీఎస్బీలలో ప్రభు త్వం వద్దగల షేర్ల సంఖ్యలో మార్పులేనప్పటికీ కొన్ని బ్యాంకులలో వాటా శాతాలు మార్పులకు లోనయ్యాయి. ఆయా బ్యాంకులు మూలధన సమీకరణకు కొత్తగా షేర్లను జారీ చేయడం ప్రభావం చూపింది. కాగా.. ఐడీబీఐ బ్యాంక్లో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించి ఈ నెల లో లేదా వచ్చే నెలలో ఫైనాన్షియల్ బిడ్స్ ను ఆహ్వానించనున్నట్లు నాగరాజు తెలియజేశారు. -
పీక్లో వెండి ధరలు… ఒక్కసారిగా కుప్పకూలుతాయా?
వెండి ధర సగానికి పడిపోతుందా? 1980 నాటి సీన్ మళ్లీ రిపీట్ అవుతుందా ? ఇప్పుడైతే వెండి ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పీక్ స్టేజ్ లోనే ఉంది — MCXలో వెండి ధర ప్రస్తుతం సుమారు ₹3,00,000/కిలోగా ట్రేడవుతోంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది మనసుల్లో వస్తున్న ప్రశ్న ఏమిటంటే.. 1980ల నాటి ‘వెండి పతనం’ మళ్ళీ జరుగుతుందా? ఒకప్పుడు జరిగినట్లు రాత్రికి రాత్రే ధరలు సగానికి పైగా పడిపోతాయా. 1980 లో జరిగిన వెండి పతనం ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా? అనే భయం నెలకొంది. ఆ రోజు వెండి ధర ఒకే రోజులో 50 డాలర్ల నుండి 10.80 డాలర్లకి పడిపోయింది. అసలు 1980 లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. 1979-1980లో అమెరికన్ బిలియనీర్ సోదరులు ..వీళ్లను హంట్ బ్రదర్స్ అని పిలుస్తారు. వీళ్లు వెండిపై భారీ పందెం వేశారు. ఇద్దరు సోదరులు భౌతిక వెండి, ఫ్యూచర్లలో చాలా పెద్ద స్థానాన్ని నిర్మించుకున్నారు. దీంతో ప్రపంచ సరఫరాలో 50-60 శాతాన్ని నియంత్రణ లోకి తీసుకున్నారు. వీళ్లు ప్రపంచంలోనే 50 శాతం వెండి సరఫరాను నియంత్రించారు. అప్పట్లోనే వెండి ధర ఔన్సుకు 50 డాలర్లకు చేరుకున్నాయి. అయితే అప్పట్లో అమెరికన్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలు నియమించింది.దీని ఫలితంగా 1980 మార్చి 27న ‘సిల్వర్ థర్స్డే’ అని పిలుస్తారు. ఇది చరిత్రలో వెండి పతనాన్ని సూచిస్తుంది.ఇక ఈ సంఘటన తర్వాత హంట్ బ్రదర్స్ దివాలా తీశారు. వెండి ధరలు చాలా సంవత్సరాలు 5-10 డాలర్ల మధ్య ఉన్నాయి. ఇక చూస్తే ఈ సంవత్సరం కూడా వెండి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కిలో వెండి రూ.3.75 లక్షలకు చేరుకుంది. అటువంటి పరిస్థితిలో వెండిలో ఇంత వేగంగా పెరుగుదల దాని పతనానికి కారణం అవుతుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం 1980లో జరిగినట్లు ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించడం లేదు. 1980 నాటి వెండి మార్కెట్ కు నేటి వెండి మార్కెట్ చాలా భిన్నంగా ఉంది. అతిపెద్ద తేడా ఏమిటంటే ఇప్పుడు వెండి పెట్టుబడికి డిమాండ్ లేదు. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, వైద్య పరికరాలు సహా అన్ని రంగాలలో వెండి వినియోగం బాగా పెరుగుతోంది. ప్రపంచదేశాలు వెండిని భవిష్యత్తు అవసరాలకోసం పోగుచేసుకుంటున్నారు. దీంతో సామాన్యులకు వెండి దూరమవుతుంది. అయితే 1980 లో జరిగినట్లు రాత్రికి రాత్రే వెండి ధరలు ఢమాల్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు..ప్రపంచ ఆర్థిక అస్థిరత పెరిగితే, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే, డాలర్ బలపడితే లేదా పెద్ద పెట్టుబడిదారులు కలిసి లాభాల బుకింగ్ ప్రారంభించినట్లయితే, అటువంటి పరిస్థితిలో వెండి ధరలు ఒక్కసారిగా తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
తమిళనాడు సంస్కృతి పరిరక్షణకు..
డీఎంకే ఏలుబడిలో ఉన్న తమిళనాడుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా అరుదైన ఖనిజాల రవాణా కారిడార్ను నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. దీంతోపాటు చెన్నై మీదుగా పయనించే హైస్పీడ్ రైలు లింక్లను అభివృద్ధిచేయనున్నారు. పశ్చిమ కనుమల మార్గంలో పొధుగైమలై కొండ ప్రాంతంలో హైకింగ్, ట్రెక్కింగ్, మౌంటేన్ బైకింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు.పులికాట్ సరస్సుకు విచ్చేసే విదేశీ పక్షుల కోలాహలం, ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించేందుకు బర్డ్ వాచింగ్ పాయింట్లను నిర్మించనున్నారు. త్వరలో తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాల నిధులను భారీగా కేటాయించడం విశేషం. ఇనుప రాతి యుగం నాటి ప్రఖ్యాత ఆదిచనల్లూర్ ప్రాంతంలో పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అక్కడ లభించిన పురాతన రాళ్లు, ఆనాటి నాగరికత వైభవాన్ని చాటే వస్తువులతో ఆర్కియాలాజికల్ సైట్ను అభివృద్ధిచేయనున్నారు.నాటి సంస్కృతికి కళ్లకు కట్టేలా అభివృద్ధి చేస్తామని ఆమె వెల్లడించారు. నడకదారిలో మొత్తం పురాతత్వ ప్రాంతాన్ని కలియతిరిగేలా వాక్వేలను నిర్మించనున్నారు. అక్కడి ప్రాచీన వస్తు వుల విశిష్టతను కథల రూపంలో చెప్పే లా, నాటి సాంకేతికతలను విడమర్చి విశదీకరించేలా గైడ్లను అందుబాటు లోకి తేనున్నారు. పాడైన ప్రాచీన వస్తు వులకు మరమ్మతులు, సంరక్షణ కోసం కన్జర్వేటివ్ ల్యాబ్ను ఏర్పాటు చేయ నున్నారు.పురాతత్వ ప్రాంతానికి విచ్చేసే పర్యా టకులు, విదేశీ సందర్శకుల్లో ఆ ప్రాంతంపై మరింత అవగాహన పెంచేలా ఎగ్జిబిషన్ల వంటివి ఏర్పా టుచేయనున్నారు. ‘అత్యంత అరుదైన మూలకాల కోసం ఖనిజాల తవ్వకం కోసం తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్ను ఏర్పాటుచేయబోతున్నాం. ఖనిజాల శుద్ధి, పరిశోధన, తయారీని మరింతగా ప్రోత్సహిస్తాం’ అని మంత్రి నిర్మల అన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల! -
బెంగాల్కు కొత్తగా సరుకు రవాణా కారిడార్
పశ్చిమబెంగాల్, గుజరాత్ మధ్య వేగవంతమైన సరుకు రవాణా లక్ష్యంగా సరికొత్త కారిడార్ను ఆర్థికమంత్రి నిర్మల ఆదివారం బడ్జెట్లో ప్రతిపాదించారు. ‘సమీకృత ఈశాన్య భారత పారిశ్రామిక కారిడార్’లో భాగంగా పశ్చిమబెంగాల్లోని డంకునీ నుంచి గుజరాత్లోని సూరత్కు నూతన సరుకు రవాణా కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల ప్రకటించారు. బెంగాల్లోని దుర్గాపూర్ కేంద్రంగా ఈ కారిడార్ను విస్తరిస్తామని చెప్పారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పర్యాటక పథకమైన ‘పూర్వోదయ విజన్’లో భాగంగా మరింత అభివృద్ధి చేస్తామని నిర్మల వెల్లడించారు.డంకునీ సూరత్ ఫ్రీట్ కారిడార్ అనేది పర్యావరణ అనుకూలమైనదేకాకుండా ఇరు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా ఖర్చులనూ భారీగా తగ్గిస్తుందని నిర్మల పేర్కొన్నారు. నదీజల మార్గాల గుండా జరిగే సరకు రవాణాను సమీకృత కారిడార్లతో అనుసంధానించి బెంగాల్ పారిశ్రామికాభివృద్ధిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామని నిర్మల తెలిపారు. 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి మరో మూడునెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ బెంగాల్కు మోదీ సర్కార్ వరాల జల్లు కురిపించడం గమనార్హం.పూర్వోదయ రాష్ట్రాలుగా పిలుచుకునే బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని ఆమె తెలిపారు. 4,000 ఎలక్ట్రిక్ బస్సుల అందజేతతోపాటు ఆయా రాష్ట్రాల్లో ఉపాధి పెంపు, ఆయా రాష్ట్రాల మధ్య జనం, వస్తూత్పత్తుల రవాణాపై దృష్టిపెట్టామని ఆమె వెల్లడించారు.విమర్శించిన తృణమూల్ కాంగ్రెస్రాష్ట్రానికి కొత్తగా సరుకు రవాణా కారిడార్ తెస్తామన్న నిర్మల నిర్ణయంపై బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ‘పాత ప్రతిపాదనలకే కొత్త తాయిలాల పొట్లంలో కట్టి ఇస్తున్నారు. నిధుల మంజూరును గాలికొదిలేసి కేవలం కాగితాలకు పరిమితమయ్యే వాగ్దానాలు చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల ఎత్తుగడ. గత ఐదేళ్లుగా ఇదే చూస్తున్నాం.బెంగాల్కు మోదీ సర్కార్ కేంద్రనిధులపై శ్వేతపత్రం జారీచేసే దమ్ముందా? 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక్క కూలీకి అయినా ప్రత్యక్ష బదిలీ పథకం(ఈబీటీ) ద్వారా నగదు ఇచ్చినట్లు రుజువుచేస్తే రాజకీయ సన్యాసం చేస్తా’ అని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు.ఎన్నికల వ్యూహంగా అభివర్ణించిన విశ్లేషకులుఅభివృద్ధి అని చెబుతున్నా వాస్తవానికి తాజా కేటాయింపులు కేవలం ఎన్నికల ఎత్తు గడగా భావించవచ్చని ఎన్నికల వ్యూహకర్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీ భారీ కేటాయింపులు చేస్తోందని వారు వ్యాఖ్యానించారు. ‘‘ ఎన్నికలున్న రాష్ట్రాలకు బడ్జెట్లో భారీ వడ్డనలు ఉండటం ఇటీవలికాలంలో ఒక సంప్రదాయంగా మారింది. ఈ కేటాయింపులు వాస్తవాలో కాదో గుర్తెరిగి తదుపరి ఎన్నికల్లో ఓటేసే స్పృహ ఓటర్లకు ఉండాల్సిందే’’ అని చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల! -
ప్రసారభారతికి పెద్దపీట
కేంద్ర బడ్జెట్లో సమాచార, ప్రసార శాఖకు రూ.4,551 కోట్లు కేటాయించారు. ఇందులో అధిక భాగం ఆలిండియా రేడియో, ప్రసారభారతికి దక్కనుంది. మిగతా నిధులను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాల్లో నైపుణ్యం పెంపుదలకు, కమ్యూనిటీ రేడియో విస్తరణకు కేటాయించారు. 2025–26 బడ్జెట్లో ఈ శాఖకు కేటాయించింది రూ.6,103.02 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.ఈ దఫా సమాచార, ప్రసార శాఖకు ఇచ్చిన రూ.4,551 కోట్లలో ప్రసారభారతికి రూ.2,291.88 కోట్లను ప్రత్యేకించారు. ఈ నిధులను వేతనాలు, పింఛన్లు తదితరాల కోసం ఖర్చు పెడతారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూ.250 కోట్లను వెచ్చిస్తారు. ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహణ, కొత్త చిత్రాలు, డాక్యుమెంటరీల నిర్మాణానికి రూ.344.55 కోట్లను, ఎఫ్ఎం ప్రసారాలతో ఆలిండియా రేడియో నెట్వర్క్ విస్తరణ, డీటీహెచ్ సామర్థ్యం పెంపు వంటి వాటికి రూ.509.24 కోట్లు కేటాయించారు.గత బడ్జెట్లో మాదిరిగానే ఈసారి కూడా నిరక్షరాస్యుల కోసం కమ్యూనిటీ రేడియో కార్య క్రమాల నిమిత్తం రూ.8 కోట్లు కేటాయించారు. యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్(ఏవీజీసీ) రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు దేశవ్యాప్తంగా 15 వేల సెకండరీ స్కూళ్లు, 500 కాలేజీల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ల కోసం రూ.250 కోట్లు కేటాయించారు.పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు రూ89.97 కోట్లు, కోల్కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్కు రూ.80 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్కు రూ.83 కోట్లు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రూ.11.22 కోట్లు, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు రూ.35 కోట్లు వేర్వేరుగా కేటాయింపులు జరిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో సామాజిక సేవల రంగానికి బడ్జెట్లో మరో రూ.111.22 కోట్లను కేటాయించారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల! -
న్యాయ వ్యవస్థలో డిజిటల్ విప్లవం
దేశవ్యాప్తంగా ఉన్న కింది స్థాయి కోర్టులను (సబార్డినేట్ కోర్టులు) డిజిటలైజ్ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఈ–కోర్ట్స్ ప్రాజెక్ట్ – ఫేజ్ 3’ కోసం 2026–27 కేంద్ర బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్ అంచనాల్లో రూ.1,500 కోట్లు ప్రతిపాదించగా, తుది కేటాయింపుల్లో రూ.1,200 కోట్లు ఖరారు చేశారు.సబార్డినేట్ కోర్టుల కంప్యూటరీకరణదేశంలోని అన్ని సబార్డినేట్ కోర్టులను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించి, సాంకేతికతను అనుసంధానం చేయడం ఈ విడత ప్రధానోద్దేశం. 2023 సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ ఈ మూడో దశను ఆమోదించింది. నాలుగేళ్ల కాలపరిమితిలో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టు మొత్తం బడ్జెట్ అంచనా రూ.7,210 కోట్లు. దీనిని కేంద్ర రంగ పథకంగా అమలు చేస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల! -
కొత్తగా రూ.17.2 లక్షల కోట్ల రుణాలు
రానున్న ఆర్థిక సంవత్సరానికి (2026–27) కేంద్ర సర్కారు రూ.17.2 లక్షల కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకోనుంది. జీడీపీలో ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించాలన్న లక్ష్యానికి నిధులను వినియోగించనుంది. 2025–26 సంవత్సరానికి స్థూల రుణ సమీకరణ అంచనా రూ.14.80 లక్షల కోట్లుగా ఉంది.‘ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు డేటెడ్ సెక్యూరిటీల రూపంలో రూ.11.7 లక్షల కోట్లు నికర రుణ సమీకరణ చేయనున్నాం. మిగిలిన రుణాలు చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఇతర రూపాల్లో ఉంటాయి. స్థూల రుణ సమీకరణ రూ.17.2 లక్షల కోట్లుగా ఉంటుంది’ అని బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.5.5 లక్షల కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉందని, అందుకే రుణ సమీకరణ నంబర్ పెద్దగా కనిపిస్తోందని ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీ అనురాధా ఠాకూర్ వివరించారు.ద్రవ్య నిర్వహణ విషయమై రాష్ట్రాలతోనూ మాట్లాడుతున్నామని బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో భాగంగా మంత్రి సీతారామన్ తెలిపారు. ఆర్టికల్ 293 (3) కింద రాష్ట్రాల రుణాలను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. పరిమితికి మించి రుణ సమీకరణను అడ్డుకోవడం లేదంటూ.. ఎఫ్ఆర్బీఎం కింద రాష్ట్రాలు తమ బాధ్యతను అర్థం చేసుకోవాలన్నారు.ఇదీ చదవండి: క్యాపిటల్ గెయిన్స్గా షేర్ల బైబ్యాక్ -
డిజిన్వెస్ట్మెంట్ @ రూ.80,000 కోట్లు
ఏప్రిల్1 నుంచి ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. మిస్లేనియస్ క్యాపిటల్ రిసీప్ట్స్ పేరుతో ఈ పద్దును నమోదు చేయనుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్యూలు)లో వాటాల విక్రయం, ఆస్తుల మానిటైజేషన్ చేపట్టనుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025–26) సవరించిన లక్ష్యం రూ. 34,000 కోట్లతో పోలిస్తే తాజా పద్దును రెట్టింపునకుపైగా పెంచడం గమనార్హం! అయితే కీలక రంగాలలోని కంపెనీలలో వ్యూహాత్మక నియంత్రణను నిలుపుకుంటూనే డిజిన్వెస్ట్మెంట్ చేపట్టవచ్చునంటూ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గరిష్టస్థాయిలో టార్గెట్ను పెట్టుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ ఏడాది సవరించిన లక్ష్యం రూ. 33,837 కోట్లుకాగా.. కేవలం రూ. 8,800 కోట్లు సమకూర్చుకోగా.. గతంలోనూ డిజిన్వెస్ట్మెంట్పై బడ్జెట్ ప్రతిపాదనా లక్ష్యాలు చేరుకోలేకపోయిన విషయం విదితమే.ఇదీ చదవండి: క్యాపిటల్ గెయిన్స్గా షేర్ల బైబ్యాక్ -
రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27వ సంవత్సరానికి సంబంధించి ఆదివారం కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్పరానికి రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్ను ఆమె ప్రకటించారు. దేశ తయారీ రంగానికి ఊతమిచ్చేలా పలు చర్యలను ప్రతిపాదించారు. గ్లోబల్ డేటా సెంటర్లకు టాక్స్ హాలిడేను ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. అదేవిధంగా వ్యవసాయం, పర్యాటక రంగాలకు పలు రాయితీలను ప్రతిపా దించారు. అంతర్జాతీయ పెరుగుతున్న అస్థిరతల నేపథ్యంలో...దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక బ్లూప్రింట్ను ఆమె ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టిన నిర్మలా సీతారామన్ వరసగా 9 సార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్ను సృష్టించారు. దేశ చరిత్రలో మహిళా ఆర్థిక మంత్రి ఇన్ని సార్లు ఆర్థికపద్దును సభ ముందుకు తేవడం ఇదే తొలిసారి. మాజీ ప్రధానమంత్రి, దివంగత మొరార్జీ దేశాయ్ అందరికంటే ఎక్కువగా 10 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎంఎస్ఎంఈకి రూ.10వేల కోట్ల ఫండ్దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ ఎంఈ) ఛాంపియన్లుగా ఎదగడానికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రూ.10,000 కోట్లతో డెడికేటెడ్ ఫండ్ను తాజా బడ్జెట్లో ప్రకటించింది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఉత్పాదకత పెంచడం, వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సమగ్ర ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. మన కర్తవ్యం నెరవేర్చుకో వడానికి సంస్కరణల ఎక్స్ప్రెస్ వేగం ఇలాగే కొనసాగుతుందని స్పష్టంచేశారు. మనకు మూ డు కర్తవ్యాలు ఉన్నట్లు చెప్పారు. అవి.. వేగవంతమైన, సుస్థిరాభివృద్ధి, ఆకాంక్షలు నెరవేర్చు కోవడం–సామర్థ్యాలు పెంచుకోవడం, సబ్కా సాత్, సబ్కా వికాస్ అని వివరించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎస్ఈలు ఛాంపియ న్లుగా మారాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. గ్రోత్ ఇంజన్ కు ఎంఎస్ఎంఈలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఆయా కంపెనీలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అందుకోసం రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ప్రతిపాదించారు. రక్షణ రంగానికి సింహ భాగంపొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మిలటరీ ఆధునీకరణపై కేంద్రం ఫోకస్ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో రక్షణ రంగానికి సింహ భాగం కేటాయించింది. ముఖ్యంగా మూలధన వ్యయంలో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా లక్ష కోట్లకు పైగానే కేటాయింపులు జరిపింది. 2025–26లో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రికార్డు స్థాయిలో రూ.7,84,678 కోట్లు ప్రకటించింది. ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 15 శాతం అధికంగా కేటాయింపులు జరిపింది. పాకిస్తాన్ పై ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో అత్యాధునిక యుద్ధరీతులపై కేంద్రం దృష్టి పెట్టింది. కొత్త ఆ యుధాలు, ఎయిర్క్రాఫ్ట్లు, యుద్ధనౌకలు, మిలటరీ హార్డ్వేర్ కొనుగోళ్లు లక్ష్యంగా మొత్తం రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ.2,19,306 కోట్లు కేటాయించింది. వికసిత్ భారత్కు రోడ్మ్యాప్: ప్రధాని మోదీఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ బారత్కు రోడ్మ్యా ప్ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నా రు. ‘‘ఇదొక విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన బడ్జెట్. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్. ప్రపంచ వేదికపై మనదేశ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. అద్భుత అవకాశాలకు ఈ బడ్జెట్ ఒక రహదారి. వికసిత్ భారత్–2047కు బలమైన పునాదిగా నిలుస్తుంది. దేశం ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్ప్రెస్కు నూతన వేగం, నూతన శక్తి లభించడం తథ్యం. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి రోడ్మ్యాప్గా తోడ్పడుతుంది. దేశ ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను కచ్చితంగా తీరుస్తుంది. మన పరిశ్రమలు లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం సహకరిస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 సంవత్సరానికి గాను బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదిసార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. -
ఫ్యూచర్స్ ట్రేడర్లపై ఎస్టీటీ గూగ్లీ
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీ స్థాయి స్పెక్యులేషన్ని కట్టడి చేసే దిశగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్వో)పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని (ఎస్టీటీ) పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఫ్యూచర్స్పై ప్రస్తుతం 0.02 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.05 శాతానికి (150 శాతం) పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఆప్షన్స్ ప్రీమియంపై, ఆప్షన్స్ వినియోగంపై ప్రస్తుతం వరుసగా 0.1 శాతం, 0.125 శాతంగా ఉన్న ఎస్టీటీని 0.15 శాతానికి (దాదాపు 50 శాతం) పెంచుతున్నట్లు తెలిపారు. క్యాష్ ఈక్విటీ మార్కెట్పై కాకుండా అత్యధిక వాల్యూమ్స్ ఉంటున్న డెరివేటివ్ ట్రేడింగ్నే లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో యాక్టివ్, స్వల్పకాలిక ట్రేడింగ్ లావాదేవీల వ్యయాలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. అతి స్పెక్యులేటివ్ యాక్టివిటీని నివారించేందుకు, మార్కెట్ సమతుల్యతను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు రూ. 1 లక్ష విలువ చేసే ఫ్యూచర్స్ విక్రయంపై ఎస్టీటీ రూ. 12.50గా ఉండగా ఇకపై రూ. 20కి పెరుగుతుంది. అలాగే రూ. 10,000 ఆప్షన్ కాంట్రాక్ట్ విక్రయంపై ఎస్టీటీ రూ. 6.25 నుంచి రూ. 10కి పెరుగుతుంది‘ అని స్టాక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం లెమన్ సహ వ్యవస్థాపకుడు ఆశీష్ సింఘాల్ తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరంలో ఎస్టీటీ రూపంలో కేంద్రానికి రూ. 73,000 కోట్లు రావొచ్చనే అంచనాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ముందుగా అంచనా వేసిన రూ. 78,000 కోట్ల కన్నా తక్కువగా రూ. 63,670 కోట్లకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. ‘నామమాత్రపు పెంపు అనేది కేవలం స్పెక్యులేషన్ని నివారించేందుకే తప్ప ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చేందుకు కాదు. ఎఫ్అండ్వో ట్రేడింగ్కి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవుతున్నప్పుడు మేము మౌనంగా చూస్తూ ఉండిపోలేము. ఈ నిర్ణయం అలాంటి స్పెక్యులేటివ్ పెట్టుబడులను నివారించేందుకు ఉపయోగపడుతుంది‘ అని బడ్జెట్ అనంతరం కాన్ఫరెన్స్లో నిర్మలా సీతారామన్ వివరించారు. మార్కెట్లు డౌన్.. ఎస్టీటీ పెంపు ప్రభావంతో మార్కెట్లు గణనీయంగా తగ్గాయి. కీలకమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దాదాపు 2 శాతం క్షీణించాయి. బ్రోకరేజ్ సంబంధ స్టాక్స్ ఒక దశలో 18 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈలో ఎంసీఎక్స్ షేరు సుమారు 12 శాతం తగ్గి రూ.2,232కి (ఇంట్రాడేలో 18 శాతం డౌన్), ఏంజెల్ వన్ స్టాక్ దాదాపు 9 శాతం క్షీణించి రూ. 2,320కి, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సరీ్వసెస్ 8 శాతం క్షీణించి రూ. 304కి పడ్డాయి. అటు గ్రో మాతృ సంస్థ బిలియన్బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేరు 5 శాతం క్షీణించి రూ. 168 వద్ద, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2 శాతం తగ్గి రూ. 567 వద్ద క్లోజయ్యాయి. ఎఫ్పీఐలకు ప్రతికూలం.. సమీప భవిష్యత్తులో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ముఖ్యంగా డెరివేటివ్స్ ఆధారిత హై–ఫ్రీక్వెన్సీ గ్లోబల్ ఫండ్స్కి ప్రతికూలంగా ఉండొచ్చని చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ ఆకాశ్ షా తెలిపారు. అంతర్జాతీయంగా రిసు్కలు, కరెన్సీపరమైన ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల ఎఫ్పీఐలు ఇప్పటికే ఆచితూచి వ్యవహరిస్తూ మన ఈక్విటీ మార్కెట్ నుంచి జనవరిలో రూ. 41,000 కోట్లు ఉపసంహరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు ప్రతికూలంగా పరిణమిస్తుందన్నారు.దీనితో ట్యాక్స్ అనంతర లాభాలు తగ్గిపోయి, భారత మార్కెట్ ఆకర్షణను కోల్పోయే అవకాశం ఉందని షా వివరించారు. ఫండమెంటల్స్ ప్రాతిపదికన, దీర్ఘకాలిక దృష్టితో లావాదేవీలు నిర్వహించే ఎఫ్పీఐలపై ప్రభావం పరిమితంగానే ఉంటుందన్నారు. కాకపోతే, లావాదేవీల వ్యయాలు పెరిగిపోవడం వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు..ఇతర ఆసియా మార్కెట్లవైపు మళ్లే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది పెంపునకు అదనంగా ఇప్పుడు ఎస్టీటీని భారీగా పెంచడం వల్ల ట్రేడర్లు, హెడ్జర్ల వ్యయాలు పెరిగిపోతాయని కోటక్ సెక్యూరిటీస్ ఎండీ శ్రీపాల్ షా చెప్పారు. దీనితో డెరివేటివ్స్ విభాగంలో పరిమాణాలు తగ్గుతాయన్నారు. ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం కన్నా వాల్యూమ్స్ని తగ్గించడమే ఈ ప్రతిపాదన అంతరార్థం అయి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్న నేపథ్యంలో యాక్టివ్ ఎఫ్అండ్వో ఇన్వెస్టర్లను ఎస్టీటీ పెంపు అనేది పెద్ద అవరోధంగా ఉండకపోవచ్చని గ్రీన్ పోర్ట్ఫోలియో పీఎంఎస్ సహ–వ్యవస్థాపకుడు దివమ్ శర్మ తెలిపారు. అతి స్పెక్యులేటివ్ ధోరణులను తగ్గించి ఫైనాన్షియల్ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఎన్ఎస్ఈ ఎండీ ఆశీష్ కుమార్ చౌహాన్ తెలిపారు. -
మార్కెట్ డకౌట్
2026 బడ్జెట్ మ్యాచ్లో నిర్మలా సీతారామన్ వేసిన తొలి ఓవర్కే స్టాక్ మార్కెట్ డకౌట్ అయింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ పై ఆర్థిక మంత్రి వేసిన పన్నుల ఫుల్ టాస్కి బ్రోకరేజీలు క్లీన్ బౌల్డ్ అయ్యాయి. బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ పాయింట్ల బ్యాటింగ్ చేస్తుందనుకుంటే నిర్మలా సీతారామన్ వేసిన అనూహ్య బౌన్సర్కు సెన్సెక్స్–నిఫ్టీ స్టంపులు ఎగిరిపోయాయి. ఓపెనింగ్ ఓవర్లోనే సెన్సెక్స్పై భారీ అమ్మకాల యార్కర్ల దాడి జరిగింది. మిడ్ సెషన్కల్లా రెడ్ స్కోర్బోర్డ్ దడ పుట్టించింది.. ఇన్వెస్టర్లు డకౌట్ అయ్యి వెనుదిరిగితే, ఎల్బీడబ్లు్య అప్పీల్కి బుల్స్ చేతులు ఎత్తేశారు. బడ్జెట్ మ్యాచ్ లాభాల గెలుపుతో కాకుండా.. నష్టాల ఓటమి షాక్తో ముగిసింది.న్యూడిల్లీ: నిర్మలమ్మ బడ్జెట్ స్టాక్ మార్కెట్పై ‘పన్నుల’ దాడి చేసింది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ) 0.02% నుంచి 0.05 శాతానికి పెంచడం, కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్లపై 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్లపై 30% పన్ను విధింపు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశపరిచింది. కీలక మౌలిక రంగాలకు ఆశించిన స్థాయిలో మూలధన వ్యయాన్ని కేటాయించకపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా బడ్జెట్ రోజైన ఆదివారం సెన్సెక్స్ 1,547 పాయింట్లు క్షీణించి 80,723 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 496 పాయింట్లు కుప్పకూలి 25 వేల స్థాయి దిగువన 24,825 వద్ద నిలిచింది. మార్కెట్ పతన తీవ్రత ఎంతలా ఉందంటే..., ఒక్కరోజులో రూ.9.40 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.450 లక్షల కోట్లకు దిగివచ్చింది. ట్రేడింగ్ సాగిందిలా బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకంగా నిర్వహించిన ట్రేడింగ్లో స్టాక్ సూచీలు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 82,389 వద్ద, నిఫ్టీ 25,334 వద్ద మొదలయ్యాయి. ఎస్టీటీ రద్దు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపులపై ఆశలతో తొలిభాగంలో లాభాలు ఆర్జించాయి. ఒక దశలో సెన్సెక్స్ 457 పాయింట్లు పెరిగి 82,727 వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు బలపడి 25,321 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. బడ్జెట్ ప్రసంగంలో పన్నుల ప్రతిపాదన మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడడంతో సూచీలు క్షణాల్లో కుప్పకూలాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 2,371 పాయింట్లు క్షీణించి 79,899 వద్ద, నిఫ్టీ 549 పాయింట్లు కోల్పోయి 24,572 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. దిగువ స్థాయిల్లో కొంతమేర రికవరీ వచి్చనప్పటికీ.., సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్ష ‘‘బడ్జెట్లో ఎస్టీటీ, కార్పొరేట్ బైబ్యాక్లపై పన్నుల పెంపు ప్రతిపాదనలు మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. ట్రేడింగ్ వ్యాపారంపై పన్నుల భారం పెరగడంతో భవిష్యత్లో వాల్యూమ్ తగ్గే అవకాశం ఉంది. సెక్యూరిటీ మార్కెట్లకు ఇదొక కఠిన పరీక్షగా మారనుంది. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ’’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని అంశాలు ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు బడ్జెట్లో రూ.40,000 కోట్ల ప్రతిపాదనతో ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల షేర్లు వెలిగిపోయాయి. అత్యధికంగా సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ 6% లాభపడింది. డిక్సాన్ టెక్నాలజీస్ 4.21%, కేన్స్ టెక్నాలజీ 3.82%, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్స్ 2.95%, డీసీఎక్స్ సిస్టమ్స్ 2.06%, సైయంట్ డీఎల్ఎం 1 శాతం లాభపడ్డాయి. → సెన్సెక్స్ 30 షేర్లలో టీసీఎస్(2%), ఇన్ఫోసిస్(1.17%), సన్ఫార్మా(0.95%), టైటాన్ (0.33%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. ఎస్బీఐ(5.61%), అదానీపోర్ట్స్(5.53%), బీఈఎల్(5.36%), ఐటీసీ (3.91%), టాటా స్టీల్ (3.88%) õÙర్లు నష్టపోయాయి. → ఒక ఐటీ షేర్లకు మాత్రమే స్వల్పంగా డిమాండ్ లభించింది. బీఎస్ఈలో రంగాల వారీ సూచీల్లో పీఎస్యూ బ్యాంక్స్ 5.60%, మెటల్ 3.85% క్షీణించాయి. కమోడిటీస్ 3.35%, ఇంధన 3.14%, క్యాపిటల్ గూడ్స్ 3.08%, వినిమయ 2.98%, → ఇండ్రస్టియల్స్ 2.66%, విద్యుత్ 2.52% పతనమయ్యాయి. బీఎస్ ఈ స్మాల్, మిడ్క్యాప్ ఇండెక్సులు వరుసగా 3%, 2% పతనమయ్యాయి. → ఎస్టీటీ పెంపు ప్రభావం బ్రోకరేజ్ కంపెనీల షేర్లపై తీవ్రంగా కనిపించింది. ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గుతుందనే ఆందోళనలతో ఈ రంగంలోని కీలక కంపెనీల షేర్లు 12% వరకు క్షీణించాయి. → క్యూ3లో లాభం 16% వృద్ధి నమోదుతో సన్ఫార్మా షేరు 1% పెరిగి రూ.1,610 వద్ద స్థిరపడింది. -
‘ఛాంపియన్ల’ కోసం మూడంచెల వ్యూహం
కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రపంచ స్థాయి ‘ఛాంపియన్స్’గా తీర్చిదిద్దేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక వినూత్నమైన మూడంచెల వ్యూహాన్ని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈక్విటీ, లిక్విడిటీ, ప్రొఫెషనల్ సపోర్ట్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.దేశంలోని ఎంఎస్ఎంఈలు కేవలం చిన్న సంస్థలుగానే మిగిలిపోకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే ఛాంపియన్లుగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు.పెట్టుబడి మద్దతుఎంఎస్ఎంఈలకు రుణ భారంతో సంబంధం లేకుండా పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. భవిష్యత్తులో దిగ్గజ సంస్థలుగా ఎదిగే అవకాశం ఉన్న ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ప్రత్యేక ‘ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. 2021లో ప్రారంభించిన ‘సెల్ఫ్-రిలయంట్ ఇండియా ఫండ్’కు అదనంగా రూ.2,000 కోట్లు కేటాయించి మైక్రో ఎంటర్ప్రైజెస్ రిస్క్ క్యాపిటల్ను పొందేలా చర్యలు తీసుకున్నారు.లిక్విడిటీ సపోర్ట్చిన్న పరిశ్రమలకు చెల్లింపుల సమస్య లేకుండా ఉండేందుకు TReDS (Trade Receivables Discounting System) ప్లాట్ఫారమ్ను మరింత శక్తివంతం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులను తప్పనిసరిగా TReDS ద్వారానే జరపాలి. ఇది కార్పొరేట్ రంగానికి ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది. TReDS ప్లాట్ఫారమ్పై ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కోసం క్రెడిట్ గ్యారెంటీ మద్దతును ప్రభుత్వం కల్పిస్తుంది.‘జెమ్స్’తో అనుసంధానం: ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (జెమ్స్)ను TReDSతో అనుసంధానించడం ద్వారా వేగంగా తక్కువ వడ్డీకే ఫైనాన్సింగ్ పొందే వెసులుబాటు కలుగుతుంది.ప్రొఫెషనల్ సపోర్ట్చిన్న సంస్థలు చట్టపరమైన నిబంధనలను తక్కువ ఖర్చుతో పూర్తి చేసేందుకు ‘ప్రొఫెషనల్ సపోర్ట్’ అందించనున్నారు. టైర్-2, టైర్-3 నగరాల్లోని ఎంఎస్ఎంఈలకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా ‘కార్పొరేట్ మిత్ర’లను అభివృద్ధి చేస్తారు. ఐసీఏఐ, ఐసీఎస్ఐ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో ఈ కార్పొరేట్ మిత్రలకు శిక్షణ ఇచ్చి ఎంఎస్ఎంఈలకు సరసమైన ధరలకే సేవలు అందేలా ప్రభుత్వం సహకరిస్తుంది.కొరియర్ ఎగుమతులపై పరిమితి ఎత్తివేతఎంఎస్ఎంఈ రంగం ప్రపంచ మార్కెట్లకు చేరువయ్యేలా చేసేందుకు పన్ను ప్రతిపాదనల్లో కీలక మార్పు చేశారు. ప్రస్తుతం కొరియర్ ద్వారా చేసే ఎగుమతులపై ఉన్న రూ.10 లక్షల గరిష్ట విలువ పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు. దీనివల్ల ఈ-కామర్స్ ద్వారా విదేశాలకు వస్తువులను పంపే చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026-27 లైవ్ అప్డేట్స్ -
ఆ మందులు ఇక అంత ఖరీదు ఉండవ్..
కేంద్ర బడ్జెట్ 2026–27లో క్యాన్సర్ రోగులకు కీలక ఉపశమనం లభించింది. 17 క్యాన్సర్ సంబంధిత మందులు, ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో క్యాన్సర్ చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి.“రోగులకు, ముఖ్యంగా క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో 17 మందులు లేదా ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని ప్రతిపాదిస్తున్నాను” అని ఆమె పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టే సందర్భంగా తెలిపారు.అదేవిధంగా, ఔషధాలు, మందులు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం ఆహారం (FSMP) వ్యక్తిగత దిగుమతులపై సుంకం మినహాయింపు పొందే జాబితాలో మరో ఏడు అరుదైన వ్యాధులను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యతో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కూడా ఆర్థిక భారంలో తగ్గుదల కలగనుంది.ఈ నిర్ణయంతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే అత్యవసర క్యాన్సర్ మందుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు అధిక కస్టమ్స్ సుంకాల కారణంగా ఖరీదైన చికిత్సలు అందని ద్రాక్షలా మారిన పరిస్థితి ఉండగా, తాజా ప్రతిపాదనతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. అలాగే దేశంలో క్యాన్సర్ చికిత్స అందుబాటును పెంచడంతో పాటు, ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వ సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
పారిశ్రామిక విప్లవానికి బడ్జెట్ బాటలు
కేంద్ర బడ్జెట్ 2026-27లో భారత ప్రభుత్వం దేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కొన్ని పథకాలను ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ‘వికసిత్ భారత్’ దిశగా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే కొన్ని వ్యూహాత్మక రంగాలకు పెద్దపీట వేశారు.ప్రపంచానికి తయారీ కేంద్రంగా భారత్ను నిలబెట్టడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ అడుగులు వేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా కేంద్రం పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చిప్ తయారీ నుంచి చౌకైన క్రీడా సామాగ్రి వరకు.. ప్రతి రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా కేటాయింపులు జరిపినట్లు పేర్కొన్నారు.ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) 2.0సెమీకండక్టర్ రంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చడానికి ఐఎస్ఎం 2.0ను ప్రకటించారు. కేవలం చిప్ తయారీ మాత్రమే కాకుండా, సెమీకండక్టర్ పరికరాలు, మెటీరియల్స్ ఉత్పత్తి, భారతీయ మేధో సంపత్తిని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఇందుకోసం పరిశ్రమల భాగస్వామ్యంతో పరిశోధన, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.బయోఫార్మా ‘శక్తి’ఫార్మా రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి రూ.10,000 కోట్ల కేటాయింపుతో ‘బయోఫార్మా శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మూడు కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER)లను ఏర్పాటు చేస్తారు. 1000కి పైగా గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్ సైట్ల నెట్వర్క్ను రూపొందిస్తారు.అరుదైన ఖనిజాల అభివృద్ధి పథకంచైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేస్తారు. అరుదైన ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, శాశ్వత అయస్కాంతాల తయారీకి ఈ పథకం ఊతమిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగానికి అత్యంత కీలకం.డెడికేటెడ్ కెమికల్ పార్కులుదేశీయ రసాయన ఉత్పత్తిని పెంచడానికి రూ.600 కోట్లతో మూడు ప్రత్యేక కెమికల్ పార్కులను ‘ఛాలెంజ్ రూట్’(సాధారణంగా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టును ఒకే చోట కాకుండా ఏ రాష్ట్రం అయితే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందో అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తారు. ఇందుకోసం రాష్ట్రాల మధ్య నిర్వహించే పోటీనే ఛాలెంజ్ రూట్) ద్వారా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారు.ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్)ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు ఈ పథకం కేటాయింపులను ఏకంగా రూ.40,000 కోట్లకు పెంచారు. దీనివల్ల మొబైల్స్, ల్యాప్టాప్ల విడిభాగాలు భారత్లోనే తయారవుతాయి.టెక్స్టైల్స్ రంగం - ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్వస్త్ర పరిశ్రమ బలోపేతానికి నేషనల్ ఫైబర్ స్కీమ్, టెక్స్టైల్ విసర్తణ, ఉపాధి పథకాలు ఉన్నాయి. పాత టెక్స్టైల్ క్లస్టర్లను ఆధునీకరించడం వీటి ప్రధాన ఉద్దేశం.ఇతర కీలక మౌలిక సదుపాయాల పథకాలుకంటైనర్ తయారీ: గ్లోబల్ సప్లై చైన్లో భారత్ వాటాను పెంచడానికి రూ.10,000 కోట్లతో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్.ఇండస్ట్రియల్ క్లస్టర్లు: దేశవ్యాప్తంగా ఉన్న 200 పాత పారిశ్రామిక వాడలను (Clusters) ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించనున్నారు.హైటెక్ టూల్ రూమ్స్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యాధునిక టూల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈలకు సాంకేతిక సహాయం అందిస్తారు.క్రీడా సామగ్రి: సరసమైన ధరల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా సామగ్రిని తయారు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.నిర్మాణ పరికరాలు: అధిక విలువ కలిగిన నిర్మాణ, మౌలిక సదుపాయాల యంత్రాల తయారీని దేశీయంగా బలోపేతం చేయనున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026-27 లైవ్ అప్డేట్స్ -
నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలోని కీలక ప్రకటనలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించడమే కాకుండా 75 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం చేయడం విశేషం. రూ.53.47 లక్షల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్ మంత్రి ప్రకటనలు కీలకంగా కింది విధంగా ఉన్నాయి.ఆదాయపు పన్నుపన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఈసారి పన్ను శ్లాబుల్లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ సరళీకరణపై దృష్టి సారించారు.కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.ఐటీ రిటర్నులను సవరించుకునే గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు.మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చే పరిహారంపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు.విదేశీ విద్య, వైద్యం, టూర్ ప్యాకేజీలపై ‘ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్’ (టీసీఎస్)ను 5% నుంచి 2%కి తగ్గించారు.మౌలిక సదుపాయాలు, రవాణాదేశాభివృద్ధికి ఇంజిన్లుగా భావించే మౌలిక సదుపాయాల కల్పనకు రికార్డు స్థాయిలో రూ.12.2 లక్షల కోట్లు కేటాయించారు.మెట్రో నగరాలను అనుసంధానిస్తూ 7 కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు.కొత్తగా 20 జాతీయ జల మార్గాలను అభివృద్ధి చేయనున్నారు.అత్యధికంగా రవాణా రంగానికి రూ.5.98 లక్షల కోట్లను కేటాయించారు.సాంకేతికత, పరిశ్రమలుభారత్ను గ్లోబల్ టెక్ హబ్గా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగంగా చిప్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.40,000 కోట్లు కేటాయించారు.ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా సహా 5 రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు.ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్: చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.10,000 కోట్ల నిధిని ప్రకటించారు.ఆరోగ్య, రక్షణ రంగాలుక్యాన్సర్ మందులు: 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేశారు. దీనివల్ల ప్రాణరక్షక మందులు చౌకగా లభించనున్నాయి.దేశ భద్రత కోసం రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లను కేటాయించారు.ఆర్థిక లోటు, వృద్ధి రేటుభారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధి నమోదు చేస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.2026-27 సంవత్సరానికి ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతంగా అంచనా వేశారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026-27 లైవ్ అప్డేట్స్ -
బడ్జెట్ 2026: చౌకైనవి.. ఖరీదైనవి ఇవే!
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 2026లో చాలా అంశాలను వెల్లడించారు. ఈ కథనంలో బడ్జెట్ తరువాత చౌకగా లభించే వస్తువులు ఏవి?, ఖరీదైనవిగా మారిన వస్తువులు ఏవి? అనేది తెలుసుకుందాం.చౌకగా లభించే వస్తువులువిమాన భాగాలుమైక్రోవేవ్ ఓవెన్లుEV బ్యాటరీలుసోలార్ ప్యానెల్స్డయాబెటిక్ & క్యాన్సర్ మందులుభారతదేశంలో తయారయ్యే స్మార్ట్ఫోన్లుటాబ్లెట్లుఖరీదైనవిగా మారే వస్తువులులగ్జరీ గడియారాలుదిగుమతి చేసుకున్న మద్యంసిగరెట్లుబీడీలుపాన్ మసాలాగుట్కాకొన్ని ఎరువులుదిగుమతి చేసుకున్న టీవీ పరికరాలు, కెమెరాలు & సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలుఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026-27 లైవ్ అప్డేట్స్ -
బడ్జెట్ 2026: మౌలిక వసతులు, రక్షణ రంగాలకు ప్రాధాన్యం
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి దిశగా నడిపించే లక్ష్యంతో రూపొందించిన 2026-27 కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. మొత్తం రూ.53.47 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో కొన్ని రంగాలు అగ్రస్థానంలో నిలిచాయి.కీలక రంగాల కేటాయింపులు (రూ.కోట్లలో)రవాణా: రూ. 5,98,520 కోట్లురక్షణ: రూ. 5,94,585 కోట్లుగ్రామీణాభివృద్ధి: రూ. 2,73,108 కోట్లుహోం వ్యవహారాలు: రూ. 2,55,234 కోట్లువ్యవసాయం & అనుబంధ రంగాలు: రూ. 1,62,671 కోట్లువిద్య: రూ. 1,39,289 కోట్లుఇంధనం: రూ. 1,09,029 కోట్లుఆరోగ్యం: రూ. 1,04,599 కోట్లుపట్టణాభివృద్ధి: రూ. 85,522 కోట్లుఐటీ అండ్ టెలికాం: రూ. 74,560 కోట్లువాణిజ్యం & పరిశ్రమలు: రూ. 70,296 కోట్లుసాంఘిక సంక్షేమం: రూ. 62,362 కోట్లుశాస్త్ర సాంకేతిక విభాగాలు: రూ. 55,756 కోట్లుపన్ను పరిపాలన: రూ. 45,500 కోట్లువిదేశీ వ్యవహారాలు: రూ. 22,119 కోట్లుఆర్థిక శాఖ: రూ. 20,649 కోట్లుఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి: రూ. 6,812బడ్జెట్లో అత్యధికంగా రవాణా రంగానికి రూ.5.98 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా హైవేలు, రైల్వేలు, పోర్టుల ఆధునీకరణపై ప్రభుత్వం తన పట్టును చాటింది. దీనికి సమాంతరంగా రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఈ నిధులు ఊతమివ్వనున్నాయి.గ్రామీణ భారతం, వ్యవసాయంగ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.73 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.1.62 లక్షల కోట్లు కేటాయించడం విశేషం. రైతుల ఆదాయం పెంచడం, డిజిటల్ అగ్రి-స్టాక్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు.విద్య, ఆరోగ్యం, ఐటీమానవ వనరుల వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యకు రూ.1.39 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.1.04 లక్షల కోట్లు కేటాయించారు. రాబోయే కాలంలో టెక్నాలజీ పాత్రను గుర్తిస్తూ ఐటీ, టెలికాం రంగానికి రూ.74,560 కోట్లు కేటాయించడం డిజిటల్ ఇండియా వేగాన్ని పెంచనుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026 సమగ్ర స్వరూపం.. -
బడ్జెట్ 2026: విదేశాలకు వెళ్లేవారికి ఊరట
మధ్యతరగతి వేతన జీవుల విదేశీ ప్రయాణాలకు, అంతర్జాతీయ విద్యను అభ్యసించాలనుకునే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊతం ఇచ్చింది. గతంలో ఈ విభాగంలో భారంగా మారిన 5 శాతం టీసీఎస్ను 2 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వేతన జీవుల నెలవారీ బడ్జెట్పై పడే అదనపు భారం తగ్గడమే కాకుండా చేతిలో నగదు లభ్యత పెరుగుతుంది. ఈ మార్పు వేతన జీవుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.టీసీఎస్ అంటే ఏమిటి?సాధారణంగా మనం విదేశీ పర్యటనల కోసం ప్యాకేజీలు కొన్నప్పుడు లేదా విదేశాలకు డబ్బు పంపినప్పుడు బ్యాంకులు లేదా ట్రావెల్ ఏజెంట్లు కొంత మొత్తాన్ని పన్ను రూపంలో ముందే వసూలు చేస్తారు. దీనినే టీసీఎస్ అంటారు. ఇది మన ఆదాయపు పన్నులో ముందుగానే చెల్లించాలి.వేతన జీవులపై ప్రభావంగతంలో 5 శాతం టీసీఎస్.. అంటే ఎక్కువ సొమ్ము ప్రభుత్వం వద్ద ఉండిపోయేది. ఇప్పుడు అది 2 శాతానికి తగ్గడం వల్ల ఆ మిగిలిన 3 శాతం నగదు పన్ను దారులకు మిగులుతుంది. విదేశీ విద్య కోసం లోన్ తీసుకోకుండా సొంతంగా డబ్బు పంపే తల్లిదండ్రులకు ఇది పెద్ద ఊరట. విదేశీ టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకునేటప్పుడు ముందస్తుగా చెల్లించాల్సిన నగదు తగ్గుతుంది.ఉదాహరణకు..ఒక వేతన జీవి తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లాలనుకున్నారనుకుందాం. ఆ టూర్ ప్యాకేజీ ధర రూ.10 లక్షలు అనుకుంటే, పాత, కొత్త రేట్ల ప్రకారం తేడా ఇలా ఉంటుంది. పాత నిబంధనల ప్రకారం, ఈ ప్యాకేజీ ధరపై 5 శాతం టీసీఎస్ వర్తించేది. అంటే ఆ వ్యక్తి ప్యాకేజీ ధరతో పాటు అదనంగా రూ.50,000 పన్ను రూపంలో ముందే చెల్లించాల్సి వచ్చేది.అయితే, కొత్త బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈ టీసీఎస్ రేటును 2 శాతానికి తగ్గించారు. దీనివల్ల అదే రూ.10 లక్షల ప్యాకేజీపై ఇప్పుడు కేవలం రూ.20,000 మాత్రమే పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా సదరు ప్రయాణికుడికి తక్షణమే రూ.30,000 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. -
కేంద్ర బడ్జెట్ 2026 సమగ్ర స్వరూపం..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.53,47,315 కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.35,33,150 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.18,14,165 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్ 2026-27 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.బడ్జెట్ 2025-26 సమగ్ర స్వరూపంరెవెన్యూ వసూళ్లు రూ.35,33,150 కోట్లుపన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లుపన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లుమూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లురుణాల రికవరీ రూ.38,397 కోట్లుఇతర వసూళ్లు రూ.80,000 కోట్లుఅప్పులు, ఇతర వసూళ్లు రూ.16,95,768 కోట్లుమొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లుమొత్తం వ్యయం రూ.53,47,315 కోట్లురెవెన్యూ ఖాతా రూ.41,25,494 కోట్లువడ్డీ చెల్లింపులు రూ.14,03,972 కోట్లుమూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,92,702 కోట్లుమూలధన ఖాతా రూ.12,21,821 కోట్లువాస్తవ మూలధన వ్యయం రూ.17,14,523 కోట్లురెవెన్యూ లోటు రూ.5,92,344 కోట్లునికర రెవెన్యూ లోటు రూ.99,642 కోట్లుద్రవ్య లోటు రూ.16,95,768 కోట్లుప్రాథమిక లోటు రూ.2,91,796 కోట్లు -
రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయం.. ఎలా ఖర్చు చేస్తారంటే..
కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని మార్చే దిశగా ఉన్నాయి. ముఖ్యంగా మూలధన వ్యయాన్ని రూ.12.2 లక్షల కోట్లకు పెంచడం దేశాభివృద్ధికి బలమైన సంకేతం. 2014-15లో కేవలం రూ.2 లక్షల కోట్లుగా ఉన్న ఈ వ్యయం, ఇప్పుడు ఆరు రెట్లు పెరగడం గమనార్హం. ఈ భారీ కేటాయింపుల నేపథ్యంలో రాబోయే కాలంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందో చూద్దాం.మౌలిక సదుపాయాల కల్పనబడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి స్పష్టంగా పేర్కొన్నట్లుగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, వంతెనల నిర్మాణం వేగవంతం అవుతుంది. వందే భారత్ రైళ్ల విస్తరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల పూర్తికి ఈ నిధులు ఉపయోగపడతాయి.టైర్ 2, టైర్ 3 నగరాల అభివృద్ధిఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలపై బడ్జెట్లో దృష్టి సారించారు. ఈ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులు, మెరుగైన మురుగునీటి వ్యవస్థ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. చిన్న నగరాలు వృద్ధి కేంద్రాలుగా మారుతున్నందున అక్కడ గృహ నిర్మాణ రంగానికి, కమర్షియల్ స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది.ఇంధన రంగం, గ్రీన్ ఎనర్జీభారీ కాపెక్స్ కేటాయింపులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎల్లప్పుడూ ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. సోలార్ ప్యానెల్స్, విండ్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ మిషన్లలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. పాత విద్యుత్ లైన్ల ఆధునీకరణ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిధులు మళ్లుతాయి.లాజిస్టిక్స్, తయారీ రంగం‘వేగాన్ని కొనసాగించడం’ అనే లక్ష్యంతో వస్తువుల రవాణా ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వివిధ రవాణా మార్గాలను అనుసంధానించడం ద్వారా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణం జరుగుతుంది. మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో తయారీ రంగంలో దేశీ, విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.ఉపాధి, అనుబంధ రంగాలుమూలధన వ్యయం పెరగడం వల్ల సిమెంట్, స్టీల్, పెయింట్స్, భారీ యంత్రాల పరిశ్రమలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ పరిశ్రమల వృద్ధి వల్ల లక్షలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్కు వేళాయె.. -
హైదరాబాద్కు హై-స్పీడ్ రైళ్లు..
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్పై వరాల జల్లు కురిపించింది. కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా హైదరాబాద్ను అనుసంధానిస్తూ పలు హై-స్పీడ్ రైలు కారిడార్లను కేంద్రం ప్రకటించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా మొత్తం ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లు ప్రతిపాదించగా, వాటిలో మూడు కారిడార్లు హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం.ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు ఇవే..* ముంబై – పూణే* పూణే – హైదరాబాద్* హైదరాబాద్ – బెంగళూరు* హైదరాబాద్ – చెన్నై* చెన్నై – బెంగళూరు* బెంగళూరు – వారణాసి* వారణాసి – సిలిగురిఈ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్ దేశవ్యాప్తంగా కీలక రవాణా కేంద్రంగా మరింత బలోపేతం కానుంది. -
వికసిత్ భారత్ లక్ష్యంగా ‘కర్తవ్య మంత్రం’: నిర్మలా సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ దేశాభివృద్ధికి సంబంధించి కీలకమైన రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. కర్తవ్య భవన్లో రూపొందించిన తొలి బడ్జెట్గా దీన్ని అభివర్ణిస్తూ యువతను కీలకంగా చేసుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘మూడు కర్తవ్యాలు’, ‘ఆరు దశల ప్రక్రియ’ను ఆమె ప్రకటించారు.మూడు ప్రధాన కర్తవ్యాలుప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చడానికి మూడు ముఖ్యమైన విధులను (కర్తవ్యాలను) ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.1. ఆర్థిక వృద్ధి: అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ప్రపంచ సవాళ్లను తట్టుకోగల సామర్థ్యాన్ని నిర్మించడం.2. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. వారిని కేవలం లబ్ధిదారులుగా కాకుండా భారతదేశ శ్రేయస్సులో బలమైన భాగస్వాములుగా మార్చేలా వారి నైపుణ్యాలను పెంపొందించడం.3. సమ్మిళిత వనరుల పంపిణీ: ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ విజన్తో ప్రతి కుటుంబం, సమాజం, ప్రాంతానికి వనరులు అందేలా చూడటం.‘నీరు, ఎనర్జీ, క్లిష్టమైన ఖనిజాల అవసరం పెరుగుతోంది. కొత్త సాంకేతికతలు ఉత్పత్తి వ్యవస్థలను మారుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆశయాన్ని, సమ్మిళిత వృద్ధిని సమతుల్యం చేస్తూ భారతదేశం వికసిత్ భారత్ వైపు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తుంది’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.ఆరు దశల ప్రక్రియభారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు బడ్జెట్లో ఆరు కీలక అంశాలపై దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి చెప్పారు.వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి: ఉత్పాదకత పెంపుదల.యువశక్తి, ఉపాధి: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన.మౌలిక సదుపాయాల కల్పన: ఆధునిక రవాణా, డిజిటల్ మౌలిక వసతులు.సుస్థిర ఇంధనం: ఇంధన భద్రత, క్లీన్ ఎనర్జీ.ఇన్నోవేషన్, పరిశోధన: టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధి.సమ్మిళిత అభివృద్ధి: అణగారిన వర్గాలు, పేదల సాధికారత. ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్కు వేళాయె.. -
వాణిజ్య గ్యాస్ ధరల పెంపు
చమురు కంపెనీలు ఫిబ్రవరి 1, ఆదివారం నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.49 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ రిటైల్ ధర రూ.1,740.50కు చేరుకుంది. అయితే గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు.రంగాలపై ప్రభావంగతంలో కమర్షియల్ గ్యాస్ ధరల తగ్గింపుతో ఊపిరి పీల్చుకున్న ఆతిథ్య, క్యాటరింగ్ రంగాలు తాజా పెంపుతో మళ్లీ ప్రభావితమయ్యే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. వంట గ్యాస్ ఖర్చులు పెరగడం వల్ల బయట ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య గ్యాస్పై ఆధారపడే టీ స్టాళ్లు, స్వీట్ షాపులపై ఈ ప్రభావం నేరుగా పడుతుంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్కు వేళాయె.. -
కాంజీవరం చీరలో నిర్మలమ్మ.. ప్రత్యేకతలివే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంట్లో తన తొమ్మిదో బడ్జెట్ను (2026-27) ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆమె ధరించిన ‘కాంజీవరం చీర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు ఆర్థిక లెక్కలు, మరోవైపు రాజకీయ సమీకరణాల నడుమ ఈ చీర ప్రత్యేక చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కాంజీవరం పట్టు చీరను ధరించడం ద్వారా ఆ రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పిటన్లవుతుందని కొందరు భావిస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి, ఆ రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న గౌరవాన్ని చాటడానికి ఇదొక సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాంజీవరం చీర ప్రత్యేకతలు..కాంజీవరం చీరలను దక్షిణ భారతదేశం నుంచి సేకరించిన స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో తయారు చేస్తారు. ఇందులో వాడే జరిలో వెండి తీగపై బంగారు పూత ఉంటుంది. దీనివల్ల చీర చాలా కాలం పాటు మెరుస్తూ ఉంటుంది. ఇందులో చీర, అంచు విడివిడిగా నేస్తారు. తర్వాత చాలా బలంగా వాటిని ‘కోర్వాయ్’ పద్ధతిలో జత చేస్తారు. ఒకవేళ చీర చిరిగినా అంచు మాత్రం చీర నుంచి విడిపోకుండా జాగ్రత్తపడుతారు.మూడు దారాల కలయికసాధారణ పట్టు చీరల కంటే ఇవి కొంచెం బరువుగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో మూడు పట్టు దారాలను కలిపి నేస్తారు. దీనివల్ల చీర చాలా మన్నికగా, దృఢంగా ఉంటుంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్కు వేళాయె.. -
బడ్జెట్కు ముందు రాష్ట్రపతిని ఎందుకు కలవాలి?
దేశ ఆర్థిక దిశను నిర్దేశించే 2026-27 వార్షిక బడ్జెట్ సమర్పణకు సమయం దగ్గరపడింది. ‘డిజిటల్ బహీ-ఖాతా’తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కర్తవ్య భవన్ నుంచి బయలుదేరారు. పార్లమెంట్లో బడ్జెట్ చదవడానికి ముందు ఆమె నేరుగా రాష్ట్రపతి భవన్కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. రాజ్యాంగబద్ధంగా వస్తున్న ఈ ఆనవాయితీకి కారణాలేమిటి? సూట్కేస్ స్థానంలో వచ్చిన ‘డిజిటల్ బహీ-ఖాతా’ కథేంటి? వంటి వివరాలు మీకోసం..రాష్ట్రపతిని ఎందుకు కలుస్తారు?బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి రాష్ట్రపతిని కలవడం కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు. దీని వెనుక రాజ్యాంగ, సాంప్రదాయ కారణాలు ఉన్నాయి.రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ 112): భారత రాజ్యాంగం ప్రకారం, బడ్జెట్ను (వార్షిక ఆర్థిక నివేదిక) పార్లమెంట్లో ప్రవేశపెట్టే బాధ్యత నిజానికి రాష్ట్రపతిదే. రాష్ట్రపతి తరపున ఆర్థిక మంత్రి ఈ బాధ్యతను నిర్వహిస్తారు. అందుకే బడ్జెట్ ప్రసంగం చదవడానికి ముందు రాష్ట్రపతి నుంచి అధికారికంగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి.బడ్జెట్ అనేది ఒక ‘మనీ బిల్లు’. రాజ్యాంగం ప్రకారం ఏదైనా మనీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు అవసరం.సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతిని కలిసినప్పుడు ఆర్థిక మంత్రికి రాష్ట్రపతి ‘పెరుగు-చక్కెర’ తినిపిస్తారు. ఒక ముఖ్యమైన పనికి వెళ్లే ముందు ఇది దేశీయంగా ఒక శుభసూచకంగా భావిస్తారు.రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆర్థిక మంత్రి పార్లమెంట్కు చేరుకుని ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి (Cabinet) సమావేశంలో బడ్జెట్కు తుది ఆమోదం పొందుతారు.#WATCH | President Droupadi Murmu feeds Union Finance Minister Nirmala Sitharaman the customary 'dahi-cheeni' (curd and sugar) ahead of her ninth consecutive Union Budget presentation. pic.twitter.com/WouiznFEMr— ANI (@ANI) February 1, 2026ఏంటి ఈ ‘డిజిటల్ బహీ-ఖాతా’?బ్రిటిష్ హయాం నుంచి వస్తున్న ‘లెదర్ బ్రీఫ్కేస్’ సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ 2019లో నిర్మలా సీతారామన్ ‘బహీ-ఖాతా’ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ఎర్రటి వెల్వెట్ క్లాత్తో చేసిన బ్యాగ్. దీనిపై బంగారు రంగులో మన జాతీయ చిహ్నం (అశోక చక్రం) ముద్రించి ఉంటుంది. 2021 నుంచి కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ను పేపర్లెస్గా మార్చారు. ఇప్పుడు ఆ ఎర్రటి బహీ-ఖాతా లోపల కాగితపు పత్రాలకు బదులుగా ఒక డిజిటల్ టాబ్లెట్ ఉంటుంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్కు వేళాయె.. -
Budget 2026: ఊరటనిస్తారా? ఉసూరుమనిస్తారా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే 2026-27 కేంద్ర బడ్జెట్ (Union Budget 2026-27) గురించి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పిస్తూ ఆమె సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా నడిపించేందుకు ఈ బడ్జెట్ ఒక దిక్సూచిలా నిలవనుంది.ఈ నేపథ్యంలో నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఏడాది బడ్జెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.పన్ను చెల్లింపుదారులకు ఊరటమధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఎప్పుడూ ఆశించేది ఆదాయపు పన్ను రాయితీలు. ఈసారి కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పన్ను స్లాబుల్లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం ఉన్న రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని మరింత పెంచే అవకాశం ఉంది.వివాహిత జంటలకు కలిపి ఒకే పన్ను రిటర్నులు దాఖలు చేసే వెసులుబాటు కల్పించడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించే దిశగా కొత్త ప్రతిపాదన రావొచ్చు.మౌలిక సదుపాయాల కల్పనగత కొన్ని బడ్జెట్ల మాదిరిగానే ఈసారి కూడా మూలధన వ్యయంపై ప్రభుత్వం భారీగా దృష్టి పెట్టనుంది.వందే భారత్ స్లీపర్ రైళ్ల విస్తరణ, అమృత్ భారత్ స్టేషన్ల ఆధునీకరణ, కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి భారీ కేటాయింపులు ఉండవచ్చు.వస్తు రవాణా ఖర్చులను తగ్గించడానికి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యత లభించనుంది.ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధిదేశంలో నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక్ష ఉపాధి ప్రోత్సాహక పథకాలను ప్రకటించే అవకాశం ఉంది.తయారీ రంగాన్ని ప్రోత్సహించి ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని మరిన్ని రంగాలకు విస్తరించవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది.వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిగ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం బడ్జెట్లో కీలక అంశం కానుంది.చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితి పెంపు, మహిళా రైతులకు ప్రత్యేక రాయితీలు ఆశించవచ్చు.వ్యవసాయ రంగంలో సాంకేతికతను జోడించి ఉత్పాదకతను పెంచేందుకు ‘అగ్రి-టెక్’ స్టార్టప్లకు ప్రోత్సాహం ఉండవచ్చు.గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలుపర్యావరణ హిత ఇంధనాల వైపు మళ్లడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి.ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గించేలా బ్యాటరీ తయారీపై పన్ను రాయితీలు, చార్జింగ్ స్టేషన్ల విస్తరణపై ప్రకటనలు వెలువడవచ్చు.నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు మరిన్ని నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది.ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి?ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో కొత్త రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు లేదా ప్రత్యేక ప్యాకేజీల ప్రకటనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్కు వేళాయె.. -
బడ్జెట్ రచయితలు వీరే..
భారత ఆర్థిక ముఖచిత్రాన్ని నిర్దేశించే కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పిస్తున్న మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ బడ్జెట్ రూపకల్పన వెనుక ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, వృద్ధిని సమతుల్యం చేస్తూ ఒక శక్తివంతమైన అధికారుల బృందం గత కొన్ని నెలలుగా శ్రమించింది.బడ్జెట్ వెనుక ఉన్న వ్యక్తులునిర్మలా సీతారామన్ (కేంద్ర ఆర్థిక మంత్రి): బడ్జెట్ రూపకల్పనకు దిశానిర్దేశం చేస్తూ భారత ఆర్థిక విధానాలను ప్రపంచ వేదికపై శక్తివంతంగా నిలుపుతున్న నాయకురాలు.అనురాధ్ ఠాకూర్ (ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి): బడ్జెట్ తయారీలో ఈమె అత్యంత కీలక పాత్ర పోషించారు. వనరుల కేటాయింపు, వృద్ధి ప్రాధాన్యతలు, బడ్జెట్ పత్రాల తుది రూపకల్పనలో ఈమెది ప్రధాన నిర్ణయం.ఆర్వింద్ శ్రీవాస్తవ (రెవెన్యూ కార్యదర్శి): బడ్జెట్లోని పన్నుల ప్రతిపాదనల బాధ్యతను ఈయన పర్యవేక్షించారు. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ, కస్టమ్స్ సుంకాల మార్పులపై కీలకంగా వ్యవహరించారు.ఉమ్లున్మాంగ్ ఉల్నమ్ (వ్యయ కార్యదర్శి): ప్రభుత్వ ఖర్చులు, వివిధ పథకాలకు సబ్సిడీల కేటాయింపులను సమన్వయం చేస్తూ నిధుల దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించారు.ఎం.నాగరాజు (ఆర్థిక సేవల కార్యదర్శి): బ్యాంకింగ్ రంగం బలోపేతం, బీమా, పెన్షన్ వ్యవస్థల వృద్ధిపై దృష్టి సారించారు.అరునిష్ చావ్లా (దీపమ్ కార్యదర్శి): ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా పన్నేతర ఆదాయాన్ని సమకూర్చే బాధ్యతను నిర్వహించారు.కె.మోసెస్ చాలై (పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కార్యదర్శి): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, వాటి మూలధన వ్యయాన్ని పర్యవేక్షించారు.వి.అనంత నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు): అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ దేశీయ వృద్ధి రేటు అంచనాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.ప్రధాన లక్ష్యాలు.. వ్యూహాలుఈ బడ్జెట్ ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక లోటు నియంత్రణ మధ్య సమతుల్యతను సాధించడంపై దృష్టి సారించనుందని అంచనాలున్నాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పాదక రంగం వృద్ధి, భారీ స్థాయిలో ఉద్యోగ సృష్టికి ఈ బడ్జెట్ పెద్దపీట వేస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఆమెకు ఆర్థిక శక్తి!
‘బడ్జెట్ అనేది మన స్వేచ్ఛకు పరిమితులు విధించకూడదు. మరింత స్వేచ్ఛ ఇవ్వాలి’ అనేది పాత మాట. ‘ బడ్జెట్ అనేది స్వేచ్ఛ మాత్రమే కాదు మహిళా సాధికారతకు దారి చూపాలి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు బడ్జెట్ ద్వారా కొత్త శక్తి ఇవ్వాలి’ అనేది కొత్త మాట. ‘బడ్జెట్–2026’ నుంచి మహిళలు ఆశిస్తున్నది ఏమిటి? బడ్జెట్ రూపకల్పనలో జెండర్ ఇన్టెన్షనాలిటీ ప్రాధాన్యత ఏమిటి? ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు కావాల్సింది ఏమిటి?... తెలుసుకుందాం...గత కాలాల సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పనలో జెండర్ ఇన్టెన్షనాలిటీ (జేఈ) కీలకంగా మారింది. ‘జేఈ’ అనేది మహిళల అవసరాలు, ఆకాంక్షలు, ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని చేసే డిజైనింగ్.‘గత బడ్జెట్ చిన్న వ్యాపారాలు, స్టార్టప్లకు కొత్త అవకాశాలను సృష్టించింది, పెట్టుబడి, టర్నోవర్ పరిమితులను పెంచింది. క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్లకు రెట్టింపు చేసింది. స్టార్టప్లు, ఎగుమతిదారులకు అధిక కాలపరిమితి గల రుణాలను అందించింది. రాబోయే అయిదేళ్లలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రూ. 2 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందించాలనే ప్రభుత్వ ప్రణాళికతో ఉపశమనం లభించింది. పెద్ద సంస్థలను స్థాపించాలని, పారిశ్రామిక వృద్ధికి దోహదపడాలని, ఉద్యోగాలు సృష్టించాలని మహిళలు కోరుకుంటున్నారు’ అంటున్నారు భారతీయ యువశక్తి ట్రస్ట్(బివైఎస్టీ) మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటేశన్.జెండర్ బడ్జెటింగ్ అంటే...జెండర్ బడ్జెటింగ్ను జెండర్ సెన్సిటివ్ బడ్జెట్ అని కూడా పిలుస్తారు. బడ్జెట్లో లింగ అసమానతలు లేకుండా చూసుకోవడమే జెండర్ బడ్జెటింగ్. ముఖ్యమైన అంశాలలో మహిళలు కీలక నిర్ణయాలు తీసుకునేలా చేయడం, పురుషులు, మహిళల మధ్య వనరుల పంపిణీలో సమానత్వం ఉండేలా చూడడం జెండర్ బడ్జెటింగ్ ప్రాథమిక లక్ష్యం.సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్2026 బడ్జెట్ నుండి ఆశిస్తున్న వాటిలో ముఖ్యమైనది...అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి మహిళలకు తగినంత సహకారం అందించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, డీప్–టెక్లాంటి రంగాలలో మహిళల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయాలని పీహెచ్డీసీసీఐ (పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్) మహిళల ప్రతినిధి బృందం కోరుతోంది.ప్రోత్సాహకాలు, విధానపరమైన మద్దతు ద్వారా మహిళల నేతృత్వంలోని పరిశ్రమలు, సేవారంగాలకు ప్రోత్సాహం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉన్నతవిద్య అభ్యసించే మహిళలకు, ముఖ్యంగా ‘స్టెమ్’ విభాగాలకు సంబంధించిన మహిళలకు స్కాలర్షిప్లు అందించాలని, మార్కెట్ యాక్సెన్ను మెరుగుపరుచుకోవడానికి మహిళల నేతృత్వంలోని వ్యాపార సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను అందించాలనీ కోరారు. ఆఫీసులలో మహిళా ఉద్యోగులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ నివారణలాంటి ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి ఆరోగ్య పథకాలను అందించాలని కోరారు.మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం..‘మహిళల నేతృత్వంలోని కంపెనీలకు అందుబాటులో ఉండే పథకాలను ప్రవేశపెట్టాలని, ముఖ్యంగా కొలేటరల్–ఫ్రీ క్రెడిట్, వడ్డీ రాయితీ...మొదలైన వాటి ద్వారా సహకారం అందించాలని కోరుకుంటున్నాను. చిన్నా, పెద్ద పట్టణాలలో ఉన్న మహిళా వ్యాపారులలో ఎంతో సృజనాత్మకత ఉంది. గొప్ప ఆశయాలు ఉన్నాయి. ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వారి సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరచవచ్చు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వారు కీలక భాగస్వాములు అయ్యేలా సహాయపడవచ్చు. మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడం అనేది కేవలం కలిసికట్టుగా ముందుకు సాగడం మాత్రమే కాదు భవిష్యత్తు కోసం మెరుగైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం కూడా’ అంటున్నారు క్రిమినల్ లాయర్ నుంచి ఎంటర్ప్రెన్యూర్గా మారిన ‘రూట్స్ కేఫ్’ ఫౌండర్ మీనాక్షి కుమార్. ‘మన దేశంలో రిటైల్ కాస్మెస్యూటికల్ పరిశ్రమ లో ఎంతో మార్పు వచ్చింది. దీనిలో మహిళా వినియోగదారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. స్వల్పకాలిక పరిష్కారాల కంటే దీర్ఘకాలిక చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాస్మెస్యూటికల్స్ను కేవలం అందాల విభాగంగా మాత్రమే చూడకుండా ఆరోగ్య సంరక్షణ–విశ్లేషణ వర్గంగా అధికారికంగా గుర్తించే అవకాశాన్ని కేంద్ర బడ్జెట్ 2026 ఇస్తుందని ఆశిస్తున్నాం. సమర్థవంతమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆ రంగం మరింత అభివృద్ధి అయ్యేలా చేయవచ్చు. దేశీయ తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా మన దేశంలోని బ్యూటీ–ఫార్మా పరిశ్రమ బలోపేతం అవుతుంది. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది’ అంటున్నారు బ్యూటీ–ఫార్మాకు చెందిన మహిళా ఎంటర్ప్రెన్యూర్లు.అసమానతలు లేకుండా...మా వాహక్, విట్ట సఖీగా మహిళలు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి బీమా వాహక్లకు కేంద్ర బడ్టెట్లో ప్రాధాన్యత ఇచ్చి, ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉంది. ‘బడ్జెట్ అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే గత కొంతకాలంగా స్త్రీ సాధికారత దృష్ట్యా అది మరింత ఆసక్తికరంగా మారింది. జెండర్ బడ్జెటింగ్కు ప్రాధాన్యత ఇచ్చే ధోరణి పెరగడం సంతోషం కలిగిస్తోంది. బడ్జెట్లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీదే వారి పురోగతి ఆధారపడి ఉంటుంది’ అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. -
బంగారం ఇకపైనా ఇలాగేనా? ఆర్థిక సర్వే ఏం చెప్పింది?
గతేడాది (2025) బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు, ప్రపంచ విధాన అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడుతున్న అమెరికన్ డాలర్ కారణంగా బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరిగింది. ఫలితంగా బంగారం ధరలు ఔన్స్కు 2,607 డాలర్ల నుంచి 4,315 డాలర్ల వరకు పెరిగాయి.భారత మార్కెట్లో భారీ రాబడులుమల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో బంగారం ధర 2025 జనవరిలో రూ.81,028గా ఉండగా, 2026 జనవరి నాటికి రూ.1,75,231కు చేరింది. దీంతో ఒక ఏడాది కాలంలోనే పెట్టుబడిదారులకు సుమారు 116 శాతం రాబడి లభించింది.2026లో ధరల్లో ఒడిదుడుకులుఅయితే, ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో స్వల్ప కరెక్షన్ కనిపించింది. 2026 జనవరి 30న ఎంసీఎక్స్ (MCX)లో స్పాట్ గోల్డ్ ధర రూ.1,75,231 నుంచి రూ.1,67,095కు తగ్గింది. దీని ప్రభావంతో పలు గోల్డ్ ఈటీఎఫ్ల విలువలు కూడా సుమారు 10 శాతం వరకు పడిపోయాయి.కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు పెంపుఆర్థిక సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్నాయి. భారత్లో బంగారం నిల్వల విలువ 2025 మార్చి చివరిలో 78.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2026 జనవరి నాటికి 117.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది బంగారంపై కొనసాగుతున్న విశ్వాసాన్ని సూచిస్తోంది.2026పై ఆర్థిక సర్వే అంచనాలుప్రపంచ అనిశ్చితులు కొనసాగితే, వాణిజ్య యుద్ధాలు పరిష్కారం కాకపోతే బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ కొనసాగుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే, 2025లో కనిపించినంత భారీ ర్యాలీ 2026లో ఉండకపోవచ్చని, ధరల్లో ఒడిదుడుకులు సహజమని కూడా హెచ్చరించింది.సేఫ్ హేవన్గా బంగారంమొత్తానికి, తాత్కాలికంగా ధరల్లో మార్పులు వచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. -
భారత ఆర్థిక వ్యవస్థకు ఎఫ్టీఏల ఊపు
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా పయనిస్తోందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటులో 2025-26 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన మరుసటిరోజు దేశ ఆర్థిక స్థితిగతులు, సవాళ్లు, భవిష్యత్తు అవకాశాలపై ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు. ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) భారత ఎగుమతులకు సరికొత్త అవకాశాలు కల్పిస్తాయని స్పష్టం చేశారు.ఎగుమతులకు ఎఫ్టీఏలే కీలకంఇటీవల వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారత్కు వ్యూహాత్మక ప్రయోజనాన్ని చేకూరుస్తాయని నాగేశ్వరన్ తెలిపారు. ‘శ్రమ ఆధారిత రంగాలైన టెక్స్టైల్స్, లెదర్ వంటి ఎక్కువ మందికి ఉపాధినిచ్చే తయారీ రంగాలకు ఈ ఒప్పందాల వల్ల భారీ లబ్ధి చేకూరుతుంది. యూరోపియన్ యూనియన్ వంటి పెద్ద మార్కెట్లలోకి ప్రవేశించేందుకు తక్కువ లేదా జీరో సుంకాలు ఎంతో తోడ్పడుతాయి. దీనివల్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి’ అన్నారు.పెట్టుబడుల ప్రవాహంవిదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) గురించి మాట్లాడుతూ.. స్థూల పెట్టుబడులు మెరుగ్గానే ఉన్నప్పటికీ నికర పెట్టుబడుల్లో(డెప్రిసియేషన్ను పరిగణిస్తారు) హెచ్చుతగ్గులు ఉన్నాయని అంగీకరించారు. ‘విదేశీ సంస్థలు తమ లాభాలను వెనక్కి తీసుకోవడం, భారత కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నికర పెట్టుబడుల ప్రవాహంలో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ రంగ పెట్టుబడులు మందగించాయన్న వాదన సరికాదు. 2024-25 గణాంకాలు విడుదలయ్యాక ప్రైవేట్ రంగంలో వృద్ధి మరింత స్పష్టంగా కనిపిస్తుంది’ అన్నారు.రూపాయి విలువరూపాయి విలువ పతనంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డాలర్తో పోలిస్తే రూపాయికి ఒక నిర్దిష్ట స్థాయి అంటూ ఏదీ ఉండన్నారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా అది సర్దుబాటు అవుతుందని పేర్కొన్నారు. దిగుమతులకు సంబంధించి దీని ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు క్రాష్ -
రేపటి బడ్జెట్ లీకైందా? సోషల్ మీడియాలో వైరల్
కేంద్ర బడ్జెట్ 2026-27 (Union Budget 2026-27) మరికొన్ని గంటల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సంప్రదాయం ప్రకారం.. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం నార్త్ బ్లాక్ బేస్మెంట్లో బడ్జెట్ ప్రింటింగ్ కోసం లాక్-ఇన్ పీరియడ్ ప్రారంభమైన తర్వాత హల్వా వేడుక కూడా జరిగింది.ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్ 2026-27 లీకైందని, కొత్త బడ్జెట్ స్కాన్ కాపీ మెసెంజర్ యాప్లో ప్రత్యక్షమైనట్లుగా అంటూ సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టతనిచ్చింది. లీక్ అయినట్టు చెబుతున్న కేంద్ర బడ్జెట్ 2026-27 వైరల్ చిత్రాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసి సోషల్ మీడియాలో షేర్ అవుతున్న చిత్రాలు నకిలీవని పేర్కొంది.చలామణి అవుతున్న చిత్రాలలో ఒకటి కేంద్ర బడ్జెట్ 2026-27కు చెందినది కాదని, 2025-26 కేంద్ర బడ్జెట్ కు సంబంధించినదని తేల్చింది. దీనినే మొదటి పేజీని ఎడిట్ చేసి సంవత్సరం మార్చారని తెలిపింది. ఇక సర్క్యులేట్ అవుతున్న మరో చిత్రం పూర్తిగా డిజిటల్గా సృష్టించినదని, ఇది ఏ కేంద్ర బడ్జెట్ పత్రానికి చెందినది కాదని స్పష్టం చేసింది. ‘కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన ధ్రువీకరించని చిత్రాలు, వాదనలను నమ్మవద్దు. వాటిని ఫార్వార్డ్ చేయవద్దు. ఇటువంటి తప్పుడు సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. అనవసరమైన భయాందోళనలను వ్యాప్తి చేస్తుంది’ అని పేర్కొంది.అప్పట్లో నిజంగానే బడ్జెట్ లీక్1950లో కేంద్ర బడ్జెట్ విషయంలో ఊహించని సంఘటన జరిగింది. అప్పట్లో మింటో రోడ్లో ఉన్న రాష్ట్రపతి భవన్ ప్రెస్ నుండి కేంద్ర బడ్జెట్ లీక్ అయింది. అప్పటి వరకూ బడ్జెట్ పత్రాలను ఇదే ప్రెస్లో ముద్రించేవారు. ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు. కానీ 1950లో బడ్జెట్ పేపర్లు లీక్ అయ్యాయి. దీంతో దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక పత్రాన్ని ముద్రించే స్థలాన్ని మరింత సురక్షితమైన ప్రదేశానికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.బడ్జెట్ పత్రాలు లీక్ అయిన సమయంలో జాన్ మథాయ్ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కొంత మంది శక్తివంతమైన వ్యక్తుల ప్రయోజనాల కోసమే బడ్జెట్ను లీక్ చేశారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత, ప్రణాళికా సంఘానికి నిరసనగా అప్పటి ఆర్థిక మంత్రి రాజీనామా చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు 1980లో బడ్జెట్ను ముద్రించే స్థలం మరోసారి మారింది. నార్త్ బ్లాక్లోని ప్రస్తుత స్థానానికి మార్చారు.Some images are being shared on social media claiming that a scanned copy of the Union Budget 2026–27 has been leaked on Telegram.#PIBFactCheck❌ These images are #FAKE✅ One of the images being circulated is NOT from the Union Budget 2026–27. It is from the Union Budget… pic.twitter.com/mC4bLKRp3A— PIB Fact Check (@PIBFactCheck) January 30, 2026 -
కెవిన్ వార్ష్ చేతికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పగ్గాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉంటున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ స్థానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంక్గా ఉన్న ‘ఫెడరల్ రిజర్వ్’ తదుపరి ఛైర్మన్గా మాజీ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కెవిన్ వార్ష్ను నామినేట్ చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ పదవీకాలం 2026 మే నెలలో ముగియనుంది. ఆ వెంటనే వార్ష్ బాధ్యతలు చేపడతారని ట్రంప్ వెల్లడించారు.అర్హతలే ప్రామాణికం..వార్ష్ ఎంపికను సమర్థిస్తూ ఆయన నేపథ్యాన్ని ట్రంప్ ప్రశంసించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూల్ నుంచి పట్టభద్రుడైన వార్ష్ గతంలో మోర్గాన్ స్టాన్లీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా 2006–2011 మధ్య కాలంలో ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో సభ్యుడిగా సేవలందించిన అనుభవం ఆయనకు ఉంది. జీ-20 సదస్సుల్లో అమెరికా ప్రతినిధిగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్థిక సంస్కరణల సలహాదారుగా ఆయనకున్న ట్రాక్ రికార్డును ట్రంప్ హైలైట్ చేశారు. వార్ష్ను ‘యూఎస్ పరిపాలన విభాగంలో ఇట్టే ఇమిడిపోయే అద్భుతమైన అభ్యర్థి’గా ట్రంప్ అభివర్ణించారు.మార్కెట్ల స్పందనట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికన్ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ధోరణి కనిపించింది. అక్కడి మార్కెట్ సూచీలైన డౌ జోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 పతనమయ్యాయి. వార్ష్ గతంలో ‘ఇన్ఫ్లేషన్ హాక్’(ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి)గా పేరు పొందడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.స్వతంత్రతపై ప్రశ్నలు.. సెనెట్ ఆమోదం బాకీవార్ష్ ఎంపికపై ఆర్థిక వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు ట్రంప్ తక్కువ వడ్డీ రేట్లను ఆశిస్తుండగా వార్ష్ దానికి అనుగుణంగా నడుచుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రత దెబ్బతినే అవకాశం ఉందని కొందరు రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెవిన్ వార్ష్ నియామకం ఇప్పుడు అమెరికా సెనెట్ ఆమోదానికి వెళ్లనుంది. అక్కడ రాజకీయంగా, ఆర్థికంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. సెనెట్ ఆమోదం లభిస్తేనే మే 2026 నుంచి ఫెడ్ నిర్వహణ బాధ్యతులు వార్ష్ చేతుల్లోకి వెళ్తుంది.ట్రంప్ చిరకాల మిత్రుడి అల్లుడే వార్ష్కెవిన్ వార్ష్ భార్య జైన్ లాడర్ ప్రపంచ ప్రసిద్ధ కాస్మెటిక్స్ సంస్థ అయిన ‘ఎస్టే లాడర్’ వ్యవస్థాపకురాలు ఎస్టే లాడర్ మనవరాలు. ఆమె ఒక బిలియనీర్, వ్యాపారవేత్త. జైన్.. రోనాల్డ్ లాడర్ కుమార్తె. రోనాల్డ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చిరకాల మిత్రుడు, మద్దతుదారుగా ఉన్నారు. జైన్ లాడర్ 1996లో తన కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఆమె ఎస్టే లాడర్ కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ డేటా ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ఆమె నికర ఆస్తి విలువ సుమారు 2.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22,000 కోట్లకు పైగా). కెవిన్ వార్ష్, జైన్ లాడర్కు మధ్య స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పరిచయం ఏర్పడింది. వారు 2002లో వివాహం చేసుకున్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం.. -
చైనా, భారత్ నడిపిస్తాయ్
రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ కీలకంగా మారుతుందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా భారత్ స్థానం మరింత బలోపేతం కావడం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ తీరుతెన్నులను మార్చివేయనుందని చెప్పారు. ఈ దశాబ్దం చివరికి అంతర్జాతీయ తయారీ అన్నది ఏ ఒక్క దేశం చుట్టూ కేంద్రీకృతం కాదంటూ.. భారత్, చైనా కీలకంగా వ్యవహరిస్తాయన్నారు. ఐసీఏఐ వరల్డ్ ఫోరమ్ ఆఫ్ అకౌంటెంట్స్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.ప్రపంచ సరఫరా వ్యవస్థలు అస్థిరంగా ఉన్నాయంటూ.. టారిఫ్లు పెంచడం కారణంగా 400 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో మార్పులు చోటుచేసుకున్నాయన్న ప్రపంచ ఆర్థిక వేదిక డేటాను ప్రస్తావించారు. తయారీపై పెట్టుబడులు అన్నవి ఇప్పుడు షాక్లను తట్టుకోగల, రిస్క్లను సమర్థంగా నిర్వహించగల, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థల్లోకే వెళుతున్నట్టు చెప్పారు. ఈ విషయంలో భారత్ సుముచిత స్థానంలో ఉన్నట్టు బిర్లా చెప్పారు. దేశీ మార్కెట్ విస్తరణకుతోడు పారిశ్రామిక బేస్, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం దీర్ఘకాల పెట్టుబడులకు నమ్మకాన్ని కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కార్మిక శక్తి తగ్గే సమయానికి.. అదనపు శ్రామిక శక్తిలో భారత్ పావు వంతు వాటా కలిగి ఉంటుందన్నారు.భారత్లో 3 టెలికం సంస్థలు ఉండాల్సిందే..సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్)కు సంబంధించి ఇటీవల వెలువడిన పరిష్కారం వొడాఫోన్ ఐడియాకి నిర్ణయాత్మక ములుపు వంటిదని కుమారమంగళం బిర్లా అన్నారు. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు, ప్రభుత్వ జోక్యంతో దీర్ఘకాలంపాటు నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందన్నారు. మనుగడ కోసం కాకుండా ఇకపై స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టేందుకు అవకాశం కల్పించిందన్నారు. వొడాఫోన్ ఐడియాకు ఆదిత్య బిర్లా గ్రూప్ సైతం ఒక ప్రమోటర్ కావడం తెలిసిందే. భారత మార్కెట్కు మూడు టెలికం సంస్థలు ఉండడం సముచితమేనని కుమారమంగళం బిర్లా అన్నారు. అస్థిరమైన ప్రపంచంలో భారత వృద్ధి స్థిరమైన అంశంగా మారినట్టు చెప్పారు. భారత దేశ వృద్ధిలో తమ గ్రూప్ చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు.‘‘భారత్ వృద్ధితోపాటే ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా ఎదుగుతుంది. ఎన్నో రంగాల్లో భౌతిక, డిజిటల్ సంస్థాగత సామర్థ్యాన్ని నిర్మిస్తున్నాం. తద్వారా దేశంతో పాటుగా ఎదుగుతాం. దేశ పురోగతి నుంచి ప్రయోజనం పొందుతూనే, సుస్థిరతకు కూడా తోడ్పడతాం’’అని కుమారమంగళం బిర్లా పేర్కొన్నారు. ‘కష్టకాలాలు ఎప్పటికీ ఉండవు. కానీ, దృఢమైన కంపెనీలు శాశ్వతం’ అన్న తన నమ్మకాన్ని వొడాఫోన్ ఐడియా అనుభవం గుర్తు చేస్తున్నట్టు చెప్పారు. తమ జాయింట్ వెంచర్ వొడాఫోన్ ఐడియా టెలికం రంగ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు అనిశ్చితులు, సవాళ్లను ఎదుర్కొని నిలబడినట్టు పేర్కొన్నారు. ఎన్నో అనుకూలతలు..మూడు దశాబ్దాలుగా ప్రపంచ తయారీ కేవలం ఒక భౌగోళిక ప్రదేశం (చైనా)పైనే ఆధారపడి ఉండడాన్ని కుమార మంగళం బిర్లా ప్రస్తావించారు. ఆ నమూనా అసాధారణ ఫలితాలనిచ్చిదంటూ.. ఇకపై ఇదే విధానం కొనసాగబోదన్నారు. చైనా ప్లస్ వన్ నమూనా మరింత బలపడుతుందన్నారు. భారత్లో మౌలిక వసతుల అభివృద్ధితో లాజిస్టిక్స్ (రవాణా) వ్యయాలు తగ్గుతాయన్నారు. పట్టణాభివృద్ధితోపాటు తలసరి ఆదాయం 10,000 డాలర్లకు పెరగడం.. ప్రపంచ వాణిజ్యంలో భారత్ను బలమైన శక్తిగా ఇతర దేశాలు చూస్తాయన్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం.. -
వృద్ధి జోరు..అయినా ఇన్వెస్టర్లు పరార్
దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు గణనీయంగా పెరిగితేనే భారత్ ఆశించిన స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించడం సాధ్యపడుతుందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. కార్పొరేట్ రంగం నిలకడగా పెట్టుబడులు పెంచడం దేశీయంగా కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. 50 శాతం టారిఫ్ల భారంతో అమెరికా–భారత్ బంధంపై అనిశ్చితి నెలకొనడం కూడా పెట్టుబడుల రాకకు కొంత ప్రతిబంధకంగా ఉండొచ్చని చెప్పారు. అది తొలగిపోతే అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో చురుగ్గా పాలుపంచుకునేందుకు వీలవుతుందని, భారత్కి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.గత కొన్నాళ్లుగా భారత మార్కెట్ కొంత పటిష్టంగా మారిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధిస్తున్న భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్న చిత్రమైన పరిస్థితిపై స్పందిస్తూ, ‘‘ప్రైవేట్ రంగం కూడా పెట్టుబడులు పెడుతుంటే ఎఫ్డీఐలు వస్తాయి. కానీ ప్రైవేట్ రంగం ఇన్వెస్ట్ చేయడం లేదు. అంటే ఇక్కడ పరిస్థితి ఏదో సరిగ్గా లేదు. పాలసీపరమైన అనిశ్చితి కూడా కారణమనేది కొందరి అభిప్రాయం’’ అని రాజన్ చెప్పారు. గతేడాది వరుసగా నాలుగో నెల నవంబర్లో కూడా ఎఫ్డీఐ గణాంకాలు ప్రతికూలంగా నమోదయ్యాయి. ఆర్బీఐ డేటా ప్రకారం ఆ నెలలో వచ్చిన ఎఫ్డీఐల కన్నా అధికంగా 446 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడులాంటి రాష్ట్రాలు ఎఫ్డీఐలను ఆకర్షించగలుగుతున్నప్పటికీ విస్తృత స్థాయిలో పెట్టుబడులు తరలిపోతుండటానికి కారణాలేమిటనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు. యూఎస్ ట్రెజరీలను తగ్గించుకుంటున్నది అందుకే..సర్వత్రా అనిశ్చితి నెలకొనడం, కొన్ని విధానాలను ఉల్లంఘించేందుకు అమెరికా సంసిద్ధంగా ఉండటంలాంటి అంశాల వల్ల చాలా దేశాలు అమెరికా ట్రెజరీల్లో తమ పెట్టుబడులను తగ్గించుకుని, డైవర్సిఫికేషన్ వైపు మొగ్గు చూపుతున్నాయని రాజన్ చెప్పారు. అమెరికా ట్రెజరీల్లో భారత్ హోల్డింగ్స్ అయిదేళ్ల కనిష్టానికి పడిపోవడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సులభంగా మార్చుకునేందుకు వీలుంటుందనే నమ్మకం వల్లే డాలరు రిజర్వ్ కరెన్సీగా చెలామణీ అవుతోందని, కానీ ప్రస్తుతం ఆ నమ్మకం సడలుతోందని రాజన్ పేర్కొన్నారు. కానీ, బ్రిటన్, చైనా, జపాన్, రష్యాలాంటి దేశాలు సొంత సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో డాలరుకు దీటైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్నారు. సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొంటున్నప్పటికీ, అది బబుల్ స్థాయికి చేరిందేమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయని రాజన్ చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత్ రిజర్వుల్లో ఎక్కువభాగం డాలర్ బాండ్లే ఉంటాయని రాజన్ తెలిపారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం.. -
కేంద్ర బడ్జెట్ 2026-27: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..
దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026-27కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వ మూడో విడత పాలన, అంతర్జాతీయ అనిశ్చితులు, యూఎస్ టారిప్లు, వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఇది కీలకమైన బడ్జెట్ కావడంతో సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరి కళ్లు ఆర్థిక మంత్రి ప్రసంగంపైనే ఉన్నాయి.ఆశలు.. ఆకాంక్షలుద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఆదాయపు పన్ను మినహాయింపులు, స్టాండర్డ్ డిడక్షన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు చిరువ్యాపారులు, ఇటు బడా కార్పొరేట్ సంస్థలు కూడా తమ రంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్తో ఆర్థిక మంత్రి తన తొమ్మిదో బడ్జెట్ ప్రసంగాన్ని సుదీర్ఘ సమయంపాటు చదివి కొత్త రికార్డును సృష్టిస్తారని కొందరు భావిస్తున్నారు.రికార్డు ప్రసంగాలుభారత బడ్జెట్ చరిత్రలో ప్రసంగాలకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ప్రసంగ సమయంలో కొందరు మంత్రులు కవితలతో ఆకట్టుకుంటే మరికొందరు గంటల తరబడి గణాంకాలతో వివరిస్తారు.బడ్జెట్ ప్రసంగం నిడివి పరంగా నిర్మలా సీతారామన్ పేరిట రికార్డు ఉంది. 2020 బడ్జెట్ సమయంలో ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించారు. 2019లో ఆమె నెలకొల్పిన 2 గంటల 19 నిమిషాల రికార్డును ఆమె మళ్లీ తిరగరాశారు. అంతకుముందు ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ (2003లో 2 గంటల 13 నిమిషాలు), అరుణ్ జైట్లీ (2014లో 2 గంటల 10 నిమిషాలు) సుదీర్ఘ ప్రసంగాలు చేశారు.పదాల పరంగా మన్మోహన్ సింగ్ రికార్డుప్రసంగంలోని పదాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చిన 1991 బడ్జెట్ ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. లైసెన్స్ రాజ్ చట్టానికి స్వస్తి పలికి ఆర్థిక సరళీకరణకు బాటలు వేసిన ప్రసంగం ఇది.సంక్షిప్త ప్రసంగం1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరూభాయ్ ఎం. పటేల్ కేవలం 800 పదాలతో తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఇది భారత చరిత్రలోనే అతి తక్కువ నిడివి గల ప్రసంగం. 2024 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ కేవలం 60 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి తన శైలికి భిన్నంగా వ్యవహరించారు.ఈసారి ఏం జరగబోతోంది?దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును స్థిరంగా ఉంచుతూనే సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చే నిర్ణయాలను నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రసంగంతో అన్ని ఊహాగానాలకు తెరపడనుంది.ఇదీ చదవండి: సీనియర్ సిటిజన్లకు తీపి కబురు? -
బడ్జెట్: బ్రీఫ్కేస్ నుంచి టాబ్లెట్ వరకు ఇలా..
యూనియన్ బడ్జెట్ అనేది భారతదేశంలో కేవలం ఆదాయ-వ్యయాల లెక్కలు మాత్రమే కాదు. అది దేశ ఆర్థిక దిశను సూచించే ముఖ్యమైన పత్రం. అయితే స్వాతంత్య్రం రాకముందు ప్రారంభమైండ్ ఈ బడ్జెట్లో.. పార్లమెంటులో సమర్పించే విధానంలో కూడా కాలక్రమేణా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు బ్రీఫ్కేస్లో బడ్జెట్ పత్రాలను తీసుకెళ్లిన ఆర్థిక మంత్రులు, నేడు టాబ్లెట్ ద్వారా పూర్తిగా కాగిత రహితంగా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న చరిత్ర, ఆలోచన, ఆధునికత మొదలైన విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.తొలినాళ్లలో.. భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి బడ్జెట్ పత్రాలను బ్రీఫ్కేస్లో పార్లమెంటుకు తీసుకెళ్లారు. ఈ బ్రీఫ్కేస్ బ్రిటిష్ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. బ్రిటన్లో అప్పటి ఆర్థిక మంత్రి విలియం ఎవార్ట్ గ్లాడ్స్టోన్ ఉపయోగించిన “గ్లాడ్స్టోన్ బాక్స్”కు అనుకరణగా ఇది ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ సంప్రదాయం అలాగే కొనసాగింది. దశాబ్దాల పాటు చాలామంది ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్ ప్రసంగానికి బ్రీఫ్కేస్తోనే వెళ్లడం ఆనవాయితీగా మారింది.ఇదీ చదవండి: 2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు!కాలం మారింది.. ఆలోచనలు మారాయి. 2019లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బ్రీఫ్కేస్ సంప్రదాయానికి ముగింపు పలికారు. బ్రీఫ్కేస్ స్థానంలో భారతీయ సంప్రదాయానికి ప్రతీక అయిన 'బహి ఖాతా'ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 2021లో సీతారామన్ పూర్తిగా కాగిత రహిత బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 'మేడ్ ఇన్ ఇండియా' టాబ్లెట్ను ఉపయోగించి బడ్జెట్ పత్రాలను డిజిటల్ రూపంలో పార్లమెంటుకు సమర్పించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ టాబ్లెట్ను కూడా బహి ఖాతా ఆకృతిని తలపించే ఎరుపు రంగు కవర్లో తీసుకెళ్లడం విశేషం. ఇది సంప్రదాయం & ఆధునికత కలయికకు ప్రతీకగా నిలిచింది.బడ్జెట్ మార్పుకు కారణం!బడ్జెట్ సమర్పించడంలో మార్పు రావడానికి ప్రధాన కారణం.. కాగిత వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం, డిజిటలైజేషన్ ద్వారా బడ్జెట్ పత్రాలను వేగంగా, సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. అంతే కాకుండా.. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా ప్రభుత్వ పనితీరును ఆధునీకరించడం అని తెలుస్తోంది. -
2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారతదేశ బడ్జెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఆదివారం, ఫిబ్రవరి 1న ఆమె యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెడుతున్న 9వ కేంద్ర బడ్జెట్ కావడం విశేషం. ఇప్పటికే ఎనిమిది బడ్జెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. అయితే ప్రారంభం నుంచి ఏ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం?, సుదీర్ఘ ప్రసంగం ఎప్పుడు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే కీలక బడ్జెట్లను నిర్మలా సీతారామన్ అందించారు. కరోనా వంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా.. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లు చరిత్రలో నిలిచిపోయాయి. ముఖ్యంగా 2020లో ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం సుమారు 2 గంటలు 42 నిమిషాలు కొనసాగి, భారత పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా గుర్తింపు పొందింది.కాలక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగ శైలిలో మార్పు కనిపించింది. ప్రారంభంలో సుధీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగాలు, తరువాతి సంవత్సరాల్లో.. క్రమంగా సంక్షిప్తంగా మారాయి. 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం 56 నిమిషాల్లో (గంట లోపు) పూర్తయింది. ఇది ఇప్పటివరకు ఆమె చేసిన అత్యంత చిన్న ప్రసంగంగా నిలిచింది. అలాగే 2025 బడ్జెట్ ప్రసంగం కూడా తక్కువ సమయం (74 నిమిషాలు)లోనే పూర్తి కావడం విశేషం.బడ్జెట్ - ప్రసంగ సమయం➤2019 బడ్జెట్: 140 నిమిషాలు (2 గంటల 20 నిమిషాలు)➤2020 బడ్జెట్: 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు - అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం)➤2021 బడ్జెట్: 100 నిమిషాలు (1 గంట 40 నిమిషాలు)➤2022 బడ్జెట్: 91 నిమిషాలు (1 గంట 31 నిమిషాలు)➤2023 బడ్జెట్: 87 నిమిషాలు (1 గంట 27 నిమిషాలు)➤2024 ఫిబ్రవరి బడ్జెట్: 56 నిమిషాలు➤2024 జులై బడ్జెట్: 85 నిమిషాలు (1 గంట 25 నిమిషాలు)➤2025 బడ్జెట్: 74 నిమిషాలు (1 గంట 14 నిమిషాలు) మొత్తం 8 బడ్జెట్లు.. 793 నిమిషాలు / 13 గంటల 13 నిమిషాలుఇక 9వ బడ్జెట్తో ఆమె మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం సాగుతుంది, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 2026 బడ్జెట్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
సామాజిక, ఆర్థిక అవగాహనతోనే వృద్ధికి బూస్ట్!
ప్రపంచం మొత్తమ్మీద అతివేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. అయితే దేశీ వార్షిక వృద్ధి రేటు ఏడు శాతం కంటే ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ద్రవ్యలోటును తగ్గించుకోవడంతోపాటు రుణ భారాన్ని కూడా తగ్గించుకోవాలి. దీని ద్వారా ద్రవ్యపరమైన స్థిరీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.మరోవైపు రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి కాలంలో చేపట్టిన చర్యలను పరిశీలిస్తే.. విధానపరమైన రేట్లను తగ్గించే దిశగా అడుగులేస్తున్నట్లు స్పష్టమవుతుంది. తద్వారా వృద్ధికి తోడ్పాటు అందించాలని వ్యాపారాలు, కుటుంబాలపై ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయ, ఆర్థికవేత్తల అభిప్రాయం కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. కార్మిక, వ్యవసాయ చట్టాల సవరణ, రైల్వే, రహదారులపై భారీ పెట్టుబడులు, ఆర్థిక ప్రోత్సాహకాలు, తక్కువ పన్నుల రూపంలో ప్రభుత్వం ఇప్పటికే వృద్ధికి అవసరమైన వాతావరణం కల్పించిందని, ఇప్పుడు ప్రైవేట్ రంగం దేశీ అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తోంది.అంతేకాదు.. యూరోపియన్ యూనియన్తో ఇటీవల కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కూడా అమెరికా వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ జియోపాలిటిక్స్ ద్వారా ఏర్పడుతున్న అనిశ్చితులను అధిగమించేందుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. ఇవన్నీ నాణేనికి ఒక వైపు అయితే.. వాస్తవం మరింత సంక్లిష్టంగా ఉంది.సామాజిక ఆర్థిక పరిస్థితులుభారత్ కచ్చితంగా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ కానీ.. తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ. చైనాసహా ఇతర ధనిక దేశాల తలసరి ఆదాయాలు మనకు నాలుగు రెట్లు ఎక్కువ.దేశంలో యాభై శాతం జనాభాకు రేషన్ బియ్యం కావాలని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అలాగే దిగువ, మధ్య తరగతి వర్గాల వారు మరిన్ని కొనుగోళ్లు చేసేలా చేసే లక్ష్యంతో ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది కూడా.నిరుద్యోగం, తగినన్ని అవకాశాలు లేకపోవడం ఇప్పటికీ దేశంలో అధికంగా ఉంది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది.పోషకాహార లోపం సమస్యను ఇప్పటివరకూ పరిష్కరించలేకపోయారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు తగిన మౌలిక సదుపాయాలు లేవు.మూలధన, శ్రామిక ఉత్పాదకత కూడా ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఇది ఇటీవలి కాలంలో వేగంగా తగ్గిపోతోంది.రూపాయి బలహీనపడిపోవడం, విదేశీ పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్ల నుంచి వేగంగా వైదొలగుతూండటం కూడా ఏమంత మంచి పరిణామాలు కావు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు భారీగా ఉన్నప్పటికీ విదేశీ రుణభారం తగ్గకపోవడాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.చాలాకాలంగా దేశీ ఎగుమతుల్లో పెరుగుదల లేకుండాపోయింది. పైగా చైనా ఉత్పత్తులపై ఆధారపడటం ఏటికేటా పెరిగిపోతోంది.బ్యాంకింగ్ వ్యవస్థలో రిస్క్ క్యాపిటల్ తగినంత ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రుణాల కోసం డిమాండ్ పెరగడం లేదు. అయితే డిపాజిట్ల క్రెడిట్ల నిష్పత్తి మాత్రం గత కొన్ని నెలల్లో గణనీయంగా పెరిగిపోయింది. పొదుపు తగ్గడం లేదా పెట్టుబడి విషయంలో ప్రాథమ్యాలు మారిపోవడం దీనికి కారణం కావచ్చు. బంగారం, రియల్ ఎస్టేట్, క్రిప్టో తదితర ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటూ ఉండవచ్చు.పెద్ద పెద్ద వ్యాపారాలు, అధికాదాయ, ధనిక కుటుంబాలకు మినహా చిన్న, ప్రైవేట్ రంగ వ్యాపార వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు.ఎగుమతులు పెరగకపోవడం, అంతర్జాతీయ వాణిజ్య విపణిలో చైనా ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిగుమతులపై ఉన్న నిబంధనలను కొన్నింటిని తొలగించింది.భారతీయ నగరాలు కొన్ని ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలోకి చేరాయి. మహా నగరాల్లో ట్రాఫిక్ నిర్వహణ నత్తనడకన సాగుతోంది.రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలపై రుణభారం పెరిగిపోతోంది.క్లుప్తంగా చెప్పాలంటే.. మనం భారీ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న సమాజంగా పరిణమించేందుకు ఇంకా చాలా సమయం పడుతుందన్నమాట. కాబట్టి.. అభివృద్ధిని మరింత పెంచేందుకు ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెరగాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు చాలా కుటుంబాలు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే భారీ పెట్టుబడులతో సామాజిక, ఆర్థిక పురోగతికి పునాదులు వేయాలి.ప్రజలందరికీ అవసరమైన మౌలిక సదుపాయాలను అందరికీ సమానంగా అందుబాటులోకి తేలేకపోతే మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఇది కాస్తా దీర్ఘకాలంలో మధ్యాదాయ దేశంగానే మిగిలిపోయేలా చేస్తుంది. ఈ ట్రాప్ నుంచి తప్పించుకోవాలంటే...ద్రవ్య స్థిరీకరణను వాయిదా వేయాలి. ఎందుకంటే.. వడ్డీరేట్లు స్థిరంగా ఉన్నాయి.. తగినంత లిక్విడిటీ అందుబాటులో ఉంది.స్పెక్యులేషన్కు అవకాశమున్న రంగాల్లో పెట్టుబడులను నియంత్రించాలి. తద్వారా అందుబాటులో ఉన్న మొత్తం రిస్క్ క్యాపిటల్ను మెరుగ్గా వాడుకునేందుకు వీలు ఏర్పడుతుంది.నగర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వమే భారీగా పెట్టుబడులు పెట్టాలి. కాలుష్య నివారణకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు, పారిశుద్ధ్యాన్ని పెంచేందుకు, గృహ వసతి కల్పనకు ప్రయత్నాలు ముమ్మరం కావాలి.చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఈక్విటీ మద్దతు కల్పించాలి. రుణ సౌకర్యం కల్పించడం ఒక్కటే సరిపోదు.ప్రభుత్వ రంగ సంస్థల వద్ద వృథాగా పడిఉన్న మొత్తాలను పెట్టుబడుల రూపంలోకి మార్చేలా ప్రోత్సహించాలి. కొన్నేళ్లపాటు డివిడెండ్లను త్యాగం చేయాల్సి వచ్చిన వెనకాడరాదు.ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకుండా చూడాలి. ఎనిమిదో పే కమిషన్ ద్వారా గ్రామీణ, నగర ప్రాంతాలు రెండింటిలోనూ తగిన వేతన పరిమితులు ఏర్పాటయ్యేలా చూడాలి.పరోక్ష పన్నుల భారాన్ని తగ్గించి, ద్రవ్యోల్బణ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.యూరప్తో కుదిరిన ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా గరిష్టంగా లాభం పొందేందుకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు పెద్ద కంపెనీలకు కూడా లక్ష్యాల ఆధారిత ప్రోత్సాహకాలు అందించాలి.ఇన్నోవేషన్ ద్వారా విలువను జోడించడంలో భారీ కార్పొరేషన్ల పాత్రను గుర్తించి తగు విధంగా ప్రోత్సహించాలి.మొత్తమ్మీద చూస్తే.. ఆర్థికాభివృద్ధి విషయంలో ప్రభుత్వ, ఆర్థికవేత్తల వ్యూహంపై పునరాలోచన జరగాలి. వివిధ దేశాలతో చేసుకున్న ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ సేవల రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెంచాలి. భారీ కార్పొరేషన్లకు కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు ఆర్థికపరమైన మద్దతుకు ప్రాధాన్యత కల్పించాలి. అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం ఉండేందుకు కార్మిక, పెట్టుబడి ఉత్పాదకతలను పెంచే విషయమై దృష్టి పెట్టాలి. యువతకు పబ్లిక్ సర్వీసుల్లో అవకాశాలను సృష్టించాలి.- అనిల్ కె.సూద్, అధ్యాపకులు, ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ ఛాయిసెస్, హైదరాబాద్. -
బడ్జెట్ 2026: సీనియర్ సిటిజన్లకు తీపి కబురు?
త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో దేశంలోని కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్-19 సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి పునరుద్ధరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.ఆరేళ్ల నిరీక్షణకు తెర పడనుందా?రైల్వే రాయితీల పునరుద్ధరణపై గ్రీన్ సిగ్నల్ లభిస్తే దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత సీనియర్ సిటిజన్ ప్రయాణికులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది.గతంలో ఉన్న రాయితీ వివరాలు..పురుషులు (60 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 40 శాతం రాయితీ.మహిళలు (58 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 50 శాతం రాయితీ.వర్తించే తరగతులు: స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి దాదాపు అన్ని క్లాసుల్లో ఈ సదుపాయం ఉండేది.రాయితీ నిలిపివేతకు కారణాలేంటి?మార్చి 2020లో కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ సమయంలో రైల్వే ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక లోటును అధిగమించేందుకు ఈ రాయితీలను రద్దు చేశారు. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీల వల్ల భారతీయ రైల్వేపై ఏటా రూ.1,600 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా. కరోనా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని, రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడినప్పటికీ ఆర్థిక భారం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటివరకు ఈ రాయితీలను పునప్రారంభించలేదు.బడ్జెట్ 2026పై ఆశలుప్రస్తుతం పెరుగుతున్న ప్రయాణ ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సీనియర్ సిటిజన్లు మళ్లీ పాత పద్ధతిలోనే వయసు ధ్రువీకరణ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా కౌంటర్లలో రాయితీ టికెట్లు పొందవచ్చు.ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే.. -
బడ్జెట్ 2026: వికసిత్ భారత్ దిశగా అడుగులు!
భారత జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతున్న వేళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే 2025-26లోని వివరాల ప్రకారం.. ఈసారి బడ్జెట్ కేవలం అంకెలు మాత్రమే కాదు, సామాన్యుడి ఆశల ప్రతిరూపంగా ఉండనుందనే అంచనాలున్నాయి.వేతన జీవులకు..కేంద్ర బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు అనేది వేతన జీవులకు అత్యంత కీలకమైన అంశంగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ అనేది జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లకు లభించే తగ్గింపు. అంటే, మొత్తం వార్షిక ఆదాయం నుంచి ఎటువంటి ఖర్చులు చూపించాల్సిన అవసరం లేకుండానే ఈ మొత్తాన్ని నేరుగా మినహాయించుకోవచ్చు.పెంపు ఎందుకు అవసరం?గత కొన్ని ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న రూ.75,000 (గత సవరణల ప్రకారం) స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుత జీవన వ్యయానికి సరిపోవడం లేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగుల చేతిలో ఖర్చు చేయడానికి మరింత నగదు మిగులుతుంది. ప్రజల చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటే మార్కెట్లో వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ను పెంచి జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది.మౌలిక సదుపాయాలకు బూస్ట్దేశాభివృద్ధికి మౌలిక వసతులే కీలకమని నమ్ముతున్న కేంద్రం ఈసారి మూలధన వ్యయం (Capital Expenditure) కేటాయింపుల్లో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల గడువును పెంచడం ద్వారా స్థానికంగా రోడ్లు, బ్రిడ్జిల వంటివాటి నిర్మాణం వేగవంతం అవుతుంది. తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (PLI) మరింత విస్తరించనున్నారు.యువత - ఉపాధిరాబోయే రోజుల్లో లక్షల మంది పట్టభద్రులు ఉద్యోగ వేటలో పడనున్నారు. దీన్ని ఆర్థికంగా అందిపుచ్చుకోవడానికి బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రధానంగా జౌళి (Textiles), పర్యాటకం, ఈ-కామర్స్ రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్యాకేజీలు ఉండొచ్చు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వృత్తి విద్యా కోర్సులు, శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.ఎంఎస్ఎంఈచిన్న తరహా పరిశ్రమల ఆర్థిక ఇబ్బందులను తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని మరింత సరళతరం చేస్తూ కొలేటరల్(పూచీకత్తు) లేకుండా రుణాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా వస్తువులను ప్రపంచ మార్కెట్లకు చేర్చడానికి ఎగుమతి సుంకాల్లో సడలింపులు ఉండవచ్చు.వ్యవసాయం, గ్రామీణ వికాసంవాతావరణ మార్పుల ధాటికి తట్టుకునేలా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం ప్రస్తుత తక్షణ అవసరం.రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని(ప్రస్తుతం ఏటా రూ.6000) పెంచాలనే డిమాండ్ను ప్రభుత్వం పరిశీలిస్తోంది.భూ రికార్డుల డిజిటలైజేషన్, డ్రోన్ల వినియోగం, ఆధునిక గోదాముల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించే అవకాశం ఉంది.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ‘అందరికీ ఇల్లు’ లక్ష్యాన్ని చేరుకోవడానికి గృహ నిర్మాణ రంగానికి అదనపు కేటాయింపులు చేయనున్నారు.ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే -
సవాళ్లున్నా ముందుకే
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధితో ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రస్థానం కొనసాగుతుందని ఆర్థిక సర్వే విశ్వాసం వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) జీడీపీ 6.8–7.2 శాతం మధ్య వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.4 శాతం కంటే తగ్గించడం గమనార్హం. జీడీపీలో ద్రవ్యలోటు 2025–26లో 4.8 శాతం అంచనా కాగా, 2026–27లో 4.4 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో తీసుకొచ్చిన విధానపరమైన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య కాల వృద్ధిని 7 శాతానికి చేర్చుతాయి.కనుక ప్రపంచ అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధికి అవకాశం ఉంది. కావాల్సింది అప్రమత్తతే కానీ, నిరాశావాదం కాదు’’అని ఆర్థిక సర్వే పేర్కొంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య రక్షణాత్మక పెట్టుబడుల ధోరణితో బంగారం, వెండి ధరల మంటలు ఇప్పుడప్పుడే చల్లారకపోవచ్చని అభిప్రాయపడింది. 739 పేజీలతో కూడిన 2025–26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటుకు సమర్పించారు. సందర్భానుసారం వేదాలు, ఇతిహాసాల్లోని సూక్తులను సైతం ప్రస్తావించడం విశేషం. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ బృందం దీన్ని రూపొందించింది. ఏటా బడ్జెట్కు ముందు ఆవిష్కరించే ఆర్థిక సర్వే నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు రానున్న రానున్న సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందన్నది తెలియజేస్తుంది.‘స్వదేశీ’ మంత్రం.. అంతర్జాతీయంగా వాణిజ్యం, ఇతర సమస్యల నుంచి గట్టెక్కేందుకు ‘స్వదేశీ’ మంత్రాన్ని ఆర్థిక సర్వే సూచించింది. ‘‘అన్నిరకాల దిగుమతులకు ప్రత్యామ్నాయం అన్నది ఆచరణ సాధ్యం కాబోదు. అలాగే, ఆమోదనీయం కూడా కాదు. అభివృద్ధి చెందిన దేశాలు ఎగుమతులపై నియంత్రణలు విధిస్తూ, టెక్నాలజీ బదిలీకి నిరాకరిస్తున్న తరుణంలో స్వదేశీ అన్నది తప్పనిసరే కాదు అవసరం కూడా’’అని ఆర్థిక సర్వే పేర్కొంది. ఐరోపాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ తయారీ రంగ పోటీతత్వాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతుల పరంగా ఉన్న అవరోధాలను తొలగించడంపై దృష్టి సారించాలి. సర్వేలోని అంశాలు.. ⇒ 2026–27లో జీడీపీ వృద్ధి రేటు 6.8–7.2 శాతంగా ఉంటుంది. మధ్య కాలానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా కొనసాగొచ్చు. ⇒ 2026–27లో ద్రవ్యలోటు 4.4 శాతానికి దిగొస్తుంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువే ఉండొచ్చు. అయినప్పటికీ ఆర్బీఐ లకి్ష్యత స్థాయి 4 శాతం పరిధిలోనే ఉంటుంది. ⇒ అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలు ఈ ఏడాదిలో ముగుస్తాయి. దీంతో విదేశీ వాణిజ్యం పరంగా అనిశ్చితులు తగ్గుతాయి. ⇒ కృత్రిమ మేధ (ఏఐ)పై ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ట్రిలియన్ డాలర్లు కుమ్మరిస్తున్న నేపథ్యంలో.. ఈ పెట్టుబడులు ఆశించిన ప్రతిఫలం ఇవ్వకపోతే అది ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అధిక విలువలు కలిగిన అసెట్స్లో దిద్దుబాటు చోటుచేసుకోవచ్చు. ⇒ రూపాయి విలువ పటిష్టమైన దేశ ఆర్థిక మూలాలను ప్రతిఫలించడం లేదు. అమెరికా టారిఫ్లతో రూపాయి విలువ 5 శాతం పతనమైంది. అయినప్పటికీ కరెన్సీ విలువ క్షీణించడం వల్ల మన ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్ల ప్రభావాన్ని కొంత వరకు తగ్గిస్తోంది. ⇒ దేశ వృద్ధిలో సేవల ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వస్తు ఎగుమతులపై టారిఫ్ల అనిశ్చితుల ప్రభావాన్ని ఇవి భర్తీ చేస్తున్నాయి. ⇒ ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉంది. కంపెనీలు, గృహాల పద్దులు ఆరోగ్యంగా ఉన్నాయి. వినియోగం కూడా బలంగా ఉంది. ⇒ తదుపరి జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇ–వే బిల్లు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. ⇒ ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.8.1 లక్షల కోట్ల చెల్లింపుల్లో జాప్యం ఈ రంగం వృద్ధికి అవరోధంగా మారింది. నగదు ప్రవాహాల ఆధారితంగా రుణ సాయం అందించడం వంటి వినూత్నమైన చర్యలు అవసరం. ⇒ ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి పదార్థాలు, ఫార్మా ముడిసరుకులు (ఇంగ్రేడియెంట్స్), మ్యాగ్నెట్, బ్యాటరీ సెల్స్, నూనెలు, టెలికం ఎక్విప్మెంట్, వైద్య పరికరాల పరంగా స్వావలంబనను పెంచేందుకు బహుళ అంచల విధానం అవసరం. ⇒ ప్రస్తుతం ఏదైనా కంపెనీలో ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటే దాన్ని ప్రభుత్వ సంస్థగా పేర్కొంటుండగా, దీన్ని 26 శాతానికి తగ్గించాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 51 శాతం కంటే తక్కువకు తగ్గించుకోవచ్చు. పూర్తిగా వైదొలగొచ్చు. ⇒ పీఎల్ఐ పథకం కింద రూ.13,759 కోట్ల ప్రోత్సాహకాలతో దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ 2025 సెప్టెంబర్ నాటికి రూ.9.34 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు రూ.5.12 లక్షల కోట్లుగా ఉన్నాయి. ⇒ డిజిటల్ వ్యసనానికి చెక్ పెట్టేందుకు సోషల్ మీడియా యాప్ల వినియోగంలో వయసుల వారీ పరిమితులు తీసుకురావాలి. కరోనా సమయంలో మొదలైన ఆన్లైన్ బోధన టూల్స్పై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు అవసరం. పిల్లలకు బేసిక్ ఫోన్లు లేదా కంటెంట్ పరంగా ఫిల్టర్లతో విద్యా సంబంధిత సమాచారంతో కూడిన ట్యాబ్లను అనుమతించొచ్చు. ⇒ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య మీడియాలో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్పై ప్రచారాన్ని నిషేధించాలి. చంటి పిల్లలకు సంబంధించి పాలు, పానీయాల మార్కెటింగ్పై పరిమితులు విధించాలి. ⇒ దేశంలో స్థూలకాయం పెరిగిపోతుండడం ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారింది. కనుక సరైన పోషకాహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మహిళల్లో 24 శాతం, పురుషుల్లో 23 శాతం అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ⇒ ఐటీ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉండొచ్చు. కొన్ని రకాల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుంది. దీనిపై దృష్టి సారించేందుకు ఏఐ ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలి.వికసిత్ భారత్కు మార్గసూచీభారతదేశ సంస్కరణల ప్రస్థానాన్ని ఆర్థిక సర్వే విశదీకరించింది.అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం మధ్య స్థిరమైన పురోగతిని ప్రతిబింబించింది. బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, స్థిరమైన వృద్ధితోపాటు దేశ నిర్మాణంలో ఆవిష్కరణలు, పారిశ్రామిక పాత్రను హైలైట్ చేస్తోంది. తయారీని బలోపేతం చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి, వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి ఈ సర్వే కార్యాచరణను కూడా వివరించింది’’ – ప్రధాని నరేంద్ర మోదీపటిష్ట స్థితిలో భారత్ దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు ఇంతకుముందెన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా అధిగమించడం ద్వారా భారత్ను అధిక వృద్ధి పథంలో నిలిపాం. జీడీపీ వృద్ధి సామర్థ్యాన్ని 7 శాతానికి చేర్చాం. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం మధ్య భారత్ అంతర్జాతీయ ఆశాకిరణంగా నిలిచింది’’ – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎగుమతులు, వ్యవసాయంలో లోపాలు.. పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే 2025–26 దేశ ఎగుమతి విధానాలు.. ముఖ్యంగా వ్యవసాయ రంగం విషయంలో లోపాలను ఎత్తి చూపించింది. విలువ పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద వ్యవసాయ దేశంగా ఉన్న భారత్ నుంచి.. వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఆహారం, పానీయాల ఉత్పత్తుల ఎగుమతులు వచ్చే నాలుగేళ్ల కాలంలో 100 బిలియన్ డాలర్లకు (రూ.9.2 లక్షల కోట్లు) చేరుకుంటాయని అంచనా వేసింది.2024–25లో ఇవి 51.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే విధానాల్లో తరచూ చేసే మార్పులతో సరఫరా వ్యవస్థలు దెబ్బతినొచ్చని, అనిశ్చితికి కారణమై.. విదేశీ కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాలను ఆశ్రయించేందుకు దారితీయొచ్చంటూ హెచ్చరించింది. ఒక్కసారి ఎగుమతుల మార్కెట్లను కోల్పోతే తిరిగి పొందడం కష్టమవుతుందని పేర్కొంది. -
ఎకనామిక్ సర్వే 2026.. మారథాన్ వేగం అవసరం: సీఈఏ
దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఆర్థిక సర్వే 2026ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ సర్వేలోని ముఖ్యాంశాలను వివరిస్తూ.. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భారతదేశం తన వ్యూహాలను ఎలా మార్చుకోవాలో స్పష్టం చేశారు.‘ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి దృష్ట్యా భారతదేశం నిరాశావాదం కంటే వ్యూహాత్మక సంయమనాన్ని ప్రదర్శించాలని సర్వే సూచించింది. భారతదేశం ఇప్పుడు ఒకే సమయంలో మారథాన్, స్ప్రింట్ రెండింటినీ ఎదుర్కోవాలి. అంటే దీర్ఘకాలిక వృద్ధిని (మారథాన్) కొనసాగిస్తూనే, తక్షణ సవాళ్లను ఎదుర్కోవడంలో వేగాన్ని (స్ప్రింట్) ప్రదర్శించాలి. సరఫరా వ్యవస్థలో స్థిరత్వం, వనరుల సృష్టి, దేశీయ వృద్ధిని పెంచడం, అనిశ్చితులను తట్టుకునే సామర్థ్యం చాలా కీలకం’ అన్నారు.పెరిగిన నిడివిఈ ఏడాది ఆర్థిక సర్వే గతంలో కంటే భిన్నంగా, మరింత సమగ్రంగా రూపొందించారు. ఇందులో 17 అధ్యాయాలున్నాయి. మునుపటి కంటే సర్వే నిడివి పెరిగింది. పదిహేడు అధ్యాయాలతో కూడిన ఈ ఎడిషన్ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించింది. గతంలో అధ్యాయాల అమరిక ఆర్థిక అంశాల ప్రాధాన్యతపై ఆధారపడేది, కానీ ఇప్పుడు జాతీయ అవసరాలు, సమయ-ఔచిత్యం (Time-relevance) ఆధారంగా సిద్ధం చేశారు.రాజకీయాల ఆధారంగానే విధానాలు2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలాన్ని ఎదుర్కోవచ్చని సర్వే హెచ్చరించింది. 2025 నాటి పరిస్థితులే కొనసాగినప్పటికీ భద్రతా పరంగా ప్రపంచం మరింత బలహీనంగా మారుతుందని విశ్లేషించింది. ‘భద్రత పరిధి సన్నగిల్లడంతో చిన్నపాటి ఆర్థిక లేదా రాజకీయ ఒత్తిళ్లు పెద్ద వ్యవస్థాగత నష్టాలకు దారితీయవచ్చు. ప్రపంచ దేశాల మధ్య అపనమ్మకం పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థలు సమీకృతంగా ఉన్నా కొన్ని సమస్యలకు అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ పోటీ తీవ్రమవ్వడం వల్ల వాణిజ్య విధానాలు ఇప్పుడు భద్రత, రాజకీయాల ఆధారంగానే రూపొందుతున్నాయి’ అని సర్వేలో తెలిపారు.కరెన్సీ, ఎగుమతుల మధ్య సంబంధం‘సాధారణంగా ఒక దేశ కరెన్సీ బలంగా ఉండాలంటే ఆ దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని (Forex) నిరంతరం ఆర్జించాలి. దీనికి తయారీ రంగ పోటీతత్వం, ఎగుమతులు వెన్నెముక వంటివి. ఎగుమతులు పెరిగితే రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. తయారీ రంగం బలోపేతమైతే దిగుమతులపై ఆధారపడటం తగ్గి, కరెన్సీ మరింత బలోపేతం అవుతుంది’ అని సర్వే తెలిపింది.ఇదీ చదవండి: గోల్డ్ ధర.. గుండె దడ! -
ఆర్థిక సర్వే 2025-26.. ముఖ్యాంశాలు
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (జనవరి 29, 2026) పార్లమెంటులో ‘ఆర్థిక సర్వే 2025-26’ పత్రాన్ని ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్కు దిక్సూచిగా నిలిచే ఈ సర్వే భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని విశ్లేషించింది. కాసేపట్లో భారత ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత నాగేశ్వరన్ మీడియా సమావేశం నిర్వహించి కీలక అంశాలను వివరించనున్నారు.ఆర్థిక వృద్ధి అంచనాలు: సంస్కరణల ప్రభావంప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని సాధిస్తుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది.2025-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.4% గా ఉంటుందని ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి.2026-27 ఆర్థిక సంవత్సరంలో బలమైన స్థూల ఆర్థిక అంశాలు, వరుస నియంత్రణ సంస్కరణల వల్ల జీడీపీ వృద్ధి 6.8% నుంచి 7.2% మధ్య ఉండొచ్చని సర్వే అంచనా వేసింది.‘ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధి కీలకం. ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, కానీ నిరాశావాదం అక్కర్లేదు. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. ఆహార ధరల ఒత్తిడి తగ్గింది’ అని సర్వేలో పేర్కొన్నారు.‘మేక్ ఇన్ ఇండియా 2.0’పై దృష్టి కేంద్రీకరించి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు తెలిపారు.డిజిటల్ ఎకానమీ.. డిజిటల్ పేమెంట్లు, ఫిన్టెక్, AI వినియోగం వేగంగా పెరుగుతూ, భారత్ను ప్రపంచ స్థాయి టెక్ హబ్గా మలుస్తోందన్నారు.సౌర, వాయు, హైడ్రజన్ వంటి గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించి, స్థిరమైన వృద్ధికి అనుకూలంగా పాలసీ మద్దతు కొనసాగుతోందని చెప్పారు.మానవ కేంద్రిత సంస్కరణలు.. సాంకేతిక వినియోగాన్ని విస్తరించడంలో కూడా, సంక్షేమాన్ని కాపాడే విధంగా సంస్కరణలు పూర్తిగా మానవ కేంద్రితంగానే ఉంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలో భారత స్థానం.. భారతాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు “ఆశాకిరణం”గా వర్ణిస్తూ, గ్లోబల్ పెట్టుబడులు, దృష్టి భారత్వైపు మళ్లుతున్నాయని పేర్కొన్నారు.ఇదిలాఉండగా, డిసెంబరులో వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం 2% వద్ద ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఇది కేంద్రం నిర్దేశించిన 4% లక్ష్యం కంటే చాలా తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నామమాత్రపు జీడీపీ వృద్ధి 8% వద్ద ఉండొచ్చని అంచనా.బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గుర్తుంచుకోవాల్సిన తేదీలు..జనవరి 29: ఆర్థిక సర్వే 2025-26 సమర్పణ.ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్.ఏప్రిల్ 2: బడ్జెట్ సమావేశాల ముగింపు. -
పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2025-26 విడుదల
దేశ ఆర్థిక వ్యవస్థ గమనానికి దిక్సూచిగా భావించే ఆర్థిక సర్వే (Economic Survey) 2025-26ను కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ నేడు (గురువారం, జనవరి 29, 2026) పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ కంటే ముందు వెలువడే ఈ కీలక పత్రం గత ఆర్థిక సంవత్సరంలో దేశం సాధించిన ప్రగతిని, రాబోయే సవాళ్లను విశ్లేషిస్తుంది.ప్రధాన అంశాలు..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ సర్వేను సమర్పించారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి.అనంత నాగేశ్వరన్ విలేకరుల సమావేశంలో పాల్గొని దేశ ఆర్థిక పోకడలపై సమగ్ర వివరణ ఇవ్వనున్నారు.జనవరి 28న ప్రారంభమైన ఈ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2, 2026 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.ఆర్థిక వృద్ధి అంచనాలుభారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశం 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా. ఇది గతంలో ఊహించిన 6.3 - 6.8 శాతం కంటే మెరుగ్గా ఉండటం విశేషం. పటిష్టమైన దేశీయ వినియోగం, తయారీ రంగంలో వృద్ధి దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి?ఆన్లైన్లో indiabudget.gov.in(https://www.indiabudget.gov.in) అధికారిక వెబ్సైట్, సాక్షి.కామ్లోని లైప్ అప్డేట్ల ద్వారా బడ్జెట్ వివరాలు తెలుసుకోవచ్చు. దీంతోపాటు సోషల్ మీడియాలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అధికారిక పేజీలతోపాటు ఫేస్బుక్లోకి ‘సాక్షి’ పేజీని ఫాలో అయి తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: గోల్డ్ ధర.. గుండె దడ! -
పటిష్టంగానే పారిశ్రామికరంగం
దేశ పారిశ్రామిక రంగం డిసెంబర్లో బలమైన పనితీరు చూపించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) రెండేళ్ల గరిష్ట స్థాయిలో 7.8 శాతం వృద్ధి చెందింది. మైనింగ్, తయారీ, విద్యుదుత్పత్తి రంగాలు రాణించడం ఇందుకు దారితీసింది. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసింది. 2024 డిసెంబర్ నెలలో ఐఐపీ వృద్ధి 3.7 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘పారిశ్రామిక పనితీరు 2025 డిసెంబర్లో మరింత బలపడింది. ఐఐపీ వృద్ధి 7.8 శాతంతో రెండేళ్లలోనే గరిష్ట స్థాయికి చేరింది. 2025 నవంబర్లో నమోదైన 7.2 శాతం తర్వాత అధిక వృద్ధిని నమోదు చేసింది’’అని ఎన్ఎస్వో తెలిపింది. వాస్తవానికి 2025 నవంబర్ నెలకు ఐఐపీ వృద్ధిని లోగడ 6.7 శాతంగా అంచనా వేయగా, తాజాగా దీన్ని 7.2 శాతానికి సవరించింది.తయారీ రంగంలో వృద్ధి 2025 డిసెంబర్లో 8.1 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఈ రంగం వృద్ధి 3.7 శాతంగా ఉంది. మైనింగ్ రంగంలో ఉత్పత్తి 6.8 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఇదే నెలలో వృద్ధి 2.7 శాతంగా ఉంది.విద్యుదుత్పత్తి 6.3 శాతం వృద్ధి చెందింది. 2024 డిసెంబర్లోనూ ఈ రంగంలో ఉత్పత్తి 6.2 శాతం పెరగడం గమనించొచ్చు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పారిశ్రామికోత్పత్తి 3.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 4.1 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది.ఇదీ చదవండి: లెక్కలు తప్పయితే.. చిక్కులు తప్పవు! -
యూఎస్తో వాణిజ్య ఒప్పందంపై కేంద్రం స్పష్టత
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ తన పట్టును బిగిస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న భారత్-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు మంగళవారంతో ముగిశాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై వస్తున్న ఊహాగానాలపై కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు స్పష్టతనిచ్చారు. భారత్ తన ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేసిందని, యూఎస్తో ట్రేడ్ డీల్ పరంగా ఇప్పుడు ముందడుగు వేయాల్సింది అమెరికానే అని తేల్చి చెప్పారు.అమెరికా అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని కొందరు సభ్యులు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలను ప్రస్తుత చర్చలతో ముడిపెట్టవద్దని అధికారులు హెచ్చరించారు. ‘భారత్ తన వైపు నుంచి ఇవ్వాల్సిన ఆఫర్లను ఇప్పటికే యూఎస్ ముందుంచింది. భారత్ వైపు నుంచి ప్రక్రియ పూర్తయింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది యూఎస్’ అని ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు. వాణిజ్య ఒప్పందం అసలు వివరాలు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR), చర్చల బృందాలకు మాత్రమే తెలుసని పేర్కొన్నారు.భారత్-ఈయూ ఒప్పందం కీలకంఅమెరికాతో చర్చలు జరుగుతున్నప్పటికీ ఈయూతో ఒప్పందం వేగవంతం కావడం వెనుక బలమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, ప్రీమియం వస్తువులపై భారత్ సుంకాల తగ్గింపునకు అంగీకరించింది. ప్రతిగా భారతీయ వస్త్రాలు, తోలు వస్తువులు, ఇంజినీరింగ్ ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత రంగాలకు ఈయూ మార్కెట్లో భారీ రాయితీలు లభించనున్నాయి. ఇది దేశంలో ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది.వ్యూహాత్మకంగా..అమెరికాతో ఉన్న అనిశ్చితి వల్లే ఈయూతో భారత్ వేగంగా ఒప్పందం చేసుకుంటోందనే వాదనలను అధికారులు తోసిపుచ్చారు. ‘ప్రతి చర్చకు దాని సొంత పథం, వ్యూహాత్మక హేతుబద్ధత ఉంటుంది. ఈయూ చర్చలు అమెరికా చర్చల కంటే చాలా ముందు నుంచే జరుగుతున్నాయి. కాబట్టి ఇది సహజమైన పరిణామమే తప్పా ఒక దేశంపై ఆధారపడి తీసుకున్న నిర్ణయం కాదు’ అని అధికారులు వివరించారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు! -
వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు
దేశవ్యాప్తంగా 2026-27 కేంద్ర బడ్జెట్ కోసం సన్నాహాలు జరుగుతున్న వేళ అన్నదాత గళం మరోసారి బలంగా వినిపిస్తోంది. పెరుగుతున్న సాగు ఖర్చులు, అనిశ్చిత వాతావరణం, మందగిస్తున్న ఉత్పాదకత వంటి సవాళ్ల నడుమ.. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) రంగానికి భారీగా నిధులు కేటాయించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.పరిశోధన రంగానికి నిధుల కరువుభారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ పరిశోధనా వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. గణాంకాలను పరిశీలిస్తే 2025-26 బడ్జెట్లో వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం (DARE)కి రూ.10,466 కోట్లు కేటాయించారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే నామమాత్రపు పెరుగుదలే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) బడ్జెట్లో సుమారు 85 శాతం నిధులు కేవలం శాస్త్రవేత్తల జీతాలు, పెన్షన్లు, నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయి. వాస్తవ పరిశోధనలకు మిగిలేది అత్యల్ప వాటా మాత్రమే. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలు తమ వ్యవసాయ జీడీపీలో 2% నుంచి 4% వరకు పరిశోధనలపై ఖర్చు చేస్తుంటే భారత్ కేవలం 0.3% నుంచి 0.7%** మధ్యనే ఉండటం గమనార్హం.క్షేత్రస్థాయిలో వాస్తవాలువిత్తనాలు, ఎరువులు, ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండగా పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కేవలం సబ్సిడీలు ఇస్తే సరిపోదు, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే సాంకేతికత కావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 50 శాతం సాగు వర్షాధారంగానే సాగుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల కరువులు, అకాల వర్షాలు రైతులను దెబ్బతీస్తున్నాయి. వీటిని తట్టుకునే ‘క్లైమేట్ రెసిలెంట్’ (వాతావరణ నిరోధక) వంగడాల సృష్టికి నిధుల కొరత అడ్డంకిగా మారింది.బడ్జెట్పై ఆశలుప్రభుత్వం ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి కట్టుబడి ఉండాలంటే ఈసారి బడ్జెట్లో విప్లవాత్మక మార్పులు అవసరం. ప్రధానంగా చేయాల్సినవి..1. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు పరిశోధనల కోసం ప్రత్యేక నిధుల కేటాయింపు.2. కీలకమైన వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ‘జాతీయ వ్యవసాయ ఆవిష్కరణ టాస్క్ఫోర్స్’ ఏర్పాటు.3. పరిశోధనలు కేవలం ల్యాబ్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పొలాల వరకు చేరేలా విస్తరణ సేవల బలోపేతం.ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండాలంటే వ్యవసాయ శాస్త్రంలో పెట్టుబడి పెట్టడం అత్యవసరం. బడ్జెట్ 2026 ద్వారా ప్రభుత్వం పరిశోధన రంగానికి పెద్దపీట వేసి, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తుందని ఆశిద్దాం.ఇదీ చదవండి: వ్యవసాయ రంగానికి పీఎంఓ దిశానిర్దేశం -
కేంద్ర బడ్జెట్ 2026: ‘మౌలిక’ మద్దతు మరింత పెరగాలి
2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమీపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన తొమ్మిదవ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, దేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకైన మౌలిక సదుపాయాల రంగం మరింత ప్రభుత్వ వ్యయం, విధాన మద్దతు, ప్రాజెక్టుల వేగవంతమైన అమలును ఆశిస్తోంది.గత కొన్ని సంవత్సరాలుగా మూలధన వ్యయం గణనీయంగా పెరిగినప్పటికీ, భూసేకరణ, టెండరింగ్ విధానాలు, నియంత్రణ సంబంధిత సమస్యల కారణంగా అనేక పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యమవుతూ, ఖర్చులు పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ సవాళ్లను అధిగమించేందుకు రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రధాన ప్రభుత్వ ఆస్తుల కోసం కేటాయింపులను కనీసం 10–15 శాతం వరకు పెంచాలని రంగం డిమాండ్ చేస్తోంది.అదే విధంగా, కేవలం తక్కువ బిడ్ ఆధారిత టెండరింగ్ విధానాలపై ఆధారపడటాన్ని తగ్గించి, సాంకేతిక సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలు, గత అమలు పనితీరుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వాటాదారులు సూచిస్తున్నారు. ఇది ప్రాజెక్టులు సకాలంలో పూర్తవ్వడమే కాకుండా దీర్ఘకాలికంగా మెరుగైన ఆస్తి సృష్టికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.ప్రధాన మెట్రో నగరాలపై ఉన్న ఒత్తిడిని తగ్గించడంతో పాటు సమగ్ర ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిచ్చేందుకు, టైర్-టూ, టైర్-త్రీ నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని పరిశ్రమ కోరుతోంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: ఆ పన్నులు తగ్గిస్తే మంచిది: ఎస్బీఐరాబోయే బడ్జెట్లో బలమైన ఆర్థిక మద్దతు, వేగవంతమైన అమలు విధానాలు మరియు సౌకర్యవంతమైన టెండరింగ్ నిబంధనలు మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని మరింత వేగవంతం చేసి, భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను బలోపేతం చేస్తాయని రంగ నిపుణులు విశ్వసిస్తున్నారు.రూ.13 లక్షల కోట్లు కేటాయించాలిమూలధన వ్యయానికి గత బడ్జెట్లో రూ.11.21 లక్షల కోట్లు కేటాయించారు. పట్టణాభివృద్ధికి తీసుకున్న చర్యలు ఈ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. హైదరాబాద్లో అమలవుతున్న మా రూ.215 కోట్ల మురుగునీటి ప్రాజెక్టులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. రానున్న 2026 బడ్జెట్లోనూ నీటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి అవసరం. నమామి గంగే పథకం కింద 7,000 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి సామర్థ్యం కోసం పీపీపీ ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, పట్టణ ప్రాంతాల్లో సర్క్యులర్ వాటర్ రీయూజ్ వంటి చర్యలు కీలకం. ఈ నేపథ్యంలో రూ.12–13 లక్షల కోట్ల స్థిరమైన మూలధన వ్యయాన్ని మౌలిక రంగం అంచనా వేస్తోంది.– సునీల్ ఎస్. నాయర్, సీఈఓ, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ -
తీపితో సీక్రెట్ లాక్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్కు ముందు కీలక సంప్రదాయ కార్యక్రమం బడ్జెట్ హల్వా సెరమనీ న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్లో మంగళవారం ఘనంగా, సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంతో బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోపాటు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, సీనియర్ అధికారులు, బడ్జెట్ తయారీలో పాల్గొన్న సిబ్బంది కలిసి హల్వాను పంచుకున్నారు.భారత సంప్రదాయంలో శుభారంభానికి తీపి పంచుకోవడం ఆనవాయితీ కావడంతో, బడ్జెట్ ప్రక్రియ ప్రారంభానికి ఇది ప్రతీకగా కొనసాగుతోంది. వచ్చే నెల (ఫిబ్రవరి)1 న ఆర్థిక మంత్రి పార్లమెంట్కు బడ్జెట్ను సమరి్పంచనున్నారు. హల్వా వేడుక తర్వాత ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ ముద్రణ విభాగాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. మొత్తం బడ్జెట్ బృందానికి ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశారు. బడ్జెట్ వరకు దిగ్బంధం బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బంది పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు నార్త్ బ్లాక్లోనే (లాకిన్) ఉండిపోతారు. బాహ్య ప్రపంచంతో వారికి ఎలాంటి సమాచార, సంబంధాలు ఉండవు. బడ్జెట్ తుది పత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ అవ్వకుండా ఈ విధానాన్ని పాటిస్తుంటారు. ఇలా లాకిన్లో ఉండే అధికారులు, సిబ్బందికి అభినందన పూర్వకంగా హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నార్త్బ్లాక్ బేస్మెంట్లోని ప్రింటింగ్ ప్రెస్లోనే 1980 నుంచి 2020 వరకు బడ్జెట్ ప్రతులను ముద్రించే వారు. ఆ తర్వాత నుంచి పరిమితంగా కొన్ని పత్రాలను ముద్రించి, మిగిలిన మొత్తం డిజిటల్ రూపంలోకి మారింది. 1950కు పూర్వం రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాల ముద్రణ నడిచింది. డాక్యుమెంట్లు లీక్ అవ్వడంతో 1950లో మింట్రోడ్కు మార్చారు. ఆ తర్వాత 1980లో నార్త్బ్లాక్కు మారింది. -
బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?
కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే.. అంటే 1860 ఏప్రిల్ 7న భారత్ బ్రిటిష్ పాలనలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్ (మధ్యంతర బడ్జెట్)ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు.బ్లాక్ బడ్జెట్ గురించిభారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నవంబర్ 26న దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత క్రమంగా బడ్జెట్లను ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను 'బ్లాక్ బడ్జెట్' (Black Budget) అన్నారు. ఇంతకీ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో తెలుసా..1971లో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం దేశాన్ని ఆర్ధిక సంక్షోభానికి గురి చేసింది. యుద్ధం కారణంగా కరువు ఏర్పడింది, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా వ్యవసాయం మీద గణనీయమైన ప్రభావం చూపించాయి. ఆ తరువాత 1973లో అప్పటి ప్రధానమంత్రి 'ఇందిరా గాంధీ' (Indira Gandhi) నాయకత్వంలో ఆర్థిక మంత్రి 'యశ్వంతరావు చవాన్' (Yashwantrao Chavan) బడ్జెట్ ప్రవేశపెట్టారు.రూ. 550 కోట్ల ఆర్థిక లోటు..దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిందని, కరువు కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తగ్గిందని.. ఈ కారణంగా లోటు బడ్జెట్ పెరిగిందని.. బడ్జెట్ ప్రసంగంలో చవాన్ వెల్లడించారు. ఆ సమయంలో ఏకంగా రూ. 550 కోట్ల ఆర్థిక లోటును ప్రకటించారు. ఈ క్రమంలో బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాల జాతీయీకరణకు రూ. 56 కోట్లు కేటాయింపు ప్రకటించారు.బొగ్గు గనులను జాతీయం చేయడం ద్వారా.. దేశంలో ఇంధన రంగం అభివృద్ధి చెందితుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలు భారతదేశ ఆర్ధిక విధానాలపై ప్రభావాన్ని చూపించాయి. ఈ కారణంగానే దీనిని 'బ్లాక్ బడ్జెట్' అని అన్నారు. బ్లాక్ బడ్జెట్ అనే పదం లోటును మాత్రమే కాకుండా.. ఆర్థిక సంస్కరణల తక్షణ అవసరాన్ని కూడా హైలైట్ చేసింది. -
భారత మార్కెట్ రూపురేఖలు మార్చే డీల్!
భారతీయ విలాసవంతమైన కార్ల ప్రియులకు, టెక్ ప్రియులకు ఇక పండగే! భారత్-ఈయూ మధ్య ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా పిలవబడే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో యూరప్ నుంచి భారత్లోకి వస్తున్న యూరోపియన్ బ్రాండెడ్ కార్లు, అత్యున్నత స్థాయి వైద్య పరికరాలు, దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల ధరలు భారీగా తగ్గనున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో భారత మార్కెట్ ముఖచిత్రాన్నే మార్చేయబోతున్న ఈ ఒప్పందం వివరాలు, ఏయే వస్తువులపై సుంకాలు ఎంత మేర తగ్గుతాయో కింద చూద్దాం.భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వచ్చే దశాబ్ద కాలంలో భారత దిగుమతి మార్కెట్ను సమూలంగా పునర్నిర్మించేలా, కీలక రంగాల్లో భారీగా సుంకాలు తగ్గనున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఆటోమొబైల్ రంగంలో..ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం కార్లపై సుంకాల తగ్గింపు. ప్రస్తుతం 70% వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని భారత్ క్రమంగా 10%కి తగ్గించనుంది. ఏడాదికి 2,50,000 వాహనాల వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ మార్పు భారత ప్రీమియం కార్ల మార్కెట్ను పూర్తిగా రీసెట్ చేస్తుందని ఈయూ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.ఎగుమతులు - సుంకాల ఆదా2032 నాటికి భారతదేశానికి ఈయూ ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. 90% పైగా వస్తువులపై సుంకాల తగ్గింపు ఉంటుంది. దీనివల్ల ఏడాదికి సుమారు 4 బిలియన్ యూరోల మేర ట్యాక్స్ ఆదా అవుతుందని బ్రస్సెల్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం గరిష్టంగా ఉన్న సుంకాలు (యంత్రాలపై 44%, రసాయనాలపై 22%, ఫార్మాపై 11%) గణనీయంగా తగ్గనున్నాయి.వైద్యం, సాంకేతిక రంగంభారతదేశంలో వైద్య సేవల ఖర్చులను తగ్గించే దిశగా ఈ ఒప్పందం దోహదపడనుంది. దాదాపు అన్ని వైద్య పరికరాలపై సుంకాలను సున్నాకి తగ్గించనున్నారు. 90% ఉత్పత్తులపై సుంకాలు తొలగిపోతాయి. దీనివల్ల ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. విమానాలు, అంతరిక్ష నౌకలకు సంబంధించి దాదాపు పూర్తిస్థాయిలో సుంకాల తొలగింపు ఉంటుంది.ఆహారం, పానీయాలుయూరప్ నుంచి దిగుమతి అయ్యే ప్రముఖ పానీయాలపై సుంకాలను భారత్ భారీగా తగ్గించింది. యూరోపియన్ వైన్లపై 20 నుంచి 30 శాతం వరకు సుంకాలు తగ్గనుండగా వివిధ రకాల స్పిరిట్లపై 40 శాతం వరకు రాయితీ లభించనుంది. అన్నిటికంటే ఎక్కువగా యూరోపియన్ బీరుపై ఏకంగా 50 శాతం మేర సుంకాలు తగ్గనున్నాయి.కేవలం పానీయాలకే పరిమితం కాకుండా వంట గదిలో అత్యవసరమైన ఆహార నూనెలపై కూడా ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపనుంది. ఐరోపా నుంచి వచ్చే ఆలివ్ ఆయిల్, మార్గరీన్, ఇతర వెజిటబుల్ ఆయిల్స్పై ఉన్న దిగుమతి సుంకాల్లో ప్రభుత్వం భారీ కోత విధించింది. దీనివల్ల భారతీయ వినియోగదారులకు నాణ్యమైన యూరోపియన్ ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత ఎగుమతులకు లబ్ధిఏడేళ్ల వ్యవధిలో 99.5% వాణిజ్య వస్తువులపై ఈయూ కూడా సుంకాలను తగ్గించనుంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. అందులో..సముద్ర ఉత్పత్తులు, తోలు, వస్త్రాలు.రసాయనాలు, రబ్బరు, రత్నాలు, ఆభరణాలు.ఈ ఒప్పందం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత వినియోగదారుల మార్కెట్లో యూరప్ పట్టును బలోపేతం చేయనుంది. అయితే, యూరోపియన్ ఉత్పత్తుల నుంచి ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకునేలా దేశీయ తయారీదారులు ఏ విధంగా సిద్ధమవుతారనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
వ్యవసాయ రంగానికి పీఎంఓ దిశానిర్దేశం
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా వ్యవసాయ రంగ వృద్ధిని పరుగులు తీయించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖకు కీలక సూచనలు చేసింది.ఆందోళన కలిగిస్తున్న వృద్ధి రేటువ్యవసాయ రంగ వృద్ధి రేటులో కనిపిస్తున్న మందగమనంపై పీఎంఓ ఆందోళన వ్యక్తం చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధి రేటు 2025–26 అంచనాల ప్రకారం 3.1 శాతానికి పడిపోయింది. 2020–21లో దేశ మొత్తం స్థూల విలువ జోడింపు (GVA)లో వ్యవసాయ రంగం వాటా 20.4 శాతం ఉండగా 2023–24 నాటికి అది 17.7 శాతానికి తగ్గింది. గత 5-6 ఏళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ కొవిడ్ ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల సగటు జీవీఏ వృద్ధి 3–4 శాతం వద్దే నిలిచిపోయింది.బడ్జెట్పై అంచనాఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు బడ్జెట్లో భారీ నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై దృష్టి సారించనున్నారు.1. చిన్న, సన్నకారు రైతులను ఏకం చేసి సహకార సంఘాల ద్వారా వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం.2. పంట పండించడమే కాకుండా అగ్రో-ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించడం.3. పంట కోత అనంతర నష్టాలను తగ్గించేందుకు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వసతుల కల్పన.4. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చేందుకు ప్రత్యేక సంస్థల ద్వారా మార్కెట్ అవకాశాన్ని పెంచడం.ప్రభుత్వం ప్రతిపాదించబోయే ఈ సమగ్ర గ్రామీణ పునరుజ్జీవన కార్యాచరణ కేవలం వ్యవసాయానికే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల విస్తరణకు కూడా దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. సరఫరా గొలుసుల (Supply Chains) ఆధునీకరణ ద్వారా వినియోగదారులకు, రైతులకు మధ్య దళారీల ప్రభావం తగ్గి నేరుగా రైతుకే లాభం చేకూరే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
వారంలో ఐదు రోజులే పని!?
బ్యాంకింగ్ రంగంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ‘వారంలో ఐదు రోజుల పని’ డిమాండ్ను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ‘యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU)’ నేడు (జనవరి 27, మంగళవారం) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నిరసన కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సర్వీసులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.సమ్మె అనివార్యంజనవరి 23న చీఫ్ లేబర్ కమిషనర్తో జరిగిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సమ్మెకు వెళ్లక తప్పడం లేదని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. తొమ్మిది ప్రధాన బ్యాంకు యూనియన్ల సమాఖ్య యూఎఫ్బీయూ తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) నుంచి స్పష్టమైన హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రతినెలా ఒకటి, మూడు, ఐదో శనివారాలు పూర్తి పని దినాలుగా ఉన్నాయి. రెండు, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు అధికారిక సెలవు దినాలు.ఎవరెవరు ఏమన్నారంటే..సీహెచ్ వెంకటాచలం (ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి: చర్చల్లో మా డిమాండ్పై ఎలాంటి సానుకూల హామీ రాలేదు. అందుకే సమ్మె రూపంలో నిరసనను తెలియజేస్తున్నాం.రూపమ్ రాయ్ (ఏఐబీఓసీ ప్రధాన కార్యదర్శి): 2024 వేతన సవరణ ఒప్పందంలోనే అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించేందుకు అంగీకారం కుదిరింది. కానీ అమలు కాలేదు. దీనికి బదులుగా ప్రతిరోజూ అదనంగా 40 నిమిషాలు పనిచేసేందుకు కూడా మేము సిద్ధమని తెలిపాం. పని గంటల్లో ఎలాంటి నష్టం ఉండదు.ఎల్ చంద్రశేఖర్ (ఎన్సీబీఈ ప్రధాన కార్యదర్శి): ఇది విలాసం కోసం చేస్తున్న సమ్మె కాదు. మెరుగైన సేవలందించాలంటే బ్యాంకర్లకు తగిన విశ్రాంతి అవసరం.ప్రభావితం కానున్న సేవలుఈ సమ్మె ప్రభావం ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఉండనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకుల శాఖల్లో కింది సేవలకు ఆటంకం కలగవచ్చు.1. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు.2. చెక్ క్లియరెన్సులు.3. రుణ మంజూరు ప్రక్రియలు, ఇతర అడ్మినిస్ట్రేషన్ పనులు.హెచ్డీఎఫ్సీ (HDFC), ఐసీఐసీఐ (ICICI), యాక్సిస్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. కాబట్టి వాటి సేవలు యథావిధిగా కొనసాగుతాయి.డిజిటల్ సేవలు, ఏటీఎంలుబ్యాంకు శాఖలు మూతపడినా యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, సమ్మె కారణంగా లాజిస్టిక్స్ ఇబ్బందులు తలెత్తితే కొన్ని ప్రాంతాల్లో ఏటీఎంల్లో నగదు లభ్యతపై ప్రభావం ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో ‘గ్లూటెన్’ గుర్తింపు
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల తయారీలో పారదర్శకత పెంచే దిశగా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) కీలక అడుగు వేసింది. గ్లూటెన్తో సీలియాక్ వ్యాధి(గ్లూటెన్ తీసుకున్నప్పుడు శరీరంలోని రోగనిరోధక శక్తి పొరపాటున చిన్న పేగులపై దాడి చేస్తుంది) వస్తున్నందున కోట్లాది మంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక నిర్ణయం తీసుకుంది. గ్లూటెన్ కలిగిన ధాన్యాల లేబెలింగ్, ‘క్రాస్-కాంటాక్ట్’(ఇతర ధాన్యాలతో కలయిక ) నివారణపై సమగ్ర సమాచారాన్ని కోరుతూ తాజాగా ప్రకటన విడుదల చేసింది.లేబెలింగ్లో పారదర్శకతే లక్ష్యంప్రస్తుతం అనేక ఆహార ఉత్పత్తుల్లో గోధుమలతో పాటు రై (rye), బార్లీ (barley) వంటి ధాన్యాలను ఉపయోగిస్తున్నారు. అయితే, వీటిని ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల సీలియాక్ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు ఎఫ్డీఏ కొన్ని అంశాలపై దృష్టి సారించింది. రై, బార్లీ కలిగిన ఉత్పత్తుల లేబెలింగ్ విధానాన్ని తీసుకురావాలని తెలిపింది. ఓట్స్ సహజంగా గ్లూటెన్ రహితమైనప్పటికీ ఇతర ధాన్యాలతో కలయిక(క్రాస్ కాంటాక్ట్) వల్ల వాటిలో గ్లూటెన్ చేరే అవకాశం ఉంది. దీనిపై స్పష్టమైన డేటాను సేకరిస్తోంది. ఈ ధాన్యాల వల్ల కలుగుతున్న ప్రతికూల ఆరోగ్య పరిస్థితులు, అలర్జీల తీవ్రతను అంచనా వేయనుంది.ఈ సందర్భంగా ఎఫ్డీఏ కమిషనర్ మార్టీ మకరీ మాట్లాడుతూ ‘సీలియాక్ వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారు తాము తినే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా సందర్భాల్లో కచ్చితమైన సమాచారం లేక వారు ఆహారం తీసుకునే విషయంలో కేవలం అంచనాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.డేటా లోపాలపై దృష్టిఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) నివేదికలు, కొంతమంది ప్రజల నుంచి అందిన పిటిషన్లను సమీక్షించిన ఎఫ్డీఏ ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాలో కొన్ని అంశాలను గుర్తించింది. ఆహార పదార్థాల్లో రై లేదా బార్లీ ఉన్నప్పటికీ వాటి వివరాలు వెల్లడించట్లేదు. దీనివల్ల ‘ఇమ్యూనోగ్లోబులిన్-E’ (IgE) ఆధారిత ఆహార అలర్జీల తీవ్రత పెరుగుతోంది. క్రాస్-కాంటాక్ట్ వల్ల ఓట్స్లో గ్లూటెన్ పరిమాణం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకోబోయే కఠిన నియంత్రణ చర్యలకు ఈ సమాచార సేకరణ పునాదిగా మారుతుందని, తద్వారా వినియోగదారులకు మరింత సురక్షితమైన ఆహారం లభింస్తుందని సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: ఇకపై సిల్వర్ రీసైక్లింగ్ -
సంస్కరణల బాటా...సుంకాల మోతా..?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్ను (2026–27 ఆర్థిక సంవత్సరం) వచ్చే నెల (ఫిబ్రవరి) 1న పార్లమెంట్కు సమర్పించనున్నారు. గతేడాది జీఎస్టీలో శ్లాబులను క్రమబద్ధీకరించడం ద్వారా వినియోగానికి ఊతమిచి్చనట్టుగానే.. కస్టమ్స్ సుంకాల్లోనూ ఇదే మాదిరి సంస్కరణ ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగి, వాణిజ్య అనిశి్చతులు నెలకొన్న తరుణంలో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే సంస్కరణలను ప్రకటించొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. జీడీపీలో రుణ నిష్పత్తిని తగ్గించే మార్గ సూచీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ద్రవ్యలోటు నిర్వహణకు పరిమితం కాకుండా, రుణ భారాన్ని తగ్గించుకోవడంపై కేంద్ర సర్కారు ఇటీవలి కాలంలో దృష్టి సారించడం తెలిసిందే. ముఖ్య అంచనాలు.. → ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానుంది. పాత, కొత్త ఆదాయపన్ను విధానాల్లో స్టాండర్డ్ డిడక్షన్ అమల్లో ఉంది. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షలకు మించని ఆదాయంపై పన్ను మినహాయింపును గత బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు కొత్త పన్ను విధానంలోకి మరింత మందిని తీసుకొచ్చే విధంగా ప్రోత్సాహానికి స్టాండర్డ్ డిడక్షన్ను పెంచాలన్న డిమాండ్ ఉంది. → టీడీఎస్ శ్లాబులను తగ్గించొచ్చన్న అంచనా ఉంది. కస్టమ్స్ వివాదాల రూపంలో చిక్కుకుపోయిన రూ.1.53 లక్షల కోట్ల విడుదలకు వీలుగా క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించొచ్చు. అలాగే, నిబంధనల అమలును సులభతరం చేయాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. → రుణ భారాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించొచ్చు. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో రక్షణ రంగానికి ఈ విడత మరిన్ని కేటాయింపులు చేయొచ్చు. → వీబీజీ రామ్జీ పథకం కింద వ్యయాలను కేంద్రం, రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తిలో పంచుకోవచ్చు. → 2026 జనవరి 1 నుంచి 8వ పే కమిషన్ అమలుకు వీలుగా కేటాయింపులు చేయొచ్చు. → 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాలకు పన్నుల పంపిణీ. → టారిఫ్ల కారణంగా ప్రభావితమవుతున్న రత్నాభరణాలు, వస్త్రాలు, లెదర్ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ప్రకటించొచ్చు. → లిథియం, కోబాల్ట్ తదితర అరుదైన ఖనిజాల అన్వేషణకు నిధుల మద్దతును ప్రకటించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. -
భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం ఖరారు
భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. భారత్–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సాగిన చర్చలు విజయవంతంగా ముగిశాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని జనవరి 27న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇది “సమతుల్యమైనదీ, ముందుచూపుతో కూడినదీ” అని పేర్కొన్న ఆయన, ఈయూతో భారతదేశ ఆర్థిక ఏకీకరణను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ఈ ఒప్పందం వచ్చే ఏడాది ఏదో ఒక సమయంలో అమల్లోకి వచ్చే అవకాశముందని అగర్వాల్ తెలిపారు. ఒప్పంద పాఠ్యానికి సంబంధించిన చట్టపరమైన పరిశీలన (లీగల్ స్క్రబ్బింగ్)కు సుమారు 5–6 నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత అధికారికంగా సంతకాలు జరుగుతాయని చెప్పారు. “చర్చలు పూర్తయ్యాయి. ఒప్పందం ఖరారైంది. ఇది రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది” అని ఆయన అన్నారు.కాగా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సోమవారం జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కేంద్ర బడ్జెట్ 2026: ఆరోజు నిర్మలమ్మ పలికే పదాలివే..
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నకేంద్ర బడ్జెట్ 2026ను మరికొద్ది రోజుల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం వ్యయం, పన్నులు, అభివృద్ధి ప్రణాళికలపై తన దిశానిర్దేశాన్ని వెల్లడిస్తుంది. అందుకే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వినిపించే పదాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపుతాయి. అలాంటి కొన్ని పదాలు.. వాటి అర్థాల గురించి తెలుసుకుంటే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం–వ్యయాలపై స్పష్టమైన అవగాహన వస్తుంది.యూనియన్ బడ్జెట్: ప్రభుత్వ ఆర్థిక స్థితిని సమగ్రంగా వివరించే నివేదిక. ఆదాయ వనరులు, వ్యయాలు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలు ఇందులో ఉంటాయి.ఫిస్కల్ పాలసీ (విత్త విధానం): వ్యయం, పన్నుల ద్వారా ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ప్రభుత్వం అనుసరించే విధానం. ఇది బడ్జెట్ ద్వారా అమలవుతుంది.ఇన్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం): వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. దీని వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది.మానిటరీ పాలసీ (Monetary Policy): డబ్బు సరఫరా, వడ్డీ రేట్లు, రుణ పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకు (ఆర్బీఐ) తీసుకునే చర్యలు.బడ్జెట్ ఎస్టిమేట్స్ (Budget Estimates): రాబోయే ఆర్థిక సంవత్సరానికి మంత్రిత్వ శాఖలు, పథకాలకు కేటాయించిన నిధుల అంచనాలు.రివైజ్డ్ ఎస్టిమేట్స్ (Revised Estimates): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యలో వాస్తవ పరిస్థితులను బట్టి సవరించిన ఆదాయం–వ్యయాల అంచనాలు.రెవెన్యూ బడ్జెట్: ప్రభుత్వ రెవెన్యూ వసూళ్లు (పన్ను, పన్నుయేతర ఆదాయం), రెవెన్యూ వ్యయాలను చూపుతుంది.క్యాపిటల్ బడ్జెట్: మూలధన వసూళ్లు, మూలధన వ్యయాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి.ఫినాన్స్ బిల్ (ఆర్థిక బిల్లు): బడ్జెట్లో ప్రతిపాదించిన పన్నుల మార్పులను అమలు చేయడానికి రూపొందించే చట్టప్రతిపాదన.క్యాపిటల్ ఎక్స్పెండీచర్ (మూలధన వ్యయం): ఆస్తుల కొనుగోలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు వంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేసే ఖర్చు.రెవెన్యూ ఎక్స్పెండీచర్ (రెవెన్యూ వ్యయం): జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు వంటి తక్షణ వినియోగ ఖర్చులు.ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్యలోటు): ప్రభుత్వ మొత్తం వ్యయం, రుణం కాని వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే లోటు.ప్రైమరీ డెఫిసిట్ (ప్రాథమిక లోటు): ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపులను మినహాయించిన మొత్తం.రెవెన్యూ డెఫిసిట్ (రెవెన్యూ లోటు): రెవెన్యూ వ్యయం, రెవెన్యూ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది.గ్రాస్ ఫిస్కల్ డెఫిసిట్ (స్థూల ద్రవ్యలోటు): ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అవసరమైన మొత్తం రుణ పరిమాణం.నెట్ ఫిస్కల్ డెఫిసిట్ (నికర ద్రవ్యలోటు): ప్రభుత్వం ఇచ్చే నికర రుణాలను మినహాయించిన ద్రవ్యలోటు.క్యాపిటల్ రిసీట్స్ (మూలధన వసూళ్లు): రుణాలు, పెట్టుబడుల ఉపసంహరణ, రుణ రికవరీలు మొదలైనవి.రెవెన్యూ రిసీట్స్ (రెవెన్యూ వసూళ్లు): పన్నులు, పన్నుయేతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం.డైరెక్ట్ ట్యాక్స్ (ప్రత్యక్ష పన్నులు): ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వంటి నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులు.ఇన్డైరెక్ట్ ట్యాక్స్ (పరోక్ష పన్నులు): జీఎస్టీ వంటి వస్తువులు, సేవలపై విధించే పన్నులు. -
1950లో బడ్జెట్ లీక్!.. తర్వాత ఏం జరిగిందంటే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రజెంటేషన్కు ముందు అనేక సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి హల్వా వేడుక. హల్వా వేడుకతో బడ్జెట్ పత్రాల ముద్రణకు అనుమతి లభిస్తుంది. ప్రింటింగ్ ప్రక్రియ సాధారణంగా ప్రభుత్వ ప్రెస్ ఉన్న నార్త్ బ్లాక్ నేలమాళిగలో (అండర్ గ్రౌండ్) జరుగుతుంది.ఒకప్పుడు రాష్ట్రపతి భవన్ ప్రెస్లో..గతంలో బడ్జెట్కు సంబంధించిన డాక్యుమెంట్ ప్రింటింగ్ అనేది.. ఈ నార్త్ బ్లాక్లో జరిగేది కాదు. ఎందుకంటే 1950లో జాన్ మథాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర బడ్జెట్ వివరాలు లీక్ అయ్యాయి. అప్పుడు డాక్యుమెంట్ ప్రింటింగ్ రాష్ట్రపతి భవన్ ప్రెస్లో జరిగింది. కేంద్ర బడ్జెట్ లీక్ అవ్వడంతో మథాయ్ కూడా రాజీనామా చేశారు.తరువాత నార్త్ బ్లాక్కు..ఎప్పుడైతే బడ్జెట్ లీక్ అయిందో.. వెంటనే ప్రింటింగ్ చేసే ప్రదేశాన్ని కూడా మార్చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్ నుంచి మింటో రోడ్లోని మరింత సురక్షితమైన సదుపాయానికి మార్చడానికి దారితీసింది. ఆ తరువాత 1980లో మళ్ళీ బడ్జెట్ ముద్రణ ప్రదేశం నార్త్ బ్లాక్కు మారింది. ఆ తరువాత ప్రదేశం మారలేదు, కాబట్టి నేటికీ ఇక్కడే బడ్జెట్ ముద్రణ జరుగుతోంది.బడ్జెట్ ముద్రణ సమయంలో చాలా కఠినమైన భద్రతలు ఉంటాయి. ఇది కూడా చాలా రహస్యంగా జరుగుతుందని సమాచారం. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు 'లాక్-ఇన్' వ్యవధికి లోబడి ఉంటారు. అంటే వీరు కొన్ని రోజులు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు. వారందరూ కనీసం ఫోన్లను కూడా ఉపయోగించకూడదు. ఆర్థిక మంత్రి లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాతే వాళ్లందరూ బయటకు రావడానికి అనుమతిస్తారు.ఇదీ చదవండి: బ్రిటిష్ సంప్రదాయానికి చెక్.. 1999లో మారిన బడ్జెట్ టైమ్నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. -
ఎరువుల దిగుమతి భారం తగ్గించేలా చర్యలు
దేశీయంగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. రాబోయే బడ్జెట్లో ‘ఎరువుల స్వావలంబన మిషన్’ (Mission for Self Reliance in Fertilizer) పేరిట ఒక భారీ పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ మిషన్ ద్వారా ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించడంతో పాటు, ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహానికి పెద్దపీట వేయనున్నారు.లక్ష్యాలు, గడువుప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మిషన్ ద్వారా స్పష్టమైన కాలపరిమితితో కూడిన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఐదేళ్లలో ఎరువుల దిగుమతులను కనీసం 20 శాతం తగ్గించనున్నారు. పదేళ్లలో దిగుమతులను 35 శాతం వరకు కట్టడి చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఏటా వీటి విక్రయాలను 6–7 శాతం తగ్గించడం ద్వారా ప్రస్తుత మితిమీరిన వినియోగాన్ని అదుపులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.రికార్డు స్థాయికి చేరిన విక్రయాలు2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం ఎరువుల విక్రయాలు 655.94 లక్షల టన్నులకు చేరి సరికొత్త రికార్డును సృష్టించాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఎరువుగా యూరియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.2024-25 ఆర్థిక సంవత్సరంలో యూరియా విక్రయాలు 387.92 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 8.4 శాతం వృద్ధిని సూచిస్తుంది.నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ మిశ్రమంతో కూడిన సంక్లిష్ట ఎరువుల (NPK) వినియోగంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇవి 28.2 శాతం వృద్ధితో 149.72 లక్షల టన్నుల విక్రయాలను నమోదు చేశాయి.పొటాష్ ఎరువుల విషయానికి వస్తే, ఎంఓపీ (మూరియేట్ ఆఫ్ పొటాష్) విక్రయాలు అత్యధికంగా 33.9 శాతం వృద్ధి చెంది 22.02 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.అన్ని ఎరువుల విక్రయాలు పెరిగినప్పటికీ DAP (డై-అమోనియం ఫాస్ఫేట్) విక్రయాల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. గతంలో 109.74 లక్షల టన్నులుగా ఉన్న DAP విక్రయాలు, ఈసారి 96.28 లక్షల టన్నులకు పరిమితమయ్యాయి. నవంబర్ మధ్య వరకు నెలకొన్న సరఫరా కొరత కారణంగానే ఈ తగ్గుదల నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.సబ్సిడీ భారం.. సమన్వయ వ్యూహంప్రస్తుత బడ్జెట్ అంచనాల ప్రకారం ఎరువుల సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.1,67,899.5 కోట్లు కేటాయించింది. అయితే, ఫాస్ఫేటిక్, పొటాష్ ఎరువుల సబ్సిడీని రూ.49,000 కోట్ల నుంచి ఏకంగా రూ.75,000 కోట్లకు పెంచాల్సి వచ్చింది. ఈ భారీ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది.1. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ‘పీఎం-ప్రణామ్’ పథకాన్ని కొత్తగా రాబోయే ఎరువుల మిషన్లో విలీనం చేయాలని యోచిస్తున్నారు.2. ‘నేచరల్ ఫార్మింగ్ మిషన్’కు నిధుల కేటాయింపులను పెంచి రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవ ఎరువులను ప్రోత్సహించడం.3. తక్కువ ఎరువులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా కొత్త వంగడాలు, సాంకేతికతలను అభివృద్ధి చేసే బాధ్యతను భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR)కి అప్పగించనున్నారు.రసాయన ఎరువుల వాడకం పర్యావరణంపై, ప్రభుత్వ ఖజానాపై చూపుతున్న ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ ‘ఎరువుల మిషన్’ ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య చాలా రోజులుగా ఊరిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఈయూ ట్రేడ్ కమిషనర్ మారోస్ సెఫ్కోవిచ్ ఆశాభావం వ్యక్తం చేశారు.కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అనంతరం సెఫ్కోవిచ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘గత ఏడాది కాలంగా జరుగుతున్న నిరంతర సంప్రదింపులు ఈ ఒప్పందం ప్రాధాన్యతను చాటుతున్నాయి. చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని నమ్మకంగా చెప్పగలను’ అని పేర్కొన్నారు.గణతంత్ర వేడుకల వేళ కీలక పరిణామాలుప్రస్తుతం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా న్యూఢిల్లీ పర్యటిస్తున్నారు. మంగళవారం జరగనున్న భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశం ఈ ఒప్పందానికి సంబంధించి అత్యంత కీలకం కానుంది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇప్పటికే ఈయూ నేతలతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో చర్చలు భారత్-ఈయూ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ఇటీవల దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.భారత ప్రయోజనాలుటెక్స్టైల్స్, లెదర్, ఫుట్వేర్ వంటి రంగాలకు యూరప్ మార్కెట్లలో భారత్ ఎగుమతులకు సున్నా సుంకం (Zero Duty) లభించే అవకాశం ఉంది. దాంతో బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో భారత ఎగుమతిదారులు దీటుగా పోటీ పడవచ్చు. ఇదిలాఉండగా, వైన్, ఇతర మద్యపాన పానీయాలపై టారిఫ్ తగ్గించాలని ఈయూ డిమాండ్ చేస్తోంది. యూరోపియన్ ప్రీమియం కార్ల కోసం ప్రత్యేక కోటా వ్యవస్థ ఉండాలని కోరుతోంది. ప్రధాన సవాళ్లుచర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ సుస్తిరత అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా ఈయూ ప్రతిపాదించిన ‘కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (CBAM)’ వల్ల భారతీయ ఎగుమతిదారులపై పడే అదనపు భారం గురించి ఇరు పక్షాలు సుదీర్ఘంగా చర్చిస్తున్నాయి. సాధారణంగా వస్తువుల తయారీలో ఎంత మేర గ్రీన్ హౌస్ వాయువులు (ముఖ్యంగా కార్బన్డయాక్సైడ్) విడుదలయ్యాయో లెక్కగట్టి దాని ఆధారంగా ఈ పన్ను విధిస్తారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
వ్యూహాత్మక వృద్ధి దిశగా అడుగులు
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడీ కాదు.. అది దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక సమగ్ర విధాన పత్రం. 2026 బడ్జెట్పై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025లో చేపట్టిన కీలక కార్పొరేట్ సంస్కరణలను కొనసాగిస్తూనే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా వ్యూహాత్మక మార్పులకు కేంద్రం సిద్ధమవుతోంది.సంస్కరణల కొనసాగింపుగత ఏడాది ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (వ్యాపార నిర్వహణ సౌలభ్యం)లో భాగంగా అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తూ కార్పొరేట్ విధానాలను సరళీకరించేందుకు ఎంసీఏ వీ3 ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డైరెక్టర్ల కేవైసీ ప్రక్రియను సులభతరం చేసింది. చిన్న కంపెనీలకు ఊతం ఇచ్చేలా వాటి విలీనాలు, ఇతర అనుబంధ సంస్థల విడదీత కోసం ఫాస్ట్ట్రాక్ విధానాన్ని విస్తరించింది. దాంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ వివాదాల మధ్య కూడా భారత్ స్థిరమైన విదేశీ పెట్టుబడులను (FDI) ఆకర్షించగలిగింది. ఈ ఊపును 2026లోనూ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.రక్షణ రంగంలో సడలింపులు?రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్లో రక్షణ రంగ విదేశీ పెట్టుబడుల పరిమితిని సవరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐదో తరం యుద్ధ విమానాల తయారీ, కీలక విడిభాగాల ఉత్పత్తి కోసం పెట్టుబడులను పెంచడం ద్వారా గ్లోబల్ కంపెనీలను భారత్కు రప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పౌర, రక్షణ డ్రోన్ల తయారీలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశీయ సరఫరా గొలుసును బలోపేతం చేసే ప్రకటనలు వెలువడవచ్చని నిపుణులు భావిస్తున్నారు.సెమీకండక్టర్ మిషన్భవిష్యత్తు అవసరాలైన సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ రంగాలకు ఈ బడ్జెట్ పెద్దపీట వేయనుంది. రీసైక్లింగ్ ద్వారా ఖనిజాలను పొందడంపై దృష్టి సారించేలా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దేశీయ ఎకోసిస్టమ్ను నిర్మించే స్టార్టప్లకు ప్రత్యేక ప్రోత్సాహకాల అందించేందుకు సెమీకండక్టర్ మిషన్ తోడ్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సమగ్ర కృత్రిమ మేధ (AI) ఫ్రేమ్వర్క్ను ఏర్పాటును వేగవంతం చేస్తారని చెబుతున్నారు.వాణిజ్య ఒప్పందాలు2025-26 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సూచించినట్లుగా ఎగుమతుల వృద్ధికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAs) కీలకం కానున్నాయి. ప్రధాన దేశాలతో పెండింగ్లో ఉన్న ఒప్పందాలను ముగించడం ద్వారా భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మార్గం సుగమం చేయడమే దీని లక్ష్యం.కార్పొరేట్ చట్టాల సరళీకరణ‘కంపెనీస్ (సవరణ) బిల్లు-2025’ ద్వారా కార్పొరేట్ నేరాల డీక్రిమినలైజేషన్ (శిక్షల తొలగింపు) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చిన్నపాటి సాంకేతిక లోపాలకు జైలు శిక్షల వంటివి తొలగించి జరిమానాలతో సరిపెట్టడం ద్వారా వ్యాపారవేత్తల్లో భరోసా కల్పించాలని చూస్తోంది. వీటితో పాటు స్టాంప్ డ్యూటీ సంస్కరణలు, ఏపీఐ(ఫార్మా) తయారీకి ప్రోత్సాహకాలు, వైద్య పరికరాల పునర్నిర్మాణ విధానం తీసుకువచ్చేలా చర్యలు సాగుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..
పన్నులు తగ్గించాలని, బయో ఇంధనాలకు నిధుల మద్దతును వచ్చే బడ్జెట్లో (2026 –27) ప్రకటించాలంటూ వ్యవసాయం, అనుబంధ రంగాలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరాయి. ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సంస్కరణల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత వ్యవసాయ రంగం పోటీపడే విధంగా, వృద్ధికి చోదకంగా తీర్చిదిద్దాలని సూచించారు.బయో ఇంధనాలు, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (పెట్రోలియానికి ప్రత్యామ్నాయ ఇంధనం), గ్రీన్ హైడ్రెజన్కు రూ.2,500 కోట్లు కేటాయించాలని ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ (ఏఐఎస్టీఏ) డిమాండ్ చేసింది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న చక్కెర మిల్లులు బయో ఇంధన కేంద్రాలుగా (ఇథనాల్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు) అవతరించేందుకు మరో రూ.2,500 కోట్లు కేటాయించాలని కోరింది.ఒక కిలో హైడ్రోజన్ కోసం 70 యూనిట్ల విద్యుత్ అవసరమని.. అదే హైడ్రోజన్ తయారీకి ఇథనాల్ వినియోగించినట్టయితే చక్కెర పరిశ్రమకు మేలు జరుగుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని, లీటర్ ఇథనాల్ కొనుగోలు ధరను రూ.6–8 పెంచాలని కోరింది. చక్కెర కిలో కనీస విక్రయ ధరను రూ.31 నుంచి పెంచాలని డిమాండ్ చేసింది. ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలి.. అవశేషాలు లేని, పోషకాలు పుష్కలంగా ఉండే సాగును ప్రోత్సహించాలని సొల్యుబుల్ ఫెర్టిలైజర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రాజిబ్ చక్రవర్తి కేంద్రాన్ని కోరారు. సబ్సిడీల్లేని సొల్యుబుల్, ఆర్గానిక్, మైక్రో న్యూట్రియంట్, స్టిమ్యులంట్ ఫెర్టిలైజర్ను కీలక పదార్థాలుగా గుర్తించాలని సూచించారు. పెరిగిపోయిన వాతావరణ మార్పులు, అధి క సాగు వ్యయాలు, కారి్మకుల వ్యయాలతో కాఫీ రంగం సంక్షోభం ఎదుర్కొంటున్నట్టు కేలచంద్ర కాఫీ ఎండీ రాణా జార్జ్ పేర్కొన్నారు. సాగు బీమాతోపాటు, దీర్ఘకాలానికి రుణ సాయం అందించాలని కోరారు. వాతావరణ మార్పులను తట్టుకోగల రకాలపై పరిశోధనలకు పెట్టుబడుల సాయం అందించాలని డిమాండ్ చేశారు. -
పన్ను వసూళ్లలో ‘పవర్’ఫుల్ భారత్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక యవనికపై భారత్ తనదైన ముద్ర వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ వడివడిగా పరుగులు పెడుతుండటంతో పాటు.. ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీనితో పన్ను వసూళ్ల విషయంలో పలు అభివృద్ధి చెందుతున్న దేశాలను భారత్ వెనక్కి నెట్టిందని ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ తన తాజా పరిశోధన నివేదికలో స్పష్టం చేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పన్నుల ఆదాయ నిష్పత్తి ప్రస్తుతం 19.6 శాతానికి చేరినట్లు తెలిపింది. డిజిటలైజేషన్, పన్నుల సరళీకరణ విధానాలే ఈ వృద్ధికి ఇంధనంగా మారాయని నివేదిక విశ్లేషించింది. సంస్కరణల ఫలితమే ఈ జోరు... పన్నుల వసూళ్లు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలేనని నివేదిక తేల్చిచెప్పింది. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడం, జీఎస్టీని సమర్థవంతంగా అమలు చేయడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, పన్ను విధానాల్లో పారదర్శకత పెంచడం, కార్పొరేట్ పన్నుల హేతుబదీ్ధకరణ, అనధికారిక ఆర్థిక వ్యవస్థను అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం వంటి ఈ చర్యల వల్ల రానున్న రోజుల్లో పన్ను ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది. ముఖ్యంగా ’వివాద్ సే విశ్వాస్’ వంటి పథకాలు, పన్ను ఎగవేతలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు .. పారదర్శకతను పెంచాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ‘నూతన ఆదాయ పన్ను చట్టం–2025’ దేశ పన్నుల చరిత్రలో మరో కీలక మలుపు కానుందని నివేదిక అంచనా వేసింది. అగ్రరాజ్యాలకు ఆమడ దూరంలోనే.. నివేదిక ప్రకారం పన్ను వసూళ్లలో పురోగతి సాధించినప్పటికీ .. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మాత్రం భారత్ ఇంకా వెనుకబడే ఉంది. ఆయా దేశాల పన్ను ఆదాయ నిష్పత్తితో పోలిస్తే మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. యూరప్ అగ్రరాజ్యం జర్మనీలో ట్యాక్స్–టు–జీడీపీ రేషియో ఏకంగా 38 శాతంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇది 25.6 శాతంగా నమోదైంది. వీటితో పోలిస్తే 19.6 శాతంతో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. అయితే మన జనాభా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో ఈ అంతరాన్ని తగ్గించే సత్తా భారత్కు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆసియాలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన హాంకాంగ్, మలేషియా, ఇండోనేషియా వంటి వర్ధమాన దేశాల కంటే భారత్ మెరుగైన పనితీరు కనబరుస్తుండటం విశేషం. ఈ విషయంలో మనం ఇతర వర్ధమాన మార్కెట్లయిన హాంకాంగ్ (13.1%), మలేషియా (13.1%), ఇండోనేషియా (12.0%) కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాం. ఆయా దేశాలకంటే మన పన్ను వసూళ్ల నిష్పత్తి ఎక్కువగా ఉండటం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది. కరోనా సమయంలో పన్నుల ఆదాయం తగ్గినప్పటికీ, ఆ తర్వాత భారత్ అద్భుతంగా పుంజుకుంది. -
బ్రిటిష్ సంప్రదాయానికి చెక్.. 1999లో మారిన బడ్జెట్ టైమ్
2026 ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. అయితే ఈ టైమ్ 1999 నుంచి మారిపోయింది. టైమ్ ఎందుకు మారింది?, దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.1999 వరకు బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకు సమర్పించడం ఆనవాయితీ ఉండేది. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేది. అప్పట్లో లండన్.. భారతదేశంలో ఏకకాలంలో బడ్జెట్ ప్రకటనలు ఉండేవని సమాచారం. ఇండియా టైమ్.. యూకే కంటే 5 గంటల 30 నిమిషాలు ముందున్నందున, భారతదేశంలో సాయంత్రం 5 గంటల సమయం GMT (లండన్లోని గ్రీన్విచ్ వద్ద ఉన్న ప్రైమ్ మెరిడియన్ ఆధారంగా లెక్కించే ప్రపంచ ప్రామాణిక సమయం) ఉదయం 11:30కి అనుగుణంగా ఉంది. దీని వలన బ్రిటిష్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రకటనలను సమన్వయం చేయడం సులభతరం అయ్యేది. ఇదే ప్రక్రియ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది.1999లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: దేశంలో తొలి బడ్జెట్.. ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లేనా?భారత్ బ్రిటీష్ వారి సొత్తు కాదు, కాబట్టి లండన్ టైమ్ జోన్ను అనుసరించాల్సిన అవసరం లేదని.. బడ్జెట్ను అధ్యయనం చేయడానికి, చర్చించడానికి చట్టసభ సభ్యులు & అధికారులకు మరింత సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 27, 1999న యశ్వంత్ సిన్హా మొదటిసారిగా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ను సమర్పించారు. ఈ కొత్త సమయం శాశ్వత మార్పుగా మారింది. అప్పటి నుండి, అన్ని యూనియన్ బడ్జెట్లు ఉదయం 11 గంటలకు సమర్పించడం ఆనవాయితీగా మారింది. -
దేశంలో తొలి బడ్జెట్.. ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లేనా?
ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడుకుంటున్న అంశం యూనియన్ బడ్జెట్ 2026. కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే చాలామందికి ఈ బడ్జెట్ ఎప్పుడు ప్రారంభమైంది? దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? అనే విషయాలు తెలిసి ఉండవు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.1860లో మొదటి బడ్జెట్1860లో భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' ఏప్రిల్ 7న తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లే అన్నమాట. అయితే ఈ బడ్జెట్ వలస పాలకుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్లకు అప్పటి బడ్జెట్ పూర్తిగా భిన్నంగా ఉండేది.స్వాతంత్య్రం వచ్చిన తరువాతభారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కాదు. 1948 ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉండటంతో, ఈ బడ్జెట్ను ఒక మధ్యంతర బడ్జెట్గా ప్రవేశపెట్టారు.వీటికే ప్రాధాన్యతతొలి బడ్జెట్లో అభివృద్ధి కంటే పరిపాలన, భద్రత, పునరావాసం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయంతొలి బడ్జెట్లో ఒక విశేష అంశం ఉంది. అదేమిటంటే.. భారత్, పాకిస్తాన్ రెండూ 1948 సెప్టెంబర్ వరకు ఒకే కరెన్సీని ఉపయోగిస్తాయి అని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. ఇండియా, పాక్ విభజన జరిగినప్పటికీ.. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా విడిపోలేదు. అయితే ఆర్థికంగా విడిపోవడం ఒక దశలవారీ ప్రక్రియగా కొనసాగిందన్నమాట.నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి.. -
కొన్నది కొంతే.. ఆర్బీఐకి బంగారం చేదైందా?!
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ పసిడి కొనుగోళ్లను పెంచుకుంటుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాత్రం తగ్గిస్తోంది. 2025లో ఆర్బీఐ తన బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, 2025లో ఆర్బీఐ కేవలం 4.02 టన్నుల బంగారమే కొనుగోలు చేసింది. ఇది 2024లో కొనుగోలు చేసిన 72.6 టన్నులతో పోలిస్తే దాదాపు 94 శాతం భారీ తగ్గుదల.ప్రపంచ కేంద్ర బ్యాంకుల ధోరణిప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఇటీవలి సంవత్సరాల్లో బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. 2025 డిసెంబర్ నాటికి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల వద్ద మొత్తం 32,140 టన్నుల బంగారం ఉంది. ఇక కొనుగోళ్ల విషయానికి వస్తే 2022లో అన్ని కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 1,082 టన్నులు కాగా 2023లో 1,037 టన్నులుగా ఉన్నాయి. 2024లో రికార్డు స్థాయిలో 1,180 టన్నులకు చేరాయి. 2025లోనూ 1,000 టన్నులకుపైగా ఉంటాయని అంచనా.అయితే, కొనుగోళ్లు తగ్గినప్పటికీ ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సుమారు 880.2 టన్నుల బంగారం ఉంది. 2025 నవంబర్ నాటికి ఈ బంగారం నిల్వల విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది.విదేశీ మారక నిల్వల్లో పెరిగిన బంగారం వాటాభారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా కూడా గణనీయంగా పెరిగింది. ఒక సంవత్సరంలో బంగారం వాటా 10% నుంచి 16%కి పెరిగింది. 2021 మార్చిలో ఇది కేవలం 5.87% మాత్రమే. అంటే, గత ఐదేళ్లలో ఆర్బీఐ తన నిల్వల్లో బంగారం ప్రాధాన్యతను దాదాపు మూడు రెట్లు పెంచింది.కొనుగోళ్లు ఎందుకు తగ్గాయి?బంగారం ధరలు అత్యధికంగా ఉండటం, అలాగే ఆర్బీఐ నిల్వల్లో ఇప్పటికే బంగారం వాటా గణనీయంగా పెరగడం వల్ల, ఇప్పుడు ఆర్బీఐ కొత్త కొనుగోళ్ల కంటే ఉన్న నిల్వల సమతుల్య నిర్వహణపై దృష్టి పెడుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది.ఆర్బీఐ బంగారం ఎక్కడ ఉంది?ఆర్బీఐకి చెందిన బంగారం మొత్తం భారతదేశంలోనే నిల్వ ఉండదు. 2025 మార్చి నాటికి భారత్ మొత్తం బంగారం నిల్వలు 879.59 టన్నులు కాగా ఇందులో భారత్లో నిల్వ చేసింది సుమారు 512 టన్నులు. మిగిలిన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద భద్రపరిచింది. కొంత భాగం బంగారం నిక్షేపాల (Gold Deposits) రూపంలో కూడా ఉంది. -
రూపాయి విలవిల..
ముంబై: డాలరు డామినేషన్కు రూపాయి విలవిల్లాడుతోంది. విలువ అంతకంతకూ కరిగిపోతోంది. తాజాగా శుక్రవారం డాలర్ మారకంలో 32 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 91.90 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం, అంతర్జాతీయ అనిశి్చతులు రూపాయి పతనానికి ప్రధాన కారణమయ్యాయి. అలాగే క్రూడాయిల్ ధరల ర్యాలీ, అమెరికా బాండ్లపై రాబడులు పెరగడమూ ఒత్తిడి పెంచాయని నిపుణులు తెలిపారు. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 91.45 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఒక దశలో 42 పైసలు క్షీణించి 92.00 వద్ద చరిత్రాత్మక ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ బలోపేతం, ఎఫ్ఐఐల విక్రయాల ప్రభావంతో గతేడాదిలో 5% క్షీణించి రూపాయి... 2026లో జనవరి 23 వరకు 2% (202 పైసలు) పతనమైంది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో రిస్క్ సామర్థ్యం తగ్గడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల కొనసాగింపు ఒత్తిళ్ల ప్రభావంతో రూపాయి మరింత క్షీణించే వీలుంది. వచ్చే వారం నెలాఖరు కావడంతో దిగుమతిదారులు, హెడ్జర్ల నుంచి డాలర్ల్ల డిమాండ్ నెలకొనవచ్చు. రానున్న రోజుల్లో 91.60 – 92.30 శ్రేణిలో ట్రేడవ్వొచ్చు’’ అని మిరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ విశ్లేషకుడు అనుజ్ చౌదరీ తెలిపారు. -
పరుగు ఆపని పసిడి
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా జోడు గుర్రాల్లా పరిగెడుతున్న వెండి, బంగారం మరోసారి కదంతొక్కాయి. స్పాట్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల పసిడి 10 గ్రాములు రూ. 1,500 బలపడి రూ. 1,58,700కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ. 9,500 జంప్చేసి రూ. 3,29,500ను తాకింది. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా బంగారం, వెండి సరికొత్త రికార్డులను సాధించాయి. కేజీ వెండి తాజాగా 4 శాతం జంప్చేసింది. ఎంసీఎక్స్లో మార్చి కాంట్రాక్ట్ రూ. 12,638 బలపడి రూ. 3,39,927ను తాకింది. ఇదే బాటలో బంగారం 10 గ్రాములు 2 శాతం(రూ. 2,885) ఎగసింది. ఫిబ్రవరి డెలివరీ రూ. 1,59,226కు చేరింది. బుధవారం వెండి(కేజీ) రూ. 3,35,521 వద్ద, గురువారం పసిడి(10 గ్రా.) రూ. 1,56,341 వద్ద చారిత్రక గరిష్టాలకు చేరిన విషయం విదితమే. వెరసి బంగారం వరుసగా ఐదో రోజు లాభపడింది. ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు 98.31కు వెనకడుగు వేయడం, యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టవచ్చన్న అంచనాలు విలువైన లోహాలకు డిమాండ్ పెంచుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా సిల్వర్ సెంచరీ..యూఎస్ కామెక్స్లోనూ వెండి, బంగారం గరిష్ట ధరలతో ధగధగలాడుతున్నాయి. ఔన్స్ వెండి చరిత్రలో తొలిసారి 100 డాలర్లను దాటగా.. బంగారం అంచనాలను నిజం చేస్తూ ఔన్స్(31.1 గ్రా.) 5,000 డాలర్ల సమీపానికి చేరింది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 3.7 డాలర్లు ఎగసి 100 డాలర్లను తాకింది. గోల్డ్ ఫిబ్రవరి కాంట్రాక్ట్ 4,989.54 డాలర్లను తాకింది. వెరసి 2020 మార్చి తదుపరి ఈ వారం అత్యధికంగా లాభపడినట్లు నిపుణులు వెల్లడించారు. -
కేంద్ర బడ్జెట్ 2026: ఈసారి రూ.3 లక్షల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టుల కోసం రూ.3 లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించాలని లాజిస్టిక్స్ రంగ నైపుణ్య మండలి (ఎల్ఎస్సీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మౌలిక రంగానికి సంబంధించి భారీ సంస్కరణలు చేపట్టాలని, బడ్జెట్లో కేటాయింపులను పెద్ద మొత్తంలో పెంచాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాల కోసం, రహదారుల నిర్మాణం, పట్టణరవాణా, స్మార్ట్ సిటీల కోసం రూ.1.5 లక్షల కోట్లు కేటాయించగా, ఈ విడత రెట్టింపు చేయాలన్నది లాజిస్టిక్స్ రంగం డిమాండ్గా ఉంది. దేశ ఆర్థిక వృద్ధిలో లాజిస్టిక్స్ రంగం కీలక పాత్ర పోషిస్తున్నట్టు లాజిస్టిక్స్ రంగ నైపుణ్య మండలి సీఈవో రవికాంత్ యమర్తి తెలిపారు. బడ్జెట్ 2026 వృద్ధి, ఉపాధి కల్పన, ఆత్మనిర్భర్ భారత్ దిశగా కొత్త బెంచ్మార్క్ ఏర్పాటుకు ఒక అవకాశమని చెప్పారు.జాతీయ రహదారులు, రైల్వేలు, లాజిస్టిక్స్ కారిడార్లపై కొన్నేళ్లుగా చేస్తున్న పెట్టుబడులను గుర్తు చేస్తూ.. ఈ రంగానికి కేటాయింపులను రెట్టింపు చేయడం ద్వారా సరఫరా వ్యవస్థ బలపడుతుందని, అంతర్జాతీయంగా పోటీతత్వం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు, పోటీతత్వాన్ని పెంచేందుకు, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ప్రయోజనాలను అందించేందుకు స్థిరమైన మౌలిక సదుపాయాల ప్రణాళికలు అవసరమమంటూ పరిశ్రమ ప్రభుత్వానికి సూచించింది. వినియోగానికి ఊతం.. వినియోగం తదుపరి దశ వృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కీలకమని గోదావత్ గ్రూప్ ఎండీ శ్రేణిక్ గోదావత్ పేర్కొన్నారు. ‘‘రిటైల్ ఆధారిత సదుపాయాల కల్పనకు వచ్చే బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆధునిక గోదాములు, కోల్డ్ చైన్ సదుపాయాలు, మారుమూల ప్రాంతాలకు రవాణా సదుపాయాల విస్తరణ కారిడార్లకు ప్రాధాన్యం ఇవ్వాలి’’అని కోరారు. -
కేంద్ర బడ్జెట్ 2026: పన్ను రాయితీలు కల్పించాలి
న్యూఢిల్లీ: వచ్చే బడ్జెట్లో తమకు పన్నుల్లో రాయితీలు కల్పించాలని, సుంకాలను క్రమబద్దీకరించాలని, అంతర్జాతీయంగా బ్రాండింగ్, మార్కెటింగ్కు సహకారం అందించాలని ఎగుమతి దారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇన్వర్టెడ్ కస్టమ్స్ డ్యూటీ స్ట్రక్చర్ పరంగా ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.తుది ఉత్పత్తుల కంటే విడిభాగాలు, ముడి సరుకులపై పన్ను రేట్లు అధికంగా ఉండడాన్ని ఇన్వర్టెడ్ కస్టమ్స్ డ్యూటీ స్ట్రక్చర్గా చెబుతారు. ఎగుమతులకు ఉద్దేశించిన కీలక విడిభాగాలు, ముడి సరుకుల దిగుమతులపై సుంకాలను క్రమబద్దీకరించాలని, దీనివల్ల తయారీ వ్యయాలు దిగొస్తాయని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) పేర్కొంది. తుది వ్రస్తాల కంటే సింథటిక్ యార్న్, ఫైబర్పై కస్టమ్స్ డ్యూటీ అధికంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఇది టెక్స్టైల్ వ్యాల్యూ చైన్పై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని పేర్కొంది.అలాగే, ఎల్రక్టానిక్స్ తుది ఉత్పత్తుల కంటే ఎలక్టాన్రిక్స్ విడిభాగాలైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, కనెక్టర్లు, సబ్ అసెంబ్లీలపై అధిక సుంకాలు పడుతున్నాయంటూ.. ఇది దేశీయంగా వ్యాల్యూ చైన్పై ప్రభావం చూపిస్తున్నట్టు వివరించింది. కెమికల్, ప్టాస్టిక్స్ రంగంలోనూ ముడి పదార్థాలలైన కెమికల్స్, పాలీమర్స్పై అధికంగా సుంకాలు అమలవుతున్నాయని, లెదర్ పరిశ్రమలోనూ ఇదే విధానం ఉన్నట్టు తెలిపింది.‘‘కనుక ముడి సరుకులపై సుంకాలను తగ్గించడం ద్వారా ఈ లోపాలకు చెక్ పెట్టాలి. దీనివల్ల తయారీ వ్యయాలు తగ్గుతాయి. మూలధన నిధుల పరంగా ఒత్తిళ్లు తగ్గుతాయి. దేశీ తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. భారత ఎగుమతుల పోటీతత్వం పెరుగుతుంది’’అని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ పేర్కొన్నారు.ప్రపంచస్థాయి షిప్పింగ్ లైన్స్.. ప్రపంచ స్థాయి షిప్పింగ్ లైన్స్ (ఆపరేటర్లు) అభివృద్ధికి విధానపరమైన, ద్రవ్యపరమైన మద్దతు అందించాలని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ రల్హాన్ కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం విదేశీ షిప్పింగ్ లైన్స్పై ఆధారపడడం వల్ల రవాణా కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తున్నట్టు చెప్పారు. సరఫరా వ్యవస్థలో సమస్యలను, రవాణా చార్జీల్లో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు తెలిపారు.ఇక కొత్త తయారీ యూనిట్లకు 15 శాతం రాయితీ కార్పొరేట్ పన్ను రేటును మరో ఐదేళ్ల కాలానికి పొడిగించాలని కూడా కోరారు. రాయితీ రేట్లపై రుణాలను అందించాలని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) కేంద్రానికి సూచించింది. టెక్స్టైల్ మెషినరీపై జీఎస్టీని తగ్గించాలని, చిన్న యూనిట్లకు టెక్నాలజీ నవీకరణ కోసం పథకాన్ని ప్రకటించాలని ఏఈపీసీ చైర్మన్ శక్తివేల్ డిమాండ్ చేశారు. -
సిల్వర్ స్పీడుకు బ్రేక్
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి, వెండి ధరల పరుగుకు కాస్త బ్రేక్ పడింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం గురువారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛమైన పుత్తడి 10 గ్రాముల ధర రూ. 2,500 తగ్గి రూ. 1,57,200 వద్ద ముగిసింది. అటు తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేసిన వెండి ధర కిలోకి రూ. 14,300 క్షీణించి రూ. 3,20,000కి పరిమితమైంది. రికార్డు బ్రేకింగ్ ర్యాలీల తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం, వెండి ధరల్లో కరెక్షన్ వచ్చినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూరప్ దేశాలపై టారిఫ్ల బెదిరింపులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో రెండు మెటల్స్ కాస్త నెమ్మదించినట్లు వివరించారు. భౌగోళిక–రాజకీయ రిసు్కలపై ఆందోళన కొంత తగ్గడంతో దేశీ మార్కెట్లలో పాక్షికంగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 8.80 డాలర్లు తగ్గి 4,822.65 వద్ద ట్రేడయ్యింది. వెండి మాత్రం 0.27 శాతం పెరిగి 93.36 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు, బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ పాలసీ నిర్ణయాల వెల్లడికి ముందు ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, దీంతో పసిడి, వెండి రేట్లలో హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కాయ్నాత్ చైన్వాలా తెలిపారు. -
ఇండియా ఇక ముందూ ఇదే స్పీడు..
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తోందని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. ఇక ముందూ భారత్ వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది.‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 2026 సంవత్సరం ఆరంభమైంది. వెనెజువెలాలో యూఎస్ జోక్యం చేసుకోవడం, మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై అస్పష్టత నెలకొనడం, గ్రీన్లాండ్పై వివాదం ఇవన్నీ భౌగోళిక ఆర్థిక సమస్యలను, విధానపరమైన అనిశ్చితిని పెంచేవే. ఇలాంటి తరుణంలో ఆర్థిక మూలాలు బలంగా ఉండడం రానున్న కాలానికి ఆశావాదాన్ని సూచిస్తున్నాయి. 2025–26 సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలు ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని సూచిస్తున్నాయి’’అని పేర్కొంది. అనిశ్చితుల మధ్య కూడా అంతర్జాతీయ వృద్ధి 2025లో స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. డిమాండ్ బలంగా.. డిసెంబర్ నెలకు సంబంధించి ముఖ్యమైన సూచికలు డిమాండ్ బలంగా ఉన్నట్టు సూచిస్తున్నాయని, ఇది వృద్ధికి ప్రేరణనిస్తుందని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో కొంత పెరిగినప్పటికీ, ఆర్బీఐ కనిష్ట లక్ష్యానికి దిగువనే ఉన్నట్టు గుర్తు చేసింది. వాణిజ్య రంగానికి బ్యాంక్లు, బ్యాంకింగేతర మార్గాల (కార్పొరేట్ బాండ్లు, ఎఫ్డీఐ తదితర) ద్వారా గడిచిన ఏడాది కాలంలో రుణ వితరణ పెరిగినట్టు తెలిపింది. ఏడాది క్రితం ఉన్న రూ.21.3 లక్షల కోట్ల నుంచి రూ.30.8 లక్షల కోట్లకు చేరినట్టు పేర్కొంది.ఎగుమతుల వైవిధ్యానికి, బలోపేతానికి గాను భారత్ గణనీయమైన కృషి చేసినట్టు పేర్కొంది. ప్రస్తుతం పలు దేశాలు, సమాఖ్యలతో (మొత్తం 50 దేశాలకు ప్రాతినిధ్యం వహించే) వాణిజ్య చర్చలు కొనసాగిస్తోందని గుర్తు చేసింది. న్యూజిలాండ్, ఒమన్తో చర్చలు ముగిసిపోగా, ఐరోపా సమాఖ్యతోనూ త్వరలో ముగింపునకు రానుండడం గమనార్హం. 2025లో జీఎస్టీ శ్లాబులను క్రమబద్దీకరించడం, ఆదాయపన్ను మినహాయింపులు, కార్మిక చట్టాల్లో మార్పులు వంటివి వృద్ధి అవకాశాలను బలోపేతం చేస్తాయని ఆర్బీఐ బులెటిన్ అభిప్రాయపడింది. రూపాయి క్షీణతకు ఎన్నో కారణాలు.. ఇక నుంచి ఆవిష్కరణలు – స్థిరత్వం, వినియోగదారుల రక్షణ మధ్య సమతుల్యంపై విధాపరమైన దృష్టి ఉండాలని ఆర్బీఐ బులెటిన్ సూచించింది. నియంత్రణలు, పర్యవేక్షణ పట్ల వివేకవంతమైన విధానం ఉత్పాదకత పెంపునకు, దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి సాయపడుతుందని పేర్కొంది. తన ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల కంటే భారత్లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం డిసెంబర్లో రూపాయి విలువ క్షీణతకు దారితీసినట్టు వివరించింది.అలాగే, భారత్–యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడంతో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం కూడా రూపాయి క్షీణతకు కారణమైనట్టు తెలిపింది. రూపాయిలో ఆటుపోట్లన్నవి.. ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే తక్కువే ఉన్నట్టు పేర్కొంది. 2025 ఏప్రిల్–నవంబర్ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని ఎఫ్డీఐ కంటే అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. నవంబర్లో నికర ఎఫ్డీఐ వరుసగా మూడో నెలలోనూ ప్రతికూలంగా ఉందని, స్వదేశాలకు పెద్ద మొత్తంలో నిధులు వెళ్లడమే కారణమని తెలిపింది. -
దావోస్: గ్రీన్లాండ్ మాక్కావాలి..
గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యూరోపియన్ మిత్రదేశాల నుంచి కొంత వ్యతిరేక స్పందన (pushback) వ్యక్తమవుతుండగా, ఆయన ఈ రోజు దావోస్కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి ముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) కాంగ్రెస్ హాల్లోని ‘జోన్ సిలో’ వద్ద వందలాది మంది ప్రతినిధులు క్యూకట్టారు. ట్రంప్ ప్రసంగంపై అంతర్జాతీయంగా భారీ ఆసక్తి నెలకొంది.అధ్యక్ష పదవికి ఏడాది.. ట్రంప్ ప్రశంసలుఅధ్యక్ష పదవిలో ఏడాది పూర్తి అయిన సందర్భంగా దావోస్లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ వేదికపై ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన పాలనలో సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు.“నిన్న నా ప్రమాణ స్వీకారానికి ఏడాది పూర్తైంది. ఈ రోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి ఉధృతంగా ఉంది, ఆదాయాలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గతంలో తెరిచి ఉన్న ప్రమాదకరమైన సరిహద్దులు ఇప్పుడు మూసివేయబడ్డాయి. అమెరికా తన చరిత్రలోనే అత్యంత కీలకమైన మలుపు దశలో ఉంది” అని ట్రంప్ అన్నారు.యూరప్ సరైన దిశలో లేదుడబ్ల్యూఈఎఫ్ వేదికపై మాట్లాడిన ట్రంప్, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు “గుర్తించలేనంతగా మారిపోయాయి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో “వాదనకు తావు లేదని” పేర్కొన్నారు.“నేను ఐరోపాను ప్రేమిస్తున్నాను. ఐరోపా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతం అది సరైన దిశలో ముందుకు సాగడం లేదు” అని ట్రంప్ స్పష్టం చేశారు.అలాగే, ప్రపంచంలోని సుమారు 40 శాతం దేశాలతో అమెరికా చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. వివిధ దేశాలపై విధించిన సుంకాల వల్ల అమెరికాలో భారీ వాణిజ్య లోటులు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.గ్రీన్లాండ్ కావాల్సిందే..అమెరికా, రష్యా, చైనాల మధ్య కీలకమైన వ్యూహాత్మక ప్రదేశంలో గ్రీన్లాండ్ ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికాకు ఈ ద్వీప భూభాగం దాని ఖనిజాల కోసం కాదని, "వ్యూహాత్మక జాతీయ, అంతర్జాతీయ భద్రత" కోసం అవసరమని అమెరికా అధ్యక్షుడు అన్నారు. డెన్మార్క్కు కృతజ్ఞత లేదని ట్రంప్ ఆక్షేపించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత "గ్రీన్లాండ్ ను తిరిగి ఇవ్వడం" అమెరికా "మూర్ఖత్వం" అని అన్నారు. "మేము డెన్మార్క్ కోసం గ్రీన్లాండ్లో స్థావరాలను ఏర్పాటు చేశాం. డెన్మార్క్ కోసం పోరాడాము. గ్రీన్లాండ్ను రక్షించాం. శత్రువులు అడుగు పెట్టకుండా నిరోధించాము. యుద్ధం తర్వాత మేము గ్రీన్లాండ్ ను తిరిగి డెన్మార్క్ కు ఇచ్చాము. అలా చేయడం మా తెలివి తక్కువతనం' అన్నారు. మరోవైపు గ్రీన్లాండ్ను అమెరికా కొనుగోలు చేయండం వల్ల నాటోకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. నాటోనే అమెరికాను "చాలా అన్యాయంగా" చూస్తోందని ట్రంప్ విమర్శించారు. -
అటల్ పెన్షన్ యోజన.. మరో ఐదేళ్లు పొడిగింపు
దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉన్న అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు, అంటే 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.పథకం ముఖ్యాంశాలు.. తాజా నిర్ణయాలుఈ పొడిగింపు ద్వారా పథకం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే కాకుండా క్షేత్రస్థాయిలో మరింత మందికి చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పథకం నిరంతరాయంగా సాగేందుకు అవసరమైన ‘గ్యాప్ ఫండింగ్’కు ప్రభుత్వ నిధుల మద్దతును కేంద్రం విస్తరించింది.గ్రామీణ, అనధికారిక రంగాల్లోని కార్మికులకు ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఈ పథకం కింద చేరిన వారు 60 ఏళ్ల వయసు తర్వాత తాము అందించిన సహకారం (Contribution) ఆధారంగా నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు గ్యారెంటీ పెన్షన్ పొందుతారు.8.66 కోట్ల మంది నమోదుమే 9, 2015న ప్రారంభమైన అటల్ పెన్షన్ యోజన భారత సామాజిక భద్రతా వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. అధికారిక పెన్షన్ సౌకర్యం లేని సామాన్యులను పెన్షన్ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. తాజా గణాంకాల ప్రకారం జనవరి 19, 2026 నాటికి ఈ పథకం కింద నమోదైన చందాదారుల సంఖ్య 8.66 కోట్లకు పైగా చేరింది.ఎందుకు ఈ పొడిగింపు?భారతదేశంలో మెజారిటీ కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారు. వారికి వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని కేంద్రం పేర్కొంది. పథకం అమలును మరింత బలోపేతం చేయడం, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం కోసం ప్రభుత్వ మద్దతు అవసరమని భావించి ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.అటల్ పెన్షన్ యోజన.. మరిన్ని వివరాలుఏపీవై అనేది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక సామాజిక భద్రతా పథకం. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారు (ఉదాహరణకు: డ్రైవర్లు, తోపుడు బండ్ల వ్యాపారులు, కూలీలు) తమ వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి దీన్ని రూపొందించారు.అర్హతలుభారతీయ పౌరుడై ఉండాలి.వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.దరఖాస్తుదారునికి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి (ఆధార్ అనుసంధానం అవసరం).అక్టోబర్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధన ప్రకారం ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించే వారు ఈ పథకంలో చేరడానికి అనర్హులు.సమకూరే పెన్షన్చందాదారులు 60 ఏళ్లు నిండిన తర్వాత ఐదు రకాల పెన్షన్ మొత్తాల్లో ఒక దాన్ని ఎంచుకోవచ్చు. అందులో నెలకు రూ. 1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000 లేదా రూ.5,000 స్లాబ్లున్నాయి. చందాదారులు ఎంచుకున్న పెన్షన్ మొత్తం, పథకంలో చేరినప్పటి వయసును బట్టి తాము చెల్లించాల్సిన నెలవారీ ప్రీమియం మారుతుంది.ప్రీమియం ఇలా..మీరు ఎంత త్వరగా (తక్కువ వయసులో) చేరితే ప్రీమియం అంత తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.ఉదాహరణకు: 18 ఏళ్ల వయసులో చేరి నెలకు రూ.1,000 పెన్షన్ కావాలనుకుంటే కేవలం రూ.42 చెల్లిస్తే సరిపోతుంది. అదే 40 ఏళ్ల వయసులో చేరితే రూ.291 చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం డబ్బు మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా కట్ అవుతుంది. నెలవారీ, మూడు నెలలకొకసారి లేదా ఆరు నెలలకొకసారి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.పథకం ప్రయోజనాలుమార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం కనీస పెన్షన్కు హామీ ఇస్తుంది.చందాదారుడు మరణిస్తే అదే పెన్షన్ మొత్తం వారి జీవిత భాగస్వామికి అందుతుంది.చందాదారుడు, వారి భాగస్వామి ఇద్దరూ మరణిస్తే మొత్తం పెన్షన్ ఫండ్ను నామినీకి అందజేస్తారు.సెక్షన్ 80 సీసీడీ కింద చెల్లించిన ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది.ఎలా దరఖాస్తు చేయాలి?మీకు ఖాతా ఉన్న బ్యాంకును లేదా సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి ఏపీవై (APY) దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి ఇవ్వాలి. చాలా బ్యాంకులు ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో ఈ పథకంలో చేరే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి -
గిగ్ వర్కర్ల సామాజిక భద్రతే లక్ష్యంగా ముందడుగు
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పని సంస్కృతికి అనుగుణంగా భారతదేశంలో గిగ్ (Gig), ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉపాధి రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కేవలం పార్ట్-టైమ్ ఆదాయ వనరుగా మొదలైన ఈ రంగం, నేడు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమైంది. ఈ నేపథ్యంలో గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం, నిపుణులు ప్రతిపాదిస్తున్న నూతన విధానాలపై కథనం.నీతి ఆయోగ్ అంచనాలునీతి ఆయోగ్ 2022 నివేదిక ప్రకారం, గిగ్ రంగంలో ఉపాధి పొందుతున్న వారిలో నైపుణ్యాల విభజన ఆసక్తికరంగా ఉంది.మధ్యస్థ నైపుణ్యాలు: 47%అధిక నైపుణ్యాలు: 22%తక్కువ నైపుణ్యాలు: 31%భవిష్యత్తులో అధిక, తక్కువ నైపుణ్యాలు కలిగిన గిగ్ ఉద్యోగాల వాటా మరింత పెరుగుతుందని అంచనా. ఈ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ‘సామాజిక భద్రతా కోడ్-2020’ గిగ్ కార్మికులను ప్రత్యేక వర్గంగా గుర్తించింది. ఇది వారి ఆదాయం, కెరీర్ మార్గాలకు తగిన రక్షణ కల్పించేందుకు పునాది వేసింది.మౌలిక వసతులుగిగ్ కార్మికుల కోసం కొత్తగా వ్యవస్థలను నిర్మించాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే ఉన్న డిజిటల్ మౌలిక వసతులను వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ-శ్రమ్ పోర్టల్లో ఇప్పటివరకు 31.38 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు నమోదయ్యారు. ఆధార్తో అనుసంధానమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) నంబర్ ద్వారా కార్మికులు తమ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లేదా రాష్ట్రాలు మారినా వారిని ట్రాక్ చేయడం సులభమవుతుంది. ఈ-శ్రమ్ గుర్తింపును సామాజిక భద్రతా సంస్థలతో అనుసంధానిస్తే కార్మికులు తాత్కాలిక లేదా శాశ్వత ఉద్యోగాల్లోకి మారినా రక్షణ వ్యవస్థ కొనసాగుతుంది.ఆర్థిక వృద్ధి, బీమా రక్షణకొన్ని సంస్థల గణాంకాల ప్రకారం, 2021-22 నుంచి 2023-24 మధ్య ఆహార డెలివరీ రంగం చాలా వృద్ధిని సాధించింది. ఇది సుమారు 13.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగం స్థూల ఉత్పత్తి విలువ రూ.1.2 లక్షల కోట్లను దాటింది. ఈ వృద్ధిని సామాజిక భద్రతతో ముడిపెట్టడానికి బీమా రక్షణ ఉత్తమ మార్గమని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సభ్యులకు అందుతున్న ఈడీఎల్ఐ (రూ.7 లక్షల వరకు జీవిత బీమా) పథకాన్ని గిగ్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనివల్ల సిబ్బంది ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే కుటుంబానికి భరోసా లభిస్తుంది.చిన్న మొత్తాల్లో కట్ అయ్యేలా..గిగ్ కార్మికులకు స్థిర వేతనం ఉండదు కాబట్టి, ప్రతి రైడ్ లేదా డెలివరీ పూర్తయినప్పుడు చిన్న మొత్తాన్ని (Micro-contribution) ఆటోమేటిక్గా కట్ అయ్యే లావాదేవీ ఆధారిత విధానం వీరికి అత్యంత అనుకూలమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఐటీ రంగంలో పుంజుకుంటున్న ‘డిస్క్రెషనరీ’ ఖర్చులు -
మెండుగా వ్యాపార విశ్వాసం!
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వ్యాపార విశ్వాస సూచీ ఐదు నెలల గరిష్టానికి ఎగిసింది. 2025–26 క్యూ3లో (2025 అక్టోబర్–డిసెంబర్) 66.5కు చేరింది. డిమాండ్, లాభదాయకత, పెట్టుబడులకు సానుకూల పరిస్థితులపై ఆశావహ ధోరణి నెలకొంది. అన్ని రంగాలకు చెందిన కంపెనీలు, ఎంఎస్ఎంఈలను సర్వే చేసి సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) వివరాలను విడుదల చేసింది.175కు పైగా కంపెనీలు (ప్రభుత్వ, ప్రైవేటు) అభిప్రాయాలు పంచుకున్నాయి. దేశీ డిమాండ్ కీలక చోదకంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. 2025–26 రెండో త్రైమాసికంలో (సెప్టెంబర్ క్వార్టర్) అధిక డిమాండ్ను చూసినట్టు సర్వేలో మూడింట రెండొంతుల కంపెనీలు చెప్పాయి. జీఎస్టీ శ్లాబుల కుదింపు, పండుగల సందర్భంగా వినియోగం పెరగడం సానుకూలించినట్టు సీఐఐ నివేదిక తెలిపింది. పెట్టుబడులు, నియామకాల ఉద్దేశ్యాలు బలంగా ఉన్నట్టు పేర్కొంది. మార్చిలోపు ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుందని 69 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇకమీదటా వృద్ధి నిలకడగా కొనసాగేందుకు వీలుగా బడ్జెట్లో సంస్కరణలు కొనసాగుతాయన్న నమ్మకాన్ని సీఐఐ వ్యక్తం చేసింది.వినియోగానికి జీఎస్టీ దన్ను జీఎస్టీలో శ్లాబుల సంఖ్యను కుదించడం ఫలితంగా 375కు పైగా ఉత్పత్తులపై రేట్లు దిగిరావడంతో.. తమ అమ్మకాలు 5–20 శాతం మధ్య పెరిగినట్టు సీఐఐ సర్వేలో 56.3 శాతం సంస్థలు తెలిపాయి. సాహసోపేతమైన సంస్కరణలతో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ స్థానం స్థిరపడినట్టు పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితుల మధ్య బలమైన పనితీరు చూపించినట్టు తెలిపింది. వ్యాపార విశ్వాసం క్రమంగా పెరుగుతుండడం అన్నది విదేశీ ప్రతికూలతలను పరిశ్రమ అధిగమించగలదని తెలియజేస్తున్నట్టు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వృద్ధి రేటు మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.బడ్జెట్పై కీలక సూచనలుప్రభుత్వం మూలధన వ్యయాలను స్థిరంగా కొనసాగించాలని, రూ.150 లక్షల కోట్లతో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ 2.0ను ప్రారంభించాలని బడ్జెట్ 2026కు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖకు సీఐఐ సూచించడం గమనార్హం. వ్యూహాత్మక నిధుల మద్దతుతో దేశ పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచాలని కోరింది. ఇండియా డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఫండ్ (ఐడీఎస్ఎప్)ను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. రూ.1,000 కోట్లతో అత్యాధునిక అధ్యయనం, పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రూ.1,000 కోట్లతో డిజిటైజేషన్ ఫండ్ను నెలకొల్పాలని కోరింది.ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు -
ఎగువ మధ్యాదాయ దేశంగా భారత్
భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే నాలుగేళ్లలో (2030 నాటికి) ఎగువ మధ్యాదాయ దేశంగా మారుతుందని, చైనా, ఇండోనేషియా సరసన చేరుతుందని ఎస్బీఐ పరిశోధన విభాగం అంచనా వేసింది. అలాగే, 2028 కంటే ముందుగానే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది.స్థూల తలసరి ఆదాయం ఆధారంగా ఆర్థిక వ్యవస్థలను తక్కువ ఆదాయం, దిగువ మధ్యాదాయం, ఎగువ మధ్యాదాయం, అధిక ఆదాయంగా ప్రపంచ బ్యాంక్ వర్గీకరిస్తుంటుంది. 1990లో 219 దేశాలను ప్రపంచ బ్యాంక్ వర్గీకరించగా, ఇందులో 51 దేశాలు తక్కువ ఆదాయం, 56 దేశాలు దిగువ మధ్యస్థ ఆదాయం, 29 దేశాలను ఎగువ మధ్యాదాయం, 39 దేశాలను ఉన్నతాదాయ విభాగంలో చేర్చింది. 2024 డేటా ప్రకారం.. తక్కువ ఆదాయం విభాగంలో కేవలం 26 దేశాలే మిగిలాయి. 50 దేశాలు దిగువ మధ్యాదాయం, 54 దేశాలు ఎగువ మధ్యాదాయం, 87 దేశాలు అధిక ఆదాయం కిందకు వచ్చాయి. 60 సంవత్సరాల తర్వాత భారత్ 2007లో తక్కువ ఆదాయం నుంచి దిగువ మధ్యాదాయ దేశంగా మారినట్టు.. తలసరి స్థూల ఆదాయం 1962లో 90 డాలర్లుగా ఉంటే, 2007లో 910 డాలర్లకు చేరినట్టు ఎస్బీఐ నివేదిక తెలిపింది. రెండేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు.. భారత్ స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుందని, తదుపరి 7 ఏళ్లకు (2014లో) 2 ట్రిలియన్ డాలర్లకు, 2021 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు, 2025లో 4 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు ఎస్బీఐ నివేదిక వివరించింది. వచ్చే రెండేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. తొలి వెయ్యి డాలర్ల తలసరి ఆదాయానికి భారత్ 2009లో చేరుకుందని, తదుపరి పదేళ్లలో 2019 నాటికి ఇది 2,000 డాలర్లు పెరిగిందని, అనంతరం ఏడేళ్లకు 3,000 డాలర్లకు విస్తరించినట్టు తెలిపింది.‘వచ్చే నాలుగేళ్లలో 2030 నాటికి 4,000 డాలర్లకు తలసరి ఆదాయం వృద్ధి చెందుతుంది. తద్వారా ఎగువ మధ్యాదాయ దేశంగా చైనా, ఇండోనేషియా సరసన చేరుతుంది. ప్రస్తుతం ఉన్నతాదాయ దేశానికి ఉన్న పరిమితి 13,936 డాలర్ల స్థాయిని భారత్ 2047 నాటికి చేరుకోవాలంటే.. ఇక్కడి నుంచి ఏటా 7.5 శాతం చొప్పున వృద్ధిని సాధించాల్సి ఉంటుంది. గత 23 ఏళ్ల కాలంలో (2001–2024) భారత్ తలసరి స్థూల ఆదాయం ఏటా 8.3 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. కనుక ఇకపై 7.5 శాతం వృద్ధి సాధ్యమే’అని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవేళ 2047 నాటికి ఉన్నతాదాయ దేశానికి పరిమితి 18,000 డాలర్లకు మారుతుందని భావించేట్టు అయితే.. భారత్ ఇక్కడి నుంచి ఏటా 8.9 శాతం చొప్పున వచ్చే 23 ఏళ్ల పాటు వృద్ధిని సాధించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకు గాను భారత్ సంస్కరణల పథాన్ని కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంది.ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు -
రూ.10,300 కోట్ల యూరియా ప్రాజెక్టు
దేశీయ ఎరువుల ఉత్పత్తి రంగంలో స్వయంసమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎల్) భారీ విస్తరణకు చర్యలు చేపట్టింది. చెన్నైలో సుమారు రూ.10,300 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా గ్రీన్ఫీల్డ్ అమ్మోనియా–యూరియా సమ్మేళన ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. చెన్నైలో జరిగిన ‘పాన్ ఐఐటీ టెక్4భారత్ సమిట్ 2026’లో పాల్గొన్న సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) మనోజ్కుమార్ జైన్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ప్రాజెక్టు ముఖ్యాంశాలుఈ ప్లాంట్ ద్వారా దక్షిణ భారతదేశంలో నెలకొన్న యూరియా కొరతను అధిగమించే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది. దీని ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 13 లక్షల టన్నులు. ఈ ఎంఎఫ్ఎల్ సముదాయం ఉత్తర చెన్నైలోని మణాలీలో ఉంది. ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ (PDIL) రూపొందించిన ప్రీ-ఫీజిబిలిటీ నివేదికకు ఇప్పటికే బోర్డు ఆమోదం లభించింది. ‘కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును రూపొందించాం. అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఇది దేశ ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది’ అని మనోజ్కుమార్ జైన్ పేర్కొన్నారు.రికార్డు స్థాయి ఆపరేషనల్ పనితీరు1970లో ప్రారంభమైన పాత ప్లాంట్ను ప్రస్తుతం 120 శాతం సామర్థ్యంతో నడుపుతున్నట్లు జైన్ తెలిపారు. ఆధునిక సాంకేతికతతో ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 10–12 శాతం మెరుగుపరిచినట్లు ఆయన వెల్లడించారు. మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (MFL) 2024–25 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించింది. సంస్థ వార్షిక ఆదాయం గతంతో పోలిస్తే 14 శాతం వృద్ధిని నమోదు చేస్తూ రూ.2,542 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపడటంతో సంస్థ ఈ కాలంలో రూ.64.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.ఉత్పత్తి పరంగా కూడా ఎంఎఫ్ఎల్ సరికొత్త రికార్డులను సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 5,28,400 టన్నుల నీమ్ కోటెడ్ యూరియాను ఉత్పత్తి చేయగా, అమోనియా ఉత్పత్తి కూడా సంస్థ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని విధంగా 3,26,260 టన్నులకు చేరింది. ముఖ్యంగా పర్యావరణ హితంగా, పొదుపుగా కార్యకలాపాలు నిర్వహించడంలో సంస్థ గణనీయమైన ప్రగతి సాధించింది. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా ఒక టన్ను ఉత్పత్తికి కేవలం 6.875 గిగా కేలరీల (Gcal) శక్తిని మాత్రమే వినియోగించింది. ఇది సంస్థ చరిత్రలోనే నమోదైన అత్యంత తక్కువ శక్తి వినియోగం కావడం విశేషం.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..కొత్త గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఎంఎఫ్ఎల్ ఆదాయం పెరగడమే కాకుండా విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో జరిగిన 59వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కూడా ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను సంస్థ నొక్కి చెప్పింది. -
విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి అణు ప్రాజెక్టులు?
భారతదేశ ఇంధన రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దేశంలో అణు విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిని తన పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం వ్యాపార నిబంధనల కేటాయింపులో అవసరమైన సవరణలు చేయాలని కోరుతూ కేబినెట్ సెక్రటేరియట్కు ప్రతిపాదనలు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.అంతర్జాతీయ సహకారంతో ప్రాజెక్టులుఅంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పరిధిలోని రియాక్టర్లతో అణు విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే బాధ్యతను తమ మంత్రిత్వ శాఖకు అప్పగించాలని విద్యుత్ శాఖ కోరుతోంది. ప్రస్తుతం, అణు విద్యుత్ రంగానికి సంబంధించిన పూర్తి పరిపాలనా అధికారాలు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఆధ్వర్యంలోని అణు శక్తి విభాగం (DAE) వద్ద ఉన్నాయి.‘శాంతి’ చట్టండిసెంబర్ 2025లో ప్రకటించిన ‘సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’(SHANE - శాంతి) చట్టానికి ముందే ఈ ప్రతిపాదనలు రావడం గమనార్హం. అణు రంగంలో నియంత్రిత పద్ధతిలో పరిమిత ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించడం ఈ చట్టం ఉద్దేశం. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డును (AERB) మరింత బలోపేతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం నమ్ముతుంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్లాంట్లు, భద్రత, ఇంధనం వంటి కీలక అంశాలు మాత్రం యథాతథంగా డీఏఈ పరిధిలోనే ఉంటాయి.2047 నాటికి 100 గిగావాట్ల లక్ష్యంభారతదేశం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్పీసీఐఎల్(డీఏఈ పరిధిలో) దాదాపు 50 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బాధ్యత వహించాలి. ఎన్టీపీసీ (విద్యుత్ శాఖ పరిధిలో) సుమారు 30 గిగావాట్ల ఉత్పత్తి చేయాల్సి ఉంది. ‘వ్యూహాత్మక ప్లాంట్లు, భద్రత వంటి ప్రధాన అంశాలు డీఈఏ వద్దే ఉండాలి. కానీ విద్యుత్ ఉత్పత్తి పంపిణీ బాధ్యతలు విద్యుత్ శాఖకు బదిలీ చేయడం వల్ల పనుల్లో వేగం పెరుగుతుంది’ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.నియంత్రణలో స్పష్టతగతంలోని 1962 అణు శక్తి చట్టం ప్రకారం, టారిఫ్ ధరలను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సంప్రదింపులతో డీఏఈ నిర్ణయించేది. అయితే, రాబోయే కొత్త నిబంధనలు, ‘శాంతి’ చట్టం ద్వారా టారిఫ్ నిర్ణయాల్లో మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ధరల నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉండనుంది.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే.. -
బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీలు అనుసంధానం?
అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాల్లో చెల్లింపుల ప్రక్రియను మరింత సరళతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక అడుగు వేసింది. బ్రిక్స్(BRICS) కూటమిలోని సభ్య దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను (CBDC) పరస్పరం అనుసంధానించాలని ఆర్బీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఈ చర్య ద్వారా అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్పై ఉన్న ఆధిపత్యాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.2026 బ్రిక్స్ సదస్సు అజెండాలో..2026లో జరగనున్న BRICS సదస్సులో ఈ ప్రతిపాదనను ప్రధాన అజెండాగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సులో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపడితే సభ్య దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానంపై తొలిసారిగా అధికారిక ప్రతిపాదన వెలువడే అవకాశం ఉంది.డీ-డాలరైజేషన్ దిశగా అడుగులు..బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఈ బ్రిక్స్ కూటమి ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థల వైపు మొగ్గు చూపడంపై అమెరికా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కూటమిని అమెరికా వ్యతిరేకంగా అభివర్ణిస్తూ సభ్య దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని గతంలోనే హెచ్చరించారు. అయితే, భారత్ మాత్రం రూపాయి వాడకాన్ని విస్తరించే ప్రయత్నాలు డీ-డాలరైజేషన్ (డాలర్ వినియోగాన్ని తగ్గించడం) లక్ష్యంగా చేస్తున్నవి కావని, కేవలం వాణిజ్య సౌలభ్యం కోసమేనని స్పష్టం చేస్తోంది.2025 రియో డిక్లరేషన్కు కొనసాగింపు2025లో బ్రెజిల్లోని రియో డి-జెనీరోలో జరిగిన బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల చెల్లింపు వ్యవస్థల మధ్య ‘ఇంటరాపరబిలిటీ’ (పరస్పర అనుకూలత) పెంచాలని నిర్ణయించారు. తాజా ఆర్బీఐ ప్రతిపాదన ఆ నిర్ణయానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాల్లో ఏదీ పూర్తిస్థాయిలో డిజిటల్ కరెన్సీని విడుదల చేయనప్పటికీ ఐదు ప్రధాన దేశాలు పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.భారత ‘ఈ-రూపీ’ పురోగతిభారత్ తన డిజిటల్ కరెన్సీ రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. డిసెంబర్ 2022లో ప్రారంభమైన ‘ఈ-రూపీ’కి ప్రస్తుతం 70 లక్షల మంది రిటైల్ వినియోగదారులు ఉన్నారు. ఆఫ్లైన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీల కోసం ఆర్బీఐ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. మరోవైపు చైనా కూడా తన డిజిటల్ యువాన్ అంతర్జాతీయ వినియోగాన్ని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.సవాళ్లు..బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశాల మధ్య ఉండే వాణిజ్య అసమతుల్యతలు, సాంకేతిక పరమైన భిన్నత్వాలు, పాలనా నియమాలను ఏకీకృతం చేయడం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగాల్సి ఉంది. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర సభ్య దేశాల కేంద్ర బ్యాంకులు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదని గమనించాలి.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే.. -
బడ్జెట్ 2026లో వ్యవసాయానికి కొత్త దిశ!
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే వ్యవసాయ రంగం ప్రస్తుతం వాతావరణ మార్పులు, అస్థిరమైన మార్కెట్ ధరల వల్ల సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 (Budget 2026)లో వ్యవసాయాన్ని లాభసాటిగా, సుస్థిరంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంప్రదాయ సాగు పద్ధతుల నుంచి సాంకేతికతతో కూడిన ‘స్మార్ట్ అగ్రికల్చర్’ వైపు అడుగులు వేయడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు.వాతావరణానికి అనువైన వ్యవసాయంమారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలు పంట దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం స్థితిస్థాపక వ్యవసాయంపై దృష్టి సారిస్తోంది. అందులో భాగంలో కింది అంశాలను పరిశీలిస్తోందని నిపుణులు చెబుతున్నారు.కరువును, వరదలను తట్టుకునే అత్యధిక నాణ్యత గల విత్తనాల అభివృద్ధికి పరిశోధనా సంస్థలకు నిధులు పెంచడం.నీటి యాజమాన్యంలో భాగంగా సూక్ష్మ సేద్యం, భూసార పరిరక్షణ కోసం రైతులకు సబ్సిడీలు అందించడం.రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహించడం ద్వారా భూసారాన్ని కాపాడటం.పీపీపీ మోడల్తో మౌలిక సదుపాయాలుప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పంట నష్టాన్ని తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ పెట్టుబడులతో అధునాతన కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల నిర్మించాలని వ్యవసాయ సంఘాలు చెబుతున్నాయి. రైతుల నుంచి నేరుగా మార్కెట్కు పంటను తరలించేలా రవాణా నెట్వర్క్లను బలోపేతం చేయాల్సి ఉంది. ప్రైవేట్ సంస్థల వద్ద ఉన్న అధునాతన యంత్రాలను రైతులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తేస్తే మరింత ఉత్పాదకత సాధ్యం అవుతుంది.అధిక విలువ కలిగిన పంటలువరి, గోధుమ వంటి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే హార్టికల్చర్ (ఉద్యానవన పంటలు)పై బడ్జెట్ దృష్టి సారించాలి. తక్కువ నీటితో ఎక్కువ లాభం ఇచ్చే పండ్లు, ఔషధ మొక్కల సాగుకు ప్రోత్సాహకాలు అందించాలి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న సుగంధ ద్రవ్యాల సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.రైతన్నకు ‘స్మార్ట్’ అండసాంకేతికతను సామాన్య రైతుకు చేరువ చేయడమే డిజిటల్ ఇంటిగ్రేషన్ లక్ష్యం. మొబైల్ యాప్ల ద్వారా వాతావరణ సూచనలు, తెగుళ్ల నివారణా చర్యలను ఎప్పటికప్పుడు రియల్ టైమ్ డేటాతో అనుసందానించి అందించాలి. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించేలా ‘ఈ-నామ్’ (e-NAM) వంటి ప్లాట్ఫామ్లను మరింత బలోపేతం చేయాలి. పంటల అంచనా, రుణాల మంజూరు సులభతరం చేసేందుకు వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలి.సుస్థిర సాగు, ప్రైవేటు పెట్టుబడులు, డిజిటల్ విప్లవంతో కూడిన వ్యూహం అమలులోకి వస్తే భారత వ్యవసాయ రంగం మరిన్ని ఫలితాలు సాధిస్తుంది. బడ్జెట్ 2026లో చేసే కేటాయింపులు అన్నదాతకు భరోసా కల్పించడమే కాకుండా దేశ ఆహార భద్రతను మరింత పటిష్టం చేస్తాయని ఆశిస్తున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు -
ఈక్విటీలపై పన్ను.. క్యాపిటల్ మార్కెట్ భాగస్వాముల డిమాండ్
ఈక్విటీ పెట్టుబడులపై పన్ను భారాన్ని తగ్గించాలని క్యాపిటల్ మార్కెట్ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. 2026–27 బడ్జెట్లో దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను (ఎల్టీసీజీ) తగ్గించడంతోపాటు, పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని సూచించాయి. దీనివల్ల రిటైల్, దీర్ఘకాల పెట్టుబడిదారులకు పెద్ద ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నాయి. సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్టీటీ) మరింత పెంచకుండా ఉండాలని కోరాయి. వచ్చే ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1న మంత్రి సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. ఎల్టీసీజీ మినహాయింపు పెంచాలి..ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాల లాభం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలు మించకపోతే ప్రస్తుతం ఎలాంటి పన్ను లేదు. ఇంతకు మించిన మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. రూ.2 లక్షల వరకు లాభంపై పన్ను మినహాయింపును పెంచాలని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రభుత్వానికి సూచించింది. దీర్ఘకాలం అన్న నిర్వచనాన్ని ఈక్విటీలకు 12 నెలలు ఉండగా.. డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ ఇలా అన్ని సాధనాలకు ఒకే విధంగా అమలు చేయాలని కోరింది. దీనివల్ల పన్నలపై స్పష్టత పెరిగి, సంక్లిష్టత తగ్గుతుందని పేర్కొంది. మూలధన నష్టాన్ని ఇతర ఆదాయంతోనూ సర్దుబాటుకు అవకాశం కల్పించాలని కోరింది.ఎస్టీటీ తక్కువగా ఉండాలి.. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ను నిరుత్సాహపరిచి, దీర్ఘకాల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా.. డెరివేటివ్స్ కంటే ఈక్విటీ డ్రేడ్లపై ఎస్టీటీ తక్కువగా ఉండాలని ప్రభుత్వానికి సూచించినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీఈవో, ఎండీ ధీరజ్ రెల్లి వెల్లడించారు. షేర్ల బైబ్యాక్లో కేవలం లాభంపైనే పన్ను ఉండాలన్నారు. ఎస్టీటీని మరింత పెంపునకు ప్రభుత్వం దూరంగా ఉండాలని ఫయర్స్ సీఈవో తేజాస్ ఖోడే పేర్కొన్నారు. దీర్ఘకాల, స్వల్పకాల మూలధన లాభం పన్నును 10 శాతానికి తగ్గించినట్టయితే రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మరింత పెరుగుతుందన్నారు. బంగారం, వెండిపై దిగుమతుల సుంకాన్ని ప్రభుత్వం మరింత పెంచకపోవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు -
భారత వృద్ధి అంచనాలు అంతకు మించి..
భారత్ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 7.3 శాతం వృద్ధిని సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. గతేడాది అక్టోబర్లో వేసిన అంచనా కంటే ఇది 0.7 శాతం అధికం. భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు అంచనాలకు మించి ఉండడమే సవరణకు దారితీసినట్టు పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) సంబంధించి వృద్ధి అంచనాను సైతం 6.2 శాతం నుంచి 6.4 శాతానికి పెంచింది.సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాల కంటే బలంగా నమోదు కావడంతోపాటు, డిసెంబర్ త్రైమాసికంలోనూ కార్యకలాపాలు బలంగా ఉన్నట్టు ఐఎంఎఫ్ తన తాజా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అవుట్లుక్లో తెలిపింది. జాతీయ గణాంక కార్యాలయం అంచనా ప్రకారం 2025–26 సెపె్టంబర్ త్రైమాసికంలో 8 శాతం వృద్ది రేటు నమోదు కావడం తెలిసిందే. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని ప్రభుత్వం తన ముందస్తు అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది..ద్రవ్యోల్బణం 2025లో కనిష్ట స్థాయిలకు తగ్గగా.. ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం స్థాయికి చేరుకోవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. మరీ ప్రతికూల పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం 4 శాతానికి ఎగువ, దిగువ వైపు 2 శాతం మించకుండా (2–6 శాతం) చూడాలన్నది ఆర్బీఐ లక్ష్యంగా ఉంది. ఇక 2026లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతంగా ఉంటుందని, 2027లో ఇది 3.2 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్ తెలిపింది. 2025 అక్టోబర్ అంచనాలతో పోల్చి చూస్తే వీటిల్లో పెద్ద మార్పు లేదు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి రేటు 2026, 2027లో 4 శాతం ఎగువన ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. చైనా వృద్ధి రేటును 0.2 శాతం పెంచి 5 శాతం చేసింది. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం 2025లో ఉన్న 4.1 శాతం నుంచి 2026లో 3.8 శాతానికి పరిమితం అవుతుందని, 2027లో 3.4 శాతానికి దిగొస్తుందని పేర్కొంది.ఇదీ చదవండి: డిజిటల్ భారత్ ముంగిట ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’ విప్లవం -
బినామీ ఆస్తులకు చెక్
బినామీ ఆస్తులు... దాని వ్యవహారాలను భారతదేశంలో నిషేధించారు. ఇందుకు సంబంధించి 1988లో చట్టమే వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన, బలమైన చట్టం.ఆస్తి అంటే: బినామీ వ్యవహారాలన్నీ ఆస్తి చుట్టూ తిరుగుతాయి. అందుకని ‘ఆస్తి’ అనే పదాన్ని బాగా నిర్వచించారు. చట్టంలో ఈ నిర్వచనం కష్టమయితే చాలా తెలివిగా, పరిధి ఎక్కువగా ఉండేలా వివరణ ఇచ్చారు. ఈ క్రిందివన్నీ ‘ఆస్తి’ అని పెద్ద జాబితా చెబుతారు. ఈ నిర్వచనం చదివితే మీకు భగవద్గీత స్ఫురణకు రాకతప్పదు.(1) ఏ రకమయినా.. స్థిరమైన, అస్థిరమైన, కంటికి కనిపించేవి... కనపడవని... భౌతికమైనవి... నిరాకారమైనవి. (2) హక్కు, ఆసక్తి, దస్తావేజుల్లో పేరు, ప్రస్తావన(3) రూపాంతరం చెందగలిగే ఆస్తి(4) పై పేర్కొన్న 1,2,3 ఆస్తుల ద్వారా వచ్చిన వసూళ్లు ..రియల్ ఎస్టేట్, భూములు, ఇళ్లు, పొలాలు, స్థిరాస్తులు, షేర్లు, వేతనాలు, ఫిక్సిడ్ డిపాజిట్లు, బ్యాంకు డిపాజిట్లు, నగదు బ్యాంకు లాకర్లు, ప్రయివేటు లాకర్లు మొదలైనవి.బినామీ వ్యవహారం ఏమిటంటే..➤ఒక వ్యవహారం–ఒప్పందం.. ఒక ఆస్తికి కాగితాల ప్రకారం ఓనర్ (యజమాని) ఓనమాలు రాని ఓబయ్య అయితే.., ఆ వ్యవహారానికి మదుపు పెట్టినది చదువుకున్న చలమయ్య. ఇందులో చలమయ్య గారికి ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది.➤లేని వ్యక్తి పేరు మీద, డమ్మీ వ్యక్తి పేరు మీద జరిగే వ్యవహారం... కర్త, కర్మ, క్రియ... ఒకరైతే.. అబద్దపు పేరుతో దస్తావేజులు తయారవుతాయి.➤ఒక వ్యక్తి/సంస్థకి తెలియకుండా/చెప్పకుండా/ ఎరుకలో లేకుండా జరిగిన వ్యవహారం. విచారణలో నాకు తెలియదు, నేను కాదని, నాకు హక్కు లేదని ధ్రువీకరించిన కేసులు.➤కొన్ని వ్యవహారాల్లో మనిషి కల్పితం (చందమామ బేతాళ కథల్లోలాగా).గాభరా పడొద్దు.. వీటికీ మినహాయింపులున్నాయి. హిందూ ఉమ్మడి కుటుంబంలో కర్త కాని, సభ్యులు కాని వారి పేరు మీద ఆస్తి ఉంచుకోవచ్చు. కానీ సోర్స్ మాత్రం కుటుంబం నుంచే రావాలి. ప్రయోజనం ఉమ్మడి కుటుంబానికే చెందాలి. ట్రస్టుల్లో, భాగస్వామ్యంలో, కంపెనీల్లో, డిపాజిటరీలాగా, ఏజెంటులాగా, విశ్వాసపాత్రుడి హోదాలో వ్యవహారాలు.. కుటుంబంలో భార్యభర్తల పేరు మీద, పిల్లల పేరు మీద జరిగే వ్యవహారాలు మొదలైన వాటికి సోర్స్ కుటుంబ సభ్యుల నుంచే రావాలి. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, గత తరంగానీ, భవిష్యత్తు తరంగానీ, జాయింట్ ఓనర్స్... డాక్యుమెంట్ ప్రకారం ఉండి.. సోర్స్ వారిలో ఎవరి దగ్గర్నుంచైనా ఉండాలి. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే ‘సోర్స్’ అంటే ‘కెపాసిటీ‘ ఉండాలి. నిజమైన వ్యవహారం అయి ఉండాలి. డమ్మీలుండకూడదు. మరి కొన్ని ఉదాహరణలు గమనించండి..➤‘అ’ అనే అన్నగారు ఒక ఇల్లు కొన్నారు. తానే డబ్బు ఇచ్చారు. కానీ ‘ఆ’ అనే వదిన గారి పేరు మీద రిజిస్టేషన్ జరిగింది. ‘అ’ ఆ ఇంట్లోనే ఉంటారు. ఈ కేసులో ‘ఆ’ బినామీదారు. ‘అ’ ప్రయోజనం పొందిన వ్యక్తి.➤ఇక మరో కేసు. ఇది వింటే ‘మత్తు’ వదిలిపోతుంది. 'పీ’ అనే వ్యక్తికి లిక్కర్ లైసెన్సు ఉంది. తన ఉద్యోగి ‘ఖ’ పేరు మీద అన్ని చెల్లింపులు. కానీ రాబడి అంతా 'పీ’దే. ఇదొక బినామీ వ్యవహారం.బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, కల్పిత పేర్లతో, లేనివారి పేరు మీద, మరణించిన వారి పేరుతో మీద పెడతారు. ఇదీ బినామీయే. ఉద్యోగస్తుల పేరు మీద బ్యాంకు లాకర్లు తెరిచి అందులో నగదు, బంగారం పెట్టడం, అలాగే బంధువుల పేరు మీద వ్యవహారాలు చేయడం.. ఇటువంటి వ్యవహారాల్లో బేతాళ కథల్లోని కల్పిత వ్యక్తి ... బినామీదారు. తన గుట్టు చెప్పకుండా ప్రయోజనం పొందే వ్యక్తి, ప్రయోజనం పొందిన వ్యక్తిని ఈ పేరుతో వ్యవహరిస్తారు.ఈ వ్యవహారాలు/ఆస్తులు, ఇందులోని సూత్రధారులు అందరూ శిక్షార్హులే! ‘‘బినామీ వ్యవహారాలకు దూరంగా ఉండండి’’ అని డిపార్టుమెంటు వారు జారీ చేసిన కరపత్రాలు చదవండి. బినామీ అంటే సునామీ లాంటిది.ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
విద్యుత్తు బిల్లులో అసమానతలు
అమెరికాలో గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు గుదిబండగా మారుతున్నాయి. గత ఐదేళ్లలో విద్యుత్ ధరలు ఆకాశాన్ని తాకగా ఈ భారం పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్నప్పటికీ, వాటి ఖర్చును కూడా సామాన్య పౌరులే మోయాల్సి వస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆకాశాన్నంటుతున్న ధరలుఫిబ్రవరి 2020తో పోలిస్తే అమెరికా వ్యాప్తంగా విద్యుత్ ధరలు సగటున 40 శాతం పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా వాషింగ్టన్లో జులై 2020 నుంచి జులై 2025 మధ్య విద్యుత్ ఖర్చులు ఏకంగా 93 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) డేటా ప్రకారం 2022-2024 మధ్య..నివాస వినియోగదారుల విద్యుత్తు బిల్లులు 10 శాతం పెరిగాయి.వాణిజ్య వినియోగదారులపై 3 శాతం మాత్రమే పెరిగాయి.పారిశ్రామిక వినియోగదారులపై ధరలు 2 శాతం తగ్గాయి.డేటా సెంటర్లుచిన్నపాటి నగరాలకు సరిపోయే విద్యుత్తును వినియోగించే డేటా సెంటర్లు గ్రిడ్లోకి వస్తున్నా వాటికి తక్కువ ధరలకే విద్యుత్ అందుతోంది. ఈఐఏ గణాంకాల ప్రకారం, 2024 చివరి నాటికి నివాస వినియోగదారులకు యూనిట్ (కిలోవాట్-గంట) ధర 16 సెంట్లు ఉండగా వాణిజ్య వినియోగదారులకు అది 13 సెంట్లు మాత్రమే ఉంది.ఈ వ్యత్యాసానికి కారణాలునివాస ప్రాంతాలకు విద్యుత్ చేరవేయడానికి స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఖర్చు పెరిగింది. ఇవి తుఫానులు, అడవి మంటల వల్ల దెబ్బతింటే ఆ మరమ్మతు ఖర్చులు వినియోగదారులపైనే పడుతున్నాయి.డేటా సెంటర్లు నేరుగా హై-వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్లకు అనుసంధానమవుతాయి. తద్వారా పంపిణీ ఖర్చుల నుంచి తప్పుకుంటున్నాయి.పెద్ద కంపెనీలకు ఉన్న లాబీయింగ్ బలం సామాన్య ప్రజలకు ఉండదు. యుటిలిటీ రెగ్యులేటర్ల వద్ద కంపెనీలు తమకు అనుకూలమైన ధరలను సాధించుకోగలుగుతున్నాయి.గ్రిడ్ అప్గ్రేడ్ భారం ఎవరిది?ఇటీవల యూఎస్లో పీజేఎం అనే గ్రిడ్ ఆపరేటర్ 5 బిలియన్ డాలర్ల వ్యయంతో ట్రాన్స్మిషన్ లైన్ల అప్గ్రేడ్ ప్రాజెక్టును చేపట్టింది. డేటా సెంటర్ల వల్లేఈ అప్గ్రేడ్ అవసరం ఏర్పడినప్పటికీ వర్జీనియా, మేరీల్యాండ్ వంటి ప్రాంతాల్లో ఈ భారాన్ని నివాస వినియోగదారుల బిల్లుల్లో చేర్చడం వివాదాస్పదమైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం, అనేక యుటిలిటీ సంస్థలు మెటా వంటి దిగ్గజ కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. టెక్సాస్లో ఎల్ పాసో ఎలక్ట్రిక్ సంస్థ మెటా డేటా సెంటర్ కోసం ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఆ విషయాన్ని ప్రజల దృష్టికి రాకుండా దాచేందుకు ప్రయత్నించడం గమనార్హం.మార్పు దిశగా..ఈ అసమానతలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ లా స్కూల్ ఎక్స్పర్ట్ అరి పెస్కో మాట్లాడుతూ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత రెగ్యులేటర్లపై ఉందన్నారు. ఇప్పటికే వర్జీనియా రాష్ట్రం డేటా సెంటర్ల కోసం ప్రత్యేక వినియోగదారుల క్లాస్ను ఏర్పాటు చేసి గ్రిడ్ అప్గ్రేడ్ల కోసం వారి నుంచే ఎక్కువ వసూలు చేసేలా నిబంధనలు మార్చింది. విస్కాన్సిన్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. పెరుగుతున్న విద్యుత్ ధరలు అమెరికాలో ఒక ప్రధాన రాజకీయ, ఆర్థిక అంశంగా మారాయి. దీన్ని సరిదిద్దకపోతే ఓటర్ల ఆగ్రహం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: డిజిటల్ భారత్ ముంగిట ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’ విప్లవం -
ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు
అమెరికా ఓవల్ ఆఫీస్లో రెండోసారి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే కీలక నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్.. గడిచిన 365 రోజుల్లో తన ‘ట్రంపరితనాన్ని’ చూపిస్తూనే ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే మంత్రాన్ని జపిస్తూ శరవేగంగా వెలువడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చైనాతో టారిఫ్ల యుద్ధం, అక్రమ వలసలపై ఉక్కుపాదం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో కలిసి డోజ్(DOGE) ద్వారా ప్రభుత్వ ప్రక్షాళన.. ఇలా ప్రతి అడుగులోనూ ట్రంప్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.ఈ ఏడాది పొడవునా సాగిన ఈ సంచలన నిర్ణయాల తుపాను ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ముద్ర వేసింది? జీడీపీ లెక్కలు, ఏఐ బూమ్ వెనుక దాగిన మార్కెట్ వాల్యుయేషన్లు ట్రంప్నకు విజయ కేతనం పడుతున్నాయా లేక 2026లో రాబోయే భారీ ఆర్థిక పరీక్షకు సంకేతాలు ఇస్తున్నాయా? వంటి అంశాలపై విశ్లేషణ..అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి రేపటితో ఏడాది పూర్తవుతుంది. ఈ సంవత్సరం కాలంలో సుంకాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(DOGE), కృత్రిమ మేధ (ఏఐ)లో భారీ పెట్టుబడుల వంటి నిర్ణయాలతో వైట్హౌస్ నిరంతరం వార్తల్లో నిలిచింది. రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకున్న ఈ ఏడాది ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలను అందించింది.ఆరంభంలో సంకోచం.. ఆపై..ట్రంప్ పాలన 2025 ప్రారంభంలో కొంత ఒడిదుడుకులతో సాగింది. 2025 మొదటి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 0.6 శాతం క్షీణించింది. 2022 తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇలా వెనకబడటం ఇదే తొలిసారి. అయితే, ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదై ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కింది. వినియోగదారుల ఖర్చు పెరగడం, ఎగుమతులు పుంజుకోవడం, దిగుమతుల్లో తగ్గుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.ద్రవ్యోల్బణం, ఉద్యోగాల సవాలుద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. పీసీఈ (PCE) ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో 2.8 శాతంగా ఉండగా, డిసెంబర్ నాటికి 2.7 శాతానికి తగ్గింది. సుంకాల వల్ల ధరలు భారీగా పెరుగుతాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి అటువంటి నాటకీయ మార్పులు కనిపించలేదు. కానీ, ఉద్యోగ మార్కెట్ ఆందోళన కలిగిస్తోంది. యూఎస్లో నిరుద్యోగ రేటు 2025 నవంబర్లో 4.5 శాతానికి చేరింది. 2025లో నెలకు సగటున కేవలం 49 వేల ఉద్యోగాలు మాత్రమే జోడయ్యాయి. ఇది గడిచిన ఏడేళ్ల సగటు (1.41 లక్షలు) కంటే చాలా తక్కువ. బిగ్ టెక్ సంస్థల్లో కొనసాగుతున్న లేఆఫ్స్ దీనికి ప్రధాన కారణం.అమెరికా కంటే ప్రపంచమే ముందంజట్రంప్ 2.0 తొలి ఏడాదిలో అమెరికా మార్కెట్లు లాభాలను పంచాయి. గడిచిన ఏడాదిలో..ఎస్ అండ్ పీ 500: +16%నాస్డాక్: +20%డౌ జోన్స్: +14%ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్ల జోరు తక్కువగానే ఉంది. జపాన్ నిక్కీ (40%), కొరియా కోస్పి (92%), హాంగ్ సెంగ్ (37%) వంటి అంతర్జాతీయ సూచీలు అమెరికాను మించిపోయాయి. డాలర్ ఇండెక్స్ 9.3 శాతం పడిపోవడం, బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం ఈ ఏడాది విశేషం.ఏఐ బూమ్ట్రంప్ హయాంలో ఏఐ రంగానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా ‘స్టార్గేట్’ వంటి 500 బిలియన్ డాలర్ల మెగా ప్రాజెక్టులు టెక్ రంగాన్ని ఉత్సాహపరిచాయి. ఆల్ఫాబెట్, ఎన్విడియా వంటి ‘మాగ్-7’ స్టాక్స్ మార్కెట్ విలువలో 20 శాతం వృద్ధి సాధించాయి. ప్రస్తుతం ఎస్ అండ్ పీ 500లో 42 శాతం వాటా కేవలం ఏఐ అనుబంధ కంపెనీలదే ఉండటం గమనార్హం.అసలైన పరీక్ష ముందే?ప్రస్తుతం అమెరికా మార్కెట్లు 28 రెట్ల పీఈ(ప్రైస్ టు ఎర్నింగ్ - ఉదాహరణకు.. కంపెనీ రేషియో 20 ఉంటే ఆ కంపెనీ సంపాదించే 1 రూపాయి లాభం కోసం 20 రూపాయలు చెల్లిస్తున్నారని అర్థం) వద్ద ట్రేడవుతున్నాయి. ఇది 2000 నాటి డాట్కామ్ బబుల్ స్థాయిని గుర్తుచేస్తోంది. 2026లో వడ్డీ రేట్ల నిర్ణయాలు, ఫెడ్ రిజర్వ్ వైఖరి, సుంకాల దీర్ఘకాలిక ప్రభావం అమెరికా ఆర్థిక స్థితిని నిర్ణయించనున్నాయి. రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్లపై ట్రంప్ గర్వపడుతున్నా పెరుగుతున్న రుణాలు, మార్కెట్ వాల్యుయేషన్ల మధ్య ఈ ఏఐ బూమ్ ఎంతకాలం నిలుస్తుందనేది వేచి చూడాలి.ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే.. -
ప్రపంచ క్రెడిట్ మార్కెట్లో ‘హీట్’
ప్రపంచ క్రెడిట్ మార్కెట్లు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో కార్పొరేట్ బాండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఇదే సమయంలో రిస్క్కు లభించే ప్రతిఫలం (ప్రీమియం) కనిష్ట స్థాయికి పడిపోవడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి క్రెడిట్ మార్కెట్లలో కనిపిస్తున్న ‘ఆత్మసంతృప్తి’ (Complacency) భవిష్యత్తులో ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.రికార్డు స్థాయిలో తగ్గిన ప్రీమియం రాబడిబ్లూమ్బెర్గ్ గణాంకాల ప్రకారం, కార్పొరేట్ రుణాలపై ప్రీమియం నుంచి లభించే మార్జిన్ కేవలం ఒక శాతానికి పడిపోయింది. ఇది జూన్ 2007 తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి. ఆర్థిక స్థిరత్వంపై నమ్మకం, రేటింగ్లు, కరెన్సీలో మార్పులు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని కొందరు చెబుతున్నారు. అదే సమయంలో క్రెడిట్ కంపెనీలకు తగిన పరిహారం లభించడం లేదన్నది విశ్లేషకుల వాదన. ప్రస్తుత పరిస్థితుల్లో అతిగా రిస్క్ ఉన్న విభాగాల్లో క్రెడిట్ జోలికి వెళ్లకపోవడమే సరైన వ్యూహమని అబెర్డీన్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్టర్ ల్యూక్ హిక్మోర్ పేర్కొన్నారు.బార్క్లెస్ పీఎల్సీ (Barclays PLC) విశ్లేషణ ప్రకారం, యూఎస్ రుణ మార్కెట్లో రిస్క్ పట్ల అశ్రద్ధ లేదా క్రెడిట్ కంపెనీల్లో ఆత్మసంతృప్తి స్థాయి 93 శాతానికి చేరింది. ఇది డిసెంబర్ 2024 తర్వాత గరిష్ట స్థాయి. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు రుణాలు పుట్టడం చాలా సులభమైంది. కొత్త కార్పొరేట్ బాండ్లపై చెల్లించాల్సిన అదనపు వ్యయం కేవలం 1.3 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉంది. ఇది గత ఏడాది సగటు (3 బేసిస్ పాయింట్లు) కంటే చాలా తక్కువ. ఈ ఏడాది జారీ చేసిన బాండ్లకు విక్రయ పరిమాణం కంటే ఇన్వెస్టర్ల నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ఆర్డర్లు రావడం మార్కెట్ జోరుకు నిదర్శనం.ముంచుకొస్తున్న సవాళ్లుమార్కెట్లు ఇంత సానుకూలంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా కొన్ని సవాళ్లు పొంచి ఉన్నాయి. ఉక్రెయిన్-రష్యా, మిడిల్ఈస్ట్ ప్రాంతాల్లో నెలకొన్న సంక్షోభాలు ఇంకా కొనసాగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలు ప్రపంచ వాణిజ్యంపై చూపే ప్రభావాన్ని తేలికగా తీసుకోలేం. యూఎస్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్పై జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలపై రాజకీయ ఒత్తిడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ చిన్న పొరపాటు జరిగితే క్రెడిట్ కంపెనీలు ఏమేరకు తట్టుకుంటాయనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి.రికార్డు స్థాయిలో బాండ్ల జారీఈ ఏడాది జనవరి తొలి పదిహేను రోజుల్లోనే కంపెనీలు సుమారు 435 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను జారీ చేశాయి. ఇది ఒక రికార్డు. గోల్డ్మన్ సాక్స్ గ్రూప్ వంటి దిగ్గజాలు కూడా 16 బిలియన్ డాలర్ల రుణాన్ని సమీకరించాయి. పెట్టుబడిదారుల వద్ద నగదు లభ్యత ఎక్కువగా ఉండటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే ఆశలు మార్కెట్ను నడిపిస్తున్నాయి. అయితే, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ముప్పు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని దిగ్గజ సంస్థలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: మీరు యాక్టివా.. పాసివా? -
మొసళ్లుంటాయ్... జాగ్రత్త!
స్టాక్ మార్కెట్లు అదేపనిగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటిదాకా దూరంగా ఉన్నవాళ్లు కూడా పెట్టుబడి పెడితే బాగుంటుంది కదా అని ఊగిసలాడుతున్నారు. ఇదే అదనుగా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఏఐ అండతో ఏకంగా నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్నే సృష్టిస్తున్నారు. నకిలీ లాభాలు చూపిస్తున్నారు. 10వేలు విత్డ్రా చేయనిచ్చి... 10 లక్షలు లాగేస్తున్నారు. కొందరి దగ్గరైతే కోట్లు కొట్టేస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్లో సాక్షాత్తూ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ భార్యనే మోసం చేశారంటే మోసగాళ్లు ఏ స్థాయిలో రెచి్చపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. చాలామందికి లాభాల ఆశచూపించి... నకిలీ ఖాతాల్లోకి నగదు వేయించుకుని చెక్కేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే... మార్కెట్ ర్యాలీలో భాగంగా కొన్ని అనామకపు షేర్లు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఫలానా షేరు కొంటే నెలలో రెండింతలవుతుందంటూ ఎస్ఎంఎస్లూ వస్తున్నాయి. వీటి వలలో చిక్కుకుని చాలామంది విలవిలలాడుతున్నారు. మరి దీనికి మార్గమేంటి? స్టాక్ మార్కెట్ అంటే మోసం మాత్రమే కాదు కదా? ఈ మోసాల బారిన పడకుండా ఉండటమెలా? మన డబ్బులు మనం కాపాడుకోవటం ఎలా? ఇదే ఈ వారం బిగ్ ‘వెల్త్ స్టోరీ’.నకిలీలు, మోసగాళ్ల సంగతి పక్కనబెడితే... ముందుగా మార్కెట్లో ట్రేడవుతున్న షేర్లతోనే ఎలాంటి స్కామ్లు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. పంప్ అండ్ డంప్.. పెద్దగా ఎవరికీ తెలియన ఓ అనామకపు షేరు ఉన్నట్టుండి తెరమీదికి వస్తుంది. అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న ఆ షేరు ధర అప్పటికే పెరగటం మొదలవుతుంది. దీనికి గురించి సోషల్ మీడియాలో ఫిన్ఫ్లుయెన్సర్లు ఊదరగొడతారు. ఊరూపేరూ లేని ఎస్ఎంఎస్లు కూడా వచ్చేస్తుంటాయి. అప్పటిదాకా ఆ షేరు గురించి తెలియనివారు కొందరు ఇన్వెస్ట్ చేయటం మొదలుపెడతారు. కొందరు వేచి చూద్దామని వాచ్లిస్ట్లో పెడతారు. అది మెల్లగా పెరుగుతుంటుంది. దీంతో అందరూ ఎగబడతారు. అంతే... అప్పటికే దాన్ని కొనిపెట్టుకున్న స్టాక్మార్కెట్ తిమింగలాలు రేటు పెరిగే కొద్దీ వాటిని అమ్మేస్తుంటారు. బాగా సొమ్ము చేసుకుంటారు. ఒక దశ తర్వాత వేగంగా ఆ షేరు కుప్పకూలుతుంది. మళ్లీ లేచినా... కొద్దిరోజులకే మళ్లీ పడుతుంది. భారీ రేటుకు కొన్న ఇన్వెస్టర్లు ఇరుక్కు పోయినట్లే!!.బాయిలర్ రూమ్ ఆపరేషన్స్ బాయిలర్ రూమ్లో ఎవరూ ఎక్కువసేపు ఉండలేరు. తక్షణం బయటపడేలా బాయిలర్ ఒత్తిడి చేస్తుందన్న మాట. అదే తరహాలో... మంచి తరుణం మించిన దొరకదు, లాస్ట్ చాన్స్ అంటూ ఊరూ పేరూ లేని, పనికిమాలిన స్టాక్స్ను కొనిపించేలా కొందరు బ్రోకర్లు, ఫిన్ఫ్లుయెన్సర్లు ఒత్తిడి పెంచుతుంటారు. దాన్ని వాళ్లు సొమ్ము చేసుకుంటారు.శక్తివంతమైన ఆయుధాలున్నాయ్.. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు, మన చేతిలోనే కొన్ని శక్తివంతమైన ఆయుధాలున్నాయి. వాటిని కాస్త పదును పెట్టుకుంటే సరి. అవేంటంటే... → ఏ అంశాన్నయినా లోతుగా పరిశీలించాలి.. → కంపెనీ ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలి → కంపెనీ వార్షిక నివేదికలను చదవాలి → వార్తలను విశ్వసనీయ సోర్స్ల ద్వారానే ధృవీకరించుకోవాలి → సెబీ ఇన్వెస్టర్ హెల్ప్లైన్ → ఎన్ఎస్ఈ/బీఎస్ఈ అలర్టులు → ప్రామాణికమైన ఫైనాన్షియల్ న్యూస్ ప్లాట్ఫాంలుఇన్సైడర్ ట్రేడింగ్ కంపెనీలు బయటకు వెల్లడించని సమాచారం కూడా యాజమాన్యానికి తెలిసి ఉంటుంది. అది సహజం. దీన్ని ఆధారం చేసుకుని యాజమాన్యంగానీ, వారికి దగ్గరగా ఉండే వారు గానీ ఆ కంపెనీ షేర్లలో ట్రేడింగ్ చేస్తుంటారు. కంపెనీకి ప్రతికూలంగా ఉండే సమాచారం గనక వారికి తెలిస్తే... షేర్లను విక్రయించేయటం, సానుకూలమైన సమాచారం తెలిస్తే కొని పెట్టుకోవటం చేస్తుంటారు. ఆ తరువాత సమాచారం బయటకు వస్తుంది. దానికి తగ్గట్టుగా షేరు రియాక్ట్ అవుతుంది. దీనివల్ల ముందే ట్రేడింగ్ చేసిన కంపెనీ ఇన్సైడర్లు బాగుపడతారు. కాబట్టే దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో షేరు పెరగడానికి లేదా పడటానికి అసలు కారణాలేంటో తెలియని ఇన్వెస్టర్లు నష్టపోతూ ఉంటారు. పోంజీ, పిరమిడ్ స్కీములు ఇన్వెస్ట్మెంట్ స్కీములో కొత్తగా ఎవరినైనా చేరిస్తే, భారీగా లాభాలిస్తామంటారు. కానీ అసలు లాభాల్లో నుంచి కాకుండా, కొత్త ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న డబ్బులో కొంత పాత ఇన్వెస్టర్లకు చెల్లిస్తుంటారు. అంతిమంగా ఇలాంటి స్కీములు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాయి. లింకు తెగి అప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన వాళ్లంతా కుప్పకూలుతారు.బేసిక్ అంశాలను తెలుసుకోవాలి .. పెట్టుబడుల పెట్టే ముందు ఇలాంటి కొన్ని ఆర్థికాంశాల గురించి తెలుసుకుంటే మంచిది. → పీ/ఈ నిష్పత్తి (కంపెనీ లాభాన్ని సంవత్సరాలతో గుణించడమన్న మాట) → ఎర్నింగ్స్ పర్ షేర్ (ఈపీఎస్– సదరు కంపెనీ ఒక షేరుకు ఎంత చొప్పున ఆర్జిస్తోంది) → రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్వోఈ– షేర్హోల్డర్ల ప్రతి రూ.100కు కంపెనీ ఎంత లాభాన్ని తెస్తోంది) అంకెల గురించి అంతగా అర్థం కాకపోయినా ఫర్వాలేదని, గుడ్డిగా ఇన్వెస్ట్ చేసేయొద్దు.ఫాంటమ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటినే ఫాంటమ్ రిటర్న్స్’, ఫాంటమ్ అసెట్స్ అని కూడా పిలుస్తుంటారు. ఫాంటమ్ అనేది ఊహే కదా... అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అన్నమాట. అసలు ఉనికిలోనే లేని నకిలీ స్టాక్స్, బాండ్స్, ఫండ్స్లాంటి వాటిని అంటగడతారు. నకిలీ లాభాలు చూపిస్తుంటారు. నకిలీ స్టేట్మెంట్లు పంపిస్తారు. అంతా రియల్ అనుకుని, లాభాలు పెరుగుతుండటం చూసి మరింత పెట్టుబడి పెట్టేస్తుంటారు. ఎప్పుడైనా విత్డ్రా చేద్దామని అనుకుంటే... ఆ రోజే మొత్తం సిస్టమ్ మాయమైపోతుంది. ఈ మధ్య ఇలాంటివి బాగా పెరిగాయి. మరి తప్పించుకోవటమెలా? మరి ఇన్ని రూపాల్లో మోసగాళ్లు దాడులు చేస్తుంటే మనని మనం కాపాడుకోవటం ఎలా? ఈ సందేహానికి సమాధానం ఒక్కటే... ఆథరైజ్డ్ అవునా కాదా అన్నది చూసుకోవటం. రూపాయి పెట్టుబడి పెడుతున్నా సరే, ఇన్వెస్టింగ్కు ముందే బ్రోకర్ లేదా ప్లాట్ఫాం గురించి ధ్రువీకరించుకోవాలి. సెబీలోను, ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈలోను రిజిస్టర్డా కాదా అన్నది తెలుసుకోవాలి. సెబీలో నమోదు చేసుకోనివారికి ఎవరికైనా... పెట్టుబడి సలహాలివ్వడానికి గానీ మీ డబ్బును మేనేజ్ చేయడానికి గానీ చట్టబద్ధమైన అర్హత ఉండదు. → గ్యారంటీ రాబడులొస్తాయని చెబితే...! ఎందుకంటే స్టాక్మార్కెట్లో రాబడులకు గ్యారంటీ ఉండదు. → వెంటనే నిర్ణయం తీసుకోకపోతే నష్టపోతారంటూ ఒత్తిడి చేస్తే...! ఎందుకంటే ఒత్తిడిలో ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. → అవాంఛిత కాల్స్, మెసేజీలు లేదా ఈమెయిల్స్ ద్వారా వచి్చన సమాచారాన్ని నమ్మొద్దు. ఎందుకంటే ఆ సమాచారం సరైనదైతే మీకెందుకు పంపుతారు? వాళ్లే ఉపయోగించుకుంటారుగా!. → నమ్మశక్యం కాని ఆఫర్లు ఇస్తే నమ్మొద్దు → గుర్తు తెలియని ప్రొఫైల్స్ లేదా ఫేక్ యోగ్యతాపత్రాలు చూపిస్తే పట్టించుకోవద్దు → ఎవరైనా సరే ‘‘మీ డబ్బు చాలా వేగంగా రెట్టింపవుతుంది’’ అంటూ హామీ ఇస్తున్నారంటే, అది సలహా కాదు, అలర్టవ్వాల్సిన విషయమని గుర్తుంచుకోవాలి. ఈ ప్రశ్నలు వేసుకోవాలి.. పెట్టుబడికి ముందు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అవేంటంటే.. → అసలు సదరు కంపెనీ ఏం చేస్తుంది? → దాన్ని నడిపేది ఎవరు? వారికి విశ్వసనీయత ఉందా? → ఆదాయం నిజమైనదేనా? నిలకడగా వచ్చేదేనా? → ఈ పెట్టుబడి ఎందుకు పెట్టానో ఎవరు అడిగినా సరళంగా వివరించగలనా? → ఏదైనా తేడా వస్తే బైటపడే మార్గమేంటి? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చుకోలేకపోతే, కాస్త ఆగి, ఆలోచించాలి.తప్పుడు రీసెర్చ్ రిపోర్టులు కొన్ని ఊరూపేరూ లేని సంస్థల నుంచి రీసెర్చ్ రిపోర్టులంటూ బయటికొస్తాయి. వారు కావాలనుకున్న షేరు తాలూకు భవిష్యత్తును ఊదరగొడుతూ చూపిస్తారు. రకరకాల మెయిల్స్ ద్వారా ఈ రిపోర్టులు వచ్చి పడుతుంటాయి. నిజమేనని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే అంతే గతి.అనధికారిక ట్రేడింగ్ ఒక్కోసారి కమీషన్ కోసం కక్కుర్తి పడి ఏజెంట్లు లేదా బ్రోకర్లు మీ అనుమతి లేకుండా మీ అకౌంట్లో అనధికారికంగా ట్రేడింగ్ చేస్తుండవచ్చు. దీన్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి.మోసపూరిత అడ్వైజరీ స్కాములు సడెన్గా వాట్సాప్లో ఓ మెసేజ్ వస్తుంది. ఫలానా గ్రూపుకు చెందిన నిపుణుడు సలహాలిస్తాడంటూ లింకు పంపిస్తారు. ఆ గ్రూపు లో చేరితే... అప్పటికే కొందరు ఆ ఎక్స్పర్ట్ను పొగుడుతూ ఉంటారు. మీరిచి్చన సలహా వల్ల నేను లక్షలు సంపాదించానంటూ మెసేజీలు పెడుతుంటారు. ఆ సలహా ఏంటో... ఎప్పుడిచ్చారో కూడా మనకు తెలీదు. ఇలా కొందరు చేస్తుండగానే... ఫలానా చోట ఖాతా తెరిస్తే తాను నేరుగా సలహాలిస్తానంటూ సదరు నిపుణుడు చెబుతాడు. అందులో ఉన్నదంతా ఆ నిపుణుడి మనుషులే కాబట్టి ‘సరే సర్’.. అంటారు. అదంతా నిజమని నమ్మి మనం కూడా ఖాతా తెరిచినా... ఎక్స్పర్ట్కు ఫీజు చెల్లించినా... అంతే సంగతి.ఆన్లైన్ ఖాతాలను రక్షించుకోవాలి.. డిజిటల్ భద్రతకు చెక్లిస్ట్ → 2–ఫ్యాక్టర్ ఆథెంటిఫికేషన్ని ఎనేబుల్ చేయాలి → బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్లను వాడాలి → ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దు → సందేహాస్పద లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలి → అధికారిక సోర్సుల నుంచే యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి ప్రస్తుత ప్రపంచంలో మిమ్మల్ని ముంచినా మీ ఫోనే... మిమ్మల్ని కాపాడగలిగేది కూడా మీ చేతిలోని ఫోనే.ఫ్రాడ్ అని అనుమానం వస్తే.. వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సత్వరం ఫిర్యాదు చేస్తే రికవరీ చేసేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఏ మా త్రం జాప్యం చేసినా మోసగాళ్లు తప్పించుకునేందుకు అవ కాశం ఇచి్చనట్లవుతుంది. ఈ కింది వాటికి రిపోర్ట్ చేయాలి. → సెబీ ఆన్లైన్ కంప్లైంట్ పోర్టల్ → ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈ → మీ బ్రోకర్ → లోకల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ఆరోగ్యకరమైన మైండ్సెట్ పెట్టుబడులకు సంబంధించి ఆరోగ్యకరమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలి. → హైప్ని బట్టి కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయాలి → పోర్ట్ఫోలియోలో వైవిధ్యం పాటించాలి. అంటే డబ్బంతా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా, కొంత ఈక్విటీ, కొంత డెట్, కాస్తంత బంగారంలో పెట్టుబడి పెడితే ఎటు పోయి ఎటొచ్చీ ఏదైనా పడిపోయినా మరొకటి మెరుగ్గా ఉండటం వల్ల ఓవరాల్గా రిసు్కలు తగ్గుతాయి. → ‘హాట్ టిప్స్’ వెంటబడకూడదు. చేతులు కాల్చుకోకూడదు. → FOMO.. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఇక ఎప్పటికీ కుదరదు, ఆ మంచి అవకాశం ఇక దొరకనే దొరకదు అన్నట్లుగా ఒక్కోసారి కంగారు పుట్టించే పరిస్థితులు ఎదురవుతుంటాయి. స్కామర్లు ఇలాంటివాటిని ఆయుధాలుగా వాడుకుంటూ ఉంటారు. జాగ్రత్త వహించాలి. → సిసలైన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బోరింగ్గానే ఉంటుంది. కానీ అదే మంచిది. ఓపిగ్గా, రీసెర్చ్ చేసి, క్రమశిక్షణతోనే పెట్టుబడుల ఫలాలు అందుకోవచ్చు. షార్ట్కట్లంటూ ఉండవు. స్టాక్ మార్కెట్ అనేది అన్ని వివరాలను తెలుసుకుని, జాగ్రత్తగా వ్యవహరించే ఇన్వెస్టర్లకు మాత్రమే లాభాలనిస్తుంది. అజాగ్రత్తగా ఉండే వారిని నష్టాలతో శిక్షిస్తుంది. పెట్టుబడులకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉండాలి. అదే సమయంలో అప్రమత్తంగానూ ఉండాలి. రాత్రికి రాత్రి లాభాలు గడించాలనుకోవడం కాకుండా పెట్టుబడిని కాపాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలి!. -
‘కేంద్రం–రాష్ట్రాలు రెండూ లోటు తగ్గించుకోవాలి’
భారతదేశ ఆర్థిక సుస్థిరతకు పెరుగుతున్న ఆర్థిక లోటు (Fiscal Deficit) ప్రధాన బలహీనతగా మారిందని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అర్వింద్ సుబ్రహ్మణియన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ లోటును తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల ‘భారతదేశ అభివృద్ధి మార్గం’ అనే అంశంపై నిర్వహించిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణపై పలు వ్యాఖ్యలు చేశారు.‘ప్రికోసియస్ డెమోక్రసీ’ ప్రభావంభారతదేశం అభివృద్ధికి ముందే పరిణతి చెందిన ప్రజాస్వామ్యం (Precocious Democracy)గా అవతరించిందని సుబ్రహ్మణియన్ అభివర్ణించారు. సమాజంలోని ప్రతి వర్గం నుంచి వచ్చే డిమాండ్లను ప్రజాస్వామ్యబద్ధంగా తీర్చాల్సి రావడం కీలకంగా మారుతుంది. ఇది దేశ ఆర్థిక అలవాట్లపై ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారత ప్రభుత్వ లోటు సగటున జీడీపీలో 10 శాతం వరకు ఉంటోందన్నారు. మనతో సమానంగా ఎదుగుతున్న ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని ఆయన గుర్తుచేశారు.సంక్షేమ పథకాలపై సమీక్ష అవసరంప్రస్తుతం భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుండటం వల్ల ద్రవ్యలోటును తట్టుకోగలుగుతోందని ఆయన విశ్లేషించారు. అయితే, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ‘కేంద్రం, రాష్ట్రాలు రెండూ తమ ఆర్థిక లోటును క్రమంగా తగ్గించుకోవాలి. నగదు బదిలీ పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలపై చేసే వ్యయాన్ని పునసమీక్షించాలి. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరం లేకపోయినా, బాధ్యతాయుతమైన వ్యయం తప్పనిసరి’ అని చెప్పారు.ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్! -
బ్యాంకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర ఆర్థిక సంస్థల సేవలపై అసంతృప్తిగా ఉన్న వినియోగదారులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. జులై 2026 నుంచి అమలులోకి రానున్న నూతన అంబుడ్స్మన్ పథకం ద్వారా బాధితులకు భారీ స్థాయిలో పరిహారం పొందే అవకాశం కల్పించింది.పరిమితి లేని వివాద పరిష్కారంకొత్తగా తీసుకువచ్చిన ‘రిజర్వ్ బ్యాంక్–ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ (RB-IOS) 2026’ ప్రకారం.. వినియోగదారుల ఫిర్యాదులో ఉన్న వివాదాస్పద మొత్తంపై ఇకపై ఎటువంటి గరిష్ట పరిమితి ఉండదు. అంటే, వివాదంలో ఉన్న మొత్తం ఎంత పెద్దదైనా అంబుడ్స్మన్ దాన్ని విచారించవచ్చు. అయితే, ఫిర్యాదు వల్ల కలిగిన నష్టాలకు (Consequential Loss) సంబంధించి అంబుడ్స్మన్ గరిష్టంగా రూ.30 లక్షల వరకు పరిహారం మంజూరు చేసే అధికారం కలిగి ఉంటుంది. 2021 పథకం ప్రకారం ఇది రూ.20 లక్షలుగా ఉంది.మానసిక వేదనకు అదనపు పరిహారంకేవలం ఆర్థిక నష్టమే కాకుండా, ఫిర్యాదుదారుడు అనుభవించిన మానసిక వేదన, సమయం వృథా, ఖర్చులకుగానూ ప్రత్యేకంగా గరిష్టంగా రూ.3 లక్షల వరకు పరిహారం చెల్లించాలని అంబుడ్స్మన్ ఆదేశించవచ్చు. గతంలో ఇది రూ.1 లక్షగా ఉంది. కొత్త నిర్ణయం వినియోగదారుల పట్ల ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.కీలక మార్పులుఈ సవరించిన పథకం జులై 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, నాన్-బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడర్లు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఆర్బీఐ తన అధికారులను మూడు సంవత్సరాల కాలపరిమితితో అంబుడ్స్మన్ లేదా డిప్యూటీ అంబుడ్స్మన్గా నియమిస్తుంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ (CRPC) ఏర్పాటు చేస్తారు.ఫిర్యాదు చేయడం ఎలా?వినియోగదారులు తమ ఫిర్యాదులను డిజిటల్ లేదా ఫిజికల్ రూపంలో నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా https://cms.rbi.org.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసేవారు ఈమెయిల్ ద్వారా లేదా పోస్ట్/నేరుగా సంబంధిత సెంట్రలైజ్డ్ సెంటర్కు పంపవచ్చు. ఈ కొత్త నిబంధనలు ఆర్థిక రంగంలో పారదర్శకతను పెంచుతాయని, సామాన్య వినియోగదారులకు బ్యాంకింగ్ వ్యవస్థపై మరింత నమ్మకాన్ని కలిగిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు -
తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వీధికుక్కల పట్ల అత్యంత క్రూరమైన చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. జంతు సంక్షేమ నిబంధనలను తుంగలో తొక్కి మెగ్నీషియం సల్ఫేట్ వంటి రసాయనాలను ఉపయోగించి కుక్కలను సామూహికంగా హతమారుస్తున్నట్లు జంతు పరిరక్షణ కార్యకర్తలు, పశువైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విషప్రయోగం - అత్యంత బాధాకరమైన మరణంసాధారణంగా వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే మెగ్నీషియం సల్ఫేట్ మార్కెట్లో తక్కువ ధరకు సులభంగా లభిస్తుంది. దీన్ని ద్రవ రూపంలోకి మార్చి నిపుణుల ద్వారా కుక్కల గుండెకు నేరుగా ఇంజెక్ట్ చేస్తున్నారని సమాచారం. ‘ఇది చాలా పాత, క్రూరమైన పద్ధతి. మెగ్నీషియం సల్ఫేట్ను నేరుగా గుండెకు ఇంజెక్ట్ చేయడం వల్ల జంతువులకు తక్షణమే అత్యంత బాధాకరమైన మరణం సంభవిస్తుంది. ఇది సాధారణ వ్యక్తులు చేసే పని కాదు, శిక్షణ పొందిన వారే ఇలా చేస్తున్నారు’ అని ఒక సీనియర్ పశువైద్యుడు వెల్లడించారు.విచ్చలవిడిగా రసాయనాల వాడకంకుక్కలను చంపడానికి కేవలం మెగ్నీషియం సల్ఫేట్ మాత్రమే కాకుండా ‘స్ట్రిక్నైన్ హైడ్రోక్లోరైడ్’ వంటి ప్రమాదకర రసాయనాలను కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 5 గ్రాముల స్ట్రిక్నైన్ హైడ్రోక్లోరైడ్ పొడితో వందలాది కుక్కలను చంపవచ్చు. దీన్ని మాంసంలో కలిపి ఎరగా వేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు సైనైడ్ ఉపయోగించి కూడా కుక్కలను చంపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ‘కొంగ మందు’ అని పిలిచే సాంప్రదాయ మందులను కూడా ఆహారంలో కలిపి ఇచ్చి కుక్కల ప్రాణాలు తీస్తున్నారు.చట్టం ఏం చెబుతోంది?భారత జంతు సంక్షేమ బోర్డు (AWBI) నిబంధనల ప్రకారం, వీధికుక్కలను చంపడం నేరం. కేవలం నయం చేయలేని వ్యాధులు ఉన్నప్పుడు లేదా ప్రాణాంతక గాయాలైనప్పుడు మాత్రమే శాంతియుత మరణానికి ప్రత్యేక పద్ధతులు అనుసరించాలి. ఇందుకోసం ప్రభుత్వం, జంతు సంక్షేమ బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాయి.దీని ప్రకారం, ప్రాణాంతక వ్యాధులు లేదా తీవ్రమైన గాయాలతో బాధపడుతున్న కుక్కలకు మాత్రమే అనుమతుల మేరకు పెంటనాల్ సోడియం, సోడియం థియోపెన్టోన్ వంటి మందులను ఉపయోగించి శాంతియుత మరణం ప్రసాదించాలి. అయితే, ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా మెగ్నీషియం సల్ఫేట్, సైనైడ్, స్ట్రిక్నైన్ హైడ్రోక్లోరైడ్ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి కుక్కలను అక్రమంగా హతమారుస్తున్నారు.సులభంగా అందుబాటులో..ఈ మందుల లభ్యత విషయంలో కూడా చాలా అనుమానాలున్నాయి. పెంటనాల్ సోడియం వంటి మందులు కేవలం అధికారిక ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే లభిస్తాయి. వీటి వినియోగంపై కఠినమైన నిఘా ఉంటుంది. దీనికి భిన్నంగా కుక్కలను చంపడానికి వాడుతున్న ఇతర రసాయనాలు సాధారణ రిటైల్ దుకాణాల్లో ఎటువంటి పరిమితులు లేకుండా ఎవరికైనా సులభంగా దొరుకుతున్నాయి. ఇది అసాంఘిక శక్తులకు, నిబంధనలు ఉల్లంఘించే వారికి వరంగా మారింది.నిబంధనల ప్రకారం, ఏదైనా జంతువుకు ప్రాణాపాయ స్థితిలో మందు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా అర్హత కలిగిన వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నిపుణులు కాని వారిని నియమించి ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేకుండా సామూహికంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం. ఇలాంటి అక్రమ పద్ధతులు జంతు హింసను ప్రోత్సహించడమే కాకుండా చట్టంలోని నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లేనని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విష రసాయనాల విక్రయాలపై నియంత్రణ విధించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా! -
అమెరికా దెబ్బకు విదేశీ విద్యా రుణ వ్యవస్థ డీలా
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా వీసా నిబంధనలు సవాలుగా మారుతున్నాయి. అమెరికా వీసా విధానంలో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ విద్యా రుణాల మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఎడ్యుకేషన్ లోన్ ప్లాట్ఫారమ్ల గణాంకాల ప్రకారం, 2024తో పోలిస్తే 2025 సంవత్సరంలో విదేశీ విద్యా రుణాలు 30 నుంచి 50 శాతం వరకు క్షీణించాయి.తగ్గుతున్న రుణాల పరిమాణంఅమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆ దేశానికి సంబంధించిన రుణాల పరిమాణం ఏకంగా 60 శాతం పడిపోయింది. విద్యార్థులు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, తూర్పు యూరప్ దేశాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ అమెరికా యూనివర్సిటీల స్థాయిలో రుణాల పరిమాణం ఉండటం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆర్బీఐ డేటారిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన విదేశీ రిమిటెన్సుల గణాంకాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. విదేశీ విద్య కోసం భారత్ నుంచి పంపే నిధుల ప్రవాహంలో (రిమిటెన్సులు) స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా జనవరిలో ప్రారంభమయ్యే ‘స్ప్రింగ్ అడ్మిషన్ సీజన్’ను పరిశీలిస్తే.. 2024 జనవరిలో 449 మిలియన్ డాలర్లుగా ఉన్న రిమిటెన్సులు 2025 జనవరి నాటికి 368 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే ఈ కాలంలో సుమారు 18 శాతం మేర తగ్గుదల నమోదైంది.అత్యధిక అడ్మిషన్లు జరిగే ఆగస్టు ‘ఫాల్ సీజన్’లో ఈ క్షీణత మరింత తీవ్రంగా ఉంది. 2024 ఆగస్టులో విదేశీ విద్యా అవసరాల కోసం 416 మిలియన్ డాలర్లు భారత్ నుంచి వెళ్లగా, 2025 ఆగస్టు నాటికి ఆ మొత్తం 319 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్లో ఏకంగా 23 శాతం తగ్గుదల కనిపిస్తోంది. ఇది విదేశీ విద్యా రుణ మార్కెట్పై ఉన్న ఒత్తిడిని, విద్యార్థుల విదేశీ ప్రయాణాల్లో వచ్చిన మార్పును స్పష్టంగా సూచిస్తోంది.(గమనిక: పైన తెలిపిన గణాంకాల్లో విద్యార్థుల జీవన వ్యయం కూడా కలిసి ఉంది)నిపుణుల హెచ్చరికఅభివృద్ధి చెందిన దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల సమీప భవిష్యత్తులో విద్యా రుణాల వృద్ధి మందగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇన్క్రెడ్ ఫైనాన్షియల్ తన ఆస్తుల నిర్వహణలో 24 శాతం విద్యా రుణాలు ఉండటంతో ఈ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాపర్టీ లోన్ల వంటి ఇతర విభాగాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. విద్యా రుణాలిచ్చే బోర్డర్ప్లస్ కంపెనీ ఒకటి రెండు సంవత్సరాల వరకు కొత్త రుణాల మంజూరు బలహీనంగానే ఉంటుందని తెలిపింది.ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బ్యాంకులు.. అవాన్స్, క్రెడిలా వంటి ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలో ప్రధానంగా సర్వీసులు అందిస్తున్నాయి. అమెరికా వీసా విధానాల్లో సానుకూల మార్పులు వచ్చే వరకు ఈ రంగంలో ఇదే రకమైన స్తబ్దత కొనసాగే అవకాశం కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు? -
నార్త్ బ్లాక్లోనే బడ్జెట్ పత్రాల ముద్రణ
దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. అయితే ఈసారి ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం కొత్త పార్లమెంట్ భవనానికి మారినప్పటికీ, బడ్జెట్ పత్రాల ముద్రణ మాత్రం పాత పార్లమెంట్ భవనంలోని నార్త్ బ్లాక్లోనే కొనసాగనుంది.కొత్త భవనంలో లేని సౌకర్యంకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమ బృందంలోని కీలక అధికారులు 2025 సెప్టెంబర్లోనే ఆధునిక సెంట్రల్ సెక్రటేరియట్లోని ‘కర్తవ్య భవన్’కు మారారు. అయితే, అక్కడ బడ్జెట్ పత్రాల ముద్రణకు అవసరమైన అత్యంత సురక్షితమైన, ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పాత పార్లమెంట్ బిల్డింగ్లోని నార్త్ బ్లాక్లో ఉన్న ప్రెస్లోనే ముద్రణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.బడ్జెట్ పత్రాల ముద్రణను 1950 వరకు రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. 1950లో పత్రాలు లీక్ కావడంతో ముద్రణను మింట్ రోడ్డులోని ప్రెస్కు మార్చారు. తర్వాత 1980 నుంచి భద్రతా కారణాల దృష్ట్యా నార్త్ బ్లాక్లోని ప్రత్యేక ప్రెస్కు ఈ బాధ్యతలు బదిలీ చేశారు.రెండు వారాల క్వారంటైన్.. కట్టుదిట్టమైన భద్రతబడ్జెట్ ముద్రణ అనేది అత్యంత రహస్యంగా సాగే ప్రక్రియ. ముద్రణలో పాల్గొనే సిబ్బందిని సుమారు రెండు వారాల పాటు నార్త్ బ్లాక్లోని గదుల్లోనే ఉంచుతారు. ఈ సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. కీలక అధికారుల ఫోన్లపై కూడా పరిమితులు ఉంటాయి. బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు వీరు అక్కడే ఉంటూ ఈ పుస్తకాల తయారీని పర్యవేక్షిస్తారు.త్వరలో ‘హల్వా వేడుక’బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగింపునకు సూచికగా నిర్వహించే సాంప్రదాయ ‘హల్వా వేడుక’ వచ్చే వారం జరగనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ బడ్జెట్ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, రికార్డుల కోసం పరిమిత సంఖ్యలో పత్రాల ముద్రణ కోసం ఈ కసరత్తును పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్! -
ఎంఎస్ఎంఈ రుణాలకు తోడుగా ‘జన్సమర్థ్’
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణ వితరణ మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) అన్నీ కలిసి ఎంఎస్ఎంఈ క్రెడిట్ కోసం ఒకే విధమైన, ప్రమాణీకరించిన (Standardized) డిజిటల్ విధానాన్ని అనుసరించాలని కేంద్రం ఆదేశించింది.జన్సమర్థ్ పోర్టల్తో వేగంగా రుణాలుకేంద్ర క్యాబినెట్ సూచనల ప్రకారం, రూ.1 కోటి వరకు ఎంఎస్ఎంఈ రుణాలన్నింటినీ ఇకపై ‘జన్సమర్థ్’ (JanSamarth) పోర్టల్ ద్వారానే ప్రాసెస్ చేయనున్నారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులు ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్ను వాడటం వల్ల రుణ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని నమ్ముతున్నారు. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్లు, ఆదాయపు పన్ను రిటర్న్లు (ఐటీఆర్), జీఎస్టీ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్లను బ్యాంకులు ఆటోమేటిక్గా పరిశీలిస్తాయి. వ్యక్తిగతంగా పరిశీలన తగ్గడం వల్ల రుణ అప్లికేషన్ల తిరస్కరణ రేటు తగ్గి వేగంగా నిధులు మంజూరవుతాయి.క్రెడిట్ వృద్ధిగడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ఎంఈ రంగానికి బ్యాంకులు అందించిన మద్దతు గణనీయంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో సుమారు రూ.26.43 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు పంపిణీ చేశాయి. దాదాపు 13 మిలియన్ల (1.3 కోట్లు) ఖాతాల్లోకి ఈ రుణాలు చేరాయి. 2024 జనవరి-అక్టోబర్ కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించిన క్రెడిట్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 32.5 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ఈ నూతన డిజిటల్ ప్రణాళిక వల్ల చిన్న వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పుతుంది. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంతో అర్హులైన ప్రతి చిన్న వ్యాపారికి సకాలంలో పెట్టుబడి అందుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్! -
భారత వలసదారులపై కోపమెందుకు?
అమెరికా అభివృద్ధిలో భాగస్వాములైన భారతీయ వలసదారులు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా అత్యంత శాంతియుతమైన, విజయవంతమైన వర్గంగా పేరుగాంచిన భారతీయులపై ఇటీవల కాలంలో ఆన్లైన్ వేదికగా, రాజకీయంగా అసహనం పెరుగుతోంది. అమెరికాను వివిధ సంస్కృతుల కలయికగా అభివర్ణించే ‘మెల్టింగ్ పాట్’(Melting Pot- వివిధ సంస్కృతుల సమ్మేళనం) సిద్ధాంతానికి ఈ పరిణామాలు సవాలుగా మారుతున్నాయి.ఆన్లైన్ వేదికలపై..2025 నుంచి సోషల్ మీడియాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసా నిబంధనలపై జరుగుతున్న చర్చలు ద్వేషపూరిత వ్యాఖ్యలకు దారితీస్తున్నాయి. అమెరికా టెక్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే తప్పుడు ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగ మార్కెట్లో వస్తున్న మార్పులు కూడా వలసదారులపై వ్యతిరేకత పెరగడానికి కారణమవుతున్నాయి.రాజకీయ దుమారంప్రస్తుత అమెరికా రాజకీయ పరిణామాలు భారతీయుల్లో మరింత అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. అక్కడి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (JD Vance) గతంలో చేసిన ‘అధిక సంఖ్యలో ఉన్న వలసల వల్ల అమెరికా ప్రయోజనాలు నీరుగారుతున్నాయి’ అనే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ క్రమంలో ఆయన భార్య భారత సంతతికి చెందిన ఉషా వాన్స్ కూడా ఆన్లైన్లో ట్రోల్ అయ్యారు. నిక్ ఫ్యుయెంటెస్ వంటి తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు ఉషా వాన్స్ను లక్ష్యంగా చేసుకుని జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. దీనిపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకుడు వివేక్ రామస్వామి ఘాటుగా స్పందించారు. ఇటువంటి ద్వేషపూరిత భావజాలానికి పార్టీలో చోటు ఉండకూడదని స్పష్టం చేశారు.చారిత్రక పునరావృతంచరిత్రను గమనిస్తే అమెరికాలో ఆర్థిక మాంద్యం లేదా ఉద్యోగాల కోత ఉన్న సమయాల్లో వలసదారులపై దాడులు పెరగడం కొత్తేమీ కాదు. గతంలో ఐరిష్, ఇటాలియన్, జపనీస్ వలసదారులు కూడా ఇటువంటి వివక్షను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం భారతీయుల పట్ల కనిపిస్తున్న అసహనం కూడా అటువంటి ఆర్థిక అభద్రతాభావం నుంచే పుట్టుకొస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.తాజా గణాంకాల ప్రకారం వివక్ష ఇలా..49 శాతం భారతీయ అమెరికన్లు గడిచిన ఏడాది కాలంలో ఏదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొన్నారు. చర్మం రంగు, భాష యాస, మతపరమైన ఆచారాల ఆధారంగా భారతీయులను వేరుగా చూస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తున్న భారతీయ నిపుణులపై ఈ విధమైన అసహనం ప్రదర్శించడం ఇరు దేశాల సంబంధాలపైనే కాకుండా, అమెరికా ప్రజాస్వామ్య విలువలపై కూడా ప్రభావం చూపుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం వలసదారులను విమర్శించడం ఆపేయాలని, ఆన్లైన్లో ద్వేషాన్ని అరికట్టాలని పౌర సమాజం కోరుతోంది.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్! -
నిధులు మూరెడు.. పనులు జానెడు!
భారతదేశ గ్రామీణ అభివృద్ధి పథంలో అసలైన సవాలు నిధుల కొరత కాదని నిపుణులు చెబుతున్నారు. ఆ నిధులను సమర్థంగా ఖర్చు చేస్తూ ఫలితాలుగా మార్చగల మానవ వనరుల కొరత ఎక్కువగా ఉందని విధానకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు వేల కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతర సాంకేతిక మద్దతు ఇచ్చే వ్యవస్థ లేకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ లోటును పూడ్చేందుకు ప్రొఫెషనల్ వ్యక్తులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.అంకెల్లో నిధుల వెల్లువప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే గ్రామీణ ఉపాధికి నిధుల కొరత లేదన్నది స్పష్టమవుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ (2024-25)కు సుమారు రూ.1.32 లక్షల కోట్లు కేటాయించారు. ఎంజీనరెగా(ప్రస్తుతం వీబీ జీరామ్జీ)కు రూ.86,000 కోట్లు ఇచ్చారు. ఒడిశా వంటి రాష్ట్రాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే రూ.33,919 కోట్లు కేటాయించాయి. ఇంత భారీ పెట్టుబడులు పెడుతున్నా సమీక్షలు కేవలం ‘ఎంత మందికి లబ్ధి చేకూరింది? ఎన్ని ఎరువులు పంచారు?’ అనే గణాంకాలకే పరిమితమవుతున్నాయి. కానీ, ఆ పెట్టుబడుల వల్ల పంటల ఉత్పాదకత పెరిగిందా? రైతుల కుటుంబ ఆదాయం మెరుగుపడిందా? అన్న కీలక ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు.పరిష్కారమేంటి?ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం ఆఫీసు పనుల్లో నిమగ్నమై ఉండటంతో క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలిచే వ్యవస్థ అవసరం. దీనికోసం జాతీయ స్థాయిలో శిక్షణ పొందిన స్థానిక యువత పరిష్కారంగా తోస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.వీరి విధులు - బాధ్యతలుతమ సొంత గ్రామంలోనే ఉంటూ వాతావరణానుకూల సాగు, పశువైద్యం, నీటి నిర్వహణలో రైతులకు మార్గనిర్దేశం చేస్తారు.శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా ప్రభుత్వ గౌరవ వేతనంతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక సంఘాల నుంచి సర్వీసు ఫీజులు పొందవచ్చు.పంచాయతీ స్థాయిలో ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పథకాల అమలును పర్యవేక్షిస్తారు.తక్కువ ఖర్చు - ఎక్కువ లాభంశిక్షణలో పూర్తి చేసిన ఒక్కో వ్యక్తికి డిజిటల్ కిట్ కోసం సుమారు రూ.1 లక్ష వెచ్చిస్తే, 10,000 మందిని తయారు చేయడానికి అయ్యే ఖర్చు కేవలం రూ.100 కోట్లు మాత్రమే. ఇది వార్షిక వ్యవసాయ బడ్జెట్లో చాలా స్వల్ప భాగం. కానీ, ఈ చిన్న పెట్టుబడితో ప్రతి గ్రామంలో ఒక నిరంతర పర్యవేక్షణ, మద్దతు వ్యవస్థ ఏర్పడి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు వృథా కాకుండా సరైన ఫలితాలను ఇస్తాయి.తూర్పు ఆఫ్రికాలో కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు, కొన్ని ఆసియా దేశాల్లోని ఫీల్డ్ ఫెసిలిటేటర్లు ఇలాంటి విధానంతోనే విజయాలు సాధించారు. భారతదేశంలో ఇప్పటికే ఉన్న కృషి సఖీలు, ఎన్ఆర్ఎల్ఎం కేడర్లను కేవలం ప్రాజెక్టులకే పరిమితం చేయకుండా వారిని కీలక వనరులుగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.3,900 కోట్ల మద్యం బకాయిలు చెల్లించని ప్రభుత్వం -
టోకు ధరల సూచీ అంటే? దీని ప్రాధాన్యం తెలుసా?
ఆహార, ఆహారేతర పదార్థాల రేట్ల పెరుగుదలతో టోకు ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలా పెరిగింది. డిసెంబర్లో 0.83 శాతంగా నమోదైంది. ఇది ఎనిమిది నెలల గరిష్టం. క్రితం రెండు నెలల్లో నెగటివ్గా ఉన్న ధరల పెరుగుదల తాజాగా పాజిటివ్లోకి వచి్చంది.టోకు ధరల సూచీ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని (Inflation) కొలిచే అత్యంత కీలకమైన సాధనం. వినియోగదారుల వద్దకు చేరకముందే, అంటే టోకు మార్కెట్ లేదా తయారీదారుల స్థాయిలో వస్తువుల ధరల్లో వచ్చే మార్పులను ఇది ప్రతిబింబిస్తుంది.టోకు ధరల సూచీ ప్రాముఖ్యతఈ సూచీ ద్రవ్యోల్బణాన్ని ముందే పసిగట్టే ఒక సాధనం. తయారీదారులు లేదా టోకు వ్యాపారుల వద్ద వస్తువుల ధరలు పెరిగితే, కొద్ది రోజుల్లోనే ఆ ప్రభావం రిటైల్ (వినియోగదారుల) ధరల మీద పడుతుంది. దీనివల్ల ప్రభుత్వం, ప్రజలు భవిష్యత్తులో పెరగబోయే ధరలను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది.ప్రభుత్వ విధానాల రూపకల్పనదేశ ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రభుత్వం తన ఆర్థిక (Fiscal), ద్రవ్య (Monetary) విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లను సవరించడానికి డబ్ల్యూపీఐ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఏయే రంగాలలో ధరలు పెరుగుతున్నాయో గమనించి ఆయా ఉత్పత్తులపై సబ్సిడీలు ఇవ్వాలా లేదా దిగుమతి సుంకాలను తగ్గించాలా అనే నిర్ణయాలు తీసుకోవడానికి ఇది దోహదపడుతుంది.వ్యాపార, పెట్టుబడి నిర్ణయాలువ్యాపారవేత్తలు తమ ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేయడానికి ఈ డేటాను ఉపయోగిస్తారు. ముడి పదార్థాల ధరలు ఎలా మారుతున్నాయో తెలుసుకోవడం ద్వారా కంపెనీలు తమ వస్తువుల ధరలను నిర్ణయించుకుంటాయి. అలాగే, పెట్టుబడిదారులు మార్కెట్ ధోరణిని అర్థం చేసుకుని సరైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక గైడ్లా పనిచేస్తుంది.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం.. -
రూ.3,900 కోట్ల మద్యం బకాయిలు చెల్లించని ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మద్యం సరఫరా చేసే కంపెనీలకు మధ్య బకాయిల వివాదం ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుమారు రూ.3,900 కోట్లకు పైగా ఉన్న దీర్ఘకాలిక బకాయిలను చెల్లించాలని ప్రముఖ ఆల్కహాలిక్ బేవరేజ్ (అల్కోబెవ్) పరిశ్రమ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (CIABC) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.ఏడాది కాలంగా నిధులు పెండింగ్తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) ద్వారా మద్యం సరఫరాదారులకు చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుతం రూ.3,900 కోట్లు దాటిందని, ఇందులో రూ.900 కోట్లు గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నాయని సంఘాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం సరఫరా జరిగిన 45 రోజుల్లోపు చెల్లింపులు జరపాల్సి ఉండగా, ఆ నిబంధన అమలు కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాయి.రికార్డు స్థాయిలో ఆదాయంగడచిన పదేళ్లలో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం కళ్లు చెదిరే రీతిలో పెరిగింది.2014 ఆదాయం: సుమారు రూ.9,000 కోట్లు.2023-24 ఆదాయం: దాదాపు రూ.38,000 కోట్లు (నాలుగు రెట్లు పెరుగుదల).అక్టోబర్ 2025: కేవలం రిటైల్ లైసెన్స్ దరఖాస్తు ఫీజుల ద్వారానే ప్రభుత్వం రూ.3,000 కోట్లు వసూలు చేసింది.డిసెంబర్ 2025: మద్యం విక్రయాల టర్నోవర్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరిందనే అంచనాలున్నాయి.రాష్ట్ర మొత్తం పన్ను ఆదాయంలో మూడో వంతు వాటా ఈ రంగం నుంచే వస్తోంది. నెలకు సగటున రూ.2,300 నుంచి రూ.2,600 కోట్ల ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ బకాయిలు చెల్లించకపోవడం సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తుందని సంఘాలు హెచ్చరించాయి.తగ్గుతున్న పెట్టుబడులురాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని పరిశ్రమ వర్గాలు గణాంకాలతో సహా వివరించాయి. టీజీ ఐపాస్ కింద వచ్చిన అనుమతుల రూపేణా గత ఏడాది వచ్చిన పెట్టుబడులు రూ.28,100 కోట్లు ఉండగా, 2024-25లో అవి రూ.13,730 కోట్లకు (సుమారు 50% పైగా తగ్గుదల) పడిపోయాయి. త్వరలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) దావోస్ సదస్సులో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పాత ఒప్పందాలను గౌరవించి బకాయిలు చెల్లిస్తేనే అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయత పెరుగుతుందని సంఘాలు సూచించాయి.‘బకాయిల చెల్లింపులో ఆలస్యం కొనసాగితే సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన 70,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం.. -
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్.. నిధుల వినియోగంలో వైఫల్యం
దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం ఇంటర్న్షిప్ పథకం (PMIS) ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో వెనుకబడుతోంది. భారీ బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిధుల వినియోగం నామమాత్రంగా ఉంటోంది. ఇందుకు అభ్యర్థుల నుంచి స్పందన తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.నిధుల వినియోగంలో భారీ వ్యత్యాసంకార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు విస్తుపోయే నిజాలను వెల్లడిస్తున్నాయి. 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి రూ.11,500 కోట్లు కేటాయించారు. అయితే, నవంబర్ 2025 వరకు చేసిన ఖర్చు కేవలం సుమారు రూ.500 కోట్లు. మొత్తం కేటాయింపులో ఇది కేవలం 4 శాతం మాత్రమే. ఇంకా మిగిలి ఉన్న నిధులు దాదాపు రూ.10,800 కోట్లు.గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. అప్పట్లో నిధుల వినియోగం లేకపోవడంతో బడ్జెట్ను రూ.2,667 కోట్ల నుంచి రూ.1,078 కోట్లకు తగ్గించగా అందులోనూ కేవలం రూ.680 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.పథకం పట్ల యువతలో ఆసక్తి ఉన్నప్పటికీ కంపెనీలు ఇచ్చే ఆఫర్లను స్వీకరించడంలో వారు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ పథకం తొలి దశ లేదా పైలట్ ప్రాజెక్ట్ పరిశీలిస్తే, మొత్తం 1.27 లక్షల ఇంటర్న్షిప్ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ కంపెనీలు అభ్యర్థుల కోసం 82,000కు పైగా ఆఫర్లను జారీ చేశాయి. అయితే, వీటిలో కేవలం 28,000 మంది అభ్యర్థులు మాత్రమే ఆఫర్లను అంగీకరించారు. దీనివల్ల తొలి దశలో అంగీకార శాతం కేవలం 34 శాతానికే పరిమితమైంది.ఈ పథకం రెండో దశలో అభ్యర్థుల ఆసక్తి మరింత తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ దశలో 1.18 లక్షల అవకాశాలు లభ్యం కాగా, కంపెనీలు 83,000కు పైగా ఆఫర్లను ఇచ్చాయి. కానీ, అభ్యర్థుల నుంచి అంగీకారం లభించినవి 24,600 కంటే తక్కువగానే ఉన్నాయి. దీని ఫలితంగా రెండో దశలో అంగీకార రేటు 30 శాతం కంటే దిగువకు పడిపోవడం గమనార్హం. అయితే, నవంబర్ 30, 2025 నాటికి ఈ పథకం కింద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారి సంఖ్య కేవలం 2,066 మాత్రమే ఉండటం పథకం నత్తనడకను సూచిస్తోంది.కారణం ఏంటి?ఈ పథకం కింద ఇంటర్న్లకు నెలకు రూ.5,000 స్టైపెండ్, ఒకసారి రూ.6,000 గ్రాంట్, బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈ మొత్తం చాలా స్వల్పమని, అందుకే యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుకు రావడం లేదని అధికారులు అంతర్గతంగా విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చకపోతే బడ్జెట్లో కేటాయించిన భారీ నిధులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం.. -
రష్యా చమురు దిగుమతుల్లో భారత్ స్థానం ఎంతంటే..
అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా విధించిన కఠినమైన ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్ వెనకబడింది. 2025 డిసెంబరు నాటికి భారత్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిందని యూరోపియన్ థింక్ ట్యాంక్ ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’(CREA) తన తాజా నివేదికలో వెల్లడించింది.గణాంకాలు ఇలా..సీఆర్ఈఏ డేటా ప్రకారం, నవంబర్ నెలలో 3.3 బిలియన్ యూరోలుగా ఉన్న భారత రష్యన్ హైడ్రోకార్బన్ల దిగుమతులు డిసెంబరు నాటికి 2.3 బిలియన్ యూరోలకు తగ్గాయి. ఇదే సమయంలో టర్కీ 2.6 బిలియన్ యూరోల కొనుగోళ్లతో రెండో స్థానానికి చేరగా, చైనా 6 బిలియన్ యూరోల వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.డిసెంబరులో భారత్ దిగుమతుల వివరాలుముడి చమురు: 1.8 బిలియన్ యూరోలు (మొత్తం దిగుమతుల్లో 78%)బొగ్గు: 424 మిలియన్ యూరోలుచమురు ఉత్పత్తులు: 82 మిలియన్ యూరోలుతగ్గుదలకు ప్రధాన కారణాలుఅమెరికా ఆంక్షల సెగ: ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా నిధులను అడ్డుకోవాలనే లక్ష్యంతో అమెరికాకు చెందిన ‘ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్’ (OFAC) చర్యలు చేపట్టింది. దాంతో రష్యాకు చెందిన ప్రధాన చమురు సంస్థలైన రోస్ నెఫ్ట్, లుకోయిల్పై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల భయంతో భారతీయ కంపెనీలు వెనక్కి తగ్గాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యూహాత్మక నిర్ణయం: భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (జామ్ నగర్), రష్యన్ ముడి చమురు వినియోగాన్ని ఏకంగా సగానికి (50%) తగ్గించింది. గతంలో రోస్ నెఫ్ట్ ద్వారా సరఫరా అయిన కార్గోలను మాత్రమే తీసుకున్న రిలయన్స్, కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇతర మార్గాలను వెతుక్కుంటోంది.ప్రభుత్వ రంగ సంస్థల కోత: ప్రైవేట్ సంస్థలే కాకుండా, ప్రభుత్వ రంగ రిఫైనర్లు కూడా రష్యా నుంచి దిగుమతులను 15 శాతం వరకు తగ్గించుకున్నాయి. హెచ్పీసీఎల్(HPCL), మంగళూరు రిఫైనరీ (MRPL) వంటి సంస్థలు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) మాత్రం ఆంక్షలు లేని సంస్థల నుంచి మాత్రమే పరిమితంగా దిగుమతులు చేస్తోంది.2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకే చమురు లభించడంతో భారత్ ఒక దశలో 35 శాతం వరకు రష్యాపైనే ఆధారపడింది. కానీ, ప్రస్తుత అంతర్జాతీయ ఒత్తిళ్లు, ఆంక్షల కారణంగా ఇది 25 శాతానికి పడిపోయింది. భారతదేశం తన ఇంధన భద్రత కోసం ఇప్పుడు ఇతర మిడిల్ఈస్ట్ దేశాల వైపు మొగ్గు చూపుతోంది.ఇదీ చదవండి: వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్ కీలక ఆవిష్కరణ -
యూనియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,073 కోట్లను తాకింది. ప్రొవిజన్లు భారీగా తగ్గడం ఇందుకు అనుకూలించింది. అయితే నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 9,328 కోట్లకు చేరింది. బ్యాంకింగ్ వ్యవస్థకంటే తక్కువగా రుణ వృద్ధి 7 శాతానికి పరిమితంకావడం, నికర వడ్డీ మార్జిన్లు 0.15 శాతం నీరసించి 2.76 శాతానికి చేరడం ప్రభావం చూపాయి. డిపాజిట్లు సైతం 3.4 శాతం మాత్రమే పుంజుకున్నాయి. వడ్డీయేతర ఆదాయం 3 శాతం పెరిగి రూ. 4,541 కోట్లకు చేరింది. కాగా.. తాజా స్లిప్పేజీలు రూ. 2,199 కోట్ల నుంచి రూ. 1,820 కోట్లకు నీరసించగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.29 శాతం నుంచి 3.06 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రూ. 1,599 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 322 కోట్లకు పరిమితమయ్యాయి. వెరసి లాభాలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. బ్యాంక్ షేరు బీఎస్ఈలో 8 శాతం జంప్చేసి రూ. 180 వద్ద ముగిసింది. -
రిక్షా పుల్లర్ బిడ్డ, జడ్జి బిడ్డ ఒకే స్కూళ్లో చదవాలి: సుప్రీంకోర్టు
దేశంలో విద్యా వ్యవస్థ ద్వారా రాజ్యాంగం ఆశించిన ‘సౌభ్రాతృత్వం’ (Fraternity) లక్ష్యాన్ని సాధించే దిశగా సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఒక రిక్షా కార్మికుడి పిల్లలు మల్టీ మిలియనీర్ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిల్లలతో కలిసి ఒకే తరగతి గదిలో చదువుకున్నప్పుడే అసలైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించిన 25% ఉచిత సీట్ల అమలుపై విచారణ చేపట్టింది. ఇందుకు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్లతో కూడిన ధర్మాసనం సారథ్యం వహించింది.‘ఒక ఆటో డ్రైవర్ లేదా వీధి వ్యాపారి బిడ్డ, ధనవంతుల బిడ్డతో కలిసి పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చోవడం అనేది సహజమైన, నిర్మాణాత్మకమైన ప్రక్రియగా మారాలి. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. ఆర్టికల్ 21ఏ, 39(ఎఫ్) కింద దేశం చిన్నారులకు ఇచ్చిన హక్కు’ అని కోర్టు పేర్కొంది. కులం, తరగతి లేదా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఉండే ‘అనుమానాస్పద గుర్తింపులను’ పక్కన పెట్టి, విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకంగా ఉండటానికి సెక్షన్ 12 దోహదపడుతుందని ధర్మాసనం వివరించింది.కొఠారి కమిషన్ నివేదిక ప్రస్తావనసమాజంలోని అన్ని వర్గాల పిల్లలు వివక్ష లేకుండా విద్యను అభ్యసించే సాధారణ పాఠశాల వ్యవస్థపై గతంలో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదికను కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. పేద పిల్లలు ధనిక వాతావరణం(Rich Culture)లో ఇమడగలరా? అనే సందేహాలను పక్కన పెట్టాలని, ఉపాధ్యాయులు ఆ పిల్లల నేపథ్యాలను ఒక వనరుగా మార్చుకుని వారి గౌరవాన్ని పెంచాలని సూచించింది.రాష్ట్రాలకు, ఎన్సీపీసీఆర్కు ఆదేశాలువిద్యా హక్కు చట్టం (RTE)లోని సెక్షన్ 12(1)(సీ) కింద ఉన్న ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన నియమ నిబంధనలను రూపొందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 38 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి, వెనుకబడిన, బలహీన వర్గాల పిల్లల ప్రవేశాలకు సంబంధించి అవసరమైన సబార్డినేట్ చట్టాలను (Subordinate Legislation) సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.‘సమానత్వం, స్వేచ్ఛ అనేవి వ్యక్తిగత హక్కులు కావచ్చు. కానీ, సౌభ్రాతృత్వం అనేది సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సంస్థాగత ఏర్పాట్ల ద్వారానే సాధ్యమవుతుంది’ - సుప్రీంకోర్టుసంప్రదింపులుఈ నిబంధనల రూపకల్పన ప్రక్రియ కేవలం ఏకపక్షంగా సాగకూడదని, సంబంధిత విభాగాల భాగస్వామ్యం ఉండాలని కోర్టు సూచించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు (SCPCR), జాతీయ, రాష్ట్ర స్థాయి సలహా మండలితో సమగ్రంగా సంప్రదించి విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది.రిపోర్టింగ్, పర్యవేక్షణఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే దానిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ గడువును విధించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేసిన లేదా రూపొందించిన నియమ నిబంధనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్సీపీసీఆర్ను ఆదేశించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి మార్చి 31 లోగా ఒక సమగ్ర అఫిడవిట్ను దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం -
యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య సుంకాలు (Tariffs) ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా అమెరికాతో చేసే వ్యాపారంపై 25% అదనపు సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్-ఇరాన్ వాణిజ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలు చూద్దాం.భారత్-ఇరాన్ వాణిజ్యం: ప్రస్తుత స్థితిగతులుఅధికారిక గణాంకాల ప్రకారం, ఇరాన్తో భారత్కు ఉన్న వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఇరాన్ మధ్య మొత్తం వాణిజ్యం సుమారు 1.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది భారత్ మొత్తం ప్రపంచ వాణిజ్యంలో కేవలం 0.15% మాత్రమే. ఇది గతంలో కాస్త ఎక్కువగానే ఉండేది.ఎగుమతులు-దిగుమతులుభారత్ నుంచి ఇరాన్కు సుమారు 1.24 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఫార్మాస్యూటికల్స్ (మందులు), రసాయనాలు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ సుమారు 0.44 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. డ్రై ఫ్రూట్స్, సేంద్రీయ రసాయనాలు, గ్లాస్వేర్ ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి.ట్రంప్ హెచ్చరిక - భారత్పై ప్రభావంట్రంప్ ప్రకటించిన 25% అదనపు సుంకం వల్ల భారత ఎగుమతిదారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వ వర్గాల విశ్లేషణ ప్రకారం దీని ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.భారత్ ఇరాన్కు ఎగుమతి చేసే వస్తువుల్లో అత్యధిక భాగం ఆహార పదార్థాలు (బియ్యం, టీ పొడి), మందులు. ఇవి అంతర్జాతీయ ఆంక్షల పరిధిలోకి రావు.ఇరాన్ భారత్ టాప్-50 వాణిజ్య భాగస్వాముల జాబితాలో కూడా లేదు. అందువల్ల 25% సుంకం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపకపోవచ్చు.సముద్ర రవాణా, చాబహార్ ఓడరేవుభారత్కు వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ ఓడరేవు విషయంలో అమెరికా సానుకూల వైఖరిని ప్రదర్శించింది. చాబహార్ ఓడరేవు అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి భారత్కు ఉన్న ఆంక్షల మినహాయింపును ఏప్రిల్ 2026 వరకు పొడిగించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు రవాణా సౌకర్యం కల్పించే ఈ ఓడరేవు ద్వారా వాణిజ్యం కొనసాగింపుపై భారత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.చైనా, యూఈఏ, టర్కీకి దెబ్బఅమెరికా నిర్ణయం వల్ల చైనా, యూఏఈ, టర్కీ వంటి దేశాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ దిగుమతుల్లో వీటి వాటా చాలా ఎక్కువ. భారత్ తన వాణిజ్యాన్ని ఇప్పటికే వైవిధ్యీకరించుకోవడం వల్ల ఈ టారిఫ్ వార్ నుంచి తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత రెవెన్యూ వ్యవస్థలో ఆర్థిక సైనికులు -
భారత రెవెన్యూ వ్యవస్థలో ఆర్థిక సైనికులు
సాధారణంగా దేశ రక్షణ అనగానే మనకు సరిహద్దుల్లో పహారా కాసే సైనికులు గుర్తుకు వస్తారు. కానీ, ఆయుధాలు పట్టుకోకుండా, దేశ ఆర్థిక సరిహద్దులను కాపాడుతూ దేశాభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించే కొందరు సైనికులు మన మధ్యే ఉన్నారు. వారే కస్టమ్స్ అధికారులు, జీఎస్టీ ఇన్స్పెక్టర్లు. ప్రభుత్వ ఆదాయాన్ని రక్షించడంలో, వాణిజ్య, పన్నుల వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే వీరిని ‘ఆర్థిక సైనికులు’(Economic Soldiers) అని పిలుస్తున్నారు.కస్టమ్స్ అధికారుల పాత్రకస్టమ్స్ అధికారులు ప్రధానంగా ఓడరేవులు (Ports), విమానాశ్రయాలు, భూ సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తారు. దేశంలోకి వచ్చే, దేశం నుంచి వెలుపలికి వెళ్లే వస్తువుల కదలికలను వీరు పర్యవేక్షిస్తారు.అక్రమ రవాణా నిరోధం: బంగారం, మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత వస్తువుల స్మగ్లింగ్ను అడ్డుకోవడం వీరి ప్రధాన బాధ్యత.సుంకాల వసూలు: వస్తువుల సరైన విలువను నిర్ణయించి వాటిపై పడే పన్నులను వసూలు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చూస్తారు.వాణిజ్య నియంత్రణ: అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు అమలు చేస్తూ, దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంలో వీరు కీలకంగా వ్యవహరిస్తారు.జీఎస్టీ ఇన్స్పెక్టర్ల పాత్రదేశీయ పన్నుల వ్యవస్థకు జీఎస్టీ(GST) ఇన్స్పెక్టర్లు వెన్నెముక వంటి వారు. వస్తు సేవల పన్ను చట్టం సక్రమంగా అమలు అయ్యేలా చూడటం వీరి బాధ్యత.పన్ను చెల్లింపుల తనిఖీ: పన్ను రిటర్నులను ధ్రువీకరించడం, ఆడిట్లు నిర్వహించడం ద్వారా పన్ను ఎగవేతను అరికడతారు.దర్యాప్తు: పన్ను ఎగవేతకు పాల్పడే సంస్థలపై నిఘా ఉంచి, విచారణలు చేపడతారు.పన్ను చెల్లింపుదారులకు చట్టపరమైన నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తూ, సరళమైన పన్ను సంస్కృతిని ప్రోత్సహిస్తారు.దేశానికి భౌగోళిక భద్రత ఎంత ముఖ్యమో, ఆర్థిక భద్రత కూడా అంతే కీలకం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన (రోడ్లు, రైల్వేలు..), రక్షణ రంగానికి అవసరమైన నిధులు ఈ పన్నుల ద్వారానే లభిస్తాయి. ఆదాయ నష్టాన్ని నిరోధించడం ద్వారా ఈ అధికారులు దేశ అభివృద్ధిలో నేరుగా భాగస్వాములవుతున్నారు. అందుకే వీరిని దేశపు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే సైనికులుగా అభివర్ణిస్తున్నారు.నియామక ప్రక్రియభారతదేశంలో ఈ విభాగాల్లో చేరడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి.1. ఎస్ఎస్సీ సీజీఎల్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష ద్వారా ఇన్స్పెక్టర్ల నియామకం జరుగుతుంది. వీరు పే లెవల్-7 (సుమారు నెలకు రూ.44,900 ప్రాథమిక వేతనం) హోదాలో ఉండి క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తారు.2. యూపీఎస్సీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా నేరుగా అసిస్టెంట్ కమిషనర్ హోదాలో నియమితులవుతారు. వీరు పే లెవల్-10 (సుమారు నెలకు రూ.56,100 ప్రాథమిక వేతనం) హోదాలో ఉండి పరిపాలన, పర్యవేక్షక బాధ్యతలు చేపడతారు.వృత్తిపరమైన ఎదుగుదలఎస్ఎస్సీ సీజీఎల్ ద్వారా ఎంపికైన ఇన్స్పెక్టర్లు తమ రెండు సంవత్సరాల ప్రొబేషన్ కాలం, ఆ తదుపరి రెండు సంవత్సరాల కనీస సర్వీసు పూర్తి చేసిన తర్వాత సూపరింటెండెంట్గా ప్రమోషన్ పొందడానికి అర్హులు. ఖాళీలు, అనుభవం ఆధారంగా వారు అసిస్టెంట్ కమిషనర్లుగా, ఉన్నత స్థాయి అధికారులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమబద్ధమైన కెరీర్ వృద్ధి అధికారులకు కాలక్రమేణా పెద్ద బాధ్యతలను స్వీకరించేలా ప్రోత్సహిస్తుంది.కస్టమ్స్ అధికారులు, జీఎస్టీ ఇన్స్పెక్టర్లు భారతదేశ పాలనా వ్యవస్థలో కీలకం. వీరి పనితనం వెలుగులోకి రాకపోయినా, దేశ ఆర్థిక భద్రతలో వీరి ప్రభావం అపారం. సక్రమమైన వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ, అక్రమ మార్గాలను అడ్డుకుంటూ, వీరు దేశ గౌరవాన్ని, ఆర్థిక వ్యవస్థను నిరంతరం కాపాడుతున్నారు.- దవనం శ్రీకాంత్, కస్టమ్స్ అధికారి, రచయిత, కెరీర్ గైడెన్స్ కంట్రిబ్యూటర్.ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే.. -
ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ వేతన పరిమితి పెంపు?
దేశంలోని కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించే అవకాశం ఉంది. ఉద్యోగుల సామాజిక భద్రతా పథకాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈపీఎఫ్ఓ (ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ), ఈఎస్ఐసీ (ఉద్యోగుల స్టేట్ బీమా సంస్థ)ల వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ రెండు సంస్థల వేతన పరిమితిని నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య స్థాయికి పెంచాలని భావిస్తోంది.ప్రస్తుతం ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీల మధ్య వేతన పరిమితుల్లో భారీ వ్యత్యాసం ఉంది.ఈపీఎఫ్ఓ పరిమితి: నెలకు రూ.15,000 (ఇది 2014 సెప్టెంబర్ నుంచి మార్పు చేయలేదు).ఈఎస్ఐసీ పరిమితి: నెలకు రూ.21,000.ఈ వ్యత్యాసం వల్ల వేతనాల పెరుగుదల కారణంగా చాలా మంది ఉద్యోగులు సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు. ద్రవ్యోల్బణం, పెరిగిన కనీస వేతనాలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రెండు పథకాలను ఏకరీతిగా చేయడం ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం.సుప్రీంకోర్టు ఆదేశాలుఈ తాజా పరిణామాల్లో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు అత్యంత కీలకంగా మారాయి. జనవరి 2026 ప్రారంభంలో (జనవరి 5 నాటి సమాచారం ప్రకారం) సుప్రీం కోర్టు, ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి, ఈపీఎఫ్ఓ బోర్డుకు నాలుగు నెలల గడువు విధించింది. దశాబ్ద కాలంగా పరిమితి మారకపోవడంపై పిటిషనర్లు, ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటానికి ఇది ఒక విజయంగా భావించవచ్చు.లబ్ధిదారులపై ప్రభావంఈ మార్పు అమల్లోకి వస్తే సామాజిక భద్రతా వలయం గణనీయంగా విస్తరిస్తుంది. ఈపీఎఫ్ఓ పరిధిలో ప్రస్తుతం ఉన్న 8.5 కోట్ల మంది సభ్యుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈఎస్ఐసీలో ప్రస్తుతం ఉన్న 14 కోట్ల మంది లబ్ధిదారులకుతోడు పరిమితి పెంపుతో మరిన్ని కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభిస్తుంది.పెరగనున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి, యజమాని చెరో 12 శాతం వాటా జమ చేస్తారు. యజమాని వాటాలో 8.33 శాతం పెన్షన్ స్కీమ్ (EPS)కు, 3.67 శాతం పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. వేతన పరిమితి పెరిగితే ఈ కాంట్రిబ్యూషన్ మొత్తం పెరిగి ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ మరింత మెరుగ్గా మారుతాయి.సాధారణంగా ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం, ప్రస్తుతం ఉన్న రూ.15,000 గరిష్ట వేతన పరిమితి ఆధారంగా లెక్కలు కింది విధంగా ఉంటాయి.1. ఉద్యోగి వాటా (12%): గరిష్టంగా కట్ అయ్యే మొత్తం: రూ.15000*12%= రూ.1,800.2. యజమాని వాటా (12%): రెండు భాగాలుగా విడిపోతుంది.EPF (3.67%): 15000*3.67%= రూ.550.EPS (పెన్షన్ - 8.33%): 15000*8.33%= రూ.1250.కాబట్టి, ప్రస్తుత అధికారిక పరిమితి ప్రకారం మీ జీతం నుంచి నెలవారీ గరిష్టంగా కట్ అయ్యే పీఎఫ్ మొత్తం రూ.1,800.ఒకవేళ వేతన పరిమితి రూ.25,000 లేదా రూ.30,000 కి పెరిగితే..వేతన పరిమితిఉద్యోగి వాటా (12%)యజమాని వాటా (EPS + EPF)మొత్తం నెలకు జమ అయ్యేదిరూ.25,000రూ.3,000రూ.3,000 (EPS: రూ.2,083 + EPF: రూ.917)రూ.6,000రూ.30,000రూ.3,600రూ.3,600 (EPS: రూ.2,499 + EPF: రూ.1,101)రూ.7,200 -
లక్షకు పైగా యూఎస్ వీసాల రద్దు..
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా కారణాలు, చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘనల నేపథ్యంలో యూఎస్ విదేశాంగ శాఖ ఏడాది కాలంలో ఏకంగా 1,00,000 కంటే ఎక్కువ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దు చేసిన వాటిలో దాదాపు 8,000 విద్యార్థి వీసాలు, 2,500 ప్రత్యేక వర్క్ పర్మిట్లు ఉండటం గమనార్హం. క్రిమినల్ రికార్డులు లేదా చట్టపరమైన నిబంధనలు అతిక్రమించిన విదేశీ పౌరులపై చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.సురక్షిత అమెరికా లక్ష్యంగా..ఇటీవల తన అధికారిక ఎక్స్(గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా యూఎస్ విదేశాంగ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అమెరికాను సురక్షితంగా ఉంచడానికి వీసారద్దును, కఠినమైన నిబంధనలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ట్రంప్ పరిపాలనలో వీసా అమలును కఠినతరం చేయడం, యూఎస్లోకి ప్రవేశించిన తర్వాత కూడా వీసా హోల్డర్ల ప్రవర్తనను పర్యవేక్షించే స్క్రీనింగ్ విధానాల విస్తరణ వల్లే ఈ స్థాయిలో రద్దులు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.భారతీయులపై ప్రభావంఅమెరికా వీసా హోల్డర్లలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పరంగా చైనాను అధిగమించిన భారత్, ఇప్పుడు కఠినమైన యూఎస్ స్క్రీనింగ్ విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2025లో భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ నెమ్మదించింది. హెచ్-1బీ వీసాలపై ఉన్న భారతీయ ఐటీ నిపుణులు కూడా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొత్త H-1B వీసాలపై ప్రతిపాదిత 1,00,000 డాలర్ల ఫీజు విధించే నిబంధన కంపెనీలకు భారంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం యూఎస్ కోర్టుల్లో చట్టపరమైన సవాలును ఎదుర్కొంటోంది. ఒకవైపు భారత్లోని రాయబార కార్యాలయం వరుసగా రెండో ఏడాది 10 లక్షల కంటే ఎక్కువ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసినప్పటికీ, ఈ వీసాల రద్దు ఆందోళన కలిగిస్తోంది.🚨BREAKING: The State Department has now revoked over 100,000 visas, including some 8,000 student visas and 2,500 specialized visas for individuals who had encounters with U.S. law enforcement for criminal activity.We will continue to deport these thugs to keep America safe. pic.twitter.com/wuHVltw1bV— Department of State (@StateDept) January 12, 2026రంగంలోకి భారత ప్రభుత్వంపెరుగుతున్న వీసా రద్దులు, కఠిన నిబంధనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రభావిత భారతీయ పౌరులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వీసా ఆందోళనలను అధికారికంగా యూఎస్ దృష్టికి తీసుకెళ్లాం’ అని ప్రభుత్వం ప్రకటించింది.ఇదీ చదవండి: పండగ ముందు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. -
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై కీలక ప్రతిపాదనలు
భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమగ్రమైన బ్లూప్రింట్ను ప్రతిపాదించింది. ముఖ్యంగా నాన్-స్ట్రాటెజిక్ రంగాల్లో(జాతీయ భద్రత, క్లిష్టమైన మౌలిక సదుపాయాలు లేదా అత్యవసర సేవలతో సంబంధం లేని రంగాలు) ప్రభుత్వ వాటాలను తగ్గించడం ద్వారా సుమారు రూ.10 లక్షల కోట్ల మూలధనాన్ని సమకూర్చుకోవచ్చని అంచనా వేసింది.2026-27 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రైవేటీకరణ అనేది సుదీర్ఘ ప్రక్రియ కావడంతో మధ్యంతర చర్యగా నిర్ణీత కాలపరిమితితో కూడిన డిస్ఇన్వెస్ట్మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) విధానాన్ని సీఐఐ సూచించింది.రూ.10 లక్షల కోట్ల ప్రణాళిక ఇలా..సీఐఐ విశ్లేషణ ప్రకారం, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 78 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్ఈ)లో ప్రభుత్వ వాటాను దశలవారీగా తగ్గించడం ద్వారా భారీ నిధులను సమీకరించవచ్చు.మొదటి దశలో.. ప్రభుత్వం సుమారు రెండు సంవత్సరాల కాలపరిమితిలో 55 ప్రభుత్వ రంగ సంస్థలపై దృష్టి సారించాలని సీఐఐ సూచించింది. ప్రస్తుతం ఈ సంస్థల్లో ప్రభుత్వ వాటా 75 శాతం వరకు ఉంది. ఈ సంస్థల నుంచి వాటాల ఉపసంహరణ ద్వారా దాదాపు రూ.4.6 లక్షల కోట్లు సమీకరించే అవకాశం ఉందని పేర్కొంది. తక్కువ వాటా ఉన్న సంస్థలను ముందుగా ఎంచుకోవడం వల్ల ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని సీఐఐ భావిస్తోంది.రెండో దశలో.. ప్రభుత్వం మిగిలిన 23 ప్రభుత్వ రంగ సంస్థలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ సంస్థల్లో ప్రస్తుతం ప్రభుత్వ వాటా 75 శాతం కంటే ఎక్కువగా ఉంది. వీటిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా అదనంగా మరో రూ.5.4 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందే వీలుందని సీఐఐ తన విశ్లేషణలో వెల్లడించింది. ఇలా దశలవారీగా పకడ్బందీగా ముందుకు వెళ్లడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన వనరులను సమకూర్చుకోవచ్చని స్పష్టం చేసింది.ప్రస్తుతం బడ్జెట్ పత్రాల్లో ‘డిస్ఇన్వెస్ట్మెంట్’ అనే పదానికి బదులుగా ‘మిసెలేనియస్ క్యాపిటల్ రిసీప్ట్స్’ అనే పదాన్ని వాడుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ రూపంలో రూ.47,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా ఇప్పటివరకు వివిధ మార్గాల్లో రూ.27,500 కోట్లు సమకూరాయి.ప్రైవేటీకరణ ప్రక్రియకు సూచనలుప్రభుత్వం తనకు నచ్చిన సంస్థను అమ్మకానికి పెట్టడం కంటే, మార్కెట్లో ఇన్వెస్టర్లకు ఏ సంస్థలపై ఆసక్తి ఉందో ముందుగా అంచనా వేయాలి.డిమాండ్ ఎక్కువగా ఉన్న సంస్థలకే ప్రాధాన్యత ఇవ్వాలి.ఇన్వెస్టర్లకు ముందస్తు ప్లానింగ్ కోసం వీలుగా, రాబోయే మూడేళ్లలో ఏయే సంస్థలను ప్రైవేటీకరణ చేయబోతున్నారో ప్రభుత్వం స్పష్టమైన క్యాలెండర్ను ప్రకటించాలి.ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా మినిస్టీరియల్ బోర్డ్, నిపుణులతో కూడిన అడ్వైజరీ బోర్డ్, ఎగ్జిక్యూషన్ కోసం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టీమ్ను ఏర్పాటు చేయాలి.నేరుగా ప్రైవేటీకరణ సాధ్యం కాకపోతే ముందుగా ప్రభుత్వ వాటాను 51 శాతానికి తగ్గించి, ఆ తర్వాత క్రమంగా 33 నుంచి 26 శాతానికి తీసుకురావాలి.ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు యాపిల్ అత్యవసర హెచ్చరిక -
మూలధన వ్యయం నిధుల వినియోగంలో ఏపీ స్థానం ఎంతంటే..
రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయం-స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్(SASCI)’ పథకం కింద నిధులను పొందడంలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2026 బడ్జెట్ ప్రతిపాదనల నేపథ్యంలో వెలువడిన గణాంకాల ప్రకారం, యూపీ తర్వాత మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు అత్యధిక నిధులు పొందిన జాబితాలో ఉన్నాయి.నిధుల కేటాయింపు వివరాలుకేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం, ఈ పథకం కింద రాష్ట్రాలకు 50 ఏళ్ల కాలపరిమితితో వడ్డీ లేని రుణాలను కేంద్రం అందజేస్తోంది. ఇందులో భాగంగా 2025-26 బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1.5 లక్షల కోట్లను కేటాయించగా, జనవరి 4, 2026 నాటికి రూ.83,600 కోట్లను రాష్ట్రాలకు విడుదల చేశారు. అయితే అక్టోబర్ 2020 నుంచి ఇప్పటి వరకు (జనవరి 4, 2026 వరకు) ఈ పథకం కింద మొత్తం రూ.4.50 లక్షల కోట్లను రాష్ట్రాలకు అందజేశారు. గత మూడేళ్ల డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు రూ.52,000 కోట్లు, మధ్యప్రదేశ్, బిహార్కు చెరో రూ.36,000 కోట్లు, మహారాష్ట్ర, అస్సాంకు రూ.23,000 కోట్లకు పైగా కేటాయించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు రూ.21,590 కోట్లు కేటాయించడంతో ఏడో స్థానంలో నిలిచింది.పథకం నేపథ్యం - ప్రాధాన్యతకొవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు, రాష్ట్రాల్లో ఆస్తుల కల్పనను వేగవంతం చేయడానికి కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదట రూ.12,000 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం, రాష్ట్రాల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో 2025-26 నాటికి రూ.1,50,000 కోట్లకు చేరుకుంది. రాష్ట్రాలు తమకు నచ్చిన మూలధన ప్రాజెక్టుల కోసం ఈ నిధులను వాడుకోవచ్చు. కేంద్రం నిర్దేశించిన నిర్దిష్ట రంగాల్లో సంస్కరణలు చేపట్టినందుకు ప్రోత్సాహకంగా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు.బడ్జెట్ వేళ రాష్ట్రాల విజ్ఞప్తిఇటీవల జరిగిన బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో మెజారిటీ రాష్ట్రాలు ఎస్ఏఎస్సీఐ పథకాన్ని మరిన్ని నిధులతో కొనసాగించాలని కోరాయి. మూలధన వ్యయం వల్ల ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయని, ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి మరింత ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు యాపిల్ అత్యవసర హెచ్చరిక -
ధర దడ.. 3 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో 2025 డిసెంబర్లో ద్రవ్యోల్బణం 1.33 శాతం పెరిగింది. మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాది నవంబర్లో 0.71 శాతంగా, 2024 డిసెంబర్లో 5.22 శాతంగా నమోదైంది. తాజాగా ఇది పెరిగినప్పటికీ వరుసగా నాలుగో నెలలోనూ, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న కనిష్ట పరిమితి రెండు శాతం లోపే ఉండటం గమనార్హం. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, కూరగాయలు, మాంసం–చేపలు, గుడ్లు, మసాలా దినుసులు, పప్పులు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం, రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినట్లు సీపీఐ డేటాను విడుదల చేసిన సందర్భంగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో (0.76 శాతం) పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అధికంగా 2.03 శాతం స్థాయిలో నమోదైంది. ద్రవ్యోల్బణం అత్యధికంగా నమోదైన టాప్ అయిదు పెద్ద రాష్ట్రాల్లో కేరళ (9.49 శాతం), కర్ణాటక (2.99 శాతం), ఆంధ్రప్రదేశ్ (2.71 శాతం) ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ ఇటుగా) కట్టడి చేసే బాధ్యతను రిజర్వ్ బ్యాంక్కి కేంద్రం అప్పగించిన సంగతి తెలిసిందే. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 18.38 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి జనవరి 11 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా రూ. 18.38 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 8.82 శాతం పెరిగాయి. కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు పెరగడం, పన్నుల రిఫండ్లు నెమ్మదించడం ఇందుకు కారణం. ఆదాయ పన్ను శాఖ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం కార్పొరేట్ ట్యాక్స్ల వసూళ్లు నికరంగా 12.4 శాతం పెరిగి రూ. 8.63 లక్షల కోట్ల కు చేరగా, వ్యక్తుల–హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్), కార్పొరేట్యేతర వర్గాల నుంచి వసూళ్లు 6.39 శాతం పెరిగి రూ. 9.30 లక్షల కోట్లకు చేరాయి. సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను వసూళ్లు ఫ్లాట్గా రూ. 44,867 కోట్లుగా ఉన్నాయి. ట్యాక్స్ రిఫండ్లు 17 శాతం క్షీణించి రూ. 3.12 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, సమీక్షాకాలంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 4.14 శాతం పెరిగి రూ. 21.50 లక్షల కోట్లకు చేరాయి. -
బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత
బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంపై సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పత్రాలు చర్చనీయాంశం అయ్యాయి. మొండి బకాయిలు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, తనిఖీ నివేదికలు(Inspection Reports) వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ దేశంలోని ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంకులు కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ను ఆశ్రయించాయి.అసలు వివాదం ఏమిటి?సమాచార హక్కు చట్టం (RTI) కింద ధీరజ్ మిశ్రా, వాతిరాజ్, గిరీష్ మిట్టల్, రాధా రామన్ తివారీ వంటి సామాజిక కార్యకర్తలు ఆర్బీఐ వద్ద కొన్ని కీలక పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా..టాప్ 100 ఎన్పీఏల వివరాలు.బ్యాంక్ ఆఫ్ బరోడాకు విధించిన రూ.4.34 కోట్ల జరిమానాకు సంబంధించిన తనిఖీ నివేదికలు.యెస్ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు.ఎస్బీఐ, ఆర్బీఎల్ బ్యాంకులపై ఆర్బీఐ జరిపిన పర్యవేక్షణ మూల్యాంకన నివేదికలు.ఆర్బీఐ వర్సెస్ బ్యాంకులుఆర్టీఐ నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని వెల్లడించవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భావించింది. సుప్రీంకోర్టు గతంలో జయంతిలాల్ ఎన్. మిస్త్రీ కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఆర్బీఐకి బ్యాంకులతో ఎటువంటి విశ్వసనీయ సంబంధం (Fiduciary Relationship) లేదని, కాబట్టి సమాచారాన్ని దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, బ్యాంకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాచారం వెల్లడిస్తే తమ వాణిజ్య ప్రయోజనాలకు, మార్కెట్ పోటీతత్వానికి హాని కలుగుతుందని, ఇది తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయంతిలాల్ మిస్త్రీ తీర్పును పునపరిశీలించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.సీఐసీ కీలక నిర్ణయంఈ వ్యవహారాలను విచారించిన సమాచార కమిషనర్ ఖుష్వంత్ సింగ్ సేథీ వీటి సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను గతంలో డబుల్ బెంచ్ విచారించినందున ఈ కేసులన్నింటినీ సీఐసీ నేతృత్వంలోని లార్జర్ బెంచ్కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. ఇది తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయా సమాచారాలను దరఖాస్తుదారులకు వెల్లడించకూడదని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నిలిపివేశారు.డిపాజిటర్ల హక్కులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల జవాబుదారీతనం విషయంలో ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ లార్జర్ బెంచ్ సమాచార వెల్లడికి మొగ్గు చూపితే బ్యాంకింగ్ రంగంలోని లోపాలు, ఎగవేతదారుల వివరాలు బహిర్గతం అవుతాయి. లేదంటే బ్యాంకుల గోప్యతకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది.ఇదీ చదవండి: రూ.2.7 కోట్ల జీతం.. ఉద్యోగం వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. -
ఐపీఓలంటే అద్భుతాలు కావు!
స్టాక్ మార్కెట్లలోని కంపెనీలన్నీ ఎప్పుడో ఒకప్పుడు పబ్లిక్ ఇష్యూకు వచ్చినవే. కాకపోతే వాటిలో అగ్రశ్రేణి కంపెనీలుగా (లార్జ్క్యాప్) మారినవి కొన్నే. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయాలో.. వద్దో తెలిసిపోతుంది. ఎందుకంటే ఐపీఓలంటే అద్భుతాలు కావు. ఆటోమేటిగ్గా సంపదను సృష్టించే సాధనాలూ కావు. అవి అవకాశాలతో పాటే రిస్కులనూ మన ముందుంచుతాయి. అలాగని ఐపీఓలకు దూరంగా ఉండమని కాదు. ఐపీఓ అంటే... మార్కెట్లు పంపే ఆహ్వాన పత్రికలు. దేన్ని స్వీకరించాలో... దేన్ని తిరస్కరించాలో మనమే నిర్ణయించుకోవాలి. అది ఎలాగో.. 2025లో ఐపీఓకు వచి్చన కంపెనీల పరిస్థితేంటో... 2026లో ఎలా వ్యవహరించాలో సమగ్రంగా వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ...ప్రస్తుతం ప్రైమరీ (ఐపీఓ) మార్కెట్ మంచి దూకుడు మీదుంది. దాదాపు 200కు పైగా కంపెనీలు లిస్టింగ్లకు సన్నద్ధమవుతున్నాయి. వీటిలో ఫిన్టెక్ యూనికార్న్లు, గ్రీన్ ఎనర్జీ వెంచర్ల నుంచి కన్జూమర్ బ్రాండ్లు, ఇన్ఫ్రా రంగ దిగ్గజాల వరకు చాలా ఉన్నాయి. జీడీపీ ఏడు శాతానికి పైగా కొనసాగుతుందనే సానుకూల అంచనాలు, డీమ్యాట్ ఖాతాలు 15 కోట్ల స్థాయిని దాటిపోవడం, ప్రతి నెలా సిప్ల ద్వారా రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు మార్కెట్లలోకి వస్తుండటం వంటి పరిణామాలు కంపెనీలకు మంచి ఊపునిస్తున్నాయి.ఐపీవోలు ఎందుకు..కంపెనీలు వివిధ కారణాలరీత్యా పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరిస్తుంటాయి. అవేంటంటే.. → కార్యకలాపాలను విస్తరించడానికి, కొత్త టెక్నాలజీల ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవటానికి → రుణాలుంటే తీర్చెయ్యడానికి... → ప్రారంభ దశలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, అలాగే ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించుకోవటానికి → బ్రాండ్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకునేందుకు ఇలాంటి అవసరాలకు సంబంధించి ఐపీవోలనేవి కంపెనీకి సహాయకరంగానే ఉంటాయి. అయితే, షేరు ధర అదే పనిగా పెరుగుతూనే ఉంటుందనే గ్యారంటీ ఏమీ ఉండదు. మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పుడు కొన్ని కంపెనీలు లిస్టింగ్లో మంచి లాభాలే ఇవ్వొచ్చు. మరికొన్ని కంపెనీలు లిస్టింగ్ వేళ నిరాశపర్చినా, ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ పుంజుకుని మెరుగైన రాబడులు అందించే అవకాశం ఉంది. అదే సమయంలో చాలా మటుకు కంపెనీలు తీవ్రమైన పోటీ ఎదుర్కొనలేక చతికిలబడి, షేర్లు కనుమరుగైపోతుంటాయి కూడా.రిటైల్ ఇన్వెస్టర్ల తప్పులివీ...ఆ ఐపీవో బాగా లిస్టయ్యింది.. ఈ ఇష్యూ బాగా లాభాలు తెచ్చిందనే అత్యుత్సాహంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తుంటారు. చేతులు కాల్చుకుంటూ ఉంటారు. కొందరు గ్రే మార్కెట్లను ఫాలో అవుతూ అక్కడ ప్రీమియం రేటు పలికే వాటి వెంటబడుతుంటారు. ఇంకొందరు భారీగా ఓవర్సబ్్రస్కయిబ్ అయ్యింది కదా కచి్చతంగా లాభాలొచ్చేస్తాయనుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. మరికొందరు లిస్టింగ్ రోజున భలే ఎగ్జైటింగ్గా ఉంటుందని పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, ఈ అత్యుత్సాహంలో కొన్ని విషయాలు విస్మరిస్తుంటారు. వ్యాపారం మోడల్ నిజంగా బలమైనదేనా? దీర్ఘకాలికంగా నిలబడేదేనా? ప్రమోటర్ల ట్రాక్ రికార్డు బాగుందా లేదా? ఐపీవో ద్వారా తీసుకున్న డబ్బును కంపెనీ ఏ అవసరాల కోసం వాడుకుంటోంది? ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. 2025లో ఏం జరిగిందంటే... గతేడాది ఐపీవోలు తీపి, చేదు జ్ఞాపకాలు రెండింటినీ ఇచ్చాయి. దాదాపు 373 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.95 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో 103 మెయిన్ బోర్డ్ ఇష్యూ లు కాగా 270 కంపెనీలు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై లిస్టయ్యాయి. టాటా క్యాపిటల్ (రూ.15,512 కోట్లు), హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (రూ.12,500 కోట్లు) వంటి దిగ్గజాలు భారీగా నిధులు సమీకరించాయి. కొత్త తరం సంస్థలు మీషో రూ. 5,421 కోట్లు సమీకరించగా, గ్రో క్యాపిటల్ రూ.6,632 కోట్లు రాబట్టుకుంది. వీటిలో లిస్టింగ్ నాడు ఏకంగా 136 శాతం లాభాన్నిచి్చన స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లాంటి కంపెనీలతో పాటు తొలిరోజే 56 శాతం నష్టాన్నిచ్చిన గ్లోటిస్ లిమిటెడ్ వంటి కంపెనీలూ ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద ఇష్యూల్లో మీషోనే తీసుకుంటే ఇష్యూ ధర రూ.111 అయితే దాదాపు 46 శాతం అధికంగా రూ.162.50 వద్ద లిస్టయ్యింది. అలాగని అన్నీ ఇదే రీతిలో లిస్టింగ్ లాభాలిచ్చాయనుకోవడానికి లేదు. గతేడాది సగటున లిస్టింగ్ లాభాలు చూస్తే 8 శాతం స్థాయికే (అంతకు ముందటి సంవత్సరాలకన్నా తక్కువగా) పరిమితమయ్యాయి. వీటిలో దాదాపు సగ భాగం లిస్టింగ్లో ఏడాది చివరి నాటికి లాభాల్లోనే ఉండగా, మిగతావి ఇష్యు రేటు కన్నా కిందికి పడిపోయాయి. ఇక ఎస్ఎంఈ ఐపీవోలైతే మరీ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని మలీ్టబ్యాగర్లుగా మారినప్పటికీ మిగతావి భారీగా పడిపోయాయి. హైప్ అనేది ఎల్లకాలం ఉండదని, వాస్తవంగా వ్యాపారానికి ఉండే బలమే కీలకమనే పాఠాన్ని 2025 మరోసారి నేరి్పంది.2026 ప్రత్యేకత ఏంటి.. ఈసారి 200 పైగా కంపెనీలు ఐపీవోలకు సిద్ధమవుతున్నాయి. ఇవి రూ. 2.5 లక్షల కోట్లకు మించి సమీకరించవచ్చనే అంచనాలున్నాయి. వీటిలో పలు కంపెనీలు భారీ వేల్యుయేషన్లతో రాబోతున్నాయి. ఉదాహరణకు రూ. 11– 12 లక్షల కోట్ల వేల్యుయేషన్తో రిలయన్స్ జియో ఐపీవో దేశంలోనే అతి పెద్ద ఇష్యూగా ఉంటుందనేది నిపుణుల అంచనా. ఇది 2026 ప్రథమార్ధంలోనే రావచ్చు. అలాగే ఎన్ఎస్ఈ, ఫోన్పే, ఫ్లిప్కార్ట్, ఓయో, జెప్టో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్... ఇలా బోలెడు పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఈ ఇష్యూల ద్వారా పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు తమ వాటాలను విక్రయించుకుని ని్రష్కమించనున్నాయి. డీమ్యాట్ ఖాతాలు పెరుగుతుండటం, సిప్ పెట్టుబడుల వెల్లువతో వీటికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగానే డిమాండ్ ఉంటుందనే అంచనాలున్నాయి. వెరసి ఈసారి కూడా స్టాక్ మార్కెట్లు సందడిగానే ఉండనున్నాయి.ఏం చేయాలంటే... ఇదంతా చూసిన తర్వాత ఇంతకీ ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే... ఇవి మీ పోర్ట్ఫోలియోలో స్మార్ట్ భాగంగా ఉండొచ్చు. సముచిత రేటులో లభిస్తున్న బలమైన కంపెనీల ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయండి. కానీ పెట్టుబడులకు సంబంధించి అదొక్కటే వ్యూహంగా మాత్రం పెట్టుకోవద్దు. → మంచి అవకాశాల కోసం కాస్త వేచి చూడండి. ఇలాంటివి ఏడాదిలో 4– 6 వరకు వస్తుంటాయి. → బాగుందనిపించగానే ఇన్వెస్ట్ చేసేయొద్దు. వ్యాపార ప్రాథమిక విషయాలను తెలుసుకునేందుకు ప్రాస్పెక్టస్ని కూడా కాస్త తిరగేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. → పబ్లిక్ ఇష్యూల్లో పెట్టుబడులను మీ దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్లూ–చిప్ స్టాక్స్కి అనుబంధంగానే ఉంచుకోవడం మంచిది. చివరిగా చెప్పేదేమిటంటే పబ్లిక్ ఇష్యూలంటే లాటరీలు కావు! యుఫోరియాకి లోను కాకుండా జాగ్రత్త వహించాలి. లిస్టింగ్కి వచ్చిన కంపెనీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉంటే కేవలం లిస్టింగ్ రోజునే కాదు దీర్ఘకాలికంగా కూడా మంచి రాబడులను అందుకోవచ్చని గుర్తుంచుకోవాలి. -
సిప్ సూపర్ హిట్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి డిసెంబర్లో నికరంగా రూ.28,054 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్లో రూ.29,911 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే 6 శాతం తగ్గాయి. ఈ ఏడాది అక్టోబర్లో వచి్చన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. ఈక్విటీ, గోల్డ్ ఈటీఎఫ్లు నికరంగా పెట్టుబడులను ఆకర్షించగా, డెట్ ఫండ్స్లో అమ్మకాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి డిసెంబర్లో రూ.66,591 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. డివిడెండ్ ఈల్డ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) తప్ప మిగిలిన అన్ని ఈక్విటీ ఫండ్స్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. నవంబర్ చివరికి ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) రూ.80.80 లక్షల కోట్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి రూ.80.23 లక్షల కోట్లకు తగ్గాయి. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. సిప్ ద్వారా రికార్డు స్థాయి పెట్టుబడులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు డిసెంబర్లో సరికొత్త గరిష్టానికి చేరాయి. రూ.31,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్లో సిప్ పెట్టుబడులు రూ.29,445 కోట్లుగా ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు రూ.3.34 లక్షల కోట్లకు చేరాయి. విభాగాల వారీ పెట్టుబడులు.. → అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి రూ.10,019 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్లో ఈ విభాగంలోకి వచి్చన పెట్టుబడులు రూ.8,135 కోట్లుగానే ఉన్నాయి. → మిడ్క్యాప్ ఫండ్స్ రూ.4,176 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్లోకి రూ.4,094 కోట్లు వచ్చాయి. → స్మాల్క్యాప్ ఫండ్స్ రూ.3,824 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. లార్జ్క్యాప్ ఫండ్స్లోకి రూ.1,567 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → వ్యాల్యూ ఫండ్స్ రూ.1,088 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.2,255 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.1,057 కోట్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు)లోకి పెద్ద మొత్తంలో రూ.11,647 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. -
వెంచర్ క్యాపిటల్కు బై ఐపీఓకు.. హాయ్
ఇటీవల కొద్ది రోజులుగా చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు తదుపరి దశ నిధుల సమీకరణలో పబ్లిక్ రూట్కే ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే ఐపీవోకు వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండింగ్, టాలెంట్, టెక్నాలజీ వృద్ధికి వీలుంటుందని భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ప్రైమరీ మార్కెట్లు రెండేళ్లుగా రికార్డు నిధుల సమీకరణ ద్వారా కదం తొక్కుతుండటంతో చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు లిస్టింగ్వైపు చూస్తున్నాయి. ఇందుకు దేశీయంగా కనిపిస్తున్న ఇన్వెస్టర్ల ఆసక్తి, అత్యధిక లిక్విడిటీ తోడ్పాటునిస్తున్నాయి. ఫలితంగా తొలి, మలిదశలలో వృద్ధి నిలుపుకునేందుకు.. తద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల కోసం పబ్లిక్ మార్కెట్కు ప్రాధాన్యమిస్తున్నాయి. వెరసి ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే స్టాక్ ఎక్సే్ఛంజీలలో నమోదయ్యేందుకే చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు ఆసక్తిని చూపుతున్నాయి.. కాగా.. ఇంతక్రితం చాలా స్టార్టప్లు బిలియన్ డాలర్ల కంపెనీలు(యూనికార్న్)గా ఎదిగిన తదుపరి మాత్రమే లిస్టింగ్వైపు చూసేవి. అంతకుముందు పెట్టుబడుల కోసం పీఈ, తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థలను ఆశ్రయిస్తుండేవి. అయితే ఇటీవల ఈ ట్రెండ్కు విరుద్ధంగా చాలా ముందుగానే ఐపీవో బాట పడుతుండటం గమనార్హం! బ్రాండ్ బిల్డింగ్.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండ్ బిల్డింగ్తోపాటు.. టాలెంట్ను ఆకట్టుకోవడం, కొత్త టెక్నాలజీలపై గురి పెట్టడం తదితరాలకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా కంపెనీకి సరైన విలువ లభించడం, పారదర్శక పాలన, తగినంత లిక్విడిటీకి వీలుండటం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశాయి. వెరసి రూ. 300–400 కోట్ల ఆదాయ స్థితికి చేరిన స్టార్టప్లు ఐపీవోకు సిద్ధపడుతున్నట్లు తెలియజేశాయి. రెండేళ్లుగా అటు ఎస్ఎంఈ, ఇటు మెయిన్ బోర్డులో రికార్డ్స్థాయిలో కంపెనీలు లిస్టవుతుండటం స్టార్టప్లకు జోష్నిస్తున్నట్లు వివరించాయి.జాబితా ఇలా.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్పట్ల ఆసక్తిగా ఉన్న మధ్యస్థాయి స్టార్టప్ల జాబితాలో స్క్రిప్బాక్స్, మైగేట్, ఫ్యాబ్హోటల్స్, క్లాస్ప్లస్ ముందువరుసలో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గత నెల(2025 డిసెంబర్)లో ఫ్యాబ్హోటల్స్ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. రానున్న 6 నెలల్లో లిస్టయ్యేందుకు స్క్రిప్బాక్స్ సైతం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రూ. 300–600 కోట్ల సమీకరణ ప్రణాళికలున్న స్టార్టప్లు అధికంగా ఐపీవో బాటవైపు చూస్తున్నట్లు ఇన్క్రెడ్ క్యాపిటల్ ఎండీ ప్రతీక్ ఇండ్వార్ పేర్కొన్నారు. రూ. 600–700 కోట్ల పరిమాణంలో నిధుల సమీకరణపై కన్నేసిన స్టార్టప్లు సైతం అధికంగా లిస్టింగ్కు సిద్ధపడుతున్నట్లు ప్రోజస్ గ్రూప్ గ్లోబల్ హెడ్ గజానన్ శుక్లా తెలియజేశారు. ఇదీ తీరు తొలి, మలి దశ స్టార్టప్లు ప్రధానంగా ఏంజెల్ ఫండింగ్, వెంచర్ క్యాపిటల్ సంస్థల ద్వారా నిధు లు సమీకరిస్తుంటాయి. ఈ జాబితాలో సీక్వోయా, యాక్సెల్, బ్లూమ్ వెంచర్స్, కళారి, వై కాంబినేటర్, లెట్స్వెంచర్, ఫండ్ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఆపై ప్రయివేట్ ఈక్విటీ సంస్థలను సైతం సంప్రదిస్తుంటాయి. నిజానికి 2019లో మధ్యస్థాయి స్టార్టప్లు ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 145 రౌండ్ల ద్వారా మైనారిటీ వాటాలు విక్రయించాయి. తద్వారా 5.7 బిలియన్ డాలర్లు సమకూర్చుకు న్నాయి. తదుపరి 2020, 2022లలో నిధుల సమీకరణ మరింత పుంజుకున్నప్పటికీ 2025లో నీరసించింది. 2019 స్థాయిలోనే 152 రౌండ్ల ద్వారా 5.4 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. ఇందుకు సంస్థలు పెరిగినప్పటికీ ఐపీవో బాట పట్టడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పెట్రోల్ కంటే.. పాలు, నీళ్ల ధరలే ఎక్కువ!.. ఎక్కడంటే?
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెలుగొందిన వెనెజువెలా.. నికోలస్ మదురో అరెస్టు తర్వాత తీవ్ర సంక్షోభంతో సతమతమవుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరిపోయాయి. పెట్రోల్ ధరల కంటే.. వాటర్ బాటిల్, పాలు ధరలు ఎక్కువైపోయాయి.ధరలు ఇలా..ఒక లీటరు పెట్రల్: రూ. 45.10ఒక లీటరు పాలు: రూ. 160.60ఒక లీటరు వాటర్ బాటిల్: రూ. 223.70ఒక లీటరు వంట నూనె: రూ. 315 నుంచి రూ. 405అమెరికా ఆంక్షలు, సరఫరా గొలుసులను తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్ధిక సంక్షోభం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే తాగు నీరు కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇక్కడ కరెన్సీకి విలువ తగ్గిపోవడం వల్ల.. లావాదేవీలు కూడా కష్టతరం అయిపోయింది.వెనెజువెలా ఆర్ధిక పతనానికి కారణాలు➤వ్యవసాయం, తయారీ రంగాలను విస్మరించి.. ఎక్కువగా చమురుపైనే ఆధారపడటం.➤నైపుణ్యం లేనివారికి పదవులు కట్టబెట్టడం వల్ల, నిర్వహణ లోపాలు తలెత్తాయి.➤ఆదాయం లేకపోవడంతో.. ప్రభుత్వం విచ్చలవిడిగా కరెన్సీ ముద్రించింది. దీనివల్ల దేశ కరెన్సీ ఎక్కువైంది. విలువ పెరిగిపోయింది.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త! -
మూడో ‘ఆర్థిక శక్తి’గా భారత్ ఎదగాలంటే..
భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే దిగుమతులు తగ్గించుకుని, ఎగుమతులను పెంచుకోవాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సీఎస్ఐఆర్లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు.ఈ సందర్భంగా వ్యవసాయ వ్యర్థాలను విలువైన జాతీయ వనరుగా మార్చుకోవడం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చని చెప్పారు. దీనివల్ల వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం కారణంగా వెలువడే కాలుష్యాన్ని నిరోధించొచ్చన్నారు. పెట్రోల్లో ఇథనాల్ను 15 శాతం కలపడం ద్వారా ఏడాదిలో 4,500 కోట్ల డాలర్ల విదేశీ మారకాన్ని ఆదా చేసుకోవచ్చని చెప్పారు.ఇటీవలే జపాన్ను దాటేసి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం తెలిసిందే. రహదారుల నిర్మాణంలో బయో బిటుమన్ను (పెట్రోలియం రహిత) వినియోగించడం 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా పరివర్తనాత్మక అడుగుగా మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. వాణిజ్య పరంగా బయో బిటుమన్ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం భారత్ అని చెప్పారు. ఇది రైతుల జీవితాలను మార్చేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందన్నారు.వ్యవసాయం, నిర్మాణ రంగ సామగ్రి తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఫ్లెక్స్ ఇంజన్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించాలని కోరారు. హైడ్రోజన్ రవాణా అన్నది పెద్ద సమస్యగా పేర్కొంటూ.. ఈ విషయంలో భారత్ ఇంధన ఎగుమతిదారుగా అవతరించాలన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్ రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త! -
జీడీపీ వృద్ధి 7.4 శాతం
న్యూఢిల్లీ: తయారీ, సేవల రంగాల బలమైన పనితీరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని, ప్రపంచంలో వేగవంతమైన పెద్ద ఆర్థిక వ్యవస్థగా తన గుర్తింపును కొనసాగిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవ జీడీపీ స్థిర ధరల వద్ద 2025–26లో రూ.201.90 లక్షల కోట్లకు చేరుతుందని, 2024–25లో ఉన్న రూ.187.97 లక్షల కోట్ల కంటే 7.4 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది. 6.3–6.8 శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చన్న గత అంచనాల కంటే ఇది ఎక్కువ. ఆర్బీఐ అంచనా 7.3 శాతం కంటే అధికం కావడం గమనార్హం. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లు విధించినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ సెపె్టంబర్ త్రైమాసికంలోనూ బలమైన పనితీరు (8.2 శాతం) నమోదు చేయడం తెలిసిందే. కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ ఈ మేరకు తొలి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంది. జీఎస్టీ సంస్కరణలతో 375 ఉత్పత్తులపై ధరలు దిగిరావడం, ఆదాయపన్ను కొత్త విధానంలో మినహాయింపులను గణనీయంగా పెంచడం, కార్మిక సంస్కరణలు, ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం, ద్రవ్యోల్బణం దిగిరావడం, గ్రామీణ వినియోగం పుంజుకోవడాన్ని సానుకూలతలుగా గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ పేర్కొంది. స్థూల జోడించిన విలువ (జీవీఏ) 7.3 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 6.4 శాతంగా ఉంది. తయారీ 7 శాతం తయారీ రంగం 7 శాతం వృద్ధిని సాధిస్తుందని (గత ఏడాది 4.5 శాతం) ప్రభుత్వం అంచనా వేసింది. సేవల రంగంలో వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 7.2 శాతం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతానికి విస్తరిస్తుందని -
అఫీషియల్: ఆదివారమే కేంద్ర బడ్జెట్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA).. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కీలక తేదీలను ఆమోదించింది. పార్లమెంట్ క్యాలెండర్ ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశ చరిత్రలో ఆదివారం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి కానుంది.బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా.. జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. కాగా జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 తేదీలలో జరుగుతుందని, రెండవ భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 మధ్య రెండో సెషన్ జరుగుతాయి.సీతారామన్ తొమ్మిదో బడ్జెట్ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు. వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు. ఇది రెండోసారి.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు.. 2025 బడ్జెట్ను సమర్పించిన సంగతి తెలిసిందే. గతంలో.. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2015లో ఫిబ్రవరి 28న శనివారం, 2016లో ఫిబ్రవరి 28న ఆదివారం కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. -
మార్చి 2026 నుంచి ఏటీఎమ్లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత?
భారతదేశంలో పలుమార్లు నోట్ల రద్దు జరిగింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఇందులో 2026 మార్చి నుంచి ఏటీఎంల నుంచి రూ. 500 నోట్లు రావని ఉంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగంలో స్పందించింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 2026 నాటికి రూ. 500 నోట్ల చెలామణిని నిలిపివేస్తుందని కొన్ని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి. దీనిపై పీఐబీ స్పందిస్తూ.. ''ఇది తప్పు అని వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి ప్రకటన చేయలేదు. రూ. 500 నోట్లు చెలామణిలోనే ఉంటాయి. యధావిధిగా ఏటీఎంల నుంచి కూడా తీసుకోవచ్చు'' అని స్పష్టం చేసింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని పేర్కొంది.ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లుభారతదేశంలో ప్రస్తుతం రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు చెలామణిలో ఉన్నాయి. అయితే ఏటీఎం నుంచి రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు వస్తాయి. కొన్ని ఏటీఎంలలో కేవలం రూ. 500 నోట్లు మాత్రమే వస్తాయి. మొత్తం మీద రూ. 500 నోట్లు రద్దు కావని పీఐబీ వెల్లడించింది.RBI to stop ₹500 notes from ATMs by March 2026❓🤔Some social media posts claim that the Reserve Bank of India will discontinue the circulation of ₹500 notes by March 2026.#PIBFactCheck:❌This claim is #fake!✅ @RBI has made NO such announcement.✅ ₹500 notes have… pic.twitter.com/F0Y3t0wHSf— PIB Fact Check (@PIBFactCheck) January 2, 2026 -
సరికొత్త రికార్డ్.. చైనాను అధిగమించిన భారత్!
వరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనాను.. భారత్ అధిగమించింది. దీంతో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.150.18 మిలియన్ టన్నులుభారతదేశంలో వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులు కాగా.. చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం 25 పంటలకు చెందిన 184 కొత్త రకాలను విడుదల చేస్తూ వెల్లడించారు. అంతే కాకుండా అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు పంట ఉత్పత్తిని & రైతుల ఆదాయాన్ని పెంచుతాయని, ఈ కొత్త రకాలు రైతులకు త్వరగా చేరేలా చూడాలని మంత్రిత్వ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.దేశ రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడుతూ.. అధిక దిగుబడినిచ్చే విత్తనాల అభివృద్ధిలో దేశం గొప్ప విజయాన్ని సాధించిందని అన్నారు. 1969లో గెజిట్ నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి.. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఫైబర్ పంటలు వంటి మొత్తం 7,205 పంట రకాలు నోటిఫై చేసినట్లు పేర్కొన్నారు.2014 తర్వాత పెరుగుదల..1969, 2014 మధ్య నోటిఫై చేసిన 3,969 రకాలతో పోలిస్తే.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 3,236 అధిక దిగుబడినిచ్చే రకాలను ఆమోదించిందని చౌహాన్ తెలియజేశారు. భారత్ ఆహార కొరత ఉన్న దేశం నుంచి ప్రపంచ ఆహార ప్రదాతగా మారిందని, ఇప్పుడు విదేశీ మార్కెట్లకు బియ్యాన్ని సరఫరా చేస్తోందని అన్నారు.దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, తద్వారా భారతదేశ ఆహార భద్రతకు భరోసా లభిస్తుందని చౌహాన్ అన్నారు. అంతే కాకుండా.. భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి పప్పుధాన్యాలు & నూనెగింజల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాలని మంత్రి వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు.సమిష్టి కృషి ఫలితంఅధిక దిగుబడినిచ్చే.. విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకునే విత్తనాల అభివృద్ధి బలంతో దేశం వ్యవసాయ విప్లవం యొక్క కొత్త యుగంలోకి ప్రవేశించిందని చౌహాన్ అన్నారు. ఈ విజయం ఐసిఎఆర్ యొక్క పంటలపై అఖిల భారత సమన్వయ ప్రాజెక్టులు, రాష్ట్ర మరియు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు ప్రైవేట్ విత్తన కంపెనీల సమిష్టి కృషి ఫలితమని కేంద్ర మంత్రి అన్నారు.ఇటీవల విడుదల చేసిన మొత్తం 184 రకాల్లో.. 122 తృణధాన్యాలు, 6 పప్పు ధాన్యాలు, 13 నూనె గింజలు, 11 పశుగ్రాస పంటలు, 6 చెరకు, 24 పత్తి (22 బిటి పత్తితో సహా), 1 జనపనార, 1 పొగాకు ఉన్నాయి.ఇదీ చదవండి: స్టార్లింక్ సేవలు ఫ్రీ.. మస్క్ కీలక ప్రకటన


