breaking news
Economy
-
కరెన్సీ నోట్లలో కీలక మార్పు!
కరెన్సీ నోట్ల విషయంలో కేంద్రం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్(ప్లాస్టిక్)తో తయారు చేసిన నోట్లను ప్రయోగాత్మకంగా తీసుకురావడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.ముందు రూ.10, రూ.20 నోట్లపై ఈ ప్రయోగం చేయనున్నారు. ఒక్కో డినామినేషన్కు 100 కోట్ల నోట్లను తయారు చేసి, ప్రజల మధ్య చలామణిలోకి తీసుకువచ్చి ఎలా పనిచేస్తాయో పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని పాలిమర్ కరెన్సీ నోట్లు వచ్చే అవకాశం ఉంటుంది.కొత్త పాలిమర్ నోట్లు వస్తున్నాయని.. పాత పేపర్ నోట్లు వెంటనే రద్దు అవుతాయని ప్రజలు భయపడాల్సిన అవకాశం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న పేపర్ నోట్లతో పాటు కొత్త పాలిమర్ నోట్లు కూడా చలామణిలో ఉంటాయి. ముందుగా ఈ నోట్లు రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎంతకాలం మనగలుగుతున్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి వంటి విషయాలను రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తుంది.ట్రయల్స్ సక్సెస్ అయితే.. తర్వాత వీటిని రెగ్యులర్గా చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ ఆలోచిస్తోంది. పాలిమర్ నోట్లు.. కాగితం నోట్ల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. ఇవి పలుచని ప్లాస్టిక్ లాంటి పదార్థంతో తయారవుతాయి. అందువల్ల నీటికి, తేమకు, దుమ్ముకు తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.పేపర్ నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. నకిలీ నోట్లను తయారు చేయడం కూడా కొంత కష్టంగా ఉండేలా భద్రతా ఫీచర్లు ఏర్పాటు చేయవచ్చు. ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని పాలిమర్ నోట్లు వాడుతున్నారు. భారత్లో కూడా గతంలో పరిమిత స్థాయిలో వీటిని పరీక్షించారు.కొత్త నోట్లు ఎప్పటి నుంచి మన చేతుల్లోకి వస్తాయనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. పాలిమర్ నోట్ల తయారీకి సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదటి దశలోనే ఉందని ప్రభుత్వం తెలిపింది. నోట్ల తయారీకి అవసరమైన మెటీరియల్, ప్రింటింగ్ ఏర్పాట్లు, ట్రయల్స్ ఎక్కడ నిర్వహించాలి వంటి విషయాలపై ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఇదీ చదవండి: హైదరాబాద్లో ట్రంప్ టవర్స్! -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేసి చాలా కాలమైంది. ఈ రేట్లు ఎప్పుడు తగ్గుతాయా అని వాహనదారులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఫ్యూయెల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?, అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వివరణ ఇచ్చింది.పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం నేరుగా నిర్ణయించదని, ఇవి మార్కెట్ ఆధారంగా నిర్ణయించబడతాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడి చమురు ధరలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలను నిర్ణయిస్తాయని కేంద్ర మంత్రి సురేష్ గోపి తెలిపారు.ధరల్లో వచ్చిన మార్పులు!2021 జూన్ నుంచి 2026 జూన్ వరకు అంతర్జాతీయంగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల్లో చాలా మార్పులు వచ్చాయి. అయితే.. ఇతర దేశాల్లోని ధరలతో పోలిస్తే, భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ కాలంలో (2021-26) ఢిల్లీలో పెట్రోల్ ధర 8.1 శాతం, డీజిల్ ధర 11.5 శాతం మాత్రమే పెరిగింది. అమెరికాలో పెట్రోల్ ధర 70.6 శాతం, ఫ్రాన్స్లో 59.9 శాతం, జర్మనీలో 51.1 శాతం, బ్రిటన్లో 46.9 శాతం పెరిగింది.ఇక పక్క దేశాల విషయానికి వస్తే.. పాకిస్థాన్లో పెట్రోల్ ధర 160.6 శాతం, శ్రీలంకలో 148.6 శాతం, నేపాల్లో 76 శాతం పెరిగింది. డీజిల్ ధరలు కూడా ఈ దేశాల్లో భారీగా పెరిగాయని ప్రభుత్వం తెలిపింది.పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 2026 ఫిబ్రవరిలో భారతదేశం కొనుగోలు చేసే ముడి చమురు ధర బ్యారెల్కు సుమారు 69 డాలర్లు ఉండగా, మార్చిలో అది 136.68 డాలర్లకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. చమురు ధరలు ఎంతలా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.నష్టం భరించిన ప్రభుత్వంఇలాంటి పరిస్థితుల్లో.. మొత్తం భారాన్ని వినియోగదారులపై వేయకుండా, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కొంత నష్టాన్ని భరించాయని ప్రభుత్వం తెలిపింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నష్టాలను చవిచూశాయని వెల్లడించింది. ముఖ్యంగా హిందుస్తాన్ పెట్రోలియంకు రూ.11,526 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చిలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది. అయితే.. దీని వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం కూడా తగ్గింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి తగ్గించే కొత్త నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు.అందుకే చమురు ధరల్లో వ్యత్యాసం!మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాన్ని, నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం.. రాష్ట్ర పన్నులు, స్థానిక పన్నులు. ఉదాహరణకు.. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.12 ఉండగా, బెంగళూరులో అది రూ.111.37గా ఉంది. ముంబైలో కూడా పెట్రోల్ ధర రూ.111 కంటే ఎక్కువగా ఉంది.యుద్ధం మొదలైన తర్వాత.. భారత్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని సార్లు పెరిగాయి. ఏప్రిల్ నెలలో ఒకసారి.. ఆ తర్వాత మే నెలలో కూడా ధరలు పెరిగాయి.దీన్నిబట్టి చూస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం ప్రభుత్వం నిర్ణయించడం వల్ల మాత్రమే మారవు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, యుద్ధాలు, మార్కెట్ పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర పన్నులు వంటి అనేక కారణాలు వీటి ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే.. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, భారత్లో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవచ్చు. ప్రభుత్వం మాత్రం వినియోగదారులపై భారం తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.ఇదీ చదవండి: 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు! -
పెరిగిన ‘అండర్ రికవరీ’ భారం!
పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సంక్షోభం, హార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాల ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో వంటగ్యాస్ (ఎల్పీజీ) ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా వ్యయం పెరిగినా దేశీయంగా గృహ వినియోగదారులకు భారం పడకుండా తక్కువ ధరకు విక్రయించడంతో ప్రభుత్వ రంగానికి చెందిన చమురు మార్కెటింగ్ కంపెనీల (IOCL, BPCL, HPCL) ‘అండర్ రికవరీ’ (అమ్మకపు లోటు) 2026 జులై 31 నాటికి రూ.59,000 కోట్లకు పైగా పెరిగింది. ఈ మేరకు పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి అధికారిక వివరాలను వెల్లడించారు.పరిహారం ఉన్నప్పటికీ పెరుగుతున్న లోటుపెట్రోలియం కంపెనీల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.22,000 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా ఆర్థిక సంవత్సరాలు 2025-26, 2026-27ల కాలానికి మరో రూ.30,000 కోట్ల పరిహారాన్ని మంజూరు చేసింది. మొత్తం రూ.52,000 కోట్ల ప్రభుత్వ సహాయం అందినప్పటికీ అంతర్జాతీయంగా ప్రొపేన్-బ్యూటేన్ బెంచ్ మార్క్ ధరలు భారీగా పెరగడంతో బకాయిపడ్డ అండర్ రికవరీ మొత్తాలు రూ.59,000 కోట్ల మార్కును దాటాయి.నెలవారీ పరోక్ష సబ్సిడీ మార్పులుఢిల్లీలో 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ ధర రూ.942 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల పెట్రో కంపెనీలు భరించే పరోక్ష సబ్సిడీ (అండర్ రికవరీ) జూన్లో ప్రతి సిలిండర్పై రూ.700 కంటే ఎక్కువగా, జులైలో రూ.500 వరకు నమోదు కాగా ఆగస్టు నాటికి గ్లోబల్ ధరలు కొంత నెమ్మదించడంతో ఈ లోటు రూ.188కి తగ్గింది. ఇక పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తించే రూ.300 నిర్దేశిత సబ్సిడీతో కలిపి సిలిండర్ రూ.642కే లభిస్తోంది.గతంలో భారత్ తన వంటగ్యాస్ దిగుమతుల్లో 90% వరకు పశ్చిమాసియా పైనే ఆధారపడేది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో ఖతార్ వంటి దేశాల నుంచి సరఫరా తగ్గినప్పటికీ అమెరికా నుంచి రికార్డు స్థాయిలో (జులైలో 9.12 లక్షల టన్నులు) ఎల్పీజీని దిగుమతి చేసుకుంటూ సరఫరాల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (ఇప్పటివరకు 1.7 కోట్లకు పైగా కనెక్షన్లు), ఇండక్షన్ స్టవ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.ఇదీ చదవండి: గౌతమ్ అదానీకి భారీ ఊరట -
ఇథనాల్ తయారీకి చెరకు వాడకంపై కేంద్రం కోత?
దేశీయంగా రికార్డు స్థాయికి చేరిన చక్కెర ధరలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే నూతన మార్కెటింగ్ సీజన్లో ఇథనాల్ తయారీ కోసం చెరకు వినియోగాన్ని పరిమితం చేయాలని యోచిస్తోంది. దేశీయ వినియోగానికి ప్రథమ ప్రాధాన్యమిస్తూ మార్కెట్లో చక్కెర లభ్యతను పెంచడం, తద్వారా భగ్గుమంటున్న నిత్యావసర ధరలను అదుపు చేయడమే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.దేశంలో చక్కెర ఉత్పత్తికి కీలకంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈసారి వర్షపాతం కొరవడటంతో రాబోయే పంట దిగుబడిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సరఫరా తగ్గిపోవడం, సమీపిస్తున్న పండుగల సీజన్ దృష్ట్యా వినియోగం పెరగడంతో గత నెల రోజుల్లోనే చక్కెర ధరలు ఏకంగా 10 శాతం మేర పెరిగి గరిష్ఠ స్థాయికి చేరాయి. పరిస్థితులు చేయిదాటిపోకుండా ఉండటానికి, విదేశాల నుంచి అత్యవసర దిగుమతులు చేసుకునే పరిస్థితి రాకుండా నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది.గడిచిన ఏడాది కాలంలో చక్కెర మిల్లులు సుమారు 30 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను (మొత్తం ఉత్పత్తిలో దాదాపు 10 శాతం) ఇథనాల్ తయారీకి మళ్లించాయి. అయితే నూతన నిబంధనల ప్రకారం, నేరుగా ‘చెరకు రసం’ అలాగే అధిక చక్కెర తీవ్రత ఉండే ‘బీ-హెవీ’ మోలాసెస్ నుంచి ఇథనాల్ ఉత్పత్తిని నిలిపివేయాలని మిల్లులను ఆదేశించే అవకాశం ఉంది. దీనికి బదులుగా చక్కెర సేకరించగా మిగిలిన వ్యర్థ పదార్థమైన ‘సీ-హెవీ’ మోలాసెస్ నుంచి మాత్రమే ఇథనాల్ ఉత్పత్తికి అనుమతించనున్నారు.అయితే, పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలనే ఈ-20 జాతీయ లక్ష్యానికి విఘాతం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. చెరకు ద్వారా తగ్గే ఇథనాల్ కోటాను భర్తీ చేయడానికి దేశంలో ప్రస్తుతం పుష్కలంగా లభ్యమవుతున్న మొక్కజొన్న, బియ్యం నిల్వలను ఇథనాల్ తయారీకి విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ సమతుల్య విధానం అమలులోకి వస్తే దేశీయంగా చక్కెర సరఫరా స్థిరపడి సామాన్య వినియోగదారులకు ధరల భారం నుంచి ఉపశమనం లభిస్తుందని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్రానికి పసిడి పంట -
కేంద్రానికి పసిడి పంట
బంగారం, వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. ఈ ఏడాది మే 13 నుంచి ఆగస్టు 2 వరకు స్వల్ప వ్యవధిలోనే విలువైన లోహాల దిగుమతుల ద్వారా కస్టమ్స్ సుంకాల రూపంలో ఏకంగా రూ.10,463 కోట్ల రాబడి సమకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.ఆదాయంలో పసిడిదే అగ్రస్థానంమొత్తం కస్టమ్స్ వసూళ్లలో సింహభాగం బంగారం నుంచే లభించింది. బంగారం దిగుమతులపై రూ.10,040 కోట్లు, వెండి దిగుమతులపై రూ.328 కోట్లు, ప్లాటినం దిగుమతులపై రూ.95 కోట్లు సమకూరింది.సుంకాల పెంపునకు కారణాలుపశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సంక్షోభం, హార్మూజ్ జలసంధి ఆటంకాల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు, ఎరువుల ధరలు పెరిగాయి. దేశీయ విదేశీ మారక నిల్వలను (ఫారెక్స్) పరిరక్షించుకోవడానికి, అనవసర దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం మే 13న పసిడి, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతాల నుంచి 15 శాతానికి, ప్లాటినం సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచిన విషయం విదితమే. చమురు, నిత్యావసర పారిశ్రామిక ముడిసరుకుల దిగుమతులకు ఫారెక్స్ నిల్వలను ప్రాధాన్యత క్రమంలో కేటాయించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.స్మగ్లింగ్పై ఉక్కుపాదంపన్ను రేట్లు పెరగడంతో అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉండటంతో తనిఖీ ఏజెన్సీలు నిఘాను తీవ్రతరం చేశాయి. మే 13 నుంచి జూన్ 30 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ సరిహద్దుల్లో దాడి చేసి 161 కిలోల అక్రమ బంగారాన్ని జప్తు చేయడమే కాకుండా 116 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద పసిడి వినియోగదారైన భారత్లో దిగుమతి సుంకాల పెంపు వల్ల పసిడి విక్రయాలు కొంత మందగించినప్పటికీ ప్రభుత్వానికి మాత్రం త్వరితగతిన భారీగా రెవెన్యూ సమకూరిందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్! -
మేధో వలస నుంచి మేధో సమృద్ధి వైపు..
విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తయ్యాక అక్కడే స్థిరపడాలనే ఆలోచనా ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విదేశీ విద్యను ఆకాంక్షిస్తున్న ప్రతి ఐదుగురు భారతీయ విద్యార్థుల్లో నలుగురు (80 శాతం) చదువు పూర్తి కాగానే తిరిగి భారత్ రావాలని కోరుకుంటున్నారు. ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థ ‘ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్’ విడుదల చేసిన తాజా నివేదిక ఈ ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించింది.మారుతున్న ప్రాధాన్యతలుదశాబ్దాలుగా మన దేశాన్ని వేధిస్తున్న ‘మేధో వలస’ (Brain Drain) దశ ముగిసి, భారత్ ఇప్పుడు ‘మేధో సమృద్ధి’ (Brain Gain) దిశగా పయనిస్తోందనడానికి ఈ నివేదిక నిదర్శనం. గతంలో విదేశీ డిగ్రీ అనగానే అక్కడే పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్), ఉద్యోగం పొందడమే ప్రధాన లక్ష్యంగా ఉండేది. కానీ నేటి యువతరం ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సంపాదించిన గ్లోబల్ ఎక్స్పోజర్, సాంకేతిక నైపుణ్యాలను స్వదేశంలోనే వినియోగించాలనుకుంటున్నారు. దాంతో సొంతంగా స్టార్టప్లు ప్రారంభించడం, వేగంగా విస్తరిస్తున్న భారతీయ ఇన్నోవేషన్ ల్యాబ్లలో కీలక పాత్ర పోషించడం, గ్లోబల్ కార్పొరేట్ రంగంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.స్వదేశంలో అవకాశాలు.. విదేశీ సవాళ్లుప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా నిలవడం, హైదరాబాద్, బెంగళూరు.. వంటి నగరాలు గ్లోబల్ టెక్నాలజీ హబ్లుగా మారడం విద్యార్థుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, ఫిన్టెక్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో భారత్లో లభిస్తున్న అవకాశాలు, వేతనాలు పాశ్చాత్య దేశాలకు దీటుగా ఉన్నాయి. మరోవైపు, పలు అభివృద్ధి చెందిన దేశాల్లో కఠినతరం అవుతున్న వీసా నిబంధనలు, వర్క్ పర్మిట్లపై పరిమితులు, పెరిగిన జీవన వ్యయం కూడా విద్యార్థులను స్వదేశం వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి.అంతర్జాతీయ స్థాయి విద్యను, అక్కడి అనుభవాన్ని మూలధనంగా మార్చుకుని తిరిగొచ్చే ఈ మేధో సంపత్తి భారత ఆర్థిక, సాంకేతిక వ్యవస్థలకు కొత్త ఊపిరి పోస్తుందనడంలో సందేహం లేదు. సరైన ప్రోత్సాహకాలు అందిస్తే ఈ ‘మేధో సమృద్ధి’ రాబోయే దశాబ్దంలో ‘వికసిత భారత్’ స్వప్నాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్! -
పొలాల్లో తగలేసే గడ్డి కాదిది.. కోట్లు కురిపించే నిధి!
దేశంలో ఇప్పటివరకు కేవలం పర్యావరణ సమస్యగా, పొలాల్లో తగులబెట్టే భారంగా చూసిన వ్యవసాయ వ్యర్థాలు ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త వాణిజ్య సరుకుగా (కమోడిటీ) రూపాంతరం చెందుతున్నాయి. భారత్లో ఏటా దాదాపు 50 నుంచి 55 కోట్ల టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తవుతుండగా అందులో దాదాపు 23 కోట్ల టన్నుల మిగులు వ్యర్థాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే ఇవి దేశీయ గ్రామీణ ఆర్థిక రంగానికి జీవనాడిలా మారే అవకాశం ఉంది.వరి గడ్డి, చెరకు పిప్పి, పత్తి కట్టెలు, గోధుమ వ్యర్థాలను బయో-ఎనర్జీగా మార్చడం ద్వారా భారత్ ఇంధన భద్రతలో విప్లవాత్మక మార్పులు సాధించవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రూ.23,731 కోట్ల గోబర్ధన్ (GOBARdhan) పథకం, కంప్రెస్డ్ బయో గ్యాస్ విభాగంలో గేమ్ఛేంజర్గా నిలవనుంది. సీఎన్జీ రవాణా ఇంధనంలో 2028-29 నాటికి 5% కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) కలపడం నిర్బంధం చేయడంతో శిలాజ ఇంధనాల దిగుమతి భారం తగ్గి దేశీయంగా స్వచ్ఛమైన శక్తి లభ్యత పెరుగుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.రైతు రాబడికి అదనపు ఊతంగతంలో పొలాల్లో గడ్డి తగులబెట్టడం వల్ల తీవ్ర వాయు కాలుష్యంతో పాటు నేల రసాయన సారం దెబ్బతినేది. ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా పంట వ్యర్థాలను పారిశ్రామిక అవసరాలకు కొనుగోలు చేస్తుండటంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. అలాగే, బయోగ్యాస్ తయారీలో బై-ప్రొడక్ట్గా వచ్చే ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మ్యాన్యూర్(ఎఫ్ఓఎం) వంటి సేంద్రీయ ఎరువులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి నేల సారవంతాన్ని పునరుద్ధరిస్తున్నాయి.మార్కెట్ సంస్కరణలే కీలకంఅంతర్జాతీయంగా 2023-2030 మధ్య పెరిగే బయో-ఎనర్జీ డిమాండ్లో భారత్ వాటా ఏకంగా 35 శాతంగా ఉంటుందని అంచనా. అయితే, పంట కోతల సమయంలో వ్యర్థాల సమర్థవంతమైన సేకరణ, తేమ నియంత్రణ, అధునాతన నిల్వ మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే ఈ రంగం పూర్తిస్థాయి గోల్డ్ మైన్గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు -
పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు
ఉదయాన్నే బండి స్టార్ట్ చేయగానే మీ జేబులోంచి రూపాయి కరిగించే పెట్రోల్... కేవలం వాహనం నడిపే ఇంధనం మాత్రమే కాదు! అది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను శాసించే అదృశ్య శక్తి. భూగర్భంలోని వేల అడుగుల లోతులో నల్లటి ద్రవంగా పుట్టి.. దుబాయ్, సౌదీ ఎడారుల నుంచి ముంబై సముద్ర తీరాల మీదుగా ప్రయాణించి.. రిఫైనరీల భారీ కొలిముల్లో రూపాంతరం చెంది మన వాహనం ట్యాంకులోకి చేరే వరకు ‘నల్ల బంగారం’ వెనుక అతిపెద్ద సాంకేతిక, ఆర్థిక విప్లవమే దాగి ఉంది. అసలు ఈ ఇంధనాన్ని ఎలా తీస్తారు? అరబ్ దేశాల వెలికితీతకు, భారత విధానానికి తేడా ఏంటి? ఒక్క లీటర్ ముడిచమురు నుంచి పెట్రోల్తో పాటు లభించే ఆ లగ్జరీ బై-ప్రొడక్ట్లు ఏవి? ఇక మన దేశంలో సైలెంట్గా సాగిపోతున్న ఈ20 ఇంధన విప్లవం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.పెట్రోల్ ఎలా తయారు చేస్తారు?సాంకేతిక భాషలో పెట్రోల్ను ‘గ్యాసోలిన్’ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా హైడ్రోకార్బన్ల (హైడ్రోజన్, కార్బన్ మూలకాల సమ్మేళనం) మిశ్రమం. భూగర్భంలో మిలియన్ల సంవత్సరాల పాటు అధిక ఉష్ణోగ్రత, పీడనాలకు గురైన వృక్ష, జంతు అవశేషాల నుంచి ఏర్పడిన క్రూడ్ ఆయిల్ (చమురు)ను ప్రాసెస్ చేయడం ద్వారా పెట్రోల్ తయారవుతుంది.ప్రాసెసింగ్ విధానంచమురు శుద్ధి కర్మాగారాల్లో క్రూడ్ ఆయిల్ను ప్రత్యేక పరిస్థితుల్లో వేడి చేస్తారు. వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద వేర్వేరు హైడ్రోకార్బన్లు ఆవిరిగా మారి విడిపోతాయి. 30 డిగ్రీ-200 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద పెట్రోల్ (గ్యాసోలిన్) ఉత్పత్తుల ఆవిరులు వేరై చల్లబడి ద్రవ రూపంలో మారుతాయి. తదనంతరం ఈ ద్రవానికి ఆక్టేన్ రేటింగ్ పెంచేందుకు క్రాకింగ్, రిఫార్మింగ్(సాధారణంగా ముడిచమురును వేడి చేసినప్పుడు పెట్రోల్ కన్నా డీజిల్, భారమైన పదార్థాలు ఎక్కువ పరిమాణంలో వస్తాయి. కానీ మార్కెట్లో పెట్రోల్కు డిమాండ్ ఎక్కువ. అందుకే, ఆ భారమైన నూనెలను సైతం పెట్రోల్గా మార్చే పద్ధతులు ఇవి. వీటిలో ఎక్కువ కార్బన్ అణువులు ఉన్న పెద్ద, సంక్లిష్టమైన హైడ్రోకార్బన్ గొలుసులను అధిక ఉష్ణోగ్రత, పీడనం లేదా ఉత్ప్రేరకాల సహాయంతో చిన్న తేలికపాటి అణువులుగా (పెట్రోల్గా) మారుస్తారు) వంటి ప్రక్రియలు నిర్వహిస్తారు.అరబ్ దేశాలు.. భారత్: వెలికితీత విధానాలుఅరేబీయా ద్వీపకల్పంలో చమురు నిల్వలు భూమి పొరల్లో, తీరప్రాంతాల్లో పుష్కలంగా ఉన్నాయి. సాంప్రదాయ రిగ్గుల ద్వారా భూమి లోపలికి రంధ్రాలు చేసి సహజ సిద్ధంగా ఉండే అధిక పీడనం సహాయంతో ఆయిల్ను పైకి రప్పిస్తారు. ఉత్పత్తి వ్యయం ప్రపంచంలోనే ఇక్కడ అత్యంత తక్కువ.భారత్లో వెలికితీతభారతదేశంలో అంతర్గత చమురు ఉత్పత్తి అవసరాలలో 15-20% మాత్రమే తీరుస్తుంది. ముంబై హై ప్రాజెక్ట్లో భాగంగా సముద్రంలో భారీ ఫ్లోటింగ్ ప్లాట్ఫారమ్లు ఏర్పాటు చేసి అడుగు భాగాన్ని డ్రిల్ చేస్తారు. అందులో నుంచి వచ్చే చమురును ప్రాసెస్ చేస్తారు. అస్సాం (దిగ్బోయ్, నహర్కటియా), గుజరాత్ (అంకలేశ్వర్), కృష్ణా-గోదావరి (కేజీ బేసిన్), రాజస్థాన్ (బార్మర్)లలో ఆన్షోర్ డ్రిల్లింగ్ (భూమిపై) ల్యాండ్ రిగ్గుల ద్వారా చమురు తీస్తున్నారు.ఉప ఉత్పత్తులు ఇవే..క్రూడ్ ఆయిల్ను రిఫైన్ చేసినప్పుడు పెట్రోల్ ఒక్కటే రాదు. దానితో పాటు లభించే ఉప ఉత్పత్తులు ఆధునిక రసాయన పరిశ్రమకు ముడిసరుకుగా మారుతున్నాయి.ఎల్పీజీ (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్): వంటగ్యాస్, పారిశ్రామిక ఇంధనండీజిల్: రవాణా రంగానికి ఉపయోగిస్తున్నారు.కిరోసిన్, ఏవియేషన్ ఫ్యూయల్: విమానాల ఇంధనం, గృహ అవసరాలు.నాఫ్తా: పెట్రోకెమికల్స్, ప్లాస్టిక్స్, ఎరువుల తయారీ.బిటుమెన్, తార్: రోడ్ల నిర్మాణం, వాటర్ ప్రూఫింగ్.పారాఫిన్ వ్యాక్స్: కొవ్వొత్తులు, కాస్మొటిక్స్, ఫార్మా రంగాలు.చమురు మార్కెటింగ్.. కంపెనీల సరళిచమురు వ్యాపారంలో రెండు ప్రధాన రంగాలు ఉంటాయి. ఒకటి అప్స్ట్రీమ్. అంటే చమురు అన్వేషణ, వెలికితీత (ఉదా: ఓఎన్జీసీ, ఓఐఎల్).రెండు డౌన్స్ట్రీమ్ కంపెనీలు. ఇందులో శుద్ధి, మార్కెటింగ్, పంపిణీ (ఉదా: ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) వంటివి వస్తాయి.క్రూడ్ ఆయిల్ సేకరణ➔ రిఫైనింగ్ (శుద్ధి)➔ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా పంపిణీ ➔ రిటైల్ అవుట్లెట్లు (బంకులు)కంపెనీల లాభనష్టాల మాటేమిటి?ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ను ప్రాసెస్ చేసినప్పుడు వచ్చే ఉత్పత్తుల విలువకు క్రూడ్ ఆయిల్ అసలు ధర మధ్య ఉండే వ్యత్యాసమే రిఫైనరీల లాభం. అంతర్జాతీయ మార్కెట్లో రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-యూఎస్ మధ్య అశాంతి మూలంగా బ్యారెల్ క్రూడ్ ధర పెరిగితే ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ధరల నియంత్రణ విధించినప్పుడు కంపెనీలు నష్టాలు చవిచూస్తాయి. భారత్లో పెట్రోల్ రిటైల్ ధరలో దాదాపు 40-50% వరకు కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్ పన్నులే ఉంటాయి.భారత్లో ఈ20 విప్లవంభారతదేశం విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఉద్గారాలను అరికట్టడానికి ఈ20 (20% ఇథనాల్ + 80% పెట్రోల్) బ్లెండింగ్ ప్రోగ్రామ్ను వేగవంతం చేసింది. 2030 నాటికి నిర్దేశించుకున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని భారత్ ముందుగానే సాధించి దేశవ్యాప్తంగా ఈ20 ఇంధన లభ్యతను అందుబాటులోకి తెచ్చింది. చెరకు చెక్కెర పాకం, మొక్కజొన్న, ధాన్యం వ్యర్థాల నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వులు వేల కోట్లు దీని వల్ల ఆదా అవుతున్నాయి. దాంతోపాటు రైతుల ఆదాయం పెరుగుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సైతం చేకూరుతోందని అంటోంది.ఇదీ చదవండి: మీ EPF డబ్బు సురక్షితంగా ఉండాలా? -
బ్యాంక్ లోన్ కట్టలేదా? కొత్త నిబంధనలు ఇవే!
బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణ వసూళ్ల వ్యవహారంలో రికవరీ ఏజెంట్ల అక్రమాలు, వేధింపులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెక్ పెట్టింది. రుణగ్రహీతల హక్కులకు రక్షణ కల్పిస్తూ సమగ్రమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నూతన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.ఫోన్ కాల్స్, సమయంపై కఠిన పరిమితులుకొత్త నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. పరిమితికి మించి పదేపదే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు పంపకూడదు. రుణగ్రహీతలను భయభ్రాంతులకు గురిచేయడం, అనామక సంభాషణలు జరపడం, అసభ్య పదజాలం వాడటం పూర్తిగా నిషేధం. అంతేకాక, బంధువులు, స్నేహితులు లేదా సహోద్యోగులకు ఫోన్ చేసి వేధించడం, సోషల్ మీడియాలో రుణగ్రహీత ఫొటోలు లేదా వివరాలు పోస్ట్ చేసి వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడాన్ని ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది.ఏజెంట్లకు ఐఐబీఎఫ్ శిక్షణ నిర్బంధంబ్యాంకులు నియమించే రికవరీ ఏజెంట్లు తప్పనిసరిగా ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్’ (ఐఐబీఎఫ్) సర్టిఫికేషన్ పొంది ఉండాలి. ఏజెంట్ మొదటిసారి వెళ్లేముందే బ్యాంకులు కస్టమర్కు సమాచారం అందించాలి. ప్రతి ఏజెంట్ వద్ద ఐడీ కార్డు, బ్యాంక్ అధికార పత్రం ఉండాలి. సంభాషణలకు సంబంధించిన కాల్ రికార్డింగ్లను కనీసం 6 నెలల పాటు భద్రపరచాలి. వైద్య అత్యవసర పరిస్థితులు, వివాహాలు, తీవ్ర విషాద సమయాల్లో వసూలు ప్రయత్నాలు చేయకూడదు. పొరపాటు వసూలు చర్యలకు గురైన బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.మొబైల్ ఫోన్ రుణాలు.. పరిహారంమొబైల్ కొనుగోలు రుణ బకాయిలు చెల్లించకపోతే మాత్రమే ఆ పరికరాన్ని ‘డివైజ్ లాకింగ్’ సాంకేతికత ద్వారా నిరోధించేందుకు అనుమతి ఉంటుంది.ఈఎంఐ చెల్లింపు 30 రోజులు ఆలస్యమైతే పాక్షికంగా, 60 రోజులు దాటితే పూర్తిస్థాయి ఆంక్షలు విధించవచ్చు. అయితే, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ సేవలను నిలిపివేయడానికి వీల్లేదు.రుణగ్రహీత కాంటాక్ట్లు, ఫొటోలు, గ్యాలరీని యాక్సెస్ చేయడం నిషేధం.బాకీ చెల్లించిన 1 గంటలోపు ఫోన్ అన్లాక్ చేయాలి.ఆలస్యమైతే గంటకు రూ.250 చొప్పున పరిహారం బాధితుడికి చెల్లించాలి.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్, సాంప్రదాయ రుణ మార్కెట్లో జవాబుదారీతనాన్ని పెంచి సామాన్య రుణగ్రహీతలకు మానసిక ప్రశాంతతను అందిస్తుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: మీ EPF డబ్బు సురక్షితంగా ఉండాలా? -
మీ EPF డబ్బు సురక్షితంగా ఉండాలా?
ఉద్యోగ విరమణ చేసిన లేదా ఉద్యోగాలు మారిన చందాదారులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నిధులను సకాలంలో ఉపసంహరించుకోవాలని లేదంటే వడ్డీ నష్టపోవాల్సి వస్తుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తెలిపింది. ఈ మేరకు ఇనాపరేటివ్ (క్రియాశీలకంగా లేని) ఖాతాలపై చందాదారులకు అధికారికంగా అవగాహన కల్పిస్తూ స్పష్టతనిచ్చింది.ఉద్యోగం వదిలేసిన తర్వాత లేదా చందా చెల్లింపులు నిలిచిపోయిన తర్వాత ఖాతాలోకి కొత్తగా డిపాజిట్లు రాకపోతే ఆ ఖాతాలు ఇనాపరేటివ్గా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి ఖాతాలపై వడ్డీ నష్టపోకుండా ఉండేందుకు ఈపీఎఫ్ఓ రెండు విభిన్న వయోపరిమితి ఆధారిత నిబంధనలను స్పష్టం చేసింది.55 ఏళ్ల కంటే ముందే రిటైర్మెంట్ పొందినవారు.. వీరు తమకు 58 ఏళ్ల వయసు నిండేలోపు ఈపీఎఫ్ సొమ్మును పూర్తిస్థాయిలో క్లెయిమ్ చేసుకోవాలి.55 ఏళ్లు లేదా ఆ తర్వాత రిటైర్ అయినవారు.. ఉద్యోగ విరమణ పొందిన తేదీ నుంచి సరిగ్గా మూడేళ్ల (3 ఏళ్లు) కాలపరిమితిలోగా నిధులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.రిటైర్మెంట్ నిధి సురక్షితంగా ఉండాలంటే..మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) ద్వారా ఈపీఎఫ్ ఖాతాను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తుండాలి.ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను(కేవైసీ) ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవాలి.ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ను కొత్త కంపెనీ ఖాతాకు బదిలీ చేసుకోవాలి.పదవి విరమణ అనంతర నిధులను నిర్దేశిత గడువు దాటకముందే ఉపసంహరించుకోవాలి.ఈపీఎఫ్ఓ జారీ చేసే తాజా మార్గదర్శకాలను తరచూ గమనిస్తూ ఉండాలి.కేవలం పొదుపు చేయడమే కాకుండా విరమణ నిధిని బాధ్యతాయుతంగా నిర్వహించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో క్లెయిమ్లు పూర్తి చేసుకుని వడ్డీ నష్టపోకుండా చూసుకోవడం చందాదారుల ప్రాథమిక బాధ్యత.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ తీరుపై వారెన్ బఫెట్ సీరియస్! -
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. బిల్లుకు లోక్సభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ (MDR) విధించేందుకు వీలుగా నిబంధనలను మార్చే ట్యాక్సేషన్ చట్టాల (సవరణ) బిల్లు, 2026కు లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ప్రతి యూపీఐ చెల్లింపుపైనా ఛార్జీ పడుతుందని భావించాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై జీరో-ఎండీఆర్ విధానం అమల్లో ఉంది. డిజిటల్ చెల్లింపులను వేగంగా విస్తరించడంతో పాటు చిన్న వ్యాపారులు, వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఈ విధానం కొనసాగుతోంది. తాజా సవరణ ద్వారా కొన్ని రకాల యూపీఐ లావాదేవీలకు భవిష్యత్తులో ఎండీఆర్ విధించేలా చట్టపరమైన అడ్డంకిని తొలగించే అవకాశం ఏర్పడింది.అయితే ఎంత ఛార్జీ విధించాలి, ఏ లావాదేవీలకు వర్తించాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలి వంటి అంశాలను బిల్లు ప్రస్తుతం నిర్దేశించలేదు. యూపీఐ వినియోగదారుల నుంచి నేరుగా ఫీజు వసూలు చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎంపిక చేసిన వ్యాపార చెల్లింపులపై ఎండీఆర్ విధించే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.అందువల్ల సాధారణ యూపీఐ వినియోగదారులకు ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పు ఉండదు. భవిష్యత్తులో ప్రభుత్వం, ఆర్బీఐ నిర్ణయించే నిబంధనల ఆధారంగానే నిర్దిష్ట వ్యాపార లావాదేవీలపై ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిన్న వ్యాపారులు, తక్కువ విలువైన చెల్లింపులకు రక్షణ కల్పిస్తూ ఛార్జీల విధానాన్ని రూపొందించాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. -
‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026’కు ఆమోదం
దేశీయ ఆర్థిక, బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. 135 ఏళ్ల నాటి ప్రాచీన చట్టం ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ - 1891’ స్థానంలో నూతన సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా రూపొందించిన ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు - 2026’ను లోక్సభ ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లు డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ లావాదేవీలు, న్యాయపరమైన సాక్ష్యాల నిరూపణ ప్రక్రియను ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది.డిజిటల్ యుగానికి అనుగుణంగా నూతన చట్టం1891 నాటి పాత చట్టం కేవలం భౌతిక కాగితపు లెడ్జర్లు, క్యాష్ బుక్కులు, చేతిరాత ఖాతాలకే పరిమితమైంది. అయితే, నేడు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ రికార్డులు, క్లౌడ్ స్టోరేజ్ ఆధారిత లావాదేవీలే బ్యాంకింగ్ వ్యవస్థకు మూలాధారంగా మారాయి. ఈ నేపథ్యంలో నూతన చట్టం కొన్ని కీలక మార్పులను తీసుకొచ్చింది.ఎలక్ట్రానిక్, డిజిటల్, వర్చువల్, క్లౌడ్ స్టోరేజ్, డిజాస్టర్ రికవరీ సర్వర్లలో భద్రపరిచిన రికార్డులన్నింటినీ కోర్టుల్లో ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణిస్తారు.సాంప్రదాయ మాన్యువల్ సంతకాలతో పాటు ‘సమాచార సాంకేతిక చట్టం-2000’ కింద ధ్రువీకరించిన డిజిటల్, ఎలక్ట్రానిక్ సంతకాలకు పూర్తి చట్టబద్ధత కల్పించారు.బ్యాంకింగ్ సిబ్బందికి ఉపశమనంపాత నిబంధనల ప్రకారం, బ్యాంకులు నేరుగా భాగస్వాములు కాని కేసుల్లో కూడా బ్యాంక్ అధికారులు భౌతిక రికార్డులతో కోర్టులకు హాజరుకావాల్సి వచ్చేది. నూతన బిల్లులోని స్పెషల్ కాజ్ (ప్రత్యేక కారణం) నిబంధన ద్వారా కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తే తప్ప బ్యాంక్ అధికారులను అనవసరంగా సమన్లు చేసే భారం తప్పుతుంది. దీనివల్ల బ్యాంకింగ్ సిబ్బందిపై ఒత్తిడి తగ్గడమే కాక సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, చెక్ బౌన్స్ కేసులు, రుణ రికవరీ వివాదాల్లో సర్టిఫైడ్ డిజిటల్ సాక్ష్యాలు త్వరితగతిన లభించి న్యాయ విచారణ వేగవంతమవుతుంది.ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే.. -
నాలుగోసారీ.. యథాతథం
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ వరుసగా నాలుగోసారీ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. కీలకమైన రెపో రేటును 5.5 శాతంగానే ఉంచాలని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. తదుపరి ఎంపీసీ సమావేశం అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరగనుంది. ఆహార, ఇంధన ధరల పెరుగుదల కారణంగా సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మరింత పెరిగి 2026–27 మూడో త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకుని, క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేస్తున్నట్లు ద్వైమాసిక పాలసీ సమీక్ష సమావేశం అనంతరం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. కొన్ని విభాగాల్లో మినహా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు విస్తృతంగా లేనందున ద్రవ్య పరపతి విధానాన్ని అత్యవసరంగా కఠినతరం చేయాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. ద్రవ్యోల్బణం అంచనాలపై మరింత స్పష్టత వచ్చే వరకు వేచి చూస్తూనే, ధరలను టార్గెట్ దిగువకు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. తటస్థ పాలసీ విధానం, వడ్డీ రేట్లపై తదుపరి నిర్ణయాలనేవి ఎప్పటికప్పుడు వచ్చే డేటాపై ఆధారపడి ఉంటాయని మల్హోత్రా చెప్పారు. ‘‘వేగంగా మారిపోతున్న పశ్చిమాసియా పరిణామాలపై అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు, సెంటిమెంట్లు ఆధారపడి ఉంటున్నాయి. ఇవి దేశీయంగా వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండటమనేది, భారత ఎకానమీ ఈ గ్లోబల్ షాక్లను తట్టుకునేందుకు తోడ్పడుతోంది’’ అని మల్హోత్రా చెప్పారు. ‘‘వృద్ధికి ఊతమివ్వడం, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, ధరలు .. కరెన్సీ స్థిరంగా ఉండేలా చూడటం .. ఇలా ఏ అంశమైనా సరే ఎకానమీని మరింత బలోపేతం చేసే విధానాలను అమలు చేయడాన్ని కొనసాగిస్తాం’’ అని ఆయన తెలిపారు. గ్లోబల్గా అనిశ్చితి నెలకొన్నప్పటికీ సర్వీసుల ఎగుమతులు, రెమిటెన్సుల రాకతో దేశ కరెంటు అకౌంటు పటిష్టంగా ఉన్నట్లు వివరించారు. జూలై 31 నాటికి ఫారెక్స్ నిల్వలు 692.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వివరించారు. త్వరలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు లైసెన్సు మార్గదర్శకాలు యూనివర్సల్ బ్యాంకుల తరహాలోనే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు ఆన్–ట్యాప్ లైసెన్సులు ఇవ్వడానికి సంబంధించి త్వరలోనే ముసాయిదా మార్గదర్శకాలను వెల్లడించనున్నట్లు మల్హోత్రా తెలిపారు. దీనిపై జనవరిలోనే చర్చాపత్రాన్ని రూపొందించినట్లు వివరించారు. మరోవైపు, బ్యాంకింగ్ రంగంలో గణనీయంగా మార్పులు వచ్చిన నేపథ్యంలో గ్రామీణ సహకార బ్యాంకుల్లో రిస్క్ ల నిర్వహణ మార్గదర్శకాలను సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. రుణాలపై వడ్డీ రేట్ల క్రమబద్దీకరణ.. నియంత్రిత సంస్థలవ్యాప్తంగా రుణాలపై వడ్డీ రేట్లను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మల్హోత్రా వివరించారు. వడ్డీ రేట్లలో పారదర్శకతను పెంచేందుకు, పరపతి విధాన నిర్ణయాల బదలాయింపు అమలయ్యేందుకు, విని యోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు, రూపాయిని బలోపేతం చేసే ఉద్దేశంతో పరిమిత కాలం కోసం ప్రకటించిన ఫారిన్ కరెన్సీ నాన్–రెసిడెంట్ (బ్యాంక్) స్కీము కింద గణనీయంగా నిధులు వస్తున్నాయని గవర్నర్ చెప్పారు. దీన్ని ముందస్తుగా ముగించేసే యోచనేదీ లేదని తెలిపారు. విదేశీ నిధులు వస్తున్నప్పటికీ దేశీ కరెన్సీ బలపడకపోవడంపై స్పందిస్తూ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే రూపా యి మరింత బలోపేతం కావచ్చని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాలిమర్ కరెన్సీ అంతా సజావుగా జరిగితే, పాలిమర్ కరెన్సీ నోట్లను 2028 ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మల్హోత్రా వివరించారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి నోట్లు 30 ఏళ్లకు పైగా మన్నాయని ఆయన పేర్కొన్నారు.ద్వితీయార్థంలో అర శాతం పెంపునకు చాన్స్ రిస్కులను కూడా ప్రస్తావిస్తూ సమతూకంగా ఆర్బీఐ పాలసీ విధానం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఉపాసనా భరద్వాజ్ చెప్పారు. 2027 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో 50 బేసిస్ పాయింట్ల మేర రేట్ల పెంపు ఉండొచ్చని చెప్పారు. మరోవైపు, కఠినతరం చేసే సంకేతాలు ఇవ్వకుండా, తటస్థ ధోరణిని పాటించడం ద్వారా ఆర్బీఐ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉండేలా చూసుకుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఎండీ రాహుల్ గోస్వామి చెప్పారు. ఇతర కీలకాంశాలు .. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని జూన్లో అంచనా వేయగా, తాజాగా 5 శాతానికి తగ్గించారు. ఆహారం, ఇంధనం భాగంగా ఉండని కోర్ ద్రవ్యోల్బణ అంచనాలను 4.7 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గించారు. → వృద్ధి రేటు అంచనాలను 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచారు. వాస్తవ జీడీపీ వృద్ధి క్యూ1లో 7 శాతంగా, క్యూ2లో 6.4 శాతంగా, క్యూ3లో 6.5 శాతంగా, క్యూ4లో 6.8 శాతంగా ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నా దేశీయంగా డిమాండ్, తయారీ, సర్వీసుల కార్యకలాపాలు, ఎగుమతులు మెరుగ్గా ఉండటం ఇందుకు దోహదపడనున్నాయి. అయితే, రుతు పవనాలు, ఎల్నినో పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, గ్లోబల్ ట్రేడ్ పాలసీలపరమైన రిస్కులు పొంచి ఉన్నాయి. → ఏప్రిల్–మే వ్యవధిలో కరెంటు అకౌంటు మి గులు 2.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. → తొలి త్రైమాసికంలో స్థూలంగా 30.7 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. -
ఆర్బీఐ పరపతి సమీక్ష ముఖ్యాంశాలు
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆగస్టు 3న ప్రారంభించిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) సమావేశం నేటితో ముగిసింది. ఈ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ద్రవ్యోల్బణ ముప్పులు పూర్తిస్థాయిలో తగ్గకపోవడం, అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతుండటంతో ప్రాథమిక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో కీలకమైన రెపో రేటు 5.25 శాతం వద్దే స్థిరంగా కొనసాగనుంది. వరుసగా నాలుగోసారి కూడా ఆర్బీఐ ఈ స్థిర వైఖరిని పాటించింది.ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే..FY27 ఆర్థిక సంవత్సరానికి ప్రధాన ద్రవ్యోల్బణం 4.3%గా ఉంటుందని అంచనా వేశారు.త్రైమాసికాల వారీగా అంచనాలు..Q2: 4.7%Q3: 5.9%Q4: 5.5%ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుదక్షిణాది రుతుపవనాల్లో అసమానతల వల్ల వ్యవసాయ రంగానికి ఎల్ నినో ప్రధాన ముప్పుగా మారే అవకాశం ఉందని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. జులై నుంచి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఇంధన ధరలలో అస్థిరత నమోదైంది.జీడీపీ వృద్ధి, ఆర్థిక పురోగతిFY27 వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.7%గా ఉండవచ్చని అంచనా వేశారు (ఇది మునుపటి అంచనా కంటే 10 bps ఎక్కువ). Q1లో ఉత్పాదక రంగం, ప్రైవేట్ వినియోగం బలంగా ఉండటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగ్గా వృద్ధి చెందిందన్నారు.బ్యాంకింగ్ వ్యవస్థ.. లిక్విడిటీజూన్ నెల నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో సగటు లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) రూ. 1 లక్ష కోట్లకు పైగా ఉంది.దేశంలో రుణ వృద్ధి చాలా బలంగా, అన్ని రంగాలకూ విస్తరించి ఉంది.బ్యాంకింగ్ వ్యవస్థలో ఎల్లప్పుడూ తగినంత లిక్విడిటీ ఉండేలా సెంట్రల్ బ్యాంక్ చర్యలు తీసుకుంటుంది.రుణ విధానంలో పారదర్శకతరుణ రేట్లలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి, నియంత్రిత సంస్థల్లో అడ్వాన్సులపై ఉన్న నియంత్రణ ఫ్రేమ్వర్క్ను సమన్వయం చేయడానికి ప్రతిపాదనలు చేశారు.అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సింగ్పట్టణ సహకార బ్యాంకుల నూతన లైసెన్సింగ్ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు గాను ఆర్బీఐ త్వరలోనే ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేయనుంది.విదేశీ పెట్టుబడులు.. మారక నిల్వలుమొదటి త్రైమాసికంలో 13.5 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నమోదయ్యాయి.పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల దేశ విదేశీ మారక నిల్వలకు ముప్పు పొంచి ఉందని ఆర్బీఐ పేర్కొంది.కరెంట్ ఖాతా లోటుగతేడాది భారతదేశ కరెంట్ ఖాతా లోటు స్థిరంగా ఉంది.ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ఇది లోటు నుంచి మిగులు సాధించిందని గవర్నర్ తెలిపారు.యథాతథ స్థితికి దారితీసిన ప్రధాన కారణాలురిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం నియంత్రణ పరిధిలోనే ఉన్నప్పటికీ ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం మధ్యకాలిక లక్ష్యం కంటే కొంత పైస్థాయిలోనే కొనసాగుతోంది. ఆహార పదార్థాల ధరల్లో ఒడుదొడుకులు ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచే ప్రమాదం ఉందనే భావన వ్యక్తమైంది.పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. ఇది భారత్ వంటి చమురు దిగుమతి దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ, పంటల సాగు సరళిపై ఆర్బీఐ దృష్టి సారించింది. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడడం ద్రవ్యోల్బణ నియంత్రణకు ముఖ్యం.అమెరికా సహా ప్రధాన గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధానాలు, బాండ్ ఈల్డ్లు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ ధోరణులు పరిగణనలోకి తీసుకున్నారు.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచేలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2025లో చేపట్టిన వడ్డీ రేట్ల కోత ప్రభావం ఆర్థిక వ్యవస్థలోకి ప్రతిబింబిస్తున్న వేళ తొందరపడి రేట్లను మరింత తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం మళ్లీ పెచ్చురిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. -
రూ.28 వేల కోట్ల సబ్సిడీ.. 50 లక్షల కుటుంబాలకు లబ్ది!
ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) పథకం కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా 50.06 లక్షల గృహాలు లబ్ధి పొందాయి. ప్రారంభం నుంచి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో గణనీయమైన పెరుగుదల కనిపించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేవలం రెండేళ్లలోనే ఈ పథకం పతాకస్థాయిలో ఆదరణ పొందినట్లు పేర్కొంది.పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కోసం.. కేంద్ర ప్రభుత్వం రూ.75,021 కోట్ల భారీ నిధులను కేటాయించింది. అయితే ఈ పథకం అమలు చేయడానికి ముందు పదేళ్లలో.. దేశవ్యాప్తంగా కేవలం 7.94 లక్షల రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు మాత్రమే ఏర్పాటు అయ్యాయి. కానీ ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన రెండేళ్లలోనే 50 లక్షలకు పైగా కుటుంబాలు సోలార్ను స్వీకరించాయి. దీన్నిబట్టి చూస్తే.. ప్రజల్లో అవహగాన పెరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.ఒక్క నెలలోనే 5.06 లక్షలుప్రస్తుతం ప్రతి ఆరు రోజులకు లక్ష మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకంలో చేరుతున్నట్లు సమాచారం. గత తొమ్మిది నెలల్లో సోలార్ వ్యవస్థల ఏర్పాటు వేగం మూడు రెట్లకు పైగా పెరిగింది. ముఖ్యంగా 2026 జూలైలో ఒక్క నెలలోనే 5.06 లక్షల ఇళ్లలో సోలార్ ప్యానెల్లు ఏర్పాటు కావడం ఒక కొత్త రికార్డు. రోజుకు సగటున 16 వేలకుపైగా ఇళ్లలో సోలార్ వ్యవస్థలు అమర్చడం ఈ కార్యక్రమం ఎంత వేగంగా ముందుకు సాగుతోందో తెలియజేస్తోంది.ఈ పథకం వల్ల ప్రజలకు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.28,024 కోట్ల సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఫలితంగా సుమారు 19 లక్షల కుటుంబాలు విద్యుత్ బిల్లు లేకుండానే జీవిస్తున్నాయి.అదనపు ఆదాయం కూడా..అంతేకాదు.. అవసరానికి మించి ఉత్పత్తి చేసిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు అదనపు ఆదాయం కూడా సంపాదిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కుటుంబాలు కలిపి రూ.421 కోట్ల ఆదాయం పొందగా, ఒక్కో కుటుంబానికి సగటున ఏడాదికి రూ.3,500 వరకు అదనపు ఆదాయం వచ్చింది.ఇదీ చదవండి: UPI యూజర్లకు అలర్ట్.. డబ్బులు పంపే ముందు కొత్త స్టెప్!దరఖాస్తు నుంచి సబ్సిడీ విడుదల వరకు మొత్తం ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఆన్లైన్ చేసింది. దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా సేవలు పొందుతున్నారు. కాగా.. ఈ పథకం వల్ల ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి.A people-powered solar revolution is transforming India. Under Hon'ble PM Shri @narendramodi ji’s @PMSuryaGhar Muft Bijli Yojana, 50 lakh families are harnessing the power of the sun for cleaner energy, lower electricity bills, and a brighter tomorrow. #50LakhPMSuryaGhar pic.twitter.com/dhRgyDvnhI— Ministry of New and Renewable Energy (MNRE) (@mnreindia) August 4, 2026 -
పెట్రోల్ ఎగుమతులపై ట్యాక్స్ పెంపు!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ల ఎగుమతులపై కేంద్రం విండ్ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ను పెంచింది. ఆగస్టు 3 (సోమవారం) నుంచి పక్షం రోజుల పాటు ఇది అమలవుతుంది. ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని లీటరుకు రూ. 15.5 నుంచి రూ. 25.5కి పెంచారు. అలాగే ఏటీఎఫ్పై లీటరుకు రూ. 14.5 నుంచి రూ. 22కి, పెట్రోల్పై రూ. 2,5 నుంచి రూ. 3.5కి ఎస్ఏఈడీ పెరిగింది.పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. దేశీయంగా ఇంధనాల లభ్యతను పెంచేందుకు మార్చి 27న డీజిల్, ఏటీఎఫ్పై ఆ తర్వాత మే 16 నుంచి పెట్రోల్ ఎగుమతులపైనా విండ్ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నారు. అంతర్జాతీయ, దేశీయ రేట్ల మధ్య వ్యత్యాసాన్ని ఎగుమతిదారులు అనుచితంగా సొమ్ము చేసుకోకుండా నివారించేందుకు కేంద్రం ఈ ట్యాక్స్ను విధిస్తుంది. -
‘మీకు బోలెడు లాభాలొచ్చాయ్’
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ పెట్రోల్ బంకుల్లో సామాన్య వినియోగదారులకు ధరల ఉపశమనం లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోని ప్రధాన చమురు కంపెనీలు అనైతికంగా విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్నాయని ఆరోపిస్తూ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను తక్షణమే తగ్గించాలని ఆదేశించారు. ‘చమురు దిగ్గజాలు అధిక లాభాలు గడిస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో ఇంధన ధరలను వెంటనే తగ్గించండి’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేశారు.ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అడ్డంకుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగి ఎక్సన్ మొబిల్, షెవ్రాన్ వంటి అమెరికన్ చమురు సంస్థలు గత త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. అయితే, మిలిటరీ చర్యలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 83 డాలర్ల స్థాయికి పడిపోయాయి. ముడిచమురు ధరలు పడిపోయినా రిటైల్ మార్కెట్లో పెట్రోల్ ధరలను తగ్గించకుండా కంపెనీలు లాభపడటంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈక్రమంలో షెవ్రాన్ సీఈఓ మైక్ విర్త్ను ట్రంప్ నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. తమ ప్రభుత్వ వ్యూహాత్మక విధానాలు, మద్దతు వల్లే వెనిజువెలా వంటి ప్రాంతాల్లో షెవ్రాన్ తిరిగి బలమైన స్థానానికి చేరుకుని భారీగా ఆర్జిస్తోందని, కానీ ఆ క్రెడిట్ను యాజమాన్యం గుర్తించడం లేదని విమర్శించారు. ‘ప్రభుత్వ పరిపాలన అందించిన మద్దతు, స్థిరత్వం లేకపోతే అమెరికా చమురు పరిశ్రమ దెబ్బతినేది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కంపెనీలు ఆ ప్రయోజనాన్ని ధరల తగ్గింపు రూపంలో ప్రజలకు అందించాల్సిందే’ అని స్పష్టం చేశారు.అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా పెద్ద సవాలుగా మారాయి. దీంతో ఓటర్ల అసంతృప్తిని చల్లార్చేందుకు ట్రంప్ ఇంధన దిగ్గజాలపై ఒత్తిడి పెంచుతున్నారు. చమురు కంపెనీలు వెంటనే స్వీయ నియంత్రణ పాటించి బంకుల్లో ధరలు తగ్గించకపోతే ధరల పెంపుపై జస్టిస్ డిపార్ట్మెంట్ ద్వారా విచారణ జరిపించేందుకు సైతం వైట్హౌస్ వెనుకాడకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: దేశంలోనే అత్యధిక శ్రీమంతులున్న టాప్-10 ఇంటిపేర్లు -
రాబోతున్నాయి.. మరిన్ని ‘పన్ను’ మార్పులు!
పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం, డిజిటల్ చెల్లింపులను మరింత విస్తరించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పన్ను, నియంత్రణ వ్యవస్థల్లో పలు కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆదాయపు పన్ను (సవరణ) ఆర్డినెన్స్–2026 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడంలో భాగంగా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం.డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలకు కొత్త ఫ్రేమ్వర్క్డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు ప్రతిపాదిత సంస్కరణల్లో ప్రధానంగా నిలిచాయి. ఆదాయపు పన్ను చట్టంతో అనుసంధానమైన ప్రస్తుత నిబంధనలకు బదులుగా, బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థల ప్రొవైడర్లు ఛార్జీలు విధించకూడని ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను ప్రభుత్వం నోటిఫై చేసేలా చట్టపరమైన అధికారం కల్పించనున్నారు. ఈ మార్పుతో డిజిటల్ లావాదేవీలపై వ్యాపారులు చెల్లించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వ సెక్యూరిటీలపై పన్ను మినహాయింపులువిదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు), బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా పొందే వడ్డీ ఆదాయం, మూలధన లాభాలపై పన్ను మినహాయింపు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది. విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడమే ఈ చర్య ఉద్దేశంగా కనిపిస్తోంది.ఎలక్ట్రానిక్స్ తయారీకి దీర్ఘకాలిక ప్రోత్సాహంఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అవసరమైన మూలధన వస్తువులను సరఫరా చేసే విదేశీ సంస్థలకు పన్ను ప్రయోజనాలను 2040–41 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అలాగే భారత్లో కాంట్రాక్ట్ తయారీ కార్యకలాపాల కోసం కస్టమ్స్ బాండెడ్ గిడ్డంగుల్లో విడిభాగాలను నిల్వ చేసే విదేశీ కంపెనీలకు కూడా అదే కాలం వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని యోచిస్తోంది.వజ్రాల రంగానికీ పన్ను ప్రోత్సాహకాలువిదేశీ వజ్రాల మైనింగ్ కంపెనీలు, నోటిఫైడ్ ప్రత్యేక మండలాల ద్వారా ముడి వజ్రాలను విక్రయించే సంబంధిత సంస్థలకు 2040–41 ఆర్థిక సంవత్సరం వరకు పన్ను మినహాయింపులు కల్పించే ప్రతిపాదన ఉంది. దీంతో వజ్రాల వ్యాపారం, సంబంధిత పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.డేటా సెంటర్లు, ఇన్వెస్ట్మెంట్ ఫండ్లకు మార్పులుఅర్హత కలిగిన పెట్టుబడి నిధుల (క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్) పాలనను సరళీకరించడంతో పాటు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల నిర్వచనాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్దిష్ట డేటా సెంటర్లు సొంతంగా కలిగి ఉన్న లేదా లీజుకు తీసుకున్న మౌలిక సదుపాయాలపై కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతించే మార్పులు కూడా ప్రతిపాదిత సంస్కరణల్లో ఉన్నాయి.అదేవిధంగా, కొన్ని సందర్భాల్లో బిజినెస్ ట్రస్ట్ యూనిట్ హోల్డర్లకు డివిడెండ్పై పన్ను మినహాయింపును కొనసాగించాలని ప్రతిపాదించారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే ప్రత్యేక ప్రయోజన వాహకాలు (SPV)పై 25 శాతం అధిక సర్ఛార్జ్ విధించే ప్రతిపాదన కూడా ఉంది.మొత్తంగా, ఈ ప్రతిపాదిత మార్పులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణతో పాటు విదేశీ పెట్టుబడులు, ఎలక్ట్రానిక్స్ తయారీ, వజ్రాల రంగం, డేటా సెంటర్లు వంటి కీలక రంగాలకు దీర్ఘకాలిక పన్ను ప్రోత్సాహకాలను అందించే దిశగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
అమెరికా ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్నారా?
డొనాల్డ్ ట్రంప్ తరచూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత బలంగా ఉందని చెబుతున్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని, ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు పీటర్ షిఫ్ (Peter Schiff) మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు.పీటర్ షిఫ్ ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిజంగా బలంగా ఉంటే ప్రజలు తమ రోజువారీ ఖర్చులు, రుణాల చెల్లింపులు సకాలంలో చేయగలగాలి. కానీ.. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేకపోతున్న వారి సంఖ్య 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు.Trump claims the U.S. economy is booming like never before, yet serious credit-card delinquencies are at their highest rate since the aftermath of the 2008 financial crisis. This shows that Americans are struggling to pay their bills, which is consistent with bad, not good times.— Peter Schiff (@PeterSchiff) August 2, 2026క్రెడిట్ కార్డు బకాయిలు ఎక్కువకాలం చెల్లించకుండా ఉండటాన్ని ఆర్థిక రంగంలో 'సీరియస్ క్రెడిట్ కార్డ్ డెలింక్వెన్సీ'గా పరిగణిస్తారు. ఇలాంటి కేసులు పెరగడం అంటే.. ప్రజలు తమ ఆదాయంతో ఖర్చులను నిర్వహించలేకపోతున్నారని, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్థం. అందుకే ట్రంప్ చెబుతున్నట్లుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే వాదనకు ఈ గణాంకాలు సరిపోవని పీటర్ షిఫ్ అంటున్నారు.ప్రజలు అప్పులు తీర్చలేకపోతుంటే.. దానిని మంచి ఆర్థిక పరిస్థితిగా ఎలా చెప్పగలమని పీటర్ షిఫ్ ప్రశ్నించారు. అయితే.. ప్రస్తుత అమెరికా ఆర్థిక పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఉద్యోగాల పెరుగుదల, ఆర్థిక వృద్ధి వంటి సూచీలను ప్రస్తావిస్తే, మరికొందరు ప్రజలపై పెరుగుతున్న రుణభారం, అధిక జీవన వ్యయం, క్రెడిట్ కార్డు బకాయిలను ప్రధాన సమస్యలుగా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై చర్చ కొనసాగుతూనే ఉంది.ఇదీ చదవండి: బ్యాంకులు మీ డబ్బుతో ఏం చేస్తాయో తెలుసా? -
జులై జీఎస్టీ వసూళ్లు.. 14 నెలల కాలంలోనే గరిష్ఠం
భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి పయనంలో దూసుకుపోతోందనడానికి నిదర్శనంగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం జులై నెలలో స్థూల జీఎస్టీ రాబడి 15.4 శాతం వృద్ధితో రూ.2.11 లక్షల కోట్లకు చేరింది. గత 14 నెలల కాలంలోనే ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం.దిగుమతుల జోరు, నికర ఆదాయంలో ఊపుఅంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు పుంజుకోవడంతో దిగుమతులపై వచ్చే జీఎస్టీ వసూళ్లు ఏకంగా 28.8% పెరిగి రూ.66,511 కోట్లకు ఎగబాకాయి. ఇక స్వదేశీ లావాదేవీల ద్వారా లభించిన రాబడి 10.1 శాతం పెరిగి రూ.1.45 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యాపారులకు ఇచ్చే రీఫండ్లను మినహాయించిన తర్వాత ప్రభుత్వానికి లభించిన నికర జీఎస్టీ రాబడి 15.8% వృద్ధితో రూ.1.81 లక్షల కోట్లకు చేరింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్-జులై) స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.8.43 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ-ఇన్వాయిసింగ్ విధానం పక్కాగా అమలుకావడం, డేటా విశ్లేషణ ద్వారా పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడం ఆదాయానికి ప్రధాన చోదకాలుగా నిలిచాయి. వచ్చే పండుగల సీజన్తో రాబోయే త్రైమాసికాల్లో వినియోగం మరింత పెరిగి జీఎస్టీ రాబడి కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్! -
నీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్!
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో తీవ్రమవుతున్న నీటి కొరతను అధిగమించేందుకు ‘బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి’ (బీడబ్ల్యూఎస్ఎస్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠినమైన ఆంక్షలు విధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాగునీటిని వాహనాల వాషింగ్కు, తోటపని (గార్డెనింగ్), భవన నిర్మాణాలు, రోడ్ల శుభ్రత, ఫౌంటెన్ల నిర్వహణ వంటి ఇతర అవసరాలకు వాడటంపై పూర్తి నిషేధం విధించింది.రూ.5,000 ఫైన్బీడబ్ల్యూఎస్ఎస్బీ చట్టం 1964 లోని సెక్షన్లు 33, 34 ప్రాతిపదికన ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. నిబంధనలను ఉల్లంఘించి తాగునీటిని వ్యాపార లేదా ఇతర అవసరాలకు వాడే వారికి మొదటిసారిగా రూ.5,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ ఉల్లంఘన పునరావృతమైతే రూ.5,000 తో పాటు రోజూ అదనంగా రూ.500 వంతున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మాల్స్, సినిమా హాళ్లు, వినోద కేంద్రాల్లో కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే కావేరీ నీటిని వినియోగించడానికి అనుమతి ఉంటుంది.శుద్ధి చేసిన నీటినే వాడాలి..వాహనాల కడగడం, తోటపని వంటి ప్రాథమికేతర అవసరాల కోసం కేవలం శుద్ధి చేసిన రీసైకిల్ నీటిని మాత్రమే వినియోగించాలని బీడబ్ల్యూఎస్ఎస్బీ చైర్మన్ సూచించారు. జలమండలి సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని, ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే పౌరులు హెల్ప్లైన్ నంబర్ 1916 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని విజ్ఞప్తి చేశారు.పడిపోతున్న భూగర్భజలాలువర్షభావ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం వల్ల నగరంలోని వందలాది బోర్వెల్స్ ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. దాదాపు 1.4 కోట్ల జనాభా కలిగిన ఐటీ కారిడార్లో రోజువారీ నీటి అవసరాలకు, సరఫరాకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ క్రమంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు నీటి ధరలను కూడా ప్రభుత్వం ఇప్పటికే క్రమబద్ధీకరించింది. ప్రతీ చుక్క నీటినీ బాధ్యతాయుతంగా వాడుకోవాలని పౌరులకు జలమండలి పిలుపునిచ్చింది.ఇదీ చదవండి: బ్యాంక్ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు -
బ్యాంక్ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు
దేశ ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు సవాలుగా మారిన నకిలీ కరెన్సీ చలామణిని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక అడుగు వేసింది. అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన జిల్లాల్లో ఉన్న అన్ని బ్యాంకు శాఖలు, కరెన్సీ చెస్టుల్లో నోట్ల ప్రామాణికతను తనిఖీ చేసే ప్రత్యేక యంత్రాలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని వాణిజ్య బ్యాంకులను ఆదేశించింది. నకిలీ నోట్ల గుర్తింపు, నివేదన ప్రక్రియలో కొన్ని బ్యాంకులు చూపుతున్న నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బ్యాంక్ ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలతో కొత్త సర్క్యులర్ను జారీ చేసింది.సరిహద్దు జిల్లాలే లక్ష్యంగా..పొరుగు దేశాల సరిహద్దుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోకి దొంగనోట్లను చేరవేసే వ్యవస్థలకు అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అంతకుముందు ఏప్రిల్లో జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్ల అమలు తీరును సమీక్షించగా పలు బ్యాంకు శాఖల సన్నాహకాలు ఆశించిన స్థాయిలో లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది.నూతన మార్గదర్శకాల్లోని అంశాలుఅంతర్జాతీయ సరిహద్దు పరిధిలోని జిల్లాల్లో ఉన్న ప్రతి బ్యాంకు శాఖ, బ్యాక్ ఆఫీసుల్లో నోట్ సార్టింగ్, అథెంటికేషన్ యంత్రాలతో పాటు ఆల్ట్రావైలెట్ లాంప్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.కౌంటర్లలో నగదు లావాదేవీలు నిర్వహించే ప్రతి ఉద్యోగికి అసలైన నోట్ల భద్రతా లక్షణాలు, నకిలీ నోట్ల పసిగట్టే నైపుణ్యాలపై 2026 అక్టోబర్ 31 నాటికి శిక్షణ పూర్తి చేయాలని ఆర్బీఐ స్పష్టమైన గడువు విధించింది.డిపాజిట్ల సమయంలో కౌంటర్లో గానీ, బ్యాక్ ఆఫీస్లో గానీ నకిలీ నోట్లను గుర్తిస్తే వాటిని వెంటనే జప్తు చేసి ఆర్బీఐకి నివేదించాలి. ఏ పరిస్థితుల్లోనూ నకిలీ నోటును ఖాతాదారునికి తిరిగి ఇవ్వడం గానీ లేదా బ్యాంకు స్థాయిలో నాశనం చేయడం గానీ చేయకూడదు.బ్యాంకుల ఫోర్జ్డ్ నోట్ విజిలెన్స్ (ఎఫ్ఎన్వీ) సెల్స్ తమ డేటాను విశ్లేషించి నకిలీ నోట్లు ఎక్కువగా వస్తున్న హాట్స్పాట్ ప్రాంతాలను, ట్రెండ్స్ను గుర్తించి తదనుగుణంగా తనిఖీలు తీవ్రతరం చేయాలి.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
చెప్పిందే జరుగుతోంది.. కియోసాకి హెచ్చరిక!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి గురించి తాను చాలా సంవత్సరాల క్రితమే 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' అనే పుస్తకంలో హెచ్చరించానని కియోసాకి పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రస్తుత పరిస్థితిని చూసి ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. పుస్తకంలో ఇచ్చిన సూచనలను పాటించిన వారు ఈరోజు ఆర్థికంగా కొంత భద్రంగా ఉన్నారని కియోసాకి పేర్కొన్నారు.అయితే.. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. సరైన నిర్ణయాలు తీసుకుంటే మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మన ఆర్థిక ప్రణాళికలను మార్చుకోవడం, ఖర్చులను నియంత్రించడం, తెలివిగా పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలపై దృష్టి పెట్టాలని కియోసాకి సూచిస్తున్నారు.ప్రతి ఆర్థిక సంక్షోభం ఒక పరీక్ష లాంటిది. ఇలాంటి సమయాల్లో చాలా మంది తమ సంపదను కోల్పోతారు. కానీ.. కొందరు మాత్రం పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం వల్ల మరింత ధనవంతులుగా మారుతారని కియోసాకి అభిప్రాయపడ్డారు.భయపడకుండా, ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కియోసాకి చెబుతున్నారు. అయితే ఆర్ధిక విషయాల్లో తప్పకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే అవసరమైన మార్పులు చేసుకోవాలని కోరుతున్నారు. -
ఐటీఆర్ గడువు పొడిగింపుపై ప్రభుత్వం స్పష్టత
ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు నిర్దేశించిన జులై 31 తుది గడువు రేపటితో ముగుస్తుండటంతో పన్ను చెల్లింపుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో డెడ్లైన్ పొడిగింపుపై రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కానీ గడువు పెంపుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు పుకార్లను నమ్మకుండా అందుబాటులో ఉన్న సమయాన్నే ప్రామాణికంగా తీసుకుని వెంటనే ఐటీఆర్ దాఖలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్థిక, పన్ను నిపుణులు హెచ్చరిస్తున్నారు.పుకార్లపై అప్రమత్తతఏటా ఐటీఆర్ డెడ్లైన్ సమీపించే సమయంలో గడువు పొడిగిస్తారనే ప్రచారం సహజంగా మారినప్పటికీ అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని పన్ను నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫారమ్ల లభ్యత, సాంకేతిక సమస్యల కారణంగా దాఖలు వేగం మందగించిన మాట నిజమే అయినా ప్రస్తుతం ఐటీ శాఖ తన ఈ-ఫైలింగ్ పోర్టల్ మౌలిక వసతులను గణనీయంగా బలోపేతం చేసింది. ఒకేసారి లక్షలాది మంది వినియోగదారులు లాగిన్ అయినా తట్టుకునేలా వ్యవస్థను సన్నద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఆలస్యమైతే జరిమానాజులై 31 తుది గడువును దాటవేస్తే పన్ను చెల్లింపుదారులు ఆర్థికంగానూ, సాంకేతికంగానూ నష్టపోవాల్సి వస్తుంది. లేట్ ఫీజు (జరిమానా) కింద పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయ స్థాయిని బట్టి గరిష్టంగా రూ.5,000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బకాయి ఉన్న పన్ను మొత్తంపై నిర్దేశిత చట్టాల ప్రకారం వడ్డీ వర్తిస్తుంది. సకాలంలో రిటర్నులు సమర్పించకపోతే రావాల్సిన రీఫండ్ జమకావడంలో ఆలస్యం జరుగుతుంది. ఆఖరి నిమిషంలో హడావుడిగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఆన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్), ఫారం-26ఏఎస్ వివరాల సరిపోలికలో పొరపాట్లు జరిగి ఐటీ నోటీసులకు దారితీసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
క్రెడిట్ కార్డు బకాయి చెల్లించకపోతే ఉద్యోగంపై వేటు చెల్లదు
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత క్రెడిట్ కార్డు బకాయిని ఆలస్యంగా చెల్లించారనే కారణంగా ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగి, బ్యాంకు మధ్య క్రెడిట్ కార్డు లావాదేవీ అనేది యజమాని–ఉద్యోగి సంబంధం కాదని, అది పూర్తిగా రుణదాత–రుణగ్రహీత మధ్య జరిగే వాణిజ్య ఒప్పందం మాత్రమేనని పేర్కొంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అప్పటి ఆంధ్రాబ్యాంకు) ఉద్యోగి ప్రకాశ్బాబుపై విధించిన కంపల్సరీ రిటైర్మెంట్ శిక్షను రద్దు చేసింది. ఆయన పిటిషన్ను అనుమతిస్తూ.. సాధారణ పదవీ విరమణ వరకు సేవలో కొనసాగినట్లుగా పరిగణించాలని ఆదేశించింది. అన్ని సర్వీస్, పింఛన్, రిటైర్మెంట్ ప్రయోజనాలను 8 వారాల్లో చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. 1979లో ఆంధ్రా బ్యాంకులో ప్రొబేషనరీ అధికారిగా చేరిన ప్రకాశ్ బాబు మూడు దశాబ్దాల పాటు సేవలందించారు. ఉద్యోగంలో ఉండగా బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డును వినియోగించారు. రూ.లక్ష పరిమితి ఉన్న కార్డులో బకాయి పెరిగి రూ.1.68 లక్షలకు చేరింది. చార్జిషిట్ జారీ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించిన బ్యాంక్.. 2009లో ఆయనపై కంపల్సరీ రిటైర్మెంట్ విధించింది. దీన్ని సవాల్ చేస్తూ 2012లో ప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. క్రెడిట్ కార్డు ఉద్యోగ ప్రయోజనంగా ఇవ్వలేదని, సాధారణంగా మాత్రమే జారీ చేసిందన్నారు. బ్యాంకుకు శాశ్వత ఆర్థిక నష్టం కలిగించాలనే దురుద్దేశం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. వ్యక్తిగత క్రెడిట్ కార్డు బకాయిలపై శాఖాపరమైన విచారణ ప్రారంభించడానికి బ్యాంకుకు చట్టపరమైన అధికారం లేదని తేల్చారు. -
భారత పౌరసత్వంపై కోల్కతా హైకోర్టు స్పష్టత
ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు ఖాతా పుస్తకం వంటి పత్రాలు కేవలం వ్యక్తిగత గుర్తింపునకు లేదా ప్రభుత్వ సేవలు పొందడానికే పరిమితమని, అవి భారత పౌరసత్వానికి నిర్దిష్ట నిరూపణలు (కన్క్లూజివ్ ప్రూఫ్) కావని కోల్కతా హైకోర్టు తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్ పౌరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ డిటెన్షన్ సెంటర్లో ఉన్న ఓ వ్యక్తి పౌరసత్వ వివాదానికి సంబంధించిన పిటిషన్ను విచారించిన జస్టిస్ దేబాంగ్షు బసాక్, జస్టిస్ మహమ్మద్ షబ్బర్ రషీదీలతో కూడిన ధర్మాసనం ఈ స్పష్టత ఇచ్చింది.కేసు నేపథ్యం.. విచారణ ముఖ్యాంశాలుముర్షిదాబాద్ ప్రాంతానికి చెందినవాడిగా భావిస్తున్న నాసిర్ అనే వ్యక్తి విదేశీయుడనే అనుమానంతో లాల్గోలా డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. తాను భారతీయ పౌరుడినేనని నిరూపించుకోవడానికి ఆయన తరఫున ఓటరు ఐడీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్బుక్లను కోర్టుకు సమర్పించారు. అయితే, విచారణలో ఆయన వెల్లడించిన వివరాల్లో వ్యత్యాసాలు, అస్పష్టత ఉన్నట్లు ధర్మాసనం గుర్తించింది. విదేశీయుల చట్టం (ఫారెనర్స్ యాక్ట్, 1946) సెక్షన్ 9 ప్రకారం.. ఒక వ్యక్తి తాను విదేశీయుడు కాదని నిరూపించుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.‘ఓటరు గుర్తింపు కార్డు అనేది ఓటర్ల జాబితాలో సదరు వ్యక్తి పేరు నమోదుకు సాక్ష్యమే తప్ప పౌరసత్వాన్ని ధ్రువీకరించదు. ఆధార్, పాన్ కార్డ్ ప్రభుత్వ సేవలు పొందడానికి, పన్ను సంబంధిత గుర్తింపునకు ఉద్దేశించిన సాధనాలు మాత్రమే. వీటి ఆధారంగా పౌరసత్వాన్ని పొందలేరు. పౌరసత్వ చట్టం 1955 ప్రకారం భారతదేశంలో పౌరసత్వ నిర్ణయాలకు సిటిజన్షిప్ యాక్ట్, 1955 ప్రధాన ప్రాతిపదిక. అందులోని చట్టబద్ధ నిబంధనలను సాధారణ సేవా గుర్తింపు కార్డులు అధిగమించలేవు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.కస్టడీలో ఉన్నప్పుడు సమర్పించిన పత్రాలు, ఇచ్చిన వాంగ్మూలాల్లో పొంతన లేకపోవడంతో పిటిషనర్ కోరికను నిరాకరిస్తూ హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. అక్రమ చొరబాట్లు, గుర్తింపు పత్రాల దుర్వినియోగం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో పౌరసత్వ చట్ట నిబంధనలకు, సాధారణ గుర్తింపు కార్డులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చట్టపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే..భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే కేవలం సాధారణ గుర్తింపు కార్డులు సరిపోవని ‘పౌరసత్వ చట్టం, 1955’ ప్రకారం నిర్దిష్టమైన, చట్టబద్ధమైన ధ్రువపత్రాలు అవసరమవుతాయని న్యాయస్థానాలు, హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి.పాస్పోర్ట్: భారత ప్రభుత్వం జారీ చేసే విదేశీ ప్రయాణ పాస్పోర్ట్ అనేది విదేశాల్లో, దేశంలో పౌరసత్వానికి అత్యంత బలమైన ప్రాథమిక ఆధారం.పౌరసత్వ గుర్తింపు పత్రం: విదేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందిన వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక పౌరసత్వ పత్రం.బర్త్ సర్టిఫికేట్: మున్సిపాలిటీ, పంచాయతీ లేదా ప్రభుత్వ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పొందిన అధికారిక జనన ధ్రువీకరణ పత్రం.తల్లిదండ్రుల పౌరసత్వ ఆధారాలు: 1987 జులై 1కి ముందు భారతదేశంలో జన్మించిన వారికి తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రం సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబరు 3 మధ్య జన్మిస్తే అభ్యర్థి జనన ధ్రువీకరణ పత్రంతో పాటు తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరు ఆ సమయానికి భారతీయ పౌరుడని నిరూపించే పత్రాలు ఉండాలి. 2004 డిసెంబరు 3 తర్వాత జన్మిస్తే తల్లిదండ్రులిద్దరూ భారతీయ పౌరులై ఉండాలి.ఇతర పత్రాలుజనన ఆధారాలు స్పష్టంగా లేనప్పుడు కొన్ని ప్రభుత్వ పత్రాలు పౌరసత్వ విచారణల్లో సహాయపడతాయి. తరాల నుంచి భారతదేశంలో నివసిస్తున్నట్లు చూపే పాత ఆస్తి లేదా రెవెన్యూ రికార్డులు. పుట్టిన తేదీ, ప్రదేశం నమోదై ఉన్న పాత విద్యా అర్హత పత్రాలు. పూర్వీకులు భారతదేశంలో నివసించారని నిరూపించే ప్రభుత్వ గుర్తింపు పొందిన రికార్డులు ఉండాలి.ఇదీ చదవండి: వసివాడిన పసిడి మెరుపులు -
ఇంధన ధరకు బ్రేక్
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు మార్కెట్ అస్థిరతకు లోనవుతున్న తరుణంలో ఇటలీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా పెరిగిన ఇంధన భారాన్ని తగ్గించేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మేలోని నేతృత్వంలోని కేబినెట్ డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 17 యూరో సెంట్లు తగ్గిస్తూ అత్యవసర డిక్రీని ఆమోదించింది.పన్ను కోతతో ఊరటపశ్చిమాసియాలో రోజురోజుకూ మారుతున్న పరిస్థితులు చమురు సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. పర్యవసానంగా యూరప్ ఖండంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా రవాణా, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు, గృహ అవసరాలకు అత్యంత కీలకమైన డీజిల్ ధరలు లీటరుకు రెండు యూరోలు దాటడం వల్ల ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉంది. ఈ ఆర్థిక భారం నుంచి పౌరులను, వ్యాపారాలను కాపాడేందుకు ఇటలీ ప్రభుత్వం ‘మొబైల్ ఎక్సైజ్ డ్యూటీ’ యంత్రాంగాన్ని ప్రారంభించి, అదనపు వ్యాట్ రాబడిని పన్ను తగ్గింపునకే వినియోగిస్తోంది.క్రూడాయిల్ ధర పెరగడం వల్ల పెట్రోల్/డీజిల్ ధర పెరిగి ప్రభుత్వం ఖాతాలోకి వ్యాట్ రూపంలో అదనంగా ఆదాయం వస్తుంది. ఇటలీ ప్రభుత్వం ఆ అదనపు ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకోకుండా లీటరుపై విధించే ఎక్సైజ్ సుంకాన్ని (17 యూరో సెంట్లు) తగ్గించడానికి ఉపయోగించింది. అంటే.. ఒక వైపు వ్యాట్ ద్వారా వచ్చిన లాభాన్ని, మరోవైపు ఎక్సైజ్ సుంకం తగ్గించి ప్రజలకు డిస్కౌంట్ ఇవ్వడానికి ఉపయోగిస్తుంది.రవాణా, వ్యవసాయ రంగాలపై ప్రభావంఇటలీ ఆర్థిక వ్యవస్థలో రోడ్డు రవాణా, వ్యవసాయ రంగాలు అత్యంత కీలకమైనవి. లారీలు, రవాణా వాహనాలు, ట్రాక్టర్లు ఎక్కువగా డీజిల్పైనే ఆధారపడటంతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడిపై తీవ్ర భారం పడింది. ట్రంప్ ఇరాన్పై చేపట్టిన సైనిక, దౌత్య ఒత్తిళ్ల కారణంగా గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ దెబ్బతింది. జర్మనీ, ఇటలీ వంటి పెట్రోలియం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే ఐరోపా పారిశ్రామిక దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.‘ఈ ధరల పెరుగుదలకు మేం కారణం కాకపోయినప్పటికీ పౌరులను కాపాడుకోవడం మా బాధ్యత. ఇది ప్రతి సమస్యకూ శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు. కానీ సమయానుకూల, బాధ్యతాయుతమైన స్పందన’ అని ప్రధాని మేలోని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో యుద్ధ పరిస్థితులు సద్దుమణగకపోతే విద్యుత్తు, గ్యాస్ బిల్లులపై కూడా రాయితీలు ప్రకటించేందుకు ఇటలీ కేబినెట్ సమాయత్తమవుతోంది.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ! -
ఈపీఎఫ్ఓ అప్డేట్.. డబ్బు ఆటో రీఫండ్
ఉపాధి, కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) దశాబ్దాలుగా క్లెయిమ్ కాకుండా పడివున్న చందాదారుల డబ్బును నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఏళ్ల తరబడి నిద్రాణంగా (ఇన్ఆపరేటివ్) ఉండి రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న 7.11 లక్షల ఖాతాలలో ఇప్పటికే 1.18 లక్షల ఖాతాదారుల బ్యాంకు వివరాలను ఆధార్ డేటాతో అనుసంధానించి ధ్రువీకరించినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.ఈపీఎఫ్ఓ 2.0 సంస్కరణల్లో భాగంగా ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా చందాదారులు ఎలాంటి దరఖాస్తులు లేదా క్లెయిమ్ ఫారాలు సమర్పించాల్సిన అవసరం లేకుండానే వడ్డీతో సహా వారి సొమ్ము బ్యాంకు ఖాతాల్లోకి ఆటో-క్రెడిట్ కానుంది.సీ-డాక్ సాఫ్ట్వేర్రూ.1,000 కంటే తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న 7.11 లక్షల ఖాతాల్లో మొత్తం రూ.30.52 కోట్ల సొమ్ము ఆమోదం లేకుండా పడి ఉంది. ఈ భారీ ప్రక్రియ కోసం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘సీ-డాక్’ సంస్థ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను రూపొందిస్తోంది. సాధారణంగా ఈపీఎఫ్ఓ వ్యవస్థ సభ్యులు క్లెయిమ్ చేస్తేనే స్పందిస్తుంది. కానీ ఈ విధానంలో సభ్యుల ప్రమేయం లేకుండానే సిస్టమ్ జనరేటెడ్ క్లెయిమ్ సదుపాయాన్ని సీ-డాక్ అభివృద్ధి చేస్తోంది.బ్యాంక్ ఖాతాల ధ్రువీకరణలో భాగంగా ‘పెన్నీ డ్రాప్’ విధానాన్ని అమలు చేయగా మరణించిన ఖాతాదారుల వివరాలు కూడా గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్ట్, ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.భవిష్యత్తు ప్రణాళికలు.. మానవ ప్రమేయానికి స్వస్తిఈ మొదటి విడత పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత రూ.1,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న మిగిలిన 24.76 లక్షల మంది చందాదారులకు కూడా ఇదే రీతిలో ఆటో రిఫండ్ ప్రక్రియను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం గత రెండు దశాబ్దాలుగా దాదాపు 31.86 లక్షల క్లెయిమ్ కాని ఖాతాల్లో రూ.10,903 కోట్ల నిధులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. 2014లో యూనివర్సల్ అకౌంట్ నంబర్ కేటాయింపుతో ప్రారంభమైన ఈ డిజిటల్ ప్రక్షాళన, కార్మికులు తమ సొంత డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సులభతరమైన సేవలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: చిన్న రవాణాదారుల మనుగడ ప్రశ్నార్థకం -
చిన్న రవాణాదారుల మనుగడ ప్రశ్నార్థకం
దేశీయ సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న మోటారు రవాణాదారులు (స్మాల్ ట్రక్కర్స్) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నిరంతరం పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, స్థిరంగా పడిపోతున్న ఫ్రైట్ ధరల మధ్య ఈ రంగాన్ని నమ్ముకున్న వేలాది మంది కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) తెలిపిన వివరాల ప్రకారం, దేశీయ సరుకు రవాణాలో 70 శాతం చిన్న ఆపరేటర్లే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒక లారీ నిర్వహణ వ్యయంలో కేవలం డీజిల్ ఖర్చులే 55-60 శాతానికి చేరాయి. దీనికితోడు టోల్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, అడ్ బ్లూ (వాహనాల నుంచి వెలువడే ప్రమాదకరమైన పొగను తగ్గించడానికి ఉపయోగించే ఒక రసాయన ద్రవం), టైర్లు, వాహన ఈఎంఐలు, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగాయి. మరోవైపు, ఏజెంట్లు (బ్రోకర్లు), డిజిటల్ ఫ్రైట్ ప్లాట్ఫారమ్లపై ఆధారపడటం వల్ల తక్కువ ధరలకే సరుకును రవాణా చేయాల్సి వస్తోంది.పరిశ్రమను వేధిస్తున్న మరో ప్రధాన సమస్య డ్రైవర్ల కొరత. ప్రస్తుతం దేశంలో దాదాపు 22 లక్షల మంది కమర్షియల్ డ్రైవర్ల కొరత ఉంది. సుదీర్ఘ ప్రయాణాలు, రహదారులపై సరైన వసతులు లేకపోవడం, తక్కువ ఆదాయం కారణంగా యువత ఈ వైపు రావడం లేదు. ఏఐఎంటీసీ మాజీ అధ్యక్షుడు బాల్ మల్కిత్ సింగ్ ఈ పరిస్థితిపై మాట్లాడుతూ.. ‘సరుకు రవాణా రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వేలాది మంది చిన్న ఆపరేటర్లు వ్యాపారాలు మూసివేసే ప్రమాదం ఉంది. ఇది దేశ సరఫరా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని పేర్కొన్నారు.ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టోల్ రుసుములను హేతుబద్ధీకరించాలని, సరుకు రవాణా ధరలను నిర్వహణ ఖర్చులతో అనుసంధానించాలని, వాహన్ (Vahan) పోర్టల్లోని లోపాలను సరిచేసి వెహికల్ ట్రాకింగ్ డివైజ్ నిబంధనలను పునపరిశీలించాలని రవాణా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
భారత కరెన్సీలో భారీ మార్పు!.. RBI ప్లాన్ ఏంటంటే?
భారతదేశంలోని కరెన్సీ నోట్ల విషయంలో కొత్త మార్పు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణ కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేసిన ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.ఆర్బీఐ ప్రతిపాదన ప్రకారం.. మొదటి దశలో రూ.10, రూ.20 నోట్లను ప్లాస్టిక్ నోట్లగా ప్రయోగాత్మకంగా చలామణిలోకి తీసుకురానున్నారు. ఈ నోట్లు భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తాయి, వాటి మన్నిక ఎలా ఉంటుంది అనే విషయాలను పరిశీలించేందుకు ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు.ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతేనే.. భవిష్యత్తులో ప్లాస్టిక్ నోట్ల వినియోగాన్ని పెంచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మనగలుగుతాయని ఆర్బీఐ చెబుతోంది.ప్లాస్టిక్ నోట్ల ఉపయోగాలుప్లాస్టిక్ నోట్లు, సాధార నోట్ల మాదిరిగా తొందరగా చిరిగిపోకుండా ఉంటాయి. దీంతో ఎక్కువకాలం చలామణిలో ఉంటాయి. కాగా.. ఇప్పటికే కొన్ని దేశాలు ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నాయని, ఎక్కువగా నగదు వినియోగించే ఆర్థిక వ్యవస్థలకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని ఆర్బీఐ చెబుతోంది.కాగితపు నోట్లు కనుమరుగవుతాయా?ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయంటే.. కాగితం నోట్లు కనుమరుగవుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ.. ప్లాస్టిక్ నోట్లు, కాగితపు నోట్లతో పాటు చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. కాగితపు కరెన్సీని పూర్తిగా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం లేదని వెల్లడించింది.ఇదీ చదవండి: మానవాళికి కొత్త సవాల్.. ఎలాన్ మస్క్ హెచ్చరిక! -
దేశానికి రూ .14 లక్షల కోట్ల సమస్య ఇది..
సాధారణంగా పెద్దగా పట్టించుకోని తుప్పు (Corrosion) సమస్య ఏటా దేశానికి రూ .14 లక్షల కోట్ల నష్టాన్ని కలిగిస్తోందంటే నమ్ముతారా? తుప్పు సమస్య భారత ఆర్థిక వ్యవస్థపై భారీ భారం మోపుతోందని జపాన్కు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ నోమురా తాజా నివేదిక వెల్లడించింది. వంతెనలు, రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ఆస్తులు తుప్పు కారణంగా ముందుగానే దెబ్బతింటుండటంతో దేశానికి ఏటా సుమారు రూ.14.15 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోందని అంచనా వేసింది. ఇది భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)లో దాదాపు 4.3 శాతానికి సమానమని నివేదిక పేర్కొంది.తుప్పు వల్ల పెరుగుతున్న ఆర్థిక భారంతుప్పు (Rust) అనేది కేవలం ఇంజినీరింగ్ సమస్య మాత్రమే కాదని, అది దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ వ్యయం, ప్రజా భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశమని నివేదిక స్పష్టం చేసింది. ఉక్కు నిర్మాణాలు కాలక్రమేణా బలహీనపడటంతో వాటి మరమ్మతులు, మార్పిడి కోసం ప్రభుత్వాలు, పరిశ్రమలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫలితంగా కొత్త మౌలిక సదుపాయాల నిర్మాణానికి వినియోగించాల్సిన నిధులు పాత ఆస్తుల సంరక్షణకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ఆర్థిక ఒత్తిడి పెరగడంతో పాటు జాతీయ ఆస్తుల ఉత్పాదకత కూడా తగ్గుతోందని నివేదిక హెచ్చరించింది.అత్యధిక ప్రభావం విద్యుత్, మౌలిక సదుపాయాలపైనే..తుప్పు ప్రభావం అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి, ప్రసార రంగంపై పడుతోందని నోమురా తెలిపింది. ఆ తర్వాత టెలికమ్యూనికేషన్స్, ఆటోమోటివ్, మౌలిక సదుపాయాలు, రైల్వేలు ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. మౌలిక సదుపాయాల రంగానికే ఏటా రూ.1.41 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుండగా, విద్యుత్ రంగంలో రూ.53,860 కోట్లు, టెలికమ్యూనికేషన్స్లో రూ.38,320 కోట్లు, రైల్వేల్లో రూ.23,788 కోట్లు, ఆటోమోటివ్ రంగంలో రూ.87,098 కోట్ల మేర ఆర్థిక నష్టం సంభవిస్తున్నట్లు నివేదిక అంచనా వేసింది.వాతావరణమే ప్రధాన సవాలుభారత్లోని భారీ రుతుపవనాలు, అధిక తేమ, తీరప్రాంతాల్లో ఉప్పు గాలులు తుప్పు తీవ్రతను మరింత పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా వంతెనలు, రహదారులు, ఓడరేవులు వంటి నిర్మాణాలు ఈ ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయి. అమెరికా, జపాన్ వంటి దేశాలు వాతావరణ పరిస్థితులను బట్టి వేర్వేరు తుప్పు నిరోధక ప్రమాణాలు అమలు చేస్తున్నప్పటికీ, భారత్లో మాత్రం చాలా ప్రాంతాల్లో ఒకే తరహా నిర్మాణ ప్రమాణాలను అనుసరించడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని నోమురా అభిప్రాయపడింది.కఠిన ప్రమాణాల అమలే పరిష్కారంబ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) తుప్పు నిరోధక చర్యలను సూచించినప్పటికీ, ఏ వాతావరణ పరిస్థితుల్లో ఏ సాంకేతికతను ఉపయోగించాలనే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు లేవని నివేదిక పేర్కొంది. దీంతో కాంట్రాక్టర్లు కనీస స్థాయి రక్షణతోనే సరిపెడుతున్నారని తెలిపింది. తప్పనిసరి తుప్పు నిరోధక ప్రమాణాలు, కఠినమైన అమలు, మెరుగైన పర్యవేక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత నిర్మాణ విధానాలను నవీకరించడం ద్వారా మౌలిక సదుపాయాల ఆయుష్షు పెరగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన లాభం చేకూరుతుందని నోమురా సూచించింది. సమర్థవంతమైన తుప్పు నిరోధక చర్యలు అమలు చేస్తే దేశ జీడీపీకి 1.5 శాతం వరకు అదనపు వృద్ధి సాధ్యమవుతుందని నోమురా అభిప్రాయపడింది.ఇదీ చదవండి: కేంద్ర విద్యాశాఖ మంత్రికి జీతం ఎక్కువా? -
మహిళలకు స్వర్గధామం ఈ దేశాలు..
ప్రపంచవ్యాప్తంగా మహిళల పురోగతి, న్యాయం, భద్రత ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ నివేదిక ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అమెరికాలోని ‘జార్జ్టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్, పీస్ అండ్ సెక్యూరిటీ’ విడుదల చేసిన వుమెన్, పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్(2025-26) ప్రకారం.. మహిళలు స్వతంత్రంగా, సురక్షితంగా, సాధికారతతో జీవించడానికి ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన దేశంగా డెన్మార్క్ (0.939 స్కోరు) అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 181 దేశాల్లో మహిళల భాగస్వామ్యం, చట్టపరమైన రక్షణ, భద్రతలకు సంబంధించిన 13 కీలక సూచికలను ప్రామాణికంగా తీసుకుని ఈ జాబితాను ఖరారు చేశారు.టాప్-5లో నార్డిక్ దేశాలు1. డెన్మార్క్ (0.939)2. ఐస్లాండ్ (0.932)3. నార్వే (0.924), స్వీడన్ (0.924)4. ఫిన్లాండ్ (0.921)లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ తదితర దేశాలు టాప్-10లో చోటు దక్కించుకోగా.. ఆస్ట్రేలియా (11), కోస్టారికా, ఉరుగ్వే వంటి లాటిన్ అమెరికా దేశాలు సైతం గణనీయమైన ప్రగతితో ఉత్తమ శ్రేణిలో నిలిచాయి.నార్డిక్ మోడల్ ప్రత్యేకత ఏమిటి?ఉచిత విద్య, ఉద్యోగాల్లో అధిక శ్రామిక శక్తి భాగస్వామ్యం, బలమైన ఆర్థిక పురోగతి, రాజకీయ ప్రాతినిధ్యం, సమర్థవంతమైన చట్టపరమైన రక్షణలు నార్డిక్ దేశాల విజయ రహస్యం. బలమైన సామాజిక భద్రతా వ్యవస్థలు ఉన్న చోట మహిళలపై హింసాత్మక సంఘటనలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.యుద్ద భయాలు.. దయనీయ స్థితిలో చివరి స్థానాలుమరోవైపు అంతర్యుద్ధాలు, నిరంకుశ పాలన, రాజకీయ అస్థిరత ఎదుర్కొంటున్న దేశాల్లో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అఫ్గానిస్థాన్ (181వ ర్యాంకు) ఆఖరి స్థానంలో నిలిచింది. యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సిరియా, సుడాన్, హైతీ, కాంగో, మయన్మార్ దేశాలు అడుగున మిగిలాయి. ఈ ర్యాంకులో దిగువన ఉన్న 12 దేశాల్లో నివసిస్తున్న 70 శాతానికి పైగా మహిళలు భీకర సాయుధ పోరాటాలు జరుగుతున్న ప్రాంతాలకు కేవలం 50 కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తున్నారు. ఇది వారి ప్రాణాలకు, ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఈ సూచీలో భారతదేశం 131వ ర్యాంకుతో 0.607 స్కోరు, పాకిస్థాన్ 169వ ర్యాంకుతో 0.462 స్కోరుతో నిలిచాయి.ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా? -
నేపాల్లో ఇక రూ.200, రూ.500 నోట్లు..
భారత్–నేపాల్ మధ్య ప్రయాణాలు, సరిహద్దు వాణిజ్యానికి ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని నేపాల్ ప్రభుత్వం అమలు చేసింది. 2016లో భారత్లో నోట్ల రద్దు తర్వాత అమల్లోకి వచ్చిన కఠిన పరిమితులను సడలిస్తూ, 2016 నవంబర్ 9 తర్వాత జారీ చేసిన భారతీయ రూ.200, రూ.500 నోట్లను ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా రూ.25,000 వరకు నేపాల్లోకి తీసుకెళ్లడానికి, అక్కడి నుంచి తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (Nepal Rastra Bank–NRB) తాజాగా మరోసారి స్పష్టీకరణ నోటీసు విడుదల చేసింది.ఫిబ్రవరి 11న నేపాల్ గెజిట్లో ఈ నిబంధనలు ఇప్పటికే ప్రచురించినప్పటికీ, వాటి అమలుపై స్పష్టత కల్పించేందుకు ఎన్ఆర్బీ తాజా నోటీసు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. భారతీయులు, నేపాలీయులు ఇద్దరూ 2016 నవంబర్ 9 తర్వాత ముద్రించిన రూ.200, రూ.500 నోట్లను చట్టబద్ధంగా వినియోగించవచ్చు. అయితే 2016కు ముందు జారీ చేసిన పాత రూ.500, రూ.1,000 నోట్లు మాత్రం నేపాల్లో ఇప్పటికీ నిషేధితంగానే ఉంటాయి.ఎన్ఆర్బీ అధికార ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ ప్రకారం.. నేపాలీ పౌరులు భారత కరెన్సీని భారత్ నుంచి మాత్రమే నేపాల్కు తీసుకురావాలి. అలాగే నేపాల్ నుంచి భారతదేశం మినహా మూడో దేశానికి భారత కరెన్సీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. ఈ నిబంధనలు సరిహద్దు నగరాల ప్రజలు, వ్యాపారులు, పర్యాటకులకు వర్తిస్తాయి. విదేశీ కరెన్సీ విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల్లో మార్పు లేదు. నేపాలీ పౌరులు, విదేశీ సందర్శకులు 5,000 అమెరికన్ డాలర్లు లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ డిక్లరేషన్ లేకుండా తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా కస్టమ్స్కు ప్రకటించాల్సి ఉంటుంది.2016లో భారత ప్రభుత్వం రూ.500, రూ.1,000 పాత నోట్లను రద్దు చేసిన అనంతరం, నేపాల్ భద్రతా, ఆర్థిక కారణాలతో రూ.100కు మించిన భారతీయ నోట్ల ప్రవేశాన్ని నిలిపివేసింది. దాంతో భారత పర్యాటకులు, సరిహద్దు వ్యాపారులు, నేపాల్లో పనిచేసే వేలాది మంది నేపాలీయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజా నిర్ణయంతో దాదాపు పదేళ్ల తర్వాత ఆ పరిమితులకు గణనీయమైన సడలింపు లభించినట్లైంది. భారత్–నేపాల్ మధ్య పర్యాటకం, చిన్న స్థాయి సరిహద్దు వాణిజ్యం, ప్రజల మధ్య ఆర్థిక లావాదేవీలు మరింత సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.ఇది చదివారా? ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్బీఐ తొలి అడుగు! -
రూ.50,000 కోట్ల టార్గెట్ ఫిక్స్.. డిఫెన్స్ ఎగుమతుల్లో దూకుడు!
భారత రక్షణ ఉత్పత్తి రంగం అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేస్తోంది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.50,000 కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా చేరుకుంటుందని కేంద్ర రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. గత దశాబ్దంలో ఆత్మనిర్భర్ భారత్ పిలుపుతో విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్న భారత్ నేడు గ్లోబల్ సౌత్ దేశాలకు నమ్మకమైన భద్రతా భాగస్వామిగా రూపాంతరం చెందుతోందని చెప్పారు.విశ్వవ్యాప్తంగా పెరిగిన డిమాండ్గత ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.38,000 కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 61 శాతం వృద్ధి కావడం గమనార్హం. 2014 ప్రాంతంలో కేవలం రూ.600 కోట్లకు పరిమితమైన ఎగుమతులు నేడు ఈ స్థాయికి చేరడం భారత రక్షణ పారిశ్రామిక వ్యవస్థ సామర్థ్యానికి అద్దం పడుతోందని రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సంప్రదాయ యుద్ధ సామగ్రి, ఆర్టిలరీ షెల్స్, క్షిపణులు, డ్రోన్ సాంకేతికతలకు భారీ డిమాండ్ ఏర్పడింది. భారత ఆయుధ వ్యవస్థలు క్షేత్రస్థాయిలో నాణ్యతను నిరూపించుకోవడంతో అనేక దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పారు.లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో ప్రోత్సాహంఆసియా, ఆఫ్రికా దేశాల్లోని కొనుగోలుదారులను మరింత ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఆర్థిక పరిమితులు ఉన్న వర్ధమాన దేశాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు (లైన్ ఆఫ్ క్రెడిట్) ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ కేబినెట్ నోట్ సిద్ధం చేసింది. ఇది అమల్లోకి వస్తే భారతీయ ఆయుధాల విక్రయాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.ప్రభుత్వ రంగం, యూరప్ భాగస్వామ్యాలుగతంలో ప్రైవేట్ కంపెనీలకే పరిమితమైన ఎగుమతుల వృద్ధిలో ప్రస్తుతం హిందూస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు, యూరప్ దేశాల్లో శ్రామిక శక్తి కొరత, వయోవృద్ధుల జనాభా పెరుగుతుండటంతో తక్కువ వ్యయంతో నాణ్యమైన తయారీ సామర్థ్యం ఉన్న భారత స్థానిక పరిశ్రమలతో భాగస్వామ్యానికి పాశ్చాత్య దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా? -
20ల్లో చేసే తప్పులు.. 30ల్లో కరిగిపోతున్న కలలు!
జీతం వస్తోంది.. ఖర్చవుతోంది. కానీ సంపద మాత్రం పెరగడం లేదు. ఇది నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవం. ఖరీదైన ఫోన్లు, వీకెండ్ ట్రిప్స్, క్రెడిట్ కార్డు షాపింగ్లు, సోషల్ మీడియా చూపించే లైఫ్స్టైల్...ఇవన్నీ తెలీకుండానే సంపద సృష్టించే అవకాశాలను యువతకు దూరం చేస్తున్నాయి. 20ల్లో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో కోట్ల రూపాయల నష్టంగా మారతాయి. అందుకే ఈ వయసులో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన దిశలో నడిపించడం అంతకంటే ముఖ్యం. ఈ ఏడు మనీ మిస్టేక్స్ను ఇప్పుడే గుర్తిస్తే యువత భవిష్యత్తు ఆర్థికంగా మరింత బలంగా మారుతుంది. నెలాఖరులో జీతం బ్యాంకు ఖాతాలో పడుతోంది. కానీ కొన్ని రోజుల్లోనే మాయమవుతోంది. ఈనెల నుంచి సేవింగ్స్ మొదలు పెడతా, ఈసారి జీతం పెరిగాక సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్) చేస్తా, ఈ ఈఎంఐ అయ్యాక పెట్టుబడులు ప్లాన్ చేస్తా ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత తమ జీవితంలో అత్యంత విలువైన ఒక దశాబ్దాన్ని కోల్పోతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 20 ఏళ్ల వయసులో చేసే ఆర్థిక పరమైన తప్పులు పెద్దవేం కావు. కానీ వాటి ప్రభావం మాత్రం 30, 40 ఏళ్ల వరకు వెంటాడతాయి. చిన్న అలవాట్లు, చిన్న చిన్న నిర్లక్ష్యాలు, చిన్న ఆనందం కోసం వేసే వాయిదాలు భవిష్యత్తులో చేతికందాల్సిన కోట్ల రూపాయలను దూరం చేస్తాయి. 20ల్లో యువత చేసే తప్పులు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడాలి ? పర్సనల్ ఫైనాన్స్ (వ్యక్తిగత ఆర్ధిక నిర్వహణ) గురించి ఎక్కడైనా చదివినా, సోషల్ మీడియాలో నిపుణుల సూచనలు విన్నా ఎక్కువమంది యువతే లక్ష్యంగా సలహాలు ఇస్తుంటారు. చిన్న వయసులోనే పొదుపు చేయండి, ఉద్యోగంలో చేరిన నెలనుంచే పెట్టుబడులు ప్రారంభించండి, అప్పులకు దూరంగా ఉండండి అంటూ అనేక సూచనలు ఇస్తుంటారు. పెట్టుబడులు ఎలా చేయాలో వివరిస్తుంటారు. కానీ 90 శాతం యువత ఈ సూచనలను పట్టించుకోరు. కారణం వారికి అవగాహన లేకపోవడం కాదు. కెరీర్ ప్రారంభ దశలో ఎదురయ్యే అనిశ్చితులు, ఆకర్షణలు, కొన్నాళ్ల తర్వాత మొదలెడదాంలే అనే భావన వారిని వెనక్కి నెడతాయి. అయితే 20 ఏళ్ల వయసు ప్రయోగాలు చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి, కలలు కనడానికి సరైన సమయం. అయితే యువత ఆనందానికి మాత్రమే ప్రాధాన్యమిస్తారు. కానీ ఆనందం కాస్త ప్రణాళికతో ఉండాలి, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. ఊహించని సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. లేకపోతే 30 ఏళ్ల తర్వాత ‘ఇప్పటిదాకా ఇంత సంపాదించాను, అంతా ఎక్కడికిపోయింది‘ అనే ప్రశ్న ఎదురవుతుంది. అప్పడు పెరిగినబాధ్యతలు, పెరుగుతున్న ఖర్చులు భవిష్యత్తు గురించి బెంగపడేలా చేస్తాయి.యువత భవిష్యత్తును మింగేస్తున్న 7 మనీ ట్రాప్స్ 1. జీతం పెరిగినపుడు జీవనశైలిని అప్గ్రేడ్ చేయడం చాలామంది యువత ఉద్యోగంలో చేరిన కొత్తలో జీతం పెరిగిన వెంటనే కొత్త కొత్త మొబైల్ ఫోన్లు, కొనడం, ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్లి వేలల్లో ఖర్చుచేయడం, నెలా నెలా విహార యాత్రలకు వెళ్లడం ద్వారా కొత్త లైఫ్ స్టైల్ను ఎంచుకుంటారు. ఒక్కోసారి ఇవన్నీ సహజంగానే అనిపిస్తాయి. కానీ ఈ అలవాట్లు భారీ ఖర్చులుగా మారతాయి. దీన్నే లైఫ్ స్టైల్ క్రీప్ అంటారు. జీతం పెరుగుతూ ఉంటుంది. పొదుపు మాత్రం పెరగదు. కానీ జీవన శైలి మారిపోతూ ఉంటుంది. ఫలితంగా పదేళ్లు గడిచేసరికి బ్యాంకు పొదుపు ఖాతాలో పదిరూపాయలు కూడా కనబడదు. దీనికి పరిష్కారం సులభమే. జీతం పెరిగిన ప్రతిసారీ ఆ పెరుగుదలలో కనీసం 50 శాతాన్ని నేరుగా పెట్టుబడి వైపు మళ్లించాలి. అప్పుడే ఆదాయం పెరుగుదల భవిష్యత్తులో సంపదగా మారుతుంది. 2. పెట్టుబడులను వాయిదా వేయడం‘ఈసారి జీతం పెరిగినపుడు పెట్టుబడి మొదలెడతా, వచ్చే ఇంక్రిమెంట్ అందుకున్నాక పొదుపు చేస్తా, ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేసి కాస్త స్థిరపడడ్డాక ఇన్వెస్ట్ స్టార్ట్ చేస్తా‘ యువత నుంచి సాధారణంగా వినిపించే మాటలు ఇవి. కానీ కాంపౌండింగ్ అనే అద్భుతం కాలాన్ని కోరుకుంటుంది. ఉదాహరణకు 22 ఏళ్ల వయసులో నెలకు రూ.5000తో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ప్రారంభించిన వ్యక్తి 55 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు రూ.2.2 కోట్ల సంపద కూడబెట్టగలడు (ఏడాదికి 12 శాతం రాబడి అంచనాతో). అదే సిప్ను 30 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే అది రూ.85 లక్షల వరకు మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ డబ్బు కన్నా ముందుగా ప్రారంభించడం వల్ల వచ్చిన కాల ప్రయోజనమే ప్రధాన కారణం. అందుకే పెట్టుబడి ఎంత చేశారు కాదు. ఎప్పుడు మొదలెట్టారు అన్నదే అత్యంత కీలకం. 3. క్రెడిట్ కార్డును అదనపు ఆదాయంగా భావించడం క్రెడిట్ కార్డు అనేది ఆదాయం కాదు. అది తాత్కాలిక రుణం మాత్రమే. స్వైప్ చేసినపుడు గర్వంగా అనిపిస్తుంది. కానీ బిల్లు వచ్చినపుడు అసలు వాస్తవం కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుంది. వాడిన మొత్తంలో కనీస బకాయి మాత్రమే చెల్లిస్తూ వెళితే ఏడాదికి 36 నుంచి 48 శాతం అదనపు వడ్డీ భారాన్ని మోసే పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా క్రెడిట్ కార్డు వాడకుండా ఉండాలంటే కనీసం 6 నుంచి 9 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. 4. తెలియని ఇన్వెస్ట్మెంట్ల వెంట పరుగులు తీయడంప్రతి కాలంలో ఏదో ఒక పెట్టుబడి రంగం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా, సంచలనంగా మారుతుంది. కొన్నేళ్ల క్రితం క్రిప్టో, తర్వాత డిఫెన్స్ స్టాక్స్, ఆ తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్స్, తర్వాత ఫ్లెక్సీ కాప్ ఫండ్లు ఇలా.. వాటిలో పెట్టుబడి పెట్టినవారు భారీ లాభాలు పొందారని, కోటీశ్వరులయ్యారని వార్తలు వస్తూంటాయి. యువతరం ఎక్కువగా ఆ ప్రచారంలో చిక్కుకుని, ఆ ట్రెండ్లో భారీగా నష్టపోతోంది. దీర్ఘకాలిక సంపద సృష్టించే పెట్టుబడులకంటే తక్షణ లాభాల ఆశతో ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ వైపు యువరం ఆకర్షితులవుతోంది. సోషల్ మీడియాలో ఫిన్ఫ్లూయెర్స్ ప్రభావం, తక్కువ సమయంలో భారీ రాబడులు వస్తాయనే ప్రచారం ఈధోరణిని మరింత పెంచుతున్నాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ సంపదను సృష్టిస్తే డెరివేటివ్స్ ట్రేడింగ్ మూలధనాన్నే కరిగించేస్తాయి. ఇక్కడ సమస్య పెట్టుబడి ఎంపికలో కాదు. స్పష్టమైన లక్ష్యం లేకుండా సమయం చూడకుండా ఇన్వెస్ట్ చేయడంలోనే ఉంది. ప్రతిసారి పెట్టుబడి చేసే ముందు రెండు ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి ఈ డబ్బు ఏ అవసరానికి? రెండు.. ఎప్పుడు అవసరం అవుతుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేకపోతే పెట్టుబడి వ్యూహం కాదు, జూదం అవుతుంది.5. ఇన్సూరెన్స్ను పెట్టుబడిగా కొనడంచాలా మంది ఫైనాన్స్ ఏజెంట్లు యూలిప్లు. ఎండోమెంట్ పాలసీలు, ఒకే ఉత్పత్తితో రక్షణతో పాటు రాబడి కూడా ఇస్తాయని చెబుతుంటారు. కానీ అవి ఆశించిన ఫలితం ఇవ్వవు. ఈ పాలసీల్లో ఇన్సూరెన్స్ కవరేజీ తక్కువ ఉంటుంది. పెట్టుబడి రాబడులు కూడా రకరకాల ఛార్జీల కారణంగా తగ్గిపోతాయి. అందుకే పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు టర్మ్ ఇన్సూరెన్స్ వేరు, పెట్టుబడులు వేరు అనే సూత్రాన్ని సూచిస్తారు. కుటుంబ రక్షణకు టర్మ్ పాలసీ, సంపద కోసం ముచువల్ ఫండ్లు, ఇతర పెట్టుబడులు ఎంచుకోవడం తెలివైన నిర్ణయమవుతుంది. 6. సోషల్ మీడియా ప్రభావంతో ఖర్చు చేయడంసోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్లు విదేశీ పర్యటనలు, ఖరీదైన రెస్టారెంట్లు, కొత్త కొత్త గాడ్జెట్లు, విలాసవంతమైన జీవితం మాత్రమే చూపిస్తారు. కానీ వాటి వెనక ఉన్న ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులు గురించి చెప్పరు. వీటిని తరచూ చూసే యువతరం వాటి ప్రభావంతో తమ ఆర్థిక సామర్థ్యాన్ని మించి ఖర్చు చేస్తారు. తాత్కాలిక ఆనందం కంటే ఆదాయానికి మించిన ఖర్చుతో పెరిగిన ఒత్తిడి తరువాతి రోజోల్లో అనుభవించిన ఆనందాన్ని గుర్తు లేకుండా చేస్తుంది. అందుకే ప్రతిసారి ఖర్చు చేసే ముందు ‘ఇది నిజంగా నాకు అవసరమా? లేక ఇతరులను చూసి చేస్తున్నానా? అని ఆలోచించుకోవడం అవసరం. 7. స్వీయాభివృద్ధికి పెట్టుబడి చేయకపోవడంయువతకు అత్యంత విలువైన ఆస్తి స్టాక్ పోర్ట్ ఫోలియో కాదు. సంపాదన సామర్ధ్యం ప్రధానం. ప్రమోషన్కు ఉపకరించే ఒక మంచి కోర్సు, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్, నైపుణ్యాన్ని పెంచుకునే సరైన పుస్తకాలుపై చేసే పెట్టుబడి కెరీర్ను పూర్తిగా మార్చగలవు. రూ.20000 జీతాన్ని లక్షలకు పెంచే అవకాశం కలుగుతుంది. అందువల్ల ఈ వయసులో సంపద సృష్టించడంలో ముఖ్యమైన పెట్టుబడి మీపై మీరు చేసేదే.అసలు సమస్య ఏమిటి? ఈ ఏడు తప్పిదాల్లో ఒక సామాన్య అంశం ఇమిడి ఉంది. ఇవన్నీ చెడు నిర్ణయాల వల్ల జరిగినవి కావు. నిర్ణయం సరిగా తీసుకోకపోవడం వల్ల జరిగేవి. డబ్బు ఎప్పుడూ ఎవరికోసం ఆగదు. జీతం వచ్చిన క్షణం నుంచి అది అనేక రకాలుగా అనేక మార్గాల్లో ఎటో వెళ్లిపోతుంది. కాబట్టి మంచి ఆర్థిక అలవాట్లను ఆటోమేటిక్గా ఏర్పాటు చేసుకోవడం అత్యంత ముఖ్యం.ఆటో డెబిట్ సిప్, ప్రత్యేక సేవింగ్స్ ఖాతా, సరైన టర్మ్ ఇన్సూరెన్స్ వంటి నిర్ణయాలు జీవితాన్ని సులభతరం చేస్తాయి. 20 ఏళ్ల వయసులు సంపద సృష్టించాలి అనుకునే వారికి ఎక్కువ ఆర్థిక నైపుణ్యం ఉండాల్సిన అవసరంలేదు. కానీ త్వరగా సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నవారు ముందంజలో ఉంటారు. ఈ దశలో తీసుకునే చిన్న ఆర్ధిక నిర్ణయాలు భవిష్యత్తులో కోట్ల రూపాయల తేడాను చూపిస్తాయి. అందుకే 20ల్లో డబ్బును నిర్లక్ష్యం చేయడం కాదు, దానికి సరైన దిశ చూపించడం అత్యంత అవసరం.సంపద సృష్టికి గుర్తుంచుకోవాల్సిన 5 గోల్డెన్ రూల్స్→ జీతం పెరిగినపుడల్లా కనీసం 50 శాతం పెట్టుబడికి మళ్లించండి → మొదటిజీతం నుండే సిప్ ప్రారంభించండి → 6 నుంచి 9 నెలల ఖర్చులకు ఎమెర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయండి → టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి → నైపుణ్యాలు పెంచుకునేందుకు కొంత ఖర్చు చేయండి – సాక్షి, వెల్త్ డెస్క్ -
దలాల్ స్ట్రీట్లో బిగ్ ఫైట్
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు ఈ వారంల దలాల్ స్ట్రీట్కు దిశానిర్ధేశం చేయనున్నాయి. ఇరాన్పై సైనిక చర్యను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేయడంతో ముడిచమురు ధరలు 100 డాలర్ల స్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్లను వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు జులై 28–29 తేదీల్లో జరగనున్న ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన, జూలై 28న (మంగళవారం) వెలువడే దేశీయ ఐఐపీ గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు, కార్పొరేట్ రంగానికి వస్తే ఎల్అండ్టీ, మారుతీ, హెచ్యూఎల్, ఐటీసీ వంటి నిఫ్టీ దిగ్గజాల క్యూ1 ఫలితాలు స్టాక్–ఆధారిత ట్రేడింగ్ను నడిపిస్తాయి. వీటికి తోడు ఒకే రోజున నిఫ్టీ వీక్లీ, నిఫ్టీ మంత్లీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల ’సూపర్ ఎక్స్పైరీ’ రాబోతుండటంతో దలాల్ స్ట్రీట్లో రోలోవర్లు, షార్ట్ కవరింగ్ వల్ల అస్థిరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కార్పొరేట్ ఫలితాల ప్రకటనలపై కన్ను నేడు ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్ ప్రధానంగా ఐడీఎఫ్సీ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి దిగ్గజాల జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ), ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం), మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈఎల్), అదానీ ఎంటర్ప్రైజెస్, ఐఆర్ఎఫ్సీ, ఐటీసీ తదితర కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాలతో పాటు కంపెనీల డిమాండ్ పరిస్థితులు, మార్జిన్లు, మూలధన వ్యయం (క్యాపెక్స్)పై యాజమాన్యాల వ్యాఖ్యలను విశ్లేషకులు నిశితంగా పరిశీలించనున్నారు. ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలపై దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాలు జూలై 28–29 తేదీల్లో జరగనున్నాయి. బుధవారం వెలువడే ప్రకటనలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని అంచనాలున్నాయి. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడ్ వడ్డీరేట్లను 0.25 శాతం పెంచే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్ల నిర్ణయం కంటే కూడా ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, భవిష్యత్ ద్రవ్య విధానంపై ఫెడ్ ఇచ్చే సంకేతాలే మార్కెట్ దిశను నిర్దేశిస్తాయని చెబుతున్నారు. పశ్చిమాసియా పరిణామాలు... క్రూడాయిల్ దరలు ప్రభావం పశ్చిమాసియాలో శరవేగంగా మారుతున్న పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. వైమానిక క్షిపణి నిల్వలు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరాన్పై భారీ సైనిక చర్య ప్రణాళికలను డోనాల్డ్ ట్రంప్ నిలిపివేసినట్లు వెలువడిన నివేదికలు మార్కెట్లకు కొంత ఊరటనిచ్చాయి. అయితే మిడిల్ ఈస్ట్లో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత తక్షణం పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు, అమెరికా–ఇరాన్ మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలను పునరుద్ధరించడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలతో గురువారం (జూలై 23న) 100 డాలర్లకు చేరిన ముడి చమురు ధరలు, శుక్రవారం ఒక్కరోజే 4% కంటే ఎక్కువ పడిపోయాయి. ముడిచమురు ధరల్లో తీవ్ర ఊగిసలాట, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను పెంచడంతో ఇన్వెస్టర్లు ప్రస్తుతం అప్రమత్తత వైఖరి ప్రదర్శిస్తున్నారు. మంగళవారం ‘సూపర్ ఎక్స్పైరీ’ మంగళవారం (జూలై 28) ఒకే ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ–50 వీక్లీ ఎక్స్పైరీతో పాటు, నిఫ్టీ–50, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల జూలై నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీలు ఒకేసారి రాబోతున్నాయి. దీంతో ఈ వారం దలాల్ స్ట్రీట్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత నెల కాంట్రాక్టుల సెటిల్మెంట్లతో పాటు, ట్రేడర్లు తమ పొజిషన్లను తదుపరి నెలకు రోలోవర్ చేసుకునే ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ ఒత్తిడి కారణంగా మార్కెట్లో షార్ట్ కవరింగ్ లేదా ఉన్నట్టుండి భారీ విక్రయాలు నెలకొనే అవకాశం ఉంది. కావున ఎక్స్పైరీ రోజున ఇంట్రాడే ట్రేడర్లు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, కఠినమైన స్టాప్లాస్లతో వ్యవహరించడం శ్రేయస్కరం.నిఫ్టీ టెక్నికల్ అవుట్లుక్ గత నెల రోజులుగా 23,800 – 24,400 పరిధిలోనే ట్రేడైన నిఫ్టీ, ప్రస్తుతం ఆ స్థాయిలను కోల్పోయింది. సాంకేతికంగా ఇది సమీప కాలంలో మార్కెట్ వైఖరికి ప్రతికూల అంశమే. ప్రస్తుతం నిఫ్టీకి 23,600 వద్ద కీలక మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 23,100 వరకు దిగివచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ షార్ట్ కవరింగ్ జరిగి మార్కెట్ కోలుకుంటే నిఫ్టీ 24,000 – 24,100 శ్రేణిలో తొలి నిరోధాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. ఆ పైన 24,400 వద్ద మరో బలమైన నిరోధం ఎదురుకావచ్చు.బేరీష్గానే ఎఫ్ఐఐలు గత వారంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 7,180 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే దేశీయ ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ. 8,640 కోట్ల మేర ఈక్విటీలను కొనుగోలు చేసి మార్కెట్ పతనాన్ని కొంతవరకు అడ్డుకోగలిగారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలపై స్పష్టత వచ్చే వరకు విదేశీ నిధుల ప్రవాహంలో తీవ్ర అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.గతవారమంతా నష్టాలే.. దలాల్ స్ట్రీట్ గతవారంలో వరుసగా అయిదు ట్రేడింగ్ సెషన్లలోనూ నష్టాలనే చవిచూసింది. మళ్లీ తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, కంపెనీల మిశ్రమ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. అలాగే డాలర్తో మారకంలో రూపాయి క్షీణత, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్ 2,091 పాయింట్లు (2.68%), నిఫ్టీ 566 పాయింట్లు (2.33%) చొప్పున భారీగా క్షీణించాయి. -
షేర్లకూ కావాలి ఫిట్నెస్!
తల్వాల్కర్ జిమ్... ఒకప్పుడు ఇదో మెరుపు. స్టాక్ మార్కెట్లో తొలి ఫిట్నెస్ కంపెనీగా లిస్టయింది. విపరీతంగా విస్తరించింది. భారీగా అప్పులు చేసింది. కట్చేస్తే... దివాలా తీసి తెరమరుగైపోయింది. ఇన్వెస్టర్లు మునిగిపోయారు. ఇపుడు కల్ట్ ఫిట్. హృతిక్రోషన్ దన్నుతో కొన్నేళ్లుగా ఇదో బ్రాండ్ను సృష్టించుకుంది. వీధివీధికీ విస్తరించింది. హృతిక్తో సహా ప్రస్తుత ఇన్వెస్టర్లకు ఎగ్జిట్ అవకాశమిస్తూ ఐపీఓకు వస్తోంది. డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. నిజానికి లిస్టయిన... లిస్ట్ కాబోతున్న అచ్చమైన ఫిట్నెస్ కంపెనీలు ఈ రెండే. ఒక కథ ముగిసింది. మరో కథ మొదలవుతోంది. కానీ ఇన్వెస్టర్లు చూడాల్సింది ఇది కాదు. వీటి చుట్టూ ఉన్న ఫిట్నెస్ ఎకానమీని. 15 ఏళ్ల కిందట ఫిట్నెస్ అంటే జిమ్. కానీ ఇపుడది జీవనశైలి. ఆ జీవనశైలిని అనుసరించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఎందుకంటే ఒకప్పుడు జిమ్కు వెళ్లేవారు... ఇపుడు నడుస్తున్నారు. పరుగులు పెడుతున్నారు. ట్రెక్కింగ్ చేస్తున్నారు. బ్యాడ్మింటన్, పికిల్ బాల్ ఆడుతున్నారు. స్మార్ట్వాచ్లతో అడుగులు లెక్కబెడుతున్నారు. లెక్కలు కట్టుకుని ప్రొటీన్ తింటున్నారు. ఏడాదికోసారి హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఇపుడు అవసరాలుగా మారిపోయాయి. మరి ఈ ఫిట్నెస్ ఎకానమీలో మెరిసే చాన్సున్న కంపెనీలేంటి? రిటైల్ ఇన్వెస్టర్లు గమనించాల్సినవేంటి? ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ప్రపంచ మధుమేహ రాజధానిగా మనదేశం మారటం... పెరుగుతున్న ఊబకాయం... యువతకూ గుండె సమస్యలు... ఇవన్నీ వ్యాయామాన్ని తప్పనిసరి మెడిసిన్ జాబితాలో చేర్చేశాయి. మధ్యతరగతి ఆదాయాలు పెరగటం... దానికి సోషల్ మీడియా ప్రచారం తోడవటంతో... యోగా, జిమ్, స్పోర్ట్స్ ఎరీనాలు, మారథాన్ ఈవెంట్లు, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్మార్ట్వాచ్లు, స్పోర్ట్స్వేర్ వంటి ఫిట్నెస్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఎకానమీలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన రంగాలు, కంపెనీల వివరాలివిగో...ఫిట్నెస్ సెంటర్లు నేరుగా బయటకు కనిపించే ఈ రంగంలో లిస్టెడ్ ప్లేయర్లు తక్కువే. తల్వాల్కర్స్ జిమ్ గతంలో లిస్టయినా రకరకాల కారణాల వల్ల దివాలా తీసేసి డీలిస్ట్ అయింది. కల్ట్ఫిట్ త్వరలో ఐపీఓకు వస్తోంది. అయితే గోల్డ్స్ జిమ్, ఎనీటైమ్ ఫిట్నెస్, స్నాప్ ఫిట్నెస్ వంటి అన్లిస్టెడ్ చెయిన్లు బాగానే రాణిస్తున్నాయి. ఈ రంగం వేగంగా పెరుగుతున్నా... లాభాలు తక్కువేనని చెప్పాలి. పెరుగుతున్న అద్దెలు, అధిక నిర్వహణ ఖర్చులు, తరచూ మారిపోయే కస్టమర్లు, ఒక సెంటర్లో ఎక్కువ మందికి ఏకకాలంలో అవకాశం ఇవ్వలేకపోవటం వంటివి జిమ్ల లాభాల్ని పరిమితం చేస్తున్నాయి.రియల్ ఎస్టేట్ మౌలికంగా జరుగుతున్న అతిపెద్ద మార్పు ఇదే. ఎందుకంటే పదేళ్ల కిందట ఇల్లు కొనేటపుడు ఎన్ని బెడ్రూమ్లు? అనేదే చూసేవారు. ఇపుడు క్లబ్హౌస్ ఎంత పెద్దది? అన్నదే ప్రధానం. ప్రధాన ప్రాజెక్టుల్లో ఒలింపిక్ సైజ్ స్విమింగ్పూల్స్, పూర్తిస్థాయి జిమ్లు, యోగా స్టూడియోలు, ఇండోర్ బ్యాడ్మింటన్, స్క్వాష్, సైక్లింగ్– జాగింగ్ ట్రాక్స్, యాక్టివిటీ పార్క్స్ సహజమైపోయాయి. డెవలపర్లు విక్రయిస్తున్నది కేవలం ఫ్లాట్లు కాదు. లైఫ్స్టైల్. వారి మధ్య పోటీ అంతా ఈ సౌకర్యాల్లోనే. ఈ రంగం విపరీతంగా పెరగటంతో పాటు లిస్టెడ్ సంస్థలూ ఎక్కువే ఉన్నాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ. డీఎల్ఎఫ్, శోభా డెవలపర్స్, కల్పతరు, లోధా, ఎన్సీసీ వంటి ప్రధాన కంపెనీల్ని ఇన్వెస్టర్లు వాచ్ చేయొచ్చు.స్పోర్ట్స్ రిటైల్ జాగింగ్కో, వాకింగ్కో వెళ్లినపుడే స్పోర్ట్స్ షూ వేయటమనేది పోయింది. నిత్యం వాడే పాదరక్షల్లో ఇది చేరిపోయింది. ఈ మార్పు స్పోర్ట్స్ రిటైల్ను ఆకర్షణీయ రంగంగా చేసింది. డెకాథ్లాన్, అడిడాస్, నైకీ, పూమా వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు... పేజ్ ఇండస్ట్రీస్ (అథ్లీజర్), క్యాంపస్ యాక్టివ్వేర్, బాటా, రిలాక్సో ఫుట్వేర్ వంటి లిస్టెడ్ సంస్థలనూ వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు. న్యూట్రిషన్ఫిట్నెస్పై మనసు పెట్టేవారంతా... ఎక్కువ ప్రొటీన్... తక్కువ చక్కెర, హెల్తీ స్నాక్స్ వంటివి రెగ్యులర్ ఆహారాల్లో భాగంగా మార్చేసుకుంటున్నారు. దీంతో ప్రొటీన్ ఇపుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేసింది. హెల్త్కార్ట్, ఫాస్ట్ అండ్ అప్, మజిల్ బ్లేజ్, జీఎన్సీ ఇండియా వంటి అన్లిస్టెడ్ కంపెనీలతో పాటు బ్రిటానియా, నెస్లే ఇండియా, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ వంటి లిస్టెడ్వీ ఉన్నాయి.హెల్త్కేర్ అనారోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఆసుపత్రుల కంటే డయాగ్నస్టిక్ కంపెనీలు, బీమా కంపెనీలు అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నాయి. ప్రధానంగా అపోలో హాస్పిటల్స్, డాక్టర్ లాల్ పాత్లాబ్స్, థైరోకేర్, మెట్రోపాలిటన్ హెల్త్కేర్, విజయా డయాగ్నస్టిక్స్ వంటి సంస్థలతో పాటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు.స్పోర్ట్స్ టూరిజంజనం ఇపుడు మారథాన్లు, సైక్లింగ్, ట్రెక్కింగ్, ట్రయాథ్లాన్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం రకరకాల ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మారథాన్, లడఖ్ సైక్లింగ్, అడ్వెంచరస్ స్పోర్ట్స్ వంటివేవీ పదేళ్లకిందట పెద్దగా లేవు. కానీ ఇపుడు ఫిట్నెస్తో ట్రావెల్ డిమాండ్ కూడా పెరుగుతోంది. స్మార్ట్ వేరబుల్స్యాపిల్, శామ్సంగ్ వంటి విదేశీ లిస్టెడ్ కంపెనీలతో పాటు బోట్ వంటి దేశీ అన్లిస్టెడ్ సంస్థలూ వేరబుల్స్ మార్కెట్ను శాసిస్తున్నాయిపుడు. ఎందుకంటే స్మార్ట్వాచ్ అనేది కేవలం టైమ్ తెలియజేయటానికి కాదు. హార్ట్ రేట్ నుంచి మొదలు పెడితే... ఎన్ని అడుగులు నడిచారు? ఎంత సేపు మంచి నిద్రపోయారు? ఈసీజీ ఎలా ఉంది? ఒత్తిడి ఎంత ఉంది? కేలరీలెన్ని? ఇవన్నీ చెబుతోంది. అందుకే ఇది అతివేగంగా విస్తరిస్తూ... ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్లు ప్రవేశించడానికి కారణమవుతోంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ఇపుడిపుడే ఎదుగుతున్న రంగమిది. ఒకవంక స్పోర్ట్స్ ఇన్ఫ్రాపై ప్రభుత్వాలు భారీగా వెచ్చిస్తుండగా... మరోవంక ప్రయివేటు అకాడమీలూ వేగంగా పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేక మారథాన్లు, సైక్లింగ్, బ్యాడ్మింటన్, పికిల్బాల్ వంటి క్రీడల్లో ఇన్ఫ్రా సౌకర్యాలు కల్పిస్తూ ప్రయివేటు ప్లేయర్లు ప్రవేశిస్తున్నారు. వీటన్నిటినీ చూశాక అనిపించేదొకటే!. దేశంలో ఫిట్నెస్ బూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీని లబ్ధిదారులెవరు? ఒకటి జిమ్లు. రెండు యాక్టివ్ లైఫ్స్టయిల్ను అలవాటుగా మార్చే కంపెనీలు!!. సమాధానం రెండే. ఎందుకంటే ఒక వ్యక్తి కల్ట్ఫిట్ జిమ్లో చేరి... ఆ తరవాత మానేశాడనుకోండి. తన ఫిట్నెస్ ప్రయాణం ఆగిపోదు కదా!!. తను స్పోర్ట్స్ షూలు వాడతాడు. ప్రొటీన్ పౌడర్ కొంటాడు. స్మార్ట్ వాచ్ పెట్టుకుంటాడు. రోజూ వాకింగ్ చేస్తాడు. తన కమ్యూనిటీలో క్లబ్హౌస్ ఉంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ట్రెక్కింగ్కు వెళ్లడం... బ్యాడ్మింటన్ ఆడటం వంటివి చేస్తూనే ఉంటాడు. అంటే... తను చేసే ఖర్చు మారింది తప్ప ఆగిపోలేదు. -రమణమూర్తి మంథా -
దేశంలో రిచెస్ట్ జిల్లా తెలంగాణలోనే..
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంప్రదాయక ఆర్థిక రాజధాని ముంబైని అధిగమించి అత్యధిక తలసరి జీడీపీ సాధించిన జిల్లాల జాబితాలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ‘ఇన్ఫ్రామంత్రా’ ఆర్థిక గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ఒక ప్రాంతంలో ప్రతి వ్యక్తి అందించే సగటు ఆర్థిక విలువను (తలసరి ఆదాయం) ప్రతిబింబిస్తుంది. ఐటీ, ఫార్మా, పరిశ్రమలు, పర్యాటక రంగాల మద్దతుతో దేశంలో అత్యధిక తలసరి జీడీపీ నమోదు చేసిన టాప్-10 సంపన్న జిల్లాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.దేశంలో అత్యంత సంపన్న జిల్లాలుర్యాంక్జిల్లా పేరురాష్ట్రంతలసరి జీడీపీ1రంగారెడ్డితెలంగాణరూ.11.46 లక్షలు2గురుగ్రామ్ (గుర్గావ్)హరియాణారూ.9.05 లక్షలు3బెంగళూరు అర్బన్కర్ణాటకరూ.8.93 లక్షలు4గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా)ఉత్తరప్రదేశ్రూ.8.48 లక్షలు5సోలన్హిమాచల్ ప్రదేశ్రూ.8.10 లక్షలు6ఉత్తర, దక్షిణ గోవాగోవారూ.7.63 లక్షలు7సిక్కిం జిల్లాలు (గ్యాంగ్టక్ తదితరాలు)సిక్కింరూ.7.46 లక్షలు8దక్షిణ కన్నడ (మంగళూరు)కర్ణాటకరూ.6.69 లక్షలు9ముంబైమహారాష్ట్రరూ.6.57 లక్షలు10అహ్మదాబాద్గుజరాత్రూ.6.54 లక్షలు ఈ ఆర్థిక పురోగతి కేవలం పారిశ్రామిక రంగానికే కాకుండా ఈ జిల్లాల్లో ప్రపంచస్థాయి రహదారులు, విమానాశ్రయాలు, లగ్జరీ హోటళ్లు వంటి పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది.రంగారెడ్డి అగ్రస్థానం వెనుక ఆర్థిక అంశాలుహైదరాబాద్కు అనుబంధంగా ఉన్న రంగారెడ్డి జిల్లా కేవలం పరిపాలనా సరిహద్దులకే పరిమితం కాలేదు. గ్లోబల్ ఐటీ దిగ్గజాలు, భారీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ పార్కుల రాకతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందింది. మరోవైపు చార్మినార్, గోల్కొండ కోట, చౌమహల్లా ప్యాలెస్ వంటి హైదరాబాద్ చారిత్రక సౌధాలకు ప్రవేశ ద్వారంగా ఉన్న రంగారెడ్డి జిల్లా తన ఆర్థిక పురోగతితో పర్యాటకులకు ప్రపంచస్థాయి ఆతిథ్య, రవాణా వసతులను అందిస్తోంది.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
ఎగుమతులకు రెక్కలొచ్చేనా?
దేశీయ ఉత్పత్తుల ఎగుమతులను మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల పెట్టుబడులతో పనిచేసే ఈ-కామర్స్ సంస్థలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనల్లో సడలింపులు ప్రకటించింది. భారతదేశంలో తయారైన లేదా ఉత్పత్తి చేసిన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే పరిమితమయ్యేలా ఈ-కామర్స్ సంస్థలు ఇన్వెంటరీ ఆధారిత నమూనాను నిర్వహించడానికి అనుమతినిచ్చింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది.పాలసీలో మార్పుఇంతకుముందు అమల్లో ఉన్న ఎఫ్డీఐ విధానం ప్రకారం.. వ్యాపారాల మధ్య జరిగే ఈ-కామర్స్ (బీ2బీ), మార్కెట్ ప్లేస్ మోడళ్లకు మాత్రమే విదేశీ పెట్టుబడుల అనుమతి ఉండేది. సొంతంగా సరుకులను నిల్వ ఉంచుకుని నేరుగా వినియోగదారులకు విక్రయించే ఇన్వెంటరీ మోడల్, అలాగే బీ2సీ విక్రయాలపై కఠినమైన నిషేధం ఉండేది. అయితే, నూతన నిబంధనల ద్వారా దేశీయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే సందర్భాల్లో ఈ ఇన్వెంటరీ, బీ2సీ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజాలు ఇకపై భారత్లో తయారైన వస్తువులను నేరుగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుని అంతర్జాతీయ వినియోగదారులకు ఎగుమతి చేసే వీలుంది.పరిశ్రమల వర్గాల స్పందనదేశీయంగా చిల్లర వర్తకాన్ని పరిరక్షించేందుకే గతంలో ఇన్వెంటరీ విధానంపై ఆంక్షలు విధించారని, అయితే ఎగుమతుల విషయంలో ఈ స్పష్టత ఇవ్వడం ద్వారా విదేశీ పెట్టుబడిదారుల్లో విధానపరమైన నమ్మకం పెరుగుతుందని ఈవై ఇండియా పన్ను, నియంత్రణ సేవల భాగస్వామి సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని అమెజాన్ సంస్థ స్వాగతించింది. తమ గ్లోబల్ విజన్కు ఇది మరింత బలమిస్తుందని, ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని చిన్న, మధ్యతరహా తయారీదారులకు గ్లోబల్ మార్కెట్తో అనుసంధానం ఏర్పడుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
మామిడి రసంలో పల్ప్ ఉంటేనే ట్యాక్స్ బెనిఫిట్
మామిడి పానీయాల తయారీలో నిజమైన పండ్ల గుజ్జు (పల్ప్) శాతాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ దానికి అనుగుణంగా జీఎస్టీ రాయితీలను అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పానీయాల్లో కనీసం 22-25 శాతం సహజసిద్ధమైన మామిడి గుజ్జును తప్పనిసరిగా వాడే ఉత్పత్తులకే 5 శాతం రాయితీ జీఎస్టీ స్లాబ్ను పరిమితం చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అంతకంటే తక్కువ గుజ్జు శాతంతో కృత్రిమ రుచులొచ్చేలా ఇతర రసాయనాలతో తయారుచేసే పానీయాలపై అధిక పన్ను విధించాలని స్పష్టం చేసింది.లఖ్నవూలోని ఐసీఏఆర్-సబ్ట్రోపికల్ హార్టికల్చర్ పరిశోధనా సంస్థ (సీఐఎస్హెచ్) డైరెక్టర్ డాక్టర్ టి.దామోదరన్ నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సమర్పించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని తోతాపురి మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించక మార్కెట్లో ధరలు తీవ్రంగా పతనమైన నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.ధరల పతనానికి మూలాలు.. కమిటీ సిఫార్సులువాణిజ్య పానీయాల తయారీ సంస్థలు చాలా తక్కువ పరిమాణంలో నిజమైన పల్ప్ను ఉపయోగిస్తున్నాయి.ప్రాసెసింగ్ యూనిట్ల సామర్థ్యానికి, పండ్ల సేకరణ సమయానికి మధ్య సమన్వయం ఉండడంలేదు.అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్లలో ధరలు హెచ్చుతగ్గులున్నాయి.రైతులకు స్థిరమైన ఆదాయం అందించేందుకు ప్రతి సీజన్కు ముందే పంట దిగుబడి, ప్రాసెసింగ్ అవసరాలు, ఎగుమతుల అంచనాల ఆధారంగా రిపోర్ట్ ఇవ్వాలని నిపుణులు చెప్పారు. సూచనప్రాయమైన కొనుగోలు ధరలను ఖరారు చేసేలా 'సెంట్రల్ కోఆర్డినేషన్ అండ్ ప్రైస్ స్టెబిలైజేషన్ కమిటీ'ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.రైతులకు, వినియోగదారులకు ప్రయోజనంఈ సిఫార్సులు అమల్లోకి వస్తే పానీయాల తయారీ సంస్థలు 5 శాతం జీఎస్టీ ప్రయోజనం కోసం తోతాపురి మామిడి గుజ్జును కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల తోతాపురి పండిస్తున్న లక్షలాది మంది రైతులకు స్థిరమైన డిమాండ్, మెరుగైన ధర దక్కుతాయి. మరోవైపు, వినియోగదారులకు కృత్రిమ రసాయనాలు లేని ఆరోగ్యకరమైన జ్యూస్లు అందుబాటులోకి వస్తాయి. ఆహార శుద్ధి రంగాన్ని రైతు సంక్షేమానికి అనుసంధానించే ఈ ప్రక్రియ వేగంగా అమలైతే మామిడి సాగుదారుల కష్టాలకు పరిష్కారం లభిస్తుంది.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
‘మేం చమురు అమ్మకపోతే.. ఎవరినీ అమ్మనివ్వం’
పశ్చిమాసియాలో క్రూడాయిల్ సంక్షోభం మరింత ప్రమాదకర మలుపు తిరిగింది. అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా సైనిక చర్యల కారణంగా తమ చమురు ఎగుమతులకు అడ్డంకులు కలిగిస్తే ఆ ప్రాంతం నుంచి చమురు సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ‘మమ్మల్ని చమురు అమ్మకుండా నిరోధిస్తే.. ఈ ప్రాంతంలో ఏ ఒక్క దేశాన్ని కూడా చమురు అమ్మనివ్వం’ అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ గాలిబాఫ్ చేసిన ప్రకటనతో గ్లోబల్ ఇంధన మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి.అమెరికాతో సాగుతున్న సైనిక ఘర్షణలో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహం అత్యంత స్పష్టంగా ఉందని గాలిబాఫ్ తెలిపారు. తమ భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తే పశ్చిమాసియాలోని చమురు మౌలిక వసతులను, సరఫరా మార్గాలను స్తంభింపజేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధి భద్రతపై అమెరికా దళాల ఉనికి తీవ్రంగా ఖండించారు. ఇరాన్ భద్రతా ఆందోళనలను పరిగణనలోకి తీసుకునే వరకు ఈ జలసంధిలో పూర్వ పరిస్థితులు నెలకొనవని చెప్పారు.ముదురుతున్న ఉద్రిక్తతలు.. వ్యూహాత్మక దాడులుఒకవైపు ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు ఉధృతం చేస్తామని అమెరికా హెచ్చరిస్తుండగా.. మరోవైపు దౌత్యపరమైన చర్చలు ఎలాంటి పురోగతి సాధించకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికి తోడు ఎర్రసముద్రంలో సౌదీ చమురు ట్యాంకర్లపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడం, ఇంధన రవాణాకు మరో కీలకమైన ప్రాంతంలో కొత్త ఆటంకాలను సృష్టిస్తోంది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుఇరాన్ వ్యూహాత్మక హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఒకవేళ హార్మూజ్ జలసంధిలో సరఫరాకు విఘాతం కలిగితే గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. సైనిక దాడుల కంటే ముందే దౌత్య మార్గాల ద్వారా ఈ సంక్షోభానికి తెరదించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బ తినడం ఖాయమని కొందరు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్
రహదారి భద్రతను పటిష్టం చేయడం, నిబంధనలను తరచూ ఉల్లంఘించే వాహనదారులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వారికి తక్షణ డిజిటల్ హెచ్చరికలు పంపడంతో పాటు పదేపదే చేసే ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్తగా డిజిటల్ వార్నింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.సాంకేతికతతో రియల్-టైమ్ పర్యవేక్షణప్రస్తుతం అమలులో ఉన్న ఈ-చలాన్ వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ప్రతిపాదిత వ్యవస్థకు అనుసంధానించనున్నారు. వాహనదారులు సిగ్నల్ జంపింగ్, అతివేగం, హెల్మెట్/సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ లేదా డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడితే.. డిజిటల్ నెట్వర్క్ ద్వారా వెంటనే సదరు వాహనదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్కు అలర్ట్/వార్నింగ్ మెసేజ్ వెళ్తుంది.డీమెరిట్ పాయింట్ల విధానం.. లైసెన్స్ రద్దుఈ ప్రతిపాదనలో అత్యంత కీలకమైన అంశం పాయింట్ల ఆధారిత శిక్షా విధానం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విధానంలో.. ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘనకు ఒక ప్రత్యేక డిజిటల్ రికార్డు ఉంటుంది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో నిర్దేశిత పరిమితికి మించి (ఉదాహరణకు 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు) ఉల్లంఘనలు నమోదవ్వడం లేదా డీమెరిట్ పాయింట్లు పరిమితి దాటితే ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) నేరుగా జోక్యం చేసుకుంటుంది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడం లేదా శాశ్వతంగా రద్దు చేసే అధికారం రవాణా శాఖకు ఉంటుంది. అంతేకాకుండా లైసెన్స్ పునరుద్ధరణకు ముందు వాహనదారులు విధిగా డ్రైవింగ్ రీ-టెస్ట్, భద్రతా శిక్షణ పూర్తి చేయాల్సి రావచ్చు.మారనున్న వాహనదారుల ప్రవర్తనసాధారణంగా జరిమానా చెల్లించి మళ్లీ పాత తప్పులే చేసే ధోరణి చాలామందిలో కనిపిస్తుంటుంది. అయితే, కొత్త డిజిటల్ హెచ్చరిక వ్యవస్థ ద్వారా కేవలం జరిమానా మాత్రమే గాక లైసెన్స్ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది వాహనదారుల్లో క్రమశిక్షణను, జవాబుదారీతనాన్ని పెంచుతుంది. అలాగే, మనుషుల ప్రమేయం తక్కువగా ఉండి సాంకేతికత ఆధారంగా నిర్ణయాలు జరగడం వల్ల అవినీతికి తావులేకుండా పారదర్శకత పెరుగుతుందని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పండగలు షురూ.. వంటనూనెల దిగుమతుల జోరు -
పండగలు షురూ.. వంటనూనెల దిగుమతుల జోరు
రాబోయే వరుస పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని దేశంలో వంటనూనెల కొరత తలెత్తకుండా ప్రభుత్వం, దేశీయ రిఫైనరీలు ముందస్తు చర్యలను వేగవంతం చేశాయి. రాబోయే జులై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సగటున నెలకు 15 లక్షల టన్నుల చొప్పున వంటనూనెలను దిగుమతి చేసుకోవడానికి రంగం సిద్ధమైంది. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సమయంలో స్వీట్లు, పిండివంటల తయారీతో వంటనూనెలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో మార్కెట్లో కొరత ఏర్పడకుండా స్థిరమైన ధరలను నిర్వహించడమే లక్ష్యంగా దిగుమతుల పరిమాణాన్ని భారీగా పెంచుతున్నారు.దేశీయ సరఫరా తగ్గుదల..ప్రస్తుతం దేశీయంగా సోయాబీన్, ఆవాల (రేప్సీడ్) క్రషింగ్ కార్యకలాపాలు మందగించడంతో స్థానికంగా నూనెల లభ్యత తగ్గింది. ఈ లోటును పూడ్చడానికి పండుగల నాటి గరిష్ఠ డిమాండ్ను తట్టుకోవడానికి దిగుమతులే ఏకైక మార్గంగా మారాయని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి.మెహతా తెలిపారు. దీంతో దేశీయ రిఫైనర్లు పామ్ ఆయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నారు.అంతర్జాతీయ మార్కెట్లపై భారత డిమాండ్ ప్రభావంప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకునే భారతదేశం ఈ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టడం గ్లోబల్ కమొడిటీ మార్కెట్లపై స్పష్టమైన ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియాల నుంచి క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతులు పుంజుకోనున్నాయి. అర్జెంటీనా, బ్రెజిల్ల నుంచి సోయా ఆయిల్, రష్యా-ఉక్రెయిన్ల నుంచి పొద్దుతిరుగుడు నూనె సరఫరాలు పెరగనున్నాయి. భారత్ నుంచి పెద్దమొత్తంలో ఆర్డర్లు రావడంతో ఇండోనేషియా, మలేషియాల్లో నిల్వలు తగ్గి మలేషియన్ పామ్ ఆయిల్, గ్లోబల్ సోయా ఆయిల్ ఫ్యూచర్స్ ధరలకు అంతర్జాతీయ మార్కెట్లో బలమైన మద్దతు లభిస్తోంది.భారతదేశం తన మొత్తం వంటనూనెల అవసరాలలో దాదాపు 55-60% వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. పండుగల సీజన్లో సామాన్యులపై ధరల భారం పడకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించాలి. సుదీర్ఘ కాలంలో దిగుమతులను తగ్గించుకోవడానికి నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ద్వారా దేశీయంగా నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని, ఉత్పాదకతను పెంచడంపై కేంద్రం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా.. -
పసిడి తగ్గినా.. ‘గోల్డ్ బాండ్ల’ జోరు తగ్గేదేలే..
బంగారం ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గినప్పటికీ సార్వభౌమ పసిడి బాండ్లలో (సావరీన్ గోల్డ్ బాండ్స్-ఎస్జీబీ) పెట్టుబడి పెట్టిన వారికి గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ 34-44 శాతం వరకు లబ్ధి చేకూరుతోంది. కొత్తగా ఎస్జీబీల జారీని ప్రభుత్వం నిలిపివేసినప్పటికీ 2032 ఫిబ్రవరి వరకు గడువు తీరే దాదాపు 45 బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫామ్ల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవి వార్షికంగా 2.50 శాతం వడ్డీని అందిస్తూనే గడువు ముగిసే సమయానికి నాటి పసిడి మార్కెట్ ధర ఆధారంగా మెచ్యూరిటీ సొమ్మును చెల్లిస్తాయి.900 శాతానికి పైగా పెరుగుదలరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 2024లో చివరిసారిగా ఎస్జీబీని జారీ చేసింది. 2015 చివరిలో ఈ పథకం ప్రారంభమైనప్పుడు 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.25,000 ఉండగా ప్రస్తుతం అది దాదాపు రూ.1.29 లక్షలకు చేరింది. ఫలితంగా, ప్రభుత్వంపై ఎస్జీబీల బాధ్యత సుమారు రూ.1.12 లక్షల కోట్ల- రూ.1.20 లక్షల కోట్లకు (సుమారు 130 టన్నుల బంగారం) పెరిగింది. ఇది 2015తో పోలిస్తే 900 శాతానికి పైగా పెరుగుదల.ఈ క్రమంలోనే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర బడ్జెట్ 2026లో కీలక పన్ను సవరణ చేసింది. ఇకపై ఆర్బీఐ ద్వారా ప్రాథమికంగా బాండ్లు కొనుగోలు చేసి ఎనిమిదేళ్ల గడువు వరకు ఉంచుకునే వారికి మాత్రమే మూలధన లాభాల పన్ను మినహాయింపు లభిస్తుంది. సెకండరీ మార్కెట్ (NSE/BSE)లో ఇతరుల నుంచి ఎస్జీబీలు కొనుగోలు చేసేవారికి ఈ పన్ను మినహాయింపు వర్తించదని నిపుణులు చెబుతున్నారు. బాండ్ల పన్ను విధానంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో కొత్తగా పసిడిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్లు మెరుగైన ప్రత్యామ్నాయమని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: కోకా-కోలా ‘ఫెయిర్లైఫ్’పై సైబర్ దాడి -
ఈక్విటీలపై ఎల్టీసీజీ పన్ను రద్దు లేదు
ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నును ఎత్తివేసే ఆలోచన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతికూల మార్కెట్ వార్తలు, నిపుణుల అంచనాల నడుమ పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ లోక్సభలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.పార్లమెంట్ ఉభయసభల సమావేశాల సందర్భంగా లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానమిస్తూ.. పన్ను విధానాలు, మూలధన లాభాల పన్ను రేట్లను ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రూపకల్పన సమయంలోనే స్థూల ఆర్థిక పరిస్థితులను బట్టి సమీక్షిస్తుందని, ప్రస్తుతానికి ఎల్టీసీజీని రద్దు చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని పేర్కొన్నారు.ఖజానాకు భారీగా పన్ను ఆదాయంభారత మార్కెట్లలో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం ఊపందుకోవడంతో ఎల్టీసీజీ ద్వారా ప్రభుత్వానికి లభించే రాబడి భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ (అసెస్మెంట్ ఇయర్ 2025-26) ఈక్విటీ ఎల్టీసీజీ పన్ను వసూళ్లు ఏకంగా 78.8 శాతం పెరిగి రూ.1,29,158 కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (ఏవై 2024-25) ఈ వసూళ్లు రూ.72,249 కోట్లుగా నమోదయ్యాయి.ఎఫ్పీఐలతో సమానమైన పన్ను నిబంధనలువిదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులపై వస్తున్న వార్తలను కూడా ప్రభుత్వం ఖండించింది. ఈక్విటీలపై విధిస్తున్న 12.5% ఎల్టీసీజీ పన్ను రేటు స్వదేశీ రిటైల్ ఇన్వెస్టర్లకు, విదేశీ ఇన్వెస్టర్లకు సమానంగానే వర్తిస్తుందని తెలిపింది. ఎఫ్పీఐలకు ఇటీవల ప్రకటించిన పన్ను మినహాయింపు కేవలం ప్రభుత్వ సెక్యూరిటీల పెట్టుబడుల వరకే పరిమితమని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు పైబడిన ఈక్విటీ లాభాలపై 12.5% చొప్పున ఎల్టీసీజీ పన్ను అమలులో ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పన్ను రాబడిని సమకూరుస్తున్న ఈ విధానాన్ని మున్ముందు కూడా కొనసాగించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా.. -
మౌలిక రంగం... 5 నెలల గరిష్టానికి జంప్
న్యూఢిల్లీ: సిమెంటు, విద్యుత్, ముడి ఇనుము దన్నుతో జూన్లో తొమ్మిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి అయిదు నెలల గరిష్టమైన 5 శాతానికి ఎగిసింది. 2025 జూన్లో ఇది 1.1 శాతంగా, 2026 మే నెలలో 3.2 శాతంగా నమోదైంది. తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల్లో బేస్ ఇయర్ని 2011–12 నుంచి 2022–23కి మార్చారు. ఇందులో తొమ్మిదో రంగంగా ముడి ఇనుమును కూడా జోడించారు. గణాంకాల ప్రకారం ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల ఉత్పత్తి క్షీణించింది. మరోవైపు సిమెంటు, విద్యుదుత్పత్తి 9.8 శాతం చొప్పున, కొత్తగా చేర్చిన ముడి ఇనుము రంగం ఉత్పత్తి 43.9 శాతం మేర వృద్ధి చెందగా, ఉక్కు 4.6 శాతానికి నెమ్మదించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కీలక రంగాలు 3.6 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఇదే వ్యవధిలో వృద్ధి 1 శాతానికి పరిమితమైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వరుసగా నాలుగో నెలా ఎరువుల ఉత్పత్తి మందగించింది. -
మంచి కంపెనీ... షేరు వేరువేరు
బుల్ మార్కెట్లో జరిగేదొకటే. కొన్ని తప్ప అన్ని షేర్లూ పరుగులు పెడతాయి. ఎలా అంటే... అమ్మో! ఇప్పుడు కొనలేకపోతే ఇంకెప్పటికీ ఆ ధర దగ్గర దొరకవేమో!!... అని ఇన్వెస్టర్లు భయపడేలా!. కొంచెం స్టాక్మార్కెట్ గురించి తెలిసిన వాళ్లంతా గురువులు, స్నేహితుల రూపంలో అప్పుడే ఎదురవుతారు. ‘‘ఇది మంచి కంపెనీ. ధర ఓకే. జస్ట్ కొని పక్కనపెట్టుకోండి. ఎప్పటికీ అమ్మకపోతేచాలు’’ అని సలహా ఇస్తారు. ఇదిగో... ఇన్వెస్టర్లు తప్పులో కాలేసేదిక్కడే. ఎందుకంటే ‘షేర్లు కొని మర్చిపోండి’ అనే సలహాలో నిజం సగమే. ఒక గొప్ప కంపెనీ షేరును కొన్నంత మాత్రాన అద్భుతమైన లాభాలు వస్తాయని కానీ... ఒక నాసిరకం కంపెనీ షేరును కొన్నంత మాత్రాన నష్టాలు ఖాయమని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే కంపెనీ– షేరు కవలలు కాదు. కేవలం సోదరులే. రెండింట్లో తేడాలుండొచ్చు. అనుకున్నట్టుగా రాణించే మంచి కంపెనీలకన్నా, అనూహ్యంగా రాణించే సాధారణ కంపెనీలే బాగా ముందుకెళతాయి. అదెలాగో సోదాహరణంగా వివరించేదే ఈ సాక్షి ‘వెల్త్’ ప్రత్యేక కథనం... ఒక షేరు పెరుగుతుందా? తగ్గుతుందా? ఎన్నాళ్లలో ఎంత రాబడినిస్తుంది? ఇదంతా కేవలం కంపెనీ ఎంత బాగుందన్న దానిపైనే ఆధారపడదు. కంపెనీ వ్యాపారం ఏటా ఏ స్థాయిలో పెరుగుతోంది? ఆ పెరిగే వృద్ధికి మార్కెట్ ఎంత విలువ ఇస్తోంది? ఆ కంపెనీ ఎంత డివిడెండ్ చెల్లిస్తోంది? మనం కొన్న షేరును ఎంతకాలం విక్రయించకుండా ఉంచగలుగుతున్నాం? ఇవన్నీ కలిసే షేరుపై వచ్చే రాబడిని నిర్ణయిస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలివీ... గొప్ప కంపెనీ... కానీ పూర్ ఇన్వెస్ట్మెంట్! పేజ్ ఇండస్ట్రీస్: 2009–2019 మధ్య దేశంలోని కంపెనీల్లో ఇన్వెస్టర్లకు అత్యంత భారీ లాభాలిచ్చిన షేరు ఇదే. ఆదాయం బీభత్సం. మార్జిన్లు అద్భుతం. పెట్టిన మూలధనంపై వచ్చే రాబడి(ఆర్ఓసీఈ) అత్యధికం. దీంతో 2009లో రూ.300 ఉన్న షేరు ధర పదేళ్లలో ఏకంగా రూ.35వేలకు చేరింది. ఇన్వెస్టర్లు ఇక ఈ కంపెనీకి ఎదురులేదనుకున్నారు. ధర ఎంత పెరిగినా కొనటం మొదలుపెట్టారు. వేల్యుయేషన్లు పెరిగాయి. అంటే.. కంపెనీ భవిష్యత్తుకు తగ్గట్టు ముందే షేరు ధర పెరిగిపోయింది. జాకీ బ్రాండ్ దుస్తుల్ని దేశీయంగా విక్రయించే ఈ కంపెనీ వ్యాపారం 2019 తరువాత కూడా అద్భుతంగా కొనసాగింది. కానీ అప్పటికే ఆ భవిష్యత్తు మొత్తం షేరు ధరలో చేరిపోయింది. ఈ ఏడేళ్లలో షేరు ధర రూ.40 వేలకు అటూఇటుగా ఉంది. మరి 2019లోనో ఆ తరువాతో ఇన్వెస్ట్ చేసిన వారికిది పూర్ ఇన్వెస్ట్మెంటే కదా? కొటక్ మహీంద్రా బ్యాంక్దీ ఇలాంటి స్టోరీనే.దేశంలోని అతికొద్ది అద్భుతమైన ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి. మేనేజ్మెంట్, అండర్రైటింగ్, అసెట్ క్వాలిటీ అన్నింటా సూపర్. ఇన్వెస్టర్లకూ ఇష్టమే. కానీ అందరూ ఇష్టపడి కొనటం వల్ల ఈ షేరు వాల్యుయేషన్ బాగా పెరిగిపోయింది. తరువాత రుణాల వృద్ధి తగ్గింది. వ్యాపారం, బుక్ వేల్యూ పెరుగుతున్నా వాల్యుయేషన్ల ప్రీమియం తగ్గటంతో షేరు ధర బాగా పడింది. ఏషియన్ పెయింట్స్దీ ఇలాంటి కథే. ఒకప్పుడు ఇది వ్యాపారానికి బెంచ్మార్క్. పోటీ సంస్థలకన్నా అన్నింటా ముందంజే. కానీ గత కొన్నేళ్లుగా షేరుపై రాబడి పెద్దగా లేదు. ఎందుకంటే వ్యాపారం బాగానే ఉన్నా అంచనాలు విపరీతంగా పెరిగాయి. వాటిని అందుకోవటం సాధ్యం కాని స్థితిలో... షేరు ధర పెరుగుదల అంతంతమాత్రంగానే ఉంటోంది. రాబడిలో నిలకడ లేకుంటే... షేరు ధర అంతంతే! నాట్కో ఫార్మా: అప్పుల్లే వు. ఆర్ అండ్ డీ అద్భుతం. మార్జిన్లు సూపర్. పటిష్ఠమైన మేనేజ్మెంట్. కానీ... దీర్ఘకాలలలో చూస్తే ఈ కంపెనీపై రాబడి చాలా నాసిరకం. కారణమేంటి? ఈ కంపెనీ లాభాలన్నీ బ్లాక్బస్టన్ జనరిక్ డ్రగ్స్ను ప్రవేశపెట్టడంపైనే ఆధారపడుతూ వస్తున్నాయి. ఒక అద్భుతమైన ఉత్పత్తితో అన్నీ మారిపోతాయి. తరవాత దానికి పోటీ వస్తుంది. మార్జిన్లు పడిపోతాయి. మరో కొత్త ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ తరహా అనిశ్చితి మార్కెట్కు నచ్చదు. దివీస్ లాబొరేటరీస్: ఇది కూడా నాట్కో తరహాలో దేశీ ఫార్మా కంపెనీనే. కానీ ఈ కంపెనీ పనితీరులో నాటకీయ అనూహ్యతేదీ ఉండదు. బ్లాక్బస్టర్ డ్రగ్స్ ఉండవు. కానీ... అదే పనితీరు క్రమం తప్పకుండా కొనసాగుతుంది. మార్జిన్లు, క్యాష్ ఫ్లో, రాబడి... అన్నీ అంచనాలకు తగ్గట్టే ఉంటాయి. అందుకే ఈ కంపెనీ షేరు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠ స్థాయిలను తాకుతూనే వస్తోంది. కొన్ని సార్లు వేచి చూడాలి... అంతే! రిలయన్స్ ఇండస్ట్రీస్: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ది ప్రత్యేక కథ. 2002–08 మధ్య చూస్తే... చమురు రిఫైనింగ్ బూమ్లో ఉంది. షేరు ధర రూ.20 నుంచి ఏకంగా రూ.350కి చేరి ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. కానీ అప్పటి నుంచి 2016 వరకు వ్యాపారం అద్భుతంగానే ఉన్నా షేరు ధర పెరగలేదు. పైపెచ్చు తగ్గింది. ఆ తరువాతి ఐదేళ్లూ... అంటే 2021 వరకూ చూస్తే జియో వచ్చింది. రిటైల్ పెరిగింది. కంపెనీ విలువ మారిపోయింది. షేరు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.1400 కూడా తాకింది. మరి తరువాతేంటి? ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానంకోసమే మార్కెట్ ఎదురు చూస్తోంది. అందుకే గడిచిన ఐదేళ్లలో షేరు ధర పెరగలేదు. జియో ఐపీవోకు వస్తే దాని విలువెంత? రిటైల్ ఐపీఓ ఎంత? గ్రీన్ ఎనర్జీ ఆదాయాలెలా ఉంటాయి? ఏఐతో వచ్చే లాభమెంత? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం మార్కెట్ వేచిచూస్తోంది. కంపెనీ మారలేదు. వ్యాపారం క్షీణించలేదు. కానీ మార్కెట్ కంపెనీ వృద్ధికి కొత్త ట్రిగ్గర్ కోసం ఎదురుచూసింది. అందుకే ఐదేళ్లపాటు షేరు ధర పెద్దగా కదల్లేదు. ఇదే టైమ్ కరెక్షన్.సాదాసీదా వ్యాపారం... షేరు అద్భుతం! షిప్పింగ్ కంపెనీలను చూడండి. వ్యాపార నాణ్యత అంతంతే. రాబడులు కొన్నిసార్లు మాత్రం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా సరకు రవాణా సైకిల్స్ మారుతుంటాయి కనక. దానికి తగ్గట్టే షేర్లూ పెరుగుతుంటాయి. షుగర్ కంపెనీలదీ అదే తీరు. మార్జిన్లు తక్కువ. ప్రభుత్వ నియంత్రణ ఎక్కువ. కానీ... ఇథనాల్ నిర్ణయాలప్పుడు... చక్కెర సీజన్లోను ఈ షేర్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని చాలాసార్లు రెండుమూడు రెట్ల చొప్పున పెరిగాయి. కానీ వ్యాపారమేమీ అంత నాటకీయంగా మారిపోదు. సీజన్ మారుతుంది... అంతే.షేర్ల రాబడికి గ్రోత్ ఇంజిన్లు ఇవే... పై ఉదాహరణలన్నీ చూశాక ప్రతి ఇన్వెస్టరూ గమనించాల్సినవి ఇవే. → రాబడుల్లో వృద్ధి: కంపెనీ ఆదాయం, లాభం క్రమం తప్పకుండా పెరగాలి. → ఊహించినట్టే: కంపెనీ భవిష్యత్తు రాబడులపై ఇన్వెస్టర్లు ధీమాగా ఉండాలి. → వేల్యుయేషన్: ఎంత పీఈ దగ్గర కొంటున్నామనే విషయంతో పాటు కంపెనీ పీఈ ఏటా ఏ స్థాయిలో పెరుగుతోందో కూడా చూడాలి. అప్పుడే ధర సహేతుకమో కాదో తెలుస్తుంది. → క్యాపిటల్ కేటాయిపు: రాబడుల్లో మిగిలే మొత్తం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ఏ మేరకు సరిపోతుందన్నది కూడా ముఖ్యమే. → టైమ్: ఇది అన్నిటికన్నా ముఖ్యం. కొన్నిసార్లు అన్నీ బాగున్నా మార్కెట్ మాత్రం ఆ కంపెనీ నుంచి మరిన్ని సంకేతాల కోసం ఎదురు చూస్తుంటుంది. ఇన్వెస్టర్లు చూడాల్సినవివే... ఒక షేరు కొనేటపుడు ‘ఇది మంచి కంపెనీయే’ అని సింపుల్గా తేల్చేసుకోకుండా... → కంపెనీ రాబడుల్లో వృద్ధి నిలకడగా ఉంటుందా? → వ్యాపార పనితీరు అనుకున్నట్టుగానే సాగుతుందా? → లాభాలను కంపెనీ తెలివిగా వాడి విస్తరణ చేయగలుగుతుందా? → కంపెనీ షేరు విలువ సహేతుకంగానే ఉందా? → ఈ కంపెనీనుంచి మార్కెట్ ఆశిస్తున్నదెంత? కంపెనీ సాధించిందెంత? → వచ్చే ఐదేళ్లలో ఈ కంపెనీ ఏ రకమైన అనూహ్య ఫలితాలు సాధిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని... ఆ తరువాత ఇన్వెస్ట్ చేస్తేనే అనుకున్న ఫలితాలొస్తాయి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ సలహాదారులు ఇన్వెస్టర్లు కంపెనీ యాజమాన్యం తరహాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతారు. కానీ అది సరికాదనే అనుకోవాలి. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం ‘ఈ వ్యాపారం భవిష్యత్ బాగుంటుందా?’ అనే ఆలోచిస్తుంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం... ‘ఈ వ్యాపారం తాలూకు భవిష్యత్తు వృద్ధి ఇప్పటికే ఈ షేరులో కనిపిస్తోందా?’ అనేది చూడాలి. ఎందుకంటే ఇన్వెస్టర్లు కంపెనీని కొనరు. ఆ కంపెనీ భవిష్యత్ ఆదాయాలను కొంటారు. ఆ భవిష్యత్తుకు ఎంత ధర చెల్లిస్తున్నారన్నదే చివరికి వారి రాబడిని నిర్ణయిస్తుంది. ఆ చెల్లించే ధర మరీ ఎక్కువ అనిపిస్తే ఆ షేరుకు దూరంగానే ఉండాలి. కనీసం కొన్నాళ్లయినా!! -మంథా రమణమూర్తి -
ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్బీఐ తొలి అడుగు!
దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.10, రూ.20 విలువల పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక చర్యలు ప్రారంభించింది. అయితే పైలట్ ప్రాజెక్టు తేదీలు లేదా నోట్ల డినామినేషన్లపై ఆర్బీఐ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం గ్లోబల్ టెండర్ ప్రక్రియ ప్రారంభించడం ద్వారా సన్నాహాలు వేగవంతం చేసింది.ఆర్బీఐకి చెందిన కరెన్సీ ముద్రణ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) కోరింది. ఇందులో బయాక్సియల్ ఓరియెంటెడ్ పాలీప్రొపైలిన్ (BOPP) ఆధారిత పాలిమర్ సబ్స్ట్రేట్ను సరఫరా చేయాలని పేర్కొంది. మొత్తం 68,000 రీముల పాలిమర్ షీట్లు అవసరమని, వాటిలో రెండు డినామినేషన్లకు చెరో 34,000 రీములు కేటాయించినట్లు టెండర్లో వెల్లడించింది.ఈ పాలిమర్ షీట్లలో పారదర్శక విండో, మెటాలిక్ న్యూమరల్, మాగ్నెటిక్ సూడో థ్రెడ్, షాడో ఇమేజ్, ఇరిడిసెంట్ ప్యాటర్న్ వంటి అధునాతన భద్రతా లక్షణాలు ఉండాలని ఆర్బీఐ నిర్దేశించింది. ఇవి నకిలీ నోట్ల తయారీని మరింత కష్టతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.టెండర్ నిబంధనల ప్రకారం, దరఖాస్తు చేసుకునే సంస్థలకు సెంట్రల్ బ్యాంకులు లేదా బ్యాంక్నోట్ ప్రింటింగ్ సంస్థలకు కనీసం మూడేళ్ల పాటు పాలిమర్ సబ్స్ట్రేట్ సరఫరా చేసిన అనుభవం ఉండాలి. అంతేకాదు, చైనా లేదా పాకిస్తాన్కు సంబంధించిన కార్యకలాపాలు భారత ప్రాజెక్టుతో సంబంధం లేకుండా పూర్తిగా వేరుగా ఉండాలని, అక్కడి నుంచి ముడి పదార్థాలను సేకరించకూడదని కూడా కఠిన నిబంధనలు విధించింది. బిడ్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 18గా నిర్ణయించింది.ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారు?జూన్లో జరిగిన ద్రవ్య విధాన సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, పాలిమర్ నోట్ల ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని, వాటి ప్రయోజనాలు, వ్యయభారం, అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అందువల్ల 2027లో పూర్తి స్థాయి అమలు జరిగే అవకాశం ఉందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నప్పటికీ, దీనిపై ఆర్బీఐ నుంచి అధికారిక ధ్రువీకరణ ఇంకా వెలువడలేదు.పాలిమర్ నోట్ల ప్రత్యేకత ఏమిటంటే..1988లో ఆస్ట్రేలియా తొలిసారిగా పాలిమర్ బ్యాంకు నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 50కిపైగా దేశాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నుతాయి. నీరు, తేమ, మురికి ప్రభావం తక్కువగా ఉండటంతో పాటు నకిలీ చేయడం కూడా కష్టమవుతుంది. దీర్ఘకాలంలో ముద్రణ వ్యయం తగ్గడం, పాడైన నోట్ల స్థానంలో కొత్త నోట్లు ముద్రించే అవసరం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. -
వృద్ధికి పశ్చిమాసియా గండం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం, రుతుపవనాలపై అనిశ్చితి నెలకొనడం తదితర అంశాలు దేశ ఆర్థిక వృద్ధికి కీలక రిస్కులుగా పరిణమించవచ్చని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్య, ఆర్థిక విధానాలు పటిష్టంగా ఉండటం వల్లే భారత్ జీడీపీ వృద్ధి అధిక స్థాయిలో ఉంటోందని ఆయన చెప్పారు. ‘అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ గత కొన్నేళ్లుగా 7 శాతం పైగా వృద్ధి రేటు సాధిస్తోంది. ఆర్థికంగా ఫండమెంటల్స్ బలంగా ఉండటంతో గత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం సాధించింది‘ అని పేర్కొన్నారు. పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.6 శాతం స్థాయిలో ఉండొచ్చనే ఆర్బీఐ అంచనా వేస్తున్నట్లు మల్హోత్రా వివరించారు. సరఫరా తరఫు సవాళ్ల కారణంగా జూన్లో ద్రవ్యోల్బణం, ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యానికి మించి నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ అంచనాలను 4.6 శాతం నుంచి 5.1 శాతానికి ఆర్బీఐ పెంచినట్లు మల్హోత్రా చెప్పారు. పెద్ద సంఖ్యలో జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో రుతుపవనాల తీరుతెన్నులు కీలకంగా ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 17 శాతంగా ఉంటుంది. స్థిరంగా రూపాయి... అంతర్జాతీయంగా అనిశ్చితి పెరగడం, డాలరు బలపడటంలాంటి అంశాలు ఉన్నప్పటికీ పోటీ దేశాలతో పోలిస్తే రూపాయి స్థిరంగానే ఉన్నట్లు మల్హోత్రా చెప్పారు. ‘పశ్చిమాసియాలో యుద్ధం తర్వాత డాలరు మరింత బలపడింది. చాలా మటుకు దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి. గ్లోబల్ కోణంలో చూస్తే రూపాయి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు భావించవచ్చు‘ అని పేర్కొన్నారు. రికార్డు ఎఫ్డీఐలు.. గతేడాది స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రికార్డు స్థాయిలో 95 బిలియన్ డాలర్లకి చేరినట్లు మల్హోత్రా వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే 7 బిలియన్ డాలర్ల మేర ఎఫ్డీఐలు వచ్చినట్లు చెప్పారు. మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పరిస్థితి పటిష్టంగానే ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందిస్తూనే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడాన్ని ఆర్బీఐ కొనసాగిస్తుందన్నారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో, స్థిరంగా ఉంటే నిలకడగా వృద్ధి సాధించేందుకు దోహదపడగలదని చెప్పారు. మరోవైపు, వివిధ రంగాలవ్యాప్తంగా రుణ వృద్ధి మెరుగ్గానే ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం మీద బ్యాంక్ క్రెడిట్ వార్షికంగా 18 శాతం, మే నెలతో పోలిస్తే జూన్లో 17.8 శాతంగా నమోదైనట్లు వివరించారు. కస్టమర్ సరీ్వస్ను మెరుగుపర్చుకునేందుకు, నిర్వహణ వ్యయాలను తగ్గించుకునేందుకు, సైబర్సెక్యూరిటీ, డేటా ప్రైవసీ లీక్లను నిరోధించేందుకు గాను ఏఐని వినియోగించుకునేలా బ్యాంకులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
పార్లమెంట్లో ‘ఆదాయ పన్ను సవరణ బిల్లు-2026’
కేంద్ర ప్రభుత్వం రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలకమైన ఆర్థిక సంస్కరణను చట్టరూపంలోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల జారీ చేసిన ఒక అత్యవసర ఆర్డినెన్స్ స్థానంలో.. ‘ఆదాయ పన్ను (సవరణ) బిల్లు, 2026’ను ప్రవేశపెట్టేందుకు ముసాయిదాను సిద్ధం చేసింది. జులై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సెషన్లో ఈ బిల్లుకు ప్రాధాన్యత లభించనుంది.ఆర్డినెన్స్ స్థానంలో కొత్త చట్టంఈ ప్రతిపాదిత చట్టం ద్వారా గత నెల (జూన్ 5, 2026) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆదాయ పన్ను (సవరణ) ఆర్డినెన్స్, 2026’ను భర్తీ చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో తక్షణ నివారణ చర్యల కోసమై రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం లభించిన ప్రత్యేక అధికారాల ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులతో ఈ ఆర్డినెన్స్ను అమల్లోకి తెచ్చారు. ఇది ఏప్రిల్ 1, 2026 నుంచి పాత తేదీతో వర్తిస్తుంది.విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను మినహాయింపుఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.. భారత ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం. గరిష్ట భద్రత గల ప్రభుత్వ బాండ్ల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లకు లభించే వడ్డీ ఆదాయం, వాటి విక్రయాల ద్వారా వచ్చే మూలధన లాభాలపై ఆదాయ పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వడం ఈ కొత్త బిల్లులోని ప్రధానాంశం.ఎందుకు ఈ వ్యూహాత్మక అడుగు?ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ముడిచమురు ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు, ప్రపంచ మార్కెట్ల ఒడిదొడుకుల నేపథ్యంలో భారత్ ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. దీని ద్వారా ఒరగూరే ప్రయోజనాలు..భారత సార్వభౌమ రుణ మార్కెట్ను (సావరిన్ డెట్ మార్కెట్) అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తృతం చేయడం.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దీర్ఘకాలిక గ్లోబల్ పెట్టుబడులను దేశంలోకి క్రమబద్ధంగా ఆకర్షించడం.విదేశీ నిధుల రాక ద్వారా అంతర్జాతీయ ఒత్తిళ్ల నుంచి రూపాయి విలువను కాపాడుకోవడం, దేశీయ ఆర్థిక మార్కెట్లో లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) పెంచడం.భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ బాండ్ సూచీలలో చేర్చిన తరుణంలో ఈ పన్ను రాయితీలు గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఒక సానుకూల సంకేతాన్ని పంపుతాయని నిపుణులు నమ్ముతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను తట్టుకుంటూనే దేశీయంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపార సౌలభ్యం)ను పెంపొందించడానికి ఇదొక ముందడుగని చెబుతున్నారు.ఇదీ చదవండి: వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్ను క్లోజ్ చేస్తున్నారా? -
రూ.6.51 లక్షల కోట్లు వచ్చాయ్..
కార్పొరేట్ పన్ను వసూళ్లు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) జూలై 13 నాటికి దేశంలో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 16.40 % పెరిగి రూ.6.51 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలను విడుదల చేసింది. సమీక్షా కాలంలో, నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 22% వృద్ధితో రూ.2.40 లక్షల కోట్లకు, నికర కార్పొరేట్యేతర పన్ను వసూళ్లు 12% పెరిగి రూ.3.84 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, సంస్థలు చెల్లించే పన్నులు కార్పొరేట్యేతర విభాగం కిందకు వస్తాయి.సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) వసూళ్లు 48% పెరిగి రూ.26,429 కోట్లకు చేరాయి. ఇదే కాలంలో ప్రభుత్వం రూ.1.22 లక్షల కోట్ల పన్ను రీఫండ్లను జారీ చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14.57 శాతం అధికం. మరోవైపు, రీఫండ్లను మినహాయించక ముందు స్థూల ప్రాతిపదికన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 16.11 % పెరిగి రూ.7.73 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.3.35 లక్షల కోట్లు, కార్పొరేట్యేతర పన్ను వసూళ్లు రూ.4.12 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.26.97 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో లక్ష్యంగా నిర్దేశించింది. ఇది 2025–26లో వసూలైన రూ.23.40 లక్షల కోట్లతో పోలిస్తే 15 శాతం అధికం. ‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం వంటి ప్రతికూలతలు కార్పొరేట్ కంపెనీల ఆదాయాలపై పెద్దగా ప్రభావం చూపలేదు, వాటి లాభాలు స్థిరంగా ఉన్నాయి అనేందుకు ఈ గణాంకాలు నిదర్శనం. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు ఇప్పటికే బడ్జెట్ అంచనాలలో 19.5 శాతానికి, కార్పొరేట్యేతర పన్ను వసూళ్లు 27.6 శాతానికి చేరుకున్నాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలమైన పునాదిపై కొనసాగుతున్నాయి’’ అని డెలాయిట్ పాట్నర్ రోహింటన్ సిద్ధ్వా పేర్కొన్నారు. -
కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్, మరో ఇద్దరు భారతీయ నిపుణులు
వాషింగ్టన్ : అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ (Fed) 5 ప్రత్యేక టాస్క్ఫోర్స్లను (కమిటీలను) ఏర్పాటు చేసింది. కీలకమైన ఈ కమిటీలో ముగ్గురు భార సంతతికి చెందిన నిపుణులు ఉండటం విశేషం. వారిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్, IMF మాజీ చీఫ్ ఎకనామిస్ట్ రఘురామ్ రాజన్ ప్రముఖంగా ఉన్నారు.గత కొన్ని ఏళ్లుగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ద్రవ్య విధాన రూపకల్పనను పునర్రూపకల్పన చేసే లక్ష్యంతో చేపట్టిన సమగ్ర సంస్కరణల కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ఈ కీలక కమిటీల్లో ముగ్గురు భారతీయ ఆర్థిక నిపుణులను ఎంపిక చేసింది. రఘురామ్ రాజన్తో పాటు, ఢిల్లీకిచెందిన అమెరికన్ ఆర్థికవేత్త రాజ్ చెట్టి , మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మ ఇందులో ఉన్నారు. ఈ ప్రముఖులతో పాటు ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఉన్నారు.రఘురామ్ రాజన్ పాత్ర: బ్యాలెన్స్ షీట్ పాలసీ టాస్క్ఫోర్స్' (Balance Sheet Policy Task Force) లో సభ్యుడిగా ఉంటారు. హార్వర్డ్ ఆర్థికవేత్త కారెన్ డైనన్, ఫెడ్ మాజీ గవర్నర్ జెరెమీ స్టెయిన్లతో కలిసి ఆయన పనిచేస్తారు. ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుత బ్యాలెన్స్ షీట్ (ఆస్తుల నిల్వలు, బాండ్ల కొనుగోళ్లు విధానం వల్ల కలిగే లాభనష్టాలను, ద్రవ్య విధానంపై దాని ప్రభావాన్ని వీరు సమీక్షిస్తారు.రాజ్ చెట్టి (Raj Chetty): ఢిల్లీలో జన్మించిన ఈ హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆర్థికవేత్త 'డేటా టాస్క్ఫోర్స్' (Data Task Force) కు సహ-నాయకత్వం వహిస్తారు. వాల్మార్ట్ మాజీ సీఈఓ డౌగ్ మెక్మిలన్, చికాగో యూనివర్సిటీ ఆర్థికవేత్త కెవిన్ మర్ఫీలతో కలిసి ఈయన పనిచేస్తారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నిజసమయ (real-time) ఆర్థిక సంకేతాలు, డేటా నాణ్యతను మెరుగుపరచడం వీరి బాధ్యత.ఆశా శర్మ (Asha Sharma): మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్బాక్స్ (Xbox) సీఈఓ అయిన ఈమె 'ఉత్పాదకత మరియు ఉద్యోగాల టాస్క్ఫోర్స్' (Productivity and Jobs Task Force) లో సభ్యురాలిగా ఉంటారు. సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీస్సెన్, స్టాన్ఫోర్డ్ ఆర్థికవేత్త చార్లెస్ ఐ. జోన్స్లతో కలిసి ఈమె పనిచేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కొత్త టెక్నాలజీల వల్ల ఉద్యోగాలు, దేశ ఆర్థిక వృద్ధిపై ఎలాంటి ప్రభావం పడుతుందో వీరు అంచనా వేస్తారు.5 టాస్క్ఫోర్స్లు- లక్ష్యంకొత్తగా నియమితులైన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ (Kevin Warsh) ఈ 5 టాస్క్ఫోర్స్లను ప్రకటించారు. గడిచిన ఐదేళ్లకు పైగా అమెరికాలో ద్రవ్యోల్బణం ఫెడ్ లక్ష్యం కంటే ఎక్కువగా ఉండటంతో, సరికొత్త ఆలోచనలతో వ్యవస్థను బలోపేతం చేయడం మరియు నిర్ణయాల్లో పారదర్శకతను పెంచడం కోసం ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కమ్యూనికేషన్స్, బ్యాలెన్స్ షీట్ పాలసీ, డేటా, ఉత్పాదకత-ఉద్యోగాలు, ద్రవ్యోల్బణ విధానాలు(inflation framework) అనే 5 ప్రధాన రంగాలపై ఈ టాస్క్ఫోర్స్లు దృష్టి పెడతాయి. -
వ్యక్తికి 7 కిలోలే.. గరిష్ఠంగా 35 కేజీలు
దేశంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ‘అంత్యోదయ అన్న యోజన’ (ఏఏవై) పథకంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా మార్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ), 2013కు సవరణలు చేస్తూ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ‘నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ (అమెండ్మెంట్) బిల్లు, 2026’ ముసాయిదాను విడుదల చేసింది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఇప్పటివరకు ప్రతి అంత్యోదయ కుటుంబానికి లభిస్తున్న స్థిర కోటా (35 కిలోల ఆహారధాన్యాలు) విధానంలో మార్పులు రానున్నాయి.కొత్త రూల్ ఏమిటి?ప్రస్తుతం అంత్యోదయ కార్డు ఉన్న కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారనే దానితో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ఆహారధాన్యాలను (ఉచితంగా) అందిస్తున్నారు. అయితే, కొత్త ముసాయిదా చట్టం ప్రకారం.. ఇకపై కుటుంబ ప్రాతిపదికన కాకుండా, కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోల చొప్పున రేషన్ కేటాయించనున్నారు. అదే సమయంలో ఒక ఫ్యామిలీకి ఇచ్చే గరిష్ఠ పరిమితిని 35 కిలోలుగానే ఉంచనున్నారు.చిన్న కుటుంబాలకు కోత.. పెద్ద కుటుంబాలకు ఎలా?కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సరికొత్త వ్యక్తిగత పరిమితి విధానం వల్ల ఒకటి నుంచి నలుగురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబాలకు రేషన్ కోటా భారీగా తగ్గనుంది. ఒక్కరు ఉండే కుటుంబానికి 35 కిలోల స్థానంలో కేవలం 7 కిలోలు మాత్రమే అందుతాయి. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే గరిష్ఠ పరిమితి 35 కిలోలు మాత్రమే అందుతుంది. అంటే ఐదుగురు కంటే ఎక్కువ (ఉదాహరణకు ఆరుగురు) ఉన్న కుటుంబంలో తలసరి కోటా 7 కిలోల కంటే తక్కువకు పడిపోతుంది.ప్రభుత్వ వాదన ఏమిటి?తక్కువ మంది ఉన్న కుటుంబాలకు ఎక్కువ రేషన్, ఎక్కువ మంది ఉన్న పేద కుటుంబాలకు తలసరిగా తక్కువ రేషన్ అందుతోందని ఈ వ్యత్యాసాన్ని తొలగించి పంపిణీని మరింత హేతుబద్ధం చేయడానికే ఈ విధానాన్ని ప్రతిపాదించినట్లు కేంద్ర ఆహార శాఖ పేర్కొంది. సాధారణ ప్రాధాన్యత గల కుటుంబాలకు ఇచ్చే తలసరి 5 కిలోల కంటే ఇది ఎక్కువగా (7 కిలోలు) ఉంటుందని స్పష్టం చేసింది.రాష్ట్రాల నుంచి వ్యతిరేకత..ఈ ముసాయిదా చట్టంపై ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలు కావడం వల్ల చిన్న కుటుంబాలు (న్యూక్లియర్ ఫ్యామిలీస్) ఎక్కువగా ఉన్నాయి. ఈ చట్టం వల్ల వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఉన్న అంత్యోదయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వ్యక్తగత ప్రాతిపదికన రేషన్ ఇవ్వాలనుకుంటే కుటుంబానికి విధించిన 35 కిలోల గరిష్ఠ పరిమితిని (క్యాపింగ్) ఎత్తివేయాలని, లేదంటే పెద్ద కుటుంబాలకు కూడా అన్యాయం జరుగుతుందని ఆహార భద్రతా హక్కుల కార్యకర్తలు సూచిస్తున్నారు. ఈ ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
బ్యాంక్ ఖాతా డేటాకు ముగ్గురు కాపలాదారులు!
దేశీయ ఆర్థిక రంగంలో డిజిటలైజేషన్, సాంకేతికత ఆధారిత వ్యాపార నమూనాలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఖాతాదారుల ఆర్థిక సమాచారం (డేటా) భద్రత, నాణ్యతపై ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్యాంకులు, ప్రభుత్వేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తమ డేటా నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించుకోవడానికి మూడు ప్రత్యేక రకాల ఉన్నతాధికారులను నియమించాలని స్పష్టం చేసింది. ‘డేటా ఓనర్లు’, ‘డేటా స్టీవార్డులు’, ‘డేటా కస్టోడియన్లు’ అనే పేర్లతో ఈ బాధ్యతలను అప్పగించనున్నారు.ముగ్గురు రక్షకులు.. వారి విధులు, బాధ్యతలుడేటా ఓనర్: నిర్దిష్ట విభాగానికి (డేటా డొమైన్) సంబంధించిన డేటాను వర్గీకరించడం, దాని నాణ్యతను పర్యవేక్షించడం, సమాచార భాగస్వామ్య నిబంధనలను ఆమోదించడం వీరి బాధ్యత. డేటాకు వీరే పూర్తి జవాబుదారీగా ఉంటారు.డేటా స్టీవార్డ్: నిత్యం డేటా గవర్నెన్స్ ప్రమాణాల క్షేత్రస్థాయి అమలును వీరు పర్యవేక్షిస్తారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం సాధించడం, డేటా ప్రవాహాన్ని గమనించడం, ఏవైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి డేటా ఓనర్కు నివేదించడం వీరి విధి.డేటా కస్టోడియన్: సమాచార సాంకేతిక, సాంకేతిక పర్యావరణ నిర్వహణను వీరు చూసుకుంటారు. యాక్సెస్ కంట్రోల్స్, డేటా స్టోరేజ్, బ్యాకప్, డిజాస్టర్ రికవరీ, సురక్షితమైన డేటా తొలగింపు వంటి సాంకేతిక భద్రతా చర్యలు వీరి పరిధిలోకి వస్తాయి.మండలి ఆమోదం.. ప్రత్యేక విభాగం ఏర్పాటుఆర్బీఐ ప్రతిపాదనల ప్రకారం, ప్రతి నియంత్రిత సంస్థ తప్పనిసరిగా బోర్డు ఆమోదించిన డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ను కలిగి ఉండాలి. దీని కోసం ఒక ప్రత్యేక డేటా ఫంక్షన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. దీనికి చీఫ్ జనరల్ మేనేజర్ లేదా అంతకంటే ఉన్నత స్థాయి అధికారి నేతృత్వం వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, డేటా నిర్వహణకు సంబంధించి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ (ఎస్ఎస్ఓటీ) విధానాన్ని అమలు చేయాలని దీనివల్ల సమాచారంలో ఎలాంటి తారుమారు లేదా వైరుధ్యాలు ఉండవని ఆర్బీఐ పేర్కొంది.వ్యక్తిగత డేటా రక్షణ చట్టానికి అనుగుణంగా..ఈ నూతన మార్గదర్శకాలు భారత ప్రభుత్వ ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం, 2023’ నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. థర్డ్-పార్టీ యాప్లు లేదా ఫిన్టెక్ సంస్థలతో కస్టమర్ల డేటాను పంచుకునేటప్పుడు కఠినమైన నిబంధనలు అవసరమని కేంద్ర బ్యాంక్ నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
బొగ్గు కరెంట్కు బైబై
పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా భారతదేశం అడుగులు వేస్తోంది. 2070 నాటికి ‘నెట్-జీరో’ (నికర-సున్నా ఉద్గారాలు) లక్ష్యాన్ని చేరుకోవడానికి అణుశక్తి రంగంలో రోడ్మ్యాప్ను సిద్ధం చేసింది. దేశీయంగా పరిశోధనలు పెంపొందించడం, అవసరమైన యురేనియం దిగుమతి చేసుకోవడం, అణు, సౌర ఇంధన వనరులను వేగంగా విస్తరించడం ద్వారా ఈ రంగంలో స్వయంసమృద్ధి సాధించేందుకు పార్లమెంటరీ కమిటీ ఉన్నత స్థాయి సమీక్షను పూర్తి చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్ చీఫ్ మేధా విశ్రామ్ కుల్కర్ణి దీనికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు.దేశీయ పరిశోధనలకు పెద్దపీట..ఈ సన్నాహక రోడ్మ్యాప్లో భాగంగా భారతదేశం తన స్వదేశీ అణు సాంకేతికతను మరింత బలోపేతం చేయనుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అణు రియాక్టర్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం భారీగా నిధులను పరిశోధనలకు కేటాయిస్తున్నారు. అణు ఇంధన లభ్యతపై ఉన్న పరిమితులను అధిగమించడానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను భారత్ విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా భారతదేశానికి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించింది. అక్కడి నుంచి యురేనియం దిగుమతులు చేసుకోవడానికి మార్గం సుగమం కావడం ఈ రోడ్మ్యాప్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా నిలిచింది. అంతవరకు దేశీయ ఖనిజ నిల్వలపై ఆధారపడుతూనే విదేశీ యురేనియం సహాయంతో ఇంధన గ్రిడ్ను మరింత బలోపేతం చేయనున్నారు.థర్మల్ పవర్కు ప్రత్యామ్నాయంగా అణు, సౌర శక్తిపర్యావరణానికి ముప్పుగా మారిన బొగ్గు ఆధారిత ఉద్గారాలను తగ్గించేందుకు అణు విద్యుత్ను బేస్లోడ్ (స్థిరమైన విద్యుత్ సరఫరా) వనరుగా మార్చాలని నీతి ఆయోగ్, వివిధ నిపుణుల కమిటీలు సూచించాయి. ప్రభుత్వ నివేదికల ప్రకారం, సౌర లేదా పవన శక్తితో గ్రిడ్ను సమతుల్యం చేయడం కంటే అణు విద్యుత్ రంగాన్ని భారీగా విస్తరించడం వల్ల వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకే కరెంట్ లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా 2070 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని భారీ స్థాయికి (సుమారు 331 గిగావాట్లకు) చేర్చడం ద్వారా దేశీయ ఇంధన అవసరాల్లో అణుశక్తి వాటాను పెంచనున్నారు. సౌర, పవన, జల విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వేగవంతమైన విస్తరణకు తోడుగా నిరంతరం విద్యుత్ అందించే అణుశక్తిని అనుసంధానించనున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట -
ఏఐ బూమ్తో ఎగుమతులు అప్!
ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం చైనా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదింది. అంతర్జాతీయ మార్కెట్లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది జూన్ నెలలో చైనా ఎగుమతులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మేరకు చైనా కస్టమ్స్ శాఖ అధికారిక గణాంకాలను విడుదల చేసింది. ఆర్థికవేత్తల ముందస్తు అంచనాలను తలకిందులు చేస్తూ నమోదైన ఈ రికార్డు వృద్ధి, చైనా ఎగుమతి రంగానికి బలమైన మైలేజీని ఇచ్చింది. గడిచిన మే నెలలో నమోదైన 19.4 శాతం వార్షిక వృద్ధితో పోలిస్తే జూన్ ఫలితాలు మరింత మెరుగ్గా ఉండటం గమనార్హం.ఏఐ సాంకేతికత, ఈవీలదే హవాగ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ చైనా హైటెక్ ఉత్పాదక రంగానికి భారీగా కలిసివచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ మోడల్స్ విస్తృతి పెరగడంతో అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల ధరలు భారీగా పెరిగాయి. దీనికి తోడు కంప్యూటర్లు, ఆటోమేటెడ్ డేటా ప్రాసెసింగ్ పరికరాలు, హైటెక్ ఎలక్ట్రానిక్ పరికరాల ఎగుమతులు వృద్ధి చెందాయి. అలాగే, చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా గ్లోబల్ మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. అమెరికా టారిఫ్ల భయంతో పశ్చిమ దేశాల వ్యాపారులు భారీగా ఆర్డర్లు ఇవ్వడం కూడా ఈ అసాధారణ వృద్ధికి మరో ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.దేశీయ మందగమనానికి విదేశీ ఊరటప్రస్తుతం చైనా దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర సంక్షోభాన్ని, వినియోగదారుల ఖర్చుల్లో మందగమనాన్ని ఎదుర్కొంటోంది. స్థానిక మార్కెట్లో నెలకొన్న ఈ బలహీనతలను విదేశీ ఎగుమతుల జోరు సమర్థవంతంగా భర్తీ చేస్తోంది. అయితే, ఈ వృద్ధి సుస్థిరంగా కొనసాగడంపై ఆర్థిక నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రస్తుతానికి ఎగుమతుల వృద్ధి బాగున్నప్పటికీ భవిష్యత్తులో ఇది మరింత సున్నితంగా మారే అవకాశం ఉంది. ఆటోమొబైల్స్, ఏఐ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు పూర్తిగా అంతర్జాతీయ డిమాండ్, పశ్చిమ దేశాల నియంత్రణలపైనే ఆధారపడి ఉంటాయి’ బీఎన్పీ పారిబాస్ సెక్యూరిటీస్ (చైనా) మల్టీ-అస్సెట్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వేయ్ లీ అన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట -
ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపునకు బ్రేక్!
లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) గరిష్ట వేతన పరిమితి పెంపు ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు తెలిసింది. ఈపీఎఫ్ శాతాన్ని లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న పరిమితిని రూ.15,000ల నుంచి రూ.25,000లకు పెంచాలనే ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు సమాచారం. కొత్త సామాజిక భద్రతా కోడ్ అమలు నేపథ్యంలో వేతన పరిమితి దాదాపు రెట్టింపు అవుతుందని ఆశించిన ఉద్యోగ వర్గాలకు ఈ నిర్ణయంతో ప్రస్తుతానికి నిరాశే ఎదురవుతుందని కొందరు భావిస్తున్నారు.నేపథ్యం.. ప్రస్తుత విధానందేశంలో ప్రైవేట్ రంగ ఉద్యోగుల సామాజిక భద్రతను నిర్ణయించడంలో ఈ వేతన పరిమితి అత్యంత కీలకమైనది. చివరిగా 2014లో ఈ పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000లకు పెంచారు. ఆ తర్వాత గడిచిన దశాబ్ద కాలంలో ద్రవ్యోల్బణం, పెరిగిన జీవన ప్రమాణాల దృష్ట్యా ఈ పరిమితిని కనీసం రూ.21,000 లేదా రూ.25,000లకు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, తాజా సమీక్షలో ప్రభుత్వం పాత రూ.15,000 పరిమితినే ప్రస్తుతానికి కొనసాగించాలని చూస్తోంది.నిర్ణయం వాయిదాకు గల కారణాలుఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, వేతన పరిమితిని ఒకేసారి రూ.25,000లకు పెంచడం వల్ల ప్రభుత్వంపై, కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం ఉద్యోగుల పెన్షన్ పథకానికి (ఈపీఎస్) కేంద్ర ప్రభుత్వం తన వంతుగా 1.16% అదనపు సబ్సిడీని అందిస్తుంది. పరిమితి పెరిగితే ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేయాల్సిన నిధులు భారీగా పెరుగుతాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉద్యోగుల పీఎఫ్ వాటా కోసం అదనపు నిధులు కేటాయించాల్సి వస్తుంది. ఇది వారి వ్యాపార నిర్వహణ వ్యయాన్ని ప్రభావితం చేస్తుంది.ఉద్యోగులపై ప్రభావంనిబంధన (పరిమితి)ఉద్యోగి వాటా (12%)యాజమాన్యం ఈపీఎస్ వాటా (8.33%)ఈపీఎఫ్ వాటా (3.67%)ప్రస్తుత విధానం (రూ. 15,000)రూ. 1,800రూ. 1,250రూ. 550ప్రతిపాదన (రూ. 25,000)రూ. 3,000రూ. 2,083రూ. 917 పరిమితి పెరగకపోవడం వల్ల ఉద్యోగుల నెలవారీ జీతాల్లో కోతలు పెరగవు. ఫలితంగా ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో వారి చేతికి వచ్చే జీతం తగ్గకుండా ఉంటుంది. కానీ, నాణేనికి ఉన్న మరో వైపు చూస్తే.. రిటైర్మెంట్ నాటికి లభించే భారీ పీఎఫ్ నిధి, పెన్షన్ మొత్తాన్ని పెంచుకునే అవకాశాన్ని ఉద్యోగులు ప్రస్తుతానికి కోల్పోతారు. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులు కుదుటపడ్డాక కేంద్రం ఈ వేతన పరిమితి పెంపుపై పునరాలోచన చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది? -
కస్టమర్ల హక్కుల రక్షణకు ఆర్బీఐ నయా వ్యూహం
డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో.. కస్టమర్ల ఫిర్యాదులు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్ల సమస్యలకు బ్యాంకుల స్థాయిలోనే న్యాయమైన, శాశ్వత పరిష్కారం లభించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. కస్టమర్ ఫిర్యాదులను అర్థవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ అంతర్గత అంబుడ్స్మెన్లను ఆదేశించారు.క్షేత్రస్థాయిలోనే పరిష్కారం..ఒక కస్టమర్ బ్యాంకు సేవలపై అసంతృప్తితో ఫిర్యాదు చేసినప్పుడు ఆ సంస్థ దానిని తిరస్కరిస్తే ఆటోమేటిక్గా అది అంతర్గత అంబుడ్స్మెన్ పరిశీలనకు వెళ్తుంది. అయితే, చాలా సందర్భాల్లో ఈ ఫిర్యాదులు సరిగ్గా పరిష్కారంకాక ఆర్బీఐ అంబుడ్స్మెన్ స్థాయికి చేరుకుంటున్నాయి. దీనివల్ల కేంద్ర బ్యాంకుపై అదనపు భారం పడుతోంది. ఈ ఎస్కలేషన్లను తగ్గించడమే ఆర్బీఐ తాజా ఆదేశాల ఉద్దేశం. సమస్యలను ప్రాథమిక దశలోనే పరిష్కరిస్తే కస్టమర్లకు సమయం కలిసిరావడంతో పాటు బ్యాంకులపై నమ్మకం పెరుగుతుందని ఆర్బీఐ భావిస్తోంది.‘బ్యాంకులు నియమించే అంతర్గత అంబుడ్స్మెన్లు కేవలం సాంకేతిక నిబంధనలను చూపి కస్టమర్ల ఫిర్యాదులను తోసిపుచ్చకూడదు. వారు బ్యాంక్ యాజమాన్య ఒత్తిళ్లకు లొంగకుండా ఒక స్వతంత్ర న్యాయమూర్తిలా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. మానవీయ కోణంలో కస్టమర్ వైపు ఉన్న న్యాయాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి’ అని స్వామినాథన్ చెప్పారు.ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది? -
స్మాల్, మిడ్ క్యాప్లలో పెట్టుబడి అవకాశాలు
చాలామంది ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్–క్యాప్ షేర్లలో పెట్టుబడుల ద్వారానే ఎక్కువ సంపదను సృష్టించుకోగలుగుతుంటారు. ఎందుకంటే, లార్జ్–క్యాప్లతో పోలిస్తే ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిఫ్టీ 100 ఇండెక్స్ పరిధితో పోలిస్తే నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 ఇండెక్స్లో ఎక్కువ రకాల రంగాలు అందుబాటులో ఉన్నాయి. గత రికార్డులను చూసినా లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే వేగంగా వృద్ధి చెందాయి. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య లార్జ్–క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి 74 శాతంగా ఉంటే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీల ఆదాయం దాదాపు 82 శాతం పెరిగింది. అలాగే లాభాల వృద్ధి విషయానికి వస్తే.. ఇదే కాలంలో లార్జ్–క్యాప్లో 211 శాతం వృద్ధి నమోదైతే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలు ఏకంగా 256 శాతం వృద్ధిని సాధించాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలోనూ వీటి హవా పెరిగింది. ఈ విభాగంలో ఉండే మిడ్–క్యాప్ కంపెనీల సంఖ్య 2021లో 63 ఉండగా, 2026 నాటికి 93కి చేరింది. అలాగే స్మాల్–క్యాప్ కంపెనీలు 5 నుంచి 25కి పెరిగాయి. గత 15 ఏళ్ల కాలంలో చూసుకుంటే, చాలా సందర్భాల్లో లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే ఇన్వెస్టర్లకు మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లలో పెట్టుబడి పెట్టడానికి ’స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్’ (IFS) మెరుగైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్లాగే సెబీ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. కాకపోతే పోర్ట్ఫోలియో రూపకల్పనలో వీటికి పీఎంఎస్ తరహాలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఈ ఫండ్స్ పరిధిలోని ’ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్’ వ్యూహం పెద్ద కంపెనీలను పక్కన పెట్టి, పూర్తిగా మిడ్, స్మాల్–క్యాప్ షేర్లపైనే దృష్టి పెడుతుంది. అందుకే ఇది ఇన్వెస్టర్లకు మెరుగైన సాధనంగా ఉంటుంది.ప్రధానంగా నాలుగు సూత్రాలు.. ఇది ప్రధానంగా నాలుగు సూత్రాలపై నడుస్తుంది. కంపెనీల అకౌంటింగ్ పరిశీలన (ఫోరెన్సిక్స్), సముచిత ప్రైసింగ్, ఒకే ఇన్వెస్ట్మెంట్ శైలికి పరిమితం కాకపోవడం, బలమైన బిజినెస్ మోడల్స్ (కార్పొరేట్ గవర్నెన్స్) అనేవి ఈ సూత్రాలు. కేవలం వేగంగా పెరిగే కంపెనీలనే కాకుండా విశ్వసనీయమైన ప్రమాణాలు, వ్యాపారాన్ని విస్తరించే చాన్స్, స్థిరమైన సంపాదన ఉన్న కంపెనీలనే ఎంచుకుంటారు. అలాగే వాల్యూ ఇన్వెస్టింగ్ లేదా గ్రోత్ ఇన్వెస్టింగ్ అనే ఒకే రకమైన శైలికి కట్టుబడి ఉండకుండా, బిజినెస్ క్వాలిటీ, మీడియం–టర్మ్ లాభాల అవకాశాలను బట్టి పోర్ట్ఫోలియోను మారుస్తుంటారు. ఇక్కడ అధిక లాభాలు సాధించడానికి ఫ్లెక్సిబిలిటీ, బలమైన నమ్మకమే కారణం. ఈ ఫండ్ ఒకే రంగానికి పరిమితం కాదు. ఇండెక్స్ రూల్స్ తో సంబంధం లేకుండా, ఎక్కడ మంచి అవకాశాలు ఉంటే అక్కడికి నిధులను మళ్లిస్తుంది. ఈ వ్యూహం ద్వారా దాదాపు 35 నుంచి 45 షేర్లతో కూడిన నిర్దిష్ట పోర్ట్ఫోలియోను నిర్వహిస్తారు. వీటిలో ప్రతి షేరును క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే ఎంపిక చేస్తారు. డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందే సదరు కంపెనీల అకౌంటింగ్ నాణ్యత, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు, మేనేజ్మెంట్ ట్రాక్ రికార్డ్ను పూర్తిగా స్క్రీన్ చేయడం ఇక్కడ మరో కీలకమైన అంశం. ఇన్ఫర్మేషన్ గ్యాప్స్, బిజినెస్ రిసు్కలు ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లో ఈ ముందస్తు పరిశీలన చాలా ముఖ్యం. ఇది కేవలం వ్యాల్యుయేషన్పరంగానే కాకుండా, అదనపు రక్షణ పొరలా పనిచేస్తూ రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరుస్తుంది. ఈ వ్యూహంలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుంచి 750 ర్యాంకుల మధ్య ఉన్న కంపెనీలకే 65 శాతానికి పైగా నిధులను కేటాయిస్తారు. దీనివల్ల ఫోకస్ అంతా మిడ్, స్మాల్–క్యాప్ పరిధిలోనే ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ల మధ్య సమతుల్యత ఉండేలా ఎప్పటికప్పుడు పెట్టుబడుల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. నిర్దిష్టంగా చెప్పాలంటే .. ప్రస్తుత మార్కెట్ వాతావరణం ఎస్ఐఎఫ్ పెట్టుబడులకు రెండు విధాలుగా సానుకూలంగా ఉంటోంది. ఒకటి వ్యాల్యుయేషన్లు అందుబాటులోకి రావడం కాగా రెండోది వైవిధ్యమైన పెట్టుబడి అవకాశాలు ఉండడం. క్రమశిక్షణ, ఫ్లెక్సిబిలిటీ, స్పష్టమైన వ్యూహంతో ఈ మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొనే ఫండ్స్ మాత్రమే లాంగ్–టర్మ్లో ఇన్వెస్టర్లకు స్థిరమైన, అల్ఫా లాభాలను అందించగలవు.ఇదే సరైన సమయం ఎందుకు అంటే మిడ్, స్మాల్–క్యాప్ (ఎస్ఎంఐడీ) షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం అనడానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. మార్కెట్లో వచ్చే కరెక్షన్లనేవి అంచనాలను, వ్యాల్యుయేషన్లను మళ్లీ దారికి తెస్తాయి. ఇటీవల మార్కెట్ కరెక్షన్ల వల్ల దాదాపు 75 శాతం మిడ్–క్యాప్ షేర్లు, అలాగే 82 శాతం స్మాల్–క్యాప్ షేర్లు వాటి 52 వారాల గరిష్టాల నుంచి 20 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇలా మార్కెట్ పడటం అనేది కేవలం తాత్కాలిక ఒడిదొడుకు మాత్రమే కాదు, మార్కెట్ జోరులో ఓవర్ ప్రైస్ అయిన షేర్ల విలువను ఇది తగ్గిస్తుంది. స్వల్పకాలిక సెంటిమెంట్ను పక్కన పెట్టి ఆలోచించే ఇన్వెస్టర్లకు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది మంచి చాన్స్. వ్యాల్యుయేషన్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సెపె్టంబర్ 2024లో ఎస్ఎంఐడీ వ్యాల్యుయేషన్లు దాదాపు 39 రెట్లు పెరిగి పీక్ స్టేజ్కి చేరాయి. ఆ తర్వాత వచి్చన కరెక్షన్ల వల్ల ఇప్పుడు 25–30 రెట్ల మధ్యకు దిగివచ్చాయి. ఇదే గత ఐదేళ్ల యావరేజ్ కంటే తక్కువ స్థాయి. అంటే, వేగంగా ఎదుగుతున్న వ్యాపారాలలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని మార్కెట్ ఇప్పుడు చారిత్రక సగటు ధరలకే అందిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈక్విటీల్లో రిటర్న్స్ అనేవి కంపెనీ సంపాదనతో పాటు, మనం ఎంత వ్యాల్యుయేషన్ వద్ద ఇన్వెస్ట్ చేశామనే దానిపై కూడా ఆధారపడి ఉంటాయి. మార్కెట్ పెరిగినా, తగ్గినా లాభపడేలా (లాంగ్, షార్ట్ పొజిషన్ల కలయిక ద్వారా) మిడ్, స్మాల్–క్యాప్ అవకాశాలను అందిపుచ్చుకునే వ్యూహాలు ఇప్పుడు కీలకంగా మారుతాయి. అలాంటి వాటిలో ’అల్టీవా ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్ ఫండ్’ ఒకటి. ఈ వ్యూహం ప్రకారం సాధారణంగా 65 శాతం నుంచి 100 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్–క్యాప్ రంగంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అవసరాన్ని బట్టి డెరివేటివ్స్, షార్ట్ పొజిషన్ల ద్వారా రిస్క్ ను తగ్గిస్తూ, రిటర్న్స్ పెంచుకునే వీలుంటుంది.త్రిదీప్ భట్టాచార్య, ప్రెసిడెంట్–సీఐఓ (ఈక్విటీస్) ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ -
దేశంలోకి భారీగా విదేశీ కరెన్సీ తెచ్చేలా బిగ్ ప్లాన్!
దేశంలో విదేశీ మారక నిల్వలను (ఫారెక్స్ రిజర్వ్స్) మరింత బలోపేతం చేయడం, రూపాయి విలువ స్థిరత్వానికి ఊతమివ్వడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ కీలక అడుగులు వేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా విదేశీ కరెన్సీ డిపాజిట్లను భారీగా ఆకర్షించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ పురోగతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులు హాజరుకానున్నారు.మూడు ప్రధానాంశాలపైనే ఫోకస్ఈ కీలక సమావేశంలో ముఖ్యంగా ప్రవాస భారతీయులు, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి నిధులను రాబట్టేందుకు మూడు మార్గాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు ప్రాథమిక సమాచారం.ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంక్) డిపాజిట్లను పెంచడం ద్వారా విదేశీ కరెన్సీని నేరుగా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం.అంతర్జాతీయ మార్కెట్లలో విదేశీ కరెన్సీ బాండ్లను జారీ చేయడం ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి తక్కువ వడ్డీకే నిధులను సమీకరించడం.భారతీయ కార్పొరేట్లు, బ్యాంకులు విదేశాల నుంచి వాణిజ్య రుణాల రూపంలో నిధులను సేకరించే ప్రక్రియను మరింత సరళతరం చేయడం.గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, కరెన్సీ హెచ్చుతగ్గుల నేపథ్యంలో.. దేశీయంగా ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడం భారతదేశ ఆర్థిక భద్రతకు కీలకం. ఈ డ్రైవ్ విజయవంతమైతే బ్యాంకుల వద్ద లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పెరగడంతోపాటు విదేశీ చెల్లింపుల సమతుల్యత మెరుగవుతుంది.బ్యాంకర్లకు దిశానిర్దేశంఈ సమీక్షలో భాగంగా విదేశీ కరెన్సీని ఆకర్షించడంలో బ్యాంకులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వడ్డీ రేట్ల పోటీతత్వం, ప్రవాస భారతీయులను చేరవేయడానికి డిజిటల్ ఛానెళ్లను ఎలా ఉపయోగించుకుంటున్నారనే అంశాలపై ఆర్థిక మంత్రి పర్యవేక్షించనున్నారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మరింత చొరవ చూపాలని ఈ సమావేశం ద్వారా ఆర్థిక శాఖ స్పష్టమైన దిశానిర్దేశం చేయనుంది.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
ఉద్యోగం మారినా అంతా ఆటోమేటిక్గా..
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కోట్లాది మంది వేతన జీవులకు ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగం మారిన ప్రతిసారీ పాత పీఎఫ్ ఖాతాలోని డబ్బును కొత్త ఖాతాలోకి బదిలీ చేసుకోవడానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ ప్రవేశపెడుతున్న ‘సెంట్రలైజ్డ్ డేటాబేస్ మైగ్రేషన్’ ప్రక్రియ ద్వారా ఈ బదిలీ అంతా స్వయంచాలకంగా (ఆటోమేటిక్గా) జరిగిపోతుంది. ఈ సాంకేతిక మార్పు ద్వారా తరచూ ఉద్యోగాలు మారే కార్పొరేట్, ఐటీ రంగాల ఉద్యోగులకు ఇది ఎంతో మేలు జరగనుంది.ఆధార్ లింకింగ్ ఉంటే చాలు.. క్లియర్!ఈ ఆటోమేటిక్ బదిలీ సదుపాయం సజావుగా సాగాలంటే పీఎఫ్ చందాదారులు ఒక ముఖ్యమైన నిబంధనను పాటించాల్సి ఉంటుంది. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)కు ఆధార్ అనుసంధానమై ఉండటం కీలకం.యూఏఎన్-ఆధార్ లింకింగ్ పూర్తయిన సభ్యులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారినప్పుడు పాత కంపెనీ పీఎఫ్ ఖాతాలోని నిధులు, సర్వీస్ హిస్టరీ ఎలాంటి మాన్యువల్ అభ్యర్థనలు లేకుండానే కొత్త ఖాతాలోకి బదిలీ చేయబడతాయి.గతంలో పాత పీఎఫ్ డబ్బులు బదిలీ అవ్వాలంటే ఆన్లైన్లో ‘ఫారమ్ 13’ సబ్మిట్ చేయడం, పాత లేదా కొత్త యజమానుల డిజిటల్ సంతకం కోసం వేచి చూడటం వంటి ఇబ్బందులు ఉండేవి. ఇకపై ఆ పాత పద్ధతులకు స్వస్తి పలకవచ్చు.ఖాతాలు సకాలంలో విలీనం కావడం వల్ల ఉద్యోగి పీఎఫ్ సొమ్ముపై వచ్చే వడ్డీకి ఎలాంటి బ్రేకులు పడకుండా నిరంతరాయంగా కొనసాగుతుంది.ఉద్యోగులు తెలుసుకోవలసిన అంశాలుమీ పీఎఫ్ మెంబర్ పోర్టల్లోకి లాగిన్ అయి ఆధార్ స్టేటస్ వెరిఫైడ్ అని ఉందో లేదో చూసుకోవాలి.పీఎఫ్ రికార్డుల్లో ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలు.. ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో పూర్తిగా సరిపోలాలి.మీ ప్రస్తుత బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ పీఎఫ్ పోర్టల్లో యాక్టివ్గా అప్డేట్ అయి ఉండాలి.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
ఆస్ట్రేలియా వీసా ఫీజు 25 శాతం పెంపు
ఉన్నత చదువులు చదవాలన్నా, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలన్నా నేడు భారతీయుల మొదటి ఛాయిస్ల్లో ఆస్ట్రేలియా ఒకటి. అయితే, తాజాగా ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లాలనుకునే లక్షలాది మంది భారతీయుల ఆశలపై ఆర్థిక భారాన్ని మోపింది. ముందస్తు సంప్రదింపులు లేకుండానే అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక కార్మికుల వీసా దరఖాస్తు రుసుములను 25 శాతం వరకు పెంచుతూ ఆస్ట్రేలియా హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గత రెండేళ్లుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఈ వీసా ఫీజు తాజా పెంపుతో అంతర్జాతీయంగా ఆస్ట్రేలియాను అత్యంత ఖరీదైన గమ్యస్థానంగా మార్చేసింది. నేషనల్ సెక్యూరిటీ బడ్జెట్ ఖర్చులను భర్తీ చేయడానికే ఈ పెంపు అని అక్కడి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇది అంతర్జాతీయ విద్యార్థులను ఒక ఆదాయ వనరులాగా వాడుకోవడమేనని నిపుణులు మండిపడుతున్నారు.కొత్తగా మారిన వీసా ధరల స్వరూపం (ఆస్ట్రేలియన్ డాలర్లలో)వీసా రకంపాత ఫీజుసవరించిన కొత్త ఫీజుపెంపు శాతంస్టూడెంట్ వీసా (సబ్క్లాస్ 500) (యూనివర్సిటీ, వొకేషనల్)2,0002,500 (సుమారు రూ.1.38 లక్షలు)25%తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసా (సబ్క్లాస్ 485) (వర్క్ పర్మిట్)4,6005,750 (సుమారు రూ.3.17 లక్షలు)25%ఇండిపెండెంట్ ELICOS (ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సులు)2,0002,0502.5%గమనిక: స్టూడెంట్ వీసా ఫీజులు 2024 జులైకి ముందు కేవలం 710 డాలర్లు మాత్రమే ఉండేవి. రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఇది 710 నుంచి 1600, ఆపై 2000 డాలర్లు... ఇప్పుడు ఏకంగా 2,500 డాలర్లకు చేరింది. అంటే దాదాపు 252 శాతం పెంపు నమోదైంది!భారతీయులపై పడే ప్రభావం ఏమిటి?1. రీఫండ్ లేని భారీ రుసుము: ఆస్ట్రేలియా వీసా విధానంలో అత్యంత కఠినమైన నిబంధన ఏంటంటే.. వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైనా ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. లక్షల రూపాయలు పోసి దరఖాస్తు చేసుకున్న తర్వాత వీసా రాకపోతే ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు పెద్ద రిస్క్.2. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పెంపు నుంచి ఏషియన్(ఆగ్నేయాసియా దేశాల కూటమి) దేశాలకు, పసిఫిక్ దీవుల విద్యార్థులకు మినహాయింపు ఇచ్చి పాత ఫీజులనే వర్తింపజేసింది. కానీ, ఆస్ట్రేలియాకు రెండో అతిపెద్ద విద్యార్థుల వనరుగా ఉన్న భారతదేశానికి ఎలాంటి మినహాయింపు లభించకపోవడం గమనార్హం.3. ఉపాధి వీసాలూ ఖరీదే: చదువు పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియాలోనే ఉండి పని చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే ‘తాత్కాలిక గ్రాడ్యుయేట్ వర్క్ వీసా’ ఫీజు ఏకంగా 5,750 డాలర్లకు పెరగడం వల్ల అక్కడ స్థిరపడాలనుకునే యువతపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడనుంది.అంతర్జాతీయ విద్యారంగం స్పందనఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై ‘యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా’, భారతీయ విద్యా ప్రతినిధుల సంఘం (ఏఏఈఆర్ఐ) అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించాలనుకుంటూ ప్రవేశ రుసుములను ఇంతలా పెంచడం ఆస్ట్రేలియా అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీస్తుందని హెచ్చరించాయి. వీసా ఫీజును ఒకేసారి కాకుండా అప్రూవల్ అయ్యాక రెండో విడతగా తీసుకునే ‘టూ-స్టేజ్ పేమెంట్’ విధానాన్ని తేవాలని భారతీయ ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
నిప్పుల కొలిమిలో నగరాలు
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల తీవ్రతకు నగరాలు ఎలా నిప్పుల కొలిమిలా మారుతున్నాయో తెలియజేస్తూ బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా విశ్లేషణాత్మక అధ్యయనాన్ని విడుదల చేశారు. ‘సస్టైనబుల్ సిటీస్ అండ్ సొసైటీ’ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. విపరీతమైన వేడి కారణంగా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నగరాలు ప్రమాదంలో ఉన్న నాలుగు దేశాల్లో భారతదేశం ముందుంది. తర్వాత పాకిస్థాన్, నైజీరియా, ఘనా దేశాలు ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 205 ప్రధాన నగరాలను పరిశోధకులు విశ్లేషించగా ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి. తీవ్ర ఉష్ణోగ్రతల ముప్పు పొంచి ఉన్న నగరాల్లో 95 శాతానికి పైగా దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోనే ఉన్నాయి.ప్రపంచంలోనే రెండో స్థానంలో అహ్మదాబాద్ఈ అంతర్జాతీయ విశ్లేషణలో ఇరాక్కు చెందిన అల్ బస్రా నగరం ప్రపంచంలోనే అత్యధిక హీట్-రిస్క్ (0.83 స్కోరు) కలిగిన నగరంగా మొదటి స్థానంలో నిలవగా గుజరాత్లోని అహ్మదాబాద్ (0.79 స్కోరు) ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రమాదకర నగరంగా నమోదైంది. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన మరో రెండు నగరాలు టాప్-10లో చోటు సంపాదించడం గమనార్హం. మహారాష్ట్రలోని నాగ్పూర్ 4వ స్థానంలో, తమిళనాడులోని మదురై 7వ స్థానంలో నిలిచాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ముప్పు ఉన్న టాప్-10 నగరాలుర్యాంకునగరం / దేశం1అల్ బస్రా (ఇరాక్)2అహ్మదాబాద్ (భారత్)3బమాకో (మాలి)4నాగ్పూర్ (భారత్)5క్యూజన్ సిటీ (ఫిలిప్పీన్స్)6బాగ్దాద్ (ఇరాక్)7మదురై (భారత్)8ఫైసలాబాద్ (పాకిస్థాన్)9లాగోస్ (నైజీరియా)10హైదరాబాద్ (పాకిస్థాన్)కేవలం ఉష్ణోగ్రతలే కారణం కాదు!ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పరిశోధకురాలు నెత్మి జయరత్నే కరియవాసమ్, ప్రొఫెసర్ రాధికా ఖోస్లా, ప్రొఫెసర్ జీసస్ లిజానా నేతృత్వంలో ఈ అధ్యయనం సాగింది. కేవలం థర్మామీటర్లో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు మాత్రమే ఒక నగరాన్ని ప్రమాదంలోకి నెట్టవని ఈ పరిశోధన స్పష్టం చేసింది. వారి పరిశోధన ప్రకారం.. సూర్యుడి వేడి, వేడి గాలుల ప్రభావం, నగరంలో నివసించే ప్రజల వయసు (వృద్ధులు, పిల్లలు), ఆర్థిక స్థితిగతులు, ఆరుబయట పనిచేసే కూలీల సంఖ్య, నగరాల్లో ఏసీలు, కూలర్లు వంటి మౌలిక వసతులు అందరికీ అందుబాటులో లేకపోవడం, చెట్ల విస్తీర్ణం వేగంగా క్షీణించడం.. వంటివి కారణాలుగా ఉన్నాయి.జెడ్డా, బ్యాంకాక్ వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ తట్టుకునే ఆర్థిక రక్షణ వలయాలు, మౌలిక వసతులు మెరుగ్గా ఉండటం వల్ల వాటి రిస్క్ స్కోరు తక్కువగా ఉంది. కానీ భారతీయ నగరాలలో అధిక జనాభా, తక్కువ పచ్చదనం, తక్కువ ఆదాయ వర్గాలు ఎక్కువగా ఉండటం వల్ల ముప్పు తీవ్రత పెరిగింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
93.95 కోట్లు దాటిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లు
భారతదేశ ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ (ఏబీడీఎం) ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ల్లో ఒకటిగా అవతరించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 93.95 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు (ఆబా) జనరేట్ అయ్యాయని, వీటికి అనుబంధంగా 105 కోట్ల ఆరోగ్య రికార్డులను డిజిటల్గా లింక్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా అధ్యక్షతన జరిగిన మిషన్ స్టీరింగ్ గ్రూప్ మూడో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ సందర్భంగా దేశంలో డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన భవిష్యత్తు కార్యాచరణ (రోడ్మ్యాప్)పై చర్చించారు.రికార్డు స్థాయిలో డిజిటల్ నమోదుదేశంలో వైద్య సేవలను పారదర్శకంగా, వేగవంతంగా మార్చే ప్రక్రియలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ రిజిస్ట్రీల్లో భారీగా నమోదు ప్రక్రియ సాగుతోంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం..ఆరోగ్య ఖాతాలు (ఆబా) 93.95 కోట్లు దాటాయి.లింక్ అయిన హెల్త్ రికార్డులు 105 కోట్లకు పైగా ఉన్నాయి.నమోదైన ఆరోగ్య సౌకర్యాలు (హాస్పిటల్స్/క్లినిక్స్) 5.33 లక్షలు.నమోదైన ఆరోగ్య సంరక్షణ నిపుణులు (డాక్టర్లు/నర్స్ లు) 9.85 లక్షల మంది.2.72 లక్షల ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏబీడీఎం సాఫ్ట్వేర్ సాంకేతికతను వాడుతున్నాయి.ఆసుపత్రుల్లో ఓపీడీ కోసం క్యూలైన్ బాధలు తప్పించే ‘స్కాన్ అండ్ రిజిస్టర్’ విధానం ద్వారా దాదాపు 24 కోట్ల టోకెన్లను జనరేట్ చేశారు.డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్రనాణ్యమైన ఆరోగ్య సంరక్షణను సామాన్యుడికి సైతం చేరవేయడంలో, పౌరుల ఆరోగ్య రికార్డులను అత్యంత సురక్షితంగా భద్రపరచడంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవాత్మక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి జె.పి.నడ్డా స్పష్టం చేశారు. ‘సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తోంది. ప్రతి పౌరుడికి సులభంగా, పారదర్శకంగా వైద్య సేవలు అందడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది’ అని నడ్డా చెప్పారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
భారత్ జీడీపీకి ఇంధన సెగ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 6.6 శాతానికి తగ్గించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధనాల ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటం, ఆదాయాలపై ప్రభావం చూపనుండటమే ఇందుకు కారణం. ఇది 6.9 శాతంగా ఉండొచ్చని ఏడీబీ ఏప్రిల్లో అంచనా వేసింది. వృద్ధి మందగించినా కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది.గత అంచనాలకు అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3 శాతం మేర విస్తరించే అవకాశం ఉందని వివరించింది. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు విధానపరమైన చర్యలు, ఇంధనాలపై ట్యాక్స్ తగ్గించడం, సర్వీసుల ఎగుమతులు పటిష్టంగా ఉండటం తదితర అంశాలు మెరుగైన వృద్ధికి దోహదపడొచ్చని ఏషియన్ డెవలప్మెంట్ ఔట్లుక్ (ఏడీవో) జూలై నివేదికలో ఏడీబీ పేర్కొంది.గ్లోబల్గా పరిస్థితులు మెరుగుపడటం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు మరింతగా పెరగడం వల్ల 2027 ఆర్థిక సంవత్సరంలో అధిక వృద్ధికి ఊతం లభిస్తుందని వివరించింది. భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, వ్యవసాయంపై ప్రతికూల వాతావరణ ప్రభావాల్లాంటి రిసు్కలు పొంచి ఉన్నాయని ఏడీబీ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కూడా ఇప్పటికే భారత్ వృద్ధి అంచనాలను తగ్గించాయి. ఐఎంఎఫ్ 6.5 శాతం నుంచి 6.4 శాతానికి, రిజర్వ్ బ్యాంక్ 6.9 శాతం నుంచి 6.6 శాతానికి కుదించాయి. ద్రవ్యోల్బణం అప్.. భగ్గుమంటున్న ఇంధన ధరలతో రవాణా, ఆహార వ్యయాలు పెరిగిపోవడమనేది ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తోందని ఏడీబీ తెలిపింది. దీనితో 2026–27లో ఇది గతంలో అంచనా వేసిన 4.5 శాతం కన్నా అధికంగా 5.2 శాతానికి ఎగియొచ్చని వివరించింది. అయితే, క్రమంగా ఇంధనం, ఆహార ధరలు సాధారణ స్థితికి తిరిగొచ్చే అవకాశం ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం ద్రవ్యోల్బణం గత అంచనాలకు తగ్గట్లు 4 శాతం స్థాయిలోనే కొనసాగవచ్చని తెలిపింది. -
ఆర్బీఐ కొత్త సర్వేలు.. ఎందుకో తెలుసా?
ద్రవ్య విధాన రూపకల్పనకు కీలకమైన సమాచారాన్ని అందించే లక్ష్యంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మూడు సర్వేలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ద్రవ్యోల్బణ అంచనాలు, గ్రామీణ, పట్టణ ప్రజల ఆర్థిక పరిస్థితిపై అభిప్రాయాలను తెలుసుకోవడం ఈ సర్వేల ప్రధాన ఉద్దేశ్యం. భవిష్యత్ ద్రవ్య విధాన నిర్ణయాలు తీసుకునే సమయంలో.. ఈ సర్వేల ద్వారా లభించే సమాచారం ఆర్బీఐకి చాలా ఉపయోగపడనుంది.కుటుంబాల ద్రవ్యోల్బణ అంచనాల సర్వేఆర్బీఐ ప్రారంభించిన సర్వేలలో ఒకటి 'కుటుంబాల ద్రవ్యోల్బణ అంచనాల సర్వే'. ఈ సర్వే ద్వారా ప్రజలు భవిష్యత్లో ధరల పెరుగుదలను ఎలా అంచనా వేస్తున్నారో తెలుసుకోనున్నారు. ఈ సర్వేను దేశంలోని 19 నగరాల్లో నిర్వహించనున్నారు. ప్రజలు తమ రోజువారీ వినియోగ అలవాట్లు, ఖర్చుల ఆధారంగా వివిధ వస్తువులు, సేవల ధరల్లో మార్పులు ఎలా ఉండవచ్చని భావిస్తున్నారో ఇందులో నమోదు చేస్తారు.రాబోయే మూడు నెలల్లో, అలాగే ఒక సంవత్సరం కాలంలో సాధారణ ధరల పరిస్థితి ఎలా ఉండొచ్చనే అంశంపై కుటుంబాల అభిప్రాయాలను సేకరిస్తారు. ఆహారం, ఇతర వినియోగ వస్తువులు వంటి నిర్దిష్ట ఉత్పత్తుల ధరలపై కూడా ప్రజల అంచనాలను తెలుసుకుంటారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణ స్థాయి, వచ్చే మూడు నెలలు.. ఏడాదిలో ఉండే అవకాశం ఉన్న ద్రవ్యోల్బణంపై పరిమాణాత్మక వివరాలను కూడా సేకరించనున్నారు.రూరల్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేఆర్బీఐ మరో సర్వే పేరు 'రూరల్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే'. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ప్రజల ఆర్థిక పరిస్థితిపై ఉన్న అభిప్రాయాలను తెలుసుకోవడం ఈ సర్వే లక్ష్యం. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించనున్నారు. ఇందులో ప్రజల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, భవిష్యత్పై వారి అంచనాలను నమోదు చేస్తారు. ప్రధానంగా దేశ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు, ధరల స్థాయి, కుటుంబ ఆదాయం, ఖర్చులపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ ధోరణులు ఎలా మారుతున్నాయో తెలుసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.అర్బన్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేఅర్బన్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేను కూడా ఆర్బీఐ ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు దేశ ఆర్థిక పరిస్థితిని ఎలా చూస్తున్నారు? భవిష్యత్పై వారి అంచనాలు ఏమిటి? అనే అంశాలను తెలుసుకోవడం దీని ఉద్దేశ్యం.ఈ సర్వేలో ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు, ధరల స్థాయి, కుటుంబ ఆదాయం, ఖర్చులపై పట్టణ కుటుంబాల అభిప్రాయాలను సేకరిస్తారు. ద్రవ్యోల్బణ అంచనాల సర్వే మాదిరిగానే ఈ సర్వేను కూడా 19 నగరాల్లో నిర్వహించనున్నారు. ఇందులో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, ముంబై, తిరువనంతపురం వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి.దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, ప్రజల ఖర్చు ధోరణులు, వినియోగదారుల విశ్వాసం వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. వడ్డీ రేట్లను నిర్ణయించడం, ద్రవ్య సరఫరాను నియంత్రించడం వంటి కీలక నిర్ణయాలకు ఆర్బీఐ ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ప్రజలు ధరల పెరుగుదలను ఎలా అంచనా వేస్తున్నారు? వారి ఆదాయం, ఖర్చుల పరిస్థితి ఎలా ఉంది? ఆర్థిక వ్యవస్థపై వారి నమ్మకం ఎంతవరకు ఉంది? వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన రావడం ద్వారా ఆర్బీఐ మరింత సమర్థవంతమైన ద్రవ్య విధానాలను రూపొందించగలదు. -
ఫోర్స్డ్ లేబర్ విధానంపై యూఎస్ ద్వంద్వ నీతి
ప్రపంచ సరఫరా గొలుసు (గ్లోబల్ సప్లై చైన్) నుంచి బలవంతపు శ్రమను (ఫోర్స్డ్ లేబర్) నిర్మూలించాలనే నెపంతో అమెరికా ప్రతిపాదిస్తున్న నూతన సుంకాల విధానంలోని లోపాలను, ద్వంద్వ ప్రమాణాలను భారతదేశం అంతర్జాతీయ వేదికపై బట్టబయలు చేసింది. తమ దేశీయ అవసరాల కోసం ఏకంగా 1,600 వస్తువులకు మినహాయింపులు ఇచ్చుకుంటూ ఇతర దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించాలనుకోవడం అమెరికా అస్థిర వైఖరికి అద్దం పడుతోందని భారత్ ఘాటుగా విమర్శించింది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) ప్రతిపాదించిన సుంకాలపై జరిగిన బహిరంగ విచారణలో భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ బ్రిజ్ మోహన్ మిశ్రా యూఎస్టీఆర్ ప్యానెల్ ముందు కీలక సాక్ష్యాలుంచారు.అమెరికా విధానం హేతుబద్ధం కాదుఅమెరికా తన దేశంలో ఉత్పత్తి చేయలేని 1,600 వస్తువులను బలవంతపు కార్మికుల(ఫోర్స్డ్ లేబర్) పరిశీలన పరిధి నుంచి ఏకపక్షంగా మినహాయించుకుందని జాయింట్ సెక్రటరీ బ్రిజ్ మోహన్ మిశ్రా ఎత్తి చూపారు. ‘యూఎస్టీఆర్ ప్రకటించిన ఈ మినహాయింపులు అంతర్జాతీయ సరఫరా గొలుసులో బలవంతపు శ్రమ ప్రభావాన్ని పరిష్కరించాలనే అమెరికా విధాన హేతుబద్ధతను పూర్తిగా బలహీనపరుస్తున్నాయి. అంతేకాకుండా, లూప్హోల్స్ (సర్కమ్వెన్షన్ పద్ధతులు) ద్వారా జరిగే దుష్ప్రభావాన్ని నివారించడంలో ఈ విధానం విఫలమైంది’ అని బ్రిజ్ మోహన్ మిశ్రా తెలిపారు.టెక్స్టైల్ రంగంలో అమెరికా అనుసరిస్తున్న తీరును కూడా ఆయన తప్పుపట్టారు. అమెరికాకు చెందిన పత్తి, ఇతర వస్త్ర ముడిసరుకులను ఉపయోగించి తయారుచేసే వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులపై యూఎస్ సుంకం రేట్లను తగ్గించడాన్ని ఆయన హైలైట్ చేశారు. ఇది విదేశీ తయారీదారులు తమ నిర్ణయాలను మార్చుకునేలా బలవంతం చేసే ఏకపక్ష చర్యే తప్ప బలవంతపు శ్రమ సమస్యకు నిజమైన పరిష్కారం కాదని స్పష్టం చేశారు.ఏవైనా ఆందోళనలు ఉంటే వాటిని 'సెక్షన్ 301' దర్యాప్తు వంటి ఏకపక్ష పద్ధతుల్లో కాకుండా, భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య చర్చల చట్రంలోనే పరిష్కరించుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని మిశ్రా పునరుద్ఘాటించారు.అమెరికన్ వినియోగదారులకే నష్టం60 ఆర్థిక వ్యవస్థల నుంచి వచ్చే దిగుమతులపై 10 నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలనే అమెరికా ప్రతిపాదనను భారత పరిశ్రమల సమాఖ్యలు తీవ్రంగా వ్యతిరేకించాయి. యూఎస్టీఆర్ ప్యానెల్ ముందు ఫిక్కీ ప్రతినిధి పూర్ణిమా షెనాయ్ సాక్ష్యమిస్తూ ఈ అదనపు సుంకాల భారం అంతిమంగా అమెరికా పైనే పడుతుందని హెచ్చరించారు. ‘ఈ నిర్ణయం వల్ల భారతీయ ఎగుమతిదారులతోపాటు అమెరికా తయారీదారులు, దిగుమతిదారులు, రిటైలర్లు, చివరికి అమెరికన్ వినియోగదారులకు కూడా ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఎన్నో అమెరికా పరిశ్రమలు భారతీయ సరఫరాదారుల నాణ్యత, విశ్వసనీయత, అంతర్జాతీయ ప్రమాణాల సమ్మతిని నమ్మి దీర్ఘకాలిక సంబంధాలను కలిగి ఉన్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
భారత్ వృద్ధి అంచనాలు కట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కుదించింది. ఈ ఏడాది ఏప్రిల్లో అంచనా వేసిన 6.5 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోందని, ప్రైవేట్ వినియోగం.. సర్వీసులు ఇందుకు దన్నుగా ఉంటున్నాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అయితే, సానుకూలాంశాలు ఉన్నప్పటికీ ఇంధన ధరలు అధిక స్థాయిలో ఉండటమనేది ప్రతికూలంగా పరిణమించవచ్చని తెలిపింది. 2027లో ఇంధన ధరల షాక్ ప్రభావం నెమ్మదించి ఎకానమీ పటిష్టం కాగలదని ఐఎంఎఫ్ తెలిపింది. మధ్యకాలికంగా వృద్ధి సుమారు 6.5% ఉండొచ్చని వివరించింది. తాజా నివేదిక ప్రకారం 2028 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.7 శాతానికి చేరనుంది. మరోవైపు అంతర్జాతీయంగా వృద్ధి 2026లో 3కి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ తెలిపింది. -
52 పైసలు పతనమైన రూపాయి
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ 52 పైసలు క్షీణించి 95.48 వద్ద ముగిసింది. అమెరికా ఇరాన్పై తాజా వైమానిక దాడులు జరపడం, దీనికి ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లపై దాడులు చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనతో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 6 శాతానికి పైగా ఎగిశాయి. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత పెట్టుబడిగా భావించే అమెరికా డాలర్కు డిమాండ్ పెరగడంతో డాలర్ ఇండెక్స్ 101.13 స్థాయికి చేరుకుంది. మరోవైపు దేశీయ ఈక్విటీ సూచీలు రెండుశాతానికి పైగా క్షీణించింది. ఈ పరిణామాలన్నీ రూపాయి కోతకు కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 95.15 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించి, ఇంట్రాడేలో 94.98–95.61 శ్రేణిలో కదలాడింది. -
మార్కెట్లో ట్రంప్ కల్లోలం
ముంబై: ‘‘ఇరాన్తో అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఇక భవిష్యత్తులో ఎలాంటి చర్చలు ఉండవు. కేవలం సంప్రదింపులు మాత్రమే ఉంటాయి’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర 6.18 శాతం ఎగిసి బ్యారెల్కు 78.74 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గడిచిన మూడు నెలల్లోనే అతిపెద్ద పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 1,667 పాయింట్లు క్షీణించి 76,504 వద్ద ముగిసింది. నిఫ్టీ 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద స్థిరపడింది.ఒక్కరోజే ఇన్వెస్టర్ల మార్కెట్ సంపద రూ.8.96 లక్షల కోట్లు కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.471 లక్షల కోట్లకు దిగివచ్చింది. రోజంతా అమ్మకాల ఒత్తిడే... బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య సూచీలు నష్టాలతోనే ట్రేడింగ్ను ప్రారంభించాయి. రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. చివరి గంటలో విక్రయాలు మరింత ఉధృతమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,922 పాయింట్లు క్షీణించి 76,259 వద్ద, నిఫ్టీ 594 పాయింట్లు కోల్పోయి 23,805 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఆయా రంగాల ఇండెక్సులన్నీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సర్వీసెస్ సూచీ 3.21 శాతం క్షీణించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2.76%, ప్రైవేటు బ్యాంకులు 2.74%, ఎఫ్ఎంసీజీ 2.54 %, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.49 శాతం నష్టపోయాయి. మిడ్క్యాప్ సెలెక్ట్ 2.14 %, స్మాల్క్యాప్ సెలెక్ట్ 1.61 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలో అన్ని షేర్లూ డీలా సెన్సెక్స్ సూచీలో 30 షేర్లూ నష్టాలతో ముగిశాయి. ఇండిగో (–5.22%), మారుతీ (–4.11%), హెచ్యూఎల్ (–3.36%), బజాజ్ ఫైనాన్స్ (–3.07%), కోటక్ మహీంద్రా (– 2.93%) షేర్లు అత్యధికంగా పతనమయ్యాయి. మరోవైపు, అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ (– 2.27%), ఐసీఐసీఐ బ్యాంక్ (–2.36%), రిలయన్స్ (–2.35%), ఎల్అండ్టీ(–2.41%), ఎయిర్టెల్ (–1.82%) షేర్లు నష్టపోయాయి. ఆయిల్, ఏవియేషన్, పెయింట్స్ షేర్లు బేర్.. క్రూడ్ సెగతో మార్కెటింగ్ మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుందన్న అంచనాలతో హెచ్పీసీఎల్ (–4.60%), ఐఓసీ (–3.51%), బీపీసీఎల్ (–3.20%) షేర్లు బలహీనపడ్డాయి. ఏటీఎఫ్ ధరల ఆందోళనతో ఇండిగో (–5.02%), స్పైస్జెట్ (–3.04%) పడ్డాయి. షాలీమార్ పెయింట్స్ 4.44 శాతం, ఇండిగో పెయింట్స్ 4.18 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.49 శాతం, బర్జర్ పెయింట్స్ 2.26 శాతం క్షీణించాయి.బలహీనంగా అంతర్జాతీయ మార్కెట్లు భౌగోళిక, రాజకీయ ఉద్రికత్తల దెబ్బతో ప్రపంచ మార్కెట్లన్నీ ఎరుపెక్కాయి. కొరియా (–5.65%), జపాన్ (–2.15%), చైనా (–0.49%) నష్టపోయాయి. జర్మనీ (–1.96%), ఫ్రాన్స్ (–2.11%) పతనమయ్యాయి. బ్రిటన్ (–1.44%), అమెరికా స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.న్యాక్ ప్యాకేజింగ్ లిస్టింగ్ సక్సెస్ న్యాక్ ప్యాకేజింగ్ లిస్టింగ్ విజయవతమైంది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.170)తో పోలిస్తే 9.41% ప్రీమియంతో రూ.186 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. 13% లాభపడి రూ.192 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 7.47 శాతం లాభంతో రూ.183 వద్ద ముగిసింది.ఉదయం 9.15సెన్సెక్స్ 77,816 (–365)మధ్యాహ్నం 1.45సెన్సెక్స్ 77,559 (–622)మధ్యాహ్నం 3.30సెన్సెక్స్ 76,504 (–1,677) -
వికసిత్ భారత్ సాధ్యం కాదా? భారత అభివృద్ధిపై బిగ్ రివీల్
‘‘వికసిత్ భారత్ 2047’’ లక్ష్యాన్ని పెట్టుకుంది ఇండియా. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం ఊహిస్తున్న లేదా ఇప్పటివరకు నమోదవుతున్న ఆర్థిక వృద్ధి రేటు సరిపోదని ఆర్థికవేత్త, రచయిత, కాలమిస్టు సుర్జిత్ భల్లా చెప్పారు. అంటే, మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న వేగంతో ఎదిగితే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని, ఇంకా ఎక్కువ వృద్ధి అవసరమని అన్నారు. సుర్జిత్ భల్లా గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలిలో పార్ట్టైమ్ సభ్యుడిగా పనిచేశారు. అలాగే, అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలకు కార్యనిర్వాహక డైరెక్టర్గా సేవలు అందించారు.తాజాగా, సుర్జిత్ భల్లా ఓ ఇంటర్వ్యూలో.. భారత ఆర్థిక వ్యవస్థ, రూపాయి, చైనా, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, స్థూల దేశీయోత్పత్తి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి భారత్ చేపట్టాల్సిన సంస్కరణలపై మాట్లాడారు. ‘‘భారత్లో 1991 నుంచి ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి గత 30 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ సగటున 6% వృద్ధి సాధించింది. కానీ తలసరి వృద్ధి (ఒక్కో వ్యక్తికి సగటు ఆదాయం పెరిగిన వేగం) మాత్రం దాదాపు 4.8% మాత్రమే. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం 6% పెరిగినా, జనాభా కూడా పెరగడం వల్ల ఒక్కో వ్యక్తికి చేరే ఆదాయం అంత వేగంగా పెరగలేదు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరాలంటే దేశ జీడీపీ వృద్ధి మాత్రమే కాదు, ఒక్కో వ్యక్తి ఆదాయం పెరిగే వేగం కూడా చాలా ఎక్కువగా ఉండాలి’’ అని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యం అంటే అధిక ఆదాయ దేశం లేదా ధనిక దేశంగా మారడం. దీనికి ప్రపంచ బ్యాంకు అధికారిక నిర్వచనం ఇచ్చింది. అంటే 2025 నుంచి 2047 వరకూ డాలర్ విలువలో తలసరి వృద్ధి 9% కంటే ఎక్కువ ఉండాలి.చైనా ఇలా ఎదిగింది.. ‘‘దీనిపై నేను ఒక పరిశోధనా పత్రం కూడా రాశాను. ప్రపంచంలో జరిగిన పరిణామాలను పోల్చాను. 2008-09లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. 2011 నుంచి లేదా ఆ సంక్షోభం తర్వాత ప్రపంచ తలసరి వృద్ధి అన్ని దేశాల్లో గణనీయంగా తగ్గింది. అందుకే ఇప్పుడు లక్ష్యాన్ని చేరడం, 2011కు ముందు కంటే చాలా కష్టమైంది. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని చెబుతుంటాను. మనది ప్రపంచంతో అనుసంధానమైన దేశం. అందువల్ల ప్రపంచంలో జరిగే పరిణామాల ప్రభావం మనపై ఉంటుంది.ప్రతి దేశంపైనా అదే ప్రభావం ఉంటుంది. అందుకే ప్రపంచ పరిస్థితులను చూడాలి. మనం బాగా ఎదిగాం. చైనా అసాధారణంగా ఎదిగింది. మిగతా దేశాలు ఎదగని సమయంలో అది అలా చేసింది. మారకపు విలువ విధానం, ఇతర వ్యవస్థల ద్వారా పరిస్థితిని తమకు అనుకూలంగా మలిచింది. ఆ విజయానికి వారికి అభినందనలు. కానీ, ఇప్పుడు పారదర్శకత తప్ప మరో మార్గం లేదు. అందుకే వికసిత్ భారత్ లక్ష్యాన్ని తీసుకుంటే, గత 30 ఏళ్లుగా మన స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 6% ఉంది. ఇది గొప్ప విజయమే. కానీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరాలంటే ఇంకా మెరుగైన వృద్ధి అవసరం. 6% లేదా 6% కంటే కొద్దిగా ఎక్కువ సరిపోదు. 9% కంటే ఎక్కువ వృద్ధి ఉంటేనే ఆ లక్ష్యాన్ని చేరగలం’’ అని సుర్జిత్ భల్లా వివరించారు. -
ఆగస్టు 1 నుంచి ‘బైక్ టాక్సీలు’ చట్టబద్ధం!
మహారాష్ట్ర రవాణా విభాగంలో భారీ మార్పు రాబోతుంది. గత కొంతకాలంగా చట్టపరమైన చిక్కులు, ఆంక్షల నడుమ యాప్ ఆధారిత బైక్ టాక్సీలకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీలను చట్టబద్ధం చేస్తూ సరికొత్త రవాణా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త విధానానికి సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం.4.5 లక్షల బైక్ టాక్సీలుప్రస్తుతం మహారాష్ట్రవ్యాప్తంగా సుమారు 4-4.5 లక్షల బైక్ టాక్సీలు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. జులై చివరి నాటికి రవాణా శాఖ ఈ కొత్త పాలసీకి తుది అనుమతులు ఇవ్వనుండటంతో ఆగస్టు 1 నుంచి ఈ అసంఘటిత రంగం నియంత్రణ చట్రం పరిధిలోకి రానుంది. గతంలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో ఓలా, ఉబర్, రాపిడో వంటి అగ్రిగేటర్ల తాత్కాలిక లైసెన్సులను రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు స్థానిక యువత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని సవరించుకోవడం గమనార్హం.నిబంధనలు ఇవే!స్థానిక నిరుద్యోగ యువత ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం ఈ పాలసీలో కొన్ని కీలకమైన నిబంధనలు పెట్టింది.స్థానికంగా మహారాష్ట్ర నివాసితులకు మాత్రమే బైక్ టాక్సీ పర్మిట్లు మంజూరు చేస్తారు.బైక్ టాక్సీ నడిపే డ్రైవర్లు స్థానిక భాష మరాఠీ కచ్చితంగా అర్థం చేసుకోగలగాలి.మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 ప్రకారం సూచించిన పబ్లిక్ సర్వీస్ వెహికల్ బ్యాడ్జ్ కలిగి ఉండాలి.డ్రైవర్ల సంక్షేమం కోసం నిధిబైక్ టాక్సీ రంగాన్ని క్రమబద్ధీకరించడంతోపాటు డ్రైవర్ల సామాజిక భద్రతకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా సరికొత్త రెవెన్యూ మోడల్ను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఆపరేటర్లు లేదా డ్రైవర్లు రోజుకు రూ.5 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రతి రైడ్ బుకింగ్పై వచ్చే ఆదాయంలో 2 శాతం నిధులను డ్రైవర్ల సంక్షేమ పథకాల(ఆరోగ్య, జీవిత బీమా, పీఎఫ్) కోసం కేటాయించాలి.‘మహారాష్ట్రలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే మా లక్ష్యం. ఈ కొత్త విధానం ద్వారా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అలాగే రైడర్ల సంక్షేమం కోసం 2 శాతం నిధిని కూడా వినియోగిస్తాం’ అని ప్రతాప్ సర్నాయక్ అన్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
నెమ్మదించిన ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సాంకేతిక వ్యవస్థను ఆధునీకరించే (సిస్టమ్ అప్గ్రేడ్) ప్రక్రియలో ఉన్నందున ఆన్లైన్ సేవల్లో తాత్కాలిక జాప్యం చోటుచేసుకుంటోంది. దీనివల్ల పీఎఫ్ క్లెయిమ్లు, సెటిల్మెంట్లు, విత్డ్రాయల్స్ (ఉపసంహరణలు) సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో చందాదారులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు కొన్ని విషయాలను, జాగ్రత్తలను గమనించాలని ఈపీఎఫ్ఓ సూచించింది.చేయకూడనివి ఇవే..ఆన్లైన్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్) ఆన్లైన్ పోర్టల్ను ఓపెన్ చేయడానికి లేదా లాగిన్ అవ్వడానికి పదేపదే ప్రయత్నించవద్దు. దీనివల్ల సర్వర్లపై లోడ్ మరింత పెరిగి సిస్టమ్ నెమ్మదిస్తుంది.ఒకసారి క్లెయిమ్ అభ్యర్థనను సమర్పించిన తర్వాత అది ప్రాసెసింగ్లో ఉన్నప్పుడు మళ్లీ అదే క్లెయిమ్ కోసం డూప్లికేట్ అభ్యర్థనలను పంపకండి.ఇది సిస్టమ్ లోడ్ను పెంచడమే కాకుండా మీ అప్లికేషన్ తిరస్కరణకు దారితీయవచ్చు.వీలైనంత వరకు ఉదయం పూట లేదా రాత్రి వేళల్లో (ఆన్లైన్ ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయాల్లో) పోర్టల్ను ఉపయోగించడానికి ప్రయత్నించండి.జాప్యానికి ప్రధాన కారణాలుఈపీఎఫ్ఓ తన ఐటీ మౌలిక సదుపాయాలను మరింత పటిష్టం చేయడానికి, భవిష్యత్తులో లావాదేవీలను వేగవంతం చేయడానికి ఈ సాంకేతిక అప్గ్రేడ్ను చేపట్టింది. ప్రస్తుతం డేటా మైగ్రేషన్, సిస్టమ్ స్టెబిలైజేషన్ జరుగుతుండటం వల్ల తాత్కాలికంగా క్లెయిమ్ల ప్రాసెసింగ్ ఆలస్యమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సేవలు మరింత వేగంగా, సురక్షితంగా అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
భారీగా బంగారం కొంటున్న భారత్.. కారణం ఇదే!
బంగారం అంటే భారతీయులకు ఒకప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకం.. దేశ ఆర్థిక విధానంలో కూడా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరగడం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ వరుసగా బంగారం కొనుగోలు చేయడంతో మన దేశంలో బంగారం నిల్వల విలువ 115.8 బిలియన్ డాలర్లను చేరుకుంది. ఈ విలువ గత రెండేళ్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం విశేషం.భారతదేశంలోని విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల గణాంకాల ప్రకారం, విదేశీ నిల్వల్లో బంగారం వాటా 17 శాతానికి చేరుకుంది. ఏడాది క్రితం ఇది 12 శాతం మాత్రమే ఉండేది. అంటే.. భారత్ కేవలం డాలర్ వంటి విదేశీ కరెన్సీలపైనే మాత్రమే ఆధారపడకుండా, బంగారాన్ని కూడా ఒక కీలక ఆస్తిగా భావిస్తోందన్నమాట.భారతదేశంలో బంగారం నిల్వల విలువ పెరగడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం. రెండు ఆర్బీఐ నిరంతరంగా బంగారం కొనుగోలు చేయడం. 2024 ప్రారంభంలో ఔన్స్ బంగారం ధర సుమారు 2,000 డాలర్ల వద్ద ఉండగా, తరువాత కాలంలో అది 4,000 డాలర్లకు పైగా చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ ఒక్కసారిగా పెరిగింది.భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచంలోని చాలా దేశాల కేంద్ర బ్యాంకులు కూడా తమ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షలు, కరెన్సీ విలువల్లో మార్పుల వచ్చినప్పుడు రక్షణ పొందేందుకు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నాయి. ఈ కారణంగా బంగారం నిల్వల విలువలను పెంచుకుంటున్నాయి.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత మారిన పరిస్థితి!నిజానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు తమ విదేశీ నిల్వలను కేవలం అమెరికా డాలర్ వంటి కరెన్సీల్లో ఉంచడం ఎంతవరకు సురక్షితం అనే దానిపై ఆలోచించడం ప్రారంభించాయి. దీంతో అనేక దేశాలు బంగారం కొనుగోళ్లను పెంచడం ప్రారంభించాయి.బంగారం కొనుగోలు చేయడంలో పోలాండ్ ముందుంది. దీంతో కొన్ని సంవత్సరాల్లోనే.. తన బంగారం నిల్వలను భారీగా పెంచుకుంది. చైనా కూడా 2023 తర్వాత మళ్లీ బంగారం కొనుగోళ్లను వేగవంతం చేసింది. చెక్ రిపబ్లిక్ వంటి చిన్న దేశాలు కూడా తమ బంగారం నిల్వలను గణనీయంగా పెంచుకున్నాయి.ఆర్బీఐ వ్యూహంఇండియా కూడా గత కొన్నేళ్లుగా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2015లో ఆర్బీఐ వద్ద సుమారు 557.8 టన్నుల బంగారం ఉండేది. అది 2026 నాటికి అది 880.5 టన్నులకు చేరింది. ముఖ్యంగా 2019 తర్వాత ఆర్బీఐ మరింత బంగారం కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీంతో దేశ విదేశీ నిల్వల్లో బంగారం ప్రాధాన్యత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు బంగారం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని కేంద్ర బ్యాంకులు భావిస్తున్నాయి.ఇక అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఇటీవల కాలంలో కొత్తగా.. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయాల్సిన అవసరం ఈ దేశాలకు తక్కువగా ఉంది. సౌదీ అరేబియా కూడా తన బంగారం నిల్వలను దాదాపు స్థిరంగా ఉంచుకుంది. అయితే చమురు ఎగుమతుల ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ నిల్వలపై ఎక్కువగా ఆధారపడుతోంది. -
8వ వేతన సంఘం ప్రక్రియ వేగవంతం
దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ వేగంగా కదులుతోంది. జనవరి 2025లో కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటును అధికారికంగా ప్రకటించగా తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిబంధనలకు ఆమోదం తెలిపింది. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సవరణలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో 7వ వేతన సంఘం కాలం ముగిసిన తర్వాత 01.01.2026 నుంచి 8వ వేతన సంఘం నిబంధనలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు సమర్పించిన ప్రతిపాదనలు, ముఖ్యంగా 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ డిమాండ్ వెనుక ఉన్న అంశాలేమిటి? ఉద్యోగుల జీతాలు ఏ స్థాయిలో పెరగనున్నాయి? అనే వివరాలు చూద్దాం.3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్: జీతాల్లో భారీ పెరుగుదల?నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (ఎన్సీ-జేసీఎం) ప్రభుత్వం ముందు 51 పేజీల సుదీర్ఘమైన మెమోరాండంను సమర్పించింది. ఇందులో కీలకమైన డిమాండ్ 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీనివల్ల కనీస ప్రాథమిక వేతనం రూ.18,000గా అమలవుతోంది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కోరుతున్న 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను లెక్కిస్తే ఉద్యోగుల, పెన్షనర్ల భత్యాలు ఏకంగా 283 శాతం పెరిగే అవకాశం ఉంది.కొత్తగా ప్రతిపాదించిన వేతన శ్రేణులు (పే స్కేల్స్)ఉద్యోగ సంఘాల ప్రతిపాదనల ప్రకారం కొన్ని పాత లెవెల్స్ను విలీనం చేస్తూ సరికొత్త పే స్కేల్స్ను రూపొందించారు. 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తింపజేస్తే మారే కొత్త జీతాల వివరాలు ఇలా ఉన్నాయి.పే స్కేల్ప్రస్తుత లెవెల్ (7 సీపీసీ)ప్రస్తుత వేతనం (రూ.)ప్రతిపాదిత వేతనం (రూ.)పే స్కేల్-1ప్రస్తుత లెవల్-118,000 - 56,90069,000పే స్కేల్-2లెవల్ 2 & 3 (విలీనం)21,700 - 69,10083,200పే స్కేల్-3లెవల్ 4 & 5 (విలీనం)29,200 - 92,3001,12,000పే స్కేల్-4ప్రస్తుత లెవల్ 635,400 - 1,12,4001,35,700పే స్కేల్-5లెవల్ 7 & 8 (విలీనం)47,600 - 1,51,1001,82,500పే స్కేల్-6లెవల్ 9 & 10 (విలీనం)56,100 - 1,77,5002,15,100ప్రస్తుతం అందుతున్న వేతనాలుప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 7వ వేతన సంఘం పరిధిలోనే వేతనాలు అందుకుంటున్నారు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే..కనీస ప్రాథమిక వేతనం: రూ.18,000కనీస పెన్షన్: రూ.9,000గరిష్ట వేతనం: రూ.2,25,000 (కేబినెట్ కార్యదర్శి లాంటి అత్యున్నత పదవులకు రూ.2,50,000)ప్రస్తుత డీఏ/డీఆర్: 58 శాతంఏడో వేతన సంఘం సిఫార్సులను గతంలో ప్రభుత్వం కేవలం 6 నెలల స్వల్ప వ్యవధిలోనే ఆమోదించి జనవరి 1, 2016 నుంచి అమల్లోకి తెచ్చింది. అదే వేగాన్ని పరిశీలిస్తే 8వ వేతన సంఘం సిఫార్సులు కూడా మరికొద్ది నెలల్లోనే తుది రూపం దాల్చి జనవరి 1, 2026 నుంచి బ్యాక్ డేట్తో అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారిన ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న ఈ రూ.69,000 కనీస వేతన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రశ్నగా మారింది.ఇదీ చదవండి: కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి? -
ఎగువ మధ్యాదాయ రేసులో 5 రాష్ట్రాలు!
భారతదేశం స్థూలంగా తక్కువ మధ్య ఆదాయ (లోయర్ మిడిల్ ఇన్కమ్) ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నప్పటికీ దేశీయంగా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆదాయంలో దూసుకుపోతున్నాయి. ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన దేశాల ఆర్థిక వర్గీకరణ గుర్తింపు, రాష్ట్రాల తలసరి ఆదాయ డేటాను విశ్లేషిస్తూ కొన్ని సంస్థలు అందించిన నివేదిక ప్రకారం.. భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఎగువ మధ్య ఆదాయ (అప్పర్ మిడిల్ ఇన్కమ్) పరిమితిని దాటేశాయి.మరోవైపు కొన్ని రాష్ట్రాలు ఈ మైలురాయికి అత్యంత సమీపంలో ఉండగా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ పేదరికంలో వెనుకబడి ఉండటం దేశీయ ఆర్థిక అసమానతలను స్పష్టం చేస్తోంది.గ్లోబల్ బెంచ్మార్క్ను దాటిన రాష్ట్రాలుప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం, ఏ దేశం లేదా ప్రాంతం తలసరి ఆదాయమైనా 4,636 డాలర్ల నుంచి 14,375 డాలర్ల మధ్య ఉంటే దానిని ‘ఎగువ-మధ్య-ఆదాయ’ ఆర్థిక వ్యవస్థగా గుర్తిస్తారు. ఈ బెంచ్మార్క్ను అధిగమించి టాప్-5లో నిలిచిన భారతీయ రాష్ట్రాల వివరాలు..స్థానంరాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతంతలసరి ఆదాయం (డాలర్లలో)1ఢిల్లీ6,2172కర్ణాటక5,5793తెలంగాణ5,4074తమిళనాడు5,3295గుజరాత్4,734అడుగు దూరంలో మరిన్ని రాష్ట్రాలుమరికొద్దిపాటి వృద్ధిని నమోదు చేస్తే ‘ఎగువ-మధ్య-ఆదాయ’ హోదాను అందుకోవడానికి మరో మూడు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో..మహారాష్ట్ర: తలసరి ఆదాయం 4,628 డాలర్లు (బెంచ్మార్క్ కంటే కేవలం 8 డాలర్లు తక్కువ).హరియాణా: తలసరి ఆదాయం 4,627 డాలర్లు (బెంచ్మార్క్ కంటే కేవలం 9 డాలర్లు తక్కువ).కేరళ: తలసరి ఆదాయం 4,610 డాలర్లు (బెంచ్మార్క్ కంటే కేవలం 26 డాలర్లు తక్కువ).ఒకవైపు కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ ప్రమాణాల వైపు దూసుకుపోతుంటే, మరోవైపు దేశంలో ప్రాంతీయ అసమానతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాల పరిస్థితి దయనీయంగా ఉంది. అందులో అట్టడుగున బిహార్ ఉంది. కేవలం 984 డాలర్లు తలసరి ఆదాయంతో బిహార్ భారతదేశంలోనే పేద రాష్ట్రంగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ (1,403 డాలర్లు), ఝార్ఖండ్ (1,470 డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇదీ చదవండి: కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి? -
కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి?
ఒక జిల్లాకు శాంతిభద్రతల పరిరక్షణ నుంచి సంక్షేమ పథకాల అమలు వరకు సర్వం తానై నడిపించే సారథి జిల్లా కలెక్టర్. తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారులకు ఉండే క్రేజ్, గౌరవం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీలివెలుగుల వాహనం, ఖాకీల సెల్యూట్లు, వందలాది మంది సిబ్బంది.. ఇవన్నీ చూసే ప్రతి యువకుడు తానూ ఒక కలెక్టర్ కావాలని కలలుకంటాడు. అయితే ఇటీవల తెలంగాణలో ఐఏఎస్ల బదిలీ నేపథ్యంలో ప్రతిష్టాత్మక అధికారాలు చలాయించే జిల్లా కలెక్టర్ల అసలు వేతనం ఎంత? వారికి లభించే అలవెన్స్లు, రాజభోగాలు ఎలా ఉంటాయో క్షేత్రస్థాయి అధికారిక విశ్లేషణ కింద చూద్దాం.(కేడర్నుబట్టి వారి జీతభత్యాల్లో స్వల్ప తేడాలుంటాయని గమనించాలి)7వ వేతన సంఘం ప్రకారం జీతాల వర్గీకరణభారతదేశంలో ఐఏఎస్ అధికారుల వేతనాలు కేంద్ర ప్రభుత్వపు 7వ వేతన సంఘం నిర్దేశించిన పే మ్యాట్రిక్స్ ఆధారంగా ఖరారవుతాయి. సర్వీసులో వారు పూర్తి చేసిన కాలం, ప్రమోషన్ల ఆధారంగా ఈ వేతనం మారుతుంది.ప్రారంభ స్థాయి (జూనియర్ టైమ్ స్కేల్- లెవల్ 10): సివిల్స్ పాసై శిక్షణ పూర్తి చేసుకున్న కొత్తలో అసిస్టెంట్ కలెక్టర్ / సబ్ కలెక్టర్ హోదాలో ఉన్నప్పుడు ప్రాథమిక వేతనం(బేసిక్ పే) రూ.56,100 గా ఉంటుంది.కలెక్టర్ స్థాయి (జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్-లెవల్ 12): సాధారణంగా 9 నుంచి 12 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని పూర్తిస్థాయి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టే అధికారి ప్రాథమిక వేతనం రూ.78,800 నుంచి ప్రారంభమవుతుంది.సీనియర్ కలెక్టర్ స్థాయి (సెలక్షన్ గ్రేడ్-లెవల్ 13): దాదాపు 13 నుంచి 16 ఏళ్ల అనుభవంతో సీనియర్ జిల్లా కలెక్టర్గా పనిచేసే వారి బేసిక్ పే రూ.1,18,500కి పెరుగుతుంది.జీతాన్ని పెంచే అలవెన్స్లు (భత్యాలు)ప్రాథమిక వేతనానికి అదనంగా ప్రభుత్వం కల్పించే భత్యాల వల్లే కలెక్టర్ల నెలవారీ గ్రాస్ శాలరీ భారీగా పెరుగుతుంది. అందులో ముఖ్యమైనవి..కరువు భత్యం (డీఏ): ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు సార్లు (జనవరి, జులై) డీఏని సవరిస్తుంది. ప్రస్తుతం ఇది ప్రాథమిక వేతనంలో కీలక శాతంగా ఉంటూ జీతాన్ని రెట్టింపు స్థాయికి చేరుస్తుంది.ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ): పోస్టింగ్ ఉన్న నగరం / జిల్లాను బట్టి (X, Y, Z కేటగిరీలు) బేసిక్ పే లో 8% నుంచి 24% వరకు హెచ్ఆర్ఏ లభిస్తుంది. అయితే, కలెక్టర్ కేడర్ ఉద్యోగులకు ప్రభుత్వం అధికారిక బంగ్లా కేటాయిస్తుంది కాబట్టి వీరికి హెచ్ఆర్ఏ వర్తించదు.ప్రయాణ భత్యం (టీఏ): అధికారిక ప్రయాణాల నిమిత్తం నెలకు నిర్ణీత రవాణా భత్యం అందుతుంది. దీనికి కూడా డీఏ తోడవుతుంది.అలవెన్స్లకు మించిన అధికారిక వసతులునిజానికి కలెక్టర్ల జీతం కంటే ప్రభుత్వం వారికి కల్పించే హోదా, సౌకర్యాలే అత్యంత విలువైకనవి. ఒక జిల్లా అధిపతిగా వారికి లభించే రాజభోగాలు ఇవే..వసతి రకంకల్పించే సౌకర్యాల వివరాలుఅధికారిక నివాసంవిశాలమైన ల్యాన్, క్యాంప్ ఆఫీస్తో కూడిన కలెంట్ బంగ్లా. దీని నిర్వహణ, తోటపని అంతా ప్రభుత్వ ఖర్చుతోనే జరుగుతుంది.రవాణా సౌకర్యండ్రైవర్తో కూడిన విలాసవంతమైన ప్రభుత్వ వాహనం. ఇంధన ఖర్చులు, రిపేర్లు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.భద్రతకలెక్టర్ నివాసానికి గన్మెన్లు, హోంగార్డుల ప్రత్యేక భద్రత ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎస్కార్ట్ వాహనం కూడా కేటాయిస్తారు.ఉచిత సేవలుఉచిత విద్యుత్ (పరిమితులకు లోబడి), హైస్పీడ్ ఇంటర్నెట్, ల్యాండ్లైన్, మొబైల్ కనెక్షన్లు.సిబ్బందిఇంటిపనుల కోసం ప్రత్యేక సహాయకులు (డొమెస్టిక్ స్టాఫ్), వంట మనుషులు, క్యాంప్ క్లర్కులు అందుబాటులో ఉంటారు.ఇదీ చదవండి: వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు -
ఆర్బీఐ కొత్త అంబుడ్స్మన్ విధానం అమలు
బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, డిజిటల్ వాలెట్ల వినియోగదారుల హక్కులకు మరింత రక్షణ కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 2021 ఫ్రేమ్వర్క్ను పూర్తిగా సవరిస్తూ మరింత పారదర్శకమైన, వేగవంతమైన, పునరుద్ధరించిన ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ (ఆర్బీ-ఐఓఎస్)ను 2026 జులై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ‘సేవా లోపం’ జరిగితే కస్టమర్లకు లభించే గరిష్ట పరిహారాన్ని ఆర్బీఐ భారీగా పెంచడం ఈ కొత్త విధానంలో అత్యంత కీలకమైన అంశం.రూ.33 లక్షల వరకు పరిహారం..కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం కస్టమర్లకు లభించే పరిహారాల పరిమితిని గణనీయంగా పెంచారు. పాత నియమాలతో పోలిస్తే పెరిగిన మార్పులు ఇలా ఉన్నాయి.పరిహార రకంమునుపటి పరిమితి (2021 ఫ్రేమ్వర్క్)సవరించిన కొత్త పరిమితి (2026 జూలై 1 నుంచి)ఆర్థిక నష్టాలకు గరిష్ట పరిహారంరూ.20 లక్షలురూ.30 లక్షల వరకుమానసిక వేదన, సమయం వృధాకు పరిహారంరూ.1 లక్షరూ.3 లక్షల వరకుఅంబుడ్స్మన్ తీర్పు ఇచ్చే పరిహారానికి పరిమితి ఉన్నప్పటికీ, అంబుడ్స్మన్ ముందుకు తీసుకువచ్చే వివాదాల మొత్తం విలువపై ఎలాంటి ద్రవ్య పరిమితి లేదు.వన్ నేషన్, వన్ అంబుడ్స్మన్వినియోగదారులు తమ భౌగోళిక ప్రాంతంతో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసుకునేందుకు వీలుగా ‘వన్ నేషన్, వన్ అంబుడ్స్మన్’ విధానాన్ని ఆర్బీఐ మరింత బలోపేతం చేసింది. అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, షెడ్యూల్డ్ సహకార బ్యాంకులతోపాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (డిజిటల్ వాలెట్లు), పేమెంట్ సిస్టమ్ పార్టిసిపెంట్స్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, ఆర్బీఐ నోటిఫై చేసిన ఇతర నియంత్రిత సంస్థలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.ఎలాంటి ఫిర్యాదులు చేయవచ్చు?అనధికారిక ఆన్లైన్ లావాదేవీలు, ఏటీఎం, కార్డ్ వివాదాలు, డిజిటల్ పేమెంట్ వైఫల్యాలు, రీఫండ్ చేయడంలో జాప్యం, లోన్ సర్వీసింగ్ సమస్యలు, క్రెడిట్ రిపోర్టులో తప్పులు, రికవరీ ఏజెంట్ల వేధింపులు, ఇతర కస్టమర్ సేవా లోపాలపై ఫిర్యాదు చేయవచ్చు.బ్యాంకుల అంతర్గత వాణిజ్య నిర్ణయాలు (లోన్ మంజూరు లేదా వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి), కోర్టులు/ట్రిబ్యునళ్లలో పెండింగ్లో ఉన్న కేసులు, అనామక ఫిర్యాదులు, ఉద్యోగి-యజమాని వివాదాలు, పాలసీ నిర్ణయాలు ఈ పరిధిలోకి రావు.ఫిర్యాదు ఎలా చేయాలి?నేరుగా ఆర్బీఐకి ఫిర్యాదు చేయడానికి వీల్లేదు. మొదట సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీకి ఫిర్యాదు సమర్పించాలి. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా సదరు సంస్థ స్పందించకపోయినా లేదా వారి ఇచ్చిన పరిష్కారంపై కస్టమర్ అసంతృప్తిగా ఉన్నా ఆర్బీఐ అంబుడ్స్మన్ను ఆశ్రయించవచ్చు. బ్యాంకు తుది సమాధానం ఇచ్చిన 90 రోజులలోపు లేదా ప్రతిస్పందన రానట్లయితే నిర్ణీత గడువు ముగిసిన తర్వాత అంబుడ్స్మన్కు ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుంది.కోర్టు ఖర్చులు లేవు!కొత్త ఫ్రేమ్వర్క్ ద్వారా డిప్యూటీ అంబుడ్స్మన్ పాత్రను ఆర్బీఐ మరింత బలోపేతం చేసింది. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడం, నిబంధనలకు లోబడి లేని వాటిని తిరస్కరించడం, ఇరు పక్షాల మధ్య రాజీ కుదర్చడం వంటి కీలక అధికారాలను వారికి అప్పగించారు. అలాగే, ఈ ప్రక్రియ అంతా సరళంగా ఉంటుంది. కస్టమర్లు తమకు తాముగా లేదా అధీకృత ప్రతినిధి ద్వారా వాదనలు వినిపించవచ్చు. దీనికోసం న్యాయవాదుల అవసరం ఉండదు.అప్పీల్ చేసుకునే అవకాశంఅంబుడ్స్మన్ ఇచ్చిన తీర్పుపై కస్టమర్ లేదా సదరు ఆర్థిక సంస్థ అప్పీల్కు వెళ్లవచ్చు. ఆర్బీఐ వినియోగదారుల రక్షణ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఇక్కడ అప్పీలేట్ అథారిటీగా వ్యవహరిస్తారు. అయితే, విచారణ సమయంలో సరైన పత్రాలు లేదా సమాచారం అందించడంలో విఫలమైన బ్యాంకులు/నియంత్రిత సంస్థలకు అప్పీల్ చేసుకునే హక్కు ఉండదు.ఫిర్యాదు దాఖలు చేయడానికి మార్గాలు:ఆర్బీఐ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ (https://cms.rbi.org.in) ద్వారా సులభంగా ఫిర్యాదు చేయవచ్చు.ఈమెయిల్ / పోస్ట్: చండీగఢ్లోని కేంద్రీకృత స్వీకరణ, ప్రాసెసింగ్ కేంద్రానికి (సీఆర్పీసీ) భౌతిక దరఖాస్తును పంపవచ్చు.టోల్-ఫ్రీ నంబర్: మరిన్ని వివరాలు, మార్గదర్శకత్వం కోసం ఆర్బీఐ ప్రత్యేక టోల్-ఫ్రీ నంబర్ 14448 ద్వారా బహుళ భారతీయ భాషల్లో సహాయాన్ని అందిస్తోంది.ఇదీ చదవండి: వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు -
కోట్లాది మంది ఉద్యోగులకు బంపర్ ఆఫర్
దేశంలోని సుమారు 8 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నిల్వలపై 8.25 శాతం వడ్డీ రేటును అధికారికంగా ఖరారు చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వడ్డీ మొత్తాన్ని తక్షణమే చందాదారుల ఖాతాల్లోకి జమ చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని క్షేత్రస్థాయి ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడంతో ఈపీఎఫ్ఓ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.కేంద్ర ప్రభుత్వం ఆమోదంఈపీఎఫ్ పథకం-1952లోని పేరా 60(1) ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీని ప్రతి సభ్యుని ఖాతాలో జమ చేయడానికి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అనుమతి లభించిందని ఈపీఎఫ్ఓ తన తాజా సర్క్యులర్లో స్పష్టం చేసింది. ‘కేంద్ర ప్రభుత్వ తుది అనుమతి లభించిన నేపథ్యంలో సభ్యుల ఖాతాల్లోకి సకాలంలో వడ్డీని బదిలీ చేసేందుకు వీలుగా సంబంధిత విభాగాలన్నీ తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నాం’ అని ఈపీఎఫ్ఓ సర్క్యులర్లో పేర్కొన్నారు.ఈసారి ఆలస్యం లేదు.. సరికొత్త సాఫ్ట్వేర్!గతంలో వడ్డీ డబ్బులు ఖాతాల్లో పడటానికి కనీసం ఒకటి రెండు నెలల సమయం పట్టేది. సాంకేతిక లోపాలు, అస్తవ్యస్తమైన ప్రక్రియల వల్ల చందాదారులు ఇబ్బందులు పడేవారు. అయితే, ఈసారి ఉద్యోగులకు ఆ తిప్పలు తప్పనున్నాయి. గత వారమే ఈపీఎఫ్ఓ తన ప్రధాన డేటాబేస్ కన్సాలిడేషన్తో పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. దీనివల్ల ఈసారి వడ్డీ క్రెడిట్ ప్రక్రియ వేగంగా, అవాంతరాలు లేకుండా సాగనుంది. కేవలం కొద్ది రోజుల్లోనే లబ్ధిదారులందరి ఖాతాల్లోనూ వడ్డీ సొమ్ము నేరుగా జమ కానుంది.వరుసగా మూడో ఏడాది అదే జోరుఈ ఏడాది మార్చిలోనే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ 8.25% వడ్డీ రేటును ప్రతిపాదించింది. అనంతరం జూన్ నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈపీఎఫ్ఓ వరుసగా మూడో ఏడాది కూడా 8.25 శాతం గరిష్ట వడ్డీ రేటును కొనసాగించడం గమనార్హం. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉద్యోగుల పదవీ విరమణ నిధికి భద్రతతో పాటు ఉత్తమ రాబడిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇదీ చదవండి: వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు -
‘వికసిత్ భారత్’లో భాగస్వాములు కావాలి
భారతదేశాన్ని ‘వికసిత్ భారత్ 2047’ (అభివృద్ధి చెందిన దేశం)గా మార్చే ప్రయాణంలో భాగస్వాములు కావాల్సిందిగా ఫ్రాన్స్ వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా పరస్పర ఆర్థిక పురోగతిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. పారిస్లో జరిగిన ‘భారత్–ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్టేబుల్’ సమావేశంలో ఆమె ప్రసంగించారు.లైఫ్ సైన్సెస్, వ్యాక్సిన్లు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐలు), క్లినికల్ రీసెర్చ్, ప్రిసిషన్ మెడిసిన్, డిజిటల్ హెల్త్ రంగాలలో ఇరు దేశాలకు విభిన్న నైపుణ్యాలు ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ ‘హెల్త్కేర్ విలువ ఆధారిత సప్లై చైన్’ను బలోపేతం చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని ఆమె కోరారు. శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తోందన్నారు. భారత్లో అమలవుతున్న ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’, ‘పీఎల్ఐ’ (ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక) పథకాలు పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్ రంగాలలో భారీ పెట్టుబడి అవకాశాలను కల్పిస్తున్నాయని సీతారామన్ పేర్కొన్నారు.గిఫ్ట్ సిటీ వృద్ధిఅంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్గా వేగంగా ఎదుగుతోందని మంత్రి తెలిపారు. జూన్ 2026 నాటికి ఇందులో 1,200 కంటే అధిక సంస్థలు రిజిస్టర్ అయ్యాయని, 111 బిలియన్ డాలర్ల బ్యాంకింగ్ ఆస్తులతో పాటు, ఇప్పటివరకు మొత్తం 176 బిలియన్ డాలర్ల బ్యాంకింగ్ లావాదేవీలు జరిగాయని వివరించారు. బ్యాంకింగ్, ఫండ్ మేనేజ్మెంట్, లీజింగ్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), రీఇన్సూరెన్స్ వంటి విభాగాలలో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, సాంకేతికతగత పదేళ్లలో భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అయ్యిందని ఆర్థిక మంత్రి తెలిపారు. సప్లై చైన్ వైవిధ్యీకరణ, సాంకేతిక పరిణామాలు కొత్త పెట్టుబడి అవకాశాలను ఇస్తున్నాయని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీస్ రంగాలలో ఇరు దేశాలు నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. భారత్లోని డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇంధన పరివర్తన రంగాలు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎంతో అనువైనవని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.డిజిటల్ ఎకానమీ జోరుభారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిధిలో ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఒఎన్డీసీ వంటి విప్లవాత్మక వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో దాదాపు సగం వాటా భారత్దేనని అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 1,000 ఫ్రాన్స్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. కాగా, గత దశాబ్ద కాలంగా భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చర్యలను ఈ సదస్సులో పాల్గొన్న ఫ్రాన్స్ అగ్రశ్రేణి ఆర్థిక సంస్థల ప్రతినిధులు అభినందించారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
ఇంట్లో బంగారం ఉందా.. ఈ స్కీమ్తో భారీ లాభం!
భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన దేశ ప్రజలు బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా.. భవిష్యత్తు కోసం భద్రమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. అయితే.. ఇళ్లలోని బంగారం, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉపయోగపడకుండా అలాగే ఉండిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (Gold Monetisation Scheme)ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కొత్త రూపంలో తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం.. ప్రజలు తమ ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగించేలా చేయడం. బంగారం డిపాజిట్ చేసిన వారికి ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లించేది. గడువు పూర్తయిన తర్వాత వారు బంగారం రూపంలో గానీ, దానికి సమానమైన నగదు రూపంలో గానీ తిరిగి పొందే అవకాశం ఉండేది. అయితే ఈ స్కీమ్ అనుకున్నంత సక్సెస్ కాలేదు.ఈ పథకం ఎందుకు విఫలమైంది?దాదాపు పది సంవత్సరాల కాలంలో ఈ పథకం ద్వారా కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే సేకరించారు. కానీ భారతీయుల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం ఉందని అంచనా. దీన్నిబట్టి చూస్తే.. ఈ పథకం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదని తెలుస్తోంది.➤భారతీయ కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వచ్చిన లేదా భావోద్వేగ విలువ కలిగిన నగలను డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపలేదు.➤పన్ను సంబంధిత విచారణలు వస్తాయనే భయం ప్రజల్లో ఉంది.➤బ్యాంకులకు ఈ పథకం ద్వారా పెద్దగా లాభం లేకపోవడంతో వారు దీనిని ప్రోత్సహించలేదు.➤ప్రభుత్వం వడ్డీతో పాటు బంగారం ధర పెరిగితే ఆ అదనపు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగింది.కొత్త మార్పులు ఏమిటి?గోల్డ్ మానిటైజేషన్ స్కీములో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలర్లు (బంగారు నగల వ్యాపారులు) కూడా కలెక్షన్ పార్ట్నర్లుగా పనిచేసే అవకాశం కల్పించడం.అంటే.. ఇప్పటి వరకు బంగారాన్ని కేవలం బ్యాంకుల ద్వారానే మాత్రమే డిపాజిట్ చేయాల్సి వచ్చేది. ఇకపై ప్రజలు తమకు దగ్గరలో ఉన్న విశ్వసనీయ జ్యువెలర్ల వద్ద కూడా బంగారాన్ని ఇచ్చే అవకాశం ఉండవచ్చు. దీనివల్ల ప్రజలకు సౌకర్యం పెరుగుతుంది, అలాగే మరింత బంగారం ఈ పథకంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు➤ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది.➤విదేశాల నుంచి బంగారం దిగుమతుల అవసరం తగ్గుతుంది.➤డాలర్లపై భారతదేశం ఆధారపడటం తగ్గుతుంది.➤రూపాయి విలువ బలపడే అవకాశం ఉంటుంది.➤దేశంలో బంగారం ఆధారిత వ్యాపారాలు మరింత పారదర్శకంగా మారతాయి.➤దిగుమతులు తగ్గడం వల్ల, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. భారతీయుల వద్ద ఉన్న బంగారంలో కేవలం 5 శాతం మాత్రమే ఈ పథకం ద్వారా సమీకరించినా, సుమారు 1,250 టన్నుల బంగారం లేదా 80-90 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. ఇది దాదాపు రెండేళ్ల పాటు బంగారం దిగుమతుల అవసరాన్ని తగ్గించే స్థాయిలో ఉంటుంది.ప్రధానమంత్రి పిలుపుఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఒక సంవత్సరం పాటు కొత్త బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కోరారు. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
ఆర్థిక సంస్థలకు ఏఐ సైబర్ ముప్పు
దేశీయ ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, అంతే స్థాయిలో సైబర్ ముప్పు పొంచి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన తాజా ‘ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్’ (ఎఫ్ఎస్ఆర్)లో ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ ఐటీ, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకోవాలని తెలిపింది. రాబోయే 12 నెలల్లో ఏఐ ఆధారిత సైబర్ దాడులే ఆర్థిక రంగానికి అతిపెద్ద సవాలుగా మారనున్నాయని ఆర్బీఐ ఈ నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది.ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంప్రపంచవ్యాప్తంగా ఇతర ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంపైనే అత్యధిక సంఖ్యలో సైబర్ దాడులు జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా రష్యా, ఉక్రెయిన్ తర్వాత అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండటం గమనార్హం. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ఆర్థిక సంస్థల్లో 42 శాతం సంస్థలు భౌగోళిక అనిశ్చితి కారణంగానే సైబర్ దాడుల ముప్పు తీవ్రతరమైందని అంగీకరించాయి.ఆర్థిక స్థిరత్వానికి విఘాతం‘డిజిటల్ పరిజ్ఞానంతో ముడిపడి ఉన్న ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఒక్క సైబర్ దాడి జరిగినా అది మొత్తం వ్యవస్థను కుదిపేస్తుంది. సేవల నిలిపివేత, డేటా చోరీ, పేమెంట్ వ్యవస్థల్లో అంతరాయాల వల్ల ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న నమ్మకం సడలిపోతుంది’ అని ఆర్బీఐ హెచ్చరించింది.ఏఐ సవాళ్లు - సన్నద్ధతలో వెనుకబాటు2020 నుంచి డిజిటల్ ఆర్థిక సేవల వినియోగం విపరీతంగా పెరగడంతో సైబర్ నేరగాళ్లకు మరిన్ని అవకాశాలు చిక్కాయని నివేదిక తెలిపింది. దేశంలోని 33 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, 10 అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీల ఆధారంగా ఆర్బీఐ ఈ సర్వే నిర్వహించింది. ఏఐ సాంకేతికత వేగంగా విస్తరిస్తుండటంతో సైబర్ దాడుల తీవ్రత, వేగం, పరిధి ఊహించని స్థాయికి చేరాయని స్పష్టం చేసింది. అయితే, ఈ ఏఐ ముప్పును ఎదుర్కొనేందుకు మన ఆర్థిక సంస్థల సన్నద్ధత ఇంకా ప్రాథమిక దశల్లోనే ఉందని సర్వే గణాంకాలు చెబుతున్నాయి.మెజారిటీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఏఐ రక్షణ వ్యవస్థల్లో ఇంకా అభివృద్ధి చెందుతున్న లేదా మధ్యస్థ దశలోనే ఉన్నాయి.ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేలా పూర్తిస్థాయి సన్నద్ధత సాధించిన సంస్థల సంఖ్య చాలా తక్కువగా ఉంది.ఈ నేపథ్యంలో ప్రస్తుత సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ను మరింత బలోపేతం చేస్తూ.. నిరంతర నిఘా, ఉద్యోగుల్లో అవగాహన, తక్షణ స్పందన వంటి చర్యలపై బ్యాంకులు దృష్టి పెట్టాలని ఆర్బీఐ సూచించింది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
జీఎస్టీ వసూళ్లు: ఒక్క నెలలో రూ.1.94 లక్షల కోట్లు
దేశ జీఎస్టీ వసూళ్లు గడిచిన జూన్లో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. స్థూల జీఎస్టీ ఆదాయం 13.9 శాతం పెరిగి రూ.1,94,812 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఇది రూ.1,71,105 కోట్లుగా ఉండటం గమనార్హం.నికరంగా (రిఫండ్లు మినహాయించిన తరువాత) జీఎస్టీ వసూళ్లు 11.2 శాతం పెరిగి రూ.1,62,377 కోట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో నెలలో రీఫండ్లు గణనీయంగా పెరిగి రూ.32,436 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29.1 శాతం అధికం.కేంద్ర జీఎస్టీ (CGST) వసూళ్లు 8 శాతం పెరిగి రూ.37,376 కోట్లకు చేరగా, రాష్ట్ర జీఎస్టీ (SGST) 4 శాతం వృద్ధితో రూ.45,116 కోట్లుగా నమోదైంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST)లోనూ బలమైన పెరుగుదల కనిపించింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఐజీఎస్టీ రూ.52,282 కోట్లుగా ఉండగా, దిగుమతులపై వసూళ్లు 34.6 శాతం భారీ వృద్ధితో రూ.60,038 కోట్లకు చేరాయి.దేశీయ స్థూల ఆదాయాలు మొత్తం 6.5 శాతం పెరిగి రూ.1,34,774 కోట్లుగా నమోదయ్యాయి. ఇది దేశీయ వినియోగం, సేవల రంగంలో కొనసాగుతున్న స్థిరమైన డిమాండ్ను సూచిస్తోందని ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి.రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 9 శాతం వృద్ధితో రూ.30,714 కోట్ల జీఎస్టీ వసూళ్లను నమోదు చేసి మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 19 శాతం వృద్ధితో రూ.9,165 కోట్లు సాధించింది. గుజరాత్ రూ.11,743 కోట్లు (12% వృద్ధి), కర్ణాటక రూ.12,937 కోట్లు (10% వృద్ధి), హర్యానా రూ.10,065 కోట్లు (9% వృద్ధి) నమోదు చేశాయి. అయితే తమిళనాడు మాత్రం స్వల్పంగా 2 శాతం తగ్గుదలతో రూ.9,776 కోట్లకు పరిమితమైంది. -
దిగొచ్చిన ఇంధన ధరలు!
కొంతకాలంగా పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ఉద్రిక్తతలతో అల్లాడిపోతున్న ఇంధన వినియోగదారులకు అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఊరట లభించింది. ఇరాన్ వివాదం సడలడం, కీలకమైన సముద్ర రవాణా మార్గాలు పునప్రారంభం కావడంతో అంతర్జాతీయంగా ముడిచమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాలు మళ్లీ గాడిలో పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అంతరాయాలపై ఆందోళనలు తొలగిపోవడంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా తగ్గిన ముడిచమురు ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ప్రైవేట్ రంగ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ రిటైల్ నెట్వర్క్లో పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను లీటరుకు రూ.3 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఇంధన ధరలను తగ్గించిన మొదటి రిటైలర్గా నయారా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న నయారాకు చెందిన 7,000 ఇంధన స్టేషన్లలో ఈ సవరించిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. అయితే, స్థానిక పన్నులు (వ్యాట్) ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో తుది రిటైల్ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.మార్చి నాటి పెంపు ఉపసంహరణగతంలో ఇరాన్ వివాదంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఎగబాకడంతో.. మార్చి 26న నయారా సంస్థ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 పెంచింది. తాజా తగ్గింపుతో ఆ పెంపును సంస్థ పూర్తిగా వెనక్కి తీసుకున్నట్లయింది. గ్లోబల్ మార్కెట్ స్థిరీకరణ తర్వాత ఇంధన ధరల్లో వచ్చిన మొదటి తగ్గుదల సవరణ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం గుజరాత్లోని వడినార్లో తమ 20 మిలియన్ టన్నుల (వార్షిక సామర్థ్యం) రిఫైనరీ టర్నరౌండ్ను పూర్తి చేసుకుని దేశీయ డిమాండ్ను అందుకునేందుకు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ప్రభుత్వ రంగ సంస్థల్లో మార్పు లేదు!ప్రైవేట్ రంగ సంస్థ నయారా ధరలను తగ్గించినప్పటికీ ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు మాత్రం ఇంకా పాత ధరలనే కొనసాగిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు దేశంలోని లక్షకు పైగా ఇంధన స్టేషన్లలో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. కాగా, ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12 గాను, డీజిల్ ధర లీటరుకు రూ.95.20 గాను కొనసాగుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
కాందిశీకుల కలలపై ‘ఖర్చు’ల కత్తి!
బ్రిటన్లో అక్రమ వలసల నియంత్రణే లక్ష్యంగా అధికార లేబర్ పార్టీ ప్రభుత్వం కీలకమైన నూతన ఆశ్రయ నిబంధనలను ప్రకటించింది. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఈ నిర్ణయం ప్రకారం.. భవిష్యత్తులో బ్రిటన్లో ఆశ్రయం పొందే, శాశ్వత నివాసం (పీఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే శరణార్థులు ప్రభుత్వం తమపై చేసే ఖర్చును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?బ్రిటన్ హోం శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, దేశంలో శాశ్వత నివాసం పొందాలంటే అంతకుముందు ప్రభుత్వం తమ వసతి, జీవన భత్యం కోసం ఖర్చు చేసిన 10,000 పౌండ్లు (సుమారు రూ.11 లక్షలు) తిరిగి చెల్లించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనల అమలుపై ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది.భవిష్యత్తులో బ్రిటన్కు వచ్చే, ఈ మొత్తాన్ని చెల్లించగల ఆర్థిక స్థోమత ఉన్న వయోజనులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.ఈ నిబంధనలు గతంలో ఆశ్రయం పొందిన వారికి వర్తించవు. అలాగే చిన్నారులకు దీని నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.శరణార్థులు ఈ డబ్బు చెల్లించడం వల్ల పూర్తిగా పేదరికంలోకి జారిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు కూడా చట్టంలో పొందుపరిచారు.బ్రిటన్ హోం శాఖ అంచనాల ప్రకారం ఆశ్రయం కోరుకునేవారికి తాత్కాలిక వసతి కల్పించేందుకు సగటున ఒక్కో వ్యక్తికి రోజుకు 23.25 పౌండ్లు(సుమారు రూ.2,600), హోటళ్లలో ఉంచితే రోజుకు 144 పౌండ్ల(రూ.16,000) వరకు ఖర్చవుతోంది. దీనికి అదనంగా వారానికి జీవన భత్యం కూడా చెల్లించాల్సి వస్తోంది. గత ఏడాది ఆశ్రయ వసతి, సంబంధిత సాయం కోసం బ్రిటన్ సుమారు 400 కోట్ల పౌండ్లు(సుమారు 44,000 కోట్ల రూపాయలు) ఖర్చు చేయడం గమనార్హం.ఈ నేపథ్యంలో బ్రిటన్ హోం సెక్రటరీ షబానా మహమూద్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్ పన్ను చెల్లింపుదారులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఆశ్రయ సాయం పొందడం కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత కూడా. శరణార్థులకు ఆర్థిక స్థోమత చేకూరిన తర్వాత బ్రిటన్ ప్రజలకు ప్రతిగా వారు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలి’ అన్నారు.రాజకీయ ఉద్రిక్తతలు - లేబర్ పార్టీ వ్యూహంబ్రిటన్ రాజకీయాల్లో వలసల అంశం అత్యంత సున్నితమైనది. ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే ప్రధానాంశాల్లో ఇది ఒకటిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇది స్థానిక ఉద్రిక్తతలు, నిరసనలకు కూడా కారణమవుతోంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న సెంటర్ లిఫ్ట్-లేబర్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని కొందరు భావిస్తున్నారు. నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రైట్ వింగ్-రిఫార్మ్ యూకే పార్టీ దేశంలో రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. దేశంలోని సుమారు ఆరు లక్షల మంది శరణార్థులను వెనక్కి పంపించేస్తామంటూ రిఫార్మ్ యూకే ఇస్తున్న హామీలు స్థానిక ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. దీన్ని తిప్పికొట్టేందుకే లేబర్ పార్టీ ఈ చర్యలకు పూనుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
పెట్రోల్, డీజిల్పై ఆంక్షలు ఎత్తివేత
దేశంలోని ఇంధన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వెలువడిన ఈ ఆదేశాల ప్రకారం.. జులై 1 (బుధవారం) నుంచి రిటైల్, కమర్షియల్, పారిశ్రామిక వినియోగదారులు ఎలాంటి పరిమితులు లేకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు.దేశీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడంతో గతంలో విధించిన ‘మోటార్ స్పిరిట్ అండ్ హై-స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరా తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్, 2026’ నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ప్రధాన మార్పులు ఇవే..కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో క్షేత్రస్థాయిలో కింది మార్పులు అమలులోకి రానున్నాయి.రిటైల్ ఫ్యూయల్ స్టేషన్లలో (పెట్రోల్ బంకుల్లో) ఒకే వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలనే నిబంధన ఇకపై ఉండదు. జులై 1, 2026 నుంచి వాహనదారులు తమ అవసరానికి తగినంత డీజిల్ను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు.వాణిజ్య, పారిశ్రామిక రంగానికి చెందిన కొనుగోలుదారులు రిటైల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీనివల్ల వారు కేవలం తమ సొంత కన్జ్యూమర్ పంపుల నుంచే కాకుండా సాధారణ రిటైల్ బంకుల నుంచి కూడా ఇంధనాన్ని సేకరించుకోవచ్చు.ఆంక్షలు విధించడానికి కారణం..పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభంతో దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 12న అత్యవసరంగా ఈ తాత్కాలిక నియంత్రణలను ప్రవేశపెట్టింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సరసమైన ధరలకు ఇంధనాన్ని సమానంగా పంపిణీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.ధరల వ్యత్యాసంతో పెరిగిన డిమాండ్అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ సాధారణ వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిటైల్ ధరలను నియంత్రించాయి. ఉదాహరణకు ఢిల్లీలో రిటైల్ బంకుల వద్ద డీజిల్ ధర లీటరుకు రూ.95.20 ఉండగా బల్క్ (భారీ) కొనుగోలుదారులకు లీటరుకు రూ.134.50గా ఉంది.ఈ భారీ ధరల వ్యత్యాసం (లీటరుకు దాదాపు రూ.39) కారణంగా భారీ పారిశ్రామిక వినియోగదారులు నేరుగా రిటైల్ బంకులను ఆశ్రయించారు. ఫలితంగా జూన్ ప్రారంభంలో చమురు సంస్థలకు డీజిల్పై లీటరుకు రూ.36.5, పెట్రోల్పై రూ.9 చొప్పున ఆదాయ నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా డిమాండ్ పెరిగి కృత్రిమ కొరత ఏర్పడింది.టెలికాం టవర్లు, ట్రక్కింగ్ కంపెనీలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సులు, విద్యుత్ ఉత్పాదక పరిశ్రమలు రిటైల్ బంకుల వైపు మళ్లడంతో.. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ (నిల్వ ఉంచడం) అరికట్టేందుకు ప్రభుత్వం ఈ పరిమితిని విధించాల్సి వచ్చింది.ఇప్పుడు ఎందుకు ఎత్తివేశారు?పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమీక్ష ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సంతృప్తికరంగా ఉంది. దేశీయ సరఫరా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడటంతో పాటు సాధారణ పంపిణీ ఏర్పాట్లు పునరుద్ధరించారు. అందువల్ల జూన్ 12 నాటి ఆర్డర్ను కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన ప్రభుత్వం ఆంక్షలను ఉపసంహరించుకుంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
15 ఏళ్ల డాలర్ బంధానికి ముగింపు!
ఒక దేశపు కరెన్సీ విలువను మరో దేశపు కరెన్సీతో స్థిరంగా అనుసంధానించి ఉంచడం.. ఆ తర్వాత ఆ బంధాన్ని తెంచుకోవడం సాధారణ నిర్ణయం కాదు. అలాంటి కీలక అడుగే ఇప్పుడు బొలీవియా వేసింది. 15 ఏళ్లుగా కొనసాగిన డాలర్ పెగ్ విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? డాలర్ పెగ్ను వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మార్పు బొలీవియా ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేయనుంది? పరిశీలిస్తే..సాధారణంగా ఒక దేశ కరెన్సీ విలువ మార్కెట్లో డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువను అమెరికన్ డాలర్కు స్థిరంగా కట్టిపెడతాయి. దీనినే "డాలర్ పెగ్" అంటారు. బొలీవియా కూడా గత 15 ఏళ్లుగా తన కరెన్సీ అయిన "బొలివియానో" విలువను డాలర్తో స్థిరంగా కొనసాగించింది. మార్కెట్లో పరిస్థితులు ఎలా మారినా.. ఒక నిర్దిష్ట మారకపు రేటును ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. ఇందుకోసం భారీ మొత్తంలో డాలర్ నిల్వలు అవసరమవుతాయి.సడన్గా ఎందుకు?..ఇటీవలి కాలంలో బొలీవియా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దేశ విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంధన దిగుమతులు, విదేశీ చెల్లింపుల కోసం అవసరమైన డాలర్లను సమకూర్చడం ప్రభుత్వానికి భారంగా మారింది. మరోవైపు మార్కెట్లో డాలర్ల కొరత తీవ్రమైంది. అధికారిక మారకపు రేటు ఒకలా ఉండగా, బ్లాక్ మార్కెట్లో డాలర్ ధర మరింత ఎక్కువగా పలుకుతోంది. దీంతో ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి బ్లాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో పాత విధానాన్ని కొనసాగించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావించింది.ఇకపై..డాలర్ పెగ్ విధానాన్ని రద్దు చేయడంతో ఇకపై బొలీవియా కరెన్సీ విలువ మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది. అంటే డిమాండ్, సరఫరా ఆధారంగా కరెన్సీ విలువ పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు. ఈ నిర్ణయం తర్వాత బొలివియానో విలువ గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దీని ప్రభావంగా.. దిగుమతి వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో కరెన్సీ నిజమైన మార్కెట్ విలువను ప్రతిబింబించడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరికొన్ని దేశాలు..బొలీవియా నిర్ణయం ప్రపంచానికి కొత్తేమీ కాదు. గతంలో అనేక దేశాలు డాలర్తో ఉన్న స్థిర అనుబంధాన్ని వదిలేశాయి. దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనా 1990లలో తన కరెన్సీ పెసోను డాలర్కు 1:1 నిష్పత్తిలో కట్టిపెట్టింది. కానీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా 2002లో ఆ విధానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం అర్జెంటీనా కరెన్సీ భారీగా విలువ కోల్పోయింది. అలాగే కజకిస్తాన్ 2015లో, ఈజిప్ట్ 2016లో తమ కరెన్సీలను మార్కెట్ ఆధారిత విధానానికి మార్చాయి. నైజీరియా కూడా గత కొన్నేళ్లుగా విదేశీ మారక సంక్షోభం నేపథ్యంలో కరెన్సీపై నియంత్రణలను సడలిస్తోంది.అయితే మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్ వంటి దేశాలు ఇప్పటికీ డాలర్ పెగ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దేశాల వద్ద భారీ విదేశీ మారక నిల్వలు ఉండటం ఇందుకు ప్రధాన కారణం.ఒక దేశం తన కరెన్సీని డాలర్కు కట్టిపెట్టడం ఎంత కష్టమో, ఆ బంధాన్ని తెంచుకోవడం కూడా అంతే కీలక నిర్ణయం. బొలీవియా తీసుకున్న తాజా నిర్ణయం ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో చెబుతూనే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యం, కరెన్సీ విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది.భారత్ డాలర్ పెగ్ విధానాన్ని అనుసరించదు. మన కరెన్సీ రూపాయి 'మేనేజ్డ్ ఫ్లోట్' విధానంలో ఉండటంతో.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాని విలువ మారుతుంటుంది. అయితే రూపాయిలో తీవ్ర ఒడిదొడుకులు రాకుండా అవసరమైనప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. -
లాకర్.. సేఫేనా?
ఏళ్ల తరబడి కూడబెట్టిన బంగారం. వారసత్వంగా వస్తున్న కుటుంబ నగలు, విలువైన ఆస్తిపత్రాలు లాకర్లో ఉంటే చాలు ఇక టెన్షన్ లేదు అనే నమ్మకం భారతీయ కుటుంబాల్లో బలంగా ఉంది. విలువైన సంపదనంతా లాకర్లో దాచేసి తాళం చెవిని చూసుకుంటూ అంతా సేఫ్ అనుకునే రోజులు పోయాయి. దేశంలోని పలు నగరాల్లో ఇటీవలి కాలంలో వరుసగా వెలుగుచూసిన బ్యాంక్ లాకర్ వివాదాలు ప్రజల నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నాయి. లాకర్లో ఉంచిన నగలు మాయమైతే బ్యాంకు బాధ్యత పరిమితమే అనే విషయం లాకర్లో వస్తువులు మాయమయ్యాక తెలుస్తోంది. నష్టపోయిన వస్తువులకు బ్యాంకులు చెల్లించే పరిహారం పోగొట్టుకున్న వాటి పూర్తి విలువలో పావువంతు కూడా ఉండదన్న విషయం అనేకమందికి చేతులు కాలాక కానీ అవగాహనకి రావడంలేదు. లాకర్ నిజంగా మీ విలువైన వస్తువులకు భద్రత ఇస్తుందా... ఇస్తే అది ఎంత భద్రత ఇస్తుంది? బంగారం, ఆస్తి పత్రాలను పూర్తిగా కాపాడుకోవాలంటే ఇంకేం చేయాలి అని వివరించి గైడ్ చేసే వెల్త్ స్టోరీ...బెంగళూరులో ఒక డాక్టర్ బ్యాంక్ లాకర్లో దాచుకున్న రూ.24 లక్షల విలువైన బంగారం పోయింది. మరో కేసులో ఢిల్లీలో ఓ కుటుంబం లాకర్లో ఎప్పటినుంచో పెడుతున్న రూ.60 లక్షల నగలు ఒకసారి కనిపించకుండా పోయాయి. సీసీటీవీలు ఉన్నాయి. ఫుటేజీల్లో పోయిన విషయం వెల్లడైంది. అయినా బాధితులకు న్యాయం అందలేదు. ఇక్కడ అసలు షాక్ ఏమిటంటే బ్యాంక్కు మీ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయాల్సిన బాధ్యత లేదు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం మీకు తెలియాల్సిన నిజం ఏమిటంటే ,బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు బాధ్యత లాకర్ రెంట్కు వంద రెట్లు మాత్రమే.. లాకర్లో వస్తువులు పోతే కస్టమర్ చెల్లించే లాకర్ రెంటుకు వంద రెట్లు నష్టపరిహారం మాత్రమే బ్యాంకు చెల్లిస్తుంది. అంటే ఒక లాకర్కు ఏడాదికి రూ.7000 అద్దె కడుతుంటే నష్టపోయినపుడు దక్కే పరిహారం రూ.7 లక్షలు మాత్రమే. పోగొట్టుకున్న మీ సంపద 70 లక్షలకు పైగా ఉన్నా దక్కేది అదే..అంటే బ్యాంక్ లాకర్ మాత్రమే విలువైన వస్తువులకు సేఫ్ కాదు. మరి బంగారాన్ని, ఇతర వస్తువులు, డాక్యుమెంట్లు ఎలా రక్షించుకోవాలి? అందుకు మల్టీ లేయర్ స్ట్రాటజీ పాటించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఒక రక్షణ పద్ధతిపై మాత్రమేఆధార పడటం ప్రమాదకరం. ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నది కూడా మల్టీలేయర్ ప్రొటెక్షన్ స్ట్రాటజీనే అదేమీ బంగారం, డాక్యుమెంట్స్కు అసలైన భద్రత.జ్యువెలరీ ఇన్సూరెన్స్ఎక్కువ మంది పట్టించుకోని పెద్ద రక్షణభారతదేశంలో నగలు కొనేవారు ఇంటికి ఒకరు చొప్పున కోట్లలో ఉన్నా కొన్న నగలకు ఇన్సూరెన్స్ చేసే వారు మాత్రం అరుదే. లక్షల విలువ చేసే నగలు కొనగానే బీమా చేస్తే దొంగతనం జరిగినపుడు అది ఇంట్లో అయినా, బయట అయినా. లాకర్ లో జరిగినా పూర్తిగా నష్టపరిహారం బీమా రూపంలో అందుతుంది. అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు, ప్రయాణాల్లో నగలు పోగొట్టుకున్నా బీమా భద్రత పూర్తిగా లభిస్తుంది.ఇది బ్యాంకు తప్పిదంవల్ల జరిగిన నష్టానికి అందే పరిహారం కంటే ఎక్కువ. బ్యాంక్ కవరేజ్ లిమిట్ను దాటి, అసలు విలువను రక్షించేది ఇదే.ప్రీమియం ఎంత? సంవత్సరానికి 0.3శాతం నుంచి 1శాతం లోపే రూ.10 లక్షల బంగారానికి రూ.3,000 రూ.10,000 వరకు మాత్రమే అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పాలసీలో మీరు డిక్లేర్ చేసిన నగలకు మాత్రమే కవరేజ్ లభిస్తుంది. బీమా చేశాక నగలు కొత్తగా కొంటే వాటిని బీమాలో అప్డేట్ చేయాలిజ్యువెలరీ వాల్యుయేషన్చిన్న తప్పు, పెద్ద నష్టంమీ నగల విలువను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మదుపు చేయించాలి. అదీ పాత బిల్లుతో కాదు. ప్రస్తుత మార్కెట్ విలువతో ఇన్సూర్ చేయించాలి. ఎందుకంటే పదేళ్ల క్రితం కొన్న బంగారం విలువ ప్రస్తుతం అనేక రెట్లు పెరిగి ఉంటుంది. పాత విలువతో బీమా చేయిస్తే పోగొట్టుకున్నప్పుడు లభించే బీమా క్లెయిమ్ తక్కువే ఉంటుంది. అందుకే నగలను ఎప్పటికప్పుడు సర్టిఫైడ్ జ్యువెలర్తో వాల్యుయేషన్ చేయించాలి. కనీసం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారైనా అప్డేట్ చేసుకోవాలి.హోమ్ సేఫ్ ఏర్పాటుఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ప్రతి ఇంట్లో ఉండాల్సిన మినీ వాల్ట్ ఉండాలి. రోజువారీ క్యాష్, నగల కోసం ఇంట్లో ఒక మంచి హోమ్ సేఫ్ ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే దృఢమైన స్టీల్ బాడీతో తయారు చేసినదై ఉండాలి. పిన్/ ఫింగర్ ప్రింట్ లాక్ సౌకర్యం ఉండాలి. అగ్ని ప్రమాదాలను తట్టుకునేలా ఫైర్ రెసిస్టెంట్ అయి ఉండాలి. గోడకు కానీ నేలకు కానీ బిగించాలి. రూ.5000 నుంచి 25000 ఖర్చుతో సేఫ్ ఏర్పాటు చేసుకుని తరచూ వేసుకునే నగలతోపాటు, లాకర్లో పెట్టిన వస్తువుల కాపీలు, రసీదులు, డాక్యుమెంట్ల జిరాక్సులు రెడీగా ఉంచుకోవాలి.హోమ్ ఇన్సూరెన్స్ అండర్ రేటెడ్ కవరేజ్చాలా మందికి హోమ్ ఇన్సూరెన్స్ ఉండదు. ఫరి్నచర్, ఎల్రక్టానిక్స్ వస్తువులతో పాటు, నగలు కూడా (సబ్ లిమిట్)తో బీమా చేయించాలి. జువెలరీ లిమిట్ ని అదనంగా పెంచుకోవచ్చు.డిజి లాకర్డాక్యుమెంట్లకు డిజిటల్ రక్షణభారత ప్రభుత్వం పౌరులందరికి అందిస్తున్న ఫ్రీ సర్వీస్ ఈ డిజిలాకర్.. డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డులు, రిజి్రస్టేషన్ కార్డులు వంటి డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో ఇక్కడ దాచుకో?వచ్చు. ఇవన్నీ ఎక్కడైనా లీగల్గా వాలిడిటీ కలిగి ఉంటాయి. ఎక్కడైనా, ఎక్కడినుంచైనా ఇంటర్ నెట్ ద్వారా, ఫోన్లో కూడా యాక్సెస్ చేయచ్చు. అయితే ఒకవిషయం గుర్తుంచుకోవాలి. డిజి లాకర్లో అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లు స్కాన్ కాపీలు మాత్రమే. రిఫరెన్స్ కోసమే. ఒరిజినల్స్ను మరోచోట సేఫ్ గా భద్రపరచుకోవాలి.ప్రాపర్టీ డాక్యుమెంట్స్స్మార్ట్ హ్యాండ్లింగ్ తప్పనిసరిఇళ్లు, స్థలాలకు సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్లు పోతే వాటిని తిరిగి పొందడానికి, కనీసం డూప్లికేట్ కాపీలు సంపాదించడానికి సంవత్సరాలు సాగుతాయి. అందువల్ల డాక్యుమెంట్ కాపీలను మల్టిపుల్ కాపీలు గా చేసి లాకర్తో పాటు, ఇంట్లో, దగ్గరి బంధువులు, స్నేహితులు దగ్గర ఒక కాపీ ఉంచాలి. హైక్వాలిటీ స్కాన్ చేయించి గూగుల్ డ్రైవ్లో, డిజిలాకర్లో అప్లోడ్ చేయాలి. ఒక కాపీని పర్సనల్ మెయిల్కి పంపుకుని సేవ్ చేసి ఉంచుకోవాలి?డాక్యుమెంటేషన్పోయిన వస్తువుల, నగల క్లెయిమ్కు ఇదే బేస్కొన్న ప్రతి నగకు ఫోటోలు తీయించాలి. వాటి వెయిట్, ప్యూరిటీ నోట్ చేసి ఉంచాలి. బిల్లులు అన్నీ ఎక్స్ ట్రా కాపీ భద్రంగా ఉంచాలి. ఎక్కడ ఉంచారో రికార్డు చేయాలి. ఈ రికార్డు లేకపోతే బీమా క్లెయిమ్ రిజెక్ట్ అయే చాన్స్ ఎక్కువ.లాకర్లో నగలు మాయమైతే ఏం చేయాలి? బ్యాంకు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. సీసీటీవీ ఫుటేజ్ అడిగి తీసుకోవాలి, వెంటనే బీమా కంపెనీకి సమాచారం అందించాలి. నగలకు సంబంధించిన ఫొటోలు, విలువకు సంబంధించిన పత్రాల కాపీలు అందించాలి. బెంగళూరు, ఢిల్లీ కేసులు యాదృచ్ఛికం కాదు నిర్లక్ష్యానికి హెచ్చరిక. అన్ని వస్తువులకు బ్యాంకు లాకరే భద్రత కాదు. అసలు భద్రత సిస్టమ్ ప్లస్ ప్లానింగ్. సేఫ్టీ అనేది ప్రమాదం సంభవించిన తర్వా త కాదు. ముందే నిర్మించుకోవాల్సిన విషయం. -
మీ రూపాయికీ చిల్లు పడుతోందా?
బంగారాన్ని కొనవద్దంటూ ఆంక్షలు విధించినా... దిగుమతి సుంకం అమాంతం పెంచేసినా... అదంతా మన దిగుమతుల బిల్లు భారం తగ్గించుకోవటానికే. విదేశీ ప్రయాణాలు వద్దని సాక్షాత్తూ ప్రధానమంత్రి సూచించటం ఒకెత్తయితే... దేశీయంగా పెట్రోలు వాడకాన్ని తగ్గించడానికి అందులో కలిపే ఇథనాల్ మోతాదును పెంచటం కూడా చేస్తోంది ప్రభుత్వం. పైపెచ్చు 100 శాతం ఇథనాల్ అంటూ కొత్త వాహనాలను, ఇంధనాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు కూడా. ఇదంతా ఎందుకంటే దిగుమతుల బిల్లు తగ్గించుకోవటానికి. అంతకంతకూ కరిగిపోతున్న రూపాయి విలువను కాస్తయినా పటిష్ఠంగా ఉంచడానికి. కానీ డాలర్తో మారకంలో రూపాయి ఇప్పటికే భారీగా పతనమైపోయింది. ఎల్రక్టానిక్ గాడ్జెట్లతో సహా తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన చాలా వస్తువుల ధరలు పైకి ఎగిశాయి. దేశీయంగా పెట్రోలు ధరలు పెరగటం ఫలితంగా చాలా వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వెరసి సామాన్యుడి బడ్జెట్ తల్లకిందులయింది. ఈ నేపథ్యంలో ఏ వర్గంపై ఎలాంటి ప్రభావం పడుతోంది? వారు బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని వివరించేదే ఈ సాక్షి వెల్త్ స్టోరీ...ఐటీ, ఫైనాన్స్, స్టార్టప్లవ్యాప్తంగా ఒకప్పుడు పుష్కలంగా కొలువులు వచి్చనా... ఇప్పుడు ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారింది. నెలంతా అప్పులతో నెట్టుకొచ్చి జీతం రాగానే చెల్లించేసే చాలా మంది వేతన జీవులకు ఈ అనిశ్చితి సమస్యాత్మకంగా ఉంటోంది. వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాల ఈఎంఐలు గుదిబండగా మారుతున్నాయి. జీతాలు పెరిగినా పెరగకపోయినా.. పెరిగిపోయే స్కూలు, కాలేజీ ఫీజులు కట్టడమెలా అని తలపట్టుకుంటున్నారు. అటు పదవీ విరమణ చేసిన వారి సంగతి తీసుకుంటే వైద్యం ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది కదా అని ఫిక్స్డ్ డిపాజిట్లలో కాస్తో కూస్తో దాచుకున్నా.. దానిపై వచ్చే వడ్డీ అంతంతమాత్రమే. ఈ వడ్డీ పెరిగే ధరల భారాన్ని తట్టుకునేందుకు సరిపోయేట్లు ఏమాత్ర ఉండటం లేదు. ఇక చిరు వ్యాపార వర్గాలను చూస్తే.. రవాణా ఖర్చులు, మెటీరియల్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పైపెచ్చు వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించుకుంటూ ఉండటంతో అమ్మకాలు పడిపోతూ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. అయిదు హెచ్చరిక సంకేతాలు.. పరిస్థితి అదుపు తప్పుతోందనడానికి ఓ అయిదు హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అవి కనిపించగానే, వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి. ఇంతకీ ఆ హెచ్చరిక సంకేతాలేమిటంటే..1. క్రెడిట్ కార్డు బాకీలను ప్రతి నెలా క్యారీ ఫార్వార్డ్ చేస్తుండటం 2. ఈఎంఐల భారం ఆదాయంలో 40 శాతానికి పైగా ఉండటం 3. అత్యవసర నిధి అంటూ లేకపోవడం 4. వచ్చే ఆదాయంలో పొదుపు మొత్తం 10% కూడా లేకపోవడం5. ఆరోగ్య బీమా లేకపోవడం ఇలా చేద్దాం.. పరిష్కారం 1: ఒక ఏడాదికి సరిపడే అత్యవసర నిధి గతంలో ఎలాంటి అత్యవసరాన్నైనా ఎదుర్కోవాలంటే ఒక ఆరు నెలల ఖర్చులకు సరిపడా దాచిపెట్టుకుంటే సరిపోయేది. కానీ జాబ్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం, హెల్త్ ఎమర్జెన్సీలు తలెత్తుతుండటం, ధరలు పరుగులు తీస్తున్న తరుణంలో కనీసం 9–12 నెలల అవసరాలకు సరిపోయేంత మొత్తాన్ని తక్షణం తీసుకోవటానికి వీలుగా పక్కన పెట్టుకోవడం అనివార్యం. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్, సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుచుకోవచ్చు. పరిష్కారం 2: కొత్త భారీ రుణాలకు దూరం.. సాధ్యమైనంత వరకు భారీ స్థాయి రుణాలకు అంటే.. లగ్జరీ కార్ లోన్స్, వ్యక్తిగత రణాలు, ఈఎంఐలతో క్రెడిట్ కార్డుల మీద పెద్ద మొత్తాల్లో కొనుగోళ్లు చేయటం వంటి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. పైగా వడ్డీ రేటు అధికంగా ఉండే అప్పును తీర్చేయడం లక్ష్యంగా పెట్టుకుంటే మరీ మంచిది. వడ్డీ రూపంలో కట్టాల్సిన ఒక్క రూపాయిని ఆదా చేసినా.. పన్నుల భారం లేకుండా కాస్త అదనపు ఆదాయాన్ని అందుకున్నట్లే.పరిష్కారం 3: ఈక్విటీల్లో క్రమంగా పెట్టుబడులుచారిత్రకంగా చూస్తే కరెన్సీ బలహీనపడినప్పుడల్లా బంగారం ఆదుకుంటూ వస్తోంది. పెరిగే ధరలను ఎదుర్కొనగలిగేలా ఈక్విటీలు.. అంటే షేర్లు మెరుగైన రాబడులు అందిస్తూ వస్తున్నాయి. కాబట్టి మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయనే కారణంతో పెట్టుబడులను ఆపేయకుండా సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసే వారు.. కొనసాగిచడమే మంచిది. పరిష్కారం 4: బంగారంలో 10–15% పెట్టుబడి.. పసిడిలో ఎంతో కొంతైనా పెట్టుబడి పెడితే కష్టకాలంలో ఉపయోగపడుతుంది. కనుక మొత్తం పోర్ట్ఫోలియోలో ఓ 10–15% బంగారానికి కేటాయించండి. గోల్డ్ ఈటీఎఫ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లలో (మళ్లీ ప్రవేశపెడితే) ఇన్వెస్ట్ చేయొచ్చు. కుటుంబ అవసరాల మేరకే ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు. లేకపోతే ఎల్రక్టానిక్ పద్ధతిలో కొనుక్కోవడమే శ్రేయస్కరం. సాధారణంగా రూపాయి బలహీనపడినప్పుడు, అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగినప్పుడు పసిడికి డిమాండ్ పెరుగుతుంది. పరిష్కారం 5: బీమా కవరేజీని సమీక్షించుకోవాలిప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా, అలాగే ఆర్జించే కుటుంబ సభ్యుల పేరిట టర్మ్ పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. అంతే కాదు.. కవరేజీ కూడా సరిపోయేంతగా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే, ఏదైనా సంక్షోభం ముంచుకొస్తే తప్ప చాలా మందికి .. తాము తీసుకున్న బీమా కవరేజీ.. తమ అవసరాలకు సరిపోయేంతగా లేదనే విషయం తెలియదు. కాబట్టి పాలసీ తీసుకుని మర్చిపోవడం కాకుండా.. ప్రతి సంవత్సరం కవరేజీని సమీక్షించుకుంటూ, అవసరాన్ని బట్టి పెంచుకుంటూ ఉండాలి. పరిష్కారం 6: కొత్త నైపుణ్యాలు.. అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఇది అన్నింటికంటే ముఖ్యమైన పరిష్కారం. 40 ఏళ్ల పైబడిన ప్రొఫెషనల్స్ ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ, తమను తాము అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఏఐ గురించి తెలుసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియ్లల్ ప్లానింగ్ సర్టిఫికేషన్లు, తాము చేసే రంగాలకు సంబంధించి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉండాలి. తద్వారా పెట్టుబడులపై రాబడులు ఎలా ఉన్నా ఆదాయం అధికంగా ఉంటే ధరల దాడిని కొంత మేర అయినా సమర్ధంగా ఎదుర్కొనవచ్చు. పరిష్కారం 7: వివిధ ఆదాయ మార్గాలు కేవలం జీతం మీదే ఆధారపడితే సరిపోదు. వేరే వేరే ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. కన్సలి్టంగ్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ట్యూషన్లు, ఆన్లైన్ సరీ్వసులు.. ఇలా అదనంగా కనీసం ఒక్క ఆదాయ మార్గమైనా పక్కన ఉంటే... ఆర్థికంగా స్ట్రెస్ కాస్త తగ్గుతుంది. పరిష్కారం 8: ‘విదేశీ’ తగ్గించుకోవాలి రూపాయి పతనం వల్ల విదేశీ ప్రయాణాలు, చదువులు, దిగుమతి చేసుకున్న గ్యాడ్జెట్లు.. చాలా ఖరీదైన వ్యవహారంగా మారతాయి. కాబట్టి అనవసరమైన అప్గ్రేడ్స్ జోలికి వెళ్లకూడదు. వీలైనంత వరకు వాయిదా వేసుకోతగిన వాటి కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం మంచిది. పరిష్కారం 9: నాణ్యమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి అనిశ్చితి నెలకొన్న వేళ.. పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్యాలెన్స్ షీటు పటిష్టంగా ఉన్నవి, స్థిరంగా క్యాష్ ఫ్లో ఉన్నవి, క్రమం తప్పకుండా డివిడెండ్లు చెల్లించే కంపెనీలను పరిశీలించి, అలాంటి షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి. భారీగా రుణభారం ఉన్న స్పెక్యులేటివ్ స్టాక్స్ జోలికి పోవద్దు. పరిష్కారం 10: బిజినెస్లాగే బడ్జెట్ వ్యాపారం చేస్తుంటే ప్రతిదీ ఎలా లెక్కేస్తామో ఇంటి బడ్జెట్లోనూ అలాగే ఉండాలి. ఇంటి ఈఎంఐలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, రవాణా, వినోదం ఇలా అన్నింటినీ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అనవసరమైన సబ్్రస్కిప్షన్లు, ఫుడ్ డెలివరీలు, ఆత్రం కొద్దీ కొనేసే వాటివల్ల ఎంత దుబారా అవుతోందనేది చాలా కుటుంబాలు గ్రహించవు. ఇలాంటి ఖర్చులను నివారిస్తే బోలెడు ఆదా అయినట్లే. -
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు చెబుతున్నారు.మే 10న ప్రధానమంత్రి బంగారం కొనుగోలును ఒక ఏడాది వాయిదా వేయాలని చెప్పినప్పుడు, 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,53,140గా ఉండగా, వెండి ధర కేజీ సుమారు రూ.2,62,350గా ఉంది. అయితే నేటికి (జూన్ 28) ఆ ధర బంగారం ధర రూ.1,39,873కి తగ్గగా, వెండి ధర రూ.2,16,541కి పడిపోయింది. అంటే.. మోదీ ప్రకటన తరువాత గోల్డ్ రేటు సుమారు రూ.13,267 తగ్గగా, వెండి దాదాపు రూ.45,809 తగ్గింది.భారత్లో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై భారీ ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి అవసరం ఉంటే తప్పా.. బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరారు.ప్రధాని విజ్ఞప్తి తరువాత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీని ద్వారా దిగుమతులను తగ్గించడంతో పాటు.. దేశీయ మార్కెట్పై నియంత్రణ సాధించాలని భావించారు. అనుకున్న విధంగానే.. ఈ నిర్ణయం వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపించిందని తెలుస్తోంది. -
జూన్ 30 తర్వాత పాత నోట్ల రద్దు?: స్పందించిన బ్యాంక్
2026 జూన్ 30 తర్వాత పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్వీకరించదని ఒక వార్త వైరల్ సోషల్ మీడియాలో అయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. చాలామంది ఇది మరోసారి పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జరుగుతుందేమోనని భావించారు. అయితే.. ఈ వార్త పూర్తిగా అసత్యమని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారికంగా స్పష్టం చేసింది.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన అధికారిక ఫేస్బుక్ పేజీలో #FakeMessageAlert హ్యాష్ట్యాగ్తో ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో, ''2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను 2026 జూన్ 30 తర్వాత మా శాఖలు స్వీకరించవని ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం పూర్తిగా తప్పు. వినియోగదారులు ఇలాంటి తప్పుడు సందేశాలను నమ్మవద్దు, ఇతరులకు పంపవద్దు. అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి'' అని తెలిపింది.A false message is being circulated claiming that pre-2005 ₹10, ₹20, ₹50 & ₹100 notes will not be accepted after 30th Jun'26. Bank of Maharashtra clarifies that this information is incorrect. Customers are requested to rely only on official sources for authentic information. pic.twitter.com/afF5czNO7e— Bank of Maharashtra (@mahabank) June 26, 2026వైరల్ వార్తలో జరిగిన ప్రచారంవైరల్ అయిన కథనాల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పాత నోట్లను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని, త్వరలో ఇతర బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను వెంటనే మార్చుకోవాలని భావించారు. అయితే.. ఈ ప్రచారాన్ని బ్యాంక్ పూర్తిగా ఖండించింది. అంతే కాకుండా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా దీనికి సంబంధించిన ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది.ఆర్బీఐ ప్రకటన2015లో ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చలామణి తగ్గిపోయిందని, అవసరమైతే ప్రజలు వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే.. ఆ నోట్లు చట్టబద్ధమైన కరెన్సీ (Legal Tender)గానే కొనసాగుతాయని కూడా స్పష్టంగా తెలిపింది. కొత్త నోట్లలో భద్రతా ఫీచర్లు మెరుగ్గా ఉండటంతో నకిలీ నోట్ల తయారీని అరికట్టడం సులభమవుతుందని ఆర్బీఐ వివరించింది. కానీ.. పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు లేదా చెల్లుబాటు కాకుండా చేస్తున్నట్లు ఎప్పుడూ ప్రకటించలేదు.ఇదీ చదవండి: 35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్ -
చల్లారుతున్న చమురు ధరల మంటలు
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలకు మార్గం సుగమమై, సరఫరా మెరుగుపడుతుండటంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరులో అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మొదలు కావడానికి ముందు స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కి 72–73 డాలర్లకు, అమెరికా క్రూడాయిల్ రేటు 70 డాలర్లకు దిగి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇవి ఒక దశలో 120 డాలర్లకు ఎగిసిన సంగతి తెలిసిందే.ఇక ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడానికి ముందు రోజున .. అంటే ఫిబ్రవరి 27న భారత్ కొనుగోలు చేసే ముడిచమురు బాస్కెట్ ధర 71.17 డాలర్లు పలికింది. తాజాగా కేంద్ర చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్, అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) డేటా ప్రకారం జూన్ 24న ఇది 70.71 డాలర్లకు నెమ్మదించింది. జూన్ పూర్తి నెలకు గాను సగటు ధర 86.31 డాలర్లుగా ఉంది. ఫిబ్రవరిలో ఇది 72.47గా నమోదైంది. భారత్కి ఊరట... ముడిచమురు కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. సుమారు 88 శాతం క్రూడాయిల్ని దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బ్యారెల్ ధర కనీసం 10 డాలర్లు తగ్గినా ఏటా బిలియన్ల కొద్దీ డాలర్ల స్థాయిలో దిగుమతుల బిల్లు ఆదా అవుతుంది. కరెంటు అకౌంటు లోటు తగ్గుతుంది. అలాగే, ఇంధన, రవాణా, తయారీ వ్యయాలు తగ్గడం ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం నెమ్మదిస్తుంది. ప్రభుత్వంపై ఇంధన సబ్సిడీల భారం కూడా తగ్గి .. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఇంధనాల రేట్లు తగ్గడం వల్ల పెట్రోకెమికల్ డెరివేటివ్స్ కీలకంగా ఉండే ఏవియేషన్, పెయింట్స్, కెమికల్స్, లాజిస్టిక్స్, కన్జూమర్ గూడ్స్ తదితర రంగాలకు కూడా ఊరట లభిస్తుంది. దీన్ని ప్రతిబింబిస్తూ, ఇంధనాలను విరివిగా ఉపయోగించే కంపెనీల మార్జిన్లు బాగుంటాయనే ఇన్వెస్టర్ల అంచనాలతో వాటి షేర్లు ఇప్పటికే పుంజుకోవడం కనిపిస్తోంది. ఇక, ఇంధనాల దిగుమతులకు డాలర్లను చెల్లించడం తగ్గుతుంది కాబట్టి, వాటికి డిమాండ్ నెమ్మదించి రూపాయి మారకం విలువ పెరుగుతుంది. తగ్గుదల స్థిరంగా ఉంటేనే.. గ్లోబల్గా క్రూడాయిల్ ధరలు ఎగియడంతో ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ. 7.50 మేర పెంచిన సంగతి తెలిసిందే. అయితే, ముడి చమురు ధరలు రికార్డు స్థాయుల నుంచి తగ్గినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం అవి తగ్గించలేదు. దీనితో ధర ధరలను రోజువారీగా కాకుండా అంతర్జాతీయంగా గడిచిన పక్షం, నెల రోజుల సగటు రేట్లను బట్టి ఆయిల్ కంపెనీలు సవరిస్తాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఒకవేళ క్రూడాయిల్ రేట్లు నిలకడగా తక్కువ స్థాయిలోనే కొనసాగిన పక్షంలో పెట్రోల్ బంకుల్లో ఆ ప్రయోజనాలు కనిపించాలంటే కొంత సమయం పట్టొచ్చని వివరించాయి. గ్లోబల్గా క్రూడాయిల్ రేట్లు భారీగా పెరిగినప్పటికీ దాదాపు రెండున్నర నెలల తర్వాతే ఆయిల్ కంపెనీలు ఇంధనాల రేట్లను పాక్షికంగా పెంచినట్లు పేర్కొన్నాయి.ప్రస్తుతం ముడిచమురు ధరలు తగ్గిన తరుణంలో డీజిల్ విక్రయాలపై స్వల్ప నష్టాలు వస్తున్నప్పటికీ పెట్రోల్పై మెరుగ్గా మార్జిన్లు లభిస్తున్నాయని అధికారులు వివరించారు. ఆయిల్పై ఆందోళన తగ్గడమనేది ప్రభుత్వ స్పందనలోనూ కనిపిస్తోంది. ఉద్రిక్తతలు మొదలైన తర్వాత నుంచి అంతర్ మంత్రిత్వ శాఖలకు ప్రతి రోజూ తాజా పరిస్థితుల గురించి బ్రీఫింగ్ జరిగేది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై కీలక మంత్రిత్వ శాఖల అధికారులు ఇందులో చర్చించేవారు. పరిస్థితి మెరుగుపడే కొద్దీ ఈ సమావేశాల నిర్వహణ నెమ్మదిగా వారానికి రెండు సార్లకు తగ్గింది. సాధారణంగా సోమవారం, గురువారం బ్రీఫింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, ఈ వారం అసలు సమావేశాలే జరగలేదు. -
రేటు పెంపు చెప్పే చేస్తాం!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని, రేట్ల పెంపు విషయమై ఈ దశలో మాట్లాడడం తొందరపాటు అవుతుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ‘‘ఇందుకు (రేటు పెంపు) మార్కెట్ను సన్నద్ధం చేయాలని అనుకుంటే, మా వైఖరి మార్చుకునే వాళ్లం కదా!.. రానున్న నెలల్లో రేట్లు పెంచుతామన్న స్పష్టతతో ఉంటే మా వైఖరిని తటస్థం నుంచి నియంత్రిత విధానానికి మార్చుకుని ఉండే వాళ్లం. కానీ, అలా చేయలేదు. కనుక ఇప్పుడే రేటు పెంపు గురించి మాట్లాడడం భావ్యం కాదు. మేం అప్రమత్తంగా ఉన్నామని చెప్పాం. ద్రవ్యోల్బణం, వృద్ధికి సంబంధించి రిస్్కలు ఉన్నాయని తెలుసు. కనుక డేటా ఆధారితంగా వ్యవహరిస్తాం’’అని మల్హోత్రా వివరించారు.ఈ నెల ఆరంభంలో జరిగిన ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించడం తెలిసిందే. పశ్చిమాసియా ఘర్షణల కారణంగా ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం, వృద్ధికి సవాళ్లు పొంచి ఉండడంతో, వేచి చూసే వైఖరిని అనుసరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026–27) వృద్ధి అంచనాను సైతం గతంలో వేసిన 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించడం గమనార్హం. ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. పైగా తటస్థ విధానాన్నే కొనసాగించింది. ప్రపంచానికి సానుకూలం పశి్చమాసియా ఘర్షణలు ఉపశమించడం ప్రపంచానికి, భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలమని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. వృద్ధి, ద్రవ్యోల్బణం పరంగానూ అనుకూలమని పేర్కొన్నారు. చమురు, ఎరువుల ధరలు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు సౌకర్యాన్నిస్తుందన్నారు. ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇంధన ధరల పెరుగుదల భారాన్ని వినియోగదారులపై ఎక్కువగా పడకుండా వ్యవహరించాయని, ఈ అనిశి్చతులను భారత్ గొప్పగా ఎదుర్కోందని చెప్పారు. చమురు ధరలకుతోడు నైరుతి రుతుపవనాల పురోగతిని సైతం ఆర్బీఐ పరిశీలిస్తున్నట్టు మల్హోత్రా చెప్పారు. రానున్న రోజుల్లో ద్రవ్యల్బణం తీరును ఇవే ప్రభావితం చేస్తాయన్నారు. -
జీడీపీ వృద్ధికి సవాళ్లు..!
ముంబై: అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం విఫలమైనా, నైరుతి రుతుపవనాలు బలహీన పనితీరు చూపించినా భారత ఆర్థిక వ్యవస్థ... వృద్ధి పరంగా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బీఐ తాజా బులెటిన్ పేర్కొంది. పశ్చిమాసియాకు సంబంధించి మధ్యంతర శాంతి ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అవరోధాలు కొనసాగుతున్నట్టు ప్రస్తావించింది.అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. పపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘ఈ ఒప్పందం విచ్ఛిన్నం అయితే తిరిగి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగిపోతాయి. కీలకమైన ఇంధన సరఫరాల్లో సమస్యలు, పెట్టుబడుల వ్యయాలు నిదానించడం, ఆహార భద్రత ఆందోళనలు, ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని, వృద్ధి తగ్గిపోతుంది’’అని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ 2025–26లో చివరి త్రైమాసికంలో భారత్ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందంటూ.. ప్రైవేటు వినియోగం, స్థిర పెట్టుబడులు ఇందుకు మద్దతునిచ్చినట్టు వివరించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనూ (ఏప్రిల్, మే) ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగానే కొనసాగుతున్నాయని ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో పెరిగినప్పటికీ, అది నియంత్రిత శ్రేణిలోనే ఉండడాన్ని గుర్తు చేసింది. విదేశీ వాణిజ్యం, చెల్లింపుల స్థితులు బలంగానే ఉన్నాయని వెల్లడించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), తగినంత విదేశీ మారకం నిల్వలు మద్దతుగా నిలిచినట్టు పేర్కొంది. ఎదుర్కొనే స్థితిలో.. ఇతర దేశాలతో పోల్చి చూస్తే.. బలమైన ఆర్థిక మూలాలతో భారత్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని నిలవగలదని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. ఎల్పీజీ ధరలు పెంచినందున అది రెస్టారెంట్ల సేవలపై ప్రభావం చూపించి, ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుందని అంచనా వేసింది. జూన్ 18 నాటికి ఉన్న డేటా ప్రకారం ఆహార ధరల్లో పెరుగుదల కొనసాగుతున్నట్టు తెలిపింది. బియ్యం, గోధుమలు, ప్రధాన పప్పుల ధరలు పెరిగినట్టు వెల్లడించింది. అలాగే, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటా, నూనెల ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో సమస్యలతో భారత క్రూడ్ బాస్కెట్ ధరలు గరిష్టాల్లోనే ఉన్నట్టు పేర్కొంది. -
పేపర్ ఖర్చులు రూ.986.4 కోట్లు.. అగ్రస్థానంలో SBI
మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు, ఆన్లైన్ స్టేట్మెంట్లు ఇలా అన్నీ వేగంగా పెరుగుతున్నాయి, దీంతో బ్యాంకింగ్ రంగం పూర్తిగా డిజిటల్ అయిపోయిందని భావిస్తాం. కానీ.. వాస్తవానికి బ్యాంకుల లోపల ఇంకా భారీగా పేపర్ ఆధారిత వ్యవస్థ కొనసాగుతోంది. ఈ విషయం FY25 గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది.భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు ప్రింటింగ్, స్టేషనరీ, చెక్బుక్స్, పాస్బుక్స్, ఫార్మ్స్ వంటి అవసరాల కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రింటింగ్ అండ్ స్టేషనరీపై గ్రోవ్ సంస్థ నివేదికలు చెబుతున్నాయి. డిజిటల్ సేవలు పెరిగినా, సంప్రదాయ పేపర్ వర్క్ పూర్తిగా తగ్గలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. FY25లో ఈ బ్యాంక్ సుమారు రూ.986.4 కోట్లు ప్రింటింగ్, స్టేషనరీ కోసం ఖర్చు చేసింది. ఇదే సమయంలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా దాదాపు రూ.922.5 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.ఇతర ప్రధాన బ్యాంకుల విషయానికి వస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ సుమారు రూ.318.5 కోట్లు ఖర్చు చేసింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ దాదాపు రూ.373.8 కోట్లు వెచ్చించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా 1 శాతం పరిధిలోనే ఈ ఖర్చులను కొనసాగిస్తున్నాయి.అయితే నిజమైన భారం కొన్ని మధ్యస్థాయి బ్యాంకులపై ఎక్కువగా పడుతోంది. ఉదాహరణకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తన లాభాల్లో దాదాపు 8 శాతం కంటే ఎక్కువ స్టేషనరీ ఖర్చులకే వెచ్చించడం గమనార్హం. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో కూడా ఈ ఖర్చు శాతం గణనీయంగా కనిపిస్తోంది.భారత బ్యాంకింగ్ రంగం డిజిటల్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ, పాత పద్ధతులైన పేపర్ వర్క్ ఇంకా పూర్తిగా వెనక్కి వెళ్లలేదు. భవిష్యత్తులో డిజిటలైజేషన్ మరింత పెరిగితే ఈ ఖర్చులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం ''డిజిటల్ బ్యాంకింగ్ + పేపర్ బ్యాంకింగ్'' కలిసి నడుస్తున్న వాస్తవాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.How much do Banks spend on Pen & Paper?(Costs for FY25) pic.twitter.com/OViC5vd8Bl— Groww (@_groww) June 17, 2026 -
త్వరలో ‘ఇంధన అత్యవసర’ ఆంక్షల ఎత్తివేత!
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్ రక్షణ కోసం అమలు చేసిన ‘ఇంధన అత్యవసర’ ఆంక్షలను అంతర్జాతీయ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత దశలవారీగా ఉపసంహరించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య 111 రోజుల యుద్ధానికి ముగింపు పలికే మధ్యంతర ఒప్పందం కుదిరింది. దీంతో వ్యూహాత్మకంగా కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి ద్వారా నౌకాయాన కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి రానుండటం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారతదేశానికి భారీ ఊరటనిచ్చే అంశం.ముందస్తు రక్షణ చర్యలుగా ఆంక్షలు ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చమురు, సహజ వాయువు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ముడి చమురు ధరలు, షిప్పింగ్ భీమా ప్రీమియంలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సంక్షోభం తీవ్రరూపం దాల్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పలు అత్యవసర ప్రత్యామ్నాయ చర్యలను అమలు చేసింది. అందులో భాగంగా... ఎల్పీజీ సరఫరాలపై నిఘా పెంచింది. సిలిండర్ల అక్రమ రవాణా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై కఠిన నిబంధనలు తెచ్చింది. ఇందులో భాగంగానే పెట్రోకెమికల్స్ ఉత్పత్తికి వాడే గ్యాస్ను ఎల్పీజీ వైపు మళ్లించాలని రిఫైనరీలను ఆదేశించింది.హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాను తగ్గించడంతో పాటు, గృహ వినియోగదారుల సిలిండర్ బుకింగ్ వ్యవధిని పెంచి నిల్వలను నియంత్రించింది. గృహ అవసరాలు, రవాణా (సీఎన్జీ), ఎరువుల రంగానికి ప్రాధాన్యత ఇస్తూ దేశీయ సహజ వాయువు కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేసింది.‘‘ఈ ఆంక్షలన్నీ కేవలం ముందస్తు నివారణా చర్యలే. అంతర్జాతీయంగా చమురు మార్కెట్ స్థిరపడి, సరఫరా ముప్పు తొలగిపోగానే ఈ ఆంక్షలను దశలవారీగా ఉపసంహరిస్తాం’’ అని అధికారి స్పష్టం చేశారు.చమురు కంపెనీలకు రోజూ రూ.550 కోట్ల నష్టం యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు 70–72 ডy్థయి నుంచి గరిష్టంగా 119 డాలర్లకు చేరుకున్నాయి. అయితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం కొంతకాలం పాటు పెరగకుండా నియంత్రించింది. మార్చి 27న పశి్చమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అనంతరం ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.7.50 చొప్పున, సీఎన్జీ ధరలను కిలోకు రూ.6 మేర పెంచింది.గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రెండు విడతల్లో మొత్తం రూ.89 పెంపు అమలు చేసింది. ఈ ధరల పెంపు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయ రిటైల్ ఇంధన ధరలు ఇంకా తక్కువగానే ఉండటంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికీ రోజుకు సుమారు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని అధికారి వెల్లడించారు. గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మూడు నెలల కనిష్టానికి పతనమమయ్యాయి. గురువారం బ్యారెల్ ధర సుమారు 78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ 17 నాటికి నికర ఆదాయపన్ను (ప్రత్యక్షపన్ను) వసూళ్లు 15 శాతం వరకు పెరిగి రూ.5.21 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా స్పష్టం చేసింది. నికర కార్పొరేట్ పన్నుల వసూళ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 22 శాతం వృద్ధితో రూ.2.08 లక్షల కోట్లకు చేరాయి.నికర నాన్ కార్పొరేట్ పన్నుల ఆదాయం 8 శాతం పెరిగి రూ.2.94 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, వాణిజ్య సంస్థల పన్నులు నాన్ కార్పొరేట్ కిందకు వస్తాయి. రిఫండ్లు మే 17 నాటికి రూ.89,026 కోట్లుగా ఉన్నాయి. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) రూపంలో ఆదాయం 45 శాతం పెరిగి రూ.18,856 కోట్లకు చేరింది. ముందస్తు పన్ను చెల్లింపులు 15.30 శాతం అధికమై రూ.1.78 లక్షల కోట్లు వసూలయ్యాయి.స్థూల పన్ను వసూళ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు జూన్ 17 నాటికి 12.46 శాతం పెరిగి రూ.6.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.26.97 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందన్నది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లక్ష్యంగా ఉంది. -
స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డబ్బులు
న్యూఢిల్లీ/జ్యురిక్: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు 2025లో 3.25 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు (రూ. 36,793 కోట్లు) తగ్గాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 8 శాతం తక్కువ. లోకల్ శాఖలు, ఇతర ఆర్థిక సంస్థలు ద్వారా వచ్చే నిధులు తగ్గడం ఇందుకు కారణం. అయితే, స్విట్టర్లాండ్లోని బ్యాంకుల్లో భారతీయులు నేరుగా తమ ఖాతాల్లో వ్యక్తిగతంగా, సంస్థలపరంగా జమ చేసిన డిపాజిట్లు మాత్రం 50 శాతం పెరిగి 524 మిలియన్ స్విస్ ఫ్రాంకులకు (సీహెచ్ఎఫ్) (సుమారు రూ. 6,000 కోట్లు) చేరాయి.స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ)కి వివిధ బ్యాంకులు సమర్పించిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే, ఇందులో ’నల్ల ధనం’, మరో దేశం ద్వారా భారతీయులు, ప్రవాస భారతీయులు.. స్విస్ బ్యాంకుల్లో ఎంత దాచుకుని ఉండొచ్చనే వివరాలు తెలియరాలేదు. 2024లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల మొత్తం నిధులు మూడు రెట్లు పెరిగి 3.5 బిలియన్ సీహెచ్ఎఫ్కి చేరాయి. అంతకు ముందు 2021లో అత్యధికంగా 14 ఏళ్ల గరిష్ట స్థాయి 3.83 బిలియన్ సీహెచ్ఎఫ్కి పెరిగాయి. -
యూకే–భారత్ వాణిజ్యానికి రెక్కలు
న్యూఢిల్లీ: యూకే, భారత్ మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సెటా) ఎట్టకేలకు వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. స్వేచ్ఛాయుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో 2025 జూలై 25న, లండన్లో జరిగిన కార్యక్రమంలో రెండు దేశాల ప్రధానులు ఒప్పందంపై సంతకాలు చేయడం గమనార్హం. దశలవారీగా అమలయ్యే ఈ ఒప్పందంతో వస్తు, సేవల పరంగా భారత ఎగుమతిదారులకు టారిఫ్ అనుకూల ప్రయోజనాలు లభిస్తాయి. 99 శాతం వస్తువులపై సుంకాలు తొలగిపోనున్నాయి.రెండు దేశాల మధ్య వస్తు, సేవలకు మార్కెట్ అవకాశాలు పెంచుకోవడం, టారిఫ్ల భారం తగ్గించుకోవడం ఒప్పందం లక్ష్యం. ముఖ్యంగా కొన్ని ఉత్పత్తులకు కోటా ఆధారిత మార్కెట్ ప్రవేశం అమలు కానుంది. భారత వ్యవసాయం, డైరీ, నూనె గింజలు, కూరగాయలు, ధాన్యాలకు ఈ ఒప్పందంలో రక్షణ కల్పించారు. బ్రిటన్ అంచనా ప్రకారం.. సెటాతో ఏటా భారత్ జీడీపీకి 5.1 బిలియన్ పౌండ్లు, యూకే జీడీపీకి 4.8 బిలియన్ పౌండ్ల మేర అదనపు ప్రయోజనం లభించనుంది. దీర్ఘకాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం 25.5 బిలియన్ పౌండ్లకు చేరుకుంటుందని అంచనా. గణనీయమైన అవకాశాలు.. ‘‘సెటాతోపాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (సామాజిక భద్రతకు సంబంధించి) జూలై 15 నుంచి ఏకకాలంలో అమల్లోకి రావడంతో భారత్ ఎగుమతిదారులకు గణనీయమైన అవకాశాలు లభించనున్నాయి. తక్షణమే 99 శాతం మన ఎగుమతులకు సుంకాల్లేని ప్రవేశం దక్కనుంది. టెక్స్టైల్స్, లెదర్, మెరైన్, ఇంజనీరింగ్, ప్రాసెస్డ్ ఫుడ్ రంగాలు ఎలాంటి ప్రతికూలతల్లేకుండా తమ ఉత్పత్తులతో పోటీపడనున్నాయి. సున్నితమైన మన వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలకు దిగుమతుల నుంచి రక్షణ కల్పించాం. భారతీయ నిపుణుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ద్వంద బీమా చెల్లింపుల నుంచి కూడా మినహాయింపు ఉంటుంది’’అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ రంగాలకు సానుకూలం.. 🔹 భారత్ నుంచి యూకేకి వెళ్లే ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తులపై 70 శాతం, మెరైన్ ఉత్పత్తులపై 21.5 శాతం, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలపై 18 శాతం, లెదర్, పాదరక్షలపై 16 శాతం, టెక్స్టైల్స్, వ్రస్తాలపై 12 శాతం మేర సుంకాలు సున్నాకి తగ్గిపోనున్నాయి. 🔹 డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కింద యూకేలో భారత ఉద్యోగులు, కారి్మకులకు మూడేళ్ల పాటు సామాజిక భద్రత కోసం చందాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇలా ఆదా అయ్యే మొత్తం రూ.4,000 కోట్లుగా ఉంటుంది. 🔹 భారత్ సైతం యూకే నుంచి వచ్చే దిగుమతులపై దశలవారీ (2036 నాటికి) 90 శాతం మేర టారిఫ్లను ఎత్తేయనుంది. 🔹 భారత్కు చెందిన 85 శాతం స్టీల్ ఎగుమతులకు యూకేలో నియంత్రణ చర్యల నుంచి మినహాయింపు ఉంటుంది. యూకేకి చెందిన విస్కీ, జిన్ ఉత్పత్తులపై 150 శాతంగా ఉన్న సుంకాలు తొలుత 75 శాతానికి, పదో ఏడాదికి 40 శాతానికి తగ్గిపోనున్నాయి. దీంతో భారత్ మార్కెట్లో వాటి అమ్మకాలు పెరగనున్నాయి. చౌకగా యూకే కార్లు 🔹 ఒప్పందం మొదటి 15 ఏళ్లలో యూకే నుంచి 3.78 లక్షల యూనిట్ల సంప్రదాయ కంబస్టన్ ఇంజన్ ప్యాసింజర్ కార్లను రాయితీ సుంకాలపై భారత్ అనుమతించనుంది. ఇందులో లగ్జరీతోపాటు మాస్ మార్కెట్ కార్లు కూడా ఉంటాయి. 🔹 ఆటో విడిభాగాలపై 110 శాతంగా ఉన్న సుంకాలు 10 శాతానికి తగ్గుతాయి. ఇందుకు సంబంధించి రెండు దేశాలు కోటా విధానాన్ని అనుసరించనున్నాయి. 🔹 ఒప్పందం ఆరో ఏడాది నుంచి యూకేకి ఎలక్ట్రిక్/హైడ్రోజన్ ప్యాసింజర్ కార్లను (20,000–80,000 పౌండ్ల ధరలోని) పరిమిత కోటా మేరకు భారత్ సుంకాల్లేకుండా ఎగుమతి చేయొచ్చు. ఇది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఎంఅండ్ఎం, మారుతి సుజుకీ తదితర కంపెనీలకు ప్రయోజనం కల్పించనుంది. -
ఏటీఎం నుంచి మనీ విత్డ్రా.. EPFOనుంచి కీలక అప్డేట్ వచ్చేసింది
ఈపీఎఫ్వో సభ్యులకు శుభవార్త. త్వరలోనే ఏటీఎం సెంటర్ల ద్వారా, అలాగే యూపీఐ యాప్ల ద్వారా పీఎఫ్ విత్డ్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈ సౌకర్యం అమలు కానుంది. ఇటీవల కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.ఈపీఎఫ్వో 3.0లో సభ్యులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్లో 75 శాతం వరకు తక్షణ ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏటీఎం లేదా యూపీఐ ద్వారా రోజుకు రూ.10,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. రూ.5 లక్షల వరకు క్లెయిమ్లు ఆటోమేటిక్గా మూడు రోజుల్లో ఆమోదం పొందుతాయి. ఇంతకు ముందు ఈ ప్రక్రియకు 7నుంచి 20 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఏఐ ఆధారిత సిస్టమ్ ద్వారా వేగంగా క్లెయిమ్లు సెటిల్ అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం.ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ మొత్తాన్ని కొత్త ఖాతాకు మార్చుకోవడానికి ఇంతకు ముందు ఫారమ్ 13 నింపాల్సి వచ్చేది. ఇకపై ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే పీఎఫ్ ఖాతా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే విధంగా, సభ్యులు తమ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత వివరాలను ఆధార్ ఆధారంగా స్వయంగా సరిచేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ మార్పులకు ఉద్యోగి,యజమాని ఇద్దరూ కలిసి జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది.ఈ కొత్త సౌకర్యాలతో ఉద్యోగులకు పేపర్వర్క్ తగ్గుతుంది, క్లెయిమ్ సెటిల్మెంట్ వేగవంతమవుతుంది, పీఎఫ్ ట్రాన్స్ఫర్ సులభతరం అవుతుంది. పెన్షన్ చెల్లింపుల్లో కూడా పారదర్శకత పెరుగుతుంది. అయితే, అన్ని ఫీచర్లు దశలవారీగా అమలు అవుతున్నాయి. ప్రస్తుతం యూపీఐ ఆధారిత ఉపసంహరణలు కొంతమంది సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.పెన్షన్ ఉపసంహరణకు సంబంధించి కొత్త నియమాలు కూడా అమలులోకి వచ్చాయి. ఉదాహరణకు, 36 నెలల నిరుద్యోగం తర్వాత మాత్రమే పెన్షన్ ఉపసంహరణ చేసుకోవచ్చు. ఈపీఎఫ్వో 3.0తో ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సహాయం, వేగవంతమైన సేవలు, మరింత పారదర్శకత లభించనున్నాయి. -
డబ్ల్యూపీఐకి గుడ్బై.. పీపీఐకి మారనున్న కేంద్రం!
ధరల తీరును మరింత ప్రతిఫలించే విధంగా వస్తు, సేవలకు ఉత్పత్తిదారుల ధరల సూచీ (పీపీఐ)ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రతి నెలా విడుదల చేస్తున్న టోకు ధరల ఆధారిత సూచీ స్థానంలో వచ్చే ఐదేళ్లలోపు దీన్ని పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనుంది.దేశవ్యాప్తంగా మే నెలకు అన్ని కమోడిటీలకు సంబంధించి అవుట్పుట్ పీపీఐ 109.6 శాతంగా నమోదైంది. ఏప్రిల్లో ఇది 108.6 శాతంగా ఉంది. తయారీ రంగానికి సంబంధించి ప్రయోగాత్మక ఇన్పుట్ పీపీఐ మే నెలకు 104.9గా ఉంది. ప్రయోగాత్మక విధానంలో విడుదల చేస్తున్న ఈ డేటా నాణ్యతను పరిశీలించి, భాగస్వాముల అభిప్రాయాలను తెలుసుకుని అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతం ఇదే విధానం అమల్లో ఉంది. దీంతో భారత్ సైతం డబ్ల్యూపీఐ నుంచి పీపీఐకి మారాలంటూ ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చాన్నాళ్లుగా కోరుతోంది. దీనికితోడు నీతిఆయోగ్ వర్కింగ్ గ్రూప్ ఇటీవలే చేసిన సిఫారసుల మేరకు పీపీఐకి మారాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఉత్పత్తి తయారీ లేదా సేవను అందించేందుకు కంపెనీకి అయ్యే వ్యయాన్ని ఇన్పుట్ ప్రైస్ రూపంలో, తయారీ అనంతరం ఆయా సంస్థలు విక్రయించే ధరను అవుట్పుట్ ప్రైస్ రూపంలో డేటాను విడుదల చేయనున్నారు.ఇన్పుట్ ధరలు పెరుగుతుంటే (కంపెనీలు వినియోగించే ముడి సరుకులు, విడిభాగాలు, మైక్రోచిప్లు తదితర), అంతిమంగా కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తుంటాయి. దాంతో రిటైల్ ధరలు పెరుగుతాయి. ఈ డేటాకు అనుగుణంగా ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. పీపీఐ అవుట్పుట్ ప్రైస్కు రవాణా, పన్నులు, వర్తకుల మార్జిన్లు కలసి రిటైల్ ధరలు నిర్ణయమవుతాయి. -
డీజిల్, జెట్ ఇంధనంపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు!
పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న ముడిచమురు సమీకరణాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూసేందుకు, ఎగుమతిదారులు అనవసర లబ్ధి పొందకుండా అడ్డుకట్ట వేసేందుకు డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. సవరించిన కొత్త ధరలు ఈరోజు నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అయితే, సామాన్యుడిపై భారం పడకుండా దేశీయ వినియోగం కోసం సరఫరా అయ్యే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి సుంకాలు పెంచకపోవడం గమనార్హం.విండ్ఫాల్ ట్యాక్స్ అంటే..ఏదైనా ఒక పరిశ్రమ లేదా కంపెనీ తమ సొంత కష్టం లేదా అదనపు పెట్టుబడి లేకుండా అనుకోకుండా మారిన అంతర్జాతీయ పరిస్థితులు లేదా బాహ్య కారణాల వల్ల భారీగా లాభ పడినప్పుడు (విండ్పాల్ గెయిన్స్) ఆ అదనపు లాభాలపై ప్రభుత్వం విధించే ప్రత్యేక పన్నునే విండ్ఫాల్ ట్యాక్స్ అంటారు.సవరించిన పన్నుల వివరాలు..ఎగుమతులను నిరుత్సాహపరిచి, దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ పన్నును సవరించింది.ఇంధనం రకంపాత సుంకం (లీటరుకు)సవరించిన కొత్త సుంకం (లీటరుకు)మార్పుడీజిల్రూ. 13.5రూ. 14.0రూ. 0.50 పెంపుజెట్ ఇంధనంరూ. 9.5రూ.12.5రూ.3 పెంపు -
ఆర్థిక ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం!
బ్యాంకింగ్ రంగంలో కస్టమర్ల ప్రయోజనాలే పరమావధిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే ప్రక్రియపై నిబంధనలను ఆర్బీఐ మరింత కఠినతరం చేసింది. రుణదాతలు, బ్యాంకింగ్ సిబ్బంది కస్టమర్లను తప్పుదారి పట్టించి ఉత్పత్తులను అంటగట్టే ‘మిస్ సెల్లింగ్’ పద్ధతులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కొత్త గైడ్లైన్స్ను విడుదల చేసింది.అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే?సవరించిన నూతన మార్గదర్శకాలు తొలుత జులై 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, బ్యాంకింగ్ వ్యవస్థలో సాంకేతిక, కార్యాచరణ మార్పులు చేసుకోవడానికి వీలుగా సెంట్రల్ బ్యాంక్ గడువును పొడిగించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2027 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.నూతన మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలుబ్యాంకులు ఏ రకమైన ఆర్థిక ఉత్పత్తి లేదా సేవను విక్రయించాలన్నా సదరు కస్టమర్ స్పష్టమైన ఆమోదం తీసుకోవాలి. అలాగే ఆ ఉత్పత్తి కస్టమర్కు ఎంతవరకు అనుకూలమైనదో ముందే నిర్ధారించుకోవాలి.సంతకం చేసిన డిక్లరేషన్లు, ఓటీపీ-ఆధారిత ఆమోదాలు, డిజిటల్ ధ్రువీకరణలు లేదా ఒప్పంద పత్రాలలో స్పష్టంగా పేర్కొన్న సమ్మతి నిబంధనల ద్వారా మాత్రమే ఈ అనుమతిని సేకరించాల్సి ఉంటుంది.డిజిటల్ ప్లాట్ఫారమ్లు, యాప్లలో వినియోగదారులను తప్పుదారి పట్టించేలా లేదా మోసగించేలా రూపొందించే వినియోగదారు-అనుభవ పద్ధతులు లేదా డార్క్ ప్యాటర్న్స్(డిజిటల్ ప్లాట్ఫారమ్లు వినియోగదారులను మోసగించడానికి లేదా వారి ప్రమేయం లేకుండా కొన్ని పనులు చేయించడానికి ఉపయోగించే వ్యూహాలు) వాడకాన్ని ఆర్బీఐ పూర్తిగా నిషేధించింది.తప్పుగా విక్రయిస్తే.. పూర్తి రీఫండ్!బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యంత కీలకమైన నిబంధనను ఆర్బీఐ ఈసారి తీసుకొచ్చింది. ఆర్థిక ఉత్పత్తులను కస్టమర్లకు తప్పుగా విక్రయించినట్లు రుజువైతే బ్యాంకులు ఆ విక్రయాన్ని రద్దు చేయడమే కాకుండా.. కస్టమర్ నుంచి వసూలు చేసిన మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రద్దు, రీఫండ్ గురించిన సమాచారాన్ని కస్టమర్కు అధికారికంగా తెలియజేయడం తప్పనిసరి.ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏజెంట్లే..సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఆర్థిక ఉత్పత్తులను ప్రమోట్ చేసే వారిపై కూడా ఆర్బీఐ నిఘా పెంచింది. ప్రమోషన్లు లేదా కస్టమర్లను ఆకర్షించే ప్రక్రియలో పాల్గొనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సన్లు, అనుబంధ సంస్థలు, ఇతర డిజిటల్ మార్కెటింగ్ మధ్యవర్తులను ఇకపై డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు లేదా డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లుగానే పరిగణిస్తారు. తద్వారా వారికి కూడా బ్యాంకింగ్ నిబంధనలు, బాధ్యతలు వర్తిస్తాయి.ఉద్యోగుల ఇన్సెంటివ్లపై స్పష్టతబ్యాంక్ సిబ్బంది కస్టమర్లపై ఒత్తిడి తెచ్చి ఉత్పత్తులను విక్రయించకుండా చూసేందుకు ఆర్బీఐ ప్రోత్సాహకాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. థర్డ్ పార్టీ సంస్థలు (ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైనవి) నియంత్రిత సంస్థల/బ్యాంకుల ఉద్యోగులకు నేరుగా ప్రోత్సాహకాలు అందించడాన్ని పూర్తిగా నిషేధించారు. బ్యాంకులు లేదా నియంత్రిత సంస్థలు తమ సొంత సిబ్బందికి అంతర్గతంగా ప్రోత్సాహకాలను అందించుకోవచ్చు.గమనిక: అయితే, ఈ అంతర్గత ప్రోత్సాహక నిర్మాణాలు ఉద్యోగులను దూకుడుగా అమ్మకాలు జరిపేలా ప్రోత్సహించకూడదని, అది మిస్ సెల్లింగ్కు దారితీయకూడదని ఆర్బీఐ హెచ్చరించింది.ఈ నూతన నిబంధనల నేపథ్యంలో బ్యాంకులు తమ సొంత ప్రకటనలు, మార్కెటింగ్, అమ్మకాల ప్రక్రియల కోసం ఒక సమగ్రమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలో మిస్ సెల్లింగ్ మోసాలకు అడ్డుకట్ట పడటంతోపాటు కస్టమర్లలో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం మరింత బలపడనుంది.ఇదీ చదవండి: బంగారు పంట పండింది! -
డీల్తో ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో దాదాపు నాలుగు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పెడుతూ, శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న అమెరికా–ఇరాన్ నిర్ణయంతో భారత్కి ఊరట లభించనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈసారైనా ఒప్పందం సజావుగా అమలైతే, పశ్చిమాసియాకి భారత్ ఎగుమతులు మళ్లీ పుంజుకునేందుకు ఊతం లభిస్తుందని ఎగుమతిదారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దిగుమతి బిల్లుల భారం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయని, రూపాయి స్థిరపడగలదని భావిస్తున్నారు. వెరసి వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని వారు తెలిపారు. జూన్ 19 స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ‘ దాదాపు 50 శాతం క్రూడాయిల్, సుమారు 70 శాతం వంట గ్యాస్, 90 శాతం ద్రవీకృత సహజ వాయువు దిగుమతుల కోసం పశ్చిమాసియాపై భారత్ ఆధారపడుతోంది. అక్కడ ఉద్రిక్తతలతో సరఫరా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో శాంతి ఒప్పందంతో భారత్కి తక్షణం ఆర్థికంగా ఊరట లభిస్తుంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటే, ఇంధన మార్కెట్లు స్థిరపడతాయి. చమురు..గ్యాస్ ధరలపై ఒత్తిడి తగ్గి రూపాయి బలపడవచ్చు. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగుపడొచ్చు‘ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అనిశ్చితికి తెర.. శాంతి ఒప్పంద ప్రకటనతో అనిశ్చితి, ఆర్థిక మందగమనం, అనవసర సమస్యలకి తెర పడుతుందని టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ తెలిపారు. ఎగుమతులు ఎగియడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చన్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరా, ధరలు తిరిగి సాధారణ స్థాయికి తిరిగి రావొచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. హార్మూజ్ మూసివేత వల్ల నౌకలు ఆఫ్రికా చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనితో సముద్ర మార్గంలో రవాణా, నౌకల బీమా వ్యయాలు భారీగా పెరిగిపోవడంతో పాటు డెలివరీల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. హార్మూజ్ తెరుచుకుంటే నౌకల రాకపోకలకు కూడా వెసులుబాటు లభిస్తుందని నిపుణులు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఆ దేశంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దానితో మార్చిలో భారత్ ఎగుమతులు 7 శాతం క్షీణించి అయిదు నెలల కనిష్ట స్థాయి 38.92 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పశ్చిమాసియాకి ఏకంగా 58 శాతం తగ్గి 3.5 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు 52 శాతం పడిపోయాయి. ఇక ఇంధనాల సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చాలా కాలం తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లను ఇటీవల పాక్షికంగా పెంచినప్పటికీ, అంతర్జాతీయంగా ఎగిసిన స్థాయికి తగ్గట్లు పెంచకపోవడంతో ఆదాయ నష్టాలను చవిచూస్తున్నాయి. అవి పూర్తి ఆర్థిక సంవత్సరపు లాభాలకు సరిసమానంగా ఒక్క త్రైమాసికంలోనే నష్టాలు నమోదు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకుంటే సరఫరా మెరుగుపడి, ముడి చమురు ధరలు నెమ్మదించవచ్చు. -
ఎగుమతులు భేష్..!
న్యూఢిల్లీ: వస్తు ఎగుమతులు మేలో పటిష్ట పనితీరు చూపించాయి. ఆరు నెలల గరిష్ట స్థాయిలో 45.2 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు సైతం 10 శాతం పెరిగి 73.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్యలోటు (ఎగుమతులను మించి దిగుమతుల విలువ పెరగడం కారణంగా ఏర్పడేది) 28.21 బిలియన్ డాలర్లకు ఎగిసింది. గతేడాది మే నెలలో వాణిజ్యలోటు 21.88 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ముడి చమురు, ఎరువుల కోసం అధికంగా వెచ్చించాల్సి రావడం దిగుమతుల బిల్లు పెరిగేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లోనూ దేశ ఎగుమతులు మెరుగైన వృద్ధిని చూసినట్టు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఎగుమతుల్లో మెరుగైన వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్రక్టానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మా ఎగుమతుల వృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. మరోవైపు మేలో సేవల ఎగుమతులు 36.76 బిలియన్ డాలర్లు, సేవల దిగుమతులు 19.06 బి. డాలర్లుగా ఉండొచ్చన్నది ప్రభుత్వం అంచనా. మొదటి రెండు నెలల్లో మంచి పనితీరు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 16.09 శాతం పెరిగి 88.91 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 15.14 శాతం జంప్ చేసి 145.35 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 56.44 బిలియన్ డాలర్లుగా ఉంది. పసిడి దిగుమతులు ఎక్కువే.. ఏప్రిల్, మే నెలలో 9.40 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు దేశంలోకి వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 60 శాతం పెరిగాయి. పసిడి, వెండి దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు కేంద్రం ఇటీవలే వాటిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. ముడిచమురు దిగుమతుల విలువ సైతం 16.5 శాతం పెరిగి 41.3 బిలియన్ డాలర్లకు చేరింది. పశ్చిమాసియాకు మెరుగైన ఎగుమతులు పశ్చిమాసియాలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రాంతానికి మే నెలలో ఎగుమతులు గతేడాది మే స్థాయికి చేరినట్టు రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. 2025 మేలో 5.38 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఈ ఏడాది అదే నెలలో 5.30 బిలియన్ డాలర్ల మేర ఆ ప్రాంతానికి ఎగుమతయ్యాయి. ఒమన్కు చెందిన దుక్్మ, సోహార్, సలాలా పోర్టుల ద్వారా భారత్ తన ఎగుమతులను పెంచుకుంది. -
డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జనాభా సంక్షోభం ముదురుతోంది. దేశాల ఆర్థిక, సామాజిక భవిష్యత్తును శాసించే జనన రేట్లు ఊహించని విధంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఆసియా, ఐరోపా ఖండాల్లోని ప్రభుత్వాలు ఈ ధోరణిని మార్చడానికి పడే తపన అంతా ఇంతా కాదు. ఎక్కువ మంది పిల్లలను కనాలని పౌరులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అపర కుబేరులలాగా నగదు పంపిణీలు, పన్ను మినహాయింపులు, ఉచిత గృహ వసతి, భారీ కుటుంబ ప్రయోజనాలతో పాటు భావోద్వేగ విజ్ఞప్తులు కూడా చేస్తున్నాయి. అయినప్పటికీ, ఫలితం శూన్యం. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు నానాటికీ దిగజారుతూనే ఉంది.ఈ నేపథ్యంలో.. ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ఒప్పించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ప్రపంచ అనుభవాల నుంచి రేపటి మేటి శక్తిగా ఎదుగుతున్న భారతదేశం ఎలాంటి వ్యూహాత్మక పాఠాలు నేర్చుకోవాలి? అనే అంశాలపై నిపుణులు చర్చిస్తున్నారు.బేబీ బోనస్ ప్రయోగం: చేతులెత్తేసిన దేశాలుపడిపోతున్న జనన రేట్లను తిప్పికొట్టడం ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికి దక్షిణ కొరియా ఒక ఉదాహరణ. 2006లో తక్కువ సంతానోత్పత్తి నివారణకు ఒక సమగ్ర ప్రణాళికను ప్రారంభించినప్పటి నుంచి ఆ దేశం నగదు ప్రోత్సాహకాలు, ఉచిత పిల్లల సంరక్షణ, సంతానోత్పత్తి చికిత్స రాయితీలు, తల్లిదండ్రుల సెలవులు, గృహ సహాయం వంటివాటి కోసం ఏకంగా 200 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. అయినా ఫలితం ఏంటి? 2023లో ఆ దేశ సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయి 0.72 కి పడిపోయింది. 2024లో 0.75, 2025లో 0.8 గా ఇది స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా స్థిరమైన జనాభాకు అవసరమైన భర్తీ రేటు అయిన 2.1 కంటే ఇది ఎంతో దూరంలో ఉంది.ఇతర దేశాలు ఇలా..ఇదే బాటలో నడిచిన సింగపూర్ 2001లో ‘బేబీ బోనస్’ పథకాన్ని తెచ్చింది. పదేపదే రాయితీలు పెంచినా అక్కడా జననాల రేటు ప్రపంచంలోనే అత్యల్ప స్థాయిలోనే ఉంది. జపాన్, చైనా, హంగేరీ, రష్యా, పోలాండ్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చినా తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత మార్పును సాధించలేకపోయాయి. ఆర్థిక ప్రోత్సాహకాలు కేవలం కొంతవరకు మాత్రమే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని, పిల్లలను కనడం అనేది కేవలం డబ్బుతో ముడిపడిన అంశం కాదని ఈ దేశాల అనుభవాలు నిరూపిస్తున్నాయి.డబ్బు మాత్రమే ఎందుకు సరిపోవట్లేదు?ప్రభుత్వాల ఆలోచన ప్రకారం.. పిల్లల పెంపకం ఖరీదైనది, కాబట్టి నగదు ఇస్తే ప్రజలు పిల్లలను కంటారు. కానీ నిజ జీవితంలో ఈ తర్కం పనిచేయడం లేదు. ‘సంతానోత్పత్తి నిర్ణయాలు అనేవి వన్-టైమ్ ఫైనాన్షియల్ లావాదేవీలు కావు. పిల్లలను కలిగి ఉండటం అనేది గృహనిర్మాణం, ఉపాధి భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రుల మానసిక, ఆర్థిక సామర్థ్యాలతో ముడిపడి ఉన్న సుదీర్ఘమైన ప్రక్రియ. ప్రభుత్వాలు ఇచ్చే తాత్కాలిక బేబీ బోనస్లు తల్లిదండ్రులు ఎదుర్కొనే వ్యవస్థాగత ఒత్తిళ్లను దూరం చేయలేవు’ అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా అన్నారు.నిజమైన ఖర్చులు ఇవే..పరిశోధకుల ప్రకారం.. సమస్య ప్రసవానికి అయ్యే ఖర్చు కాదు, ఒక కుటుంబాన్ని సగర్వంగా సమాజంలో నిలబెట్టడానికి అయ్యే విస్తృత సామాజిక-ఆర్థిక ఖర్చులు.పెరుగుతున్న గృహాల ధరలుకుటుంబం ఏర్పడటానికి ప్రధాన అడ్డంకి గృహ స్థోమత. UNFPA (ఐక్యరాజ్యసమితి జనాభా నిధి) 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 19% మంది తమకు కావలసిన సంఖ్యలో పిల్లలు లేకపోవడానికి గృహ సంబంధిత సమస్యలే కారణమని తేల్చారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) మార్చి 2025 నివేదిక సైతం దక్షిణ కొరియా, చైనా (బీజింగ్, షాంఘై), సింగపూర్ల్లో విపరీతంగా పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలు యువత పెళ్లిళ్లను వాయిదా వేయడానికి, తక్కువ సంతానోత్పత్తికి దారితీస్తున్నాయని స్పష్టం చేసింది.ఆలస్యమవుతున్న వివాహాలుఆసియా సంస్కృతిలో ప్రసవం అనేది వివాహ బంధంతో ముడిపడి ఉంది. ప్రస్తుతం యువత ఉన్నత విద్య, స్థిరమైన కెరీర్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా వివాహ వయస్సు పెరుగుతోంది. వివాహ రేట్లు పడిపోతున్నాయి. తక్కువ వివాహాలు అంటే తక్కువ జననాలే కదా!ఆధునిక మహిళ - పని వాతావరణంనేటి మహిళలు విద్యావంతులు, ఆర్థిక స్వతంత్రులు. వారు తమ ఆకాంక్షలను త్యాగం చేయాల్సి వచ్చే కుటుంబ ఏర్పాట్లకు దూరంగా ఉంటున్నారు. ‘కార్యాలయాల్లో ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు పిల్లల పెంపకం భారం మహిళలపైనే పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని, చాలామంది మహిళలు పిల్లలను వద్దు అనుకుంటున్నారు’ అని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సీఈఓ శోభిత్ అగర్వాల్ అన్నారు.ఇంటెన్సివ్ పేరెంటింగ్నేటి కాలంలో పిల్లల సంఖ్య కంటే, ఉన్న ఒక్క బిడ్డకు బెస్ట్ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనే ధోరణి పెరిగింది. విద్యా ఖర్చులు పెరగడం, పోటీ ప్రపంచంలో సీట్ల కోసం పడే పాట్లు చూసి ఇద్దరు పిల్లల కంటే ఒకరికే పరిమితమవుతున్నారు లేదా పేరెంట్హుడ్ను పూర్తిగా వాయిదా వేస్తున్నారు.గ్లోబల్ సర్వే ఏం చెబుతోంది? (UNFPA 2025 డేటా)యంగ్ జనరేషన్ కేవలం పిల్లల కోసం కాకుండా కెరీర్ గ్రోత్, వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తోంది. వారు ఆశించే కుటుంబ పరిమాణాన్ని అడ్డుకుంటున్న కారకాలను కింది పట్టిక వివరిస్తుంది.అడ్డంకులు/కారణాలుశాతం (%)ఆర్థిక పరిమితులు39%ఉద్యోగ అభద్రత21%గృహ సమస్యలు19%సరిపోని పిల్లల సంరక్షణ సదుపాయాలు12%మనం నేర్చుకోవాల్సిన పాఠాలుభారతదేశం ప్రస్తుతం తూర్పు ఆసియా తరహా తీవ్ర జనాభా క్షీణతను ఎదుర్కోవడం లేదు కానీ, మన దేశ సంతానోత్పత్తి సరళి వేగంగా మారుతోంది. ఎన్ఎఫ్హెచ్ఎస్-6 (2023-24) నివేదిక ప్రకారం..భారతదేశ సగటు సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) 2.0 గా నమోదైంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 సర్వే ప్రకారం.. దేశ జాతీయ టీఎఫ్ఆర్ 1.9 కు పడిపోయింది.1960లలో ఒక భారతీయ మహిళకు సగటున ఆరుగురు పిల్లలు ఉండగా నేడు విద్యా ప్రమాణాలు పెరగడం, గర్భనిరోధక సాధనాల లభ్యత వల్ల కుటుంబాలు చిన్నవయ్యాయి. అయితే ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో జననాల రేటు పడిపోయి వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుంటే, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా జనన రేట్లు ఎక్కువగా ఉన్నాయి.భారత్ ఏం చేయాలి?సంతానోత్పత్తి తగ్గడాన్ని ఒక సంక్షోభంగా చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం కంటే సరసమైన చైల్డ్ కేర్, మెరుగైన ప్రసూతి/పితృత్వ సెలవులు, సురక్షితమైన పని వాతావరణం కల్పించడంపై పాలకులు దృష్టి పెట్టాలి. భారతదేశంలో ఇంకా వివాహ బంధ వ్యవస్థ బలంగానే ఉంది. అయితే వంధ్యత్వం (Infertility), గృహాల ధరలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సవాలుగా మారుతున్నాయి. సంతానోత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి పడిపోయే వరకు వేచి ఉండకుండా ఇప్పుడే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విధానాలు రూపొందించాలి.ఇదీ చదవండి: మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం -
మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం
గ్లోబల్ మార్కెట్లో తలెత్తుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, దేశీయంగా విదేశీ మూలధన ప్రవాహాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంయుక్తంగా కీలక చర్యలు ప్రారంభించాయి. విదేశీ నిధులను తిరిగి భారత మార్కెట్ వైపు ఆకర్షించేందుకు తీసుకుంటున్న ఈ చర్యల్లో ఇది మొదటి అడుగని, రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ‘మైండ్ మైన్ సమ్మిట్ 2026’లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు.ముడి చమురు, ఎరువులు, కీలక ముడి పదార్థాల దిగుమతుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పరిస్థితుల నుంచి ఉత్పన్నమయ్యే ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి మన బాండ్ మార్కెట్ ‘మంచి అయస్కాంతం’లా పనిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్త విశ్లేషణలో తేలిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడిదారులకు నిబంధనలను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు.ఎఫ్ఏఆర్ పరిధి విస్తరణప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ ఇన్వెస్టర్లకు సమ్మతి భారాన్ని తగ్గించేందుకు గానూ, ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్’ (ఎఫ్ఏఆర్) కింద నిర్దిష్ట సెక్యూరిటీల జాబితాను జూన్ 5న ప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల ద్వారా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఆర్జించే వడ్డీ, మూలధన లాభాల ఆదాయానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు.‘ప్రస్తుతానికి ఈ సంస్కరణలు బాండ్ మార్కెట్కే పరిమితమైనప్పటికీ దీని పరిధి విస్తరించనుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రావాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం’ అని సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు.బ్యాంకులకు ఊరటవిదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచడంతో పాటు కరెన్సీ హెడ్జింగ్ రిస్క్ను తగ్గించడానికి ఆర్బీఐ జూన్ 5న బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. 3 నుంచి 5 సంవత్సరాల మెచ్యూరిటీ గల ‘విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్’ (ఎఫ్సీఎన్ఆర్-బీ) డిపాజిట్ల కోసం ఆర్బీఐ స్వాప్ సదుపాయాన్ని యాక్సెస్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. దీని ద్వారా బ్యాంకులు తమ యూఎస్ డాలర్ డిపాజిట్లను ఆర్బీఐతో మార్చుకోవచ్చు. తద్వారా మారకపు విలువల్లో వచ్చే కరెన్సీ ప్రమాదాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అలాగే, విదేశీ మూలధన ప్రవాహాన్ని పెంచడానికి, సెప్టెంబర్ 30 వరకు బాహ్య వాణిజ్య రుణాలను (ఈసీబీ) పెంచుకునేలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఇదీ చదవండి: మల్టీప్లెక్స్ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్! -
ఇంధన కొరతపై కేంద్ర మంత్రి క్లారిటీ!
దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ముడిచమురు, ఎల్జీ, సహజ వాయువు సరఫరా పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి శనివారం స్పష్టం చేశారు. దేశీయంగా 60 రోజులకు పైగా సరిపడా ముడిచమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఎల్పీజీ సరఫరా కూడా చాలా మెరుగ్గా ఉందన్నారు. గరిష్టంగా 75 నుంచి 80 రోజులకు సరిపోయేలా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఎల్పీజీ కనెక్షన్ దారులు క్రమంగా పైప్డ్ గ్యాస్ (పీఎన్జీ) వైపు మారాలని ఆయన కోరారు. ఇక డీజిల్ విక్రయాలపై రోజుకు 200 లీటర్ల పరిమితి విధించడంపై స్పందిస్తూ.. బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.అమెరికా దాడిపై భారత్ తీవ్ర ఆగ్రహంఒమన్ గల్ఫ్లో ఒక వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నౌకా సిబ్బంది మరణించిన ఘటనపై భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార ప్రతినిధిని రెండుసార్లు పిలిపించి మాట్లాడామని చెప్పారు. అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో నేరుగా మాట్లాడి తమ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి వివరించారు.పెరగనున్న ‘ఈ85’ ఇంధన పంపులుపర్యావరణ అనుకూల ఇంధన రంగం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో 47 ‘ఈ85’ (85 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంధన పంపులు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాబోయే డిసెంబర్ 2026 నాటికి వీటి సంఖ్యను 500కు, డిసెంబర్ 2027 నాటికి ఏకంగా 5,000 పంపులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. -
మధ్యతరగతిపై ధరల భారం
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ బడ్జెట్ను నిర్వహించడం సవాలుగా మారింది. వచ్చే ఆదాయానికి, అయ్యే ఖర్చులకు పొంతన కుదర్చడానికి సామాన్యుడు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే కిరాణా సామాగ్రి, ఇంధన ధరలు, పిల్లల పాఠశాల ఫీజులు, ఈఎంఐలు, కరెంట్ బిల్లులు లాంటి యుటిలిటీ బిల్లులు గృహ ఆదాయంలో అత్యధిక భాగాన్ని మింగేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఊహించని ఖర్చుల కోసం రూపాయి దాచుకుందామన్నా సాధ్యపడటం లేదు.ఈక్రమంలో తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు సామాన్యుడు మరింత ఆందోళన చెందేలా ఉన్నాయి. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో నమోదైన 3.48 శాతం నుంచి మే నెల నాటికి 3.93కి పెరిగింది. ప్రధానంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరగడమే ఇందుకు కారణం. కాగితంపై ఈ పెరుగుదల స్వల్పంగానే కనిపించవచ్చు. అలాగే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత పరిమితిలోనే ఉండవచ్చు. కానీ, ఒక స్థిరమైన జీతంపై ఆధారపడే కుటుంబాలకు మాత్రం రాబోయే రోజుల్లో నిత్యావసరాలు మరింత ప్రియం కానున్నాయా అనే ఆందోళన మొదలైంది.మళ్లీ పెరిగిన ఆహారం, ఇంధనం మంట!సాధారణ వినియోగదారుడికి ద్రవ్యోల్బణం లెక్కలు, ఆర్థిక అంచనాలతో పెద్దగా పనిలేదు. మార్కెట్కు వెళ్తే కూరగాయలు, వంటనూనె ఎంతకు వస్తున్నాయి, బండిలో పెట్రోల్ కొట్టించడానికి ఎంతవుతోంది అనేదే వారి లెక్క. ఏప్రిల్లో 4.20 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం, మే నెలలో 4.78కు ఎగబాకింది. రవాణా ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 0.01గా ఉన్న ఉంటే మే నాటికి ఏకంగా 1.75 శాతానికి పెరిగింది.ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నెలలోనే నాలుగు సార్లు ఇంధన ధరలను సవరించడం దీనికి ప్రధాన కారణం. రవాణా ఖర్చులు పెరిగినప్పుడు ఆ భారాన్ని వ్యాపారాలు వినియోగదారులపైకే నెట్టేస్తాయి. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతాయి. ‘మే నెలలో రిటైల్ వినియోగదారులు టోకు ద్రవ్యోల్బణ తీవ్రత నుంచి కొంతవరకు తప్పించుకున్నప్పటికీ.. రెస్టారెంట్లు, వంట గ్యాస్, రవాణా వంటి రంగాలలో అప్పుడే ధరల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది’ అని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపమ్ చౌధురి అన్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఇది పట్టణ మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తూ మార్కెట్లో డిమాండ్ను తగ్గిస్తోంది.భవిష్యత్తు మరింత భారమేనా?ప్రస్తుత ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు లోబడే ఉన్నప్పటికీ ధరల ఒత్తిడి మాత్రం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలారా క్యాపిటల్ డిప్యూటీ హెడ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎకనామిస్ట్ గరిమా కపూర్ మాట్లాడుతూ.. ‘ఇంధనం, ఆహార ధరల ప్రభావం ఉన్నప్పటికీ మే నెల సీపీఐ ద్రవ్యోల్బణం అంచనాల కంటే కొంచెం తక్కువగానే నమోదైంది. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారం దిశగా అడుగులు పడటం, ఆర్బీఐ-ప్రభుత్వ చర్యల వల్ల స్థూల ఆర్థిక నేపథ్యం ప్రస్తుతం కాస్త అనుకూలంగా మారింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని అదుపు చేయడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది’ అని విశ్లేషించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
మేలోనూ ధరల మంటే!
న్యూఢిల్లీ: రిటైల్ ధరలు మే నెలలో మరికొంత ఎగిశాయి. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) ఏప్రిల్లో ఉన్న 3.48 శాతం నుంచి 3.93 శాతానికి పెరిగింది. ఆహార ధరలు, ఇంధన ధరలు ఈ పెరుగుదలకు దోహదం చేసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్త్నుాయి. → ఆహార విభాగంలో సీపీఐ ఏప్రిల్లో 4.2 శాతంగా ఉంటే, మేలో 4.78 శాతానికి పెరిగింది. → మేలో పసిడి, వెండి ఆభరణాలు, టమాటోలు, అల్లం, కిస్మిస్ ధరలు అధికంగా పెరిగాయి. → ఆలుగడ్డలు, బఠానీ, మోటారు కార్లు, జీలకర్ర, మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలు తగ్గాయి. → మే నుంచి చూస్తే పెట్రోల్ ధర 7.4 శాతం, డీజిల్ ధర రూ.8.4 శాతం చొప్పున పెరగడం తెలిసిందే. → పట్టణాల్లో ద్రవ్యోల్బణం తక్కువగా 3.93 శాతంగా ఉంటే, పల్లెల్లో 4.25 శాతంగా నమోదైంది. → దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే 6.15 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. మిజోరంలో అత్యల్పంగా 1.03 శాతం ఉంది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉండొచ్చంటూ ఆర్బీఐ ఎంపీసీ ఇటీవలి సమీక్ష అనంతరం ప్రకటించడం తెలిసిందే. ఆహారంతోపాటు, ఆహారేతర వస్తువుల ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించినట్టు క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త దీప్తి దేశ్పాండే తెలిపారు. ‘‘తయారీదారులకు ముడిసరుకుల ధరలు ప్రియంగా మారాయి. టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 8.3 శాతానికి చేరడం ఇదే సూచిస్తోంది. ఇప్పుడు ఈ భారం రిటైల్ ధరలపైనా క్రమంగా ప్రతిఫలిస్తోంది’’అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆర్బీఐ లకి‡్ష్యత పరిధిలోనే (2–6 శాతం) ద్రవ్యోల్బణం ఉండొచ్చని అసోచామ్ ప్రెసిడెంట్ నిర్మల్ కే మిండా అంచనా వేశారు. -
పెరిగిన భారత్ బంగారం నిల్వల విలువ
భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో (Forex Reserves) స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ గణనీయంగా పెరిగింది. ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జూన్ 5తో ముగిసిన వారంలో దేశ బంగారం నిల్వల విలువ 1.98 బిలియన్ డాలర్లు పెరిగి 114.58 బిలియన్ డాలర్లకు చేరుకుంది.అదే సమయంలో మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు 711 మిలియన్ డాలర్లు తగ్గి 681.61 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఫారెక్స్ రిజర్వుల్లో అతిపెద్ద వాటా కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) 2.70 బిలియన్ డాలర్లు తగ్గి 543.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఎఫ్సీఏలను అమెరికా డాలర్ విలువలో లెక్కిస్తారు. అయితే ఈ నిల్వల్లో యూరో, పౌండ్ స్టెర్లింగ్, జపాన్ యెన్ వంటి ఇతర ప్రధాన కరెన్సీలు కూడా ఉండటంతో, వాటి మారకపు విలువల్లో చోటుచేసుకునే మార్పులు ఎఫ్సీఏపై ప్రభావం చూపుతాయి.గత వారంలో భారత విదేశీ మారక నిల్వలు సుమారు 938 మిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. రూపాయి మారకపు విలువలో అధిక ఒడిదుడుకులు కనిపించినప్పుడు లేదా మార్కెట్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆర్బీఐ ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుంటూ నిల్వలను వినియోగిస్తుంది.ఇటీవల అమెరికా డాలర్ నిల్వలను బలోపేతం చేయడం, రూపాయి స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఎఫ్సీఎన్ఆర్-బీ (FCNR-B) డిపాజిట్ల హెడ్జింగ్ ఖర్చును భరించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.ప్రస్తుతం భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే 95 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన 97 స్థాయితో పోలిస్తే మెరుగైన స్థితిగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రూపాయి మారకం విలువ 94.70 నుంచి 95.60 మధ్య కదలాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: టాటా కారు కొనుగోలుదారులకు షాక్! -
పేపర్ నోట్ల స్థానే ప్లాస్టిక్ నోట్లు! ప్రభుత్వం వివరణ
‘జూన్ 30 తర్వాత మీ జేబులోని కాగితపు కరెన్సీ నోట్లు చెల్లవు.. వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి’— ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల్లో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ సారాంశం ఇది. 2016 నాటి నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఈ వార్త వ్యాపార వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిజంగానే కాగితపు నోట్లను నిషేధిస్తోందా? కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏమంటోంది? అనే అంశాలను కింద చూద్దాం.వైరల్ అవుతున్న పోస్ట్లో ఏముంది?సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్టుల ప్రకారం.. జూన్ 30, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. అదే తేదీ నుంచి వాటి స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ (పాలిమర్ నోట్లు) అమల్లోకి వస్తుందని ఆ పోస్టుల సారాంశం.పీఐబీ ఫ్యాక్ట్ చెక్ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ వాదనను పూర్తిగా నకిలీ (ఫేక్ న్యూస్) అని కొట్టిపారేసింది. ‘జూన్ 30, 2026 నాటికి కాగితపు నోట్లను దశలవారీగా తొలగించే లేదా వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఎలాంటి ప్రణాళికలు ఆర్బీఐ వద్ద లేవు. వివిధ సామాజిక గ్రూపుల్లో వచ్చే ధ్రువీకరించని సమాచారాన్ని, ఫార్వార్డ్ మెసేజ్లను గుడ్డిగా నమ్మవద్దు’ అని ప్రభుత్వం కోరింది. కరెన్సీకి సంబంధించిన ఎలాంటి వివరాల కోసమైనా నేరుగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.Several social media posts are falsely claiming that RBI will withdraw paper currency notes and replace them with plastic currency notes from June 30, 2026.#PIBFactCheck❌ This claim is #Fake✅ According to @RBI, there are no plans to withdraw paper currency notes or… pic.twitter.com/dhZqANjip9— PIB Fact Check (@PIBFactCheck) June 9, 2026పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలుఇటీవల (జూన్ 5, 2026న) జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్లాస్టిక్ నోట్లపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ‘పాలిమర్ నోట్ల ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే. మేము దాని వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేస్తున్నాం. అయితే, ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
ట్రంప్ వ్యాఖ్యలు వైరల్! ప్రత్యర్థులకు ఫుల్ జోష్
అమెరికాలో నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. మే నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం (సీపీఐ) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడంపై ఆందోళనలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. పైగా ‘ఆర్థిక గణాంకాలు చాలా బాగున్నాయి... నేను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ విలేకరులతో ట్రంప్ అనడం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వచ్చే నవంబర్లో జరగబోయే కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో ఈ ధరల పెరుగుదలనే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న డెమొక్రాట్లకు ట్రంప్ వ్యాఖ్యలు వరంగా మారుతాయని కొందరు చెబుతున్నారు.డెమొక్రాట్ల ఎదురుదాడిట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా యూఎస్ సెనేట్ డెమొక్రాటిక్ మైనారిటీ నేత చక్ షూమర్ మాట్లాడుతూ.. ‘అమెరికన్ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ట్రంప్నకు ఉన్న నిర్లక్ష్యానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. తాను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నానని పబ్లిక్గా ఒప్పుకున్నారు. అమెరికా ప్రజల పట్ల ఆయనకున్న ధిక్కారానికి హద్దులు లేవు’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.డెమొక్రాటిక్ పార్టీ వ్యూహంట్రంప్ మాట్లాడిన వీడియో క్లిప్ను జోడిస్తూ డెమొక్రాటిక్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో కొత్త ప్రచార ప్రకటనను విడుదల చేసింది. ‘ట్రంప్ తన మనసులోని నిశ్శబ్దాన్ని బయటపెట్టేశారు. ఆయనకు ద్రవ్యోల్బణం అంటే ఇష్టం. ప్రతి అమెరికన్ దీనిని గమనించాలి’ అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. మరోవైపు హౌస్ రిపబ్లికన్ స్పీకర్ మైక్ జాన్సన్ అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ట్రంప్ అన్న మాటలను అంసందర్భంగా మారుస్తూ రాజకీయం చేస్తున్నారని వాదించారు.మూడేళ్ల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణంతాజా గణాంకాల ప్రకారం, మే నెలలో వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) వార్షిక ప్రాతిపదికన 4.2 శాతానికి పెరిగింది. ఇది ఏప్రిల్ నెలలోని 3.8 శాతం కంటే ఎక్కువ మాత్రమే కాకుండా, ఏప్రిల్ 2023 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. కిరాణా సామగ్రి, ఇంధనంతో పాటు వైద్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ సేవల ఖర్చులు, విమాన ప్రయాణ ఛార్జీలు, వినోద రంగాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.ధరల పెరుగుదలకు కారణంకొవిడ్ సృష్టించిన సంక్షోభం నుంచి కోలుకోకముందే.. వరుస అంతర్జాతీయ పరిణామాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ విధించిన అంతర్జాతీయ సుంకాలు ఇప్పటికే ఆర్థికవ్యవస్థను దెబ్బతీయగా ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన యూఎస్-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం చమురు మార్కెట్ను కోలుకోలేని దెబ్బతీసింది.ప్రపంచ చమురు, వాయువు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ద్రవ్యోల్బణం ఒక్కసారిగా తగ్గుతుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. కానీ, ఆర్థికవేత్తలు మాత్రం యుద్ధం ముగిసినా చమురు ధరలు పూర్వస్థితికి రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు.ఆశాజనకమైన సంకేతాలుకొంతకాలంగా గ్యాసోలిన్ ధరలు స్వల్పంగా స్థిరపడుతుండటం మార్కెట్ విశ్లేషకులలో ఆశలు రేకెత్తిస్తోంది. ‘అధిక ఇంధన ధరలు గత నెలలో ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచిన మాట వాస్తవమే. కానీ, ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుందని మా అంచనా. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది తగ్గుముఖం పడుతుంది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి’ అని నేషన్ వైడ్ చీఫ్ ఎకనామిస్ట్ కాథీ బోస్ట్జోన్సిక్ అన్నారు.వడ్డీ రేట్ల తగ్గింపు కష్టమేనా?అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యానికి పరిమితం చేయాలని భావిస్తోంది. వచ్చే వారం ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణాయక కమిటీ సమావేశం కానుంది. గత నెలలోనే పగ్గాలు చేపట్టిన కొత్త ఛైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో జరగబోయే మొదటి సమావేశం ఇది కావడం విశేషం. వడ్డీ రేట్లను తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను యథాతథంగా ఉంచేందుకే మొగ్గు చూపవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ఎరువుల సబ్సిడీ రెట్టింపు
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాతావరణ మార్పులు, సాంకేతిక విప్లవం (ఏఐ) అంతర్జాతీయ వ్యాపార రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఎరువుల సబ్సిడీ బిల్లు ఏకంగా రూ.3.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి.భారత్పై సబ్సిడీ భారంయూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభం 100 రోజులు కావస్తుండడం, హార్మూజ్ జలసంధిలో రవాణా అంతరాయాలు, ఉత్పత్తి కేంద్రాల దెబ్బతినడం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.71 లక్షల కోట్లు కేటాయించగా ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇది రెట్టింపై రూ.3.4 లక్షల కోట్లకు చేరేలా ఉంది.రైతాంగానికి ఊరటప్రభుత్వానికి భారం పెరిగినప్పటికీ రైతులపై పైసా భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. 2018 నుంచి యూరియా ధర (45 కిలోల బస్తా) రూ.266.5 వద్దే స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఒక్కో బస్తాపై సబ్సిడీ రూ.4,000 దాటింది. డీఏపీ (50 కిలోల బస్తా) ధర కూడా రూ.1,350 వద్దే కొనసాగుతోంది.ఆయిల్ కంపెనీలకు మద్దతుగత 78 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1.23 లక్షల కోట్ల మద్దతును అందిస్తోంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించడం ఇందులో భాగమే.బడ్జెట్ పరిమితులు దాటని ద్రవ్యలోటుఈ అదనపు వ్యయాలు దేశ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీయవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2026-27 బడ్జెట్ రూపకల్పనలోనే ఇలాంటి అంతర్జాతీయ అనిశ్చితులను ముందే అంచనా వేసి వ్యూహాత్మకంగా నిధులను కేటాయించారు. బడ్జెట్లో నిర్దేశించుకున్న జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అదనపు రుణాలు లేదా అనుబంధ గ్రాంట్ల అవసరం రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.రూ.1 లక్ష కోట్ల స్థిరీకరణ నిధిఊహించని ప్రపంచ పరిస్థితులను తట్టుకోవడానికి గత ఏడాది ఏర్పాటు చేసిన రూ.1 లక్ష కోట్ల ఆర్థిక స్థిరీకరణ నిధి ప్రస్తుతం కేంద్రానికి రక్షణ కవచంగా మారింది. దీని నుంచే విమానయాన సంస్థల కోసం రూ.10,000 కోట్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధిని కేటాయించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశీయ యూరియా ప్లాంట్లకు తగినంత ఎల్ఎన్జీ సరఫరాను ప్రభుత్వం నిర్ధారించింది. ఇది సబ్సిడీ భారాన్ని కొంతవరకు తగ్గించనుంది.ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టిఅదనపు సబ్సిడీల భారాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం పన్నుయేతర ఆదాయాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. ‘డీఐపీఏఎం(దీపమ్) , డీపీఈ విభాగాలు రాబోయే ఏడాది కాలానికి స్పష్టమైన కార్యాచరణతో ఉన్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బడ్జెట్ లక్ష్యం రూ.80,000 కోట్లను మించి ఆదాయం వస్తుందని భావిస్తున్నాం’ అని ప్రభుత్వ ఉన్నత అధికార వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
డార్క్ ప్యాటర్న్స్తో ఏటా రూ.28,000 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన డిజిటల్ ప్లాట్ఫారమ్లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ‘డార్క్ ప్యాటర్న్స్’ (మోసపూరిత డిజైన్ విధానాలు) కారణంగా భారతీయ ఆన్లైన్ కొనుగోలుదారులు ఏటా రూ.25,000 కోట్ల నుంచి రూ.28,000 కోట్ల వరకు నష్టపోతున్నట్లు మార్కెట్ పరిశోధనా సంస్థ డేటమ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. సంస్థ మంగళవారం విడుదల చేసిన ‘డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్లైన్ మార్కెట్ప్లేసెస్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2026 తొలి త్రైమాసికంలో దేశంలోని 50 నగరాలకు చెందిన 2,590 మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన 12 ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఇందులో విశ్లేషించారు. డార్క్ పాటర్న్స్ అంటే: ఉత్పత్తులు లేదా సేవలను అంటగట్టేందుకు అనుసరించే వివిధ పద్ధతులే డార్క్ పాటర్న్స్గా వ్యవహరిస్తారు. వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, వారిని గందరగోళానికి గురిచేయడం, బలవంతంగా షాపింగ్ చేయించడమే వీటి లక్ష్యం. నివేదికలో మరిన్ని అంశాలు: → రహస్య ఛార్జీలు, బలవంతపు యాడ్–ఆన్లు, డ్రిప్ ప్రైసింగ్, ఫాల్స్ అర్జెన్సీ, సబ్్రస్కిప్షన్ ఉచ్చులు వంటి విధానాల కారణంగా దేశంలోని 30.4 కోట్ల మంది ఆన్లైన్ కొనుగోలుదారుల్లో 88 శాతం మంది నెలకు సగటున రూ.78 నుంచి రూ.87 వరకు అదనపు భారం భరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. → ప్రారంభంలో ఒక ధర చూపించి, చెల్లింపు దశలో అదనపు రుసుములు జోడించే ‘డ్రిప్ ప్రైసింగ్’ లేదా ‘హిడెన్ ఛార్జీలు’ ఎదురవుతున్నాయని 63 % మంది డిజిటల్ చెల్లింపుల వినియోగదారులు తెలిపారు. 2024లో ఈ సంఖ్య 52 శాతంగా ఉండగా, ప్రస్తుతం 63 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశమని నివేదిక పేర్కొంది → అధ్యయనంలో భాగమైన 73 శాతం ప్లాట్ఫారమ్లు వినియోగదారులకు ఇష్టం లేకపోయినా.., కొనుగోలు చేసేలా బలవంతపు వ్యూహాలు (ఫోర్డ్స్ యాక్షన్) అమలు చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. → ఆన్లైన్ కొనుగోలుదారులలో 81 శాతం మందికి ఇలాంటి మోసపూరిత టెక్నిక్స్ (డార్క్ ప్యాటర్న్స్) గురించి అవగాహన ఉన్నప్పటికీ, వారిలో 85 శాతం మంది డార్క్ ప్యాటర్న్స్ వల్ల ఏదో ఒక రూపంలో తప్పుదోవ పట్టించబడినట్లు వెల్లడించారు. దీనిని నివేదిక ‘అవగాహన వైరుధ్యం’ గా అభివరి్ణంచింది. → ఈ–కామర్స్ విభాగంలో 50 శాతం మంది వినియోగదారుల మద్దతుతో అమెజాన్ అత్యంత విశ్వసనీయ వేదికగా నిలిచింది. మరోవైపు, ఫ్లిప్కార్ట్ విషయంలో నమ్మకం (37 శాతం) కంటే అపనమ్మకమే (41 శాతం) ఎక్కువగా నమోదైంది. ఇక్కడ ప్రతి లావాదేవీలోనూ వినియోగదారుల నుంచి ‘అదనపు సొమ్ము’ వసూలు చేసే ప్రక్రియ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నివేదిక విశ్లేషించింది. → ఆన్లైన్ ట్రావెల్ రంగంలో మేక్మైట్రిప్ అత్యంత సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. కాగా క్లియర్ట్రిప్ వినియోగదారులకు ఎక్కువ నష్టం చేకూరుస్తున్నట్లు రేటింగ్ పొందింది. → క్విక్ కామర్స్ రంగంలో బిగ్బాస్కెట్ యాప్ తీవ్రమైన డార్క్ ప్యాటర్న్స్ స్కోరును నమోదు చేసింది. → ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఈ డిజిటల్ మోసాలను అరికట్టడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయని నివేదిక అభిప్రాయపడింది. అయితే, ఆన్లైన్ కొనుగోలుదారుల్లో 74 శాతం మంది పారదర్శకమైన, న్యాయబద్ధమైన డిజైన్ విధానాలను అనుసరించే ప్లాట్ఫారమ్ల కోసం అవసరమైతే కొంత ఎక్కువ ధర చెల్లించేందుకూ సిద్ధంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. -
వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026–27) భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తగ్గించింది. గతంలో 6.7 శాతంగా ప్రకటించిన అంచనాను 6.4 శాతానికి సవరిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా–ఇరాన్ యుద్ధంతో సెపె్టంబర్, డిసెంబర్ త్రైమాసికాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు నిదానించనున్నట్టు తెలిపింది. ప్రజల ఆదాయం, వినియోగ వ్యయాలపై ధరల పెరుగుదల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదు కావడం తెలిసిందే. ‘‘జీడీపీ వృద్ధి రేటు 2026–27లో 6.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. మార్చిలో ప్రకటించిన అంచన కంటే 0.3 శాతం తక్కువ. వృద్ధిలో దేశీ డిమాండ్ కీలక పాత్ర పోషిస్తుంది. నికర దిగుమతులు తక్కువగా ఉండడం వృద్ధికి అనుకూలించనుంది’’ అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.6 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చన్నది ఆర్బీఐ తాజా అంచనా. ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని జూన్ సమీక్ష అనంతరం ప్రకటించడం తెలిసిందే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇటీవలి కాలంలో పెంచడాన్ని ఫిచ్ తన నివేదికలో ప్రస్తావించింది. 2027–28లో జీడీపీ వృద్ధి 6.7%కి పుంజుకుంటుందని అంచనా వేసింది. ధరలు పెరుగుతాయ్.. భారత్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో పెరగలేదంటూ, రానున్న నెలల్లో ధరలు క్రమంగా పెరుగుతాయని ఫిచ్ తెలిపింది. ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 8.3%కి పెరగ్గా, రిటైల్ ద్రవ్యోల్బణం 3.5%గా ఉండడాన్ని ప్రస్తావించింది.అంతర్జాతీయ వృద్ధి 2.4 శాతం 2026 సంవత్సరానికి అంతర్జాతీయ వృద్ధి రేటు అంచనాలను సైతం 0.2 శాతం తగ్గించి 2.4 శాతంగా ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. -
ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో మిగులు నిధుల బదిలీ (సర్ప్లస్ ట్రాన్స్ఫర్) ఊపందుకుంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో ఆర్బీఐ ఏకంగా రూ.2,86,588.46 కోట్ల భారీ మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది. ఇది మన దేశ జీడీపీలో 0.83 శాతానికి సమానం. గడచిన మూడేళ్లుగా ఈ బదిలీలు నిరంతరాయంగా భారీ స్థాయిలో సాగుతున్నాయి.గత మూడేళ్ల బదిలీల గణాంకాలను పరిశీలిస్తే..2023-24: రూ.2,10,873.99 కోట్లు (జీడీపీలో 0.99%)2024-25: రూ.2,68,590.07 కోట్లు (జీడీపీలో 0.90%)2025-26: రూ.2,86,588.46 కోట్లు (జీడీపీలో 0.83%)ఈ నిధుల బదిలీ ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తున్నప్పటికీ దేశ ద్రవ్య వ్యవస్థ(మానిటరీ సిస్టమ్), లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై నిపుణులు కొన్ని అంశాలు పంచుకుంటున్నారు.చట్టబద్ధమైన నిబంధనలు - ఆదాయ వ్యయాలుఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 47 ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ తన మొత్తం ఆదాయం నుంచి నిర్వహణ వ్యయాలు, అవసరమైన నిధుల కేటాయింపులు పోను మిగిలిన నికర ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?ఆర్బీఐకి దేశీయ వనరులతో పాటు విదేశీ వనరుల నుంచి వచ్చే వడ్డీలు, పెట్టుబడుల అమ్మకాలు/రిడెంప్షన్ ద్వారా లభించే లాభాల రూపంలో ఆదాయం వస్తుంది. 2025-26లో ఆర్బీఐ స్థూల ఆదాయం 26.42 శాతం పెరిగి రూ.4,27,684.15 కోట్లకు చేరింది. ఇందులో అత్యధికంగా 76.53 శాతం ఆదాయం విదేశీ వనరుల నుంచే రావడం గమనార్హం.మరోవైపు ఆర్బీఐ మొత్తం వ్యయం (ఉద్యోగుల జీతాలు, కరెన్సీ ముద్రణ ఛార్జీలు, ఏజెన్సీ ఛార్జీలు మొదలైనవి) రిస్క్ ప్రొవిజన్లకు ముందు 27.60 శాతం పెరిగి రూ.1,41,091.69 కోట్లుగా నమోదైంది. రిస్క్ ప్రొవిజన్ల(భవిష్యత్తులో రాబోయే ఊహించని నష్టాలు లేదా ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆర్బీఐ తన లాభాల నుంచి ముందుగానే పక్కన పెట్టే రక్షణ నిధి)కు ముందు నికర ఆదాయం రూ.3,95,972.10 కోట్లుగా ఉండగా, మార్చి 31, 2026 నాటికి ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ సైజ్ 20.61 శాతం వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.రిస్క్ బఫర్ నిర్వహణసవరించిన ఆర్థిక మూలధన చట్రం (ఎకానామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్-ECF) ప్రకారం.. ఆర్బీఐ తన బ్యాలెన్స్ షీట్ సైజులో 4.5% నుంచి 7.5% వరకు కంటింజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్బీ-ఊహించని అత్యవసర ఖర్చులు) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ 2025-26లో ఏకంగా రూ.1,09,379.64 కోట్లను సీఆర్బీకి మళ్లించింది (గత ఏడాది ఇది రూ.44,861.70 కోట్లు మాత్రమే). ప్రస్తుతం ఈ రిస్క్ బఫర్ లెక్కింపు ప్రకారం 6.5 శాతంగా ఉంది.ద్రవ్య వ్యవస్థపై పర్యవసానాలుఆర్బీఐ వద్ద మిగులు నిధుల బదిలీ కేవలం అకౌంటింగ్ ప్రక్రియ మాత్రమే కాదు, దీనికి తీవ్రమైన ద్రవ్య ప్రాధాన్యత ఉంది. ఇది దేశ ద్రవ్య విధానంపై ప్రభావం చూపుతుంది.రిజర్వ్ మనీ పెరగడం: దేశంలో ద్రవ్య సృష్టికి మూలమైన రిజర్వ్ మనీ లేదా బేస్ మనీతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీల వైపు కరెన్సీ, బ్యాంకుల డిపాజిట్లు ఉంటే.. అసెట్స్ వైపు నెట్ డొమెస్టిక్ అసెట్స్ (ఎన్డీఏ-ప్రభుత్వానికి ఇచ్చే క్రెడిట్), నెట్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎన్ఎఫ్ఏ) ఉంటాయి.లిక్విడిటీ: ఆర్బీఐ వద్ద ఈ మిగులు ఉన్నంత కాలం నిధులు ‘నాన్-మానిటరీ లయబిలిటీ’గా రిజర్వుల్లో ఉంటాయి. ఎప్పుడైతే వీటిని ప్రభుత్వానికి బదిలీ చేస్తారో అప్పుడు ఇవి ప్రభుత్వ డిపాజిట్లుగా మారతాయి. ప్రభుత్వం ఈ నిధులను వివిధ పథకాలు, అభివృద్ధి పనుల కోసం మార్కెట్లో ఖర్చు చేసినప్పుడు.. ఆ డబ్బు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుంది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) భారీగా పెరుగుతుంది. ఇది వ్యవస్థలోకి శాశ్వత లిక్విడిటీని ప్రవేశపెట్టడంతో సమానం.రాబడిలో పెరుగుదలకేంద్ర బడ్జెట్లో ఈ నిధులను పన్నేతర రాబడి కింద ‘డివిడెండ్లు, లాభాలు’ అనే పద్దులో చూపిస్తారు.2025-26 బడ్జెట్ అంచనాలుసవరించిన అంచనాలుతుది సంఖ్యరూ.3,25,000 కోట్లురూ.3,75,590 కోట్లురూ.3,80,136 కోట్లుఈ పెరిగిన రూ.55,136 కోట్లకు ప్రధాన కారణం ఆర్బీఐ బదిలీ చేసిన మిగులు నిధులే. 2025-26లో బదిలీ అయిన రూ.2,86,588.46 కోట్లు.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పన్నేతర రాబడిలో ఏకంగా 43.01 శాతంగా నిలవనుంది. ఇది ఆర్బీఐ నిధులపై ప్రభుత్వ డిపెండెన్సీ ఏ స్థాయిలో పెరుగుతుందో సూచిస్తోంది. సాధారణ ప్రభుత్వ రంగ సంస్థల లాభాల బదిలీకి, ఆర్బీఐ మిగులు బదిలీకి చాలా తేడా ఉంటుంది. ఆర్బీఐ బదిలీ నేరుగా ప్రాథమిక ద్రవ్య విస్తరణకు దారితీస్తుంది.ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందా?సాంకేతిక కోణంలో చూస్తే ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే అంశాలాగా తోస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ బదిలీల వల్ల వ్యవస్థలోకి వచ్చే అదనపు ద్రవ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ సులువుగా విస్మరించలేదు. ప్రభుత్వానికి ఇది ఆర్థికంగా వెసులుబాటు కల్పించే అవకాశం అయినప్పటికీ, మార్కెట్లో మితిమీరిన ద్రవ్య లభ్యత వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణ ముప్పును అదుపు చేయడం ఆర్బీఐకి సవాలుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
క్యూ4లో 7.1 బిలియన్ డాలర్లు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికం(క్యూ4)లో దేశీ కరెంట్ ఖాతా 7.1 బిలియన్ డాలర్ల మిగులును సాధించింది. ఇది దేశ జీడీపీలో 0.7 శాతంకాగా.. ఇందుకు సరీ్వసుల ఎగుమతులు, అధిక రెమిటెన్సులు సహకరించాయి. అయితే అంతక్రితం ఏడాది(2024–25) జనవరి–మార్చి(క్యూ4)లో 13.7 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. ఇది జీడీపీలో 1.4 శాతానికి సమానం. ఆర్బీఐ బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్(బీవోపీ)పై తాజాగా విడుదల చేసిన గణాంకాలివి. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) 25.2 బిలియన్ డాలర్లుగా ఉంది. జీడీపీలో ఇది 0.6 శాతంకాగా.. 2024–25లోనూ 22.9 బిలియన్ డాలర్ల(0.6 శాతం) క్యాడ్ నమోదైంది. క్యూ4 వివరాలిలా గతేడాది క్యూ4లో మెర్కండైజ్ వాణిజ్య లోటు 83.4 బిలియన్ డాలర్లుకాగా.. 2024–25 చివరి త్రైమాసికంలో నమోదైన 59.3 బిలియన్ డాలర్లకంటే భారీగా పెరిగింది. సర్వీసుల నికర వసూళ్లు (రిసీప్్ట్స) 53.3 బిలియన్ డాలర్ల నుంచి 60.4 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వార్షికంగా సరీ్వసుల ఎగుమతులు ప్రధాన కేటగిరీలైన కంప్యూటర్ సరీ్వసులు, ఇతర బిజినెస్ సరీ్వసులలో బలపడ్డాయి. ఈ కాలంలో సెకండరీ ఆదాయ ఖాతాకింద వ్యక్తిగత బదిలీ రిసీప్్ట్స(రెమిటెన్స్లు) 33.9 బిలియన్ డాలర్ల నుంచి 43.5 బిలియన్ డాలర్లకు జంప్చేశాయి. ఫైనాన్షియల్ ఖాతాలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) నికరంగా 0.4 బిలియన్ డాలర్ల నుంచి 4.2 బిలియన్ డాలర్లకు ఎగశాయి. మరోపక్క విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్(ఎఫ్పీఐ) నుంచి 12 బిలియన్ డాలర్ల నికర పెట్టుబడులు లభించాయి. అయితే అంతక్రితం ఏడాది క్యూ4లో 5.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. బీవోపీ ప్రాతిపదికన విదేశీ మారక నిల్వలు 7.2 బిలియన్ డాలర్లమేర బలపడ్డాయి. అంతక్రితం క్యూ4లో ఇవి 7.2 బిలియన్ డాలర్లమేర పుంజుకున్నాయి. పూర్తి ఏడాదికి గతేడాది నికర ఎఫ్డీఐ పెట్టుబడులు 6.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 16.4 బిలియన్ డాలర్ల ఎఫ్పీఐ పెట్టుబడులు తరలిపోయాయి. 2024–25లో 3.6 బిలియన్ డాలర్ల ఎఫ్పీఐ పెట్టుబడులు లభించాయి. విదేశీ మారక నిల్వలు 23.6 బిలియన్ డాలర్లమేర క్షీణించాయి. అంతక్రితం ఏడాదిలో ఈ క్షీణత 5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
గణాంకాలపై మార్కెట్ ఫోకస్!
దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా పలు దేశ, విదేశీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోపక్క రోజుకో మలుపు తీసుకుంటున్న పశ్చిమాసియా పరిస్థితులు కీలకం కానున్నాయి. గత వారాంతాన యూఎస్ మార్కెట్లతోపాటు.. పసిడి, వెండి తదితర కమోడిటీలలో అమ్మకాలు వెల్లువెత్తాయి. యూఎస్ స్టాక్ మార్కెట్లు 1.5–4% మధ్య క్షీణించగా.. బంగారం 3 శాతం, వెండి 6.5% చొప్పున పతనమయ్యాయి. ముడిచమురు, కాపర్, నేచురల్ గ్యాస్ సైతం 2–4 శాతం మధ్య నీరసించాయి. ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూఎస్ లీజర్, హెల్త్కేర్, ఆతిథ్య రంగాల దన్నుతో మే నెలలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించాయి. దీంతో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు పెరిగి ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 100కు బలపడింది. మరోపక్క ఏఐ సవాళ్లతో టెక్నాలజీ స్టాక్స్లో తలెత్తిన భారీ అమ్మకాలు నాస్డాక్ను 4% పడగొట్టినట్లు తెలిపా రు. కాల్పుల విరమణ అంటూనే యూఎస్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. నేడు అటూఇటుగా గత వారం చివర్లో యూఎస్ మార్కెట్లు, కమోడిటీలలో నమోదైన అమ్మకాల ప్రభావం నేడు దేశీయంగా కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత వారం విడుదలైన దేశ జీడీపీ గణాంకాలు, ఆర్బీఐతోపాటు ప్రభుత్వం చేపట్టిన విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాల నిబంధనల సవరణలు కొంతమేర ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు వివరించారు. రాజకీయ, భౌగోళిక అనిశ్చితి, చమురు ధరల కారణంగా ఎదురవుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ తగ్గించడం కొంతమేర ప్రతికూలమేనని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు ఆర్బీఐ దన్ను, బలపడిన డాలరు.. రూపాయిపై ప్రభావం.. ఇవన్నీ కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. వెరసి నేడు మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాలపై దృష్టిఇటీవల ఆశలు రేపుతున్న రుతుపవనాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. మే నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలు 12న వస్తాయి. ఈ అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గ్లోబల్ ఐటీ దిగ్గజాల్లో అమ్మకాలు దేశీయంగానూ ప్రభావం చూపవచ్చని లివ్లాంగ్ వెల్త్ రీసెర్చ్ నిపుణులు కె.హరిప్రసాద్ చెప్పారు.సాంకేతికంగా చూస్తే.. సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం గత వారం సెన్సెక్స్ మద్దతు స్థాయిలకు సమీపంలో నిలిచినప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది. మరోపక్క 23,500 పాయింట్లను దాటలేకపోతున్న నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. వెరసి ఈ వారం నిఫ్టీ 23,000 పాయింట్ల దిగువకు 22,900కు చేరవచ్చు. బలపడితే 23,500 వద్ద రెసిస్టెన్స్కు అవకాశముంది. గత వారం డీలా విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర విక్రయాల నేపథ్యంలో గత వారం(1–5) హెచ్చుతగ్గుల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ నికరంగా 532 పాయింట్లు(0.7%) నష్టపోయి 74,243 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్లు(0.76%) క్షీణించి 23,367 వద్ద స్థిరపడింది. ఎఫ్పిఐ అమ్మకాల దెబ్బ కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలు చేపడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల తొలి వారంలోనూ ఇదే ధోరణి కొనసాగించారు. వెరసి జూన్ తొలి వారంలో రూ. 43,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేలండర్ ఏడాది(2026)లో ఇప్పటివరకూ రూ. 2.67 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇది సరికొత్త రికార్డ్కాగా.. ఎన్ఎస్డీఎల్ వివరాల ప్రకారం 2025లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు రూ. 1.66 లక్షల కోట్లను ఇవి దాటేశాయి. బలహీన కార్పొరేట్ ఫలితాలు, రూపాయి క్షీణత, గ్లోబల్ మార్కెట్లలో ఆకర్షణీయ అవకాశాలు తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లోనూ ఎఫ్పీఐలు నికర అమ్మకందారులుగానే నిలవడం గమనార్హం! మార్చిలో అత్యధికంగా రూ. 1.17 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత ఆర్థిక వ్యవస్థ భేష్
ముంబై: రాజకీయ, భౌగోళిక సవాళ్ల నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడను చూపుతున్నట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ జే. స్వామినాథన్ ఇటీవల పేర్కొన్నారు. ఇందుకు పారిశ్రామిక, సరీ్వసుల రంగాలు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా విస్తృత డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్ ఫలితాలు తదితర అంశాలు వ్యవస్థ ప్రగతిశీలతకు మద్దతిస్తున్నట్లు వివరించారు.ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్షిత పరిధిలోనే ఉన్నట్లు కొలంబియా యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్(ఎస్ఐపీఏ) వద్ద ప్రసంగంలో సోమవారం ప్రస్తావించారు. విదేశీ ఆటుపోట్లను తట్టుకోగలమని ఈ సందర్భంగా తెలియజేశారు. జియోపాలిటిక్స్, వాతావరణ మార్పులు, ఏఐ, టెక్నాలజీ సవాళ్లపై ప్రపంచ పాలసీలు ఆధారపడుతున్న సందర్భంలో సమావేశంకానున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రసంగాన్ని ఆర్బీఐ తాజాగా వెబ్సైట్లో పోస్ట్ చేసింది. -
అంచనాలను మించిన భారత జీడీపీ
న్యూఢిల్లీ: దేశీయంగా వినియోగానికి డిమాండ్ పటిష్టంగా ఉండటం, ప్రభుత్వం కూడా గణనీయంగా వ్యయాలు చేయడంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలకు మించి వృద్ధి చెందింది. 7.8 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది 7 శాతంగాను, తాజా క్యూ3లో 8 శాతంగాను నమోదైంది. ఇక వినియోగం, పెట్టుబడులు మెరుగ్గా ఉండటంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ 7.7 శాతం మేర వృద్ధి చెందింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 7.1 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడితే 2028 ఆర్థిక సంవత్సరంలో భారత్ మళ్లీ 7 శాతానికి పైగా వృద్ధి సాధించవచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. ఆర్బీఐ అంచనా వేస్తున్నట్లుగా 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7 శాతం లోపునకు నెమ్మదించినా, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ప్రభుత్వం తీసుకునే పాలసీపరమైన చర్యలనేవి ఎకానమీ మళ్లీ 7 శాతం పైగా వృద్ధి రేటువైపు మళ్లేందుకు దోహదపడగలవని పేర్కొన్నారు. స్థిర ధరల ప్రాతిపదికన వాస్తవ జీడీపీ 2025–26లో రూ. 323.12 లక్షల కోట్ల స్థాయిలో ఉంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) పేర్కొంది. ప్రస్తుత ధరల్లో నామినల్ జీడీపీ రూ. 346.36 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని వివరించింది. 2025–26లో నిర్మాణం, తయారీ, ట్రేడ్, హోటల్స్, రియల్ ఎస్టేట్, ఐటీ తదితర సెకండరీ, టర్షరీ రంగాలు వరుసగా 8.8 శాతం, 9.3 శాతం వృద్ధి చెందాయి. వ్యవసాయం, ఫిషరీ రంగాల దన్నుతో ప్రైమరీ సెక్టార్ 3.6 శాతం వృద్ధి చెందింది. పశ్చిమాసియా ప్రభావం క్యూ1లో .. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం జనవరి–మార్చి త్రైమాసికంలో ఒక నెలలోనే కనిపించింది. కీలకమైన ముడి చమురు, నేచురల్ గ్యాస్, ఎల్పీజీపరంగా సంక్షోభ పూర్తి ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) కనిపించనుంది. ఇంధనాలు, కమోడిటీల ధరలు భారీ స్థాయిలో తిరుగాడుతుండటం, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తదితర సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను రిజర్వ్ బ్యాంక్ 6.9% నుంచి 6.6 శాతానికి తగ్గించింది. సంస్కరణల ఎక్స్ప్రెస్ దూకుడు.. గ్లోబల్ సవాళ్ల నడుమ ఆర్థిక ప్రగతి సాధించే దిశగా పాలసీలపరంగా నిర్ణయాత్మక చర్యలతో సంస్కరణల ఎక్స్ప్రెస్ దూకుడుని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్స్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేశారు. -
బంగారం ‘బరువు’ తగ్గినా రికార్డే!
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, బంగారం పట్ల భారతీయుల మక్కువ ఏమాత్రం తగ్గలేదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశానికి దిగుమతైన బంగారం పరిమాణం (టన్నుల పరంగా) స్వల్పంగా తగ్గినా, దిగుమతుల విలువ మాత్రం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2025-26లో భారత్ 721 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, దీని విలువ రూ.6.89 లక్షల కోట్లకు (సుమారు 72 బిలియన్ డాలర్లు) చేరింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విలువ పరంగా దాదాపు 24 శాతం పెరుగుదల.ధరల పెరుగుదలే ప్రధాన కారణం2024-25లో 757 టన్నుల బంగారం దిగుమతి కాగా, విలువ రూ.5.54 లక్షల కోట్లుగా నమోదైంది. అయితే 2025-26లో దిగుమతి పరిమాణం 4.8 శాతం తగ్గినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడంతో మొత్తం దిగుమతుల విలువ రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే కిలో బంగారం దిగుమతి ధర గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.వాణిజ్య లోటుపై ప్రభావంబంగారం, వెండి దిగుమతుల పెరుగుదల దేశ వాణిజ్య లోటుపై కూడా ప్రభావం చూపుతోంది. 2025-26లో బంగారం దిగుమతులు మొత్తం దిగుమతుల్లో 5 శాతానికి పైగా వాటాను ఆక్రమించాయి. అధిక దిగుమతుల కారణంగా దేశ వాణిజ్య లోటు మరింత విస్తరించినట్లు అధికార గణాంకాలు సూచిస్తున్నాయి.దిగుమతులను కట్టడి చేసే చర్యలుఇటీవల కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడం, అధిక దిగుమతులను నియంత్రించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. అయినప్పటికీ పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడి అవసరాల కారణంగా దేశీయ డిమాండ్ బలంగానే కొనసాగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
పెట్రోల్ రూ.26, గ్యాస్ రూ.157: పాతికేళ్లలో ఎంతలా అంటే..
గత రెండు దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, జీవన వ్యయం కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయాలు పెరిగినప్పటికీ.. నిత్యావసరాలైన పెట్రోల్, వంటగ్యాస్, పాలు, ఇతర వినియోగ వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరగడం ప్రతి కుటుంబంపై ప్రభావం చూపుతోంది. 2000 సంవత్సరంతో పోలిస్తే.. 2026 నాటికి ధరల్లో వచ్చిన మార్పులు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.పెట్రోల్ ధరలు2000 సంవత్సరంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఒక లీటర్ పెట్రోల్ ధర సుమారు 26 రూపాయలుగా ఉండేది. అయితే 2026 నాటికి ఈ ధర సుమారు 102 రూపాయలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే.. పాతికేళ్లలో పెట్రోల్ ధరలు ఎంతలా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల.. కేంద్ర, రాష్ట్ర పన్నులు, రవాణా ఖర్చులు వంటి అంశాలు పెట్రోల్ ధరలను ప్రభావితం చేశాయి. పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల వ్యక్తిగత ప్రయాణ ఖర్చులతో పాటు వస్తువుల రవాణా ఖర్చులు కూడా పెరిగి, ఇతర వస్తువుల ధరలపై ప్రభావం చూపింది.ఎల్పీజీ (వంటగ్యాస్) ఖర్చువంటగ్యాస్ ప్రతి ఇంటికి అవసరం. 2000వ సంవత్సరంలో ఒక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.157 మాత్రమే. 2026 నాటికి అది దాదాపు రూ.912కు చేరుకుంది. ప్రభుత్వం వివిధ సబ్సిడీలను అందించినప్పటికీ, గ్యాస్ ధరల పెరుగుదల మధ్యతరగతి, పేద కుటుంబాలపై అదనపు భారం మోపుతోంది. అమెరికా - ఇరాన్ యుద్ధం తరువాత గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి.పాల ధరల పెరుగుదలభారతదేశంలో దాదాపు అన్ని కుటుంబాలకు పాలు ఒక ప్రధాన ఆహార పదార్థం. గత ఇరవై ఏళ్లలో పాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. పశువుల మేత ఖర్చులు, రవాణా వ్యయాలు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడం వల్ల పాల ఉత్పత్తి వ్యయం అధికమైంది. దీనివల్ల పాల ధరలు కూడా భారీగా పెరిగాయి.జీవన వ్యయాన్ని నిర్ణయించే ఇతర అంశాలుపెట్రోల్, గ్యాస్, పాలు వంటి కొన్ని వస్తువుల ధరల పెరుగుదల మాత్రమే జీవన వ్యయాన్ని పూర్తిగా నిర్ణయించవు. ఇంటి అద్దెలు, విద్య, వైద్యం, కరెంట్ చార్జీలు, రవాణా, వినోదం వంటి అనేక అంశాలు కూడా జీవన వ్యయంలో భాగమే. ముఖ్యంగా మెట్రో నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య ఖర్చుల్లో గణనీయమైన తేడాలు ఉంటాయి.2000 నుంచి 2026 వరకు భారతదేశంలో అనేక నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే.. జీవన వ్యయాన్ని పూర్తిగా అంచనా వేయాలంటే కేవలం కొన్ని వస్తువుల ధరలతో కాకుండా, ప్రజల మొత్తం ఖర్చులు, ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. భారతదేశం ఆర్థికంగా ఎదుగుతున్న కొద్దీ.. పెరుగుతున్న ఆదాయాలు, జీవన వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడటం ప్రభుత్వం, ప్రజల ముందున్న ప్రధాన సవాలుగా మిగిలింది.ఇదీ చదవండి: వైభవ్ సూర్యవంశీ ట్యాక్స్ ఎవరు కట్టాలి?: రూల్స్ ఏం చెబుతున్నాయ్! -
గ్లోబల్ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లు
దేశీయ ఆర్థిక వృద్ధిని మరింత పరుగులు పెట్టించడమే కాకుండా, విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జూన్ సమీక్షలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక సమీకరణల నేపథ్యంలో భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు అడ్డంకులను తొలగిస్తూ నిబంధనలను సరళీకృతం చేస్తున్నట్లు చెప్పింది. ముఖ్యంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ), ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) ఊరటనిచ్చేలా కేంద్ర బ్యాంక్ కొన్ని రాయితీలను ప్రకటించింది.ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన కీలక చర్యల వివరాలు ఇవీ..గ్లోబల్ ఇండెక్స్ల్లో భారత ప్రభుత్వ బాండ్లుప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎఫ్పీఐ పెట్టుబడుల నిబంధనలను ఆర్బీఐ సరళీకరించింది. ఇందులో భాగంగా.. ఇకపై కొత్తగా జారీ చేయబోయే 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల కాలపరిమితి గల ప్రభుత్వ బాండ్లు అన్నీ ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్’ (ఎఫ్ఏఆర్) కిందకు వస్తాయి.గ్లోబల్ ఇండెక్స్ల్లో స్థానం: ఈ బాండ్లు అంతర్జాతీయ గ్లోబల్ ఇండెక్స్ల్లో భాగం కానున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు భారత్కు తరలివచ్చే అవకాశం ఉంది.పరిమితుల తొలగింపు: ఇతర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులపై ఉన్న పాత పరిమితులను కూడా సెంట్రల్ బ్యాంక్ ఎత్తివేసింది.ఎన్ఆర్ఐ పెట్టుబడి పరిమితుల పెంపుప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) దేశీయ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల పరిమితులను భారీగా పెంచింది. అంతేకాకుండా, ఈ సదుపాయాన్ని భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తులందరికీ విస్తరింపజేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల విదేశీ నిధుల ప్రవాహం మరింత సులభతరం కానుంది.ఫారెక్స్ మార్పిడిపై రాయితీలువిదేశీ మారక నిల్వలను స్థిరీకరించేందుకు ఆర్బీఐ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు (నాలుగు నెలల పాటు) రాయితీతో కూడిన ఫారెక్స్ మార్పిడి సదుపాయాన్ని కల్పించనుంది. బ్యాంకులు 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల ఎఫ్సీఎన్ఆర్-బీ డిపాజిట్లను సేకరించడానికి, వాటి పూర్తి హెడ్జింగ్ ఖర్చును భరించేందుకు సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ ఇదే తరహా సదుపాయాన్ని అనుమతించింది.బాహ్య వాణిజ్య రుణాలుప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ) విదేశాల నుంచి బాహ్య వాణిజ్య రుణాలు (ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్-ఈసీబీ) సేకరించేలా ఆర్బీఐ తగిన ప్రోత్సాహకాలను అందించనుంది. ఎగుమతిదారులు తాము విదేశాలకు పంపిన సరుకుల ఆదాయాన్ని తిరిగి భారతదేశానికి రాబట్టే సమయాన్ని తొమ్మిది నెలలకు పునరుద్ధరిస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలు రూపాయి విలువను స్థిరీకరించడానికి, దేశీయ మార్కెట్లలోకి విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఎంతో దోహదపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ బాండ్ సూచీల్లో భారత బాండ్ల చేరిక, ఎఫ్పీఐ నిబంధనల సరళీకరణ వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్! -
కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం జూన్ 3 నుంచి 5 వరకు జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇది రెండో విధాన సమీక్ష. ఈ సమీక్ష సమావేశంలో కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది.#WATCH | RBI keeps policy repo rate unchanged at 5.25%, maintains a neutral stance pic.twitter.com/8pZgzxmSim— ANI (@ANI) June 5, 20262025-26 ఏడాది ప్రారంభం నుంచి వరుసగా రేట్లు తగ్గించిన ఆర్బీఐ.. గడిచిన రెండు సమావేశాలతోపాటు ఈసారీ రేట్ల తగ్గింపుపై తటస్థ వైఖరి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడుసార్లు రేట్లలో కోత విధించింది. దాంతో మొత్తంగా 125 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటు ప్రస్తుతం 5.25గా ఉంది.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశంలోని ముఖ్యాంశాలు..పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా దేశీయ ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ సంఘర్షణల ప్రభావాలను తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ ముందుకుసాగుతోంది.ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉన్నప్పటికీ వ్యయ ఒత్తిళ్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ఇంధన, ఇతర ఇన్పుట్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ సరఫరా గొలుసు అంతరాయాలు భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలపై భారం చూపే అవకాశం ఉంది.అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయ ధరలపై వాటి ప్రభావం పరిమితంగా ఉండటం వల్ల సీపీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే తక్కువగానే నమోదైంది.2027 ఆర్థిక సంవత్సరానికి భారత ద్రవ్యోల్బణం 5.1%గా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.ఇందుకు కమర్షియల్ ఎల్పీజీ, బేస్ మెటల్స్, ప్లాస్టిక్, రబ్బరు.. వంటి కీలక వస్తువుల ధరలు పెరగడమే దీనికి కారణం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల సాధారణ కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గుతుందని గవర్నర్ అన్నారు.భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఆర్బీఐ గతంలో ఉన్న 6.9% నుంచి 6.6%కి తగ్గించింది. 2027 ఆర్థిక సంవత్సరం త్రైమాసికాల వారీగా అంచనాలు ఇలా ఉన్నాయి.త్రైమాసికంజీడీపీ వృద్ధి అంచనాQ1 (మొదటి త్రైమాసికం)6.6%Q2 (రెండో త్రైమాసికం)6.3%Q3 (మూడో త్రైమాసికం)6.5%Q4 (నాలుగో త్రైమాసికం)6.8%పట్టణ వినియోగంద్రవ్యోల్బణం భారం ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వినియోగం స్థిరంగా సాగడానికి కొన్ని సానుకూల అంశాలు తోడ్పడతాయని గవర్నర్ పేర్కొన్నారు.-సేవల రంగంలో కనిపిస్తున్న నిరంతర వృద్ధి.-జీఎస్టీ హేతుబద్ధీకరణ వల్ల వస్తున్న సానుకూల మార్పులు.-మార్కెట్లో స్థిరంగా ఉన్న ఉపాధి అవకాశాలు ఇందుకు దోహదపడుతాయన్నారు.ఇదీ చదవండి: ‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’ -
ఐపీఎల్ ముగిసింది.. ఇక అసలు ఆట షురూ
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ముగిసిందని.. అసలు ఆట షురూ అయ్యిందని.. ఇకనైనా భారత కంపెనీలు వినోదాన్ని పక్కనపెట్టి వ్యాపార రంగంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గూగుల్ తాజా పెట్టుబడుల ప్రకటనను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వినోదం నుంచి దృష్టి మళ్లించి భవిష్యత్ సాంకేతికతలు, ముఖ్యంగా కృత్రిమ మేధస్సుపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని దేశీయ కంపెనీలకు ఉదయ్ కొటక్ సూచించారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ AI రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆల్ఫాబెట్ సంస్థ ఏఐ విస్తరణ కోసం సుమారు 80 బిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు ప్రకటించగా.. ఈ ఏడాది మొత్తం ఏఐపై 180 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని ఉదయ్ కొటక్ ఓ “వేక్ అప్ కాల్”గా అభివర్ణించారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’లో స్పందించిన ఆయన.. గూగుల్ వంటి సంస్థకు భారీ లాభాలు, భారీ మార్కెట్ విలువ ఉన్నప్పటికీ భవిష్యత్ టెక్నాలజీల కోసం మరింత పెట్టుబడులు పెడుతోందని పేర్కొన్నారు. గూగుల్ వార్షిక లాభాలు సుమారు 160 బిలియన్ డాలర్లు, మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్ డాలర్లు అని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో భారత కంపెనీలు తక్షణ లాభాలు, వినోద కేంద్రిత దృష్టి నుంచి బయటకు వచ్చి దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ఆయన పరోక్షంగా సూచించారు.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ఐటీ రంగం కూడా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉడయ్ కొటక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. చాలా మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ భారత వ్యాపార రంగం ఇప్పుడు పెట్టుబడులు, టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే కొందరు మాత్రం అమెరికాలో పెద్ద స్పోర్ట్స్ లీగ్స్ కొనసాగుతున్నప్పటికీ అక్కడి ఆర్థిక వ్యవస్థ ఇన్నోవేషన్లో వెనుకడుగు వేయలేదని గుర్తు చేస్తూ.. భారతదేశం కూడా వినోదం–వ్యాపారం మధ్య సమతుల్యం సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ప్రభావం ఎలాగంటే.. ఈ తరహా భారీ పెట్టుబడులు ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), డేటా సెంటర్లు, చిప్ టెక్నాలజీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే భారీ లాభాలు ఉన్నప్పటికీ మరింతగా పెట్టుబడులు పెడుతుండటం వల్ల.. కొత్త AI మోడళ్ల అభివృద్ధి వేగవంతమవుతుంది. ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతుంది. అలాగే గ్లోబల్ టెక్ పోటీ మరింత తీవ్రంగా మారుతుంది. దీని ప్రభావంగా సాఫ్ట్వేర్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టించబడతాయి.కానీ అదే సమయంలో సంప్రదాయ ఐటీ సేవలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచ వ్యాపార రంగంలో ఇక “కొత్త ఆవిష్కరణలు చేయాలి లేదా పోటీలో వెనుకబడిపోవాలి” అనే పరిస్థితి మరింత స్పష్టంగా మారే అవకాశం ఉంది. -
విదేశీ పెట్టుబడిదారులకు పన్ను ఉపశమనం!
దేశీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్పీఐ) నిష్క్రమణకు, రికార్డు స్థాయిలో పతనమవుతున్న రూపాయి విలువకు బ్రేకులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొన్ని వర్గాల సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడిదారులకు పన్ను నిబంధనలను సడలించేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ కీలక ఆర్డినెన్స్ను సిఫారసు చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడటంతో త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీయ మార్కెట్లను కాపాడుకునేందుకు ప్రభుత్వం వేసిన వ్యూహాత్మక అడుగు ఇది.రికార్డు స్థాయిలో నిధుల ఉపసంహరణప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 6 శాతం మేర బలహీనపడటం విధాన నిర్ణేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ) జనవరి నుంచి భారతీయ ఈక్విటీల నుంచి రికార్డు స్థాయిలో రూ.2.25 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ భారీ అవుట్ఫ్లోల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండటంతో విదేశీ పెట్టుబడులను తిరిగి ఆకర్షించేందుకు పన్ను సడలింపులే ఏకైక మార్గమని ప్రభుత్వం భావించింది.ప్రధాన డిమాండ్లుగత కొన్నేళ్లుగా ప్రభుత్వం దీర్ఘకాలిక (ఎల్టీసీజీ), స్వల్పకాలిక (ఎస్టీసీజీ) మూలధన లాభాల పన్నును పెంచడంతో పాటు సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ)ను కూడా విధించింది. పన్ను నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ ద్వంద్వ పన్ను విధానం వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారతదేశం అంతగా ఆకర్షణీయమైన మార్కెట్గా అనిపించడం లేదు. కేంద్ర బడ్జెట్కు ముందే ఎఫ్పీఐ ప్రతినిధులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచారు.లిస్టెడ్ సెక్యూరిటీల కోసం మూలధన లాభాల పన్ను విధానాన్ని పూర్తిగా సమీక్షించాలి.క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రెండింటినీ కలిపి విధించడాన్ని నిలిపివేయాలి.ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై విదేశీ పెట్టుబడిదారులు 20 శాతం విత్హోల్డింగ్ పన్ను (టీడీఎస్) చెల్లిస్తున్నారు. (గమనిక.. జులై 1, 2023 వరకు ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు, రూపాయి విలువ కలిగిన బాండ్లపై ఈ పన్ను 5 శాతం మాత్రమే ఉండేది. దీనిని తిరిగి సవరించాలని వారు కోరుతున్నారు).ఎంపీసీ నిర్ణయాలపైనే అందరి దృష్టికొన్ని సంస్థల అంచనా ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆర్డినెన్స్ నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ముందస్తుగా కుదుర్చుకున్న సమన్వయ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. నిన్న ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు, మార్కెట్లో లిక్విడిటీని పెంచేందుకు సెంట్రల్ బ్యాంక్ కూడా శుక్రవారం కొన్ని కీలక చర్యలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్! -
ఎంఎస్ఎమ్ఈలో మందగించిన రుణ వృద్ధి
ముంబై: అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావంతో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంలో రుణాల వృద్ధి మందగించింది. ముఖ్యంగా సూక్ష్మ వ్యాపారాలు, తయారీ రంగ అనుబంధ విభాగాల్లో ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నట్లు క్రెడిట్ సమాచార సంస్థ క్రిఫ్ హైమార్క్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఎంఎస్ఎంఈల రుణ బకాయిలు సుమారు రూ.46 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 12.8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడటం, వివిధ రంగాల భాగస్వామ్యం పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. అయితే రుణాల వృద్ధి వేగం గణనీయంగా మందగించింది. 2025 డిసెంబర్–2026 ఏప్రిల్ మధ్య రుణ బకాయిల వృద్ధి 3.1 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 9.7 శాతంగా నమోదైంది. ఇదే వ్యవధి (2025 డిసెంబర్–2026 ఏప్రిల్)లో క్రియాశీల రుణాల సంఖ్య 3.5 శాతం తగ్గింది. కాగా, 2024 డిసెంబర్–2025 ఏప్రిల్ మధ్య కాలంలో అవి 3 శాతం పెరిగాయి. సూక్ష్మ వ్యాపారాలపై అధిక ప్రభావం భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ దేశీయ డిమాండ్, రుణాల ప్రవాహం మద్దతుతో ఎంఎస్ఎంఈ రంగం నిలకడగా కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. అయితే కొన్ని నిర్దిష్ట విభాగాల్లో ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఎంఎస్ఎంఈ రుణాల్లో దాదాపు 86 శాతం వాటా కలిగిన సూక్ష్మ వ్యాపారాలు ఎక్కువ ప్రభావానికి గురయ్యాయి. 31–90 రోజుల ఆలస్య చెల్లింపుల సూచిక (పీఏఆర్) ఏప్రిల్ 2026 నాటికి 2.7 శాతానికి చేరింది. 2025 డిసెంబర్–2026 మార్చి మధ్య సూక్ష్మ వ్యాపారాలకు చెందిన క్రియాశీల రుణాలు 4.6 శాతం క్షీణించాయి. తయారీ రంగంలో తగ్గిన జోరు ఎంఎస్ఎంఈ పోర్ట్ఫోలియోలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ, వాణిజ్య రంగాల్లో రుణ వృద్ధి మందగించింది. తయారీ రంగ రుణ వృద్ధి 2025 డిసెంబర్–2026 మార్చి మధ్య 4.3 శాతానికి పరిమితమైంది. దీనికి సీజనల్ మార్పులే ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. సప్లై చైన్తో ముడిపడి ఉన్న షిప్పింగ్, రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో అనుబంధ రంగాల్లో రుణ బకాయిలు 10–15 శాతం మేర తగ్గాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వెనకడుగు ఎంఎస్ఎంఈలకు రుణాల పంపిణీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వేగం కూడా తగ్గింది. 2025 డిసెంబర్–2026 మార్చి మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎంఎస్ఎంఈ రుణాలు 0.2 శాతం తగ్గాయి. కాగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 3.5 శాతం వృద్ధి నమోదైంది. ఎన్బీఎఫ్సీల రుణాలు 1.6 శాతం క్షీణించగా, గత ఏడాది ఇదే కాలంలో 6.4 శాతం పెరిగాయి. దేశీయ డిమాండ్, విభిన్న రుణదాతల భాగస్వామ్యం, ప్రభుత్వ మద్దతు చర్యలతో ఎంఎస్ఎంఈ రంగం ప్రపంచ అనిశ్చితులను సమర్థంగా ఎదుర్కొంటోందని నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న ఒత్తిడి సంకేతాలపై నిశిత పర్యవేక్షణ అవసరమని నివేదిక సూచించింది. -
పాలసీ రేట్ల పాజ్తో వృద్ధికి ఊతం
ముంబై: ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకు కట్టుబడితే నిలకడైన ఆర్థిక వృద్ధికి వీలుంటుందని పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పాలసీ రేట్ల విషయంలో స్టేటస్ కో అమలు చేయవచ్చని అత్యధిక శాతంమంది అంచనా వేస్తున్నట్లు సిటీ 2026 ఇండియా సదస్సులో పాల్గొన్న శెట్టి పేర్కొన్నారు. వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులకు అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. అయితే పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తే నిలకడైన వృద్ధికి కచ్చితంగా ఇది సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ పబ్లిక్ ఇష్యూపై స్పందిస్తూ ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2026)లో లిస్టింగ్ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అనుమతుల కోసం నిరీక్షిస్తున్నట్లు తెలియజేశారు. బ్యాంకింగ్పై.. అన్ని విభాగాలకూ బ్యాంకింగ్ సర్వీసులను విస్తరించడం, సంస్థాగత నైపుణ్యం పెంచుకోవడం, మారుతున్న కస్టమర్ల అవసరాలను లోతుగా అర్ధం చేసుకోవడం, టెక్నాలజీ, డేటా, ఏఐను వినియోగించుకోవడం తదితర కొన్ని కీలక అంశాల ఆధారంగా భవిష్యత్ బ్యాంకింగ్ విధానం ఉండాలని శెట్టి సూచించారు. తద్వారా దేశ ఆశయాలకు బ్యాంకింగ్ వ్యవస్థ మద్దతివ్వగలుగుతుందని తెలియజేశారు. కాగా.. వార్తా సంస్థ పీటీఐ ఇటీవల ఆర్బీఐ పాలసీ సమీక్షపై 15 మంది ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులతో నిర్వహించిన సర్వేలో 11 మంది రేట్ల పాజ్నే అంచనా వేయడం గమనార్హం! ద్రవ్యోల్బణ రిసు్కల నేపథ్యంలో ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) చివర్లో రేట్ల పెంపును చేపట్టే వీలున్నట్లు సర్వేలో అత్యధిక శాతం మంది భావించారు. -
పరిశ్రమలకు ‘పశ్చిమాసియా’ గండం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయంగా చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థల ఆదాయాలు, లాభాలపై గణనీయంగా ప్రభావం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వాటి ఆదాయాలు 100 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు (1 శాతం) తగ్గి 7.5 – 8.5 శాతం శ్రేణికి పరిమితం కానున్నాయి. ఇక ఎబిటా సైతం 50–100 బేసిస్ పాయింట్లు క్షీణించి 5–5.5 శాతానికి నెమ్మదించవచ్చునని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తాజాగా ఎంఎస్ఎంఈ రిపోర్టులో అంచనా వేసింది. దీని ప్రకారం మోర్బి, ఫిరోజాబాద్, సూరత్, వదోదరలాంటి క్లస్టర్లపై తీవ్ర ప్రభావం ఉండనుంది. ఏడాదికి రెండుసార్లు వెలువరించే ఈ నివేదికలో 69 రంగాలు, 147 క్లస్టర్లను పరిగణనలోకి తీసుకుంటారు. వీటి ఆదాయం రూ. 75 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 20–25 శాతం, ఎంఎస్ఎంఈ పరిశ్రమలో మూడింట రెండొంతులు ఉంటుంది. మూడు కేటగిరీలు.. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావానికి గురయ్యే ఎంఎస్ఎంఈలను మూడు కేటగిరీలుగా నివేదికలో వర్గీకరించారు. గ్యాస్లాంటి ఇంధన సంబంధ ముడిసరుకుపై ఆధారపడినవి, ఇంధన సంబంధ డెరివేటివ్స్పై ఆధారపడినవి, వ్యాపారపరంగా అవరోధాల ప్రభావం ఎక్కువగా ఎదుర్కొనేవి వీటిలో ఉన్నాయి. గ్యాస్లాంటి ఇంధనాలపై ఆధారపడే యూనిట్లపై అత్యధిక ప్రభావం పడనుంది. మోర్బి క్లస్టర్ ఇందుకు ఉదాహరణ. దేశీయంగా సెరామిక్ టైల్స్ ఉత్పత్తిలో దీని వాటా 80 శాతం పైగా ఉంటుంది. ఇందులో 80–85 శాతం తయారీ .. గ్యాస్ ఆధారంగానే ఉంటోంది. క్లస్టర్లోని సెరామిక్ రంగం ఆదాయంలో దీని వాటా 85 శాతంగా ఉంటుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ క్లస్టర్ ఆదాయ వృద్ధి 9–11 శాతంగా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1–3 శాతానికి పడిపోనుంది. ఇక్కడ ప్రధానంగా ఎగుమతుల కోసమే ఉత్పత్తి (80–90 శాతం) జరుగుతుండటం ఇందుకు కారణం. ఇందులో 20–25 శాతం ఉత్పత్తి.. పశ్చిమాసియాకే ఎగుమతి అవుతోంది. మోర్బి క్లస్టర్ సెరామిక్ పరిశ్రమ ఎబిటా మార్జిన్ ఈ ఆర్థిక సంవత్సరం 300–400 బేసిస్ పాయింట్లు క్షీణించి 4–6 శాతానికి పరిమితం కానుంది. అదే విధంగా ఫిరోజాబాద్లోని గ్లాస్ సెక్టార్ ఉత్పత్తి 40 శాతం తగ్గడంతో పరిశ్రమ ఆదాయ వృద్ధి 1–3 శాతానికి పరిమితం కానుంది. పశ్చిమాసియా నుంచి మిథనాల్లాంటి వాటిని 90 శాతం మేర దిగుమతి చేసుకునే కెమికల్ రంగానికి ముడిసరుకు వ్యయాలు 1.2–1.4 రెట్లు పెరిగిపోయాయి. ఇందులో కొంత భారాన్ని అవి బదలాయించినప్పటికీ 2027 ఆర్థిక సంవత్సరంలో వదోదరలోని కెమికల్ ఎంఎస్ఎంఈల మార్జిన్లు 150–250 బీపీఎస్ మేర తగ్గొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇక రోడ్ల నిర్మాణంలాంటి రంగాలపై డీజిల్ రేట్ల పెరుగుదల ప్రభావం పడే అవకాశం ఉంది. సదరు సంస్థల మొత్తం వ్యయాల్లో ఇంధన వ్యయాల వాటా 8–10 శాతం ఉంటుంది. దీంతో వాటి మార్జిన్లు 50–100 బేసిస్ పాయింట్లు తగ్గి 8–10 శాతానికి పరిమితం కావచ్చు. అలాగే, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వ్యాపార సంస్థల ఖర్చులో 10–15 శాతం ప్యాకింగ్ వ్యయాలు ఉంటాయి. ఫలితంగా వాటి మార్జిన్లు కూడా 50–100 బేసిస్ పాయింట్లు తగ్గి 6–6.5 శాతానికి నెమ్మదించనున్నాయి.కొత్తేమీ కాదు.. పరిశ్రమకు ఇలాంటి పరిస్థితి కొత్తేమీ కాదని నివేదిక పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద కంపెనీల ఆదాయాలు 1 శాతం వరకు, ఎంఎస్ఎంఈల రెవెన్యూ 3–5 శాతం మేర క్షీణించినట్లు తెలిపింది. అలాగే ఎంఎస్ఎంఈల ఎబిటా మార్జిన్లు 2021 ఆర్థిక సంవత్సరంలో 80 బీపీఎస్ క్షీణించి 4.7 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం తీరుతెన్నులు కూడా అదే తరహాలో ఉన్నట్లు తెలిపింది. చిన్న వ్యాపారాలపై ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తోందని నివేదిక వివరించింది. ఎంఎస్ఎంఈలు రెండు రకాల సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. గ్యాస్లాంటి ముడి సరుకు లభ్యత తగ్గిపోవడం వల్ల ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చి, ఆ కారణంగా ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటోందని వివరించింది. ఇక రెండో అంశం విషయానికొస్తే వ్యాపారానికి అవరోధాలు, పెరిగిన కమోడిటీ..ఇంధన వ్యయాలను కస్టమర్లకు బదలాయించేలా, రేట్లను పెంచలేని పరిస్థితి వల్ల మార్జిన్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటోందని నివేదిక పేర్కొంది. -
అసలు సమస్య...రూపాయి పతనం కాదు
→ 1991లో భారత్ ఎదుర్కొన్న చెల్లింపుల (విదేశీ మారకం–ఫారెక్స్) సంక్షోభం లాంటిదేదీ ఇప్పుడు తలెత్తే అవకాశం లేదు. మన దగ్గర పుష్కలంగా ఫారెక్స్ నిల్వలున్నాయి. ప్రస్తుతం ధరల సర్దుబాటే అతిపెద్ద సమస్య. → మన ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలకు సంబంధించి చర్చ మొత్తం డాలరుతో రూపాయి విలువ పతనం, ఫారెక్స్ నిల్వల చుట్టూనే తిరుగుతోంది. విదేశీ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి? కరెన్సీ స్పెక్యులేషన్కు అడ్డుకట్ట ఎలా వేయాలి వంటి పరిష్కార మార్గాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కానీ, ప్రధానంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యను రెండు కోణాల్లో చూడాలి. → పశ్చిమాసియా యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రికత్తల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కొండెక్కినప్పుడు దానికనుగుణంగా దేశీయంగానూ ధరలు సర్దుబాటు అవ్వాల్సిందే. కాబట్టి, పెట్రో రేట్లతో సహా కొన్ని ఉత్పత్తుల రేట్ల పెంపు అనివార్యం. → ఇక రెండోది, అసలు రూపాయి క్షీణత అనేది సమస్యే కాదు. ఎందుకంటే, పశ్చిమాసియాలో యుద్ధం మొదలవ్వకముందే అత్యంత బలహీన కరెన్సీల్లో ఒకటిగా మన రూపాయి ఉంది. అంటే ఎకానమీలో మరింత విస్తృతమైన నిర్మాణాత్మక సమస్యలు కూడా ఉన్నాయని అర్థం. → భారీ ఇంధన, ఎరువుల సబ్సిడీలు అనేక ఏళ్లుగా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం నిరవధికంగా కొనసాగించం సాధ్యం కాదు. మార్కెట్కు అనుగుణంగా ధరలను పెరగనివ్వాలి. అయితే, ఆ షాక్కు తగలకుండా పేదలను ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఆదుకోవాల్సిందే. → జనధన్, ఆధార్, మొబైల్(జామ్) ద్వారా డిజిటల్ రంగంలో మనం భారీగా పురోగతి సాధించాం, భారత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ అసలైన డీబీటీ వ్యవస్థ ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. → ఉదాహరణకు, ఎరువులనే తీసుకుందాం. యూరియాపై కేంద్రం భారీ సబ్సిడీ భరిస్తోంది. అలాగే దాన్ని ఉపయోగించే రైతులకు నగదు సాయం (పీఎం కిసాన్) కూడా ఇస్తోంది. ఆ రెండింటినీ అనుసంధానించే పథకం కొరవడింది. యూరియా ధరలు పెరిగితే, మీరు అధిక రేట్లు చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఆ అదనపు భారాన్ని ఆదాయ బదిలీల రూపంలో ప్రభుత్వం మీకు తిరిగి చెల్లిస్తుందని చెప్పే వ్యవస్థ మన దగ్గర లేదు. → విద్యుత్, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు తదితర రంగాల్లో సబ్సిడీలను తగ్గించుకుంటూ... ఆర్థికంగా అత్యంత బలహీన వర్గాలకు రక్షణ కల్పించే విధంగా డీబీటీ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ మార్పులు క్రమంగా జరగాలి. మన విధానకర్తల మందున్న అసలైన సవాలు ఇదే. – అరవింద్ సుబ్రమణియన్, ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) -
అంతా అబద్ధం.. ఏవీ నమ్మొద్దు!
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ ప్రచురించిన కథనాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. ఈ ప్రచారం నకిలీదని (ఫేక్ న్యూస్) స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ ‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా వాస్తవాలను వెల్లడించింది. బంగారం భౌతిక నిల్వలపై ఆర్బీఐ విడుదల చేసిన తాజా బులెటిన్ను పరిశీలించాలని ప్రజలను కోరింది.పెరిగిన బంగారం నిల్వలుబ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ సీనియర్ ఆర్థికవేత్త అభిషేక్ గుప్తా అంచనా ప్రకారం.. మే 22తో ముగిసిన రెండు వారాల్లో రూపాయిని కాపాడేందుకు ఆర్బీఐ 12 బిలియన్ డాలర్ల బంగారాన్ని విక్రయించి ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ వాదన పూర్తిగా తప్పని ఆర్బీఐ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.భారత విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా వివరాలుసెప్టెంబర్ 2025 చివరి నాటికి: 13.92%మార్చి 31, 2026 నాటికి: 16.70%మే 22, 2026 నాటికి: 16.85%గణాంకాలను పరిశీలిస్తే విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా నిరంతరం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదని స్పష్టమవుతోంది. ఆర్బీఐ తన నెలవారీ బులెటిన్లో భౌతిక బంగారం నిల్వల స్థితిని స్పష్టంగా పొందుపరిచిందని, తాజా ఎడిషన్ ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉందని కేంద్ర ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, ప్రామాణిక సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.A news report published by @Bloomberg states that RBI may have sold gold amounting to approximately USD 12 billion.#PIBFactCheck❌ This claim is FAKE✔️ According to @RBI, the share of gold in India's foreign exchange reserves rose from 13.92% at end-September 2025 to 16.70%… pic.twitter.com/eVjxPxEv1i— PIB Fact Check (@PIBFactCheck) June 3, 2026‘రూపాయి విలువ తగ్గినా నష్టం లేదు’మరోవైపు, రూపాయి మారకం విలువపై 16వ ఆర్థిక సంఘం చైర్మన్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక సంవత్సరం ఫార్వర్డ్ మార్కెట్లో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 100 మార్కును తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ తరుణంలో రూపాయి విలువ క్షీణించడానికి ఆర్బీఐ అనుమతించాలని, కేవలం 100 అనే అంకెను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా చమురు కొరత స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా.. రూపాయి విలువ సహజంగా క్షీణించడమే ప్రస్తుతానికి సరైన ప్రతిస్పందనేనన్నారు.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా? -
నేటి నుంచి ఆర్బీఐ పాలసీ సమీక్ష
నేటి నుంచి ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. మూడు రోజులపాటు నిర్వహించనున్న సమావేశాల్లో భాగంగా శుక్రవారం(5న) పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే అత్యధిక శాతం మంది ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులు ఈసారి యథాతథ పాలసీ అమలుకే ఎంపీసీ కట్టుబడవచ్చని అంచనా వేస్తున్నారు. వెరసి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించే వీలున్నట్లు భావిస్తున్నారు.మరోపక్క ద్రవ్యోల్బణ రిస్క్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) చివర్లో కేంద్ర బ్యాంకు(ఆర్బీఐ) కఠిన పరపతి విధానాలకు తెరతీసే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. పాలసీ సమీక్షపై పీటీఐ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో 11 మంది స్టేటస్ కోకు వీలున్నట్లు పేర్కొనగా.. నలుగురు మాత్రం 0.25% రెపో రేటు పెంపును అంచనా వేశారు.4 శాతానికి దిగువనే..ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం దిగువనే కొనసాగుతుండటంతో రేట్ల పాజ్ను చేపట్టవచ్చని ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులు పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆర్బీఐ మరికొంతకాలం వేచిచూసేందుకు అవకాశమున్నదని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎకానమిస్ట్ గౌర సేన్గుప్తా అభిప్రాయపడ్డారు. గతేడాది వృద్ధికి మద్దతుగా ఎంపీసీ రెపో రేటులో మొత్తం 1.25 శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా? -
సామాన్యుడిపై ఇంధన భారం..
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రవాణా, తయారీ రంగాల వ్యయాలు పెరిగిపోతుండటం వల్ల రాబోయే రోజుల్లో నిత్యావసరాల ధరలు మరింత ప్రియం కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. గత నెల 15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 7.5 మేర పెరిగిన సంగతి తెలిసిందే. ఒకవేళ అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలోనే ఉంటే దేశీయంగా ఇంధనాల రేట్లు మరింత పెరగవచ్చని క్రిసిల్ పేర్కొంది.చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో ధరల పెంపు క్రమంగా లీటరుకు రూ. 10 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. దీనితో రవాణా ఖర్చులు పెరిగి ఆహార పదార్ధాలతో పాటు ఇతరత్రా నిత్యావసరాల రేట్లు కూడా పెరిగి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోసే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 7.5 చొప్పున పెరగడం వల్ల వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంపై 36 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం ఉంటుందని, అదే రూ. 10 స్థాయిలో ఇంధనాల ధరలు పెరిగితే 48 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడుతుందని వివరించింది. రోడ్ రవాణాపై భారీ ఎఫెక్ట్..దేశీయంగా రవాణాలో సింహభాగం వాటా (71 శాతం) ఉంటున్న రోడ్ ట్రాన్స్పోర్ట్పై ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. రవాణా వాహనాల నిర్వహణ వ్యయాల్లో 42 శాతం వాటా ఇంధనాలదే ఉండటం ఇందుకు కారణం. రిటైల్ ఇంధన రేట్లు పెరగడం వల్ల రాబోయే నెలల్లో రవాణా వ్యయాలు, అంతిమంగా వివిధ ఉత్పత్తుల ధరలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని నివేదిక వివరించింది. వీటిపై ఎక్కువగా ప్రభావం..రవాణా కీలకంగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, తేయాకు, కాఫీ, పండ్లు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు, మాంసం, చేపలు మొదలైన ఆహారోత్పత్తులపై అధికంగా ప్రభావం పడనుంది. సానుకూల బేస్ ఎఫెక్ట్ కూడా తగ్గడం వల్ల రాబోయే త్రైమాసికాల్లో ఆహార ద్రవ్యోల్బణం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. దుస్తులు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, కలప ఉత్పత్తులు, సిమెంటు.. సెరామిక్స్ సహా నిర్మాణ రంగ మెటీరియల్స్కి కూడా రవాణా ప్రధానమైన అంశం కావడం వల్ల వాటిపై కూడా ప్రభావం పడనుంది. జీఎస్టీ ఉపశమనం కొంతే..గతేడాది సెప్టెంబర్లో వస్తు, సేవల పన్నులను (జీఎస్టీ) తగ్గించిన నేపథ్యంలో తాజా ద్రవ్యోల్బణంపరమైన ప్రభావం నుంచి కొంత ఉపశమనం లభించవచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఊరట లభించకపోవచ్చని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న 4 శాతం లోపే ఉంటున్నప్పటికీ, రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే తక్కువ వర్షపాతం, ఎల్ నినో పరిస్థితులు మొదలైన వాటన్నింటినీ ఆర్బీఐ నిశితంగా పరిశీలించి, విధాన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది.ఇదీ చదవండి: కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా! -
ఎరువుల సంక్షోభం ముంచుకొస్తోంది..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో తీవ్రమైన ఎరువుల సంక్షోభం ముంచుకొస్తోందని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ గులాటి హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని ప్రధానంగా రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుందని ఆయన విశ్లేషించారు. త్వరలోనే ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ప్రస్తుతానికి మన దగ్గర తగినన్ని ఎరువుల నిల్వలు ఉండటం రైతులకు ఊరట కలిగించే శుభవార్త అని ఆయన పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాలికంగా చూస్తే ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై, సబ్సిడీలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేశారు. డా. అశోక్ గులాటి తెలిపిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తనున్న ఎరువుల సంక్షోభాన్ని ప్రధానంగా రెండు కోణాల్లో చూడాలి. ఖరీఫ్ సాగు సీజన్ త్వరలో మొదలవనున్న నేపథ్యంలో మన దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయన్నది రైతులకు శుభవార్త.ఇక రెండోది మన వ్యవసాయానికి అత్యంత కీలకమైన యూరియా. మనం ఏటా సుమారు 40 మిలియన్ టన్నుల యూరియా వాడుతున్నాం. గతేడాది 11 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకున్నాం. ఇటీవలే ప్రభుత్వం యూరియా దిగుమతి కోసం టన్నుకు 935 డాలర్ల కనీస ధరతో టెండర్లు ఆహ్వానించింది. రైతులకు విక్రయిస్తున్న ధర సుమారు 65 డాలర్లు.ఒకవేళ ధరలు పెరగకుంటే ఈ ఏడాది బడ్జెట్లో రూ.1.71 లక్షల కోట్లుగా కేటాయించిన ఎరువుల సబ్సిడీ తడిసిమోపడవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది రూ.2.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం త్వరగా చల్లారకపోతే, సబ్సిడీ మొత్తం ఏకంగా రూ. 3 లక్షల కోట్లను కూడా దాటిపోవచ్చనేది ఎరువుల శాఖ అధికారుల తాజా లెక్క.హార్మూజ్ జలసంధిలో దిగ్బంధనం మరో 2–3 నెలలు పాటు కొనసాగితే, రాయితీల విషయంలో ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు తలెత్తుతాయి. ఇంతకు మించిన ఆందోళన ఏంటంటే, ఎరువుల కోసం మనం 70% దిగుమతులపైనే ఆధారపడుతున్నాము.దేశీయంగా యూరియా ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. ఎందుకంటే, దీనికి అవసరమైన గ్యాస్ (ఎల్ఎన్జీ)లో 85% దిగుమతి చేసుకోవాల్సిందే. దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారీగా ఎగబాకుతుంది, మొత్తంమీద ఖరీఫ్ సీజన్ మధ్యలోనో, లేదంటే చివర్లోనో తీవ్రమైన ఎరువుల సంక్షోభం పొంచి ఉంది.ఎరువుల ధరలు పెంచకపోతే, సబ్సిడీల భారం పెరిగి ద్రవ్యలోటు ఎగబాకుతుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి. విదేశీ పెట్టుబడుల తగ్గుదల, రూపాయి మరింత పతనం వంటి దుష్ర్పభావాలు తీవ్రమవుతాయి.ఈ సంక్షోభాన్ని సదవకాశంగా మలచుకొని సంస్కరణలకు నడుంబిగించాలి. ఎరువుల ధరల సబ్సిడీ విధానం నుంచి ఆదాయ మద్దతు విధానానికి మారాలి. రైతులతో మాట్లాడి, ఎరువుల ధర రాయితీలకు బదులు ఆదాయపరమైన రాయితీలతో ఆదుకుంటామన్న భరోసా కల్పించాలి. దీనికి ఒక వ్యవస్థ ఉండాలి. అవసరమైతే ‘పీఎం కిసాన్’ పథకంలో విలీనం చేయవచ్చు. దీని ద్వారా కూడా రైతులకు రూ. 2 లక్షల కోట్ల రాయితీలను నేరుగా ఇవ్వొచ్చు. తద్వారా కనీసం రూ. 40,000 కోట్లు ఆదా చేయగలుగుతారు.ప్రభుత్వం ఇంత భారీ సబ్సిడీలను ఇప్పుడున్నట్లే ఇవ్వాలనుకుంటే, వినియోగ పరిమితులను విధించాల్సి ఉంటుంది. అంటే, పొలం విస్తీర్ణాన్ని బట్టి, పండించే పంట ఆధారంగా రైతుకు అందించే ఎరువుల పరిమాణాన్ని కేటాయించాలి.15 ఏళ్లుగా వరి, గోధుమలు.. ఇలా అనేక ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కానీ యూరియా ధరలు మాత్రం అక్కడే ఉండిపోయాయి. ఈ విధానం సరికాదు. ఎరువుల సరఫరా వ్యవస్థలో లీకేజీల (వృథా/అక్రమాలు) కారణంగా సబ్సిడీ నిథులు పక్కదారి పడుతున్నాయి. ఎరువుల ధరలు సహజ మార్కెట్ స్థాయికి చేరుకుంటే, లీకేజీలన్నీ వాటంతటవే మాయమైపోతాయి.– డా. అశోక్ గులాటి, వ్యవసాయ ఆర్థికవేత్త -
రికార్డ్ బ్రేకింగ్: యూపీఐ పేమెంట్లు.. రూ.29.90 లక్షల కోట్లు
దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మరోసారి కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.29.90 లక్షల కోట్లకు చేరగా, మొత్తం లావాదేవీల సంఖ్య 23.2 బిలియన్లుగా నమోదైంది. విలువ, వాల్యూమ్ రెండింటి పరంగా ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో నమోదైన రూ.29.03 లక్షల కోట్లతో పోలిస్తే మేలో లావాదేవీల విలువ మరింత పెరిగింది. గత ఏడాది మేలో నమోదైన రూ.25.14 లక్షల కోట్లతో పోల్చితే ఇది సుమారు 19 శాతం వృద్ధిని సూచిస్తోంది.ట్రాన్సాక్షన్లూ రికార్డే..లావాదేవీల సంఖ్య పరంగా కూడా యూపీఐ కొత్త గరిష్ఠాన్ని తాకింది. మే నెలలో 23.2 బిలియన్ల ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. ఇది గత ఏప్రిల్లో నమోదైన 22.35 బిలియన్లను అధిగమించడమే కాకుండా, గత ఏడాది మేలో నమోదైన 18.67 బిలియన్లతో పోలిస్తే దాదాపు 24 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తోంది.డిజిటల్ పేమెంట్స్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవి సెలవుల ప్రయాణాలు, ఐపీఎల్ నేపథ్యంలో పెరిగిన వినియోగదారుల ఖర్చులు, ఆన్లైన్ కొనుగోళ్లు యూపీఐ లావాదేవీల వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. వినియోగదారుల నుంచి వస్తున్న సహజమైన డిమాండ్ యూపీఐ వృద్ధిని మరింత బలోపేతం చేస్తోందని వారు పేర్కొంటున్నారు. -
పెట్రోల్, డీజిల్పై ఎగుమతులపై పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్ఫాల్ గెయిన్స్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల మార్పులు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో తాజా సవరణలు అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్పై విండ్ఫాల్ గెయిన్స్ పన్నును లీటరుకు రూ.3 నుంచి రూ.1.50కు తగ్గించారు. డీజిల్పై ఈ పన్నును లీటరుకు రూ.16.50 నుంచి రూ.13.50కు సవరించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై విండ్ఫాల్ పన్నును లీటరుకు రూ.16 నుంచి రూ.9.50కు తగ్గించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.దేశీయ వినియోగదారులపై ప్రభావం లేదుదేశీయ మార్కెట్లో వినియోగానికి విడుదల చేసే పెట్రోల్, డీజిల్పై ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో దేశీయ వినియోగదారులపై ఈ నిర్ణయం ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం లేదని భావిస్తున్నారు.ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ల సగటు అంతర్జాతీయ ధరలను ఆధారంగా చేసుకుని విండ్ఫాల్ పన్ను రేట్లను నిర్ణయిస్తారు. ఈ రేట్లను ప్రతి 15 రోజులకోసారి సమీక్షించి సవరిస్తుంటారు. చివరిసారిగా 2026 మే 16న రేట్లలో మార్పులు అమలులోకి వచ్చాయి.ముడి చమురు ధరలపై భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంఅమెరికా–ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న తర్వాత ప్రపంచ ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాల భయాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో ముడి చమురు ధరల్లో అస్థిరత కొనసాగుతోంది.విండ్ఫాల్ ట్యాక్స్ ఉద్దేశం ఇదే..అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు దేశీయ ధరల కంటే అధికంగా ఉన్న సమయంలో ఎగుమతిదారులు పొందే అదనపు లాభాలను నియంత్రించేందుకు విండ్ఫాల్ ట్యాక్స్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. మార్కెట్లో అసాధారణ పరిస్థితుల కారణంగా ఏర్పడే అనూహ్య లాభాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వ ఆదాయంగా మళ్లించడం ఈ పన్ను ప్రధాన ఉద్దేశం.ఇదీ చదవండి: పండుగలా దిగివచ్చిన పసిడి, వెండి.. -
పత్తి దిగుమతులకు సుంకాల నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: పత్తి దిగుమతులకు అయిదు నెలల పాటు అన్ని రకాల కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపునిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. దేశీయంగా టెక్స్టైల్ పరిశ్రమకు కాటన్ లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని వివరించింది. టెక్స్టైల్, అపారెల్ పరిశ్రమకు ముడి సరుకు వ్యయాలు తగ్గడానికి, దేశీయ రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే తయారీ సంస్థలు, వినియోగదారులకు ఊరటనిచ్చేందుకు దోహదపడగలదని తెలిపింది. టెక్స్టైల్ పరిశ్రమ ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దేశీయ మార్కెట్లో పత్తి లభ్యతపై ఒత్తిడి ఉండటంతో పాటు ముడి సరుకు ధరలు పెరగడం వల్ల స్పిన్నింగ్, గార్మెంట్ తయారీ యూనిట్లు వ్యయభారం ఎదుర్కొంటున్నాయని వారు పేర్కొన్నారు. దిగుమతి సుంకాల మినహాయింపుతో విదేశాల నుంచి తక్కువ ఖర్చుతో పత్తిని దిగుమతి చేసుకునే అవకాశం లభిస్తుందని, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా టెక్స్టైల్ సంస్థలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. అలాగే భారత టెక్స్టైల్, అపారెల్ ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడంతో పాటు ఉత్పత్తి చక్రం అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
విమానం ఎగిరితే.. కోట్లాది రూపాయలు ఇలా కురుస్తాయ్?
ఆకాశంలో ఫ్లైట్స్ ఎన్నో ఎగురుతూ ఉంటాయి. విమానాల వల్లే సుదూర ప్రాంతాలకు తొందరగా చేరుకోగలుగుతున్నాం. ఏ రంగమైనా రెవెన్యూతో ముడిపడి ఉంటుంది. మరి ఫ్లైట్ రెవెన్యూ అంటే అసలుఏంటి? ఒక ఎయిర్లైన్ సంస్థకు విమాన ప్రయాణాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఫ్లైట్ రెవెన్యూ అంటారు.ప్రధానంగా రెవెన్యూ వచ్చే మార్గాలుప్రయాణికుల టికెట్ బుకింగ్స్ నుంచి అంటే.. బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ టికెట్స్ నుంచి అదనపు లగేజ్ చార్జీలు ఫుడ్ అండ్ బెవరేజ్ సేల్స్ కార్గో అండ్ పార్సల్ సర్వీసులు, ఇన్ఫ్లైట్ వైఫై లేదా ప్రీమియం సేవలు అంటే ఇది దాదాపు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ఫ్యూయల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పైలట్ అండ్ సిబ్బంది జీతాలు, ఎయిర్పోర్ట్ చార్జీలు, విమాన మెయింటెనెన్స్, ట్యాక్సీలు ఇవన్నీ కలిపి కూడా ఫ్లైట్ రెవెన్యూ కిందకు వస్తుంటాయి.ఎగరడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకుందాం..ఉదాహరణకు.. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్యాసింజర్ ప్లేన్ ఒక ఎయిర్ బస్ A380 ఒక సింగల్ ఫ్లైట్ లో ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్లైట్ దుబాయ్ నుంచి లండన్ వెళ్తుంది అనుకుందాం. ప్రయాణం 7 గంటలు పడుతుందనుకుందాం. దీంట్లో 506 సీట్స్ ఉంటాయి. ఫుల్లీ బుక్డ్ అనుకుందాం.. ఈ ఫ్లైట్ మొత్తం మరి దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇందులో 14 ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్ ఉంటే అందులో నుంచి వీళ్లకు వచ్చే ఆదాయం అక్షరాల ఒకటిన్నర కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక మిగిలిన సీట్లు ఉంటాయి కదా.. 76 బిజినెస్ క్లాట్స్ ప్యాసెంజర్స్ సీట్స్ ఉంటాయి. మరి అందులో నుంచి వారికి 86 అంటే 86.2 లాక్స్ ఆదాయం వస్తుంది. అలాగే 416 ఎకానమీ ప్యాసెంజర్ సీట్స్ ఉంటాయి.అంటే ఫస్ట్ క్లాస్ తర్వాత మిగిలిన సీట్స్ తర్వాత ఎకానమీ ప్యాసెంజర్స్ సీట్స్ ఉంటాయి. వాళ్ల నుంచి వీళ్లకు వచ్చే ఆదాయం 1/2 కోట్లు ఉండొచ్చు. మరి ఇక టికెట్ రెవెన్యూ రఫ్ గా చూసుకున్నట్లయితే వీళ్లకి రూ.3.16 కోట్లు. అలాగే మన కార్గో చార్జీలు అన్నీ ఉంటాయి కదా వాటికి కూడా వాళ్లకి వచ్చే ఆదాయం 67 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక టోటల్ రెవెన్యూ మాత్రం దగ్గర దగ్గరగా 3.83 కోట్ల వరకు వస్తుంది.ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చు?ఒకవేళ ఈ ఫ్లైట్ నే తీసుకుందాం A380. ఈ ఫ్లైట్ అసలు నడవడానికి కొంతవరకు బర్న్ అయ్యే ఫ్యూయల్ ఉంటుంది కదా.. ఒకవేళ 2600 గలోన్స్ ఆఫ్ ఫ్యూయల్ పర్ అవర్ ఉంటే ఒక ఫ్లైట్ కి కావాల్సింది 27600 గెలోన్స్ దీనికి కాస్ట్ ఎంత పడుతుందనుకుంటున్నారు? నియర్లీ 60,000 డాలర్.. అంటే అక్షరాల రూ.57 లక్షలు అవుతుంది. మరి ల్యాండింగ్ ఫీస్ సెక్యూరిటీ బ్యాగేజ్ హ్యాండిలింగ్ ఫీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వీటికి కూడా 12.45 లక్ష అవుతుంది. ఇక ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ ఫీస్ ఉంటుంది 11.5 లాక్స్ అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే క్రూ ఉంటారు ఫ్లైట్ లో మరి వాటికి కూడా వాళ్లకు కూడా చార్జీలు ఉంటాయి. ఇక క్రూ మొత్తం కలుపుకుంటే ఆ పెద్ద ఫ్లైట్ లో 22 ఫ్లైట్ అటెండెన్స్ ఉంటాయి. అంటే 22 ఫ్లైట్ అటెండెన్స్ ప్లస్ఫోర్ పైలట్స్ చూసుకున్నట్లయితే వాళ్లకి కూడా శాలరీస్ ఉంటాయి. మరి దానికి ఖర్చు రూ.14.36 లక్షలు ఉండొచ్చు. ఇక ఇంజన్ సిస్టం మెయింటనెన్స్ కాస్ట్లు పడుతూ ఉంటాయి. మరి దానికి అయ్యే ఖర్చు రూ.4.78 లక్షలు. ఇక వేరియబుల్ కాస్ట్ అన్ని కలిపి ఒక కోటి రూపాయల వరకు అవ్వచ్చు. మరి అలాగే డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఖర్చులు ఉంటాయి. వాటికి కూడా 47.87 లక్షల రూపాయలు అవుతుంది. అంత స్మూత్ గా వెళ్తుంటే రూ.2.35 క్రోర్స్ వరకు వాళ్లకు ఆదాయం వస్తుంది. అంటే ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చులు ఆదాయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం చూసే ప్రతి ఫ్లైట్ కేవలం ప్రయాణం మాత్రమే కాదు. వేలాది ఉద్యోగాలు కోట్ల రూపాయల బిజినెస్, బారి ప్లానింగ్ తో నడిచే ఒక పెద్ద ఇండస్ట్రీ ఆకాశంలో ఎగిరేది విమానం మాత్రమే కాదు.. దాని వెనక ఉన్న రెవెన్యూ కూడా... -
సవాళ్లున్నాయి, కానీ సంక్షోభం లేదు
పశ్చిమాసియా సంక్షోభం, ఇతరత్రా విదేశీ షాక్ల కారణంగా ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. దీని తీవ్రత మన కళ్ల ముందు స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా విదేశీ మారక నిల్వల తగ్గుముఖం, దిగుమతుల భారం, రూపాయి పతనం, ఎరువుల రాయితీలు భారీగా ఎగబాకడం, పెట్రో ధరల పెంపు వంటివి చూస్తున్నాం. అయితే, ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందన్నదే అసలు ప్రశ్న. విదేశీ షాక్ల విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ సరైన దిశలోనే ఉన్నాయి. పలు రంగాల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిరావచ్చు. అయితే, కొంతమంది భయాందోళనలకు గురిచేస్తున్నట్లుగా మన ఎకానమీలో ఏదో సంక్షోభం నెలకొందని అనిపించడం లేదు. చాలా పటిష్టంగానే ఉందని భావిస్తున్నా. గత మూడేళ్లుగా జీడీపీ సగటున 7.3% వృద్ధి చెందింది. మూడేళ్లలో ద్రవ్యోల్బణం సగటున సుమారు 4.3%గా నమోదైంది. కరెంట్ ఖాతా లోటు కూడా జీడీపీలో 1% పరిధిలోనే కొనసాగింది. ఆర్థిక వ్యవస్థలో కొత్తగా నిర్మాణాత్మక సమస్యలేవీ లేవు. మన శ్రామిక శక్తిలో ఇప్పటికీ 46% వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. పట్టణీకరణ వేగం పుంజుకోవడం లేదు. రాబోయే దశాబ్దంలో వీటిని చక్కదిద్దాల్సి ఉంది. విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయన్న విషయంలో గందరగోళం నెలకొంది. నిజానికి కీలకమైన స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (గ్రాస్ ఎఫ్డీఐలు) చాలా బలంగా ఉన్నాయి. 2024–25లో ఇవి 81 బిలియన్ డాలర్లు కాగా, 2025–26లో 94 బిలియన్ డాలర్లు. సమస్యేమిటంటే, విదేశీ ఇన్వెస్టర్లు గతంలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల గతేడాది సుమారు 20 బిలియన్ డాలర్లు వెనక్కి వెళ్లాయి. అలాగే, విదేశీ పరిణామాల కారణంగా స్టాక్ మార్కెట్లలో పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు దెబ్బతిన్నాయి. భారత్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో సానుకూల దృక్పథం మారలేదు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భారీ సంస్కరణల్లో చాలా వరకు పూర్తయ్యాయి. అయితే, నియంత్రణపరమైన కొన్ని అడ్డంకులు ఇంకా కొనసాగుతున్నాయి. న్యాయపరమైన సంస్కరణలల్లో పెద్దగా పురోగతి లేదు. రాబోయే దశాబ్దాల్లో వీటితో సహా మరిన్ని భారీ సంస్కరణలు అవసరం. ప్రధాని పొదుపు చర్యలను ఒక నైతిక సూచనగానే చూడాలి. అయితే, వీటిని ప్రభుత్వాలు ఆచరించి ఆదర్శంగా నిలవాలన్న వాదనతో ఏకీభవిస్తున్నా. ముఖ్యంగా ఉచిత పథకాలను ఎడాపెడా ఇవ్వడం మంచిది కాదు, కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం దీనికి మినహాయింపు. కోవిడ్ తర్వాత ఆర్థిక క్రమశిక్షణ మెరుగ్గానే ఉంది. రానున్న కాలంలో కేవలం ఉచితాలతోనే ఎన్నికల్లో గెలవలేమని రాజకీయ పార్టీలన్నీ గ్రహిస్తాయని భావిస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటిని ఆపడం సాధ్యం కాదు. మెరుగైన పాలన, సేవలతోనే విజయం లభిస్తుంది. కాలక్రమేణా ఉచిత పథకాలు వాటంతటవే కనుమరుగవుతాయి. పశ్చిమాసియా సంక్షోభం నేడోరేపో ముగిసినా చమురు సరఫరా వ్యవస్థ మునుపటి స్థాయికి చేరడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది(2026–27) అర శాతం తగ్గి 6.5 శాతానికి చేరవచ్చు. ఒకవేళ ఏడాదంతా ఉద్రిక్తతలు కొనసాగితే 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది.– డా. అరవింద్ పనగారియా, ఆర్థికవేత్త, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ -
కరెన్సీ నోటు మీద ట్రంప్.. డిజైన్ రెడీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చిత్రంతో 250 డాలర్ల కరెన్సీ నోటును తీసుకురావడానికి సంబంధించిన చర్చ అమెరికా రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ నోటుకు సంబంధించిన డిజైన్ను సిద్ధం చేశామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. అయితే దీనికి తుది ఆమోదం కాంగ్రెస్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.వైట్హౌస్లో మాట్లాడిన బెస్సెంట్, “మేము బిల్లు డిజైన్ను సిద్ధం చేశాం. అవసరమైతే వెంటనే ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి” అని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక స్మారక నోటుగా దీనిని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపారు.కాంగ్రెస్లో పెండింగ్లో బిల్లుఈ ప్రతిపాదనకు సంబంధించి రిపబ్లికన్ ప్రతినిధి జో విల్సన్ కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుత చట్టం ప్రకారం సజీవ వ్యక్తుల చిత్రాలు అమెరికా కరెన్సీపై ముద్రించరాదు. అయితే ట్రంప్ కోసం ఆ నిబంధనకు మినహాయింపు ఇవ్వాలని ఈ బిల్లు కోరుతోంది. ట్రెజరీ విభాగం ప్రకారం, కాంగ్రెస్ ఆదేశిస్తే “అమెరికా 250వ వార్షికోత్సవాన్ని ప్రతిబింబించే స్మారక 250 డాలర్ల నోటు” విడుదలకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించారు.డిజైన్లో ట్రంప్ చిత్రం, సంతకంవాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ నోటు డిజైన్లో ట్రంప్ చిత్రపటంతో పాటు 250వ వార్షికోత్సవ లోగో, ఆయన సంతకం కూడా ఉండనున్నాయి. బ్రిటిష్ కళాకారుడు ఇయాన్ అలెగ్జాండర్ ఈ డిజైన్ను రూపొందించినట్లు సమాచారం. అమెరికా బ్యూరో ఆఫ్ ఎంగ్రేవింగ్ అండ్ ప్రింటింగ్లో ఈ ప్రతిపాదనపై అంతర్గత చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ట్రంప్ నియమిత యూఎస్ ట్రెజరర్ బ్రాండన్ బీచ్ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.ట్రంప్ బ్రాండ్ విస్తరణ2025లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తన పేరు, చిత్రాన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ చిత్రంతో 250వ వార్షికోత్సవ స్మారక నాణేలు రూపొందించగా, ఫెడరల్ భవనాలపై కూడా ఆయన చిత్రపటాలు ప్రదర్శిస్తున్నారు. అయితే 250 డాలర్ల నోటు విడుదల కావాలంటే కాంగ్రెస్ బిల్లు ఆమోదం పొందడంతో పాటు ట్రంప్ సంతకం కూడా అవసరం. “మేము చట్టానికి కట్టుబడి ఉంటాం. ఇక నిర్ణయం క్యాపిటల్ హిల్ చేతుల్లోనే ఉంది” అని బెస్సెంట్ స్పష్టం చేశారు. -
రూపాయిని మరింత పడనివ్వాలి
ముంబై: విదేశీ ఆర్థిక అనిశ్చితి, ఒత్తిళ్లను తట్టుకునేందుకు వీలుగా డాలరుతో రూపాయి మారకం విలువను మరింత క్షీణించేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలు మరింత పెరిగితే, వడ్డీ రేట్ల పెంపునకు బదులు ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) నియంత్రణ చర్యలను ఎంచుకోవడం మంచిదని సూచించారు. పశ్చిమాసియా సంక్షోభంతో క్రూడ్ ధరలు దూసుకెళ్లడం, రూపాయి భారీగా పతనం కావడం, దేశీయంగా పెట్రో రేట్ల పెంపుతో ద్రవ్యోల్బణానికి రెక్కలొస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జూన్ 5న ఆర్బీఐ కీలక పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో దువ్వూరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ద్రవ్యోల్బణం మరీ ఆందోళనకంగా ఉందని భావిస్తే ఆర్బీఐ పరపతి విధానాన్ని కఠినతరం చేయొచ్చు. అయితే, కరెన్సీ రేటు పడిపోకుండా అడ్డుకోవడానికి మాత్రం మానిటరీ పాలసీని చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగించాలి. బలహీన రూపాయి అనేది తటస్థ షాక్ అబ్జార్బర్లా పని చేస్తుంది. కాబట్టి, అది మరింత పడిపోకుండా అడ్డుకోవడం కంటే, పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు వీలు కల్పించాలి’ అని ఆయన పేర్కొన్నారు. నిర్ణయాత్మక చర్యలు అవసరం... ‘రూపాయి మరింత పడిపోతుందని ఇన్వెస్టర్లు, దిగుమతిదారులు, ప్రజలు భావించడం మొదలైతే అది మరింత బలహీనపడుతుంది. కరెన్సీ ఇంకా పడిపోయే విధంగా వారి చర్యలుంటాయి. ఎగుమతిదారులు తమ డాలర్లను సొమ్ము చేసుకోవడం ఆలస్యం చేస్తారు. దిగుమతిదారులు డాలర్ల కోసం ఎగబడతారు. ప్రజలు బంగారం కొనేందుకు మరింత మొగ్గుచూపుతారు. అలాగే ఇన్వెస్టర్లు హెడ్జింగ్ను తీవ్రతరం చేస్తారు. అందుకే జోక్యం చేసుకోవడం కంటే వారి ఆందోళనలను తగ్గించేలా వివరించడం చాలా ముఖ్యం’ అని దువ్యూరి చెప్పారు. పాలసీ రూపకర్తలు ఆత్మరక్షణలో పడినట్లు లేదా భయాందోళనలకు గురైనట్లు కాకుండా నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోవాలన్నారు. వేచిచూడటం మంచిది... జీడీపీకి మద్దతివ్వడం కోసం వడ్డీ రేట్లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణం ఎగబాకి.. మారకం రేటు ఒత్తిళ్లు తీవ్రమవుతాయి. ఒకవేళ వడ్డీ రేట్లను భారీగా పెంచితే ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిని, జీడీపీ వృద్దిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ‘వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ స్థిరీకరణ విషయంలో సమతూకం పాటించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సంక్లిష్టమైన అంశం. కాబట్టి ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలను అంచనా వేసేందుకు, తక్షణం పాలసీ రేట్లను పెంచకుండా ఆర్బీఐ కొంతకాలం వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తే మంచిదని దువ్వూరి తెలిపారు. -
ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచాలి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఎగుమతుల పోటీతత్వం పెంచేందుకు పన్నుల తగ్గింపు, అవసరం లేని, అనర్ధదాయక వస్తువుల దిగుమతులపై నిషేధం విధించడంతోపాటు.. తగిన రక్షణ చర్యలు అవసరమని ఒక నివేదిక సూచించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్టు తెలిపింది. దీనివల్ల ఇంధనం, వ్యవసాయం, ఉత్పాదక రంగాలలో వ్యయాలు పెరిగి, ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నట్టు ‘థింక్ చేంజ్ ఫోరమ్’ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి సబ్సిడీలపై ఆధారపడటం పరిష్కారం కాదని సూచించింది. సబ్సిడీలు ఇవ్వడం వల్ల పరిశ్రమలు అంతర్జాతీయ సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని, సమర్థతను కోల్పోతాయంటూ.. వీటికి బదులు ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడానికి పన్నుల నిర్మాణంలో మార్పులు చేయాలని, దేశీయ పరిశ్రమలకు మేలు జరిగేలా దిగుమతి సుంకాలను ఎప్పటికప్పుడు సవరించాలని, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి అనవసరమైన వస్తువుల దిగుమతులను అడ్డుకోవాలని సూచించింది. అవసరం లేని వస్తు దిగుమతులను తగ్గించడం అన్నది కేవలం పొదుపు చర్య మాత్రమే కాదని, అది దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఎంతో ముఖ్యమైందన్న ప్రధాని మోదీ ఇటీవలి పిలుపును ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 774.98 బిలియన్ డాలర్లకు పెరగ్గా.. ఎగుమతులు 441.78 బిలియన్ డాలర్లుగా నమోదవడం తెలిసిందే. దీనివల్ల దేశ వాణిజ్య లోటు 333 బిలియన్ డాలర్లు దాటిపోయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ డేటాను ఉదహరించింది. రూపాయిని కాపాడుకోవాలి.. → అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన కరెన్సీ (రూపాయి) విలువను కాపాడుకునేందుకు తక్కువ విలువ జోడించే విడిభాగాలను కట్టడి చేయాలి. వీటి తయారీకి సంబంధించి దేశీయంగా తగిన తయారీ వ్యవస్థ ఉంది. → హానికారక వస్తు దిగుమతులను సైతం నిషేధించాలి. తక్కువ విలువతో కూడిన విచక్షణారహిత దిగుమతులను అనుమతించడం వల్ల విదేశీ మారకం నిల్వలపై ఒత్తిళ్లు పడుతున్నాయి. అదే సమయంలో దేశీయంగా బలమైన విలువ జోడింపు అవకాశాలు, సామర్థ్య విస్తరణ, ఉపాధి కల్పన అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. → పొగాకు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో అతిపెద్ద దేశమైనప్పటికీ.. 116 మిలియన్ డాలర్ల విలువైన సిగరెట్లు, సిగార్లు, టుబాకో, టుబాకో ప్రత్యామ్నాయాలను దిగుమతి చేసుకుంటోంది. → ఖరీదైన కన్ఫెక్షనరీలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, విలాసవంతమైన వాచీలు, కార్ల దిగుమతులను సాధారణ అనుమతుల జాబితా నుంచి తొలగించి, కఠినమైన నిబంధనలతో కూడిన ప్రత్యేక లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలి. → విదేశీ వస్తు దిగుమతులతో దేశీ పరిశ్రమలు నష్టపోతున్నప్పుడు, వాటిని రక్షించడానికి తగిన వాణిజ్య చర్యలను తగిన కాలపరిమితితో తక్షణమే అమలు చేయాలి. -
మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి
కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నప్పటి కంటే సంకీర్ణ సర్కార్లు ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్, వాజ్పేయి ప్రభుత్వాలు దీనిని నిదర్శనం. ఇందిర, మోదీ సారథ్యంలో ఎకానమీ తీవ్ర సమస్యల్లోకి జారిపోవడం చూస్తున్నాం. → రాజకీయంగా బలమైన మెజారిటీ ఉన్నప్పుడే ఆర్థికంగా బలహీన పనితీరు ఉంటుంది. ఎందుకంటే, వారు తమ పొలిటికల్ బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తారు తప్ప, ఆర్థిక సవాళ్లపై పెద్దగా ఫోకస్ చేయరు. → కొంత మంది ఆర్థిక వేత్తలు చెబుతున్నట్టు, భారత ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉందనడంలో అర్థం లేదు. ఎందుకంటే, గతంతో పోలిస్తే భారత్ పనితీరు ఎలా ఉందో చూడాలి. ఈ శతాబ్దం తొలి పదేళ్లలో సగటు ఎకానమీ వృద్ధి రేటు 7–7.5 శాతంగా ఉంది. మరిప్పుడు సగటు వృద్ధి 6 శాతానికి పడిపోయింది. → 2020 కల్లా మన జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే లక్ష్యమని ప్రధాని మోదీ 2017లో ప్రకటించారు. ఆ టార్గెట్ తర్వాత 2022కి, ఆపై 2025కి మారింది. ఇప్పుడు 2026లో కూడా మనం ఇంకా 4 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నాం. లక్ష్యం మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. సమస్యలు గుర్తించి, తగిన పాలసీ చర్యలు చేపట్టాలి. → ప్రైవేటు పెట్టుబడులు పెరగకపోవడానికి 3 కారణాలున్నాయి. చాలా రంగాల్లో ఉత్పత్తులకు డిమాండ్ పుంజుకోవడం లేదు. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ పెట్టుబడులు పెంచుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019లో చెప్పారు. దీనివల్ల డిమాండ్ పెరిగి, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అదేమీ జరగలేదు. → సంపన్నులు దేశాన్ని విడిచిపోతున్నారు. కొంత మంది బడా కార్పొరేట్లు సైతం విదేశాల్లో తమ ఫ్యామిలీ ఆఫీసులు తెరుస్తున్నారు. దీనివల్ల దేశం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఇక మూడోది ఎఫ్డీఐలు మందగిస్తున్నాయి. గణాంకాలే దీనికి నిదర్శనం. → తయారీ రంగం, వృద్ధి రేటు, ఎగుమతులు, ఉద్యోగ కల్పన ఇలా ఏ డేటా చూసినా.. 1990– 2015 మధ్య అంటే పాతికేళ్ల పాటు ఎకానమీకి స్వర్ణ యుగం అనే చెప్పొచ్చు. ఇందిగా గాంధీ హయాంలో, ఇప్పుడు మోదీ జమానాలో ఆర్థిక వ్యవస్థ పనితీరు అసలేం బాగోలేదు. అయితే, బీజేపీ పీఎం అటల్జీ పాలనలో మాత్రం సంస్కరణల పరంగా, పెట్టుబడుల పరంగా కూడా మంచి నాయకత్వం లభించింది. → ప్రధాని మోదీ పొదుపు మంత్రం జపిస్తే సరిపోదు. మరింత ఫోకస్ అవసరం. గతంలో 1991లో ఫారెక్స్ సంక్షోభాన్ని పీవీ, 1998లో అణు పరీక్షల కారణంగా అమెరికా విధించిన ఆంక్షలను అటల్జీ ఎదుర్కొన్న తీరును గమనించండి. ప్రస్తుతం మాటలే తప్ప అలాంటి చేతలు కనిపించడం లేదు. ఎకానమీ మందగమనానికి గల్ఫ్ వార్, క్రూడ్ ధరల పెరుగుదల మాత్రమే కాదు, చాలా అంశాలు ప్రభావం చూపుతున్నాయి. – డా. సంజయ బారు, పాలసీ ఎనలిస్ట్ -
వికసిత్ భారత్కు బ్యాంకింగ్ దన్ను
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాకారంలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషిస్తుందని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. మూలధన సమీకరణ, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో బ్యాంకింగ్ ప్రధానంగా ఉంటోందన్నారు. వార్షిక నివేదికలో షేర్హోల్డర్లకు ఇచ్చిన సందేశంలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ‘‘దేశంలోనే అతి పెద్ద బ్యాంకు కావడం వల్ల మాకు అవకాశాలూ, బాధ్యత.. రెండూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తెరిగి, భారత్ వృద్ధి ఆకాంక్షలు సాకారం కావడానికి అవసరమైన తోడ్పాటు అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు. డిజిటల్ మాధ్యమం, కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చేలా ‘డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్’ విధానాలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో బ్యాంకింగ్ సేవలను బలోపేతం చేసేలా టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ, సైబర్సెక్యూరిటీ, డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులను కొనసాగిస్తామని శెట్టి చెప్పారు.కొత్త ఆవిష్కరణలపై ఫోకస్.. కొత్త ఆవిష్కరణలకు తెరతీస్తూ, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ, మరింత నాణ్యమైన సేవలు అందించేలా వివిధ ప్రక్రియలను సరళతరం చేయడంపై దృష్టి పెడుతున్నట్లు శెట్టి తెలిపారు. ఇందుకు ప్రాజెక్ట్ సరళ్ కింద ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ)ని మరింత వినియోగించుకోనున్నట్లు వివరించారు. -
గోల్డ్ లోన్ కంపెనీలు బంగారు గనులు!
న్యూఢిల్లీ: పసిడి ధర, రుణాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం రుణాల కంపెనీల దగ్గర హోల్డింగ్స్ భారీగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మూడు లిస్టెడ్ గోల్డ్ కంపెనీలైన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ దగ్గర మొత్తం బంగారం 20 టన్నులు పెరిగి రికార్డు స్థాయిలో 334 టన్నులకు చేరింది. పలు దేశాల దగ్గరున్న నిల్వల కన్నా ఇది అధికం కావడం గమనార్హం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం బ్రిటన్ దగ్గర 310 టన్నులు, బ్రెజిల్ వద్ద 172 టన్నులు, సింగపూర్ దగ్గర 194 టన్నుల బంగారం ఉంది. ఈ మూడు సంస్థల దగ్గరున్న హోల్డింగ్స్ భారతదేశపు వార్షిక పసిడి దిగుమతుల్లో దాదాపు సగం (46 శాతం). కేంద్ర వాణిజ్య శాఖ డేటా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు దాదాపు 5 శాతం తగ్గి 721 టన్నులకు పరిమితమయ్యాయి. 2026 మార్చి ఆఖరు నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద గతేడాది నమోదైన 879.6 టన్నుల స్థాయికి దాదాపు దరిదాపుల్లో మొత్తం 880.5 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. ఇందులో 680 టన్నులను దేశీయంగా నిల్వ చేస్తుండగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్ల్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద 197.7 టన్నులు నిల్వ చేస్తున్నారు. గోల్డ్ డిపాజిట్ల రూపంలో మరో 2.8 టన్నులు ఉన్నాయి. ఐఐఎఫ్ఎల్ ః 19 టన్నులు .. గత ఆర్థిక సంవత్సరంలో ఐఐఎఫ్ఎల్ వద్ద పసిడి అత్యధికంగా 19 టన్నులు పెరిగింది. దాదాపు 60 టన్నులకు చేరింది. వాస్తవానికి 2024 మార్చి నుంచి ఆరు నెలల పాటు పసిడి రుణాలివ్వకుండా రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ గోల్డ్ లోన్ వ్యాపార విభాగంపై గణనీయంగా ప్రభావం పడింది. అయితే, ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత వ్యాపారం క్రమంగా పుంజుకుంది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా ఏడు శాతం తగ్గినప్పటికీ ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర పసిడి హోల్డింగ్స్ అత్యధికంగా 209 టన్నులు ఉన్నాయి. ధర అధిక స్థాయిలో ఉన్నప్పుడు తక్కువ పరిమాణంలోనే బంగారాన్ని తనఖా పెట్టి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకునేందుకు వీలుండటం ఇందుకు కారణమని విశ్లేషకులు తెలిపారు. అటు మూడో లిస్టెడ్ గోల్డ్ లోన్ కంపెనీ అయిన మణప్పురం ఫైనాన్స్ వద్ద పసిడి హోల్డింగ్స్ ఏడు టన్నులు (11.7 శాతం) పెరిగాయి. రికార్డు స్థాయిలో 63 టన్నులకు చేరాయి. మైక్రోఫైనాన్స్ రంగంలో మొండిబాకీల ఒత్తిడి కనిపిస్తున్న నేపథ్యంలో మణప్పురం తమ పసిడి రుణాల వ్యాపారాన్ని మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతుండటమనేది కంపెనీ దగ్గర బంగారం హోల్డింగ్స్ పెరుగుదలకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఐఐపీ లెక్కల్లో భారీ మార్పులు
దేశ పారిశ్రామిక వృద్ధి రేటును అంచనా వేసే ‘పారిశ్రామిక ఉత్పత్తి సూచీ’ (ఐఐపీ-ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) లెక్కింపు పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. మారుతున్న ఆర్థిక ముఖచిత్రానికి అనుగుణంగా మరింత పారదర్శకంగా పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించేలా ఐఐపీ పరిధిని విస్తరిస్తోంది. ‘బేస్ ఇయర్ రివిజన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ’ (టీఏసీ-ఐఐపీ) చేసిన ప్రతిపాదనల మేరకు సరికొత్త ఐఐపీ సిరీస్ను జూన్ 1వ తేదీన ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది.ఈ కొత్త సిరీస్లో ఇప్పటివరకు ఉన్న బేస్ ఇయర్ 2011-12 స్థానంలో 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని నూతన ఆధారిత సంవత్సరంగా (బేస్ ఇయర్) ఖరారు చేశారు. ఇటీవల మార్చిన దేశ జీడీపీ బేస్ ఇయర్ 2022-23, వినియోగదారుల ధరల సూచీ - సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ ఇయర్ 2024ల తర్వాత వాస్తవిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా మారుస్తున్న మూడో కీలక ఆర్థిక సూచిక ఇదే కావడం గమనార్హం.కొత్తగా చేరిన రంగాలుగణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పారిశ్రామిక రంగంలో వస్తున్న నూతన మార్పులను అందిపుచ్చుకునేలా ఐఐపీ పరిధిని పెంచారు. అరుదైన ఖనిజాల విభాగంలో మైనింగ్, క్వారీయింగ్ విభాగం కింద రేర్ ఎర్త్ మెటల్స్, మైనర్ మినరల్స్ను కొత్తగా ఈ సూచీలో చేర్చారు. అంతేకాకుండా, సాంప్రదాయ (నాన్ రెన్యువబుల్), పునరుత్పాదక (రెన్యువబుల్) ఇంధన వనరుల ద్వారా జరిగే విద్యుత్ ఉత్పాదనను ఇకపై విడివిడిగా చూపిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నల్లా కనెక్షన్ల సంఖ్య ఆధారంగా నీటి సరఫరా విభాగాన్ని అంచనా వేస్తారు. అమృత్ పథకం కింద ఉన్న 500 నగరాల్లోని డ్రైనేజీ కనెక్షన్ల ఆధారంగా మురుగునీటి నిర్వహణను, పట్టణాల్లో సేకరించి ప్రాసెస్ చేసిన వ్యర్థాల ఆధారంగా వేస్ట్ మేనేజ్మెంట్ రంగాన్ని ట్రాక్ చేస్తారు.ఆరు విభాగాల వర్గీకరణ యథాతథంబేస్ ఇయర్ మారినప్పటికీ.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు రకాల వర్గీకరణలను కమిటీ యథాతథంగా కొనసాగించింది. ఇందులో ప్రాథమిక వస్తువులు, మూలధన వస్తువులు, మధ్యంతర వస్తువులు, మౌలిక సదుపాయాలు-నిర్మాణ రంగ వస్తువులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్యూమర్ నాన్-డ్యూరబుల్స్ ఉన్నాయి.జూన్ 1న తొలి నివేదికజూన్ 1న విడుదలయ్యే తొలి నివేదికలో ఏప్రిల్ 2023 నుంచి గణాంకాలను పొందుపరుస్తారు. ఇందులో ఏప్రిల్ 2026కి సంబంధించిన ముందస్తు అంచనాలు కూడా ఉంటాయి. ఆల్ ఇండియా జనరల్ ఇండెక్స్తో పాటు.. మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సప్లై, వాటర్ సప్లై, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి రంగాల వారీ సూచీలను కూడా ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు. ఈ నూతన సంస్కరణల ద్వారా దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించిన మరింత స్పష్టమైన, వాస్తవిక లెక్కలు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
పెడచెవిన పెట్టడంతో రూ.12వేల కోట్ల నష్టం!
చౌక దిగుమతులను అడ్డుకునేందుకు యాంటీ డంపింగ్ డ్యూటీ (సుంకాలు) విధించాలన్న సిఫారసులను కేంద్రం అమలు చేయకపోవడంతో.. దేశీ పరిశ్రమకు రూ.11,938 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్టు తేలింది. అంతేకాదు ఒకవేళ ఈ యాంటీ డంపింగ్ సుంకాలు విధించినట్టయితే, దిగుమతులను నివారించడం రూపంలో ఏటా రూ.28,450 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చుకునే అవకాశం కూడా ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) నిర్వహించిన అధ్యయనంలో తేలింది.చౌక దిగుమతులు దేశీ పరిశ్రమకు ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితుల్లో డీజీటీఆర్ అధ్యయనం చేసి, సిఫారసులు చేస్తుంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుంది. 56 ఉత్పత్తులకు సంబంధించి యాంటీ డంపింగ్ సుంకాలు విధించాలంటూ ఇప్పటి వరకు డీజీటీఆర్ సిఫారసు చేయగా, వీటిని అమలు చేయని కారణంగా దేశీ పరిశ్రమ ఏటా రూ.11,938 కోట్లను నష్టపోతున్నట్టు తెలిసింది.ఉపాధికీ నష్టమే..33 ఉత్పత్తుల దిగుమతుల రూపంలోనే రూ.1.54 లక్షల కోట్ల ఆర్థిక నష్టం ఏర్పడినట్టు డీజీటీఆర్ గుర్తించింది. 2030 నాటికి ఈ నష్టం రూ.2.70 లక్షల కోట్లకు పెరగొచ్చని పేర్కొంది. ప్రస్తుతం 24,000 ఉద్యోగాలు నష్టపోయే పరిస్థితి ఉండగా, 2030 నాటికి ఇది 38,000–42,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశీ సామర్థ్యాలు, పెట్టుబడులు, ద్రవ్యోల్బణం తదితర అంశాలనూ డీజీటీఆర్ తన అధ్యయనంలో భాగంగా పరిగణనలోకి తీసుకుంది.విదేశీ చౌక ఉత్పత్తుల నుంచి దేశీ పరిశ్రమను రక్షించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూటీవో సభ్య దేశాలు యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం సర్వసాధారణం. ఒక ఉత్పత్తిని సాధారణ విలువ కంటే తక్కువ ధరకు ఎగుమతి చేయడాన్ని డంపింగ్ (కుమ్మరించడం)గా భావిస్తుంటారు. చారిత్రకంగా చూస్తే 2020 వరకు డీజీటీఆర్ సిఫారసుల్లో 99.5 శాతం అమలయ్యాయి. కానీ, ఇటీవలి కాలంలో తిరస్కరణ రేటు పెరిగిపోయింది. 2025 ఏప్రిల్–నవంబర్ కాలంలో 16 శాతం సిరఫారసులనే తిరస్కరించగా, 2025 నవంబర్ నుంచి 2026 ఏప్రిల్ కాలంలో 81 శాతానికి పెరిగినట్టు డీజీటీఆర్ అధ్యయనంలో వెల్లడైంది. రూపాయి విలువ క్షీణత, తగ్గిపోతున్న విదేశీ మారకం నిల్వలు కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో కేంద్ర సర్కారు పలు చర్యలు తీసుకుంటున్న క్రమంలో డీజీటీఆర్ నివేదికలోని విషయాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
రూపాయి పతనాన్ని అడ్డుకోకూడదు..
ప్రస్తుత అంతర్జాతీయ, దేశీయ పరిస్థితుల్లో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం సబబేనని, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఇది తప్పనిసరి చర్య అని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ డాక్టర్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోకపోతే మనకు ఎకానమీని ఎలా నిర్వహించాలో తెలియదనే తప్పుడు సంకేతాలు వెళ్లేవని ఆయన అభిప్రాయపడ్డారు.అహ్లూవాలియా ఏమన్నారంటే..ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రో ధరల పెంపు సబబే. తప్పదు కూడా. లేదంటే మనకు ఎకానమీని ఎలా చక్కదిద్దాలో తెలియదనే అభిప్రాయం కలిగేది. గతంలో మేము కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాము, ప్రస్తుత ప్రభుత్వమూ ఇదే విధానాన్ని అమలు చేస్తోంది.పశ్చిమాసియా సంక్షోభం ఇంకెంత తీవ్ర రూపం దాల్చుతుందో మనకు కచ్చితంగా తెలియదు, కాబట్టి దూరదృష్టితో ఆలోచించాలి. హార్మూజ్ జలసంధి తెరుచుకునే విషయంలో స్పష్టత లేదు. నిజానికి క్రూడ్ ధరలు మరింత పెరిగితే, రానున్న రోజుల్లో పెట్రో ధరలను ఇంకా పెంచాల్సి వస్తుంది. ఎరువుల రేట్లు కూడా భారీగా ఎగబాకే అవకాశం ఉంది.మొదట్లో ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు (రూ.10) రూపంలో ప్రజలకు కాస్త ఉపశమనం కల్పించింది. ఇంకా భరిస్తే, ద్రవ్యలోటు ఎగబాకుతుంది. పెట్రో ధరలపై ప్రభుత్వ నియంత్రణ రద్దయి చాలా ఏళ్లయినా, నిజానికి అది ఇంకా కొనసాగుతూనే ఉంది.ఎకానమీ గురించి ప్రజలను భయాందోళనలకు గురి చేయను కానీ, మన ఆర్థిక వ్యవస్థకు కొన్ని బలాలతో పాటు బలహీనతలూ ఉన్నాయి. క్రూడ్ ధర పెరుగుదల ఒక్కటే దీనికి కారణం కాదు. కొన్నేళ్లుగా ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతున్నాయి, ఎగుమతుల పనితీరు అశించిన స్థాయిలో లేదు. ఇది ఎకానమీని దెబ్బతీసే ప్రమాదం ఉంది.డాలరుతో రూపాయి మారకం విలువ 100ను తాకుతుందా అనే చర్చ జరుగుతోంది. ఈ నంబర్లకు నేను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. అధిక క్రూడ్ ధరలు, దిగుమతుల భారం కారణంగా రూపాయి క్షీణత అనివార్యమే. తగ్గడానికి అనుమతించడం మంచిదే. కరెన్సీ విలువ అనేది మార్కెట్ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది, కాబట్టి దాన్ని మార్కెట్ వర్గాలకే వదిలేయాలి. రూపాయి మరీ క్షీణించిందని భావిస్తే, మార్కెట్లే తిరిగి సరైన స్థాయి చేర్చి, గాడిలో పెడతాయి. కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడానికి విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలను వాడటం సరికాదు.యూకే, ఈయూలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మంచి ఆలోచన. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆధార్ మరింత బలోపేతం అయింది. భారీ డిజిటల్ ఇన్ఫ్రాగా తీర్చిదిద్దారు. తొలుత జీఎస్టీని వ్యతిరేకించినా.. తర్వాత అమల్లోకి తెచ్చారు. ఎయిరిండియా ప్రైవేటీకరణ వంటివి చాలా కీలకమైనవి. చాలా కఠిన నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయి.జీడీపీ వృద్ధి విషయంలో మనం గమ్యానికి చాలా దూరంలో ఉన్నాం. మరిన్ని సంస్కరణలు అవసరమని ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రధాన మంత్రే స్వయంగా రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే నినాదం ఇచ్చారు. కాబట్టి, సబ్సిడీలు, సంస్కరణల విషయంలో పునఃసమీక్షకు ఇది మంచి తరుణం, అత్యవసరం కూడా. నీతి ఆయోగ్ ద్వారా లేదా ఏదైనా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి, విస్తృతంగా చర్చించాలి. ఈ మార్పుల ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
ద్రవ్యోల్బణానికి పెట్రో మంట
న్యూఢిల్లీ: ఇంధన (పెట్రోల్, డీజిల్, గ్యాస్) ధరల పెంపు, బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం పెంపుతో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 5 శాతానికి చేరుకోవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఇంధన ధరల ప్రభావం పూర్తి స్థాయిలో కనిపించేంత వరకు ఆర్బీఐ రేట్ల పెంపు విషయమై వేచిచూడొచ్చని పేర్కొన్నారు. మే 15 నుంచి విడతల వారీగా లీటర్ పెట్రోల్ ధరను రూ.7.38, లీటర్ డీజిల్ ధరను రూ.7.48 వరకు కేంద్రం పెంచడం తెలిసిందే. దీంతో పెట్రోల్, డీజిల్ను ముడిసరుకుగా వినియోగించే రవాణా తదితర రంగాలపై ఈ ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనికితోడు బంగారం, వెండి దిగుమతులపై 6 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్రం 15 శాతానికి పెంచడం తెలిసిందే. 5 శాతం దాటితే పెంచడమే! ‘‘పెట్రోలియం ఇంధన ధరలను లీటర్కు రూ.7.5 వరకు పెంచడంతో వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం 75 బేసిస్ పాయింట్లు (0.75 శాతం) వరకు పెరగొచ్చు. మే నెలకు 4–4.5 శాతం స్థాయిలో, జూన్లో 4.5–5 శాతం స్థాయిలో నమోదు కావొచ్చు. సీపీఐ పెరుగుదల అన్నది ధరల ఆధారితం. రెపో రేటులో మార్పులు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంపై పరిమిత ప్రభావమే చూపిస్తుంది. కనుక పెట్రోల్ ధరల పెంపు ప్రభావం ఒక త్రైమాసిక కాలంలో ఎలా ఉంటుందో ఆర్బీఐ పరిశీలించొచ్చు. ఒకవేళ సీపీఐ ద్రవ్యోల్బణం 5 శాతం మించిపోతుంటే ఆర్బీఐ వేచి చూడకుండా రేట్ల కఠినతరాన్ని మొదలు పెట్టొచ్చు’’ అని ఈవై ఇండియా ముఖ్య ఆర్థిక సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చు.. జూన్ సమీక్షలో రేట్ల పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని బార్క్లేస్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ఆస్థా గుడ్వాణి సైతం పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంధన ధరల పెంపుతో రవాణా ధరలు ఎగసి పలు రంగాల్లోని ఉత్పత్తులు ప్రియంగా మారతాయని.. ద్వితీయార్ధంలో ద్రవ్యోల్బణం ఎగిసిపడొచ్చన్నారు. దీంతో రేట్ల పెంపు తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు.జూన్లో యథాతథమే.. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతాన్ని మించొచ్చని, అయినప్పటికీ ఆర్బీఐ గరిష్ట పరిమితి 6 శాతంలోపే ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ మేఘా అరోరా అంచనా వేశారు. ఇంధన ధరల పెంపుతో 38 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని తెలిపారు. జూన్ 5 నాటి ఆర్బీఐ ఎంపీసీ సమావేశం రేట్లపై యథాతథ స్థితికే మొగ్గుచూపొచ్చని అరోరా సహా ఇతర ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 42 నెలల గరిష్ట స్థాయి 8.3%కి ఎగిసింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలకు స్వల్పంగా పెరిగి 3.48% స్థాయిలో ఉంది. ఇటీవల పెట్రో ధరల పెంపు, బంగారం, వెండి దిగుమతులపైనా సుంకాల పెంపుతో మే, జూన్ నెలలకు ద్రవ్యోల్బణం పెరిగిపోయే రిస్క్ ఏర్పడింది. దీంతో ఆర్బీఐ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.


