Sports
-
వైభవ్ టీమిండియా ఎంట్రీ ఖరారు
భారత క్రికెట్కు సంబంధించి ఓ సంచలన వార్త అందుతోంది. ఐపీఎల్ 2026 వీరలెవెల్లో రెచ్చిపోతున్న, యువ చిచ్చరపిడుగు, రాజస్థాన్ రాయల్స్ కెరటం వైభవ్ సూర్యవంశీ త్వరలో టీమిండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ తర్వాత జరిగే ఐర్లాండ్, జింబాబ్వే టీ20 సిరీస్లలో అతను బరిలోకి దిగడం ఖరారైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.15 ఏళ్ల వైభవ్ ఎంపికపై సెలెక్టర్లు తొలుత ముల్లగుల్లాలు (వయసు రిత్యా) పడినప్పటికీ.. ఆతర్వాత ప్రతిభే కొలమానంగా ఎంపికే చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వైభవ్ ఎంపిక కేవలం ఐపీఎల్ ఆధారంగానే కాకుండా అండర్-19 జట్టు తరఫున ప్రదర్శనలు కూడా పరిగణలోకి తీసుకొని చేయనున్నట్లు సమాచారం.వైభవ్ ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్లో విశేషంగా రాణించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ విధ్వంసకర శతకం బాదాడు. ఫలితంగా భారత్ జగజ్జేతగా అవతరించింది. వైభవ్ ఇటీవలే దేశవాలీ క్రికెట్లోకి (బిహార్ తరఫున) కూడా అరంగేట్రం చేసి, అక్కడ కూడా సత్తా చాటాడు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొన్న భారత సెలెక్టర్లు, వైభవ్ టీమిండియా ఎంపికకు ముహూర్తం ఖరారు చేశారు.ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా ఐర్లాండ్, జింబాబ్వేల్లో పర్యటించనుంది. ఈ సిరీస్లకు వైభవ్ను ఎంపిక చేసి టీమిండియాకు గ్రాండ్గా పరిచయం చేయాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ సిరీస్లలో వైభవ్కు జతగా మరో చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ ఉండవచ్చు. ఒకవేళ ఈ ఇద్దరు బరిలోకి దిగితే పసికూనలైన ఐర్లాండ్, జింబాబ్వే పరిస్థితి ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. వైభవ్-అభిషేక్ జోడీ టీ20 ఫార్మాట్లో అత్యంత భయంకరమైన ఓపెనింగ్ జోడీగా మారవచ్చని అంచనాలు ఉన్నాయి. చరిత్ర సృష్టిస్తాడుఐర్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో వైభవ్ టీమిండియా అరంగేట్రం జరిగితే సరికొత్త చరిత్ర అవుతుంది. అతి చిన్న వయసులో టీమిండియా అరంగేట్రం చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. వైభవ్ జూన్ 26న ఐర్లాండ్పై తొలి టీ20 ఆడితే, ఆ సమయానికి అతని వయసు 15 సంవత్సరాలు 91 రోజులు అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కాకపోయినా, ఐర్లాండ్, జింబాబ్వే సిరీస్ల్లో ఏ మ్యాచ్లో అరంగేట్రం చేసినా చరిత్రే అవుతుంది. ఎందుకంటే, భారత్ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 16 సంవత్సరాలు 205 రోజుల వయసులో టీమిండియా ఎంట్రీ ఇచ్చాడు. ఈ లెక్కన వైభవ్-సచిన్కు చాలా గ్యాప్ ఉంటుంది.ఆకాశమే హద్దుప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో సగటు 40, స్ట్రైక్ రేట్ 263.16తో 200 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్లలో ఒకడిగా చలామణి అవుతున్నాడు. ఈ ఎడిషన్లో వైభవ్.. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ లాంటి ప్రపంచ మేటి బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. -
సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత రియాన్ పరాగ్ వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమి రాయల్స్కు ఈ సీజన్లో మొదటిది. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి, తాజా ఓటమి తర్వాత కూడా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఈ ఓటమి తర్వాత రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీజన్లో తొలి ఓటమి కావడంతో అతనిలో పెద్దగా సీరియస్నెస్ కనిపించలేదు. తప్పిదాలను ఒప్పుకుంటూనే ఓటమిని లైట్గా తీసుకున్నట్లు మాట్లాడాడు. సింగిల్ డిజిట్ స్కోర్కే సగం వికెట్లు కోల్పోయినా, బ్యాటింగ్ డెప్త్ అంటూ గొప్పలు పోయాడు. జడేజాకు బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని, పిచ్ను అంచనా వేయలేకపోవడాన్ని సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. సన్రైజర్స్ అరంగేట్రం సీమర్లను ప్రశంసించాడు.అతని మాటల్లో.. వికెట్లు త్వరగా కోల్పోవడం మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. వారు బాగా బౌలింగ్ చేశారు. కొన్ని లెక్కలు తప్పాయి. దీన్ని ఒక చిన్న మినహాయింపుగా తీసుకుంటాం. ఎక్కువగా ఆలోచించం. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా 159 పరుగులు చేయడం మా బ్యాటింగ్ లోతుకు నిదర్శనం.పిచ్ పరిస్థితులు కొత్త బంతి కాస్త స్టికిగా అనిపించింది. షైనింగ్ తగ్గాక స్లో అయ్యింది. ఓ రకంగా ఆలోచిస్తే, మొదట బ్యాటింగ్ చేయడం మంచిదై ఉండేది. ఏదిఏమైనా మేమే ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కొత్త సీమర్లపై ప్రశంస సన్రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన సీమర్లు ఫ్రఫుల్ హింజ్, సకిబ్ హుస్సేన్కు నా అభినందనలు. వారు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రేక్షకుల ఒత్తిడి ఉన్నప్పటికీ, మొదటి నాలుగు–ఐదు ఓవర్లలో చాలా బాగా బౌలింగ్ చేశారు. నేను వారిని ఎక్కువగా చూడలేదు. కానీ ఈ ప్రదర్శన అద్భుతం. జడేజాకు బౌలింగ్ ఇవ్వకపోవడం అప్పటికి ఇషాన్ బాగా ఆడుతున్నాడు. జడ్డూ భాయ్కి బౌలింగ్ ఇవ్వకపోవడానికి కారణాలు లేవు. బిష్ణోయిని నమ్మాను. వారు మేము అనుకున్న దానికంటే 30 పరుగులు ఎక్కువ చేశారు. ఈ ఓటమిని ఇక్కడితో వదిలిపెట్టి, తదుపరి మ్యాచ్లో మంచి ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతాం. మొత్తంగా రియాన్ మాటలను బట్టి చూస్తే.. ఈ ఓటమిని లైట్గా తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. -
ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రఫుల్ హింజ్ (4-0-34-4), సకిబ్ హెస్సేన్ (4-0-24-4) అనే ఇద్దరు అరంగేట్రం పేసర్లు రాయల్స్ జైత్రయాత్రను బ్రేక్ చేసి సన్రైజర్స్కు అద్భుత విజయాన్నందించారు. ఈ క్రమంలో హింజ్ ఓ చారిత్రక రికార్డు నమోదు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పాడు.హింజ్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. అతనికి సకిబ్ కూడా జత కావడంతో రాయల్స్ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చారిత్రక పతనం దిశగా సాగింది. అయితే రవీంద్ర జడేజా (45), డొనొవన్ ఫెరియెరా (69) అనూహ్యంగా ప్రతిఘటించి ఆ పతనాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఓ చారిత్రక రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ చరిత్రలో మొదటి 5 వికెట్లు 20 పరుగుల లోపే కోల్పోయిన తర్వాత కూడా జట్టు స్కోర్ 150 పరుగుల మార్క్ను దాటిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. సన్రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో జడేజా, ఫెరియెరా ప్రతిఘటించడంతో రాయల్స్ 159 పరుగులకు ఆలౌటై, 57 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ లెక్కన రాయల్స్ ఓటమిలోనూ చరిత్ర సృష్టించింది.ఈ సీజన్లో రాయల్స్కు ఇదే తొలి ఓటమి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ జట్టుకు సన్రైజర్స్ తమ సొంతగడ్డపై బ్రేకులు వేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ఇషాన్ కిషన్ (91) శివాలెత్తడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్లాసెస్ (40) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో సలీల్ అరోరా (24 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (28) బ్యాట్ ఝులిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో హింజ్, సకిబ్ ధాటికి విలవిలలాడిపోయిన రాజస్థాన్ రాయల్స్ అతికష్టం మీద 19 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌటైంది. హింజ్, సకిబ్కు ఎషాన్ మలింగ (4-0-31-2) కూడా సహకరించాడు. రాయల్స్ తరఫున ఆఖర్లో తుషార్ దేశ్పాండే (25) సైతం బ్యాట్ ఝులిపించాడు. అయితే అప్పటికే రాయల్స్ ఓటమి ఖరారైపోయింది. -
భారత్లో మళ్లీ ఫార్ములావన్ రేసుకు ప్రయత్నాలు!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్లో ఫార్ములావన్ రేసు నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గ్రేటర్ నోయిడాలో2011, 2012, 2013లలో ఇండియన్ గ్రాండ్ప్రి పేరుతో ఎఫ్1 రేసులు జరిగాయి. అనంతరం ట్యాక్స్ చెల్లింపు రాయితీలు ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో 2014 నుంచి ఎఫ్1 రేసులు భారత్లో కొనసాగించేందుకు ఫార్ములావన్ నిర్వాహకులు ఆసక్తి చూపలేదు. ‘వచ్చే ఏడాది భారత్లో ఎఫ్1 రేసు నిర్వహించేందుకు మూడుసంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. విధివిధానాలు ఖరారు చేయడానికి ఆరు నెలలు పడుతుంది. భారత్లో ఎఫ్1 పునరాగమనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పన్ను రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మాండవీయ తెలిపారు. -
ప్రఫుల్ ప్రచండ రూపం
217 పరుగుల లక్ష్యఛేదన... అందరి కళ్లూ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే... ఎన్ని సిక్సర్లు కొడతాడు, రాజస్తాన్ ఎంత వేగంగా విజయం సాధిస్తుందనేదానిపైనే చర్చ... కానీ సన్రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే ఒక్కసారిగా దూసుకొచ్చాడు. రెండో బంతికే వైభవ్ డకౌట్... నాలుగో బంతికి జురేల్ డకౌట్... చివరి బంతికి ప్రిటోరియస్ డకౌట్... ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడటం మొదటిసారి కాగా, అరంగేట్ర మ్యాచ్లోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా ప్రఫుల్ చరిత్రకెక్కాడు. ఆపై రాజస్తాన్ స్కోరు 3 ఓవర్లలో 9 పరుగులకే 5 వికెట్లు. అంతే... అక్కడే సన్రైజర్స్ మ్యాచ్ గెలిచేసింది... మిగతా ఆటంతా ఇక లాంఛనంగానే మిగిలింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ తాజా సీజన్లో రెండు సార్లు 200కుపైగా స్కోరు చేసి కూడా ఓటమిని మూటగట్టుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి భారీ స్కోరును కాపాడుకుంది. అయితే జట్టు బలహీనతగా కనిపించిన బౌలింగ్ విభాగం ఇప్పుడు మ్యాచ్ను గెలిపించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో ఇషాన్ కిషన్ బృందం 57 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91; 8 ఫోర్లు, 6 సిక్స్లు) చెలరేగగా... హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. డొనొవాన్ ఫెరీరా (44 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్స్లు), రవీంద్ర జడేజా (32 బంతుల్లో 45; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. వీరిద్దరు ఆరో వికెట్కు 72 బంతుల్లో 118 పరుగులు జోడించి పోరాడినా అది సరిపోలేదు. కీలక భాగస్వామ్యం... అభిషేక్ శర్మ (0) వెనుదిరిగిన తర్వాత ట్రవిస్ హెడ్ (18) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఇషాన్ మెరుపు బ్యాటింగ్ను ప్రదర్శించాడు. ఆర్చర్ ఓవర్లో 4, 6 కొట్టిన అతను బర్గర్, సందీప్ ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదాడు. పవర్ప్లేలో జట్టు 51 పరుగులు చేయగలిగింది. ఇషాన్, క్లాసెన్ భాగస్వామ్యంలో రైజర్స్ ఇన్నింగ్స్ దూసుకుపోయింది. వీరిద్దరు మూడో వికెట్కు 39 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. బిష్ణోయ్ ఓవర్లో సిక్స్తో 30 బంతుల్లో కిషన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తుషార్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్తో చెలరేగిపోయిన కిషన్... ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే సెంచరీకి చేరువలో అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే క్లాసెన్ కూడా అవుట్ కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 28; 4 సిక్స్లు) దూకుడుతో స్కోరు 200కు చేరువైంది. చివర్లో సలీల్ అరోరా (13 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మరికొన్ని కీలక పరుగులు జోడించాడు. అభిషేక్ మళ్లీ డకౌట్... సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ హైదరాబాద్ అభిమానులను మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. సొంత మైదానంలో అతని మెరుపు బ్యాటింగ్ను చూసేందుకు ఎంతో ఉత్సాహంతో మైదానానికి వచ్చిన ఫ్యాన్స్ రెండో మ్యాచ్లోనూ డకౌట్ను చూడాల్సి వచ్చింది. లక్నోతో జరిగిన గత మ్యాచ్లో రెండో బంతికి సున్నా చుట్టిన అభిషేక్ ఈసారి తొలి బంతికే పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. నితీశ్ మళ్లీ మూడు సిక్స్ల మోత... హైదరాబాద్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో దిగ్వేశ్ రాఠీ వేసిన ఒకే ఓవర్లో మూడు సిక్స్లు బాదిన నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లోనూ అదే ఫీట్ను పునరావృతం చేశాడు. సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో లాంగాన్ మీదుగా రెండు వరుస సిక్స్లు బాదిన అతను అదే ఓవర్ చివరి బంతికి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్లెగ్ దిశగా మరో సిక్స్తో తన ధాటిని ప్రదర్శించాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) బిష్ణోయ్ (బి) ఆర్చర్ 0; హెడ్ (సి) ఫెరీరా (బి) పరాగ్ 18; ఇషాన్ కిషన్ (సి అండ్ బి) సందీప్ 91; క్లాసెన్ (సి) పరాగ్ (బి) తుషార్ 40; నితీశ్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 28; సలీల్ (నాటౌట్) 24; అనికేత్ (రనౌట్) 6; దూబే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 216. వికెట్ల పతనం: 1–0, 2–55, 3–143, 4–162, 5–195, 6–209. బౌలింగ్: ఆర్చర్ 4–0–37–2, బర్గర్ 4–0–31–0, సందీప్ 4–0–52–1, తుషార్ 4–0–55–1, పరాగ్ 1–0–5–1, బిష్ణోయ్ 3–0–35–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) నితీశ్ (బి) సాకిబ్ 1; వైభవ్ (సి) అరోరా (బి) ప్రఫుల్ హింగే 0; జురేల్ (బి) ప్రఫుల్ హింగే 0; ప్రిటోరియస్ (సి) నితీశ్ (బి) ప్రఫుల్ హింగే 0; పరాగ్ (సి) అభిషేక్ (బి) ప్రఫుల్ హింగే 4; జడేజా (సి) అరోరా (బి) ఇషాన్ మలింగ 45; ఫెరీరా (బి) సాకిబ్ 69; ఆర్చర్ (సి) ప్రఫుల్ హింగే (బి) సాకిబ్ 2; తుషార్ (సి) కిషన్ (బి) ఇషాన్ మలింగ 25; బిష్ణోయ్ (సి) కిషన్ (బి) సాకిబ్ 0; బర్గర్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–1, 4–2, 5–9, 6–127, 7–129, 8–140, 9–140, 10–159. బౌలింగ్: ప్రఫుల్ హింగే 4–0–34–4, సాకిబ్ 4–0–24–4, ఇషాన్ మలింగ 4–0–31–2, శివాంగ్ 3–0–28–0, నితీశ్ 2–0–19–0, హర్ష్ దూబే 2–0–22–0. -
హడలెత్తించిన ప్రఫుల్, సాకిబ్.. ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్ సంచలన బౌలింగ్కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్ఆర్హెచ్ సునాయసంగా గెలుపొందింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (91) సెంచరీ చేజార్చుకున్నప్పటికీ మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. క్లాసెన్ (40) పరుగులు చేశాడు. ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, తుషార్, పరాగ్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. డొనోవన్ ఫెరీరా (69) టాప్ స్కోరర్గా నిలవగా, జడేజా (45) పర్వాలేదనిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్లు చెరో 4 వికెట్లు పడగొట్టి రాజస్తాన్ను శాసించారు. సంచలన బౌలింగ్తో మెరిసిన ప్రఫుల్ హెంగేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: తొలి బౌలర్గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే! -
తొలి బౌలర్గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో సంచలనం నమోదైంది. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ప్రఫుల్ హింగే సంచలన ప్రదర్శనతో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపిన ప్రఫుల్ నాలుగో బంతికి ధ్రువ్ జురేల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ చివరి బంతికి ప్రిటోరియస్ను వెనక్కి పంపాడు. తద్వారా ప్రఫుల్ హింగే అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకసారి వాటిని పరిశీలిద్దాం.ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్ ఇన్నింగ్స్లో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా ప్రఫుల్ నిలిచాడు. గతంలో తొలి ఓవర్లో బౌలర్లు 32 సార్లు రెండు వికెట్లు తీసిన సందర్భాలున్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ తరఫున 2024లో ఇదే రాజస్తాన్పై భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రఫుల్ పటేల్ బౌలింగ్లో ఔటైన ముగ్గురు రాజస్తాన్ బ్యాటర్లు డకౌట్లుగానే వెనుదిరగడం విశేషం.ఐపీఎల్ చరిత్రలో తొలి ఆరు ఓవర్లలో నాలుగు అంతకంటే ఎక్కువ పడగొట్టిన బౌలర్ల జాబితాలోనూ ప్రఫుల్ హింగే చోటు దక్కించు కున్నాడు. ప్రఫుల్హింగే కంటే ముందు ఇషాంత్ శర్మ, షోయ్ అక్తర్, అజిత్ చండీలా, దావల్ కులకర్ణి, పాట్ కమిన్స్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ ఈ ఫీట్ సాధించారు.ఎవరీ ప్రఫుల్ హింగే?విదర్భకు చెందిన ప్రఫుల్ హింగే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. వేలంలో ఎస్ఆర్హెచ్ ప్రఫుల్ హింగేను రూ. 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్కు బ్యాకప్ బౌలర్గా వచ్చిన ప్రఫుల్ హింగే రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో సూపర్ ప్రదర్శన కనబరిచి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ప్రఫుల్ హింగే 10 ఫ్లస్ట్క్లాస్ మ్యాచ్లాడి 27 వికెట్లు తీశాడు. 6 లిస్ట్-ఏ మ్యాచ్లాడి 5 వికెట్లు తీశాడు. అయితే తన కెరీర్లో ఇప్పటివరకు ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడడం గమనార్హం.LADIES & GENTLEMEN - MEET PRAFUL HINGE:- The first bowler in history of the IPL to take 3 wickets in the opening over. 🥶🔥 pic.twitter.com/KuYFeai4HT— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2026🚨 HISTORY CREATED BY PRAFUL HINGE. 🚨- Hinge becomes the first bowler in 19 years of the IPL to claim 3 wickets in the opening over. 🤯🔥 pic.twitter.com/osukqE6HBg— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2026చదవండి: గోల్డెన్ డక్.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు -
గోల్డెన్ డక్.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ అభిషేక్ శర్మ తొలి బంతికే వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి రవి బిష్ణోయ్కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ అయ్యాడు. తద్వారా అభిషేక్ శర్మ తన పేరిట అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అదేంటంటే..2026 సీజన్ టీ20 క్రికెట్లో అభిషేక్ శర్మకు ఇది ఏడో గోల్డెన్ డక్. 2026 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 18 ఇన్నింగ్స్ల్లో ఏడుసార్లు గోల్డెన్ డకౌట్ అయ్యి అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు.అంతకముందు కూపర్ కన్నోలి 17 ఇన్నింగ్స్ల్లో 4 సార్లు డకౌట్గా వెనుదిరిగాడు.ఇక ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున తొలి బంతికే వెనుదిరిగిన రెండో బ్యాటర్గా అభిషేక్ శర్మ మరో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో శిఖర్ దావన్ 2018 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో తొలి బంతికే ఔటయ్యి గోల్డెన్ డక్ అయి తొలి బ్యాటర్గా నిలిచాడు.భారత్ తరఫున టీ20 క్రికెట్లో ఒకే క్యాలండర్ ఇయర్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలోనూ అభిషేక్ చోటు సంపాదించాడు. ఏడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ తొలి స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (2018లో ఆరుసార్లు), సంజూ శాంసన్ (2024లో ఆరు సార్లు), గురుకీరత్ సింగ్ (2103లో 5 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఐపీఎల్లో తొలి బంతికే వికెట్ తీయడం ఆర్చర్కు ఇది నాలుగోసారి. టీమిండియా వెటరన్ క్రికెటర్ మహ్మద్ షమీ ఐపీఎల్లో ఈ ఫీట్ను 5 సార్లు నమోదు చేయడం విశేషం.ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్ తొలి బంతికే వికెట్ తీయడం ఇది 24వ సారి. ఐపీఎల్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధికం. ముంబై ఇండియన్స్ 22సార్లు ఈ ఫీట్ నమోదు చేసింది. View this post on Instagram A post shared by IPL (@iplt20) -
ఐపీఎల్ షెడ్యూల్లో కీలక మార్పు!
ఐపీఎల్ 2026 సీజన్లో షెడ్యూల్కు సంబంధించి బీసీసీఐ కీలక మార్పు చేసింది. అహ్మదాబాద్లో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా చెన్నై సూపర్కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లకు సంబంధించి మ్యాచ్ వేదికలను స్వాప్ చేస్తూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. విషయంలోకి వెళితే.. సీజన్ తొలి దశలో ఏప్రిల్ 26న అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ మ్యాచ్ వేదికను చెన్నై చిదంబరం స్టేడియానికి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాచ్ సమయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇక మే 21 ఈ రెండు జట్లు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మరోసారి తలపడాల్సి ఉంది. తాజాగా ఈ వేదికను అహ్మదాబాద్కు మారుస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ 19వ సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ 4 మ్యాచ్ల్లో ఒక విజయంతో పట్టికలో 9వ స్థానంలో ఉండగా, గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది.చదవండి: తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్కు షాక్! -
IPL 2026: రాజస్తాన్పై ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, షకీబ్ హుస్సేన్ సంచలన బౌలింగ్కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్ఆర్హెచ్ సునాయసంగా గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ప్రఫుల్ హెంగే, సాకిబ్లు చెరో 4 వికెట్లతో మెరిశారు.ఫెరీరా అర్థసెంచరీ..రాజస్తాన్ రాయల్స్ 14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. డొనోవన్ ఫెరీరా అర్థసెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఫెరీరా (63 బ్యాటింగ్), జడేజా (43 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో జడేజా (21 బ్యాటింగ్), ఫెరీరా (24 బ్యాటింగ్) ఉన్నారు. ఐదో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ పేలవ ఆటతీరు కనబరుస్తోంది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్తాన్ 10 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఫ్రపుల్ హింగే బౌలింగ్లో 4 పరుగులు చేసిన పరాగ్ అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 4 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన షాకిబ్ హుస్సేన్ బౌలింగ్లో జైస్వాల్ (1) నితీశ్రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.తొలి ఓవర్లోనే మూడు వికెట్లు..217 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఆర్హెచ్ బౌలర్ ఫ్రపుల్ హెంగే తన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్ కాగా.. ధ్రువ్ జురేల్,, ప్రిటోరియస్ డకౌట్గా వెనుదిరిగారు. దీంతో ఒక్క పరుగు వద్దే రాయల్స్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.రాజస్తాన్ లక్ష్యం 217 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్.. రాజస్తాన్ ముంగిట 217 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 91 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, క్లాసెన్ 40 పరుగులు చేశాడు.చివర్లో సాహిల్ అరోరా (24 నాటౌట్) మెరిశాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు పూర్తిగా నిరాశపరిచారు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు తీయగా, సందీప్ శర్మ, తుసషార్ దేశ్ పాండే, పరాగ్ తలా ఒక వికెట్ తీశారు.నాలుగో వికెట్ డౌన్హెన్రిచ్ క్లాసెన్ (40) రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో షాట్కు యత్నించిన క్లాసెన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ ఔట్ రాజస్తాన్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న ఇషాన్ కిషన్ (91) సందీప్ శర్మ బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.13 ఓవర్లకు ఎస్ఆర్ఎస్ హెచ్ స్కోరు: 140/2హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్ఇషాన్ కిషన్ హఫ్ సెంచరీతో అదరొగట్టాడు. కేవలం 30 బంతుల్లో 50 పరుగుల చేశాడు. డీప్ మిడ్వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన ఇషాన్ కిషన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.హెడ్ ఔట్.. రెండో వికెట్ డౌన్రాజస్తాన్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ రియాన్ పరాగ్ బౌలింగ్లో డొనొవన్ ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆరు ఓవర్లలో ఎస్ఆర్హెచ్ స్కోరు 51/1రాజస్తాన్తో మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అయినప్పటికీ వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఇషాన్ (35 బ్యాటింగ్), హెడ్ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన్ ఎస్ఆర్హెచ్రాజస్తాన్తో మ్యాచ్లో ఆదిలోనే ఎస్ఆర్హెచ్కు గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అభిషేక్ శర్మ రవి బిష్ణోయ్ క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ఐపీఎల్ 2026 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ రాయల్స్ ఈ మ్యాచ్కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. బ్రిజేష్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్ పాండే, హెట్మైర్ స్థానంలో ప్రిటోరియస్ తుది జట్టులోకి వచ్చారు. కాగా ప్రిటోరియస్కు ఐపీఎల్లో ఇదే తొలి మ్యాచ్. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఉనాద్కట్, హర్షల్ పటేల్లను తప్పించినట్లు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తెలిపాడు. ఇక ముఖాముఖి పోరులో ఎస్ఆర్హెచ్దే పైచేయి. ఇరుజట్ల మధ్య 21 మ్యాచ్లు జరగ్గా ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్ల్లో, రాజస్తాన్ 9 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి.సన్రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్/ కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ.రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే. -
తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్కు షాక్!
ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో తన ప్రవర్తనతో అంపైర్లకు చిరాకు తెప్పించిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్కు కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాకిచ్చింది. అంపైర్లకు బంతిని అందించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా టిమ్ డేవిడ్పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.4 ప్రకారం టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించినట్లు ఐపీఎల్ కౌన్సిల్ తెలిపింది. జరిమానా విధించడం ద్వారా టిమ్ డేవిడ్ తిక్క కుదిరిందని అభిమానులు కామెంట్లు చేశారు. పాండ్యాకు జరిమానా..మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు పాండ్యాకు జరిమానా విధిస్తూ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది.‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం హార్దిక్ పాండ్యా ఆర్సీబీతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. ఈ సీజన్లో ముంబై జట్టుకు ఇదే మొదటి తప్పిదం కావడంతో కెప్టెన్ పాండ్యాకు రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని వెల్లడించింది.టిమ్ డేవిడ్ ఏం చేశాడంటే?ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. అయితే డేవిడ్ బలంగా బాదడంతో బంతి ఆకారం మారిపోయింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బంతులున్న బాక్స్ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఆ బాక్స్లో నుంచి ఒక బంతిని తీసుకొని చెక్ చేయడం ప్రారంభించాడు. అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాలని పదే పదే అడిగినప్పటికీ టిమ్ డేవిడ్ అతడిని పట్టించుకోకుండా అదే పనిగా బంతిని గాల్లోకి విసురుతూ దానిని చెక్ చేస్తూనే పోయాడు. లెగ్ అంపైర్ వీరేందర్ శర్మ వచ్చి ఇలా చేయడం తగదని వార్నింగ్ ఇవ్వడం, ఇంతలో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్కు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Casual inspection from Tim David after absolute destruction 🔥🥶#IPLRivalryWeek 2026 👉 #MIvRCB | LIVE NOW 👉https://t.co/gLbf9ggQbu | #TATAIPL pic.twitter.com/OumaLMDlYF— Star Sports (@StarSportsIndia) April 12, 2026చదవండి: ‘ఇదేనా మర్యాద.. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తోంది’ -
‘ఇదేనా మర్యాద.. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తోంది’
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటర్ టిమ్ డేవిడ్ చేసిన ఒక పని చర్చనీయాంశమైంది. ఆదివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. అయితే డేవిడ్ బలంగా బాదడంతో బంతి ఆకారం మారిపోయింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బంతులున్న బాక్స్ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఆ బాక్స్లో నుంచి ఒక బంతిని తీసుకొని చెక్ చేయడం ప్రారంభించాడు. అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాలని పదే పదే అడిగినప్పటికీ టిమ్ డేవిడ్ అతడిని పట్టించుకోకుండా అదే పనిగా బంతిని గాల్లోకి విసురుతూ దానిని చెక్ చేస్తూనే పోయాడు. లెగ్ అంపైర్ వీరేందర్ శర్మ వచ్చి ఇలా చేయడం తగదని వార్నింగ్ ఇవ్వడం, ఇంతలో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్కు ఇచ్చాడు. టిమ్ డేవిడ్ ఇదంతా ఫన్నీ మోడ్లోనే చేసినప్పటికీ చూసేవాళ్లకు మాత్రం అతడి ప్రవర్తన విసుగు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన అభిమానులు టిమ్ డేవిడ్ను ఏకిపారేశారు. ‘అంతర్జాతీయ క్రికెటర్ అయ్యుండి ఒక ఫీల్డ్ అంపైర్కు ఇచ్చే మర్యాద ఇదేనా?’ అంటూ ఒక అభిమాని ప్రశ్నించాడు. ‘అందుకే క్రికెట్లో యెల్లో, రెడ్ కార్డులు ప్రవేశపెట్టాల్సిన అవసరముంది’ అని మరొక అభిమాని కామెంట్ చేశాడు. ‘ఇలాంటి చిల్లర చేష్టలు చేయకుండా డీమెరిట్ పాయింట్ లేదా మ్యాచ్ నిషేధం విధిస్తే దారికొస్తాడని’ మరికొంతమంది కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ, ఫిల్ సాల్ట్, పటిదార్లు అర్థసెంచరీలతో మెరిశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులకు పరిమితమైంది.Casual inspection from Tim David after absolute destruction 🔥🥶#IPLRivalryWeek 2026 👉 #MIvRCB | LIVE NOW 👉https://t.co/gLbf9ggQbu | #TATAIPL pic.twitter.com/OumaLMDlYF— Star Sports (@StarSportsIndia) April 12, 2026చదవండి: ఈ లెక్కన ఎస్ఆర్హెచ్కు మూడినట్లే! -
కమిన్స్లా కాదు.. ఇషాన్ కిషన్పై జహీర్ ఖాన్ ఫైర్!
ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓడి పరాజయంతో తాజా ఎడిషన్ మొదలుపెట్టింది ఎస్ఆర్హెచ్. రెండో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఘన విజయం సాధించినా.. అదే జోరు కొనసాగించలేకపోయింది.జహీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలుసొంతమైదానం ఉప్పల్లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైన సన్రైజర్స్.. చివరగా ముల్లన్పూర్లో పంజాబ్ కింగ్స్ చేతిలోనూ చిత్తుగా ఓడిపోయింది. తదుపరి మ్యాచ్లో ఉప్పల్ వేదికగా సోమవారం రాజస్తాన్ రాయల్స్తో సన్రైజర్స్ తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ సన్రైజర్స్ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.ఆస్ట్రేలియా స్టార్, ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టుతో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని జహీర్ ఖాన్ అన్నాడు. అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా ఉన్న టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ వ్యూహాలను అమలు చేయడంలో విఫలమవుతున్నాడని విమర్శించాడు.కమిన్స్లా కాదు.. క్లారిటీ లేదు!ఈ మేరకు క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్ ఫామ్లోకి వచ్చారు. ఇషాన్ కిషన్ మాత్రం బ్యాట్తో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆరంభంలో బాగానే ఆడినా అదే జోరును కొనసాగించలేకపోతున్నాడు.కెప్టెన్గానూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ప్యాట్ కమిన్స్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. అతడి కెప్టెన్సీలో ఒక స్పష్టత ఉంటుంది. కానీ ఇషాన్ విషయంలో అది మిస్సయ్యింది. తాను ఏమనుకుంటున్నాడో జట్టుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు.తాత్కాలిక కెప్టెన్గా ఉన్న ఇషాన్ కిషన్ నాయకత్వ ప్రణాళికల్లో లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పొరపాటును సరిచేసుకుంటేనే సానుకూల ఫలితాలు వస్తాయి’’ అని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్లో ఇషాన్ కిషన్ చేసిన పరుగులు వరుసగా.. 80, 14, 1, 27.చదవండి: ‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’ -
SRH vs RR: మ్యాచ్కు వెళ్తున్నారా?.. వీటిపై నిషేధం
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ సొంతమైదానంలో మరో మ్యాచ్కు సిద్ధమైంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్ను సోమవారం ఢీకొట్టనుంది. కాగా ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్లలో సన్రైజర్స్ ఒకటి మాత్రమే గెలిచింది.ఆసక్తికర పోరుమరోవైపు.. రాజస్తాన్ నాలుగు విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. అయితే, సొంతమైదానంలో సత్తా చాటాలని సన్రైజర్స్ పట్టుదలగా ఉండగా.. రాజస్తాన్ ఫామ్ను కొనసాగించాలని భావిస్తోంది. దీంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారనుండగా.. మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. అటు రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ.. ఇటు సన్రైజర్స్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ- ట్రవిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు.ఈ నేపథ్యంలో మల్కాజిగిరి కమిషనరేట్ ప్రేక్షకులు స్టేడియానికి తీసుకురాకూడని వస్తువుల గురించి గుర్తు చేసింది. ఇందుకు సంబంధించి ఫొటో విడుదల చేసింది. నిషిద్ధ వస్తువులను తీసుకురాకూడదని హెచ్చరించింది. స్టేడియంలో వస్తువులు భద్రపరిచేందుకు ఎలాంటి క్లాక్రూమ్ అందుబాటులో ఉండదని తెలిపింది.స్టేడియానికి తీసుకువెళ్లకూడని నిషిద్ధ వస్తువులు ఇవే👉కెమెరాలు, ఇతర రికార్డింగ్ పరికరాలు👉బ్లూటూత్ హెడ్ఫోన్స్, ఇయర్ఫోన్స్, ఎయిర్పాడ్స్👉సిగరెట్లు, లైటర్, అగ్గిపెట్టె👉తుపాకులు, కత్తులు, ఇతరత్రా ఆయుధాలు👉నీళ్ల బాటిళ్లు, ఆల్కహాల్, కూల్డ్రింక్స్👉పెంపుడు జంతువులు👉తినుబండారాలు👉బ్యాక్పాక్స్, హ్యాండ్బ్యాగ్స్👉ల్యాప్టాప్స్, సెల్ఫీ స్టిక్కులు👉హెల్మెట్స్, బైనాక్యులర్స్👉పేలుడు పదార్థాలు, ఫైర్ క్రాకర్స్👉డ్రగ్స్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీపై నిషేధం? -
ఈ లెక్కన ఎస్ఆర్హెచ్కు మూడినట్లే!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భీకర ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. బరిలోకి దిగిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న ఈ బుల్లోడు 266.66 స్ట్రైక్రేట్తో 200 పరుగులకు పైగా సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు. తాను క్రీజులో ఉంటే బౌలర్ ఎవరైతే నాకేంటి.. బంతిపైనే తన దృష్టి ఉంటుందని ఇటీవలే ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం డైరెక్ట్ స్టేట్మెంట్ విడుదల చేయడం గమనార్హం. ఇప్పటివరకు రాజస్తాన్ ఆడిన ప్రతీ జట్టులో ఒక ప్రధాన బౌలర్ను వైభవ్ ఒక ఆట ఆడుకున్నాడు. చెన్నైతో మ్యాచ్లో మాట్ హెన్రీని, గుజరాత్తో మ్యాచ్లో రబాడను, ముంబైతో మ్యాచ్లో బుమ్రాను, ఆర్సీబీతో మ్యాచ్లో హాజిల్వుడ్ను లక్ష్యంగా చేసుకొని ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఇక ఇవాళ వైభవ్ సూర్యవంశీ ఎస్ఆర్హెచ్ను వారి సొంతగడ్డపైనే ఎదుర్కోనున్నాడు. బుమ్రా, హాజిల్వుడ్, రబాడ వంటి టాప్ బౌలర్లను ఉతికారేసిన వైభవ్ ముందు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చిన్నబోతోంది. కమిన్స్ లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బలహీనంగా తయారయ్యింది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ బౌలర్ లేకపోవడం మైనస్గా మారింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లోనూ ఎస్ఆర్హెచ్ బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. యావరేజ్గా చూసుకుంటే ప్రతీ ఓవర్కు 10.42 పరుగులివ్వడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్లో బౌలింగ్ పరంగా అత్యంత చెత్త ప్రదర్శన ఎస్ఆర్హెచ్దే. ఇక పేసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. హర్షల్ పటేల్, ఉనాద్కట్, ఇషాన్ మలింగలతో కూడిన పేస్ త్రయం ప్రతీ ఓవర్కు సగటున 11.47 పరుగులు సమర్పించుకున్నారు. ఈ లెక్కన ఇవాళ్టి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ మరోమారు చెలరేగితే మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలర్లకు మూడినట్లేనని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్ల బౌలర్లు హడలెత్తిపోయేలా చేస్తున్నాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇక ఐపీఎల్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరుజట్లు 21 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 12 సార్లు, రాజస్తాన్ 9 సార్లు విజయాలు అందుకున్నాయి. సీజన్లో ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ ఐదో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఒకే విజయం సాధించిన ఎస్ఆర్హెచ్ సొంతగడ్డపై రెండో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది.చదవండి: వైభవ్ సూర్యవంశీపై నిషేధం? -
వైభవ్ సూర్యవంశీపై నిషేధం?
రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్ ఫోన్లో వాడడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. రోమీ భిందర్ ఐపీఎల్ యాంటీ కరప్షన్ ప్రోటోకాల్ను ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు కూడా వినిపిస్తుడడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ ఘటనపై బీసీసీఐ కూడా సీరియస్ అయింది. "మేనేజర్గా రోమీ భిందర్ ఫోన్ తీసుకెళ్లవచ్చు. కానీ దానిని డగౌట్లో వాడకూడదు. వీడియో ఫుటేజీని, చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం" అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఇప్పటికే రోమీ భిందర్ బీసీసీఐ అనినీతి వ్యతిరేక, భద్రతా విభాగం అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఏమి జరిగిదంటే?ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ డగౌట్లో రోమీ భిందర్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాల కంట పడ్డాడు. అతడే పక్కన కూర్చున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఆ ఫోన్ స్క్రీన్ చూస్తూ కన్పించాడు. ఇందుకు సబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ కూడా తీవ్రంగా స్పందించాడు.దీంతో ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్గా తీసుకుంది. దీనిపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అంతర్గత విచారణ జరపనుంది. కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న వేళ డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. అయితే డ్రెస్సింగ్ రూమ్లో మేనేజర్ ఫోన్ ఉపయోగించవచ్చు.వైభవ్పై వేటు!కాగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే భిందర్పై జరిమానా లేదా నిషేధం పడే అవకాశం ఉంది. అలాగే పక్కన ఉండి ఫోన్ చూసిన వైభవ్ సూర్యవంశీపై కూడా బీసీసీఐ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. అతడిపై జరిమానా లేదా ఓ మ్యాచ్ నిషేధం విధించే అవకాశముందని క్రికెట్ నిపుణలు అభిప్రాయపడుతున్నారు.చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే? -
‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో శ్రేయస్ అయ్యర్ హవా కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్, బ్యాటర్గా ఈ టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్కు సారథిగా టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్.. గతేడాది పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు.అంతేకాదు 2025లో 17 మ్యాచ్లలో కలిపి 604 పరుగులు సాధించాడు అయ్యర్. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికి పంజాబ్ ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు గెలిచింది. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ నాలుగు మ్యాచ్లలో కలిపి 137 పరుగులు చేశాడు.శ్రేయస్ అయ్యర్ దుమ్ములేపుతున్నా..ఇదిలా ఉంటే.. దేశీ టీ20 ఫార్మాట్, ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ దుమ్ములేపుతున్నా.. భారత టీ20 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు. ప్రస్తుతం జట్టులో ఖాళీ లేనందునే ఈ ముంబైకర్ను పక్కనపెట్టాల్సి వస్తోందని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గతంలో పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి శ్రేయస్ అయ్యర్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంత చేసినా అయ్యర్ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే తాను నిరసనకు దిగుతానన్నాడు. ‘‘అతడు గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు.టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతాఅయినా సరే సెలక్టర్లు గనుక అతడిని జాతీయ టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే.. నాతో పాటు మిగిలిన వాళ్లు కూడా వచ్చి నిరసనకు దిగాలి. అతడి కోసం మనం ఫైట్ చేయాలి. జట్టులో చోటుకు అతడు అర్హుడు. ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు.ఇలాంటి సమయంలో శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడు జట్టులోకి వస్తే ఉపయోగకరం. అతడు జట్టులో ఉంటే టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవగలదు’’ అని మనోజ్ తివారి పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్ విషయంలో సెలక్టర్లతో మాటల యుద్ధం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే? -
అతడిని చూసి నేర్చుకో! తిలక్ వర్మపై విమర్శల వర్షం
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ముంబైకి ఇది వరుసగా మూడో పరాజయం. దీంతో హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది.ముఖ్యంగా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఫామ్ లేమి ముంబై జట్టు మేనెజ్మెట్ కలవరపెడుతోంది. ఈ ఏడాది సీజన్లో తిలక్ ఇప్పటివరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ తిలక్ నిరాశపరిచాడు. 3 బంతుల్లో కేవలం ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు.మొత్తంగా నాలుగు మ్యాచ్లు ఆడిన తిలక్ కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యలో తిలక్ వర్మపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్లా తిలక్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించలేకపోతున్నాడని శ్రీకాంత్ అన్నాడు. కాగా పాటిదార్ కూడా నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు."తిలక్ వర్మ ప్రస్తుతం ఫామ్లో లేడు. అతడికి భారీ షాట్లు ఆడే సత్తా లేదు. దూకుడుగా ఆడే బ్యాటర్ కూడా కాదు. తిలక్ వర్మ మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడే కావచ్చు, కానీ ఫిల్ సాల్ట్ లేదా రజత్ పాటిదార్ లాగా బౌలర్లను టార్గెట్ చేయలేడు. గత రెండు మూడు ఐపీఎల్ సీజన్ల నుంచి తిలక్ వర్మ ఆశించినంత మేర రాణించలేకపోయాడు.టీ20ల్లో క్రికెట్లో నిలకడ అవసరం లేదు. పది మ్యాచ్ల్లో ఏడింటిలో 30-40 పరుగులు చేయడం కంటే, నాలుగింటిలో మెరుపు ఇన్నింగ్స్లు ఆడి జట్టును ఒంటిచేత్తో గెలిపించడం మేలు. ఇప్పుడు పాటిదార్ అదే చేస్తున్నాడు. తిలక్ను లోయార్డర్లో బ్యాటింగ్కు పంపిస్తే బెటర్.160 లేదా 170 పరుగులను ఛేజ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే తిలక్ అద్భుతంగా ఆడతాడు. కానీ 200 లేదా 220 పరుగులను ఛేజ్ చేసేటప్పుడు తిలక్ వర్మ సరిపోడు" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్? -
ఏడేళ్ల తర్వాత దిగ్గజ ప్లేయర్కు పిలుపు
తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మొదటి సంతకమే ఆటగాళ్ల జీతాల పెంపు ఫైల్పై చేసిన అతను.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. షర్మిన్ సుల్తానా అనే ప్లేయర్ను ఏడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చేలా చేశాడు. షర్మిన్ చివరిగా 2019లో బంగ్లాదేశ్కు ప్రాతినిథ్యం వహించింది. ఆమె ఇటీవల ఎమర్జింగ్ ఏసియా కప్లో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించింది. షర్మిన్ గతంలో బంగ్లాదేశ్ తరఫున 13 వన్డేలు ఆడి కేవలం 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. త్వరలో శ్రీలంకతో జరుగనున్న వన్డే సిరీస్ కోసం షర్మిన్ బంగ్లా జట్టుకు ఎంపికైంది.తమీమ్ అథ్వర్యంలోని బంగ్లా సెలెక్టర్లు శ్రీలంకతో వన్డే సిరీస్కు ఇవాళ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో షర్మిన్తో పాటు మరిన్ని ఆసక్తికర ఎంపికలు జరిగాయి. వికెట్కీపర్ బ్యాటర్ జువైరియా ఫిర్దౌస్ జట్టులో చోటు దక్కించుకుంది. అయితే కెప్టెన్ నిగార్ సుల్తానా వికెట్కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఫిర్దౌస్ కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగనుంది.శ్రీలంకతో వన్డే సిరీస్ ఏప్రిల్ 20 నుంచి జరుగనుంది. ఈ మ్యాచ్లు 20, 22, 25 తేదీల్లో రాజ్షాహీ మైదానం వేదికగా జరుగనున్నాయి. అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 28, 30, మే 2 తేదీల్లో సిల్హెట్ వేదికగా జరుగనుంది. టీ20 సిరీస్కు బంగ్లా జట్టును ప్రకటించాల్సి ఉంది.శ్రీలంక సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే జట్టు..నిగర్ సుల్తానా జోటీ (సి), నహిదా అక్టర్ (విసి), ఫర్జానా హక్, శోభనా మోస్తరీ, ఫాహిమా ఖాతున్, షర్మిన్ అక్తర్ సుప్తా, రీతు మోని, షోర్నా అక్టర్, రబెయా ఖాన్, షర్మిన్ సుల్తానా, మరుఫా అక్టర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, సుల్తానా ఖాతున్, శంజిదా అక్తేర్ మగ్లా, జువైరియా ఫిర్దౌస్ -
ఆశా భోంస్లేకు నివాళులర్పిస్తూ సచిన్ కన్నీళ్లు
భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. లెజెండరీ గాయని ఆశా భోంస్లే మరణ ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆశా భోంస్లే అంత్యక్రియలు సోమవారం ముంబైలోని శివాజీ పార్క్లో జరగనున్నాయి. ప్రస్తుతం ముంబైలోని స్వగృహంలో ఆశా భోంస్లే భౌతికకాయాన్ని ఉంచారు. ఈ క్రమంలో ఆమె పార్ధివ దేహానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి నివాళులు అర్పించారు.VIDEO | Mumbai: Sachin Tendulkar gets emotional as he arrives to pay tribute to legendary singer Asha Bhosle at her residence in Grande, Lower Parel.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/lLA2qis5Nq— Press Trust of India (@PTI_News) April 13, 2026ఈ సందర్భంగా సచిన్ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఆశా భోంస్లేతో సచిన్ కుటుంబానికి దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఆమెను తన కుటుంబ సభ్యురాలిగానే సచిన్ భావించేవారు. View this post on Instagram A post shared by Times Now (@timesnow)చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే? -
LSG vs GT: అర్జున్ టెండుల్కర్ భార్య అలా.. అక్క ఇలా!
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.నిప్పులు చెరిగిన ప్రసిద్ కృష్ణఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (30) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగి లక్నో బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్18.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. శుబ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (40 బంతుల్లో 56) ఆడగా.. జోస్ బట్లర్ (37 బంతుల్లో 60), వాషింగ్టన్ సుందర్ (13 బంతుల్లో 21 నాటౌట్) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా గుజరాత్ జయభేరి మోగించింది.స్టాండ్స్లో సచిన్ కుమార్తె, కోడలుఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్, కోడలు సానియా చందోక్ ఏకనా స్టేడియానికి విచ్చేశారు. కాగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ఆరంభానికి ముందు సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ను లక్నోకు ట్రేడ్ చేసిన సంగతి తెలిసిందే.అయితే, ఇప్పటికి లక్నో నాలుగు మ్యాచ్లు ఆడినా అర్జున్ టెండుల్కర్కు ఒక్కసారి కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు. గుజరాత్తో మ్యాచ్లోనూ అతడు బెంచ్కే పరిమితం అయ్యాడు. అయినప్పటికీ అర్జున్ ఉన్న లక్నో జట్టుకు మద్దతు ఇచ్చేందుకు అతడి అక్క సారా, భార్య సానియా స్టేడియానికి రావడం విశేషం.లక్నో జెర్సీలో సానియా.. సారా మాత్రంసారా, సానియా పక్క పక్కనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. సానియా లక్నో జెర్సీ ధరించి రాగా.. సారా మాత్రం నార్మల్ కుర్తీసెట్ వేసుకుంది. దీంతో సారా ఇప్పటికీ ముంబై ఇండియన్స్నే తన ఫేవరెట్ జట్టుగా భావిస్తోందని అందుకే వేరే జెర్సీ వేసుకునేందుకు కూడా ఇష్టపడటం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం తమ్ముడు ఎలాగో తుదిజట్టులో లేడు.. అందుకే ఈసారి ఆమె గుజరాత్ కెప్టెన్ గిల్కు మద్దతు ఇచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా సారా- గిల్ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇటు సారా గానీ.. అటు గిల్ గానీ ఎప్పుడూ స్పందించలేదు.చదవండి: హార్దిక్తో విభేదాలు.. స్పందించిన కృనాల్ -
హార్దిక్తో విభేదాలు.. స్పందించిన కృనాల్
టీమిండియా స్టార్ సోదర ద్వయం కృనాల్-హార్దిక్ పాండ్యాల మధ్య గొడవలు జరుగుతున్నాయని గత కొంతకాలంగా సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) రాత్రి జరిగిన ఆర్సీబీ-ఎంఐ మ్యాచ్లో అన్నదమ్ములిద్దరూ ఎడముఖం పెడముఖంగా వ్యవహరించారు. పైగా హార్దిక్ ఔటయ్యాక కృనాల్ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు.దీంతో పాండ్యా సోదరుల మధ్య విభేదాల ప్రచారానికి బలం చేకూరింది. అన్నదమ్ముల మధ్య గతంలో ఉన్న సఖ్యత లేదని స్పష్టమైంది. మ్యాచ్ అనంతరం అన్న కృనాల్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. బరిలో ఇద్దరు పాండ్యాలు ఉన్నా, గెలవాల్సింది ఒక పాండ్యానే అంటూ కృనాల్ చేసిన వ్యాఖ్యలు హార్దిక్పై అతని వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయి. ఈ వ్యాఖ్యలను కృనాల్ వేరే ఉద్దేశంతో చేసినా, ఇందులో డబుల్ మీనింగ్ ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. అన్నదమ్ముల వివాదంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ ఎందుకు అన్నదమ్ముల మధ్య విభేదాలు..?కృనాల్-హార్దిక్ మధ్య విభేదాలు ఓ అమ్మాయి విషయంలో ఉన్నట్లు తెలుస్తుంది. హార్దిక్ తన మొదటి భార్య నటాషా స్టాంకోవిచ్కు విడాకులు ఇచ్చి మహీకా శర్మ అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. ఇది కృనాల్కు నచ్చలేదని సమాచారం. అలాగే మరో సోదరుడు (సవితి సోదరుడు వైభవ్) విషయంలోనూ వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని ప్రచారం జరుగుతుంది.ఏదిఏమైనా రామలక్ష్మనుల్లా కలిసుండే కృనాల్-హార్దిక్ వేర్వేరుగా ఉండటాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్లో హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా.. కృనాల్ ఆర్సీబీలో కీలక ఆల్రౌండర్గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్ను వారి సొంత ఇలాకాలో మట్టి కరిపించి సంబరాలు చేసుకుంది. ఈ మ్యాచ్లో హార్దిక్ (4-0-39-1, 40), కృనాల్ (4-0-26-1) ఇద్దరూ రాణించినప్పటికీ.. అన్న కృనాల్ జట్టే అంతిమంగా పైచేయి సాధించింది. -
వైభవ్ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే?
వైభవ్ సూర్యవంశీ.. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేవలం 32 బంతుల్లో శతక్కొట్టిన వైభవ్.. ఐపీఎల్లో యంగెస్ట్ సెంచరియన్గా చరిత్రను తిరగరాశాడు.గత సీజన్లో ఎక్కడైతే తన విధ్వంసాన్ని ఆపాడో ఇప్పుడు అక్కడే తిరిగి మొదలు పెట్టాడు. ఐపీఎల్-2026లో వైభవ్ దుమ్ములేపుతున్నాడు. తొలి మ్యాచ్ నుంచే తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. బౌలర్ ఎవరైనా తనకు తెలిసింది మాత్రం బంతిని బాదడం అన్నట్లగా దూసుకుపోతున్నాడు.జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఈ బిహార్ చిన్నోడు వదల్లేదు. ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జబితాలో వైభవ్(200) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ నెట్వర్త్, తదితర విషయాలపై ఓ లుక్కేద్దాం. వైభవ్ తన ఆటలోనే సంపాదనలో కూడా దూసుకుపోతున్నాడు.వైభవ్ సంపాదన ఎంతంటే?15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బిహార్లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి తన కొడుకును క్రికెటర్ను చేసేందుకు తనకున్న కొంత భూమిని కూడా అమ్మేశాడు. ఇప్పుడు వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. వైభవ్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.15 ఏళ్ల వయస్సులోనే కోటీశ్వరుడయ్యాడు. ఐపీఎల్-2025 వేలంలో రాజస్తాన్ రాయల్స్ సూర్యవంశీని రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్కు ముందు కూడా అతడిని రిటైన్ చేసుకుంది. అంటే రెండు సీజన్లకు గాను రూ. 2.20 కోట్లు జీతంగా అతడు అందుకున్నాడు.అదేవిధంగా ఐపీఎల్లో ఆడే ప్రతి మ్యాచ్కు అదనంగా రూ.7.50 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది. లీగ్ కాంట్రాక్ట్ వాటా, మ్యాచ్ ఫీజులు కలిపితే.. వైభవ్ ఒక్కో మ్యాచ్కు సుమారు రూ.15.35 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లేదా ఇతర అవార్డుల రూపంలో వచ్చే నగదు బహుమతులు ఇందుకు అదనం.డొమెస్టిక్ మ్యాచ్లు (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ), అండర్-19 మ్యాచ్ల ద్వారా కూడా బీసీసీఐ నుండి ఫీజులు పొందుతున్నాడు. అండర్-19 సిరీస్లో వైభవ్కు ఫీజు రూపంలో రోజుకు రూ.20 వేలు లభిస్తోంది. బీహార్ రంజీ ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ మ్యాచ్కు రూ.1.6 లక్షల మ్యాచ్ ఫీజు అందుకున్నాడు. ఐపీఎల్-2025లో సెంచరీ చేసినందుకు అతడికి రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించింది. అదే సీజన్లో స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. ఈ అవార్డ్ కింద రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్తో పాటు రూ. 20 లక్షల టాటా కర్వ్ ఎస్యూవీ కార్ బహుమతిగా లభించింది. అతడి వద్ద టాటా కర్వ్తో పాటు ఖరీదైన మెర్సిడెస్-బెంజ్ కారు కూడా ఉంది. మొత్తంగా అతడి నెట్ వర్త్ రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్? -
SRH తుదిజట్టులో ఊహించని బౌలర్.. 4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ!
వరుస ఓటముల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ సొంతమైదానంలో కీలక మ్యాచ్కు సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా సోమవారం రాజస్తాన్ రాయల్స్తో పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్-2026లో ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడు ఓడి సన్రైజర్స్ వెనుకబడగా.. నాలుగింటికి నాలుగూ గెలిచి రాజస్తాన్ జోరు మీదుంది.కమిన్స్ లేనిలోటు తెలుస్తోందికాబట్టి టేబుల్ టాపర్ రాజస్తాన్తో మ్యాచ్లో గెలవాలంటే సన్రైజర్స్ తీవ్రంగా శ్రమించకతప్పదు. ఈ క్రమంలో సన్రైజర్స్ తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై మంచి స్కోరు సాధించినా రైజర్స్ నిలబెట్టుకోలేకపోయింది. రెగ్యులర్ కెప్టెన్, ప్రధాన పేసర్ ప్యాట్ కమిన్స్ లేనిలోటు మరోసారి స్పష్టంగా కనిపించింది.బౌలర్ల ముల్లన్పూర్లో సన్రైజర్స్ 219 పరుగులు చేయగా.. పంజాబ్ 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ బౌలర్లు జయదేవ్ ఉనాద్కట్ (3 ఓవర్లలో 40), ఇషాన్ మలింగ (3 ఓవర్లలో 46), నితీశ్ రెడ్డి (2 ఓవర్లలో 20 పరుగులు) ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.దారుణ ప్రదర్శనశివాంగ్ కుమార్ (3 ఓవర్లలో 33) మెరుగ్గా రాణించి మూడు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే (4 ఓవర్లలో 38) ఒక వికెట్ తీయగలిగాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్తో మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు కూర్పులో.. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో మార్పులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎస్ఆర్హెచ్ పేసర్లు గత మ్యాచ్లో దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఉనాద్కట్ 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చుకోగా.. నితీశ్ రెడ్డి ఇంచుమించు అదే స్థాయిలో బౌలింగ్ చేశాడు. అయితే, బ్యాటర్గా మాత్రం ఈ ఆల్రౌండర్ ప్రదర్శన బాగుంది. దీంతో నితీశ్ రెడ్డి తుదిజట్టులో పదిలంగా ఉండటం ఖాయం.నాలుగేళ్ల తర్వాత అతడి రీఎంట్రీ?అయితే, ఉనాద్కట్ను రాజస్తాన్తో మ్యాచ్లో బెంచ్కే పరిమితం చేసి.. ఆటను మెరుగుపరుచుకునేలా సమయం ఇస్తే బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు. అతడికి బదులు టీమిండియాకు ఆడిన శివం మావిని రంగంలోకి దించితే.. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కడా తీయగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే బిహార్ ఫాస్ట్ బౌలర్ సకీబ్ హుసేన్ను ఆడించినా బాగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.కాగా 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన శివం మావి.. ఇప్పటికి 32 మ్యాచ్లు ఆడి 30 వికెట్లు తీయగలిగాడు. ఈ యూపీ పేసర్ చివరగా 2022లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగాడు. ఐపీఎల్-2026 మినీ వేలంలో సన్రైజర్స్ శివం మావిని రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. మరి రాజస్తాన్తో మ్యాచ్లో అతడికి రీఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కుతుందేమో చూడాలి!రాజస్తాన్తో మ్యాచ్కు సన్రైజర్స్ తుదిజట్టు అంచనాఅభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ/బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనాద్కట్/శివం మావి.చదవండి: BCCI: ఫోన్ చూసిన రోమీ, వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ కఠిన చర్యలు!You don’t hear it, you feel it 🔥🤌 pic.twitter.com/oynhxm0jCs— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2026 -
మరో వివాదంలో చహల్
పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. భార్యతో విడాకులు, ఆతర్వాత పలువురు అమ్మాయిలతో డేటింగ్ పుకార్లు.. కొద్ది రోజుల కిందట సిగరెట్ వివాదం, తాజాగా ఓ నటితో అసభ్య వ్యవహారం. ఇలా చహల్ అనునిత్యం ఏదో వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు.తాజా వివాదం ఏంటంటే..?చహల్.. కోల్కతాకు చెందిన నటి, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయిన తానియా చటర్జీకి ఓ మెసేజ్ పెట్టాడు. దీన్ని ఆమె సోషల్మీడియా వేదికగా బహిర్గతం చేసింది. చహల్ తన వీడియో క్లిప్లను షేర్ చేస్తూ 'cute' అని కామెంట్ చేసినట్లు ఓ వీడియో ద్వారా వెల్లడించింది. Dude wtf, Taniya chatterjee exposing yuzvendra chahal.She showing her instagram dm to paps where yuzi replied to her story and said her cute. If this is real shame on yuzvendra. pic.twitter.com/E4sYyc1uk2— Aditya. (@Adityaverce) April 12, 2026సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో చహల్ పంపిన Instagram DM చూపించింది. ఈ వీడియోలో మాట్లాడుతూ.. నేను వ్యక్తిగతంగా చహల్ను ఎప్పుడూ కలవలేదు. ఆయన మెసేజ్ రావడం ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఆ మెసేజ్కు పెద్దగా స్పందించలేదు. ఆలస్యంగా చూసినందున సంభాషణ కొనసాగలేదని తెలిపింది. ఈ వీడియోను చూసిన అనంతరం నెటిజన్లు చహల్ను తిట్టిపోస్తున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించిన వ్యక్తి ఇలాగేనా ప్రవర్తించేదంటూ ఫైరవుతున్నారు. బుద్ది మార్చుకోకపోతే ఐపీఎల్ అవకాశాలు కూడా ఉండవని హెచ్చరిస్తున్నారు.కాగా, కొద్ది రోజుల కిందట చహల్కు సంబంధించిన మరో వీడియో కూడా సోషల్మీడియాలో రచ్చ చేసింది. చహల్గా భావిస్తున్న వ్యక్తి లగ్జరీ కారులో కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. ఇంతవరకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా కాల్చిన సిగరేట్ను ఆర్పకపోవడం విమర్శలకు కారణమైంది. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాల్చడమే నేరం. అలాంటిది దాన్ని ఆర్పాలన్న సోయి కూడా లేకుండా రోడ్డుపై పడేయటాన్ని నెటిజన్లు తప్పుబట్టారు.ఇంతకీ ఎవరీ తానియా చటర్జీ..? - తానియా చటర్జీ కోల్కతాకు చెందిన నటి, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. - ఆమె గాంది బాత్సీజన్ 4, క్లాస్ ఆఫ్ 2020 సీజన్ 2 వంటి వెబ్ సిరీస్లలో నటించింది. - Ullu యాప్లో పలు సిరీస్లలోనూ కనిపించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో చహల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. వాస్తవానికి గత కొద్ది సీజన్లుగా అతని ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే జాతీయ జట్టు అవకాశాలను సైతం కోల్పోయాడు. ఈ సీజన్లో చహల్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ రేట్ కూడా చాలా ఎక్కువగా (8.20) ఉంది. -
విరాట్ కోహ్లికి ఏమైంది..? టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించినప్పటికి.. ఆర్సీబీ శిబిరంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయంపై ఆందోళన నెలకొంది. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన కోహ్లి, సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఫీల్డింగ్ రాలేదు. కోహ్లికి ఏమైంది?అతడి స్ధానంలో ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బెతల్ సబ్స్ట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి వచ్చాడు. కోహ్లి చీలమండ గాయం కారణంగా ఫీల్డింగ్కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మెడికల్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్లోనే కోహ్లికి చికిత్స అందించింది. అయితే విరాట్ గాయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అప్డేట్ ఇచ్చాడు."ప్రస్తుతానికి కచ్చితంగా విరాట్కు ఏమైందన్నది తెలియదు. కానీ అతడు ఇప్పుడు బాగానే ఉన్నాడు" అని పాటిదార్ పేర్కొన్నాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 15న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ నాటికి కోహ్లి కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన విరాట్.. 179 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్? -
కత్తిదూస్తే రాణిరుద్రమలే!
వరంగల్ స్పోర్ట్స్: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి తెగువ, ఆయుధ విద్యను ఇప్పటికీ ఓరుగల్లు ఆడబిడ్డలు వారసత్వంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కత్తిసాము(ఫెన్సింగ్) క్రీడ ఉనికి పదిలంగానే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఫెన్సింగ్ మూడో స్థానంలో నిలుస్తోంది. అభివృద్ది చెందిన నగరాలు, దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ గేమ్లో రాణిస్తున్నారు ఉమ్మడి వరంగల్కు చెందిన ఆడబిడ్డలు. రాణి రుద్రమదేవీలా కత్తి దూస్తున్న ఆ ఇద్దరి నేపథ్యమే ఈ వారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.అంతర్జాతీయ వేదికపై ప్రదర్శనవరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన గొర్రె శ్రీజ డిగ్రీ చదువుతూ మహారాష్ట్ర సాయ్ అకాడమీలో ఫెన్సింగ్లో శిక్షణ పొందుతోంది. 4వ తరగతిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చేరిన శ్రీజ 9వ తరగతి వరకు అక్కడే చదువుతూ ఫెన్సింగ్లో శిక్షణ పొందింది. అనంతరం ఎన్ఐఎస్ పంజాబ్లో సీటు సాధించి కత్తి యుద్ధంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 20కిపైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బల్గేరియా, ఇటలీలో జరిగిన చాంపియన్షిప్లో తనదైన ప్రతిభ చాటింది. ఎప్పటికై నా భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది.పది పోటీల్లో ప్రతిభహనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన కడార్ల స్కావెస్లా స్పోర్ట్స్ కోటాలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. పదో తరగతిలో ఫెన్సింగ్లో శిక్షణ ప్రారంభించిన స్కావెస్లా కేవలం ఐదేళ్లలో పదికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. మరింత మెరుగైన శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి వరంగల్ జిల్లాకు పేరు తీసుకొస్తానని స్కావెస్లా చెబుతోంది. -
ఆ ఒక్క ఓవర్.. ముంబై ఓటమికి ప్రధాన కారణం అదే!
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఆదివారం నాటి మ్యాచ్లో హార్దిక్ సేన 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా వరుసగా మూడో ఓటమితో హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది.చెత్త కెప్టెన్సీనే కారణమనిఈ నేపథ్యంలో ముంబై ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం స్పందించాడు. ఆర్సీబీతో మ్యాచ్లో ముంబై ఓటమికి హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే కారణమని ఘాటుగా విమర్శించాడు. ముఖ్యంగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ క్రీజులో ఉన్న వేళ హార్దిక్ ఎంచుకున్న బౌలింగ్ ఆప్షన్లు సరికాదని పేర్కొన్నాడు.స్పిన్ హిట్టర్ అని తెలిసీ.. ఈ మేరకు.. ‘‘సన్రైజర్స్తో 2024 నాటి మ్యాచ్ సందర్భంగా రజత్ పాటిదార్ తాను స్పిన్ హిట్టర్నని నిరూపించుకున్నాడు. మయాంక్ మార్కండే బౌలింగ్లో ఒకే ఓవర్లో నాలుగు బౌండరీలు బాదాడు. ఇక ఇప్పుడు కూడా అంతే.ఆర్సీబీ ఇన్నింగ్స్లో ముంబై స్పిన్నర్ మార్కండే పన్నెండో ఓవర్లో బౌలింగ్కు దిగగా.. విరాట్ కోహ్లి తొలుత సింగిల్ తీశాడు. ఆ తర్వాత రజత్ పాటిదార్ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. అక్కడే 18 పరుగులు రాబట్టాడు.ఆ ఒక్క ఓవర్..ఈ ఓవర్ విజయాన్ని నిర్దేశించడంలో కీలకంగా మారింది. స్పిన్నర్ల బౌలింగ్లో రజత్ పాటిదార్ హిట్టింగ్ ఆడగలడు. అలాంటిది అతడు బ్యాటింగ్కు రాగానే మార్కండేనే ఎందుకు రంగంలోకి దించినట్లు? ఇదైతే తెలివైన నిర్ణయం కానేకాదు.అసలు మార్కండే ఏం ఆలోచిస్తున్నాడో హార్దిక్ తెలుసుకున్నాడా? హైదరాబాద్లో గతంలో అతడి బౌలింగ్ను పాటిదార్ ఉతికి ఆరేశాడు. ఇక్కడ కూడా మొదటి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. ఇక ముంబై మరో స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్లోనూ ఆర్సీబీ బ్యాటర్లు అదరగొట్టారు.83 పరుగులుఇద్దరు స్పిన్నర్లు మార్కండే, సాంట్నర్ కలిసి ఏకంగా 83 పరుగులు ఇచ్చుకున్నారు. ఇందులో సాంట్నర్వి 43. వీరిద్దరి వైఫల్యం వల్లే ఆర్సీబీ భారీ స్కోరు చేయగలిగింది’’ అని అశ్విన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ సరిగ్గా లేదని విమర్శించాడు. కాగా వాంఖడే వేదికగా ముంబైతో మ్యాచ్లో పాటిదార్ కేవలం 20 బంతుల్లో 53 పరుగులు సాధించాడు.ఇక ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (36 బంతుల్లో 78), విరాట్ కోహ్లి 38 బంతుల్లో (50).. టిమ్ డేవిడ్ (16 బంతుల్లో 34 నాటౌట్) కూడా అదరగొట్టారు. ఫలితంగా ఆర్సీబీ కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లు నష్టపోయి 222 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.Back to winning ways 👏A statement victory for #RCB at the Wankhede as they defeat #MI by 1️⃣8️⃣ runs ❤️Scorecard ▶️ https://t.co/q1MGJfD2d8#TATAIPL | #KhelBindaas | #MIvRCB | @RCBTweets pic.twitter.com/n2RaM9oZyk— IndianPremierLeague (@IPL) April 12, 2026 -
అమన్కు రజతం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో చివరిరోజు భారత్కు రెండు రజతాలు, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ (61 కేజీలు), ముకుల్ దహియా (86 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... దినేశ్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్స్లో అమన్ 10–13తో క్వాంగ్ మ్యోంగ్ కిమ్ (ఉత్తర కొరియా) చేతిలో, ముకుల్ 0–7తో కామ్రాన్ ఘాసెమ్పూర్ (ఇరాన్) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్లో దినేశ్ 12–1తో తుర్దుబెకోవ్ (కిర్గిస్తాన్)పై గెలిచాడు. ఓవరాల్గా పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచి 162 పాయింట్లతో రన్నరప్గా నిలిచింది. 4 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచి 178 పాయింట్లతో ఇరాన్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ వరుసగా హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయపడడం ముంబై ఇండియన్స్ మేనెజ్మెంట్ను కలవరపెడుతోంది.241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ముంబై ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రోహిత్ శర్మ తొడ కండరాలు పట్టేశాయి. వికెట్ల మధ్య పరిగెత్తేందుకు రోహిత్ ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి రోహిత్ కుడి హ్యామ్స్ట్రింగ్కు బ్యాండేజ్ వేశాడు. కానీ ఏ మాత్రం రోహిత్ నొప్పి లేదు. దీంతో అదే ఓవర్లో రోహిత్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. రిహిత్ ఇలా మధ్యలోనే వెళ్లిపోవడంతో వాంఖడే స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. తర్వాత మరి అతడు బ్యాటింగ్కు రాలేదు. రోహిత్ స్కాన్ రిపోర్ట్లు కోసం ముంబై మేనెజ్మెంట్ ఎదురుచూస్తోంది. అతడి గాయంపై మ్యాచ్ అనంతరం ముంబై స్టార్ షేర్ఫేన్ రూథర్ఫర్డ్ అప్డేట్ ఇచ్చాడు."రోహిత్ తొడ కండరాలు పట్టేసినట్లు అన్పిస్తోంది. కానీ అధికారికంగా ఏమీ ఖరారు కాలేదు. ప్రస్తుతం అతడు మా వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడు. స్కాన్ రిపోర్ట్ల కోసం వేచి చూస్తున్నాం. రోహిత్ ఫిట్నెస్ గురించి త్వరలోనే పూర్తి సమాచారం తెలుస్తుంది" రూథర్ఫర్డ్ పేర్కొన్నాడు.ఒకవేళ రోహిత్ గాయం గ్రేడ్-1లో ఉన్నట్లయితే పూర్తిగా కోలుకోవడానికి సుమారు నాలుగు వారాల సమయం పట్టనుంది. అదే జరిగితే రోహిత్ ఐపీఎల్-2026 సీజన్ మధ్యలోనే వైదొలిగే అవకాశముంది. ఏదేమైనప్పటికి రోహిత్ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: BCCI: ఫోన్ చూసిన రోమీ, వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ కఠిన చర్యలు! -
బుమ్రాకు ఏమైంది.. ఏంటి ఈ వరుస చేదు అనుభవాలు..?
ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. ఈ స్టార్ ముంబై ఇండియన్స్ పేసర్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బుమ్రా స్థాయి బౌలర్కు ఇది ఖచ్చితంగా చేదు అనుభవమనే చెప్పాలి.గత ఎడిషన్ చివరి మ్యాచ్తో (పంజాబ్ కింగ్స్పై 4-0-40-0) కలుపుకొని బుమ్రా ఐపీఎల్లో వరుసగా ఐదు మ్యాచ్ల్లో వికెట్లు లేకుండా ఉన్నాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్లో అత్యంత పొడవైన వికెట్లేని స్ట్రీక్. ఈ పేసు గుర్రం ఐపీఎల్లో 149 మ్యాచ్లు ఆడి 183 వికెట్లు తీయగా.. ఇప్పటివరకు ఇలాంటి చేదు అనుభవం ఎన్నడూ ఎదురుకాలేదు. ఒక మ్యాచ్ కాకపోతే మరో మ్యాచ్లో అయినా అతనికి వికెట్ దక్కేది. అలాంటిది ఏకంగా ఐదు మ్యాచ్లుగా అతనికి వికెట్ లేకపోవడమనేది నిజంగా ఆశ్చర్యకరం.ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బుమ్రా 122 బంతులు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేదు. బహుశా ఏ స్థాయి క్రికెట్లో అయినా అతనికి ఇది చేదు అనుభవమే అయ్యుంటుంది. యార్కర్లు, స్లో బౌన్సర్లు, లో ఫుల్ టాస్ బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే బుమ్రా ఉన్నట్లుండి వికెట్లకు ఎందుకు ముఖం వాచాడోనని ఫ్యాన్స్ అనుకుంటున్నాడు. ఈ సీజన్లో వికెట్లు తీయలేకపోయినా, పొదుపుగా బౌలింగ్ చేయడం బుమ్రాకు ఈ సీజన్లో సానుకూలాంశం. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో అతని ఎకానమీ రేట్ 8.20గా ఉంది.తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకున్న బుమ్రా.. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్పై 3 ఓవర్లలో 32 పరుగులు.. ఢిల్లీ క్యాపిటల్స్పై 4 ఓవర్లలో 21.. కేకేఆర్పై 4 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు.ఇదిలా ఉంటే, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో బుమ్రా మినహా మిగతా బౌలర్లంతా తేలిపోవడంతో ముంబై ఇండియన్స్ భారీగా పరుగులు సమర్పించుకుంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో తడబడి 18 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా సీజన్లో హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొంది. తొలి మ్యాచ్లో కేకేఆర్పై గెలుపు తర్వాత వరుసగా ఢిల్లీ, ఆర్ఆర్, ఆర్సీబీ చేతుల్లో పరాజయాలు ఎదుర్కొని, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. తదుపరి మ్యాచ్లో ముంబై ఇదే వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్తో (ఏప్రిల్ 16) తలపడనుంది.ముంబై-ఆర్సీబీ మ్యాచ్ వివరాలు..ఆర్సీబీ- 240/4(20)ముంబై ఇండియన్స్- 222/5(20)18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయంప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: ఫిల్ సాల్ట్కీలక ప్రదర్శనలుఆర్సీబీ- ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1)ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్ఫోర్డ్ (71 నాటౌట్) -
ఫోన్ చూసిన రోమీ, వైభవ్ సూర్యవంశీ.. షాకిచ్చిన బీసీసీఐ!
రాజస్తాన్ రాయల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనినీతి వ్యతిరేక, భద్రతా విభాగం అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.అగ్రస్థానంలోఐపీఎల్-2026లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న రాజస్తాన్ రాయల్స్.. శుక్రవారం నాటి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ని చిత్తు చేసింది. తద్వారా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లు నాలుగూ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో రాయల్స్ ఓపెనర్, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ పాత్ర కీలకం.అయితే, ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ చేసిన పని వివాదానికి దారితీసింది. డగౌట్లో కూర్చుని అతడు మొబైల్ ఫోన్ను చూశాడు. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ సైతం పక్కనే కూర్చుని ఫోన్లోకి చూసినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.రంగంలోకి బీసీసీఐకాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న వేళ డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. ఇలా చేయడం ద్వారా అవినీతి నిరోధక ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించినట్లే లెక్క. ఈ నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ఈ ఘటనపై విచారణలో భాగంగా బీసీసీఐలోని యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) రోమీ భిందర్కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నలభై ఎనిమిది గంటల్లోగా.. తాను ఆరోజు ఫోన్ ఎందుకు ఉపయోగించానన్న విషయంపై రోమీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి చైర్మన్ అరుణ్ ధుమాల్ ధ్రువీకరించాడు. ‘‘ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి.. నివేదిక ఇవ్వాల్సిందిగా మేము ACSUను ఆదేశించాము’’ అని ధుమాల్ తెలిపాడు.PC: BCCIఅందుకే ఫోన్ చూశాడా?ఈ విషయంపై రోమి భిందర్ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘అనారోగ్యం కారణంగా రోమీ దాదాపుగా పది కిలోల బరువు తగ్గిపోయాడు. అతడికి ఆస్తమా కూడా ఉంది. అందుకే దూరప్రయాణాలు చేయొద్దని, మెట్లు ఎక్కడం తగ్గించాలని వైద్యులు సూచించారు.అయితే, టీమ్ మేనేజర్గా ఫ్రాంఛైజీ తరపున అతడు ఎన్నెన్నో వ్యవహారాలు చక్కబెట్టాల్సి ఉంటుంది. అతడికి నిబంధనలు తెలుసు. ఆరోజు కూడా వైద్యపరమైన కారణాల వల్లే అతడు ఫోన్ చూశాడు. హెల్త్ ఎమర్జెన్సీ సమయాల్లో డగౌట్లో కూర్చుని ల్యాప్టాప్ లేదంటే మొబైల్తో కనిపించడం తప్పేమీ కాదు.నిజానికి అతడు ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే.. ఎవరికైనా ఫోన్ చేస్తున్నట్లుగానో కనిపించలేదు. కేవలం అతడు ఫోన్ను స్క్రోల్ చేశాడంతే. ACSU విచారణలో అతడు తాను చేసిన పని గురించి వివరణ ఇవ్వగలడు. అతడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ACSU విచారణ జరుపుతుందని భావిస్తున్నాం. డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లి ఫోన్ చూసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్లాలంటే కనీసం 50 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అందుకే అతడు అక్కడే కూర్చుని ఫోన్ చూసి ఉంటాడు’’ అని పేర్కొన్నాయి.చదవండి: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా 1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026 -
అందరూ అనుకున్నట్లు కాదు, నా లెక్క వేరు.. రజత్ పాటిదార్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) రాత్రి జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్ను వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆర్సీబీకి భారీ స్కోర్ అందించారు. ఛేదనలో తడబడిన ముంబై, లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది.విజయానంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన, వ్యక్తిగత ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబైలో ఆడటాన్ని గొప్ప ఆనుభూతిగా పేర్కొన్నాడు. విరాట్ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.రజత్ మాటల్లో.. ముంబైలో, ప్రత్యేకంగా వాంఖడే మైదానంలో ఆడటం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి అభిమానులు, వాతావరణం, ఫుల్–ప్యాక్ స్టేడియంలో ఆడటం వేరే లెవెల్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ మ్యాచ్లో జట్టు ప్రదర్శన సంతృప్తిని కలిగించింది. విరాట్ భాయ్, ఫిల్ సాల్ట్ మంచి ఆరంభాన్ని ఇచ్చి మాకు డ్రైవింగ్ సీట్ ఇచ్చారు. అందుకే నేను, టిమ్ స్వేచ్ఛగా షాట్లు ఆడగలిగాము. ఇది పూర్తిగా టీమ్ ఎఫర్ట్.చాలామంది నేను స్పిన్ బౌలింగ్ను బాగా ఆడగలనని అనుకుంటారు. కానీ నిజానికి నాకు ఫాస్ట్ బౌలింగ్ ఆడటం చాలా ఇష్టం. అందులోనే నేను సౌకర్యవంతంగా ఆడగలను. ఈ పిచ్లో పేసర్లపై ఎదుర్కోవడం చాలా బాగుంది.విరాట్ భాయ్ గాయంపై నాకు పూర్తి సమాచారం లేదు. కానీ ఆయన బాగానే ఉన్నారని అనిపిస్తోంది. రజత్ మాటలను బట్టి చూస్తే.. జట్టు ప్రదర్శనపై అతను చాలా సంతృప్తిగా ఉన్నాడు. భయం లేకుండా బ్యాటింగ్ చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాడు. స్పిన్నర్ల కంటే పేసర్లనే మెరుగ్గా హ్యాండిల్ చేయగలనన్న విషయాన్ని స్పష్టం చేశాడు.కాగా, ఎంఐతో మ్యాచ్ను ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసే సమయంలోనే తమ ఖాతాలో వేసుకుంది. సాల్ట్, విరాట్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చి పవర్ ప్లేలోనే మ్యాచ్ ఫేట్ను డిసైడ్ చేసేశారు. ఆతర్వాత రజత్, టిమ్ బ్యాటింగ్ ధాటి ఆర్సీబీ గెలుపును ఖరారు చేసింది. బౌలర్లు పెద్దగా రాణించకపోయినా, అది చేసిన భారీ స్కోర్ వల్ల వచ్చిన ధీమా మాత్రమే. మొత్తంగా ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గ ప్రదర్శనలు చేస్తూ, ప్రస్తుత సీజన్లోనూ టైటిల్ దిశగా సాగుతోంది. ముంబై-ఆర్సీబీ మ్యాచ్ వివరాలు..ఆర్సీబీ- 240/4(20)ముంబై ఇండియన్స్- 222/5(20)18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయంప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: ఫిల్ సాల్ట్కీలక ప్రదర్శనలుఆర్సీబీ- ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1)ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్ఫోర్డ్ (71 నాటౌట్) -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ లెజెండ్ రోహిత్ శర్మ మరో చారిత్రాత్మక మైలురాయిని తాకాడు. క్యాష్ రిచ్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరఫున 6000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నిన్న (ఏప్రిల్ 12) వాంఖడే స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్కు ముందు రోహిత్కు ఈ మైలురాయిని చేరుకునేందుకు 6 పరుగులు కావాల్సి ఉన్నాయి. జేకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లోపుల్ షాట్తో సిక్సర్ కొట్టి ఈ ఘనత (231వ మ్యాచ్) సాధించాడు. ఈ మ్యాచ్లో 13 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 19 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..రోహిత్ శర్మ- 6002 (2 సెంచరీలు/40 అర్ద సెంచరీలు) సూర్యకుమార్ యాదవ్- 3776 (2/29)కీరన్ పొలార్డ్- 3412 (0/16)అంబటి రాయుడు- 2416 (0/14) సచిన్ టెండూల్కర్- 2334 (1/13) ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్తో కలిపి ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ చేసిన పరుగులు..- 240 మ్యాచ్ల్లో 6275 పరుగులు. - రోహిత్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (3915), పొలార్డ్ (3823) ఉన్నారు. విరాట్ కోహ్లీతో పోలిక - ఐపీఎల్లో ఒకే జట్టుకు అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. - విరాట్ ఆర్సీబీ తరఫున 271 మ్యాచ్ల్లో 8840 పరుగులు చేశారు. - IPL + CLT20 కలిపి 9264 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ చారిత్రక మైలురాయిని తాకినా, ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 222 పరుగుల వద్ద ఆగిపోయింది. ఫలితంగా ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఆర్సీబీ తరఫున ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1) అద్భుత ప్రదర్శనలు చేయగా.. ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్ఫోర్డ్ (71 నాటౌట్) చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేశారు. -
ఆర్సీబీ చేతిలో ఘోర ఓటమి.. హార్దిక్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై (వాంఖడే స్టేడియం) ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ సీజన్లో ఆ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమి తర్వాత ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమస్యలున్నట్లు చెప్పుకొచ్చాడు. పవర్ ప్లేల్లో మొమెంటమ్ లేదని అభిప్రాయపడ్డాడు. టాస్ వ్యూహంపై పునరాలోచించుకోవాలని అన్నాడు. రూథర్ఫోర్డ్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. మొత్తంగా జట్టు సమస్యలపై ఆత్మపరిశీలనకు సమయం ఆసన్నమైందని తెలిపాడు.హార్దిక్ మాటల్లో.. అవును, మేము చాలా వికెట్లు కోల్పోయాము. అదే సమయంలో బౌలింగ్లోనూ చాలా పరుగులు ఇచ్చాము. పెద్ద ఓవర్లు వేసినప్పుడు క్యాచ్ అప్ మోడ్లో ఉండిపోయాము. గత రెండు, మూడు మ్యాచ్ల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమయ్యాము.టాస్ వ్యూహంపై పునరాలోచించాలి. టాస్ గెలిచినా దాన్ని అనుకూలంగా మార్చుకోలేకపోయాము. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొత్త ఆప్షన్లను పరిశీలించాలి. పిచ్ పరిస్థితులను బట్టి మొదటి బ్యాటింగ్ చేయడం కూడా మంచిదే. పవర్ప్లేలో మొమెంటం లేదు. మొదటి ఆరు ఓవర్లలోనే గేమ్ మాకు దూరమవుతోంది. కాబట్టి పవర్ప్లేలో ఎలా మొమెంటం తెచ్చుకోవాలో చర్చిస్తున్నాము. రూథర్ఫోర్డ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. అతని ప్రదర్శన సంతృప్తినిస్తుంది. రూథర్ఫోర్డ్ను తీసుకున్నప్పుడే అతని శక్తి, సామర్థ్యం గురించి మాకు తెలుసు. ఆయన బ్యాటింగ్ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది. అవసరమైతే మార్పులు చేయడానికి కాన్ఫిడెన్స్ కూడా ఇస్తోంది. ఆర్సీబీ చేతిలో ఓటమి అనంతరం హార్దిక్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. తదుపరి మ్యాచ్ల్లో ఆ జట్టు వ్యూహాలు మార్చే అవకాశం ఉంది. వైఫల్యాలను అతను నిర్మోహమాటంగా అంగీకరించాడు. ఇదిలా ఉంటే, తాజా ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింట ఓడింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ మినహా వరుస పరాజయాలు ఎదుర్కొంది. తదుపరి మ్యాచ్ను ఆ జట్టు ఏప్రిల్ 16న ఇదే వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్తో ఆడనుంది.ముంబై-ఆర్సీబీ మ్యాచ్ వివరాలు..ఆర్సీబీ- 240/4(20)ముంబై ఇండియన్స్- 222/5(20)18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయంప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్-ఫిల్ సాల్ట్కీలక ప్రదర్శనలుఆర్సీబీ- ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1)ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్ఫోర్డ్ (71 నాటౌట్) -
ప్రసిధ్ పరాక్రమం
లక్నో: ఐపీఎల్ 19వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన తొలి పోరులో మాజీ విజేత గుజరాత్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై గెలిచింది. గత మ్యాచ్లో ముకుల్ చౌదరీ మెరుపులతో విజయం సాధించిన లక్నో... ఈ పోరులో అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్లో కనీస ప్రతిఘటన కనబర్చలేకపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ మార్క్రమ్ (21 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన బ్యాటర్లలో ఒక్కరు కూడా ఇరవై పరుగులు చేయలేకపోయారు. కెప్టెన్ రిషభ్ పంత్ (18), మార్ష్ (11), ఆయుశ్ బదోనీ (9), పూరన్ (19), అబ్దుల్ సమద్ (18), ముకుల్ చౌదరీ (18), జార్జ్ లిండే (16), షమీ (12 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (37 బంతుల్లో 60; 11 ఫోర్లు), కెప్టెన్ శుబ్మన్ గిల్ (40 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. లక్ష్యం పెద్దది కాకపోవడంతో టైటాన్స్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది.స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) సుందర్ (బి) ప్రసిధ్ 30; మార్ష్ (సి) గిల్ (బి) రబాడ 11; పంత్ (సి) తెవాటియా (బి) సిరాజ్ 18; బదోని (సి) ఫిలిప్స్ (బి) ప్రసిధ్ 9; పూరన్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 19; అబ్దుల్ సమద్ (సి) ఫిలిప్స్ (బి) అశోక్ 18; ముకుల్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 18; లిండే (సి) (సబ్) షారుక్ (బి) అశోక్ 16; షమీ (నాటౌట్) 12; అవేశ్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 164. వికెట్ల పతనం:1–14, 2–45, 3–69, 4–74, 5–109, 6–118, 7–131, 8–157. బౌలింగ్: సిరాజ్ 4–0–19–1; రబాడ 4–0–54–1; అశోక్ 4–0–32–2; ప్రసిధ్ 4–0–28–4; రషీద్ 4–0–25–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) అవేశ్ (బి) రాఠీ 15; గిల్ (సి) పంత్ (బి) ప్రిన్స్ 56; బట్లర్ (సి) మార్క్రమ్ (బి) షమీ 60; సుందర్ (నాటౌట్) 21; తెవాటియా (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–45, 2–129, 3–135. బౌలింగ్: షమీ 4–0–36–1; ప్రిన్స్ 4–0–31–1; దిగ్వేశ్ రాఠీ 4–0–31–1; లిండే 3–0–28–0; అవేశ్ 2–0–24–0; మార్క్రమ్ 1.4–0–15–0. -
భళా బెంగళూరు
ముంబై: టాప్–3 బ్యాటర్ల దూకుడుకు బౌలర్ల సహకారం తోడవడంతో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్లో మూడో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్లో రాజస్తాన్ దూకుడు ముందు నిలువలేకపోయిన బెంగళూరు... ముంబైపై సమష్టిగా సత్తా చాటింది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు 18 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్పై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్స్లు), విరాట్ కోహ్లి (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రజత్ పాటీదార్ (20 బంతుల్లో 53; 4 ఫోర్లు, 5 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (16 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 222 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్), రికెల్టన్ (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 33; 5 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. భారీ ఛేదనలో ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి లయ దొరకబుచ్చు కోలేకపోయింది. ఆఖర్లో రూథర్ఫోర్డ్ (31 బంతుల్లో 71 నాటౌట్; 1 ఫోర్, 9 సిక్స్లు) ధనాధన్ షాట్ల విరుచుకుపడినా అది ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగడం కూడా ఫలితంపై ప్రభావం చూపింది. బెంగళూరు బౌలర్లలో సుయాశ్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. ముంబై స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకొని బెంగళూరు భారీ షాట్లతో విరుచుకుపడగా... బెంగళూరు స్పిన్నర్లు పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) హార్దిక్ (బి) శార్దుల్ 78; కోహ్లి (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 50; రజత్ (సి) తిలక్ (బి) సాంట్నర్ 53; టిమ్ డేవిడ్ (నాటౌట్) 35; జితేశ్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 10; షెఫర్డ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 240. వికెట్ల పతనం: 1–120, 2–185, 3–194, 4–231. బౌలింగ్: బౌల్ట్ 4–0–50–1; హార్దిక్ 4–0–39–1; బుమ్రా 4–0–35–0; సాంట్నర్ 4–0–43–1; మార్కండే 2–0–40–0; శార్దుల్ 2–0–32–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) భువనేశ్వర్ (బి) సుయాశ్ 37; రోహిత్ (రిటైర్డ్ హర్ట్) 19; సూర్యకుమార్ (సి) రసిక్ (బి) కృనాల్ 33; తిలక్ వర్మ (సి) డఫీ (బి) సుయాశ్ 1; హార్దిక్ (సి) షెఫర్డ్ (బి) డఫీ 40; రూథర్ఫోర్డ్ (నాటౌట్) 71; నమన్ ధీర్ (సి) రజత్ (బి) రసిక్ 1; సాంట్నర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–72, 2–74, 3–121, 4–145, 5–154. బౌలింగ్: డఫీ 4–0–58–1; భువనేశ్వర్ 4–0–38–0; రసిక్ సలామ్ 2.5–0–23–1; కృనాల్ 4–0–26–1; సుయాశ్ 4–0–47–2; షెఫర్డ్ 1.1–0–28–0. -
ఆర్సీబీ జోరు.. ముంబైకి హ్యాట్రిక్ ఓటమి
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుసగా హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. ఆదివారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హార్దిక్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేయగల్గింది.ముంబై బ్యాటర్లలో షెర్ఫేన్ రూథర్ఫర్డ్(71 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(40), ర్యాన్ రికెల్టన్(37), సూర్యకుమార్ యాదవ్(33) ఫర్వాలేదన్పించారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు, జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా తలా వికెట్ సాధించారు.సాల్ట్, పాటిదార్ విధ్వంసం..అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 78) టాప్ స్కోరర్గా నిలవగా.. రజత్ పాటిదార్(53), విరాట్ కోహ్లి(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరితో పాటు టిమ్ డేవిడ్(16 బంతుల్లో 34) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, శార్థూల్ ఠాకూర్, మిచెల్ శాంట్నర్ తలా వికెట్ సాధించారు. -
ఆర్సీబీ కెప్టెన్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ?
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు ముంబై బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 17 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఐపీఎల్లో పాటిదార్కు ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న పాటిదార్.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్తో పాటిదార్ ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానానికి దూసుకెళ్లాడు. పాటిదార్ ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో 65 సగటుతో 195 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్(214.29) జట్టులోని ఇతర విధ్వంసకర బ్యాటర్లైన టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. అదేవిధంగా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన కెప్టెన్గా ఆడమ్ గిల్క్రిస్ట్ రికార్డును సమం చేశాడు. 2009 సీజన్లో డక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా 17 బంతుల్లో ఆర్ధశతకం సాధించాడు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత గిల్లీ రికార్డును పాటిదార్ సమం చేశాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పాటిదార్తో పాటు ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 78), విరాట్ కోహ్లి(53), డేవిడ్(34) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా, శాంట్నర్, ఠాకూర్ తలా వికెట్ సాధించారు.చదవండి: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లి హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఫిల్ సాల్ట్తో ఆర్సీబీ ఇన్నింగ్స్ను ప్రారంభించిన విరాట్.. ముంబై బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.తొలుత దూకుడుగా ఆడిన కోహ్లి, మిడిల్ ఇన్నింగ్స్లో కాస్త నెమ్మదించాడు. ఫిల్ సాల్ట్తో కలిసి తొలి వికెట్ ఏకంగా 124 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నమోదు చేశాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 50 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో కింగ్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవేఐపీఎల్లో ముంబై ఇండియన్స్పై 1000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్గా విరాట్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్, సీఎస్కేపై 1000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు.అదేవిధంగా టీ20ల్లో అత్యధిక సెంచరీ (100+) భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆయన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(29), పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం(28)లను కోహ్లి అధిగమించాడు. -
పూరన్ సరికొత్త చరిత్ర.. రాహుల్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లోనూ పూరన్ తీవ్ర నిరాశపరిచాడు. అయూశ్ బదోని ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పూరన్ గుజరాత్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. 21 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 2 సిక్స్ల సాయంతో 19 పరుగులు చేశాడు.అయితే పూరన్ జిడ్డు ఇన్నింగ్స్ ఆడినప్పటికి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఈ కరేబియన్ ఆటగాడు లక్నో తరపున ఇప్పటివరకు 47 మ్యాచ్ల్లో 1422 పరుగులు సాధించాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ లక్నో తరపున 38 మ్యాచ్ల్లో 1410 పరుగులు నమోదు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో రాహుల్ను పూరన్ అధిగమించాడు.లక్నో తరపున టాప్-3 రన్ స్కోరర్లు వీరేనికోలస్ పూరన్-1422కేఎల్ రాహుల్-1410ఆయుష్ బదోని-1038చదవండి: IPL 2026: 'అతడే మన బెస్ట్ బౌలర్.. గెలిచే మ్యాచ్లను దగ్గరుండి ఓడిస్తాడు' -
రాణించిన ప్రసిద్ద్, గిల్, బట్లర్.. లక్నోను చిత్తు చేసిన గుజరాత్
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యహ్నం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. రబాడ (4-0-54-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. రషీద్ ఖాన్ (4-0-25-0) వికెట్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశాడు. లక్నో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో మిచెల్ మార్ష్ 11, పంత్ 18, బదోని 9, పూరన్ 19, అబ్దుల్ సమద్ 18, ముకుల్ ఛౌదరి 18, జార్జ్ లిండే 16, షమీ 12 (నాటౌట్), ఆవేశ్ ఖాన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. శుభ్మన్ గిల్ (56), బట్లర్ (60) అర్ద సెంచరీలతో రాణించి గుజరాత్ను గెలిపించారు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించి వేగంగా మ్యాచ్ను ముగించాడు. మిగతా ఆటగాళ్లలో సాయి సుదర్శన్ 15, తెవాతియా 10 (నాటౌట్) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ తలో వికెట్ తీశారు. -
ముంబైపై ఆర్సీబీ ఘన విజయం
MI vs RCB Live Updates: ఐపీఎల్-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.ఆర్సీబీ ఘన విజయంఆర్సీబీ తిరిగి గెలుపు బాట పట్టింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో షెర్ఫేన్ రూథర్ఫర్డ్(71 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(40), ర్యాన్ రికెల్టన్(37), సూర్యకుమార్ యాదవ్(33) ఫర్వాలేదన్పించారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు, జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా తలా వికెట్ సాధించారు.ముంబై నాలుగో వికెట్ డౌన్ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. జాకబ్ డఫీ బౌలింగ్లో ఔటయ్యాడు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. కృనాల్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 46 బంతుల్లో 120 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో ముంబై రెండు వికెట్లు డౌన్ముంబై ఇండియన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్లో తొలి బంతికి ర్యాన్ రికెల్టన్(37) ఔట్ కాగా.. ఐదో బంతికి తిలక్ వర్మ(1) ఔటయ్యారు. 9 ముంబై ఇడియన్స్కు స్కోర్: 85/2రోహిత్ రిటైర్డ్ హార్ట్ముంబైకి భారీ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 7 ఓవర్లకు ముంబై స్కోర్: 72/0దూకుడుగా ఆడుతున్న ముంబై ఓపెనర్లు3 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్టన్(29), రోహిత్ శర్మ(9) ఉన్నారు.దుమ్ములేపిన ఆర్సీబీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు బీభత్సం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 78) టాప్ స్కోరర్గా నిలవగా.. రజత్ పాటిదార్(53), విరాట్ కోహ్లి(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరితో పాటు టిమ్ డేవిడ్(16 బంతుల్లో 34) మెరుపులు మెరిపించాడు.ఆర్సీబీ మూడో వికెట్ డౌన్రజత్ పాటిదార్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేసిన పాటిదార్.. శాంట్నర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 194/3ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 38 బంతుల్లో 58 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. 14.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 185-2ఆర్సీబీ తొలి వికెట్ డౌన్ఫిల్ సాల్ట్ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 36 బంతుల్లో 78 పరుగులు చేసిన సాల్ట్.. శార్థూల్ ఠాకూర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 167/1. క్రీజులో విరాట్ కోహ్లి(47), రజత్ పాటిదార్(9 బంతుల్లో 34)ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు7 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(49), విరాట్ కోహ్లి(24) ఉన్నారు.3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 33/03 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(13), ఫిల్ సాల్ట్(17) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ప్లేయింగ్ ఎలెవన్లోకి మిచెల్ శాంట్నర్, మయాంక్ మార్కండే వచ్చారు. మరోవైపు ఆర్సీబీ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. జోష్ హాజిల్వుడ్కు విశ్రాంతి ఇవ్వగా జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా -
అరుదైన మైలురాయిని తాకిన గిల్.. కోహ్లి కంటే వేగంగా..!
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 12) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో గిల్ 4000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.గిల్ ఈ మైలురాయిని 118వ ఇన్నింగ్స్లో చేరుకోగా.. రాహుల్ 105, క్రిస్ గేల్ 112, డేవిడ్ వార్నర్ 114, జోస్ట్ బట్లర్ 116 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితా టాప్-5లో గిల్ రెండో భారత ప్లేయర్గా నిలిచాడు. దిగ్గజం విరాట్ కోహ్లికి ఈ మైలురాయిని తాకేందుకు 128 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. గిల్ అతని కంటే వేగంగా ఈ ఘనత సాధించాడు.బంతుల ప్రకారం చూస్తే.. అత్యంత వేగంగా 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్లో ఉండగా.. దిగ్గజం విరాట్ కోహ్లి టాప్-5లో కూడా లేడు.అత్యంత వేగంగా (బంతులు) 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు..సూర్యకుమార్ యాదవ్- 2714శుభ్మన్ గిల్- 2875సురేష్ రైనా- 2886 ఎంఎస్ ధోని- 2887 సంజూ శాంసన్- 2915మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతోంది. -
IPL 2026: రాకాసి బౌన్సర్ దెబ్బకు పుర్రె పగిలిపోయేది..!
లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ ఛౌదరి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 2026 ఎడిషన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఫాస్ట్ బౌలర్ అశోక్ కుమార్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ ముకుల్ ఛౌదరి తలను బలంగా తాకింది. గంటకు 150 కిమీ వేగంతో వచ్చిన ఆ బంతి ముకుల్ హెల్మెట్ను తగిలి థర్డ్ మన్ దిశగా చాలా దూరం వెళ్లింది. దీన్ని బట్టి బంతి ఎంత వేగంగా వచ్చిందో అంచాన వేయవచ్చు. pic.twitter.com/c7dQanPPqN— crictalk (@crictalk7) April 12, 2026ఈ దెబ్బకు హెల్మెట్ ఉన్నా, ముకుల్ దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన తర్వాత మైదానం మొత్తం ఒక్క క్షణం నిశబ్దం ఆవహించింది. ఫిజియో హుటాహుటిన వచ్చి ముకుల్కు కంకషన్ టెస్ట్ చేశాడు. అదృష్టవశాత్తూ ముకుల్కు ఎలాంటి అపాయం జరగలేదు. ఒకవేళ ఆ బంతి హెల్మెట్ కవర్ చేయని ప్రాంతంలో తగిలి ఉంటే, ముకుల్ పరిస్థితి ఏంటో అంచనా వేయడం కష్టంగా ఉండేది. ఒకవేళ ముకుల్ హెల్మెట్ లేకుండా బరిలోకి దిగుంటే అతని పుర్రె పగిలిపోయేది. అశోక్ ఎంత వేగవంతమైన బౌలరో ఇదివరకే రుజువైంది. ఈ సీజన్తోనే అరంగేట్రం చేసిన అతను.. క్రమం తప్పకుండా 150 కిమీ వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బంతి (154.2) కూడా అశోక్ ఖాతాలోనే ఉంది.ముకుల్ విషయానికొస్తే.. ఇతగాడు గత మ్యాచ్లో (కేకేఆర్పై) లక్నోను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపుపై ఎమాత్రం అంచనాలు లేని సమయంలో 27 బంతుల్లో 54 పరుగులు చేసి లక్నోకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్లో ముకుల్ కొట్టిన 7 సిక్సర్లు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్తో ముకుల్ వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు. ముకుల్ కూడా ధోని తరహాలోనే వికెట్కీపింగ్ బ్యాటర్గా ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతుంది. -
'అతడే మన బెస్ట్ బౌలర్.. గెలిచే మ్యాచ్లను దగ్గరుండి ఓడిస్తాడు'
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ వైఫల్యం కొనసాగుతోంది. బ్యాటింగ్లో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ, బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు పెద్ద మైనస్గా మారింది. శనివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది.220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ప్రస్తుత జట్టులో సీనియర్ పేసర్గా ఉన్న జయదేవ్ ఉనద్కట్ దారుణంగా విఫలమవుతున్నాడు. గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అయితే జయదేవ్ పూర్తిగా తేలిపోయాడు.సరైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్లో అతడు తీవ్రంగా శ్రమించాడు. పంజాబ్ బ్యాటర్లు అతడి బౌలింగ్ను ఓ ఆట ఆడుకున్నాడు. ఉనద్కట్ తన మూడు ఓవర్ల కోటాలో 13.30 ఏకానమీతో 40 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో కూడా అతడు విఫలమయ్యాడు.ఆ మ్యాచ్లో అయితే ఉనద్కట్ 3.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. ఈ రెండు మ్యాచ్లలో కూడా అతడు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. మొత్తంగా అతడు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడి 4 వికెట్లు సాధించాడు. జయదేవ్ ఏకానమీ రేటు 10.90గా ఉంది.దీంతో ఇంతదారుణంగా విఫలమవుతున్నప్పటికి అతడిని ప్లేయింగ్ ఎలెవన్లో కొనసాగించడం పట్ల ఎస్ఆర్హెచ్ అభిమానులు మండిపడుతున్నారు. ఉనద్కట్ను సైతం ట్రోల్ చేస్తున్నారు. "బ్యాటింగ్లో కోహ్లి రన్ మిషన్ అయితే, బౌలింగ్లో ఉనద్కట్ ఒక రన్ మిషన్" అంటూ పోస్ట్లు పెడుతున్నారు. 'జయదేవ్ ఉనద్కట్ మన బెస్ట్ బౌలర్.. గెలిచే మ్యాచ్లను దగ్గరుండి ఓడిస్తాడు' అని మరొక నెటిజన్ ఈ సెటైరికల్ పోస్ట్ చేశాడు. అతడి స్ధానంలో ప్రఫుల్ హింగే, ఓంకర్ తర్మాలే వంటి యువ పేసర్లకు అవకాశమివ్వాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. తదుపరి మ్యాచ్కైనా ఉనద్కట్పై ఎస్ఆర్హెచ్ వేటు వేస్తుందో లేదో చూడాలి.చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! ఒకవేళ అదే జరిగితే? -
IPL 2026: కేకేఆర్కు బిగ్ న్యూస్
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్కు బిగ్ న్యూస్ అందింది. రూ. 18 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న శ్రీలంక పేసర్ మతిష పతిరణ త్వరలో జట్టులో చేరబోతున్నాడు. సొంత దేశ క్రికెట్ బోర్డు (SLC) నుంచి అతనికి NOC లభించింది. గాయం కారణంగా పతిరణ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. తాజాగా అతను ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసి, SLC అనుమతితో ఐపీఎల్ 2026లో అడుగుపెట్టబోతున్నాడు.ఏప్రిల్ 14న సీఎస్కేతో జరుగబోయే మ్యాచ్కు అతను అందుబాటులో ఉండనున్నాడు. పతిరణ రాక కేకేఆర్ బౌలింగ్ విభాగానికే కాకుండా జట్టు యావత్తుకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు హర్షిత్ రాణా, ఆకాశ్దీప్ సేవలు కోల్పోయి పేలవ ప్రదర్శనలు చేస్తుంది. ఇప్పుడు పతిరణ రాక కేకేఆర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.కాగా, ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆ జట్టుకు అదృష్టం కూడా కలిసి రావడం లేదు. గెలవాల్సిన మ్యాచ్ల్లో ఓటమిపాలవడంతో పాటు ఓ మ్యాచ్ అన్యాయంగా వర్షార్పణం అయ్యింది.ఇదిలా ఉంటే, పతిరణ గైర్హాజరీలో విదేశీ పేసర్గా జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ పలు మ్యాచ్లు ఆడాడు. అయితే అతని నుంచి ఆశించి ఫలితాలు రాకపోవడంతో కేకేఆర్కు చేదు అనుభవాలు మిగిలాయి. చివరికి గాయంతో బాధపడుతున్న గ్రీన్తో బౌలింగ్ చేయించినా సానుకూల ఫలితాలు రాలేదు. సీజన్ ప్రారంభానికి ముందే ముస్తాఫిజుర్ రూపంలో కేకేఆర్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! ఒకవేళ అదే జరిగితే?
ఐపీఎల్-2026లో శుక్రవారం(ఏప్రిల్ 10) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాజస్తాన్ గెలుపొందినప్పటికి.. ఆ జట్టు మేనేజర్ రోమీ భిందర్ చేసిన ఒక చిన్న పొరాటు ఇప్పుడు వివాదానికి దారితీసింది.మ్యాచ్ జరుగుతుండగా రోమీ భిందర్ డగౌట్లో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి మొబైల్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ఇందుకు సబంధించిన వీడియోను తొలుత ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం పూర్తిగా నిషేధం. ఈ ఘటనపై ఐపీఎల్ ఫౌండర్, మాజీ చైర్మెన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు. అవినీతి నిరోధక, భద్రతా విభాగం అధికారులు అప్పుడు ఏం చేస్తున్నారని అతడు ఎక్స్లో రాసుకొచ్చాడు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు.రోమీ భిందర్ 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా' నిబంధనలను ఉల్లంఘించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో సెల్ ఫోన్ వాడకం నిషేధం. ఇది పొరపాటున జరిగి ఉండవచ్చు. కానీ అతడు నిబంధనలు ఉల్లంఘించనందున చర్యలు తప్పవు. మ్యాచ్ రిఫరీ, అవినీతి నిరోధక విభాగం నివేదిక ఆధారంగా జరిమానా ఉంటుందా లేదా మ్యాచ్ నిషేధం ఉంటుందా అనేది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐ పేర్కొన్నారు. కాగా మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తన "లోకల్ గార్డియన్" అని రోమీ భిందర్ను పేర్కొనడంతో, ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ యాంటి కరప్షన్ యూనిట్ నివేదిక ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ అతడిపై చర్యలు తీసుకోనుంది. నివేదిక ఆధారంగా భారీ జరిమానా లేదా కొన్ని మ్యాచ్ల పాటు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్లోకి రాకుండా నిషేధం విధించే ఛాన్స్ ఉంది.మరోవైపు రుమీ బిందర్ పక్కన ఉండి ఫోన్ చూసిన 15 వైభవ్ సూర్యవంశీపై కూడా బీసీసీఐ స్వల్ప జరిమానాను విధించే అవకాశం ఉందని టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది.చదవండి: Sanju Samson: చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు -
లక్నోపై గుజరాత్ గెలుపు
లక్నోపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం లక్నో 164/8(20) గుజరాత్ 165/3(18.4)లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్165 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ లక్ష్యం దిశగా సాగుతుంది. 8 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టానికి 69 పరుగులుగా ఉంది. గిల్ (40), బట్లర్ (14) క్రీజ్లో ఉన్నారు. గుజరాత్ టార్గెట్ 165టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీసి లక్నోను దెబ్బ తీశాడు. ఏడో వికెట్ కోల్పోయిన లక్నో18.1వ ఓవర్- 131 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి ముకుల్ చౌదరి (18) ఔటయ్యాడు.ఐదో వికెట్ కోల్పోయిన లక్నో14.3వ ఓవర్-109 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి పూరన్ (19) ఔటయ్యాడు.నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నోలక్నో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 96 పరుగులుగా ఉంది. పూరన్ (6), సమద్ (17) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో4.1వ ఓవర్- 45 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో తెవాతియాకు క్యాచ్ ఇచ్చి పంత్ (18) ఔటయ్యాడు. మార్ష్ (11) ఔట్1.3వ ఓవర్- 14 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ ఇంపాక్ట్ సబ్స్: షారుక్ ఖాన్, మానవ్ సుతార్, జాసన్ హోల్డర్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్స్: మణిమారన్ సిద్ధార్థ్, జార్జ్ లిండే, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్ -
రోహిత్, విరాట్ సరసన సంజూ
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్లో సీఎస్కే సింగం సంజూ శాంసన్ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో సంజూ జూలు విదిల్చి సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సంజూతో పాటు బౌలింగ్లో జేమీ ఓవర్టన్ (4-0-18-4), అన్షుల్ కంబోజ్ (4-0-35-3) సత్తా చాటడంతో ఢిల్లీపై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది.ఈ మ్యాచ్లో అద్భుత శతకంతో చెలరేగిన సంజూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో పాటు పలు రికార్డులు సాధించాడు. ఇందులో ఓ భారీ సిక్సర్ల రికార్డు సైతం ఉంది. అదేంటంటే.. ఈ మ్యాచ్లో 4 సిక్సర్లు బాదిన అనంతరం టీ20ల్లో సంజూ సిక్సర్ల సంఖ్య క్వాడ్రపుల్ సెంచరీకి (400) చేరింది.పొట్టి క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత అరుదైన మైలురాయి. ఇప్పటివరకు ఈ మైలురాయిని కేవలం 29 మంది మాత్రమే (సంజూతో కలుపుకొని) తాకారు. భారత్ తరఫున సంజూకు ముందు కేవలం ముగ్గురు మాత్రమే ఈ మైలురాయిని అధిగమించారు. వీరిలో రోహిత్ శర్మ (554), విరాట్ కోహ్లి (440), సూర్యకుమార్ యాదవ్ (421) వంటి సిక్స్ హిట్టింగ్ మిషన్లు ఉన్నారు. ఇప్పుడు సంజూ బాబా వీరి సరసన చేరాడు. ఓవరాల్గా పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ (1056) చలామణి అవుతున్నాడు. అతనికి చాలా దూరంలో కీరన్ పోలార్డ్ (982), ఆండ్రీ రసెల్ (784) తదితర విండీస్ యోధులు ఉన్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 9, విరాట్ కోహ్లి 21, సూర్యకుమార్ యాదవ్ 23, సంజూ శాంసన్ 29 స్థానాల్లో ఉన్నారు. -
ఎవరికీ సాధ్యంకాని ఘనతను సాధించిన సంజూ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ (115 నాటౌట్) సూపర్ సెంచరీ సాధించి సీఎస్కేకు తొలి విజయాన్ని అందించాడు. సంజూ రాజస్థాన్ నుంచి సీఎస్కేకు మారిన తర్వాత ఇది తొలి సెంచరీ. ఈ సెంచరీతో అతను చాలా రికార్డులు సాధించాడు.ఇందులో ముఖ్యమైనది..సంజూ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు (ప్రస్తుత సెంచరీతో కలుపుకొని) చేయగా.. అందులో ప్రతి సెంచరీ సీజన్లో మొట్టమొదటిదిగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. తాను చేసిన నాలుగు సెంచరీలు సీజన్లో మొదటివి కావడం సంజూకు మాత్రమే సాధ్యమైంది. 2017, 2019, 2021, 2026 సీజన్లలో మొదటి సెంచరీలను సంజూనే చేశాడు. తద్వారా సీజన్లో తొలి సెంచరీలను ఎక్కువ సార్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి సంజూ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ ఉన్నాడు. మెక్కల్లమ్ 2008, 2015 సీజన్లలో తొలి సెంచరీలు చేసి, సీజన్లో తొలి సెంచరీలు అత్యధిక సార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ తర్వాతి స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత చాలామంది ఆటగాళ్లు సీజన్లో తొలి సెంచరీలు చేశారు.ప్రతి ఐపీఎల్ సీజన్లో తొలి సెంచరీ చేసిన ఆటగాళ్లు.. 2008- బ్రెండన్ మెక్కల్లమ్2009- ఏబీ డివిలియర్స్2010- యూసఫ్ పఠాన్2011- పాల్ వాల్తాటి2012- అజింక్య రహానే2013- షేన్ వాట్సన్2014- లెండిల్ సిమన్స్2015- బ్రెండన్ మెక్కల్లమ్2016- క్వింటన్ డికాక్2017- సంజూ శాంసన్2018- క్రిస్ గేల్2019- సంజూ శాంసన్2020- కేఎల్ రాహుల్2021- సంజూ శాంసన్2022- జోస్ బట్లర్2023- హ్యారీ బ్రూక్2024- విరాట్ కోహ్లి2025- ఇషాన్ కిషన్2026- సంజూ శాంసన్పై రికార్డు కాకుండా ఈ సెంచరీతో సంజూ మరో భారీ రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్ల తరఫున సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. సంజూ ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్ (2), సీఎస్కే ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు. సంజూకు ముందు కేఎల్ రాహుల్ ఈ ఘనతను సాధించాడు. రాహుల్ పంజాబ్, లక్నో, ఢిల్లీ ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు. -
ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది. సీనియర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, మధుర, ప్రగతిలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 233–232 (59–58, 55–59, 59–57, 60–58) పాయింట్ల తేడాతో అలెక్సిస్ రుయిజ్, పియర్స్, ఒలివియా డీన్లతో కూడిన అమెరికా జట్టును ఓడించింది. ఓవరాల్గా సురేఖ కెరీర్లో ఇది 12వ ప్రపంచకప్ పసిడి పతకం కావడం విశేషం. తొలి రౌండ్ నుంచే భారత్, అమెరికా ఢీ అంటే ఢీ అన్నట్ల పోటీపడ్డాయి. తొలి రౌండ్లో భారత్ 59-58తో అమెరికాపై స్వల్ప ఆధిక్యం ప్రదర్శించగా, రెండో రౌండ్లో ఆధిక్యం 114-117 తగ్గింది. అయితే మూడో రౌండ్ ముగిసే సరికి 173-174తో స్వల్ప వెనుకంజలో ఉన్న భారత్ చివర్లో ఆరు పది పాయింట్లు ఖాతాలో వేసుకోవడంతో పసిడి ఖాతాలో చేరింది.చదవండి: అథ్లెటిక్స్లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు! -
అథ్లెటిక్స్లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు!
ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే రేసింగ్ ట్రాక్ మీద చిరుతలా పరుగులు పెట్టిన స్ప్రింటర్ గుర్తుకువస్తాడు. పరుగుపందెంలో మిగిలిన వారికీ, ఉసేన్ బోల్ట్కి మధ్య ఉన్న దూరం చూసి, ప్రపంచం విస్తుపోయింది. 100, 200, 400 మీటర్ల ఈవెంట్స్లో బోల్ట్ ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. తాజాగా 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్లో బోల్ట్ నెలకొల్పిన రికార్డును ఆస్ట్రేలియాకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు గౌట్ బద్దలుకొట్టడం విశేషం. ఆస్ట్రేలియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆదివారం ఈ అద్భుతం చోటుచేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసులో గౌట్ 19.67 సెకన్లలో గమ్యాన్ని చేరి సరికొత్త సృష్టించాడు. ఇంతకముందు ఉసేన్ బోల్ట్ 200 మీటర్ల రేసును 19.93 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో గౌట్ ఇదే 200 మీటర్ల రేసును 20.02 సెకన్లలో పూర్తి చేశాడు. తాజాగా తన రికార్డును మరింత సవరించడమే గాకుండా ఏకంగా జమైకా చిరుత బోల్ట్ రికార్డుకు ఎసరు పెట్టి నయా చిరుతగా ఆవిర్భవించాడు. ఇక ఫైనల్లో తన ప్రత్యర్థుల నుంచి గౌట్కు పోటీ ఎదురైంది. ఐడాన్ మర్ఫీ 19.88 సెకన్లతో రెండో స్థానంలో, కాలబ్ లా 20.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే ఫైనల్కు ముందే లాచ్లెన్ కెన్నెడీ వైదొలగడం కూడా గౌట్కు కలిసొచ్చింది.ఎవరీ గౌట్?గౌట్ పేరెంట్స్ అతడు పుట్టకముందే దక్షిణ సుడాన్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. క్వీన్స్లాండ్లో నివాసం ఏర్పరచుకున్న మోనికా, బోనా దంపతులకు ఏడుగురు సంతానం. అయితే గౌట్ పూర్వీకులది ఈజిప్ట్ కావడంతో అతడికి ఆ పేరు పెట్టారు. సౌత్ఈస్ట్ క్వీన్స్లాండ్లోని ఇప్స్విచ్ గ్రామర్ స్కూల్లో చదువుకున్న గౌట్ చిన్నప్పటి నుంచి సాకర్ ఆడడం నేర్చుకున్నాడు. అలా అథ్లెటిక్స్పై ఇష్టం పెంచుకున్నాడు. ఆ తర్వాత పూర్తి అథ్లెటిక్స్లోకి మారిన గౌట్ అండర్ 16 విభాగంలో 100, 200 మీటర్ల పలు రికార్డులు నెలకొల్పాడు. 14 ఏళ్ల వయసులో గౌట్ 100 మీటర్ల రేసును 10.57 సెకన్లలో పూర్తి చేసిస సరికొత్త చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల వయసులో గౌట్ అండర్-18 విభాగంలో 200 మీటర్ల రేసును 20.87 సెకన్లలో పూర్తి చేసి దేశవాలీలో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ అథ్లెటిక్స్ టోర్నీల్లోనూ సత్త చాటిన గౌట్ ఓషినియా అండర్ 18 అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో 200 మీటర్లు, 4x400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. ఇక ఉసేన్ బోల్ట్, 2009లో 100 మీటర్ల పరుగు పందెన్ని 9.58 సెకన్లలో పూర్తి చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే 150 మీటర్లను 14.35 సెకన్లు, 200 మీటర్లను 19.19 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 2, 2012 లండన్ ఒలింపిక్స్లో 3, 2016 రియో ఒలింపిక్స్లో 3 స్వర్ణాలు సాధించిన ఉసేన్ బోల్ట్, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో 11 స్వర్ణాలు సాధించాడు. 18-year-old GOUT GOUT 🇦🇺 19.67s (1.7) over 200m at Australian Championships in Sydney!!🤯🤯A new U20 World Record ☑️National Record ☑️ First Australian man under 20 seconds ☑️A star is born!pic.twitter.com/1GTfFJ4gst— Track & Field Gazette (@TrackGazette) April 12, 2026 చదవండి: దేశ ప్రజలను అవమానించిన పాక్ క్రికెటర్! -
IPL 2026: నితీశ్ రాణా, రుతురాజ్పై చర్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. సంజూ శాంసన్ (115 నాటౌట్) శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (59 రిటైర్డ్ ఔట్) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో శివమ్ దూబే (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ.. జేమీ ఓవర్టన్ (4-0-18-4), అన్షుల్ కంబోజ్ (4-0-35-3) ధాటికి 20 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. ట్రిస్టన్ స్టబ్స్ (60) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు సీఎస్కేకు ఈ సీజన్లో మొదటిది కాగా.. ఢిల్లీ నాలుగు మ్యాచ్ల్లో రెండో పరాజయాన్ని ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఢిల్లీ ఆటగాడు నితీశ్ రాణాకు జరిమానా విధించింది.సీఎస్కే కెప్టెన్గా రుతురాజ్ స్లో ఓవర్రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ మ్యాచ్ ఫీజ్లో రూ. 12 లక్షలు కోల్పోగా.. నితీశ్కు మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత, అదనంగా ఓ డీమెరిట్ పాయింట్ శిక్షగా విధించబడింది. సీఎస్కేకు ఈ సీజన్లో ఇది మొదటి తప్పిదం కావడంతో జరిమానాతో సరిపెట్టారు.నితీశ్ విషయానికొస్తే.. అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గానూ ఈ శిక్షను ఎదుర్కొన్నాడు. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో (19వ ఓవర్లో) ట్రిస్టన్ స్టబ్స్ గ్లవ్స్ మార్చుకోవాలని అంపైర్లను కోరగా, వారు నిరాకరించారు. దీంతో నితీశ్ మధ్యలో కల్పించుకొని స్టబ్స్కు వత్తాసుగా ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. అసభ్య పదజాలం కూడా వాడాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.3 నిబంధన ప్రకారం ఇది లెవెల్ 1 నేరం కిందికి వస్తుంది. ఇందుకు మ్యాచ్ ఫీజ్లో 25 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించారు. -
దేశ ప్రజలను అవమానించిన పాక్ క్రికెటర్!
పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్ సూపర్లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న హసన్ అలీ అసభ్యకరమైన సంజ్ఞతో సైగలు చేయడం వివాదానికి దారి తీసింది. విషయంలోకి వెళితే.. శనివారం కరాచీ కింగ్స్, హైదరాబాద్ కింగ్స్మెన్ మధ్య మ్యాచ్ జరిగింది.కింగ్స్మెన్ ఇన్నింగ్స్ సమయంలో అబ్బాస్ అఫ్రిది వేసిన 8వ ఓవర్లో ఉస్మాన్ఖాన్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే నిల్చున్న హసన్ అలీ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకున్నాడు. అయితే క్యాచ్ తీసుకున్న వెంటనే పెవిలియ్ స్టాండ్ వైపు తిరిగి ‘నోరు మూయండి’ అన్నట్లు సైగ చేసి ఆ తర్వాత గాల్లోకి పంచ్ విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ప్రస్తుతం పీఎస్ఎల్ ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. కరాచీ కింగ్స్ తమ సొంత గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతుండడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్ధంగా ఉండడం ప్రేక్షకులు లేకుండానే మాకు హాయిగా ఉంది అన్నట్లుగా అర్థం వచ్చేలా సైగలు ఉండడం వివాదంగా మారింది. ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో పీఎస్ఎల్ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అంతకముందు ఇన్నింగ్స్ 7.3 ఓవర్లో ఉస్మాన్ ఖాన్ ఇచ్చిన క్యాచ్ను హసన్ అలీ జారవిడిచాడు. మళ్లీ హసన్ అలీనే ఉస్మాన్ ఖాన్ క్యాచ్ తీసుకున్నాడు. చేసిన తప్పుకు ప్రాయచిత్తం చేసుకునేందుకే హసన్ అలీ ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ కింగ్స్మెన్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకొని విజయం సాధించింది.- @RealHa55an signalling this to whom? 🤔 pic.twitter.com/FGOJ1TaWIP— HAMAS 🇵🇰 (@HamasulGhani) April 11, 2026చదవండి: ట్విస్ట్ అదుర్స్.. అరుదైన జాబితాలో ఆయుశ్ మాత్రే! -
అదరగొట్టిన భారత రెజ్లర్లు..
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో శనివారం భారత రెజ్లర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుజీత్ కల్కాల్ (65 కేజీలు), అభిమన్యు (70 కేజీలు) పసిడి పతకాలతో మెరిపించగా... సందీప్ సింగ్ మాన్ (79 కేజీలు) రజతం... అంకుశ్ (57 కేజీలు) కాంస్యం దక్కించుకున్నారు. ఈ ఏడాది అజేయంగా ఉన్న సుజీత్ ఫైనల్లో 8–1 పాయింట్ల తేడాతో ఉమిద్జాన్ జలోలోవ్ (ఉజ్బెకిస్తాన్)ను అలవోకగా ఓడించాడు. ఈ విజయంతో సుజీత్ 2019లో బజరంగ్ పూనియా తర్వాత 65 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్గా అవతరించిన భారత రెండో రెజ్లర్గా గుర్తింపు పొందాడు. మరోవైపు అభిమన్యు 5–3తో తుల్గా తుముర్ ఒచిర్ (మంగోలియా)పై గెలుపొందాడు. 79 కేజీల ఫైనల్లో సందీప్ సింగ్ 1–2తో కీవన్ ఘరెదాగి (జపాన్) చేతిలో ఓడిపోయాడు. 57 కేజీల కాంస్య పతక బౌట్లో అంకుశ్ 8–2తో ఫుగా ససాకి (జపాన్)పై విజయం సాధించాడు. 97 కేజీల కాంస్య పతక బౌట్లో విక్కీ 5–7తో షెర్జాద్ పొయోనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో అమన్, ముకుల్ టోర్నీ చివరిరోజు ఆదివారం భారత్కు మరో రెండు స్వర్ణ పతకాలు లభించే అవకాశం ఉంది. 61 కేజీల విభాగంలో అమన్ సెహ్రావత్, 86 కేజీల విభాగంలో ముకుల్ దహియా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్లో అమన్ 11–9తో అహ్మద్ (ఇరాన్)పై, ముకుల్ 12–6తో బొలాత్ సకాయెవ్ (కజకిస్తాన్)పై గెలిచారు. 125 కేజీల విభాగం సెమీఫైనల్లో దినేశ్ 0–2తో షరిపోవ్ (బహ్రెయిన్) చేతిలో ఓడిపోయి నేడు కాంస్య పతకం కోసం పోటీపడతాడు. -
ట్విస్ట్ అదుర్స్.. అరుదైన జాబితాలో ఆయుశ్ మాత్రే!
ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ ఆటగాడు ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయుశ్ రిటైర్డ్ ఔట్ వెనుక సీఎస్కే మేనేజ్మెంట్ హస్తం ఉంది. మంచి ఈజ్తో బ్యాటింగ్ చేస్తున్న ఆయుశ్ మాత్రేను అర్థంతరంగా రిటైర్డ్ ఔట్గా వెళ్లిపోవడం వెనుక విమర్శలు వచ్చాయి. కానీ సీఎస్కే నిర్ణయం సరైనదే అని కాసేపటికే తెలిసొచ్చింది. ఆయుశ్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హార్డ్ హిట్టర్ శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తూ వేగంగా పరుగులు రాబట్టాడు. ఫలితంగా సీఎస్కే భారీ స్కోరు సాధించింది. ఆయుశ్ మాత్రే రిటైర్డ్ ఔట్ వెనుక కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ పాత్ర కీలకం. అందుకే మాత్రే పెవిలియన్ చేరుకున్న సమయంలో అతడికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఈ నేపథ్యంలో ఆయుశ్ మాత్రే ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్లు చాలా తక్కువగా జరుగుతుంటాయి. గతంలో రవిచంద్రన్ అశ్విన్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, డెవాన్ కాన్వే వంటి క్రికెటర్లు రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగారు. తాజాగా ఈ జాబితాలో ఆయుశ్ మాత్రే కూడా చేరిపోయాడు. కాగా ఐపీఎల్ 2026 సీజన్లో ఆయుశ్ మాత్రేదే తొలి రిటైర్డ్ ఔట్.సాధారణంగా క్రికెట్లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ వేర్వేరు. రిటైర్డ్ హర్ట్' అంటే గాయం కారణంగా ఆటగాడు మైదానం విడిచిపెట్టడం. అదే రిటైర్డ్ ఔట్ అనేది జట్టు ప్రయోజనాల కోసం స్వచ్చందంగా మైదానం విడిచిపెట్టడం. రిటైర్డ్ హర్ట్ అయితే సదరు మ్యాచ్లో మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రిటైర్డ్ ఔట్ అలా కాదు. ఒక్కసారి రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగితే మళ్లీ క్రీజులోకి వచ్చేందుకు అవకాశం ఉండదు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. View this post on Instagram A post shared by IPL (@iplt20) చదవండి: అంపైర్తో వాదన.. కోపంతో ఊగిపోయిన స్టబ్స్! -
అంపైర్తో వాదన.. కోపంతో ఊగిపోయిన స్టబ్స్!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్లో కోపంతో ఊగిపోతూ హెల్మెట్ను నేలకేసి కొట్టడంతో పాటు గ్లోవ్స్ను విసిరేయడం కెమెరాలకు చిక్కింది. మరి స్టబ్స్ కోపానికి కారణమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో స్టబ్స్ తన గ్లోవ్స్ను మార్చుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే గ్లోవ్స్ మొత్తం చెమటతో తడిసిపోవడంతో స్టబ్స్ పదే పదే బ్యాట్ గ్రిప్ను కోల్పోయాడు. దీంతో గ్లోవ్స్ను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని అంపైర్ను కోరాడు. కానీ అంపైర్ ససేమీరా అనడంతో చేసేదేం లేక స్టబ్స్ అదే గ్లోవ్స్తో కంటిన్యూ అయ్యాడు. అయితే 19వ ఓవర్లో జేమీ ఓవర్టన్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడే యత్నంలో మిడాఫ్లో నూర్ అహ్మద్ చేతికి చిక్కాడు. దీంతో పెవిలియన్ చేరిన స్టబ్స్ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాకా కోపంతో ఊగిపోతూ బ్యాట్ను, హెల్మెట్ను విసిరేయడంతో పాటు గ్లోవ్స్ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టబ్స్ ఔటైన తర్వాత డగౌట్లో ఉన్న ఢిల్లీ ఆటగాడు నితీశ్ రానా స్టబ్స్ను సమర్థించాడు. తడిగా ఉన్న గ్లోవ్స్తో ఆడడం వల్ల బ్యాటింగ్కు ఆటంకం కలుగుతుందని, స్టబ్స్కు గ్లోవ్స్ మార్చుకునేందుకు అవకాశమెందుకు ఇవ్వలేదంటూ థర్డ్ అంపైర్తో వాదనకు దిగాడు. కోచ్ హేమంగ్ బదాని కూడా అంపైర్తో ఇదే విషయమై వాదనకు దిగడం కనిపించింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.Stubbs asked to change his gloves just before the wicket ball and Umpire didn't allow it, now DC management is furious and ofcourse CSK is involved in another spooky decision. pic.twitter.com/jkkImLB5Bq— Avay Sha (@avay_69) April 11, 2026🚨 DC Camp Angry on Umpire Decision 🚨DC coach Hemang Badani and Nitish Rana were angry on umpire after Tristan Stubbs was not allowed to change his gloves during the over.The decision upset the DC camp, and on the very next ball, Stubbs got out. pic.twitter.com/qGHdCe6tQL— Cricket Vaira (@ramgaming242) April 11, 2026Stubs wanted to change his gloves, but the umpire did not allow it, and he got out on the very next ball.#CSKvsDC pic.twitter.com/BAHX9zhURM— Vivek Gupta (@VIVEK1888) April 12, 2026చదవండి: ‘విజయానికి వాళ్లే కారణం.. సంజూ కాదు’ -
‘విజయానికి వాళ్లే కారణం.. సంజూ కాదు’
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ విజయంలో సంజూ శాంసన్, ఆయుశ్ మాత్రేలు కీలకపాత్ర పోషించారు. అయితే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం బౌలర్ల వల్లే తమ జట్టు విజయం సాధించిదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు సీజన్లో తొలి విజయం సాధించడం, సంతోషంతో మాట్లాడేందుకు మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ మేము ఆడిన తీరు చాలా గొప్పగా అనిపించింది. చెపాక్ స్టేడియంలో మేము ఎప్పుడు మొదట బ్యాటింగ్ చేసినా 200 నుంచి 210 స్కోరు చేయాలని అనుకునేవాళ్లం. కానీ స్లో పిచ్ కారణంగా ఆ స్కోరు చేయడం కాస్త కష్టంగా అనిపించేంది. గత మ్యాచ్లతో పోలిస్తే అన్ని విషయాల్లో మెరుగయ్యాం. ఈరోజు సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. ఆయుష్ కూడా అద్భుతంగా రాణించాడు. కానీ ఇవాళ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలుపులో బౌలింగ్ పాత్రే కీలకం. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం, ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం మా విజయానికి కలిసొచ్చింది. మా బౌలర్ల కృషిని చూసి గర్వపడుతున్నా. నిజానికి మా బౌలింగ్ లైనప్లో 'ఎక్స్-ఫ్యాక్టర్' బౌలర్ లేకపోయి ఉండవచ్చు. కానీ ప్రతి మ్యాచ్లోనూ ఎంత ప్రభావవంతంగా ఉండాలి, ముందస్తుగా ఎలా ఆలోచించాలి, అదనపు బౌండరీలను ఎలా ఆపాలి అనే విషయాలపై మేం చర్చించుకుంటూనే ఉన్నాం. తొలి మూడు మ్యాచ్ల్లో మేము విజయానికి చేరువగా వచ్చినప్పటికీ ఒకటి రెండు ఓవర్లలో 20-25 పరుగులు సమర్పించుకోవడం గెలుపును దూరం చేశాయి. పవర్ప్లేలో మేం కొంచెం వెనకంజలో నిలిచినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాం. చెన్నై ఫ్యాన్స్ ఎప్పుడూ మాకు అండగా ఉంటారు. మేం ఎక్కడికి వెళ్లినా వారి మద్దతు, సందేశాలు మమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దేశంలో ఈ ప్రాంతం ప్రత్యేకం. ఇక్కడి ప్రజలు క్రికెట్ను ఆస్వాదిస్తూనే ఫ్రాంచైజీని అమితంగా ప్రేమిస్తుంటారు.’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. శాంసన్ సెంచరీ, శివమ్ దూబే అజేయ అర్థసెంచరీతో రాణించారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.చదవండి: ‘నా సెంచరీ వెనుక ఆ 50 సెకన్లు.. అతడికే అంకితం’ -
‘నా సెంచరీ వెనుక ఆ 50 సెకన్లు.. అతడికే అంకితం’
ఐపీఎల్ 2026 సీజన్లో ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్కింగ్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత గెలుపు రుచి చూసింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 23 పరుగుల తేడాతో గెలుపొందింది. సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మూడు వరుస ఓటముల తర్వాత సెంచరీతో జట్టును గెలిపించడం సంతోషంగా ఉందన్నాడు. వరుసగా విఫలమైనప్పటికీ జట్టు మేనేజ్మెంట్ తనపై నమ్మకం ఉంచడం గొప్ప విషయమన్నాడు. తన సెంచరీని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్కు అంకితమిస్తున్నట్లు శాంసన్ తెలిపాడు. శాంసన్ మాట్లాడుతూ.. ‘ఈసెంచరీ నాకు ఎంతో ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే నాపై నమ్మకంతో చెన్నై ఫ్రాంచైజీ ట్రేడింగ్లో నన్ను దక్కించుకుంది. తొలి మూడు మ్యాచ్ల్లో విఫలమైనప్పుడు వారి నమ్మకాన్ని కోల్పోతున్నానేమోననిపించింది. కానీ ఇవాళ బాధ్యతా యుతంగా ఆడి సెంచరీ చేయడంతో పాటు వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాను. ఇంతకాలం ఒక ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు మరో కొత్త ఫ్రాంచైజీకి ఆడడం కొంత కష్టమే. కానీ నాకు చెన్నై విషయంలో అది ఏనాడు కనిపించలేదు. చెన్నైకి ఆడుతుంటే నేను మరో సొంత ఇంటికి వచ్చానన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. అందరూ ప్రశాంతంగా కనిపిస్తున్నారు. అయితే వరుసగా మూడు ఓటములు చవిచూసినప్పటికీ ఇవాళ మ్యాచ్కు ముందు మేమంతా కేవలం 50 సెకన్లు మాత్రమేమీటింగ్ పెట్టుకున్నాం. ఆ యాబై సెకన్లు నేను ఒక టీమ్తో ఎంత కనెక్ట్ అయ్యాననేది చూపించింది. నేను గతంలో చాలాసార్లు విఫలమయ్యాను. అలాంటప్పుడు మనసు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. కానీ నా బేసిక్స్ ఏంటో తెలుసుకొని వాటిని పాటించడమే ముఖ్యం. అందుకోసం మా సపోర్ట్ స్టాఫ్తో కలిసి కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నాను. మ్యాచ్లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా అవసరం. ఆయుష్ చాలా పరిణతితో ఆడాడు. మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కోసమే నా సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాను. పరిస్థితులు ఎంత సవాలుగా ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఈ ఇన్నింగ్స్ను ఆయనకు అంకితం చేయాలనుకున్నాను.’ అని తెలిపాడు.🗣️🗣️ 𝙄𝙩 𝙛𝙚𝙚𝙡𝙨 𝙡𝙞𝙠𝙚 𝙘𝙤𝙢𝙞𝙣𝙜 𝙩𝙤 𝙖𝙣𝙤𝙩𝙝𝙚𝙧 𝙝𝙤𝙢𝙚 🏠Sanju Samson reflects on his match-winning knock and the love from the Chennai crowd 💛 Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC | @IamSanjuSamson | @ChennaiIPL pic.twitter.com/H4X2sug3sB— IndianPremierLeague (@IPL) April 11, 2026#CSK fans, bring out the whistles 💛A first win of the season for the 5⃣-time #TATAIPL champions 👏Scorecard ▶️ https://t.co/BzGc6O65jX #KhelBindaas | #CSKvDC | @ChennaiIPL pic.twitter.com/tS2xyOWgdj— IndianPremierLeague (@IPL) April 11, 2026చదవండి: చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు -
చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు తన రిథమ్ను అందుకున్నాడు. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సంజూ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.తొలి మూడు మ్యాచ్లలో విఫలమైన సంజూ.. ఢిల్లీపై మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. శాంసన్ కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సెంచరీ బాదిన మొట్టమొదటి వికెట్ కీపర్-బ్యాటర్గా రికార్డు సృష్టించాడు.2008 నుండి సీఎస్కే పూర్తిస్థాయి కీపర్గా ఉన్న ఎంఎస్ ధోనికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోనీ అత్యధిక స్కోరు 84 పరుగులుగా ఉంది. అయితే ధోని దాదాపుగా లోయార్డర్లోనే బ్యాటింగ్కు రావడంతో ఒక్కసారి మూడంకెల స్కోర్ను అందుకోలేకపోయాడు. కానీ సంజూ మాత్రం సీఎస్కే తరపున తొలి ఎడిషన్లో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్రైజర్స్ కెప్టెన్🚨 SANJU SAMSON SCORED THE FIRST HUNDRED IN IPL 2026 🚨Chetta at Chepauk. 🔥 pic.twitter.com/XXWiX1P3nP— Johns. (@CricCrazyJohns) April 11, 2026 -
పంజాబ్ ప్రతాపం
న్యూ చండీగఢ్: ఐపీఎల్ 19వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయం మూట గట్టుకుంది. బ్యాటింగ్లో ఆశించిన స్కోరు చేయలేకపోయిన రైజర్స్... పేలవ బౌలింగ్తో మూల్యం చెల్లించుకుంది. శనివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన తొలి పోరులో సన్రైజర్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడింది. మొదట హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 74; 5 ఫోర్లు, 8 సిక్స్లు) దంచికొట్టగా... ట్రావిస్ హెడ్ (23 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్), క్లాసెన్ (33 బంతుల్లో 39; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు హాఫ్ సెంచరీలు సాధించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. పవర్ప్లేలో 105 పరుగులు రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు చూస్తే ఈ మ్యాచ్లో 300 పరుగుల రికార్డు స్కోరు ఖాయనిపించింది. తొలి రెండు ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టిన అభిషేక్.. అర్ష్ దీప్ వేసిన మూడో ఓవర్లో 4, 4, 6, 6తో మొత్తం 24 పరుగులు రాబట్టాడు. యాన్సెన్ వేసిన తదుపరి ఓవర్లో హెడ్ 4, 6, 4 కొట్టగా... వైశాక్ వేసిన ఐదో ఓవర్లో అభిషేక్ నాలుగు సిక్స్లతో విజృంభించాడు. ఈ క్రమంలో అభిషేక్ 18 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తదుపరి ఓవర్లో హెడ్ ‘హ్యాట్రిక్’ ఫోర్లు బాదగా... అభిషేక్ ఓ సిక్స్ కొట్టాడు. దీంతో ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి రైజర్స్ వికెట్ కోల్పోకుండా 105 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ గాడితప్పింది. శశాంక్ ఒకే ఓవర్లో హెడ్, అభిషేక్లను పెవిలియన్కు చేర్చగా... కెప్టెన్ ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడినా... మరో ఎండ్లో క్లాసెన్ ధాటి కనబర్చలేకపోయాడు. అనికేత్ (18) అనూహ్యంగా రనౌట్ కాగా... నితీశ్ రెడ్డికి (0 నాటౌట్)ఒక్క బంతి మాత్రమే ఆడే అవకాశం దక్కింది. పవర్ప్లే తర్వాత 14 ఓవర్లలో హైదరాబాద్ 114 పరుగులే చేసి 6 వికెట్లు కోల్పోయింది. ధనాధన్ ఆరంభం సన్రైజర్స్ ఓపెనర్లను మరిపించే స్థాయిలో పంజాబ్ ఇన్నింగ్స్ ఆరంభమైంది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ ప్రతి బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపించారు. ఆర్య తొలి ఓవర్లో 4, 6, 4 కొట్టగా... తర్వాతి రెండు ఓవర్లలో ప్రభ్సిమ్రన్ రెండేసి ఫోర్లు, రెండేసి సిక్స్లు బాదాడు. ఈ జంట ఏ బౌలర్ను వదలకుండా విరుచుకుపడటంతో... పవర్ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ కోల్పోకుండా 93 పరుగులు చేసింది. ఈ క్రమంలో హర్షల్ పటేల్ ఓవర్లో వరుసగా 6, 6, 4, 4 కొట్టిన ఆర్య 16 బంతుల్లోనే హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికి ప్రభ్సిమ్రన్ 24 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. వీరిద్దరు అవుటయ్యాక ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యత శ్రేయస్ తీసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ ముందుకు సాగిన అయ్యర్ 24 బంతుల్లో ‘ఫిఫ్టీ’ కొట్టడంతో పాటు జట్టును విజయతీరాలకు చేర్చాడు.స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) అర్ష్ దీప్ (బి) శశాంక్ 74; హెడ్ (సి) బార్ట్లెట్ (బి) శశాంక్ 38; ఇషాన్ (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ 27; క్లాసెన్ (సి) కూపర్ (బి) బార్ట్లెట్ 39; అనికేత్ (రనౌట్) 18; సలీల్ (సి) బార్ట్లెట్ (బి) అర్ష్ దీప్ 9; నితీశ్ రెడ్డి (నాటౌట్) 0; హర్ష్ దూబే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–120, 2–122, 3–169, 4–195, 5–214, 6–218. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–50–2; బార్ట్లెట్ 4–0–42–1; యాన్సెన్ 4–0–40–0; వైశాక్ 2–0–33–0; శశాంక్ 3–0–20–2; చాహల్ 3–0–33–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ఆర్య (సి) నితీశ్ రెడ్డి (బి) శివాంగ్ 57; ప్రభ్సిమ్రన్ (సి) క్లాసెన్ (బి) శివాంగ్ 51; కూపర్ (సి) అభిషేక్ (బి) శివాంగ్ 11; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 69; నేహల్ వధేరా (బి) హర్ష్ 14; శశాంక్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 5; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–99, 2–117, 3–128, 4–197. బౌలింగ్: హర్ష్ దూబే 4–0– 38–1; జైదేవ్ ఉనాద్కట్ 3–0–40–0; ఇషాన్ మలింగ 3–0–46–0; హర్షల్ 2–0–39–0; శివాంగ్ కుమార్ 4–0–33–3; నితీశ్ రెడ్డి 2–0–20–0; అభిషేక్ 0.5–0–7–0. -
శతక్కొట్టిన సంజూ.. బోణీ కొట్టిన సీఎస్కే
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(60) టాప్ స్కోరర్గా నిలవగా.. ఫాథుమ్ నిస్సాంక(41), అశుతోష్ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ మూడు, నూర్ అహ్మద్, ఖలీల్ తలా వికెట్ సాధించారు.సంజూ సూపర్ సెంచరీఅంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 52 బంతుల్లోనే తన నాలుగో ఐపీఎల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా సంజూ 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆయూశ్ మాత్రే(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.చదవండి: IPL 2026: చెలరేగిన శాంసన్.. చెపాక్లో సూపర్ సెంచరీ -
చెలరేగిన శాంసన్.. చెపాక్లో సూపర్ సెంచరీ
ఐపీఎల్-2026లో తొలి సెంచరీ నమోదైంది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి మూడు మ్యాచ్లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన సంజూ.. ఢిల్లీ క్యాపిటల్స్పై మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో సంజూ ఉతికారేశాడు.కేవలం 52 బంతుల్లోనే నాలుగో ఐపీఎల్ సెంచరీ మార్కును సంజూ అందుకున్నాడు. సీఎస్కే జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగా కోల్పోయినప్పటికి.. సంజూ మాత్రం యువ ఆటగాడు ఆయూశ్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వారిద్దరూ రెండో వికెట్కు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత మాత్రే రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగినప్పటికి, సంజూ మాత్రం తన జోరును కొనసాగించాడు.మొత్తంగా 56 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.అయూశ్ మాత్రే రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్-2026 వేలానికి ముందు సంజూ శాంసన్ను రూ. 18 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ నుంచి సీఎస్కే ట్రేడ్చేసుకుంది. అయితే తొలి మూడు మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లకే (6, 7, 9 పరుగులు) అవుట్ అయ్యి విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు తన సూపర్ సెంచరీతోనే విమర్శలకు సమాధనమిచ్చాడు.చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్రైజర్స్ కెప్టెన్ -
ఆ తప్పే మా కొంపముంచింది: సన్రైజర్స్ కెప్టెన్
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవిచూసింది. శనివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఈ భారీ టార్గెట్ను పంజాబ్ కింగ్స్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 69 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ప్రియాన్ష్ ఆర్య(57), ప్రభ్సిమ్రాన్ సింగ్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. సన్రైజర్స్ బౌలర్లలో స్పిన్నర్లు శివాంగ్ కుమార్ మూడు, హర్ష్ దూబే ఓ వికెట్ సాధించారు. ఫాస్ట్ బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని కిషన్ తెలిపాడు."మేము సాధించిన 219 పరుగుల భారీ స్కోర్ ఈ రోజు సరిపోలేదు. మేము ఆరంభించిన తీరు చూస్తే కనీసం 250 పరుగులు చేస్తామని అనుకున్నాం. కానీ మధ్య ఓవర్లలో తడబడ్డాం. అయినప్పటికి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని అందించాము.కానీ పంజాబ్ ఓపెనర్లు కూడా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ప్లేలో భారీగా పరుగులు రాబట్టుకున్నారు. జట్టులో ఆరు నుండి ఏడుగురు బౌలర్లు ఉన్నప్పటికీ, ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. టీ20 క్రికెట్లో సరైన లైన్ అండ్ లెంగ్త్లో వేయడం ముఖ్యం. కానీ ఈ రోజు ఆ విషయంలో విఫలమయ్యారు. ప్రస్తుత క్రికెట్లో మ్యాచ్కు ముందే ప్లానింగ్ అంతా పూర్తవుతుంది. ఏ బ్యాటర్ ఎక్కడ హిట్టింగ్ చేస్తాడు? మైదానంలో ఏ వైపు బౌండరీ లాంగ్ ఉంది? వంటి విషయాలన్నీ మాకు తెలుసు. వీటిన్నటి దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేశాము. కానీ ప్లానింగ్ సరిగ్గా ఉన్నా, వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యామని" కిషన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్లో పేర్కొన్నాడు. -
అభిషేక్ మెరుపులు వృధా.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన పంజాబ్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27, క్లాసెన్ 33 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.మిగతా ఆటగాళ్లలో అనికేత్ వర్మ 18, సలీల్ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్ 0, హర్ష్ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, శాశాంక్ సింగ్ తలో 2, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ సన్రైజర్స్కు ధీటుగా జవాబిచ్చింది. తొలి బంతి నుంచి పంజాబ్ ఓపెనర్లు ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ప్రియాంశ్ ఆర్య (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రభ్సిమ్రన్ (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆతర్వాత శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం కొనసాగించారు. ఫలితంగా పంజాబ్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఊదేసింది. సన్రైజర్స్ బౌలర్లలో శివాంగ్ కుమార్ (4-0-33-3) రాణించాడు. -
ఢిల్లీపై సీఎస్కే గ్రాండ్ విక్టరీ
Chennai super kings vs delhi capitals live Updates: ఢిల్లీపై సీఎస్కే గ్రాండ్ విక్టరీఐపీఎల్-2026లో సీఎస్కే తొలి విజయాన్ని నమోదు చేసింది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్(60) టాప్ స్కోరర్గా నిలవగా.. ఫాథుమ్ నిస్సాంక(41), అశుతోష్ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ మూడు, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.ఓటమి దిశగా ఢిల్లీఢిల్లీ విజయానికి చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్(60), కుల్దీప్ యాదవ్(3) ఉన్నారు.ఢిల్లీ ఆరో వికెట్ డౌన్అశుతోష్ రూపంలో ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన అశుతోష్.. నూర్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 60 పరుగులు కావాలి.ఢిల్లీ ఐదో వికెట్ డౌన్డేవిడ్ మిల్లర్ రూపంలో ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన మిల్లర్.. ఓవర్టన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో స్టబ్స్(34), అశుతోష్ శర్మ(9)ఉన్నారు.10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 91/410 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్(11), డేవిడ్ మిల్లర్(6) ఉన్నారు. ఢిల్లీ విజయానికి 57 బంతుల్లో 121 పరుగులు కావాలి.ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అక్షర్ పటేల్.. గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు స్కోర్: 73/3ఢిల్లీ రెండో వికెట్ డౌన్పాథుమ్ నిస్సాంక రూపంలో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన నిస్సాంక.. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో ఔటయ్యాడు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్61 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో నిస్సాంక(41), రిజ్వీ ఉన్నారు.సంజూ సూపర్ సెంచరీ.. సీఎస్కే భారీ స్కోర్చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 55 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్లతో 115 పరుగులు చేశాడు. అతడితో పాటు అయూశ్ మాత్రే(59), దూబే(10 బంతుల్లో 20) రాణించారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు. అయూశ్ మాత్రే రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు.సంజూ శాంసన్ సెంచరీ17వ ఓవర్లో సంజూ శాంసన్ ఫోర్ బాది సెంచరీ నమోదు చేశాడుఈ సీజన్లో 52 బంతుల్లో తొలిసెంచరీ చేశాడుఢిల్లీపై 3సిక్స్లు,14 ఫోర్లతో సంజూ సెంచరీ పూర్తి చేశాడు ఆయూష్ ఔట్ 17వ ఓవర్లో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది17వ ఓవర్ నటరాజన్ బౌలింగ్లో సీఎస్కే బ్యాట్స్మెన్ ఆయూష్ ఔటయ్యాడు 55 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం సంజు, ఆయుష్ రెండో వికెట్కు 55 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు క్రీజులో సంజు 95, ఆయుష్ 55 17 ఓవర్లకు చెన్నై స్కోర్ 174/1 12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 119-1, క్రీజులో సంజూ శాంసన్(77), ఆయూష్ మాత్రే(25) ఉన్నారు.శాంసన్ హాఫ్ సెంచరీఐపీఎల్-2026 సీజన్లో సీఎస్కే సూపర్ స్టార్ సంజూ శాంసన్ తొలి హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 52 పరుగులతో సంజూ తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 8.5 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 77/1సీఎస్కే తొలి వికెట్ డౌన్సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6.2 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 62/. క్రీజులో సంజూ శాంసన్(46), అయూశ్ మాత్రే ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న సంజూసంజూ శాంసన్ ఎట్టకేలకు తన రిథమ్ను అందుకున్నాడు. 22 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 3 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 27/1టాస్ గెలిచిన ఢిల్లీ..ఐపీఎల్-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి అకిబ్ నబీ, అశుతోష్ శర్మ తుది జట్టులోకి వచ్చారు.జమ్మూ కాశ్మీర్ పేసర్ అకిబ్ నబీకి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. సీఎస్కే కూడా రెండు మార్పులు చేసింది. విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ తిరిగి పునరాగమనం చేశాడు. అదేవిధంగా గుర్జప్నీత్ సింగ్ సీఎస్కే తరపున ఐపీఎల్ డెబ్యూ చేశాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్ -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ఏకైక ప్లేయర్గా
పాకిస్తాన్ సూపర్ స్టార్, పెషావర్ జెల్మీ కెప్టెన్ బాబర్ ఆజం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో 4000 పరుగుల మార్క్ అందుకున్న తొలి ప్లేయర్గా ఆజం చరిత్ర సృష్టించాడు. శనివారం కరాచీ వేదికగా లహోర్ ఖలంధర్స్తో జరిగిన మ్యాచ్లో 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్ ఈ ఫీట్ను అందుకున్నాడు. బాబర్ కేవలం 102 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అతడి పీఎస్ఎల్ కెరీర్లో 37 ఫిప్టీలతో పాటు రెండు సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుత పీఎస్ఎల్ సీజన్లో బాబర్ అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో 70.67 సగటుతో 212 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రనస్కోరర్గా బాబర్ కొనసాగుతున్నాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లహోర్పై 76 పరుగుల తేడాతో కరాచీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. పెషావర్ ఇన్నింగ్స్లో కుశాల్ మెండిస్(48 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 74) టాప్ స్కోరర్గా నిలవగా.. మైఖల్ బ్రేస్వెల్(21), మహ్మద్ హ్యారిస్(18) రాణించారు.లహోర్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్ రెహ్మన్ రెండు, ఉబైడ్ షా, ఉసమా మీర్ తలా వికెట్ సాధించారు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లహోర్.. పెషావర్ బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. పెషావర్ బౌలర్లలో స్పిన్నర్లు మైఖల్ బ్రేస్వెల్, సుఫియన్ ముఖియమ్ తలా మూడు వికెట్లతో లహోర్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు షోర్ఫుల్ ఇస్లాం, అమీర్ జమీల్ ఓ వికెట్ సాధించారు.చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఎప్పుడంటే? -
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఎప్పుడంటే?
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. శుక్రవారం గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి ప్రపంచస్ధాయి బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. వైభవ్ కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు.దీంతో వైభవ్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన సూర్యవంశీ 200 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రశంసల వర్షం కురిపించాడు."వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఇంత చిన్న వయసులో ఇలాంటి టాలెంట్ను చూడడం ఇదే తొలిసారి. అతి పిన్న వయస్కుడిగా టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి వైభవ్ కచ్చితంగా అర్హుడు" అని ధుమాల్ ఎక్స్వేదికగా కొనియాడాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే తన 15వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు అర్హత సాధించాడు.ఐపీఎల్-2026 సీజన్ తర్వాత భారత జట్టు రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్కు వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశముంది. వైభవ్ ప్రదర్శనలను అజిత్ అగార్కర్ అండ్ కో నిశితంగా పరిశీలిస్తోంది.ఒకవేళ త్వరలో జరగనున్న ఐర్లాండ్ సిరీస్కు వైభవ్ ఎంపికైతే, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ ఆల్-టైమ్ రికార్డును వైభవ్ తిరగరాసే అవకాశం ఉంది. టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.చదవండి: ఊచకోత.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ -
ఊచకోత.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (ఏప్రిల్ 11) జరుగుతున్న మ్యాచ్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో ఐపీఎల్ చరిత్రలో 20 లోపు బంతుల్లో 5 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తన ఐపీఎల్ కెరీర్లో 16 బంతుల్లో ఓసారి.. 18 బంతుల్లో రెండు సార్లు, 19 బంతుల్లో మరో రెండు సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు.ఈ విభాగంలో అభిషేక్ తర్వాతి స్థానంలో నికోలస్ పూరన్ ఉన్నాడు. పూరన్ 4 సార్లు ఐపీఎల్లో 20 లోపు బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. అభిషేక్, పూరన్ తర్వాతి స్థానాల్లో జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ (3), వైభవ్ సూర్యవంశీ (3) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్ హెడ్ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 27, క్లాసెన్ 33 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 39 పరుగులు చేశాడు.మిగతా ఆటగాళ్లలో అనికేత్ వర్మ 18, సలీల్ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్ 0, హర్ష్ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, శాశాంక్ సింగ్ తలో 2, జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ తీశారు. -
వైభవ్ మరో 'చరిత్ర'
రాజస్థాన్ రాయల్స్ యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2026 ఎడిషన్లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తన జట్టుకు తిరుగులేని విజయాన్నందించిన వైభవ్.. ఈ ఎడిషన్లో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో (15 ఏళ్లు) ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.గతంలో ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ పేరిట ఉండేది. సాయి 23 ఏళ్ల 231 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. వైభవ్, సాయి తర్వాతి స్థానాల్లో శుభ్మన్ గిల్ (23 ఏళ్ల 263 రోజులు), రుతురాజ్ గైక్వాడ్ (24) ఉన్నారు.ఈ ఏడిషన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన వైభవ్ 266.67 స్ట్రయిక్రేట్తో 50 సగటున 2 హాఫ్ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 18 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్లో వైభవ్ చేసిన రెండు అర్ద సెంచరీలు 15 బంతుల్లోనే (సీఎస్కే, ఆర్సీబీ) చేయడం మరో విశేషం. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో టాప్-3 రన్ స్కోరర్లు రాయల్స్ ఆటగాళ్లే (వైభవ్ (200), జైస్వాల్ (183), జురెల్ (176)) కావడం మరో విశేషం.ఇదిలా ఉంటే, గత ఎడిషన్లో (2025) 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వైభవ్ మరిన్ని రికార్డులపై కన్నేశాడు. వైభవ్ ప్రస్తుతమున్న జోరును కొనసాగిస్తే ఈ సీజన్లో చాలా అల్టైమ్ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అతి చిన్నవయసులో ఐపీఎల్ అరంగేట్రంతో పాటు ఐపీఎల్ చరిత్రలో భారత ఆటగాడిచే అత్యంత వేగవంతమైన సెంచరీ (35) రికార్డులు కలిగిన వైభవ్.. ఈ సీజన్లో ఓవరాల్గా (ఐపీఎల్ చరిత్రలో) ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. -
సన్రైజర్స్పై పంజాబ్ గెలుపు
సన్రైజర్స్పై పంజాబ్ గెలుపుసన్రైజర్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్ కింగ్స్.మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్10.2వ ఓవర్- 128 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్లో అనికేత్ వర్మ (11)కు క్యాచ్ ఇచ్చి కూపర్ కన్నోల్లీ (11) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్6.2వ ఓవర్- 99 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. శివాంగ్ కుమార్ బౌలింగ్లో నితీశ్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్య (57) ఔటయ్యాడు. ధీటుగా బదులిస్తున్న పంజాబ్220 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ధీటుగా బదులిస్తుంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (51), ప్రభ్సిమ్రన్ (41) చెలరేగి ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 93-0గా ఉంది. ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్20 ఓవర్లలో 218-6 (అభిషేక్ శర్మ (74), ట్రవిస్ హెడ్ (38), ఇషాన్ కిషన్ (27), క్లాసెన్ (39), అనికేత్ వర్మ (18)).మూడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్13.6వ ఓవర్-169 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ కిషన్ (27) ఔటయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్అప్పటిదాకా పరుగుల వరద పారించిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ఒకే ఓవర్లో ఔటైపోయారు.ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల ఊచకోతటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్ తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 84 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (59), ట్రవిస్ హెడ్ (18) శివాలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అభిషేక్ పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోతున్నాడు. కేవలం18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెడ్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు రఫ్ఫాడిస్తున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 11) డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్-సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ముల్లాన్పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ రెండు మార్పులు చేయగా.. పంజాబ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఎస్ఆర్హెచ్ తరఫున లివింగ్స్టోన్ స్థానంలో సలీల్ అరోరా బరిలోకి దిగుతున్నాడు. అలాగే ప్రఫుల్ హింజ్ (ఉనద్కత్ స్థానంలో) అరంగేట్రానికి సిద్దమయ్యాడు.తుది జట్లు..పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: నేహాల్ వధేరా, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గే, యష్ ఠాకూర్, హర్ప్రీత్ బ్రార్సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (w/c), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగఇంపాక్ట్ సబ్స్: జయదేవ్ ఉనద్కత్, లియామ్ లివింగ్స్టోన్, శివమ్ మావి, ప్రఫుల్ హింగే, కమిందు మెండిస్ -
చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..?
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేసి రాయల్స్కు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ మధ్యలో వైభవ్ చేసిన ఓ పని అతన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది.మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైభవ్ డగౌట్లో కూర్చొని జట్టు మేనేజర్ రోమీ భిందర్తో కలిసి మొబైల్ ఫోన్ చూస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరలైంది. బీసీసీఐ నియమాల ప్రకారం ఆటగాళ్లు మ్యాచ్ జరుగుతుండగా మొబైల్ చూడరాదు, వాడరాదు. మేనేజర్కు ఈ విషయంలో వెసులుబాటు ఉన్నా, అతనికి కూడా డగౌట్లో మొబైల్ వాడే పర్మిషన్ లేదు. మేనేజర్కు డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే ఫోన్ వినియోగించే వెసులుబాటు ఉంది.ఇప్పుడు డగౌట్లో మొబైల్ వాడినందుకు మేనేజర్తో పాటు వైభవ్ కూడా చిక్కుల్లో పడినట్లైంది. వైభవ్ స్వతహాగా మొబైల్ వాడనప్పటికీ, దానివైపు చూస్తున్నట్లు సోషల్మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మేనేజర్తో పాటు వైభవ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాడేమో చూడాలి.ఈ అంశానికి సంబంధించి బీసీసీఐ నియమాలు (PMOA – Minimum Standards for Players and Match Officials Areas) ఇలా ఉన్నాయి.- మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ డివైజ్లు డగౌట్లో అనుమతించబడవు. - టీమ్ మేనేజర్ డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే ఫోన్ వాడవచ్చు, డగౌట్లో కాదు. - అనలిస్టులు కంప్యూటర్లు వాడవచ్చు, కానీ కేవలం ప్రత్యేకంగా కేటాయించిన అనలిస్ట్ టేబుల్ వద్ద మాత్రమే. - ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ స్టేడియంలోకి వచ్చిన వెంటనే తమ డివైజ్లను ఆఫ్ చేసి సురక్షితంగా భద్రపరచాలి. - అటెండెంట్స్, క్యాటరింగ్ వర్కర్స్ వంటి సిబ్బంది కూడా కమ్యూనికేషన్ డివైజ్లు తీసుకురావడానికి అనుమతి లేదు. -
సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పెను సంచలనం నమోదైంది. భారత యువ షట్లర్ అయుష్ శెట్టి ప్రపంచ నంబర్ 1 షట్లర్ కున్లావుట్ విటిడ్సార్న్ (థాయ్లాండ్)ను మట్టికరిపించి చరిత్ర సృష్టించాడు. కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల ఆయుష్.. ఈ టోర్నీ సెమీస్లో కున్లావుట్పై 10-21, 21-19, 21-17 తేడాతో గెలిచి పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా భారత తరఫున ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్కు (సింగిల్స్) చేరిన రెండో పురుష షట్లర్గా (దినేశ్ ఖన్నా (1965), ఓవరాల్గా మూడో భారత షట్లర్గా రికార్డుల్లోకెక్కాడు.75 నిమిషాల పాటు సాగిన సెమీస్లో ఆయుష్ మొదటి గేమ్ కోల్పోయినా, ఆతర్వాత అద్భుత పోరాటపటిమతో వరుసగా రెండు సెట్లు గెలిచి గేమ్ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆయుష్.. షి యు కీ (చైనా), చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో తలపడతాడు. అయుష్ 2023 వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన తర్వాత వార్తల్లోకెక్కాడు. -
‘భారత్ వ్యతిరేక సెంటిమెంట్తో కొంపముంచిన నిర్ణయం’
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ సమయంలో బంగ్లాదేశ్ వ్యవహరించిన తీరు సరికాదని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) మాజీ సీఈవో అష్రాఫుల్ హక్ అన్నాడు. భారత వ్యతిరేక సెంటిమెంట్తో కొంతమంది పన్నిన కుట్రలో బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) మాజీ చీఫ్ భాగమయి ఉంటారని అభిప్రాయపడ్డాడు. వీరి నిర్ణయాల కారణంగా బంగ్లా క్రికెట్ చాలా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.కాగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసింది. అక్కడి నేతలు కొంతమంది ఈశాన్య భారతం గురించి అవాకులు చెవాకులు పేలగా.. అదే సమయంలో బంగ్లాలో మైనారిటీ హిందువులపై దాడులు పెరిగాయి.దౌత్యపరమైన ఉద్రిక్తతలుఈ నేపథ్యంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగగా.. ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ను బీసీసీఐ తొలగించింది. దీంతో తమకు భారత్లో భద్రత కరువు అంటూ బంగ్లా బోర్డు.. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు భారత్కు రాబోమని పట్టుబట్టింది.తమ వేదికను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేయగా.. బంగ్లా వాదనలో నిజం లేదని పేర్కొంటూ ఇందుకు ఐసీసీ నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బీసీబీ ప్రకటించింది. అయితే, బంగ్లా ఆటగాళ్లు మాత్రం టీ20 ప్రపంచకప్ ఆడాలనే కోరిక గురించి పలుమార్లు బయటపెట్టారు.భారత క్రికెట్తో దెబ్బతిన్న సంబంధాలుమొత్తానికి అప్పటి బీసీబీ తీసుకున్న నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ ఐసీసీ టోర్నీ ఆడే అవకాశం కోల్పోవడంతో పాటు.. భారత్ క్రికెట్తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ద్వైపాక్షిక సిరీస్లను కొనసాగించాల్సిందిగా బీసీసీఐకి ఇటీవలే బీసీబీ కొత్త యాజమాన్యం లేఖ రాసింది.ఈ పరిణామాల నేపథ్యంలో ఏసీసీ మాజీ సీఈవో అష్రాఫుల్ హక్ తాజాగా రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘అప్పటి బీసీబీ చీఫ్ అమినుల్ ఇస్లాం బుల్బుల్ తీసుకున్న నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ భారత్కు వెళ్లవద్దని పన్నిన కుట్రలో ఆయన ఇరుక్కున్నట్లు అనిపించింది.భారత్ వ్యతిరేక సెంటిమెంట్తోఆసిఫ్ చెప్పగానే తాము భారత్కు వెళ్లట్లేదంటూ అమినుల్ ప్రకటించేశారు. ఆయన ఆటగాళ్ల తరఫున నిలబడాల్సింది. ‘మేము ఇండియాకు వెళ్తాము. టోర్నీ ఆడతాము. ఆటగాళ్లు ఇదే కోరుకుంటున్నారు. మ్యాచ్లు సజావుగా సాగేలా సహకరిస్తామని ఒప్పందాల మీద సంతకాలు కూడా చేశాము’ అని గట్టిగా చెప్పాల్సింది.అప్పుడైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చి ఉండేది. కానీ ఈ విషయంలో ఆసిఫ్దే తుది నిర్ణయం.. సొంత నిర్ణయం కూడా అనిపించింది. తమకున్న భారత్ వ్యతిరేక సెంటిమెంట్ను ఆటపై రుద్దాలని ఆయన ఎందుకు అనుకున్నాడో అర్థం కాలేదు. అతడు చేసిన పని బంగ్లాదేశ్ క్రికెట్ను తీవ్రంగా దెబ్బకొట్టింది. ఇది అస్సలు ఆమోదయోగ్యనీయం కాదు’’అని అష్రాఫుల్ హక్ పేర్కొన్నాడు. చదవండి: PSL: ఐపీఎల్ లేకుంటే బతుకే లేదు.. ఎంత పొగరు? -
1089 రోజుల రికార్డు పునరావృతం చేసిన బిష్ణోయ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన ఆసక్తికర సమరంలో ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తొలుత తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (63) ఆర్సీబీ పతనాన్ని అడ్డుకున్నాడు అతనికి రొమారియో షెపర్డ్ (22), వెంకటేశ్ అయ్యర్ (29 నాటౌట్) సహకరించారు. మిగతా బ్యాటర్లలో విరాట్ కోహ్లి (32) పర్వాలేదనిపించగా.. సాల్ట్ (0), పడిక్కల్ (14), కృనాల్ (1), జితేశ్ (5), టిమ్ డేవిడ్ (13) నిరాశపరిచారు. రాయల్స్ బౌలర్లలో బిష్ణోయ్ (4-0-32-2), బ్రిజేష్ శర్మ (4-0-32-2), ఆర్చర్ (3-0-33-2) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. సందీప్ శర్మ (4-0-47-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి పేట్రేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఆతర్వాత ధృవ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఫలితంగా రాయల్స్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. ఈ ఓటమి ఆర్సీబీకి ఈ సీజన్లో మొదటిది కాగా.. ఈ గెలుపుతో రాయల్స్ తమ అజేయ యాత్రను కొనసాగించింది. ఈ సీజన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో రాయల్స్ బౌలర్ రవి బిష్ణోయ్ ఓ ప్రత్యేక ఘనత సాధించాడు. విరాట్ను అద్భుతమైన గూగ్లీతో క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా.. 1089 కిందటి ఓ ఘట్టాన్ని పునరావృతం చేశాడు. విరాట్ ఐపీఎల్లో చివరిసారి 2023 ఎడిషన్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడే అతను ఈ తరహాలో వికెట్ సమర్పించుకున్నాడు. అంటే ఐపీఎల్లో విరాట్ 1089 రోజుల తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యాడన్న మాట. 2023 ఎడిషన్లో విరాట్ సీఎస్కే బౌలర్ ఆకాశ్ సింగ్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. -
‘గిల్ను కలవాలి’.. కూతురుకు మాజీ క్రికెటర్ షాక్!
క్రికెటర్లకు అభిమానులుండడం సహజం. కానీ మాజీ క్రికెటర్ కూతురు మరో క్రికెటర్కు అభిమానిగా ఉండడం, అతడిని కలవాలని కోరడం ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం. టీమిండియా మాజీ క్రికెటర్ వృద్దిమాన్ సాహా, అతడి కూతురు అన్వి మధ్య జరిగిన సంభాషణను సాహా భార్య రోమి మిత్రా సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో సాహా, కూతురు అన్వి మధ్య సంభాషణ ఆద్యంతం ఆకట్టుకుంది. విషయంలోకి వెళితే.. అన్వి శుబ్మన్ గిల్కు అభిమాని. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న గిల్ను కల్పించాలాంటూ అన్వి పదే పదే తండ్రి సాహాను రిక్వెస్ట్ చేసింది. అయితే దీనిపై సాహా కూతురుకు ఊహించని షాక్ ఇచ్చాడు. ‘గిల్ను కలవాలనుకోవడం ఓకే. కానీ అందరిలానే లైన్లో నిలబడి అతడిని కలవాల్సి ఉంటుంది. ఇందులో నీకు ఎలాంటి మినహాయింపు ఉండదు’ అని సాహా తన కూతురితో పేర్కొన్నాడు. అందుకు అన్వి.. ‘అదేంటి.. మీరు గిల్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారుగా’ అని గుర్తుచేసింది. దానికి సాహా ‘అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు నేను ఐపీఎల్ ఆడడం లేదు కదా’ అని నవ్వుతూ బదులిచ్చాడు. వీరిద్దరి మధ్య సంభాషణను సాహా భార్య రోమి మిత్రా రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. కాగా సాహా గతంలో గుజరాత్ టైటాన్స్ తరఫున గిల్తో కలిసి ఇన్నింగ్స్లు పంచుకున్న సంగతి తెలిసిందే. వృద్దిమాన్ సాహా ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఐపీఎల్ టైటిల్ సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్టులో సాహా సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు ఒక ఐపీఎల్ సీజన్ ఫైనల్లో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా సాహా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ కెరీర్లో 170 మ్యాచ్లాడిన సాహా 2,934 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా 13 అర్థశతకాలున్నాయి. ధోని హయాంలో పెద్దగా వెలుగులోకి రాలేకపోయిన వృద్దిమాన్ సాహా టీమిండియా తరఫున 40 టెస్టులు, 9 వన్డే మ్యాచ్లు ఆడాడు. 2024 రంజీ సీజన్లో బెంగాల్ తరఫున ఆడిన సాహా ఆ తర్వాత అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 2024-25 రంజీ సీజన్లో పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా బెంగాల్ ఆటగాళ్లు సాహాకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించారు. సాహా తన ఫస్ట్క్లాస్ కెరీర్లో 142 మ్యాచ్లాడి 7 వేలకు పైగా పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by Romi Mitra (@romi_mitra) చదవండి: నడిరోడ్డుపై చాహల్ హల్చల్! -
PSL: ఐపీఎల్ లేకుంటే బతుకే లేదు.. ఎంత పొగరు?
సౌతాఫ్రికా క్రికెటర్ రిలీ రొసోవ్పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ‘‘పొగరు, అహంకారంతో.. అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడితే నష్టపోయేది నువ్వే’’ అని హెచ్చరిస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారీ ధర?సఫారీ బ్యాటర్ రిలీ రొసోవ్ను 2026లో క్వెటా గ్లాడియేటర్స్ 5.5 కోట్ల రూపాయల ధరకు కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో ఇది రూ. 1.85 కోట్లకు సమానం. ఇక రావల్పిండిజ్తో శుక్రవారం నాటి మ్యాచ్లో రొసోవ్ గ్లాడియేటర్స్ తరఫున రాణించాడు. 42 బంతుల్లో 53 పరుగులు చేయడం ద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రిలీ రొసోవ్ను ఐపీఎల్ను అవమానపరిచే రీతిలో వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే పాకిస్తాన్ లీగ్లోనే క్రికెట్కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే.. ఇదే నిజమైన లీగ్ అంటూ అతి చేశాడు.క్రికెట్ కాదు.. బాలీవుడ్ ‘‘ఐపీఎల్ సుదీర్ఘ షెడ్యూల్ ఉన్న టోర్నమెంట్. అయితే, పీఎస్ఎల్ మాత్రం మంచి పోటీతత్వం ఉన్న లీగ్. ఐపీఎల్ను ఎక్కువగా బాలీవుడే నడిపిస్తుంది. కాబట్టి ఐపీఎల్ అంటే క్రికెట్ కంటే కూడా ఎక్కువగా బాలీవుడే (సినిమా రంగమే) గుర్తుకు వస్తుంది. పీఎస్ఎల్లో క్రికెట్కు ప్రాధాన్యం’’ అని రిలీ రొసోవ్ వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ నేపథ్యంలో పాక్ అభిమానులు.. ‘‘అవును.. భారత్లో నాణ్యమైన క్రికెట్కు తావు లేదు’’ అంటూ ఓవరాక్షన్ చేస్తుండగా.. ‘‘అందుకే కదా ఐసీసీ టైటిళ్లను టీమిండియా సులువుగా గెలిచేస్తుంటే.. పాక్ మాత్రం కనీసం సెమీస్ చేరలేక దిగజారిపోతోంది’’ అంటూ భారత నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. అదే సమయంలో.. ‘‘చాలా మంది క్రికెటర్లకు బతునిచ్చిందే ఐపీఎల్.. నీకెంత పొగరుంటే ఇలా మాట్లాడతావు’’ అంటూ రొసోవ్పై మండిపడుతున్నారు. కాగా రొసోవ్ 22 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 473 పరుగులు చేయగలిగాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఆటకు విరాట్ కోహ్లి ఫిదా... ఏమన్నాడంటే.. Shocking statement by Rilee Rossouw. 🤯"IPL is a very long tournament, and PSL is a much more compact tournament where the competition is a lot more fierce. IPL obviously has the whole Bollywood behind it, so it's a lot more of a movie than actual cricket". pic.twitter.com/ZwLugU3A5n— Salman. (@howeverhoe) April 11, 2026 -
నడిరోడ్డుపై చాహల్ హల్చల్!
పంజాబ్ కింగ్స్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ చిక్కుల్లో పడ్డాడు. పబ్లిక్ ప్లేస్లో అతడు ప్రవర్తించిన తీరును తప్పుబట్టిన క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమం వేదికగా ట్రోల్స్కు దిగారు. నడిరోడ్డుపై లగ్జరీ కారులో రయ్యిమని దూసుకెళ్లడం తప్పుకాకపోవచ్చు కానీ కాల్చిన సిగరేట్ను కనీసం ఆర్పాలనే సోయి లేకుండా దానిని రోడ్డు మీద పడేయడమేంటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగి ఉంటే దానికి చాహల్ బాధ్యత వహించేవాడా అని మండిపడ్డారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘సివిక్ సెన్స్ లేని క్రికెటర్ను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం.. అతడే యజ్వేంద్ర చాహల్. బహిరంగ ప్రదేశాల్లో కాల్చిన సిగరేట్ను ఆర్పి పడేయాలన్న సోయి అతడికి లేదు.’అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ‘డబ్బులు సంపాదించడం కాదు ముందు బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలనే బేసిక్ సెన్స్ నేర్చుకో’ అంటూ మరొక వ్యక్తి కామెంట్ చేశాడు. అయితే ఇటీవలే డివిలియర్స్తో జరిగిన ఇంటర్వ్యూలో తాను మందు మానేసి ఆరు నెలలకు పైనే అయినట్లు పేర్కొన్నాడు. ఫిట్నెస్, ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండడం కోసమే ఈ చర్యకు పూనుకున్నట్లు తెలిపాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న చాహల్ మూడు మ్యాచ్లు కలిపి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వరుసగా రెండు విజయాలతో దూకుడు మీద ఉంది. కేకేఆర్తో జరిగిన మూడో మ్యాచ్ వర్షార్పణం కావడంతో 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. ముల్లన్పూర్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.Yuzvendra Chahal spotted smoking and throwing a lit cigarette on the road while driving on highways in Chandigarh 🤯 pic.twitter.com/V3gcYTK5n0— Deepu (@deepu_drops) April 11, 2026🚨 YUZVENDRA CHAHAL EXPOSED 🚨Yuzvendra Chahal recently went on a podcast claiming he’s “quit everything” for his body and career longevity at 35. Fast forward to today: a viral video shows him smoking while driving. 🚭🏎️ pic.twitter.com/jgngkg5Wdd— Cricket Central (@CricketCentrl) April 10, 2026చదవండి: సాకర్ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్! -
పాక్ బౌలర్ను ‘అవమానించిన’ న్యూజిలాండ్ స్టార్?
పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అతడి బౌలింగ్ శైలిపై న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ మైదానంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో అంపైర్ రంగంలోకి పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది.121 పరుగులకే ఆలౌట్పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)-2026 టోర్నీలో డారిల్ మిచెల్ రావల్పిండిజ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఉస్మాన్ తారిఖ్ క్వెటా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు. కరాచీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన రావల్పిండిజ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గ్లాడియేటర్స్ బ్యాటింగ్కు దిగింది.నిర్ణీత 20 ఓవర్లలో గ్లాడియేటర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన రావల్పిండిజ్ 17.3 ఓవర్లలో కేవలం 121 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తద్వారా 61 పరుగుల భారీ తేడాతో గ్లాడియేటర్స్ చేతిలో ఓటమిపాలైంది.పాక్ బౌలర్కు ‘అవమానం’!ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రావల్పిండిజ్ స్టార్ డారిల్ మిచెల్.. గ్లాడియేటర్స్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్లో తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. అతడు వేసిన తొలి బంతిని ప్యాడిల్ స్వీప్ షాట్ ఆడిన డారిల్.. తర్వాత ఉస్మాన్ పాజ్ ఇస్తూ తనదైన శైలిలో బౌలింగ్ చేయగా.. వికెట్ల నుంచి దూరంగా వెళ్లిపోయాడు.తాను సిద్ధంగా లేనని సైగ చేస్తూ రెండుసార్లు ఇలాగే చేశాడు. దీంతో అంపైర్ వచ్చి ఆటను కొనసాగించాలని చెప్పగా..డారిల్ అన్యమస్కంగానే అందుకు అంగీకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో డారిల్ చర్య పాక్ బౌలర్కు అవమానం లాంటిదేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో డారిల్ మిచెల్ 32 బంతుల్లో 30 పరుగులు చేసి సౌద్ షకీల్ బౌలింగ్లో అవుటయ్యాడు.అప్పట్లో అశూ మద్దతుకాగా ఉస్మాన్ తారిఖ్ క్రీజు వద్ద కాస్త ఆగి బంతిని రిలీజ్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. దీంతో అతడు బౌలింగ్ చేయకుండా బంతిని విసురుతాడనే విమర్శలు ఉన్నాయి. అయితే, ఐసీసీ మాత్రం అతడిపై శైలిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయంలో ఉస్మాన్కు అండగా నిలిచాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఆటకు విరాట్ కోహ్లి ఫిదా... ఏమన్నాడంటే..Daryl Mitchell refuses to face Usman Tariq 😂 #QTGVRWP pic.twitter.com/2CO6z4NvR9— Nibraz Ramzan (@nibraz88cricket) April 10, 2026 -
సాకర్ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్!
మరో రెండు నెలల్లో సాకర్ మహాసంగ్రామం మొదలుకానుంది. జూన్ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్ ప్రారంభం కానుండడంతో టోర్నీకి సంబంధించి పాల్గొనబోయే జట్లు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఇప్పటికే ఫిఫా సమాఖ్య విడుదల చేసింది. అయితే ఫుట్బాల్ ఆటను మైదానంలో వీక్షిస్తే వచ్చే మజానే వేరు. 90 నిమిషాల్లో ముగిసిపోయే మ్యాచ్ చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుం టారు. సాకర్ ఫీవర్ ఉన్నన్నాళ్లు స్టేడియాలన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోవడం ఖాయం. కానీ 2026 ఫిఫా ప్రపంచకప్కు సంబంధించి టికెట్ల ధరల విషయం మాత్రం ఒక ఆందోళన కలిగిస్తోంది. ఈసారి టికెట్ రేట్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సాధారణ అభిమానులకు మ్యాచ్ వీక్షించడం సాధ్యమయ్యేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడాది ప్రపంచ కప్ టికెట్ల ధరలను ఫిఫా భారీగా పెంచేసింది. ఇప్పటికే ఉన్న కేటగిరీలకు తోడు కొత్తగా ‘ఫ్రంట్ కేటగిరీ’ పేరుతో మరింత ఖరీదైన టిక్కెట్లను ప్రవేశపెట్టింది. దీంతో మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ అభిమానులకు ఖరీదైన వ్యవహారంగా మారనుంది. జూన్ 12న అమెరికాలోని ఇంగిల్వుడ్లో జరిగే అమెరికా ఆరంభ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముందువరుసలోని ‘ఫ్రంట్ కేటగిరీ’ ఒక టికెట్ ధర 4,105 డాలర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.3.4 లక్షలు . గతంలో ఇదే కేటగిరీ గరిష్ట ధర 2,735 డాలర్లు (సుమారు రూ.2.25 లక్షలు)గా ఉండేది. ఇప్పుడు కొత్త కేటగిరీలతో ధరలు మరింత పెరిగాయి.అదేవిధంగా, ఫీఫా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఫ్రంట్ కేటగిరీ 2’టికెట్ల ధరలు 1,940 నుంచి 2,330 డాలర్ల వరకు ఉన్నాయి. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1.6 లక్షల నుంచి రూ.1.9 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కెనడా ఆరంభ మ్యాచ్కు కూడా ఫ్రంట్ కేటగిరీ ఒక టికెట్ ధర 3,360 (సుమారు రూ.2.8 లక్షలు)గా నిర్ణయించారు. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్కు కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఫిలడెల్ఫియాలో జరిగే మ్యాచ్కు టికెట్ ధర 905 డాలర్లు (సుమారు రూ.75,000)గా ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే, టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.న్యూజెర్సీలోని మెట్అఫ్ స్టేడియంలో జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్ గరిష్ట ధర 10,990 డాలర్లుగా నిర్ణయించగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.9 లక్షలకు పైగా ఉంటుంది. డిసెంబర్ లో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లు (సుమారు రూ.7.20 లక్షలు)గా ఉండేది. అదే విధంగా, కేటగిరీ 2 టికెట్లు 5,575 నుంచి 7,380 డాలర్లు (రూ.4.6 లక్షలు – రూ.6.1 లక్షలు), కేటగిరీ 3 టికెట్లు 4,185 నుంచి 5,785 డాలర్లు (రూ.3.5 లక్షలు - రూ.4.8 లక్షలు) వరకు పెరిగాయి. మొత్తం మీద యుద్ధం ప్రభావం, ఆర్థిక అనిశ్చితి ఫిఫా ప్రపంచకప్ టికెట్ ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రీమియం అనుభవం పేరుతో ఫిఫా కొత్త కేటగిరీలను తీసుకువచ్చినప్పటికీ, సాధారణ అభిమానులకు మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించడం కష్టతరంగా మారింది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: ‘అడ్డుగోడలా నిలబడితే విజయం ఎలా వస్తుంది?’ -
వైభవ్ సూర్యవంశీ ఆటకు విరాట్ కోహ్లి ఫిదా
రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్లో అతడు విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు. లక్ష్యం ఎంతైనా.. ప్రత్యర్థి ఎవరైనా బంతిని బాదడమే లక్ష్యంగా ముందుకు సాగిపోయాడు.26 బంతుల్లోనే 78 పరుగులతోబెంగళూరు విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లోనే 78 పరుగులతో దుమ్ములేపాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉండటం విశేషం. వైభవ్కు తోడు ధ్రువ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్) రాణిచండంతో రాయల్స్ 18 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026కోహ్లి సైతం ఫిదాఇక వైభవ్ ఆటను చూసి ఆర్సీబీ దిగ్గజం, టీమిండియా లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. ఈ బిహారీ పిల్లాడిపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని అభినందించాడు. అంతేకాదు.. వైభవ్ రాయల్స్ క్యాప్పై.. ‘‘ప్రియమైన వైభవ్.. అత్యద్భుతంగా ఆడావు’’ అని రాసి తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా సొంతమైదానం గువాహటి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. కోహ్లి (16 బంతుల్లో 32), కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63) రాణించారు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్ (11 బంతుల్లో 22), వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించారు.ఇక లక్ష్య ఛేదనలో వైభవ్, ధ్రువ్ జురెల్లతో పాటు రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24) కూడా తన వంతు సహకారం అందించాడు. కాగా ఈ సీజన్లో వైభవ్ ఇప్పటికి నాలుగు మ్యాచ్లలో కలిపి 200 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ విజేతగా కొనసాగుతున్నాడు. Player of the Match ✅Orange Cap ✅An autograph from Kohli 🐐✅Good night to everyone and remember to keep believing in yourself no matter what 💗 pic.twitter.com/Up2BZuYObM— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2026 -
విజేత నైశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గోండ్వానా కప్ అఖిల భారత టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ గనగామ నైశిక్ రెడ్డి విజేతగా నిలిచాడు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నైశిక్ 7–6 (7/4), 6–4తో టాప్ సీడ్ ప్రసాద్ ఇంగాలె (మహారాష్ట్ర)ను బోల్తా కొట్టించాడు. సెమీఫైనల్లో నైశిక్ 7–6 (7/5), 6–2తో మహదేవ్ బంగార్గి (మహారాష్ట్ర)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో ముకేశ్ చావ్డా (గుజరాత్)పై గెలుపొందాడు. విజేత నైశిక్కు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావ్ విన్నర్స్ ట్రోఫీ అందజేశారు. హైదరాబాద్లో జాతీయ గ్రాస్కోర్టు మాజీ చాంపియన్ సురేశ్ కృష్ణ, కాజా వినాయక్ శర్మ, ఒలింపియన్ విష్ణువర్ధన్ పర్యవేక్షణలో నైశిక్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
‘అడ్డుగోడలా నిలబడితే విజయం ఎలా వస్తుంది?’
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరుకు రాజస్తాన్ రాయల్స్ అడ్డుకట్ట వేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ స్పందించాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో ఆరంభంలో మంచి స్టార్ట్ లభించినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ అద్భుతంగా ఆడి మా నుంచి విజయాన్ని లాగేసుకున్నారని పటిదార్ తెలిపాడు. ‘పవర్ప్లేను మేము ప్రారంభించిన తీరు, వికెట్లు పడినప్పటికీ ఆ తర్వాత 202 పరుగులు చేయడం అన్నీ సానుకూలంగానే జరిగాయి. రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే జైస్వాల్ ఔటవ్వడంతో పట్టు చిక్కిందని భావించాం. కానీ వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అతడు సృష్టించిన విధ్వంసం మాకు విజయాన్ని దూరం చేసిందని చెప్పొచ్చు. వైభవ్, జురేల్లు అడ్డుగోడల్లా నిలబడితే మాకు విజయం ఎలా వస్తుంది చెప్పండి. ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ను ఇంపాక్ట్గా ఉపయో గించడం కొంత స్ట్రాటజీ ఉంది. తొలి మూడు మ్యాచ్ల్లో ఆ స్ట్రాటజీ బాగా పని చేసింది. కానీ ఈ మ్యాచ్లో అది దెబ్బకొట్టింది. వెంకటేశ్, షెపర్డ్, కృనాల్ పాండ్యా రూపంలో ముగ్గురు బౌలర్లు ఉండడంతో సుయాశ్ అవసరం ఉండదని భావించాం. ఐపీఎల్ లాంటి పోటీతరమైన క్రికెట్లో తప్పులు జరగడం సహజం. కానీ రాబోయే మ్యాచ్ల్లో ఆ తప్పులన్నీ సరిదిద్దుకొని మళ్లీ ట్రాక్ ఎక్కుతాం’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్ 63 పరుగులు చేశాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ (82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్లో ఆదివారం ముంబై ఇండియన్స్తో తలపడనుంది. చదవండి: అమ్మ ఆశీర్వాదంతో బరిలోకి.. ఆపై దంచికొట్టి ! -
అమ్మ ఆశీర్వాదంతో బరిలోకి.. ఆపై దంచికొట్టి !
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. ముఖ్యంగా టాపార్డర్లో ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్లో ఎవరో ఒకరు ఇన్నింగ్స్ కడదాకా నిలిచి జట్టును గెలిపిస్తున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు లీగ్లో నాలుగు మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 266 స్ట్రైక్రేట్తో 200 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లోనూ వైభవ్ విధ్వంసం కొనసాగింది. కేవలం 26 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. సీజన్లో అతడికి ఇది రెండో అర్థసెంచరీ. వైభవ్ విధ్వంసం ఇలాగే కొనసాగుతూ పోతే ఆరెంజ్ క్యాప్ గెలవడంతో పాటు రాజస్తాన్కు కప్ అందించినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్కు ముందు వైభవ్ సూర్యవంశీ చేసిన ఒక పని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వైభవ్ మ్యాచ్ ఆడేందుకు హోటల్ రూమ్ నుంచి బయల్దేరిన సమయంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తల్లి బయట నిలబడింది. పరాగ్ తల్లిని గమనించిన వైభవ్ వెంటనే ఆమె దగ్గరికి వచ్చి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అయితే పరాగ్ తల్లి మాత్రం వైభవ్ను వద్దంటూ వారించి హగ్ చేసుకొని ‘ఆల్ ది బెస్ట్’ చెప్పడం వీడియోలో కనిపించింది. వైభవ్ చేసిన పనిని అభిమానులు మెచ్చుకున్నారు . ‘అమ్మ ఎవరికైనా అమ్మే’.. ‘పరాగ్ తల్లి పెద్ద మనసుతో వైభవ్ను ఆశీర్వదించడం గొప్ప విషయం’ అంటూ కామెంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్ 63 పరుగులు చేశాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ (82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: ‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’ Vaibhav Sooryavanshi touched the feet of Riyan Parag's mother and took her blessings before the RCB vs RR match. ❤Vaibhav Sooryavanshi is a down-to-earth, pure desi boy. pic.twitter.com/Djgqn5mUiY— Sonu (@Cricket_live247) April 10, 2026 -
‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ మెరుపు ఇన్నింగ్స్లతో రాజస్తాన్ సునాయాసంగా గెలుపొందింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. వరుసగా నాలుగు విజయాలు సాధించడం సంతోషంగా అనిపిస్తున్నప్పటికీ బౌలింగ్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. పరాగ్ మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా ఈ వేదికపై మా రికార్డు అంత ఆశాజనకంగా లేదు, కానీ ఈరోజు ఆట తీరు బాగుంది. అయితే బౌలర్లు ఇంకాస్త క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంది. ప్రత్యర్థి జట్టు 200 పరుగులు చేసేలా కనిపించినా.. మధ్య ఓవర్లలో వికెట్లు తీసి వారిని కట్టడి చేశాం. కానీ నిజానికి వారిని 170 పరుగుల లోపే నియంత్రించి ఉండాల్సింది. కెప్టెన్గా నేను కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. మా బౌలర్లు కొన్ని సందర్భాల్లో బ్యాటర్లకు అవకాశం ఇవ్వడం వారికి అనుకూలంగా మారింది. గౌహతి, జైపూర్లలో మేము చేసిన ముందస్తు సన్నద్ధత ఇక్కడ పనిచేసింది. గ్రౌండ్పై ఉన్న నల్లమట్టి పిచ్ ఎలా ప్రవర్తిస్తుందనేది మాకు ముందే తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా మారడమే ఒక జట్టుగా మా లక్ష్యం. ఇప్పటివరకు మేము స్టిక్కీ పిచ్లపై ఆడాము, బ్యాటింగ్కు అనుకూలమైన 'బెల్టర్' పిచ్ లభిస్తే మా ఆట ఇంకా అద్భుతంగా ఉంటుంది. వైభవ్ జట్టులో అందరికీ ఇష్టమైన వ్యక్తి. అతను ఇంకా చిన్న పిల్లాడు, అతనికి బయట తిరగడం, రకరకాల ఆహార పదార్థాలు తినడం అంటే చాలా ఇష్టం. మేము అతనికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాము. అన్నింటికంటే ముఖ్యంగా అతనికి బ్యాటింగ్ అంటే పిచ్చి ప్రేమ. వైభవ్ విధ్వంసం ఇలాగే కొనసాగితే మా పని సులువైపోతుంది.’ అని చెప్పుకొచ్చాడు. 𝙐𝙣𝙗𝙚𝙖𝙩𝙚𝙣 & 𝙐𝙣𝙨𝙩𝙤𝙥𝙥𝙖𝙗𝙡𝙚 🫡A sensational win for #RR to sign off from Guwahati in style 🩷Scorecard ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/eNq8gglcrL— IndianPremierLeague (@IPL) April 10, 2026చదవండి: ‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’ -
అనూహ్య మార్పు.. జూనియర్ హాకీ జట్టుకు కొత్త కోచ్
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు టిమ్ వైట్ కొత్త కోచ్గా ఎంపికయ్యాడు. 2023 నుంచి మన అమ్మాయిల జట్టుకు తుషార్ ఖండేకర్ కోచ్గా వ్యవహరిస్తుండగా... అతడి స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉన్న ఆస్ట్రేలియాకు చెందిన వైట్ను హాకీ ఇండియా (హెచ్ఐ) కొత్త కోచ్గా నియమించింది. కోచ్ మార్పునకు కారణం వెల్లడించని హాకీ ఇండియా... వైట్ ఎప్పటి వరకు ఆ పదవిలో ఉంటాడనే అంశంలోనూ స్పష్టతనివ్వలేదు. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో వైట్ తమిళనాడు డ్రాగన్స్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. గతంలో బెల్జియం, ఆ్రస్టేలియా జూనియర్ జట్లకు కూడా వైట్ కోచ్గా పనిచేశాడు. వైట్ శిక్షణలో బెల్జియం అండర్ –21 మహిళల జట్టు జూనియర్ ప్రపంచకప్ కప్లో కాంస్య పతకం నెగ్గింది. 2021 నుంచి 2024 వరకు బెల్జియం సీనియర్ జట్టుతోనూ వైట్ కలిసి పనిచేశాడు. ఆ సమయంలో విశేషంగా రాణించిన బెల్జియం జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్లో 12వ స్థానం నుంచి మూడో ‘ప్లేస్’కు చేరింది. ఆస్ట్రేలియాకు కోచ్గా వ్యవహరించిన సయమంలో జూనియర్ ప్రపంచకప్లో ఆ జట్టు కాంస్యం గెలిచింది. ‘తమిళనాడు డ్రాగన్స్ జట్టుకు కోచ్గా భారత్లో చాలా సమయం గడిపా. అక్కడి హాకీ ఘన సంస్కృతి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జూనియర్ వరల్డ్కప్లో భాగంగా... భారత్తో జరిగిన మ్యాచ్ల సమయంలో యువ నైపుణ్యం నన్ను కట్టిపడేసింది. అలాంటి అత్యుత్తమ అథ్లెట్లతో పూర్తిస్థాయిలో కలిసి పనిచేయనుండటం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. సీనియర్ జట్టులో స్థానం కోసం పోటీపడగల సామర్థ్యం ఉన్న పటిష్టమైన ప్లేయర్లను తయారు చేయడమే నా లక్ష్యం. అటాకింగ్ గేమ్కు పదును పెడుతూనే... డిఫెన్స్లోనూ మరింత క్రమశిక్షణ పెంచాలని భావిస్తున్నా. మైదానంలో అడుగు పెట్టిన తర్వాత 60 నిమిషాల పాటు అత్యున్నత స్థాయిలో రాణించేందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధం కావడం చాలా ముఖ్యం. ఒత్తిడిలోనూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగడంపై దృష్టి పెట్టి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాం. సీనియర్ స్థాయి ప్లేయర్లను సైతం ఓడించగల ఆత్మస్థైర్యం ఉన్న ప్లేయర్లను తీర్చిదిద్దుతా’ అని వైట్ అన్నాడు. కొత్త కోచ్ రాకతో మన హాకీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అన్నాడు. ‘ఆస్ట్రేలియా, బెల్జియం జూనియర్ జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉన్న వైట్... భారత జట్టుతో చేరడంతో మన ప్లేయర్ల నైపుణ్యాలు కూడా మరింత పెరుగుతాయి. అతడి అనుభవం మనజట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని టిర్కీ పేర్కొన్నాడు. చదవండి: ‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’ -
‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్లు కొనసాగుతూనే ఉన్నాయి. క్రీజులోకి వచ్చిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో వైభవ్ 26 బంతుల్లోనే 78 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. క్రీజులో ఉన్నప్పుడు బౌలర్వైపు కన్నెత్తి చూడనని, కేవలం బంతిపైనే తన దృష్టి ఉంటుందని వైభవ్ పేర్కొన్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ‘కేక్ కటింగ్ లాంటిది ఏమీ లేదు. ఈరోజు తొందరగా పడుకోవాలి, ఎందుకంటే తెల్లవారి ఉదయమే మేము ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. నాకు భయం లేదని అనుకోవద్దు. అయితే ప్రాక్టీస్లో ఏదైతే అనుసరిస్తున్నానో మ్యాచ్లోనూ అదే గేమ్ను ఆడుతున్నా తప్పిస్తే దానికి అదనంగా ఏమీ చేయడం లేదు. ఎదురుగా బుమ్రా, హాజిల్వుడ్ లాంటి అంతర్జాతీయ స్టార్ బౌలర్లు ఉన్నప్పటికీ వారిని ఎదుర్కోవడానికి నా ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. నా మైండ్లో ఒకటే ఫిక్స్ అయ్యా. బౌలర్ ఎవరయినా సరే బెరుకు లేకుండా ఆడుతూ షాట్స్ ఆడాలని నిర్ణయించుకున్నా. కనీసం బౌలర్ ఎవరన్నది కన్నెత్తి కూడా చూడను. కేవలం బౌలర్ వేసే బంతిపైనే ఫోకస్ ఉంటుంది. ఆ బంతి ఎలా వస్తుంది? ఏ షాట్ ఆడాలి అన్నదే మైండ్లో తిరుగుతుంది. అందుకే ఎదుట ఎంత పెద్ద బౌలర్ ఉన్నా భయపడకుండా నా గేమ్ నేను ఆడుకుంటాను. ఇక నన్ను గైడ్ చేస్తున్న వాళ్లలో నా తండ్రితో పాటు కోచ్లు ఉన్నారు. ముఖ్యంగా రోమీ సార్ నా గార్డియన్. వీళ్లంతా నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, నువ్వు ఈ జర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుందని, అందుకు ఆటపైనే దృష్టి పెట్టాలని ఇతర ఆలోచనలు వదిలేయాలని పదే పదే నన్ను మోటివేట్ చేస్తుంటారు. ఔటవ్వడంపై పెద్దగా బాధ లేదు. ఎందుకంటే నేను ఉండుంటే నా నుంచి మరో 10 నుంచి 20 పరుగులు వచ్చేవి. టార్గెట్ కూడా రెండు ఓవర్ల ముందే ఫినిష్ అయిపోయేదేమో. ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే 10 నుంచి 20 పరుగులు ఎక్కువ చేసేవాళ్లమే. కాబట్టి నేను పేలవమైన షాట్ ఆడి ఔట్ అయితే జట్టుకు మైనస్ అయ్యేది అని బాధపడేవాడిని. కానీ ఆ చాన్స్ తీసుకోలేదు.’అని చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్ 63 పరుగులు చేశాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ (82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026Never satisfied. Never settling for less 🫡🎥 THE VAIBHAV SOORYAVANSHI MINDSET ✨#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/rdwKH9eReH— IndianPremierLeague (@IPL) April 10, 2026చదవండి: మొన్న బుమ్రా.. నేడు హాజిల్వుడ్! ఎవరైతే నాకెంటి? -
మొన్న బుమ్రా.. నేడు హాజిల్వుడ్! ఎవరైతే నాకేంటి?
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. మొన్న ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు చుక్కలు చూపించిన వైభవ్.. నేడు ఆర్సీబీతో మ్యాచ్లో వరల్డ్ క్లాస్ బౌలర్లు జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్లను ఉతికారేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో వైభవ్ వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 18 పరుగులు పిండుకున్నాడు. అనుభవజ్ఞుడైన హాజిల్వుడ్ను ఒక నెట్ బౌలర్లా వైభవ్ ఆడుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ కూడా వైభవ్ సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు.రెండు సిక్స్లు, ఓ ఫోర్తో 16 పరుగులు రాబట్టాడు. దీంతో ఈ బిహార్ ఆటగాడు కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో వైభవ్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ నాలుగు మ్యాచ్లు 266.67 స్ట్రైక్ రేటుతో 200 పరుగులు చేశాడు. వైభవ్ బ్యాటింగ్కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ప్రపంచ క్రికెట్లో అత్యంత డేంజరస్ బ్యాటర్ వైభవ్ అని కొనియాడుతున్నారు.చదవండి: IPL 2026: ఆర్సీబీ ఓపెనర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనేVaibhav Sooryavanshi in IPL1st ball v Bumrah - 61st ball v Bhuvi - 41st ball v Shardul - 61st ball v Washington- 61st ball v Arshdeep - 41st ball v Hazlewood - 4Unreal Talent, Unreal Hitting pic.twitter.com/XGQT8SnR4u— Cricketopia (@CricketopiaCom) April 10, 2026 -
వారెవ్వా వైభవ్
విజయలక్ష్యం ఎంతైతేనేమి... ప్రత్యర్థి ఎవరైతేనేమి... 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి లెక్కే లేదు... అతనికి తెలిసిందల్లా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటమే... ఐపీఎల్లో మరోసారి అతను తన విధ్వంసక రూపాన్ని ప్రదర్శించాడు. ఫలితంగా రాజస్తాన్ రాయల్స్కు వరుసగా నాలుగో విజయం దక్కగా, బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. 202 పరుగుల ఛేదనలో వైభవ్ 78 పరుగుల సహాయంతో 49 బంతుల్లోనే 129కి చేరిన రాజస్తాన్కు మిగిలిన 73 పరుగులు రాబట్టడంలో ఇబ్బంది రాలేదు. ధ్రువ్ జురేల్ కూడా అర్ధ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. గువాహటి: ఐపీఎల్లో మాజీ విజేత రాజస్తాన్ రాయల్స్ దూసుకుపోతోంది. శుక్రవారం దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో రాజస్తాన్ ఆరు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయంకంటే 70 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.కెప్టెన్ రజత్ పాటీదార్ (40 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లి (16 బంతుల్లో 32; 7 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచింది. వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్స్లు) చెలరేగిపోగా, ధ్రువ్ జురేల్ (43 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. రాణించిన కోహ్లి... ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సాల్ట్ (0) వెనుదిరిగినా.... కోహ్లి కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. ఆర్చర్ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను సందీప్ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. పడిక్కల్ (14) విఫలం కాగా, చక్కటి బంతితో కోహ్లిని బౌల్డ్ చేసి బిష్ణోయ్ దెబ్బ తీశాడు. పవర్ప్లేలో ఆర్సీబీ 61 పరుగులు చేయగా, తక్కువ వ్యవధిలో కృనాల్ పాండ్యా (1), జితేశ్ శర్మ (5), టిమ్ డేవిడ్ (13) అవుటయ్యారు. షెఫర్డ్ (11 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుకు జడేజా అడ్డుకట్ట వేశాడు. ఆఖరి 6 ఓవర్లలో 76 పరుగులు... ఆర్సీబీ స్కోరు 14 ఓవర్లలో 125/7... తడబడుతూ ఆడిన కెపె్టన్ పాటీదార్ 26 బంతుల్లో 27 పరుగులే చేయగా... తప్పనిసరి స్థితిలో బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు)ను ఇంపాక్ట్ సబ్గా జట్టు బరిలోకి దిగింది. ఈ దశలో పాటీదార్ చెలరేగిపోయాడు. తర్వాతి 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో అతను 36 పరుగులు రాబట్టాడు. బర్గర్, బిష్ణోయ్ ఓవర్లలో అతను రెండేసి సిక్సర్లు బాది 35 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అతను అవుటైన తర్వాత వెంకటేశ్ బాధ్యత తీసుకున్నాడు. సందీప్ వేసిన చివరి ఓవర్లో వెంకటేశ్ ఫోర్, 2 సిక్స్లు బాదడంతో స్కోరు 200 దాటింది. జురేల్ జోరు... భారీ ఛేదనలో రాజస్తాన్ వేగంగా దూసుకుపోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన హాజల్వుడ్ ఓవర్లో 2 సిక్స్లు బాదిన యశస్వి జైస్వాల్ (13) అదే ఓవర్లోనే వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ వైభవ్ తనదైన శైలిలో చెలరేగిపోగా, జురేల్ కూడా దూకుడు ప్రదర్శించాడు. అభినందన్ ఓవర్లో జురేల్ వరుసగా 4, 6, 4, 0, 6, 4తో ఏకంగా 24 పరుగులు సాధించడంతో పవర్ప్లే ముగిసేసరికే స్కోరు 97కు చేరింది. ఎట్టకేలకు కృనాల్ వరుస బంతుల్లో వైభవ్, హెట్మైర్ (0)లను అవుట్ చేయగా, పరాగ్ (3) విఫలమయ్యాడు. ఈ దశలో రాయల్స్ కాస్త నెమ్మదించింది. వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే జురేల్, రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్) సంయమనంతో ఆడి జట్టును గెలిపించారు. మళ్లీ అదే బాదుడు... వైభవ్ సూర్యవంశీ మరోసారి తన స్థాయిని, సత్తాను ఈ మ్యాచ్లోనూ ప్రదర్శించాడు. భువీ వేసిన మొదటి ఓవర్లో 2 ఫోర్లతో మొదలు పెట్టిన అతను అభినందన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. గత మ్యాచ్లో బుమ్రాపై చెలరేగిన తరహాలోనే ఈసారి మరో అంతర్జాతీయ స్టార్ బౌలర్ హాజల్వుడ్ పని పట్టాడు. హాజల్వుడ్ ఓవర్లో వైభవ్ వరుసగా 4, 4, 4, 6తో చెలరేగిపోయాడు. భువీ వేసిన తర్వాతి ఓవర్లోనూ 2 సిక్స్లు, ఫోర్ బాదిన అతను 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్తాన్ను నిలువరించే ప్రయత్నంలో పార్ట్టైమర్ డేవిడ్ను ఆర్సీబీ బౌలింగ్కు దింపగా, వైభవ్ వరుసగా రెండు సిక్సర్లతో దాడి చేశాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న అతడిని చివరకు కృనాల్ నిలువరించగలిగాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 0; కోహ్లి (బి) బిష్ణోయ్ 32; పడిక్కల్ (సి) హెట్మైర్ (బి) ఆర్చర్ 14; పాటీదార్ (సి) ఫెరీరా (బి) సందీప్ 63; కృనాల్ (సి) హెట్మైర్ (బి) బిష్ణోయ్ 1; జితేశ్ (ఎల్బీ) (బి) బ్రిజేశ్ 5; డేవిడ్ (సి) హెట్మైర్ (బి) బ్రిజేశ్ 13; షెఫర్డ్ (సి) బ్రిజేశ్ (బి) జడేజా 22; వెంకటేశ్ (నాటౌట్) 29; భువనేశ్వర్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–0, 2–45, 3–58, 4–62, 5–76, 6–94, 7–125, 8–166. బౌలింగ్: ఆర్చర్ 3–0–33–2, బర్గర్ 3–0–32–0, సందీప్ 4–0–47–1, రవి బిష్ణోయ్ 4–0–32–2, జడేజా 2–0–14–1, బ్రిజేశ్ 4–0–37–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) జితేశ్ (బి) హాజల్వుడ్ 13; వైభవ్ (సి) కోహ్లి (బి) కృనాల్ 78; జురేల్ (నాటౌట్) 81; హెట్మైర్ (సి) హాజల్వుడ్ (బి) కృనాల్ 0; పరాగ్ (సి) కృనాల్ (బి) హాజల్వుడ్ 3; జడేజా (నాటౌట్) 24 ; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో 4 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–21, 2–129, 3–129, 4–134. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–37–0, హాజల్వుడ్ 4–0–44–2, అభినందన్ 3–0–54–0, కృనాల్ పాండ్యా 4–0–30–2, డేవిడ్ 1–0–18–0, షెఫర్డ్ 2–0–18–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X హైదరాబాద్ వేదిక: న్యూ చండీగఢ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచిచెన్నై X ఢిల్లీ వేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
నాన్న త్యాగం...ధోనిపై అభిమానం
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ ముకుల్ చౌదరీ గురువారం కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో ఏడు సిక్సర్లతో మోత మోగించి తన జట్టును గెలిపించాడు. అయితే ఈ ఏడింటిలో తాను కొట్టిన మొదటి సిక్సర్ అన్నింటికంటే ఎక్కువగా నచ్చిందని ముకుల్ మ్యాచ్ తర్వాత చెప్పాడు. వైభవ్ అరోరా వేసిన 17వ ఓవర్లో ఈ సిక్స్ వచ్చింది. అరోరా వేసిన యార్కర్ను హెలికాప్టర్ షాట్తో లాంగాన్ మీదుగా సిక్స్ బాదిన ముకుల్ తాను ఆరాధించే ధోనిని గుర్తుకు తెచ్చాడు. ధోనిపై ఇష్టంతో క్రికెట్లోకి వచ్చిన ముకుల్ ఇప్పుడు ఒక్క ఐపీఎల్ మ్యాచ్తో స్టార్గా మారిపోయాడు. – సాక్షి క్రీడా విభాగంరాజస్తాన్కు చెందిన ముకుల్ ఐపీఎల్లో తన తొలి సీజన్ ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్లో 14 పరుగులకే పరిమితమైన అతను రెండో మ్యాచ్లో 2 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఆడిన ఐదు బంతుల్లోనూ అతను కాస్త తడబడ్డాడు. అయితే ఎక్కువగా ఆందోళన చెందవద్దని, నచ్చినట్లుగా ఆడమని కెపె్టన్ రిషభ్ పంత్ ధైర్యాన్నందించాడు. దాంతో కోల్కతాతో మ్యాచ్కు ముందు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ముకుల్ అన్నాడు. ‘ఐదు మ్యాచ్లు ఆడినా 50 మ్యాచ్లు ఆడినా ఎవరిపైనైనా ఒత్తిడి సహజం. అందులోనూ నేను తొలిసారి ఐపీఎల్లో ఆడుతున్నాను. కాబట్టి జట్టు మనపై నమ్మకం ఉంచినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్లలో కూడా ఒత్తిడి ఉంటుంది. దేశవాళీ క్రికెట్లో కూడా మంచి ప్రదర్శన తర్వాతే ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఇక్కడ బాగా ఆడినప్పుడు వచ్చే గుర్తింపు, పేరు ఎంతో భిన్నం. బయటి అంశాల గురించి పట్టించుకోకుండా మనపై మనం నమ్మకం ఉంచి ఆడటం ముఖ్యం’ అని ముకుల్ వ్యాఖ్యానించాడు. ఆ షాట్ అంటే ఇష్టం... అరోరా బౌలింగ్లో ముకుల్ కొట్టిన హెలికాప్టర్ షాట్పై అన్ని వైపుల నుంచి నుంచి ప్రశంసలు కురిశాయి. ‘మొదటి నుంచి నేను ధోనికి వీరాభిమానిని. వికెట్ కీపర్ అయిన నేను ధోనిలాగే ఏడో స్థానంలో ఆడుతున్నా. ఆయన మ్యాచ్లను ముగించే తీరు నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచే హెలికాప్టర్ షాట్ను ఎంతో ప్రాక్టీస్ చేశాను. ఆ షాట్ నాకు చాలా నచ్చేది. యార్కర్ను ధోని సిక్సర్గా మలిచేవాడు. అలాంటి బంతిని సిక్స్ కొట్టడం అంటే బౌలర్పై మన ఆధిపత్యం ఏమిటో తెలుస్తుంది. భారీ షాట్లు కొట్టే విధంగా బలమైన శరీర నిర్మాణం నాకుంది. నేను సాధన కూడా చాలా చేస్తాను. ప్రతీ రోజూ దాదాపు 100–150 సిక్సర్లు ప్రాక్టీస్ చేస్తా. గత ఐదారు నెలలుగా ఇదే తరహాలో ఆడటం ఇప్పుడు ఫలితం చూపించింది’ అని 21 ఏళ్ల ముకుల్ వివరించాడు. దేశవాళీలో చెలరేగి... నాలుగు నెలల క్రితం సరిగ్గా ఇదే తరహా ఆటతో ముకుల్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో దృష్టిలో పడ్డాడు. దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అప్పటికే సత్తా చాటిన ముకుల్ ఢిల్లీతో జరిగిన పోరులో మరింతగా చెలరేగాడు. ఐపీఎల్లో గురువారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లాగానే రాజస్తాన్ 176 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.ముకుల్ 26 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో అజేయంగా 62 పరుగులు చేసి చివరి బంతికి సిక్స్తో జట్టును గెలిపించాడు. ఆయుశ్ బదోని వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి కావాల్సిన 25 పరుగులను అతను రాబట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తర్వాతే వేలంలో లక్నో రూ.2 కోట్ల 60 లక్షలకు తీసుకుంది. గతంలో ఈ ఫీట్ నమోదు చేసిన కారణంగానే తనపై తనకు నమ్మకం ఉందని, ఇప్పుడు దానిని పునరావృతం చేశానని అతను చెప్పాడు. లాంగర్ ప్రోత్సాహంతో... ఐపీఎల్లో లక్నో జట్టుకు ఎంపికైన తర్వాత టీమ్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఈ కుర్రాడిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. తన బ్యాటింగ్పై నమ్మకంతో పాటు భారీ సిక్స్లు కొట్టగల సామర్థ్యం కోచ్ను ఆకట్టుకున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లో ‘అత్యంత ప్రమాదకర’ మిడిలార్డర్ బ్యాటర్గా ముకుల్ను తీర్చిదిద్దుతానని చెప్పి కోచ్ ప్రోత్సాహాన్నందించాడు. ‘అంత పెద్ద కోచ్ నా గురించి ఇలా మాట్లాడాడంటే నాలో ఏదో ప్రత్యేకత ఆయనకు కనిపించి ఉండవచ్చు. ప్రతీ రోజూ 15 నిమిషాల పాటు నా కోసం ప్రత్యేకంగా కేటాయించి సాధన చేయించడమే కాకుండా నేను ఆడాల్సిన ఆట శైలి గురించి వివరించేవారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెలరేగాలని నేనూ గట్టిగా కోరుకున్నా. ఇప్పుడు నా ఆటను చూపించాను’ అని ముకుల్ వెల్లడించాడు. రెండేళ్ల క్రితం బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా తొందరపాటు ప్రదర్శించే వాడినని... అయితే సాధన తర్వాత చివరి వరకు నిలబడి మ్యాచ్ను గెలిపించాలనే పట్టుదల తనలో పెరిగిందని ముకుల్ గుర్తు చేసుకున్నాడు. కోల్కతాతో పోరులో బౌలర్ ఏదో ఒక దశలో తప్పు చేస్తాడనే నమ్మకంతోనే వేచి చూశానని చెప్పాడు. తన ఈ ప్రదర్శనను తండ్రికి అంకితం ఇస్తున్నట్లు అతను చెప్పాడు.కుటుంబ త్యాగాలతో... ముకుల్ తండ్రి దలీప్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన తన పెళ్లి కూడా కాకముందే కొడుకు పుడితే క్రికెటర్ను చేయాలని నిర్ణయించుకున్నాడు. ముకుల్ను 10 ఏళ్ల వయసులో క్రికెట్లోకి తీసుకొచ్చిన సమయంలో తండ్రి ఆరి్థక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. కొడుకు శిక్షణలో అండగా నిలిచేందుకు ముందుగా ఆయన తన ఉద్యోగాన్ని వదిలేశాడు. తనకు వాటాగా వచ్చిన ఇంటిని అమ్మేసి ముకుల్ శిక్షణ కోసం వెచ్చించాడు. రాజస్తాన్లోని స్వస్థలం ఝన్ఝునులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో జైపూర్లోని ఆరావళి అకాడమీలో చేరి్పంచాడు. ఆరంభంలో మీడియం పేసర్గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్ కీపర్లు ఎవరూ లేకపోవడంతో అవకాశాల కోసం అటువైపు మళ్లాడు. అయితే భారీ షాట్లు ఆడే ముకుల్ శైలిని గుర్తించిన కోచ్లు ఆ దిశగా బ్యాటింగ్లో ప్రోత్సహించారు. ఆరంభంలో సరైన అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత అతని ఆట పదునెక్కింది. బీసీసీఐ అండర్–23 టోర్నీలో రాజస్తాన్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా కెరీర్ దూసుకుపోయింది. టి20ల్లో మారిన పవర్ హిట్టింగ్ను మరింత సాధన చేసేందుకు వీలుగా మధ్యలో కొన్ని నెలల పాటు అతను ఢిల్లీలోని గుర్గావ్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అతని కఠోర శ్రమ, పట్టుదల ఇప్పుడు ఐపీఎల్లో ఫలితం చూపించింది. -
ఆయుశ్ సంచలనం
నింగ్బో (చైనా): బరిలోకి దిగిన తొలిసారే భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో పోటీపడుతున్న ఈ కర్ణాటక షట్లర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2024 ఆసియా చాంపియన్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుశ్ 23–21, 21–17తో సంచలన విజయం సాధించాడు. 54 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో ఆయుశ్ నిలకడగా ఆడుతూ క్రిస్టీని కట్టిపడేశాడు. తొలి గేమ్లో 18–20తో వెనుకబడ్డ ఆయుశ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి 21–20తో ముందంజ వేశాడు. ఆ తర్వాత క్రిస్టీ 21–21తో స్కోరును సమం చేయగా... ఆయుశ్ ఈసారి వరుసగా రెండు పాయింట్లు నెగ్గి గేమ్ను దక్కించుకున్నాడు. తొలి గేమ్ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఆయుశ్ రెండో గేమ్లో మరింత జోరు పెంచాడు. తొలుత 5–2తో, ఆ తర్వాత 8–6తో, 14–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. క్రిస్టీ కోలుకునే ప్రయత్నం చేసినా ఆయుశ్ ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా సాధించిన ఆధిక్యాన్ని కాపాడుకొని చివరకు రెండో గేమ్తోపాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, 2023 విశ్వవిజేత కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)తో ఆయుశ్ తలపడతాడు. 7 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో పతకం గెలిచిన ఏడో భారతీయ ప్లేయర్ ఆయుశ్ శెట్టి. గతంలో హెచ్ఎస్ ప్రణయ్ (2018లో కాంస్యం), అనూప్ శ్రీధర్ (2007లో కాంస్యం), పుల్లెల గోపీచంద్ (2000లో కాంస్యం), ప్రకాశ్ పదుకొనే (1976లో కాంస్యం), దినేశ్ ఖన్నా (1965లో స్వర్ణం, 1969లో కాంస్యం), సురేశ్ గోయల్ (1965లో కాంస్యం) ఈ ఘనత సాధించారు. -
దానికి టైమ్ ఉంది.. కొంచెం ఓపిక పట్టాలి!
ముంబై: ఐపీఎల్లో మెరుపులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీపై మరింత ఒత్తిడి పెంచడం సరికాదని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నాడు. 15 ఏళ్ల కుర్రాడిని అలా అతడి ఇష్టానికి వదిలేయాలని ఇప్పటి నుంచే అతడి మనసులో జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఒత్తిడిని నింపొద్దని ఈ స్పిన్ దిగ్గజం హితవు పలికాడు. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ కూడా టీనేజ్ వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి... ఆ తర్వాత బ్యాటింగ్ లెజెండ్గా ఎదగగా... ఇప్పుడు ఆ అవకాశం సూర్యవంశీకి ఉందని పలువురు విశ్లేషిస్తున్న నేపథ్యంలో కుంబ్లే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘అసాధారణ ప్రతిభ గల వైభవ్ సూర్యవంశీ దూకుడును ఆపడం కష్టతరమే. అయితే తొందరపాటు అంచనాలు యువ క్రీడాకారుడిపై అనవసర ఒత్తిడి పెంచుతాయి. ఈ వయసులోనే అతడు చక్కగా ఆడుతున్నాడు. అయితే మరో రెండు నెలల్లో నువ్వు టీమిండియాకు ఆడాలి అని చెప్పడం మాత్రం అతడిపై కచ్చితంగా ఒత్తిడి పెంచుతుంది. మరో పదేళ్ల తర్వాత కూడా వైభవ్ వయసు ఇంకా పాతికేళ్లే ఉంటుంది’ అని కుంబ్లే అన్నాడు. క్రికెట్లో విజయవంతం కావడానికి ఒక నిర్దిష్టమైన మార్గం అంటూ ఏదీ లేదని... నిరంతరం శ్రమిస్తూ ఎప్పటికప్పుడు మెరుగవుతూ ముందుకు సాగితే ఫలితాలు అనుకూలంగా వస్తాయని కుంబ్లే పేర్కొన్నాడు. ‘ఈ ఏడాదో, వచ్చే ఏడాదో అతడి పేరు సెలెక్టర్ల పరిశీలనకు రావడం ఖాయం. ఇప్పటికే అతడి ఆటతీరును అంతా నిశితంగా పరిశీలిస్తున్నారు. కాస్త ఓపిక పట్టడం ముఖ్యం’ అని వివరించాడు. క్రీడా సంస్కృతి పెరగాలి... భారత్కు ఒలింపిక్స్ ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కితే అది దేశ క్రీడారంగంలో కీలక మలుపుగా నిలుస్తుందని కుంబ్లే అన్నాడు. మౌలిక వసతులు పెంపొందడంతో పాటు... కొత్త తరం అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘భారీ క్రీడా పోటీలతో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. 1982లో జరిగిన ఆసియా క్రీడలు నాపై చాలా ప్రభావం చూపాయి. దీంతో దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందుతుంది’ అని కుంబ్లే అన్నాడు. ఏదో ఒక రోజు భారత ఫుట్బాల్ జట్టు కూడా ఫిఫా ప్రపంచకప్లో పాల్గొంటుందని జంబో ఆశాభావం వ్యక్తం చేశాడు. -
వైభవ్ వీర విహారం.. ఆర్సీబీని చిత్తు చేసిన రాజస్తాన్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. రాయల్స్కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం గమనార్హం.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే డేంజరస్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఔటైనప్పటికి.. తర్వాత వచ్చిన ఆర్సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ రజత్ పాటిదార్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి పాటిదార్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. పాటిదార్ 40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్లతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(29), షెఫర్డ్(22), విరాట్ కోహ్లి(32) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, జోఫ్రా ఆర్చర్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు సందీప్ శర్మ, రవీంద్ర జడేజాతలా వికెట్ సాధించారు.వైభవ్ విధ్వంసంఅనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది. ఈ భారీ లక్ష్య చేధనలో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. వైభవ్ బ్యాటింగ్ ధాటికి ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు ధ్రువ్ జురెల్(43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 81 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 26 బంతుల్లోనే
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ధనధాన్ లీగ్లో భాగంగా గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం ఈ బుడ్డోడు ఉతికారేశాడు. తొలిసారి హేజిల్వుడ్ను ఎదుర్కొన్న వైభవ్.. 4 ఓవర్లో వరసగా 4, 4, 4 ,6తో 19 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ ఓవర్లో వరసగా రెండు సిక్సర్లతో 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడం ఇది రెండో సారి కావడం విశేషం. ఈ మ్యాచ్లో ఓవరాల్గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. వైభవ్ ఈ తుఫాన్ ఇన్నింగ్స్తో ఆరెంజ్ క్యాప్ను తన సహచరుడు జైశ్వాల్ నుంచి సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ నాలుగు మ్యాచ్లు 266.67 స్ట్రైక్ రేటుతో 200 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: బిష్ణోయ్ సూపర్ డెలివరీ.. కోహ్లి ఫ్యూజ్లు ఔట్? వీడియో వైరల్Vaibhav Sooryavanshi in IPL1st ball v Bumrah - 61st ball v Bhuvi - 41st ball v Shardul - 61st ball v Washington- 61st ball v Arshdeep - 41st ball v Hazlewood - 4Unreal Talent, Unreal Hitting pic.twitter.com/XGQT8SnR4u— Cricketopia (@CricketopiaCom) April 10, 2026 -
బిష్ణోయ్ సూపర్ డెలివరీ.. కోహ్లి ఫ్యూజ్లు ఔట్? వీడియో వైరల్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో బిష్ణోయ్ బంతితో మ్యాజిక్ చేశాడు. బిష్ణోయ్ తన తొలి ఓవర్లోనే అద్బుతమైన బంతితో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని బోల్తా కొట్టించాడు. ఆర్సీబీ తమ ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికి కోహ్లి మాత్రం బౌండరీలతో రాజస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే డేంజర్గా మారుతున్న కోహ్లిని అవుట్ చేయడానికి కెప్టెన్ రియాన్ పరాగ్..ఐదో ఓవర్లోనే రవి బిష్ణోయ్ను రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని బిష్ణోయ్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో నాలుగో బంతికి కోహ్లికి బిష్ణోయ్ గుగ్లీగా సంధించాడు. బిష్ణోయ్ వేసిన ఆ అద్భుతమైన డెలివరీని అంచనా వేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. కోహ్లి బంతిని బౌలర్ తల మీదుగా కొట్టడానికి ప్రయత్నించాడు.అయితే బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో కోహ్లి ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోహ్లి కేవలం 16 బంతుల్లో 7 ఫోర్లు సాయంతో 32 పరుగులు చేశాడు. బిష్ణోయ్ విషయానికి వస్తే తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు లిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: 'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్' -
ఆర్సీబీ ఓపెనర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఓ అవాంఛిత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లోని మొదటి బంతికే మూడుసార్లు అవుట్ తొలి ప్లేయర్గా సాల్ట్ నిలిచాడు. ఐపీఎల్-2026లో గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదటి బంతికే సాల్ట్ ఔటయ్యాడు. రాజస్తాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మొదటి బంతికే అద్భుతమైన బౌన్సర్తో సాల్ట్ను బోల్తా కొట్టించాడు. దీంతో తొలి బంతికే అత్యధిక సార్లు ఔటైన బ్యాటర్గా పార్ధివ్ పటేల్, పృథ్వీషాను సాల్ట్ అధిగమించాడు. వీరిద్దరూ గతంలో రెండు సార్లు మ్యాచ్ తొలి బంతికే ఔటయ్యారు. ఓవరాల్గా ఐపీఎల్ ఇన్నింగ్స్ పరంగా అయితే ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో పార్థివ్ పటేల్(4 సార్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో డ్వేన్ స్మిత్, పృథ్వీ షా, కెఎల్ రాహుల్, సాల్ట్ ఉన్నారు.ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక సార్లు అవుటైన ప్లేయర్లు4 - పార్థివ్ పటేల్3 - డ్వేన్ స్మిత్3 - పృథ్వీ షా3 - కేఎల్ రాహుల్3 - ఫిల్ సాల్ట్*చదవండి: IPL 2026: 'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్' -
'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్'
లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ చౌదరి ఒక్క ఇన్నింగ్స్తో ఓవర్ నైట్స్టార్గా మారిపోయాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం అతడి గురించే మాట్లాడుకుంటోంది. 21 ఏళ్ల ముకుల్ చారిత్రత్మక ఈడెన్గార్డెన్స్లో అద్భుతం చేశాడు.తన విరోచిత బ్యాటింగ్తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓటమి తప్పదకున్న చోట చివరి బంతికి లక్నో గెలిపించి రియల్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లలో 2 ఫోర్లతో పాటు 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. అంటే అతడి సాధించిన పరుగులలో మెజారిటీ భాగం సిక్సర్ల ద్వారానే వచ్చాయి. కాగా మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురుంచి మాట్లాడిన ముకుల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని తన రోల్మోడల్ ముకుల్ చెప్పుకొచ్చాడు."మా నాన్నకు పెళ్లి కాకముందే తనకు కొడుకు పుడితే క్రికెటర్ను చేయాలని కలలు కనేవారు. ఈ విజయాన్ని మా నాన్నకు అంకితమిస్తున్నాను. అలాగే ధోనీ సర్ మ్యాచ్ను ఫినిష్ చేసే తీరును చూస్తూ నేను పెరిగాను. ఆయన నాకు రోల్మోడల్. ఇప్పుడు నేను కూడా లోయార్డర్లోనే బ్యాటింగ్కు వస్తున్నాను. కాబట్టి ఈ ఇన్నింగ్స్ను ఆయనకు కూడా చేస్తున్నాను. శరీర తత్వంగా కారణంగానే నేను ఆడే షాట్లలో అంత పవర్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి షాట్లు ఆడేందుకు నేను చాలా ఎక్కువగా సాధన కూడా చేశాను. ప్రతిరోజూ నెట్స్లో సుమారు 100 నుండి 150 సిక్సర్లు కొడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాను. గత ఐదు, ఆరు నెలలుగా మరింత ఎక్కువగా శ్రమిస్తున్నాను.ఆ ఫలితమే ఇప్పుడు నా ఆటలో కనిపిస్తోంది. హెలీకాప్టర్ షాట్ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పటి నుంచే ఆ షాట్ను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. ధోని ఫినిషింగ్ స్టైల్ కూడా నాకెంతో ఇష్టం. అతను యార్కర్ బంతిని కూడా సిక్సర్గా మలిచేవాడు. అలాంటి బంతిని కూడా సిక్స్ కొడితే, బౌలర్ కచ్చితంగా ఒత్తిడితోకి వెళ్తాడు" అని ముకుల్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం! రూ.13 కోట్ల ఆటగాడిపై వేటు?Meet Mukul Choudhary - He idolised Hardik Pandya - His father was a Teacher- He was unable to pay High fees of Cricket Academies- So he left his job and tried real estate- Luckily he got success there pic.twitter.com/Is4Hftw01N— Amar💫 (@KUNGFU_PANDYA_0) April 9, 2026 -
వైభవ్, జురెల్ ఫిప్టీలు.. ఆర్సీబీపై రాజస్తాన్ ఘన విజయం
RCB vs RR Live Updates: ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. గౌహతి వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది.లక్ష్య చేధనలో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు ధ్రువ్ జురెల్(43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 81 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్లతో 63) టాప్ స్కోరర్గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(29), షెఫర్డ్(22), విరాట్ కోహ్లి(32) రాణించారు.విజయానికి చేరువలో రాజస్తాన్రాజస్తాన్ విజయానికి 24 బంతుల్లో 18 పరుగులు కావాలి. క్రీజులో ధ్రువ్ జురెల్(66), రవీంద్ర జడేజా(21) ఉన్నారు.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్రాజస్తాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్.. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. రాజస్తాన్ విజయానికి 62 బంతుల్లో 68 పరుగులు కావాలి.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో షెమ్రాన్ హెట్మైర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్వైభవ్ సూర్యవంశీ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసిన వైభవ్.. కృనాల్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న వైభవ్, జురెల్6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 97/1. క్రీజులో ధ్రువ్ జురెల్(27), వైభవ్ సూర్యవంశీ(57) ఉన్నారు.వైభవ్ విధ్వంసంవైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టిస్తున్నాడు. జోష్ హాజిల్వుడ్ వేసిన ఐదో ఓవర్లో వైభవ్.. ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో 17 పరుగులు రాబట్టాడు. కేవలం 15 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్లతో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 5 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 73/1దూకుడుగా ఆడుతున్న వైభవ్3 ఓవర్లకు రాజస్తాన్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(23), ధ్రువ్ జురెల్(1) ఉన్నారు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్.. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచి కొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్లతో 63) టాప్ స్కోరర్గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(29), షెఫర్డ్(22), విరాట్ కోహ్లి(32) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, జోఫ్రా ఆర్చర్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు సందీప్ శర్మ, రవీంద్ర జడేజాతలా వికెట్ సాధించారు.ఆర్సీబీ ఎనిమిదో వికెట్ డౌన్ఆర్సీబీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 63 పరుగులు చేసిన రజిత్ పాటిదార్.. సందీప్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు.ఆర్సీబీ ఏడో వికెట్ డౌన్ఆర్సీబీ ఏడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన రోమారియో షెపర్డ్.. జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 150/7. పాటిదార్ 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన టిమ్ డేవిడ్.. బ్రిజేష్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 94/6ఆర్సీబీ ఐదో వికెట్ డౌన్ఆర్సీబీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్లో కృనాల్ పాండ్యా ఔట్ కాగా.. 8 ఓవర్ లో బ్రిజేస్ బౌలింగ్లో జితేశ్ శర్మ ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 82/5ఆర్సీబీ మూడో వికెట్ డౌన్ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రవి బిష్ణోయ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసి పడిక్కల్ జోఫ్రా అర్చర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 45-2ఆర్సీబీకీ భారీ షాక్టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. జోఫ్రా అర్చర్ బౌలింగ్లో తొలి బంతికే ఫిల్ సాల్ట్ ఔటయ్యాడు. క్రీజులోకి దేవ్దత్త్ పడిక్కల్ వచ్చాడు. 2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 32/1టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ఐపీఎల్-2026 సీజన్లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో రాజస్తాన్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. తుషార్ దేశ్పాండే స్ధానంలో బ్రిజేశ్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ ఎట్టకేలకు పునరాగమనం చేశాడు. జాకబ్ డఫీ స్ధానంలో హాజిల్వుడ్ జట్టులోకి వచ్చాడు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ : విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హాజిల్వుడ్రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ తగ్గిన వర్షంఅభిమానులకు గుడ్ న్యూస్. గౌహతిలో వర్షం ఆగింది. దీంతో టాస్ 8:00 గంటలకు పడనుండగా.. మ్యాచ్ 8:15కు ప్రారంభం కానుంది.టాస్ ఆలస్యంఐపీఎల్-2026లో భాగంగా గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లు మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. పిచ్ను ప్రస్తుతం కవర్లతో కప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్రకారం 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఇప్పుడు ఆలస్యం కానుంది. -
క్రికెట్ కోచ్కు బెయిల్ నిరాకరణ
ముంబైలోని ఓ స్థానిక క్రికెట్ కోచ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో నిందితుడు గత 8 నెలలుగా జైలులో మగ్గుతున్నాడు. తాజాగా నిందితుడి తరఫు న్యాయవాది బెయిల్కు అప్పీల్ చేయగా.. ప్రత్యేక POCSO కోర్టు నిరాకరించింది.న్యాయమూర్తి సురేఖా సిన్హా మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే, మైనర్ బాలికలపై మళ్లీ నేరం జరిగే ప్రమాదం ఉంది. నిందితుడు పరారయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. 2023లో మరో మైనర్ బాలిక కూడా ఇదే కోచ్పై అనుచిత ప్రవర్తన ఆరోపణలు చేసినట్టు ప్రాసిక్యూషన్ గుర్తు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. కోచ్ తనపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత మైనర్ బాలిక ఆరోపించింది. వైద్య ఆధారాలు, వెంటనే నమోదు చేసిన FIR ఈ కేసుకు బలమైన సాక్ష్యాలుగా నిలిచాయి. కోచ్ CCTV కెమెరాలను ధ్వంసం చేసి ఆధారాలు తొలగించాడని ప్రాసిక్యూషన్ వాదించింది. తప్పుడు ఫిర్యాదునిందితుడి తరఫు న్యాయవాది బాలిక తప్పుడు ఫిర్యాదు చేసిందని వాదించారు. కోచ్ 2025 ఆగస్టు 5 నుంచి 8 నెలలుగా కస్టడీలో ఉన్నాడని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోని కోర్టు.. నేరం తీవ్రతను హైలైట్ చేస్తూ బెయిల్ నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం సరైంది కాదని తీర్పులో పేర్కొంది. -
ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం! రూ.13 కోట్ల ఆటగాడిపై వేటు?
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ ధనధాన్ లీగ్లో భాగంగా శనివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. లక్నోతో జరిగిన చివరి మ్యాచ్లో ఓటమి పాలైన సన్రైజర్స్.. ఇప్పుడు పంజాబ్పై ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓ కీలక మార్పుతో బరిలోకి దిగే అవకాశముంది. గత మ్యాచ్లో విఫలమైన స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్పై వేటు వేసేందుకు ఎస్ఆర్హెచ్ సిద్దమైంది. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.13 కోట్ల భారీ ధరకు లివింగ్స్టోన్ను ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది.కానీ తొలి రెండు మ్యాచ్లలో అతడికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. అయితే లక్నో జరిగిన మ్యాచ్కు మాత్రం లివింగ్స్టోన్కు తుది జట్టులో చోటు దక్కింది. కానీ తనకు దక్కిన అవకాశాన్ని ఈ ఇంగ్లీష్ ఆల్రౌండర్ సద్వినియోగపరుచుకోలేకపోయాడు. దీంతో పంజాబ్తో మ్యాచ్కు అతడిని పక్కన పెట్టేందుకు ఎస్ఆర్హెచ్ సిద్దమైంది.అతడి స్ధానంలో మరో ఇంగ్లండ్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్కు తుది జట్టులో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. తొలి మూడు మ్యాచ్లకు స్వల్ప గాయం కారణంగా బెంచ్కే పరిమితమైన కార్స్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు నెట్స్లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు.దీంతో బ్రైడన్ కార్స్ ఐపీఎల్ అరంగేట్రం దాదాపు ఖాయమైనట్లే. ఇదొక్కటి మినహా ఎస్ఆర్హెచ్ జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోపోవచ్చు. మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో మంచి జోష్లో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న పంజాబ్ను ఎస్ఆర్హెచ్ ఎలా ఎదుర్కొంటుందో ఎదురు చూడాలి.చదవండి: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై 12 జట్లతో! -
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై 12 జట్లతో!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చారిత్రత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లను చేర్చేందుకు ఐసీసీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో తొమ్మిది జట్లు పోటీ పడుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను పన్నెండుకు పెంచేందుకు ఐసీసీ సిద్దమైంది. దీంతో డబ్ల్యూటీసీ 2027-29 సైకిల్లో అఫ్గాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు కూడా చేరనున్నాయి. ఈ మూడూ టెస్టు హోదా పొందినప్పటికీ ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ సైకిల్లో మాత్రం చోటు దక్కలేదు. ఇప్పుడు తొలిసారి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిష్లో ఈ మూడు జట్లు పోటీపడనున్నాయి. కాగా ప్రస్తుత నిబంధనల ప్రకారం.. డబ్ల్యూటీసీలో చేరాంటే కనీసం రెండు టెస్టు సిరీస్లైనా ఆడాలి. కానీ ఇప్పుడు 12 జట్లను చేర్చాలని నిర్ణయించడంతో.. కనీసం ఒక్క టెస్టు సిరీస్ ఆడినా కూడా సదరు జట్టుకు డబ్ల్యూటీసీలో భాగమయ్యే అవకాశం లభిస్తోంది. అయితే ఈ నిబంధన 2027-29 సైకిల్ నుంచి అమలులోకి రానుంది. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రోజర్ ట్వోస్ నేతృత్వంలోని ఐసీసీ బృందం ఈ కొత్త మోడల్పై కసరత్తు చేస్తోంది. ఈ కమిటీ త్వరలోనే తుది సిఫార్సులను ఐసీసీ అందించే అవకాశం ఉంది. కాగా కాగా 2019లో ఐసీసీ తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ప్రవేశపెట్టింది. రెండేళ్ల వ్యవధిలో ఆడే మ్యాచ్లు, వాటి ఫలితాల ఆధారంగా జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఇందులో గెలిచిన జట్టుకు ఐసీసీ గద లభిస్తుంది.విజేతలు వీరేతొలి సీజన్లో భారత్- న్యూజిలాండ్ (2019-21) డబ్ల్యూటీసీ ఫైనల్ తలపడగా.. కేన్ విలియమ్సన్ బృందం విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లి సేన రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక రెండో సీజన్లో (2021-23)లోనూ టీమిండియా ఫైనల్ చేరగా.. ఈసారి ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్-2025లో ఆస్ట్రేలియాను ఓడించి సౌతాఫ్రికా విజేతగా అవతరించింది.చదవండి: IPL 2026: లక్నో జట్టులోకి సౌతాఫ్రికా సూపర్ స్టార్ -
IPL 2026: సునీల్ నరైన్ ప్రపంచ రికార్డు
విండీస్ దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ మరో రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ విండీస్ వీరుడు.. తాజాగా ఓ ప్రపంచ రికార్డును సెట్ చేశాడు. భారత్ వేదికగా జరిగే ఐపీఎల్లో కేకేఆర్కు ఆడే నరైన్.. 2026 ఎడిషన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో నిన్న (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్లో ఓ వికెట్ (షమీ) తీయడంతో భారత్లో టీ20ల్లో 200 వికెట్లు (183 మ్యాచ్లు) పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారతగడ్డపై ఈ మైలురాయిని తాకిన తొలి విదేశీ బౌలర్గా చరిత్రకెక్కాడు. ఈ విభాగంలో నరైన్ తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రావో (190), రషీద్ ఖాన్ (188) ఉన్నారు.నరైన్ భారత్లో ప్రపంచ రికార్డు సెట్ చేసిన మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో సునీల్ బంతితో రాణించినా (4-0-13-1) కేకేఆర్కు ఓటమి తప్పలేదు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రహానే (41), అంగ్క్రిష్ రఘువంశీ (45), కెమెరాన్ గ్రీన్ (39*), రోవ్మన్ పావెల్ (32*) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.అనంతరం కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా రాణించినా ఆయుశ్ బదోని (54), ముకుల్ చౌదరి (54 నాటౌట్) మ్యాచ్ను లాగేసుకున్నారు. ముఖ్యంగా ముకుల్ చౌదరి సిక్సర్లతో విరుచుకుపడి చివరి బంతికి లక్నోను గెలిపించాడు. ప్రస్తుత ఎడిషన్లో కేకేఆర్కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆడి న 4 మ్యాచ్ల్లో 3 ఓటములు ఎదుర్కోగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఓడిన 3 మ్యాచ్ల్లో కేకేఆర్ ఆటగాళ్లు రాణించినా, అదృష్టం వారి పంచన లేదు. 4 మ్యాచ్లైనా ఇంకా ఖాతా తెరవకపోవడంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టం కానున్నాయి. ఏప్రిల్ 14న జరిగే తదుపరి మ్యాచ్లో కేకేఆర్ సీఎస్కేతో తలపడుతుంది. -
పాకిస్తాన్ లీగ్ ఆడుతుండగానే మరో లీగ్తో ఒప్పందం చేసుకున్న స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ఆడుతుండగానే మరో లీగ్తో ఒప్పందం చేసుకున్నాడు. అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్లోని వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీతో అతను డీల్ కుదుర్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీకి స్టీవ్ 2024 ఎడిషన్లోనూ ఆడాడు. ఆ సీజన్లో ఫ్రీడంకు కెప్టెన్గానూ వ్యవహరించి టైటిల్ గెలిపించాడు. ఆ సీజన్లో ఫ్రీడం టైటిల్ గెలవడంలో స్టీవ్ది కీలకపాత్ర (9 ఇన్నింగ్స్ల్లో 56 సగటున, 148.67 స్ట్రయిక్రేట్తో 336 పరుగులు). ఇతరత్రా కారణాల వల్ల గత సీజన్ మిస్ అయిన స్టీవ్, ఇప్పుడు (2026) మళ్లీ ఫ్రీడంతో జతకట్టాడు.ఈ జనరేషన్లో అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్గా పేరు తెచ్చుకున్న స్టీవ్, ఇప్పుడిప్పుడే టీ20ల్లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. బిగ్బాష్ లీగ్ గత రెండు ఎడిషన్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిన స్టీవ్.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్కు ఆడుతున్న స్టీవ్.. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 154కు పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించాడు. ఈ సీజన్లో స్టీవ్ సాహిబ్జాదా ఫర్హాన్తో కలిసి ముల్తాన్కు మెరుపు ఆరంభాలు అందిస్తున్నాడు. స్టీవ్ రాణిస్తుండటంతో పీఎస్ఎల్ 2026లో ముల్తాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టీ20 లీగ్ల్లో ఆడటం మొదలుపెట్టిన స్టీవ్కు ఐపీఎల్లో మాత్రం అవకాశం దక్కలేదు. ఈ సీజన్ వేలంలో పాల్గొన్నా స్టీవ్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. -
IPL 2026: ఈసారి ట్రోఫీ ఆ జట్టుదే!
పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గతేడాది తొలి ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఆద్యంతం మెరుగైన ప్రదర్శన కనబరిచిన పాటిదార్ బృందం.. ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చిరకాల కోరిక నెరవేర్చుకుంది.రెండూ గెలిచిందిఇక ఇదే జోరులో ఐపీఎల్-2026ను విజయంతో ఆరంభించిన ఆర్సీబీ.. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్లలో రెండూ గెలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఈసారి కూడా విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడింది.ANIతో మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ కచ్చితంగా టైటిల్ నిలబెట్టుకోగలదు. గతంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ పని చేశాయి. ఆర్సీబీ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఈసారి కూడా నిలకడైన ఆటతో ముందుకు సాగుతోంది.మరోసారి విజేతగాప్లే ఆఫ్స్ చేరడం వారి తొలి లక్ష్యం. అన్ని జట్లు ఇందుకోసం కృషి చేస్తాయి. ఈసారి కొత్త చాంపియన్ రావడం కాస్త కష్టమే. అయితే, ఆర్సీబీ మాత్రం కచ్చితంగా మరోసారి విజేతగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈసారి కూడా ఆ జట్టు కూర్పు ఎంతో బాగుంది’’ అని అంజుమ్ చోప్రా అభిప్రాయపడింది.అదే విధంగా పంజాబ్ కింగ్స్ జట్టు కూడా బాగుందని.. వారికి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయని అంజుమ్ చోప్రా పేర్కొంది. కాగా పంజాబ్ ఈ సీజన్లో మూడు మ్యాచ్లు ఆడి రెండింట గెలవగా.. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది.చదవండి: చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్ -
లక్నో జట్టులోకి సౌతాఫ్రికా సూపర్ స్టార్
ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఫస్ట్ హాఫ్ సీజన్ తర్వాత హసరంగ జట్టుతో చేరుతాడని లక్నో మేనెజ్మెంట్ భావించింది. కానీ అతడు తన మోకాలి గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో హసరంగ ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 19వ సీజన్ నుంచి హసరంగా వైదొలిగాడు. ఈ విషయాన్ని లక్నో జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ ధ్రువీకరించాడు. అయితే హసరంగ స్ధానాన్ని సౌతాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ జార్జ్ లిండేతో లక్నో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే లిండేతో లక్నో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనిపై తదుపరి 24 నుంచి 48 గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రోటీస్ ఆల్రౌండర్కు ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్లలో ఆడిన అనుభవం ఉంది. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ 250 పైగా టీ20 మ్యాచ్ల్లో 218 వికెట్లు పడగొట్టాడు. లిండేకు లోయార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా కూడా ఉంది. లక్నో జట్టులో ఇప్పటికే షాబాజ్ అహ్మద్, ఎం. సిద్ధార్థ్ వంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారు. కానీ హసరంగ లాంటి స్టార్ ఆల్రౌండర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు లక్నో మొగ్గు చూపుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో లక్నో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి రెండింట విజయం సాధించింది.చదవండి: నాపై కోపంతో చెత్తబుట్టలో పడేశాడు.. అతడి తండ్రి వచ్చి..: యువీ -
మ్యాచ్ మధ్యలో ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. లయన్స్ అనే ఫ్రాంచైజీ తమ ఆల్రౌండర్ బేయర్స్ స్వానెపోల్ను సస్పెండ్ చేసింది. ఓ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మధ్యలో వేదికను వదిలి వెళ్లిపోయినందుకు లయన్స్ యాజమాన్యం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తొలుత బేయర్స్ గాయం కారణంగా మైదానాన్ని వీడాడని అంతా అనుకున్నారు. చివరికి అతను ఏకంగా వేదికనే వీడి యూకే విమానం ఎక్కినట్లు తెలిసింది. విషయం తెలిసి రిఫరి 10 మందితోనే మ్యాచ్ కొనసాగించాలని లయన్స్ను ఆజ్ఞాపించాడు. బేయర్స్ మైదానం వీడే సమయానికి మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. బేయర్స్ గైర్హాజరీలో లయన్స్ 10 మందితోనే మ్యాచ్ కొనసాగించలేక, చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో బేయర్స్ ఉండి ఉంటే, ఫలితం లయన్స్కు అనుకూలంగా వచ్చేది. ఆ మ్యాచ్లో బేయర్స్ బంతితో అద్భుతంగా రాణించి (3-44) లయన్స్ను మ్యాచ్లో నిలిపాడు. అయితే కీలక తరుణంలో హ్యాండ్ ఇచ్చి లయన్స్ ఓటమికి కారకుడయ్యాడు. ఇంతకీ బేయర్స్ అంత అర్జెంట్గా విమానం ఎక్కి యూకేకు ఎందుకు వెళ్లాడని ఆరా తీయగా.. అతను వోర్సెస్టర్షైర్ కౌంటీతో ఒప్పందంలో భాగంగా అలా చేశాడని తెలిసింది. ఆ విమానం మిస్ అయితే వోర్సెస్టర్షైర్తో ఒప్పందం ఉల్లంఘన జరుగుతుందని అలా చేసినట్లు బేయర్స్ స్వయంగా చెప్పాడు.బేయర్స్ చర్యను చాలా సిరీయస్గా తీసుకున్న లయన్స్ యాజమాన్యం అతని కాంట్రాక్ట్ను రద్దు చేసింది. బేయర్స్ అంత సాహసం ఎందుకు చేశాడని ఆరా తీయగా మరో సంచలన విషయం కూడా బయటపడింది. అతను క్రికెట్ సౌతాఫ్రికా నుంచి ఎన్వోసీ కూడా లేకుండానే యూకేకు పయనమైనట్లు తెలిసింది. ఈ చర్య వల్ల బేయర్స్ సౌతాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం కూడా కోల్పోతాడు. బేయర్స్ కౌంటీ ఛాన్స్ కోసం చూసుకొని ఫ్రాంచైజీతో పాటు క్రికెట్ సౌతాఫ్రికా ఆగ్రహానికి గురయ్యాడు.ఈ మొత్తం ఉదంతంపై బేయర్స్ స్పందించాడు. లయన్స్ యాజమాన్యానికి, అభిమానులకు, క్రికెట్ సౌతాఫ్రికాకు క్షమాపణులు చెప్పాడు. ఈ కౌంటీ సీజన్ నాకు చాలా ప్రత్యేకం. అందుకే అలా చేయక తప్పలేదని వివరణ ఇచ్చాడు. -
బుమ్రా, హార్దిక్లను గుర్తించింది అతడే.. చెన్నైకి ఎవరున్నారు?
చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంలో సీఎస్కే విఫలమైందని విమర్శించాడు. గతేడాది నుంచి సీఎస్కే వైఫల్యాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఐపీఎల్-2025 సీజన్లో పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగే గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది చెన్నై. తమ చరిత్రలో ఇంతటి ఘోర పరాభవం పొందడం ఇదే తొలిసారి. ఇక తాజాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఓటమిపాలైంది. ఒక్కొక్కరికి రూ. 14 కోట్లా?ఇదిలా ఉంటే.. మినీ వేలంలో భాగంగా ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలకు ఒక్కొక్కరికి రూ. 14 కోట్లకు పైగా చొప్పున సీఎస్కే ఖర్చు చేసింది. వీరి ప్రదర్శన మాత్రం ధరకు తగ్గట్లుగా లేదు. వీరిద్దరు ఇప్పటికే అరంగేట్రం చేసినా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ కోసం ఆటగాళ్లను వెదికేందుకు హేమంగ్ బదానీ, వేణుగోపాల్ రావు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీగ్లలో ప్రతి మ్యాచ్ చూస్తూ ఆటగాళ్లను వెలికి తీస్తారు.సీఎస్కే కోసం ఈ పని చేసేందుకు ఎవరున్నారు? ఎవరో ఇచ్చిన సలహాలను పాటించి ఒక్కొక్కరికి రూ. 14 కోట్ల చొప్పున ఇద్దరు ఆటగాళ్ల కోసం డబ్బంతా ధారపోశారు. ప్రతిభావంతులైన ఆటగాళ్ల కోసం సీఎస్కే అసలు ప్రయత్నిస్తోందా?’’ అని చెన్నై మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.బుమ్రా, హార్దిక్లను గుర్తించింది అతడేఈ సందర్భంగా టీమిండియా స్టార్, దిగ్గజ పేస్ బౌలర్గా ఎదిగిన జస్ప్రీత్ బుమ్రా గురించి సుబ్రమణ్యం బద్రీనాథ్ ప్రస్తావించాడు. ‘‘అన్ని జట్లకు మంచి స్కౌట్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్కు మహేళ జయవర్దనే, రిక్కీ పాంటింగ్ కోచ్లుగా ఉన్నా.. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాల ప్రతిభను గుర్తించింది మాత్రం జాన్ రైట్. ఇలాంటి విషయాల్లో సీఎస్కు చాలా వెనుకబడి ఉంది. స్కౌటింగ్ విషయంలో వాళ్లకు అసలు సరైన విధానమే లేదు’’ అని సుబ్రమణ్యం బద్రీనాథ్ విమర్శించాడు.చదవండి: చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్ -
ఐపీఎల్ నిరాకరణ తర్వాత పీఎస్ఎల్లో చరిత్ర
బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ IPL 2026లో చోటు కోల్పోయిన తర్వాత, పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఓ భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. దాయాది లీగ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలందర్స్కు ఆడుతున్న ముస్తాఫిజుర్.. నిన్న (ఏప్రిల్ 9) ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన మ్యాచ్లో 2 డాట్ బాల్స్ వేయడంతో పొట్టి క్రికెట్లో అత్యంత అరుదైన 3000 డాట్ బాల్స్ మైలురాయిని అధిగమించాడు. తద్వారా పొట్టి క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్గా చరిత్రకెక్కాడు. ముస్తాఫిజుర్కు ముందు డ్వేన్ బ్రావో (3681), మొహమ్మద్ ఆమిర్ (3348), ఆండ్రీ రస్సెల్ (3213), సోహైల్ తన్వీర్ (3046) మాత్రమే ఈ ఘనత సాధించారు.ముస్తాఫిజుర్ 3000 డాట్ బాల్స్ మైలురాయిని తాకిన మ్యాచ్లో అతని జట్టు లాహోర్ ఖలందర్స్ ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 18.3 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. ఇస్లామాబాద్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఖలందర్స్ను కుప్పకూల్చారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను ఇస్లామాబాద్ 10.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతుపాడుతూ ఛేదించింది. డెవాన్ కాన్వే (59) అజేయ అర్ద సెంచరీతో ఇస్లామాబాద్ను విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే, ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి అత్యంత సున్నితమైన పరిణామాల మధ్య తొలగించారు. 2026 సీజన్ కోసం జరిగిన వేలంలో అతన్ని కేకేఆర్ రూ. 9.2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకోగా.. భారత్-బంగ్లాదేశ్ మధ్య జియో పొలిటిలక్ ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ అతని ఐపీఎల్ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. దీంతో ముస్తాఫిజుర్ పాకిస్తాన్ సూపర్ లీగ్లో లాహోర్ ఖలందర్స్తో ఒప్పందం చేసుకున్నాడు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్.. వార్నర్ పరిస్థితి ఇదీ!
స్వల్ప విరామంలో స్వదేశానికి వెళ్లి, అనూహ్య పరిణామాల మధ్య డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టైన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో కరాచీ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న వార్నర్.. రీఎంట్రీలో తొలి మ్యాచ్లోనే దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్గానూ చేతులెత్తేసి తన జట్టు ఘోర పరాజయానికి కారకుడయ్యాడు.నిన్న (ఏప్రిల్ 9) పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్లో వార్నర్ తొలి బంతికే గోల్డెన్ డకౌటై నిరాశపరిచాడు. అతని జట్టు 247 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసి 87 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 159 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో బెయిల్పై విడుదలై పాకిస్తాన్కు వచ్చిన వార్నర్ ఇంకా ఆ తాలూకా బాధలోనే ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. అతనిలో పూర్వపు జోష్ కనిపించలేదు. ఈ సీజన్లో కరాచీ కింగ్స్కు ఇదే తొలి ఓటమి. వ్యక్తిగతంగానూ డ్రింక్ అండ్ డ్రైవ్ ఘటనకు ముందు వార్నర్ ఓ మోస్తరు ఫామ్లో ఉన్నాడు. 3 మ్యాచ్ల్లో ఓ హాఫ్ సెంచరీ, ఓ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు.అయితే డి అండ్ డి కేసులో అరెస్ట్ తర్వాత వార్నర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పాక్షిక ఉపశమనం పొందినప్పటికీ.. మే 7న సిడ్నీ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. కొద్ది రోజుల కిందట వ్యక్తిగత పనుల నిమిత్తం స్వదేశానికి వెళ్లిన వార్నర్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలో చట్టబద్ధ పరిమితి కంటే రెండింతలు ఎక్కువ. దీంతో పోలీసులు వార్నర్ను వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆతర్వాత కేసు నమోదు చేశారు. వార్నర్ అరెస్ట్పై క్రికెట్ సమాజంలో చాలా విమర్శలు వచ్చాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ బౌలర్ డొమినిక్ కార్క్ వార్నర్పై తీవ్ర విమర్శలు చేశాడు. జట్టు విజయవంతంగా ఉన్నప్పుడు ఆటగాళ్లకు సెలవులు ఇవ్వకూడదని అన్నాడు. ఇది జట్టు మోమెంటమ్ను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు. -
రికార్డులు కొల్లగొట్టిన రాజస్తాన్ చిన్నోడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా లక్నో సూపర్జెయింట్స్ యువ కెరటం ముకుల్ చౌదరి కూడా అదే జాబితాలో చేరాడు. గురువారం కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ముకుల్ చౌదరి 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 54 పరుగులు నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి లక్నోకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ముకుల్ చౌదరి రెండు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులేంటో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.కేకేఆర్తో మ్యాచ్లో ముకుల్ చౌదరి ఏడు సిక్సర్లు బాదాడు. ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక సిక్సర్లు బాదిన తొలి లక్నో బ్యాటర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో సరసన చేరాడు. బ్రావో ఐపీఎల్ 2018 సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఏడు సిక్సర్లు బాదాడు.ఇదే మ్యాచ్లో ముకుల్ చౌదరి.. అవేశ్ఖాన్తో కలిసి ఎనిమిదో వికెట్కు 54 పరుగులు జోడించాడు. తద్వారా ఐపీఎల్లో టార్గెట్ను విజయవంతంగా ఛేదించిన జట్లలో లక్నోకు 8వ వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం అని చెప్పొచ్చు.ఇక లక్నో సూపర్జెయింట్స్కు కేకేఆర్పై ఇది ఐదో విజయం. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ల్లో తలపడితే అందులో ఈడెన్ గార్డెన్స్ వేదికగానే లక్నో నాలుగు మ్యాచ్లు గెలవడం విశేషం.చదవండి: భార్యతో కలిసి చెట్టాపట్టాల్.. ఐపీఎల్కు డుమ్మా! -
అతడికి నాపై కోపం పోలేదు: యువరాజ్ సింగ్
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. టీ20 ప్రపంచకప్-2007లో తన అద్భుత ప్రదర్శన ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు భారత దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా యువీ ఫీట్ నమోదు చేయగా.. అతడి బాధితుడిగా స్టువర్ట్ బ్రాడ్ అపవాదు మూటగట్టుకున్నాడు.దిగ్గజ పేస్ బౌలర్లలో ఒకడిగాఅయితే, ఆ తర్వాత బ్రాడ్ ప్రపంచంలోని దిగ్గజ పేస్ బౌలర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. అయినప్పటికీ అతడి కెరీర్లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు సమర్పించుకున్న బౌలర్గా ఇదొక చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఆ కోపంలోనే ఆరోజు బ్రాడ్.. యువీ సంతకం చేసిన జెర్సీని చెత్తకుండీలో పారేశాడట.ఈ విషయాల గురించి యువరాజ్ సింగ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘టీ20 ఫార్మాట్లో అప్పటికి స్టువర్ట్ బ్రాడ్కు అంతగా అనుభవం లేదని అనుకుంటాను. కానీ ఆ తర్వాత అతడు దిగ్గజ ఫాస్ట్బౌలర్గా ఎదిగాడు. టెస్టు క్రికెట్లో 600కు పైగా వికెట్లు పడగొట్టాడు.నా కుమారుడి కెరీర్ నాశనంఆరోజు తనలో పెరిగిన కసితో ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. స్టువర్ట్ వాళ్ల నాన్న క్రిస్ బ్రాడ్.. టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన సమయంలో నా దగ్గరికి వచ్చాడు. ‘నువ్వు నా కుమారుడి కెరీర్ను దాదాపుగా నాశనం చేసేశావు’ అన్నాడు.ఇందుకు బదులుగా.. ‘సర్.. నేను నాకోసమే సిక్సర్లు బాదాను. అయితే, బౌలర్కు ఆ అనుభవం ఎలా ఉంటుందో నేను ఊహించగలను’ అని చెప్పాను. అప్పుడు ఆయన.. ‘స్టువర్ట్ కోసం నువ్వు షర్ట్పై సంతకం చేయాలి’ అని కోరాడు.డస్ట్బిన్లో పడేశాడటఅప్పుడు నేను..‘నా టీమిండియాపై జెర్సీపై.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్న ఆటగాడిగా నాకూ అనుభవం ఉంది. అయితే, నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా ఎదుగుతావు’ అని రాశాను. అయితే, క్రిస్ ఆ షర్టును స్టువర్ట్కు ఇచ్చినపుడు అతడు దానిని డస్ట్బిన్లో పడేశాడని ఇటీవలే చదివాను.అతడు కోపంలో ఆ పని చేసి ఉంటాడు. కాబట్టి ఇది ఆమోదయోగ్యనీయమే’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్తో యూట్యూబ్ చాట్ సందర్భంగా యువీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. Look out in the crowd!On this day in 2007, @YUVSTRONG12 made #T20WorldCup history, belting six sixes in an over 💥 pic.twitter.com/Bgo9FxFBq6— ICC (@ICC) September 19, 2021కాగా 2007లో ఐసీసీ తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ టైటిల్ను ధోని సారథ్యంలోని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో.. తాజాగా 2026లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ పొట్టి క్రికెట్ వరల్డ్కప్ ట్రోఫీలను ముద్దాడింది.చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’ -
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్ను ప్రకటించిన పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా మహిళల ద్వైపాక్షిక సిరీస్ జరగనుంది. జింబాబ్వే మహిళల జట్టు 3 మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ సిరీస్ మహిళల క్రికెట్ అభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలవనుంది. ఈ సిరీస్లు మే 3 నుంచి 15 మధ్య తేదీల్లో జరుగనున్నాయి. వన్డే సిరీస్ ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ 2025-29లో భాగంగా జరుగనుండగా.. టీ20 సిరీస్ సాధారణంగా సిరీస్గా పరిగణించబడుతుంది. అన్ని (వన్డే, టీ20) మ్యాచ్లు కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరగనున్నాయి.షెడ్యూల్.. - మే 3 – తొలి వన్డే - మే 6 – రెండో వన్డే - మే 9 – మూడో వన్డే - మే 12 – తొలి టీ20 - మే 14 – రెండో టీ20 - మే 15 – మూడో టీ20 జింబాబ్వే తొలిసారి ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్లో పాల్గొంటోంది. ఈ సిరీస్ మహిళల ఛాంపియన్షిప్లో భాగం కావడంతో 2029 వరల్డ్కప్ అర్హతపై ప్రభావం చూపుతుంది. మహిళల ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ 8, జింబాబ్వే 11వ స్థానంలో ఉన్నాయి.పాకిస్తాన్ ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్ కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. జింబాబ్వే ఇటీవల న్యూజిలాండ్ చేతిలో అన్ని మ్యాచ్ల్లో ఓటమిపాలై, అట్టడుగు స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇరు జట్లు ఈ సిరీస్లో పాయింట్లు సాధించి, ర్యాంకింగ్స్ మెరుగుపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జింబాబ్వే పరిమిత ఓవర్ల సిరీస్ల అనంతరం పాకిస్తాన్ ఐర్లాండ్ టీ20 ట్రై సిరీస్లో పాల్గొంటుంది. ఈ టోర్నీలో పాక్, ఐర్లాండ్తో పాటు వెస్టిండీస్ భాగం కానుంది. ఈ టోర్నీ మే 28 నుంచి ప్రారంభమవుతుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ 2025-29 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్ జట్లు టాప్-5లో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
భార్యతో కలిసి చెట్టాపట్టాల్.. ఐపీఎల్కు డుమ్మా!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పడుతూ లేస్తూ తన ప్రయాణం కొనసాగిస్తోంది. విజయంతో సీజన్ను ఆరంభించినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్కు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ ఎందుకు ఆడడం లేదన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఈ వారంలోపూ విల్ జాక్స్ ముంబై ఇండియన్స్తో చేరతాడని యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విల్ జాక్స్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే విల్ జాక్స్ తన భార్య అనా బ్రుమ్వెల్తో కలిసి పారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. అంతేకాదు జాక్స్ భార్య తన ఇన్స్టాగ్రామ్లో ‘ఎంజాయింగ్ హాలిడే ట్రిప్’ పేరిట స్టోరీని షేర్ చేసుకోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. ఈ లెక్కన విల్ జాక్స్ ఇప్పట్లో ఐపీఎల్లో అడుగుపెట్టే అవకాశాలు లేనట్లేనని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అమెరికన్ సింగర్ అలెక్స్ వారెన్ మ్యూజిక్ కన్సర్ట్కు జాక్స్ తన భార్యతో కలిసి హాజరయ్యేందుకే పారిస్ వెళ్లినట్లు తెలుస్తోంది.ఇక ఫ్రాన్స్లో అడుగుపెట్టడానికి ముందు మొరాకోలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేశారు. కాగా విల్ జాక్స్ ఈ ఏడాది యాషెస్ సిరీస్ సమయంలోనే తన స్కూల్ ఫ్రెండ్ అయిన అనా బ్రూమ్వెల్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే విల్కు 14 ఏళ్ల వయసులోనే వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే, అసలే రెండు వరుస ఓటములతో ఢీలా పడిన ముంబై ఇండియన్స్కు విల్ జాక్స్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిస్తే ఏమవుతుందో అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అయితే విల్ జాక్స్ విషయమై ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ మహేల జయవర్దనే రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్ ముగిసిన అనంతరం స్పందించాడు. ‘విల్ జాక్స్ త్వరలోనే జట్టుతో చేరుతాడని ఆశిస్తున్నా’ అంటూ తెలిపాడు. 2025 ఐపీఎల్ సీజన్లో విల్ జాక్స్ ముంబై ఇండియన్స్ తరఫున 233 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీశాడు. విల్ జాక్స్ లేకపోవడం వల్ల ముంబై జట్టు సమతుల్యం దెబ్బతిన్నది. విల్ జాక్స్ అందుబాటులో లేకపోవడంతో తొలి మ్యాచ్లో ఆఫ్గన్ ఆటగాడు అల్లాఘన్జఫర్ను ఆడించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రెండో మ్యాచ్లో అతడిని తొలగించి మిచెల్ శాంట్నర్కు అవకాశమిచ్చారు. ఇక మూడో మ్యాచ్లో ఐదుగురు బౌలర్ల వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. విల్ జాక్స్ జట్టులో చేరితే మాత్రం ఆల్రౌండర్గా తన పాత్రకు న్యాయం చేయగలడని ముంబై ఇండియన్స్ ఆశిస్తోంది. ముంబై తన తదుపరి మ్యాచ్ ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.No way my bruh Will Jacks is roaming in the streets of Paris 😭 https://t.co/OpZ8tjzYkw pic.twitter.com/atrDFVqePs— Mumbai Indians FC (@MIPaltanFamily) April 9, 2026చదవండి: ‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్కప్లో భారత జట్టును చూడాలి’ -
‘భారత్లోనే ప్రమాదకర బ్యాటర్.. ఈ మ్యాచ్తో నిరూపించాడు’
ముకుల్ చౌదరి.. ఒక్క మ్యాచ్తో భారత క్రికెట్ వర్గాల్లో హాట్టాపిక్గా మారిపోయిందీ పేరు. ఐపీఎల్-2026లో కోల్కతా నైట్ రైడర్స్తో గురువారం నాటి పోరులో.. ఈ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు అవసరం కాగా... ఇందులో 54 తానొక్కడే చేశాడు.27 బంతుల్లోకోల్కతా విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ముకుల్ చౌదరి.. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా లక్నోను విజయతీరాలకు చేర్చి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో లక్నో హెడ్కోచ్ జస్టిన్ లాంగర్ ముకుల్ చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా.. ‘‘వచ్చే నాలుగు నెలల్లో ఇండియాలోనే ఆరు లేదంటే ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్గా ముకుల్ ఎదగడం ఖాయం’’ అని లాంగర్ అన్నాడు.What JL said 🧿 pic.twitter.com/c7y4oI4Sgn— Lucknow Super Giants (@LucknowIPL) April 9, 2026ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కోల్కతాతో మ్యాచ్ సందర్భంగా ముకుల్ గురించి లాంగర్ చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ ముకుల్ చౌదరి?రాజస్తాన్కు చెందిన 21 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరి జైపూర్ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్ బౌలర్గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు దృష్టి సారించాడు. అండర్–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.ఇక దేశీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్లలో ఏకంగా 199 స్ట్రయిక్రేట్తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్గా ఎదగడం ఖాయం’ అని లాంగర్ ఐపీఎల్కు ముందు వ్యాఖ్యానించగా... ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్ దానిని నిరూపించడం విశేషం. This is 𝐂𝐈𝐍𝐄𝐌𝐀 🫡🤯 pic.twitter.com/JTxw0DUgqM— Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2026చదవండి: Yuvraj Singh: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’ -
‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్కప్లో భారత జట్టును చూడాలి’
క్రికెట్తో పోలిస్తే భారత్లో ఫుట్బాల్కు ఆదరణ తక్కువే. బైచుంగ్ భుటియా, సునీల్ ఛెత్రీ.. ఈ ఇద్దరే భారత్ ఫుట్బాల్లో కాస్త తెలిసిన ముఖాలు. అసలు మనకంటూ ఒక ఫుట్బాల్ టీం ఉందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. పాశ్చాత్య దేశాల్లో ఫుట్బాల్కు ఉండే క్రేజ్ వేరు. క్రికెట్లో వరల్డ్కప్ ఎలాగూ ఫుట్బాల్లో ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్ కూడా అలాంటిదే. ఇంకా చెప్పాలంటే ఐసీసీ వరల్డ్కప్ కంటే ఎక్కువే అని చెప్పొచ్చు. ఫిఫా వరల్డ్కప్లో ఒక్కసారైనా ఆడాలని చాలా దేశాలు కలలు కూడా కంటాయి.ఈ నేపథ్యంలోనే దేశవాలీలో ఫుట్బాల్ ఆటకు మళ్లీ తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు మినర్వా ఫుట్బాల్ క్లబ్ ఓనర్, కోచ్ రంజిత్ బజాజ్ వెల్లడించారు. తాను చనిపోయేలోగా భారత సీనియర్ జట్టును ఫిఫా ప్రపంచకప్లో చూస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయంగా భారత్ను ఫుట్బాల్లోనూ ఉన్నతస్థాయికి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఇటీవలే అండర్-15 మెడిటేరియన్ ఇంటర్నేషనల్ కప్ (ఎంఐసీ)లో భారత్కు చెందిన మినర్వా ఫుట్బాల్ క్లబ్ తమ ప్రదర్శనతో అదరగొట్టింది. ముఖ్యంగా ప్రిక్వార్టర్స్లో మినర్వా జట్టు 6-0 తేడాతో లివర్పూల్ జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. ఎంఐసీ కప్లో తొలిసారి ఆడుతున్నప్పటికీ ఏ బెరుకు లేకుండా ఆడిన మినర్వా జట్టు క్వార్టర్స్లో ఓడినప్పటికీ టోర్నీని ఐదో స్థానంతో ముగించి బెస్ట్ ప్రదర్శన నమోదు చేసింది.అయితే మినర్వా ఫుట్బాల్ క్లబ్ ఏర్పడడం వెనుక ఆ జట్టు కోచ్ రంజిత్ బజాజ్ చాలా ఏళ్ల శ్రమ దాగుంది. తాజాగా చందాలు పోగు చేసి మరీ తన జట్టును స్పెయిన్లో జరిగిన ఎంఐసీ కప్ ఆడేందుకు పంపించడం గమనార్హం. అయితే మార్చి 16న మినర్వా క్లబ్ జట్టును పంపించడానికి ముందు రంజిత్ బజాజ్ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆయన ఇచ్చిన సందేశం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించేలా ఉంది. మొత్తం జట్టును స్పెయిన్కు పంపేందుకు తన ఆస్తులను అమ్మినప్పటికీ మరో కోటి రూపాయలు తక్కువ పడింది. దీంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా డబ్బు సహాయం అందజేయాలని తన ఫాలోవర్లను కోరారు. ఆయన ఫాలోవర్లంతా ఈ విషయాన్ని షేర్ చేసి 27 లక్షల రూపాయలు ఆయనకు అందజేశారు. మొత్తంగా ఎలాగోలా తన జట్టును ఎంఐసీ కప్ ఆడేందుకు పంపించారు. View this post on Instagram A post shared by Ranjit Bajaj (@ranjitbajaj)మినర్వా ఫుట్బాల్ క్లబ్ జట్టు 2022లో మెనా కప్, 2023లో బ్రెజిల్ను ఓడించి గోథియా కప్ను కైవసం చేసుకుంది. కానీ సరైన ఫండ్స్ లేకపోవడంతో 2024లో ఒక్క టోర్నీ కూడా ఆడలేకపోయింది. ఇది భారత్లోని ప్రతిభావంతమైన ఫుట్బాల్ ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపిందని రంజిత్ బజాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఎవరీ రంజిత్ బజాజ్?రంజిత్ బజాజ్ (Ranjit Bajaj) భారత ఫుట్బాల్ రంగంలో, ముఖ్యంగా గ్రాస్రూట్ స్థాయిలో ప్రతిభను గుర్తించి వారిని ఆటగాళ్లుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చండీగఢ్లో మినర్వా అకాడమీ నెలకొల్పి యువ ఫుట్బాల్ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తూ భారత ఫుట్బాల్ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. సందేశ్ జింగాన్, కమల్జిత్ సింగ్, జీక్సన్ సింగ్ (ఫిఫా వరల్డ్కప్లో భారత్ తరఫున మొదటి గోల్ చేసిన ఆటగాడు) వంటి ప్రముఖ ఆటగాళ్లంతా ఈయన అకాడమీ నుంచే వచ్చారు. భారత ఫుట్బాల్ అభివృద్ధి కోసం, ముఖ్యంగా యువతకు అవకాశం కల్పించడం కోసం ఆయన తన ఆస్తులను (భార్య బంగారు ఆభరణాలు) సైతం తాకట్టు పెట్టి అకాడమీని నడిపారు. తనకు ఎవరు సహాయం చేసేందుకు ముందుకు రానప్పటికీ 2020 నుంచి మినర్వా అకాడమీ తరఫున 250 మందికి పైగా ఆటగాళ్లకు వంద శాతం స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దారు. తాను చనిపోయేలోగా భారత సీనియర్ జట్టు ఫిఫా ప్రపంచకప్లో పాల్గొనేలా చూడడమే తన కల అని రంజిత్ బజాజ్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. మరి ఆయన కల నెరవేరాలని ఆశిద్దాం.ఫుట్బాల్లోనూ స్వర్ణయుగం..ఒకప్పుడు ఆసియాలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా పరిగణించబడిన మన ఫుట్బాల్ టీం 1950 నుంచి 1960 మధ్య స్వర్ణయుగాన్ని చూసింది. హైదరాబాద్కు చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం పర్యవేక్షణలో భారతదేశం 1951, 1962 ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలను గెలుచుకోవడంతో పాటు 1956 ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. అయితే భారత జట్టు ఎప్పుడు ఫిఫా ప్రపంచకప్లో పాల్గొనలేదు.కానీ 1950 ఫిఫా వరల్డ్కప్లో మాత్రం క్వాలిఫికేషన్ గ్రూప్లోని ఇతర దేశాలన్నీ వైదొలగడంతో 1950 ప్రపంచ కప్కు డిఫాల్ట్గా అర్హత సాధించింది. అయితే, టోర్నమెంట్ ప్రారంభానికి ముందే భారత్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. భారత జట్టు ఆసియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అయిన ఏఎఫ్సీ ఆసియా కప్లో ఐదుసార్లు పాల్గొని , 1964 లో రన్నరప్గా నిలిచింది .దక్షిణాసియాలో పాపులర్ టోర్నీగా పిలవబడే దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ కప్ (శాప్-SAFF) కప్లో అజేయమైన టీమ్గా రికార్డు ఉంది. 1993లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ టోర్నమెంట్ను భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలుచుకుంది.🚨 India’s Minerva Football Club thrashed Liverpool FC 6–0. 🗿Man, Indian football has serious potential.Completely outplayed and knocked out Liverpool and reached the QF in the MIC Cup 2026 U-15 — pure attitude.Proud moment for India 🇮🇳 pic.twitter.com/DEibSGT7YR— Sonu (@Cricket_live247) April 3, 2026చదవండి: వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది! -
US-Iran: పాక్ ప్రధానిపై ప్రశంసలు.. ఓవరాక్షన్ అవసరమా?
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహిన్ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆటపై దృష్టి పెట్టకుండా.. ఇతర అంశాల్లో దూరడం ఎందుకంటూ సొంత జట్టు అభిమానులే మండిపడుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరును కూడా ఎండగడుతున్నారు. పాక్ మరో ఆటగాడు నసీం షా విషయంలో వ్యవహరించినట్లే షాహిన్ విషయంలోనూ కఠిన చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.పాక్ చేసిన పని వల్ల గందరగోళంఅసలేం జరిగిందంటే.. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం విదితమే. ఇప్పటికే పరస్పర దాడుల వల్ల మూడు దేశాలు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. ఇరాన్ అగ్ర నాయత్వాన్ని దాదాపుగా మట్టుబెట్టామని అమెరికా చెబుతోంది.అయితే, ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల చమురు సంక్షోభం తలెత్తింది. ఇలాంటి తరుణంలో కాల్పుల విరమణ ఒప్పందానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తున్నామని పాకిస్తాన్ తెరమీదకు వచ్చింది.కానీ ఇక్కడా పాక్ చేసిన పని వల్ల గందరగోళం నెలకొంది. తమ భూభాగంతోపాట లెబనాన్ మీదా దాడులను ఆపేయాలని ఇరాన్ స్పష్టంగా ప్రతిపాదనలను పంపితే వాటిలోంచి పాకిస్తాన్ ‘లెబనాన్’అనే పేరును తొలగించి.. అమెరికా, ఇజ్రాయెల్లకు చేరవేసిందని ఆరోపణలు వస్తున్నాయి.విమర్శల వర్షంలెబనాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యవర్తిగా పాక్ చేసిన తప్పిదమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ ద్వంద్వ వైఖరిపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ అయితే ఏకంగా మధ్యవర్తిత్వం విషయంలో పాక్ ఎంతమాత్రం నమ్మదగిన దేశం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.ప్రపంచ శాంతికి కృషి.. పాకిస్తానీగా గర్విస్తున్నాఇలాంటి తరుణంలో పాకిస్తాన్ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఓ ట్వీట్ చేశాడు. ‘‘ప్రపంచ శాంతి కోసం పాకిస్తాన్ నాయకత్వం వహిస్తూ ముందుకు సాగుతున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. మా ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్లు శాంతి చర్చలకు ఊతమిచ్చారు.సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు. కాల్పుల విరమణ ద్వారా మానవత్వం పరిఢవిల్లుతుంది. ఇందుకు పాకిస్తాన్ గొప్ప ముందడుగు వేసింది. శాంతి కోసం కృషి చేస్తోంది. పాకిస్తానీగా ఉన్నందుకు గర్వపడుతున్నా’’ అంటూ షాహిన్ ఓవరాక్షన్ చేశాడు.ఆటను వదిలి ఇతర అంశాల్లో జోక్యంఓవైపు.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై విమర్శలు, ఆరోపణలు వస్తున్న వేళ షాహిన్ ఆఫ్రిది ఇలా సొంతడబ్బా కొట్టుకున్నట్లుగా ట్వీట్ చేయడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆటను వదిలి ఇతర అంశాల్లో జోక్యం చేసుకోవడం అవసరమా? అని మండిపడుతున్నారు.కాగా ఇటీవల పాక్ పేసర్ నసీం షా.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆరంభ వేడుకల్లో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ను రాణిలా ట్రీట్ చేశారంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇతర అంశాల్లో జోక్యం చేసుకున్నందున పీసీబీ అతడికి రూ. 2 కోట్ల (పాక్ కరెన్సీ) జరిమానా విధించింది. మరి ఇప్పుడు షాహిన్ కూడా పీసీబీ ఇలాగే శిక్షిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాగా ఇటీవల షాహిన్ కెప్టెన్సీలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. బంగ్లాదేశ్ పర్యటనలో దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి ఆతిథ్య జట్టుకు వన్డే సిరీస్ కోల్పోయింది.చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’ -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం విరాట్ కోహ్లి రికార్డును అధిగమించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బాబర్ ఆజం పెషావర్ జాల్మీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దీనిలో భాగంగా కరాచీ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో బాబర్ ఆజం టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో బాబర్ ఆజం 12 వేల పరుగుల మైలురాయిని చేరుకుని ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్లో 351వ టీ20 మ్యాచ్ ఆడుతున్న బాబర్ 338 ఇన్నింగ్స్ ల్లో ఈ రికార్డును చేరుకోవడం విశేషం. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (343 ఇన్నింగ్స్లు) పేరిట ఉంది.టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్) మూడో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థానీ బ్యాటర్ కాగా, ఇప్పటికీ పాక్ తరపున అత్యధిక టీ20 పరుగుల రికార్డు షోయబ్ మాలిక్ పేరిట ఉంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ బరిలోకి దిగిన బాబర్ 51 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కుశాల్ మెండిస్తో కలిసి రెండో వికెట్కు ఏకంగా 191 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పెషావర్ జల్మీ 20 ఓవర్లలో 246/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. పెషావర్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. ఇఫ్రికార్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, సుఫియాన్ ముఖీమ్ చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో కరాచీ కేవలం 87 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా బాబర్ సేన ఘన విజయాన్ని అందుకుంది.చదవండి: ‘సరదాగా అన్న మాట ఇవాళ నిజమైంది’ -
‘సరదాగా అన్న మాట ఇవాళ నిజమైంది’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చిందని లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ముకుల్ చౌదరీ ప్రదర్శనపై మాటలు రావడం లేదని పంత్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో గురువారం లక్నో 3 వికెట్ల తేడాతో కేకేఆర్పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. ‘ఏం చెప్పాలి.. ముకుల్ చౌదరీ గురించి మాటలు రావడం లేదు. నేను అతన్ని తొలిసారి నెట్స్లో చూసినప్పుడే భవిష్యత్తులో మంచి బ్యాటర్ అవుతాడని ఊహించాను. ఇవాళ కేకేఆర్తో మ్యాచ్లో ముకుల్ దానిని నిజం చేసి చూపెట్టాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ను కళ్ల ప్పగించి చూస్తూ ఉండిపోయాను. అనామక ఆటగాళ్లకు ఐపీఎల్ వెలుగునిచ్చింది. ఇప్పుడు ఆ జాబితాలో ముకుల్చౌదరీ కూడా చేరిపోయాడు. ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు వారు అద్భుతాలు చేయగలరు. ఇలాంటి ప్రతి మ్యాచ్ కూడా జట్టులో ఏదో ఒక గొప్ప విషయం నిర్మితమవుతోందనే సంకేతాన్ని ఇస్తోంది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ముకుల్ చౌదరీ మూడు బంతులు వరుసగా మిస్ చేశాడు. ఆ సమయంలో అతడి దగ్గరకి వెళ్లి కంగారు పడొద్దు.. భవిష్యత్తులో నీకు అవకాశాలు బాగా వస్తాయి అని చెప్పాను. తాజాగా కేకేఆర్తో మ్యాచ్లో ముకుల్కు ఆ అవకాశం రానే వచ్చింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కడదాకా నిలిచి ఒంటిచేత్తో గెలిపించాడు. ఒక కెప్టెన్గా ఇంతకన్నా నాకేం కావాలి చెప్పండి.బదోని ఇప్పుడు మా జట్టులో సీనియర్ ప్లేయర్. అతనికి మేం ఇచ్చిన బాధ్యత అది. బదోని నుంచి మేం ఆశించే సహకారం ఇదే. షమీ కుర్రాడు కాదు. కానీ అతను జట్టుకు ఇచ్చే అనుభవం వెలకట్టలేనిది. అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండటం అద్భుతం. బౌలింగ్ యూనిట్ అంతా బాగా రాణిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు.During Match Between LSG & SRH When Mukul Choudhary missed three balls, Rishabh Pant told him: “Don’t feel nervous, you’ll get many more opportunities in the future.”Today, Mukul Choudhary won the match single-handedly for Rishabh Pant’s LSG. 😭❤️pic.twitter.com/FhDIDunk1B— Cricket Central (@CricketCentrl) April 9, 2026చదవండి: ‘సైందవుడిలా అడ్డుపడి కొంపముంచాడు’ -
‘సైందవుడిలా అడ్డుపడి కొంపముంచాడు’
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్( కేకేఆర్) హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. గురువారం లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో కేకేఆర్ గెలుపు దిశగా సాగింది. అయితే చివర్లో ముకుల్ చౌదరి సైందవుడిలా అడ్డుపడి ఒంటిచేత్తో కేకేఆర్ నుంచి గెలుపును లాగేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మ్యాచ్ ఓటమిపై స్పందించాడు.'ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. కానీ మా కుర్రాళ్లు ఆడిన తీరు అమోఘం. ముకుల్ ఆడిన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ను మలుపు తిప్పింది. అతను షాట్లు ఆడిన తీరు అమోఘం. ఇలాంటి మ్యాచ్ల్లో తప్పులను వెతకకూడదు. మా ప్రణాళికల అమల్లో చిన్న చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు. కానీ ముకుల్ ఆడిన తీరుకు, అతడి ఇన్నింగ్స్కు క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే.పిచ్పై స్లో బంతులు బాగానే పనిచేశాయి. అందుకే ప్రతి బంతిని బాదడానికి ప్రయత్నించారు. ముకుల్ షాట్లు మాత్రం అద్భుతం. మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చిందనుకున్న దశలో ముకుల్ చౌదరి సూపర్ ఇన్నింగ్స్తో ఒంటిచేత్తో మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.ఈ వికెట్పై 180-185 అనేది మంచి స్కోరు. ఏది ఏమైనా లక్నో బ్యాటర్లు ఆడిన తీరును మెచ్చుకోవాల్సిందే. ఆఖరి ఓవర్లో ఆవేష్ ఖాన్నే ఎక్కువ సేపు స్ట్రైకింగ్లో ఉంచాలని ఫీల్డింగ్ ముందుకు పెట్టాం. కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా ఐదుగురు ఫీల్టర్లు సర్కిల్ లోపల ఉన్నప్పుడు చివరి ఓవర్ వేయడం బౌలర్లకు కష్టమే. అయితే ఈ ఓటమిపై విశ్లేషించుకుంటాం. లోపాలు సరిచేసుకుంటాం. రాబోయే మ్యాచ్ల్లో మెరుగ్గా ఎలా ఆడాలనే విషయాన్ని ఆలోచిస్తాం.'అని రహానే పేర్కొన్నాడు. కేకేఆర్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.చదవండి: ‘ఈ ఇన్నింగ్స్ మా నాన్నకు అంకితం’ -
‘ఈ ఇన్నింగ్స్ మా నాన్నకు అంకితం’
ఐపీఎల్ 2026 సీజన్లో ముకుల్ చౌదరీ రూపంలో నయా స్టార్ పుట్టుకొచ్చాడు. గురువారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయే స్థితిలో ఉన్న లక్నో సూపర్జెయింట్స్ను ఒంటిచేత్తో గెలిపించిన ముకుల్ చౌదరీ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ముకుల్ చౌదరీ మాట్లాడాడు. ఈరోజుతో తన నాన్న కల నెరవేరిందని.. ఇన్నింగ్స్ను ఆయనకు అంకిత మిస్తున్నట్లు తెలిపాడు.‘నేను క్రికెటర్ కావాలన్నది మా నాన్న కల. అయితే నా చిన్నతనంలో మా కుటుంబ పరిస్థితి అంత బాగుండక పోవడంతో క్రికెట్ను ఆడలేకపోయాను. అయితే 12-13 ఏళ్ల వయస్సులో తొలిసారి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఆరోజుల్లో క్రికెట్ అకాడమీలు ఎక్కువగా ఉండేవి కావు. అందుకే మాకు దగ్గర్లో ఉన్న సికర్లోని ఎస్బీఎస్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడే ఒక ఐదు నుంచి ఆరేళ్ల పాటు ఆటలో మెళుకువలు నేర్చుకోవడంతో పాటు క్రికెటర్గా ట్రెయిన్ అయ్యాను. ఆ తర్వాత హయ్యర్ లెవెల్కు ఆడాలనే ఉద్దేశంతో జైపూర్కు నా మకాం మార్చాను. ఆ తర్వాత టీ20 క్రికెట్ ఉన్నతస్థాయికి చేరుకోవడంతో గుర్గావ్లో మూడు నుంచి నాలుగు నెలలల పాటు శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత ఢిల్లీలో ఆడిన చాలా మ్యాచ్లు నా కెరీర్కు ఉపయోగపడ్డాయి. ఇక యూపీతో జరిగిన అండర్-19 మ్యాచ్లో నా ప్రదర్శనను చూసి నేను క్రికెటర్ అవుతాననే విషయాన్ని మా నాన్న నమ్మాడు. అది లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మా జట్టులో ఎవరు పెద్దగా ఆడలేదు. నేను మాత్రమే మంచి స్కోర్ సాధించాను. అప్పుడే క్రికెట్లో నేను పెద్ద స్థాయికి చేరుతానన్న నమ్మకం మా నాన్నకు కలిగింది. ఇక ఫ్లడ్ లైట్ల కింద నేను ఆడిన రెండో మ్యాచ్ ఇది. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఒత్తిడిలా కాకుండా గోల్డెన్ ఛాన్స్లా చూశాను. చివరి వరకు ఆడాలనేదే నా ప్లాన్. నేను క్రీజులో ఉంటే జట్టును గెలిపించగలననే నమ్మకం నాకుంది. ఈరోజు కొట్టిన మొదటి సిక్స్ నాకు ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజు నేను కొట్టిన మొదటి సిక్స్ అదే. ఆఖరి ఓవర్లో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. ఏదో ఒక బంతి నా జోన్లోకి వస్తుందని తెలుసు. ఒక్క సిక్స్ కొడితే చాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను హిట్టింగ్ చేస్తున్నాను. బంతి నా జోన్లో ఉంటే బాదేస్తాను. సిక్సర్లు కొట్టడం నాకు చాలా ఇష్టం. ఇవాళ రాత్రి నువ్వు ఒక జవాన్లా (దేశానికి సేవ చేసే సైనికుల్లో చాలా మంది రాజస్తాన్లోని ఝున్ఝు ప్రాంతం నుంచి వచ్చేవారు. ఇది ముకుల్ చౌదరీ స్వస్థలం)ఆడావు అని చాలా మంది మెచ్చుకుంటున్నారు. అవును సార్.. అది నా రక్తంలోనే ఉంది. నేను ఇక్కడ గ్రౌండ్లో ఆడుతున్నాను.. వాళ్లు సరిహద్దులో కాపలా కాస్తూ దేశానికి సేవ చేస్తున్నారు.’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ విషయానికి వస్తే 182 పరుగుల ఛేదనలో లక్నో 6 ప్రధాన వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది. 32 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరీ 27 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 54 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్కు ఇది హ్యాట్రిక్ ఓటమి కాగా, లక్నోకు ఇది రెండో విజయం.Pressure? What pressure? 🤷♂️🎥 🗣️ It's all about belief and rising to the occasion for Mukul Choudhary 🙌Scorecard ▶️ https://t.co/ov5gAlAtPH #TATAIPL | #KhelBindaas | #KKRvLSG | @LucknowIPL pic.twitter.com/M2Y1F9x3ym— IndianPremierLeague (@IPL) April 9, 2026 Another day, another #TATAIPL thriller 🤩@LucknowIPL get over the line in a last-ball finish, courtesy of Mukul Choudhary's heroics 🫡Scorecard ▶️ https://t.co/ov5gAlAtPH #KhelBindaas | #KKRvLSG pic.twitter.com/VLthHCB8Cm— IndianPremierLeague (@IPL) April 9, 2026చదవండి: జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా! -
ముకుల్ సిక్సర్ల మోత
182 పరుగుల ఛేదనలో 6 వికెట్లు కోల్పోయి ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరగ్గా... లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు కావాలి. ఈ దశలో కోల్కతా గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ యువ ఆటగాడు ముకుల్ చౌదరీ భిన్నంగా ఆలోచించాడు. చివరి మూడు ఓవర్లలో రెండేసి సిక్సర్లతో చెలరేగిపోయి కేకేఆర్ పని పట్టాడు.57లో తానొక్కడే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి లక్నోకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆఖరి 4 ఓవర్లలో వరుసగా 11, 13, 16, 14 పరుగులు రాబట్టి సూపర్ జెయింట్స్ మ్యాచ్ గెలుచుకుంది. సొంత మైదానంలో విజయానికి చేరువగా వచ్చిన కోల్కతా మరో ఓటమితో తీవ్ర నిరాశకు గురైంది. కోల్కతా: ఐపీఎల్లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పైచేయి సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్లో లక్నో 3 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. ముందుగా కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రఘువంశీ (33 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్స్లు), అజింక్య రహానే (24 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు), రావ్మన్ పావెల్ (24 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), కామెరాన్ గ్రీన్ (24 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. రెండో వికెట్కు రహానే, రఘువంశీ 52 బంతుల్లో 84 పరుగులు చేయగా... ఐదో వికెట్కు గ్రీన్, పావెల్ 40 బంతుల్లో అభేద్యంగా 70 పరుగులు జోడించారు. అనంతరం లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ముకుల్ చౌదరీ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా, ఆయుశ్ బదోని (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా అర్ధసెంచరీ సాధించాడు. బ్యాటింగ్ తడబాటు... ప్రిన్స్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఫిన్ అలెన్ (8) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌండరీ వద్ద రాఠీ పట్టిన ఈ క్యాచ్ చర్చకు దారి తీసింది. క్యాచ్ పట్టే సమయంలో అతని కాలు తగిలి కుషన్ స్వల్పంగా కదిలినట్లు అనిపిస్తున్నా... మూడో అంపైర్ వేర్వేరు కోణాల్లో పరీక్షించకుండానే అలెన్ను అవుట్గా ప్రకటించాడు! ఈ దశలో రఘువంశీ, రహానే కలిసి కీలక పరుగులు జోడించారు. అయితే లక్నో బౌలర్లు చెలరేగడంతో ఒక్కసారిగా కోల్కతా జోరు తగ్గింది. 19 బంతుల వ్యవధిలో 12 పరుగులు మాత్రమే చేసి జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు బౌండరీనే రాలేదు! ఇలాంటి స్థితిలో గ్రీన్, పావెల్ దూకుడుగా ఆడారు. చివరి 4 ఓవర్లలో కేకేఆర్ 54 పరుగులు రాబట్టింది. బదోని అర్ధ సెంచరీ... ఛేదనలో మార్క్రమ్ (22), మార్ష్(15) తొలి వికెట్కు 25 బంతుల్లో 41 పరుగులు జోడించి లక్నోకు మెరుగైన ఆరంభం అందించారు. సైనీ ఓవర్లో మార్క్రమ్ వరుసగా 4, 6, 4తో ధాటిని ప్రదర్శించాడు. అయితే అరోరా ఒకే ఓవర్లో వీరిద్దరిని వెనక్కి పంపి దెబ్బ కొట్టగా... ఎట్టకేలకు ఈ సీజన్లో బౌలింగ్కు దిగిన గ్రీన్ తన తొలి ఓవర్లోనే పంత్ (10)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత పూరన్ (13), సమద్ (2) విఫలం కాగా, బదోని కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించాడు. బదోని అవుటైన తర్వాత లక్నో దాదాపు ఆశలు కోల్పోగా... ముకుల్ అద్భుత బ్యాటింగ్తో గెలిపించాడు. రాజస్తాన్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ముకుల్ చౌదరీ జైపూర్ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్బౌలర్గా మొదలు పెట్టినా...అకాడమీలో వికెట్ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు మళ్లాడు. అండర్–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్లలో ఏకంగా 199 స్ట్రయిక్రేట్తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్గా ఎదగడం ఖాయం’ అని లక్నో కోచ్ లాంగర్ ఐపీఎల్కు ముందు వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్ దానిని నిరూపించాడు. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X బెంగళూరు వేదిక: గువాహటిరాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్,జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) షమీ (బి) రాఠీ 41; అలెన్ (సి) రాఠీ (బి) ప్రిన్స్ 9; రఘువంశీ (సి) మార్క్రమ్ (బి) సిద్ధార్థ్ 45; గ్రీన్ (నాటౌట్) 32; రింకూ (బి) అవేశ్ 4; పావెల్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–15, 2–99, 3–105, 4–111. బౌలింగ్: షమీ 4–0–27–0, ప్రిన్స్ యాదవ్ 4–0–47–1, సిద్ధార్థ్ 4–0–34–1, దిగ్వేశ్ రాఠీ 4–0–25–1, అవేశ్ 4–0–44–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్(సి) రఘువంశీ (బి) అరోరా 15; మార్క్రమ్ (సి) పావెల్ (బి) అరోరా 22; పంత్ (సి) త్యాగి (బి) గ్రీన్ 10; బదోని (సి) రింకూ (బి) రాయ్ 54; పూరన్ (సి) రమణ్దీప్ (బి) త్యాగి 13; సమద్ (బి) రాయ్ 2; ముకుల్ (నాటౌట్) 54; షమీ (సి) రాయ్ (బి) నరైన్ 1; అవేశ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–41, 2–42, 3–73, 4–95, 5–104, 6–125, 7–128. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–38–2, రాయ్ 4–0–32–2, సైనీ 3–0–37–0, నరైన్ 4–0–13–1, త్యాగి 3–0–31–1, గ్రీన్ 2–0–28–1. -
‘నేనైతే మిల్లర్ను తోసేసేవాడిని’
న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చివరి ఓవర్ ఐదో బంతికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సింగిల్ నిరాకరించడం తీవ్ర చర్చకు దారి తీసింది. మిల్లర్ తప్పు చేశాడని, జట్టు ఓటమికి కారణమయ్యాడని ఎక్కువ భాగం విమర్శలు వచ్చాయి. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అసలు మిల్లర్ ఏం ఆలోచించాడో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా తనకు అర్థం కావడం లేదని, మ్యాచ్ ఫలితాన్ని అసలు నమ్మలేకపోతున్నానని అతను వ్యాఖ్యానించాడు.‘ఆఖరి బంతికి ఫోర్ లేదా సిక్స్ కొట్టాల్సి ఉందంటే మిల్లర్ నిర్ణయం సరైంది అనుకోవచ్చు. కానీ 2 బంతుల్లో 2 పరుగులు అంటే మహా అయితే ఏం జరిగే అవకాశం ఉంటుంది. ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే స్కోరు సమమయ్యేది. చివరి బంతికి కుల్దీప్ సింగిల్ తీసేవాడు. అలా కాకున్నా అతను అవుటయ్యేవాడు. అలాంటిది 10 మ్యాచ్లలో ఒకసారి జరగవచ్చంతే. భారీ స్కోర్ల మ్యాచ్లో సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లడంలో నష్టం ఏముంది. ఆ ఐదో బంతికి కుల్దీప్ స్థానంలో నేను ఉండి ఉంటే సింగిల్ కోసం దూసుకుపోయి అక్కడి నుంచి మిల్లర్ను పరుగెత్తమని తోసేసేవాడిని’ అని అశ్విన్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు కొత్త తరహా దారులు వెతుకుతున్నట్లు అనిపిస్తుందని కూడా అశ్విన్ విశ్లేషించాడు. ‘ఈ తరహాలో ఓడిపోవడం వల్ల ముందుగా మీ జట్టులో ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. పైగా వరుసగా మూడు మ్యాచ్లు ఓడితే తీవ్ర ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్న గుజరాత్ కోలుకొని మళ్లీ బరిలోకి నిలిచేందుకు మీరు అవకాశం కల్పించి మీరు నాలుగు పాయింట్ల వద్దే ఆగిపోయారు’ అని అశ్విన్ విమర్శించాడు. మిల్లర్ ఆలోచన తప్పు కాదు: గావస్కర్ మరోవైపు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మాత్రం మిల్లర్ నిర్ణయాన్ని సమర్థించాడు. జట్టును గెలిపించాలనే అతని ఉద్దేశంలో తప్పేమీ లేదని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ‘మిల్లర్ అప్పటికి చాలా బాగా ఆడుతున్నాడు. గెలిపించగలనని తనపై తాను నమ్మకం ఉంచాడు. అతaని ఉద్దేశాన్ని మనం తప్పు పట్టవద్దు. చివరకు అతని ఆలోచన సరిగా అమలు చేయలేకపోయాడు. ప్రసిధ్ కృష్ణ చక్కటి స్లో బౌన్సర్తో మిల్లర్ను కట్టిపడేశాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఈ స్థితిలోనే మన బుర్రను వాడాలి. నా ఉద్దేశం ప్రకారం కూడా ఐదో బంతికి సింగిల్ తీస్తే బాగుండేది. అంతకు ముందు కుల్దీప్ సింగిల్ రాబట్టగలిగాడనే విషయం మర్చిపోవద్దు’ అని గావస్కర్ అన్నాడు. -
భారత మహిళల పంచ్ అదుర్స్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు తమ పంచ్ పవర్ను చాటుకున్నారు. గురువారం జరిగిన ఫైనల్స్లో నలుగురు భారత బాక్సర్లు మీనాక్షి హుడా (48 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), అరుంధతి చౌధరీ (70 కేజీలు), ప్రియ ఘన్ఘస్ (60 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), అల్ఫియా పఠాన్ (ప్లస్ 80 కేజీలు) మాత్రం రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.ఫైనల్స్లో మీనాక్షి 5–0తో నొముందరి (మంగోలియా)పై, ప్రీతి 5–0తో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత హువాంగ్ సియావో వెన్ (చైనీస్ తైపీ)పై గెలిచారు. అరుంధతి 4–1తో బకిత్ సెడిష్ (కజకిస్తాన్)పై, ప్రియ 3–0తో వన్ ఉన్ గ్యోంగ్ (ఉత్తర కొరియా)పై నెగ్గారు. జైస్మీన్ 0–5తో పున్రావి ర్యునర్స్ (థాయ్లాండ్) చేతిలో, అల్ఫియా 0–5తో దినా ఇస్లామ్బెకోవా (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. తెలంగాణ స్టార్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ (51 కేజీలు)... టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), అంకుశిత బోరో (65 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించారు. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగిన 10 వెయిట్ కేటగిరీల్లోనూ భారత బాక్సర్లు పతకాలు నెగ్గడం విశేషం. -
సింధు పరాజయం... క్వార్టర్ ఫైనల్లో ఆయుశ్
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి ఆయుశ్ శెట్టి మినహా మిగతా భారత షట్లర్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 18–21, 8–21తో రెండో సీడ్ వాంగ్ జి యి (చైనా) చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో ఉన్నతి హుడా 17–21, 9–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 21–16, 21–12తో ప్రపంచ 20వ ర్యాంకర్ చి యు జెన్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12–21, 19–21తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 13–21, 14–21తో నాలుగో సీడ్ చెన్ టాంగ్ జి–టో ఈ వె (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ మ్యాచ్లో శ్రుతి మిశ్రా–ప్రియ (భారత్) జోడీ 10–21, 13–21తో యూకీ ఫకుషిమా–మయు మత్సుమోటో (జపాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
భారత్కు రెండో ఓటమి
న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. ఇండోనేసియాతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 0–3తో ఓడింది. తొలి మ్యాచ్లో వైష్ణవి అడ్కర్ 7–6 (7/3), 6–7 (3/7), 3–6తో ప్రిస్కా నుగ్రోహో చేతిలో... రెండో మ్యాచ్లో సహజ యామలపల్లి 2–6, 1–6తో జనైస్ టిజెన్ చేతిలో... మూడో మ్యాచ్లో అంకిత రైనా–రుతుజా 3–6, 6–7 (4/7)తో అల్దిలా సుత్జియాది–జనైస్ టిజెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. నేడు జరిగే నాలుగో మ్యాచ్లో మంగోలియాతో భారత్ ఆడుతుంది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో కొరియా, ఇండోనేసియా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
కాంస్యాలు గెలిచిన హన్సిక, నేహా
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో గురువారం భారత్కు రెండు కాంస్య పతకాలు లభించాయి. మరో పతకం ఖరారైంది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గగా... మీనాక్షి (53 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాంస్య పతక బౌట్లలో హన్సిక 6–1తో అరుకె కదిర్బెక్ (కిర్గిస్తాన్)పై, నేహా 10–4తో బొలోర్తుయా (మంగోలియా)పై గెలిచారు. మీనాక్షి క్వార్టర్ ఫైనల్లో 15–4తో ఎస్బోసినోవా (ఉజ్బెకిస్తాన్)పై, సెమీఫైనల్లో 4–2తో సెయంగ్ పార్క్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో చైనా రెజ్లర్ జిన్ జాంగ్తో మీనాక్షి తలపడుతుంది. 72 కేజీల విభాగంలో హర్షిత కాంస్యం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో హర్షిత 2–7తో మహిరో యోషిటాకె (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
రాకెట్ నేలకేసి కొట్టి...
మోంటెకార్లో: ప్రపంచ మాజీ నంబర్వన్, రష్యా టెన్నిస్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్ సంయమనం కోల్పోయాడు. మోంటెకార్లో మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా... ఘోర పరాజయం మూటగట్టుకున్న మెద్వెదెవ్ తన రాకెట్ను విరగ్గొట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో పదో ర్యాంకర్ మెద్వెదెవ్ 0–6, 0–6తో బెరెటిని (ఇటలీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మెద్వెదెవ్ తన రాకెట్ను వరుసగా ఏడుసార్లు నేలకేసి కొట్టి విరగ్గొట్టాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన మెద్వెదెవ్... క్రీడా కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై భారీ జరిమానా పడే అవకాశం ఉంది. తొలి సెట్ కోల్పోయి అసహనంలో ఉన్న మెద్వెదెవ్... రెండో సెట్లో తన తొలి సర్వీస్ కోల్పోయిన సమయంలో ఈ చర్యకు పాల్పడ్డాడు. 2021 యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ నెగ్గిన మెద్వెదెవ్ ఈ మ్యాచ్ను 49 నిమిషాల్లోనే కోల్పోయాడు. గతంలో బెరెటినితో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ఈ రష్యా ఆటగాడు... ఈసారి మాత్రం అదే జోరు కనబర్చలేకపోయాడు. ఇటీవల ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్పై విజయం సాధించిన మెద్వెదెవ్... మట్టి కోర్టులో జరిగిన ఈ పోరులో స్థాయికితగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి వరల్డ్ టాప్–10 ఆటగాడిని 6–0, 6–0తో ఓడించిన ఐదో ప్లేయర్గా బెరెటిని నిలిచాడు. దీన్ని ‘డబుల్ బేగల్’ అంటారు. చివరిసారిగా దశాబ్దం క్రితం ఇటాలియన్ ఓపెన్లో డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–0, 6–0తో బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేశాడు. -
‘పోడియంపై ఇక ఒంటరిని కాను’
కోల్కతా: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో స్వర్ణ, రజతాలు భారత్కే దక్కడం సంతోషంగా ఉందని... భారత స్టార్ పారా ఆర్చర్ శీతల్ దేవి పేర్కొంది. పారా ఆర్చరీలో లెక్కకు మిక్కిలి అవార్డులు, రికార్డులు తన పేరిట లిఖించుకున్న శీతల్ దేవి... సహచర పారా ఆర్చర్ పాయల్ నాగ్ ప్రదర్శనను కొనియాడింది. గతంలో పోడియంపై నిలిచినప్పుడు దేశం తరఫున తాను మాత్రమే గెలుస్తున్నట్లు ఒంటరి తనంగా ఉండేదని... ఇప్పుడు తనకు తోడు దొరికినట్లు అనిపిస్తోందని చెప్పింది. ఇటీవల బ్యాంకాక్ వేదికగా జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ కాంపౌండ్ మహిళల ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆర్చర్ శీతల్పై భారత్కే చెందిన 18 ఏళ్ల పాయల్ నాగ్ విజయం సాధించింది. దీంతో పసిడితో పాటు రజత పతకం భారత్కే దక్కింది. ఈ నేపథ్యంలో గురువారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో శీతల్ మాట్లాడుతూ...‘గతంలో నేను ఒక్క దాన్నే గెలుస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు పాయల్ వచ్చింది. చాలా సంతోషం. తను చక్కటి ప్రదర్శనతో విజయం సాధించింది. ఇద్దరం కలిసి దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం. ఆటలో గెలుపోటములు సహజం. ఆ రోజు నాకన్నా పాయల్ చాలా బాగా బాణాలు సంధించింది. దీంతో రెండు పతకాలు మనకే దక్కాయి. ఆసియా క్రీడలు, పారాలింపిక్స్లో దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం’ అని వెల్లడించింది. ఒడిశాలోని బాలాంగిర్కు చెందిన పాయల్ నాగ్... చిన్నప్పుడే విద్యుదాఘాతానికి గురైంది. మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి పనిచేస్తున్న భవనం వద్ద కరెంట్ షాక్కు గురైంది. దీంతో రెండు చేతులతో పాటు... రెండు కాళ్లు మోకాలి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. అనంతరం ఆర్చరీని కెరీర్గా ఎంచుకున్న పాయల్... అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. శీతల్పై గెలవడం పాయల్కు ఇది రెండోసారి. గతంలో నేషనల్ చాంపియన్షిప్లోనూ శీతల్పై పాయల్ పైచేయి సాధించింది. -
ఓడిపోయే మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించాడు.. ఎవరీ ముకుల్ చౌదరి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి మరో సూపర్ స్టార్ పుట్టుకొచ్చాడు. తన సంచలన బ్యాటింగ్తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ వంటి విధ్వంసకర ఆటగాళ్ల విఫలమైన చోట.. ఆ యువ ఆటగాడు అద్భుతం సృష్టించాడు. ఒంటో చేత్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. అతడే లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ చౌదరి.ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముకుల్ చౌదరి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోయే మ్యాచ్ను ఓంటి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్ స్కోరర్గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్(32), రావ్మన్ పావెల్(39) రాణించారు.అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో పవర్ ప్లేలోనే ఓపెనర్లు మార్క్రమ్ (22), మార్ష్(15) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత రిషబ్ పంత్(10), పూరన్(13), సమద్(2) ముగ్గురు కూడా వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అయూశ్ బదోని(54) మాత్రం దూకుడుగా ఆడుతూ కేకేఆర్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు.కానీ అదే సమయంలో క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి కేకేఆర్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం అయూశ్ బదోని సైతం ఔటయ్యాడు. అప్పటికే చివరి నాలుగు ఓవర్లలో లక్నో విజయానికి 50 పరుగులు కావాలి. రెగ్యులర్ బ్యాటర్లు ఎవరు లేకపోవడంతో లక్నో ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ ముకుల్ చౌదరి అందరి అంచనాలను తారుమారు చేశాడు.తొలి ఆరు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసిన ముకుల్.. ఆఖరి నాలుగు ఓవర్లలో విశ్వరూపాన్ని చూపించాడు. వైభవ్ అరోరా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 4, 6, 1 బాది 11 పరుగులు రాబట్టిన ముకుల్ చౌదరి.. తర్వాత కార్తీక్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 2 సిక్సర్లతో 13 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 30 పరుగులు అవసరమయ్యాయి.ఈ సమయంలో కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ముకుల్ 6, 4, 6 బాది 16 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆరోరా వేసిన చివరి ఓవర్లో లక్నో విజయ సమీకరణం 14 పరుగులుగా మారింది. తొలి బంతిని అవేష్ సింగిల్ తీసి ముకుల్ చౌదరికి స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో ముకుల్.. రెండో బంతిని డీప్ స్క్వేర్-లెగ్ దిశగా భారీ సిక్సర్గా మలిచాడు.అనంతరం వరుసగా రెండు బంతులకు ఎలాంటి పరుగులు రాకపోవడంతో లక్నో డగౌట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఐదో బంతికి ముకుల్ సిక్స్ బాది స్కోర్లను సమం చేశాడు. చివరి బంతికి బై రూపంలో పరుగు తీసి తన జట్టుని గెలిపించాడు. ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్స్లతో 54 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో ఎవరీ ముకుల్ చౌదరి నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ ముకుల్ చౌదరి?21 ఏళ్ల ముకుల్ చౌదరి.. రాజస్తాన్లోని ఝున్ఝునులో జన్మించాడు. ముకుల్కు చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ. అతడి తండ్రి ముకుల్ను గొప్ప క్రికెటర్ చేయాలని కలలు కన్నాడు. కానీ అప్పట్లో వారి ఆర్ధిక పరిస్థితి అంత బాగోలేకపోవడంతో సరైన అకాడమీలో చేర్చలేకపోయాడు. ఆఖరికి పైసా పైసా కూడబెట్టి 12-13 ఏళ్ల వయసులో తొలిసారి ముకుల్ను ఓ క్రికెట్ ఆకాడమీలో అతడి తండ్రి చేర్చాడు. ముకుల్ మొదట్లో మీడియం ఫాస్ట్ బౌలర్గా శిక్షణ పొందాడు. అయితే తన అకాడమీ జట్టులో వికెట్ కీపర్ లేకపోవడంతో కీపింగ్ గ్లౌవ్స్ ధరించాడు. ఆపై అతడు బౌలింగ్ను పక్కన పెట్టి స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్గా మారిపోయాడు. ముకుల్ 2023లో రాజస్థాన్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో 165+ స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.అంతేకాకుండా గతేడాది జరిగిన అండర్-23 వన్డే టోర్నమెంట్లో కూడా అతడు రాజస్తాన్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్డే టోర్నీలో అతడు 102.83 సగటుతో 617 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2026 వేలానికి ముందు అతడిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్రయల్స్కు పిలిచింది.ట్రయల్స్లో కూడా తన అద్భుత బ్యాటింగ్తో ముంబై స్కౌట్లను ఆకట్టుకున్నాడు. దీంతో ముకుల్ను వేలంలో కొనుగోలు చేయాలని ముంబై భావించింది. రూ. 30 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన అతడి కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. ఆఖరికి లక్నో రూ. 2.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముకుల్ ఆడిన రెండు మ్యాచ్లలో అతడు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. కానీ అతడికి లక్నో మేనెజ్మెంట్ మరోసారి అవకాశమచ్చింది. ఈసారి తన మూడో మ్యాచ్లో అద్బుత ఇన్నింగ్స్తో మేనెజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటివరకు 4 ఫస్ట్ క్లాస్, 5 లిస్ట్-ఎ, 10 టీ20 మ్యాచ్లు ఆడాడు. -
ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి
ఐపీఎల్-2026లో వరుసగా రెండో మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన ఉత్కంఠపోరులో 3 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.ఈ విజయంలో ముకుల్ చౌదరిది కీలక పాత్ర. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో పవర్ప్లేలోనే ఓపెనర్లు మార్క్రమ్(22), మార్ష్(15) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే రిషబ్ పంత్(10), నికోలస్ పూరన్(13), సమద్(2) కూడా వరుస క్రమంలో పెవిలియన్కు చేరాడు. కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఆయూశ్ బదోని మాత్రం కేకేఆర్ బౌలర్లను టార్గెట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన అనంతరం బదోని(54) కూడా పెవిలియన్కు చేరాడు. దీంతో లక్నో ఓటమి ఖాయమని అంతా భావించారు.ముకుల్ సంచలనంకానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి అందరి అంచనాలను తారుమారు చేశాడు. తొలి ఆరు బంతుల్లో కేవలం 6 పరుగులు చేసిన ముకుల్.. ఆ తర్వాత మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చివరి రెండు ఓవర్లలో లక్నో విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా.. ముకుల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 6, 4, 6 బాది 16 పరుగులు రాబట్టేశాడు. దీంతో లక్నో విజయ సమీకరణం 6 బంతుల్లో 14 పరుగులుగా మారింది. తొలి బంతికి అవేష్ ఖాన్ సింగిల్ తీసి స్ట్రైక్ ముకుల్ చౌదరికి ఇచ్చాడు. రెండో బంతికి సిక్సర్ బాదిన ముకుల్ చౌదరి, ఆ తర్వాత 2 డాట్ బాల్స్ ఆడాడు. చివరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సి వచ్చింది. దీంతో ఇరు జట్ల డగౌట్స్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఐదో బంతిని ముకుల్ సిక్సర్గా బాది స్కోర్లను సమం చేశాడు. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు లభించడంతో లక్నో విజయం సాధించింది. వికెట్ కీపర్ రఘువంశీ డైరెక్ట్ త్రో చేయడంలో విఫలమయ్యాడు.ముకుల్ కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్స్లతో 54 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా లక్నో 182 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, అనుకుల్ రాయ్ తలా రెండు వికెట్లు సాధించగా.. సునీల్ నరైన్, గ్రీన్, త్యాగీ చెరో వికెట్ పడగొట్టారు.అంతకముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్ స్కోరర్గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్(32), రావ్మన్ పావెల్(39) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్దార్ధ్, దిగ్వేష్ సింగ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2026: 'అతడొక సంచలనం.. టీమిండియా సూపర్ స్టార్ అవుతాడు' -
'అతడొక సంచలనం.. టీమిండియా సూపర్ స్టార్ అవుతాడు'
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్బుత బ్యాటింగ్తో దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ వైభవ్ సత్తాచాటాడు .ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రాను సైతం వైభవ్ విడిచిపెట్టలేదు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో బుమ్రా వేసిన తొలి బంతికే వైభవ్ సిక్సర్గా మలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్లో వైభవ్ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వైభవ్పై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ను "అసలైన సూపర్ స్టార్"గా స్మిత్ అభివర్ణించాడు.నేను ఊహించినట్లే ఫ్లాట్ పిచ్లు, అధిక స్కోరింగ్ మ్యాచ్లతో ఐపీఎల్ ప్రారంభమైంది. ఎప్పటిలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ సూపర్ స్టార్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ మాత్రం అందరికంటే ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నాడు. మొదటి బంతి నంచే తన పవర్ను అతడు చూపిస్తున్నాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ నిజంగా అద్భుతం. ఈ టోర్నమెంట్ ముగిసేలోపు వైభవ్ ఒక సూపర్ స్టార్ అవుతాడు. భారత క్రికెట్కు కూడా అతడు భవిష్యత్తు బ్యాటింగ్ స్టార్ అవుతాడని స్మిత్ పేర్కొన్నాడు.చదవండి: భారత లెజెండరీ క్రికెటర్ కన్నుమూత -
ఫిన్ అలెన్ది ఔటా? నాటౌటా?
ఐపీఎల్ 2026లో అంపైరింగ్ నిర్ణయాలు తీవ్ర వివాదస్పదమవుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ అవుటైన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. లక్నో ఫీల్డర్ దిగ్వేష్ రాఠీ పట్టిన క్యాచ్ క్లీన్ క్యాచ్ కాదా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.ఏమి జరిగిందంటే?కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో లక్నో పేసర్ ప్రిన్స్ యాదవ్ వేసిన నాలుగో బంతిని ఫిన్ అలెన్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని డీప్ థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న దిగ్వేష్ రాఠీ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో రాఠీ కాలు బౌండరీ లైన్కు తాకినట్లు కన్పించింది.సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు రిఫర్ చేయాలి. కానీ ఆశ్చర్యకరంగా ఫీల్డ్ అంపైర్లు అలెన్ను నేరుగా అవుట్గా ప్రకటించారు. ఆ తర్వాత రిప్లేలో అతడి కాలి బౌండరీ రోప్కు తాకినట్లు అన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్గా నాటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతకుముందు ఇదే సీజన్లో సన్రైజర్స్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ క్యాచ్లు కూడా వివాదస్పదమయ్యాయి.Finn Allen robbed pic.twitter.com/5Jqb7r6IVl— Nickk Knight (@KnightNick34590) April 9, 2026 -
భారత లెజెండరీ క్రికెటర్ కన్నుమూత
భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) మరణించారు. చెన్నైలోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యలతో ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 1952లో ఇంగ్లండ్పై భారత్ సాధించిన తొలి టెస్ట్ విజయంలో గోపీనాథ్ కీలక పాత్ర పోషించారు.భారత్ ఇన్నింగ్స్ ఎనిమిది పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ చారిత్రత్మ మ్యాచ్లో గోపీనాథ్ 35 పరుగులు చేశారు. తొలి టెస్టు విజయం సాధించిన భారత జట్టులో ఇప్పటివరకు జీవించి ఉన్న ఏకైక క్రికెటర్ గోపీనాథ్ కావడం విశేషం. ఇప్పుడు ఆయన మరణంతో భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది.1951లో ఇంగ్లండ్పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గోపీనాథ్ తన కెరీర్లో భారత్ తరపున 8 టెస్టులు ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మద్రాస్ తరపున ఆడన 83 మ్యాచ్లు ఆడారు. గోపీనాథ్ తన అరంగేట్ర మ్యాచ్లోనే మెరుపుగలు మెరిపించాడు. తన అరంగేట్ర టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మొదటి ఇన్నింగ్స్లో 50 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్లో 42 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆయన 8 మ్యాచ్లలో 242 పరుగులు చేశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.చదవండి: IPL 2026: డేవిడ్ మిల్లర్ కాదు.. ఢిల్లీ ఓటమికి అసలు కారణమిదే? -
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఊహకందని ఓ అద్భుతం జరిగింది. మహిళల విభాగంలో ఓ బౌలర్ ఏకంగా 9 వికెట్లు తీసి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కలహరి మహిళల టీ20 టోర్నీ-2026లో భాగంగా లెసోథోతో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ బౌలర్ లారా కార్డోసో ఈ చారిత్రక ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు వేసిన ఆమె.. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి, ఓ హ్యాట్రిక్ సహా 9 వికెట్లు పడగొట్టింది. ఫలితంగా 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన లెసోథో జట్టు 13 పరుగులకే ఆలౌటై (6.2 ఓవర్లలో), 190 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయంపాలైంది.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో లారా కార్డోసో నమోదు చేసిన ఈ గణాంకాలు (3-0-4-9) ఏ విభాగంలో (పురుషులు, మహిళల) అయినా అత్యుత్తమంగా నిలిచిపోనున్నాయి. గతంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు భూటాన్ బౌలర్ సోనమ్ యెషే పేరిట ఉండేవి. గతేడాది డిసెంబర్లో మయన్మార్తో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో యెషే కేవలం 7 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. -
ఉత్కంఠపోరులో లక్నో విజయం
KKR vs LSG Live updates: కేకేఆర్తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముకుల్ చౌదరి(27 బంతుల్లో 54) అద్భుతమైన ఇన్నింగ్స్తో లక్నోను గెలిపించాడు. చివరి ఓవర్లో లక్నో విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి అవేష్ ఖాన్ సింగిల్ తీసి స్ట్రైక్ ముకుల్ చౌదరికి ఇచ్చాడు. ముకుల్ రెండో బంతిని భారీ సిక్సర్గా మలిచాడు. దీంతో లక్నో విజయ సమీకరణం 4 బంతుల్లో 7 పరుగులగా మారింది. అయితే తర్వాతి రెండు బంతులకు ఎటువంటి పరుగులు రాలేదు. చివరి రెండు బంతులకు 7 పరుగులు అసవరమయ్యాయి. మళ్లీ ఐదో బంతికి ముకుల్ సిక్సర్ బాదాడు. దీంతో స్కోర్లు సమమయ్యాయి. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు లభించడంతో లక్నో విజయం సాధించింది. వికెట్ కీపర్ రఘువంశీ డైరెక్ట్ త్రో చేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా లక్నో 182 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతి చేధించింది.దుమ్ములేపుతున్న ముకుల్ చౌదరికేకేఆర్ విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావాలి. ముకుల్ చౌదరి అద్భుతంగా ఆడుతున్నాడు.18 ఓవర్లకు లక్నో స్కోర్: 152/718 ఓవర్లు ముగిసేసరికి లక్నో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ముకుల్ చౌదరీ(26) దూకుడుగా ఆడుతున్నాడు.కేకేఆర్ ఆరో వికెట్ డౌన్కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన ఆయూశ్ బదోని.. అనుకుల్ రాయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14.4 ఓవర్లకు లక్నో స్కోర్: 125-6లక్నో నాలుగో వికెట్ డౌన్లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నికోలస్ పూరన్.. కార్తీక్ త్యాగీ బౌలింగ్లో ఔటయ్యాడు.లక్నో మూడో వికెట్ డౌన్రిషబ్ పంత్ రూపంలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రిషబ్ పంత్.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లకు లక్నో స్కోర్: 74-3లక్నో రెండో వికెట్ డౌన్లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. వైభవ్ ఆరోరా బౌలింగ్లో ఔటయ్యాడు.లక్నో తొలి వికెట్ డౌన్41 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన మార్క్రమ్.. వైభవ్ ఆరోరా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చాడు.4 ఓవర్లకు లక్నో స్కోరెంతంటే?4 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(22), మిచెల్ మార్ష్(22) ఉన్నారు.రాణించిన కేకేఆర్ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(41) టాప్ స్కోరర్గా నిలవగా.. రఘువంశీ(45), గ్రీన్(32), రావ్మన్ పావెల్(39) రాణించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్దార్ధ్, దిగ్వేష్ సింగ్, అవేష్ ఖాన్ తలా వికెట్ సాధించారు.17 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 144/417 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో పావెల్(25), గ్రీన్(15) ఉన్నారు.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్రింకూ సింగ్ రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రింకూ సింగ్.. అవేష్ ఖాన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. కేకేఆర్ మూడో వికెట్ డౌన్కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన రఘువంశీ.. సిద్దార్ధ్ బౌలింగ్లో ఔటయ్యాడు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్అజింక్య రహానే రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన రహానే.. దిగ్వేష్ సింగ్ రాథీ బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 102/27 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 65/17 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో రఘువంశీ(26), అజింక్య రహానే(27) ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఫిన్ అలెన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువంశీ వచ్చాడు. 2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 16/1ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్కు దూరమైన కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.దీంతో బ్లెస్సింగ్ ముజర్బానీ బెంచ్కే పరిమితయమ్యాడు. అయితే స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాత్రం తన చేతి వేలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. మరోవైపు లక్నో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎస్ఆర్హెచ్తో ఆడిన టీమ్నే కొనసాగించింది.జట్లు:కోల్కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రోవ్మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగిఇంపాక్ట్ సబ్లు - మనీష్ పాండే, వైభవ్ అరోరా, తేజస్వి దహియా, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్లు - ఆయుష్ బడోని, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్, -
గెలిపించిన గ్రీన్
ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ క్రిస్ గ్రీన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో సత్తా చాటాడు. ఈ లీగ్లో ఇస్లామాబాద్ యునైటెడ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రీన్.. లాహోర్ ఖలందర్స్తో ఇవాళ (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్లో పొదుపుగా (4-0-13-3) బౌలింగ్ చేయడంతో పాటు 3 కీలక వికెట్లు తీసి ప్రత్యర్దిని దారుణంగా దెబ్బకొట్టాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.గ్రీన్తో పాటు షాదాబ్ ఖాన్ (4-0-18-2), ఇమాద్ వసీం (4-0-13-2), రిచర్డ్ గ్లీసన్ (3-0-13-2), ఫహీమ్ అష్రఫ్ (2.3-0-21-1) సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఇస్లామాబాద్ లాహోర్ను 18.3 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ చేసింది. లాహోర్ ఇన్నింగ్స్లో 25 పరుగులు చేసిన సికందర్ రజా టాప్ స్కోరర్గా నిలువగా.. హసీబుల్లా ఖాన్ (19), అబ్దుల్లా షఫీక్ (10), ఆసిఫ్ అలీ (15) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్ 10.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. డెవాన్ కాన్వే (59 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో ఇస్లామాబాద్ను గెలిపించాడు. అతనికి మొహమ్మద్ ఫైక్ (34 నాటౌట్) సహకరించాడు. ఇస్లామాబాద్ కోల్పోయిన ఏకైక వికెట్ (సమీర్ మిన్హాస్ (5)) లాహోర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి దక్కింది.ఎవరీ క్రిస్ గ్రీన్..?32 ఏళ్ల కుడి చేతి వాటం ఆఫ్ స్పిన్నర్ క్రిస్ గ్రీన్ ఫ్రాంచైజీ క్రికెట్లో సుపరిచితుడు. సౌతాఫ్రికాలో పుట్టి ఆస్ట్రేలియా తరఫున ఓ టీ20 ఆడిన గ్రీన్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి క్రికెట్ లీగ్లో ఆడాడు. బిగ్బాష్ లీగ్లో ఇతనికి మంచి పేరు వచ్చింది. అయితే బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉండటం అతని కెరీర్ను సజావుగా సాగనివ్వలేదు. ఈ గ్రీన్ ఐపీఎల్లోనూ ఓ మ్యాచ్ ఆడాడు. యాదృచ్చికంగా ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న కెమరూన్ గ్రీన్, ఈ క్రిస్ గ్రీన్ కేకేఆర్ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించారు. క్రిస్ గ్రీన్ను కేకేఆర్ 2020 ఎడిషన్లో రూ. 20 లక్షలకు సొంతం చేసుకోగా.. కెమరూన్ గ్రీన్ను 2026 వేలంలో కేకేఆర్ ఏకంగా రూ. 25. 20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్గా కెమరూన్ గ్రీన్ రికార్డుల్లోకెక్కాడు. అయితే తనపై పెట్టిన పెట్టుబడికి గ్రీన్ న్యాయం చేయలేకపోతున్నాడు. బ్యాటింగ్లో దారుణంగా విఫలమవుతూ, అస్సలు బౌలింగే చేయడం లేదు. -
డేవిడ్ మిల్లర్ కాదు.. ఢిల్లీ ఓటమికి అసలు కారణమిదే?
ఐపీఎల్-2026లో బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థిల్లర్ సినిమాను తలపించిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.అద్భుతమైన ఇన్నింగ్స్తో హీరోగా మారుతాడు అనుకున్న డేవిడ్ మిల్లర్ ఒక్క తప్పిదంతో విలన్గా మారిపోయాడు. ప్రసిద్ద్ కృష్ణ చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని విప్రజ్ నిగమ్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతికి విప్రజ్ ఔటయ్యాడు.మూడో బంతికి కుల్దీప్ మిల్లర్కు సింగిల్ తీసి ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ భారీ సిక్స్గా మలిచాడు. దీంతో ఢిల్లీ విజయానికి ఆఖరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరయ్యాయి. అయితే ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశమున్నప్పటికి మిల్లర్ తిరస్కరించాడు. మిల్లర్ స్ట్రైక్ తన వద్ద అంటిపెట్టుకుని మ్యాచ్ ఫినిష్ చేయాలనుకున్నాడు. కానీ మిల్లర్ అనుకున్నది జరగలేదు. ఆఖరి బంతి ప్రసిద్ద్ బౌన్సర్గా సంధించడంతో మిల్లర్ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. బై కోసం పరిగెత్తగా.. జోస్ బట్లర్ స్టంప్స్ను గిరాటేశాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి చవిచూడాల్సింది. ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ టై ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్నే కోల్పోవల్సింది. ఓటమి అనంతరం మిల్లర్ కన్నీటి పర్యంతమయ్యాడు. సహచర ఆటగాళ్లు మిల్లర్ను ఓదార్చారు.అయితే ఢిల్లీ డేవిడ్ మిల్లర్ వల్ల కాదని, ఓ ఐసీసీ రూల్ వల్ల ఓడిపోయిందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. అసలేంటి ఆ రూల్? ఢిల్లీ ఓటమికి ఎలా కారణమైందో ఓసారి పరిశీలిద్దాం.ఏమి జరిగిందంటే?ఢిల్లీ ఇన్నింగ్స్ 9 ఓవర్లో నిస్సాంక ఔటయ్యక నితీశ్ రాణా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 10వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్లో రెండో బంతి నితీష్ రాణా ప్యాడ్లకు తగిలింది. అప్పీల్ చేయగా అంపైర్ వెంటనే వేలెత్తి అవుట్ అని ప్రకటించాడు. అప్పటికే రాహుల్, నితీశ్ పరుగు పూర్తి చేశాడు. నితీష్ రాహుల్తో చర్చించి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి క్లియర్గా బ్యాట్ ఎడ్జ్ తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే నితీశ్ తీసిన రన్ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు.ఐసీసీ లా 20.1.1.3 ప్రకారం.. అంపైర్ ఒక బ్యాటర్ను అవుట్ అని ప్రకటించిన మరుక్షణమే ఆ బంతి 'డెడ్ బాల్' అవుతుంది. ఆ తర్వాత బంతి బౌండరీకి వెళ్లినా లెక్కలోకి తీసుకోరు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో అదే జరిగింది. నిర్ణయం మారినప్పటికీ అప్పటికే బాల్ డెడ్ కావడంతో బ్యాటర్లు తీసిన ఆ ఒక్క పరుగును అంపైర్లు నిరాకరించారు. ఆఖరికి ఢిల్లీ జట్టు కేవలం 1 పరుగు తేడాతోనే ఓడిపోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆ పరుగు ఇచ్చి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లేది.చదవండి: PSL 2026: డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఆ జట్టుకు కొత్త కెప్టెన్? -
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్
దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందుతుంది. హిట్మ్యాన్పై బయోపిక్ రాబోతుందని సోషల్మీడియా కోడై కూస్తోంది. ఇవాళ (ఏప్రిల్ 9) రోహిత్ ఇన్స్టాలో షేర్ చేరిన స్టోరీ ఈ పుకార్లకు తావిచ్చింది.రోహిత్ షేర్ చేసిన క్రిప్టిక్ పోస్ట్లో నెట్ఫిక్స్ లోగో కలిగిన డ్రాఫ్ట్ #45 అనే స్క్రిప్ట్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. దీనిపై Champion అని రాసి ఉంది. Rohit Sharma’s copy అనే వాటర్మార్క్ ఉండటంతో, హిట్మ్యాన్ ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం అయ్యాడని అభిమానులు భావిస్తున్నారు. #collab అనే క్యాప్షన్ Netflixతో అధికారిక ఒప్పందం ఉందని సూచిస్తోంది. Rohit bhai ab Netflix Netflix pe bhi pull karenge ❤️ pic.twitter.com/mOdNjOIr09— Johns. (@CricCrazyJohns) April 9, 2026వీటన్నిటినీ బట్టి హిట్మ్యాన్పై డాక్యుమెంటరీ లేదా బయోపిక్ రాబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్-రోహిత్ బ్యాక్డ్రాప్లో డాక్యూ–సిరీస్ ఉంటుందని కొందరనుకుంటున్నారు. మరికొందరేమో, రోహిత్ స్పోర్ట్స్–థీమ్ షోలో పాల్గొనబోతున్నాడని చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరోవైపు ఫ్రాంచైజీ క్రికెట్లో ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో హిట్మ్యాన్ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్లో 78 (38) పరుగులు, ఆతర్వాతి మ్యాచ్లో 35 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మూడో మ్యాచ్లో 5 పరుగులు సహా.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 118 పరుగులు చేశాడు. హిట్మ్యాన్ తన తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 12న ఆడనున్నాడు. వాంఖడే జరిగే ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో తలపడుతుంది. -
డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఆ జట్టుకు కొత్త కెప్టెన్?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో వరుస విజయాలతో దూసుకు పోతున్న కరాచీ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కరాచీ కింగ్స్ గురువారం పెషావర్ జల్మీతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు కరాచీ రెగ్యులర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.డేవిడ్ వార్నర్ సిడ్నీలో మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై పోలీసులు డ్రండ్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అయితే అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి వార్నర్ ఏప్రిల్ 7న కరాచీ కింగ్స్ జట్టుతో తిరిగి చేరాల్సింది.కానీ అతడు ఇంకా పాకిస్తాన్కు రానిట్లు తెలుస్తోంది. ఈరోజు పెషావర్ జల్మీతో జరగనున్న కీలక మ్యాచ్కు వార్నర్ అందుబాటులో లేకపోవడంతో, కరాచీ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్గా పేసర్ హసన్ అలీ వ్యవహరించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అసలేమి జరిగిందంటే?కరాచీ కింగ్స్ జట్టుకు వారం రోజులు విశ్రాంతి లభించడంతో వార్నర్ తన కుటుంబంతో సమయం గడపడానికి పాక్ నుండి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఈ క్రమంలో సిడ్నీలోని మారుబ్రా ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లో వార్నర్ దొరికిపోయాడు.వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి నిర్ణీత పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆ తర్వాతి అతడిని విడిచిపెట్టారు. అయితే వచ్చే నెలలో ఈ కేసుకు సంబంధించి వార్నర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కాగా పెషావర్ జల్మీతో మ్యాచ్కు దూరంగా ఉన్నప్పటికి కరాచీ ఆడే తదుపరి మ్యాచ్కు వార్నర్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.చదవండి: IPL 2026: 'ఎంత మంది వచ్చినా అతడే నా ఫేవరేట్ కెప్టెన్' -
'ఎంత మంది వచ్చినా అతడే నా ఫేవరేట్ కెప్టెన్'
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కోల్కతా నైట్రైడర్స్కు కెప్టెన్గా మూడో టైటిల్ను అందించిన శ్రేయస్ అయ్యర్.. గతేడాది పంజాబ్ కింగ్స్ను రన్నరప్గా నిలిచాడు. ఐపీఎల్-2026లో కూడా పంజాబ్ను అయ్యర్ విజయపథంలో నడిపిస్తున్నాడు.ఈ ఏడాది సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి రెండు విజయాలను నమోదు చేసింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్పై ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2019 నుండి జట్టుతో ఉన్న ప్రభ్సిమ్రాన్.. గత ఏడేళ్లలో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజ కెప్టెన్ల నాయకత్వంలో ఆడాడు. కానీ తన ఫేవరేట్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ప్రభ్సిమ్రాన్ ఎంచుకున్నాడు.శ్రేయస్ అయ్యర్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటాడు. నేను కొన్ని మ్యాచ్లలో సరిగ్గా ఆడకపోయినప్పటికి, శ్రేయస్ నా దగ్గరకు వచ్చి ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని చెప్పేవాడు. నా ఆట నన్ను ఆడమని మద్దతు ఇచ్చేవాడు. అందుకే నా దృష్టిలో అతడే బెస్ట్ కెప్టెన్. అయ్యర్ నన్ను ఒక సీనియర్ ప్లేయర్గా చూశేవాడు. జట్టు వ్యూహాల్లో భాగం చేయడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ప్రభ్సిమ్రాన్ పేర్కొన్నాడు.చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’ -
ఆస్ట్రేలియా ప్లేయర్ షాకింగ్ నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మోసస్ హెన్రిక్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో అతను ఆస్ట్రేలియాను వదిలి పోర్చుగల్కు వలస వెళ్లనున్నాడని సమాచారం. ఈ విషయాన్ని పోర్చుగల్ క్రికెటర్ సిరాజ్ ఉల్లా ఖదెమ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా లీక్ చేశాడు. త్వరలో మన జట్టులో ఓ బిగ్బాష్ లీగ్ ప్లేయర్ జాయిన్ కాబోతున్నాడని హింట్ ఇచ్చాడు.హెన్రిక్స్ పోర్చుగల్కు మకాం మార్చడానికి ఓ ప్రధాన కారణముంది. అతనికి ఆస్ట్రేలియా జట్టు తరఫున అవకాశాలు రావడం లేదు. స్టోయినిస్, మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్ల వల్ల అతని అవకాశాలు కనుమరుగయ్యాయి. పైగా అతని వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. వయసు కూడా అతనికి అడ్డంకిగా మారింది. దీంతో అతను తన స్వస్థలమైన పోర్చుగల్కు మారాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. హెన్రిక్స్కు ఆస్ట్రేలియాతో పాటు పోర్చగల్ పౌరసత్వం కూడా ఉంది.హెన్రిక్స్ 1989లో పోర్చుగల్లో జన్మించాడు. అతడి తండ్రి ఆల్వారో ఓ ప్రొఫెషనల్ ఫుట్బాలర్. చిన్న వయసులోనే హెన్రిక్స్ కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. 2013లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన హెన్రిక్స్ 4 టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హెన్రిక్స్ అంతర్జాతీయ కెరీర్లో 636 పరుగులు చేసి, 17 వికెట్లు సాధించాడు. బిగ్బాష్ లీగ్లో హెన్రిక్స్కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. సిడ్నీ సిక్సర్స్ తరఫున 3324 పరుగులు చేసి, రెండు టైటిల్స్ (2019/20, 2020/21) గెలిపించాడు. అసోసియేట్ దేశాలు అంతర్జాతీయ క్రికెట్లో బలంగా ఎదుగుతున్న తరుణంలో హెన్రిక్స్ లాంటి ఆటగాడు పోర్చుగల్కు వలస వెళ్లడం ఆ దేశ క్రికెట్ తలరాతనే మార్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లో ఇటలీ లాంటి చిన్న జట్టు అద్భుతాలు చేసి, ప్రపంచ దృష్టిని ఆకర్శించిన విషయం విధితమే.అసోసియేట్ జట్లలో చేరిన ప్రముఖ క్రికెటర్లు- ఉన్ముక్త్ చంద్ (భారత్) – యూఎస్ఏ - రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే – నెదర్లాండ్స్ - కోరె ఆండర్సన్ – యూఎస్ఏ - డేవిడ్ వీస్ – నమీబియా - వేన్ మాడ్సన్ – ఇటలీ - రాస్ టేలర్ – సమోవా -
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఐసీసీ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ (2007)లో భారత్ గెలవడంలో ఈ ఆల్రౌండర్ది కీలక పాత్ర.అదే విధంగా.. సొంతగడ్డపై భారత్ వన్డే వరల్డ్కప్-2011 టైటిల్ గెలవడంలో యువీదే ముఖ్య భూమిక. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అద్భుత ప్రదర్శన కారణంగా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత టీమిండియా మరోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో యువీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.ఆటకే ప్రాధాన్యంఅయితే, ఇంతటి సంతోషకర సమయంలోనే ఓ చేదు వార్త యువరాజ్ సింగ్కు తెలిసింది. తనకు క్యాన్సర్ సోకిందనే విషయం బయటపడింది. అదే సమయంలో టెస్టు జట్టులో యువీకి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కంటే ఆటకే ప్రాధాన్యం ఇవ్వాలని అతడు భావించాడు. అయితే, డాక్టర్ హెచ్చరికల తర్వాత యువీ తన నిర్ణయాన్ని మార్చుకోకతప్పలేదు.అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్న యువరాజ్ సింగ్.. మహమ్మారిని జయించి మరికొన్నేళ్లు క్రికెటర్గా కొనసాగాడు. అయితే, చేదు అనుభవాల గురించి అతడు తాజాగా మనసు విప్పాడు. ‘‘ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకున్న వేళ ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోతున్నట్లు అనిపించింది.అప్పుడు మేము ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంగూలీ రిటైర్ అయిన కారణంగా నాకు టెస్టు జట్టులో అప్పుడే చోటు దక్కింది. ఏడేళ్ల నిరీక్షణ ఫలించబోతున్న తరుణం. నేను చచ్చిపోయినా పర్లేదు.. ఆ స్థానం నాకు కావాల్సిందే అని మనసులో గట్టిగా అనుకున్నాను.ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చుఅయితే, అప్పుడు డాక్టర్ నితేశ్ రోహత్గి నాకో భయంకర నిజం చెప్పారు. ‘నీ గుండె, ఊపిరి తిత్తులకు మధ్య ట్యూమర్ ఉంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్లి క్రికెట్ ఆడితే గుండెపోటు వచ్చినా రావొచ్చు. కీమోథెరపీ ఇప్పుడు గనుక మొదలుపెట్టకపోతే ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం’ అని కుండబద్దలుకొట్టేశారు.అప్పుడే నాకు సమస్య తీవ్రత అర్థమైంది. అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్నా. నేనిక ఆడలేను అన్న బాధ మానసికంగా నన్ను కుంగదీసింది. కానీ అసలు క్రికెట్ లేకపోతే నేనెవరిని? నా గుర్తింపు ఏమిటి? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పుడు పాత క్రికెట్ వీడియోలు చూస్తూ స్ఫూర్తి పొందేవాడిని.ముందు ఆరోగ్యంమీద శ్రద్ధ పెట్టునేను అమెరికాలో ఉన్నపుడు అనిల్ కుంబ్లే వచ్చాడు. లాప్టాప్లో మ్యాచ్లు చూస్తుంటే.. ‘ముందు ఆరోగ్యంమీద శ్రద్ధ పెట్టు. ఇవన్నీ పక్కన పెట్టు’ అని మందలించాడు. ఇంగ్లండ్లో ఉన్నపుడు సచిన్ పాజీ వచ్చి ‘నువ్వు త్వరలోనే కోలుకుని తిరిగి వస్తావు’ అని ధైర్యం నింపాడు’’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్తో యూట్యూబ్ చాట్లో యువీ పంచుకున్నాడు.చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే! -
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్ ఇక్బాల్ తన మొదటి నిర్ణయంతోనే సంచలనం సృష్టించాడు. తమీమ్ తన తొలి సంతకాన్ని క్రికెటర్ల జీతాల పెంపు ఫైల్పై చేసి, వారి జీవితాల్లో ఆనందాలు నింపాడు. గతంలో ఏ అధ్యక్షుడు క్రికెటర్ల జీతాల గురించి పట్టించుకోలేదన్న వాదన ఉంది. తమీమ్ అధ్యక్షుడు కాగానే జీతాలు పెరగడంతో క్రికెటర్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. బాస్ అంటే ఇలా ఉండాలంటూ పలువురు క్రికెటర్లు సోషల్మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.ఏప్రిల్ 7న బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్వ బోర్డును రద్దు చేసి, తమీమ్ను 11 మంది సభ్యులతో కూడిన అడ్–హాక్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించింది. 37 ఏళ్ల వయసులోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించాడు. తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరన్న విషయం తెలిసిందే.మహిళా క్రికెటర్లకు భారీ ఊరట తమీమ్ మొదటి నిర్ణయం బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్లకు భారీ ఊరట కలిగించింది. గతంలో కొందరు స్థానిక క్రికెటర్లు కేవలం 1000 టాకాలు (రూ. 749.69) మాత్రమే జీతంగా పొందేవారు. తమీమ్ తాజా నిర్ణయంతో ఇప్పుడు వారి జీతాలు టీ20 మ్యాచ్కు 10000 టాకాలు, 50 ఓవర్ల మ్యాచ్కు 15000 టాకాలు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు 20000 టాకాలుగా మారాయి. టాప్ 36 మహిళా క్రికెటర్ల జీతాలు సైతం గణనీయంగా పెరిగాయి. గతంలో 30000 టాకాలుగా ఉండిన వారి నెల జీతం ఇప్పుడు 40000 టాకాలకు పెరిగింది. ఈ పెంపు మహిళా క్రికెటర్లకు ఆర్థిక భరోసా కలిగించడంతో పాటు ప్రోత్సాహం కూడా అందించింది. పురుష క్రికెటర్లకు జాక్పాట్తమీమ్ నిర్ణయంతో బంగ్లాదేశ్ పురుషు క్రికెటర్లకు జాక్పాట్ తగిలనట్లైంది. గతంలో గ్రేడ్ ఏ, బీ, సీ కేటగిరిల్లో ఉండే ఆటగాళ్లకు కేవలం 35000 టాకాలు జీతంగా అందేది. ఇప్పుడు గ్రేడ్ల వారీగా విభజన జరిగి, గ్రేడ్ సి ఆటగాళ్లకు 40000 టాకాలు, గ్రేడ్ బి ఆటగాళ్లకు 50000 టాకాలు, గ్రేడ్ ఏ ఆటగాళ్లకు 65000 టాకాలు జీతంగా నిర్ణయించబడింది. అలాగే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఫీజు 75000 టాకాల నుంచి 100000 టాకాలకు పెరిగింది. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని తమీమ్ ప్రకటించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఇన్నేళ్లుగా జీతాల్లో పెద్ద మార్పులు జరగలేదు. కష్టపడి ఆడే ఆటగాళ్లకు న్యాయమైన వేతనం ఇవ్వడం మా లక్ష్యమని అన్నారు. -
బాంబు పేల్చిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, తన అంతర్జాతీయ కెరీర్పై ఆసక్తికర ప్రకటన చేశాడు. నిన్న (ఏప్రిల్ 8) ఢిల్లీ క్యాపిటల్స్పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన (3-17) చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన అతను.. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాన్ని ఇచ్చి బాంబు పేల్చాడు.మ్యాచ్ అనంతరం రషీద్ మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ ఆడొద్దని డాక్టర్లు చెప్పారు. అయినా నేను ఆడాను. గతేడాది జింబాబ్వేపై ఓ టెస్ట్ మ్యాచ్లో 67 ఓవర్లు వేశాను. ఈ చర్య నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. నేను ఓ టెస్ట్ మ్యాచ్లో ఇన్ని ఓవర్లు వేశానని తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఇకపై టెస్ట్లు ఆడే సాహసం చేస్తే, ఎక్కువ కాలం క్రికెట్లో కొనసాగలేనని హెచ్చరించినట్లు వెల్లడించాడు. కాగా, రషీద్ ఖాన్ 2023 నుంచి వెన్ను గాయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. శస్త్రచికిత్స కూడా జరిగింది. వైద్యులు రెడ్బాల్ క్రికెట్ ఆడొద్దని స్పష్టంగా సూచించారు. అయినా రషీద్ గతేడాది జింబాబ్వేపై టెస్ట్ మ్యాచ్ ఆడి ఏకంగా 67 ఓవర్లు వేశాడు. ఈ నిర్ణయం అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. రషీద్ 2023 వన్డే వరల్డ్ కప్ కోసం శస్త్రచికిత్స వాయిదా వేసుకున్నాడు. ఆతర్వాత యూకేలో సర్జరీ చేయించుకున్నాడు. 2024లో తిరిగి వచ్చాడు. వరుసగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల గాయాలు తిరగబెట్టాయి. ఫలితంగా కొంతకాలం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే అతను తిరిగి గాడిలో పడ్డాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీశాడు. బ్యాట్తోనూ పర్వాలేదనిపించాడు. రషీద్ టెస్ట్ కెరీర్ను పరిశీలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 2017లో టెస్ట్ హోదా పొందినప్పటి నుంచి 12 మ్యాచ్లు ఆడగా, రషీద్ కేవలం 6 టెస్ట్ల్లో మాత్రమే పాల్గొన్నాడు. చివరిసారి అతను 2025లో జింబాబ్వేపై టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో 67 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. మొత్తంగా రషీద్ తన టెస్ట్ కెరీర్లో 6 మ్యాచ్ల్లో 45 వికెట్లు తీశాడు. -
కన్నీళ్లు పెట్టుకున్న డేవిడ్ మిల్లర్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 8) జరిగిన ఉత్కంఠ సమరంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఢిల్లీని గెలిపించేందుకు డేవిడ్ మిల్లర్ చివరి బంతి వరకు పోరాడి విఫలమయ్యాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన తరుణంలో మిల్లర్ సింగిల్కు నిరాకరించడం కీలక తప్పిదంగా మారింది. Backing our Tiger, always 🫂💙 pic.twitter.com/pAFouiVmVH— Delhi Capitals (@DelhiCapitals) April 9, 2026ఆఖరి బంతిని మిస్ చేయడంతో కుల్దీప్ యాదవ్ రనౌటయ్యాడు. దీంతో ఢిల్లీ పరుగు తేడాతో పరాజయంపాలైంది. అంతకుముందు ఓవర్లో (19) 23 పరుగులు బాది ఢిల్లీని గెలుపుకు చేరువ చేసింది కూడా మిల్లరే. ఇంత చేసి చివరికి మ్యాచ్ గెలిపించలేకపోవడంతో అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. బాధపడుతున్న మిల్లర్ను కెప్టెన్ అక్షర్ పటేల్, హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ ఓదార్చారు. మిల్లర్ భావోద్వేగ క్షణాలను డీసీ తమ సోషల్మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసింది. “Backing our Tiger, always 💙” అంటూ మిల్లర్కు మద్దతు తెలిపింది. ఇది నాణేనికి ఒకవైపు.. మరోవైపు, కొందరు సొంత అభిమానులే మిల్లర్ను తిట్టిపోశారు. 19వ ఓవర్ ఐదో బంతిలో సింగిల్ తీసుంటే కనీసం సూపర్ ఓవర్కి అవకాశం ఉండేది. తప్పంతా మిల్లర్దే అంటూ సోషల్మీడియాలో దుమ్మెత్తిపోశారు. అంత అతి విశ్వాసం పనికి రాదంటూ మిల్లర్కు చీవాట్లు పెట్టారు.నాణేనికి అటు ఇటు ఉన్న విషయాలను పక్కన పెడితే, మిల్లర్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఆ సందర్భంలో అనుభవమున్న ఏ బ్యాటర్ అయినా అలాగే చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇలా మిస్ ఫైర్ అవడం సహజమే. ఇందులో మిల్లర్ను నిందించాల్సిన అవసరం లేదు.ఎవరు ఔనన్నా, కాదన్నా ఈ సీజన్లో ఢిల్లీ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. తాజాగా గుజరాత్ చేతిలో ఓటమి మినహా, ఈ సీజన్లో ఆ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. వరుసగా లక్నో, ముంబై ఇండియన్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా ఓటమి తర్వాత కూడా మెరుగైన రన్రేట్ కలిగి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ హైలైట్స్ - GT 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.- గిల్ (70), బట్లర్ (52), సుందర్ (55) అర్ద సెంచరీలతో రాణించారు. - ఛేదనలో DC ఓపెనర్లు కేఎల్ రాహుల్ (92), నిస్సంక (41) చెలరేగి ఆడారు. - గాయపడిన చేతితో డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్) చివరి బంతి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీని గెలిపించలేకపోయాడు. - రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 3/17తో DC మిడిలార్డర్ను కుదిపేశాడు. -
IPL: అత్తా- కోడళ్ల సీరియల్స్ చూసేవాళ్లే కావాలి!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా ప్రాచుర్యం పొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). భారత్లో టీ20 ఫార్మాట్లో 2008లో మొదలైన ఈ టోర్నీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. ఐపీఎల్ ప్రసార హక్కులు రూ. 40 వేల కోట్లకు పైగా అమ్ముడుపోవడం ఈ లీగ్కు ఉన్న ఆదరణకు నిదర్శనం. అయితే, ఆరంభంలో ఐపీఎల్ ప్రసారాలకు అసలు బ్రాడ్కాస్టర్లే దొరకలేదట.ప్రతి చోటా ‘నో’ అనే సమాధానమే దాదాపు వెయ్యి మంది వ్యాపారవేత్తలు ఐపీఎల్ ఐడియాను తిరస్కరించారట. ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్, ఆర్థిక నేరగాడు లలిత్ మోదీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘అప్పట్లో బ్రాడ్కాస్టర్లందరి దగ్గరికి మేము వెళ్లాము. కానీ ఒక్కరు కూడా మా మాట వినలేదు.ప్రతి ఒక్కరి నుంచి ‘నో’ అనే సమాధానమే వచ్చేది. దాదాపు వెయ్యి మంది వ్యాపారవేత్తలకు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. అందులో 90 శాతం మందికి అసలు నేనేం చెబుతున్నానో అర్థమయ్యేదే కాదు. అప్పుడు నేను తీవ్రంగా ఆలోచించాను.అత్తా-కోడళ్ల సీరియళ్లు చూసేవారిని మళ్లించాలిటీవీలో వచ్చే అత్తా-కోడళ్ల సీరియళ్లు చూసే ప్రేక్షకులను టార్గెట్ చేయాలనుకున్నా. అక్కడే మనం ఊహించనంత డబ్బు ఉంటుంది. నిజానికి భారత ప్రచార మార్కెట్లో ఎనిమిది గంటల స్లాట్ అత్యంతముఖ్యమైనది.కాబట్టి నైట్ క్రికెట్ వైపు మొగ్గుచూపితే బాగుంటుందనిపించింది. సంగీతం, డ్యాన్సులతో ఎనిమిది గంటలకు మ్యాచ్ ఆరంభించాలనే నిర్ణయానికి వచ్చాము. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల్ని ఆకర్షించడం మా ప్రధాన ఉద్దేశం. ఈ ప్రేక్షకుల వల్లే డబ్బు ఎక్కువగా వస్తుంది.భారత్ పాకిస్తాన్ను చిత్తు చేయడంతోఇక మొట్టమొదటి, టీ20 ప్రపంచకప్-2007 ఫైనల్లో భారత్ పాకిస్తాన్ను చిత్తు చేయడం మాకు కలిసి వచ్చింది. టీమిండియా ఆటగాళ్లను హీరోలుగా కీర్తిస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేశాము. వారిని చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. ఐపీఎల్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇది కూడా బాగా ఉపయోగపడింది’’ అని లలిత్ మోదీ స్పోర్ట్స్టార్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే! -
బుమ్రాపై వైభవ్ సూర్యవంశీ కామెంట్ వైరల్
టీమిండియా ప్రధాన పేసర్, ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన శైలితో రాణిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు బుమ్రా. అతడు బంతితో రంగంలోకి దిగాడంటే దిగ్గజ బ్యాటర్లు సైతం వణికిపోవాల్సిందే.అయితే, రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ మాత్రం బుమ్రాను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అతడికి ఏకంగా సిక్సర్తో స్వాగతం పలికి ఔరా అనిపించాడు. ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్- రాజస్తాన్ రాయల్స్ మంగళవారం తలపడ్డాయి.తొలి బంతికే సిక్సర్ ఈ మ్యాచ్లో వైభవ్- బుమ్రా ఫైట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. బుమ్రా బౌలింగ్లో తొలి బంతికే సిక్సర్ బాదిన వైభవ్.. అతడి ఓవర్లో మరో సిక్స్ కూడా రాబట్టాడు. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ తీరుపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ బుమ్రాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ముంబైపై విజయానంతరం రాయల్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో బుమ్రాను ఎదుర్కొన్న అనుభవం ఎలా ఉందన్న ప్రశ్నకు బదులిస్తూ..గొప్పగా ఫీలవ్వడానికి ఏమీ లేదు‘‘ఇందులో నేనేమీ గొప్పగా ఫీలవ్వడానికి ఏమీ లేదు. బౌలర్ కంటే కూడా బంతిపైనే ఎక్కువగా దృష్టి పెట్టేందుకు నేను ఎల్లవేళలా ప్రయత్నిస్తాను. అయితే, బుమ్రా వంటి దిగ్గజ బౌలర్ ఎదురుగా ఉండటం వల్ల కాస్త గాబరాగానే అనిపించింది.అయితే, నా అలవాటుకు తగ్గట్లే బంతిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అనుకున్న ఫలితం రాబట్టగలిగాను’’ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. కాగా ముంబైతో మ్యాచ్లో వైభవ్ 14 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో రాజస్తాన్ ముంబైపై 27 పరుగుల తేడాతో గెలిచింది.చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే! View this post on Instagram A post shared by Rajasthan Royals (@rajasthanroyals) -
‘మిల్లర్ తప్పేమీ లేదు.. కుల్దీప్ స్ట్రైక్ తీసుకుంటే బాగుండేది’
టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో మిల్లర్ తప్పేమీ లేదంటూ అతడికి మద్దతుగా నిలిచాడు. ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం మంచిదే అయినా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తప్పవని.. మిల్లర్ విషయంలోనూ ఇదే జరిగిందన్నాడు.ఐపీఎల్-2026లో భాగంగా ఢిల్లీ- గుజరాత్ బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడ్డా.. డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41*) విజయంపై ఆశలు పెంచాడు.ఒక్క పరుగు తేడాతోఈ ఐదో నంబర్ బ్యాటర్ ధనాధన్ దంచికొడుతూ ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకువచ్చాడు. అయితే, చివరి ఓవర్లో గుజరాత్ బౌలర్ ప్రసిద్ కృష్ణ రంగంలోకి దిగగా.. విప్రాజ్ నిగమ్ తొలి బంతికి సిక్స్ బాది మరుసటి బంతికి అవుటయ్యాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైక్ మిల్లర్కు ఇవ్వగా.. నాలుగో బంతికి అతడు సిక్సర్ బాదాడు.చివరి రెండు బంతుల్లో విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. మిల్లర్ సింగిల్కు నిరాకరించాడు. ఆఖరి బంతికి తానే హిట్టింగ్ ఆడాలని భావించగా.. ప్రసిద్ షార్ట్ బాల్తో బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో సింగిల్ తీసేందుకు మిల్లర్ ప్రయత్నించగా.. కుల్దీప్ స్ట్రైకర్ వైపునకు వచ్చే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.అతడి తప్పేమీ లేదుఈ నేపథ్యంలో మిల్లర్పై విమర్శలు వస్తుండగా.. భారత దిగ్గజ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాత్రం మద్దతుగా నిలిచాడు. "నిజానికి మిల్లర్ విన్నింగ్ రన్స్ తానే తీయాలని భావించాడు. అయితే, ఆఖరి ఓవర్లో కుల్దీప్ తాను ఎదుర్కొన్న తొలి బంతి ద్వారా సింగిల్ తీసిన తీరును మిల్లర్ గుర్తుంచుకోవాల్సింది.కుల్దీప్నకు స్ట్రైక్ ఇచ్చి ఉంటే బాగుండేది. అయితే, గత ఓవర్లో తాను సిక్సర్ బాదిన విషయాన్ని మనసులో పెట్టుకుని.. ఈసారి కూడా అదే పునరావృతం చేయగలనని మిల్లర్ విశ్వసించాడు. ఇందులో అతడి తప్పేమీ లేదు. కానీ ప్రసిద్ కృష్ణ అద్భుత బంతి సంధించి మిల్లర్ ఆశలపై నీళ్లు చల్లాడు’’ అని గావస్కర్ పేర్కొన్నాడు. చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026 -
శుబ్మన్ గిల్కు ‘ఊహించని’ షాక్!
గుజరాత్ టైటాన్స్ ఎట్టకేలకు ఐపీఎల్-2026 టోర్నీలో బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం నాటి మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఢిల్లీ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్) చేసిన పొరపాటు టైటాన్స్ నెత్తిన పాలు పోసింది. ఫలితంగా ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో టైటాన్స్ను విజయం వరించింది.ధనాధన్సొంతమైదానం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన ఢిల్లీ.. గుజరాత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ నాలుగు వికెట్లు నష్టపోయి 210 పరుగులు సాధించింది. శుబ్మన్ గిల్ (45 బంతుల్లో 70) కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరవగా.. జోస్ బట్లర్ (27 బంతుల్లో 52), వాషింగ్టన్ సుందర్ (32 బంతుల్లో 55) ధనాధన్ దంచికొట్టారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగుల వద్ద నిలిచిపోయింది. పాతుమ్ నిస్సాంక (24 బంతుల్లో 41), కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92), మిల్లర్ ఇన్నింగ్స్ వృథా అయ్యాయి. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ రెండు, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.శుబ్మన్ గిల్కు ఊహించని షాక్అయితే, గెలుపు జోష్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీతో మ్యాచ్లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఐపీఎల్ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.‘‘ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు జరిమానా విధించడమైనది. ఈ సీజన్లో ఇదే అతడి తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షల జరిమానాతో సరిపెడుతున్నాము’’ అని ఐపీఎల్ పాలక మండలి ప్రకటనలో పేర్కొంది. చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026


