breaking news
Sports
-
ఆర్సీబీకి తొలి ఓటమి.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది.ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని నామమాత్రపు స్కోరే పరిమితం చేశారు. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, కాప్, మిన్ను మని తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధాన(38) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో లారా వోల్వడర్ట్(42), కాప్(19) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సత్ఘరే రెండు, రాధా యాదవ్ ఓ వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా ఐదు మ్యాచ్లలో విజయం సాధించిన ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. -
న్యూజిలాండ్ చిత్తు చిత్తు.. భారత్ హ్యాట్రిక్ విజయం
బులావాయో:: ఐసీసీ అండర్ 19 వరల్డ్కప్లో భారత్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు(శనివారం, జనవరి 24వ తేదీ) న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం నమోదు చేసింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. దాంతో ఈ వరల్డ్కప్లో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆపై 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 13.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్లో విజేతను డక్వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్ణయించారు. ఫలితంగా భారత్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై విజయాన్ని అందుకుంది. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 17 ఓవర్లలో 90 పరుగులు చేస్తే విజయం సాధించినట్లు. దాంతో భారత్ అప్పటికే ముందంజలో ఉండటంతో విజయం అడ్డుకోవడానికి కివీస్కు ఎటువంటి చాన్స్ లేకుండా పోయింది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(40: 23 బంతుల్లో 2 ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి విజృంభించి ఆడాడు. అతనికి జతగా కెప్టెన్ ఆయుష్(53: 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో భారత్ స్కోరు 9.5 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటేసింది. అంతకుముందు భారత బౌలర్లలో అంబ్రిష్ నాలుగు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించగా, హెనిల్ పటేల్ మూడు వికెట్లతో మెరిశాడు. -
'హిట్మాన్'పై అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మపై యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్మాన్ అడుగుజాడల్లో నడుస్తున్నానని చెప్పాడు. టి20 పవర్ ప్లేలో రోహిత్ శర్మలా ఆడటానికి ప్రయత్నిస్తున్నానని అన్నాడు. తనపై హిట్మాన్ ప్రభావం గురించి జియోస్టార్తో మాట్లాడుతూ.. "రోహిత్ భాయ్ దేశం కోసం చాలా చేశాడు. పవర్ప్లేలో అతడు ఇచ్చే ప్రారంభాల కారణంగా ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుందని అన్నాడు. రోహిత్ శర్మ పాత్ర పోషించాలని కోచ్ గౌతమ్ గంభీర్ తనకు సూచించినట్టు వెల్లడించాడు.గంభీర్తో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రోత్సహంతో తాను రోహిత్ శర్మ ఫార్ములాను అనుసరిస్తున్నానని అభిషేక్ తెలిపాడు. "నేను జట్టులోకి వచ్చినప్పుడు.. కోచ్, కెప్టెన్ నా నుంచి అదే ఆశించారు. తొలి బంతి నుంచే విరుచుకుపడడం నాకు ఇష్టం కాబట్టి.. అది నా శైలికి కూడా సరిపోతుందని భావించాను. రోహిత్ భాయ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. టీమిండియా తరపున ఇలా ఆడుతూ రాణించడం నాకు నిజంగా సంతోషంగా ఉంద''ని అన్నాడు.దూకుడుగా ఆడటమే నా పనితన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటానని అభిషేక్ శర్మ చెప్పాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి.. జట్టు భారీస్కోరుకు బాటలు వేయాలని భావిస్తానని చెప్పాడు. "నేను ఇంకా పూర్తిగా పరిణతి చెందానని చెప్పను, ఎందుకంటే ఎల్లప్పుడూ మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి ఆరు ఓవర్లలో దూకుడుగా క్రికెట్ ఆడటమే నా పని అని భావిస్తున్నాను. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మంచి ఆరంభం ఇస్తే జట్టు ఆ ఊపును అనుసరించగలదని నాకు తెలుసు. అందుకే జట్టుకు ఆరంభం ఇవ్వాలని ప్రతిసారి అనుకుంటాన''ని ఈ డాషింగ్ ఓపెనర్ పేర్కొన్నాడు.వారితో ప్రాక్టీస్ చేస్తాటి20 ప్రపంచకప్కు సన్నద్ధత కోసం మాట్లాడుతూ.. తన దూకుడుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తానని, మ్యాచ్లకు ముందు తానెప్పుడూ ఇదే ఫాలో అవుతానని అన్నాడు. ''నాకు వారం లేదా 10 రోజులు సమయం దొరికినప్పుడు, తదుపరి సిరీస్ లేదా మ్యాచ్లలో నేను ఎదుర్కొనబోయే బౌలర్లను గుర్తుంచుకుంటాను. వారిలా బౌలింగ్ చేసే వారితో ప్రాక్టీస్ చేస్తాను. కొత్త బంతితో అవుట్-స్వింగర్లు, ఇన్-స్వింగర్లు వేయమని చెప్పి బ్యాటింగ్ చేస్తుంటాను. టి20 వరల్డ్కప్లో భాగంగా దేశవ్యాప్తంగా భిన్నమైన పరిస్థిల్లో వేర్వేరు జట్లతో ఆడాల్సి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ చాలా ముఖ్యమ''ని అభిషేక్ అభిప్రాయపడ్డాడు.పవర్ హిట్టింగ్తో హిట్2024, జూలైలో టి20లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్తో తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే నంబర్వన్ బ్యాటర్ ఎదిగాడు. ఇప్పటివరకు 34 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 190.92 స్ట్రైక్ రేట్తో 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 7 నుంచి జరిగే టి20 ప్రపంచకప్లోనూ తన జోరును కొనసాగించాలని ఈ ఎడంచేతి వాటం ఓపెనర్ ఉవ్విళ్లూరుతున్నాడు. చదవండి: ప్రధాని తర్వాత కష్టమైన జాబ్.. గంభీర్పై ప్రశంసలు -
దిగ్గజాలకు షాక్!.. అది నిజమే: బీసీసీఐ
ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టు గ్రేడ్లలో మార్పులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. A+ గ్రేడ్ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం ధ్రువీకరించారు.బోర్డు సంతృప్తితో లేదు‘‘A+ గ్రేడ్ను తొలగించే విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రస్తుతం ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు కాకుండా.. కేవలం ఒకే ఒక్క ఫార్మాట్ ఆడేందుకు సుముఖంగా ఉన్నారు. A+ గ్రేడ్లో కొనసాగేందుకు కావాల్సిన అర్హతలు ఇప్పుడు ఎవరూ కలిగిలేరు. ఈ విషయంలో బోర్డు సంతృప్తితో లేదు.ఈ గ్రేడ్లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడవద్దని నిర్ణయించుకున్నారు. మా నిబంధనలకు అనుగుణంగా ఎవరూ లేరు కాబట్టి ఈ గ్రేడ్ను తీసివేయాలని ఫిక్సయిపోయాం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్స్టార్తో పేర్కొన్నారు.రో-కో వన్డేలలో మాత్రమేకాగా గతేడాది ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులలో బ్యాటింగ్ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలతో పాటు.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా మాత్రమే A+ గ్రేడ్లో ఉన్నారు. వీరిలో కోహ్లి, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు.మరోవైపు.. జడేజా కూడా పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పి కేవలం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. ఇక బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడుతున్నా పనిభారం తగ్గించుకునే క్రమంలో అతడు ఎక్కువసార్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అయితే, టెక్నికల్గా మాత్రం మూడు ఫార్మాట్లు ఆడుతున్నట్లే లెక్క.బుమ్రాకు మాత్రం ఏడు కోట్లు?ఈ క్రమంలో రో-కోలతో పాటు జడ్డూకు వార్షిక తగ్గించే విషయంలో నిర్ణయం తీసేసుకున్న బీసీసీఐ.. బుమ్రాకు A+ గ్రేడ్ మాదిరే మాత్రం రూ. 7 కోట్లు జీతంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా A గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, B గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు. అదే విధంగా C గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి వార్షిక జీతంగా చెల్లిస్తోంది బీసీసీఐ.చదవండి: RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్బీర్ కపూర్! -
ICC: బై.. బై.. బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ వచ్చేసింది
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్కు ఉద్వాసన తప్పలేదు. భారత్లో తమ మ్యాచ్లు ఆడలేమంటూ పంతం పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) గట్టిషాకిచ్చింది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ను తప్పించి ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ప్రస్తుత టీ20 టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు ఐసీసీ ఈ అవకాశం ఇచ్చింది.కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడి నుంచి మొదలుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ను (Mustafizur Rahman) ఐపీఎల్ నుంచి తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేసింది.ఈ పరిణామాల క్రమంలో టీ20 వరల్డ్కప్లో భాగంగా భారత్లో తమ మ్యాచ్లు ఆడలేమని బీసీబీ.. ఐసీసీకి తెలియజేసింది. భద్రతాపరమైన ముప్పులు ఉన్నందున తమ వేదికను శ్రీలంకకు మార్చాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పరిశీలనా బృందం నుంచి వివరాలు తీసుకున్న ఐసీసీ. భారత్లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీలేదని తేల్చింది.మొండి వైఖరి అయితే, బీసీబీ మాత్రం మొండి వైఖరి అవలంబించింది. తాము భారత్లో మ్యాచ్లు ఆడే ప్రసక్తే లేదని పంతం పట్టింది. ఐసీసీ గడువు ఇచ్చినప్పటికీ తమ నిర్ణయం ఇదేనంటూ సవాలు విసిరినట్లుగా మాట్లాడింది. అంతేకాదు ఆఖరి ప్రయత్నంగా వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది.ముందుగా హెచ్చరించినట్లుగానేతాము భారత్లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్సీని బీసీబీ కోరింది. అయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేకపోయింది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఐసీసీ.. ముందుగా హెచ్చరించినట్లుగానే బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్తో భర్తీ చేసినట్లు క్రిక్బజ్ తన కథనంలో వెల్లడించింది. ఈ విషయం గురించి బీసీబీకి ఐసీసీ లేఖ కూడా రాసినట్లు పేర్కొంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక ఈసారి ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటుండగా. గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీలతో కలిసి ఉంది బంగ్లాదేశ్. ఇప్పుడు ఆ స్థానంలో స్కాట్లాండ్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. చదవండి: భారత్కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్బీర్ కపూర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఉన్న క్రేజే వేరు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, రన్మెషీన్ విరాట్ కోహ్లి ఈ జట్టులో భాగం కావడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, ప్రతి ఏడాది.. ‘‘ఈసారి కప్ మనదే’’ అనుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేసే ఆర్సీబీ అభిమానులకు పదిహేడేళ్లపాటు చేదు అనుభవమే మిగిలింది.పద్దెనిమిదేళ్లకుఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గతేడాది రజత్ పాటిదార్ (Rajat Patidar) కెప్టెన్సీలోని ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. లీగ్ మొదలైన (2008) నాటి నుంచి జట్టుతోనే ఉన్న కోహ్లి.. పద్దెనిమిదేళ్లకు తర్వాత తొలిసారి ట్రోఫీని ముద్దాడి ఉద్వేగానికి లోనయ్యాడు.చేతులు మారనున్న యాజమాన్యంఈ క్రమంలో విజయోత్సవాన్ని జరుపుకొనేందుకు సిద్ధమైన ఆర్సీబీ, ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోవాల్సి వచ్చింది. తొక్కిసలాటలో అభిమానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం నుంచి ఆర్సీబీ మ్యాచ్లు తరలిపోనున్నాయి. ఇందుకు తోడు ఆర్సీబీ యాజమాన్యం కూడా చేతులు మారనుంది.ఆదార్ పూనావాలా ఆసక్తిఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు ఫ్రాంఛైజీ మేనేజ్మెంట్ డియాజియో ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. విపరీతమైన ఆదరణ కలిగి ఉన్న ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ ఆదార్ పూనావాలా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి.‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్బీర్ కపూర్!తాజా సమాచారం ప్రకారం.. ఆర్సీబీలో వాటాలు కొనేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ ఆర్సీబీలో మూడు శాతం వాటా కోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తెలిపింది.మరోవైపు.. రణ్బీర్ కపూర్ సైతం రెండు శాతం వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా ఆర్సీబీ విలువ పెరగడంలో కోహ్లిది కీలక పాత్ర. అలాంటి ఫ్రాంఛైజీలోకి కోహ్లి జీవిత భాగస్వామి పెట్టుబడిదారుగా రావడాన్ని బీసీసీఐ ఆమోదిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ద్వంద్వ ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకు వీలుగా ఐపీఎల్ జట్లలో ఆటగాళ్లు (యాక్టివ్) ఎలాంటి వాటాలు కొనుగోలు చేయకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది. చదవండి: ఆస్ట్రేలియాతో టెస్టుకు భారత జట్టు ప్రకటన -
మాజీ క్రికెటర్తో హార్దిక్ పాండ్యా గొడవ!?.. వీడియో వైరల్
న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో టీమిండియాలో పునరాగమనం చేశాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన అతడు పూర్తిగా కోలుకుని దేశీ క్రికెట్లో సొంత జట్టు బరోడా తరఫున బరిలో దిగినప్పటికీ.. కివీస్తో వన్డే సిరీస్ నుంచి మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చింది.మొత్తంగా రెండు వికెట్లుఈ క్రమంలో నాగ్పూర్లో న్యూజిలాండ్తో తొలి టీ20 సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్.. ఆ మ్యాచ్లో 16 బంతుల్లో 25 పరుగులు చేయడంతో పాటు.. ఒక వికెట్ తీశాడు. తాజాగా రాయ్పూర్లో శుక్రవారం నాటి రెండో టీ20లోనూ ఒక వికెట్ పడగొట్టిన ఈ పేస్ ఆల్రౌండర్కు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 76), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 82 నాటౌట్).. ఆల్రౌండర్ శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్) ధనాధన్ దంచికొట్టడంతో భారత్ 15.2 ఓవర్లలోనే కివీస్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.మురళీ కార్తిక్తో గొడవ?ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండో టీ20కి ముందు అతడు.. మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తిక్తో గొడవపడినట్లు తెలుస్తోంది. బ్యాట్తో హార్దిక్ మైదానంలోకి వస్తుండగా.. మురళీ కార్తిక్ అతడిని పలకరించాడు.ఇంతలోనే కోపోద్రిక్తుడైన హార్దిక్ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మురళీ కార్తిక్ వివరించే ప్రయత్నం చేయగా.. హార్దిక్ మాత్రం మాటల బాణాలు వదులుతూనే ఉన్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వీరిద్దరు ఏ విషయంపై గొడవపడ్డారు? అసలేం జరిగింది? అన్నది మాత్రం తెలియరాలేదు. హార్దిక్ అభిమానులు మాత్రం మురళీ కార్తిక్ ఏదో అడగకూడని విషయం అడిగినందుకే ఇలా రియాక్ట్ అయి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్🚨 Hardik Pandya angry at Murali Kartik – Hardik Pandya had an argument with Murali Kartik before the IND vs NZ 2nd ODI in Raipur. pic.twitter.com/axpjLykXfY— Sonu (@Cricket_live247) January 23, 2026 -
అతడొక అటాకింగ్ ప్లేయర్: సెలక్టర్లపై అజారుద్దీన్ ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ విమర్శించాడు. కొంతమంది ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా వారికి అవకాశాలు ఇస్తున్న యాజమాన్యం.. సర్ఫరాజ్ ఖాన్ వంటి అద్భుత ఆటగాడిని మాత్రం పక్కనపెట్టిందన్నాడు.కాగా గత కొంతకాలంగా సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ టీ20, వన్డే టోర్నీలలో శతక్కొట్టిన ఈ ముంబై బ్యాటర్.. తాజాగా హైదరాబాద్తో రంజీ మ్యాచ్లో డబుల్ సెంచరీతో మెరిశాడు. ఉప్పల్లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ద్విశతకం పూర్తి చేసుకుని ముంబైకి భారీ స్కోరు అందించాడు. మొత్తంగా 219 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్ల సాయంతో 227 పరుగులు సాధించాడు.ఐదో డబుల్ సెంచరీ ఫలితంగా హైదరాబాద్తో జట్టుతో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ముంబై భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 332/4తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 123.2 ఓవర్లలో 560 పరుగులకు ఆలౌటైంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఐదో డబుల్ సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సువేద్ పార్కర్ (98 బంతుల్లో 75; 11 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీతో అతడికి అండగా నిలిచాడు.ఈ సీజన్లో సర్ఫరాజ్ విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో గోవాపై (157)పై సెంచరీ... ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీపై అస్సాంపై (100 నాటౌట్) సెంచరీ సాధించాడు. ఇక హైదరాబాద్తో రంజీ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసిన అనంతరం సర్ఫరాజ్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. అజారుద్దీన్కు క్రెడిట్ ఇచ్చాడు.ఎలా ఆడాలో చూపించారు‘‘నా కెరీర్లో పెద్దగా రివర్స్ స్వింగ్ షాట్లు ఆడలేదు. అజర్ సర్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆయనతో క్రికెట్ గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఇప్పటికి ఇది సాధ్యమైంది. ఆయన ఆఫీసుకు వెళ్లాను.ఇక్కడ (ఉప్పల్) ఆరంభంలోనే ఎక్కువ రివర్స్ స్వింగ్కు అనుకూలంగా ఉంటుందని అజర్ సర్ చెప్పారు. ఇన్స్వింగ్ ఎలా రాబట్టాలో వివరించారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. కుర్చీ నుంచి లేచి నిలబడి మరీ వివిధ రకాల షాట్లు ఎలా ఆడాలో చూపించారు. దాదాపు రెండు గంటల పాటు మా సంభాషణ కొనసాగింది’’ అని సర్ఫరాజ్ ఖాన్ అజారుద్దీన్ పట్ల కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నాడు.అతడొక అటాకింగ్ బ్యాటర్ఇక ఇందుకు స్పందనగా.. ‘‘డబుల్ సెంచరీ విషయంలో క్రెడిట్ మొత్తం సర్ఫరాజ్కే దక్కాలి. తను నా ఆఫీస్కు వచ్చి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. నేనూ కొన్ని విషయాలు అతడికి చెప్పాను. అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్కు శుభాకాంక్షలు.అతడు గొప్పగా ఆడాడు. టీమిండియాకు అతడిని మళ్లీ ఎంపిక చేయాలి. సర్ఫరాజ్కు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదు. అతడొక అటాకింగ్ బ్యాటర్. మిగిలిన ప్లేయర్లకు ఇచ్చినట్లు అతడికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని టీమిండియా సెలక్టర్ల తీరును అజారుద్దీన్ విమర్శించాడు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్ -
ఆస్ట్రేలియాతో టెస్టుకు భారత జట్టు ప్రకటన
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టుకు భారత మహిళా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. కాగా గతేడాది మహిళల వన్డే వరల్డ్కప్-2025 గెలిచిన భారత జట్టు.. ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో వైట్బాల్ సిరీస్లలో విజయాలు సాధించింది.ఆస్ట్రేలియా పర్యటనప్రస్తుతం జాతీయ జట్టులోని కీలక ప్లేయర్లంతా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026తో బిజీగా ఉన్నారు. జనవరి 9న మొదలైన ఈ టీ20 లీగ్.. ఫిబ్రవరి 5న ఫైనల్తో ముగియనుంది. ఈ టోర్నీ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటన (India Women Tour Of Australia)కు వెళ్లనుంది. ఫిబ్రవరి 15 నుంచి మర్చి 6 మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు.. ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది.ప్రతీకా రావల్కూ చోటుఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా టెస్టు జట్టును కూడా అనౌన్స్ చేసింది. ఈ జట్టులో ప్రతీకా రావల్కు కూడా చోటు దక్కడం విశేషం. కాగా వరల్డ్కప్ టోర్నీలో స్మృతి మంధానకు ఓపెనింగ్ జోడీగా రాణించిన ప్రతీకా.. అనూహ్య రీతిలో గాయపడి కీలక మ్యాచ్లకు దూరమైంది.అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న ప్రతీకా త్వరలోనే జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లు తాజాగా స్పష్టమైంది. ఇక మరో ఓపెనింగ్ బ్యాటర్ షఫాలీ వర్మకు కూడా టెస్టు జట్టులో సెలక్టర్లు స్థానం కల్పించారు.ఆస్ట్రేలియా వుమెన్తో ఏకైక టెస్టుకు భారత మహిళా జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అమన్జోత్ కౌర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్ శర్మ, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, సయాలి సత్గరే. చదవండి: ప్రత్యేకంగా ఏమీ తినలేదు.. ఆ ప్రశ్నకు జవాబు దొరికింది: ఇషాన్ కిషన్ -
‘నేనేమీ తినలేదు.. ఆ ప్రశ్నకు జవాబు దొరికింది’
న్యూజిలాండ్తో రెండో టీ20లో భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు సంజూ శాంసన్ (6), అభిషేక్ శర్మ (0) విఫలమైన వేళ ఈ వన్డౌన్ బ్యాటర్ జట్టును ఆదుకున్నాడు.ఇషాన్ ధనాధన్కేవలం 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్.. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని ఏకంగా 76 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. సూర్య, దూబే మెరుపులుఇక ఇషాన్తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత అజేయ అర్ధ శతకం (37 బంతుల్లో 82)తో రాణించగా.. శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్) కూడా అదరగొట్టాడు. ఫలితంగా రాయ్పూర్ వేదికగా కేవలం మూడు వికెట్లు నష్టపోయి టీమిండియా 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదుఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సూర్య భాయ్ అనుకున్నట్లు మధ్యాహ్న భోజనంలో నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదు. సాధారణ భోజనమే తిన్నాను. ఏదేమైనా ఈరోజు మ్యాచ్లో మెరుగ్గా ఆడాలనే సంకల్పంతోనే మైదానంలో అడుగుపెట్టాను.ఒక్కోసారి మనం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాం అనుకుంటాం. అలాంటపుడు బంతిని చూస్తూ.. మనకు అనువైన, మంచి షాట్లు మాత్రమే ఆడాలి. నేను ఈరోజు అదే పని చేశాను. రిస్క్ తీసుకోకుండానే పవర్ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని గట్టిగా అనుకున్నాను.పవర్ప్లే అత్యంత ముఖ్యంముఖ్యంగా టీ20లలో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పవర్ప్లే అత్యంత ముఖ్యమైనదిగా మారుతుంది. పవర్ప్లేలో.. మధ్య ఓవర్లలో నేను బాగా ఆడాను. నాకు నేనే వెన్నుతట్టుకున్నా. మంచి షాట్లు ఆడి జట్టును గెలిపించాలని భావించాను.దేశవాళీ క్రికెట్లో నేను విరివిగా పరుగులు రాబట్టాను. తద్వారా టీమిండియాకు ఆడగల సత్తా నాలో ఇంకా మిగిలే ఉందని నాకు నేనే సమాధానం చెప్పుకోగలిగాను. జార్ఖండ్ తరఫున కెప్టెన్గా టీ20 టోర్నీ ట్రోఫీ కూడా గెలిచాను. పునరాగమనంలో నేను ఇది చేయగలనా? అని సందేహం వచ్చింది.సరైన సమాధానం దొరికిందిఅయితే, ఇప్పుడు ఈ ప్రశ్నకు నాకు సరైన సమాధానం దొరికింది. మంచి షాట్లు ఆడితే అనుకున్న ఫలితం రాబట్టగలము. ఈ క్రమంలో ఒకవేళ నేను అవుట్ అయినా చింతించాల్సిన అవసరం ఉండదు’’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.కాగా క్రమశిక్షణా రాహిత్యంతో దాదాపుగా మూడేళ్లుగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు మళ్లీ పిలుపునిచ్చిన సెలక్టర్లు.. న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో పాటు ఏకంగా ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేశారు. ఆధిక్యంలో టీమిండియాఅయితే, పునరాగమనంలో అంటే కివీస్తో తొలి టీ20లో మాత్రం ఇషాన్ (5 బంతుల్లో 8) విఫలమయ్యాడు. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లో చితక్కొట్టి తన విలువను చాటుకున్నాడు. ఇక తొలి టీ20లోనూ గెలిచిన టీమిండియా.. కివీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యం సంపాదించింది.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్𝟓𝟎 𝐢𝐧 𝐚 𝐟𝐥𝐚𝐬𝐡 ⚡#IshanKishan slams the fastest T20I half-century in just 21 balls for India v NZ. 😮💨#INDvNZ, 2nd T20I | LIVE NOW 👉 https://t.co/Be1n2FWbLQ pic.twitter.com/UbpqrgpcTm— Star Sports (@StarSportsIndia) January 23, 2026 -
ఆమెతో రెడ్హ్యాండెడ్గా దొరికిన పలాష్.. చితకబాదిన క్రికెటర్లు?!
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం గురించి మరోసారి చర్చ మొదలైంది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో పెళ్లి రద్దు చేసుకుని స్మృతి మంచి పని చేసిందని.. లేదంటే మోసగాడి చేతిలో బలైపోయి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నవంబరు 23నఅసలేం జరిగిందంటే.. వన్డే వరల్డ్కప్-2025లో భారత జట్టు చాంపియన్గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి మంధాన సిద్ధమైంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్తో నవంబరు 23న ఆమె వివాహానికి ముహూర్తం ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత తమ వివాహం రద్దైనట్లు స్మృతి- పలాష్ విడివిడిగా అధికారిక ప్రకటన చేశారు.కాగా తనతో ప్రైవేట్గా చాట్ చేశాడంటూ పలాష్ ముచ్చల్ గురించి ఓ మహిళ సోషల్ మీడియాలో స్క్రీన్షాట్లు షేర్ చేసింది. అందులో స్మృతిని కించపరిచినట్లుగా అతడి మాటలు ఉన్నాయి. అంతేకాదు పెళ్లికి కొన్ని గంటల ముందు పలాష్ వేరే మహిళతో గదిలో ఉన్నాడనే వదంతులూ వచ్చాయి.ఒకే మంచం మీద వేరే మహిళతో ఇప్పుడు ఆ రూమర్లు నిజమే అనేలా స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడిగా చెప్పుకొంటున్న నటుడు- నిర్మాత విద్యాన్ మానే వ్యాఖ్యలు చేశాడు. హిందుస్తాన్ సిటీతో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు స్మృతి పెళ్లి వేడుకల్లో నేనూ ఉన్నాను. గదిలో ఒకే మంచం మీద వేరే మహిళతో అతడు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.అతడిని కొట్టారుఅప్పుడు పరిస్థితి మొత్తం గంభీరంగా.. భయానకంగా మారిపోయింది. స్మృతి సహచర క్రికెటర్లు అతడిని కొట్టారు. ముచ్చల్ కుటుంబం మొత్తం దొంగబుద్ధి కలవారే!.. అతడు స్మృతిని పెళ్లి చేసుకుని సాంగ్లిలో సెటిల్ అవుతాడని నేను అనుకున్నా. కానీ అంతా తలకిందులైపోయింది’’ అని విద్యాన్ మానే చెప్పుకొచ్చాడు. కాగా స్మృతి పెళ్లి సంగీత్, మెహందీ, హల్దీ వేడుకల్లో క్రికెటర్లు శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్ సందడి చేశారు. ఈ నలుగురు ఆమె ప్రాణ స్నేహితులు. మోసం చేశాడుకాగా ఫిలిం ఫైనాన్సర్గా ఉన్న తన దగ్గరకు వచ్చిన పలాష్.. నజరియా అనే సినిమా తీస్తున్నానని.. ఇందుకు పెట్టుబడి పెట్టమని కోరినట్లు విద్యాన్ మానే ఈ సందర్భంగా తెలిపాడు. ఇందుకోసం విడతల వారీగా డబ్బు ఇచ్చానని.. అయితే, సినిమా పనులు మొదలుకాకపోగా.. ఆ తర్వాత పలాష్ ఫోన్ ఎత్తడం కూడా మానేశాడని ఆరోపించాడు. నిరాధార ఆరోపణలుఈ క్రమంలోనే అతడిపై చీటింగ్ కేసు పెట్టినట్లు వెల్లడించాడు. అయితే, పలాష్ మాత్రం ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని కొట్టిపారేశాడు. తన లాయర్ ద్వారా చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వెల్లడించాడు.ఇదిలా ఉంటే.. పెళ్లి రద్దు తర్వాత ఆటపైనే పూర్తిగా దృష్టి సారించింది స్మృతి. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపీఎల్)-2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా ఉన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. ఈ ఎడిషన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీని నిలిపింది. చదవండి: ఎవరినీ నమ్మను.. ఆమెకు బ్రేకప్ చెప్పిన టీమిండియా స్టార్!.. పోస్ట్ వైరల్ -
ఐసీసీపై ‘ఫిర్యాదు’.. బంగ్లాదేశ్కు మరో షాక్ తప్పదు!
టీ20 ప్రపంచకప్-2026లో తమ మ్యాచ్ల వేదిక మార్పు విషయంలో బంగ్లాదేశ్ ఆఖరి ప్రయత్నం కూడా బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పటికే ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో తెలిపింది. భారత్లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదని.. ఇక్కడే తమ మ్యాచ్లు ఆడాలని స్పష్టం చేసింది.అయినప్పటికీ పంతం వీడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తమ విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి పట్టించుకోకపోవడంతో వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది. తాము భారత్లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్సీని బీసీబీ కోరింది.అది కుదరని పనిఅయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం బోర్డు డైరెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అధికారం డీఆర్సీకి లేదు. ఇక్కడా తమకు సానుకూల స్పందన లభించకపోతే చివరగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు వెళ్లాలని కూడా బంగ్లాదేశ్ యోచిస్తోంది.మరోవైపు.. తమ జట్టు భారత్లో మ్యాచ్ ఆడదంటూ తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా ఐసీసీకీ చెప్పకుండా బీసీబీ చైర్మన్ అమీనుల్ ఇస్లామ్ మీడియా ముందు ప్రకటించడం కూడా ఐసీసీకి ఆగ్రహం కలిగించింది. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే బంగ్లాదేశ్ను తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అండర్–19 వరల్డ్ కప్ జరుగుతున్న నమీబియాలో ఉన్న ఐసీసీ చైర్మన్ జై షా బంగ్లాదేశ్ను వరల్డ్ కప్ నుంచి తప్పిస్తూ స్కాట్లాండ్కు అవకాశం ఇస్తున్నట్లుగా శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్ -
పాక్ టి20 జట్టులో షాహిన్, బాబర్
కరాచీ: పాకిస్తాన్ సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో జరిగే టి20 సిరీస్ కోసం షాహిన్ అఫ్రిదిని ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకోవడంతో అతనికి ఎప్పట్లాగే రెగ్యులర్ జట్టులో చోటు ఇచ్చారు. ఈ ఒక్క మార్పు మినహా ఇటీవల శ్రీలంకతో ఆడిన పాకిస్తాన్ జట్టే... త్వరలో ఆస్ట్రేలియాతోనూ మూడు టి20ల ద్వైపాక్షిక సిరీస్లో తలపడుతుంది. ఆ్రస్టేలియాలో జరుగుతున్న బిగ్బాష్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు ఆడిన బాబర్ ఆజమ్ కూడా పాక్ జట్టులోకి వచ్చాడు. భారత్, శ్రీలంకలో జరగబోయే మెగా ఈవెంట్కు ముందు పాక్, ఆసీస్లకు ఇది చివరి సన్నాహక టోర్నీ! 3 మ్యాచ్లకు లాహోర్లోని గడాఫీ స్టేడియమే ఆతిథ్యమిస్తుంది. ఈ నెల 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. ఈ టోర్నీ కోసం ఆస్ట్రేలియా ఈ నెల 28న పాకిస్తాన్కు చేరుకుంటుంది. పాకిస్తాన్ జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెపె్టన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్, మొహమ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, మొహమ్మద్ వసీమ్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్. -
ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అదరగొట్టింది. బౌలింగ్లో విఫలమైనప్పటికి బ్యాటింగ్లో మాత్రం దుమ్ములేపింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో చేధించింది.తద్వారా న్యూజిలాండ్ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తన రీఎంట్రీ మ్యాచ్లో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రాయ్పూర్లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కిషాన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో ఏకంగా 76 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 82 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన కిషన్పై సూర్యకుమార్ ప్రశంసల వర్షం కురిపించాడు. పవర్ప్లేలో అతడు ఆడిన తీరు అద్భుతమని సూర్యకొనియాడాడు. "ఇషాన్ లంచ్లో ఏం తిన్నాడో, మ్యాచ్కు ముందు ఏ 'ప్రీ-వర్కౌట్' డ్రింక్ తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ అతడి బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అద్భుతం. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ను నేను ఎప్పుడూ చూడలేదు. పవర్ప్లేలో తొలి రెండు ఓవర్లలో మాకు కేవలం 8 పరుగులకే వచ్చాయి. అటువంటిది పవర్ప్లేను 75 పరుగులతో ముగించడం నిజంగా గ్రేట్. ఆ క్రెడిట్ మొత్తం కిషన్కే దక్కాలి. 200 పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు బ్యాటర్ల నుంచి ఇటువంటి ఇన్నింగ్స్లే మేము ఆశిస్తాము. ప్రతీ ఒక్కరూ పూర్తి స్వేచ్చగా ఆడుతూ తమను తాము నిరూపించుకోవాలి. ఈ మ్యాచ్లో ఇషాన్ సరిగ్గా అదే చేశాడు.పవర్ప్లేలో ఇషాన్ స్ట్రైక్ అస్సలు నాకు ఇవ్వలేదు, అందుకు కోపంగా ఉన్నాను(నవ్వుతూ). అయితే కిషాన్ దూకుడుగా ఆడడంతో క్రీజులో కుదురుకోవడానికి నాకు సమయం దొరికింది. చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. గత మూడు వారాల నుంచి నెట్స్లో ఎక్కువగా గడిపాను. వాటి ఫలితం ఈ మ్యాచ్లో స్పష్టంగా కన్పించింది.ఒకానొక దశలో న్యూజిలాండ్ 230 పరుగులు చేసేలా కనిపించింది. కానీ కుల్దీప్ యాదవ్, వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని కట్టడి చేశారు. దూబే కూడా కీలక ఓవర్ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. రాబోయో మ్యాచ్లలో ఇదే బ్రాండ్ ఆఫ్ కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు. -
సూర్య, ఇషాన్ విధ్వంసం
టి20ల్లో భారత్ ఆధిపత్య ప్రదర్శన కొనసాగుతోంది. సిరీస్ తొలి పోరులో న్యూజిలాండ్ను చిత్తు చేసిన టీమిండియా మరో ఏకపక్ష గెలుపును అందుకొని 2–0తో పైచేయి సాధించింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వేళ 209 పరుగుల లక్ష్యం పెద్దదిగా అనిపించినా... భారత్ అలవోకగా 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. ఓపెనర్లు విఫలమైన చోట ఈసారి నేనున్నానంటూ ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా, ఎట్టకేలకు తన స్థాయిని చూపిస్తూ కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ 23 ఇన్నింగ్స్ల తర్వాత ఈ ఫార్మాట్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్లో బౌండరీల (21 ఫోర్లు, 12 సిక్స్లు) ద్వారానే 156 పరుగులు వచ్చాయి. రాయ్పూర్: భారత జట్టు దూకుడైన బ్యాటింగ్తో న్యూజిలాండ్పై వరుసగా రెండో మ్యాచ్లో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో కివీస్పై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ (27 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (26 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్లు) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత్ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 82 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 76; 11 ఫోర్లు, 4 సిక్స్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్కు 49 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. ఆ తర్వాత సూర్య, శివమ్ దూబే (18 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) నాలుగో వికెట్కు 37 బంతుల్లో అభేద్యంగా 81 పరుగులు జత చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్లో భారత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. గాయం కారణంగా అక్షర్ పటేల్ ఆడలేదు. వీరిద్దరి స్థానాల్లో హర్షిత్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 ఆదివారం గువాహటిలో జరుగుతుంది. హాఫ్ సెంచరీ లేకుండానే... న్యూజిలాండ్ జట్టు బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించిన 7 ఓవర్లలో కలిపి 120 పరుగులు రాగా... భారత బౌలర్లు కట్టడి చేసిన మిగతా 13 ఓవర్లలో 88 పరుగులే లభించాయి. ఓపెనర్లు కాన్వే (9 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్), సీఫెర్ట్ (13 బంతుల్లో 24; 5 ఫోర్లు) కలిసి 20 బంతుల్లోనే 43 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లోనే కాన్వే 3 ఫోర్లు, 1 సిక్స్ బాది 18 పరుగులు రాబట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో సీఫెర్ట్ వరుసగా 4 ఫోర్లు కొట్టాడు. అయితే ఓపెనర్లిద్దరూ ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. హర్షిత్ తన తొలి ఓవర్ను ‘మెయిడిన్’గా వేసినా... అతని తర్వాతి ఓవర్లో రచిన్ 2 భారీ సిక్స్లు, ఒక ఫోర్ బాదాడు. వరుణ్ ఓవర్లోనూ రెండు సిక్స్లతో రచిన్ జోరు కొనసాగించగా... కుల్దీప్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టిన గ్లెన్ ఫిలిప్స్ (19) అదే ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో మిచెల్ (18), రచిన్ పెవిలియన్ చేరడంతో కివీస్ స్కోరు వేగం మందగించింది. చాప్మన్ (10) కూడా విఫలమైనా, చివర్లో సాంట్నర్, ఫోక్స్ (15 నాటౌట్) ధాటిగా ఆడటంతో స్కోరు 200 దాటింది. చివరి 3 ఓవర్లలో వీరిద్దరు కలిసి 6 ఫోర్లు, 2 సిక్స్లతో మొత్తం 47 పరుగులు రాబట్టారు. కివీస్ ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అభిషేక్ శర్మ ‘డకౌట్’ ఇన్నింగ్స్ రెండో బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా దానిని ఉపయోగించుకోలేక సామ్సన్ (6) తొలి ఓవర్లోనే నిష్క్రమించాడు. తొలి మ్యాచ్లో అదరగొట్టిన అభిషేక్ శర్మ (0) ఈసారి మొదటి బంతికే అవుటయ్యాడు. అయితే ఇషాన్ మెరుపు బ్యాటింగ్తో లక్ష్య ఛేదన సులువుగా మారిపోయింది. ఫోక్స్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్తో చెలరేగిన ఇషాన్... సాంట్నర్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత హెన్రీ ఓవర్లోనూ వరుసగా 6, 4, 4 బాది 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ చేసిన తొలి 100 పరుగుల్లో 76 అతని బ్యాట్ నుంచే వచ్చాయి. ఇషాన్ వెనుదిరిగిన తర్వాత సూర్య బాధ్యత తీసుకున్నాడు. భారత కెపె్టన్ చాలా కాలం తర్వాత అంచనాలకు తగిన ఆటను ప్రదర్శించాడు. ఫోక్స్ ఓవర్లో అతను వరుసగా 4, (వైడ్), 4, 4, 4, 6 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. 23 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న సూర్య ఆ తర్వాత అదే ధాటిని చివరి వరకు కొనసాగించాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) పాండ్యా (బి) హర్షిత్ 19; సీఫెర్ట్ (సి) ఇషాన్ (బి) వరుణ్ 24; రచిన్ (సి) అర్ష్ దీప్ (బి) కుల్దీప్ 44; ఫిలిప్స్ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 19; మిచెల్ (సి) పాండ్యా (బి) దూబే 18; చాప్మన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 10; సాంట్నర్ (నాటౌట్) 47; ఫోక్స్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–43, 2–43, 3–98, 4–125, 5–129, 6–161. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–53–0, పాండ్యా 3–0–25–1, హర్షిత్ 3–1–35–1, వరుణ్ 4–0–35–1, కుల్దీప్ 4–0–35–2, అభిషేక్ 1–0–12–0, దూబే 1–0–7–1. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రచిన్ (బి) హెన్రీ 6; అభిషేక్ (సి) కాన్వే (బి) డఫీ 0; ఇషాన్ కిషన్ (సి) హెన్రీ (బి) సోధి 76; సూర్యకుమార్ (నాటౌట్) 82; శివమ్ దూబే (నాటౌట్) 36; ఎక్స్ట్రాలు 9; మొత్తం (15.2 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–128. బౌలింగ్: హెన్రీ 3–0–41–1, డఫీ 4–0–38–1, ఫోక్స్ 3–0–67–0, సాంట్నర్ 2–0–27–0, సోధి 3–0–34–1, మిచెల్ 0.2–0–2–0. -
ఫైనల్లో కళింగ లాన్సర్స్
భువనేశ్వర్: పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో వేదాంత కళింగ లాన్సర్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన తొలి క్వాలిఫయర్లో కళింగ లాన్సర్స్ జట్టు 2–1 గోల్స్తో రాంచీ రాయల్స్పై గెలుపొందడంతో నేరుగా టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. కళింగ తరఫున అలెగ్జాండర్ హెండ్రిక్స్ (12వ, 32వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా, రాంచీ రాయల్స్ జట్టులో మన్దీప్ సింగ్ 40వ నిమిషంలో గోల్ చేశాడు. రాంచీకి ఫైనల్ చేరే అర్హత రెండో క్వాలిఫయర్ రూపంలో ఇంకా సజీవంగానే ఉంది. ఆదివారం ఫైనల్ బెర్త్ లక్ష్యంగా రాంచీతో హైదరాబాద్ తుఫాన్స్ తలపడుతుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో కళింగ లాన్సర్స్ అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు గత ఏడాది రన్నరప్ హైదరాబాద్ తుఫాన్స్ జట్టు రెండో క్వాలిఫయర్స్కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో హైదరాబాద్ జట్టు 2–0తో హెచ్ఐఎల్ జీసీ జట్టుపై విజయం సాధించింది. తుఫాన్స్ స్ట్రయికర్ శిలానంద్ లాక్రా అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. అతను 16వ, 39వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. హైదరాబాద్ గోల్కీపర్ జీన్ పాల్ డానెబర్గ్ ప్రత్యర్థి గోల్స్ చేయకుండా అడ్డుగోడ కట్టేశాడు. -
శ్రమించిన సబలెంకా
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో బెలారస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా తొలిసారి కఠిన పరీక్ష ఎదుర్కొంది. తొలి రెండు రౌండ్లలో అలవోకగా నెగ్గిన ఈ మాజీ చాంపియన్కు మూడో రౌండ్లో మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రపంచ 55వ ర్యాంకర్ అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా)తో జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ సబలెంకా 7–6 (7/4), 7–6 (9/7)తో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సబలెంకా రెండు సెట్లను టైబ్రేక్లో సొంతం చేసుకోవడం గమనార్హం. మూడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసిన గత ఏడాది రన్నరప్... 34 విన్నర్స్ కొట్టి 44 అనవసర తప్పిదాలు చేసింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను కూడా నాలుగుసార్లు బ్రేక్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం 17వ సీడ్ విక్టోరియా ఎంబోకో (కెనడా)తో సబలెంకా తలపడుతుంది. మూడో రౌండ్లో ఎంబోకో 7–6 (7/5), 5–7, 6–3తో 14వ సీడ్ క్లారా టౌసన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. 2023, 2024లలో ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంకా గత ఏడాది ఫైనల్లో మాడిసన్ కీస్ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. మరోవైపు మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), 12వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నారు. మూడో రౌండ్ మ్యాచ్ల్లో కోకో గాఫ్ 3–6, 6–0, 6–3తో హైలీ బాప్టిస్ట్ (అమెరికా)పై, ఆంద్రీవా 6–3, 6–4తో ఎలీనా రూస్ (రొమేనియా)పై, స్వితోలినా 7–6 (7/4), 6–3తో డయానా ష్నయిడర్ (రష్యా)పై గెలుపొందారు. ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ) మాత్రం మూడో రౌండ్ అడ్డంకిని దాటలేకపోయింది. మూడో రౌండ్లో పావోలిని 2–6, 6–7 (3/7)తో ఇవా జోవిచ్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఆడిన పావోలిని నాలుగుసార్లు తొలి రౌండ్లో, రెండుసార్లు మూడో రౌండ్లో, ఒకసారి నాలుగో రౌండ్లో నిష్క్రమించింది. అల్కరాజ్ జోరు... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ అల్కరాజ్ మరో అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో అల్కరాజ్ 6–2, 6–4, 6–1తో కొరెన్టిన్ ముటెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో స్పెయిన్ స్టార్ 30 విన్నర్స్ కొట్టి, తన ప్రత్యర్థి సర్వీస్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ను రెండుసార్లు చొప్పున సాధించిన 22 ఏళ్ల అల్కరాజ్కు ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రం కలిసిరావడం లేదు. ఐదోసారి ఈ టోర్నీలో ఆడుతున్న ఈ స్పెయిన్ స్టార్ గత రెండేళ్లలో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో అల్కరాజ్ విజేతగా నిలిస్తే... ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ ఘనత సాధించిన అతిపిన్న వయసు్కడిగా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా), 10వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్), 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్ మ్యాచ్ల్లో జ్వెరెవ్ 7–5, 4–6, 6–3, 6–1తో కామెరాన్ నోరి (బ్రిటన్)పై, డిమినార్ 6–3, 6–4, 7–5తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై, బుబ్లిక్ 7–6 (7/4), 7–6 (7/5), 6–4తో టొమాస్ ఎచ్వెరీ (అర్జెంటీనా)పై, మెద్వెదెవ్ 6–7 (5/7), 4–6, 7–5, 6–0, 6–3తో ఫాబియన్ మరోజ్సన్ (హంగేరి)పై గెలిచారు. 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 3–6, 6–7 (4/7), 3–6తో ఫ్రాన్సిస్కో సెరున్డోలో (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు. -
పార్థ్, ధర్మేంద్ర మాయాజాలం
రాజ్కోట్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో పంజాబ్ జట్టుపై సౌరాష్ట్ర విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా రెండు రోజుల్లోనే ముగిసిన పోరులో సౌరాష్ట్ర 194 పరుగుల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది. పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ వరుసగా రెండో ఇన్నింగ్స్లోనూ విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది. ఓవర్నైట్ స్కోరు 24/3తో శుక్రవారం రెండో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర... చివరకు 58.5 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (41 బంతుల్లో 56; 10 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (44 బంతుల్లో 46; 4 ఫోర్లు), హేత్విక్ కొటక్ (39; 3 ఫోర్లు, 2 సిక్స్లు), పార్థ్ భట్ (37 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) కీలక పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 5 వికెట్లు పడగొట్టగా... జస్సిందర్ సింగ్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ప్రత్యర్థి ముందు 320 పరుగుల లక్ష్యం నిలవగా... పంజాబ్ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. భారీ ఆశలు పెట్టుకున్న శుబ్మన్ గిల్ (32 బంతుల్లో 14; 1 ఫోర్) విఫలమవడంతో పంజాబ్ చివరకు 39 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఉదయ్ శరణ్ (71 బంతుల్లో 31; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా చేతులెత్తేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ పార్థ్ భట్, ధర్మేంద్ర జడేజా చెరో 5 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో గిల్ సహా ఐదు వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పార్థ్ భట్... రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లు వేసి కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయం విశేషం. రెండో ఇన్నింగ్స్లోనూ గిల్ను పార్థ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులు చేయగా... పంజాబ్ 139 పరుగులు చేసింది. ఈ విజయంతో సౌరాష్ట్ర పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరి నాకౌట్ అవకాశాలను మెరుగు పరుచుకోగా... పంజాబ్ మూడో ఓటమితో క్వార్టర్స్ రేసుకు దూరమైంది. ఇదే గ్రూప్లో భాగంగా జరుగుతున్న మరో మ్యాచ్లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 323 పరుగులకు ఆలౌట్ కాగా... కర్ణాటక 58 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. మహారాష్ట్రతో మ్యాచ్లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌట్ కాగా... మహారాష్ట్ర 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. కేరళతో మ్యాచ్లో చండీగఢ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు చేయగా... కేరళ రెండో ఇన్నింగ్స్లో 5.5 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, లక్ష్య సేన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 13–21, 17–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యు ఫె (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 18–21, 20–22తో ప్రపంచ 44వ ర్యాంకర్ పానిత్చపోన్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, లక్ష్య సేన్లకు మూడు వేల డాలర్ల (రూ. 2 లక్షల 75 వేలు) చొప్పున ప్రైజ్మనీ, 5,040 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఇషాన్, సూర్య విధ్వంసం.. న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. లక్ష్య చేధనలో 7 పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లను భారత్ కోల్పోయింది.అయితే ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో ప్రత్యర్ధి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం కిషన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 76 పరుగులు చేశాడు. కిషన్ ఔటయ్యాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత ఆచితూచి ఆడిన సూర్య.. క్రీజులో సెటిల్ అయ్యాక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20ల్లో ఏడాది తర్వాత తన హాఫ్ సెంచరీ మార్క్ను సూర్య అందుకున్నాడు. ఓవరాల్గా 37 బంతులు ఎదుర్కొన్న స్కై.. 9 ఫోర్లు, 4 సిక్స్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే (18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 36 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ, డఫీ తలా వికెట్ సాధించారు. టీ20ల్లో న్యూజిలాండ్పై భారత్కు ఇదే అత్యధిక విజయవంతమైన రన్ చేజ్ కావడం విశేషం.Let me tell to today's Generation, Ishan Kishan was our Abhishek Sharma before Abhishek Sharma existed. pic.twitter.com/wtwZ7D4bVu— Selfless⁴⁵ (@SelflessCricket) January 23, 2026కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. -
IND VS NZ 2nd T20I: న్యూజిలాండ్ భారీ స్కోర్
రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఈ స్కోర్ చేసేందుకు ప్రతి ఒక్కరి దోహదపడ్డారు. రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో సత్తా చాటారు. కాన్వే (19), సీఫర్ట్ (24), ఫిలిప్స్ (19), డారిల్ మిచెల్ (18), మార్క్ చాప్మన్ (10), జకరీ ఫౌల్క్స్ (15 నాటౌట్) క్రీజ్లో ఉన్నంతసేపు బ్యాట్ ఝులిపించారు. ఆఖర్లో సాంట్నర్, ఫౌల్క్స్ క్యామియో న్యూజిలాండ్ను 200 పరుగుల మార్కును దాటించింది.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ (4-0-53-0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవెన్లో తెచ్చారు.మరోవైపు న్యూజిలాండ్ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్ స్థానంలో టిమ్ సీఫర్ట్.. క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జకరీ ఫౌల్క్స్, జేమీసన్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
టెస్ట్ క్రికెట్లోకి విరాట్ కోహ్లి రీఎంట్రీ..?
టీమిండియాకు సంబంధించిన ఓ సంచలన వార్త ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది. టీ20 వరల్డ్కప్-2026 తర్వాత ఈ విషయం కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ యూట్యూబర్ రోహిత్ జుగ్లాన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బీసీసీఐ అధికారులు కోహ్లిని మళ్లీ టెస్ట్ల్లో ఆడమని సంప్రదించారు. ఈ విషయంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కు తీసుకునే విషయంలో కోహ్లి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే భారత క్రికెట్లో పెను సంచలనంగా మారుతుంది.కోహ్లి గతేడాది మే 12న అనూహ్యంగా 14 ఏళ్ల టెస్ట్ కెరీర్కు గుడ్బై చెప్పాడు. సరిగ్గా ఐదు రోజుల ముందే నాటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఐదు రోజుల వ్యవధిలో టెస్ట్ల నుంచి తప్పుకోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. రో-కో టెస్ట్ల నుంచి అనూహ్యంగా తప్పుకోవడం వెనుక భారత క్రికెట్లో ఓ కీలక వ్యక్తి హస్తం ఉందని టాక్ నడిచింది.సదరు వ్యక్తితో విభేదాల కారణంగా రో-కో టెస్ట్ల నుంచి అనూహ్యంగా తప్పుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. రో-కో అప్పటికే టీ20ల నుంచి వైదొలిగారు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత వారిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం రో-కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు. గత కొంతకాలంగా భారత్ టెస్ట్ల్లో ఆశాజనకమైన ప్రదర్శన చేయకపోవడంతో కోహ్లి తిరిగి రావాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ చొరవ తీసుకొని కోహ్లితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగి కోహ్లి టెస్ట్ల్లో రీఎంట్రీ ఇస్తే.. ప్రస్తుత ఫామ్ ప్రకారం అతను అతి త్వరలోనే 10000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం కోహ్లి 123 టెస్ట్ల్లో 30 శతకాలు, 31 అర్ధశతకాల సాయంతో 9230 పరుగులు చేశాడు. అతను మరో 770 పరుగులు చేస్తే అరుదైన 10000 క్లబ్లో చేరతాడు. కోహ్లి టెస్ట్ రీఎంట్రీపై సానుకూల వార్తలు ఎన్ని వినిపిస్తున్నా, ఇది అంత ఈజీ విషయమైతే కాదు. ఎందుకంటే 37 ఏళ్ల వయసులో కోహ్లి టెస్ట్ల్లోకి తిరిగి రావడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. శారీకంగా అతను ఫిట్గా ఉన్నప్పటికీ.. మెంటల్ ఫిట్నెస్ సాధించడం అంత సులువు కాదు. కోహ్లి లాంటి వ్యక్తికి ఇది అసాధ్యం కాకపోయినా, రిటైర్మెంట్ వెనక్కు తీసుకోవడం లాంటి సాహసం చేయకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇటీవలికాలంలో కోహ్లి బహిరంగా చేసిన వ్యాఖ్యలను అనలైజ్ చేస్తే, అతని ఫోకస్ అంతా కేవలం 2027 వన్డే ప్రపంచకప్పైనే ఉన్నట్లు సుస్పష్టమవుతుంది. ఈ ప్రణాళిక ఉన్న కోహ్లి టెస్ట్ల్లో రీఎంట్రీ ఇచ్చి తన లాంగ్ టర్మ్ ప్లానింగ్ను డిస్టర్బ్ చేసుకోకపోవచ్చు. ఏదిఏమైనా టీ20 ప్రపంచకప్ పూర్తయ్యేలోపు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
న్యూజిలాండ్తో రెండో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవెన్లో తెచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్ స్థానంలో టిమ్ సీఫర్ట్.. క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జకరీ ఫౌల్క్స్, జేమీసన్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
పాకిస్తాన్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఈ మ్యాచ్లో పాక్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్లో పాక్ 8 వికెట్ల తేడాతో, 181 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనతో జింబాబ్వే సూపర్ సిక్స్కు అర్హత సాధించగా.. స్కాట్లాండ్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 35.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 26.2 ఓవర్లలో ఛేదించింది. వాస్తవానికి పాక్ ఈ లక్ష్యాన్ని 20 ఓవర్లలోపే ఛేదించి ఉండవచ్చు. ఇలా జరిగితే జింబాబ్వే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించి, స్కాట్లాండ్ తదుపరి దశకు అర్హత సాధించేది.అయితే, ఇలా జరగడం పాక్కు వ్యూహాత్మకంగా కరెక్ట్ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడి జింబాబ్వేకి లబ్ది చేకూర్చి, వారు కూడా లబ్ది పొందారు. 16వ ఓవర్లోనే 96 పరుగులు చేసిన పాక్.. 16 నుంచి 25 ఓవర్ల మధ్యలో ఏకంగా 50 డాట్ బాల్స్ ఆడి, విజయాన్ని ఆలస్యం చేసింది.పాక్కు కలిగే లబ్ది ఏంటి.. టోర్నీ నియమాల ప్రకారం సూపర్ సిక్స్కు అర్హత సాధించిన జట్టు, అదే గ్రూప్ నుంచి సూపర్ సిక్స్కు క్వాలిఫై అయిన మిగతా జట్లపై సాధించిన పాయింట్లు, నెట్ రన్రేట్ను మాత్రమే సూపర్ సిక్స్కి తీసుకెళ్లుంది.ఈ లెక్కన జింబాబ్వేతో పోలిస్తే స్కాట్లాండ్ సూపర్ సిక్స్కు అర్హత సాధిస్తే పాక్కు రన్రేట్ కాస్త తక్కువవుతుంది. అందుకనే చాకచక్యంగా స్కాట్లాండ్ను సైడ్ చేసి, జింబాబ్వేకు, తమకు లబ్ది చేక్చూకుంది.పాక్ చేసిన ఈ పని అవినీతి కిందికి రాకపోయిన ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని ప్రభావితం చేసిన ప్రక్రియ కిందికి వస్తుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లోని ఆర్టికల్ 2.11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని మార్చి, నెట్ రన్రేట్ను ప్రభావితం చేస్తే కెప్టెన్పై చర్యలు తీసుకోవచ్చు. పై ఉదంతంలో పాక్ చేసింది అవినీతి కిందికి రాకపోయినా, ఆట ఆత్మను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది. అందువల్ల పాకిస్తాన్పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, గ్రూప్-సి నుంచి పాక్, జింబాబ్వేతో పాటు ఇంగ్లండ్ కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. తదుపరి దశలో పాక్ భారత్తో తలపడనుంది. భారత్ జనవరి 24న జింబాబ్వేపై గెలిస్తే, ఫిబ్రవరి 1న బులావయోలో పాకిస్తాన్–భారత్ పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ సెమీఫైనల్స్ అర్హతను నిర్ణయించే కీలక పోరాటంగా భావిస్తున్నారు. -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు పాక్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ల రీఎంట్రీ
టీ20 వరల్డ్కప్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (జనవరి 23) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా సల్మాన్ అఘా కొనసాగనున్నాడు. ఈ సిరీస్తో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది రీఎంట్రీ ఇచ్చారు.వీరిద్దరు ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్కు దూరంగా ఉండి, బిగ్బాష్ లీగ్లో పాల్గొన్నారు. మరో స్టార్ పేసర్ హరీస్ రౌఫ్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్ విభాగంలో అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్కు చోటు దక్కింది.లాహోర్లోని గద్దాఫీ స్టేడియంలో జరుగబోయే ఈ సిరీస్ కోసం పాక్ జట్టు శనివారం (జనవరి 24) లాహోర్కు చేరుకుంటుంది. మ్యాచ్లు జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగనున్నాయి. పాక్ గడ్డపై ఆస్ట్రేలియా ఆడబోతున్న రెండో టీ20 సిరీస్ ఇది. చివరిగా ఆసీస్ 2022లో పాక్లో పర్యటించి, ఏకైక టీ20 ఆడింది.ప్రపంచకప్ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా పరిగణించబడుతోంది. ఈ సిరీస్ ముగిసిన వారం రోజుల్లోపే ప్రపంచకప్ మొదలవుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో పాక్ గ్రూప్-ఏలో ఉంది. ఈ గ్రూప్లో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, భారత్ మిగతా జట్లుగా ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్లో శ్రీలంక, ఐర్లాండ్, ఒమాన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు పాక్ జట్టుసల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, మొహమ్మద్ వసీమ్ జూనియర్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్ -
WC 2027: రోహిత్ శర్మ వరల్డ్కప్ ఆడకుండా కుట్ర!?
టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మది. హిట్మ్యాన్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను భారత్ కైవసం చేసుకుంది.అయితే, కోరుకున్నట్లుగానే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ.. అనూహ్య రీతిలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వన్డే కెప్టెన్సీ నుంచి మేనేజ్మెంట్ అతడిని తొలగించింది.అగార్కర్ అలారోహిత్ శర్మ స్థానంలో శుబ్మన్ గిల్ (Shubman Gill)కు వన్డే పగ్గాలూ అప్పగించగా.. వరుసగా రెండు సిరీస్లలో టీమిండియా ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2027లో రోహిత్ ఆడే విషయంపై స్పష్టత లేనందనే అతడిని కెప్టెన్గా తప్పించామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు.ఆస్ట్రేలియా గడ్డ మీద హిట్ఈ క్రమంలో.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద రోహిత్ శర్మ అదరగొట్టాడు. సెంచరీ చేసి మరీ తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అనంతరం బీసీసీఐ ఆదేశాల మేరకు ముంబై తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగి అక్కడా శతక్కొట్టాడు.అయితే, తాజాగా న్యూజిలాండ్తో సిరీస్లో మాత్రం రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. మూడు వన్డేలలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ చేసిన స్కోర్లు వరుసగా.. 26, 24, 11. ఈ నేపథ్యంలో రోహిత్ ఆట తీరుపై విమర్శలు రాగా.. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే కూడా ఇందుకు మద్దతు ఇచ్చినట్లుగానే వ్యాఖ్యలు చేశాడు.డష్కాటే కామెంట్స్‘‘తొలి వన్డేలో రోహిత్ స్థాయికి తగినట్లు ఆడలేదు. ఆ తర్వాతి మ్యాచ్లూ అతడికి సవాలుగా మారాయి. ఈ సిరీస్కు ముందు పెద్దగా క్రికెట్ ఆడకపోవడం వల్లే ఇలా జరిగింది’’ అని డష్కాటే పేర్కొన్నాడు. నిజానికి ఆసీస్తో సిరీస్లో సత్తా చాటిన రోహిత్.. దేశీ క్రికెట్లోనూ ఆడాడు. అయినప్పటికీ డష్కాటే ఇలా వ్యాఖ్యానించాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి డష్కాటే తీరును ఎండగట్టాడు. కోచ్ చేసే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆటగాళ్ల మానసిక స్థితి ప్రభావితం అవుతుందని.. అతడిని ఒత్తిడిలోకి నెట్టివేయాలనే ప్రయత్నం తగదని చురకలు అంటించాడు.కోచ్కు ఇచ్చిపడేసిన మనోజ్ తివారిటీమిండియా సహాయక సిబ్బందిలో భాగమై ఉండి ఇలా మాట్లాడటం సరికాదని మనోజ్ తివారి డష్కాటేను విమర్శించాడు. రోహిత్తో నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయిస్తూనే.. మీడియా ముందుకు వచ్చి అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఏమిటని మండిపడ్డాడు. రోహిత్ ఫామ్ గురించి అడిగినపుడు నోరు మూసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.మరోవైపు.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మను వన్డే జట్టులోకి తీసుకుని.. వరల్డ్కప్-2027లోనూ ఆడిస్తే బాగుంటుందని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. అతడి కంటే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ముందు వరుసలో ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ప్రస్తుతం గిల్- రోహిత్ ఓపెనర్లుగా ఉన్నారు.వరల్డ్కప్ ఆడకుండా కుట్ర!?ఓవైపు అగార్కర్, డష్కాటే కామెంట్స్.. మరోవైపు ఇర్ఫాన్ పఠాన్ అంచనాలు.. వీటన్నింటిని చూసి రోహిత్ శర్మ అభిమానులు చిర్రెత్తిపోతున్నారు. హిట్మ్యాన్ను వన్డే వరల్డ్కప్-2027 ఆడకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లి విషయంలోనూ అగార్కర్ ఇలాగే మాట్లాడాడని.. అయితే, అతడు వరుస సెంచరీలు చేయడంతో ఇప్పట్లో అతడికి జోలికి వెళ్లరని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా డష్కాటేకు మనోజ్ తివారి చివాట్లు పెట్టిన తీరు బాగుందని.. దిగ్గజ ఆటగాడి పట్ల ఒక కోచ్ ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొంటున్నారు.చదవండి: IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు! -
500 వికెట్లు.. 7000కు పైగా పరుగులు
భారత క్రికెట్లో అత్యంత అన్ లక్కీ ఆటగాళ్లలో మధ్యప్రదేశ్కు చెందిన జలజ్ సక్సేనా ఒకరు. 39 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ (ఆఫ్ స్పిన్) ఆల్ రౌండర్ దేశవాలీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నా, ఒక్కసారి కూడా టీమిండియా తలుపులు తట్టలేకపోయాడు.20 ఏళ్లకు పైగా స్థిరంగా రాణిస్తున్నా జలజ్ను టీమిండియా సెలెక్టర్లు ఏనాడూ గుర్తించలేదు. జలజ్ కంటే తక్కువ స్థాయి ప్రదర్శనలు చేసిన చాలామంది ఆటగాళ్లు టీమిండియా ఛాన్స్లు కొట్టి, కెరీర్లు మలచుకున్నారు. కానీ జలజ్ మాత్రం దేశవాలీ క్రికెట్లో పరిమితమయ్యాడు.టెస్ట్ ఫార్మాట్లో జలజ్ సూపర్గా సెట్ అయ్యే ఆటగాడు. అతని కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్.. మిడిలార్డర్ బ్యాటింగ్ టీమిండియాకు చాలా ఉపయోగపడి ఉండేది. రవీంద్ర జడేజా జట్టులో నాటుకు పోయినందుకో లేక ఇతరత్రా కారణాలో తెలియదు కానీ, జలజ్కు ఏనాడూ టీమిండియా అవకాశానికి నోచుకోలేకపోయాడు.2005లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసిన జలజ్.. ఇప్పటివరకు 150 మ్యాచ్ల్లో 500 వికెట్లు తీసి, 7000కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు సహా 35 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 10 పది వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. జలజ్కు లిస్ట్-ఏ ఫార్మాట్లోనూ మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లో 109 మ్యాచ్ల్లో 2000కు పైగా పరుగులు (3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు) చేసి, 123 వికెట్లు తీశాడు. జలజ్ టీ20 ఫార్మాట్లోనూ ఓ మోస్తరు ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఈ ఫార్మాట్లో 73 మ్యాచ్ల్లో 77 వికెట్లు (2 ఐదు వికెట్ల ప్రదర్శనలు) తీసి, 688 పరుగులు చేశాడు.మూడు ఫార్మాట్లలో ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్నా జలజ్ భారత-ఏ జట్టు స్థాయి వరకే వెళ్లగలిగాడు. అక్కడు కూడా స్థిరమైన ప్రదర్శనలు చేసినా, భారత సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. 2013లో జలజ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్-ఏ జట్లపై అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనలు చేశాడు.జలజ్ అరంగేట్రం నుంచి దాదాపు ప్రతి రంజీ సీజన్లో స్థిరమైన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నాడు. 39 ఏళ్ల వయసులోనే జలజ్ ఏమాత్రం తగ్గడం లేదు.ప్రస్తుత రంజీ సీజన్కు ముందే కేరళ నుంచి మహారాష్ట్రకు మారిన జలజ్.. గోవాతో జరుగుతున్న మ్యాచ్లో 6 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటడు. ఈ క్రమంలోనే జలజ్ ఓ చారిత్రక మైలురాయిని తాకాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 500 వికెట్లు పూర్తి చేసుకొని, అత్యంత అరుదైన జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.జలజ్ కెరీర్లో అత్యుత్తమ రికార్డులు..రంజీ ట్రోఫీ చరిత్రలో 6000 పరుగులు, 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడుఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు, 8 వికెట్లు తీసిన తొలి భారతీయుడుగోవా-మహారాష్ట్ర మ్యాచ్ విషయానికొస్తే.. జలజ్ చెలరేగడంతో (34-6-79-6) తొలుత బ్యాటింగ్ చేసిన గోవా 209 పరుగులకే ఆలౌటైంది. జలజ్తో పాటు రామకృష్ణ ఘోష్ (15.1-4-34-2), విక్కీ ఓస్వాల్ (22-5-47-2) కూడా రాణించారు. గోవా ఇన్నింగ్సలో కెప్టెన్ స్నేహల్ కౌతాంకర్ (73) ఒక్కడే రాణించాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర 67 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రుతరాజ్ గైక్వాడ్ (66) అర్ద సెంచరీతో రాణించి మహారాష్ట్రను ఆదుకున్నాడు. ప్రస్తుతం సౌరభ్ నవలే (46), జలజ్ సక్సేనా (4) క్రీజ్లో ఉన్నారు. లలిత్ యాదవ్ 3 వికెట్లతో మహారాష్ట్రను దెబ్బతీశాడు. -
టీమిండియాలో చోటిస్తారా? లేదా?.. సెలక్టర్లకు వార్నింగ్!
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. హైదరాబాద్తో రంజీ ట్రోఫీ మ్యాచ్లో డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. తద్వారా టెస్టు జట్టు నుంచి తనను తప్పించిన సెలక్టర్లకు మరోసారి బ్యాట్ ద్వారానే గట్టి హెచ్చరికలు జారీ చేశాడు.కాగా ఫార్మాట్లకు అతీతంగా సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) దేశీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవల టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా డిసెంబరు 2న శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబరు 31న మరోసారి సెంచరీ బాదాడు.ఈసారి ద్విశతకంతో తాజాగా హైదరాబాద్తో రంజీ మ్యాచ్లో ద్విశతకంతో చెలరేగాడు సర్ఫరాజ్ ఖాన్. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో భాగంగా గురువారం హైదరాబాద్- ముంబై మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన సిరాజ్ సేన.. ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించింది.227 పరుగులుఈ క్రమంలో తొలిరోజు శతక్కొట్టిన సర్ఫరాజ్.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో మొత్తంగా 219 బంతులు ఎదుర్కొన్న అతడు 227 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 19 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, రక్షణ్ బౌలింగ్లో బౌల్డ్ కావడంతో సర్ఫరాజ్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.ఇక సర్ఫరాజ్కు తోడు కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (104) శతక్కొట్టాడు. సువేద్ పార్కర్ 75, అథర్వ అంకోలేకర్ 35 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో ముంబై 560 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రోహిత్ రాయుడు రెండు, నితిన్ సాయి యాదవ్, కొడిమెల హిమతేజ, కెప్టెన్ మొహమ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.టీమిండియాలో పునరాగమనం చేసేనా?దేశీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి సత్తా చాటాడు. అయితే, చివరగా 2024లో స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో ఆడిన సర్ఫరాజ్ను సెలక్టర్లు మళ్లీ జట్టుకు ఎంపిక చేయలేదు.ఈ క్రమంలో దేశీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో రాణిస్తూ సర్ఫరాజ్ సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. కాగా ఇప్పటి వరకు అతడు టీమిండియా తరఫున టెస్టులు మాత్రమే ఆడాడు. వన్డే, టీ20 జట్లలో అరంగేట్రం చేయలేదు.ఇదిలా ఉంటే ప్రస్తుతం న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో బిజీగా ఉన్న టీమిండియా తదుపరి టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఐపీఎల్-2026తో బిజీ కానున్నారు భారత ఆటగాళ్లు. ఆ తర్వాత జూలైలో ఇంగ్లండ్ పర్యటనతో మళ్లీ టీమిండియా విధుల్లో చేరతారు. చదవండి: ODI WC 2027: ‘గిల్పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ’ -
నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్, జపాన్పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 23) జరుగుతున్న తమ చివరి గ్రూప్ (ఏ) మ్యాచ్లో శ్రీలంకను 58 పరుగులకే కుప్పకూలిచ్చి సగం విజయాన్ని సొంతం చేసింది.విండ్హోక్లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. పేసర్ విల్ బైరోమ్ (6.4-0-14-5) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. బైరోమ్కు జతగా ఛార్లెస్ లచ్మండ్ (5-1-19-2), కేసీ బార్టన్ (4-0-13-2), హేడెన్ ష్కిల్లర్ (3-0-11-1) కూడా రాణించారు. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్ దిమంత మహావితన డకౌట్ కాగా.. మరో ఓపెనర్ విరాన్ చముదిత, దుల్నిత్ సిగెరా, ఆడమ్ హిల్మి తలా ఒక్క పరుగు.. కెప్టెన్ విమత్ దిన్నరా 7, సెనెవిరత్నే 5, రసిత్ రింసర, కుగథాస్ మథులాన్ తలో 6 పరుగులు చేశారు. కాగా, ఈ టోర్నీలో శ్రీలంక తమ తొలి రెండు గ్రూప్ స్టేజీ మ్యాచ్ల్లో జపాన్, ఐర్లాండ్పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. -
షమార్ హ్యాట్రిక్.. విండీస్ ఘన విజయం
దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ కంటితుడుపు విజయాన్ని సాధించింది. నిన్న (జనవరి 22) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్కు ముందే సిరీస్ ఫలితం తేలిపోయింది. తొలి రెండు టీ20ల్లో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్లో తలో పిడికెడు పరుగులు చేశారు. బ్రాండన్ కింగ్ 47, జాన్సన్ ఛార్లెస్ 17, కీసీ కార్తీ 10, జస్టిన్ గ్రీవ్స్ 12, షిమ్రోన్ హెట్మైర్ 13, క్వెన్టిన్ శాంప్సన్ 3, మాథ్యూ ఫోర్డ్ 27, షమార్ స్ప్రింగర్ 16 (నాటౌట్), మోటీ 2 (నాటౌట్) పరుగులు చేశారు.ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రహ్మాన్ షరీఫి, రషీద్ ఖాన్, అహ్మద్జాయ్ తలో 2 వికెట్లు తీయగా.. షాహిదుల్లా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్కు ఓపెనర్లు రహానుల్లా గుర్బాజ్ (71), ఇబ్రహీం జద్రాన్ (28) శుభారంభాన్ని అందించారు. అయితే వీరి తర్వాత వచ్చిన వారు ఒక్కరు కూడా క్రీజ్లో నిలబడలేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. షమార్ స్ప్రింగర్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించాడు. షమార్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు, ఫోర్డ్, పియెర్రీ, సైమండ్స్ తలో వికెట్ తీశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో గుర్బాజ్, జద్రాన్ మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. -
T20 WC 2026: ఫైనల్ చేరేది ఆ జట్లే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఐదు జట్లను చేర్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC). ఇక ఈ దఫా ఇటలీ తొలిసారిగా క్రికెట్ వరల్డ్కప్ టోర్నీకి అర్హత సాధించడం విశేషం.ఏ గ్రూప్లో ఏ జట్లు?గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్లతో కలిసి ఉంది ఇటలీ. ఇక గ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్ భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.అదే విధంగా గ్రూప్-ఢిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 7- మార్చి 8 వనకు ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. భారత్- శ్రీలంక ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ ఈసారి కూడా ఒకే గ్రూపులో ఉండటం క్రికెట్ ప్రేమికులను ఆకర్షిస్తోంది. దాయాదుల మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరుగనుంది. ఇందుకు కొలంబో వేదిక. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.పాక్కు ఓటమి తప్పదు‘‘ఈ పోరు ఉత్కంఠగా సాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే, సుదీర్ఘకాలంగా టీమిండియా పాకిస్తాన్ను ఓడిస్తూనే వస్తోంది. భారత జట్టుకు పాక్ దరిదాపుల్లో కూడా లేదు. టీమిండియాతో మ్యాచ్లో ఒత్తిడిని అధిగమిస్తేనే పాక్ సానుకూల ఫలితం రాబట్టగలదు’’ అని క్లార్క్ పేర్కొన్నాడు.ఫైనల్ చేరేది ఆ జట్లే!ఇక ఈ సందర్భంగా టీ20 వరల్డ్కప్-2026 ఫైనలిస్టులను కూడా మైకేల్ క్లార్క్ అంచనా వేశాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయని జోస్యం చెప్పాడు. కాగా టీ20 ఫార్మాట్లో 2007లో మొదలైన ప్రపంచకప్ టోర్నీలో ధోని సారథ్యంలోని టీమిండియా విజయం సాధించింది.ఆ తర్వాత 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరోసారి పొట్టి ప్రపంచకప్ టోర్నీ టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. ఇక వన్డే వరల్డ్కప్ టోర్నమెంట్లలో ఆధిపత్యం కనబరిచే ఆస్ట్రేలియా టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ట్రోఫీ గెలిచింది. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో 2021 ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి విజేతగా అవతరించింది. ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్ రెండో ర్యాంకులో ఉంది. చదవండి: ODI WC 2027: ‘గిల్పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ’ -
చెలరేగిన ఆంధ్ర బౌలర్.. అద్భుత ప్రదర్శన
డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో రంజీ మ్యాచ్లో ఆంధ్ర బౌలర్ కలిదిండి నరసింహ (కేఎస్ఎన్) రాజు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టును నామమాత్రపు స్కోరకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.దేశీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండో దశ మ్యాచ్లు గురువారం మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-ఎలో భాగమైన విజయనగరం వేదికగా ఆంధ్రతో మ్యాచ్లో టాస్ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్ చేసింది.యశ్ రాథోడ్ శతకంమ్యాచ్ ఆరంభం నుంచే ఆంధ్ర బౌలర్లు కట్టిపడేయడంతో విదర్భ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే, యశ్ రాథోడ్ (Yash Rathod- 104 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ శతకంతో ఆదుకున్నాడు. మరోవైపు.. ఈ సీజన్లో దంచి కొడుతున్న అమన్ మోఖడే (21), దానిశ్ మాలేవర్ (0), అథర్వ తైడె (13), సమర్థ్ (9)లను కేఎస్ఎన్ రాజు తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. దీంతో విదర్భ ఒక దశలో 45/4తో కష్టాల్లో పడింది.ఈ సమయంలో యశ్ రాథోడ్ గొప్ప సంయమనం కనబర్చాడు. మొదట రోహిత్తో ఐదో వికెట్కు 93 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ అండతో జట్టును ముందుకు నడిపాడు. ఫలితంగా గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి విదర్భ తొలి ఇన్నింగ్స్లో 81 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.మరో 28 పరుగులు జతచేసి ఈ క్రమంలో 267/7 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన విదర్భ మరో 28 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది. ఆంధ్ర బౌలర్లలో రాజు ఐదు వికెట్లు (5/62) కూల్చగా.. కావూరి సాయితేజ యశ్ రాథోడ్ (115), రోహిత్ బింకర్ (37) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు పార్థ్ రేఖడే వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక టీమిండియా స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా విదర్భ తొలి ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లు ఆడి 295 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. ఆంధ్ర జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది.చదవండి: IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు! -
‘గిల్పై వేటు.. వన్డే కెప్టెన్గా తిరిగి రోహిత్ శర్మనే’
టీమిండియా వన్డే కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్కు వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అతడి సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది.అనంతరం తాజాగా న్యూజిలాండ్తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్లోనూ టీమిండియాకు పరాభవం ఎదురైంది. స్వదేశంలో మొట్టమొదటి సారి కివీస్కు భారత్ వన్డే సిరీస్ను కోల్పోయింది. తొలి వన్డేలో విజయం సాధించిన గిల్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండో వన్డేల్లోనూ ఓటమిపాలైంది. అయితే, ఈ సిరీస్లో కివీస్ తమ ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడటం గమనార్హం.గిల్పై వేటు.. రోహిత్ శర్మకే పగ్గాలు ఇవ్వండిఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్సీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గిల్పై వేటు వేసి వన్డే కెప్టెన్సీని తిరిగి రోహిత్ శర్మ (Rohit Sharma)కు అప్పగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.ఈ మేరకు.. ‘‘ఇప్పటికీ సమయం మించిపోలేదు. తప్పును సరిచేసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. ఇదేదో ద్వైపాక్షిక సిరీస్ గురించి కాదు. ముందుంది వరల్డ్కప్ టోర్నీ. ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రయోగాలు అవసరం లేదు.అసలు వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ కివీస్తో సిరీస్లో గనుక రోహిత్ కెప్టెన్గా ఉండి ఉంటే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. అతడి సారథ్యంలోనే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయాన్ని మర్చిపోకూడదు.రోహిత్ కెప్టెన్గా ఉంటేఅప్పుడే జట్టు సరైన దిశలో వెళ్తోందని నాకు అనిపించింది. గిల్ కంటే రోహిత్ ఎన్నోరెట్లు గొప్ప కెప్టెన్. అతడొక విజయవంతమైన సారథి. గిల్ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్కప్ గెలిచే అవకాశాలు ఉండవచ్చు. అయితే, రోహిత్ కెప్టెన్గా ఉంటే జట్టు కచ్చితంగా చాంపియన్గా నిలుస్తుంది. ఇందుకు 85- 90 శాతం అవకాశం ఉంది’’ అని ఇన్సైడ్స్పోర్ట్తో మనోజ్ తివారి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథికాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్-2027లోనూ భారత జట్టును ముందుకు నడిపించాలని రోహిత్ భావించగా.. బీసీసీఐ అనూహ్య రీతిలో అతడిపై వేటు వేసింది. ఆస్ట్రేలియా టూర్కు ముందు రోహిత్ను తప్పించి గిల్కు వన్డే పగ్గాలు అప్పగించింది.ఇక అంతకుముందే రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకగా.. అతడి స్థానంలో గిల్ సారథిగా నియమితుడయ్యాడు. మరోవైపు.. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించగా.. సారథిగా సూర్య అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. చదవండి: వరల్డ్కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్ -
మీ కెప్టెన్ హిందువు: బంగ్లాదేశ్కు భారత మాజీ క్రికెటర్ సలహా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం దాదాపుగా ఖాయమైనట్లే కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మాటను లెక్కచేయకుండా పంతానికి పోయినందుకు బంగ్లా టోర్నీలో ఆడే అవకాశం కోల్పోవడం లాంఛనమే అనిపిస్తోంది. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలుగతంలో తమకు చేదోడువాదోడుగా నిలిచిన భారత్పై కొంతమంది బంగ్లాదేశ్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై వరుస దాడులు ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ను బీసీసీఐ తప్పించింది.ఐసీసీ మాట వినని బీసీబీఈ విషయాన్ని సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్-2026లో భారత్లో తమ మ్యాచ్లు ఆడబోడమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లకు అక్కడ భద్రత ఉండదంటూ కొత్తగా రాగం ఎత్తుకుంది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది.ఈ క్రమంలో ఐసీసీ తమ పట్ల న్యాయంగా వ్యవహరించాలని.. ఏదేమైనా తాము భారత్లో ఆడబోమని బంగ్లాదేశ్ గురువారమే తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ బీసీబీకి ఓ సలహా ఇచ్చాడు.మీ కెప్టెన్ ఓ హిందువువార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ‘‘నిజంగా ఐసీసీకి ఇదొక పీడకలలాంటిది. చాన్నాళ్ల క్రితమే టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. టోర్నీ ఆరంభానికి సమయం కూడా ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఇలా చేయడం సరికాదు.భారత్లో భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయని నేను అనుకోను. అసలు ఇక్కడ గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. మీ కెప్టెన్ (Litton Das) ఓ హిందువు.ఈ విషయాన్ని బంగ్లాదేశ్ తమకు సానుకూలంగా మలచుకోవచ్చే. టోర్నీలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు’’ అని అతుల్ వాసన్ బంగ్లాదేశ్కు హితవు పలికాడు. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బంగ్లాదేశ్ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), మహ్మద్ సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఇమోన్, తౌహిద్ హృదోయ్, షమీమ్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, మహ్మద్ షైపుద్దీన్, షోరిఫుల్ ఇస్లాం. చదవండి: భారత్కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు!
న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో టీమిండియా మరో విజయంపై కన్నేసింది. రాయ్పూర్ వేదికగా రెండో మ్యాచ్లోనూ గెలిచి ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.ఆడతాడా? లేదా?నాగ్పూర్లో కివీస్తో తొలి టీ20 సందర్భంగా వైస్ కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Injured) గాయపడిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 16వ ఓవర్ వేసిన అక్షర్ బౌలింగ్లో డారిల్ మిచెల్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ ఆడగా.. బంతిని ఆపే క్రమంలో అక్షర్ ఎడమచేతికి గాయమైంది. చూపుడు వేలు చిట్లి రక్తం వచ్చింది. దీంతో అతడు మధ్యలోనే మైదానం వీడాడు.అయితే, అక్షర్ పటేల్ గాయం తీవ్రతపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో కివీస్తో రెండో టీ20లో అతడు ఆడతాడా? లేదా? అన్నది తేలలేదు. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టులో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. లెఫ్టార్మ్ ఆల్రౌండర్ అక్షర్ స్థానాన్ని.. మరో లెఫ్టాండర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భర్తీ చేసే అవకాశం ఉంది.కుల్దీప్ వైపు మొగ్గున్యూజిలాండ్తో వన్డే సిరీస్లో కుల్దీప్ యాదవ్ అంతంత మాత్రంగానే రాణించినా.. టీ20లలో అతడికి అపార అనుభవం ఉంది. కాబట్టిరవి బిష్ణోయిని కాదని కుల్దీప్ వైపు యాజమాన్యం మొగ్గుచూపవచ్చు. ఈ ఒక్క మార్పు మినహా భారత ప్లేయింగ్ ఎలెవన్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.బ్రేస్వెల్ వస్తాడా?కాగా కుల్దీప్ యాదవ్ ఇప్పటికి టీమిండియా తరఫున 50 టీ20 మ్యాచ్లు ఆడి.. 90 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. న్యూజిలాండ్ జట్టుకు శుభవార్త అందినట్లు తెలుస్తోంది. ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. అతడు తుదిజట్టులోకి వస్తే యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్పై వేటు పడే అవకాశం ఉంది.ఇక రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం రెండో టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా ఇరుజట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. నాగ్పూర్లో 48 పరుగులు తేడాతో గెలిచి ఆధిక్యంలో నిలిచింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 తుదిజట్లు అంచనాభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.న్యూజిలాండ్మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రాబిన్సన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, క్రిస్టియన్ క్లార్క్/ మైకేల్ బ్రేస్వెల్, కైలీ జేమీసన్, ఇష్ సోధి, జేకబ్ డఫీ.UPDATE: తుదిజట్టులో రెండు మార్పులు.. సూర్య, ఇషాన్ విధ్వంసంచదవండి: భారత్కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
న్యూజిలాండ్కు భారీ షాక్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ ఆడం మిల్నే గాయపడ్డాడు. ఫలితంగా ఐసీసీ టోర్నీ నుంచి అతడు వైదొలిగాడు.న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని శుక్రవారం ధ్రువీకరించింది. తొడ కండరాల గాయంతో మిల్నే వరల్డ్కప్ జట్టుకు దూరమైనట్లు తెలిపింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్లో భాగంగా మిల్నే సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా అతడు గాయపడ్డాడు.మిల్నే స్థానంలో అతడేఇక ఆడం మిల్నే (Adam Milne) స్థానాన్ని బ్లాక్క్యాప్స్.. కైలీ జెమీషన్ (Kyle Jamieson)తో భర్తీ చేసింది. రిజర్వు ప్లేయర్గా ఉన్న అతడిని ప్రధాన జట్టులోకి చేర్చింది. జెమీషన్ స్థానంలో మరో ట్రావెలింగ్ రిజర్వును త్వరలోనే ఎంపిక చేయనున్నారు. కాగా కివీస్ జట్టును గాయాల బెడద వేధిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే విలియమ్ ఒరూర్కీ, బ్లేయర్ టిక్నర్, నాథన్ స్మిత్, బెన్ సియర్స్ వంటి ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇక కెప్టెన్ మిచెల్ సాంట్నర్, మార్క్ చాప్మన్, మ్యాట్ హెన్రీ తదితరులు ఇటీవలే గాయాల నుంచి కోలుకున్నారు. వీరంతా ప్రస్తుతం టీమిండియాతో టీ20 సిరీస్తో బిజీగా ఉన్నారు.ఫెర్గూసన్ సైతంఇదిలా ఉంటే.. వరల్డ్కప్ జట్టులో భాగమైన లాకీ ఫెర్గూసన్ పిక్కల్లో నొప్పి కారణంగా టీమిండియాతో సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. ఒకవేళ వరల్డ్కప్ నాటికి అతడు కోలుకోకపోతే జట్టుకు దూరమయ్యే పరిస్థితి.కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. కాగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతోంది. తొలి టీ20లో టీమిండియా గెలవగా.. ఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి రెండో టీ20కి రాయ్పూర్ వేదిక.టీ20 వరల్డ్కప్-2026 టోర్నీకి న్యూజిలాండ్ అప్డేటెడ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, కైలీ జెమీషన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: వరల్డ్కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్ -
భారత్కు మాత్రమే అవకాశం ఇస్తారా?
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీరు మారలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము భారత్లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్లు ఆడబోమని గురువారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని విమర్శించాడు. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందనేలా ఆరోపణలు చేశాడు.భద్రతాపరమైన కారణాలతో వేదికలు మార్చడం గతంలో చాలాసార్లు జరిగిందని, ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లన్నింటినీ దుబాయ్లోనే ఆడేలా భారత్కు అనుమతి ఇచ్చారని బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ గుర్తు చేశాడు. పాక్లో ఆడబోమని భారత్ చెబితే..‘ఐసీసీ ఎప్పుడో 1996, 2003లో జట్లు కొన్ని వేదికల్లో ఆడటానికి ఇష్టపడక పాయింట్లు చేజార్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఎప్పటి మాటలో ఎందుకు?2025 చాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లో ఆడబోమని భారత్ చెబితే వారి మ్యాచ్లను తరలించలేదా? అన్ని మ్యాచ్లు ఒకే వేదికపై ఆడి, ఒకే హోటల్లో జట్టు బస చేయడం వారికి కల్పించిన ప్రత్యేక సౌకర్యం కాదా? మేం పోరాడతాంశ్రీలంక పేరుకే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది కానీ ఒక జట్టు కోసమే (పాకిస్తాన్) హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్లు అక్కడ పెట్టారు. ఐసీసీ స్థాయి సంస్థ 24 గంటల గడువు ఇవ్వడం అనేది అర్థరహితం. ఈ విషయంలో మేం పోరాడతాం’ అని అమీనుల్ స్పష్టం చేశాడు. కాగా గతంలో పాకిస్తాన్లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విదేశీ జట్లు అక్కడ పర్యటించడం మానేశాయి. పాక్లో పరిస్థితి వేరు.. వితండవాదంఇటీవలి కాలంలో మళ్లీ పర్యటనలు మొదలుపెట్టాయి. అయితే, బీసీసీఐ మాత్రం భద్రతా కారణాలతో టీమిండియాను అక్కడకు పంపడం లేదు. అందుకే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి తటస్థ వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్నందున శ్రీలంకలో పాక్ మ్యాచ్లు ఆడిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరిన నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్లో బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఏమాత్రం ముప్పులేదని పరిశీలన బృందం చెప్పినా బంగ్లాదేశ్ ఇలా వితండవాదానికి దిగడం గమనార్హం. లాంఛనమేకాగా టీ20 వరల్డ్ కప్నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది! ఒకరోజు సమయమిచ్చి తుది నిర్ణయం తీసుకోవాలంటూ ఐసీసీ చేసిన హెచ్చరికను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పునరుద్ఘాటించారు.‘ఇది మా దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. భద్రత విషయంలో మా భయం వాస్తవం. ఐసీసీ నుంచి మాకు ఇప్పటి వరకైతే న్యాయం దక్కలేదు. మా ఆందోళనను వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని నజ్రుల్ వ్యాఖ్యానించాడు.చదవండి: వరల్డ్కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్ -
గుకేశ్కు తొలి గెలుపు
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తొలి విజయం అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఐదో రౌండ్ గేమ్లో గుకేశ్ 51 ఎత్తుల్లో థాయ్ డాయ్ వాన్ నుగుయెన్ (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందాడు. తొలి నాలుగు రౌండ్ గేమ్లను గుకేశ్ ‘డ్రా’గా ముగించడం గమనార్హం. 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఐదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్మాస్టర్లు గుకేశ్ 3 పాయింట్లతో ఐదో స్థానంలో... ఇరిగేశి అర్జున్ 2.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో... అరవింద్ చిదంబరం 1.5 పాయింట్లతో 11వ స్థానంలో, ప్రజ్ఞానంద 1.5 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నారు. గురువారం విశ్రాంతి దినం తర్వాత నేడు ఆరో రౌండ్ గేమ్లు జరుగుతాయి. -
శ్రీకాంత్ అవుట్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్వన్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–10, 21–11తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్)పై గెలుపొందగా... శ్రీకాంత్ 11–21, 10–21తో నాలుగో సీడ్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ 21–16, 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ (భారత్) ద్వయం 17–21, 21–9, 16–21తో మాన్ వె చోంగ్–కాయ్ వున్ టీ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో పానిత్చపోన్ (థాయ్లాండ్)తో లక్ష్య సేన్; చెన్ యు ఫె (చైనా)తో పీవీ సింధు తలపడతారు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 1–0తో పానిత్చపోన్పై ఆధిక్యంలో ఉండగా... సింధు 6–7తో చెన్ యు ఫె చేతిలో వెనుకబడి ఉంది. -
ఒకే రోజు 23 వికెట్లు
రాజ్కోట్: టీమిండియా వన్డే, టెస్టు జట్ల సారథి శుబ్మన్ గిల్... దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ప్రభావం చూపలేకపోయాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన పోరులో పంజాబ్ కెప్టెన్గా బరిలోకి దిగిన గిల్ (0) రెండు బంతులు ఎదుర్కొని పార్థ్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఇరు జట్ల బ్యాటర్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమవడంతో ఈ మ్యాచ్ తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. మొదట సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 47.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. జయ్ గోహిల్ (117 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (7) నిరాశ పర్చగా.. హార్విక్ దేశాయ్ (13), చిరాగ్ జానీ (8), అర్పిత్ (2), సమర్ (0) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుసకట్టారు. ప్రేరక్ మన్కడ్ (32) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 38 పరుగులిచ్చి 6 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ తీవ్రంగా తడబడింది. 40.1 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్సిమ్రన్ సింగ్ (60 బంతుల్లో 44; 7 ఫోర్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. గిల్తో పాటు హర్నూర్ సింగ్ (0), నేహల్ వధేరా (6), ప్రేరిత్ దత్తా (11), ఉదయ్ శరణ్ (23) విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, ధర్మేంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (6), చిరాగ్ జానీ (5), జయ్ గోహిల్ (8) అవుటయ్యారు. చేతిలో 7 వికెట్లు ఉన్న సౌరాష్ట్ర ఓవరాల్గా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. ధర్మేంద్ర జడేజా (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇదే గ్రూప్లో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్లో 82.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్లో మధ్యప్రదేశ్ 90 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. చండీగఢ్తో మ్యాచ్లో కేరళ తొలి ఇన్నింగ్స్లో 56 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. చండీగఢ్ 34 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. -
‘వావ్’రింకా...
మెల్బోర్న్: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని స్విట్జర్లాండ్ వెటరన్ టెన్నిస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా నిరూపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన మాజీ చాంపియన్ మరో అద్భుత విజయంతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో వావ్రింకా 4–6, 6–3, 3–6, 7–5, 7–6 (10/3)తో క్వాలిఫయర్ ఆర్థర్ గియా (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. తద్వారా కెన్ రోజ్వాల్ (ఆ్రస్టేలియా–1978లో 44 ఏళ్లు) తర్వాత ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో మూడో రౌండ్కు చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా వావ్రింకా (40 ఏళ్ల 296 రోజులు) గుర్తింపు పొందాడు. అంతేకాకుండా 1987లో నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో 128 మందితో ‘డ్రా’ రూపొందించడం మొదలయ్యాక ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో రెండు మ్యాచ్ల్లో గెలిచిన అతిపెద్ద వయసు్కడిగానూ వావ్రింకా ఘనత వహించాడు. దాంతోపాటు గ్రాండ్స్లామ్ టోర్నీల చరిత్రలో అత్యధిక ఐదు సెట్ల మ్యాచ్లు ఆడిన ప్లేయర్గానూ వావ్రింకా రికార్డు నెలకొల్పాడు. ‘గ్రాండ్’ టోర్నీల్లో వావ్రింకా ఐదు సెట్ల మ్యాచ్లు ఆడటం ఇది 49వసారి కాగా... స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (48 సార్లు) పేరిట ఉన్న రికార్డును వావ్రింకా బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో నొవాక్ జొకోవిచ్ (47 సార్లు), లీటన్ హెవిట్ (45 సార్లు), ఫెర్నాండో వెర్డాస్కో (45 సార్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా వావ్రింకా కెరీర్లో ఐదు సెట్ల మ్యాచ్లు ఆడటం ఇది 58వసారి. ఇది కూడా రికార్డే. ఇందులో అతను 31 సార్లు గెలిచి, 27 సార్లు ఓడిపోయాడు. ఈ ఏడాది తర్వాత టెన్నిస్కు వీడ్కోలు పలుకుతున్న వావ్రింకాకు ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా తన శక్తినంతా ధారపోసి ఆడుతున్న వావ్రింకాకు మూడో రౌండ్లో కఠినపరీక్ష ఎదురుకానుంది. మూడో రౌండ్లో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో వావ్రింకా తలపడతాడు. ఆర్థర్ గియాతో జరిగిన మ్యాచ్లో వావ్రింకా 11 ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 63 విన్నర్స్ కొట్టడంతోపాటు 69 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నిర్ణాయక ఐదో సెట్ ‘సూపర్ టైబ్రేక్’లో వావ్రింకా పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. జొకోవిచ్ 399వ విజయం పురుషుల సింగిల్స్లోనే డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ (ఇటలీ) మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో సినెర్ 6–1, 6–4, 6–2తో జేమ్స్ డక్వర్త్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. 10సార్లు చాంపియన్, మాజీ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–2, 6–2తో ఫ్రాన్సిస్కో మెస్ట్రెలి (ఇటలీ)పై నెగ్గాడు. గ్రాండ్స్లామ్ టోర్నీల్లో జొకోవిచ్కిది 399వ విజయం. మరో మ్యాచ్లో గెలిస్తే గ్రాండ్స్లామ్ టోర్నీల్లో పురుషుల సింగిల్స్లో 400 విజయాలు నమోదు చేసుకున్న తొలి ప్లేయర్గా జొకోవిచ్ రికార్డు సృష్టిస్తాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో ఐదో సీడ్ ముసెట్టి (ఇటలీ) 6–3, 6–3, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 6–3, 6–2, 6–2తో స్వీనీ (ఆ్రస్టేలియా)పై, టేలర్ ఫ్రిట్జ్ 6–1, 6–4, 7–6 (7/4)తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై, 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 7–5, 6–4తో మునార్ (స్పెయిన్)పై గెలిచారు. నిశేష్ నిష్క్రమణ వరుసగా రెండో ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఆడిన తెలుగు సంతతికి చెందిన అమెరికన్ ప్లేయర్ నిశేష్ బసవారెడ్డి పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో నిశేష్ 1–6, 4–6, 3–6తో 15వ సీడ్ ఖచనోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో రెండో రౌండ్కు చేరిన నిశేష్ 1 గంట 57 నిమిషాల్లో ఖచనోవ్ చేతిలో ఓటమి చవిచూశాడు. 10 ఏస్లు సంధించిన నిశేష్, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 31 విన్నర్స్ కొట్టి, 37 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 18 సార్లు పాయింట్లు గెలిచిన నిశేష్ తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయాడు. రెండో రౌండ్లో ఓడిన నిశేష్ కు 2,25,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 40 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ‘మిక్స్డ్’లో యూకీ జోడీ ఓటమి భారత డబుల్స్ నంబర్వన్ యూకీ బాంబ్రీకి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో యూకీ (భారత్)–నికోల్ మెలిచార్ మారి్టనెజ్ (అమెరికా) ద్వయం 6–3, 1–6, 6–10తో ఆరో సీడ్ టిమ్ పుట్జ్ (జర్మనీ)–జాంగ్ షుయె (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.పదో సీడ్ బెన్చిచ్ అవుట్ మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్) రెండో రౌండ్లో నిష్క్రమించగా... డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా), రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మాజీ విజేత నయోమి ఒసాకా (జపాన్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. బెన్చిచ్ 3–6, 6–0, 4–6తో క్వాలిఫయర్ నికోలా బర్తున్కోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయింది. కీస్ 6–1, 7–5తో ఆష్లిన్ క్రుగెర్ (అమెరికా)పై, స్వియాటెక్ 6–2, 6–3తో బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై, ఒసాకా 6–3, 4–6, 6–2తో సొరానా కిర్స్టియా (రొమేనియా)పై నెగ్గారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో నాలుగో సీడ్ అనిసిమోవా (అమెరికా) 6–1, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 7–5, 6–2తో వర్వరా గ్రాచెవా (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 6–0, 6–2తో మెకార్ట్నీ కెస్లెర్ (అమెరికా)పై గెలిచారు. -
SL vs ENG: ఇంగ్లండ్ను చిత్తు చేసిన శ్రీలంక
కొలంబో: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన శ్రీలంక జట్టు తొలి వన్డేలో 19 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (117 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోగా... జనిత్ లియనాగె (53 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తలా కొన్ని పరుగులు చేయడంతో లంక మంచి స్కోరు చేయగలిగింది. కమిల్ మిశ్రా (27), నిసాంక (21), కెపె్టన్ అసలంక (17), దునిత్ వెల్లలాగె (25 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (76 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్), జో రూట్ (90 బంతుల్లో 61; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో పోరాడారు. ఈ ఇద్దరూ రాణించడంతో ఒక దశలో 129/1తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (6), జాక్ క్రాలీ (6), జోస్ బట్లర్ (19), సామ్ కరన్ (5) విఫలమయ్యారు. జేమీ ఓవర్టన్ (17 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్లు), రేహాన్ అహ్మద్ (27; 5 ఫోర్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. లంక బౌలర్లలో ప్రమోద్ 3 వికెట్లు పడగొట్టగా... దునిత్, జెఫ్రీ వండర్సె చెరో రెండు వికెట్లు తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన దునిత్ వెల్లలాగెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది. -
ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు...
రాయ్పూర్: న్యూజిలాండ్తో తొలి టి20లో ఘన విజయం తర్వాత భారత్ మరో విజయంపై గురి పెట్టింది. గత పోరులో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన జట్టు 2–0తో ఆధిక్యం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు న్యూజిలాండ్ కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రెండో టి20 మ్యాచ్కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకున్నాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సామ్సన్, ఇషాన్లపై దృష్టి... తొలి టి20లో భారత బ్యాటర్లలో అభిõÙక్ శర్మ చెలరేగగా, సూర్యకుమార్ కూడా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్లో ఉన్నంత సేపు పాండ్యా ప్రభావం చూపించగా... ఫినిషర్గా రింకూ సింగ్ తన పేరును నిలబెట్టుకున్నాడు. అయితే సామ్సన్, ఇషాన్ కిషన్ మాత్రమే ప్రభావం చూపలేకపోయారు. గిల్ను తప్పించడంతో టి20 టీమ్లో ఓపెనర్గా తన స్థానం చేసుకున్న సామ్సన్ అంచనాలకు తగినట్లుగా ఆడాల్సి ఉంది. అదే విధంగా వరల్డ్ కప్ టీమ్లో కూడా చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్పై నమ్మకంతో మేనేజ్మెంట్ మూడో స్థానంలో ఆడే అవకాశం కల్పించింది. ఒక్క మ్యాచ్లో వైఫల్యం సమస్య కాకపోయినా... చెత్త షాట్లతో వీరు వికెట్లు సమర్పించుకున్నారు. ఈసారి తప్పులు దిద్దుకునే అవకాశం వీరికి ఉంది. పేస్ బౌలింగ్లో మరోసారి అర్‡్షదీప్, బుమ్రా ప్రదర్శనపై జట్టు ఆధారపడి ఉండగా, పాండ్యా కూడా కీలక పాత్ర పోషిస్తాడు. స్పిన్నర్లుగా వరుణ్, అక్షర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించగలరు. అయితే తొలి మ్యాచ్లో చేతికి గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్న అక్షర్ ఆడకపోతే మరో స్పిన్నర్ బిష్ణోయ్కు చోటు లభించవచ్చు. తుది జట్టులోకి బ్రేస్వెల్! భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ గత మ్యాచ్లో న్యూజిలాండ్ పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి సిరీస్ను సమం చేయాలని జట్టు ఆశిస్తోంది. టాప్–3 విఫలం కావడంతో జట్టును దెబ్బ తీసింది. వన్డే సిరీస్లో కూడా ఘోరంగా విఫలమైన కాన్వే ఇప్పటికైనా రాణించాలని టీమ్ కోరుకుంటోంది. రచిన్పై కూడా ప్రధాన బాధ్యత ఉండగా, రాబిన్సన్ దూకుడుగా ఆడగల సమర్థుడు. ఫిలిప్స్, చాప్మన్ మరోసారి కీలకం కానుండగా, వన్డే ఫామ్ను కొనసాగిస్తున్న మిచెల్ ఈ సారైనా జట్టును గెలిపించాలని పట్టుదలగా ఉన్నాడు. గాయంతో ఆల్రౌండర్ బ్రేస్వెల్ గత మ్యాచ్కు దూరం కావడం కివీస్ను బలహీనపర్చింది. అతను కోలుకొని ఈ సారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లలో క్లార్క్ను తప్పించి బ్రేస్వెల్ను ఆడించవచ్చు. ఇతర స్పిన్నర్లు సాంట్నర్, సోధి ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చూడాలి.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, పాండ్యా, దూబే, రింకూ సింగ్, అక్షర్/బిష్ణోయ్, అర్‡్షదీప్, వరుణ్, బుమ్రా. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), కాన్వే, రాబిన్సన్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, క్లార్క్/బ్రేస్వెల్, జేమీసన్, సోధి, డఫీ.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు బాగా అనుకూలమైన పిచ్. ఈ మైదానంలో రెండేళ్ల క్రితం జరిగిన ఏకైక టి20లో ఆ్రస్టేలియాపై భారత్ గెలిచింది. మంచు ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి ఛేదన సులువు. ఇటీవల భారత్పై వన్డేలో దక్షిణాఫ్రికా 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
సోఫీ డివైన్ ఆల్రౌండ్ ప్రదర్శన
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా మూడు పరాజయాల తర్వాత గుజరాత్ జెయింట్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆరు మ్యాచ్ల తర్వాత మూడో విజయంతో ఆ జట్టు ప్రస్తుతం రెండో స్థానానికి చేరింది. గురువారం జరిగిన పోరులో గుజరాత్ 45 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (42 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీ నమోదు చేసింది. అనంతరం యూపీ 17.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది.రాజేశ్వరి (3/16) ప్రత్యర్థిని పడగొట్టగా ... సోఫీ డివైన్, రేణుకా సింగ్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు డబ్ల్యూపీఎల్ మ్యాచ్లకు విరామం. శనివారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది.స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) నవ్గిరే (బి) ఎకెల్స్టోన్ 38; డానీ వ్యాట్ (బి) క్రాంతి 14; అనుష్క (సి) శ్వేత (బి) క్రాంతి 14; గార్డ్నర్ (బి) దీప్తి 5; సోఫీ డివైన్ (నాటౌట్) 50; భారతి (రనౌట్) 5; కనిక (సి) నవ్గిరే (బి) ట్రయాన్ 6; కాశ్వీ (బి) ఎకెల్స్టోన్ 11; రేణుక (రనౌట్) 1; హ్యాపీ కుమారి (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–23, 2–43, 3–65, 4–93, 5–105, 6–115, 7–131, 8–145. బౌలింగ్: క్రాంతి 4–0–18–2, శిఖ 4–0–53–0, దీప్తి 2–0–16–1, ఎకెల్స్టోన్ 4–0–22–2, ట్రయాన్ 4–0–32–1, శోభన 2–0–11–0. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) కాశ్వీ 14; నవ్గిరే (స్టంప్డ్) మూనీ (బి) రేణుక 0; లిచ్ఫీల్డ్ (సి) రేణుక (బి) గార్డ్నర్ 32; హర్లీన్ (సి) గార్డ్నర్ (బి) రేణుక 3; ట్రయాన్ (నాటౌట్) 30; దీప్తి (ఎల్బీ) (బి) రాజేశ్వరి 4; శ్వేత (స్టంప్డ్) మూనీ (బి) రాజేశ్వరి 3; శోభన (సి) గార్డ్నర్ (బి) రాజేశ్వరి 7; ఎకెల్స్టోన్ (సి అండ్ బి) డివైన్ 1; శిఖ (రనౌట్) 1; క్రాంతి (బి) డివైన్ 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–2, 2–39, 3–57, 4–59, 5–67, 6–79, 7–93, 8–94, 9–97, 10–108. బౌలింగ్: రేణుక 4–0–20–2, కాశ్వీ 3–0–31–1, డివైన్ 3.3–0–16–2, గార్డ్నర్ 3–0–23–1, రాజేశ్వరి 4–0–16–3. -
సర్ఫరాజ్, సిద్ధేశ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: సర్ఫరాజ్ ఖాన్ (142 బ్యాటింగ్; 11 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ (104; 10 ఫోర్లు, 2 సిక్స్లు) ‘శత’క్కొట్టారు. ఫలితంగా రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఓపెనర్లు అఖిల్ (27), ఆకాశ్ ఆనంద్ (35)లతో పాటు ముషీర్ ఖాన్ (11) విఫలమయ్యారు. 82/3తో కష్టాల్లో పడ్డ ముంబైను సిద్ధేశ్, సర్ఫరాజ్ ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 249 పరుగులు జత చేశారు. తొలి రోజు ఆట ముగుస్తుందనగా సిద్ధేశ్ అవుటయ్యాడు. హిమాన్షు (0 బ్యాటింగ్)తో కలిసి సర్ఫరాజ్ క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు రెండు వికెట్లు పడగొట్టగా... సిరాజ్, నితిన్ సాయి యాదవ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. -
సౌతాఫ్రికా జట్టులోకి డేంజరస్ ప్లేయర్లు
టీ20 వరల్డ్కప్-2026కు ముందు సౌతాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా గాయాల కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్ వరల్డ్కప్ జట్టులోకి వచ్చారు.ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. టోనీ డి జోర్జి విషయానికి వస్తే.. గతేడాది ఆఖరిలో భారత్తో జరిగిన వన్డే సిరీస్లో అతడికి కుడి కాలికి గాయమైంది. అతడు వరల్డ్కప్ సమయానికి కోలుకుంటాడని ప్రోటీస్ సెలక్టర్లు భావించారు. కానీ టోనీ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పడుతోంది. ఈ క్రమంలోనే అతడు పొట్టి ప్రపంచకప్నకు దూరమయ్యాడు. మరోవైపు సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో ఫెరీరా గాయపడ్డాడు. ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఫెరీరా(జోబర్గ్ సూపర్ కింగ్స్) భుజం ఎముక విరిగింది. దీంతో అతడు కూడా ఈ మెగా టోర్నీకి అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న రికెల్టన్, స్టబ్స్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.అదేవిధంగా ఈ మెగా టోర్నీ విధ్వంసకర ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. మిల్లర్ ప్రస్తుతం కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో వరల్డ్కప్ ముందు వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీస్కు మిల్లర్ దూరమయ్యాడు. అతడిస్ధానంలో రూబెన్ హెర్మన్కు చోటు ఇచ్చారు. టీ20 ప్రపంచకప్-2026కు సౌతాఫ్రికా జట్టుఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్.వెస్టిండీస్తో టీ20లకు ప్రోటీస్ జట్టుఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, హెర్మన్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్. -
ODI WC 2027: భారత వన్డే జట్టు.. ఊహించని పేరు!
టీమిండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో భారత్కు అతడు శుభారంభం అందించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్.1199 పరుగులుఈ మ్యాచ్లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా తరఫున ఇప్పటికి 34 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్రేటు 190.93 కావడం విశేషం.వరల్డ్కప్ -2027 జట్టులోనూ ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. వరల్డ్కప్ -2027 జట్టులోనూ అతడికి చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు.. ‘‘యాభై ఓవర్ల ప్రపంచకప్ టోర్నీ ఎంపిక సమయంలో అభిషేక్ శర్మ పేరు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అతడి కంటే ముందు వరుసలో ఉన్నారు.అయితే, ఒకవేళ అన్నీ కలిసి వచ్చి టీ20లలో మాదిరే వన్డే పవర్ప్లేలోనూ అభిషేక్ శర్మ సిక్సర్లు బాదితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా అభిషేక్ శర్మ ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు.రోహిత్- గిల్ జోడీఇక వన్డేల్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ప్రస్తుత సారథి శుబ్మన్ గిల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సన్నాహకంగా సాగుతున్న న్యూజిలాండ్తో సిరీస్లో అభిషేక్ శర్మ ఇదే జోరు కనబరిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.ఇక గత కొంతకాలంగా వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న భారత్ ఈసారి కూడా హాట్ ఫేవరెట్గా వరల్డ్కప్ బరిలో దిగుతోంది. కాగా 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
ICC: మా తుది నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ పంతం వీడలేదు. భారత్లో టీ20 ప్రపంచకప్-2026 ఆడే విషయమై తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని మరోసారి పునరుద్ఘాటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తమ విషయంలో న్యాయంగా వ్యవహరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపింది.శ్రీలంకకు మార్చాలని కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలు సాకుగా చూపుతూ.. బంగ్లాదేశ్ తమ ప్లేయర్లను భారత్కు పంపడానికి నిరాకరిస్తోంది. భారత్కు బదులు తమ మ్యాచ్ల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లాదేశ్ చెప్పినట్లు భారత్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది.కుండబద్దలు బద్దలు కొట్టిన ఐసీసీమరో 24 గంటల సమయం ఇస్తున్నామని.. ఒకవేళ వరల్డ్కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగానుకుంటే.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఆడిస్తామని ఐసీసీ కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో గురువారం బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందిస్తూ.. తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాడు.తాజా సమాచారం ప్రకారం.. భారత్లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్లు ఆడవద్దని బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లా జాతీయ జట్టు ఆటగాళ్లు, దేశ క్రీడా, యువజన శాఖ మంత్రి ఆసిఫ్ నజ్రుల్తో సమావేశం అనంతరం బోర్డు తమ వైఖరిని వెల్లడించింది.నమ్మకాన్ని కోల్పోవడం లేదుఈ మేరకు మీడియా సమావేశంలో నజ్రుల్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేందుకు మా క్రికెటర్లు ఎంతగానో కష్టపడ్డారు. అయితే, ఇండియాలో మా భద్రతపై అనుమానాలు అలాగే ఉన్నాయి. ఏవో కొన్ని పరిశీలన (ఐసీసీ)లు చేసి ముప్పు లేదనే నిర్ణయానికి రాకూడదు.ఇప్పటికీ మేము నమ్మకాన్ని కోల్పోవడం లేదు. టోర్నీకి మా జట్టు సిద్ధంగా ఉంది. ఐసీసీ మా అభ్యర్థనను మన్నించి.. న్యాయమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. మమ్మల్ని శ్రీలంకలో ఆడేందుకు అనుమతిస్తారని ఆశాభావంతో ఉన్నాము’’ అని పేర్కొన్నాడు.కచ్చితంగా ఐసీసీ వైఫల్యమేఇక బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ‘‘మేము ఐసీసీతో మరోసారి చర్చలు జరుపుతాము. వరల్డ్కప్లో ఆడాలని మాకు ఉంది. కానీ భారత్లో మాత్రం ఆడబోము. ఈ విషయంపై పోరాటం చేస్తాం. ఐసీసీ బోర్డు మీటింగ్లో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ తొలగింపు విషయం చిన్నదేమీ కాదు. మా మ్యాచ్ల విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం అన్నట్లుగా వ్యవహారం ఉంది. భారత్లో ఆడలేమని అంటే మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. క్రికెట్కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఒలింపిక్స్ వరకు ఈ క్రీడ వెళ్లింది. కానీ మేము మాత్రం ఇక్కడే ఉండిపోయాము. ఇది కచ్చితంగా ఐసీసీ వైఫల్యమే’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
శుబ్మన్ గిల్ ఫెయిల్.. జడ్డూ విఫలమైనా..
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ దేశవాళీ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ఇటీవల వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా పంజాబ్ తరఫున ఒక్క మ్యాచ్ ఆడాడు గిల్. అనంతరం న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో బిజీ అయ్యాడు.ఈ సిరీస్లో గిల్ సేన కివీస్ చేతిలో 2-1తో ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకుంది. ఇక కివీస్తో టీ20 సిరీస్, టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి సెలక్టర్లు గిల్ (Shubman Gill)ను తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్పై దృష్టి సారించిన అతడు.. పంజాబ్ కెప్టెన్గా రంజీ సెకండ్ లీగ్ బరిలో దిగాడు.పంజాబ్ తొలుత బౌలింగ్రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్రతో మ్యాచ్లో టాస్ ఓడిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది. హర్ప్రీత్ బ్రార్ (Harpreet Brar) ఆరు వికెట్లతో చెలరేగగా.. జసిందర్ సింగ్ రెండు, సన్వీర్ సింగ్, ప్రేరిత్ దత్తా చెరో వికెట్తో సత్తా చాటారు. ఫలితంగా సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే ఆలౌట్ అయింది.జడ్డూ విఫలంసౌరాష్ట్ర ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ జై గోహిల్ 82 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. ప్రేరక్ మన్కడ్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (7) సహా మిగిలిన వారంతా విఫలమయ్యారు.ఈ క్రమంలో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే పంజాబ్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. సౌరాష్ట్ర పేసర్, కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ దెబ్బకు పంజాబ్ ఓపెనర్ హర్నూర్ సింగ్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.అయితే, మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (44) నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా అతడితో పాటు.. వన్డౌన్ బ్యాటర్ ఉదయ్ సహారన్ (23)ను ధర్మేంద్రసిన్హ జడేజా పెవిలియన్కు పంపాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ నేహాల్ వధేరా (6)ను పార్థ్ భూట్ అవుట్ చేశాడు.గిల్ డకౌట్ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గిల్ను సైతం పార్థ్ వెనక్కి పంపాడు. అతడి బౌలింగ్లో రెండు బంతులు ఎదుర్కొన్న గిల్ లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా పెవిలియన్ చేరాడు. ఇలా రీఎంట్రీలో గిల్కు చేదు అనుభవమే మిగిలింది. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా.. పంజాబ్ తరఫున గిల్ బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్పై ఆసక్తి నెలకొనగా ఇద్దరూ నిరాశపరచడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.పంజాబ్ ఆలౌట్.. సౌరాష్ట్రకుకు ఆధిక్యంకాగా పంజాబ్ తరఫున ప్రభ్సిమ్రన్ (44), అన్మోల్ప్రీత్ సింగ్ (35) రాణించారు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 139 పరుగులకే ఆలౌట్ అయింది. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ ఐదు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా, ధర్మేంద్రసిన్హ జడేజా చెరో రెండు.. ఉనాద్కట్ ఒక వికెట్ తమ ఖాతాలో జమచేసుకున్నారు. బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా సౌరాష్ట్రకు 33 పరుగుల ఆధిక్యం లభించింది. బ్యాటింగ్లో నిరాశపరిచిన జడ్డూ బౌలింగ్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!During today’s Ranji match, Shubman Gill was actually not out. It was clearly bat first, but since there is no DRS in domestic matches, he was given out. BCCI, if you can’t provide DRS or even a proper live stream, then don’t conduct tournaments like this. pic.twitter.com/0LEZFFANgd— MARCUS (@MARCUS907935) January 22, 2026 -
ప్రధాని తర్వాత కష్టమైన జాబ్ చేస్తున్నాడు
టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ను ఏకీపారేస్తుంటే.. కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు, తిరువనతంపురం ఎంపీ శశిథరూర్ మాత్రం ప్రశంసలు కురిపించారు. దేశంలో రెండో కష్టతర కొలువు చేస్తూ కూడా గంభీర్ ఎంతో నిబ్బరంగా ఉన్నారంటూ కితాబిచ్చారు. నాగ్పూర్లో బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టి20 మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతకుముందుకు గంభీర్తో ఆయన భేటీ అయ్యారు. దీని గురించి 'ఎక్స్'లో పోస్ట్ చేసి, తమ ఫొటోను షేర్ చేశారు.''నాగ్పూర్లో నా పాత స్నేహితుడు గౌతమ్ గంభీర్తో జరిగిన చర్చను ఆస్వాదించాను. ప్రధానమంత్రి తర్వాత భారతదేశంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆయనే! ప్రతిరోజూ లక్షలాది మంది తనను విమర్శిస్తున్నా ప్రశాంతంగా పనిచేసుకుపోతూ, ధైర్యంగా ముందుకెళుతున్నారు. గంభీర్ నిశ్శబ్ద సంకల్పం, సమర్థ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాను. ఈరోజు నుండి ఆయనకు అన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నాన''ని ఎక్స్లో రాసుకొచ్చారు. శశిథరూర్ ట్వీట్కు ధన్యవాదాలు అంటూ గంభీర్ సమాధానం ఇచ్చారు.కివీస్ రన్స్ కంటే నా సెల్పీలే ఎక్కువతన నాగ్పూర్లో పర్యటనలో భాగంగా ఆంత్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్(ఈవో) నిర్వహించిన కార్యక్రమంలో శశిథరూర్ పాల్గొన్నారు. బుధవారం రాత్రి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ టి20 మ్యాచ్ను ఆయన వీక్షించారు. క్రికెట్ ప్రేమికుల కోలాహలం నడుమ మ్యాచ్ చూడడం ఎంతో బాగుందని పేర్కొంటూ.. తన ఫొటోలను 'ఎక్స్'లో షేర్ చేశారు. టీమిండియా-కివీస్ మ్యాచ్ చూడడంతో తన నాగ్పూర్ పర్యటన పూర్తయిందన్నారు. న్యూజిలాండ్ చేసిన పరుగుల కంటే తాను ఎక్కువ సెల్ఫీలు ఇచ్చానని చమత్కరించారు. టీమిండియా (Team India) విజయాన్ని పూర్తిగా ఆస్వాదించానని పేర్కొన్నారు.చదవండి: బెంగళూరు ఎన్నికలు.. రంగంలోకి బీజేపీ కీలక నేతకాగా, శశిథరూర్ కొంతకాలంగా సొంత పార్టీతో అంటిముట్టన్నట్టుగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించి హస్తం పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టారు. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ అయిన గంభీర్ను కలవడంతో పాటు ఆయనను పొడగ్తలతో ముంచెత్తారు. గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాతే టీమిండియా ఎన్నడూ చవిచూడని పరాజయాలు పొందిందని అందరూ విమర్శిస్తుంటే.. థరూర్ మాత్రం ఆయనను వెనుకేసుకురావడం గమనార్హం. వీరిద్దరి భేటీపై కాంగ్రెస్ నాయకులు ఇంకా స్పందించలేదు. In Nagpur, enjoyed a good &frank discussion with my old friend @GautamGambhir, the man with the hardest job in India after the PM’s! He is being second-guessed by millions daily but stays calm &walks on undaunted. A word of appreciation for his quiet determination and able… pic.twitter.com/LOHPygVV0E— Shashi Tharoor (@ShashiTharoor) January 21, 2026 -
BCCI: మీ సమస్య ఏంటి?: సుప్రీంకోర్టు ఆగ్రహం
భారత క్రికెట్ జట్టును టీమిండియా అని పిలవొద్దంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో పిటిషనర్కు ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. హైకోర్టు కఠినమైన చర్యలు తీసుకోకుండా వదిలేసినందునే పిటిషనర్ ఇక్కడి వరకు వచ్చే సాహసం చేశారని మండిపడింది.పూర్వాపరాలు ఇవేప్రైవేట్ సంస్థ అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసే జట్టును టీమిండియా, జాతీయ జట్టు అని పిలవకూడదని రీపక్ కన్సాల్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు దేశం పేరు వాడుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు.టీమిండియా అనకూడదుప్రసార్ భారతి తన కార్యక్రమాల్లో క్రికెట్ జట్టును టీమిండియా అని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రీపక్ కన్సాల్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. విశ్వవేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు టీమిండియా లేదంటే భారత జట్టు అని ఎందుకు పిలవకూడదని ప్రశ్నించింది.దేశం పేరు, జాతీయ చిహ్నాల వాడకం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని మందలించింది. అయితే, సదరు పిటిషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్కు గట్టిగానే అక్షింతలు వేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది.మీ సమస్య ఏమిటి?ఈ సందర్భంగా.. ‘‘మీరు ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లు డ్రాఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇందులో (టీమిండియా) మీకు సమస్య ఏమిటి? జాతీయ క్రీడా ట్రిబ్యునల్లో అద్భుతమైన సభ్యులు ఉన్నారు. ఇలాంటి విషయాల కోసం కోర్టుపై భారం మోపకండి’’ అని సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు ఈ విషయంలో తప్పు చేసింది అదే విధంగా.. ‘‘మీ విషయంలో హైకోర్టు తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఇలా కోర్టు సమయం వృథా చేస్తున్నందుకు మీకు జరిమానా వేయాల్సింది. అలా చేయకుండా హైకోర్టు తప్పు చేసింది. అందుకే మీరు ఇలాంటి పనికిరాని పిటిషన్లతో సుప్రీం కోర్టు వరకు వచ్చారు’’ అని సీజేఐ మండిపడ్డారు.ఈ క్రమంలో ధర్మాసనం సదరు పిటిషనర్ను రూ. 10 లక్షలు కట్టాల్సిందిగా ఆదేశించగా.. తన క్లైంట్ పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని న్యాయవాది కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
చరిత్ర సృష్టించిన పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు ఇండోనేషియా మాస్టర్స్-2026 టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ ఫో లినే హోజ్మార్క్ జేర్ఫీల్డ్ను 21-19, 21-18 తేడాతో ఓడించింది. నలభై మూడు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధు పైచేయి సాధించి.. క్వార్టర్ ఫైనల్కు దూసుకువెళ్లింది.500వ విజయంఈ క్రమంలోనే పీవీ సింధు అరుదైన మైలురాయికి చేరుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా తన కెరీర్లో 500వ విజయాన్ని ఆమె నమోదు చేసింది. తద్వారా మహిళల సింగిల్స్లో ఈ ఘనత సాధించిన భారత తొలి షట్లర్గా చరిత్ర సృష్టించిన సింధు.. ఓవరాల్గా ఆరో బ్యాడ్మింటన్ ప్లేయర్గా నిలిచింది.ఇక ఇండోనేషియా మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్లో 13వ ర్యాంకర్ అయిన సింధు.. వరల్డ్ నంబర్ 4, చైనాకు చెందిన చెన్ యూ ఫీ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోనుంది. వీరిద్దరు ఇప్పటి వరకు పదమూడు సార్లు ముఖాముఖి తలపడగా 7-6తో చెన్ ఆధిక్యంలో ఉంది. చివరగా 2019లో చెన్ను సింధు ఓడించింది.లక్ష్య సేన్ సైతంమరోవైపు.. లక్ష్య సేన్ సైతం ఇండోనేషియా మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్కు చేరాడు. అరగంటకు పైగా సాగిన పోరులో హాంకాంగ్ షట్లర్ జేసన్ గునావన్పై 21-20, 21-11 తేడాతో గెలిచి లక్ష్య సేన్ ముందుడుగు వేశాడు. -
అతడికి ఎక్కడున్నా అదే ఆలోచన.. సంతోషంగా ఉంది: సూర్య
న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. నాగ్పూర్ వేదికగా తొలి టీ20లో 48 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంలో కీలక పాత్ర భారత ఓపెనర్ అభిషేక్ శర్మదే.అతిపెద్ద సానుకూలాంశంఇక అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్కు తోడు.. బౌలర్లు కూడా రాణించడంతో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘తొలుత బ్యాటింగ్ చేయడం మాకు ఎల్లప్పుడూ సంతోషమే.మంచు ప్రభావం కూడా ఉంది. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మాకు అతిపెద్ద సానుకూలాంశం అదే. పవర్ ప్లేలో వికెట్లు (25-2) కోల్పోయినా మేము పుంజుకున్న తీరు అద్భుతం. 15 ఓవర్ వరకు మా ఆట కొనసాగుతూనే ఉంది. ఎక్కడా మాకు అలుపు రాలేదు. మా జట్టు చాలా బాగా ఆడింది.సరైన సమయంలో క్రీజులోకివ్యక్తిగతంగా నా బ్యాటింగ్ పట్ల కూడా తృప్తిగానే ఉంది. సరైన సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. నెట్స్లో నేను చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మైదానంలోనూ అదే పునరావృతం చేశాను. గత 2-3 వారాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నా. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది.ఎక్కడున్నా అదే ఆలోచనఇక అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్ కోసం అతడు సన్నద్ధమయ్యే తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హోటల్లో.. టీమ్ బస్లో.. ఇలా ఎక్కడ ఉన్నా సరే తన గ్లేమ్ ప్లాన్ గురించే ఆలోచిస్తాడు. చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారిస్తాడు. అందుకు తగ్గ ఫలాలను అతడు పొందుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాము’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించాడు.238 పరుగులుకాగా నాగ్పూర్లో బుధవారం నాటి తొలి టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 238 పరుగులు చేసింది. అయితే, కివీస్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.ఇక ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది 32 పరుగులు చేయగలిగాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది’ మ్యాచ్ అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ (35 బంతుల్లో 84)తో దుమ్ములేపాడు. భారత్- కివీస్ మధ్య శుక్రవారం జరిగే రెండో టీ20 మ్యాచ్కు రాయ్పూర్ వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డుA thumping win! 👏🏻🇮🇳Shivam Dube finishes off the proceedings & after putting up a mammoth total, Team India bowlers combine to restrict the Kiwi batters to go 1-0 up! 👌🏻Watch #INDvNZ | 2nd T20I 👉 FRI, 23rd JAN, 6 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/WTK7BuF1Nv— Star Sports (@StarSportsIndia) January 21, 2026 -
ఆమెకు బ్రేకప్ చెప్పిన టీమిండియా స్టార్!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ మరోసారి వార్తల్లోకెక్కాడు. అతడి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్వశ్తో చహల్కు విభేదాలు తలెత్తాయనేది ఆ వార్తల సారాంశం. కొరియోగ్రాఫర్, యూట్యూబర్ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చహల్.అయితే, వివాహమైన కొన్ని నెలలకే తమ మధ్య గొడవలు జరిగాయని.. విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించినట్లు కోర్టును ఆశ్రయించింది ఈ జంట. గతేడాది అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి.ఆర్జేతో చెట్టాపట్టాల్కానీ అంతకంటే ముందు నుంచే చహల్.. ఆర్జే మహ్వశ్ (RJ Mahvash)తో కలిసి చక్కర్లు కొడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా ఆమెతో కలిసి మ్యాచ్ను వీక్షిస్తున్న ఫొటోలు షేర్ చేసి తమ మధ్య స్నేహ బంధం ఉందని చహల్ స్పష్టం చేశాడు.కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. ఈ ఘటన తర్వాత కొన్నాళ్లకే చహల్- ధనశ్రీలకు విడాకులు మంజూరు కావడంతో.. అప్పటిదాకా ధనశ్రీని తిట్టినవారంతా ఆర్జే మహ్వశ్పై దృష్టి సారించారు. చహల్ కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. భార్యభర్తల మధ్య దూరి విడాకులకు కారణమైందని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.మరోవైపు.. చహల్కు మద్దతుగా పరోక్షంగా ధనశ్రీని టార్గెట్ చేస్తూ మహ్వశ్ సైతం పోస్టులు పెట్టింది. దీంతో నెటిజన్లు మరోసారి ‘‘హోం బ్రేకర్’’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల చహల్ ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు వదంతులు వ్యాప్తి చేస్తారు.ఏడుస్తూ కూర్చోలేము కదా!అంతమాత్రాన మేము ఏడుస్తూ కూర్చోలేము కదా!.. జనాలు ఏమనుకుంటున్నారో అదే అనుకోనివ్వండి. మాకేం తేడా ఉండదు. మా కాపురాన్ని కూల్చిందని ఆమెను ఆడిపోసుకున్నారు. ఇంకా ఎన్నెన్నో మాటలు అన్నారు. ఓ మహిళను ఎన్ని రకాలుగా కించపరచవచ్చో అన్ని రకాలుగా మాట్లాడారు.యుజీ ఆమెతో ఎందుకు ఉన్నాడని చాలా మంది అన్నారు. కష్టకాలంలో నాకు సహాయంగా నిలబడ్డ నా స్నేహితురాలిని అలా నిందించడం నాకు బాధ కలిగించింది. ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్లినా మా ఫొటోలు మాత్రమే క్రాప్ చేసి రూమర్స్ వ్యాప్తి చేశారు. అందుకే కలిసి బయటకు వెళ్లడం కూడా మానేశాము’’ అని చెప్పుకొచ్చాడు.ఒకరినొకరు అన్ఫాలోమరోవైపు.. ఆర్జే మహ్వశ్ సైతం అబ్బాయితో కలిసి బయటకు వెళ్తే చాలు డేటింగ్ అంటున్నారని.. అసలు మనం ఏ కాలంలో ఉన్నామంటూ మండిపడింది. పరోక్షంగా చహల్తో తనకు స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అయితే, తాజాగా వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం గమనార్హం.నేను ఎవరినీ నమ్మనుదీంతో చహల్- మహ్వశ్ మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చహల్ ఇన్స్టా స్టోరీలో.. ‘‘నేను ఎవరినీ నమ్మను’’ అని పోస్ట్ పెట్టడం ఇందుకు బలమిచ్చింది. మరో స్టోరీలో ‘‘బాధ, ఆశల వలయంలో చిక్కుకుపోకుండా.. బంధాల్లో మునిగిపోకుండా.. కోపం, భయాన్ని వదిలేసి ముందుకు సాగేవాడే తెలివైన మనిషి’’ అన్న భవద్గీత పంక్తులను కూడా చహల్ షేర్ చేయడం విశేషం.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి! -
ఫ్రాంఛైజీ యజమానిగా గ్లెన్ మాక్స్వెల్
టీ20 క్రికెట్లో పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్న దేశవాళీ లీగ్లలో మరో కొత్త టోర్నీ చేరింది. ‘యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్’ (ఈటీపీఎల్) పేరుతో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ‘రూల్స్ గ్లోబల్’ అనే సంస్థతో కలిసి ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఈ లీగ్ను నిర్వహిస్తుంది.అభిషేక్ బచ్చన్ సైతంప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్తో పాటు పలువురు ఇతర వ్యాపారవేత్తలు ‘రూల్స్ గ్లోబల్’లో భాగస్వాములుగా ఉన్నారు. లీగ్కు సంబంధించి ఇప్పటికే మూడు జట్ల కొనుగోలు పూర్తయింది. దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా ఆమ్స్టర్డామ్ ఫ్రాంచైజీకి యజమాని కాగా... మూడు ఒలింపిక్ పతకాలు, రెండుసార్లు ప్రపంచకప్లు గెలిచిన జట్లలో సభ్యుడైన ఆ్రస్టేలియా హాకీ దిగ్గజం జేమీ డ్వేయర్ కూడా స్టీవ్వాతో పాటు సహ యజమానిగా ఈ జట్టుతో చేతులు కలపడం విశేషం.యజమానిగా గ్లెన్ మ్యాక్స్వెల్ఇక ఎడిన్బర్గ్ టీమ్ను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్లు నాథన్ మెకల్లమ్, కైల్ మిల్స్ కలిసి సొంతం చేసుకున్నారు. బెల్ఫాస్ట్ టీమ్కు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో లీగ్ జరుగుతుంది. ఇటీవలి కాలంలో యూరోప్లో కూడా క్రికెట్ బాగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో ఈటీపీఎల్ విజయవంతం అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డు -
ఎన్నికల ప్రకటన తర్వాతే... ఐపీఎల్ షెడ్యూల్: రాజీవ్ శుక్లా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-19వ సీజన్ షెడ్యూల్కు కసరత్తులు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్ జరగనుండగా... దానికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాతేఈ వేసవిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ప్రభుత్వం ఎన్నికల తేదీలు ఖరారు చేసిన అనంతరం షెడ్యూల్ రూపొందించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎదురుచూస్తోంది.పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యమవుతోందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) వెల్లడించారు. రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీలు ఈ వారంలోనే తమ ‘హోం గ్రౌండ్’ను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.అపుడే షెడ్యూల్ విడుదల‘ఐపీఎల్ షెడ్యూల్ రూపొందించే పనిలో ఉన్నాం. అయితే ఎన్నికల తేదీలపై ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నాం. అది విడుదలైన వెంటనే షెడ్యూల్ ప్రకటిస్తాం. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆ ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా మ్యాచ్లు నిర్వహిస్తాం. బెంగళూరు, రాజస్తాన్ జట్లకు తమ ‘హోమ్ గ్రౌండ్’ను నిర్ణయించుకునే అవకాశం ఇస్తున్నాం. వీలైనంత త్వరగా వివరాలు అందిస్తే... దానికి తగ్గట్లు మ్యాచ్లను షెడ్యూల్ చేస్తాం’ అని రాజీవ్ శుక్లా తెలిపారు. చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డు -
షాకిచ్చిన ఐసీసీ.. స్పందించిన బంగ్లాదేశ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందించాడు. ఏదో ఒక అద్భుతం జరిగి ఐసీసీ తమ పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదే సమయంలో మరోసారి భారత్ గురించి అవాకులు చెవాకులు పేలాడు.కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్-2026లో తమ మ్యాచ్లు ఆడేందుకు భారత్కు రాబోమని బంగ్లా బోర్డు (BCB) ఐసీసీకి తెలిపింది. తమ వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి చేసింది.ఆడితే ఆడండి.. లేకపోతే పొండిఈ విషయంపై చర్చించిన ఐసీసీ బుధవారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. భారత్ నుంచి మ్యాచ్లను తరలించడం సాధ్యం కాదని... వరల్డ్ కప్లో ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్ తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం గురువారం నాటికి తుది గడువు విధించింది.ఒకవేళ బంగ్లాదేశ్ తమ పంతం వీడకపోతే ఆ జట్టును వరల్డ్ కప్ నుంచి తప్పిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ ర్యాంకింగ్స్లో తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ జట్టును బంగ్లాదేశ్ స్థానంలో ఆడించాలని కూడా ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో దీనికి మద్దతుగా అత్యధిక డైరెక్టర్లు ఓటు వేశారు.ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు బీసీసీఐ తరఫున దేవజిత్ సైకియా ఇందులో పాల్గొన్నారు. 15 మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరు కాగా, ఒక్క పాకిస్తాన్ మాత్రమే బంగ్లాదేశ్కు అండగా నిలిచింది. ఇప్పటికే బంగ్లా డిమాండ్కు మద్దతు ప్రకటించిన పాకిస్తాన్ తమ దేశంలో ఆ జట్టు మ్యాచ్లను నిర్వహిస్తామని కూడా ప్రతిపాదించింది.ఎలాంటి ప్రమాదం లేదు..అయితే ఇవన్నీ సాధ్యం కాదని ఐసీసీ కొట్టిపారేసింది. ‘భద్రతాపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. భారత్లోని ఏ వేదికపైన కూడా బంగ్లాదేశ్ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ఇతర అధికారులకు ఎలాంటి ప్రమాదం లేదు.టోర్నీ చేరువైన సమయంలో షెడ్యూల్ మార్పు ఏమాత్రం సాధ్యం కాదు. భద్రతా పరమైన కారణం అంటూ ఈసారి అలా చేస్తే ఇది చెడు సాంప్రదాయానికి దారి తీస్తూ ఐసీసీ ఈవెంట్లకు చెడ్డపేరు వస్తుంది. బంగ్లా బోర్డుకు ఇప్పటికే ఇవన్నీ పూర్తిగా వివరించాం.అయితే ఎంత చెప్పినా వరల్డ్ కప్తో ఏమాత్రం సంబంధం లేని ఒక దేశవాళీ లీగ్లో జరిగిన ఘటనను చూపిస్తూ బంగ్లా తమ డిమాండ్ను కొనసాగించింది. ఎన్నో అంశాలను బట్టి వరల్డ్ కప్ మ్యాచ్ల షెడ్యూల్, వేదికలు ప్రకటిస్తాం. ఇప్పుడు ఎలాంటి మార్పులూ చేయలేం’ అని ఐసీసీ తమ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇండియా మాకు భద్రం కాదుఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందిస్తూ.. ‘‘మా ప్రభుత్వంతో చర్చించేందుకు నాకు కొంత గడువు కావాలని ఐసీసీ బోర్డును అడిగాను. చివరి అవకాశం ఇమ్మని కోరాను. ఇది సరైనదేనని వారు భావించారు. 24 నుంచి 48 గంటలలోపు మా నిర్ణయం చెప్పాలన్నారు.అయితే, ఈ విషయంలో నేను మా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టదలచుకోలేదు. ఏదేమైనా ఇండియా మాకు భద్రమైన దేశం కాదు. శ్రీలంకలో మ్యాచ్లు ఆడేందుకే మేము కట్టుబడి ఉన్నాము. ఐసీసీ మా అభ్యర్థనను తిరస్కరించిందని తెలుసు.అద్భుతం జరుగుతుందిప్రభుత్వంతో చర్చించిన తర్వాతే మా తుది నిర్ణయం వెల్లడిస్తాం. ఐసీసీ మా విషయంలో అద్భుతం చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్ టోర్నీలో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు!.. బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా ఐసీసీ ఈవెంట్లో ఆడాలని కోరుకుంటున్నారు.బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా బంగ్లా క్రికెట్ జట్టు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనాలని ఆశిస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు భారత్ మా ఆటగాళ్లకు సురక్షిత ప్రదేశం కాదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అంటూ ఓవైపు వరల్డ్కప్ టోర్నీలో ఆడాలనే కోరిక ఉందంటూనే.. మరోవైపు భారత్ గురించి అతిగా మాట్లాడాడు. కాగా అంతకుముందు తమ అభ్యర్థనను తిరస్కరిస్తే వరల్డ్కప్ బహిష్కరిస్తామంటూ బంగ్లా హెచ్చులకు పోయింది. ఇప్పుడు మాత్రం తమకు ఆడాలని ఉందంటూ తమదంతా మేకపోతు గాంభీర్యమేనని నిరూపించుకుంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికలుగా ప్రపంచకప్-2026 టోర్నీ జరుగనుంది. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్ -
అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర లిఖించాడు. న్యూజిలాండ్తో తొలి టీ20లో కేవలం 22 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని.. కివీస్ మీద ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.అదే విధంగా.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్ స్టార్ ఫిల్ సాల్ట్ (Phil Salt) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అభిషేక్ శర్మ ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- న్యూజిలాండ్ (IND vs NZ 1st T20I) బుధవారం తొలి టీ20లో తలపడ్డాయి.నాగ్పూర్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson- 10), టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (8) పూర్తిగా నిరాశపరిచారు.ఆకాశమే హద్దుఅయితే మరో ఓపెనర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 84 పరుగులు సాధించాడు. ఇష్ సోధి బౌలింగ్లో జెమీషన్కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్కు తెరపడింది.మిగతా వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 238 పరుగులు సాధించింది.కివీస్ ఓటమిభారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు ఫిఫ్టీలు బాదిన క్రికెటర్లు వీరే🏏అభిషేక్ శర్మ- ఎనిమిది సార్లు🏏ఫిల్ సాల్ట్- ఏడుసార్లు🏏సూర్యకుమార్ యాదవ్- ఏడుసార్లు🏏ఎవిన్ లూయీస్- ఏడుసార్లు.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్ You keep on counting, he keeps on hitting! 🤩😍𝗠𝗿. 𝗠𝗔𝗫𝗜𝗠𝗨𝗠, Abhishek Sharma, is taking bowlers to the cleaners as he smashes his 5th SIX of the innings! 🔥👏🏻#INDvNZ | 1st T20I | LIVE NOW 👉 https://t.co/o7KbRwpZwK pic.twitter.com/1MyyCmbcP6— Star Sports (@StarSportsIndia) January 21, 2026 -
కోల్కతా నైట్రైడర్స్ ఫీల్డింగ్ కోచ్గా యాజ్ఞిక్
కోల్కతా: వికెట్ కీపర్ బ్యాటర్ దిశాంత్ యాజ్ఞిక్ను ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఫీల్డింగ్ కోచ్గా నియమించుకుంది. దేశవాళీలతో పాటు... ఐపీఎల్ అనుభవం ఉన్న ఈ రాజస్తాన్ ప్లేయర్ రాకతో తమ శిక్షణ బృందం బలం మరింత పెరుగుతుందని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోంది. ‘యాజ్ఞిక్కు అపార అనుభవం ఉంది. అది జట్టుకు ఉపకరించనుంది. ఈసారి ఐపీఎల్కు కొత్త సపోర్టింగ్ స్టాఫ్తో బరిలోకి దిగనున్నాం. హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్, మెంటార్గా డ్వేన్ బ్రావో, అసిస్టెంట్ కోచ్గా షేన్ వాట్సన్, బౌలింగ్ కోచ్గా టిమ్ సౌతీ, పవర్ కోచ్గా ఆండ్రీ రసెల్ వ్యవరిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో యాజ్ఞిక్ చేరుతున్నాడు. అతడి కోచింగ్ జర్నీలో ఇది ప్రత్యేకంగా నిలవడం ఖాయం’ అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీల్లో రాజస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యాజ్ఞిక్... 2011 నుంచి 2014 మధ్య 25 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం వివిధ జట్లకు శిక్షణనిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది. -
టీమిండియాకు భారీ షాక్
టీ20 ప్రపంచకప్ టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే వాషింగ్టన్ సందర్, తిలక్ వర్మ గాయాల బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేరాడు. నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో అక్షర్ గాయపడ్డాడు.కివీస్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్లో మూడో బంతిని డారిల్ మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే బంతిని ఆపే క్రమంలో అక్షర్ చేతి వేలికి గాయమైంది. బంతి బలంగా తగలడంతో అక్షర్ ఎడమ చేతి చూపుడు వేలు చిట్లి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.మిగిలిన ఓవర్ను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు. అతడి గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అక్షర్ గాయం తీవ్రమైనది కానట్లుగా తెలుస్తోంది. వేలు పైన మాత్రమే చిట్లడం వల్ల రక్త స్రవమైందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ శుక్రవారం జరగనున్న రెండో టీ20కు మాత్రం అక్షర్ దూరమయ్యే అవకాశముంది.ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. న్యూజిలాండ్పై 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అభిషేక్ శర్మ 84 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రింకూ సింగ్(44) రాణించాడు. అనంతరం కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: అటు గిల్... ఇటు జడేజా -
అటు గిల్... ఇటు జడేజా
రాజ్కోట్: రెండు నెలల విరామం అనంతరం దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఒకవైపు భారత జట్టు న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుండగా... ఈ ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని టాప్ ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీలో తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్... పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తుండగా... సిరాజ్ హైదరాబాద్ జట్టును నడిపించనున్నాడు. వీరితో పాటు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి ఇలా పలువురు టీమిండియా ప్లేయర్లు ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. నవంబర్ రెండో వారంలో చివరగా రంజీ మ్యాచ్లు జరగగా... రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. రంజీ ట్రోఫీకి విరామం ఇచ్చిన సమయంలో ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ జరిగాయి. గ్రూప్ ‘ఎ’లో భాగంగా మాజీ విజేత విదర్భతో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్కు అనంతపురం వేదిక కానుంది. తొలి అంచె పోటీల్లో 5 మ్యాచ్లాడిన ఆంధ్ర జట్టు 3 విజయాలు, 2 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. విదర్భ 25 పాయింట్లతో ‘టాప్’లో కొనసాగుతోంది. మొత్తం 32 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించగా... ఇప్పటి వరకు ఒక్కో జట్లు ఐదేసి మ్యాచ్లు ఆడాయి. ఇక లీగ్ దశలో రెండేసి మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా... ఒక్కో గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర, విదర్భ పోరు మరింత ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్తో చివరి వన్డేలో హాఫ్సెంచరీతో ఆకట్టుకున్న పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. శ్రీకర్ భరత్, రికీ భుయ్, షేక్ రషీద్లతో ఆంధ్ర జట్టు బలంగా ఉండగా... విదర్భ జట్టు ఇటీవలే విజయ్ హజారే వన్డే ట్రోఫీ నెగ్గి ఫుల్ జోష్లో ఉంది. సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వన్డే సిరీస్ కోల్పోగా... ఆ వెంటనే శుబ్మన్ గిల్ పంజాబ్ జట్టుతో చేరాడు. నేటి నుంచి సౌరాష్ట్రతో జరగనున్న గ్రూప్ ‘బి’ మ్యాచ్లో గిల్ పంజాబ్ జట్టును నడిపించనున్నాడు. మరోవైపు సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్, బెంగాల్ తరఫున మొహమ్మద్ షమీ కూడా మ్యాచ్లకు సిద్ధమయ్యారు. -
శ్రమించి గెలిచిన శ్రీకాంత్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన కిడాంబి శ్రీకాంత్, ప్రస్తుత భారత నంబర్వన్ లక్ష్య సేన్ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించగా... హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి, ఆయుశ్ శెట్టి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ప్రపంచ 24వ ర్యాంకర్ కోకి వతనాబె (జపాన్)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 33వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–15, 21–23, 24–22తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నిర్ణాయక మూడో గేమ్లో 20–21 స్కోరు వద్ద శ్రీకాంత్ ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే సంయమనం కోల్పోకుండా ఆడిన శ్రీకాంత్ స్కోరును 21–21తో సమం చేశాడు. ఆ తర్వాత మళ్లీ స్కోరు 22–22తో సమమైంది. ఈ దశలో శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 24–22తో గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్ను సాధించలేకపోయాడు. మరో మ్యాచ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 68 నిమిషాల్లో 21–13, 16–21, 21–14తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రణయ్ 19–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, కిరణ్ జార్జి 17–21, 14–21తో మో జకి ఉబైదుల్లా (ఇండోనేసియా) చేతిలో, ఆయుశ్ శెట్టి 8–21, 13–21తో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. సింధు శుభారంభం మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకోగా... తన్వీ శర్మ, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. తొలి రౌండ్లో సింధు 53 నిమిషాల్లో 22–20, 21–18తో మనామి సిజు (జపాన్)పై, అన్మోల్ 21–16, 21–17తో పాయ్ యి పో (చైనీస్ తైపీ)పై గెలుపొందారు. తన్వీ శర్మ 21–18, 18–21, 16–21తో టొమోకా మియజకి (జపాన్) చేతిలో, మాళవిక 21–23, 12–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో, ఆకర్షి 21–8, 20–22, 17–21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యారు. రుత్విక జోడీ ఓటమి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్)... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే ఓడిపోయాయి. రుత్విక–రోహన్ ద్వయం 9–21, 20–22తో థోమ్ గికెల్–డెల్ఫిన్ డెల్ర్యూ (ఫ్రాన్స్) జంట చేతిలో... తనీషా–ధ్రువ్ జంట 23–21, 20–22, 6–21తో జూలియన్ మాయో–లీ పలెర్మో (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓటమి చవిచూశాయి. -
అల్కరాజ్ ముందంజ...
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ అల్కరాజ్ 7–6 (7/4), 6–3, 6–2తో యానిక్ హాంఫ్మన్ (జర్మనీ)పై గెలిచాడు. 2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో స్పెయిన్ స్టార్ 12 ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తొలి సర్వీస్లో 71 పాయింట్లకు 49... రెండో సర్వీస్లో 40 పాయింట్లకు 24 సాధించాడు. 41 విన్నర్స్ కొట్టిన అతను 30 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇప్పటికే ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన అల్కరాజ్... ఆ్రస్టేలియన్ ఓపెన్ కూడా సాధిస్తే ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకుంటాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా), పదో సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్), 11వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా), 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్లో జ్వెరెవ్ 6–3, 4–6, 6–3, 6–4తో అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్)పై, డిమినార్ 6–7 (5/7), 6–2, 6–2, 6–1తో హమాద్ మెజెదోవిచ్ (సెర్బియా)పై, బుబ్లిక్ 7–5, 6–4, 7–5తో ఫుచువోచిస్ (హంగేరి)పై, మెద్వెదెవ్ 6–7 (9/11), 6–3, 6–4, 6–2తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)పై, రుబ్లెవ్ 6–4, 6–3, 4–6, 7–5తో క్వాలిఫయర్ జేమీ ఫారియా (పోర్చుగల్)పై విజయం సాధించారు.ఇతర మ్యాచ్ల్లో 14వ సీడ్ డేవిడోవిచ్ ఫోకినా (స్పెయిన్) 6–3, 7–6 (7/3), 5–7, 4–6, 6–4తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై, 19వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–3, 6–4, 6–2తో టిరాన్టి (అర్జెంటీనా)పై నెగ్గారు. సబలెంకా సాఫీగా... మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు చాంపియన్, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లో బెర్త్ను ఖరారు చేసుకుంది. 72 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో సబలెంకా 6–3, 6–1తో జావోజువాన్ బాయ్ (చైనా)పై గెలిచింది. మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ), ఎనిమిదో సీడ్ మిరా ఆంద్రీవా (రష్యా), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో కోకో గాఫ్ 6–2, 6–2తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా)పై, పావోలిని 6–2, 6–3తో మగ్ధలీనా ఫ్రీచ్ (పోలాండ్)పై, మిరా ఆంద్రీవా 6–0, 6–4తో మరియా సాకరి (గ్రీస్)పై, స్వితోలినా 7–5, 6–1తో లిండా క్లిమోవికోవా (పోలాండ్)పై గెలుపొందారు. -
యూకీ జోడీ శుభారంభం
ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత నంబర్వన్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మెల్బోర్న్లో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో పదో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం 6–3, 6–4తో జేమ్స్ డక్వర్త్–క్రూజ్ హెవిట్ (ఆస్ట్రేలియా) జంటపై నెగ్గింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–స్వీడిష్ జోడీ ఆరు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమసర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. 26 విన్నర్స్ కొట్టిన యూకీ–గొరాన్సన్ మూడు అనవసర తప్పిదాలు చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విభాగంలో యూకీ ఆడటం ఇది ఐదోసారి. తొలిసారి మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జతగా 2014లో ఆడిన యూకీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. తొమ్మిదేళ్ల తర్వాత 2023లో సాకేత్ మైనేని (భారత్)తో కలిసి మళ్లీ ఈ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆడిన యూకీ తొలి రౌండ్ దాటలేదు. 2024లో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)తో, 2025లో అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)తో కలిసి బరిలోకి దిగిన యూకీ తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. డబ్ల్యూపీఎల్లో నేడు యూపీ వారియర్స్ x గుజరాత్ జెయింట్స్ రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
హైదరాబాద్ x ముంబై
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, ముంబై జట్ల మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానుండగా... 42 సార్లు చాంపియన్ ముంబై జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ తలపడనుంది. గ్రూప్ ‘డి’లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఒక విజయం, ఒక ఓటమి, మూడు ‘డ్రా’లతో 13 పాయింట్లు సాధించిన హైదరాబాద్ నాలుగో స్థానంలో... పరాజయం ఎరగని ముంబై 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. లీగ్ దశలో మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా... ఈ రెండింట్లో మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్ భావిస్తోంది. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అందుబాటులో లేకపోగా... టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అజింక్యా రహానే అందుబాటులో లేకపోయినా... శార్దుల్ ఠాకూర్ సారథ్యంలోని ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, షమ్స్ ములానీ, సిద్ధేశ్ లాడ్లతో పటిష్టంగా ఉంది. ప్రతి గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. -
అదరగొట్టిన అభిషేక్
ఎప్పటిలాగే తనదైన శైలిలో అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్... సూర్యకుమార్, రింకూ సింగ్ దూకుడు... ఆపై బౌలర్ల ప్రతాపం... వెరసి న్యూజిలాండ్తో టి20 సిరీస్లో భారత్కు ఘనమైన ఆరంభం లభించింది. ముందుగా కేవలం బౌండరీల ద్వారానే 168 పరుగులు రాబట్టి భారీ స్కోరుతో చెలరేగిన టీమిండియా... అనంతరం ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమైంది. కివీస్ కొంత పోరాడినా లక్ష్యానికి దూరంలో నిలిచిపోయింది. నాగ్పూర్: న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత్ టి20 సిరీస్ తొలి మ్యాచ్లో నెగ్గి 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన ఈ పోరులో భారత్ 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (35 బంతుల్లో 84; 5 ఫోర్లు, 8 సిక్స్లు) సిక్సర్ల వర్షం కురిపించగా... రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్ ) ధాటిగా ఆడారు. అభిషేక్, సూర్యకుమార్ మూడో వికెట్కు 47 బంతుల్లోనే 99 పరుగులు జోడించారు. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 78; 4 ఫోర్లు, 6 సిక్స్లు), మార్క్ చాప్మన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. రెండో టి20 శుక్రవారం రాయ్పూర్లో జరుగుతుంది. సమష్టి ప్రదర్శన 14 సిక్సర్లతో 84 పరుగులు... 21 ఫోర్లతో 84 పరుగులు... భారత్ జోరు బౌండరీలతో ఈ తరహాలో సాగింది. ముందుగా అభిషేక్, మధ్యలో సూర్య, పాండ్యా, చివర్లో రింకూ చెలరేగి భారత్కు భారీ స్కోరును అందించారు. టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్కు దిగింది. సంజు సామ్సన్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు), ఇషాన్ కిషన్ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు) ఆరంభంలోనే వెనుదిరిగినా... మరోవైపు అభిషేక్ సిక్స్తో దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. జేమీసన్, క్లార్క్ వేసిన వరుస ఓవర్లలో అతను రెండేసి సిక్స్లు బాదాడు. దాంతో పవర్ప్లేలో భారత్ 68 పరుగులు చేసింది. ఫిలిప్స్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అభిషేక్ 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సోధి ఓవర్లో సూర్య వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు 117కు చేరింది. సూర్య అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) అదే ధాటిని ప్రదర్శించాడు. సోధి ఓవర్లో వరుసగా 4, 6, 6 బాది సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ వెనుదిరిగాడు. తక్కువ వ్యవధిలో శివమ్ దూబే (4 బంతుల్లో 9; 1 సిక్స్), పాండ్యా, అక్షర్ పటేల్ (5) అవుటైన తర్వాత ఆఖర్లో రింకూ చెలరేగిపోయాడు. క్లార్క్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి స్కోరును 200 దాటించిన అతను... మిచెల్ వేసిన ఆఖరి ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. ఫిలిప్స్ అర్ధ సెంచరీ న్యూజిలాండ్ ఛేదన పేలవంగా ప్రారంభమైంది. రెండో బంతికే కాన్వే (0) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో రచిన్ (1) కూడా అవుటయ్యాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన రాబిన్సన్ (21) కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. ఇలాంటి స్థితిలో ఫిలిప్స్, చాప్మన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఫిలిప్స్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు భారీ సిక్స్లు బాదాడు. అక్షర్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి ఫిలిప్స్ అవుట్ కావడంతో 79 పరుగుల (42 బంతుల్లో) నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్లో చాప్మన్ను వరుణ్ అవుట్ చేయడంతో కివీస్ ఆశలు కోల్పోయింది. ఈ దశలో విజయానికి చివరి 5 ఓవర్లలో 95 పరుగులు చేయాల్సిన జట్టు చివరకు 46 పరుగులే చేయగలిగింది. డరైల్ మిచెల్ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు), సాంట్నర్ (13 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రచిన్ (బి) జేమీసన్ 10; అభిషేక్ (సి) జేమీసన్ (బి) సోధి 84; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) డఫీ 8; సూర్యకుమార్ (సి) రాబిన్సన్ (బి) సాంట్నర్ 32; పాండ్యా (సి) చాప్మన్ (బి) డఫీ 25; దూబే (సి అండ్ బి) జేమీసన్ 9; రింకూ సింగ్ (నాటౌట్) 44; అక్షర్ (సి) మిచెల్ (బి) క్లార్క్ 5; అర్ష్ దీప్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–126, 4–149, 5–166, 6–185, 7–209. బౌలింగ్: డఫీ 4–0–27–2, జేమీసన్ 4–0–54–2, క్లార్క్ 4–0–40–1, సోధి 3–0–38–1, ఫిలిప్స్ 1–0–20–0, సాంట్నర్ 3–0–37–1, మిచెల్ 1–0–21–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 0; రాబిన్సన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 1; రచిన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 1; ఫిలిప్స్ (సి) దూబే (బి) అక్షర్ 78; చాప్మన్ (సి) అభిషేక్ (బి) వరుణ్ 39; మిచెల్ (సి) (సబ్) బిష్ణోయ్ (బి) దూబే 28; సాంట్నర్ (నాటౌట్) 20; క్లార్క్ (సి) రింకూ (బి) దూబే 0; జేమీసన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–52, 4–131, 5–143, 6–189, 7–189. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–31–1, పాండ్యా 2–0–20–1, బుమ్రా 3–0–29–0, అక్షర్ పటేల్ 3.3–0–42–1, వరుణ్ 4–0–37–2, దూబే 3–0–28–2, అభిషేక్ 0.3–0–3–0. -
తొలి టీ20లో భారత్ ఘన విజయం
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్ను 48 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించిందిఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ విఫలమైనప్పటికి అభిషేక్ మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లుతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు రింకూ సింగ్(24 బంతుల్లో 44 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(25) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, జాకబ్ డఫ్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్, సోధీ, క్లార్క్ తలా వికెట్ సాధించారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగల్గింది. కివీస్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఫిలిప్స్ కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు చాప్మన్(39)రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, అర్ష్దీప్, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రాయ్పూర్ వేదికగా శుక్రవారం(జనవరి 23) జరగనుంది.చదవండి: అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్ -
అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో 22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 32 పరుగులు చేసిన సూర్య భాయ్.. పొట్టి క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా అత్యంత వేగంగా (321 ఇన్నింగ్స్లు) ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.ఈ జాబితాలో విరాట్ కోహ్లి (271 ఇన్నింగ్స్లు), శిఖర్ ధవన్ (308) సూర్య కంటే ముందున్నారు. ప్రపంచం మొత్తంలో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన రికార్డు పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ పేరిట ఉంది. బాబర్ కేవలం 245 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. అభిషేక్ విధ్వంసం (35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు), రింకూ సింగ్ (20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు) మెరుపుల కారణంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అతి భారీ స్కోర్ (238/7) చేసింది.మిగతా బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో పర్వాలేదనిపించాడు. సూర్య భాయ్కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది 100వ మ్యాచ్.ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ (10), ఇషాన్ కిషన్ (8), శివమ్ దూబే (9), అక్షర్ పటేల్ (5) నిరాశపరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జేమీసన్ చెరో 2.. క్రిస్టియన్ క్లార్క్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్కు తొలి ఓవర్లోనే చేదు అనుభవం ఎదురైంది. రెండో బంతికే అర్షదీప్ డెవాన్ కాన్వేను (0) ఔట్ చేశాడు. రెండో ఓవర్లో న్యూజిలాండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా రచిన్ రవీంద్రను (1) పెవిలియన్కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 39-2గా ఉంది. రాబిన్సన్ (19), గ్లెన్ ఫిలిప్స్ (18) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే 90 బంతుల్లో మరో 200 పరుగులు చేయాలి. -
అభిషేక్ విధ్వంసం, రింకూ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్
నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోర్ (238/7) చేసింది. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి బంతి నుంచి ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్కు జతగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. అతని తర్వాత హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) కూడా సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ చేసింది.మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ 10, ఇషాన్ కిషన్ 8, శివమ్ దూబే 9, అక్షర్ పటేల్ 5, అర్షదీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జేమీసన్ చెరో 2.. క్రిస్టియన్ క్లార్క్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు. -
అభిషేక్ శర్మ ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే..!
నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, న్యూజిలాండ్పై అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ 2020లో ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.అభిషేక్కు టీ20ల్లో ఇది ఏడో హాఫ్ సెంచరీ. దీంతో అతను మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు (8) పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తర్వాతి స్థానాల్లో ఫిల్ సాల్ట్, సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్ ఉన్నారు. వీరంతా తలో ఏడు సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఐష్ సోధి బౌలింగ్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి జేమీసన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఇన్నింగ్స్లో అభిషేక్ టీ20ల్లో 5000 పరుగుల మార్కును తాకాడు. అభిషేక్ తన స్వల్ప అంతర్జాతీయ టీ20 కెరీర్లో (33 ఇన్నింగ్స్లు) 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీల సాయంతో, 190.92 స్ట్రయిక్రేట్తో, 37.46 సగటున 1199 పరుగులు చేశాడు. ఇందులో 112 ఫోర్లు, 81 సిక్సర్లు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి బంతి నుంచే ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు) స్వల్ప స్కోర్కే ఔటైనా అభిషేక్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (8) సైతం నిరాశపర్చినా, అభిషేక్ మెరుపులు ఆగలేదు. ఇంకా చెప్పాలంటే ఇషాన్ ఔటయ్యాక శృతి మించాయి.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నంలో మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత వచ్చిన శివమ్ దూబే (9) భారీ షాట్లు ఆడే క్రమంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో ఉన్న హార్దిక్ (14 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపిస్తున్నాడు. అతనికి జతగా రింకూ సింగ్ (4) క్రీజ్లో ఉన్నాడు. 15.3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 185/5గా ఉంది. -
బంగ్లాదేశ్కు భారీ షాక్.. బీసీబీ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ
భారత్తో నెలకొన్న రాజకీయ ఉద్రికత్తల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో పునఃపరిశీలనలు ఉండవని తేల్చి చెప్పింది.ఇవాళ (జనవరి 21) జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో ఓటింగ్ ద్వారా ఈమేరకు నిర్ణయించింది. మొత్తం 16 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా.. కేవలం ఇద్దరు మాత్రమే బంగ్లాదేశ్ అభ్యర్థనకు మద్దతు ఇచ్చారు. మిగతా సభ్యులు వ్యతిరేకించారు.భరోసా ఇచ్చినా..!భద్రతను సాకుగా చూపుతూ భారత్లో మ్యాచ్లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ జట్టుకు ఐసీసీ పూర్తి భరోసా ఇచ్చింది. అయినా ఆ దేశ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో స్వతంత్ర సంస్థలు చేసిన భద్రతా అంచనాలు, వేదికల వారీగా రూపొందించిన భద్రతా ప్రణాళికలు, ఆతిథ్య దేశం ఇచ్చిన హామీలన్నిటినీ ఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించి, బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.ముస్తాఫిజుర్ ఉదంతంతో సంబంధమే లేదు భారత్లో ఆడకుండా ఉండటానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చూపుతున్న సాకులకు, ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉదంతంతో సంబంధమే లేదని ఐసీసీ పేర్కొంది. ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తప్పించడాన్ని భద్రతా సమస్యతో అనుసంధానం చేయడం సరి కాదని హితవు పలికింది. స్కాట్లాండ్కు అవకాశం ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు భారత్కు రాకపోతే, వారి స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేస్తుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ టీ20 ర్యాంకింగ్స్లో 14వ స్థానంలో ఉంది. ప్రపంచకప్కు అర్హత సాధించని జట్లలో అత్యధిక ర్యాంక్ కలిగిన జట్టుగా స్కాట్లాండ్ ప్రపంచకప్కు ఎంపికవుతుంది.మరో 24 గంటల డెడ్లైన్ఇది జరగకుండా ఉండాలంటే బంగ్లాదేశ్ మరో 24 గంటల్లో ఏ విషయం తేల్చాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈలోపు కూడా బంగ్లాదేశ్ ఏ విషయం తేల్చకపోతే డీఫాల్ట్గా స్కాట్లాండ్ ప్రపంచకప్కు అర్హత సాధిస్తుంది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్.. వెస్టిండీస్, ఇంగ్లండ్, నేపాల్, ఇటలీ జట్లతో కలిసి గ్రూప్-సిలో ఉంది. బంగ్లాదేశ్ తొలి మూడు మ్యాచ్లు కోల్కతాలో ఆడి, చివరి గ్రూప్ మ్యాచ్ను ముంబైలో ఆడేలా షెడ్యూల్ ఉంది. -
భారత్తో తొలి టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. నాగ్పూర్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్తో క్రిస్టియన్ క్లార్క్ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. మిగతా ఇద్దరు పేసర్లుగా జేమీసన్, డఫీ ఉన్నారు.మరోవైపు భారత్ ముందుగా చెప్పినట్లుగానే శ్రేయస్ను కాదని వన్డౌన్లో ఇషాన్ కిషన్కు అవకాశం ఇచ్చింది. హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్లను బెంచ్కే పరిమితం చేసింది. కాగా, ఈ సిరీస్కు ముందు జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను పర్యాటక న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ యువ బ్యాటర్
ఇంగ్లండ్ యువ బ్యాటర్ బెన్ మేస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 వరల్డ్కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్లో భాగంగా స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్లో మేస్ కేవలం 65 బంతుల్లో శతక్కొట్టి, మొత్తంగా 117 బంతుల్లో 191 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మేస్ మరో రెండు పరుగులు చేసుంటే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టు తరఫున అయిన అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించి ఉండేవాడు. ఈ ప్రపంచ రికార్డు శ్రీలంక ఆటగాడు విరాన్ చముదిత పేరిట ఉంది. విరాన్ ఇదే ఎడిషన్లో జపాన్పై 192 పరుగుల చేశాడు. మేస్.. మరో శ్రీలంక ఆటగాడు హసిత బోయగోడాతో కలిసి ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. హసిత కూడా మేస్ లాగే 191 పరుగుల వద్ద ఆగిపోయాడు.మ్యాచ్ విషయానికొస్తే.. స్కాట్లాండ్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. మేస్ భారీ శతకంతో పాటు ఓపెనర్ జోసఫ్ మూర్స్ (81) అర్ద సెంచరీతో రాణించాడు. లోయర్ మిడిలార్డర్ ఆటగాడు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ 400 పరుగుల మైలురాయిని తాకింది. కెప్టన్ థామస్ రూ 22, కాలెబ్ ఫాల్క్నర్ 32, రాల్ఫీ ఆల్బర్ట్ 13, ఫర్హాన్ అహ్మద్ 15 (నాటౌట్), సెబాస్టియన్ మోర్గాన్ 24 (నాటౌట్) పరుగులు చేశారు. మరో ఓపెనర్ బెన్ డాకిన్స్ 5 పరుగులకే ఔటయ్యాడు.స్కాట్లాండ్ బౌలర్లలో జేక్ వుడ్హౌస్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫిన్లే జోన్స్ 2, మ్యాక్స్ ఛాప్లిన్ ఓ వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ తడబడుతుంది. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 48 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. మనూ సరస్వత్ (6), మ్యాక్స్ ఛాప్లిన్ (1) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్, లూక్ హ్యాండ్స్, ఫర్హాన్ అహ్మద్కు తలో వికెట్ దక్కింది.కాగా, ప్రస్తుత ఎడిషన్ ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. మరోవైపు స్కాట్లాండ్.. జింబాబ్వేతో ఆడాల్సిన తమ తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. రెండో మ్యాచ్లో ఆ జట్టు పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది. -
సూర్యకుమార్ యాదవ్ సెంచరీ
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇవాళ (జనవరి 21) ఓ చారిత్రక మైలురాయిని తాకనున్నాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇప్పటివరకు 99 మ్యాచ్లు ఆడిన స్కై.. న్యూజిలాండ్తో నేడు జరుగబోయే మ్యాచ్తో మ్యాచ్ల సెంచరీని పూర్తి చేయనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు.భారత క్రికెట్లో ఇప్పటివరకు రోహిత్ శర్మ (159), విరాట్ కోహ్లి (125), హార్దిక్ పాండ్యా (124) మాత్రమే 100 టీ20 మ్యాచ్ల మైలురాయిని తాకారు.మరో చారిత్రక మైలురాయి దిశగా..మ్యాచ్ల సెంచరీతో పాటు సూర్య మరో చారిత్రక మైలురాయి దిశగా కూడా అడుగులు వేస్తాడు. మొత్తం టీ20 కెరీర్లో ఇప్పటివరకు 346 మ్యాచ్ల్లో 395 సిక్సర్లు కొట్టిన స్కై, మరో ఐదు సిక్సర్లు కొడితే 400 సిక్సర్ల క్లబ్లోకి ప్రవేశిస్తాడు. ఈ ఘనతను భారత క్రికెట్లో ఇప్పటివరకు కేవలం రోహిత్ శర్మ (547), విరాట్ కోహ్లి (435) మాత్రమే సాధించారు.పేలవ ఫామ్తో సతమతమవుతున్న సూర్యనేటి మ్యాచ్లో చారిత్రక మైలురాయిని అందుకోబోతున్న సూర్య గత ఏడాది కాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. గతేడాది అతను 21 మ్యాచ్ల్లో కేవలం 12.62 సగటున 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కనీసం ఒక్క అర్ధశతకం కూడా లేదు. టీ20 వరల్డ్కప్ నేపథ్యంలో ప్రస్తుతం సూర్యపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. కెప్టెన్గా సఫలమవుతున్నప్పటికీ.. చెత్త ప్రదర్శన కారణంగా అతను ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. స్కై ఇదే ఫామ్ను ప్రపంచకప్లోనూ కొనసాగిస్తే అతని కెరీర్ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదముంది.ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. నాగ్పూర్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. -
టీమిండియా టీ20 కెప్టెన్గా అతడే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్గా టీమిండియా బరిలో దిగనుంది. సొంతగడ్డపై ఈ ఐసీసీ ఈవెంట్ జరుగనుండటం సూర్యకుమార్ సేనకు మరో సానుకూలాంశం. ఇక ఈ మెగా టోర్నీకి సన్నాహకంగా న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ పాల్గొననుంది.ఇదిలా ఉంటే.. కివీస్తో పాటు ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టు నుంచి సెలక్టర్లు శుబ్మన్ గిల్ను తప్పించిన విషయం తెలిసిందే. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్గా ఉన్న గిల్.. చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి తిరిగి వచ్చి వరుసగా విఫలం కావడమే ఇందుకు కారణం.అద్భుతమైన ఆటగాడుఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్కప్ టోర్నీ తర్వాత గిల్ భారత టీ20 జట్టులోకి తిరిగి రావడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్ కూడా అవుతాడని అంచనా వేశాడు. ఈ సందర్భంగా గిల్ అద్భుతమైన ఆటగాడు అని క్లార్క్ ప్రశంసలు కురిపించాడు.ఫామ్లేమి కారణంగానేబియాండ్23క్రికెట్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ అతడు పోటీలోనే ఉన్నాడు. ప్రస్తుతం జట్టుకు అవసరమైన రీతిలో అతడు బ్యాటింగ్ చేయడం లేదన్న కారణంగా పక్కనపెట్టారు. అంతేకాదు.. టీమిండియాకు లెక్కకు మిక్కిలి ఓపెనింగ్ బ్యాటర్ ఆప్షన్లు ఉన్నాయి.ప్రస్తుతం అతడు కెప్టెన్ కూడా కాదు. అందుకే వరల్డ్కప్ జట్టు నుంచి అతడిని తొలగించే సాహసం చేశారు. ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న న్యూజిలాండ్ సిరీస్కు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఫామ్లేమి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదుఅయితే, ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత గిల్ జట్టులోకి తిరిగి రావడమే కాదు.. కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతడొక అద్భుతమైన ప్లేయర్. ప్రస్తుతం అతడు ఫామ్లో లేకపోవచ్చు. అయితే, కెప్టెన్ అయ్యేందుకు అతడికి అర్హత ఉంది. ప్రస్తుతానికి వరల్డ్కప్ టోర్నీ మీద దృష్టి పెట్టినందు వల్లే మేనేజ్మెంట్ అతడిని తప్పించింది’’ అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.రోహిత్ స్థానంలో సూర్య, గిల్ కాగా రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టు సారథిగా అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక టెస్టుల్లో రోహిత్ రిటైర్మెంట్ తర్వాత శుబ్మన్ గిల్ పగ్గాలు చేపట్టగా.. గతేడాది వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించి గిల్కు ఆ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. అయితే, క్లార్క్ అభిప్రాయపడినట్లు వరల్డ్కప్ తర్వాత గిల్ సూర్య స్థానాన్ని భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్-2026 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: సూర్యకుమార్ యాదవ్కు రోహిత్ శర్మ వార్నింగ్ -
చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ బ్యాటర్.. ఫాస్టెస్ట్ సెంచరీ
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్-19 వరల్డ్కప్ 2026లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ విల్ మలాజ్చుక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న (జనవరి 20) గ్రూప్-ఏలో భాగంగా జపాన్తో జరిగిన మ్యాచ్లో కేవలం 51 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా అండర్-19 వరల్డ్కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు.గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ పేరిట ఉండేది. ఖాసిమ్ 2022 ఎడిషన్లో శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఖాసిమ్ తర్వాత మూడో వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాడు రాజ్ బవా పేరిట ఉంది. బవా 2022 ఎడిషన్లోనే ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.మలాజ్చుక్ విషయానికొస్తే.. ఇతగాడు జపాన్పై మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఫలితంగా ఆసీస్ పసికూన జపాన్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్కు ఇది వరసగా రెండో విజయం. అంతకుముందు తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను కూడా 8 వికెట్ల తేడాతోనే చిత్తు చేసింది.ఆసీస్తో మ్యాచ్లో జపాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ హ్యూగో కెల్లీ (79 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో జపాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెల్లీకి నిహార్ పర్మార్ (33), చార్లెస్ హింజ్ (24), హర హింజ్ (29) ఓ మోస్తరు సహాకారాలను అందించారు. ఆసీస్ బౌలర్లలో కూరే 3, విల్ బైరోమ్ 2, ఆర్యన్ శర్మ, కేసీ బార్టన్ తలో వికెట్ తీశారు.అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించింది. మలాజ్చుక్ మెరుపు సెంచరీకి మరో ఓపెనర్ నితేశ్ సామ్యూల్ (60 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ తోడవ్వడంతో ఆసీస్ 29.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
టాప్ ర్యాంక్ కోల్పోయిన విరాట్ కోహ్లి
ఐసీసీ తాజాగా (జనవరి 21) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. గత వారం ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో ఉండిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. అప్పటిదాకా నంబర్-2గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ సరికొత్త వన్డే నంబర్ వన్ బ్యాటర్గా అవతరించాడు.తాజాగా భారత్పై ఓ అర్ద సెంచరీ సహా వరుసగా రెండు సెంచరీలు (84, 131 నాటౌట్, 137) చేయడంతో డారిల్ రేటింగ్ పాయింట్లు అమాంతం పెరిగాయి. అప్పటిదాకా టాప్ ప్లేస్లో ఉండిన విరాట్పై డారిల్ ఏకంగా 50 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. ప్రస్తుతం డారిల్ ఖాతాలో 845 రేటింగ్ పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 795 పాయింట్లు ఉన్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో డారిల్ టాప్ ర్యాంక్ను కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. భారత్తో సిరీస్లో డారిల్ చారిత్రక ప్రదర్శన చేసి, తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని (2-1) అందించాడు.మరోవైపు రెండు వారాల కిందట టాప్ ర్యాంక్లో ఉండిన మరో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్లో మరో స్థానం దిగజారి నాలుగో స్థానానికి పడిపోయాడు. గత వారం నాలుగో స్థానంలో ఉండిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మూడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ సిరీస్లో రెండు అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.న్యూజిలాండ్తో రెండో వన్డేలో సూపర్ సెంచరీతో అదరగొట్టిన మరో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ టాప్-10లోకి (10వ స్థానం) ప్రవేశించాడు. న్యూజిలాండ్ సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్, ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్, విండీస్ ప్లేయర్ షాయ్ హోప్, శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక వరుసగా 6 నుంచి 9 స్థానాల్లో కొనసాగుతున్నారు.తాజాగా ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్తో మూడో వన్డేలో సూపర్ సెంచరీతో అలరించిన ఫిలిప్స్ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరాడు.బౌలర్ల విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 710 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ, దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్, నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని టాప్-5లో ఉన్నారు. న్యూజిలాండ్ సిరీస్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. భారత్తో సిరీస్లో బరిలోకి దిగని న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం 3 స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ సిరీస్లో అద్భుతంగా రాణించిన భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 50వ స్థానానికి చేరాడు. మరో భారత పేసర్ అర్షదీప్ సింగ్ 15 స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరాడు. భారత్తో సిరీస్లో న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన మైఖేల్ బ్రేస్వెల్ 6 స్థానాలు మెరుగుపర్చుకొని 33వ స్థానానికి ఎగబాకాడు.ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్, జింబాబ్వే సికందర్ రజా, ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ మహ్మద్ నబీ టాప్-3లో కొనసాగుతున్నారు. -
IND vs NZ: అతడే మమ్మల్ని గెలిపిస్తాడు: కివీస్ కెప్టెన్
భారత్ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచి కొత్త ఏడాదిలో శుభారంభం అందుకుంది న్యూజిలాండ్. టీ20 సిరీస్లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు పటిష్ట, నంబర్ వన్ జట్టును ఓడించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తోంది.ఇదేమీ అంత కష్టం కాదంటున్నాడు కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner), డారిల్ మిచెల్ జోరు కొనసాగిస్తే తాము సులువుగానే టీ20 సిరీస్నూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు భారత్కు వచ్చింది న్యూజిలాండ్.డారిల్దే కీలక పాత్రఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. కివీస్ భారత్ను 2-1తో ఓడించి సిరీస్ గెలిచింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్ది కీలక పాత్ర. ఈ సిరీస్లో అతడు సాధించిన పరుగులు వరుసగా.. 84, 131 నాటౌట్, 137.గతంలో స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డ డారిల్ మిచెల్ (Daryl Mitchell).. ఈసారి మాత్రం ఆ అవరోధాన్ని అధిగమించాడు. ముఖ్యంగా భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) బౌలింగ్లో అతడు చితక్కొట్టడం ఇందుకు నిదర్శనం. వన్డే ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని.. టీ20 సిరీస్లోనూ మిచెల్ అద్భుతాలు చేస్తాడని కివీస్ గట్టిగా నమ్ముతోంది.ఆరంభంలో ఇబ్బంది పడ్డాడుఈ నేపథ్యంలో నాగ్పూర్లో బుధవారం నాటి తొలి టీ20కి ముందు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ‘‘కెరీర్ ఆరంభంలో డారిల్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోలేక చాలా ఇబ్బందిపడ్డాడు. అయితే, ఆ లోపాన్ని సరిచేసుకునేందుకు అతడు కఠినంగా శ్రమించాడు.అందుకు తగ్గ ఫలితాలు, ఫలాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అతడు స్పిన్ను సమర్థవంతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో మధ్య ఓవర్లలో మ్యాచ్ను తన నియంత్రణలోకి తెచ్చుకున్న తీరు అద్భుతం. టీ20 సిరీస్లోనూ అదే స్థాయి ప్రదర్శన కనబరుస్తాడని ఆశిస్తున్నాం’’ అని సాంట్నర్ పేర్కొన్నాడు.ఇక్కడా గెలుస్తాంఇక ఇటీవలి కాలంలో సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాను వైట్వాష్ చేసిన న్యూజిలాండ్.. తాజాగా వన్డే సిరీస్లో తొలిసారి గెలుపు రుచిచూసింది. ఈ నేపథ్యంలో సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘భారత్లో ఆడటం మాకెంతో ఇష్టం. అలాంటిది ఇక్కడ చారిత్రాత్మక విజయాలతో ముందుకు సాగడం మరింత సంతోషం.ఇప్పటికే రెండు ఫార్మాట్లలో అనుకున్న ఫలితం రాబట్టాము. ఇప్పుడు కూడా అదే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాము. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇదొక మంచి సన్నాహకంగా ఉంటుంది’’ అని సాంట్నర్ తెలిపాడు. చదవండి: భారత్లో మ్యాచ్లు.. బంగ్లాదేశ్ కెప్టెన్ స్పందన వైరల్ -
IND vs NZ: అతడిపై వేటు.. భారత తుదిజట్టు ఇదే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ఆఖరి సన్నాహకంగా న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి సిరీస్ ఆరంభం కానుంది. నాగ్పూర్ వేదికగా తొలి టీ20 సందర్భంగా టీమిండియా స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ తమ స్థానాలు పదిలం చేసుకోగా.. గాయపడిన వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) స్థానంలో ఇషాన్ కిషన్ మూడో స్థానంలో వస్తాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.శ్రేయస్ అయ్యర్కు నిరాశేఫలితంగా టీ20లలో రీఎంట్రీ ఇవ్వాలన్న వన్డే స్టార్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మరోసారి నిరాశ తప్పదు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య బరిలోకి దిగుతాడని తెలిసిందే. ఇక ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే సిద్ధంగా ఉన్నారు. ఏడు ఎనిమిది స్థానాల్లో శివం దూబేతో కలిసి హిట్టింగ్ ఆడే క్రమంలో రింకూ సింగ్కు కూడా తుదిజట్టులో చోటు ఖాయమే.వరుణ్ చక్రవర్తికే ఓటుస్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్ను కాదని వరుణ్ చక్రవర్తి వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇక పేసర్ల విభాగంలో ప్రధాన బౌలర్ బుమ్రాతో పాటు టీ20 వికెట్ల వీరుడు అర్ష్దీప్ సింగ్ స్థానం దక్కించుకోవడం సహజమే.కాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా, బుమ్రాలకు విశ్రాంతినివ్వగా.. ఈ ఇద్దరి స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఆడారు. ఆఖరిదైన మూడో వన్డేల్లో నితీశ్ (53), హర్షిత్ (52) అర్ధ శతకాలతో అలరించారు. ఈ మ్యాచ్లో భారత జట్టు ఓడినా విరాట్ కోహ్లి (124)తో కలిసి కాస్తైనా పరువు నిలిచేలా చేశారు.అతడిపై వేటు తప్పదుఅయితే, టీ20 సిరీస్ సందర్భంగా హార్దిక్, బుమ్రా తిరిగి వచ్చారు. పాండ్యా ఉన్నాడు కాబట్టి నితీశ్ రెడ్డిని టీ20లకు ఎంపిక చేయలేదు. ఇక బుమ్రా కూడా వచ్చాడు కాబట్టి తొలి టీ20 సందర్భంగా హర్షిత్ రాణాపై వేటు పడక తప్పదని తెలుస్తోంది. ఒకవేళ లోయర్ ఆర్డర్లో హర్షిత్ బ్యాటింగ్కు ఉపయోగపడతాడని భావించినా.. టాపార్డర్ పటిష్టంగానే ఉన్న కారణంగా ఎక్స్ట్రా బ్యాటర్గా అతడి అవసరం ఉండకపోవచ్చు. అందుకే బుమ్రాకు తోడుగా అర్ష్దీప్ రంగంలోకి దిగుతాడని తెలుస్తోంది.న్యూజిలాండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు (అంచనా)సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.చదవండి: T20 WC: సూర్యకుమార్ యాదవ్కు రోహిత్ శర్మ వార్నింగ్ -
BCCI: బుమ్రా ఒక్కడికే ఆ ఛాన్స్.. వాళ్లకి ప్రమోషన్లు!
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వార్షిక వేతనంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు పేర్కొన్నాయి. మూడు ఫార్మాట్లు ఆడుతున్న కారణంగా సెంట్రల్ కాంట్రాక్టులో అతడిని అత్యుత్తమ గ్రేడ్లోనే కొనసాగిస్తామని సంకేతాలు ఇచ్చాయి. ఏటా రూ. 7 కోట్లుకాగా జాతీయ జట్టు ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను క్రమబద్దీకరించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాలోని ఆటగాళ్లను ఎ+, ఎ, బి, సి అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వార్షిక ఫీజులు చెల్లిస్తున్న బోర్డు... ఇక మీద ‘ఎ+’ కేటగిరీని తొలగించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ‘ఎ+’ కేటగిరీలో ఉండగా... వీరికి ఏటా రూ. 7 కోట్లు చెల్లిస్తున్నారు.రో-కోలతో పాటు జడ్డూను తొలగిస్తారు!మరోవైపు.. ‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు ఏడాదికి రూ. 5 కోట్లు... ‘బి’ కేటగిరీలోని ప్లేయర్లకు రూ. 3 కోట్లు... ‘సి’ కేటగిరీలోని ప్లేయర్లకు కోటి రూపాయలు ఇస్తున్నారు. అయితే కోహ్లి, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.మరోవైపు.. టీ20లకు స్వస్తి పలికిన జడేజా కూడా టెస్టు, వన్డే ఫార్మాట్లలోనే ఆడుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు ఎ+ గ్రేడ్లో ఉన్న బుమ్రా ఒక్కడే అన్ని ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. దీంతో 2025–26 కోసం ప్రకటించనున్న జాబితాలో ‘ఎ+’ కేటగిరీని తొలగించాలని బోర్డు భావిస్తోంది.బుమ్రా ఒక్కడికే ఆ ఛాన్స్.. వాళ్లకి ప్రమోషన్లు!అయితే బుమ్రాకు ఇస్తున్న వేతనంలో ఎలాంటి మార్పు చేసే అవకాశాలైతే లేవు. 2018 సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ‘ఎ+’ జాబితాను ప్రవేశపెట్టింది. కోహ్లి, రోహిత్ ఒక్క ఫార్మాట్లో మాత్రమే ఆడుతుండటంతో వారికి ‘బి’ కేటగిరీలో చోటు దక్కనుంది. ఇక ప్రస్తుతం ‘బి’ కేటగిరీలో ఉన్న అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి వారికి ప్రమోషన్ దక్కే అవకాశాలున్నాయి.త్వరలో జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీలో కొత్త కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోనున్నారు. ‘కాంట్రాక్టుల విధానాన్ని సరళీకరించే ప్రయత్నమే ఇది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లు ఆడుతున్న ఆటగాళ్లు తక్కువ మందే ఉన్నారు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న బుమ్రా అత్యుత్తమ కేటగిరీలోనే ఉంటాడు. అతడి వేతనంలో ఎలాంటి కోత ఉండదు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. కాగా పనిభారం తగ్గించుకునే క్రమంలో బుమ్రా ఇప్పటికే పలు కీలక మ్యాచ్లు.. టోర్నీలకు దూరమయ్యాడు. అయినప్పటికీ జట్టులో అతడి ప్రాధాన్యం దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: భారత్లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్ ఓవరాక్షన్ -
పావురాల రెట్టలు.. పరువు పోయాక చర్యలు
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నిర్వహణ లోపాలపై కేంద్ర క్రీడాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. మరోమారు ఇలాంటి పొరపాట్లు, నిర్వహణ వైఫల్యాలు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని క్రీడాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇలాంటి నిర్వాకం చేటుఇండియా ఓపెన్ వేదిక ఇందిరాగాంధీ స్టేడియం అధికారులను పిలిచిన క్రీడాశాఖ... నిర్వహణ తీరు, తలెత్తిన గందరగోళానికి సంబంధించిన సమగ్ర నివేదిక కోరింది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం బిడ్డింగ్ రేసులో నిలవాలనుకుంటున్న భారత్కు ఇలాంటి నిర్వాకం చేటు చేస్తుందని క్రీడాశాఖ భావించింది. కఠిన చర్యలు తీసుకోండిఅందుకే సత్వర చర్యలు తీసుకునేందుకు, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు, ఆతిథ్య వైఫల్యం పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మాండవీయ ‘సాయ్’ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది.నిజానికి ఇండియా ఓపెన్ భారత బ్యాడ్మింటన్ సంఘం నిర్వహించినప్పటికీ దేశంలోని ప్రముఖ క్రీడా స్టేడియాలు, ఎక్సలెన్సీ సెంటర్లన్నీ ‘సాయ్’ పరిధిలోనివి. వీటి నిర్వహణ కోసం కేంద్రం ప్రతీ ఏటా క్రీడా బడ్జెట్లో నిధులు కూడా ఇస్తోంది.అసలేం జరిగింది? దేశ రాజధానిలో ఇండియా ఓపెన్ జరిగింది. త్వరలోనే ఇక్కడ ప్రపంచ చాంపియన్షిప్ కూడా జరగనుంది. అయితే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వసతులు అధమంగా ఉన్నాయని, ఆడే పరిస్థితులు లేవని, ప్రాక్టీస్ కోర్టులన్నీ దుమ్ముధూళీతోనే నిండిపోయాయని డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫీల్డ్ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఆమె విమర్శలకు మరింత బలం చేకూర్చేలా మ్యాచ్లు జరిగే సమయంలో పలుమార్లు కోర్టులో పావురాలు రెట్ట వేశాయి. దీంతో నిర్వహణ తీరు, ఏర్పాట్లపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.చదవండి: భారత్లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్ ఓవరాక్షన్ -
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్కు భారీ షాక్
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ క్రికెటర్ లీజెల్లి లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఆమెకు జరిమానా పడింది. అంతేకాదు లీజెల్లి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ కూడా చేరింది.మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (MIW vs DCW) మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. వడోదర వేదికగా టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది.నట్ సీవర్, హర్మన్ మెరుపులుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ నట్ సీవర్- బ్రంట్ (45 బంతుల్లో 65 నాటౌట్), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur- 33 బంతుల్లో 41) రాణించడంతో ఈ మేర స్కోరు సాధ్యమైంది.లీజెల్లి లీ ధనాధన్ఢిల్లీ బౌలర్లలో నల్లపురెడ్డి శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టగా.. మరిజానే కాప్, నందిని శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 19 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లలో షఫాలీ వర్మ (29) ఫర్వాలేదనిపించగా.. లీజెల్లి లీ ధనాధన్ దంచికొట్టింది. 28 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 46 పరుగులు చేసింది.అయితే, అర్ధ శతకానికి చేరువైన వేళ లీ పొరపాటుతో మూల్యం చెల్లించుకుంది. అమన్జోత్ కౌర్ బౌలింగ్లో షాట్కు యత్నించి లీ విఫలం కాగా.. వికెట్ కీపర్ రాహిలా ఫిర్దోజ్ చక్కటి స్టంపౌట్తో ఆమెను పెవిలియన్కు పంపింది. రివ్యూలోనూ లీజెల్లి లీదే తప్పని తేలడంతో థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆమె బ్యాట్ను కొట్టినట్లు కనిపించింది.జరిమానా, డీమెరిట్ పాయింట్ఈ నేపథ్యంలో లీజెల్లి లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నట్లు డబ్ల్యూపీఎల్ ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.2 నిబంధన ప్రకారం.. లీ లెవల్ 1 తప్పిదానికి పాల్పడింది. క్రికెట్ పరికరాలను డ్యామేజ్ చేసే రీతిలో వ్యవహరించినందుకు గానూ ఈ నిబంధన ప్రకారం చర్యలు ఉంటాయి.లెవల్ 1 తప్పిదం కాబట్టి లీ మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. అదే విధంగా ఆమె ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం’’ అని డబ్ల్యూపీఎల్ పేర్కొంది. గెలిపించిన జెమీమాఇక ఈ మ్యాచ్లో లీతో పాటు కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 51 నాటౌట్) దంచికొట్టడంతో ఢిల్లీ విజయతీరాలకు చేరింది. 19 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 155 పరుగులు చేసి.. ముంబైపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇక ఈ సీజన్లో ఢిల్లీ ఇప్పటికి ఆడిన ఐదు మ్యాచ్లలో ఇది రెండో విజయం కాగా.. ముంబై ఆరింట రెండు మాత్రమే గెలిచి నాలుగు ఓడిపోయింది. మరోవైపు.. ఇప్పటిదాకా ఓటమన్నదే ఎరుగక ఐదింటికి ఐదు గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. చదవండి: భారత్లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్ ఓవరాక్షన్ -
సినెర్ గెలుపు బోణీ.. కీస్, ఒసాకా ముందంజ
మెల్బోర్న్: ‘హ్యాట్రిక్’ టైటిల్పై గురి పెట్టిన ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేశాడు. 2024, 2025లలో విజేతగా నిలిచిన ఈ ఇటలీ స్టార్ ఈసారీ గెలిస్తే జొకోవిచ్ (సెర్బియా), జాక్ క్రాఫోర్డ్ (ఆస్ట్రేలియా), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా) తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన నాలుగో ప్లేయర్గా ఘనత వహిస్తాడు. హుగో గాస్టన్ (ఫ్రాన్స్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సినెర్ తొలి రెండు సెట్లను 6–2, 6–1తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్ మొదలుకావాల్సిన దశలో హుగో గాస్టన్ గాయం కారణంగా మ్యాచ్ను కొనసాగించలేనని చైర్ అంపైర్కు తెలిపాడు. అనవసర తప్పిదాలుదాంతో మూడో సెట్ జరగకుండానే సినెర్కు విజయం ఖరారైంది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సినెర్ కేవలం మూడు గేమ్లు మాత్రమే కోల్పోయాడు. ఆరు ఏస్లు సంధించిన ఈ మాజీ నంబర్వన్ 19 విన్నర్స్ కొట్టి, 15 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్లో జేమ్స్ డక్వర్త్ (ఆస్ట్రేలియా)తో సినెర్ తలపడతాడు. మరోవైపు ఐదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ), ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా), తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. రాఫెల్ కాలిగ్నన్ (బెల్జియం)తో జరిగిన మ్యాచ్లో ముసెట్టి తొలి సెట్ను 4–6తో చేజార్చుకున్నాడు. అనంతరం 7–6 (7/5), 7–5తో వరుసగా రెండో సెట్లు గెలిచి నాలుగో సెట్లో 3–2తో ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో కాలిగ్నన్ గాయంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. బెన్ షెల్టన్ 6–3, 7–6 (7/2), 7–6 (7/5)తో యుగో హుంబెర్ట్ (ఫ్రాన్స్)పై, ఫ్రిట్జ్ 7–6 (7/5), 5–7, 6–1, 6–3తో వాలెంటిన్ రోయెర్ (ఫ్రాన్స్)లపై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో 15వ సీడ్ ఖచనోవ్ (రష్యా) 4–6, 6–4, 6–3, 5–7, 6–3తో మిచెల్సన్ (అమెరికా)పై, 16వ సీడ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) 7–5, 4–6, 2–6, 7–6 (7/1), 6–3తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, 31వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 4–6, 6–3, 6–2, 6–2తో షింటారో మొచిజుకీ (జపాన్)పై, 22వ సీడ్ లుసియానో దర్దెరి (ఇటలీ) 7–6 (7/5), 7–5, 7–6 (7/3)తో క్రిస్టియన్ గారిన్ (చిలీ)పై విజయం సాధించారు. మోన్ఫిల్స్ ఓటమి ఈ ఏడాది తర్వాత టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్ సీనియర్ స్టార్ గేల్ మోన్ఫిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో తొలి రౌండ్ను దాటలేకపోయాడు. 20వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగిన 39 ఏళ్ల మోన్ఫిల్స్ 7–6 (7/3), 5–7, 4–6, 5–7తో డేన్ స్వీనీ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. 3 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో మోన్ఫిల్స్ 14 ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేశాడు. 56 విన్నర్స్ కొట్టిన ఈ ఫ్రాన్స్ స్టార్ ఏకంగా 77 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కీస్, ఒసాకా ముందంజమహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ (అమెరికా), మాజీ విజేత నయోమి ఒసాకా (జపాన్) తొలి రౌండ్ అధిగమించేందుకు శ్రమించారు. తొలి రౌండ్లో కీస్ 1 గంట 40 నిమిషాల్లో 7–6 (8/6), 6–1తో ఒలినికోవా (ఉక్రెయిన్)పై, ఒసాకా 2 గంటల 22 నిమిషాల్లో 6–3, 3–6, 6–4తో అంటోనియా రుజిక్ (క్రొయేషియా)పై విజయం సాధించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఐదో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) 6–4, 6–3తో కాయా యువాన్ (స్లొవేనియా)పై, పదో సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 6–0, 7–5తో కేటీ బూల్టర్ (బ్రిటన్)పై గెలుపొందారు. -
భారత్లో మ్యాచ్లు.. బంగ్లాదేశ్ కెప్టెన్ స్పందన వైరల్
బంగ్లాదేశ్ మొండిపట్టు వీడటం లేదు. భారత్లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్లో ఆడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేసింది. తమ ఆటగాళ్ల భద్రతకు కట్టుబడి ఉన్నామని.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఒత్తిళ్లకు తలొగ్గమంటూ మరోసారి ఓవరాక్షన్ చేసింది.బంగ్లా బదులు ఆ జట్టుఫలితంగా వరల్డ్కప్ టోర్నీలో బంగ్లాదేశ్ ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే షెడ్యూల్, వేదికలు ఖరారు కావడం.. అందుకు అనుగుణంగా ఆయా జట్ల విమానాల టికెట్లు బుక్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ మ్యాచ్లను ఐసీసీ శ్రీలంకకు మార్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.ఒకవేళ బంగ్లాదేశ్ ఇలాగే పట్టుదలకు పోతే.. ఆ జట్టుకు బదులు ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్ (Litton Das) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదంలో తలదూరిస్తే తాను చిక్కుల్లో పడతానని ఆందోళన వ్యక్తం చేశాడు.దయచేసి అడగవద్దుబంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్తో బిజీగా ఉన్న లిటన్ దాస్ మీడియాతో మాట్లాడగా.. ‘‘మీరు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడతారా? లేదా?’’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నా వరకైతే ఈ విషయంపై స్పష్టత లేదు. జట్టులోని ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే.ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. తదుపరి మీరు ఏ ప్రశ్న అడుగబోతున్నారో నాకు తెలుసు. అది నాకు అంత సురక్షితమైనది కాదు. కాబట్టి సమాధానం చెప్పలేను’’ అని లిటన్ దాస్ పేర్కొన్నాడు. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.బీసీబీ వైఖరితో కష్టాల్లోకి ఆటగాళ్లుఈ నేపథ్యంలోనే భారత్లో మ్యాచ్లు ఆడేందుకు భద్రత అనే సాకు చూపి బంగ్లాదేశ్ నిరాకరిస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వైఖరి కారణంగా ఆటగాళ్లకు ఇప్పటికే కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లా ప్లేయర్లలో చాలా మందికి బ్యాట్ స్పాన్సర్లుగా భారత కంపెనీలు ఉన్నాయి. బీసీబీ వైఖరితో ఆ కంపెనీలు తమ కాంట్రాక్టులు రద్దు చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.మరోవైపు.. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్- 2026 టోర్నీలో ఆడకపోతే దేశానికి వచ్చే నష్టమేమీలేదని.. ఆటగాళ్లే నష్టపోతారంటూ బీసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు.. ఐసీసీ నుంచే ప్రధాన ఆదాయం వస్తున్నందున ఈ విషయంలో బీసీబీ ఆచితూచి వ్యవహరించాలని కోరినందుకు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్పై బీసీబీ అధికారి నజ్ముల్ ఇస్లాం ‘భారత ఏజెంట్’ అనే ముద్ర వేశాడు.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ క్రికెటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ నజ్ముల్ను సస్పెండ్ చేసేదాకా వదిలిపెట్టలేదు. ఇలా బోర్డు తీరుతో ఆటగాళ్లు వ్యక్తిగతంగా మాటలు పడుతూ.. ఆర్థికంగానూ నష్టపోయే ప్రమాదంలో పడ్డారు. అందుకే లిటన్ దాస్ సైతం ప్రపంచకప్ టోర్నీ ఆడే విషయమై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశాడు.చదవండి: న్యూజిలాండ్తో తొలి టీ20.. మూడో స్థానంలో వచ్చేది అతడే..! -
T20 WC: సూర్యకుమార్కు రోహిత్ శర్మ వార్నింగ్
గతేడాది టీ20 ఫార్మాట్లో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మెజారిటీ ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఆసియా టీ20 కప్-2025 టైటిల్ కూడా గెలిచింది.అయితే, బ్యాటర్గా మాత్రం సూర్య (Suryakumar Yadav) వరుస వైఫల్యాలతో చతికిలపడ్డాడు. దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగిన ఈ ముంబైకర్.. గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ముందు ఈ అంశం టీమిండియాను కలవరపెడుతోంది.సూర్య గనుక ఫామ్లోకి రాకపోతే..ఈ విషయంపై టీమిండియా దిగ్గజ బ్యాటర్, టీ20 ప్రపంచకప్-2024లో భారత్కు టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. సూర్య గనుక ఫామ్లోకి రాకపోతే జట్టుకు కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ..అతడే ప్రధాన బ్యాటింగ్ ‘పవర్’‘‘కెప్టెన్ ఫామ్లో ఉన్నాడా? లేదా? అన్నది ఇక్కడ సమస్య కాదు. ఒక ఆటగాడు ఫామ్లో లేకుంటే.. మనకు ఏడు నుంచి ఎనిమిది మంది బ్యాటర్లు అందుబాటులో ఉంటారు. అయితే, మనకున్న ప్రధాన బ్యాటింగ్ ‘పవర్’ తడబాటుకు లోనైతే పరిస్థితి కఠినంగా మారుతుంది.ప్రణాళికలు, వ్యూహాలను పక్కాగా అమలు చేయడం వీలుకాదు. అనుకున్నంత ప్రభావం చూపలేకపోవచ్చు. ఒకవేళ సూర్య గనుక సరిగ్గా ఆడకపోతే.. బ్యాటింగ్ లైనప్ కచ్చితంగా ఇబ్బంది పడుతుంది’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కెప్టెన్సీపై ప్రశంసలుఅయితే, కెప్టెన్గా మాత్రం సూర్యకుమార్ యాదవ్కు వంక పెట్టేందుకు ఏమీ లేదని రోహిత్ శర్మ ప్రశంసించాడు. ‘‘ఆట పట్ల సూర్యకు మంచి అవగాహన ఉంది. తన జట్టులోని ఆటగాళ్లలో అత్యుత్తమం ఎవరన్నది అతడికి బాగా తెలుసు. వారి నుంచి ఉత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో కూడా అతడికి తెలుసు’’ అని సూర్య కెప్టెన్సీని కొనియాడాడు. రోహిత్ స్థానంలోకాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు.ఈ క్రమంలో రోహిత్ స్థానంలో టీ20 పగ్గాలు చేపట్టిన సూర్య వరుస విజయాలతో సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 జరుగనుండగా.. చివరి సన్నాహకంగా భారత్ న్యూజిలాండ్తో ఐదు టీ20లు ఆడేందుకు సిద్ధమైంది. చదవండి: శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్!“SKY knows the game. He knows the players.” 💙@ImRo45 highlights @surya_14kumar's form and impact, calling him a critical batter whose presence brings balance and confidence to India’s batting lineup. 🔑🔥Why is SKY central to India’s success on the biggest stage? 🤔Watch it… pic.twitter.com/JEXFzIPhWA— Star Sports (@StarSportsIndia) January 20, 2026 -
T20 WC 2026: మా నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్
భారత్లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్లను ఆడబోమని బంగ్లాదేశ్ మరోసారి తెలిపింది. టోర్నీలో ఆడే విషయమై బుధవారం లోగా నిర్ణయాన్ని ప్రకటించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ (Asif Nazrul) మంగళవారం వెల్లడించారు. ఒక వేళ భారత్లో మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తే... ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను వరల్డ్కప్నకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మా బదులు స్కాట్లాండ్ ఆడుతుందా?‘మా స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేస్తుందని తెలియదు. భారత క్రికెట్ బోర్డు ఒత్తిడికి తలొగ్గి... ఐసీసీ మాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే మేము అంగీకరించము. గతంలో భారత్లో ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరిస్తే... వారి మ్యాచ్ల వేదికలను మార్చారు. మేం కూడా అదే కోరుతున్నాం’ అని ఆసిఫ్ అన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో... భారత్లో మ్యాచ్లు ఆడేందుకు ఆ జట్టు నిరాకరిస్తోంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ దశ మ్యాచ్లను కోల్కతా, ముంబైలో ఆడాల్సి ఉంది. ఇటీవల ఐసీసీతో జరిగిన భేటీలో తమ మ్యాచ్లను మార్చాలని బీసీబీ కోరింది. స్పందించని ఐసీసీగ్రూప్ ‘బి’లో ఉన్న ఐర్లాండ్ జట్టు లీగ్ దశలోని మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగానే ఆడనుండగా... తమ జట్టును గ్రూప్ ‘బి’లో వేసి తమ స్థానంలో ఐర్లాండ్కు అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై ఐసీసీ స్పందించలేదు. వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్తో కలిసి బంగ్లాదేశ్ గ్రూప్ ‘సి’లో ఉండగా... శ్రీలంక, ఆస్ట్రేలియా, ఓమన్, జింబాబ్వేతో కలిసి ఐర్లాండ్ గ్రూప్ ‘బి’లో ఉంది. చదవండి: న్యూజిలాండ్తో తొలి టీ20.. మూడో స్థానంలో వచ్చేది అతడే..! -
‘పోల్ వాల్ట్’ అథ్లెట్లకు అవమానం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు... పోల్వాల్ట్లో జాతీయ రికార్డు నెలకొలి్పన అథ్లెట్కు రైల్వే స్టేషన్లో అవమానం జరిగింది. టోర్నమెంట్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో క్రీడా సామగ్రితో కలిసి రైలులో ప్రయణించినందుకు గానూ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పన్వేల్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకోగా... సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించింది. అసలేం జరిగిందంటే... మంగళూరు వేదికగా జరిగిన ఆలిండియా యూనివర్సిటీ చాంపియన్షిప్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రికార్డు హోల్డర్ దేవ్ కుమార్ మీనాతో పాటు అతడి కోచ్ ఘన్శ్యామ్కు రైల్వే స్టేషన్లో వింత సమస్య ఎదురైంది. మంగళూరు నుంచి వస్తున్న సమయంలో ప్లేయర్లంతా తమ ‘పోల్’లను ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రైలులోని ఫ్యాన్ల పైభాగంలో ఉంచారు. అయితే ఇది గమనించిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)... ‘పోల్’లను ఇలా తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని వారిని రైలు నుంచి దింపాడు. రూ. 8 వేల జరిమానా కట్టాల్సిందేనని... లేకుంటే పోల్స్ తిరిగి ఇవ్వడం జరగదని హెచ్చరించాడు. అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొన్నట్లు వెల్లడించినా... రైల్వే అధికారులు వినలేదు. సుమారు ఐదు గంటల పాటు అథ్లెట్లను మానసిక వేదనకు గురిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మేము మంగళూరు నుంచి వస్తున్నాం. పన్వేల్ నుంచి భోపాల్ వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో రైల్వే సిబ్బంది మా క్రీడా సామగ్రిని తొలగించాలని చెప్పారు. అవి పోల్ వాల్ట్స్ అని... మేము టోర్నమెంట్లో పాల్గొని వస్తున్నామని వారికి చెప్పాం. అయితే క్రీడా సామాగ్రిని లగేజీ కంపార్ట్మెంట్లో వేయాలని... ఇలా ప్రయాణికులతో పాటు వాటిని ఉంచకూడదని చెప్పారు. పోల్వాల్ట్ కోసం వినియోగించే పోల్స్ ఫైబర్తో తయారవుతాయి. వాటి ధర కూడా ఎక్కువే. లగేజీలో వేస్తే విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే గతంలోనూ వాటిని మాతో పాటే తీసుకొని ప్రయాణించాం. ఎంత చెప్పినా అధికారులు అర్థం చేసుకోలేదు. పెద్ద ఎత్తున జరిమానా కట్టాలని ఒత్తిడి చేశారు. చివరకు దాదాపు 2 వేల రూపాయల జరిమానా అనంతరం మమ్మల్ని వదిలేశారు. ఇది మమ్మల్ని ఎంతగానో బాధించింది’ అని కోచ్ ఘన్శ్యామ్ వెల్లడించారు. దేవ్ కుమార్ మీనా గతేడాది జర్మనీ వేదికగా జరిగిన ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్లో 5.40 మీటర్ల ఎత్తు దూకి తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టాడు. కాగా రైల్వే శాఖ దీనిపై స్పందిస్తూ... ‘ప్లేయర్ల మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. మేము అథ్లెట్లను గౌరవిస్తాం. ఒక్కో పోల్ 5 మీటర్ల కంటే పొడవు ఉంది. దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాం’ అని వివరణ ఇచి్చంది. ఇది ఈ ఒక్కసారి ఎదురైన సమస్య కాదని... ప్రయాణ సమయంలో ప్రతీసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అథ్లెట్లు వాపోతున్నారు. క్రీడా పరికరాలను తీసుకెళ్లే విషయంలో కచి్చతమైన నియమాలను రూపొందించాలని కోరుతున్నారు. -
ఫైనల్ రిహార్సల్...
భారత జట్టు 2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వరుసగా ఎనిమిది సిరీస్లలో విజేతగా నిలిచింది. సరిగ్గా చెప్పాలంటే 36 మ్యాచ్లు ఆడితే 29 గెలిచి, 5 మాత్రమే ఓడిందంటే టీమ్ ఎలాంటి ఫామ్లో ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు మరో వరల్డ్కప్ టైటిల్ వేటలో చివరి రిహార్సల్గా సొంతగడ్డపై ఈ ఫార్మాట్లో పోరుకు టీమిండియా సిద్ధమైంది. అయితే ఈ విజయాల పర్వంలో తాము ఒక్కసారి కూడా తలపడని న్యూజిలాండ్ ఇప్పుడు ప్రత్యర్థిగా ఉంది. సంచలనాల కివీస్ను రెండేళ్లుగా టి20ల్లో భారత్ ఎదుర్కోలేదు. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఫలితం తర్వాత ఇప్పుడు టి20 సిరీస్ ఆసక్తిని రేపుతోంది.నాగ్పూర్: టి20 వరల్డ్ కప్కు ముందు చివరి సన్నాహకం కోసం భారత్, న్యూజిలాండ్ సన్నద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య ఐదు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు తొలి పోరు జరగనుంది. ఇటీవల సిరీస్ ఆడిన వన్డే టీమ్తో పోలిస్తే ఒకరిద్దరు మినహా భారత బృందం పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. మరోవైపు కివీస్ కూడా రెగ్యులర్ సభ్యులు అందుబాటులోకి రావడంతో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.టి20 వరల్డ్ కప్ ఇక్కడే జరగనుండటం, రెండు టీమ్లు కూడా ఐసీసీ టోరీ్నలో ఆడే టీమ్నే దాదాపుగా ఎంపిక చేయడంతో ఈ సిరీస్ సరైన ప్రాక్టీస్ కానుంది. తమ బలాబలాలను అంచనా వేసుకోవడంతో పాటు తుది జట్టు కూర్పుపై కూడా జట్లు దృష్టి పెట్టాయి. అనూహ్యంగా వన్డే సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగిన న్యూజిలాండ్ను భారత్ తక్కువగా అంచనా వేస్తే అదే ఫలితం పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. స్టార్లంతా సిద్ధం... బుమ్రా వచ్చేశాడు, హార్దిక్ పాండ్యా కూడా వచ్చాడు... మెరుపు ఆరంభాలకు అభిషేక్ శర్మ, సామ్సన్ కూడా సిద్ధం. ఎప్పటిలాగే భారత టి20 జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో ప్రతీ ఆటగాడు ఒంటిచేత్తో విజయం అందించే స్థాయిలో ఉన్నాడు. ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బుమ్రా, పాండ్యాలు సత్తా చాటితే టీమిండియాకు ఎదురే ఉండదు. శస్త్ర చికిత్స కారణంగా తొలి మూడు మ్యాచ్లకు దూరమైన తిలక్ వర్మకు బదులుగా శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసినా... మూడో స్థానంలో ఇషాన్ కిషన్ ఆడతాడని కెప్టెన్ సూర్యకుమార్ స్పష్టం చేసిన నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా సందేహాలు లేవు.ఏడు, ఎనిమిది స్థానాల్లో హిట్టర్లు రింకూ సింగ్, శివమ్ దూబే ఆడటం అంటే జట్టు బ్యాటింగ్ లోతు ఏమిటో తెలుస్తోంది. ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి భారం మోస్తారు. వన్డే సిరీస్లో కుల్దీప్ ప్రభావం చూపకపోయినా... టి20ల్లో ప్రత్యర్థిని కుప్పకూల్చగల సమర్థుడు. ఇన్ని సానుకూలతల మధ్య ఏదైనా ఆందోళన ఉందంటే అది కెప్టెన్ సూర్య ఫామ్ గురించి మాత్రమే. గత 22 ఇన్నింగ్స్లలో అతను అర్ధసెంచరీ సాధించలేకపోయాడు. జట్టు సారథిగా, విధ్వంసకర బ్యాటర్గా తనకున్న గుర్తింపును ప్రదర్శించేందుకు ఈ సిరీస్ అతనికి సరైన వేదిక. కెరీర్లో ఇది సూర్యకు 100వ టి20 మ్యాచ్ కానుంది. మిచెల్, ఫిలిప్స్పై దృష్టి... న్యూజిలాండ్ వన్డేల తరహాలో ఈ సిరీస్ కోసం కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే వన్డేల్లో సత్తా చాటిన డరైల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ మరోసారి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. టి20ల్లో మిచెల్కు కూడా మెరుగైన రికార్డు ఉండగా, ఫిలిప్స్ దూకుడుకు మారుపేరు. వన్డేల్లో విఫలమైన కాన్వే ఇక్కడ మెరుగ్గా ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. కివీస్ కూడా పలువురు టి20 స్పెషలిస్ట్లు చాప్మన్, డఫీ, సోధిలకు అవకాశం కల్పిస్తోంది. పేసర్ డఫీ చక్కటి ఫామ్లో ఉండగా... రచిన్ రవీంద్ర, కెప్టెన్ సాంట్నర్ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇటీవల ఆ్రస్టేలియాపై మెరుపు సెంచరీ చేసిన రాబిన్సన్ ఓపెనర్గా చెలరేగిపోగలడు. 1210 భారత్, న్యూజిలాండ్ మధ్య మొత్తం 25 టి20లు జరగ్గా... భారత్ 12 గెలిచి 10 ఓడింది. మరో 3 మ్యాచ్లు ‘టై’ అయ్యాయి. భారత్లో 2017, 2023లలో మూడు మ్యాచ్ల టి20 సిరీస్లు జరగ్గా... రెండూ భారత్ గెలిచింది.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, పాండ్యా, అక్షర్, రింకూ, దూబే, కుల్దీప్, బుమ్రా, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), రాబిన్సన్, కాన్వే, రచిన్, మిచెల్, ఫిలిప్స్, చాప్మన్, నీషమ్, హెన్రీ, సోధి, డఫీ. పిచ్, వాతావరణంబ్యాటింగ్, బౌలింగ్కు సమంగా అనుకూలించే మంచి స్పోర్టింగ్ వికెట్. అయితే స్పిన్నర్లు కొంత అదనపు ప్రభావం చూపగలరు. దేశంలో పెద్ద బౌండరీలు ఉన్న మైదానాల్లో ఒకటి కాబట్టి భారీ స్కోర్లు కష్టం. వర్షం సమస్య లేదు.సినెర్ గెలుపు బోణీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో శుభారంభం చేసిన డిఫెండింగ్ చాంపియన్ఐపీఎల్లో ‘జెమినై’రూ. 270 కోట్లతో ఒప్పందంన్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాన్సర్ల సుదీర్ఘ జాబితాలో ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక సంస్థ కూడా చేరింది. గూగుల్కు చెందిన ఏఐ ప్లాట్ఫామ్ ‘జెమినై’ ఐపీఎల్లో భాగస్వామిగా మారుతూ బీసీసీఐతో జత కట్టింది. ఇందు కోసం మూడేళ్ల కాలానికి ‘జెమినై’ రూ. 270 కోట్లు చెల్లిస్తుంది. భారత క్రికెట్లో ఏఐ ప్లాట్ఫామ్ల పాత్ర పెరిగేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్లో మరో ప్రముఖ సంస్థ, ‘జెమినై’కి పోటీదారు అయిన చాట్ జీపీటీ ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో స్పాన్సర్గా ఉండటం విశేషం. గత నవంబర్లోనే బీసీసీఐ ఈ ఒప్పందం చేసుకుంది. 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరుగుతుంది. -
ఢిల్లీని గెలిపించిన జెమీమా
వడోదర: జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కెప్టేన్ ఇన్నింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ను గెలిపించింది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ ఖాతాలో రెండో విజయం చేరింది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ (45 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టేన్ హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 41; 7 ఫోర్లు) రాణించారు.21 పరుగుల వద్దే ఓపెనర్లు సజన (9), హేలీ మాథ్యూస్ (12) నిష్క్రమించగా... హర్మన్, బ్రంట్ మూడో వికెట్కు 78 పరుగులు జోడించారు. క్యాపిటల్స్ బౌలర్లలో తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు లీజెల్లి లీ (28 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (29; 6 ఫోర్లు) తొలి వికెట్కు 63 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. ముంబైకిది ‘హ్యాట్రిక్’ పరాజయం. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లాడిన హర్మన్ బృందం కేవలం రెండు మ్యాచ్ల్లోనే గెలిచింది. డబ్ల్యూపీఎల్లో నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో యూపీ వారియర్స్ తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సజన (బి) నందిని 9; హేలీ మాథ్యూస్ (బి) మరిజాన్ కాప్ 12; నాట్ సీవర్ (నాటౌట్) 65; హర్మన్ప్రీత్ (సి) హామిల్టన్ (బి) శ్రీచరణి 41; నికోలా కేరీ (సి) స్నేహ్ రాణా (బి) శ్రీచరణి 12; అమన్జోత్ (సి) లీజెల్లి (బి) శ్రీచరణి 3; సంస్కృతి (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–21, 2–21, 3–99, 4–130, 5–134.బౌలింగ్: మరిజాన్ 4–0–8–1, హామిల్టన్ 4–0– 36–0, నందిని శర్మ 4–0–36–1, శ్రీచరణి 4–0– 33–3, స్నేహ్ రాణా 3–0–27–0, షఫాలీ వర్మ 1–0–14–0ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (బి) వైష్ణవి 29; లీజెల్లి లీ (స్టంప్డ్) రహిలా (బి) అమన్జోత్ 46; వోల్వార్డ్ (రనౌట్) 17; జెమీమా (నాటౌట్) 51; మరిజాన్ కాప్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–63, 2–84, 3–118.బౌలింగ్: షబి్నమ్ 4–0–26–0, నికోలా 1–0–13–0, నాట్ సీవర్ 4–0–42–0, సంస్కృతి 1–0–13–0, అమన్జోత్ 3–0–21–1, వైష్ణవి 4–0–20–1, హేలీ 2–0–19–0. -
బ్రెండన్ మెకల్లమ్పై వేటు.. ముహూర్తం ఫిక్స్!
ఇంగ్లండ్ 'బాజ్బాల్' వ్యూహం ఆస్ట్రేలియా గడ్డపై బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను 4-1 తేడాతో ఇంగ్లీష్ జట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్పై వేటు వేసేందుకు ఈసీబీ సిద్దమైనట్లు సమాచారం.మెకల్లమ్ కాంట్రాక్ట్ను పొడిగించే యోచనలో ఈసీబీ లేదంట. 'ది టెలిగ్రాఫ్' కథనం ప్రకారం.. టీ20 వరల్డ్ కప్-2026 తర్వాత మెక్కల్లమ్ను హెడ్కోచ్ పదవి నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు ఆల్ఫార్మాట్ హెడ్ కోచ్గా కొనసాగుతున్నాడు. తొలుత కేవలం టెస్టు జట్టు హెడ్కోచ్గా మాత్రమే కొనసాగిన మెక్కల్లమ్.. గతేడాది వైట్బాల్ క్రికెట్లో ప్రధాన కోచ్ పగ్గాలు చేపట్టాడు.అయితే మెకల్లమ్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాక ఆ జట్టు ఆటతీరులో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మెకల్లమ్ అప్పుడే కొత్తగా టెస్టు కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్తో కలిసి ‘బాజ్బాల్’కు శ్రీకారం చుట్టాడు. ‘బాజ్’ అన్నది మెకల్లమ్ ముద్దుపేరు. టీ20 శైలిలో దూకుడుగా ఆడుతూ టెస్టు క్రికెట్ రూపరేఖలనే ఇంగ్లండ్ మార్చేసింది.స్టోక్స్-మెకల్లమ్ ద్వయం కొన్నాళ్లపాటు అద్భుతం చేసింది. కానీ నెమ్మదిగా బాజ్బాల్కు బీటలు పడ్డాయి. ఇంగ్లీష్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. ఐసీసీ టోర్నీలతో పాటు ద్వైపాక్షిక సిరీస్లలో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిష్టత్మక యాషెస్ సిరీస్ను ఇంగ్లండ్ వరుసగా రెండోసారి కోల్పోయింది.అంతేకాకుండా జట్టు ఆన్ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ క్రమశిక్షణ కూడా లోపించింది. ఆసీస్ పర్యటన మధ్యలో ఆటగాళ్లు 'నూసా' (Noosa) రిసార్ట్కు వెళ్లడం, అక్కడ మితిమీరిన విందు వినోదాల్లో పాల్గొనడం వంటి అంశాలపై కూడా తీవ్ర స్దాయిలో విమర్శలు వచ్చాయి. ఆటగాళ్లకు మెకల్లమ్ అనుసరిస్తున్న తీరు జట్టు క్రమశిక్షణను దెబ్బతీస్తోందని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలోనే అతడిని తప్పించేందుకు ఈసీబీ సిద్దమైంది. ఒకవేళ మెక్కల్లమ్ స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
చెలరేగిన బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ 2026లో (WPL) ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ మారిజాన్ కాప్ (4-0-8-1) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. కాప్తో పాటు శ్రీ చరణి (4-0-33-3), నందిని శర్మ (4-0-36-1) కూడా సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లూసీ హ్యామిల్టన్ (4-0-36-0), స్నేహ్ రాణా (3-0-27-0) ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. షఫాలీ వర్మ ఓ ఓవర్ వేసి 14 పరుగులు సమర్పించుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో నాట్ సీవర్ బ్రంట్ (65 నాటౌట్) అజేయ అర్ద శతకంతో రాణించింది. ఆమెకు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (41) సహకరించింది. వీరిద్దరు సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో సంజీవన్ సజనా (9), హేలీ మాథ్యూస్ (12), నికోలా కేరీ (12), అమన్జోత్ కౌర్ (3) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆఖర్లో సంస్కృతి గుప్త (10 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది.కాగా, ప్రస్తుత ఎడిషన్లో ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి, ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.పేరుకు రెండో స్థానంలో ఉన్నా, ముంబైకి ఈ స్థానం గ్యారెంటీ కాదు. ఎందుకంటే మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉన్నాయి. యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ కూడా ఐదు మ్యాచ్ల్లో తలా రెండేసి విజయాలు సాధించి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. 4 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది. -
భారత్తో తొలి టీ20.. న్యూజిలాండ్ తుది జట్టు ఇదే..!
భారత్-న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్పూర్ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం. ప్రపంచకప్కు ముందు జరుగబోయే చివరి సిరీస్ కావడంతో ఈ సిరీస్లో న్యూజిలాండ్ అన్ని కాంబినేషన్లను పరీక్షించే అవకాశం ఉంది.ఓపెనర్లుగా టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే బరిలోకి దిగడం లాంఛనమే. వీరిలో రాబిన్సన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కాన్వే టీ20 ఫామ్ కాస్త కలవరపెడుతున్నా, ఇతర ఫార్మాట్లలో మంచి టచ్లో ఉండటం ఊరట కలిగించే అంశం. ఫస్ట్ ఛాయిస్ వికెట్కీపర్ కావడంతో తుది జట్టులో కాన్వే స్థానం పక్కా. వన్డౌన్లో రచిన్ రవీంద్ర రావడం కూడా దాదాపుగా ఖాయమే. రచిన్కు ఈ స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 మ్యాచ్ల్లో 143.81 స్ట్రయిక్రేట్తో 325 పరుగులు చేశాడు. స్పిన్ బౌలర్లపై ఎదురుదాడి చేయగల సమర్దత రచిన్ను ఈ స్థానానికి ఫిక్స్ చేస్తుంది.న్యూజిలాండ్ మిడిలార్డర్లో చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ ఆ జట్టుకు ఎలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం రాదు. నాలుగో స్థానంలో డారిల్ మిచెల్, ఆతర్వాత మార్క్ చాప్మన్, మైఖేల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి బలమైన హిట్టర్లు, ఆల్రౌండర్లు ఉన్నారు. సమయానుసారంగా వీరి స్థానాల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.లోయర్ ఆర్డర్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా దాదాపు అన్ని బెర్త్లు ఖరారై ఉన్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్ కమ్ బ్యాటర్గా మిచెల్ సాంట్నర్ ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సిరీస్లో సాంట్నర్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేయవచ్చు. సాంట్నర్కు భారత్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ అతను ఆడిన 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు.న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ విభాగం మిగతా విభాగాల కంటే అత్యంత పటిష్టంగా ఉంది. గతేడాది ఫార్మాట్లకతీతంగా చెలరేగిన మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ తుది జట్టులో ఉంటారు. వీరికి మరో ఇన్ ఫామ్ పేసర్ కైల్ జేమీసన్ జత కలుస్తాడు. ఈ ముగ్గురితో కివీస్ పేస్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది.ఐష్ సోది డౌటే..!భారత్పై ఐష్ సోధికి అద్భుత రికార్డు (20 మ్యాచ్లు, 25 వికెట్లు, ఎకానమీ 7.54) ఉన్నా, జట్టు కాంబినేషన్ కారణంగా తొలి మ్యాచ్లో అతనికి ఆడే అవకాశం రాకపోవచ్చు. సాంట్నర్తో పాటు రవీంద్ర, బ్రేస్వెల్, చాప్మన్, ఫిలిప్స్ స్పిన్ ఆప్షన్లుగా అందుబాటులో ఉన్నారు.భారత్తో తొలి టీ20కి న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా): మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, టిమ్ రాబిన్సన్, మైఖేల్ బ్రేస్వెల్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్. -
న్యూజిలాండ్తో తొలి టీ20.. టీమిండియా కెప్టెన్ కీలక ప్రకటన
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రేపు (జనవరి 21) నాగ్పూర్ వేదికగా తొలి టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో టీమిండియాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ అందుతుంది. ఈ మ్యాచ్లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ వన్డౌన్లో బరిలోకి దిగుతాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రకటించాడు.ISHAN KISHAN LOCKED 🔐 - Ishan will bat at 3 tomorrow for India. 🇮🇳pic.twitter.com/rHXco5dmLN— Johns. (@CricCrazyJohns) January 20, 2026రెండు సంవత్సరాల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్పై మేనేజ్మెంట్ పూర్తి నమ్మకంతో ఉందని పేర్కొన్నాడు. స్కై చేసిన ఈ ప్రకటనలో తొలి టీ20లో భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసింది. ఇషాన్ జట్టులోకి వస్తే, శ్రేయస్ అయ్యర్ బెంచ్కు పరిమితం కాక తప్పదు. తిలక్ వర్మ స్థానాన్ని అతనిలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఇషాన్ భర్తీ చేయగలడని మేనేజ్మెంట్ నమ్ముతున్నట్లుంది. అందుకే శ్రేయస్ కంటే ఇషాన్కే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సూర్యకుమార్ మాటల ద్వారా స్పష్టమవుతుంది.ఇషాన్ చివరిగా 2023లో భారత్ తరఫున ఆడాడు. ఆతర్వాత స్వతాహాగా విరామం తీసుకొని బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండటంతో తిరిగి టీమిండియా తలుపులు తట్టాడు. ప్రపంచకప్కు ఇషాన్ ఎంపిక అనూహ్యంగా జరిగింది. ఇషాన్ను జట్టులోకి తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రపంచకప్కు ఎంపిక చేసిన జట్టే న్యూజిలాండ్ సిరీస్కు కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే.జట్టులోకి వచ్చినా తిలక్ గాయపడకుంటే, ఇషాన్కు అవకాశం వచ్చేది కాదు. తిలక్ గాయం ఇషాన్కు కొత్త లైఫ్ ఇచ్చినట్లైంది.వరల్డ్ కప్కు ముందు కీలక సిరీస్ స్వదేశంలో న్యూజిలాండ్తో రేపటి నుంచి ప్రారంభమయ్యే సిరీస్ ప్రపంచకప్కు ముందు టీమిండియాకు చాలా కీలకమైంది. అందుకోసమే ప్రపంచకప్ జట్టునే ఈ సిరీస్కు కూడా కొనసాగించారు. ఈ సిరీస్కు ముందు భారత్ న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది (1-2). టీ20 సిరీస్కు ఎంపిక చేసిన వారిలో తిలక్ వర్మతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడ్డాడు. తిలక్ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్, సుందర్ స్థానాన్ని రవి బిష్ణోయ్ భర్తీ చేశారు. అయితే వీరిద్దరికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చు.తొలి టీ20లో భారత తుది జట్టు కూర్పు ఇలా ఉండవచ్చు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వన్డౌన్లో ఇషాన్ కిషన్, ఆతర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి రావచ్చు.షెడ్యూల్..తొలి టీ20- నాగ్పూర్రెండో టీ20- రాయ్పూర్మూడో టీ20- గౌహతినాలుగో టీ20- విశాఖపట్నంఐదో టీ20- తిరువనంతపురం -
ముంబై ఇండియన్స్కు ఎదురుదెబ్బ
డబ్ల్యూపీఎల్ 2026 ఎడిషన్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్కు పెద్దగా కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో రెండే విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నా, మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉండటంతో ఈ స్థానానికి గ్యారెంటీ లేదు. యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ కూడా ఐదు మ్యాచ్ల్లో చెరో రెండు విజయాలు సాధించి, ముంబై ఇండియన్స్తో పాటు 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.ఈ ఎడిషన్లో ఆశించిన విజయాలు సాధించలేకపోతున్న ముంబై ఇండియన్స్కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్కీపింగ్ బ్యాటర్ జి కమిలిని గాయం బారిన పడి ఎడిషన్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానాన్ని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మతో భర్తీ చేసింది.17 ఏళ్ల కమిలిని ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ముంబై ఇండియన్స్కు నమ్మదగిన బ్యాటర్గా ఉండింది. ఆమె లేని లోటు ఎంఐ బ్యాటింగ్ ఆర్డర్ను ప్రభావితం చేయవచ్చు.వైష్ణవి శర్మతో భర్తీ 20 ఏళ్ల వైష్ణవి శర్మను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలతో జట్టులోకి తీసుకుంది. వైష్ణవి 2025 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కీలక సభ్యురాలు. ఇటీవలే ఆమె టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేసింది. డబ్ల్యూపీఎల్కు ముందు శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో వైష్ణవి ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. డబ్ల్యూపీఎల్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు సైతం వైష్ణవి ఎంపికైంది. వైష్ణవి చేరికతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం బలపడనుంది. ముంబై ఇండియన్స్ ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది.ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆ జట్టుకు చాలా కీలకం. -
రేపటి నుంచి భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్
భారత్, న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్కు నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే జియో హాట్స్టార్ యాప్ మరియు వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.షెడ్యూల్..తొలి టీ20- నాగ్పూర్రెండో టీ20- రాయ్పూర్మూడో టీ20- గౌహతినాలుగో టీ20- విశాఖపట్నంఐదో టీ20- తిరువనంతపురంఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లు రాత్రి 7 గంటలకే, పైన పేర్కొన్న మాధ్యమాల ద్వారానే ప్రత్యక్ష ప్రసారమవుతాయి.జట్లు..భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, టిమ్ రాబిన్సన్, మైఖేల్ బ్రేస్వెల్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, జకరీ ఫౌల్క్స్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్, ఐష్ సోది, క్రిస్టియన్ క్లార్క్ఈ సిరీస్ ప్రారంభ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్లు, వాటి ఫలితాలు, అందులోని విశేషాలపై ఓ లుక్కేద్దాం.భారత్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు 8 ద్వైపాక్షిక టీ20 సిరీస్లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్ మూడు, భారత్ ఐదింట విజయాలు సాధించింది. ఇరు జట్ల మధ్య 2008-09లో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ను న్యూజిలాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.ఆతర్వాత 2012లో న్యూజిలాండ్ తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు భారత్లో పర్యటించింది. 2 మ్యాచ్ల ఈ సిరీస్ను కూడా న్యూజిలాండే కైవసం చేసుకుంది (1-0).అనంతరం 2017-18లో న్యూజిలాండ్ మరోసారి భారత్లో పర్యటించింది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్కు భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొని, తొలిసారి న్యూజిలాండ్పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది.ఆ మరుసటి ఏడాది (2018-19) భారత్ న్యూజిలాండ్లో పర్యటించి, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ను ఆతిథ్య జట్టే 2-1 తేడాతో చేజిక్కించుకుంది.2019-20లో భారత్ మరోసారి న్యూజిలాండ్లో పర్యటించింది. ఈ పర్యటన భారత టీ20 క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ 5-0తో క్లీన్ స్వీప్ చేసి, ఆతిథ్య జట్టుకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. విరాట్ కోహ్లి టీ20 కెరీర్లోనూ ఈ సిరీస్ చిరస్మరణీయంగా మిగిలిపోయింది.అనంతరం 2021-22లో న్యూజిలాండ్ 3 మ్యాచ్ల సిరీస్ కోసం భారత్లో పర్యటించింది. ఈ సిరీస్ను కూడా భారత్ క్లీన్స్వీప్ (3-0) చేసింది.2022-23లో ఇరు జట్ల మధ్య రెండు సార్లు ద్వైపాక్షిక సిరీస్లు జరిగాయి. రెండు సిరీస్లను టీమిండియానే కైవసం చేసుకుంది. తొలుత పర్యాటక జట్టుగా 1-0తో.. ఆతర్వాత ఆతిథ్య జట్టుగా 2-1తో సిరీస్లను కైవసం చేసుకుంది.శుభ్మన్ గిల్ విధ్వంసకర శతకంఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్లో ప్రస్తుత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో గిల్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 126 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ను 168 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి సిరీస్ను కైవసం చేసుకుంది. -
ఆసీస్ దిగ్గజ క్రికెటర్ కొడుకుకు ప్రతిష్టాత్మక అవార్డు
ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డారెన్ లెహ్మన్ కొడుకు జేక్ లెహ్మన్కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ 33 ఏళ్ల ఎడమ చేతి బ్యాటర్ను 2024-25 సీజన్కు గానూ మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జేక్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాక ఈ అవార్డు లభించింది.ఆసీస్ దేశవాలీ క్రికెట్లో సుదీర్ఘంగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు రాకపోవడంతో జేక్ గత నెలలోనే తన బ్రిటిష్ పాస్పోర్ట్ ఆధారంగా ఇంగ్లండ్కు వలస వెళ్లాడు. అక్కడ అతను హ్యాంప్షైర్ కౌంటీతో లోకల్ ప్లేయర్ కేటగిరీలో రెండు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నాడు. ఓ ఆటగాడు ఇతర దేశం తరఫున లోకల్ కేటగిరీలో అవకాశం దక్కించుకుంటే, తన సొంత దేశానికి ఆడే అర్హత కోల్పోతాడు. జేక్ విషయంలో ఇదే జరిగింది. జేక్ హ్యాంప్షైర్తో ఒప్పందం చేసుకోవడం వల్ల ఆస్ట్రేలియాకు ఆడాలన్న తన కలను చెరిపేసుకున్నాడు.షెఫీల్డ్ షీల్డ్లో రికార్డు ప్రదర్శన జేక్ 2024-25 షెఫీల్డ్ షీల్డ్ సీజన్లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున రికార్డు ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్ల్లో నాలుగు వరుస సెంచరీల సాయంతో 44.11 సగటున 750 పరుగులు చేశాడు. ఆ సీజన్ ఫైనల్లో జేక్ చేసిన సెంచరీ దక్షిణ ఆస్ట్రేలియాకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రెడ్బాల్ టైటిల్ను అందించింది.తండ్రి వారసత్వం జేక్ తండ్రి డారెన్ లెహ్మన్ తన జమానాలో మూడుసార్లు డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు అతని కుమారుడు జేక్ కూడా ఆ అవార్డును తొలిసారి గెలుచుకుని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఈ అవార్డుకు ఎంపికైన తర్వాత జేక్ మాట్లాడుతూ .. ఇది నాకు షాక్లా అనిపించింది. గత 18 నెలలుగా మంచి క్రికెట్ ఆడుతున్నాను. సహచరులు, ప్రత్యర్థులు ఇచ్చిన గుర్తింపు ప్రత్యేకమైనది. ఈ అవార్డు నాకు గౌరవమని అన్నాడు. ఆస్ట్రేలియాకు ఆడటం నా కలజేక్ ఆసీస్ తరఫున ఆడే అవకాశాల కోసం సుదీర్ఘంగా ఎదురుచూసి గత నెలలోనే ఇంగ్లండ్ కౌంటీ హ్యాంప్షైర్తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు ఆడటం నా కల. కానీ అది సాధ్యం కాలేదు. అయినా 12 సంవత్సరాలుగా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడినందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సమయం ఆసన్నమైందని అన్నాడు. -
నీ లక్ష్యం ఏమిటి?.. హార్దిక్తో గంభీర్.. వీడియో వైరల్
సొంతగడ్డపై న్యూజిలాండ్కు వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. టీ20లలోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు సన్నాహకంగా కివీస్తో జరిగే ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే సూర్యకుమార్ సేన ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది.హార్దిక్ పాండ్యా రీఎంట్రీహెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) మార్గదర్శనంలో టీమిండియా స్టార్లు నెట్స్లో చెమటోడ్చారు. ఇక న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా చాన్నాళ్ల తర్వాత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పునరాగమనం చేయనున్నాడు. ఆసియా టీ20 కప్-2025 మ్యాచ్లో గాయపడ్డ అతడు అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో సొంత జట్టు బరోడా తరఫున బరిలోకి దిగిన హార్దిక్.. మంచి ఫామ్లో ఉన్నాడు. కివీస్తో టీ20 సిరీస్, ప్రపంచకప్ టోర్నీల్లోనూ ఇదే జోరు కనబరచాలని భావిస్తున్నాడు. ఎక్కడికి ఎక్కుపెట్టావు?ఇందుకు తగ్గట్లుగానే ప్రాక్టీస్ సెషన్లో బంతితో, బ్యాట్తో హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. ముఖ్యంగా గంభీర్ చూస్తుండగా భారీ షాట్లతో దుమ్ములేపిన ఈ ఆల్రౌండర్.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా గంభీర్- హార్దిక్ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్గా మారింది.పవర్ఫుల్ హిట్టింగ్తో షాట్లు బాదే క్రమంలో హార్దిక్ పాండ్యా తనకు ఎదురుగా ఉన్న వారిని పక్కకు జరగమని చెప్పాడు. ఇందుకు నవ్వుతూ బదులిచ్చిన గంభీర్.. ‘‘నువ్వు ఎక్కడికి బంతిని తరలించబోతున్నావు.. నీ లక్ష్యం ఏమిటి?’’ అని అడిగాడు. ఇందుకు హార్దిక్.. ‘‘మొదటి టైర్లోకి’’ అని బదులిచ్చాడు. ఇంతలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుంటూ.. ‘‘అన్నీ సెకండ్ టైర్లోకే కొడుతున్నాడు’’ అంటూ నవ్వులు చిందించాడు. బుమ్రా కూడాఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కివీస్తో టీ20 సిరీస్తో తిరిగి టీమిండియాతో చేరాడు. కాగా జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక వేదికలు.చదవండి: శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్!Sound On 🔊 Dialling up the intensity as #TeamIndia steps into T20I mode to take on New Zealand ⚡️ #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/RSE2DXLFXA— BCCI (@BCCI) January 20, 2026 -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
మహిళల ఐపీఎల్లో (WPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్ చరిత్రలో వరుసగా ఆరు విజయాలు సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. నిన్న (జనవరి 19) గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించిన ఈ జట్టు.. అంతకుముందు ఇదే ఎడిషన్లో (2026) ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్పై వరుస విజయాలు సాధించింది. FIRST TEAM TO PLAYOFFS - ITS RCB...!!!!- The Historic moment with 6 consecutive wins. 💥 pic.twitter.com/ufVqDnuPZq— Johns. (@CricCrazyJohns) January 19, 2026అంతకుముందు ఎడిషన్లో (2025) తమ చివరి మ్యాచ్లోనూ ముంబై ఇండియన్స్ను మట్టికరిపించిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్లో వరుసగా ఆరు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. లీగ్ చరిత్రలో ఏ జట్టు వరుసగా ఇన్ని మ్యాచ్ల్లో విజయాలు సాధించలేదు. గతంలో ముంబై ఇండియన్స్ రెండు సార్లు వరుసగా ఐదు మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. ఆర్సీబీనే గతంలో ఓ సారి వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలుపొందింది.ప్లే ఆఫ్స్కు ఆర్సీబీతాజాగా గుజరాత్ జెయింట్స్పై విజయంతో ఆర్సీబీ ఈ ఎడిషన్లో ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ప్లే ఆఫ్స్కు ముందు ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. 24న ఢిల్లీతో, 26న ముంబై ఇండియన్స్తో, 29న యూపీతో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ల్లో ఓడినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్లో ఉంటుంది.నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటి గుజరాత్ను 61 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసి, అనామక ప్లేయర్ గౌతమి నాయక్ (55 బంతుల్లో 73; 7 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మంధన (26), రిచా ఘోష్ (27) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో రాధా యాదవ్ (17), శ్రేయాంక పాటిల్ (8 నాటౌట్) బ్యాట్ ఝులిపించారు. గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్, ఆష్లే గార్డ్నర్ తలో 2, రేణుకా సింగ్, సోఫి డివైన్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 179 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ పూర్తిగా చేతులెత్తేసింది. సయాలి సత్ఘరే (4-0-21-3), డి క్లెర్క్ (4-0-17-2), లారెన్ బెల్ (4-1-23-1), రాధా యాదవ్ (4-0-34-1), శ్రేయాంక పాటిల్ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్లో ఆష్లే గార్డ్నర్ (54) ఒంటరిపోరాటం చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. అనుష్క శర్మ (18), భారతి ఫుల్మాలి (14), తనుజా కన్వర్ (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
వెస్టిండీస్కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్
ఇటీవలికాలంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు వెస్టిండీస్కు వరుసగా షాకులిస్తుంది. తాజాగా అదే సీన్ రిపీటైంది.దుబాయ్ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్లో ఆఫ్ఘన్ జట్టు విండీస్పై 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఇబ్రహీం జద్రాన్ (56 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), దర్విష్ రసూలీ (59 బంతుల్లో 84; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ అందించారు. వీరిద్దరూ చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. సెదిఖుల్లా అటల్ 2 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ తీశారు.అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. జియా ఉర్ రెహ్మాన్ (4-0-36-3), రషీద్ ఖాన్ (4-0-19-2), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (4-0-29-2), నూర్ అహ్మద్ (3-0-34-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. విండీస్ ఇన్నింగ్స్లో సాంప్సన్ (30) టాప్ స్కోరర్గా కాగా.. జాన్సన్ ఛార్లెస్ (27), మోటీ (28), ఫోర్డ్ (25) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటరల్లో ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్ చెరో 4, జాంగూ, హెట్మైర్, పియెర్రీ తలో 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ సిరీస్లోని రెండో టీ20 రేపు (జనవరి 21) ఇదే వేదికగా జరుగనుంది. -
శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్!
చాన్నాళ్లుగా టీమిండియా తరఫున వన్డేలకే పరిమితమయ్యాడు శ్రేయస్ అయ్యర్. దేశవాళీ టీ20 టోర్నీలో పరుగుల వరద పారించినా.. జట్టులో ఇప్పటికే పాతుకుపోయిన ఆటగాళ్ల కారణంగా అతడికి భారత టీ20 జట్టులో స్థానం కరువైంది.అయితే, తిలక్ వర్మ గాయం కారణంగా అనూహ్య రీతిలో ఇటీవలే శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో పునరాగమనం చేసే అవకాశం దక్కించుకున్నాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma)గాయపడిన విషయం తెలిసిందే.శస్త్రచికిత్స విజయవంతంపొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడికి టెస్టిక్యులర్ టార్షన్ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం ధ్రువీకరించింది.వేగంగా కోలుకుంటున్న తిలక్స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మూడు మ్యాచ్లకు తిలక్ వర్మ దూరమయ్యాడని బోర్డు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ హైదరాబాదీ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం తిలక్ వర్మ వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం.బరిలోకి దిగేందుకు సైటైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. తిలక్ వర్మకు నొప్పి నుంచి విముక్తి లభించింది. ఇప్పటికే అతడు ఫిజికల్ ట్రెయినింగ్ మొదలుపెట్టాడు. ఫిట్నెస్ పరీక్ష కోసం అతడు మంగళవారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కి చేరుకుంటాడు.ఒకవేళ ఫిట్నెస్ నిరూపించుకుంటే కివీస్తో నాలుగో టీ20 (జనవరి 28)కి తిలక్ వర్మ అందుబాటులోకి వస్తాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ స్థానం గల్లంతు కావడం ఖాయం. అదే విధంగా.. తిలక్ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్-2026లో ఆడాలన్న ఈ ముంబైకర్ ఆశలపై కూడా నీళ్లు చల్లినట్లు అవుతుంది. కాగా గత రెండేళ్లుగా భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన తిలక్ వర్మ.. ఆసియా కప్-2025 ఫైనల్లో జట్టును గెలిపించి ప్రశంసలు అందుకున్నాడు.న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (తొలి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయి.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్! -
గిల్ కెప్టెన్సీపై అశ్విన్ ఘాటు విమర్శలు
టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత శుబ్మన్ గిల్ టీమిండియా సారథిగా పగ్గాలు చేపట్టాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించి మరీ ఆ బాధ్యతలను గిల్కు అప్పగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).అయితే, పూర్తి స్థాయి కెప్టెన్గా గిల్ (Shubman Gill) ఇంత వరకు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ సాధించలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేయగలిగాడు. అయితే, స్వదేశంలో వెస్టిండీస్ను 2-0తో టెస్టుల్లో వైట్వాష్ చేసినా.. సౌతాఫ్రికా చేతిలో పాతికేళ్ల తర్వాత భారత్ తొలిసారి 2-0తో వైట్వాష్కు గురైంది.అశూ స్పందన ఇదేతాజాగా గిల్ సేనకు న్యూజిలాండ్ చేతిలోనూ ఘోర పరాభవం ఎదురైంది. కివీస్ జట్టు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా ఈ విషయంపై స్పందించాడు.ధోని, రోహిత్లను చూసి నేర్చుకోకివీస్ సిరీస్లో ముఖ్యంగా ఇండోర్లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్ అనుసరించిన వ్యూహాలను అశూ తప్పుబట్టాడు. ఈ మేరకు.. ‘‘మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలను గొప్ప కెప్టెన్లు అని ఎందుకు ప్రశంసిస్తారో తెలుసు కదా!వారిద్దరికి ఏ సమయంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో బాగా తెలుసు. తమకు ఉన్న వనరులను వారు ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకుంటారు. ఏ బ్యాటర్కు ఏ బౌలర్తో బౌలింగ్ వేయించాలో వాళ్లకు బాగా తెలుసు. అయితే, కివీస్తో సిరీస్లో ఇది మిస్సయింది.ఎంతమాత్రం సరికాదుఈ విషయంలో గిల్ కెప్టెన్సీలో లోపాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో బాగా ఆడకపోయినంత మాత్రాన నీ బౌలర్లపై నమ్మకం కోల్పోతావా? కెప్టెన్కు ఇది ఎంతమాత్రం సరికాదు. ముఖ్యంగా మూడో వన్డేలో గ్లెన్ ఫిలిప్స్ ఫాస్ట్ బౌలర్లను చితకబాదుతుంటే.. మధ్య ఓవర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎందుకు బరిలోకి దించలేదు.అతడితో రెండు ఓవర్లు వేయించి ఉంటే మ్యాచ్ వేరే విధంగా ఉండేది. డారిల్ మిచెల్ విషయంలోనూ అనుకున్న ఫలితం రాబట్టగలిగేవాళ్లు. అందుబాటులో ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అన్నింటికంటే పెద్ద వైఫల్యం. ఒకవేళ అన్ని సరిగ్గా చేసినా ఓడిపోతే అదివేరు. కానీ ఇక్కడ మీ బెస్ట్ బౌలర్ల సేవలను సరైన సమయంలో ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు’’ అని అశ్విన్.. గిల్ కెప్టెన్సీపై ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: భారత్ నెత్తిన మిచెల్ పిడుగువాళ్లను పక్కనపెడతారా?: గిల్పై రహానే, జహీర్ ఖాన్ ఫైర్! -
బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలనాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల విషయంలో పెను మార్పులు చేయాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్టులో నాలుగు కేటగిరీలు ఉన్న విషయం తెలిసిందే. A+, A, B, C అనే గ్రేడ్లు ఉన్నాయి. చివరగా గతేడాదికి గానూ ఏప్రిల్లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. దీని ప్రకారం..రూ. 7 కోట్ల వార్షిక వేతనంA+ గ్రేడ్లో బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ప్రధాన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఉన్నారు. వీరికి రూ. 7 కోట్ల వార్షిక వేతనం లభిస్తుంది.వీరికి ఐదు.. వారికి మూడుఇక A గ్రేడ్లో ఉన్న రిషభ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, హార్దిక్ పాండ్యాలు రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నారు. అదే విధంగా.. B గ్రేడ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్లకు రూ. 3 కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది.వీళ్లందరికి కోటిఇక C గ్రేడ్లో ఉన్న రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలకు రూ. కోటి వేతనం అందుతోంది.A+ గ్రేడ్ను ఎత్తివేసే యోచనతాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది వార్షిక క్రాంటాక్టుల విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. A+ గ్రేడ్ను ఎత్తివేసి.. A, B, C అనే మూడు గ్రేడ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, వార్షిక వేతనం విషయంలోనూ ఈ మార్పులు వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.రో-కోకు భారీ షాక్తదుపరి అపెక్స్ మీటింగ్లో ఈ విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అగార్కర్ అండ్ కో ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపితే.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు భారీ షాక్ తప్పదు. ప్రస్తుతం వీరిద్దరు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి ఈసారి వీరిని B గ్రేడ్లోకి వేసే అవకాశం ఉంది.ఈ నలుగురు అంతేకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత రో-కోలతో పాటు జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇక గతేడాది రో-కో టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ప్రధాన పేసర్ బుమ్రా పనిభారం తగ్గించుకునే క్రమంలో పలు కీలక సిరీస్లకు దూరమవుతున్నాడు. ఇలా A+ గ్రేడ్లో ఉన్న నలుగురు ఆటగాళ్లు గత కొంతకాలంగా జాతీయ విధుల్లో ఏదో ఒక ఫార్మాట్కు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.చదవండి: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి -
కోహ్లికే షాకిచ్చాడు!.. కివీస్ యంగ్స్టార్కి గోల్డెన్ ఛాన్స్
భారత్తో టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టులో ఓ మార్పు చేసినట్లు మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో వన్డే సిరీస్లో సత్తా చాటిన యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ (Kristian Clarke)కు టీ20 జట్టులోనూ చోటు ఇచ్చినట్లు తెలిపింది.మూడు మ్యాచ్లకుఅయితే, తొలి మూడు టీ20లకు మాత్రమే క్లార్క్ను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. స్టార్ ఆటగాడు మైకేల్ బ్రేస్వెల్ (Michael Bracewell) గాయపడిన కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘‘ఇండియాలో పర్యటిస్తున్న బ్లాక్కాప్స్ (న్యూజిలాండ్)తో బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్టియన్ క్లార్క్ అక్కడే ఉండిపోతాడు.ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మూడు మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉంటాడు. ఇండోర్లో ఆదివారం నాటి ఆఖరి వన్డే సందర్భంగా మైకేల్ బ్రేస్వెల్ గాయపడ్డాడు. అయినప్పటికీ నాగ్పూర్లో తొలి టీ20 కోసం అతడు జట్టుతో ప్రయాణిస్తాడు.అయితే, పిక్కల్లో గాయంతో బాధపడుతున్న అతడి పరిస్థితిని వైద్యులు పర్యవేశక్షిస్తున్నారు. అతడు పూర్తి టూర్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది త్వరలోనే తేలుతుంది’’ అని న్యూజిలాండ్ క్రికెట్ తమ ప్రకటనలో పేర్కొంది.అరంగేట్రంలోనే..కాగా మైకేల్ బ్రేస్వెల్ కెప్టెన్సీలో టీమిండియాతో వన్డే సిరీస్ ఆడిన కివీస్ జట్టు.. భారత గడ్డపై తొలిసారి సిరీస్ కైవసం చేసుకుంది. ద్వితీయ శ్రేణి జట్టుతోనే 2-1 తేడాతో గిల్ సేనను ఓడించి సత్తా చాటింది. ఇక ఈ సిరీస్ సందర్భంగానే క్రిస్టియన్ క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.కోహ్లికే షాకిచ్చాడుభారత్తో తొలి వన్డేలో హర్షిత్ రాణాను అవుట్ చేసి తన ఖాతాలో తొలి వికెట్ జమచేసుకున్న క్లార్క్.. రెండు, మూడో వన్డేల్లో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లిని పెవిలియన్కు పంపాడు. రెండో వన్డేలో మొత్తంగా 3 వికెట్లు తీసిన 24 ఏళ్ల ఈ రైటార్మ్ మీడియం పేసర్.. మూడో వన్డేలోనూ మూడు వికెట్లతో సత్తా చాటాడు.ఈ క్రమంలోనే టీ20 సిరీస్ జట్టులోనూ క్రిస్టియన్ క్లార్క్ స్థానం సంపాదించగలిగాడు. ఈ విషయం గురించి న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘వన్డే సిరీస్లో తన ప్రతిభ ఏమిటో అతడు నిరూపించుకున్నాడు.తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ రాణించి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అందుకే టీ20 సిరీస్ జట్టులోనూ అతడికి చోటు దక్కింది’’ అని పేర్కొన్నాడు.టీమిండియాతో టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టు (అప్డేటెడ్)మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జెమీషన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి, క్రిస్టియన్ క్లార్క్ (మొదటి 3 మ్యాచ్లకు).షెడ్యూల్: జనవరి 21, 23, 25, 28, 31టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి న్యూజిలాండ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: Sunil Gavaskar: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి -
అంతా అమ్మే చేసింది.. నా కాపురం కూల్చేసే కుట్ర
ఇంగ్లండ్ ఫుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్ దంపతులపై వారి కుమారుడు బ్రూక్లిన్ బెక్హామ్ సంచలన ఆరోపణలు చేశాడు. ముఖ్యంగా తల్లి విక్టోరియా బెక్హామ్ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులను షాక్కు గురి చేస్తున్నాయి. బ్రూక్లిన్ పెళ్లి సమయంలో అతడికి తల్లిదండ్రులతో తలెత్తిన విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి.కుటుంబంతో కలిసే ప్రసక్తే లేదుఈ క్రమంలోనే భార్య, అమెరికన్ నటి నికోలా పెల్జ్ట్తో కలిసి అమెరికాకు వెళ్లిపోయిన బ్రూక్లిన్ అక్కడే నివసిస్తున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెంచుకునేందుకు సిద్ధమైనట్లు తాజాగా అతడు పునరుద్ఘాటించాడు. ఇందుకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్టులు పెడుతూ సంచలన ఆరోపణలకు దిగాడు.‘‘చాలా ఏళ్లుగా నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. దురదృష్టవశాత్తూ నా తల్లిదండ్రులు, వారి టీమ్ పదే పదే నన్ను విసిగిస్తూ పబ్లిక్గా మాట్లాడేలా చేశారు. నా గురించి వస్తున్న అబద్ధాలకు సమాధానంగా.. ఇప్పటికైనా నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను.ఇకపై నా కుటుంబంతో తిరిగి కలిసేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేను. ఇతరుల నియంత్రణ, ఆధీనంలో బతకడం నాకు ఇష్టం లేదు. జీవితంలో తొలిసారి నాకోసం నేను నిలబడ్డాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని నా తల్లిదండ్రులే కంట్రోల్ చేశారు. మీడియాలో నా గురించి ఏదేదో రాసేలా చేశారు.మరీ హద్దులు దాటి..ఇటీవలి కాలంలో వాళ్లు సోషల్ మీడియాలో మరీ హద్దులు దాటి.. నాపై ప్రేమ ఉన్నట్లుగా.. తమను తాము అమాయకులుగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేశారు. సమాజంలో వారి ప్రతిష్ట కోసమే ఇదంతా చేశారు. అయినా నిజం ఎన్నటికీ దాగదు.పెళ్లికి ముందు నుంచే నికోలాతో నా బంధాన్ని తెంచాలని నా తల్లిదండ్రులు గట్టిగా ప్రయత్నించారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. పెళ్లికి కొన్ని గంటల ముందు మా అమ్మ కావాలనే నికోలా వెడ్డింగ్ గౌను రెడీ కాకుండా చేసింది. అత్తగారు డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోవాలని నికోలా ఎంతగానో ఆశపడింది. ‘లంచం’ ఇచ్చికానీ మా అమ్మ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. అప్పటికప్పుడు తను ఏదో ఒక డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. పెళ్లికి కొన్ని వారాల ముందు నాకు ‘లంచం’ ఇచ్చి నా హక్కులను రాయించుకోవాలని నా తల్లిదండ్రులు ప్లాన్ చేశారు. తద్వారా నా భార్య, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలను కంట్రోల్ చేయవచ్చనేది వారి ఆలోచన.కానీ నేను వినలేదు. అప్పటి నుంచి నా పట్ల వారి వైఖరి మారిపోయింది. నా పెళ్లికి ప్రణాళికలు రచిస్తున్న సమయంలో మా అమ్మ నన్ను .. ‘ఈవిల్’ అన్నది. నికోలా, నేను మా నానమ్మలను మాతో పాటు కూర్చోబెట్టుకుంటామని చెప్పడమే ఇందుకు కారణం.వివాహానికి కొన్ని గంటల ముందు నా కుటుంబం నా దగ్గరికి వచ్చి.. ‘నికోలా మన రక్తం కాదు. మన కుటుంబం కాదు. ఆమె కోసం ఎందుకిదంతా?’ అని ప్రశ్నించారు. అప్పటి నుంచి నా మీద, నా భార్య మీద ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉన్నారు. నా తమ్ముళ్లు కూడా నాపై సోషల్ మీడియాలో దాడికి దిగారు.మా అమ్మ అంతా చెడగొట్టిందిఇక పెళ్లి సమయంలో మా అమ్మ నా భార్యను, నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొదటిసారి నా భార్యతో రొమాంటిక్ సాంగ్కు డాన్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ మా అమ్మ అంతా చెడగొట్టింది. దాదాపుగా 500 మంది అతిథుల ముందు మా అమ్మ నాతో అభ్యంతరకర రీతిలో, అసలు సంబంధమే లేనివిధంగా డాన్స్ చేసింది.నాకు అదెంతో ఇబ్బందిగా అనిపించింది. అప్పటి వరకు జీవితంలో నేను అంత చెడు అనుభవాన్ని, అవమానాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. అందుకే మేము న్యూయార్క్లో మరోసారి పెళ్లి చేసుకున్నాము. ఈసారి నా తల్లిదండ్రుల బాధ లేదు. ప్రశాంతంగా సంతోషంగా వేడుక జరుపుకొన్నాము. నా పాత గర్ల్ఫ్రెండ్ను పిలిచినా భార్యను వాళ్లు ఎప్పటికప్పుడు అవమానిస్తూనే ఉన్నారు. నా పాత గర్ల్ఫ్రెండ్ను మా అమ్మ పదే పదే ఇంటికి ఆహ్వానిస్తూ మా ఇద్దరికి ఇబ్బంది కలిగేలా చేసింది. అయినా సరే మా నాన్న యాభైవ పుట్టినరోజు కోసం మేము లండన్కి వెళ్లాము. కానీ వారం రోజుల పాటు మమ్మల్ని అక్కడికి రానివ్వలేదు. దీంతో మేము హోటల్లోనే ఉండిపోయాము.మా నాన్నతో కాస్త ఎక్కువ సమయం గడపాలని భావించాను. కానీ ఆయన ఇందుకు తిరస్కరించారు. ఆఖరికి నికోలా లేకుండా వస్తేనే నన్ను అక్కడికి అనుమతినిస్తానని చెప్పాడు. ఆ మాట నా చెంప మీద కొట్టినట్లు అనిపించింది. ఆ తర్వాత వాళ్లు లాస్ ఏంజెలిస్కు వచ్చినపుడు కూడా నన్ను కలవడానికి ఇష్టపడలేదు.బెక్హామ్ బ్రాండ్తో వచ్చే పేరు నాకు, నా భార్యకు అవసరం లేదు. నాకు, నా భార్యకు ప్రశాంతత, గోప్యత, సంతోషం మాత్రమే కావాలి. మా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలి’’ అని బ్రూక్లిన్ బెక్హామ్ చెప్పుకొచ్చాడు.సంబంధిత వార్త: David Beckham: భార్యే సర్వస్వం.. తండ్రిని కాదని.. మామగారికి విషెస్.. -
చరిత్ర సృష్టించిన జొకోవిచ్
మెల్బోర్న్: కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో పెడ్రో మారి్టనెజ్ (స్పెయిన్)పై గెలిచి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. ఓవరాల్గా ఆస్ట్రేలియన్ ఓపెన్లో జొకోవిచ్కిది 100 విజయం కావడం విశేషం. ఫెడరర్ (స్విట్జర్లాండ్–102) తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ ‘సెంచరీ’ విజయాలు సాధించిన రెండో ప్లేయర్గా ఈ సెర్బియా స్టార్ గుర్తింపు పొందాడు. అంతేకాకుండా మూడు వేర్వేరు గ్రాండ్స్లామ్ టోర్నీలలో 100 అంతకంటే ఎక్కువ మ్యాచ్ల్లో గెలిచిన ఏకైక ప్లేయర్గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్లో 101 మ్యాచ్ల్లో... వింబుల్డన్లో 102 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో అత్యధికసార్లు ఆడిన ప్లేయర్గా ఫెడరర్ (21 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేసిన జొకోవిచ్... అత్యధిక గ్రాండ్స్లామ్ టోర్నీల్లో (81 సార్లు) ఆడిన ప్లేయర్లుగా ఫెడరర్, ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డునూ అందుకున్నాడు. పెడ్రో మార్టినెజ్తో 2 గంటల్లో ముగిసిన మ్యాచ్లో జొకోవిచ్ 14 ఏస్లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. 49 విన్నర్స్ కొట్టిన అతను 21 అనవసర తప్పిదాలు చేశాడు. తన సరీ్వస్ను ఒక్కసారి కూడా కోల్పోని ఈ సెర్బియా యోధుడు ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. వావ్రింకా బోణీ... ఈ ఏడాది తర్వాత టెన్నిస్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన 2014 చాంపియన్, స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకా రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో వావ్రింకా 5–7, 6–3, 6–4, 7–6 (7/4)తో లాస్లో జెరె (సెర్బియా)పై గెలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో విజయం సాధించిన రెండో అతిపెద్ద వయసు్కడిగా వావ్రింకా (40 ఏళ్ల 296 రోజులు) గుర్తింపు పొందాడు. ఈ రికార్డు ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా–40 ఏళ్ల 326 రోజులు) పేరిట ఉంది. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్లో మూడుసార్లు రన్నరప్గా నిలిచిన మెద్వెదెవ్ (రష్యా) కూడా గెలుపు బోణీ కొట్టాడు. తొలి రౌండ్లో 11వ సీడ్ మెద్వెదెవ్ 7–5, 6–2, 7–6 (7/2)తో జెస్పెర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఆరో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) 6–2, 6–2, 6–3తో మెక్డొనాల్డ్ (అమెరికా)పై, 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–1, 6–2, 6–4తో మటియా బెలూచి (ఇటలీ)పై, 13వ సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–2, 6–3తో మటియో అర్నాల్డి (ఇటలీ)పై, 14వ సీడ్ డేవిడోవిచ్ ఫొకీనా (స్పెయిన్) 6–2, 6–3, 6–3తో ఫిలిప్ మిసోలిచ్ (ఆస్ట్రియా)పై గెలిచారు. -
అబ్బే అదేం లేదు!.. మాట మార్చిన పాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆడే విషయమై బంగ్లాదేశ్ ఇంత వరకు తమ నిర్ణయాన్ని స్పష్టం చేయలేదు. ఈ అంశంలో బుధవారం (జనవరి 21) వరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ వైఖరి ఏమిటో చెప్పాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది.ముదిరిన వివాదంకాగా భారత్- బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. భారత్పై బంగ్లా నేతలు అవాకులు, చెవాకులు పేలడం.. ఆ దేశంలో మైనారిటీ హిందువులపై దాడులు జరగడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తొలగించింది.దీనిని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ బోర్డు.. ప్రపంచకప్ టోర్నీ ఆడేందుకు భారత్కు రాలేమని.. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ కొత్తరాగం ఎత్తుకుంది. తాము ఆడే మ్యాచ్లను మరో వేదికైన శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. కుదరదుఅయితే, ఇప్పటికే భారత్- శ్రీలంకలో జరిగే మ్యాచ్లకు ఆయా జట్లు టికెట్లు బుక్ చేసుకోవడం, టోర్నీ ఆరంభానికి తక్కువ సమయం ఉన్నందున బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చినట్లు సమాచారం.డెడ్లైన్అయినా సరే బంగ్లాదేశ్ మాత్రం తమ మొండి వైఖరి వీడటం లేదు. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలకు ఉపక్రమించేందుకు సంకల్పించిన ఐసీసీ డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తలదూర్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. పాక్ మీడియా కథనాల ప్రకారం..బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ గనుక మన్నించకపోతే.. తాము సైతం టోర్నీ నుంచి వైదొలగాలని పాక్ బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బంగ్లాదేశ్కు మద్దతుగా ఐసీసీ వైఖరిని గట్టిగా వ్యతిరేకించేందుకు పాక్ సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, పీసీబీ వర్గాలు తాజాగా ఈ విషయంపై స్పందించాయి.అబ్బే అదేం లేదు.. మాకేం అవసరంరెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘అబ్బే అదేం లేదు. బంగ్లాదేశ్ విషయంలో అసలు పీసీబీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. అలా చేయడానికి పాకిస్తాన్కు అధికారం కూడా లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం పాకిస్తాన్ ఇప్పటికే తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడేందుకు సిద్ధమైంది. మరి అలాంటపుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏముంది?..తటస్థ వేదికలపైనే భారత్- పాక్ మ్యాచ్లుబంగ్లాదేశ్- బీసీసీఐ- ఐసీసీ మధ్య జరుగుతున్న విషయాలకు ఆజ్యం పోసేలా కొంతమంది కావాలని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు’’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు.తటస్థ వేదికైన దుబాయ్లో భారత జట్టు తమ మ్యాచ్లు ఆడి చాంపియన్గా నిలిచింది. ఐసీసీ చెప్పిన ప్రకారం చాంపియన్స్ ట్రోఫీలో భారత్కు తటస్థ వేదికను ఏర్పాటు చేసినట్లుగానే.. ఈసారి టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో పాక్ మ్యాచ్లకు శ్రీలంకను వేదికగా ఖరారు చేశారు. అంతకుముందు మహిళల వన్డే వరల్డ్కప్-2025 టోర్నీ భారత్లో జరుగగా.. పాక్ జట్టు తమ మ్యాచ్లను శ్రీలంకలోనే ఆడింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7- మార్చి8 వరకు భారత్-శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్కప్-2026 టోర్నీ జరుగనుంది.చదవండి: బంగ్లాదేశ్ T20 WC 2026లో ఆడకపోతే స్కాట్లాండ్కు అవకాశం! -
ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి!
న్యూజిలాండ్ చేతిలో మరోసారి టీమిండియాకు భంగపాటు ఎదురైంది. సొంతగడ్డపై కివీస్కు తొలిసారి భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.టీమిండియా ఓటమికి కారణం అదేన్యూజిలాండ్తో మ్యాచ్లలో సరైన ఆరంభాలు లేకపోవమే భారత్ సిరీస్ కోల్పోయేందుకు కారణమని గావస్కర్ అభిప్రాయ పడ్డారు. భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో ఇన్నింగ్స్లు ఎలా నిర్మించాలో విరాట్ కోహ్లి (Virat Kohli)ని చూసి సహచరులు నేర్చుకోవాలని సూచించాడు. ‘కోహ్లికి సరైన సహకారం లభించకపోతే లక్ష్య ఛేదన చాలా కష్టమని అర్థమైపోయింది. చివరకు అదే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సిరీస్లో మనకు సరైన ఆరంభాలు లభించలేదు. అదే జరిగితే సగం పని సులువయ్యేది. రాహుల్లాంటి బ్యాటర్ అవుటైన తర్వాత నితీశ్ (Nitish Kumar Reddy), హర్షిత్ (Harshit Rana)లాంటి ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శన వస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకే పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది’ అని గావస్కర్ విశ్లేషించారు. సెంచరీతో చివరి వరకు పోరాడిన కోహ్లిపై సన్నీ ప్రశంసలు కురిపించారు. ఓటమిని అంగీకరించకుండా‘కోహ్లి ఆలోచనధోరణి, అతని నిలకడను అందరూ అందిపుచ్చుకోవాలి. ఒకే శైలికి కట్టుబడకుండా పరిస్థితులకు తగినట్లుగా కోహ్లి తన ఆటను మార్చుకున్నాడు. చివరి వరకు ఓటమిని అంగీకరించకుండా అతను ప్రయత్నించాడు. ఇది యువ ఆటగాళ్లకు మంచి పాఠం అవుతుంది’ అని దిగ్గజ క్రికెటర్ పేర్కొన్నారు. చదవండి: భారత్ నెత్తిన మిచెల్ పిడుగు -
ప్రైజ్మనీ రూ. 90 కోట్ల 86 లక్షలు
రబాట్ (మొరాకో): నాటకీయ పరిణామాల మధ్య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సెనెగల్ జట్టు పైచేయి సాధించింది. రెండోసారి ఆఫ్రికా కప్ ఫుట్బాల్ టైటిల్ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో సెనెగల్ 1–0 గోల్ తేడాతో ఆతిథ్య మొరాకో జట్టును ఓడించింది. 2021లో తొలిసారి సెనెగల్ ఆఫ్రికా కప్ టైటిల్ను సాధించింది. ఈ ఓటమితో 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్రికా చాంపియన్గా నిలవాలని ఆశించిన మొరాకో జట్టుకు నిరాశే ఎదురైంది. డియాజ్ను తోసేసిన డియాఫ్మ్యాచ్ రెండో అర్ధభాగం స్టాపేజ్ సమయంలో మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడంపై దుమారం చెలరేగింది. ‘డి’ ఏరియా లోపల మొరాకో ప్లేయర్ బ్రహిమ్ డియాజ్ను సెనెగల్ ప్లేయర్ ఎల్ హాద్జి మలిక్ డియాఫ్ తోసేశాడు. దాంతో రిఫరీ జీన్ జాక్వెస్ మొరాకో జట్టుకు పెనాల్టీ కిక్ను ప్రదానం చేశాడు. నిరసనఈ నిర్ణయంతో సెనెగల్ ఆటగాళ్లతోపాటు మైదానంలోని ఆ జట్టు అభిమానులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య కొంచెంసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. రిఫరీ నిర్ణయాన్ని నిరసిస్తూ సెనెగల్ ఆటగాళ్లు మైదానాన్ని కూడా వీడారు. టీవీ రిప్లేలు చూశాక మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడం సరైనదేనని తేలింది. దాంతో 14 నిమిషాల తర్వాత మళ్లీ సెనెగల్ ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. పెనాల్టిని గోల్గా మలిచి, కొన్ని నిమిషాలు సెనెగల్ను నిలువరిస్తే మొరాకో ఖాతాలో 50 ఏళ్ల తర్వాత ఆఫ్రికా కప్ చేరేది. కానీ అలా జరగలేదు. సువర్ణావకాశం చేజారిందిఈ టోర్నీలో 5 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచిన మొరాకో స్టార్ బ్రహిమ్ డియాజ్ పెనాల్టిని తీసుకోవడానికి వచ్చాడు. తీవ్రమైన ఒత్తిడిలో డియాజ్ బంతిని నేరుగా కొట్టడం... సెనెగల్ గోల్కీపర్ ఎడువార్డో మెండీ దానిని నిలువరించడం జరిగిపోయింది. దాంతో మొరాకో సువర్ణావకాశం చేజారింది. స్టాపేజ్ సమయం ముగియడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. అదనపు సమయంలోని నాలుగో నిమిషంలో కెపె్టన్ ఇద్రిసా గుయె అందించిన పాస్ను ‘డి’ ఏరియా లోపల అందుకున్న పాపె గుయె లక్ష్యానికి చేర్చడంతో సెనెగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు మొరాకో ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలను సెనెగల్ సమర్థంగా అడ్డుకొని టైటిల్ను ఖాయం చేసుకుంది. రూ. 90 కోట్ల 86 లక్షలు ఆఫ్రికా కప్ టైటిల్ సాధించిన సెనెగల్ జట్టుకు 1 కోటి డాలర్ల (రూ. 90 కోట్ల 86 లక్షలు) ప్రైజ్మనీ లభించింది. రన్నరప్గా నిలిచిన మొరాకో జట్టు ఖాతాలో 40 లక్షల డాలర్లు (రూ. 36 కోట్ల 34 లక్షలు) చేరాయి. మూడో స్థానం పొందిన నైజీరియా జట్టుకు 25 లక్షల డాలర్లు (రూ. 22 కోట్ల 71 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన ఈజిప్ట్ జట్టుకు 13 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 81 లక్షలు) లభించాయి. క్వార్టర్ ఫైనల్లో ఓడిన మాలి, ఐవరీకోస్ట్, అల్జీరియా, కామెరూన్ జట్లకు 8 లక్షల డాలర్ల (రూ. 7 కోట్ల 26 లక్షలు) చొప్పున అందజేశారు. 121 మొత్తం 24 జట్ల మధ్య గత డిసెంబర్ 21 నుంచి జనవరి 18 వరకు జరిగిన ఆఫ్రికా కప్ టోర్నీలో మొత్తం 52 మ్యాచ్లు జరిగాయి. 121 గోల్స్ నమోదయ్యాయి. మొరాకో ప్లేయర్ బ్రహిమ్ డియాజ్ 5 గోల్స్తో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. టోర్నీ ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డును సెనెగల్కు చెందిన సాదియోమానె గెల్చుకోగా... ‘ఉత్తమ గోల్కీపర్’గా మొరాకోకు చెందిన యాసిన్ బునుయ్ నిలిచాడు. 2027లో ఎక్కడంటే.... తదుపరి ఆఫ్రికా కప్ టోర్నీకి తొలిసారి మూడు దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027లో జరిగే ఈ టోర్నీ కెన్యా, టాంజానియా, ఉగాండా దేశాల్లో జరుగుతుంది. 69 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో రెండుసార్లు మాత్రమే రెండు దేశాలు సంయుక్తంగా (2000లో ఘనా–నైజీరియా; 2012లో ఈక్వెటోరియల్ గినీ–గాబోన్) ఆతిథ్యమిచ్చాయి. చదవండి: ఆమె మనిషి కాదు! -
‘రంజీ’ బరిలో గిల్
న్యూఢిల్లీ: భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్మన్ గిల్ విశ్రాంతి తీసుకోకుండా వెంటనే రంజీ ట్రోఫీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. గిల్ సారథ్యంలోని టీమిండియా 1–2తో తొలిసారి భారత గడ్డపై న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది. ఆదివారమే కివీస్తో ఈ సిరీస్ ముగిసింది. రోజుల వ్యవధిలోనే గురువారం నుంచి సౌరాష్ట్రతో తలపడే పంజాబ్ తరఫున రంజీ మ్యాచ్ బరిలోకి దిగేందుకు గిల్ సై అంటున్నాడు. 26 ఏళ్ల ఈ కెప్టెన్ విశ్రాంతి గురించి ఆలోచించడం లేదని, రాజ్కోట్లో జరిగే రంజీ పోరు కోసం ఇండోర్ నుంచి నేరుగా అక్కడికే పయనమవుతాడని పంజాబ్ జట్టు వర్గాలు తెలిపాయి. గత సీజన్లో మాదిరిగా ఈసారి కూడా రంజీ ట్రోఫీకి మధ్యలో విరామమిచ్చారు. ముస్తాక్ అలీ టి20, విజయ్ హజారే వన్డే టోరీ్నల కోసం రంజీలకు బ్రేక్ ఇచ్చారు. ఈ రెండు పరిమిత ఓవర్ల ఈవెంట్లు ముగియడంతో గురువారం నుంచి దేశవ్యాప్తంగా మిగిలిన రెండు రౌండ్ల రంజీ ట్రోఫీ మ్యాచ్ల్ని కొనసాగించనున్నారు. మొత్తం ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో పంజాబ్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్లాడింది. ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ ఓడింది. మిగతా మూడింటిని ‘డ్రా’ చేసుకున్న పంజాబ్ 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఇంకా మూడే లీగ్ మ్యాచ్లున్నాయి. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే ఈ మూడు మ్యాచ్ల్నీ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. గిల్ రాకతో పంజాబ్ పటిష్టంగా మారింది. -
బంగ్లాదేశ్ ఆడకపోతే స్కాట్లాండ్కు అవకాశం!
టి20 ప్రపంచ కప్లో తాము ఆడే మ్యాచ్లను భద్రతాకారణాలతో భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేస్తున్న డిమాండ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో మ్యాచ్ల వేదిక మార్పు సాధ్యం కాదని ఐసీసీ పదేపదే చెబుతున్నా... బీసీబీ మాత్రం తమ మంకు పట్టును వీడటం లేదు. దీంతో ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నెల 21న దీనిపై ఐసీసీ స్పష్టమైన ప్రకటన ఇవ్వనుంది. తాము వరల్డ్ కప్ ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్ ఆలోపు నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ హెచ్చరించింది. లేదంటే టోర్నీ నుంచి బంగ్లాదేశ్ను తప్పించి ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్కు అవకాశం ఇస్తామని కూడా చెప్పేసింది. తమ గ్రూప్ను మార్చి ఐర్లాండ్ మ్యాచ్ల స్థానంలో శ్రీలంకలో మ్యాచ్లు ఆడించాలని బీసీబీ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు కూడా అంగీకరించేది లేదని ఐసీసీ జవాబిచి్చంది. భారత్–శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. -
ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ
వడోదర: బెంగళూరు... అదే జోరు! నవీ ముంబైలో ఇప్పటికే ముంబై, యూపీ, ఢిల్లీ, గుజరాత్ ఇలా డబ్ల్యూపీఎల్ ప్రత్యర్థులన్నింటిపై విజయాలు సాధించింది. ఇప్పుడు వేదిక వడోదరకు మారినా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తీరేం మారలేదు! రెండో రౌండ్ విజయాలనూ మొదలుపెట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో సోమవారం జరిగిన పోరులో స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ 61 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. వరుసగా ఐదో విజయంతో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గౌతమి నాయక్ (55 బంతుల్లో 73; 7 ఫోర్లు, 1 సిక్స్) దంచేసింది. రిచా ఘోష్ (20 బంతుల్లో 27; 3 సిక్స్లు) వేగంగా పరుగులు చేసింది. స్మృతి మంధాన (23 బంతుల్లో 26; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. జెయింట్స్ బౌలర్లలో కాశ్వీ గౌతమ్, ఆష్లే గార్డ్నర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులే చేయగలిగింది. కెపె్టన్ ఆష్లే గార్డ్నర్ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరిగా పోరాడింది. సయాలీ సత్గరే (3/21), నదిన్ డిక్లెర్క్ (2/17) చావుదెబ్బ తీశారు. నేడు జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్, జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ (సి) గార్డ్నర్ (బి) రేణుక 1; స్మృతి మంధాన (ఎల్బీడబ్ల్యూ) (బి) గార్డ్నర్ 26; జార్జియా వోల్ (బి) కాశ్వీ 1; గౌతమి (బి) గార్డ్నర్ 73; రిచా ఘోష్ (సి) గార్డ్నర్ (బి) సోఫీ డివైన్ 27; డిక్లెర్క్ (నాటౌట్) 4; రాధ (సి) భారతి (బి) కాశ్వీ 17; శ్రేయాంక (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–69, 4–138, 5–142, 6–170. బౌలింగ్: రేణుక 4–0–23–1, కాశ్వీ గౌతమ్ 4–0–38–2, అష్లే గార్డ్నర్ 4–0–43–2, హ్యాపీ కుమారి 1–0–10–0, సోఫీ డివైన్ 4–0–25–1, జార్జియా వేర్హమ్ 1–0–13–0, తనూజ 2–0–20–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (బి) సయాలీ 3; సోఫీ డివైన్ (సి) వోల్ (బి) సయాలీ 0; అనుష్క (సి) రాధ (బి) డిక్లెర్క్ 18; కనిక (బి) బెల్ 0; ఆష్లే గార్డ్నర్ (సి) రావత్ (బి) సయాలీ 54; కాశ్వీ (బి) రాధ 4; జార్జియా వేర్హమ్ (సి) సయాలీ (బి) డిక్లెర్క్ 2; భారతి (సి) హారిస్ (బి) శ్రేయాంక 14; తనూజ (నాటౌట్) 11; రేణుక (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 117. వికెట్ల పతనం: 1–3, 2–4, 3–5, 4–34, 5–48, 6–56, 7–97, 8–103. బౌలింగ్: లారెన్ బెల్ 4–1–23–1, సయాలీ 4–0–21–3, డిక్లెర్క్ 4–0–17–2, రాధ యాదవ్ 4–0–34–1, శ్రేయాంక 4–0–19–1. -
భారత్ నెత్తిన మిచెల్ పిడుగు
130, 134, 17, 63, 84, 131 నాటౌట్, 137... భారత్పై గత 7 వన్డేల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డరైల్ మిచెల్ స్కోర్లు ఇవి. టీమిండియాపై మ్యాచ్ అనగానే చెలరేగిపోయే అతి తక్కువ మంది ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు అతను కూడా చేరాడు. మొత్తంగా భారత్పై ఆడిన 11 వన్డే ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా ఏకంగా 74.10 సగటుతో అతను 741 పరుగులు సాధించాడు. ఏబీ డివిలియర్స్ ఒక్కడే భారత్లో భారత్పై ఇంతకంటే ఎక్కువ (5) సెంచరీలు నమోదు చేయగలిగాడంటే మిచెల్ ప్రదర్శన విలువను చెప్పవచ్చు. ఒంటిచేత్తో అతను తన టీమ్కు తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ అందించి కివీస్ హీరోగా మారాడు. భారత్లో భారత్పై మిచెల్ చెలరేగిపోవడం వెనక తీవ్ర సాధన, పట్టుదల ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్ లీగ్ మ్యాచ్, సెమీఫైనల్లలో రెండుసార్లూ వందకు పైగా స్ట్రయిక్ రేట్తో అతను శతకాలు బాదాడు. కానీ ఈ రెండు మ్యాచుల్లోనూ టీమిండియా అలవోక విజయాలు సాధించింది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో కూడా లీగ్ మ్యాచ్లో విఫలమైన తర్వాత ఫైనల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి అతను హాఫ్ సెంచరీ చేశాడు. అయితే పరిస్థితిని బట్టి బాగా నెమ్మదిగా ఆడిన మిచెల్ మన స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడ్డాడు. తన ఇన్నింగ్స్లోని 101 బంతుల్లో అతను 96 బంతులు స్పిన్నర్ల బౌలింగ్లోనే ఆడాడు! అయితే నలుగురు భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక 52 పరుగులే చేయగలిగాడు. ఈ మ్యాచ్లో కూడా కివీస్ ఓడింది. సిరీస్కు సిద్ధమై... భారత్తో వన్డే సిరీస్కు ముందు మిచెల్ అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు. ఈసారి తాను వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన కనబర్చడమే కాదు. టీమ్ను కూడా గెలిపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. భారత్ తరహాలో నెమ్మదైన పిచ్లు ఉండే లింకన్, మౌంట్ మాంగనీలలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురుదాడికి చాలా మంది స్టార్ బ్యాటర్లు వాడే ఆయుధం ‘స్వీప్ షాట్’ను గంటలకొద్దీ ఆడాడు. రివర్స్ స్వీప్ల సాధన దీనికి అదనం. స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే మరో పద్ధతి ముందుకు దూసుకొచ్చి బౌలర్ మీదుగా లాఫ్టెడ్ షాట్ ఆడటం. రాజ్కోట్ వన్డేలో ఇది చాలా బాగా కనిపించింది. జడేజా, కుల్దీప్లను అతను అలవోకగా ఎదుర్కోవడంతో భారత్ సమస్య పెరిగింది. కుల్దీప్ తొలి ఓవర్లోనే సిక్స్తో మొదలు పెట్టిన మిచెల్ ...అతని బౌలింగ్లో ఆడిన 32 బంతుల్లో 50 పరుగులు రాబట్టడం విశేషం. కివీస్ ఇంత అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడం దిగ్గజం సునీల్ గావస్కర్ను కూడా ఆశ్చర్యపర్చింది. వన్డేల్లో కుల్దీప్ ఒక సిరీస్లో ఇంత చెత్త ప్రదర్శన (60.66 సగటు) తొలిసారి నమోదు చేశాడంటే అందుకు మిచెల్ కారణం. అన్ని ఫార్మాట్లలో... న్యూజిలాండ్ జట్టులో మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న ఆటగాళ్లలో మిచెల్ కూడా ఒకడు. ఏడాదిన్నర క్రితం భారత్పై 3–0తో క్లీన్స్వీప్ చేసిన టెస్టు టీమ్లో అతను కూడా ఉన్నాడు. అదే స్ఫూర్తితో తాము వన్డే సిరీస్ కూడా గెలవడం సంతోషానిచి్చందని మిచెల్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్ ఆరంభంలో స్పిన్ ప్రదర్శనను అతను గుర్తు చేసుకున్నాడు. న్యూజిలాండ్తో పాటు జూనియర్ స్థాయిలో పెర్త్లో ఎక్కువగా క్రికెట్ ఆడిన మిచెల్కు స్పిన్ అంటే మొదటి నుంచీ సమస్యే. ఎప్పుడో 2013లో అండర్–19 జట్టు సభ్యుడిగా భారత్, శ్రీలంక పర్యటలకు వచ్చి ఘోరంగా విఫలమైన అనంతరం అతను మళ్లీ పోటీలోకి వచ్చేందుకు చాలా సమయం పట్టింది. దాదాపు ఏడేళ్ల కెరీర్లో ఇప్పటికి 184 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్లో ప్రస్తుతం కీలక సభ్యుడిగా ఎదిగిన మిచెల్... ఐపీఎల్లో ఒక సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు, మరో ఏడాది చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక్కడ ఆడటం మాత్రమే కాదు, భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్యలో ఆడిన అనుభవం తన ఆటను రాటుదేలి్చందని చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
చెలరేగిన గౌతమి నాయక్.. ఆర్సీబీ భారీ స్కోర్
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో ఆర్సీబీ తమ జోరును కొనసాగిస్తుంది. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేసిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 19) గుజరాత్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లోనూ చేసి భారీ స్కోర్ చేసింది.టాస్ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన గౌతమి నాయక్ ఊహించని రీతిలో చెలరేగింది. 55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 73 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్ మంధనతో (26) కలిసి మూడో వికెట్కు 60 పరుగులు జోడించింది.అనంతరం రిచా ఘోష్తో (27) కలిసి నాలుగో వికెట్కు 69 పరుగులు జోడించింది. గౌతమి నాయక్ ఔటయ్యాక ఆఖర్లో రాధా యాదవ్ (17), శ్రేయాంక పాటిల్ (8) బ్యాట్ ఝులిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో గ్రేస్ హ్యారిస్, జార్జియా వాల్ తలో పరుగు చేసి ఔట్ కాగా.. డి క్లెర్క్ (4), శ్రేయాంక (8) అజేయంగా నిలిచారు.గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్, కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ తలో 2 వికెట్లు తీయగా.. రేణుకా సింగ్ ఠాకూర్, సోఫి డివైన్ చెరో వికెట్ తీశారు. కాగా, ఈ ఎడిషన్లో ఆర్సీబీ వరుసగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్పై విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఎవరీ గౌతమి నాయక్..?మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల గౌతమి నాయక్ను ఆర్సీబీ ఈ సీజన్ వేలంలో రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం స్పిన్ బౌలింగ్ (ఆఫ్) ఆల్రౌండర్ అయిన ఈమెకు దేశవాలీ క్రికెట్లో హార్డ్ హిట్టర్గా పేరుంది. గౌతమి బరోడా, మహారాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించింది. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో రత్నగిరి జెట్స్ తరఫున సత్తా చాటి ఆర్సీబీని ఆకర్శించింది. -
ప్రపంచకప్లో బోణీ కొట్టిన పాక్
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. స్కాట్లాండ్తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. అలీ రజా (10-0-37-4) అద్భుతమైన బౌలింగ్తో స్కాట్లాండ్ పతనాన్ని శాశించాడు. మొమిన్ కమర్ 3 వికెట్లతో సత్తా చాటాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్ తలో వికెట్ తీశారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన థామస్ నైట్ టాప్ స్కోరర్ కాగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు ఫిన్లే జోన్స్ (33), ఓల్లీ జోన్స్ (30), మను సరస్వత్ (25), రోరి గ్రాంట్ (21), ఫిన్లే కార్టర్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్కు సరస్వత్, ఫిన్లే జోన్స్ 58 పరుగులు జోడించడంతో స్కాట్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఆచితూచి ఆడి 43.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉస్మాన్ ఖాన్ (75), అహ్మద్ హుసేన్ (47) పాక్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ ఫర్హాన్ (18 నాటౌట్) పాక్ను గెలుపు తీరాలు దాటించాడు. పాక్ ఇన్నింగ్స్లో అలీ హసన్ బలోచ్ 15, స్టార్ బ్యాటర్ సమీర్ మిన్హాస్ 28 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో ఓల్లీ జోన్స్, సరస్వత్ తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఈ మెగా టోర్నీలో పాక్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తైంది తదుపరి మ్యాచ్లో ఈ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్ 22న జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే పాక్ సూపర్-8కు చేరుకుంటుంది.ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో అరంగేట్రీ టాంజానియాపై సౌతాఫ్రికా 329 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ బుల్బులియా, జేసన్ రోల్స్ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన టాంజానియా 32.2 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇవాళే మరో మ్యాచ్ కూడా జరుగుతుంది. శ్రీలంక-ఐర్లాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలుపు దిశగా పయనిస్తుంది. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్
త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్లకు దూరమవుతున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. కమిన్స్ మూడు లేదా నాలుగో మ్యాచ్కు అందుబాటులోకి వస్తాడని ప్రకటించాడు. కమిన్స్ వేగంగా పురోగతి సాధిస్తే ప్రణాళికలు మారవచ్చని చెప్పుకొచ్చాడు. కమిన్స్ గత కొంతకాలంగా లంబర్ బోన్ స్ట్రెస్ ఇంజరీతో బాధపడుతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ ఆడినా, గాయం తిరగబెట్టడంతో ఆతర్వాతి మ్యాచ్లకు దూరమయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించే అవకాశం లేకపోవడంతో, వరల్డ్కప్ తొలి రెండు మ్యాచ్లు సహా, దానికి ముందు పాకిస్తాన్లో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా అందుబాటులో ఉండడంలేదు. పాక్తో సిరీస్కు కమిన్స్ సహా నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ హేజిల్వుడ్ కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రపంచకప్ జట్టులో ఉన్న వీరికి విశ్రాంతినిచ్చారు. ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్లకైనా కమిన్స్ అందుబాటులో లేకపోవడం ఆస్ట్రేలియాకు పెద్ద లోటే అవుతుంది. అతని అనుభవం, డెత్ ఓవర్లలో బౌలింగ్ నైపుణ్యం జట్టుకు చాలా కీలకం. అసలే ఆసీస్ ప్రపంచకప్ జట్టు అంతంతమాత్రంగా ఉంది. కమిన్స్ లాంటి ఆటగాడు ఒక్క మ్యాచ్కు దూరమైనా, ఆ జట్టు టైటిల్ గెలిచే అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచకప్లో ఆసీస్ ప్రయాణం ఫిబ్రవరి 11న ఐర్లాండ్తో మ్యాచ్తో మొదలవుతుంది. ఆసీస్ రెండో మ్యాచ్ జింబాబ్వేతో ఆడనుంది. ఈ మెగా టోర్నీలో ఆసీస్..ఒమన్, ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక జట్లతో గ్రూప్-బిలో ఉంది. ప్రపంచకప్కు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా -
అలా అయితే మేమూ ఆడం.. బంగ్లాదేశ్కు వంత పాడుతున్న పాక్
2026 టీ20 ప్రపంచకప్కు ముందు ఆసియా క్రికెట్లో మరోసారి రాజకీయ-క్రీడా ఉద్రిక్తతలు పెరిగాయి. భద్రత కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత్లో జరగబోయే తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఐసీసీ పలు సమీక్షలు జరిపిన అనంతరం భారత్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బీసీబీకి హామీ ఇచ్చింది. అయినా వెనక్కు తగ్గని బంగ్లా క్రికెట్ బోర్డు, భారత్లో పర్యటించేదే లేదంటూ భీష్మించుకు కూర్చుంది. దీంతో ఐసీసీ వేరే ప్లాన్స్ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ భారత్లో ఆడేందుకు నిరాకరిస్తే స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా ప్రపంచకప్లో ఆడించాలని కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. బంగ్లాదేశ్ ఏ విషయం తేల్చుకునేందుకు ఐసీసీ డెడ్లైన్ విధించినట్లు తెలుస్తుంది. ఈ నెల 21 లోగా ఏ విషయం తేల్చాలని ఐసీసీ దూత బీసీబీకి సందేశం పంపినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో.. ఐసీసీ తమ డిమాండ్ను పరిష్కరించకపోగా, భారత్లో ఆడేందుకు ఒత్తిడి తెస్తుందని బీసీబీ అంతర్జాతీయ వేదికపై గగ్గోలు పెడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సాయాన్ని కోరినట్లు సమాచారం. బీసీబీ అభ్యర్థన కోసం ఎదురుచూస్తూ ఉండిన పీసీబీ.. అడగటమే ఆలస్యమన్నట్లు రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్పై లేని ప్రేమను ఒలకబోస్తూ.. ఐసీసీ బీసీబీపై ఒత్తిడి పెంచితే, తాము కూడా ప్రపంచకప్ ఆడబోమని ఓవరాక్షన్ చేస్తుంది. బంగ్లాదేశ్ అభ్యర్థనలో న్యాయం ఉందని, ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పెద్దన్నపాత్ర పోషించే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశంపై పాక్ క్రికెట్ బోర్డు, ఆ దేశ ముఖ్య రాజకీయ నాయకులు ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నట్లు సమాచారం. ఇందులో ఐసీసీ, బీసీసీఐకి వ్యతిరేకంగా.. బీసీబీ అనుకూలంగా చాలా తీర్మానాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఏ జట్టూ ఒత్తిడి లేదా బెదిరింపులకు గురి కాకూదు. వరల్డ్కప్ మ్యాచ్లు భద్రతా వాతావరణంలో జరగాలి. అవసరమైతే బంగ్లాదేశ్ మ్యాచ్లను పాకిస్తాన్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీబీ తీర్మానించినట్లు సమాచారం. పాకిస్తాన్ ఎంట్రీతో ప్రపంచకప్లో బంగ్లా భవితవ్యం ఏ మలుపు తీసుకుంటోదనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.కాగా, గత కొంతకాలంగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేయడంతో ఈ ఉద్రిక్తలు క్రికెట్కు పాకాయి. బంగ్లాలో హిందువులపై దాడులు పెరిగిపోతుండడంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది.దీన్ని ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తమ జట్టును వరల్డ్కప్ కోసం భారత్ పంపబోమని, వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బ్యాన్ చేసింది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్లను కోల్కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. -
భారత్తో సిరీస్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో భారత్తో జరుగబోయే టీ20 సిరీస్ను రద్దు చేసుకొని, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 21 నుంచి 31 వరకు భారత్లో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టులో ఎంపికైన నీషమ్, చివరి నిమిషంలో జాతీయ విధులను వద్దనుకొని, ఫ్రాంచైజీ లీగ్కు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ విషయాన్ని రాజ్షాహీ వారియర్స్ (నీషమ్ బీపీఎల్ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హన్నన్ సర్కార్ సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు. కాగా, భారత్తో సిరీస్ న్యూజిలాండ్ జట్టుకు ప్రపంచకప్కు ముందు రిహార్సల్గా భావించబడుతోంది. ఈ సిరీస్కు ఎంపికైన వారే దాదాపుగా ప్రపంచకప్ జట్టులోనూ ఉంటారు. నీషమ్ కూడా న్యూజిలాండ్ ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేశ ప్రయోజనాలు కాకుండా, వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై న్యూజిలాండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నీషమ్ను ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా నీషమ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ జట్టులో లేకపోవడం న్యూజిలాండ్కు పెద్ద లోటుగా పరిగణించబడుతుంది. అది భారత్తో సిరీస్ అయినా, ప్రపంచకప్ అయినా నీషబ్ లేని లోటు న్యూజిలాండ్ జట్టులో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.కాగా, ప్రస్తుతం జరుగుతున్న బీపీఎల్ 2025-26 ఎడిషన్లో నీషమ్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలేమీ చేయలేదు. నాలుగు మ్యాచ్ల్లో 30 పరుగులు, మూడు వికెట్లు మాత్రమే తీశాడు. నీషమ్ సత్తా చాటలేకపోయినప్పటికీ అతని జట్టు రాజ్షాహీ వారియర్స్ లీగ్ దశలో అగ్రస్థానంలో (10 మ్యాచ్ల్లో 8 విజయాలు) నిలిచింది. రాజ్షాహీ వారియర్స్ జనవరి 20న జరిగే తమ తదుపరి మ్యాచ్లో చట్టోగ్రామ్ రాయల్స్తో (తొలి క్వాలిఫయర్) తలపడనుంది. ఇదిలా ఉంటే, జనవరి 21న నాగ్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20 జరుగనుంది. 35 ఏళ్ల నీషమ్కు ఈ మ్యాచ్లో ఆడే అవకాశం తప్పక ఉండేది.భారత్తో టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టు..హెన్రీ నికోల్స్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), నిక్ కెల్లీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జకరీ ఫౌల్క్స్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, జేడన్ లెన్నాక్స్, మైఖేల్ రే -
గౌతమ్ గంభీర్పై ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ భవితవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా అతడి మార్గదర్శకంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ను (1-2) కోల్పోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సిరీస్కు ముందు వరకు గంభీర్ను టెస్ట్ల నుంచి మాత్రమే తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే తాజా పరాభవం తర్వాత గంభీర్పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. అతన్ని మొత్తానికే టీమిండియా నుంచి తప్పించాలని ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. స్వదేశంలో, అందులో సి-టీమ్ (న్యూజిలాండ్) చేతిలో పరాభవాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.వాస్తవానికి గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్లకు మాత్రమే పరిమితం అని అంతా అనుకుంటారు. కానీ, వన్డేల్లోనూ అతనికి చెత్త ట్రాక్ రికార్డే ఉంది. అతని జమానాలో టీమిండియా చిన్న జట్టైన శ్రీలంక చేతిలో కూడా వన్డే సిరీస్ కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత్కు భంగపాటే ఎదురైంది.అతడి పుణ్యమా అని భారత్ తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. మొత్తంగా అతని పదవీకాలంలో భారత జట్టు వన్డేల్లో 11 విజయాలు సాధించి, 6 పరాజయాలు ఎదుర్కొంది. వన్డేల్లో గంభీర్ చెప్పుకోదగ్గ విజయం ఏదైనా ఉందంటే అది ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటే.గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్ల నుంచి చిన్నగా వన్డేలకు కూడా పాకడంతో, ఇక భరించేది లేదని అభిమానులు కరాఖండిగా చెబుతున్నారు. కేవలం టీ20ల కోసమే అతన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గంభీర్ స్థానంలో రాజకీయాలు చేయని ఎవరికైనా అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరుతున్నారు.గంభీర్ కోచ్గా తన ప్రదర్శన కంటే రాజకీయాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో ఉంటాడు. అతని జమానాలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రచారం జరుగుతుంది. గంభీర్ కారణంగానే వారిద్దరు అనూహ్యంగా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారని టాక్. రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంలోనూ గంభీర్దే కీలకపాత్ర అని అంతా అంటుంటారు. అంతగా అర్హం కాని శుభ్మన్ గిల్కు టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్సీ కట్టబెట్టడంలోనూ గంభీర్దే కీలకపాత్ర అని ప్రచారం జరిగింది. సంజూ శాంసన్కు అన్యాయం చేసి గిల్ను టీ20ల్లోనూ ప్రమోట్ చేయాలని గంభీర్ ప్రణాళికలు రచించాడని సమాచారం.మహ్మద్ షమీ లాంటి సీనియర్ను అకారణంగా తప్పించి, హర్షిత్ రాణాకు ఎవరికీ ఇవ్వని అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ సిరాజ్ గంభీర్ రాజకీయాలకు బలైయ్యారనే టాక్ కూడా నడుస్తుంది. కోచ్గా తన పనితనంపై ఫోకస్ పెట్టకుండా గంభీర్ ఇలాంటి రాజకీయాలు కోకొల్లలు చేశాడని చాలామంది టీమిండియా మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీసీసీఐ వెంటనే గంభీర్పై వేటు వేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.గురువు ఎంతో శిష్యుడూ అంతే..!గంభీర్ ప్రమోట్ చేసిన శుభ్మన్ గిల్ సైతం భారత కెప్టెన్గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అతని హయాంలో భారత్ తొలిసారి న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలోనూ పరాభవం ఎదుర్కొంది. టెస్ట్ల్లోనూ గిల్ (కెప్టెన్గా) ప్రదర్శన పేలవంగానే ఉంది. అరంగేట్రం సిరీస్లో (ఇంగ్లండ్) చావుతప్పి కన్ను లొట్ట పోయింది (2-2తో డ్రా). తాజాగా సౌతాఫ్రికా చేతిలో స్వదేశంలోనే ఘోర భంగపాటు (క్లీన్ స్వీప్) ఎదురైంది. ప్రదర్శన విషయంలో గిల్ తన గురువు గంభీర్తో పోటీ పడుతున్నాడు. -
టీమిండియా సిరీస్ ఓటమి.. ఆ ముగ్గురే విలన్లు
భారత క్రికెట్ జట్టుకు సొంతగడ్డపై మరోసారి న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. కివీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. సొంత గడ్డపై తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న టీమిండియాకు న్యూజిలాండ్ వరుస షాకిలిస్తోంది. మొన్న టెస్టు సిరీస్.. నేడు వన్డే సిరీస్. స్వదేశంలో న్యూజిలాండ్పై వన్డే సిరీస్ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి.ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన మెన్ ఇన్ బ్లూ.. ఈ అప్రతిష్టను మూటకట్టుకుంది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికల పడింది. విరాట్ కోహ్లి ఆఖరి వరకు పోరాడినప్పటికి.. మిగితా సీనియర్ ప్లేయర్ల నుంచి సహకారం లభించలేదు. ఈ క్రమంలో సిరీస్ ఓటమికి గల కారణాలపై ఓ లుక్కేద్దాం.రోహిత్.. నోహిట్ సాధారణంగా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడే ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్ ఈ సిరీస్లో ముగబోయింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. హిట్మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. త్వరగా ఔట్ కావడంతో నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న శుభ్మన్ గిల్పై ఒత్తిడి పెరిగి వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్లో రోహిత్ మూడు మ్యాచ్లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ అన్నట్లుగా రోహిత్ మ్యాచ్ ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది.జడేజా అట్టర్ ప్లాప్రవీంద్ర జడేజా.. భారత జట్టు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. తన ఆల్రౌండర్ ప్రదర్శనతో ఎన్నో మ్యాచ్లలో జట్టును ఒంటి చేత్తో గెలిపించిన ఘనత అతడిది. అటుంటి జడేజా ఈ సిరీస్లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. బహుశా తన కెరీర్లో అత్యంత చెత్త ప్రదర్శనలలో ఈ సిరీస్ ఒకటిగా నిలిచిపోతుంది. మూడు మ్యాచ్లలో జడేజా కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అలా అని బ్యాట్తో కూడా రాణించలేకపోయాడు. కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్లో ప్రధాన ఆల్రౌండర్గా జడేజా ప్రభావం చూపకపోవడం భారత్ను దెబ్బతీసింది.శ్రేయస్ సైలెంట్..ఇక మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీలో తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో 49 పరుగులతో రాణించిన అయ్యర్.. తర్వాతి రెండు మ్యాచ్లలో ఘోరంగా విఫలమయ్యాడు. కీలకమైన మూడో వన్డేలో అయ్యర్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. మిడిలార్డర్లో నమ్మదగ్గ ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ తన బ్యాట్కు పనిచెప్పకపోవడం భారత్ ఓటమికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.బౌలింగ్ ఫెయిల్ఈ సిరీస్లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది. భారత పేసర్లు తేలిపోయారు. హర్షిత్ రాణా, సిరాజ్ ఫర్వాలేదన్పించినప్పటికి.. ప్రసిద్ద్ కృష్ణ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. తొలి వన్డేలో భారత బౌలర్లు ఏకంగా 300 పరుగులు సమర్పించుకున్నారు.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి! -
సంపాదనలేని భర్త వద్దు.. భార్యే నా ATM?.. అసలేం జరిగింది?
ఢిల్లీ.. 2000 సంవత్సరం.. విమాన ప్రయాణం.. ఆమె లగేజీ, డాక్యుమెంట్లు పోయాయి.. ఇంతలో అతడు వచ్చాడు.. ఆమెకు సాయం చేశాడు.. ఇద్దరి మాటలు కలిశాయి.. మనసులు కలవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఐదేళ్ల స్నేహం తర్వాత 2005లో ఆ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.వారి దాంపత్యానికి గుర్తుగా 2007లో కవల కుమారులు జన్మించారు. 2013లో మరో కుమారుడు.. 2018లో ఓ ఆడబిడ్డను దత్తత తీసుకున్నారు. వారిద్దరు వారికి నలుగురు.. చక్కటి సంసారం. ఆమె భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్. అతడు కరుంగ్ ఓన్కోలర్.. ఫుట్బాల్ ఆటగాడు. న్యాయవాది కూడా!బాక్సర్గా భార్య ఎదుగుదల కోసం తన కెరీర్ను పణంగా పెట్టానంటాడు కరుంగ్. మేరీ సైతం గతంలో భర్త ప్రోత్సాహంతో ఇక్కడిదాకా వచ్చానని చెప్పింది. అయితే, విధికి కన్నుకుట్టిందో ఏమో.. 2013 నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. చినికి చినికి గాలివానలా మారి వ్యవహారం విడాకుల దాకా వచ్చింది.వివాహేతర సంబంధం మచ్చకోమ్ చట్టాల ప్రకారం తాము విడిపోయినట్లు మేరీ కోమ్ గతేడాది ఓ ప్రకటన విడుదల చేసింది. ఓన్కోలర్తో విడిపోయినట్లు తన న్యాయవాది ద్వారా ప్రకటన చేసింది. ఇక అప్పటి నుంచి ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయి ఎందరికో ఆదర్శంగా నిలిచిన మేరీ కోమ్ వ్యక్తిత్వంపై వివాహేతర సంబంధం మచ్చ పడింది.అయితే, ఈ విషయం గురించి ఓన్కోలర్ నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తన గురించి మేరీ లోక్ అదాలత్లో మోసగాడు అని ముద్ర వేసిన తర్వాతే తాను అసలు విషయం చెప్పాల్సివస్తోందంటూ అతడు సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల మాట్లాడుతూ.. 2013లో ఓ జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు వివాహేతర సంబంధం ఉండేదని అతడు ఆరోపించాడు.సాక్ష్యంగా మెసేజ్లుఆ తర్వాత రాజీ పడినా.. 2017లో మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించిందని ఓన్కోలర్ ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరి సంబంధానికి సాక్ష్యంగా తన వద్ద వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయని తెలిపాడు. ఆమెను తాను మోసం చేశానని.. ఆస్తి కొట్టేశానని మేరీ కోమ్ చేసిన ఆరోపణలకు కౌంటర్గా అతడు ఈ మేరకు సమాధానం ఇచ్చాడు.మేరీ కోమ్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని.. అయితే, తనపై అభాండాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నాడు. ఆధారాలు ఉంటేనే తన గురించి మాట్లాడాలని మేరీ కోమ్కు హితవు పలికాడు. కాగా 2022లో తాను గాయపడినపుడు ఓన్కోలర్ నిజ స్వరూపం బయటపడిందని మేరీ కోమ్ ఇటీవల తెలిపింది. తాను పోటీలలో పాల్గొని సంపాదించినంత వరకు అంతా సజావుగా సాగిందని.. ఎప్పుడైతే తాను గాయపడ్డానో అప్పటి నుంచి తానొక భ్రమలో బతుకుతున్న విషయం స్పష్టంగా తెలిసిందని వాపోయింది.సంపాదన లేకుండా నాపై ఆధారపడిఅప్పుడే తనకు నిజం తెలిసిందని.. అందుకే భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు మేరీ కోమ్ తెలిపింది. అంతేకాదు.. తన దగ్గర కోట్ల రూపాయలు కాజేసి.. భూమి కొనుకున్నాడని.. మణిపూర్లోని తన ఆస్తిపై లోన్లు తెచ్చుకున్నాడని ఆరోపించింది. తాను ఇలా మాట్లాడినందుకు కొంతమంది తనను దురాశ కలిగిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారని.. తనకు ఏడ్చే వెసలుబాటు కూడా లేదా అని ఆవేదన వ్యక్తం చేసింది.తాను కష్టపడి బాక్సింగ్ ద్వారా కుటుంబాన్ని పోషిస్తే.. అతడు మాత్రం ఎలాంటి సంపాదన లేకుండా తనపై ఆధారపడి బతికేవాడని మేరీ కోమ్ మాజీ భర్తపై మండిపడింది. తనకు తెలియకుండానే తన బ్యాంకు ఖాతాలోని డబ్బులను ఖాళీ చేశాడని ఆరోపించింది. ఇందుకు ఓన్కోలర్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.పిల్లలకు తల్లినయ్యానుపెళ్లికి ముందు తాను ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్గా ఉండేవాడినని.. అయితే, మేరీ కోమ్ కోసం తాను తన కెరీర్నే వదులుకున్నానని పేర్కొన్నాడు. ఆమె బాక్సింగ్తో బిజీగా ఉంటే.. తానే పిల్లల్ని పెంచి పెద్ద చేశానని.. ఇంటి బాధ్యతలు చూసుకున్నానని చెప్పుకొచ్చాడు.పిల్లలకు స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నీ తానే చేసేవాడినని.. తల్లిలా వారిని పెంచానని గుర్తు చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తనను కనీసం పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదంటూ ఆవేదన చెందాడు. మేరీ కోమ్, పిల్లల మీద ప్రేమతో మాత్రమే ఇవన్నీ చేశానని.. తనకు డబ్బు, పేరు అక్కర్లేదని పేర్కొన్నాడు.సంపాదనలేని భర్త వద్దా? భార్యే నా ATM?మేరీ కోమ్- ఓన్కోలర్ వివాదంలో కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు అతడికి సపోర్టు చేస్తున్నారు. భార్యను ప్రోత్సహించిన భర్తకు సంపాదన లేదన్న కారణం చూపి అవమానించడం సరికాదని కొందరు అంటుంటే.. భార్యను ATMలా వాడుకునేవాళ్లు చాలా మందే ఉంటారని మరికొందరు వాదిస్తున్నారు.ఏదేమైనా మేరీ కోమ్ వంటి దిగ్గజ బాక్సర్ రింగ్లో సత్తా చాటినా.. కారణం ఎవరైనా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కోవడం బాధాకరమని ఇంకొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలని.. పద్దెమినిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ ఇద్దరు ఇలా రచ్చకెక్కడం ఏమీ బాగాలేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. -
మాది చిన్న దేశం.. అయినా పెద్ద పెద్ద జట్లను ఓడిస్తున్నాం: కివీస్ కెప్టెన్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ గడ్డపై తొలి దైపాక్షిక వన్డే సిరీస్ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ 2-1 తేడాతో న్యూజిలాండ్ కైవసమైంది. గత పర్యటనలో టెస్టుల్లో భారత్ను వైట్వాష్ చేసిన కివీస్.. ఈసారి వన్డేల్లో మట్టి కరిపించింది. చివరి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్లో దుమ్ములేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) అద్భుత సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం లక్ష్య చేధనలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(124) ఒంటరి పోరాటం చేశాడు. అతడితో పాటు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో రాణించారు. కానీ రోహిత్, గిల్,శ్రేయస్ అయ్యర్ వంటి టాపార్డర్ బ్యాటర్ల నుంచి సహకరం లభించకపోవడంతో 296 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయింది. ఇక ఈ చారిత్రత్మక విజయంపై మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ స్పందించాడు. భారత్పై సిరీస్ విజయం తమకెంతో ప్రత్యేకమని బ్రేస్వెల్ చెప్పుకొచ్చాడు."భారత్కు వచ్చి ఇక్కడ ప్రేక్షకుల ముందు ఆడటం ఎప్పుడూ ఒక గౌరవంగా భావిస్తాం. టీమిండియా వంటి పటిష్టమైన జట్టును వారి సొంత గడ్డపై ఓడించి, తొలిసారి వన్డే సిరీస్ను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని మేము ఎప్పటకీ మర్చిపోము. భారత్కు వచ్చి మెరుగైన ప్రదర్శన చేయాలని ప్రతీ జట్టు కోరుకుంటుంది.మేము ఒక జట్టుగా మా ప్రణాళికలకు కట్టుబడి, సమష్టిగా రాణించేందుకు ప్రయత్నించాం. అది మాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్రపంచంలో ఒక మూలన ఉన్న చిన్న దేశం నుంచి వచ్చిన మేము.. ఐక్యంగా ఉండి పెద్ద పెద్ద జట్లను సవాల్ విసురుతున్నాము. కలిసి కట్టుగా ఆడడం ఒక్కటే న్యూజిలాండ్ క్రికెట్ సిద్ధాంతం. ఇక డారిల్ మిచెల్ ఒక అద్బుతం. గత కొన్నేళ్లుగా వన్డేల్లో తిరుగులేని ఫామ్లో ఉన్నాడు. అతడు మాకు మిడిలార్డర్లో కీలకమైన ఆటగాడు. మిచెల్ మా బ్యాటింగ్ యూనిట్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ సిరీస్లో అరంగేట్రం చేసిన ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్ ప్రదర్శన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాము. భారత్ వంటి కఠిన పరిస్థితులలో వారి ఆట తీరు చూస్తుంటే కివీస్ క్రికెట్ భవిష్యత్తుపై ఎటువంటి ఢోకా లేదన్పిస్తోందని" బ్రేస్వేల్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు.చదవండి: T20 World Cup: బంగ్లాదేశ్కు ఐసీసీ డెడ్ లైన్.. లేదంటే? -
పరాయి దేశానికి వలస వెళ్లిన మరో సౌతాఫ్రికా క్రికెటర్
సాధారణంగా ఏ క్రీడాకారుడికైనా దేశానికి ప్రాతినిథ్యం వహించడమనేది ఓ కల. అయితే సౌతాఫ్రికన్లు మాత్రం ఇందుకు భిన్నం. ఈ మాట చెప్పడానికి కారణాలు లేకపోలేదు. క్రికెట్ను ఉదాహరణగా తీసుకుంటే.. ఈ క్రీడ చరిత్రలో అత్యధిక శాతం వలస వెళ్లిన వాళ్లు సౌతాఫ్రికన్లే. వలస వెళ్లడమే కాదు.. దేశం మారాక వారిలో అధిక శాతం మంది స్టార్ క్రికెటర్లయ్యారు.సౌతాఫ్రికన్లే ఎక్కువ శాతం ఎందుకు విదేశాల్లో కెరీర్లు ప్లాన్ చేసుకుంటున్నారన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పేరుకు పెద్ద దేశమే అయినా, ఆ దేశ క్రికెట్ బోర్డు ఆర్దిక వనరులు మాత్రం అంతంతమాత్రమే. క్రికెటర్లు ఇతర దేశాలకు వలస వెళ్లడానికి ఇదే ప్రధాన కారణం.చరిత్ర చూసుకుంటే, సౌతాఫ్రికాలో పుట్టిన క్రికెటర్లు ఎక్కువ శాతం ఇంగ్లండ్కు వలస వెళ్లారు. ఇందుకు కారణం కోల్పాక్ ఒప్పందాలు. ఈ ఒప్పందాల మేరకు 2010లో రూపొందించిన యూరోపియన్ యూనియన్ చట్టాల్లో.. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇంగ్లండ్లో స్థానిక ఆటగాళ్లుగా ఆడే అవకాశం పొందారు. సౌతాఫ్రికాతో పోల్చుకుంటే ఇంగ్లండ్లో మెరుగైన వేతనాలు, సౌకర్యాలు, స్థిరమైన కెరీర్ మరియు భవిష్యత్తు, అదనంగా కుటుంబ భద్రత అధికంగా లభిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువ శాతం మంది సౌతాఫ్రికాలో జన్మించినా ఇంగ్లండ్లో కెరీర్ను ప్లాన్ చేసుకోవాలని అనుకుంటారు.ఉదాహరణకు.. సౌతాఫ్రికా దేశవాలీ క్రికెట్తో పోలిస్తే, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అధిక వేతనాలు లభిస్తాయి. ఇంగ్లండ్ కౌంటీలతో ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే స్థిరమైన ఆదాయం కూడా ఉంటుంది. ఈ కారణంగా కెవిన్ పీటర్సన్, జేసన్ రాయ్, జోనాథన్ ట్రాట్, ఆండ్రూ స్ట్రాస్, మ్యాట్ ప్రయర్ లాంటి సౌతాఫ్రికన్లు ఇంగ్లండ్కు వలస వెళ్లి, అక్కడ స్టార్లుగా ఎదిగారు. వీరికి ముందు అలన్ లాంబ్, క్రిస్ స్మిత్, డెర్క్ రాండల్ లాంటి వారు కూడా సౌతాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్ దిగ్గజాలుగా మారారు.ఆర్దిక అవకాశాలు కాకుండా సౌతాఫ్రికన్లు ఇతర దేశాలకు వలస వెల్లడానికి మరో కారణం కెరీర్ స్థిరత్వం. ఇతర దేశాలతో పోలిస్తే.. సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ అవకాశాలు రావడం కాస్త కష్టం. వర్ణానికి సంబంధించిన రిజర్వేషన్ల కారణంగా ఆ జట్టులో పరిమిత అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాల్లో ఈ సమస్య ఉండదు. పౌరసత్వం పొందాకా ఆటలో రాణించగలిగితే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.సౌతాఫ్రికన్లు వలసల బాట పట్టడానికి మరో కారణం కుటుంబ భద్రత మరియు జీవన ప్రమాణాలు. సౌతాఫ్రికాలోని సామాజిక–రాజకీయ అస్థిరత, నేరాల రేటు కారణంగా ఆటగాళ్లు కుటుంబ భద్రత కోసం వలస వెళ్తారు. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇతర దేశాల్లో పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్య సౌకర్యాలు మెరుగ్గా ఉండటం వల్ల వారు వలసలకు ప్రాధాన్యత ఇస్తారు.క్రికెట్లో సౌతాఫ్రికన్ల వలసలకు మరో ప్రధాన కారణం బోర్డు పరిపాలనలో అంతర్గత సమస్యలు. ఆర్దిక సమస్యలతో కొట్టిమిట్టాడే క్రికెట్ సౌతాఫ్రికా (CSA).. పాలనా సమస్యల కారణంగా మరింత పతనమవుతుంది. బోర్డు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఆటగాళ్లను వలసలు వెళ్లేలా ప్రేరేపిస్తాయి.వీటికి తోడు ప్రైవేట్ టీ20ల్లో లీగ్ల్లో పాల్గొనడంపై పరిమితులు ఉండటం సౌతాఫ్రికన్లను వలసలకుప్రోత్సహిస్తుంది. ఇటీవలికాలంలో చాలామంది సౌతాఫ్రికన్లు డబ్బు అధికంగా లభించే ప్రైవేటు టీ20 లీగ్ల కోసం జాతీయ జట్టు అవకాశాలను కూడా తృణప్రాయంగా వదిలిపెట్టారు. హెన్రిచ్ క్లాసెన్ ఇందుకు ప్రధాన ఉదాహరణ.ప్రైవేటు టీ20 లీగ్ల ప్రభావంతో ప్రస్తుతం సౌతాఫ్రికన్ల వలసల రేటు తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అవకాశాల కోసం ఎదురుచూసే వారు మాత్రం ఇంకా పక్క దేశాలవైపు చూస్తూనే ఉన్నారు. తాజాగా సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ జేజే స్మట్స్ జాతీయ జట్టు అవకాశాలు రాకపోవడంతో ఇటలీకి వలస వెళ్లాడు. భార్య ద్వారా ఆ దేశ పౌరసత్వం పొంది 2026 టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా చోటు సంపాదించాడు. స్మట్స్ ఇతర దేశ జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలోనే ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.క్రికెట్ చరిత్రలో ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహించిన సౌతాఫ్రికన్లు (ఇంగ్లండ్ కాకుండా)..ఆస్ట్రేలియామార్నస్ లబూషేన్కీగన్ మాథ్యూస్ఫిరోస్ ఎర్ఫాన్క్లైవ్ ఇంగ్లిస్న్యూజిలాండ్గ్రాంట్ ఇలియట్నీల్ వాగ్నర్డెవాన్ కాన్వేలూక్ రోంచిక్రిస్ కేన్స్నమీబియాడేవిడ్ వీస్జింబాబ్వే గ్యారీ బ్యాలెన్స్ -
భారత జెర్సీలో మళ్లీ రో-కోలు కనిపించేది ఎప్పుడంటే?
టీమిండియా స్టార్ జోడీ విరాట్ కోహ్లి-రోహిత్ శర్మల ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముగియడంతో రో-కో ద్వయం దాదాపు 6 నెలల పాటు భారత జెర్సీలో కన్పించరు. మళ్లీ వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో వీరిద్దరూ భారత్ తరపున ఆడనున్నారు.అంతకంటే మందు జూన్లో అఫ్గానిస్తాన్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం భారత పర్యటనకు రావాల్సి ఉంది. కానీ ఈ ద్వైపాక్షిక సిరీస్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఒకవేళ అఫ్గానిస్తాన్తో భారత్ ఆడితే విరాట్-రోహిత్ కూడా బరిలోకి దిగనున్నారు. లేదంటే ఆ తర్వాత నెలలో ఇంగ్లండ్పై కచ్చితంగా ఆడనున్నారు.కాగా ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లిలు.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్తో వన్డేల తర్వాత టీమిండియా టీ20 సిరీస్లు ఎక్కువగా ఆడనుంది. వీరిద్దరూ టీ20లకు వీడ్కోలు పలకడంతో వన్డే సిరీస్ షెడ్యూల్ వరకు అభిమానులు అగాల్సిందే.అయితే ఈ సీనియర్ ప్లేయర్లు ఐపీఎల్లో మాత్రం తమ తమ జట్లు తరపున సందడి చేయనున్నారు. ఈ ఏడాది ఆఖరిలో మాత్రం విరాట్, రోహిత్ వరుస అంతర్జాతీయ సిరీస్లలో బీజీబీజీగా గడపనున్నారు. ఇంగ్లండ్తో వన్డేలు ముగిసిన తర్వాత సెప్టెంబర్లో భారత్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య విండీస్తో మెన్ ఇన్ బ్లూ 3 వన్డేలు ఆడనుంది. అనంతరం అక్టోబర్-నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.విరాట్ హిట్.. రోహిత్ ఫట్ఇక తాజాగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో విరాట్ కోహ్లి దుమ్ములేపితే.. రోహిత్ మాత్రం తీవ్ర నిరాశ పరిచాడు. ఈ సిరీస్లో కోహ్లి మొత్తంగా 240 పరుగులు చేసి భారత తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో కూడా కోహ్లి వీరోచిత శతకంతో పోరాడాడు. రోహిత్ మాత్రం మూడు మ్యాచ్లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: IND vs NZ: వాళ్ల సెంచరీలే కాదు.. అతడి 28 రన్స్ కీలకం! -
వాళ్ల సెంచరీలే కాదు.. అతడి 28 రన్స్ కీలకం!
న్యూజిలాండ్ వన్డే జట్టు తాత్కాలిక కెప్టెన్ మైకేల్ బ్రేస్వెల్పై టీమిండియా మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో భారత గడ్డపై తొలిసారి కివీస్కు వన్డే సిరీస్ విజయాన్ని అందించాడని కొనియాడాడు.మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) ఫిట్నెస్ సమస్యల కారణంగా వన్డే సిరీస్కు దూరం కాగా.. టీ20 సారథి బ్రేస్వెల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.ఈ క్రమంలో బ్రేస్వెల్ (Michael Bracewell) కెప్టెన్సీలో తొలి వన్డేలో టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. ఆఖరి రెండు మ్యాచ్లలో గెలిచి తొలిసారి భారత్లో వన్డే సిరీస్ గెలిచింది. ఇండోర్లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.బ్రేస్వెల్ ధనాధన్ఈ మ్యాచ్లో డారిల్ మిచెల్ (131 బంతుల్లో 137), గ్లెన్ ఫిలిప్స్ (106) శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ బ్రేస్వెల్ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 18 బంతుల్లోనే ఓ ఫోర్, మూడు సిక్సర్లు బాది 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసిన కివీస్.. లక్ష్యాన్ని కాపాడుకుని జయభేరి మోగించింది.ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఐదో స్థానంలో వచ్చి గ్లెన్ ఫిలిప్స్ మరోసారి అద్భుతంగా ఆడాడు. షార్ట్ పిచ్ డెలివరీలను చక్కగా ఆడాడు. బంతిని నేరుగా బౌండరీ మీదుగా తరలించాడు.అత్యంత కీలకంవికెట్ బాగుంది. దానిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, మైకేల్ బ్రేస్వెల్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఈ మ్యాచ్కు అత్యంత కీలకం. అతడి కారణంగానే న్యూజిలాండ్ స్కోరు 300- 330 వరకు చేరుకోగలిగింది. బ్రేస్వెల్ సూపర్గా సిక్సర్లు బాదాడు.ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కూడా అతడిని ఎందుకు కొనలేదో నాకు ఇంత వరకు అర్థం కాలేదు. గాయం కారణంగా అతడు పెద్దగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అంతే తప్ప బ్యాటింగ్లో పర్లేదు. మరెందుకనో ఐపీఎల్ జట్లు అతడి వైపు మొగ్గు చూపలేదు.అసలు ఏ ప్రాతిపదికన ఐపీఎల్ జట్లు ఆటగాళ్లను ఎంచుకుంటున్నాయో అర్థం కావడం లేదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో తొలి వన్డేలో 16 పరుగులు చేసిన బ్రేస్వెల్.. రెండో వన్డేలో బ్యాటింగ్ చేయకపోయినా వికెట్ తీయగలిగాడు. తాజాగా మూడో వన్డేలో విలువైన 28 పరుగులు చేయడంతో పాటు తన అద్భుత కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. కాగా 34 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్ అయిన బ్రేస్వెల్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా! ఐపీఎల్ వేలం-2026లో రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన బ్రేస్వెల్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.చదవండి: వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్! -
బంగ్లాదేశ్కు ఐసీసీ డెడ్ లైన్.. లేదంటే?
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్కు వస్తుందా? లేదా అన్నది? జనవరి 21న తేలిపోనుంది. భద్రత కారణాలను సాకుగా చూపుతూ తమ జట్టును వరల్డ్కప్ కోసం భారత్కు పంపబోమని బంగ్లా క్రికెట్ బోర్డు మొండి పట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఇప్పటికే పలుమార్లు ఐసీసీకి బీసీబీ విజ్ఞప్తి చేసింది.అందుకు సమాధానముగా ఆఖరి నిమిషంలో షెడ్యూల్ను మార్చడం కుదరదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెల్చిచేప్పేసింది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ఈ క్రమంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ వస్తుందా లేదా అనే విషయం చెప్పేందుకు జనవరి 21ని తుది గడువుగా ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ బంగ్లాదేశ్ తన మొండిపట్టు వీడకుంటే.. ఆ స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చాలని ఐసీసీ భావిస్తుందంట. ఐసీసీ ర్యాంకింగ్స్ బంగ్లాదేశ్ తర్వాతి స్దానాల్లో జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఉన్నాయి. అయితే జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించగా.. తర్వాత స్దానంలో ఉన్న స్కాట్లాండ్కు బంగ్లా స్దానంలో అవకాశం దక్కనుంది.కాగా గత కొంతకాలంగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు నెలకొన్నాయి. అయితే ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ విడుదల చేయడంతో ఈ ఉద్రిక్తలు క్రికెట్కు పాకాయి. బంగ్లాలో హిందువలపై దాడులు పెరిగిపోతుండడంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తమ జట్టును వరల్డ్కప్ కోసం భారత్ పంపబోమని, వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బంగ్లా ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇక షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్లను కోల్కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది.చదవండి: T20 World Cup 2026: సౌతాఫ్రికాకు భారీ షాక్ -
వీనస్ విలియమ్స్కు షాక్
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పెను సంచలనాలు లేకుండానే ప్రారంభమైంది. ఫేవరెట్స్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచి శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్), ఏడో సీడ్ జాస్మిన్ పావోలిని (ఇటలీ), 12వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు.ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడుతున్న సబలెంకా తొలి రౌండ్లో 6–4, 6–1తో టియాంట్సోవా రకోటొమాంగా (ఫ్రాన్స్)పై గెలుపొందింది. ఈ మ్యాచ్ను టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) ప్రత్యక్షంగా తిలకించారు. 76 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సబలెంకా ఆరంభంలో తడబడింది.వెంటనే తేరుకునితొలి మూడు పాయింట్లు కోల్పోవడంతోపాటు తన తొలి సర్వీస్ గేమ్ను చేజార్చుకుంది. అయితే వెంటనే తేరుకున్న రెండుసార్లు (2023, 2024) చాంపియన్, గత ఏడాది రన్నరప్ పదో గేమ్లో టియాంట్సోవా సర్వీస్ను బ్రేక్ చేసి తొలి సెట్ను సొంతం చేసుకుంది.రెండో సెట్లో మాత్రం సబలెంకా జోరు పెంచగా... ‘వైల్డ్ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగిన టియాంట్సోవా తేలిపోయింది. 23 విన్నర్స్ కొట్టిన సబలెంకా 20 అనవసర తప్పిదాలు కూడా చేసింది. మ్యాచ్ మొత్తంలో ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో పావోలిని 6–1, 6–2తో క్వాలిఫయర్ సస్నోవిచ్ (రష్యా)పై, స్వితోలినా 6–4, 6–1తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్)పై, 28వ సీడ్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) 6–4, 6–1తో మనన్చాయ సావంగ్కె (థాయ్లాండ్)పై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. వీనస్ తొలి రౌండ్లోనే అవుట్ మరోవైపు అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్తోపాటు 11వ సీడ్ అలెగ్జాండ్రోవా (రష్యా), 20వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్), 26వ సీడ్ డయానా యాస్ట్రెమ్స్కా (ఉక్రెయిన్) తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో ఆడిన అతి పెద్ద వయస్కురాలిగా రికార్డు నెలకొల్పిన 45 ఏళ్ల వీనస్ తీవ్రంగా పోరాడినా తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించలేకపోయింది.రెండు గంటల 17 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో వీనస్ 7–6 (7/5), 3–6, 4–6తో ఓల్గా డానిలోవిచ్ (సెర్బియా) చేతిలో ఓడింది. ఇతర మ్యాచ్ల్లో క్వాలిఫయర్ జెనెప్ సోన్మెజ్ (టర్కీ) 2 గంటల 37 నిమిషాల్లో 7–5, 4–6, 6–4తో అలెగ్జాండ్రోవాపై, 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ఎల్సా జాక్వెమోట్ (ఫ్రాన్స్) 6–7 (4/7), 7–6 (7/4), 7–6 (10/7)తో మార్టా కొస్టుక్పై, ఎలీనా గాబ్రియేలా రుస్ (రొమేనియా) 6–4, 7–5తో యాస్ట్రెమ్స్కాపై సంచలన విజయాలు నమోదు చేశారు. అల్కరాజ్ శుభారంభం పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), మూడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), పదో సీడ్ బుబ్లిక్ (కజకిస్తాన్) తొలి రౌండ్లో నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను తొలిసారి గెలిచి ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకోవాలని భావిస్తున్న అల్కరాజ్ 6–3, 7–6 (7/2), 6–2తో ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. చదవండి: ఆమె మనిషి కాదు! -
T20 World Cup 2026: సౌతాఫ్రికాకు భారీ షాక్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు సౌతాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఆల్రౌండర్ డోనోవన్ ఫెరీరా భుజం గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశముంది. సౌతాఫ్రికా టీ20 లీగ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న ఫెరీరా.. శనివారం ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు.ప్రిటోరియా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో అతడి ఎడమ భుజం బలంగా నేలకు తాకింది. దీంతో ఫెరీరా తీవ్రమైన నొప్పితో విలవిలాడాడు. ఆ తర్వాత జట్టు కష్టాల్లో ఉండడంతో ఫెరీరా తప్పనిసారి పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చాడు. కానీ కేవలం ఒకే ఒక బంతి మాత్రమే ఎదుర్కొని రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. మ్యాచ్ ముగిశాక అతడిని స్కానింగ్కు తరలించగా.. భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ టోర్నీ నుంచి అతడు వైదొలిగాడు. ఫెరీరా కోలుకోవడానికి దాదాపు ఐదు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు పొట్టి ప్రపంచకప్ నుంచి తప్పుకొనే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సౌతాఫ్రికాకు నిజంగా భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫెరీరా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ తర్వాత ప్రధాన ఫినిషర్గా ఫెరీరా ఉన్నాడు. 2024 నుంచి టీ20ల్లో అత్యధిక స్ట్రైక్ రేటు కలిగి ఉన్న బ్యాటర్గా ఫెరీరా కొనసాగుతున్నాడు.86 ఇన్నింగ్స్లలో 177.08 స్ట్రైక్ రేటుతో 1716 పరుగులు చేశాడు. గత నెలలో భారత్తో జరిగిన టీ20 సిరీస్లో కూడా డోనోవన్ దుమ్ములేపాడు. అతడి ఆఫ్ స్పిన్ కూడా బౌలింగ్ చేయగలడు. ఒక వేళ అతడు ఈ టోర్నీకి దూరమైతే ర్యాన్ రికెల్టన్ లేదా ట్రిస్టన్ స్టబ్స్ను జట్టులోకి తీసుకునే అవకాశముంది.టీ20 వరల్డ్ కప్ 2026 కోసం దక్షిణాఫ్రికా జట్టు:ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కోర్బిన్ బాష్, డేవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్ (కీపర్), టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్జే, కాగిసో రబాడ, జేసన్ స్మిత్.చదవండి: వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్! -
వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్!
న్యూజిలాండ్తో మూడో వన్డేలో శుబ్మన్ గిల్ కెప్టెన్సీని భారత వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే విమర్శించాడు. టీమిండియా బౌలర్ల సేవలను అతడు సరిగ్గా వాడుకోలేదని.. అందుకే కివీస్ భారీ స్కోరు సాధించగలిగిందని అభిప్రాయపడ్డాడు.ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.డారిల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలుడారిల్ మిచెల్ (Daryl Mitchell- 137), గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips-106) శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్కు ఈ భారీ స్కోరు సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 219 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం క్రిక్బజ్ వేదికగా అజింక్య రహానే మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు గిల్ సరైన సమయంలో బంతిని ఇవ్వలేదని విమర్శించాడు.వాళ్లను పక్కనపెట్టి తప్పు చేశారు‘‘మధ్య ఓవర్లలో కుల్దీప్తో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయించాడు గిల్. అక్కడే అతడు పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ 37-38వ ఓవర్ వరకు అతడి చేతికి బంతి రాలేదు.అదే విధంగా జడేజాను సైతం 30వ ఓవర్ వరకు అలాగే ఉంచారు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు తీయగల సత్తా కలిగిన వారు. అయినప్పటికీ వారిని పక్కనపెట్టారు. అక్కడే టీమిండియా అతిపెద్ద తప్పు చేసింది’’ అని రహానే అభిప్రాయపడ్డాడు.మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటేఇందుకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ సైతం మద్దతు పలికాడు. కుల్దీప్ కంటే కూడా జడేజాను మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదన్నాడు. జడ్డూను ఆలస్యంగా బరిలోకి దించి తప్పు చేశారని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరు ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.మరోవైపు.. జడేజా ఆరు ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీయగా.. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది.ఓపెనర్లు రోహిత్ శర్మ (11), కెప్టెన్ శుబ్మన్ గిల్ (23) నిరాశపరచగా.. శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్డౌన్ బ్యాటర్ కోహ్లి పట్టుదలగా నిలబడ్డాడు. సెంచరీ (124)తో కదం తొక్కాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (53), ఎనిమిదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు.అయితే, మిగతా వారంత విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్ల ధాటికి 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయిన గిల్ సేన.. మ్యాచ్తో పాటు తొలిసారి సొంతగడ్డపై కివీస్కు వన్డే సిరీస్నూ కోల్పోయింది. చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. 20 ఏళ్ల యువ సంచలనానికి ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఈ నెలఖారులో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో ఆసీస్ ఆతిథ్య పాక్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు.అయితే స్టార్ ప్లేయర్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, గ్లెన్ మాక్స్వెల్లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వీరితో పాటు టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్ కూడా పాక్స్తాన్కు వెళ్లడం లేదు. వీరంతా నేరుగా శ్రీలంకలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్లో చేరనున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు హాజిల్వుడ్, డేవిడ్ గాయపడిన సంగతి తెలిసిందే.హాజిల్వుడ్ గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకోగా.. డేవిడ్ తొడ కండరాల గాయంతో బిగ్ బాష్ లీగ్ మధ్యలో వైదొలగాడు. అయితే వీరిద్దరూ వరల్డ్కప్ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి.జట్టులోకి యువ ఆటగాళ్లు..ఇక బిగ్ బాష్ లీగ్లో అదరగొట్టిన పేసర్ మహ్లి బియర్డ్మాన్, ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్కు తొలిసారి ఆసీస్ టీ20 జట్టులో చోటు దక్కింది. 20 ఏళ్ల బియర్డ్మాన్ పెర్త్ స్కార్చర్స్ తరఫున అద్భుతంగా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అదేవిధంగా జాక్ ఎడ్వర్డ్స్ అటు బంతితోనూ ఇటు బ్యాట్తోనూ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వీరిద్దరికి జాతీయ సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్-2026 వేలంలో ఎడ్వర్డ్స్ను రూ.3 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇక పాక్-ఆసీస్ టీ20 సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని మూడు టి20 మ్యాచ్లు లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో జరగనున్నాయి.పాక్తో టీ20లకు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, మహ్లి బియర్డ్మాన్, కూపర్ కానోలీ, బెన్ ద్వార్షుయిస్, జాక్ ఎడ్వర్డ్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), మాథ్యూ కునెమన్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాచదవండి: న్యూజిలాండ్తో సిరీస్ ఓటమి.. శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం -
ఆమె మనిషి కాదు!
వేదిక ఏదైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... ప్రత్యర్థులు ఎవరైనా... తగ్గేదేలా అంటోంది దక్షిణ కొరియా సూపర్స్టార్ షట్లర్ ఆన్ సె యంగ్. బ్యాడ్మింటన్ సీజన్లోని రెండో టోర్నమెంట్ ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆన్ సె యంగ్ టైటిల్ నిలబెట్టుకుంది.మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో విజేతగా నిలిచి ఈ ఏడాది ఘనంగా ప్రారంభించిన ఈ ప్రపంచ నంబర్వన్ అదే జోరును న్యూఢిల్లీలోనూ కొనసాగించింది. తుది పోరులో ఆన్ సె యంగ్కు గట్టిపోటీ ఇస్తుందనుకున్న ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి కొరియా స్టార్ ధాటికి తేలిపోయింది.కెరీర్లో 22వసారి వాంగ్ జి యితో ఆడిన ఆన్ సె యంగ్ 18వసారి చైనా ప్లేయర్ను ఓడించి తన కెరీర్లో 36వ సింగిల్స్ టైటిల్ను జమ చేసుకుంది. గత ఏడాది చివరి నాలుగు టోర్నీలో విజేతగా నిలిచిన ఆన్ సె యంగ్ ఈ ఏడాది ఆడిన రెండు టోర్నీలలోనూ టైటిల్ సొంతం చేసుకొని ‘సిక్సర్’ నమోదు చేసింది. న్యూఢిల్లీ: ‘ఆమె మనిషి కాదు... రోబో’ అని ఆన్ సె యంగ్ గురించి ఆమె ప్రత్యర్థులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిజమే అనుకోవాలి. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో అత్యంత నిలకడగా విజయాలు నమోదు చేస్తున్న ఆన్ సె యంగ్ కొత్త ఏడాదిలోనూ చెలరేగిపోతోంది. ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్ టోర్నీలో ఈ టాప్ సీడ్ ప్లేయర్ చాంపియన్గా నిలిచింది. గత ఏడాది టైటిల్ సాధించిన ఈ కొరియా సూపర్స్టార్ ... ఈ సంవత్సరం కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.43 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆన్ సె యంగ్ 21–13, 21–11తో వాంగ్ జి యిపై గెలిచింది. ఆన్ సె యంగ్కు 66,500 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 12వ ర్యాంకర్ లిన్ చున్ యి (చైనీస్ తైపీ) టైటిల్ గెలిచాడు. ఫైనల్లో లిన్ చున్ యి 21–10, 21–18తో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు.ప్రైజ్మనీ ఎంతంటే?లిన్ చున్ యికి 66,500 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. మహిళల డబుల్స్లో లియు షెంగ్షు –టాన్ నింగ్ (చైనా) జోడీ టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో లియు–టాన్ నింగ్ 21–11, 21–18తో యుకీ ఫుకుషిమా–సయాకా మత్సుమోతో (జపాన్)లపై గెలిచారు.పురుషుల డబుల్స్ ఫైనల్లో లియాంగ్ వెకెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం 17–21, 25–23, 21–16తో హిరోకి మిదోరికావా–క్యోహె యామషిటా (జపాన్) జోడీపై నెగ్గి టైటిల్ అందుకుంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో డెచాపోల్–సుపిసారా (థాయ్లాండ్) జంట 19–21, 25–23, 21–18తో మథియాస్ క్రిస్టియాన్సెన్–అలెగ్జాండ్రా బోయె (డెన్మార్క్) జోడీపై విజయం సాధించి టైటిల్ హస్తగతం చేసుకుంది. -
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
టీమిండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ వరుసగా రెండో సిరీస్ ఓటమిని ఎదుర్కొన్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. గతేడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో కూడా మెన్ బ్లూ ఓడిపోయింది. గిల్ కెప్టెన్సీలో భారత్ కేవలం వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను మాత్రమే సొంతం చేసుకుంది.దీంతో గిల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్.. మళ్లీ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో ఆతిథ్య జట్టుతో భారత తలపడనుంది.ఈ టూర్లో వన్డే సిరీస్లో గిల్ జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇప్పటికే టీ20 జట్టుకు అతడు దూరం అయ్యాడు కాబట్టి... ఈ టూర్ మొదలయ్యే వరకు గిల్ భారత్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే సూచనలు కన్పించడం లేదు. ఈ క్రమంలో గిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన బ్యాటింగ్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవడానికి రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో ఆడాలని గిల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ దేశవాళీ టోర్నీ సెకెండ్ లీగ్లో పంజాబ్ ఆడే తొలి మ్యాచ్లో గిల్ బరిలోకి దిగే అవకాశముంది. జనవరి 22న రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో సౌరాష్ట్రతో పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర తరపున సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆడనున్నాడు.న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో జడేజా అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. దీంతో తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి జడేజాకు రంజీ ట్రోఫీ కీలకం కానుంది. అవేవిధంగా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి అద్భుత శతకంతో అలరించాడు. ఇండోర్ వేదికగా ఈ వన్డౌన్ బ్యాటర్.. 91 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. పది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 124 పరుగులు సాధించాడు.ప్రపంచ రికార్డులు బద్దలుతద్వారా వన్డే ఫార్మాట్లో తన పేరిట ఉన్న అత్యధిక సెంచరీ (53)ల రికార్డును కోహ్లి సవరించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా 54వ వన్డే సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. తన అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 85వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026 పాంటింగ్, సెహ్వాగ్లను దాటేసిన్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కాగా న్యూజిలాండ్పై కోహ్లికి వన్డేల్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. తద్వారా కివీస్పై అత్యధిక వన్డే శతకాలు బాదిన క్రికెటర్లుగా కొనసాగుతున్న భారత దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ (6), ఆస్ట్రేలియా లెజెండ్ రిక్కీ పాంటింగ్ (6) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.కలిస్ను అధిగమించిఅంతేకాదు.. మూడు ఫార్మాట్లలో కలిపి న్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గానూ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్పై కోహ్లి 73 ఇన్నింగ్స్లో కలిపి 10 సెంచరీలు చేశాడు. తద్వారా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ (9) వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.కాగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో కివీస్ యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి పెవిలియన్ చేరాడు. కోహ్లితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) మాత్రమే రాణించారు. మిగిలిన వారు విఫలం కాగా.. భారత్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది.న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 36 ఇన్నింగ్స్లో 7 సెంచరీలువీరేందర్ సెహ్వాగ్- 51 ఇన్నింగ్స్లో 6 సెంచరీలురిక్కీ పాంటింగ్- 23 ఇన్నింగ్స్లో 6 సెంచరీలుసనత్ జయసూర్య- 47 ఇన్నింగ్స్లో 5 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 42 ఇన్నింగ్స్లో 5 సెంచరీలున్యూజిలాండ్పై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 73 ఇన్నింగ్స్లో 10 సెంచరీలుజాక్వెస్ కలిస్- 76 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుజో రూట్- 71 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 80 ఇన్నింగ్స్లో 9 సెంచరీలు.చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్ -
నితీశ్ రెడ్డి సెంచరీ.. అయ్యో పాపం!
ఐసీసీ అండర్–19 వన్డే ప్రపంచకప్లో సుదిని నితీశ్ రెడ్డి (133 బంతుల్లో 117 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తెలుగు సంతతి కుర్రాడు... అండర్–19లో అమెరికా తరఫున సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. జింబాబ్వేలోని బులవాయో వేదికగా వరల్డ్కప్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో మ్యాచ్లో నితీశ్ సత్తా చాటాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. నితీశ్ ఒంటరి పోరాటంతో జట్టుకు మంచి స్కోరు అందించగా... శివ్ శని (33), అదిత్ (40) ఫర్వాలేదనిపించారు. అంతా మనోళ్లే అమెరికా జట్టులోని పదకొండు మంది ప్లేయర్లు భారత సంతతి ఆటగాళ్లే కాగా... కెప్టెన్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ (0), సాహిల్ గార్గ్ (9), అమరిందర్ గిల్ (10), అదిత్ (6), అమోఘ్ రెడ్డి ఆరెపల్లి (0) విఫలమయ్యారు. మ్యాచ్ రద్దున్యూజిలాండ్ బౌలర్లలో ఫ్లిన్ మోరె 4, మాసన్ క్లార్క్ 3 వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 1 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు ఎంతకూ శాంతించకపోవడంతో పలుమార్లు పరిశీలించిన అనంతరం అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్ -
‘శత’క్కొట్టిన అథర్వ తైడే.. చాంపియన్ విదర్భ
సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన విదర్భ జట్టు తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ టైటిల్ను కైవసం చేసుకుంది. టోర్నమెంట్ ఆసాంతం రాణించిన విదర్భ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ విజేతగా నిలిచింది. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ సౌరాష్ట్రపై గెలుపొందింది. ‘శత’క్కొట్టిన అథర్వ తైడే.. గతేడాది తుదిమెట్టుపై బోల్తా పడ్డ విదర్భ... ఈసారి పట్టు వదలకుండా ప్రయత్నించి విజయవంతమైంది. మొదట బ్యాటింగ్కు దిగిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్ అథర్వ తైడే (118 బంతుల్లో 128; 15 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో కదంతొక్కగా... యశ్ రాథోడ్ (61 బంతుల్లో 54; 2 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్సెంచరీతో రాణించాడు. అమన్ మోఖడే (33), రవికుమార్ సమర్థ్ (25) ఫర్వాలేదనిపించారు. ఒక దశలో 213/1తో మరింత భారీ స్కోరు చేసేలా కనిపించిన విదర్భ... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హర్ష్ దూబే (17), మొహమ్మద్ ఫైజ్ (19) ఎక్కువసేపు నిలవలేకపోయారు. సౌరాష్ట్ర బౌలర్లలో అంకుర్ పన్వర్ 4 వికెట్లు పడగొట్టగా... చేతన్ సకారియా, చిరాగ్ జానీ చెరో రెండు వికెట్లు తీశారు. 279 పరుగులకు ఆలౌట్అనంతరం ఛేదనలో సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (92 బంతుల్లో 88; 10 ఫోర్లు), చిరాగ్ జానీ (63 బంతుల్లో 64; 3 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. కెపె్టన్ హార్విక్ దేశాయ్ (20), విశ్వరాజ్ జడేజా (9), పర్స్వరాజ్ రాణా (7) విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టగా... నచికేత్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. విదర్భ ప్లేయర్లు అథర్వ తైడేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అమన్ మోఖడేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు, ఆంధ్ర మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ విదర్భ జట్టుకు విన్నర్స్ ట్రోఫీ అందించారు. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్.. -
అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డికి అందుకే ఛాన్స్: గిల్
సొంతగడ్డపై టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండోర్లో ఇప్పటి వరకు వన్డే ఓటమి రుచి చూడని భారత జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చింది. మూడో వన్డేలో టీమిండియాను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి శతక్కొట్టినా మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.ఈ నేపథ్యంలో సిరీస్ ఓటమిపై భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. ‘‘తొలి మ్యాచ్లో గెలిచాం. రెండో వన్డేలో వాళ్లు గెలిచి 1-1తో సమం చేశారు. అయితే, ఇక్కడ ఈరోజు మా ఆట తీరు నన్నెంతగానో నిరాశపరిచింది.విరాట్ భాయ్ అద్భుతం.. హర్షిత్ సూపర్మేము ఆటను సరిదిద్దుకోవాల్సి ఉంది. పొరపాట్లను సరిచేసుకుంటాం. విరాట్ (Virat Kohli) భాయ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్లో మాకు అదే అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈ సిరీస్లో ఎనిమిదో స్థానంలో వచ్చి హర్షిత్ రాణా బ్యాటింగ్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026నితీశ్ రెడ్డిని అందుకే ఆడించాంఅందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. మా ఫాస్ట్ బౌలర్లు సిరీస్ ఆసాంతం మెరుగ్గా బౌలింగ్ చేశారు. ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)కి అవకాశాలు ఇస్తున్నాం. సరిపడా ఓవర్లు వేయించడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయిస్తున్నాం.A cracker to bring up his maiden ODI fifty! Well played, Nitish Kumar Reddy.#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/hKLft9Eu0G— Star Sports (@StarSportsIndia) January 18, 2026వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నాం. ఇందులో నితీశ్ కూడా భాగం. అతడి బౌలింగ్ తీరును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం’’ అని గిల్ పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.41 పరుగుల తేడాతో ఓటమిఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్ జరుగగా.. వడోదరలో టీమిండియా.. రాజ్కోట్లో కివీస్ గెలిచాయి. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనలో 46 ఓవర్లలో భారత్ కేవలం 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్లో కోహ్లి సెంచరీ (124) చేయగా.. నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు. మిగిలిన వారిలో గిల్ (23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. చదవండి: IND vs NZ: ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వచ్చినా కూడా! వీడియో -
కోహ్లి వీరోచితం సరిపోలేదు
భారత్ ముందున్న లక్ష్యం 338 అసాధారణమైంది. దీన్ని ఛేదించే క్రమంలో 71/4 స్కోరు వద్దే టీమిండియా కుదేలైంది. అప్పటికే రోహిత్ శర్మ, గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అవుట్! ఉన్నది కోహ్లి ఒక్కడే! ఈ చేజింగ్ కింగ్... నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి 159 స్కోరు వరకు తీసుకెళ్లాడు. జడేజా నిర్లక్ష్యంగా ఆడినా... హర్షిత్ రాణాతో ఒడ్డున పడేసేందుకు కడదాకా శ్రమించాడు. 40 బంతుల్లో 61 పరుగుల సమీకరణం గెలుపుపై ధీమాను తెచి్చంది. ఇలాంటి తరుణంలో 277 స్కోరు వద్ద హర్షిత్ ని్రష్కమించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. కోహ్లి వీరోచిత పోరాటానికి అండగా నిలిచేవారే లేకపోవడంతో చివరకు 41 పరుగులతో మ్యాచ్ ఓడిన భారత్ సిరీస్ను 1–2తో చేజార్చుకుంది. ఇండోర్: ఏడాదిన్నర క్రితం భారత గడ్డపై టీమిండియాను టెస్టుల్లో దెబ్బ కొట్టిన న్యూజిలాండ్... ఈ ఏడాది ఆరంభంలో వన్డేల్లోనూ కంగుతినిపించింది. మూడు వన్డేల సిరీస్ను ఓటమితో మొదలుపెట్టిన బ్రేస్వెల్ సారథ్యంలోని కివీస్ ఆ తర్వాత వరుస మ్యాచ్లు గెలిచి సిరీస్ను 2–1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 41 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. వన్డే సిరీస్ను చేజార్చుకుంది. టాస్ నెగ్గిన టీమిండియా కెపె్టన్ శుబ్మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా న్యూజిలాండ్ నిరీ్ణత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’.. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ డరైల్ మిచెల్ (131 బంతుల్లో 137; 15 ఫోర్లు, 3 సిక్స్లు), గ్లెన్ ఫిలిప్స్ (88 బంతుల్లో 106; 9 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలు సాధించారు. 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ను నాలుగో వికెట్కు 219 పరుగులు జోడించడం ద్వారా మిచెల్, ఫిలిప్స్ భారీస్కోరుకు బాట వేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగుల వద్ద ఆలౌటై ఓడిపోయింది. విరాట్ కోహ్లి (108 బంతుల్లో 124; 10 ఫోర్లు, 3 సిక్స్లు) వన్డేల్లో 54వ శతకం సాధించాడు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 53; 2 ఫోర్లు, 2 సిక్స్లు), హర్షిత్ రాణా (43 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. తదుపరి ఇరు జట్ల మధ్య ఐదు టి20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ 21న నాగ్పూర్లో జరగనుంది. నిర్ల్యక్షంగా ఆడి... పెద్ద లక్ష్యం ముందుంటే బ్యాటింగ్కు స్వర్గధామమైన పిచ్పై పెద్దగా కష్టపడకుండానే రోహిత్ (11), గిల్ (23), శ్రేయస్ (3), కేఎల్ రాహుల్ (1) నిర్లక్ష్యంగా అవుటయ్యారు. 13వ ఓవర్ ముగియకముందే 71/4 స్కోరు వద్ద భారత్ లక్ష్యానికి దూరమైంది. వచ్చిరాగానే సిక్స్తో అలరించిన కోహ్లి అడపాదడపా బౌండరీలు బాదాడు. నితీశ్ రెడ్డితో కలిసి మొదట వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత సింగిల్స్, డబుల్స్తో ఇన్నింగ్స్ను చక్కబెట్టాడు. నితీశ్ కొట్టిన ఫోర్తో భారత్ స్కోరు 20వ ఓవర్లో 100కు చేరింది. తర్వాత కోహ్లి 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. భారీ సిక్స్లు బాదిన నితీశ్ కూడా 52 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే నితీశ్ను క్లార్క్ అవుట్ చేయడంతో ఐదో వికెట్కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కోహ్లి ముందుండి... తర్వాత కోహ్లికి జతయిన జడేజా (12) నిరాశపరిచాడు. కానీ హర్షిత్ రాణా బ్యాటర్ను తలపించే ఆటతీరుతో చక్కని భాగస్వామ్యానికి బాట వేశాడు. 37వ ఓవర్లో భారత్ 200 దాటింది. హర్షిత్తో పాటు కోహ్లి కూడా షాట్లు ఆడటంతో ఈ దశలో వేగంగా పరుగులు వచ్చాయి. ఈ జోరు సాగుతుండటంతో పోయిన ప్రాణం లేచివచ్చినట్లుగా భారత్ గెలుపుపై ఆశలు చిగురించాయి. దీంతోపాటు ‘కింగ్’ కోహ్లి 91 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 250 పరుగులకు చేరుకుంది. భారీ సిక్స్లతో విరుచుకుపడుతున్న హర్షిత్ 41 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. వెంటనే అతను అవుటవడంతో 69 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యానికి, భారత్ ఆశలకు తెరపడింది. 292 పరుగుల వద్ద కోహ్లి నిష్క్రమించగా, మరో రెండు బంతులకే భారత్ ఆలౌటైంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రోహిత్ (బి) హర్షిత్ 5; నికోల్స్ (బి) అర్ష్ దీప్ 0; యంగ్ (సి) జడేజా (బి) హర్షిత్ 30; మిచెల్ (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 137; ఫిలిప్స్ (సి) రాహుల్ (బి) అర్ష్దీప్ 106; బ్రేస్వెల్ (నాటౌట్) 28; మిచెల్ హే (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 2; జాక్ ఫోక్స్ (సి) కుల్దీప్ (బి) అర్ష్దీప్ 10; క్లార్క్ (బి) హర్షిత్ 11; జేమీసన్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–5, 2–5, 3–58, 4–277, 5–283, 6–286, 7–304, 8–327. బౌలింగ్: అర్ష్దీప్ 10–1–63–3, హర్షిత్ 10–0–84–3, సిరాజ్ 10–0–43–1, నితీశ్ 8–0–53–0, కుల్దీప్ 6–0–48–1, జడేజా 6–0–41–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) క్లార్క్ (బి) ఫోక్స్ 11; గిల్ (బి) జేమీసన్ 23; కోహ్లి (సి) మిచెల్ (బి) క్లార్క్ 124; అయ్యర్ (సి) ఫోక్స్ (బి) క్లార్క్ 3; రాహుల్ (సి) ఫిలిప్స్ (బి) లెనాక్స్ 1; నితీశ్ (సి) యంగ్ (బి) క్లార్క్ 53; జడేజా (సి) యంగ్ (బి) లెనాక్స్ 12; హర్షిత్ (సి) నికోల్స్ (బి) ఫోక్స్ 52; సిరాజ్ (సి) హే (బి) ఫోక్స్ 0; కుల్దీప్ (రనౌట్) 5; అర్ష్దీప్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 8; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 296. వికెట్ల పతనం: 1–28, 2–45, 3–68, 4–71, 5–159, 6–178, 7–277, 8–277, 9–292, 10–296. బౌలింగ్: జేమీసన్ 9–0–58–1, ఫోక్స్ 9–0–77–3, క్లార్క్ 9–0–54–3, లెనాక్స్ 10–0–42–2, మిచెల్ 1–0–10–0, ఫిలిప్స్ 8–0–54–0. 1: భారత్లో భారత జట్టుతో న్యూజిలాండ్ ఇప్పటి వరకు 8 ద్వైపాక్షిక వన్డే సిరీస్లు ఆడింది. ఏడుసార్లు సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది.1: ఇండోర్లోని హోల్కర్ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 8 వన్డేలు ఆడింది. ఈ వేదికపై వరుసగా ఏడు వన్డేల్లో నెగ్గిన టీమిండియాకు న్యూజిలాండ్ తొలిసారి ఓటమి రుచి చూపించింది. 6: భారత్లో భారత జట్టును ఓడించి వన్డే సిరీస్ సొంతం చేసుకున్న ఆరో జట్టు న్యూజిలాండ్. గతంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ ఈ ఘనత సాధించాయి.9: కోహ్లి సెంచరీ సాధించిన వన్డేలో భారత జట్టు ఓడిపోవడం ఇది తొమ్మిదోసారి. -
కోహ్లి వీరోచిత పోరాటం వృథా.. ఇండోర్లో భారత్ ఓటమి
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. సొంతగడ్డపై కివీస్తో వన్డే సిరీస్ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి విరోచిత సెంచరీతో పోరాడినప్పటికి జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కోహ్లి 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. భారీ లక్ష్య చేధనలో భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం గిల్, కోహ్లి కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వరుస క్రమంలో గిల్(23), శ్రేయస్ అయ్యర్(3), రాహుల్(1) వికెట్లు భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి(53), విరాట్ కోహ్లి కలిసి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత నితీశ్(53), జడేజా(12) వెంటవెంటనే ఔట్ కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన హర్షిత్ రాణా(52).. కోహ్లితో కలిసి మెరుపులు మెరిపించాడు. కానీ వరుస క్రమంలో హర్షిత్, కోహ్లి వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో చెలరేగారు. -
విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీ
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీతో చెలరేగాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటకి.. కోహ్లి మాత్రం తన అద్బుత బ్యాటింగ్తో అభిమానుల్లో గెలుపు ఆశలను రేకెత్తించాడు.ఈ క్రమంలో విరాట్ 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కోహ్లికి ఇది 54వ వన్డే సెంచరీ. విరాట్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరికి భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో 41 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది.న్యూజిలాండ్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో సత్తాచాటారు. -
ఇదేమి నాకు కొత్త కాదు.. క్రికెట్ కూడా వదిలేయాలనుకున్నా: హర్షిత్ రాణా
టీమిండియా యువ ఆల్రౌండర్ హర్షిత్ రాణా తరుచూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ వల్లే అతడికి మూడో ఫార్మాట్లలో ఆడే అవకాశం దక్కుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ ఢిల్లీ ఆల్రౌండర్ టెస్టులకు దూరంగా ఉంటున్నప్పటికి.. భారత పరిమిత ఓవర్ల జట్టులో మాత్రం రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు.హర్షిత్ టీ20ల్లో పెద్దగా రాణించికపోయినప్పటికి.. వన్డేల్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. అయినప్పటికి ఏదో ఒక విధంగా అతడు ట్రోల్స్కు గురువుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్షిత్ రాణా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు."వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు నాకు బాగా తెలుసు. దాదాపు పదేళ్ల పాటు సెలక్షన్లలో నాకు నిరాశే ఎదురైంది. ఎన్నో ట్రయల్స్కు వెళ్లేవాడిని, కానీ ఫైనల్ లిస్ట్లో నా పేరు ఉండేది కాదు. ఇంటికి తిరిగి వచ్చి మా నాన్న ముందు ప్రతిరోజూ ఏడ్చేవాడిని. ఇప్పుడు ఏలాంటి వైఫల్యం ఎదురైనా దానిని తట్టుకోగలను. ఒకానొక దశలో క్రికెట్ను వదిలేయాలని అనుకున్నా. కానీ మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతోనే మళ్లీ తిరిగి నిలబడ్డా" అని హర్షిత్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్లో కూడా హర్షిత్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు ఓవరాల్గా 13 వన్డేలు ఆడిన హర్షిత్ రాణా 23 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్కప్-2026 భారత జట్టులో కూడా రాణా సభ్యునిగా ఉన్నాడు. -
ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వచ్చినా కూడా!
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైన రోహిత్.. ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో హిట్మ్యాన్ నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన జకారీ ఫౌల్క్స్ బౌలింగ్లో రోహిత్ ఔటయ్యాడు.మిడాన్లో క్లార్క్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. అయితే అదే ఓవర్లో నాలుగో బంతికి రోహిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను వికెట్ కీపర్ మిచిల్ హే జారవిడిచాడు. కానీ తనకు లభించిన అవకాశాన్ని రోహిత్ అందిపుచ్చుకోలేకపోయాడు. రోహిత్ కేవలం 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ సిరీస్ మొత్తంగా రోహిత్ కేవలం 61 పరుగులు చేశాడు. అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్లోనూ రోహిత్ దుమ్ములేపాడు. కానీ ఆ ఫామ్ను కివీస్పై మాత్రం కొనసాగించలేకపోయాడు. వన్డే ప్రపంచకప్-2027 ప్రణాళికలలో ఉన్న హిట్మ్యాన్ నుంచి టీమ్ మెనెజ్మెంట్ మెరుగైన ప్రదర్శలను ఆశిస్తోంది.తడబడుతున్న భారత్..కాగా 338 పరుగుల లక్ష్య చేధనలో భారత్ తడబడుతోంది. కేవలం 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శుభ్మన్ గిల్ 23 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. క్రీజులో విరాట్ కోహ్లి(35), నితీశ్ కుమార్ రెడ్డి(7) ఉన్నారు. కివీస్ బౌలర్లలో ఇప్పటివరకు ఫౌల్క్స్, క్లార్క్, లినిక్స్, జేమిసన్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్.. -
చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్..
వన్డే క్రికెట్లో నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. అయితే కోహ్లి బాటలోనే న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ పయనిస్తున్నాడు. వన్డేల్లో ఈ కివీ స్టార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ కోహ్లి మాదిరిగానే నిలకడగా మారు పేరుగా మారాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్లో మిచెల్ సెంచరీలు మోత మ్రోగించాడు. వడోదర జరిగిన తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్.. ఆ తర్వాత రాజ్కోట్ వన్డేలో సెంచరీ(131)తో మెరిశాడు. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో మిచెల్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మిచెల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మిచెల్ ఆరంభంలో భారత పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లను ఎదుర్కోవడంలో సంయమనం పాటించాడు. ఆ తర్వాత క్రీజులో కుదుర్కొన్నాక తనలోని విశ్వరూపాన్ని చూపించాడు. 106 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను మిచెల్ అందుకున్నాడు. మిచెల్కు ఇది 9వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా మొత్తంగా 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137 పరుగులు చేశాడు. భారత్పై అతడికి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్పై గత ఐదు మ్యాచ్లలో అతడికి ఇది నాలుగో సెంచరీ.ఈ మ్యాచ్లో సెంచరీతో సత్తాచాటిన మిచెల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో(టెస్టు క్రికెట్ హోదా కలిగిన దేశాలు) కనీసం 2000 పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్గా మిచెల్ చరిత్ర సృష్టించాడు. మిచెల్ ఇప్పటివరకు 58.47 సగటుతో 2690 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 58.45 సగటుతో 14673 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో కోహ్లిని మిచెల్ అధిగమించాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్(56.34) ఉన్నాడు. ఇక ఈ సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మిచెల్తో పాటు గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్దీప్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్ -
మిచెల్, ఫిలిప్స్ సెంచరీలు.. భారత్ ముందు భారీ టార్గెట్
ఇండోర్ వేదికగా భారత్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు. మొదట బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు డెవాన్ కాన్వే(5), హెన్రీ నికోల్స్(0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచిల్.. విల్ యంగ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. యంగ్(30) ఔటయ్యాక అసలు కథ మొదలైంది. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్, మిచెల్ కలిసి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని అర్ష్దీప్ సింగ్ బ్రేక్ చేశాడు. మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137 పరుగులు చేయగా.. ఫిలిప్స్ కేవలం 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో బ్రేస్వెల్(28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్దీప్ తలా వికెట్ సాధించారు. రవీంద్ర జడేజా మరోసారి కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. కాగా డారిల్ మిచెల్కు ఈ సిరీస్లో ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్ -
టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్
సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, కుమార సంగ్కకర, మహేలా జయవర్దనే, ఏబీ డివిలియర్స్.. వీరంతా ఒకప్పుడు భారత జట్టుపై ఆధిపత్యం చెలాయించిన దిగ్గజ బ్యాటర్లు. ముఖ్యంగా వీరిందరికి వన్డేల్లో భారత్పై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు వారి బాటలోనే అడుగులు వేస్తున్నాడు న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్కు తలనొప్పిగా మారితే.. మిచెల్ మాత్రం దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి ప్రత్యర్ధి భారత్ అయితే చాలు చెలరేగిపోతాడు.మిచెల్ సెంచరీల మోత..మిచెల్ కాస్త లేటుగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటికి.. అతి తక్కువ సమయంలోనే మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) తనదైన ముద్రవేసుకున్నాడు. ముఖ్యంగా అతడికి భారత్పై అసాధరణ వన్డే రికార్డు ఉంది. స్పిన్ను సమర్ధవంతంగా ఆడే మిచెల్ ఉపఖండ పిచ్లపై సత్తాచాటుతున్నాడు.వన్డే ప్రపంచకప్-2023లో కూడా ఆతిథ్య టీమిండియాను మిచెల్ గడగడలాడించాడు. సెమీఫైనల్ అయితే తన విరోచిత సెంచరీతో భారత్ను ఓడించే అంతపనిచేశాడు. అంతకుముందు లీగ్ మ్యాచ్లో కూడా భారత్పై సెంచరీ సాధించాడు. దీంతో వన్డే ప్రపంచకప్లో భారత్పై రెండు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అదే ఫామ్ను తాజా పర్యటనలో అతడు కొనసాగిస్తున్నాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో అతడు పరుగులు వరద పారిస్తున్నాడు. తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్.. ఆ తర్వాత రాజ్కోట్లో విరోచిత సెంచరీతో చెలరేగాడు. మళ్లీ ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ శతక్కొట్టాడు. మిచెల్ భారత్లో తను ఆడిన చివరి ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగుల సెంచరీలు బాదేశాడు. భారత్పై వన్డేల్లో అతడి సగటు దాదాపు 70గా ఉంది. ఇది చాలా మంది దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాలేదు.రెండో ప్లేయర్గా..భారత్పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా మిచెల్ నిలిచాడు. మిచెల్ ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీలు మొత్తం భారత్లోనే రావడం గమనార్హం. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో నాథన్ ఆస్టిల్(5) అగ్రస్ధానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే ఆస్టిల్ను మిచెల్ అధిగమిస్తాడు.చదవండి: T20 WC 2026: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో షాక్.. -
గంభీర్ చూశావా? తొలి ఓవర్లోనే వికెట్! వీడియో వైరల్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత తుది జట్టులోకి వచ్చిన పేసర్ అర్ష్దీప్ సింగ్.. తొలి ఓవర్లోనే తన మార్క్ చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే కివీస్ ఓపెనర్ హెన్రీ నికోల్స్ను పెవిలియన్ పంపి భారత్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో గిల్ బౌలింగ్ ఎటాక్ను ప్రారంభించేందుకు కొత్త బంతిని అర్ష్దీప్ చేతికి ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని ఈ పంజాబ్ పేసర్ వమ్ముచేయలేదు. తన వేసిన తొలి ఓవర్ రెండో బంతికి డెవాన్ కాన్వే ఫోర్ బాదినా.. అర్ష్దీప్ ఏమాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు.అదే ఓవర్ ఐదో బంతికి అద్భుతమైన ఇన్స్వింగర్తో నికోల్స్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అతడు గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో తొలి రెండు వన్డేల్లో అర్ష్దీప్కు అవకాశమివ్వని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఇటువంటి బౌలర్ను ఎలా పక్కన పెట్టావు? అంటూ పోస్ట్లు పెడుతున్నారు.మొదటి రెండు వన్డేల్లో అర్ష్దీప్ బెంచ్కే పరిమితమయ్యాడు. దీంతో అశ్విన్ మాజీలు గంభీర్పై విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఎట్టకేలకు సిరీస్ డిసైడర్ మ్యాచ్లో అర్ష్దీప్కు అవకాశం దక్కింది. ఈ పంజాబ్ స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ స్దానంలో తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్Arshdeep Singh has always been a wicket taker for India in every format.Still Gautam Gambhir used to bench him in most of the games. Jasprit Bumrah and Arshdeep will be the key in the T20 World Cup and the 2027 WC if Gambhir does not play politics 🔥🙇pic.twitter.com/tBcjoU9R2v— Tejash (@Tejashyyyyy) January 18, 2026 -
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో షాక్..
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు తమ జట్టును భారత్కు పంపబోమని మొండి పట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో భారీ షాక్ తగిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను క్రికెట్ ఐర్లాండ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. తమ లీగ్ మ్యాచ్లను శ్రీలంకలోనే ఆడుతామని ఐరీష్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూపు-సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లా జట్టు తమ గ్రూపు మ్యాచ్లను కోల్కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఈ మెగా టోర్నీ కోసం భారత్కు రాబోమని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా, బంగ్లాదేశ్ ప్రభుత్వం, బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ భేటిలో బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు మరో సరికొత్త ప్రతిపాదనను ఉంచింది. గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్తో తమ గ్రూపును మార్పు చేయాలంటూ ఐసీసీని బీసీబీ కోరింది. ఐర్లాండ్తో గ్రూప్ స్వాపింగ్ చేసుకుంటే లీగ్ దశ మ్యాచ్లన్నింటినీ శ్రీలంకలో ఆడవచ్చని బంగ్లాదేశ్ భావించింది. కానీ అందుకు ఐర్లాండ్ నో చెప్పడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. "మేము మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడతాం. గ్రూప్ స్టేజ్ మొత్తం శ్రీలంకలోనే జరుగుతుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మన్ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ టోర్నీలో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్కు రాకపోతే పాయింట్లను కోల్పోవల్సి ఉంటుంది.చదవండి: ఇటలీ ప్రపంచకప్ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు -
న్యూజిలాండ్తో మూడో వన్డే.. టాస్ గెలిచిన టీమిండియా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 18) జరుగునున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఓ మార్పు చేసింది. తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ద్ కృష్ణ స్థానంలో స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్ల్లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్, రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపొందాయి. మూడో మ్యాచ్లో గెలిచే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
ఇటలీ ప్రపంచకప్ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026కు ఇటలీ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీకి ఆ జట్టు తొలిసారి క్వాలిఫై అయ్యింది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల జట్టును నిన్న (జనవరి 17) ప్రకటించారు. వేన్ మ్యాడ్సన్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.ఈ జట్టులో ఓ ఆసక్తికర ఎంపిక జరిగింది. 2017-21 మధ్యలో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడిన 37 ఏళ్ల జేజే స్మట్స్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్మట్స్ సౌతాఫ్రికా తరఫున 6 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. స్మట్స్ ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో (WCL) సౌతాఫ్రికా లెజెండ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలోని ఓ మ్యాచ్లో అతను ఏబీ డివిలియర్స్తో కలిసి విధ్వంసం సృష్టించాడు. 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు.కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్, స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అయిన స్మట్స్.. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున కూడా ఆడుతున్నాడు. స్మట్స్ ఇటలీ పౌరసత్వం తన భార్య నుంచి సంక్రమించుకున్నాడు.కాగా, ఇటలీ వరల్డ్కప్ యూరప్ క్వాలిఫయర్స్లో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఈ విభాగం నుంచి మరో జట్టుగా నెదర్లాండ్స్ ఉంది. ప్రపంచకప్ 2026లో ఇటలీ.. టు టైమ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్తో పాటు గ్రూప్-సిలో ఉంది.ఇటలీ జట్టు ఫిబ్రవరి 9న బంగ్లాదేశ్ మ్యాచ్తో టీ20 వరల్డ్కప్ అరంగేట్రం చేయనుంది. కోల్కతా వేదికగా ఈ మ్యాచ్ జరునుంది. అనంతరం ఈ జట్టు ఫిబ్రవరి 12న ముంబైలో నేపాల్తో తలపడుతుంది.టీ20 ప్రపంచకప్ 2026కు ఇటలీ జట్టు..వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, జేజే స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా. -
ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ప్రకటన
ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగనున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్లను నిన్న (జనవరి 17) ప్రకటించారు. ఈ పర్యటనలో టీమిండియా-ఆస్ట్రేలియా 3 టీ20లు, ఓ టెస్ట్, 3 వన్డేలు ఆడతాయి. వీటిలోని పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత జట్టును ప్రకటించారు.గాయాల నుంచి కోలుకున్న స్టార్ ఆల్రౌండర్ శ్రేయంక పటిల్ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్లో సత్తా చాటడంతో (ఆర్సీబీ తరఫున 5 వికెట్ల ప్రదర్శన) శ్రేయంకకు మరోసారి అవకాశం వచ్చింది. టీ20 జట్టులో మరో ఆసక్తికర ఎంపిక భారతి ఫుల్మాలి. ఈమె చివరిగా 2019లో భారత్ తరఫున టీ20 ఆడింది. ఆతర్వాత పేలవ ఫామ్ కారణంగా కనుమరుగైంది. గతేడాది డబ్ల్యూపీఎల్లో ఓ మోస్తరు ప్రదర్శనలతో తిరిగి లైన్లోకి వచ్చింది. ప్రస్తుత సీజన్లో కూడా అదే ఫామ్ను కొనసాగిస్తుండటంతో ఆరేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది.హర్లీన్ డియోల్పై వేటుగత సిరీస్లో టీమిండియాలో భాగమైన హర్లీన్ డియోల్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్లో రాణిస్తున్నా, సెలెక్టర్లు ఆమెపై వేటు వేశారు. పై మార్పులు మినహా టీ20 జట్టులో పెద్దగా గమనించదగ్గ విషయాలేమీ లేవు. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధన కొనసాగారు.ఆసీస్తో టీ20 సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధన (VC), షఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), జి కమలిని (WK), అరుంధతి రెడ్డి, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, శ్రేయంక పటిల్షఫాలీ స్థానం పదిలంవన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో పలు ఆసక్తికర ఎంపికలు జరిగాయి. వరల్డ్కప్లో ఓపెనర్ ప్రతికా రావల్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. షఫాలీ వరల్డ్కప్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడి టీమిండియా ఛాంపియన్గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచకప్ సందర్భంగా గాయపడిన ప్రతికా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. వికెట్కీపర్ యస్తికా భాటియా కూడా శస్త్రచికిత్స తర్వాత రీహాబ్లో ఉండటంతో ఈ సిరీస్కు దూరమైంది. జి కమలినికి వికెట్కీపింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటంతో వన్డే జట్టులోకి కూడా వచ్చింది. ఈ జట్టులో రాధా యాదవ్, అరుంధతి రెడ్డికి చోటు దక్కలేదు. కశ్వీ గౌతమ్ కొత్తగా జట్టులోకి వచ్చింది. ఆసీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధన (VC), షఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), జి కమలిని (WK), కశ్వీ గౌతమ్, అమంజోత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్ఆసీస్ పర్యటన షెడ్యూల్ టీ20 సిరీస్: - ఫిబ్రవరి 15 – సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ - ఫిబ్రవరి 19 – మానుకా ఓవల్ - ఫిబ్రవరి 21 – అడిలైడ్ ఓవల్ వన్డే సిరీస్: - ఫిబ్రవరి 24 – బ్రిస్బేన్ (అల్లన్ బోర్డర్ ఫీల్డ్) - ఫిబ్రవరి 27 & మార్చి 1 – హోబార్ట్ (బెల్లెరివ్ ఓవల్) ఏకైక టెస్ట్: - మార్చి 6- పెర్త్ (పెర్త్ స్టేడియం)* టెస్ట్ జట్టును ప్రకటించాల్సి ఉంది. -
క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు..?
ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్కప్ 2026లో భాగంగా నిన్న (జనవరి 17) భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరిగింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా, గతంలో జరిగిన భారత్-పాక్ వివాదాస్పద 'నో హ్యాండ్ షేక్' ఉదంతాన్ని గుర్తు చేశారు.తాజా ఎపిసోడ్ తర్వాత క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు అన్న ప్రశ్న మరోసారి ఉత్పన్నమైంది. క్రికెట్ సర్కిల్స్లో ఈ అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మెజార్టీ శాతం క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. కొందరేమో ఈ అంశానికి మద్దతిస్తున్నారు. ఒక దేశం పట్ల మరో దేశం క్రూరంగా ప్రవర్తిస్తే ఇలాగే బుద్ది చెప్పాలని అంటున్నారు.ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, క్రీడలను రాజకీయాలతో ముడి పెట్టి, నో షేక్ హ్యాండ్ లాంటి ఉదంతాలకు తావిస్తే, దేశాల మధ్య ఉద్రిక్తతల మరింత పెరుగుతాయి కానీ, ఎలాంటి ప్రజాప్రయోజనాలు ఉండవు. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య స్నేహ వారుధులుగా ఉంటాయి. అలాంటి వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు.ఆటగాళ్లు సైతం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి. క్రీడలకు సంబంధం లేని విషయాలు మాకెందుకులే అనుకోవాలి. రాజకీయాలు చూసుకునే బాధ్యత నాయకులకు వదిలి పెట్టి, మైదానంలో క్రీడాస్పూర్తితో వ్యవహరించాలి. నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలకు తావివ్వకుండా హుందాగా ప్రవర్తించాలి.క్రీడల్లో హ్యాండ్షేక్ ఇవ్వడమనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే కాదు. ఇది ఆటగాళ్ల మధ్య పరస్పర గౌరవం. దేశాల మధ్య పోటీ జరిగేటప్పుడు సామరస్యతను ప్రతిబింబించే సంకేతం. ఇలాంటి వాటిలో రాజకీయాలకు అస్సలు తావివ్వకూడదు. ఈ విషయాన్ని ఆటగాళ్లు గమనించాలి. ప్రత్యర్దికి హ్యాండ్ షేక్ నిరాకరిస్తే.. అంతర్జాతీయ సమాజంలో వాళ్లే చిన్నచూపుకు గురవుతారు. అప్పటిదాకా వారిపై దేశాలకతీతంగా ఉండే అభిమానం పలచనవుతుంది.క్రికెట్కు జెంటిలెమన్ గేమ్ అనే పేరుంది. కాబట్టి క్రికెటర్లు జెంటిల్మెన్లలా ప్రవర్తించి క్రీడ గౌరవాన్ని పెంచాలి. దేశాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు పరిణితి ప్రదర్శించవచ్చు. గతంలో ఏదైనా సమస్య కాని, అసంతృప్తి కాని ఉంటే, ఆటగాళ్లు ఆర్మ్ బ్యాండ్లు ధరించే వారు. దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంలోనూ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించవచ్చు. తమ దేశం పట్ల ప్రత్యర్ది దేశం అమానవీయంగా ప్రవర్తిస్తుందని అనుకున్నప్పుడు ఆర్మ్ బ్యాండ్లు ధరించి నిరసన వ్యక్తం చేయవచ్చు.కానీ హ్యాండ్ షేక్ ఇవ్వకుండా ఒకరినొకరు అవమానించుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల అభిమానుల్లోనే కాకుండా సహచర ఆటగాళ్లలోనూ అసహనం పెరుగుతుంది. ఇటీవల ఓ విండీస్ టీ20 దిగ్గజం భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు అతను భారత ఆటగాళ్లనే బాధ్యులుగా భావిస్తున్నాడు.ఇందులో అతని తప్పేమీ లేదు. ఎందుకంటే, భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని గమనించిన ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. గతేడాది ఆసియా కప్ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు హ్యాండ్ షేక్ నిరాకరించాడు. మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఈ ఉదంతం తర్వాత భారతీయుల్లో సూర్యకుమార్పై రెస్పెక్ట్ మరింత పెరిగింది. కానీ, ఓ క్రీడాకారుడిగా అంతర్జాతీయ సమాజంలో తన మర్యాదను పలచన చేసుకున్నాడు. ఏది ఏమైనా నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలు క్రీడల ప్రతిష్టను దిగజారుస్తాయే కానీ, గౌరవాన్ని పెంచవు. ఈ విషయాన్ని క్రీడాలోకమంతా గుర్తు పెట్టుకోవాలి. -
7 పరుగులకే 5 వికెట్లు.. కట్ చేస్తే స్కోర్ ఎంతంటే..?
సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలో అత్యుత్తమ కమ్బ్యాక్ ఇచ్చిన జట్టుగా ప్రిటోరియా క్యాపిటల్స్ నిలిచిపోనుంది. కఠినమైన పిచ్పై ఆ జట్టు 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అనూహ్య రీతిలో పుంజుకొని గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అంతేకాకుండా ఆ స్కోర్ను విజయవంతంగా డిఫెండ్ చేసుకొని, 21 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జోహనెస్బర్గ్ వేదికగా నిన్న (జనవరి 17) ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు ఉపయోగించిన పిచ్ బ్యాటర్లకు చాలా కఠినంగా ఉండింది. ఈ పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ 7 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.ఈ దశలో డెవాల్డ్ బ్రెవిస్ (47 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)–షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (50 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) జోడీ అనూహ్య పోరాటం చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. వీరిద్దరు ఆరో వికెట్కు 103 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. బ్రెవిస్-రూథర్ఫోర్డ్ భాగస్వామ్యానికి ముందు ప్రిటోరియా ఇన్నింగ్స్లో నలుగురు డకౌట్లయ్యారు.జోబర్గ్ బౌలర్లలో డేనియల్ వారెల్ (4-1-12-2), వియాన్ ముల్దర్ (4-1-34-2), డుయాన్ జన్సెన్ (4-0-27-1), బర్గర్ (4-0-32-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి క్యాపిటల్స్ టాపార్డర్ కకావికలమైంది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ప్రిటోరియా బౌలర్లు అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నారు. లిజాడ్ విలియమ్స్ (4-0-25-3), కేశవ్ మహారాజ్ (4-0-15-3), రోస్టన్ ఛేజ్ (4-0-11-1), గిడ్యోన్ పీటర్స్ (3-0-25-1) ధాటికి సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో సంబంధం లేకుండా క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. సూపర్ కింగ్స్ మినుకుమినుకుమంటున్న అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది.


