breaking news
Sports
-
కాన్వే హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం
జింబాబ్వే వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హరారే వేదికగా శుక్రవారం ఆతిథ్య జింబాబ్వే జట్టును 8 వికెట్ల తేడాతో కివీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేసింది.జింబాబ్వే బ్యాటర్లలో మాధేవేరే(36) టాప్ స్కోరర్గా నిలవగా.. బెన్నట్(21) పర్వాలేదన్పించాడు. బ్లాక్క్యాప్స్ బౌలర్లలో మాట్ హెన్రీ మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీయగా.. మిల్నే, శాంట్నర్, బ్రెస్వేల్, రచిన్ రవీంద్ర తలా వికెట్ సాధించారు.కాన్వే హాఫ్ సెంచరీ.. అనంతరం 121 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(59 నాటౌట్) ఆర్ధశతకంలో మెరవగా.. రచిన్ రవీంద్ర(30), డార్లీ మిచెల్(26 నాటౌట్) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో మాపోసా, ముజర్బానీ తలా వికెట్ సాధించారు. ఈ సిరీస్లో భాగంగా జూలై 20న హరారే వేదికగా జింబాబ్వే, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
బెన్ స్టోక్స్ను చూసి గిల్ నేర్చుకోవాలి: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన తొలి పర్యటనలోనే ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో రెండు మ్యాచ్ల్లో భారత్ ఓటమి పాలైనప్పటికి.. గిల్ మాత్రం బ్యాటింగ్, కెప్టెన్సీ పరంగా వందకు వంద మార్క్లు కొట్టేశాడు.ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన గిల్.. 607 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గిల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి సీనియర్లు లేనప్పటికి గిల్ జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడని గోవర్ కొనియాడాడు."రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల వంటి దిగ్గజాల లేకుండా భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వచ్చింది. దీంతో అందరి దృష్టి యువ కెప్టెన్ శుబ్మన్ గిల్పైనే ఉండేది. కానీ శుబ్మన్ మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తూ తొలి రెండు ఇన్నింగ్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఒక జట్టుకు నాయకత్వం వహించడానికి 34 ఏళ్ల వయస్సు ఉండనవసరం లేదు. టాలెంట్తో పాటు సరైన టెక్నిక్ ఉంటే చాలు 24 ఏళ్లకే కెప్టెన్ అవ్వచ్చు. అని గోవర్ స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్పై కూడా గోవర్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఒక బలమైన జట్టును తాయారు చేయడం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. నాయకుడు ముందుండి జట్టును నడిపిస్తే విజయం సాధించడం పెద్ద కష్టమైన పనికాదు. అందుకు ఊదహరణగా బెన్ స్టోక్స్ను తీసుకొవచ్చు. లార్డ్స్లో టెస్టులో స్టోక్స్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. గత కొన్నాళ్లగా స్టోక్స్ నుంచి ఇటువంటి ప్రదర్శనను మిస్ అయ్యాము. గంటకు 120 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం, పేస్ బౌలింగ్ ఎటాక్ను లీడ్ చేయడం వంటి నిజంగా అద్బుతం. స్టోక్సీ నుంచి గిల్ కచ్చితంగా కొన్ని విషయాలను నేర్చుకోవాలి" గోవర్ అన్నారు.చదవండి: అరంగేట్రానికి సిద్దమవుతున్న కోహ్లి అన్న కొడుకు.. -
అరంగేట్రానికి సిద్దమవుతున్న కోహ్లి అన్న కొడుకు..
టీమిండియా స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కుటుంబం నుంచి మరొకరు క్రికెట్ ప్రపంచానికి పరిచయం కానున్నారు. అతడి అన్న కొడుకు ఆర్యవీర్ కోహ్లి ప్రొఫిషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 సీజన్లో 14 ఏళ్ల ఆర్యవీర్.. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ (SDS) తరపున ఆడనున్నాడు.ఇటీవల జరిగిన డీపీఎల్ వేలంలో లక్ష రూపాయల కనీస ధరకు సౌత్ ఢిల్లీ అతడిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తన డీపీఎల్ సీజన్ కోసం ఆర్యవీర్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. లెగ్ స్పిన్నర్ అయిన ఆర్యవీర్ తన సహచర బ్యాటర్లకు నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్యవీర్పై సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ హెడ్ కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ సర్సందీప్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్యవీర్కు అద్బుతమైన టాలెంట్ ఉందని అతడు కొనియాడాడు."ఆర్యవీర్ కోహ్లి ఒక రైజింగ్ స్టార్. అతడికి ప్రస్తుతం 14 ఏళ్లు మాత్రమే. అతడు భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. అతడిపై కోహ్లి అనే ట్యాగ్ ఎటువంటి ఒత్తిడి తీసుకురాదు. ఎందుకంటే అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది.అతడిలో కష్టపడి పనిచేసే తత్వం ఉంది" అని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్సందీప్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ వద్ద ఆర్యవీర్ శిక్షణ తీసుకున్నాడు. వెస్ట్ ఢిల్లీ క్రికెట్ ఆకాడమీలో ఆర్యవీర్ను రాజ్కుమార్ తన శిక్షణతో రాటుదేల్చాడు. ఈ టోర్నీలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఆడనున్నాడు. రూ. 8లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.చదవండి: అతడికి రెస్ట్ ఏమి అవసరం లేదు.. రెండు టెస్టుల్లోనూ ఆడించండి: కుంబ్లేVIDEO | Virat Kohli's nephew, Aryaveer Kohli, trained with "no baggage" of his famed last name in the training session of the South Delhi Superstarz ahead of the second edition of the Delhi Premier League.Budding leg-spinner Aryaveer Kohli, son of Virat's elder brother Vikas,… pic.twitter.com/HYu2U39qqJ— Press Trust of India (@PTI_News) July 17, 2025 -
WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
దిగ్గజ క్రికెటర్లు మరోసారి మైదానంలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వింటేజ్ ఇన్నింగ్స్ను గుర్తుచేసేలా మరోసారి బ్యాట్ ఝులిపించేందుకు యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్.. వికెట్ల వేట కొనసాగించేందుకు బ్రెట్ లీ, ఇమ్రాన్ తాహిర్ వంటి మాజీలు సన్నద్ధమయ్యారు. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)తో వినోదం పంచేందుకు సై అంటున్నారు. మరి టీ20 టోర్నమెంట్ షెడ్యూల్, జట్లు, ప్రత్యక్ష ప్రసారం తదితర అంశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆరు జట్లు ఈ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో భాగమయ్యాయి.బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇండియా చాంపియన్స్ జట్టుకు సహ యజమానిగా ఉన్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. నాకౌట్స్ ద్వారా విజేత ఎవరో తేలుతుంది. ఇండియా చాంపియన్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది.జట్లుఇండియా చాంపియన్స్యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్.ఆస్ట్రేలియా చాంపియన్స్షాన్ మార్ష్, ఆరోన్ ఫించ్, కల్లమ్ ఫెర్గూసన్, టిమ్ పైన్ (వికెట్ కీపర్), బెన్ డంక్, డేనియల్ క్రిస్టియన్, బ్రెట్ లీ (కెప్టెన్), బ్రాడ్ హాడిన్, క్రిస్ లిన్, రాబ్ క్వినీ, జాన్ హేస్టింగ్స్, జేవియర్ దొహర్టి, మోజెస్ హెండ్రిక్స్, పీటర్ సిడిల్, నాథన్-కౌల్టర్ నీల్, డిర్క్ నాన్స్.సౌతాఫ్రికా చాంపియన్స్హర్షల్ గిబ్స్, హషీం ఆమ్లా, ఏబీ డివిలియర్స్, జేపీ డుమిని, జేజే స్మట్స్, డేన్ విల్లాస్, రిచర్డ్ లెవీ, నీల్ మెకంజీ, ఎస్జే ఎర్వీ, మోర్నీ మ్యాన్ విక్, జాక్వెస్ కలిస్, క్రిస్ మోరిస్, రియాన్ మెక్లారెన్, అల్బీ మోర్కెల్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, వైన్ పార్నెల్, రోరీ క్లెన్వెల్ట్, హార్డస్ విల్జోన్, ఆరోన్ ఫంగిసో, డువాన్ ఓలీవర్.పాకిస్తాన్ చాంపియన్స్సర్ఫరాజ్ అహ్మద్, యూనిస్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్, షోయబ్ మసూద్, మిస్బా ఉల్ హక్, షార్జిల్ ఖాన్, ఆసిఫ్ అలీ, షాహిద్ ఆఫ్రిది, ఇమాద్ వాసిం, షోయబ్ మాలిక్, ఆమేర్ యామిన్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సొహైల్ తన్వీర్, రమన్ రాయీస్.ఇంగ్లండ్ చాంపియన్స్కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, అలిస్టర్ కుక్, ఫిలిప్ మస్టార్డ్, ఇయాన్ బెల్, క్రిస్ షోఫీల్డ్, టిమ్ ఆంబ్రోస్, రవి బొపారా, సమిత్ పటేల్, మొయిన్ అలీ, దిమిత్రి మస్కార్హ్నస్, స్టువర్ట్ మేకర్, రియాన్ సైడ్బాటమ్, లియామ్ ప్లంకెట్, టిమ్ బ్రెస్నాన్, సాజిద్ మహమూద్, అజ్మల్ షెహజాద్.వెస్టిండీస్ చాంపియన్స్క్రిస్ గేల్, శివ్నరైన్ చందర్పాల్, జొనాథన్ కార్టర్, చాడ్విక్ వాల్టన్, విలియమ్ పెర్కిన్స్, డేవ్ మహ్మద్, క్రిస్ గేల్, డారెన్ సామీ, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, డ్వేన్ స్మిత్, షెల్డన్ కార్టెల్, సామ్యూల్ బద్రీ, షనన్ గాబ్రియెల్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రవి రాంపాల్, ఆష్లే నర్స్, నికిత మిల్లర్, సులేమాన్ బెన్.షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం👉జూలై 18 (శుక్రవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 19 (శనివారం): వెస్టిండీస్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 19 (శనివారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 20 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 23 (బుధవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 24 (గురువారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శుక్రవారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శనివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 26 (శనివారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 27 (ఆదివారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 27 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 31 (గురువారం): తొలి సెమీ ఫైనల్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 31 (గురువారం): రెండో సెమీ ఫైనల్- రాత్రి 9 గంటలకు👉ఆగష్టు 2 (శనివారం): ఫైనల్- రాత్రి 9 గంటలకు.వేదికలు: ది ఓవల్, ఎడ్జ్బాస్టన్, హెడింగ్లీ, గ్రేస్ రోడ్, నార్తాంప్టన్ మైదానాలు.ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ?👉ఇండియాలో..👉టీవీ: స్టార్ స్పోర్ట్స్ 1👉డిజిటల్/ఓటీఈటీ: ఫ్యాన్కోడ్👉అమెరికా, కెనడాలో: విల్లో టీవీ👉యునైటెడ్ కింగ్డమ్: టీఎన్టీ స్పోర్ట్స్👉ఆస్ట్రేలియా: ఫాక్స్ స్పోర్ట్స్ స్ట్రీమ్, కయో స్పోర్ట్స్.👉సౌతాఫ్రికా: సూపర్స్పోర్ట్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా? -
అతడికి రెస్ట్ ఏమి అవసరం లేదు.. రెండు టెస్టుల్లోనూ ఆడించండి: కుంబ్లే
అండర్సన్-సచిన్ డెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. లార్డ్స్ టెస్టులో గెలవాల్సిన మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ ఓడిపోవడంతో సిరీస్లో వెనకబడింది.ఈ క్రమంలో మాంచెస్టర్లో ఎలాగైనా గెలిచి మూడో టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లలోనూ భారత పేసర్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలని టీమ్మెనెజ్మెంట్ను కుంబ్లే సూచించాడు.కాగా వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని జట్టు సెలక్షన్ సమయంలోనే బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పష్టం చేశాడు. ఇందులో భాగంగానే తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. రెండు మ్యాచ్కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ స్పీడ్ స్టార్ తిరిగి లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో ఆడాడు. ఇప్పుడు కీలకమైన నాలుగో టెస్టులో కూడా బుమ్రా ఆడాలని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు."ఇండియన్ టీమ్ మెనెజ్మెంట్లో నేను భాగమై ఉంటే బుమ్రాను కచ్చితంగా మాంచెస్టర్ టెస్టులో ఆడిస్తాను. ఎందుకంటే భారత జట్టుకు ఆ మ్యాచ్ చాలా కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతే సిరీస్ కథ ముగిసినట్లే. బుమ్రా నాలుగో టెస్టులోనూ కాదు ఆఖరి మ్యాచ్లో కూడా ఆడాలి.ముందే మూడు మ్యాచ్లు ఆడుతానని బుమ్రా చెప్పొండచ్చు. కానీ ఈ సిరీస్ తర్వాత అతడికి చాలా విశ్రాంతి లభిస్తోంది. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్లలో కూడా బుమ్రా కచ్చితంగా ఆడాలి. అతడికి మరింత విశ్రాంతి ఇవ్వాలనుకుంటే, స్వదేశంలో జరిగే సిరీస్లకు పక్కనపెట్టండి" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: వామ్మో మాంచెస్టర్.. భారత్ను భయపెడుతున్న గత రికార్డులు -
వామ్మో మాంచెస్టర్.. భారత్ను భయపెడుతున్న గత రికార్డులు
లార్డ్స్ టెస్టులో అనుహ్య ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్తో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. జూలై 23 నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డు మైదానం వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంటే.. భారత్ మాత్రం ప్రత్యర్ధిని ఎలాగైనా ఓడించి సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ కీలకపోరుకు ముందు మాంచెస్టర్లో గత రికార్డులు టీమిండియాను భయపెడుతున్నాయి.ఇంగ్లండ్దే పైచేయి..ఈ పర్యటనలో ఎడ్జ్బాస్టన్ టెస్టులో విజయం సాధించి ఇంగ్లండ్ కంచుకోటను బద్దలు కొట్టిన భారత జట్టు.. ఇప్పుడు మాంచెస్టర్పై కన్నేసింది. ఇప్పటివరకు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డు మైదానంలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా గెలవలేదు. ఈ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య మొత్తం తొమ్మిది టెస్టులు జరిగాయి.అందులో ఇంగ్లండ్ నాలుగింట విజయం సాధించగా.. మరో ఐదు టెస్టులు డ్రాగా ముగిశాయి. ఈ మైదానంలో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ 1936లో ఆడింది. అప్పటి నుంచి భారత జట్టుకు విజయం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భారత జట్టు చివరసారిగా ఈ వేదికలో 2014లో టెస్టు మ్యాచ్ ఆడింది. మళ్లీ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక మైదానంలో భారత్ ఆడనుంది.భారత ఓటమికి కారణమిదే..?ఇప్పటివరకు ఈ మైదానంలో భారత జట్టు విజయం సాధించికపోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఈ మైదానంలో పిచ్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తోంది. ఈ గ్రీన్ టాప్ వికెట్పై పేసర్లు పండగ చేసుకుంటారు. ఇటువంటి పిచ్పై ఆసియా జట్లకు ఆడడం చాలా కష్టంగా ఉంటుంది.బ్యాటర్లు స్వింగింగ్ కండీషన్స్కు అలవాటు పడకపోవడంతో ఈ మైదానంలో ఏషియన్ జట్లు ఎక్కువగా ఓటమి చవిచూడాల్సి వస్తోంది. ఈ మైదానంలో ఇంగ్లండ్ జట్టుకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 84 టెస్టుల్లో ఆతిథ్య జట్టు 33 మ్యాచ్ల్లో, 15 మ్యాచ్లలో ఓటమి చవిచూసింది.మిగిలిన 36 మ్యాచ్లను డ్రాగా ముగిసింది. ఈ మైదానంలో భారత అత్యధిక స్కోర్ 390 పరుగులగా ఉంది. ప్రస్తుతం భారత జట్టులో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ మినహా మిగితా ఎవరూ కూడా మైదానంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా తరపున ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సునీల్ గవాస్కర్ ఉన్నారు. ఆయన ఈ మైదానంలో మూడు టెస్టులు ఆడి 242 పరుగులు చేశాడు.మాంచెస్టర్లో భారత రికార్డులుఅత్యధిక స్కోరు: 119.2 ఓవర్లలో 432/10 (ఆగస్టు 1990).అత్యల్ప స్కోరు: 21.4 ఓవర్లలో 58/10 (జూలై 1952).అతిపెద్ద ఓటమి (ఇన్నింగ్స్ వారీగా): 1952లో భారత్ను ఇంగ్లండ్ ఇన్నింగ్స్ అండ్ 207 పరుగుల తేడాతో ఓడించింది.అతిపెద్ద ఓటమి (పరుగులు వారీగా): జూలై 1959లో భారత్ను 171 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓడించింది.అత్యధిక పరుగులు: సునీల్ గవాస్కర్ మూడు టెస్టుల్లో 242 పరుగులు.అత్యధిక స్కోరు: ఆగస్టు 1990లో మహ్మద్ అజారుద్దీన్ 243 బంతుల్లో 179 పరుగులు.అత్యధిక సగటు: సచిన్ టెండూల్కర్ 187.00 (ఒక టెస్ట్లో 187 పరుగులు).సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే: సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ మర్చంట్, అబ్బాస్ అలీ బేగ్, పాలీ ఉమ్రిగర్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, మహ్మద్ అజారుద్దీన్ సచిన్ టెండూల్కర్. -
BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
భారత క్రికెట్ జట్లు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి. శుబ్మన్ గిల్ సారథ్యంలోని పురుషుల జట్టు టెస్టు సిరీస్ ఆడుతుంటే.. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని మహిళల టీమ్ పరిమిత ఓవర్ల సిరీస్లో ఆతిథ్య జట్టుతో తలపడుతోంది.మరోవైపు.. ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ వంటి నయా ఐపీఎల్ సంచనాలతో కూడిన భారత అండర్-19 జట్టు కూడా ప్రస్తుతం ఇంగ్లండ్లోనే ఉంది. ఇంగ్లండ్ యువ జట్టుతో ఐదు యూత్ వన్డేలు పూర్తి చేసుకున్న ఈ టీమ్ 3-2తో సిరీస్ను కైవసం చేసుకుంది.ధనాధన్.. ఫటాఫట్ఈ సిరీస్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ మరోసారి హాట్టాపిక్ అయిపోయాడు. అతడి ఆటను చూసేందుకు వందల కిలోమీటర్లు ప్రయాణించి అభిమానులు స్టేడియాలకు వస్తున్నారంటే అతడి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్లుగానే ధనాధన్ దంచికొడుతూ క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేస్తున్నాడు వైభవ్.ముఖ్యంగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో నాలుగో వన్డేలో వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే శతక్కొట్టడం ఇంగ్లండ్ టూర్ మొత్తంలో హైలైట్గా నిలిచింది. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి యూత్ టెస్టులోనూ పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు రాణించాడు. తొలి ఇన్నింగ్స్ (14)లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకం (56) సాధించాడు. అంతేకాదు.. ఈ పార్ట్టైమ్ స్పిన్నర్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు.ఇప్పటికే కోటీశ్వరుడిగాఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే కోటీశ్వరుడైన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా ఈ బిహార్ కుర్రాడిని రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్లుగానే ఫాస్టెస్ట్ సెంచరీతో పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు వైభవ్.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వైభవ్ ఎంత సంపాదిస్తున్నాడన్న అంశంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనల ప్రకారం.. స్లాబుల ప్రకారం అండర్-19 ప్లేయర్లకు రోజుకు రూ. 20 వేల చొప్పున ఫీజు అందుతుంది. అయితే, తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లకే ఈ మొత్తం దక్కుతుంది. రిజర్వు ప్లేయర్లకు ఇందులో సగం అంటే రూ. 10 వేలు మాత్రమే ఇస్తారు.ఇప్పటికి రూ. 1.80 లక్షలుఈ లెక్కన వైభవ్ ఐదు యూత్ వన్డేల్లోనూ ఆడాడు కాబట్టి.. ఒక్కో మ్యాచ్కు రూ. 20 వేల చొప్పున ఐదింటికి రూ. లక్ష లభిస్తుంది. అదే విధంగా.. నాలుగు రోజుల యూత్ టెస్టుగానూ రోజుకు రూ. 20 వేల చొప్పున ఎనభై వేలు అతడికి ఫీజు రూపంలో దక్కుతాయి. వైభవ్తో పాటు తుదిజట్టులో ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్కు ఈ మేర ఫీజు లభిస్తుంది.సీనియర్ జట్ల ప్రదర్శన ఇలాఇదిలా ఉంటే.. శుబ్మన్ గిల్ సేన ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో మూడు పూర్తి చేసుకుంది. లీడ్స్లో ఓడిన టీమిండియా.. ఎడ్జ్బాస్టన్లో తొలిసారి గెలుపు జెండా ఎగురవేసిది. అయితే, లార్డ్స్లో ఓటమిపాలు కావడంతో ఇంగ్లండ్ 2-1తో ముందంజ వేసింది. మరోవైపు.. మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకుంది. ఇక మూడు వన్డేల సిరీస్లోనూ తొలి మ్యాచ్ గెలిచి.. శుభారంభం అందుకుంది.చదవండి: సిరాజ్ సింహం లాంటోడు.. కానీ ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్ -
టీమిండియా ఓపెనర్కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. ఇంగ్లండ్కు కూడా
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ ప్రతిక రావల్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాకిచ్చింది. ఇంగ్లండ్ మహిళలతో జరిగిన తొలి వన్డేలో తమ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ప్రతిక రావల్కు జరిమానా విధించింది. ఆమె మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా ఓ డెమెరిట్ పాయింట్ కూడా ఆమె ఖాతాలో చేరింది.అసలేమి జరిగిందంటే?సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ప్రతిక 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అద్బుతమైన బంతితో రావల్ను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో సహనం కోల్పోయిన రావల్ తన భుజంతో ఎక్లెస్టోన్ను ఢీకొట్టింది. అంతేకాకుండా ఇంగ్లీష్ పేసర్ లారెన్ ఫైలర్తో కూడా రావల్ దురుసగా ప్రవర్తించింది.దీంతో లెవల్-1 నేరంగా పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. 24 ఏళ్ల రావల్కు ఊహించని షాకిచ్చింది. మరోవైపు స్లోఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టుపై కూడా ఐసీసీ జరిమానా వేసింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది.కాగా ఈ మ్యాచ్లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ(62 నాటౌట్) ప్లేయర్గా ఆఫ్ది మ్యాచ్గా నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూలై 19న లార్డ్స్ వేదికగా జరగనుంది.చదవండి: సిరాజ్ సింహం లాంటోడు.. కానీ ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్ -
ఐపీఎల్ కోసం దాచి ఉంచు పంత్.. ఇంగ్లండ్లో ఆ షాట్లు వద్దులే!
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటికి మూడు టెస్టులు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆరు ఇన్నింగ్స్లో కలిపి 70కి పైగా సగటుతో 425 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉండటం విశేషం.అయితే, పంత్ కొన్నిసార్లు అనవసరపు షాట్లకు పోయి వికెట్ పారేసుకోవడం వల్ల విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. చివరగా ఆస్ట్రేలియాతో టెస్టుల్లోనూ నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్లోనూ అదే పునరావృతం చేస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్ షోయబ్ బషీర్ (Shoaib Bashir) బౌలింగ్లో రెండుసార్లు భారీ షాట్లకు పోయి వికెట్ సమర్పించుకున్నాడు.ఐపీఎల్ కోసం దాచి ఉంచు పంత్ఈ నేపథ్యంలో పంత్ రిస్కీ షాట్ల గురించి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఫారూఖ్ ఇంజనీర్ స్పందిస్తూ.. ‘‘కచ్చితంగా అతడు ఇలాంటి షాట్లు ఆడటం మానుకోవాలి. ఇలాంటివి ఐపీఎల్ కోసం దాచిపెట్టుకోవాలి. టెస్టు క్రికెట్లో ఎంతో క్రమశిక్షణతో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.ముఖ్యంగా మూడు, నాలుగు స్థానాల్లో ఆడేవాళ్లు సరైన రీతిలో ఆడాలి. సహచర ఆటగాళ్లతో కలిసి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి.. తమ ఇన్నింగ్స్ను భారీ స్కోర్లుగా మలచుకోవాలి’’ అని సూచించాడు.పళ్లు మొత్తం రాలిపోయి ఉండేవేమో!అదే విధంగా.. ‘‘పంత్కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అయితే, కీలక సమయాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అతడు ప్రతిభావంతుడైన ఆటగాడే. కొత్త కొత్త షాట్లు కనిపెడతాడు. ఒక్కోసారి హెల్మెట్ ఉండబట్టి సరిపోయిందిలే అనిపిస్తుంది. మా రోజుల్లో అయితే, పళ్లు మొత్తం రాలిపోయి ఉండేవేమో’’ అంటూ ఫారూఖ్ ఇంజనీర్ సరదాగా వ్యాఖ్యానించాడు.కాగా రిషభ్ పంత్ వేలికి గాయమై విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టులో అతడు కేవలం బ్యాటర్గానే బరిలోకి దిగాలని.. అతడికి బదులు ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్గా వ్యవహరించాలని ఫారూఖ్ ఇంజనీర్ సూచించాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికి మూడు పూర్తి కాగా.. ఇంగ్లండ్ రెండు గెలవగా.. టీమిండియా ఒక మ్యాచ్లో విజయం సాధించింది.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు -
సిరాజ్ సింహం లాంటోడు.. ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే (Ryan ten Doeschate) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పనిభారం గురించి అతడు అస్సలు ఆలోచించడని.. తామే ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. సిరాజ్ సింహం లాంటివాడని.. జట్టు ప్రయోజనాల కోసం ఎల్లవేళలా బంతితో సిద్ధంగా ఉంటాడంటూ ప్రశంసించాడు.నాలుగో టెస్టు గెలిస్తేనే..ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ-2025 (Anderson- Tendulkar Trophy) ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఐదింటిలో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు గిల్ సేనపై 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలు సజీవంగా ఉంటాయి.బుమ్రా ఆడేది మూడేఅయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడని టీమిండియా యాజమాన్యం ముందే చెప్పింది. అతడు కేవలం మూడు టెస్టులే ఆడతాడని స్పష్టం చేసింది. ఈ క్రమంలో లీడ్స్లో ఆడిన బుమ్రా.. ఎడ్జ్బాస్టన్లో విశ్రాంతి తీసుకుని.. లార్డ్స్లో మళ్లీ ఆడాడు.ఇక బుమ్రా గైర్హాజరీలో పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న మరో సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ మెరుగ్గా రాణిస్తున్నాడు. మూడు టెస్టుల్లోనూ ఆడిన అతడు.. మొత్తంగా 13 (2, 6, 1, 2, 2) వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఎడ్జ్బాస్టన్లో ఆరు వికెట్లతో చెలరేగి భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.సిరాజ్ సింహం లాంటోడుఈ నేపథ్యంలో డస్కటే సిరాజ్పై ప్రశంసలు కురిపించాడు. ‘‘అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండటం మాకు సానుకూలాంశం. ఇక్కడ ఫాస్ట్బౌలర్గా అతడి నుంచి మనం అందరికంటే కాస్త ఎక్కువగానే వికెట్లు తీస్తాడని ఆశిస్తాం.అయితే, తను పనిభారం గురించి మాత్రం అస్సలు పట్టించుకోడు. అందుకే మేమే అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సింహం లాంటి పోరాటపటిమ అతడి సొంతం.మేమే అతడిని వారిస్తాంలార్డ్స్లో స్టోక్స్ మాదిరి అదనపు ఓవర్లు వేసేందుకు సిరాజ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కానీ అతడు ఫిట్గా ఉండేలా చూసుకోవడం మా పని. అందుకే ఒక్కోసారి మేనేజ్మెంట్ అతడిని వారించాల్సి వస్తుంది కూడా. ఏదేమైనా అతడి చేతిలో బంతి ఉందంటే కచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేస్తాడనే నమ్మకం ఉంటుంది’’ అంటూ ఆట పట్ల సిరాజ్ అంకితభావం గురించి డస్కటే వివరించాడు.కాగా 2023 నుంచి టీమిండియా ఆడిన 27 టెస్టులలో సిరాజ్ 24 మ్యాచ్లు ఆడాడు. టీమిండియా ఫాస్ట్బౌలర్లలో ఒక్కరు కూడా ఇలా వరుస మ్యాచ్లు ఆడలేదు. ఇక 2023 నుంచి ఇప్పటిదాకా అతడు 569.4 ఓవర్లు బౌల్ చేశాడు. ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (721.2 ఓవర్లు), పేసర్ మిచెల్ స్టార్క్ (665.1) తర్వాత ఈ స్థాయిలో అలుపెరగకుండా బౌలింగ్ చేసిన ఏకైక భారత ఫాస్ట్బౌలర్ సిరాజ్. ఇదిలా ఉంటే.. మాంచెస్టర్ వేదికగా జూలై 23-27 మధ్య భారత్- ఇంగ్లండ్ నాలుగో టెస్టు జరుగనుంది.చదవండి: భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు -
చరిత్రపుటల్లోకెక్కిన జోస్ బట్లర్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఆటగాడు జోస్ బట్లర్ పొట్టి క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని అధిగమించాడు. టీ20 ఫార్మాట్లో జోస్ 13000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లండ్ ప్లేయర్గా, ఓవరాల్గా ఏడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బట్లర్కు ముందు ఇంగ్లండ్ తరఫున అలెక్స్ హేల్స్ (503 మ్యాచ్ల్లో 13814 పరుగులు) ఈ ఘనత సాధించాడు.ఓవరాల్గా క్రిస్ గేల్ (14562), కీరన్ పోలార్డ్ (13854), అలెక్స్ హేల్స్ (13814), షోయబ్ మాలిక్ (13571), విరాట్ కోహ్లి (13543), డేవిడ్ వార్నర్ (13395), బట్లర్ (13046) మాత్రమే టీ20 ఫార్మాట్లో 13000 పరుగులు పూర్తి చేసుకున్నారు.టీ20 బ్లాస్ట్ 2025లో భాగంగా నిన్న (జులై 17) యార్క్షైర్తో జరిగిన మ్యాచ్లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసిన బట్లర్.. తన జట్టు (లాంకాషైర్) విజయంలోనూ ప్రధానపాత్ర పోషించాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లాంకాషైర్.. బట్లర్తో పాటు ఫిల్ సాల్ట్ (29 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. వీరు మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో లాంకాషైర్ 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో యార్క్షైర్ కూడా తడబడింది. జేమ్స్ ఆండర్సన్ (4-0-25-3), క్రిస గ్రీన్ (4-0-27-3), లూక్ వుడ్ (4-0-33-2) చెలరేగడంతో ఆ జట్టు 19.1 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. తద్వారా లాంకాషైర్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. యార్క్షైర్ను గెలిపించేందుకు అబ్దుల్లా షఫీక్ (54) విఫలయత్నం చేశాడు. -
లార్డ్స్లో అతడి పోరాటం అసాధారణం: గంభీర్ ప్రశంసలు
లార్డ్స్ టెస్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అసాధారణ పోరాటం చేశాడని టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. విజయం కోసం చివరి వరకు పట్టుదలగా నిలబడిన జడ్డూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తలపడుతోంది.ఇందులో భాగంగా తొలుత లీడ్స్లో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ క్రమంలో సిరీస్ 1-1తో సమంగా ఉన్న వేళ లార్డ్స్ (Lord's Test)లో జరిగిన మూడో టెస్టు ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.జడ్డూ పోరాటం వృథాఅయితే, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన తరుణంలో టీమిండియా సులువుగానే ఓటమిని అంగీకరిస్తుందని అంతా భావించారు. కానీ జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్) అద్భుత పోరాటపటిమతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే, టెయిలెండర్ మహ్మద్ సిరాజ్ (30 బంతుల్లో 4) అనూహ్య రీతిలో బౌల్డ్ కావడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. జడ్డూ పోరాటం వృథాగా పోయింది.ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే, సునిల్ గావస్కర్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు జడ్డూ ఇంకాస్త దూకుడుగా ఆడి ఉంటే బాగుండేదని విమర్శించారు. అయితే, కోచ్ గంభీర్ మాత్రం జడేజా సరైన రీతిలోనే ఆడాడంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ‘‘అదొక అసాధారణ పోరాటం. జడ్డూ పోరాడిన తీరు నిజంగా ఒక అద్భుతం లాంటిదే’’ అని గంభీర్ జడ్డూను కొనియాడాడు. డ్రెసింగ్రూమ్లో ఈ మేరకు అతడు వ్యాఖ్యలు చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. మా జట్టులో ఉండటం అదృష్టంఇక సిరాజ్ మాట్లాడుతూ.. ‘‘ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్... ఇలా మూడు విభాగాల్లోనూ జడ్డూ భాయ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టు కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు.జట్టుకు అవసరమైన ప్రతిసారీ నేనున్నానంటూ బ్యాట్తో ఆదుకుంటాడు. క్షిష్ట సమయాల్లో రాణించే ఇలాంటి ప్లేయర్ అన్ని జట్లలోనూ ఉండడు. అతడు మా జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం’’ అంటూ ప్రశంసించాడు. కాగా టీమిండియాతో సిరీస్లో 2-1తో ఇంగ్లండ్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)కు మాంచెస్టర్ వేదిక.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉ఇంగ్లండ్: 387 & 192👉భారత్: 387 & 170👉ఫలితం: 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు.చదవండి: వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
దిగ్గజాల సరసన నమీబియా ప్లేయర్
నమీబియా వెటరన్ ఆల్రౌండర్ డేవిడ్ వీస్ పొట్టి క్రికెట్లో దిగ్గజాల సరసన చేరాడు. 40 ఏళ్ల వీస్ టీ20 కెరీర్లో 400 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన 29 ఆటగాడిగా రికార్డుకెక్కాడు.టీ20 ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు విండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ పేరిట ఉంది. పోలార్డ్ ఈ ఫార్మాట్లో ఏకంగా 707 మ్యాచ్లు ఆడాడు. పోలార్డ్ తర్వాత అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో డ్వేన్ బ్రావో (582), ఆండ్రీ రసెల్ (561), షోయబ్ మాలిక్ (557), సునీల్ నరైన్ (554), డేవిడ్ మిల్లర్ (530), అలెక్స్ హేల్స్ (503), రవి బొపారా (491), గ్లెన్ మ్యాక్స్వెల్ (478), రషీద్ ఖాన్ (477) టాప్-10లో ఉన్నారు.భారత్ తరఫున అత్యధిక టీ20 ఆడిన ఘనత హిట్మ్యాన్ రోహిత్ శర్మకు దక్కుతుంది. రోహిత్ పొట్టి ఫార్మాట్లో 463 మ్యాచ్లు ఆడాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (414), దినేశ్ కార్తీక్ (412), ఎంఎస్ ధోని (405), రవీంద్ర జడేజా (346) ఉన్నారు.పొట్టి క్రికెట్లో డేవిడ్ వీస్ ప్రాతినిథ్యం వహించిన జట్లు..బార్బడోస్ ట్రైడెంట్స్, కొలంబో స్టార్స్, కుమిల్లా వారియర్స్, ఈస్టర్న్స్, గయానా అమెజాన్ వారియర్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, కరాచీ కింగ్స్, ఖుల్నా టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్, లాహోర్ ఖలందర్స్, లండన్ స్పిరిట్, నమీబియా, నార్తర్న్ సూపర్చార్జర్స్ , పార్ల్ రాక్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దక్షిణాఫ్రికా, దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ ప్లేయర్స్, సెయింట్ లూసియా కింగ్స్, ససెక్స్, టైటాన్స్, ష్వానే స్పార్టన్స్, యార్క్షైర్ -
తగ్గేదేలే!.. వైభవ్ సూర్యవంశీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీస్తున్న భారత అండర్-19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఖాతాలో మరో ప్రపంచ రికార్డు చేరింది. యూత్ టెస్టు మ్యాచ్లో వికెట్ తీయడంతో పాటు.. అర్ధ శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఈ చిచ్చరపిడుగు చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టు (IND U19 Vs ENG U19)తో జరిగిన తొలి యూత్ టెస్టు సందర్భంగా సాధించిన ఈ ఘనత గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.వన్డేలలో విధ్వంసకర శతకంఇంగ్లండ్ యువ జట్టుతో ఐదు యూత్ వన్డేలు (Youth ODI's), రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ టూర్లో ఆది నుంచి వైభవ్ సూర్యవంశీ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. యూత్ వన్డే సిరీస్ను భారత్ 3-2తో గెలుచుకోవడంలో పద్నాలుగేళ్ల ఈ పిల్లాడిది కీలక పాత్ర.ఆరంభంలో నిరాశపరిచినా..ఐదు వన్డేల్లో ఐదు సాధించిన స్కోర్లు వరుసగా.. 48 (19), 45 (34), 86 (31), 143 (78), 33 (42). నాలుగో యూత్ వన్డేలో 52 బంతుల్లోనే శతకం బాది.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. అనంతరం ఇంగ్లండ్తో తొలి యూత్ టెస్టు (జూలై 12- 15)లో మాత్రం వైభవ్ ఆరంభంలో నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 13 బంతులు ఎదుర్కొని కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.రెండు వికెట్లు, ఓ అర్ధ శతకంఅయితే, బ్యాట్తో విఫలమైనా వైభవ్ ఇక్కడ బంతితో రాణించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ హంజా షేక్ (84), వికెట్ కీపర్ బ్యాటర్ థామస్ రూ (34) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు ఈ పార్ట్టైమ్ స్పిన్నర్.ఇక భారత రెండో ఇన్నింగ్స్లో వైభవ్ బ్యాట్ ఝులిపించాడు. 44 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 56 పరుగులు సాధించాడు. తద్వారా ఇంగ్లండ్తో తొలి యూత్ టెస్టులో రెండు వికెట్లు తీయడంతో పాటు అర్ధ శతకం నమోదు చేశాడు. ఈ నేపథ్యంలోనే అత్యంత పిన్న వయసులో ఒక యూత్ టెస్టులో వికెట్ తీయడంతో పాటు హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్కు చెందిన మెహదీ హసన్ మిరాజ్ పేరిట ఉండేది. కాగా ఇంగ్లండ్- భారత్ మధ్య తొలి యూత్ టెస్టు ‘డ్రా’ గా ముగిసింది.అత్యంత చిన్న వయసులో ఒక యూత్ టెస్టులో వికెట్ తీయడంతో పాటు 50 స్కోరు చేసిన క్రికెటర్లు వీరే🏏వైభవ్ సూర్యవంశీ (ఇండియా): 14 ఏళ్ల, 107 రోజుల వయసులో- బెకెన్హామ్ వేదికగా ఇంగ్లండ్ మీద🏏మెహదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్): 15 ఏళ్ల 167 రోజుల వయసులో- మిర్పూర్ వేదికగా శ్రీలంక మీద🏏షైకత్ అలీ (బంగ్లాదేశ్): 15 ఏళ్ల 204 రోజుల వయసులో- సైలెట్ వేదికగా ఇంగ్లండ్ మీద🏏నాసిర్ హుసేన్ (బంగ్లాదేశ్): 15 ఏళ్ల 219 రోజుల వయసులో డెర్బీ వేదికగా శ్రీలంక మీద🏏సురేశ్ రైనా (ఇండియా): 15 ఏళ్ల 242 ఏళ్ల వయసులో- కొలంబో వేదికగా ఇంగ్లండ్ మీద.చదవండి: అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’లు అందుకుంది వీరే -
ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్.. చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్న పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు అతి సమీపంలో ఉన్నాడు. జులై 23 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కాబోయే నాలుగో టెస్ట్లో పంత్ మరో 182 పరుగులు చేస్తే.. ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం డెనిస్ లిండ్సే పేరిట ఉంది. లిండ్సే 1966/67 ఆస్ట్రేలియా సిరీస్లో 5 మ్యాచ్ల్లో (7 ఇన్నింగ్స్ల్లో) 86.57 సగటున 3 సెంచరీలు, 2 అర్ద సెంచరీల సాయంతో 606 పరుగులు చేశాడు.ఈ రికార్డు బద్దలు కొట్టేందుకు పంత్ 182 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆరు దశాబ్దాల తర్వాత పంత్కు ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పంత్ ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి 6 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీల సాయంతో 425 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో శుభ్మన్ గిల్ (607) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. ఒక వేళ పంత్ నాలుగో టెస్ట్లో ఈ అవకాశం మిస్ అయినా ఐదో టెస్ట్లో సాధించే అవకాశం ఉంటుంది.మరో 101 పరుగులు చేస్తే..!ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో పంత్ 101 పరుగులు చేస్తే ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్గా రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు బుద్ది కుందరన్ పేరిట ఉంది. కుందరన్ 1963/64లో ఇంగ్లండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 10 ఇన్నింగ్స్లు ఆడి 525 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది.ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లు..డెనిస్ లిండ్సే-606ఆండీ ఫ్లవర్- 540కుందరన్- 525బ్రాడ్ హడిన్- 493గెర్రి అలెగ్జాండర్- 484ఆడమ్ గిల్క్రిస్ట్- 473అలెక్ స్టివార్ట్- 465వాల్కాట్- 452రిషబ్ పంత్- 425రికార్డుల మాట అటుంచితే, అసలు పంత్ ఆడతాడా..?రికార్డుల మాట అటుంచితే ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో పంత్ ఆడతాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మూడో టెస్ట్లో గాయపడిన పంత్.. నాలుగో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొనడం లేదు.పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెష్కటే అప్డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడని, నాలుగో టెస్ట్ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని థీమా వ్యక్తం చేశాడు. ముందుస్తు జాగ్రత్తగా పంత్ను ప్రాక్టీస్కు దూరంగా ఉంచామని తెలిపాడు.కాగా, మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్కు ముందే పంత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. వికెట్కీపింగ్కు దూరంగా ఉన్నా పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ మాత్రం చేశాడు. -
ప్రపంచకప్ టోర్నీకి ముందే మేలుకోండి: భారత మాజీ కెప్టెన్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ప్రొ లీగ్ టోర్నీ భారత జట్టుకు పాఠంలాంటిదని భారత మాజీ కెప్టెన్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేశ్ (PR Sreejesh) అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలు, ప్రపంచకప్కు ముందు మనకిది మేలుకొలుపు సంకేతమని చెప్పాడు. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా నిర్వహించే ప్రపంచకప్ వచ్చే ఏడాది ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. అనంతరం జపాన్ ఆతిథ్యమిచ్చే ఆసియా క్రీడలు సెపె్టంబర్ 19 నుంచి 4 వరకు జరుగుతాయి. కాగా యూరోపియన్ అంచె ప్రొ లీగ్ పోటీల్లో భారత జట్లు తీవ్రంగా నిరాశపరిచాయి. తొమ్మిది జట్లు పోటీపడిన యూరోపియన్ అంచెలో భారత పురుషుల జట్టు ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆఖరిదాకా పోరాడారుఅయితే ఫలితాలు నిరాశపరిచినప్పటికీ భారత ఆటగాళ్ల ప్రదర్శన మరీ అంత తీసికట్టుగా ఏమీ లేదని ప్రస్తుతం భారత అండర్–21 జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న శ్రీజేశ్ చెప్పుకొచ్చాడు. అక్టోబర్లో జరిగే వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్కు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీజేశ్ మీడియాతో మాట్లాడుతూ ‘నిజానికి మన ఆటగాళ్లు బాగానే ఆడారు. ప్రతీ మ్యాచ్లోనూ గోల్స్ కోసం ఎన్నో అవకాశాల్ని సృష్టించారు. గెలిచేందుకు ఆఖరిదాకా పోరాడారు. కొన్నిసార్లు ఇంతబాగా ఆడినప్పటికీ దురదృష్టవశాత్తూ నిరుత్సాహకర ఫలితాలు వస్తాయి. యూరోప్లో సరిగ్గా అదే జరిగింది’ అని వివరించాడు.ఆ అంచె పోటీల కోసం చక్కగా సన్నద్దమైనప్పటికీ మైదానంలో ఫలితాలే ప్రతికూలమయ్యాయన్నాడు. అయితే ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆసియా కప్, ప్రపంచకప్ మెగా ఈవెంట్లకు మరింత మెరుగ్గా సిద్ధమవ్వాల్సిన ఆవశ్యకతను యూరోపియన్ అంచె పోటీలు తెలియజేస్తున్నాయని చెప్పాడు.కోచ్గా ప్రయాణం ఎలా ఉందంటే?కాగా టోక్యో, పారిస్ వరుస ఒలింపిక్స్లో భారత జట్టు కాంస్య పతకాలు గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన శ్రీజేశ్.. సుదీర్ఘమైన కెరీర్కు వీడ్కోలు పలికిన అనంతరం కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. అండర్–21 జూనియర్ పురుషుల జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.ఈ కోచింగ్ ప్రయాణంపై మాట్లాడుతూ ఆటగాడిలాగే రొటీన్గా ఉందన్నాడు. ఉదయమే నిద్రలేవడం, ప్లేయర్లకు వార్మప్ తదుపరి శిక్షణ ఇవ్వడం, తదుపరి ట్రెయినింగ్ సెషన్ వ్యవహరాలు చక్కదిద్దడం, విశ్లేషించడం జరుగుతోందన్నాడు. అప్పుడు అటగాడిగా ఎక్కువగా శారీరకంగా శ్రమిస్తే ఇప్పుడు కోచ్గా మానసికంగా ఎక్కువ శ్రమించాల్సి వస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది చెన్నై, మదురై నగరాల్లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగే జూనియర్ ప్రపంచకప్ కోసం జట్టును తీర్చిదిద్దే పనిలో ఉన్నానని చెప్పాడు.ముందుగా ఒక్కో మ్యాచ్ గెలవడం, క్వార్టర్స్ చేరడం తమ లక్ష్యాలుగా ఉన్నాయన్నాడు. చిరకాల ప్రత్యర్థులు (భారత్, పాక్) ఒకే పూల్ (బి)లో ఉన్నప్పటికీ దీనిపై అనవసరంగా చర్చించి కుర్రాళ్లపై ఒత్తిడి పెంచదల్చుకోలేదని పేర్కొన్నాడు. చదవండి: కెప్టెన్గా నితీశ్ కుమార్ రెడ్డి -
రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ భామ
మాంట్రియల్: కెనడా టెన్నిస్ స్టార్ జెనీ బుచార్డ్ తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది. మాంట్రియల్ ఓపెన్ టోర్నీ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఆఖరి గ్రాండ్స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్కు ముందు సన్నాహక టోర్నీగా నిర్వహించే ‘నేషనల్ బ్యాంక్ ఓపెన్’ త్వరలో మాంట్రియల్లో జరుగుతుంది.‘ప్రతీ దానికి టైమ్ ఉంటుంది. అలాగే నేను నిష్క్రమించే టైమ్ వచ్చింది. ఎక్కడ కెరీర్ను మొదలు పెట్టానో అక్కడే టెన్నిస్ను ముగించబోతున్నాను’ అని సోషల్ మీడియాలో బుచార్డ్ పోస్ట్ చేసింది. కెరీర్లో 299 విజయాలు, 230 పరాజయాల రికార్డును కలిగిన బుచార్డ్ 2023లో కెనడా గెలిచిన బిల్లీ జీన్ కింగ్ కప్లో కీలకపాత్ర పోషించింది. 2014లో బుచార్డ్ సూపర్ ఫామ్ చాటుకుంది.ఆ ఏడాది వింబుల్డన్లో రన్నరప్గా నిలిచిన ఈ కెనడా స్టార్ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లలో సెమీఫైనల్ దాకా పోరాడింది. తద్వారా కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్కు ఎగబాకింది. అయితే మరుసటి ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్లోనూ క్వార్టర్స్ చేరిన ఆమెకు యూఎస్ ఓపెన్ చేసిన గాయం కెరీర్ను దెబ్బతీసింది.2015లో యూఎస్ ఓపెన్లో ప్రిక్వార్టర్స్ చేరిన ఆమె లాకర్ రూమ్ వద్ద జారిపడింది. దీంతో కన్కషన్కు గురైన ఆమె టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలగింది. దీనిపై యూఎస్ ఓపెన్ నిర్వాహకులపై విమర్శలు వచ్చాయి. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆమె గాయపడిందని జ్యూరీ విచారణలో తేలింది. -
ఇంగ్లండ్ వికెట్కీపర్ మహోగ్రరూపం.. 11 సిక్సర్లు, 11 ఫోర్లతో విధ్వంసకర శతకం
టీ20 బ్లాస్ట్ టోర్నీలో ఇంగ్లండ్ యువ వికెట్కీపర్ జోర్డన్ కాక్స్ (ఎసెక్స్) మహోగ్రరూపం దాల్చాడు. నిన్న (జులై 17) హ్యాంప్షైర్తో జరిగిన మ్యాచ్లో కేవలం 47 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న కాక్స్ 11 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేశాడు. పొట్టి క్రికెట్లో కాక్స్కు ఇదే తొలి సెంచరీ.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్షైర్.. టాబీ అల్బర్ట్ (55 బంతుల్లో 84; 12 ఫోర్లు, సిక్స్), కార్ట్రైట్ (23 బంతుల్లో 56; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), టామ్ ప్రెస్ట్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమ్స్ ఫుల్లర్ (6 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్.. ఆదిలో తడబడినప్పటికీ, వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన జోర్డన్ కాక్స్ శివాలెత్తిపోవడంతో మరో 4 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కాక్స్ ఒక్కడే ఒంటిచేత్తో ఎసెక్స్కు విజయతీరాలకు చేర్చాడు. సహచర బ్యాటర్లు ఒక్కో పరుగు చేసేందుకు ఇబ్బంది పడిన చోట కాక్స్ విలయతాండవం చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి భారీ లక్ష్యం చిన్నబోయేలా చేశాడు. ఫలింతగా ఎసెక్స్ 4 వికెట్ల తేడాతో హ్యాంప్షైర్పై ఘన విజయం సాధించింది.మిగిలిన ఎసెక్స్ బ్యాటర్లలో కైల్ పెప్పర్ 23, పాల్ వాల్టర్, క్రిచ్లీ, బెన్కెన్స్టెయిన్ తలో 13, చార్లీ అల్లీసన్ 5, నోవా థైన్ 4, సైమన్ హార్మర్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. -
వరుస వైఫల్యాలు.. కరుణ్ నాయర్పై వేటు..?
లండన్: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి జరగనుండగా అప్పుడే తుది జట్టుపై చర్చ మొదలైంది. సిరీస్లో జట్టు ఆడిన మూడు టెస్టులను చూస్తే బ్యాటర్ కరుణ్ నాయర్ మినహా ఇతర ఆటగాళ్లంతా రాణించారు. నాయర్ మాత్రం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. క్రీజ్లోకి వచ్చాక మెరుగ్గానే ఇన్నింగ్స్లను ఆరంభించినా...వాటిని అతను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు.అతను వరుసగా 0, 20, 31, 26, 40, 14 (మొత్తం 131 పరుగులు) స్కోర్లు నమోదు చేశాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత తనకు లభించిన ‘మరో చాన్స్’ను నాయర్ సది్వనియోగం చేసుకోలేదు. ముఖ్యంగా లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో అతను అవుటైన తీరు విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో నాయర్ స్థానం నిలబెట్టుకోవడం కష్టంగానే ఉంది.కీలకమైన మూడో స్థానంలో నాయర్కు బదులుగా యువ ఆటగాడు సాయి సుదర్శన్కు మరో అవకాశం ఇవ్వాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. లీడ్స్ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయినా... రెండో ఇన్నింగ్స్లో చక్కటి షాట్లతో చెప్పుకోదగ్గ ప్రదర్శన (30 పరుగులు) కనబర్చాడు. తుది జట్టుకు సంబంధించి ఈ ఒక్క మార్పు మాత్రం కచ్చితంగా ఉండవచ్చని తెలుస్తోంది. కాగా, 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ 2, భారత్ ఓ టెస్ట్ మ్యాచ్లో గెలిచాయి. సిరీస్లో నిలబడాలంటే భారత్ నాలుగో టెస్ట్లో గెలవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో తుది జట్టులో పలు మార్పులకు ఆస్కారం ఉంది. విశ్లేషకుల అభిప్రాయం మేరకు కరుణ్ నాయర్ను తప్పించి సాయి సుదర్శన్కు అవకాశం ఇవ్వవచ్చు. -
గెలిపించగలనని నమ్మాను.. గతంలోనూ ఇలాంటి స్థితిలో ఆడాను: టీమిండియా స్టార్ క్రికెటర్
సౌతాంప్టన్: ఇంగ్లండ్తో బుధవారం జరిగిన తొలి వన్డేను భారత మహిళల జట్టు గెలుచుకోవడంలో దీప్తి శర్మ ప్రధాన పాత్ర పోషించింది. ఆఫ్స్పిన్నర్గా జట్టు బౌలింగ్ బృందంలో రెగ్యులర్ సభ్యురాలైన దీప్తి... బ్యాటర్గా లోయర్ ఆర్డర్లో అనేక మార్లు కీలక ఇన్నింగ్స్లు ఆడింది. ఇప్పుడు ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన దీప్తి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ జట్టును విజయం వరకు తీసుకెళ్లింది.28వ ఓవర్లో 127/4 వద్ద క్రీజ్లోకి వచ్చిన ఆమె 62 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 64 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచింది. లారెన్ బెల్ బౌలింగ్లో దీప్తి ఒంటి చేత్తో కొట్టిన సిక్సర్ హైలైట్గా నిలిచింది.‘ఇన్నేళ్ల నా కెరీర్లో చాలా సందర్భాల్లో ఇలాంటి స్థితిలోనే బరిలోకి దిగాను. నేను ఎంత ప్రశాంతంగా ఉండగలనో నాకు బాగా తెలుసు. కాబట్టి ఏమాత్రం ఒత్తిడికి గురి కాలేదు. ఈసారి కూడా అదే కీలకంగా మారింది. జెమీమాతో భాగస్వామ్యం నెలకొల్పడంపై ముందుగా దృష్టి పెట్టాను. మా పార్ట్నర్షిప్ జట్టు గెలుపు వరకు తీసుకెళుతుందని నేను నమ్మాను.నేను చివరి వరకు నిలిస్తే విజయం ఖాయమవుతుందని తెలుసు. జెమీమా తర్వాత రిచా, అమన్ కూడా బాగా సహకరించారు. ఒంటి చేత్తో సిక్సర్ కొట్టడం రిషభ్ పంత్ను చూసి నేర్చుకున్నాను’ అని మ్యాచ్ అనంతరం దీప్తి శర్మ వ్యాఖ్యానించింది.ఇంగ్లండ్ పేసర్ ఫైలర్ షార్ట్ పిచ్ బంతులతో పన్నిన వ్యూహానికి తాము సిద్ధంగా ఉండటం వల్లే ఎలాంటి సమస్యా రాలేదని దీప్తి పేర్కొంది. ఆమె కెరీర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం 20వసారి కాగా... మొదటిసారి బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా కేవలం బ్యాటింగ్ ప్రదర్శనతోనే ఆమె ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం.త్వరలో జరిగే వన్డే వరల్డ్ కప్లోనూ ఆల్రౌండర్గా ఆమె కీలకం కానుంది. ‘మా జట్టు ఇటీవల వరుసగా చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తోంది. శ్రీలంకతో ముక్కోణపు టోర్నీ గెలిచాక ఇక్కడ కూడా బాగా రాణిస్తున్నాం. వరల్డ్ కప్కు ఇంకా చాలా సమయం ఉంది. దాని గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఒక్కో మ్యాచ్పైనే దృష్టి పెట్టాం’ అని దీప్తి పేర్కొంది. తొలి వన్డేలో 4 వికెట్లతో ఇంగ్లండ్ను ఓడించిన భారత్ సిరీస్లో 1–0తో ముందంజ వేయగా... రేపు లార్డ్స్ మైదానంలో రెండో వన్డే జరుగుతుంది. -
కెప్టెన్గా నితీశ్ కుమార్ రెడ్డి
టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కెప్టెన్ అయ్యాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్లో "భీమవరం బుల్స్" ఫ్రాంచైజీ సారధిగా నియమించబడ్డాడు. ఈ మేరకు సదరు ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ముగిసిన వేలంలో భీమవరం బుల్స్ నితీశ్ను రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో బిజీగా ఉన్న నితీశ్.. పర్యటన ముగియంగానే బుల్స్తో జతకడతాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) నాలుగో ఎడిషన్ ఆగప్ట్ 8న మొదలుకానుంది. అదే నెల 24న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఈ టోర్నీ విశాఖలోని Dr.YSR ACA-VDCA స్టేడియంలో జరుగనుంది. ఈ సీజన్లో ఏపీఎల్ ఏడు కొత్త జట్లతో బరిలోకి దిగుతుంది. గతంలో ఉన్న ఆరు ఫ్రాంచైజీలు తెరమరుగయ్యాయి.భీమవరం బుల్స్ ఫుల్ స్క్వాడ్నితీష్ కుమార్ రెడ్డి (కెప్టెన్), సత్యనారాయణ రాజు, హరి శంకర్ రెడ్డి, హేమంత్ రెడ్డి, పిన్నిటి తేజస్వి, మునీష్ వర్మ, సాయి శ్రవణ్, టి వంశీ కృష్ణ, ఎం యువన్, బి సాత్విక్, కె రేవంత్ రెడ్డి, సాయి సూర్య తేజ రెడ్డి, సిహెచ్ శివ, శశాంక్ శ్రీవత్స్, సి రవితేజ, ఎన్ హిమాకర్, కశ్యప్ ప్రకాశ్, భువనేశ్వర్ రావు, భస్వంత్ కృష్ణ, జె విష్ణు దత్తాహనుమ విహారీ, కేఎస్ భరత్ కూడా..!ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025లో నితీశ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు కూడా వేర్వేరు ఫ్రాంచైజీలకు సారథ్యం వహిస్తారు. భారత టెస్ట్ క్రికెటర్లు హనుమ విహారీ అమరావతి రాయల్స్కు, కేఎస్ భరత్ కాకినాడ కింగ్స్ కు నాయకత్వం వహిస్తారు.మిగిలిన నాలుగు జట్లు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైనర్స్కు వరుసగా షేక్ రషీద్, రికీ భుయ్, మహదీప్, అశ్విన్ హెబ్బర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.కాగా, జులై 14న జరిగిన APL 2025 వేలం మొత్తం 520 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. రాయల్స్ ఆఫ్ రాయలసీమ ఆల్ రౌండర్ పైలా అవినాష్ ఈ వేలంలో అత్యధికంగా రూ. 11.5 లక్షల బిడ్ను సంపాదించాడు.తదుపరి రెండు ఖరీదైన బిడ్లు రాయల్స్ ఆఫ్ రాయలసీమకు చెందిన పి. గిరినాథ్ రెడ్డి (రూ. 10.05 లక్షలు), భీమవరం బుల్స్ ఆల్ రౌండర్ సత్యనారాయణ రాజుకు (రూ. 9.8 లక్షలు) దక్కాయి. -
‘బుమ్రాను ఆడించాలనే ఉంది’
బెకెన్హామ్: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భారత టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటికే ప్రకటించింది. పని భారాన్ని తగ్గించడంలో భాగంగా తొలి మూడు టెస్టుల్లో అతను రెండు మ్యాచ్లలో బరిలోకి దిగగా... మిగిలిన రెండు టెస్టుల్లో ఒక మ్యాచ్కు దూరం కావచ్చు. అయితే అతను ఏ టెస్టులో ఆడతాడనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సిరీస్ సమం చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీనిపై మ్యాచ్ సమయానికే తుది నిర్ణయం తీసుకుంటామని జట్టు అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే వెల్లడించాడు. ‘బుమ్రా మరో మ్యాచ్కే అందుబాటులో ఉంటాడనే విషయం మాకు తెలుసు. మాంచెస్టర్లో సిరీస్ సమం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు బుమ్రా కీలకం. కాబట్టి ఆడించే ఆలోచన అయితే ఉంది. అయితే ఇతర ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టులు, వాటిలో మా అవకాశాలను దృష్టిలో పెట్టుకుంటూ తుది జట్టు ఎంపిక చేయాలి. అందుకే ఇప్పుడే ఏమీ చెప్పలేం. మాంచెస్టర్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం’ అని డస్కటే స్పష్టం చేశాడు. మూడో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సుదీర్ఘ స్పెల్లు బౌలింగ్ చేయడాన్ని బుమ్రా ఫిట్నెస్తో పోలుస్తూ వచ్చిన విమర్శలను డస్కటే కొట్టిపారేశాడు. అందరూ ఒకే తరహాలో బౌలింగ్ చేయరని, మరో బౌలర్తో పోల్చుకోవాల్సిన అవసరం లేదన్న డస్కటే... చిన్న చిన్న స్పెల్లలో బౌలింగ్ చేయడం బుమ్రా శైలి అని గుర్తు చేశాడు. మరో పేసర్ సిరాజ్ నిర్విరామంగా బౌలింగ్ చేసిన విషయాన్ని మర్చిపోవద్దని కూడా అతను అన్నాడు.గురువారం భారత జట్టు ప్రాక్టీస్లో పాల్గొనగా వికెట్ కీపర్ రిషభ్ పంత్ దీనికి దూరంగా ఉన్నాడు. అయితే పంత్ కోలుకునేందుకు తగినంత విశ్రాంతి ఇస్తున్నామని, తర్వాతి టెస్టులోనూ అతను బ్యాటింగ్ చేస్తాడని కూడా భారత అసిస్టెంట్ కోచ్ స్పష్టం చేశాడు. ప్రాక్టీస్లో ఆటగాళ్లు... లార్డ్స్ టెస్టులో ఓటమి నుంచి కోలుకున్న భారత జట్టు తర్వాతి టెస్టుపై దృష్టి పెట్టింది. మాంచెస్టర్ టెస్టుకు ముందు అందుబాటులో ఉన్న ఏకైక ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా ఆటగాళ్లు శ్రమించారు. ఇంకా మాంచెస్టర్కు వెళ్లని మన జట్టు లండన్ శివార్లలో బెకెన్హామ్లో ఉన్న కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో గురువారం సాధన చేసింది. కేఎల్ రాహుల్ మినహా ఇతర బ్యాటర్లంతా ఇందులో పాల్గొన్నారు. గాయం నుంచి కోలుకుంటున్న రిషభ్ పంత్తో పాటు పేసర్లు బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ కూడా ప్రాక్టీస్ చేయలేదు. వీరంతా స్వల్పంగా వామప్ చేసి ఆపై జిమ్కే పరిమితమయ్యారు. మరోవైపు సుదర్శన్ ఆడిన షాట్ను ఆపే క్రమంలో పేసర్ అర్ష్ దీప్ సింగ్ చేతికి బలంగా దెబ్బ తగిలింది. స్వల్ప చికిత్స అనంతరం బ్యాండేజీతో అతను మైదానం వీడాడు. బుమ్రా ఆడకపోతే అతని స్థానంలో అర్ష్ దీప్ తో అరంగేట్రం చేయించాలని మేనేజ్మెంట్ భావిస్తున్న స్థితిలో ఈ గాయం తీవ్రత ఎలాంటిదో చూడాలి. అర్ష్ దీప్ వెనుదిరిగాక టీమ్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వయంగా బౌలింగ్కు దిగి భారత బ్యాటర్లకు సహకరించాడు. లార్డ్స్లో పరాజయాన్ని మరచి మళ్లీ ఆత్మవిశ్వాసంతో కనిపించిన జట్టు ఉత్సాహంగా, సరదాగా సాధనలో పాల్గొనడం విశేషం. -
విండీస్కు మరో శరాఘాతం
భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లతో పాటు అంపైర్లను సైతం భయపెట్టగల హిట్టర్... పరిస్థితులతో సంబంధం లేకుండా బంతిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడగల ‘మిసైల్’... అవసరమైనప్పుడల్లా బంతితో బోల్తా కొట్టించగల బౌలర్... మైదానంలో అసాధారణ ఫీల్డింగ్తో కట్టిపడేయగల అథ్లెట్... ఇలా అన్ని రంగాల్లో ఆకట్టుకున్న వెస్టిండీస్ డేంజర్మ్యాన్ ఆండ్రె రసెల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్లో అధఃపాతాళానికి చేరిన వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు రసెల్ నిర్ణయం మరో శరాఘాతంలా మారింది. ఇంకో ఏడు నెలల్లో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఇటీవల నికోలస్ పూరన్ రిటైర్మెంట్ ప్రకటించగా... ఇప్పుడు రసెల్ కూడా ఆ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో కరీబియన్ జట్టు కష్టాలు మరింత పెరగనున్నాయి. సాక్షి క్రీడావిభాగం : వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ 29 ఏళ్ల నికోలస్ పూరన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకగా... ఇప్పుడు ఆల్రౌండర్ రసెల్ కూడా అదే బాటపట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు 37 ఏళ్ల రసెల్ తాజాగా వెల్లడించాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో జరగనున్న రెండో టి20 అనంతరం కెరీర్ను ముగించనున్నట్లు ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్ విషయం పక్కన పెడితే... పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగైన ఆల్రౌండర్గా ముద్రపడ్డ రసెల్ సేవలను విండీస్ బోర్డు సరిగ్గా వినియోగించుకోలేకపోయిందనే చెప్పొచ్చు. లోయర్ ఆర్డర్లో భారీ షాట్లతో జట్టుకు ఊహించని స్కోరు అందించగల నైపుణ్యంతో పాటు... వైవిధ్యమైన పేస్తో ప్రత్యరి్థని బోల్తా కొట్టించగల రసెల్ 2019లో జాతీయ జట్టు తరఫున చివరి వన్డే ఆడాడు. అప్పటి నుంచి కేవలం టి20లకే పరిమితమైన ఈ జమైకా స్టార్... ఇప్పుడు దానికి కూడా టాటా చెప్పనున్నాడు. 2026 ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్నకు మరో ఏడు నెలల వ్యవధి మాత్రమే ఉండగా... దానికి ముందు రసెల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా ఆ్రస్టేలియాతో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 27 పరుగులకే ఆలౌటై భారీ విమర్శలు మూటగట్టుకున్న కరీబియన్ జట్టు... ఇక ముందు టి20 ఫార్మాట్లోనూ మెరుగైన ప్రదర్శన చేయడం కష్టమే అనిపిస్తోంది. ఒకప్పుడు జట్టు నిండా అద్భుతమైన బ్యాటర్లు, అరివీర భయంకర బౌలర్లు ఉన్న విండీస్ జట్టు... ఇప్పుడు రోజు రోజుకు ప్రమాణాలు పడిపోతూ పాతాళం దిశగా పయనిస్తోంది. లీగ్లకే పరిమితం... విశ్వవ్యాప్తంగా ఎక్కడ టి20 లీగ్లు జరుగుతున్నా... అందులో ప్రధానంగా కనిపించే ప్లేయర్లు కరీబియన్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింట్లో ముందుండే విండీస్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీపడుతుంటాయి. క్రిస్ గేల్ నుంచి మొదలుకొని పొలార్డ్, బ్రావో, రసెల్, నరైన్, హెట్మైర్, పూరన్ ఇలా ఈ జాబితా చాంతాడంత పెద్దది. రసెల్ విషయానికి వస్తే... అతడు ఆడని లీగ్ లేదంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రసెల్... ప్రపంచంలో ఎక్కడ లీగ్ జరుగుతున్నా అందులో దర్శనమివ్వడం పరిపాటి. ఐపీఎల్తో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), బిగ్బాష్ లీగ్ (బీబీఎల్), పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్), లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్), విటాలిటీ బ్లాస్ట్, చాంపియన్ లీగ్ టి20 (సీఎల్టి20), మేజర్ క్రికెట్ లీగ్, హండ్రెడ్ ఇలా లెక్కకు మిక్కిలి లీగ్ల్లో రసెల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జట్టుకు అవసరమైన దశలో బ్యాటింగ్కు దిగి మెరుపులు మెరిపించడంతో పాటు... బంతితోనూ ఆకట్టుకోగల నైపుణ్యం రసెల్ సొంతం. ఇలాంటి ఆల్రౌండర్ను సరిగ్గా వినియోగించుకోలేకపోయిన విండీస్ క్రికెట్ బోర్డు... కనీసం వరల్డ్కప్ వరకు అతడిని కొనసాగమనే దిశగా కూడా ప్రయత్నాలు చేయలేకపోయింది. ఒకప్పుడు రసెల్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న డారెన్ స్యామీ ఇప్పుడు విండీస్ ప్రధాన కోచ్గా వ్యవహరిస్తుండగా... అతడు కూడా తన సహచరుడికి సర్దిచెప్పలేని పరిస్థితి. హార్డ్ హిట్టర్... 2010 తొలినాళ్లలో భారీ హిట్టింగ్తో వెలుగులోకి వచ్చిన రసెల్... 2011 వన్డే ప్రపంచకప్ ఆడిన వెస్టిండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ జమైకన్... ఆ తర్వాత ప్రపంచ చాంపియన్ టీమిండియాతో మ్యాచ్లో రికార్డులు తిరగరాశాడు. నార్త్సౌండ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 96 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రసెల్... 64 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్ల సహాయంతో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్లో విండీస్ ఓడినా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకోవడంతో పాటు... వన్డేల్లో 9వ స్థానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇక వన్డే కెరీర్లో అత్యధిక స్ట్రయిక్రేట్ (130.22) గల బ్యాటర్గా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 2012, 2016లో ఐసీసీ టి20 వరల్డ్కప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడైన రసెల్... కెరీర్లో ఏకైక టెస్టు 2010లో శ్రీలంకపై ఆడాడు. ఆ తర్వాత కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితమైన ఈ ఆల్రౌండర్... పలు మ్యాచ్ల్లో తన ప్రదర్శనతో జట్టుకు విజయాలు అందించాడు.ముఖ్యంగా జట్టు ఆశలన్నీ వదిలేసుకున్న సమయంలో అనూహ్య హిట్టింగ్తో చెలరేగి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపడం రసెల్కు అలవాటు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే గొప్ప అనుకునే స్థాయి నుంచి... దేశం తరఫున ఆడటం కన్నా లీగ్ల్లో పాల్గొనడమే మిన్న అనే స్థాయికి రసెల్ ఎదగగా... అలాంటి నిఖార్సైన ఆల్రౌండర్ను సరైన రీతిలో వాడుకోలేని వైచిత్ర విండీస్ బోర్డుది. కేకేఆర్ కీలక ప్లేయర్ లీగ్ల ప్రాధాన్యత పెరిగిన తర్వాత ఇక జాతీయ జట్టుకు ఆడాలనే లక్ష్యాన్నే పక్కన పెట్టిన వెస్టిండీస్ ప్లేయర్లు... విశ్వవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్లో సత్తా చాటుతున్నారు. ఐపీఎల్లో ఏజట్టును పరిశీలించినా అందులో కీలక పాత్ర పోషిస్తున్నది విండీస్ ప్లేయర్లే. 2012లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రసెల్... తొలి రెండు సీజన్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2014లో కోల్కతా నైట్ రైడర్స్కు మారిన అనంతరం అతడి ఆట మరోస్థాయికి చేరింది. లోయర్ ఆర్డర్లో కీలక పరుగులు చేయడంతో పాటు... ప్రత్యర్థికి అంతుచిక్కని తన బౌలింగ్తో కేకేఆర్ జట్టులో కీలక ప్లేయర్గా ఎదిగాడు. ఫ్రాంచైజీ తరఫున ఆడిన తొలి సీజన్లోనే చాంపియన్గా నిలిచిన రసెల్... అప్పటి నుంచి అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2015 ఐపీఎల్ సీజన్లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో విజృంభించిన ఈ జమైకన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోరీ్న’గా నిలిచాడు. కేకేఆర్ తరఫున 170కి పైగా స్ట్రయిక్ రేట్తో 2400 పైచిలుకు పరుగులు చేసిన రసెల్... 100కు పైగా వికెట్లు సైతం పడగొట్టాడు. ఇప్పుడిక అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికేయడంతో లీగ్లపై మరింత దృష్టి పెట్టడం ఖాయమే! -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
లాస్ వేగస్: మరోసారి భారత చెస్ ప్లేయర్ చేతిలో నార్వే దిగ్గజం, ప్రపంచ మాజీ చాంపియన్, వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్కు ఓటమి ఎదురైంది. ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ టూర్ చెస్ టోర్నీలో భాగంగా భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందతో జరిగిన గేమ్లో కార్ల్సన్ ఓడిపోయాడు. ‘వైట్ గ్రూప్’లో భాగంగా జరిగిన నాలుగో రౌండ్ గేమ్లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లో కార్ల్సన్ను ఓడించాడు. ఓవరాల్గా అన్ని ఫార్మాట్లలో (క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్, ఫ్రీస్టయిల్, ఆన్లైన్) కార్ల్సన్పై ప్రజ్ఞానందకిది ఎనిమిదో విజయం కావడం విశేషం.2022లో ఎయిర్థింగ్స్ మాస్టర్స్, చెస్ఏబల్ మాస్టర్స్ టోర్నీలలో ఒక్కోసారి, క్రిప్టో కప్ (ఆన్లైన్) టోర్నీలో మూడుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద... 2024లో పోలాండ్లో జరిగిన సూపర్బెట్ టోర్నీలో, నార్వే ఓపెన్ టోర్నీలో ఒక్కోసారి విజయం సాధించాడు. ఇటీవల క్రొయేషియాలో జరిగిన సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో క్లాసికల్ వరల్డ్ చాంపియన్, భారత స్టార్ దొమ్మరాజు గుకేశ్ చేతిలోనూ కార్ల్సన్ ఓడిపోయాడు. ఫ్రీస్టయిల్ చెస్ టోర్నీలో ఎనిమిది మంది మేటి ప్లేయర్లు ఉన్న ‘వైట్ గ్రూప్’లో ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. ‘వైట్ గ్రూప్’ నుంచి నొదిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్), సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), అరోనియన్ (అమెరికా) కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. మరోవైపు ఇదే టోర్నీలో ఆడుతున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ‘బ్లాక్ గ్రూప్’లో పోటీపడ్డ అర్జున్ 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ‘బ్లాక్ గ్రూప్’ నుంచి నకముర, హాన్స్ నీమన్, కరువానా (అమెరికా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
సాత్విక్–చిరాగ్ జోడీ పరాజయం
టోక్యో: అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 22–24, 14–21తో ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీ లియాంగ్ కె వెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. ఓవరాల్గా లియాంగ్–వాంగ్ జంట చేతిలో సాత్విక్–చిరాగ్ జోడీకిది ఆరో పరాజయం కావడం గమనార్హం. 44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత జోడీ రెండు గేముల్లోనూ ఆధిక్యంలో నిలిచి ఆ తర్వాత దానిని చేజార్చుకుంది. తొలి గేమ్లో 9–6తో, రెండో గేమ్లో 10–6తో ఆధిక్యంలోకి వెళ్లిన సాత్విక్–చిరాగ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయారు. మరోవైపు పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్... మహిళల సింగిల్స్లో అనుపమ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. దాంతో ఈ టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. ప్రపంచ ఏడో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ లక్ష్య సేన్ 19–21, 11–21తో ఓటమి పాలయ్యాడు. నరోకా చేతిలో లక్ష్య సేన్కిది ఐదో పరాజయం. ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 42వ ర్యాంకర్ అనుపమ 21–13, 11–21, 12–21తో పోరాడి ఓడిపోయింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అనుపమ తొలి గేమ్ను సొంతం చేసుకున్నా... అదే జోరును కొనసాగించలేకపోయింది. -
రెజ్లర్ సుజీత్కు స్వర్ణ పతకం
బుడాపెస్ట్ (హంగేరి): పొలియాక్ ఇమ్రె–వర్గా యానోస్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత్కు తొలి రోజు రెండు పతకాలు లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుజీత్ (65 కేజీలు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... రాహుల్ (57 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో సుజీత్ 5–1 పాయింట్ల తేడాతో అలీ రహీమ్జాదే (అజర్బైజాన్)పై గెలుపొందాడు. అంతకుముందు సెమీఫైనల్లో సుజీత్ 6–1తో వాజ్జెన్ తెవాన్యాన్ (అర్మేనియా)పై, క్వార్టర్ ఫైనల్లో 11–0తో అర్సమెర్జుయెవ్ (ఫ్రాన్స్)పై, తొలి రౌండ్లో 11–0తో ఇస్లాం దుదయెవ్ (అల్బేనియా)పై విజయం సాధించాడు. కాంస్య పతక బౌట్లో రాహుల్ 4–0తో నిక్లాస్ స్టెచెలె (జర్మనీ)పై నెగ్గాడు. అంతకుముందు సెమీఫైనల్లో రాహుల్ 6–7 పాయింట్ల తేడాతో ల్యూక్ జోసెఫ్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
పాకిస్తాన్తో టీ20 సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
శ్రీలంకతో టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న బంగ్లాదేశ్ పురుషుల జట్టు ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాకిస్తాన్తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ క్రమంలో పాక్తో టీ20 సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు లిట్టన్ దాస్ నాయకత్వం వహించనున్నాడు.శ్రీలంకతో తలపడిన జట్టునే ఈ సిరీస్కూ బంగ్లా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఎటువంటి మార్పులు చేయలేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లగా తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్, లిట్టన్ దాస్ కొనసాగనుండగా.. మహ్మద్ నైమ్ రిజర్వ్ ఓపెనర్గా తన స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. అదేవిధంగా మిడిలార్డర్లో తోహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా మెహది హసన్ మిరాజ్, మెహది హసన్ షేక్ ఉన్న సీనియర్లకు చోటు దక్కింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ జూలై 20 నుంచి 24 వరకు జరగనుంది.మొత్తం మూడు మ్యాచ్లు కూడా ఢాకా వేదికగానే జరగనున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్కు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిది వంటి స్టార్ ప్లేయర్లును పీసీబీ దూరం పెట్టింది.పాకిస్తాన్తో టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ జట్టులిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, ఎండీ నయీమ్ షేక్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్ పట్వారీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, షాక్ మహిదీ హసన్, తసుమ్ అహ్మద్, తసుమ్ అహ్మద్, తసుమ్ అహ్మద్, ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్బంగ్లాతో టీ20 సిరీస్కు పాక్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా సల్మాన్ , మొహమ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా ,సుఫ్యాన్ మోకిమ్. -
నాలుగో టెస్టులో రిషబ్ పంత్ ఆడుతాడా? కీలక్ అప్డేట్ ఇచ్చిన కోచ్
ఇంగ్లండ్తో మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు బెకెన్హామ్లో తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. గురువారం తొలి ప్రాక్టీస్ సెషన్లో గిల్ సేన తీవ్రంగా శ్రమించింది. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్కు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పంత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఫీల్డింగ్కు దూరంగా ఉన్న పంత్.. రెండు ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు మాత్రం వచ్చాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు పంత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్డెష్కాట్ అప్డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడని, మాంచెస్టర్ టెస్ట్ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని టెన్డెష్కాట్ థీమా వ్యక్తం చేశాడు."మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టుకు ముందు పంత్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ను మొదలు పెడతాడు. ఆ సమయానికి అతడు కచ్చితంగా ఫిట్నెస్ సాధిస్తాడన్న నమ్మకం ఉంది. అతడు మూడో టెస్టులో చాలా నొప్పితో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత అతడి చేతి వేలి నొప్పి కాస్త తగ్గింది.కానీ ముందుస్తు జాగ్రత్తగా ప్రస్తుతం అతడు ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడు. వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అన్నది ఆఖరిలో మేము నిర్ధారించుకుంటాము. మరోసారి ఇన్నింగ్స్ మధ్యలో కీపర్ను మార్చాల్సిన పరిస్థితి రాకూడదు. పూర్తి ఫిట్నెస్ సాధిస్తే పంత్నే బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండూ చేస్తాడు. రాబోయే రోజుల్లో అతడి ఫిట్నెస్పై కచ్చితంగా అప్డేట్ ఇస్తామని" విలేకరుల సమావేశంలో డెష్కాట్ పేర్కొన్నాడు.చదవండి: ENG vs IND: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్ -
బాక్సింగ్ పోటీల్లో ఉద్రిక్తత... బాక్సర్లు, కోచ్ల డిష్యూం..డిష్యూం
హైదరాబాద్లోని షేక్పేట్లో జరుగుతున్న రాష్ట్రస్దాయి బాక్సింగ్ పోటీల్లో గందరగోళం నెలకొంది. పోటీల సమయంలో బాక్సర్లు, కోచ్లు ఘర్షణకు దిగారు. గురువారం ఇద్దరు బాక్సర్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వివాదం తలెత్తింది.తప్పుడు అంపైరింగ్ కారణంగా ఓడిపోయామని ఓ టీమ్కు చెందిన సభ్యులు మరో వర్గంపై దాడి చేశారు. ఈ గొడవలో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. అనంతరం గోల్కొండ పోలీస్స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.చదవండి: ENG vs IND: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్ -
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్
లార్డ్స్ టెస్టులో హార్ట్ బ్రేకింగ్ ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్తో మరో రసవత్తర పోరుకు టీమిండియా సిద్దమైంది. మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తమ సన్నాహాకాలను ప్రారంభించింది. గురువారం ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం నెట్స్లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు.అర్ష్దీప్కు గాయం..!అయితే ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ చేతి వేలికి గాయమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్లో పేర్కొంది. బంతి చేతి వేలికి తాకడంతో రక్తం కూడా వచ్చినట్లు తెలుస్తోంది.దీంతో అతడి చేతి వేలికి ఫిజియో టేప్ వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్డెష్కాట్ కూడా ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన అర్ష్దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా భారత్ తరపున ఆడలేదు.ఇంగ్లండ్ టూర్కు ఎంపికైనప్పటికి తొలి మూడు టెస్టులకు బెంచ్కే పరిమితమయ్యాడు. ఒకవేళ నాలుగో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే.. అర్ష్దీప్కు తుది జట్టులోకి చోటు దక్కే అవకాశముంది. కానీ ఇంతలోనే అర్ష్దీప్ గాయపడడం టీమ్మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. మరోవైపు లార్డ్స్ టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫిట్నెస్పై ఇంకా క్లారిటీ లేదు.చదవండి: సిరాజ్ 3 సిక్సర్లతో గెలిపిస్తాడని అనుకున్నా!.. జోకులు ఆపండి: అశ్విన్ -
సిరాజ్ 3 సిక్సర్లతో గెలిపిస్తాడని అనుకున్నా!.. జోకులు ఆపండి: అశ్విన్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ఓ సస్పెన్ష్ థ్రిల్లర్ సినిమా ను తలపించింది. ఇరు జట్ల ఆటగాళ్ల తమ విరోచిత పోరాటాలతో అభిమానులకు అసలు సిసలైన టెస్టు క్రికెట్ మజాను అందించారు. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో విజయం ఇంగ్లండ్ జట్టునే వరించింది.ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైనప్పటికి రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లు తమ పోరాటాలతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి నేను వున్నా అంటూ జడేజా బ్యాటింగ్ చేసిన తీరు.. అతడికి టెయిలాండర్లు(జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్) సహకరించిన విధానం గురుంచి ఎంతచెప్పుకొన్నతక్కువే.విజయానికి 22 పరుగులు కావాల్సిన సమయంలో సిరాజ్ క్లీన్ బౌల్డ్ కావడంతో కోట్లమంది భారత అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ఆఖరి వికెట్గా వెనుదిరిగిన సిరాజ్ సైతం మైదానంలోనే భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే లార్డ్స్ టెస్టులో ఓటమిపై టీమిండియా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ ఆశ్విన్ తాజాగా స్పందించాడు. మ్యాచ్ ఆఖరి రోజు ఆట సందర్భంగా తన తండ్రితో జరిగిన సంభాషణ గురించి ఆశ్విన్ వివరించాడు. సిరాజ్ మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను గెలిపిస్తాడని నమ్మకంతో తన తండ్రి ఉన్నట్లు ఆశ్విన్ వెల్లడించాడు."లార్డ్స్ టెస్టులో భారత్ పోరాడి ఓడింది. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం అద్బుతమైన స్పెల్ను బౌల్ చేశాడు. ఓవైపు అలసిన శరీరంతో మైదానంలో పోరడాతూనే స్టోక్స్ తన బౌలింగ్ను కొనసాగించాడు. ఆఖరి రోజు ఆటను మా నాన్న నేను కలిసి టీవీలో వీక్షించాము.సిరాజ్ మూడు సిక్సర్లు బాది మ్యాచ్ను ఫినిష్ చేస్తాడని మా నాన్న నాతో అన్నారు. వెంటనే నేను జోకులు ఆపండి అని ఆయనతో అన్నాను. అదేవిధంగా స్టోక్స్ను కూడా ఆయన ప్రశంసించారు. రెండు ఎండ్స్ నుంచి అద్బుతంగా బౌలింగ్ చేశాడని ఆయన కొనియాడారు.తొలి ఇన్నింగ్స్లో కంటిన్యూగా 9.2 ఓవర్ల స్పెల్ను బౌలింగ్ చేసిన స్టోక్సీ.. రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్ల మ్యాచ్ విన్నింగ్ స్పెల్ను వేశాడు. అతడు 13-140 కిం కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు. ఓవైపు భారత తరపున జడేజా అడ్డుగోడలా నిలిచి తన పోరాటాన్ని కొనసాగిస్తుంటే.. మరోవైపు స్టోక్స్ కూడా ఇంగ్లండ్ తరపున అదే పనిచేశాడు" అని తన యూట్యూబ్ ఛానల్లో జడ్డూ పేర్కొన్నాడు.చదవండి: అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’లు అందుకుంది వీరే -
సచిన్కు చోటు లేదు!.. ఈ లిస్టులో టాప్-5లో ఉన్న క్రికెటర్లు వీరే!
టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య టెస్టు సిరీస్.. క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలైన సంప్రదాయ ఫార్మాట్ మజాను అందిస్తోంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికి మూడు పూర్తయ్యాయి.అయితే, ఈ మూడు టెస్టులు ఆఖరిదైన ఐదో రోజు వరకు ఉత్కంఠగా సాగడం ఒక విశేషమైతే.. అన్నింటిలోనూ ఫలితం కూడా తేలడం మరో విశేషం. లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మ్యాచ్ను టీమిండియా నుంచి లాగేసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఇక ఎడ్జ్బాస్టన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా సారథి శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)లతో అదరగొట్టి.. భారత్కు ఏకపక్ష విజయం అందించాడు. ఎడ్జ్బాస్టన్లో తొలిసారి టీమిండియా గెలుపు జెండా ఎగరవేయడంలో కీలక పాత్ర పోషించి ఈ అవార్డు అందుకున్నాడు.అయితే, లార్డ్స్ టెస్టులో మాత్రం ఆతిథ్య జట్టు మరోసారి పైచేయి సాధించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇటు బ్యాట్తో.. అటు బంతితో రాణించి.. జట్టును గెలిపించుకున్నాడు. తద్వారా 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఇలా మూడు టెస్టుల్లో ఒక్కొక్కరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు.మరి టెస్టు ఫార్మాట్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న క్రికెటర్ల జాబితాలో టాప్-5లో ఉన్నది ఎవరో తెలుసా?!.. సంప్రదాయ క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడి (15921)గా ఉన్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ మాత్రం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.జాక్వెస్ కలిస్సౌతాఫ్రికా లెజెండరీ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ టెస్టుల్లో అత్యధికంగా 23 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తన కెరీర్లో 166 టెస్టు మ్యాచ్లు ఆడిన కలిస్.. 13289 పరుగులు చేశాడు. ఇందులో 45 శతకాలు, రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.ముత్తయ్య మురళీధరన్శ్రీలంక స్పిన్ దిగ్గజం టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్ల వీరుడు (800). అతడు తన కెరీర్లో 133 టెస్టులాడి 19 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.వసీం అక్రంపాకిస్తాన్ ఐకానిక్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తన కెరీర్లో 104 టెస్టులు ఆడి.. 414 వికెట్లు కూల్చాడు. తన నిలకడైన బౌలింగ్తో ఈ స్వింగ్ సుల్తాన్ పదిహేడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.షేన్ వార్న్ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేర్ వార్న్. అంతర్జాతీయ క్రికెట్లో 145 టెస్టులు ఆడిన వార్న్.. 708 వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలోనూ పదిహేడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఉన్నాయి.కుమార్ సంగక్కరశ్రీలంక మాజీ కెప్టెన్, స్టైలిస్ లెఫ్టాండ్ బ్యాటర్ కుమార్ సంగక్కర తన కెరీర్లో 134 టెస్టు మ్యాచ్లు ఆడాడు. నిలకడైన ప్రదర్శనలతో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ప్రధాన పిల్లర్గా పేరొందిన సంగక్కర పదహారు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సంగక్కర టెస్టుల్లో 38 సెంచరీలు, 11 డబుల్ సెంచరీల సాయంతో 12400 పరుగులు సాధించాడు. అ న్న ట్లు చెప్పనే లేదు కదూ! సచిన్ తన కెరీర్లో పద్నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. చదవండి: భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు -
బీసీసీఐ పెన్షన్.. సచిన్, యువీకి ఎంతంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రస్తుతం అమలు చేస్తున్న సెంట్రల్ కాంట్రాక్టుల గురించి అడిగితే క్రికెట్ లవర్స్ ఈజీగా చెప్పేస్తారు. ఎన్ని గ్రేడులు ఉన్నాయ్, ఏ గ్రేడ్కు ఎంత జీతం వస్తుందనే వివరాలు సగటు క్రికెట్ అభిమానులకు కరతలామలకం. కానీ పెన్షన్ గురించి అడిగి చూడండి.. చాలా తక్కువ మంది మాత్రమే కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతారు. రిటైర్ అయిన మాజీ ఆటగాళ్లు, అంపైర్లకు బీసీసీఐ ప్రతినెలా పెన్షన్ ఇస్తుంటుంది.టీమిండియాకు అందించిన సేవలను గుర్తించి వారికి కృతజ్ఞత తెలిపేందుకు, రిటైర్ అయిన తర్వాత అండగా నిలిచేందుకు పెన్షన్ పథకాన్ని బీసీసీఐ (BCCI) అమలు చేస్తోంది. 2022, జూన్లో ఈ పథకాన్ని సవరించడంతో మాజీ ఆటగాళ్లు, అంపైర్లకు పెన్షన్ ద్వారా వచ్చే మొత్తం గణనీయంగా పెరిగింది. ఉన్నత శ్రేణి, దిగువ శ్రేణితో పాటు ఫస్ట్క్లాస్ మాజీ ఆటగాళ్లకు ఇచ్చే పెన్షన్లో కూడా పెరుగుదల చోటు చేసుకుంది.అదే కొలమానంటీమిండియా (Team India) తరపు ఎన్ని మ్యాచ్లు ఆడారు, ఎన్నేళ్ల పాటు జట్టులో ఉన్నారనే అంశాలతో పాటు టెస్ట్ మ్యాచ్ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడా లేదా అనే దాని ఆధారంగా మూడు కేటగిరీలుగా బీసీసీఐ విభజించింది. ఉన్నత శ్రేణిలో ఉన్న క్రికెటర్లకు నెలకు రూ. 70 వేలు, దిగువ శ్రేణిలోని వారికి రూ. 60 వేలు, ఫస్ట్క్లాస్ మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేలు పెన్షన్ అందిస్తోంది.900 మందికి పెన్షన్సవరించిన పెన్షన్ పథకం ప్రస్తుతం దాదాపు 900 మంది రిటైర్డ్ క్రికెటర్లు, అంపైర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. 2022 సవరణ తర్వాత వారిలో దాదాపు 75% మంది పెన్షన్లలో 100% పెరుగుదల కనిపించింది. ఉన్నత శ్రేణి పెన్షన్ అందుకుంటున్న వారిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు ఉన్నారు. అంటే సచిన్కు బీసీసీఐ నుంచి ప్రతినెల రూ. 70 వేలు పెన్షన్ అందుతోంది. తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడిన యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్లు దిగువ శ్రేణిలో ఉన్నారు. వీరికి నెలకు రూ.60 వేలు పెన్షన్ వస్తోంది. దేశవాళీ క్రికెట్ ఎక్కువ ఆడిన వినోద్ కాంబ్లి (Vinod Kambli) ఫస్ట్-క్లాస్ కేటగిరీలో నెలకు రూ.30 వేలు పెన్షన్ తీసుకుంటున్నాడు.చదవండి: బీసీసీఐ నుంచి వచ్చే నిధులు మళ్లించారువిలువైన గుర్తింపుసంపన్నులైన సచిన్, యువీ లాంటి స్టార్ ఆటగాళ్లకు పెన్షన్ అవసరమే లేదు. రిటైర్ అయిన తర్వాత కాంట్రాక్టులు, ఎండార్స్మెంట్ల ద్వారా ఇప్పటికీ కోట్లు సంపాదిస్తున్నారు. అయితే బీసీసీఐ నుంచి పెన్షన్ తీసుకోవడం వారు గౌరవంగా భావిస్తున్నారు. తమ సేవలకు దక్కిన విలువైన గుర్తింపుగా దీన్ని పరిగణిస్తున్నారు. క్రీడా జీవితానికి ముగింపు పలికిన ఎందరో ఆటగాళ్లకు మలి దశలో బీసీసీఐ ఇచ్చే పెన్షన్ ఆదరువుగా నిలుస్తోంది. చివరి రోజుల్లో గౌరప్రదమైన జీవితం గడిపేందుకు దోహదం చేస్తోంది. -
లార్డ్స్లో టర్నింగ్ పాయింట్ అదే.. లేదంటే విజయం భారత్దే: రహానే
మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆతిథ్య ఇంగ్లండ్ భావిస్తుంటే.. టీమిండియా మాత్రం ప్రత్యర్దిని మట్టికర్పించి సిరీస్ను సమం చేయాలని కసితో ఉండి.లార్డ్స్ టెస్టులో అనుహ్యంగా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైన గిల్ సేన, నాలుగో టెస్టులో తమ తప్పిదాలను సరిదిద్దుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మెనెజ్మెంట్కు మాజీ కెప్టెన్ అజింక్య రహానే కీలక సూచన చేశాడు.మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు అదనపు ఫాస్ట్ బౌలర్తో బరిలోకి దిగాలని రహానే అభిప్రాయపడ్డాడు. లార్డ్స్ టెస్టులో టీమిండియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. నితీశ్ కుమార్ పేస్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఉన్నాడు."లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓడిపోవడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే తొలి ఇన్నింగ్స్లో మాత్రం భారీ స్కోర్ను సాధించే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. రాబోయే మ్యాచ్లో భారత్ అదనంగా ఓ ఫాస్ట్ బౌలర్ను ఆడిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓ టెస్టు మ్యాచ్ను గెలవాలంటే ప్రత్యర్ధి జట్టులోని 20 వికెట్లను పడగొట్టాలి. ప్రస్తుతం భారత బ్యాటింగ్ యూనిట్ మెరుగ్గానే రాణిస్తున్నారు. కాబట్టి ఎక్స్ట్రా ఓ బౌలర్ జట్టులో ఉండాలన్నది నా అభిప్రాయం. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో కూడా 40 పరుగులకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో కన్పించింది. కానీ ఆ సమయంలో కరుణ్ నాయర్ ఎల్బీ రూప్లో ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆ వికెట్తో మ్యాచ్పై ఇంగ్లండ్ పట్టుబిగించింది. ప్రత్యర్ధి బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఎలాగైనా గెలవాలన్న కసి వారిలో కన్పించింది. ఫీల్డింగ్లో కూడా వందకు వంద శాతం ఎఫక్ట్ పెట్టారు" అని రహానే తన యూట్యూబ్ ఛానలో పేర్కొన్నారు.చదవండి: ఫిట్గా లేకుంటే.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
ఫిట్గా లేకుంటే.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకు: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ (Dilip Vengarkar) ఘాటు విమర్శలు చేశాడు. ఫిట్గా లేనపుడు ఒక్క మ్యాచ్ కూడా ఆడవద్దని.. అయినా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఇలాంటి వాళ్లకు ఎందుకు అనుమతినిస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించాడు.పనిభారం తగ్గించాలని..కాగా ఇంగ్లండ్తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderosn- Tendukar Trophy)లో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. ఇప్పటికి మూడు మ్యాచ్లు ముగియగా ఇంగ్లండ్ రెండు, భారత్ ఒకటి గెలిచింది. ఇదిలా ఉంటే.. భారత ప్రధాన పేసర్ బుమ్రా ఈ సిరీస్లో కేవలం మూడు టెస్టులే ఆడతాడని యాజమాన్యం ముందుగానే ప్రకటించింది. ఫిట్నెస్ సమస్యల ప్రమాదం పొంచి ఉన్న దృష్ట్యా అతడిపై పనిభారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.దిలీప్ వెంగ్సర్కార్ ఫైర్అందుకు తగ్గట్లుగానే తొలి టెస్టు ఆడిన బుమ్రాకు.. రెండో టెస్టు నుంచి విశ్రాంతినిచ్చారు. తిరిగి లార్డ్స్లో మూడో టెస్టు ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. తదుపరి మాంచెస్టర్ మ్యాచ్లో ఆడతాడా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దిలీప్ వెంగ్సర్కార్ బుమ్రా, టీమిండియా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.‘‘ఒకవేళ టీమిండియాకు ఆడాలని అనుకుంటే ప్రతి ఒక్క ఆటగాడు తప్పక ఫిట్గా ఉండాలి. ఫిట్గా లేకుంటే అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదు. తొలి, రెండో టెస్టుకు మధ్య 7- 8 ఎనిమిది రోజుల విరామం వచ్చింది. అయినా సరే అతడు రెండో టెస్టు ఆడలేదు.గంభీర్, అగార్కర్లకు నచ్చుతుందేమో గానీఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. అగార్కర్, గంభీర్లు ఇలాంటివి ఆమోదిస్తారేమో కానీ.. ఎక్కడా ఇలా జరగదు’’ అంటూ దిలీప్ వెంగ్సర్కార్ రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.టెస్టు మ్యాచ్లలో బౌలర్ల ఎంపిక విషయంలో తను ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్న వెంగ్సర్కార్.. ఫిట్గా ఉన్న ఆటగాళ్లు ఎవరైనా సరే జట్టు ప్రయోజనాల కోసం సిరీస్లో అన్ని మ్యాచ్లు ఆడాలని సూచించాడు. అదే సమయంలో బుమ్రా వరల్డ్క్లాస్ బౌలర్.. ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా అతడికి ఉందని ప్రశంసించాడు. అయితే, ఒక్కసారి జట్టుతో చేరిన తర్వాత వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడతా అంటే కుదరదు అంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా టెస్టు సిరీస్లో టీమిండియాపై ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)కు మాంచెస్టర్ వేదిక.చదవండి: భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు -
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో అనూహ్య ఓటమిచవిచూసిన భారత జట్టు.. మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 2-2తో సమం చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టులో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడు.వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని బీసీసీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును ఎంపిక చేసిన సమయంలోనే స్పష్టం చేశారు. దీంతో తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు.ఆ తర్వాత లార్డ్స్ టెస్టులో ఆడి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో బుమ్రా నాలుగో టెస్టులో ఆడుతాడా లేదా విశ్రాంతి తీసుకుంటాడా అన్నదానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది.నాలుగో టెస్టుకు బుమ్రా సై..లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టుకు మాంచెస్టర్ టెస్టుకు దాదాపు ఎనిమిది రోజుల విరామం లభించింది. రేవ్స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. బుమ్రాకు తగినంత విశ్రాంతి దొరకవడంతో నాలుగో టెస్టులో ఆడించాలని టీమ్ మెనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.అంతేకాకుండా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే నాలుగో టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలవాల్సిందే. అంతేకాకుండా ఈ మ్యాచ్ ఫలితం డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27 పాయింట్ల పట్టికపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా కూడా నాలుగో టెస్టులో ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. బుమ్రా తన కెరీర్లో ఇప్పటివరకు మాంచెస్టర్లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.ఇంగ్లండ్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గణాంకాలు (టెస్టులు)మ్యాచ్లు: 11ఇన్నింగ్స్: 21మెయిడెన్స్: 102వికెట్లు: 49ఉత్తమ బౌలింగ్ ఇన్నింగ్స్: 5/64ఉత్తమ బౌలింగ్ మ్యాచ్: 9/110సగటు: 24.97స్ట్రైక్ రేట్: 54.35-వికెట్ల హాల్స్: 4చదవండి: బంగ్లా ప్లేయర్ సరికొత్త చరిత్ర.. భజ్జీ ఆల్టైమ్ రికార్డు బద్దలు -
బంగ్లా ప్లేయర్ సరికొత్త చరిత్ర.. భజ్జీ ఆల్టైమ్ రికార్డు బద్దలు
బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మెహదీ హసన్ (Mahedi Hasan) అరుదైన ఘనత సాధించాడు. కొలంబోలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. తద్వారా టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును మెహదీ హసన్ షేక్ బద్దలు కొట్టాడు. శ్రీలంకతో మూడో టీ20 సందర్భంగా ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఈ ఫీట్ నమోదు చేశాడు.రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడే నిమిత్తం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. ఆతిథ్య లంక 1-0తో గెలిచింది. ఇక వన్డే సిరీస్ను కూడా 2-1తో సొంతం చేసుకుంది.శ్రీలంకకు చేదు అనుభవంఅయితే, టీ20 సిరీస్లో మాత్రం శ్రీలంకకు చేదు అనుభవం మిగిలింది. తొలి మ్యాచ్లో గెలిచిన చరిత్ అసలంక బృందం.. రెండో టీ20లో ఓడింది. తాజాగా కొలంబో వేదికగా జరిగిన మూడో మ్యాచ్లోనూ ఓడి సిరీస్ను చేజార్చుకుంది.ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన ఆఖరి పోరులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.ఓపెనర్ నిసాంక (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... షనక (25 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) విలువైన పరుగులు చేశాడు. కెప్టెన్ అసలంక (3), దినేశ్ చండీమల్ (4), కుశాల్ పెరీరా (0), కుశాల్ మెండిస్ (6) విఫలమయ్యారు.బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 4 ఒవర్లలో కేవలం 11 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 133 పరుగులు చేసింది.తన్జీద్ హసన్ (47 బంతుల్లో 73 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా... కెప్టెన్ లిటన్ దాస్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్), తౌహిద్ హృదయ్ (27 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అతడికి సహకరించారు. లంక బౌలర్లలో నువాన్ తుషార, కమిందు మెండిస్ చెరో వికెట్ పడగొట్టారు. మెహదీ హసన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, లిటన్ దాస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.మెహదీ హసన్ సరికొత్త చరిత్రకాగా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం పదకొండు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చిన స్పిన్ బౌలర్ మెహదీ హసన్.. కొలంబోలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇంత వరకు ఈ రికార్డు టీమిండియా మాజీ స్టార్ హర్భజన్ సింగ్ పేరిట ఉండేది. 2012 వరల్డ్కప్ సందర్భంగా ఇంగ్లండ్తో మ్యాచ్లో భజ్జీ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 12 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.కొలంబోలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పర్యాటక జట్టు బౌలర్లు👉మెహదీ హసన్ (బంగ్లాదేశ్)- శ్రీలంక మీద 4-1-11-4, జూలై 2025👉హర్భజన్ సింగ్ (ఇండియా)- ఇంగ్లండ్ మీద 4-2-12-4, సెప్టెంబరు 2012👉జోష్ హాజిల్వుడ్ (ఆస్ట్రేలియా)- శ్రీలంక మీద 4-0-16-4, జూన్ 2022 👉జో డెన్లీ (ఇంగ్లండ్)- శ్రీలంక మీద 4-0-19-4 , అక్టోబరు 2018👉ముస్తాఫిజుర్ రహ్మాన్ (బంగ్లాదేశ్)- శ్రీలంక మీద 3-0-21-4, ఏప్రిల్ 2017👉భువనేశ్వర్ కుమార్ (ఇండియా)- శ్రీలంక మీద 3.3-0-22-4, జూలై 2021👉శార్దూల్ ఠాకూర్(ఇండియా)- శ్రీలంక మీద 4-0-27-4, మార్చి 2018.చదవండి: ‘బుమ్రా ఆడనప్పుడే.. టీమిండియా ఎక్కువ మ్యాచ్లు గెలిచింది’ -
రిషబ్ పంత్లా మారిన 'లేడీ సెహ్వాగ్'
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ దీప్తి శర్మను అభిమానులు "లేడీ సెహ్వాగ్" అని పిలుచుకుంటారు. దీప్తి సెహ్వాగ్లా భయం, బెరుకు లేకుండా డాషింగ్గా షాట్లు ఆడటమే ఇందుకు కారణం. లేడీ సెహ్వాగ్ బిరుదుకు దీప్తి శర్మ తాజాగా మరోసారి సార్దకత చేకూర్చింది. నిన్న (జులై 16) ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో దీప్తి మెరుపు ఇన్నింగ్స్ (64 బంతుల్లో 62; 3 ఫోర్లు, సిక్స్) ఆడి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ ఇన్నింగ్స్లో దీప్తి కొట్టిన ఏకైక సిక్సర్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ షాట్ను దీప్తి రిషబ్ పంత్లా ఆడటం వల్ల అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. దీప్తి పంత్ ట్రేడ్ మార్క్ షాట్ అయిన "ఒంటి చేత్తో సిక్సర్" విజయవంతంగా పూర్తి చేయడంలో సఫలమైంది. DEEPTI SHARMA ON ONE-HANDED SIX:"I play these shots in practice - I picked that up from Rishabh Pant". pic.twitter.com/Y5u2eYdZ0i— Johns. (@CricCrazyJohns) July 17, 2025మ్యాచ్ అనంతరం ఈ షాట్ గురించి దీప్తి మాట్లాడుతూ.. నేను ఇలాంటి షాట్లను నిత్యం ప్రాక్టీస్ చేస్తుంటాను. రిషబ్ పంత్ను చూసినప్పటి నుంచే ఇలాంటి షాట్లను ఆడటం మొదలుపెట్టానని అంది.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగుతోంది. ఈ పర్యటనలో ఇదివరకే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. సోఫీ డంక్లీ (83), డేవిడ్సన్ రిచర్డ్స్ (53) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలో రెండు వికెట్లు తీయగా.. అమన్జోత్ కౌర్, శ్రీ చరణి చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆది నుంచే నిలకడగా ఆడుతూ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది. టాపార్డర్ బ్యాటర్లలో ప్రతీక రావల్ (36), స్మృతి మంధన (28), హర్లీన్ డియోల్ (27), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17), జెమీమా రోడ్రిగెజ్ (48) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (62 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో భారత్ను గెలిపించింది. -
బీసీసీఐ నుంచి వచ్చే నిధులు మళ్లించారు.. కేటీఆర్, కవితపై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని కోరింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించింది.తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిశారు. ఈ సందర్భంగా.. హెచ్సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని టీసీఏ ఆరోపించింది. జగన్మోహన్రావుతో పాటు మరికొందరు అక్రమార్కులు కూడా ఉన్నారని.. వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్లపై కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది.కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం‘‘HCA ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్మోహన్ రావు రావడం వెనక కేటీఆర్, కవిత హస్తం ఉంది. క్రికెట్ కి సంబంధం లేని ఈ ఇద్దరూ.. జగన్మోహన్ వెంట ఉండి నడిపించారు. HCA ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు గెలవగానే.. నా విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం అని చెప్పాడు. అతడి వెనక ఉన్న వాళ్ళ పాత్ర కూడా నిగ్గు తేల్చాలి అని CID కి ఫిర్యాదు చేశాం. HCA లో మరికొందరు అక్రమార్కులు ఉన్నారు.. వీళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరాం’’ అని ఫిర్యాదు చేసిన సందర్భంగా టీసీఏ పేర్కొంది.బీసీసీఐ నుంచి వచ్చే నిధులు మళ్లించారుఇక టీసీఏ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ నిధులను ఎవరు వాడుకున్నారు. అక్రమాలకు పాల్పడిన జగన్మోహన్ రావుకు పడిన శిక్ష రాజకీయ నాయకులకూ పడాలి. జగన్మోహన్ రావు గెలిచిన తర్వాత ఎవరికి అంకితం చేశాడో ఆ వీడియోలు సీఐడీ కి పిర్యాదు చేశాం’’ అని తెలిపారు. కాగా బీసీసీఐ నుంచి వచ్చే కోట్లాది రూపాయల నిధులను మళ్లించారని ఆరోపించిన టీసీఏ.. మనీలాండరింగ్ కోణంలో విచారణ జరపాలని ఈడీకి కూడా ఫిర్యాదు చేసింది.కాగా.. హెచ్సీఏ- ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్ హైదరాబాద్ వివాదం నేపథ్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రావు అక్రమ పద్ధతిలో హెచ్సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరీ కోర్టు నిందితులకు పన్నెండు రోజుల రిమాండ్ విధించింది. -
టీమిండియా స్టార్ క్రికెటర్ మాజీ భార్య, కూతురిపై కేసు నమోదు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహా, ఆమె కుమార్తె (మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం) అర్షి జహాపై హత్యాయత్నం కేసు నమోదైనట్లు తెలుస్తుంది. వివాదాస్పద స్థలం విషయంలో హసీన్, అర్షి తనపై దాడి చేశారని దలియా ఖాతూన్ అనే మహిళ పశ్చిమ బెంగాల్లోని బిర్భూమ్ జిల్లాలో గల సూరి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో హసీన్, అర్షిపై BNSలోని 126(2), 115(2), 117(2), 109, 351(3), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హసీన్, అర్షి దలియా ఖాతూన్పై దాడి చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్లోని సూరి పట్టణం వార్డ్ నంబర్ 5లో హసీన్ జహా, అమె కుమార్తె అర్షి జహా నివాసముంటున్నారు. ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇటీవల వారు ఇల్లు నిర్మించడం మొదలుపెట్టారు. ఈ స్థలం అర్షి పేరున రిజిస్టర్ అయ్యిందని వారంటున్నారు. An attempt to murder FIR under BNS sections 126(2), 115(2), 117(2), 109, 351(3) and 3(5) has lodged against Hasin Jahan, the estranged wife of Mohammed Shami and Arshi Jahan, her daughter from her first marriage by her neighbour Dalia Khatun in Suri town of Birbhum district in… pic.twitter.com/2dnqXUKMdK— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) July 16, 2025అయితే ఆ స్థలం తమదని అటు పక్క నివాసముంటున్న దలియా ఖాతూన్ ముందుకు వచ్చింది. హసీన్ మొదలుపెట్టిన కట్టడాన్ని ఆమె ఆపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఖాతూన్పై హసీన్, అర్షి దాడికి దిగినట్లు తెలుస్తుంది.కాగా, షమీకి ఇటీవలే కలకత్తా హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. హసీన్కు రూ. 4 లక్షల భరణం ఇవ్వాలంటూ షమీని ఆదేశించింది. షమీ ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈమేరకు తీర్పును వెలువరించింది. ఇందులో హసీన్కు రూ. 1.5 లక్షలు, షమీ ద్వారా కలిగిన కూతురు ఐరాకు రూ. 2.5 లక్షలు అని కోర్టు తెలిపింది. -
‘బుమ్రా ఆడినపుడే.. టీమిండియా ఓడిపోతుంది’
ఇంగ్లండ్తో మూడో టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. మాంచెస్టర్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్లో జరిగిన ఉత్కంఠ పోరులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని.. సిరీస్ను 2-2తో సమం చేయాలని భావిస్తోంది. అయితే, ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందే బుమ్రా పనిభారం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ పేస్దళ నాయకుడిపై భారాన్ని తగ్గించేందుకు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో.. అతడు కేవలం మూడింటిలో మాత్రమే ఆడతాడని వీరు స్పష్టం చేశారు.నో క్లారిటీఇందుకు తగ్గట్లుగానే లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్బాస్టన్ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. మళ్లీ లార్డ్స్ టెస్టుతో తిరిగి వచ్చిన ఈ రైటార్మ్ పేసర్.. తదుపరి మాంచెస్టర్లో ఆడతాడా? లేదా? అన్న అంశంపై మేనేజ్మెంట్ ఇంతవరకు స్పష్టతనివ్వలేదు.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ బుమ్రాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడొక ప్రపంచస్థాయి బౌలర్ అంటూనే.. బుమ్రా ఆడిన మ్యాచ్లలో టీమిండియాకు ఎక్కువసార్లు ఓటమే ఎదురైందని పేర్కొన్నాడు. అతడు లేనప్పుడే చిరస్మరణీయ విజయాలు అందుకుందని విమర్శించాడు.టీమిండియా గెలిస్తే ఐదో టెస్టు ఆడతాడా?‘‘ఇంగ్లండ్తో ఐదు టెస్టుల్లో బుమ్రా కేవలం మూడే ఆడతాడని కోచ్ గౌతం గంభీర్ స్వయంగా చెప్పాడు. అతడు ఇప్పటికి రెండు మ్యాచ్లు ఆడాడు. సిరీస్లో ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక్క టెస్టు మాత్రమే అతడు ఆడతాడన్నది తెలిసిందే.ఒకవేళ మేనేజ్మెంట్ తమ మాటకు కట్టుబడి ఉంటే.. అతడిని నాలుగో టెస్టులో ఆడిస్తుందా? లేదంటే.. సిరీస్ ప్రాధాన్యత దృష్ట్యా ఐదో టెస్టులోనూ ఆడించాలని కోరుకుంటుందా?.. ఒకవేళ అతడు తదుపరి ఓల్డ్ ట్రఫోర్ట్ టెస్టులో ఆడి.. టీమిండియా గెలిస్తే అప్పుడు 2-2తో సిరీస్ సమం అవుతుంది.కాబట్టి సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మకమైన ఐదో టెస్టులో అతడిని ఆడించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలా కాకుండా నాలుగో టెస్టులో టీమిండియా ఓడి 3-1తో సిరీస్ కోల్పోతే.. ఇక ఆఖరి టెస్టుకు అతడి అవసరం ఉండదని అనుకోవచ్చు.బుమ్రా జట్టులోనే ఉంటేనే ఓటమి?!ఇదొక అసాధారణ అంశం. ఏదేమైనా.. అతడు ఆడిన మ్యాచ్లలో టీమిండియా గెలిచిన సందర్భాల కంటే.. ఓడిన దాఖలాలే ఎక్కువని అంటూ ఉంటారు. అతడొక వరల్డ్క్లాస్ బౌలర్. అతడి బౌలింగ్ శైలి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఉత్తమ బౌలరే అయినా.. అతడి విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి’’ అంటూ లాయిడ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.కాగా 2018లో బుమ్రా టెస్టుల్లో అరంగేట్రం చేసి.. ఇప్పటికి 47 మ్యాచ్లు ఆడాడు. ఇందులో టీమిండియా 20 గెలవగా.. 23 మ్యాచ్లలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో తొలి టెస్టులో బుమ్రా మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. కానీ ఇందులో గిల్ సేన ఓటమిపాలైంది. ఇక రెండో టెస్టుకు అతడు దూరంగా ఉండగా ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లండ్ను ఏకంగా 336 పరుగుల తేడాతో ఓడించి ఈ వేదికపై తొలిసారి గెలుపు రుచిచూసింది.ఇక మూడో టెస్టుతో తిరిగి వచ్చిన బుమ్రా మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శన (మొత్తం ఏడు వికెట్లు)తో సత్తా చాటాడు. కానీ ఈ మ్యాచ్లో టీమిండియా 22 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్టు (జూలై 23-27) జరుగనుంది.చదవండి: జట్టు మారనున్న ఆర్సీబీ స్టార్ జితేశ్ శర్మ -
అనుమతి లేకుండానే విజయోత్సవాలు
బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయం తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ నెట్వర్క్స్ లిమిటెడ్తోపాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) కారణమని కర్ణాటక ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముందస్తుగా అనుమతి తీసుకోకుండానే విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు కర్ణాటక సర్కార్ స్పష్టంచేసింది. ఈ ర్యాలీ నిర్వహించాలని ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్ఏ సంస్థ, కేఎస్సీఏ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తప్పు పట్టింది. పోలీసులకు ముందుగా సమా చారం ఇవ్వలేదని, చట్టప్రకారం తీసుకోవాల్సి అనుమతులేవీ తీసుకోలేదని వెల్లడించింది. జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, మరో 30 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ గెలిస్తే బెంగళూరులో విజయో త్సవాలు నిర్వహిస్తామంటూ మ్యాచ్కు కొన్ని గంటల ముందు కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని, అధికారికంగా అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆ సమాచారంలో పూర్తి వివరాలు లేకపోవడంతో విజయోత్సవాలకు పోలీసులు అంగీకరించలేదని తెలిపింది. కేవలం సమాచారం ఇవ్వడాన్ని అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అయినప్పటికీ జూన్ 4న ఆర్సీబీ టీమ్ యాజమన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియం ద్వారా విక్టరీ పరేడ్ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేసిందని వెల్లడించింది. సోషల్ మీడియాలో మొదటి పోస్టు ఉదయం 7.01 గంటలకు, చివరి పోస్టు మధ్యాహ్నం 3.14 గంటలకు పెట్టినట్లు తెలిపింది. ఆన్లైన్లో ఉచిత పాసులు అందుబాటులో ఉన్నాయని యాజమాన్యం చెప్పగా, అప్పటికే జనం స్టేడియం వద్దకు చేరుకున్నారని వివ రించింది. మొత్తానికి ఆర్సీబీ యాజమాన్యం, డీఎన్ఏ నెట్వర్క్స్ లిమిటెడ్, కేఎస్సీఏ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రభు త్వం స్పష్టంచేసింది. ఈ దుర్ఘటనకు వారే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొంది. CAT says IPL Team #RCB is prima facie responsible for Bengaluru Stampede which claimed 11 lives.Police is not magician, can't be expected manage huge crowds if not given sufficient time to make arrangements, the Tribunal observed.@RCBTweets @KarnatakaCops #BengaluruStampede pic.twitter.com/2QdmvohATs— Live Law (@LiveLawIndia) July 1, 2025ఆర్సీబీ సేవకులుగా పోలీసులు బెంగళూరు తొక్కిసలాట ఘటనలో ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్తోపాటు మరికొందరు పోలీసులను సస్పెండ్ చేయడాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంది. పోలీసులు ఆర్సీబీ టీమ్కు సేవకులుగా వ్యవహరించారని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆక్షేపించింది. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయకుండానే ఆర్సీబీ విజయోత్సవాల కోసం ఏర్పాటు చేశారని ఆరోపించింది. అనుమతి ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఆర్సీబీ సేవలో తరించారని విమర్శించింది. 🚨 Karnataka Govt blames RCB for Bengaluru Stampede🚨Govt to High Court—No permission was taken for RCB’s victory paradePublic was invited without police consultationOver 3 lakh people gathered near Chinnaswamy Stadium11 people died, 50+ injured in the chaos… pic.twitter.com/KQTFFJxoWx— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) July 17, 2025 -
జట్టు మారనున్న ఆర్సీబీ స్టార్ జితేశ్ శర్మ
తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును (ఆర్సీబీ) ఛాంపియన్గా నిలపడంతో కీలకపాత్ర పోషించిన జితేశ్ శర్మ.. రానున్న దేశవాలీ సీజన్ కోసం జట్టు మారనున్నాడు. అరంగేట్రం నుంచి గత సీజన్ వరకు విదర్భకు ప్రాతినిథ్యం వహించిన జితేశ్.. వచ్చే సీజన్ నుంచి బరోడాకు ఆడనున్నాడు. గత రంజీ సీజన్లో (2024-25) మొత్తం బెంచ్కే పరిమితం కావడంతో జితేశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. జట్టు మారే విషయంలో జితేశ్ను బరోడా కెప్టెన్, ఆర్సీబీ సహచరుడు కృనాల్ పాండ్యా ప్రభావితం చేసినట్లు తెలుస్తుంది.విదర్భ తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమైన జితేశ్.. రెడ్ బాల్ ఫార్మాట్లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఇందుకు అతనికి సరైన అవకాశాలు కావాలి. అయితే విదర్భలో ఇది జరగడం లేదు. అందుకే అతను బరోడాకు మారాలని నిర్ణయించుకున్నాడు. విదర్భలో జితేశ్కు బదులు అక్షయ్ వాద్కర్కు అవకాశాలు ఎక్కువగా దొరికేవి.రైట్ హ్యాండ్ వికెట్కీపర్ బ్యాటర్ అయిన జితేశ్.. 2015-16 సీజన్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసినప్పటికీ ఇప్పటివరకు కేవలం 18 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇందులోనూ అతని ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ మ్యాచ్ల్లో జితేశ్ 24.48 సగటున కేవలం 661 పరుగులు మాత్రమే చేశాడు.జితేశ్ పరిమిత ఓవర్ల కెరీర్ (దేశవాలీ) విషయానికొస్తే.. అతను ఇప్పటివరకు 56 లిస్ట్-ఏ మ్యాచ్లు, 141 టీ20లు ఆడాడు. ఇందులో 3 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 4419 పరుగులు చేశాడు. 31 ఏళ్ల జితేశ్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో అత్యుత్తమంగా రాణించాడు. ఈ సీజన్లో అతను 176.35 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించి, ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.మరో ఆర్సీబీ ఆటగాడు కూడా..!దేశవాలీ క్రికెట్లో మరో ఆర్సీబీ ఆటగాడు కూడా జట్టు మారనున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో బెంచ్కే పరిమితమైన స్వప్నిల్ సింగ్.. రానున్న దేశవాలీ సీజన్ కోసం ఉత్తరాఖండ్ నుంచి త్రిపురకు మారనున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన స్వప్నిల్.. ఉత్తరాఖండ్ తరఫున 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 18 వికెట్లు తీశాడు. -
భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన (Smriti Mandhana)- ప్రతీకా రావల్ (Pratika Rawal) సరికొత్త చరిత్ర సృష్టించారు. మహిళల వన్డే క్రికెట్లో అత్యుత్తమ సగటుతో వెయ్యి పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. ఇంత వరకు ఏ జంటకు సాధ్యం కాని విధంగా 84.66 సగటుతో 1000 రన్స్ రాబట్టిన జోడీగా ప్రపంచ రికార్డు సాధించారు.భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ (IND vs ENG ODI's)లు ఆడుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ను 3-2తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన హర్మన్ సేన.. తాజాగా వన్డే సిరీస్లోనూ శుభారంభం చేసింది.తొలి వన్డేలో భారత్ విజయంసౌతాంప్టన్ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ మహిళా జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. 1-0తో ముందంజ వేసింది. ది రోజ్ బౌల్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.ఇంగ్లండ్ బ్యాటర్లలో సోఫియా డంక్లీ (83), అలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్ (53) అర్ధ శతకాలతో రాణించగా.. ఎమ్మా లాంబ్ (39), కెప్టెన్ నాట్ సీవర్- బ్రంట్ (41) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా రెండేసి వికెట్లు కూల్చగా.. అమన్జోత్ కౌర్, శ్రీ చరణి ఒక్కో వికెట్ పడగొట్టారు.దీప్తి శర్మ అజేయ అర్ధ శతకంఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 262 పరుగులు సాధించి జయభేరి మోగించింది. ఓపెనర్లు ప్రతికా రావల్ (36), స్మృతి మంధాన (28) ఓ మోస్తరుగా రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ (48) ఆకట్టుకుంది. ఇక ఆల్రౌండర్ దీప్తి శర్మ అజేయ అర్ధ శతకం (62)తో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చింది.మంధాన- రావల్ సరికొత్త చరిత్రఇదిలా ఉంటే.. గతేడాది నుంచి స్మృతి మంధాన- ప్రతీకా రావల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరు కలిసి ఇప్పటికి నాలుగుసార్లు శతక, ఐదుసార్లు అర్ధ శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఇందులో వీరి హయ్యస్ట్ పార్ట్నర్షిప్ 233. తాజాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మంధాన- రావల్ జోడీ.. వన్డే క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే అత్యుత్తమ సగటుతో ఈ మైలురాయిని చేరుకున్న ఓపెనింగ్ జోడీగా వరల్డ్ రికార్డు సాధించింది.మహిళల వన్డే క్రికెట్లో అత్యుత్తమ సగటుతో కనీసం వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనింగ్ జోడీలు ఇవే..🏏స్మృతి మంధాన- ప్రతీకా రావల్ (ఇండియా): 84.66 సగటుతో 1016 పరుగులు🏏కారోలిన్ అట్కిన్స్- సారా టేలర్ (ఇంగ్లండ్): 68.83 సగటుతో 1239 పరుగులు🏏రేచల్ హెయిన్స్- అలీసా హేలీ (ఆస్ట్రేలియా): 63.41 సగటుతో 1839 పరుగులు.చదవండి: Ravindra Jadeja: పోరాటయోధుడు.. అసలు సిసలు ఆల్రౌండర్కు ప్రతిరూపం -
ICC: కీలక సమావేశం.. ఐసీసీ కొత్త ప్రణాళికలు
టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్లో ఆడేందుకు ఇటీవలే ఇటలీ దేశపు జట్టు అర్హత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు పెరుగుతున్న ఆసక్తి, యూరోప్ దేశాల్లోనూ ఆట విస్తరిస్తున్న తీరుకు ఇది సరైన ఉదాహరణ. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పుడు సరిగ్గా దీనిపైనే మరింత దృష్టి పెట్టనుంది. కొత్త దేశాల్లో క్రికెట్ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించాలని ఐసీసీ భావిస్తోంది.24 జట్లకు పెంచే ప్రతిపాదనఈ నేపథ్యంలో ఇదే అంశంపై మరింత సమగ్ర చర్చ, భవిష్యత్తు కార్యాచరణ విషయంలో ఐసీసీ చర్చించనుంది. గురువారం (జూలై 17) నుంచి నాలుగు రోజుల పాటు జరిగే ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ప్రధాన ఎజెండాల్లో ఇది కూడా ఒకటి. వచ్చే టీ20 వరల్డ్ కప్ 20 జట్లతో జరగనుంది. దీనిని ఆ తర్వాత 24 జట్లకు పెంచే ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చిస్తారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డుల మద్దతుఅమెరికా–వెస్టిండీస్లలో జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ నిర్వహణలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ కొనసాగుతుండగా... విచారణలో వెల్లడైన అంశాలతో ఏజీఎంలో నివేదిక ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. టెస్టు క్రికెట్ను పెద్ద, చిన్న జట్లతో రెండు వేర్వేరు స్థాయిల్లో నిర్వహించే అంశంపై కూడా చర్చించనున్నారు. ఇలా టెస్టులను వర్గీకరించే అంశానికి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు గట్టిగా మద్దతు పలుకుతున్నాయి.జాంబియా రీ ఎంట్రీతాజాగా ఆసీస్పై విండీస్ 27 ఆలౌట్ ప్రదర్శనను బట్టి చూస్తే దీనిపై గట్టిగానే చర్చ సాగనుంది. అయితే 2025–27 డబ్ల్యూటీసీ టెస్టుల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏదైనా మార్పుపై నిర్ణయం తీసుకుంటే 2027 తర్వాతే సాధ్యమవుతుంది. మరో వైపు నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 2019లో సస్పెన్షన్కు గురైన జాంబియా జట్టుకు ఐసీసీ అసోసియేట్ టీమ్గా మళ్లీ అవకాశం కల్పించనుండగా...తొలిసారి ఈస్ట్ తైమూర్ టీమ్ కూడా ఐసీసీలో భాగం కానుంది. ఐసీసీ కొత్త సీఈఓ హోదాలో సంజోగ్ గుప్తా తొలిసారి ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించనున్నారు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 యోధుడు -
రిటైరైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. బాబర్ ఆజమ్ ఆల్టైమ్ రికార్డు బద్దలు
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించినా చారిత్రక రికార్డులు సాధించాడు. తాజాగా ఐసీసీ ఆల్టైమ్ టీ20 పాయింట్లను అప్డేట్ చేయగా.. అందులో విరాట్ కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు 897 నుంచి 909 పాయింట్లకు పెరిగాయి. దీంతో విరాట్ మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ (అత్యుత్తమంగా) అందుకున్న తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే విరాట్ టెస్ట్ల్లో అత్యుత్తమంగా 937, వన్డేల్లో అత్యుత్తమంగా 909 రేటింగ్ పాయింట్స్ కలిగి ఉన్నాడు.ఐసీసీ టీ20 రేటింగ్ పాయింట్ల అప్డేషన్ తర్వాత విరాట్ మరో చారిత్రక రికార్డును కూడా సాధించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అత్యధిక కాలం నంబర్ వన్గా కొనసాగిన బ్యాటర్గా అవతరించాడు. రేటింగ్ పాయింట్ల అప్డేషన్ తర్వాత విరాట్ నంబర్ వన్గా కొనసాగిన జమానా 1013 రోజుల నుంచి 1202 రోజులకు మారింది. రేటింగ్ పాయింట్ల అప్డేషన్కు ముందు అత్యధిక కాలం నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగిన రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ టీ20ల్లో 1057 రోజులు నంబర్ వన్గా కొనసాగాడు. తాజా అప్డేషన్తో విరాట్ బాబర్ రికార్డును బద్దలు కొట్టి అత్యధిక కాలం నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.పై రెండు రికార్డులతో విరాట్ టీ20 కెరీర్ మరింత హైలైట్ అయ్యింది. విరాట్ ఇప్పటికే వన్డే, టెస్ట్ల్లో లెక్కలేనన్ని, ఎవరికీ సాధ్యపడని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కొత్తగా చేరిన రెండు రికార్డులతో విరాట్ అంతర్జాతీయ కెరీర్ మొత్తం పరిపూర్ణమైనట్లైంది.విరాట్ అంతర్జాతీయ కెరీర్లో 125 టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 36 ఏళ్ల విరాట్ వన్డేల్లో ఇప్పటివరకు 302 మ్యాచ్లు ఆడి 57.9 సగటున 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీల సాయంతో 14181 పరుగులు చేశాడు. -
సొంతగడ్డపై శ్రీలంకకు ఊహించని పరాభవం.. చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్
ఇటీవలికాలంలో సొంతగడ్డపై ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. అన్ని విభాగాల్లో వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న (జులై 16) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్కు శ్రీలంకలో ఇది తొలి టీ20 సిరీస్ విజయం. బంగ్లా కెప్టెన్గా లిట్టన్ దాస్కు పరాయి గడ్డపై ఇది రెండో టీ20 సిరీస్ గెలుపు. ఈ సిరీస్ గెలుపుతో లిట్టన్ దాస్ చరిత్ర సృష్టించాడు. పరాయి గడ్డపై రెండు టీ20 సిరీస్ విజయాలు సాధించిన తొలి బంగ్లాదేశ్ కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. లిట్టన్ గతేడాది డిసెంబర్లో వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించాడు. శ్రీలంక, వెస్టిండీస్లో కాకుండా బంగ్లాదేశ్ పరాయి దేశాల్లో మరో రెండు టీ20 సిరీస్ విజయాలు మాత్రమే సాధించింది. ఈ రెండు కూడా జింబాబ్వేలో కాగా.. ఒకటి మష్రఫే మొర్తజా నేతృత్వంలో (2012లో 3-1 తేడాతో), మరొకటి మహ్మదుల్లా సారథ్యంలో (2021లో 2-1 తేడాతో) సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. మెహిది హసన్ (4-1-11-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముస్తాఫిజుర్ (4-0-17-1), రిషద్ హొస్సేన్ (4-0-20-0) కూడా అదే పని చేశారు. షొరిఫుల్ ఇస్లాం (4-0-50-1), తంజిమ్ హసన్ సకీబ్ (2-0-23-0) మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. షమీమ్ హొస్సేన్ 2 ఓవర్లలో ఓ వికెట్ తీసి పర్వాలేనిపించాడు. బంగ్లా బౌలర్ల దెబ్బకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక (46), దసున్ షనక (35 నాటౌట్), కమిందు మెండిస్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తంజిద్ హసన్ తమీమ్ (47 బంతుల్లో 73 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో బంగ్లాదేశ్కు సునాయాస విజయాన్నందించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (0) ఔటైనా.. లిట్టన్ దాస్ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, సిక్స్), తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, సిక్స్) తమీమ్కు సహకరించారు. ఫలితంగా బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బౌలర్లలో నువాన్ తుషార, కమిందు మెండిస్ తలో వికెట్ తీశారు. -
తొలి వన్డేలో ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు అదిరిపోయే విజయాలతో దూసుకుపోతుంది. ఈ పర్యటనలో ఇదివరకే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోనూ బోణీ కొట్టింది. ఈ సిరీస్లో భాగంగా నిన్న (జులై 16) సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. తద్వారా ఈ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. సోఫీ డంక్లీ (83), డేవిడ్సన్ రిచర్డ్స్ (53) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఎమ్మా లాంబ్ (39), కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (41), సోఫీ ఎక్లెస్టోన్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్యామీ బేమౌంట్ (5), ఆమీ జోన్స్ (1) నిరాశపరిచారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలో రెండు వికెట్లు తీయగా.. అమన్జోత్ కౌర్, శ్రీ చరణి చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆది నుంచే నిలకడగా ఆడుతూ పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించింది. టాపార్డర్ బ్యాటర్లలో ప్రతీక రావల్ (36), స్మృతి మంధన (28), హర్లీన్ డియోల్ (27), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17), జెమీమా రోడ్రిగెజ్ (48) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఆల్రౌండర్ దీప్తి శర్మ (62 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో భారత్ను గెలిపించింది. దీప్తి.. అమన్జోత్ (20 నాటౌట్) సహకారంతో టీమిండియాను విజయతీరాలకు (48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి) చేర్చింది.చివర్లో జెమీమా, రిచా ఘోష్ (10) స్వల్ప వ్యవధిలో (15 పరుగులు) ఔటైనప్పుడు కాస్త ఒత్తిడికి గురైన భారత శిబిరం.. దీప్తి బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చూసి గెలుపు ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ (10-1-34-1) ఒక్కరే భారత బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టింది. మిగతా బౌలర్లనంతా భారత బ్యాటర్లు సమర్దవంతంగా ఎదుర్కొన్నారు. ఛార్లోట్ డీన్ 2, లారెన్ ఫైలర్, లారెన్ బెల్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో రెండో వన్డే ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జులై 19న జరుగనుంది. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 యోధుడు
టీ20 యోధుడు, వెస్టిండీస్ పొట్టి క్రికెట్ దిగ్గజం ఆండ్రీ రసెల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో త్వరలో జరుగబోయే టీ20 సిరీస్ తనకు చివరిదని వెల్లడించాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లోనూ రసెల్ తొలి రెండు మ్యాచ్ల్లో మాత్రమే అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. జులై 20, 22 తేదీల్లో ఈ రెండు మ్యాచ్లు రసెల్ స్వస్థలమైన జమైకాలో జరుగనున్నాయి.37 ఏళ్ల రసెల్ వెస్టిండీస్ తరఫున 2010లో అరంగేట్రం చేసి 84 టీ20లు ఆడాడు. ఇందులో 163.1 స్ట్రయిక్రేట్తో 3 అర్ద సెంచరీల సాయంతో 1078 పరుగులు చేశాడు. బౌలర్గా 61 వికెట్లు తీశాడు. రసెల్ విండీస్ గెలిచిన రెండు టీ20 వరల్డ్కప్ల్లో (2012, 2016) కీలక సభ్యుడిగా ఉన్నాడు. పొట్టి క్రికెట్లో ఘన చరిత్ర కలిగిన రసెల్.. ఈ ఫార్మాట్లో 561 మ్యాచ్లు ఆడి 168.31 స్ట్రయిక్రేట్తో 2 సెంచరీలు, 33 అర్ద సెంచరీల సాయంతో 9316 పరుగులు సాధించాడు. అలాగే బౌలింగ్లో 485 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా రసెల్ ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగుతాడు.దెబ్బ మీద దెబ్బటెస్ట్ క్రికెట్లో, వన్డేల్లో ప్రభ కోల్పోయి అదఃపాతాళానికి పడిపోయిన వెస్టిండీస్.. టీ20 ఫార్మాట్లో మాత్రం ఆడపాదడపా మెరుపులు మెరిస్తూ ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో విండీస్ ఈ ఫార్మాట్లోనూ కిందికి పడిపోయే అవకాశం ఉంది. ఇటీవలే ఆ జట్టు టీ20 స్పెషలిస్ట్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా రసెల్ కూడా అదే బాటలో నడవడంతో టీ20ల్లో విండీస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 15 మంది సభ్యుల్లో ఒకరురసెల్ త్వరలో ఆస్ట్రేలియాతో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేయబడ్డాడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల్లో రసెల్ ఒకరు. ఈ సిరీస్ జులై 20, 22, 25, 26, 28 తేదీల్లో జమైకా (తొలి రెండు మ్యాచ్లు), సెయింట్ కిట్స్ (ఆఖరి మూడు మ్యాచ్లు) వేదికలుగా జరుగనుంది. ఈ సిరీస్లో విండీస్ జట్టుకు షాయ్ హోప్ నాయకత్వం వహిస్తాడు. ఈ జట్టులో హెట్మైర్, హోల్డర్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, రోవ్మన్ పావెల్, రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు.ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్కు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జరి జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్. -
Ravindra Jadeja: అసలు సిసలు ఆల్రౌండర్
రెప్ప పాటులో దూసుకొచ్చే బంతులను ఒడిసి పట్టాలంటే అతడు ఉండాలి...పాయింట్, కవర్స్, మిడాన్, మిడాఫ్ ఇలా ఎక్కడైనా నమ్మశక్యం కాని క్యాచ్లు అందుకోవాలంటే అతడు కావాలి...అవుట్ఫీల్డ్ నుంచి నేరుగా వికెట్లను గురిచూసి గిరాటేయాలంటే బంతి అతడికి చేతికి చిక్కాలి!పిచ్ నుంచి కాస్త సహకారం లభిస్తుందంటే చాలు ప్రత్యర్థిని చుట్టేయడానికి అతడు కావాలి...ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకున్నారంటే భాగస్వామ్యాన్ని విడదీయడానికి అతడు రావాలి...స్లో ఓవర్రేట్ బారిన పడకుండా చకచకా ఓవర్లు ముగించాలంటే అతడికి బౌలింగ్ ఇవ్వాలి!!టాపార్డర్ బ్యాటర్లకు సరైన సహకారం లభించాలంటే నాన్స్ట్రయికర్గా అతడు ఉండాలి...లోయర్ ఆర్డర్ను కాచుకుంటూ విలువైన పరుగులు చేయాలంటే క్రీజులో అతడు ఉండాలి...గడ్డు పరిస్థితుల్లో జట్టును గట్టెక్కించాలంటే అతడు బ్యాట్తో ‘కత్తిసాము’ చేయాలి!!ఇలా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో అతి ముఖ్యమైన ఆ అతడు మరెవరో కాదు... రవీంద్ర సింగ్ జడేజా. పుష్కర కాలానికి పైగా భారత టెస్టు జట్టులో కొనసాగుతున్న ఈ సౌరాష్ట్ర ఆల్రౌండర్ తాజాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో తన విలువ చాటుకుంటున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్ల్లోనూ అర్ధశతకాలతో మెరిసిన ‘జడ్డూ’... లార్డ్స్లో ఓటమి అంచున నిలిచిన జట్టును దాదాపు విజయానికి చేరువ చేశాడు. ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అనే విమర్శల నుంచి... పరిపూర్ణ ఆల్రౌండర్ అనిపించుకును స్థాయికి ఎదిగిన జడేజాపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడా విభాగంఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ విజయానికి 193 పరుగులు అవసరం కాగా... 82 పరుగులకే టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. ఇంకేముంది మరో పది, ఇరవై పరుగుల వ్యవధిలో మిగిలిన మూడు వికెట్లు కూలడం ఖాయమే అనే ఊహగానాల మధ్య భారత జట్టు చివరకు 170 పరుగులు చేయగలిగింది. చివరి ముగ్గురు బ్యాటర్లు వీరోచిత పోరాటం చేసిన మాట వాస్తవమే అయినా... దానికి నాయకత్వం వహించింది మాత్రం ముమ్మాటికీ రవీంద్ర జడేజానే. యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, శుబ్మన్ గిల్, రిషభ్ పంత్ ఇలా నమ్ముకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతుంటే జడేజా మాత్రం మొక్కవోనిసంకల్పంతో బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దుర్బేధ్యమైన డిఫెన్స్తో కట్టిపడేశాడు. మరో ఎండ్లో వికెట్ కాపాడుకోవడం కూడా ముఖ్యమైన తరుణంలో నితీశ్ కుమార్ రెడ్డి, బుమ్రా, సిరాజ్ అండతో జట్టును గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అతడు స్టోక్స్, ఆర్చర్, వోక్స్, కార్స్ వేసిన బౌన్సర్లకు ఎదురు నిలిచిన తీరు... పోరాట యోధుడిని తలపించింది. స్కోరు బోర్డు పరిశీలిస్తే జడేజా పేరిట అర్ధశతకం మాత్రమే కనిపిస్తుంది కానీ... లార్డ్స్లో అతడు చేసిన పోరాటం సెంచరీకి తీసిపోనిది. కఠిన క్షణాలు, పరీక్ష పెడుతున్న బంతులు, బ్యాటింగ్కు కష్టసాధ్యమైన పరిస్థితులు... వీటన్నిటితో పోరాడిన జడ్డూ క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకున్నాడు. వరుసగా నాలుగు ఫిఫ్టీలు... 11, 25 నాటౌట్, 89, 69 నాటౌట్, 72, 61 నాటౌట్... తాజా ఇంగ్లండ్ సిరీస్లో జడేజా గణాంకాలివి. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తప్ప అతడు విఫలమైంది లేదు. లీడ్స్లో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ తరఫున జైస్వాల్, గిల్, రాహుల్ ఒక్కో సెంచరీ చేస్తే పంత్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకాలు బాదాడు. దీంతో జడేజాకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా... బర్మింగ్హామ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కెప్టెన్ గిల్ అనితరసాధ్యమైన బ్యాటింగ్ ప్రదర్శనకు సంపూర్ణ సహకారం అందించిన ఘనత జడేజాదే. తొలి ఇన్నింగ్స్లో ఆరో వికెట్కు గిల్తో కలిసి 203 పరుగులు జోడించి జట్టుకు కొండంత స్కోరు అందించిన ‘జడ్డూ’... రెండో ఇన్నింగ్స్లోనూ సారథితో కలిసి ఐదో వికెట్కు 175 పరుగులు జతచేశాడు. తొలి ఇన్నింగ్స్లో కెపె్టన్కు అండగా నిలుస్తూ స్ట్రయిక్ రొటేట్ చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్లో వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టాపార్డర్ ఓ మాదిరిగా రాణించిన సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసిన అతడు... రెండో ఇన్నింగ్స్లో అసాధారణంగా పోరాడాడు. ఇంగ్లండ్ బౌలర్లంతా ఒకదశలో జడేజాను అవుట్ చేయడం సాధ్యం కాదని నిర్ణయించుకొని అవతలి ఎండ్లో వికెట్ పడగొట్టేందుకే ప్రయత్నించారంటే అతడు ఎంత పట్టుదలగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. వికెట్ విలువ గుర్తెరిగి... గత ఏడాది భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు జడేజా కూడా వీడ్కోలు పలికాడు. తదనంతరం ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించగా... ‘జడ్డూ’ మాత్రం కొనసాగుతున్నాడు. జైస్వాల్, గిల్, సుదర్శన్, సుందర్, నితీశ్ వంటి యువ ఆటగాళ్లతో కూడిన జట్టులో... రాహుల్, పంత్ కన్నా ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవం ఉన్న జడేజా ఈ సిరీస్లో తన వికెట్ విలువ గుర్తెరిగి బ్యాటింగ్ చేస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు తన బ్యాటింగ్ను మార్చుకుంటూ ప్రతి కెప్టెన్ తన జట్టులో ఇలాంటి ప్లేయర్ ఉండాలనుకునే విధంగా ఆడుతున్నాడు. గతంలో కేవలం తన బౌలింగ్, ఫీల్డింగ్తోనే జట్టులో చోటు దక్కించుకున్న ‘జడ్డూ’... ఇప్పుడు నమ్మదగ్గ బ్యాటర్గా ఎదిగాడు. ఒకప్పుడు ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అని విమర్శలు ఎదుర్కొన్న అతడు... వాటికి తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. భారత గడ్డపై మ్యాచ్ల్లో ఎక్కువ వికెట్లు తీసిన జడేజా... విదేశాల్లో బౌలింగ్తో అద్భుతాలు చేయలేకపోయినా... నిఖార్సైన బ్యాటర్గానూ జట్టులో చోటు నిలుపుకునే స్థాయికి ఎదిగాడు. తాజా ఇంగ్లండ్ పర్యటనలో పేసర్లు వికెట్ల పండగ చేసుకుంటుండగా... ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో లంచ్కు ముందు చివరి ఓవర్లో స్టోక్స్ అవుట్ కావడం వెనక ‘జడ్డూ’ కృషి ఉంది. అంతకుముందు ఓవర్ వేసిన అతడు కేవలం 90 సెకన్లలోనే ఆరు బంతులు వేయడంతో మరో అదనపు ఓవర్ వేసే అవకాశం దక్కగా... అందులో సుందర్ బౌలింగ్లో స్టోక్స్ పెవిలియన్ చేరాడు. ఎప్పుడూ తెరవెనుకే! జడేజా టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి చూసుకుంటే... అతడి కంటే ఐదుగురు బౌలర్లు మాత్రమే ఎక్కువ బంతులు వేశారు. 2018 తర్వాతి నుంచి అతడు 42.01 సగటుతో పరుగులు రాబట్టాడు. 83 టెస్టుల్లో జడ్డూ 4 సెంచరీలు, 26 అర్ధసెంచరీలతో 3697 పరుగులు చేయడంతో పాటు... 326 వికెట్లు పడగొట్టాడు. అందులో 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. అయితే ఇందులో అధిక శాతం ఉపఖండ పిచ్లపైనే నమోదవడం... జడేజా మంచి స్కోరు చేసిన మ్యాచ్ల్లో టాపార్డర్ భారీగా పరుగులు రాబట్టడంతో ఎప్పుడూ అతడి పేరు పెద్దగా వెలుగులోకి రాలేదు. పదకొండేళ్ల క్రితం 2014లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో టెస్టులో ధనాధన్ హాఫ్ సెంచరీతో పాటు ఆఖర్లో చక్కటి త్రోతో అండర్సన్ను రనౌట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జడేజా ఈసారి ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాలని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అయితే ఈ క్రమంలో తన పోరాటంతో మాత్రం అందలమెక్కాడు. ఇకపై కూడా అతడు ఇదే నిలకడ కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఆరు బంతులను ఒకే ప్రాంతంలో వేయగల నైపుణ్యంతో పాటు... వేర్వేరుగా సంధించగల వైవిధ్యం గల జడేజా... నోబాల్స్ విషయంలో మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది! -
‘కీబోర్డ్ వారియర్స్’ను సైలెంట్ చేశా
లండన్: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ క్రమంలో ఆర్చర్ విమర్శకులను ఉద్దేశించి ‘కీబోర్డ్ వారియర్స్’ అనే పదాన్ని ఉపయోగించాడు. 2021లో చివరిసారి ఇంగ్లండ్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన ఆర్చర్... టీమిండియాతో జరిగిన లార్డ్స్ టెస్టుతో పునరాగమనం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించిన ఆర్చర్... రెండో ఇన్నింగ్స్లో మూడు కీలక వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.‘ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇన్నాళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి విజయంలో భాగమవడం సంతోషంగా ఉంది. గత మూడు నాలుగేళ్లుగా ఎంతమంది ‘కీబోర్డ్ వారియర్స్’ నన్ను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారో లెక్కచెప్పలేను. ఎన్నో గాయాలు, మరెన్నో పునరావాస శిబిరాల తర్వాత వచ్చిన ఈ గెలుపు చాలా ప్రత్యేకం’ అని ఆర్చర్ అన్నాడు. మోచేయి, వెన్నునొప్పి, కండరాలు ఇలా ఎన్నో గాయాల బారిన పడిన 30 ఏళ్ల ఆర్చర్... గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సంతరించుకోవడంతో సుదీర్ఘ ఫార్మాట్లో తిరిగి అడుగు పెట్టాడు. భారత రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్తో పాటు పంత్, వాషింగ్టన్ సుందర్ను ఆర్చర్ పెవిలియన్కు పంపాడు. పంత్ వికెట్తో జట్టులో నూతనోత్సాహం వచ్చిందని ఆర్చర్ వెల్లడించాడు. ‘ఇన్నాళ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులో నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశా. ఇది శుభసూచకం. పంత్ వికెట్తో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత మరింత పట్టుబిగించగలిగాం’ అని ఆర్చర్ అన్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సోమవారం లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఈ సిరీస్లో ఆతిథ్య జట్టు ప్రస్తుతం 2–1తో ఆధిక్యంలో ఉండగా... ఇరు జట్ల మధ్య ఈ నెల 23 నుంచి మాంచెస్టర్లో నాలుగో మ్యాచ్ ప్రారంభం కానుంది. -
సింధుకు మళ్లీ నిరాశే
టోక్యో: ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నుంచి ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ 14వ ర్యాంకర్ సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 30 ఏళ్ల సింధు 15–21, 14–21తో ఓడిపోయింది. గతంలో సిమ్ యు జిన్తో ఆడిన మూడుసార్లూ గెలిచిన సింధు నాలుగో ప్రయత్నంలో తొలిసారి ఓటమి చవిచూసింది. 38 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్లో ఒకదశలో 3–9తో వెనుకబడింది. ఆ తర్వాత తేరుకొని ఆధిక్యాన్ని 12–13కు తగ్గించింది. అయితే కీలకదశలో కొరియా ప్లేయర్ పైచేయి సాధించి సింధుకు అవకాశం ఇవ్వలేదు. ఇక రెండో గేమ్లో మూడుసార్లు ఇద్దరి స్కోరు సమమయ్యాయి. స్కోరు 11–11వద్ద ఉన్నపుడు సిమ్ యు జిన్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 15–11తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని సింధుపై ఆమె తొలిసారి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది సింధు ఇండోనేసియా మాస్టర్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, స్విస్ ఓపెన్, మలేసియా మాస్టర్స్ టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. తదుపరి సింధు వచ్చే మంగళవారం మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరోవైపు భారత్కే చెందిన ఉన్నతి హుడా 8–21, 12–21తో చోచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోగా... అనుపమ 21–15, 18–21, 21–18తో సహచరిణి రక్షిత శ్రీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–18, 21–10తో కాంగ్ మిన్ హైయుక్–కి డాంగ్ జు (దక్షిణ కొరియా) జోడీని ఓడించింది. రూబన్ కుమార్–హరిహరన్ (భారత్) ద్వయం 15–21, 9–21తో కిమ్ వన్ హో–సియో సెయుంగ్ జే (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్య సేన్ (భారత్) 21–11, 21–18తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. -
దీపికకు ‘మ్యాజిక్ స్కిల్’ అవార్డు
న్యూఢిల్లీ: భారత జట్టు ఫార్వర్డ్ దీపిక ‘పాలీగ్రాస్ మ్యాజిక్ స్కిల్’ అంతర్జాతీయ హాకీ అవార్డును సొంతం చేసుకుంది. మైదానంలో అసాధారణ నైపుణ్యంతో ప్రత్యర్థి డిఫెండర్లను, గోల్కీపర్ను బోల్తా కొట్టించి చేసే గోల్కు గుర్తింపుగా ఈ అవార్డును యేటా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఇస్తుంది. 2024–25 ప్రొ లీగ్ సీజన్ సందర్భంగా ప్రపంచ నంబర్వన్ నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఎంతో నేర్పుగా దీపిక చేసిన ఫీల్డ్ గోల్ను ఎఫ్ఐహెచ్ జ్యూరీ, అభిమానులు ఓటింగ్లో ‘బెస్ట్ గోల్’గా ఎంపిక చేశారు. ‘ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. నెదర్లాండ్స్ లాంటి జట్టుపై ఆ గోల్ చేయడం ప్రత్యేక క్షణం. దానికి ఈ విధంగా గుర్తింపు దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతున్న సహచరులు, కోచ్లు, కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ధన్యవాదాలు. ఈ పురస్కారం నా ఒక్కదానిది కాదు. ఇది మొత్తం భారత జట్టుది’ అని దీపిక వెల్లడించింది. -
రాణించిన జెమీమా, దీప్తి
సౌతాంప్టన్: ఇంగ్లండ్ మహిళలతో టి20 సిరీస్ను గెలుచుకున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్లో శుభారంభంపై దృష్టి పెట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... కడపటి వార్తలందేసరికి 45 ఓవర్లలో 6 వికెట్లకు 232 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (54 బంతుల్లో 48; 5 ఫోర్లు), దీప్తి శర్మ (57 బంతుల్లో 57 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్కు 86బంతుల్లో 90 పరుగులు జోడించారు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ‘బర్త్డే గర్ల్’ సోఫియా డంక్లీ (92 బంతుల్లో 83; 9 ఫోర్లు), అలైస్ డేవిడ్సన్ (73 బంతుల్లో 53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శతక భాగస్వామ్యం... భారత పేసర్, మధ్యప్రదేశ్కు చెందిన క్రాంతి గౌడ్ ఆరంభంలోనే ఇంగ్లండ్ను కట్టడి చేసింది. తన తొలి ఓవర్లోనే ఎమీ జోన్స్ (1)ను బౌల్డ్ చేసిన ఆమె, తన తర్వాతి ఓవర్లో బీమాంట్ (5)ను ఎల్బీగా పంపడంతో ఇంగ్లండ్ స్కోరు 20/2 వద్ద నిలిచింది. ఈ దశలో నాట్ సివర్ బ్రంట్ (52 బంతుల్లో 41; 5 ఫోర్లు), ఎమా ల్యాంబ్ (50 బంతుల్లో 39; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్కు 87 బంతుల్లో 71 జత చేశారు. అయితే ఆఫ్స్పిన్నర్ స్నేహ్ రాణా ఇంగ్లండ్ను దెబ్బ కొట్టింది. తన వరుస ఓవర్లలో ఆమె ల్యాంబ్, నాట్ సివర్లను పెవిలియన్కు పంపించడంతో భారత్ పైచేయి సాధించింది. అయితే డంక్లీ, అలైస్ చక్కటి బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను నడిపించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఐదో వికెట్కు 23.4 ఓవర్లలో 106 పరుగులు జోడించారు. ఎట్టకేలకు అలైస్ను అవుట్ చేసి ఆంధ్ర బౌలర్ శ్రీచరణి ఈ జోడీని విడగొట్టింది. చివర్లో సోఫీ ఎకెల్స్టోన్ (19 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా ఆడటంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో ఇంగ్లండ్ 49 పరుగులు సాధించింది. భారత ఫీల్డర్లు మూడు క్యాచ్లు వదిలేయడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చింది. కెప్టెన్ విఫలం... ఛేదనను భారత ఓపెనర్లు ధాటిగా మొదలు పెట్టారు. తొలి వికెట్కు ప్రతీక రావల్ (51 బంతుల్లో 36; 3 ఫోర్లు)తో కలిసి 8 ఓవర్లలోనే 48 పరుగులు జోడించిన అనంతరం స్మృతి మంధాన (24 బంతుల్లో 28; 5 ఫోర్లు) వెనుదిరిగింది. ఆ తర్వాత 8 పరుగుల వ్యవధిలో ప్రతీక, హర్లీన్ డియోల్ (44 బంతుల్లో 27; 4 ఫోర్లు) పెవిలియన్ చేరారు. నిర్లక్ష్యంగా పరుగెత్తిన హర్లీన్ అనూహ్యంగా రనౌటైంది. అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (17) విఫలమైంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బీమాంట్ (ఎల్బీ) (బి) క్రాంతి 5; ఎమీ జోన్స్ (బి) క్రాంతి 1; ఎమా ల్యాంబ్ (సి) హర్మన్ప్రీత్ (బి) రాణా 39; నాట్ సివర్ (సి) జెమీమా (బి) రాణా 41; డంక్లీ (బి) అమన్జోత్ 83; అలైస్ డేవిడ్సన్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) శ్రీచరణి 53; ఎకెల్స్టోన్ (నాటౌట్) 23; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 258. వికెట్ల పతనం: 1–8, 2–20, 3–91, 4–97, 5–203, 6–258. బౌలింగ్: అమన్జోత్ 10–0–58–1, క్రాంతి గౌడ్ 9–0–55–2, దీప్తి శర్మ 10–0–58–0, శ్రీచరణి 10–0–46–1, స్నేహ్ రాణా 10–0–31–2, ప్రతీక 1–0–7–0. -
రాణించిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సౌతాంప్టన్ వేదికగా భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లండ్కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.ఓపెనర్లు టామీ బ్యూమాంట్(5), అమీ జోన్స్(1)ను బారత పేసర్ క్రాంతి గౌడ్ పెవిలియన్ పంపింది. ఈ క్రమంలో కెప్టెన్ స్కివర్ బ్రంట్(41), లాంబ్(39) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఔటయ్యాక సోఫీ డంక్లీ(83), ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్(53) జట్టు స్కోర్ బోర్డును నడిపించారు.వీరిద్దరూ ఐదో వికెట్కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. చరణి, అమన్జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు. స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది.తుది జట్లుఇంగ్లండ్: టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్, లారెన్ ఫైలర్, లారెన్ బెల్భారత్: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, శ్రీ చరణి, క్రాంతి గౌడ్ -
చెలరేగిన హెన్రీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో సౌతాఫ్రికాను 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.కివీస్ ఓపెనర్లు సీఫర్ట్(22), కాన్వే(9) ఆరంభంలోనే ఔటయ్యారు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ డార్లీ మిచెల్(5), వికెట్ కీపర్ హే(5) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ సమయంలో టిమ్ రాబిన్సన్(75), డెవాన్ జాకబ్స్(44).. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 105 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాక రెండు, ఎంగిడీ, ముత్తుసామి, కోట్జీ తలా వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బ్యాటర్లలో బ్రెవిస్(35) టాప్ స్కోరర్గా నిలవగా.. లిండే(30), ప్రిటోరియస్(27) పర్వాలేదన్పించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, జాకబ్ డఫీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సోధీ రెండు, శాంట్నర్ ఓ వికెట్ సాధించారు.చదవండి: Virat kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీ20లకు, టెస్టులకు వీడ్కోలు పలికినప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో తన రికార్డుల వేట మాత్రం కొనసాగిస్తున్నాడు. విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఆల్టైమ్ టీ20 ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లి రేటింగ్ పాయింట్స్ను అప్డేట్ చేసింది.కోహ్లి రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కి పెరిగాయి. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న తొలి ప్లేయర్గా కింగ్ కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్లో అత్యధికంగా 937 రేటింగ్ పాయింట్స్ సాధించగా.. వన్డేల్లో అతడి పేరిట 909 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.ఓవరాల్గా ఆల్ టైమ్ టీ20 ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ డేవిడ్ మలన్ 919 రేటింగ్ పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సూర్యకుమార్ యాదవ్ 912 రేటింగ్ పాయింట్స్తో నిలిచాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో కోహ్లి ఉన్నాడు.కోహ్లి తన కెరీర్లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లి రికార్డు స్ధాయిలో 51 వన్డే సెంచరీలు చేశాడు.చదవండి: IND vs ENG: 'తప్పేమి కాదు.. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలి' -
నేను కెప్టెన్గా ఉన్నపుడు.. నా మాట వినేవాడే కాదు: జో రూట్
టీమిండియాతో రెండో టెస్టులో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్.. లార్డ్స్ (Lord's Test)లో ఇందుకు బదులు తీర్చుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఎట్టకేలకు గిల్ సేనపై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో 2-1తో ముందంజ వేసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)ది కీలక పాత్ర.తగ్గేదేలేఓవైపు ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నా స్టోక్స్ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ఇటు బ్యాట్తోనూ.. అటు బంతితోనూ సత్తా చాటాడు. ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో పాటు.. టీమిండియా కీలక వికెట్లు కూల్చి జట్టు విజయానికి పునాది వేశాడు.లార్డ్స్ టెస్టులో స్టోక్స్ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 44, 33 పరుగులు చేశాడు. అదే విధంగా.. టీమిండియా రెండు ఇన్నింగ్స్లో కలిపి 44 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (40), నితీశ్ రెడ్డి (30) వికెట్లు కూల్చిన స్టోక్స్.. రిషభ్ పంత్ (74)ను రనౌట్ చేశాడు.అదే విధంగా.. రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (39), ఆకాశ్ దీప్ (1) వికెట్లను పడగొట్టిన స్టోక్స్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్ పట్టుదల, జట్టు ప్రయోజనాల పట్ల అతడి నిబద్ధత గురించి సహచర ఆటగాడు, మాజీ కెప్టెన్ జో రూట్ (Joe Root) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నేను కెప్టెన్గా ఉన్నపుడు.. నా మాట వినేవాడే కాదుటీమిండియాతో నాలుగో టెస్టుకు ముందు రూట్ మాట్లాడుతూ.. ‘‘అతడు ప్రతిసారీ నా మాట వినడు. ముఖ్యంగా నేను కెప్టెన్గా ఉన్నప్పుడు ఎంతగా చెప్పినా వినేవాడే కాదు. తన శరీరాన్ని కష్టపెట్టి ఎక్కువగా బౌలింగ్ చేసేవాడు.పనిభారాన్ని తగ్గించుకోమని చెబితే.. తను మాత్రం అసాధారణ రీతిలో జట్టు కోసం పట్టుదలగా ఆడేవాడు. కొన్నిసార్లు అతడి గాయాలు మరీ తీవ్రతరమైతే పరిస్థితి ఏమిటని నేను భయపడిపోయేవాడిని. కానీ అతడు మాత్రం రెండుసార్లు తీవ్రంగా గాయపడిన తర్వాత కూడా మళ్లీ కోలుకుని ఇలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆట పట్ల తన అంకిత భావం అలాంటిది మరి’’ అని స్టోక్స్పై ప్రశంసల వర్షం కురిపించాడు.కాగా లార్డ్స్ టెస్టులో రూట్- స్టోక్స్ కలిసి రెండు ఇన్నింగ్స్లో వరుసగా 88, 67 పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (104) చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం 40 పరుగులకే పెవిలియన్ చేరాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ (జూలై 23- 27)లో నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే.చదవండి: వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారా -
'తప్పేమి కాదు.. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలి'
అండర్సన్-సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో టీమిండియా పోరాడినప్పటికి విజయం సాధించలేకపోయింది.దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-2 తేడాతో గిల్ సేన వెనకబడింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ మదన్లాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని తన టెస్టు రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని మదన్లాల్ కోరాడు. కోహ్లి అవసరం జట్టుకు ఉందని, తన అనుభవాన్ని యువ ఆటగాళ్లతో పంచుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు.విరాట్ కోహ్లికి భారత క్రికెట్పై మక్కువ ఎక్కువ. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని, టెస్టుల్లో తిరిగి ఆడాలని నేను కోరుకుంటున్నాను. విరాట్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంలో తప్పులేదు. ఈ సిరీస్లో కాకపోయినా, తదుపరి సిరీస్లో అతడు తదుపరి టెస్టు సిరీస్లోనైనా ఆడాలి.అతడు ఇంకా ఇప్పటికి చాలా ఫిట్గా ఉన్నాడు. ఒకటి రెండేళ్లు ఈజీగా ఆడగలడు. తన అనుభవంతో యువ ఆటగాళ్లను రాటుదేల్చాలి. అతడు రిటైర్మెంట్ ప్రకటించి ఎక్కువ రోజులు కాలేదు, కాబట్టి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది" అని క్రికెట్ ప్రీడిక్టాలో మదన్లాల్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. అతడికంటే ముందు కెప్టెన్ రోహిత్ శర్మ రెడ్బాల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్లో 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: జితేశ్ శర్మకు అవమానం.. దినేశ్ కార్తిక్ కూడా పట్టించుకోలేదా? -
బ్యాట్ను నేలకేసి కొట్టిన సిరాజ్!.. ఓటమిపై స్పందన ఇదే
లార్డ్స్ టెస్టులో గెలుపు కోసం చివరిదాకా పోరాడిన టీమిండియాకు చేదు అనుభవమే మిగిలింది. మూడో టెస్టులో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో అనూహ్య రీతిలో మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బౌల్డ్ కావడంతో గిల్ సేన ఓటమి ఖరారైంది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 22 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. మరోసారి లార్డ్స్లో తమకు తిరుగులేదని నిరూపించుకుంది.అంతేకాదు.. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. నిజానికి.. ఐదో రోజు ఆరంభంలోనే టీమిండియా వికెట్ల పతనం మొదలైంది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో రిషభ్ పంత్ (9) బౌల్డ్ కాగా.. ఆ తర్వాత ఇన్ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (39) కూడా ఊహించని రీతిలో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు.జడేజా ఒంటరి పోరాటంఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ (0) డకౌట్ అయ్యాడు. అనంతరం నితీశ్ రెడ్డి (53 బంతుల్లో 13) కాసేపు నిలబడినా.. క్రిస్ వోక్స్ అద్భుత డెలివరీతో అతడిని వెనక్కిపంపించేశాడు. ఈ క్రమంలో బాధ్యతను నెత్తికెత్తుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (61 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.అతడికి తోడుగా టెయిలెండర్ జస్ప్రీత్ బుమ్రా (54 బంతుల్లో 5) చాలాసేపు పట్టుదలగా నిలబడ్డాడు. కానీ బెన్ స్టోక్స్ బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి సామ్ కుక్కు క్యాచ్ ఇచ్చి తొమ్మిదో వికెట్గా వెనుదిరగడంతో టీమిండియా అభిమానుల్లో గెలుపు ఆశలు దాదాపుగా చచ్చిపోయాయి. మహ్మద్ సిరాజ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడంటూ అంతా ఉసూరుమన్నారు.పాపం సిరాజ్ మియా..అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సిరాజ్ మియా 29 బంతుల్ని ఎదుర్కొని డిఫెండ్ చేసుకున్నాడు. ముప్పైవ బంతిని కూడా బాగానే డిఫెంగ్ చేసుకున్నా అనుకున్నాడు. కానీ ఊహించని రీతిలో బంతి పిచ్ మీద రోల్ అయి లెగ్ స్టంప్ను తాకగా బెయిల్ ఎగిరిపడింది.ఊహించని ఈ పరిణామంతో సిరాజ్తో పాటు టీమిండియా హృదయం కూడా ముక్కలైంది. ఇంగ్లండ్ బౌలర్ షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంతో అలా సిరాజ్ పదో వికెట్గా వెనుదిరగ్గా.. లార్డ్స్లో టీమిండియా మరోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో కోపంతో సిరాజ్ బ్యాట్ను నేలకేసి కొట్టిన వీడియోతో పాటు.. ఓటమి నేపథ్యంలో అతడు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారాయి.ఓటమిపై స్పందన ఇదే‘‘కొన్ని మ్యాచ్లు మన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే, కేవలం ఫలితం ఆధారంగా మాత్రమే కాదు.. అవి నేర్పిన పాఠాల వల్ల అలా గుర్తుండిపోతాయి’’ అంటూ సిరాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా మూడు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు రెండు, పర్యాటక టీమిండియా ఒక మ్యాచ్ గెలిచాయి. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్లో నాలుగో మ్యాచ్ జరుగనుంది. చదవండి: వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారా pic.twitter.com/Bm2Hp9Cm8K https://t.co/f4wTxyJSyg— Babu Bhaiya (@Shahrcasm) July 15, 2025 -
జితేశ్ శర్మకు అవమానం.. దినేశ్ కార్తిక్ కూడా పట్టించుకోలేదా?
టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీలక బ్యాటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma)కు చేదు అనుభవం ఎదురైంది. భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య మూడో టెస్టు వీక్షించేందుకు వెళ్తుంటే భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. తాను ఎవరన్న విషయం స్పష్టంగా చెప్పినా.. లార్డ్స్ మైదానం (Lord's Stadium)లోకి ప్రవేశించకుండా ఆపేశారు.డీకేను సాయం కోరిన జితేశ్ఇలా జితేశ్ శర్మ స్టేడియం వెలుపల భద్రతా సిబ్బందితో పాట్లు పడుతున్న వేళ.. ఆర్సీబీ కోచ్, టీమిండియా- ఇంగ్లండ్ సిరీస్ కామెంటేటర్ దినేశ్ కార్తిక్ బయటకు వచ్చాడు. అయితే, అతడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. ఇంతలో డీకేను చూసిన జితేశ్.. తనకు సాయం చేయాల్సిందిగా అతడిని కోరాడు.కానీ.. అప్పటికే ఆటోగ్రాఫ్లు, ఫొటోల కోసం తనను చుట్టుముట్టిన అభిమానుల గోల కారణంగా జితేశ్.. దినేశ్ కార్తిక్ను పిలిచినా అతడికి.. జితేశ్ గొంతు వినబడే పరిస్థితి లేకపోయింది. దీంతో జితేశ్ స్వయంగా డీకేకు ఫోన్ చేసి తన ఇబ్బంది గురించి చెప్పగా.. అతడు రంగంలోకి దిగాడు. అనంతరం ఇద్దరూ కలిసి మైదానంలోకి వెళ్లారు.ఇంతలా అవమానిస్తారా?.. అదేం లేదు!ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. ‘‘అంతర్జాతీయ క్రికెటర్ అయిన జితేశ్ శర్మను ఇంతలా అవమానిస్తారా?’’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ మండిపడుతుండగా.. సెక్యూరిటీ సిబ్బంది తమ విధి నిర్వహణలో భాగంగానే ఇలా చేసిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అదే విధంగా.. లార్డ్స్ ఎంట్రీ విషయంలో కచ్చితమైన నిబంధనలు ఉంటాయని.. స్టువర్ట్ బ్రాడ్ సైతం రిటైర్ అయిన వెంటనే తనకు స్టేడియంలోకి నేరుగా వచ్చే యాక్సెస్ లేకుండా పోయిందని గుర్తుచేస్తున్నారు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా సిబ్బంది అలా ప్రవర్తించడంలో తప్పులేదని సమర్థిస్తున్నారు.ఆర్సీబీ గెలుపులో కీలక పాత్రకాగా 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు విదర్భ ఆటగాడు జితేశ్ శర్మ. ఇప్పటికి ఏడు టీ20 మ్యాచ్లు ఆడి. 100 పరుగులు సాధించాడు. ఈ 31 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటి వరకు వన్డే, టెస్టుల్లో మాత్రం అరంగేట్రం చేయలేదు.ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో జితేశ్ శర్మది కీలక పాత్ర. 15 మ్యాచ్లలో కలిపి 261 పరుగులు చేసిన జితేశ్.. రెగ్యులర్ కెప్టెన్ రజత్ పాటిదార్ గైర్హాజరీలో జట్టును ముందుండి నడిపించాడు కూడా!.. ఇక ఐపీఎల్-2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.ఇక ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్లో పర్యటిస్తోన్న భారత జట్టు.. లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సిరీస్లో 1-2తో వెనుకబడింది గిల్ సేన. కాగా అంతకుముందు ముందు లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్లో నాలుగో టెస్టు జరుగుతుంది.చదవండి: వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారాpic.twitter.com/7gqAeAJHtx— Out Of Context Cricket (@GemsOfCricket) July 16, 2025 -
బిగ్ ట్విస్ట్: అన్న కెప్టెన్సీలో సంజూ శాంసన్ అరంగేట్రం?
కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025 సీజన్లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడనున్న సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన వేలంలో శాంసన్ను కొచ్చి బ్లూ టైగర్స్ రూ. 26.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో కొచ్చి బ్లూ టైగర్స్ కెప్టెన్గా సంజూ ఎంపిక అవుతాడని అంతా భావించారు.కానీ ఆఖరి నిమిషంలో కొచ్చి ఫ్రాంచైజీ అందరికి షాకిచ్చింది. సంజూను కాదని అతడి అన్నయ్య సాలీ శాంసన్ను తమ జట్టు కెప్టెన్గా కొచ్చి బ్లూ టైగర్స్ ఫ్రాంచైజీ నియమించింది. తన అన్నయ్యకు డిప్యూటీగా శాంసన్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కొచ్చి ఫ్రాంచైజీ వెల్లడించింది. కాగా కేసీఎల్ వేలంలో సాలీ శాంసన్ను రూ.75,000 వేలలకు కొచ్చి కొనుగోలు చేసింది. 34 ఏళ్ల సాలీ శాంసన్ తన కెరీర్ ఆరంభం నుంచి గాయాలతో సతమతమవుతూ వస్తున్నాడు. గత నాలుగేళ్లగా అతడు కేరళ జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ క్లబ్ క్రికెట్లో మాత్రం ఆడుతూ వస్తున్నాడు.కేరళ తరపున ఇప్పటివరకు 6 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడిన అతడు కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అతడికి బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. క్లబ్ క్రికెట్లో శాంసన్ కెప్టెన్సీ అనుభవం ఉంది. ఈ క్రమంలోనే అతడి కెప్టెన్సీ స్కిల్స్పై నమ్మకంతో కొచ్చి తమ జట్టు పగ్గాలను అప్పగించింది. ఇక కేసీఎల్ తొట్టతొలి సీజన్(2024)లో కొచ్చి బ్లూ టైగర్స్ తీవ్ర నిరాశపరిచింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో బ్లూ టైగర్స్ నిలిచింది. ఇప్పుడు సంజూ శాంసన్ రాకతో ఎలాగైనా ఈ ఏడాది ఛాంపియన్గా నిలవాలని కొచ్చి బ్లూ టైగర్స్ ఉవ్విళ్లూరుతోంది. కాగా కేరళ క్రికెట్ లీగ్లో సంజూ ఆడడం ఇదే తొలిసారి. అన్నయ్య కెప్టెన్సీలో శాంసన్ అరంగేట్రం చేయనున్నాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సీజన్కు ముందు సీఎస్కేకు ట్రేడ్ అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: అతడి ఆటిట్యూడ్ వల్లే టీమిండియా ఓడిపోయింది: మహ్మద్ కైఫ్ -
వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారా
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లుగా పేరొందారు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan).. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ (Shane Warne). మూడు ఫార్మాట్లలో కలిపి ఏకంగా 1347 వికెట్లు కూల్చి అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు ముత్తయ్య మురళీధరన్.మరోవైపు.. 1001 వికెట్లతో అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు దివంగత షేన్ వార్న్. సమకాలీన బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ ఇద్దరు స్పిన్ బౌలర్లలో ఎవరు అత్యుత్తమం అంటే చెప్పడం కాస్త కష్టమే. వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియన్ లారా కూడా ఇదే మాట అంటున్నాడు. అయితే, షేన్ వార్న్- ముత్తయ్య మురళీధరన్లలో ఒకరు మాత్రం ఇంకాస్త బెస్ట్ అంటూ తన మనసులోని మాట చెప్పేశాడు.ఇద్దరూ ఇద్దరేఈ మేరకు.. ‘‘మురళి బౌలింగ్ చేస్తున్నపుడు నన్ను గందరగోళానికి గురిచేస్తాడు. స్వీప్ షాట్ లేదంటే.. డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ మీదుగా షాట్ బాదాలని అనుకుంటే.. అతడు నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. మరోసారి నేను స్వీప్ షాట్ ఆడాలని అనుకున్నపుడు సడన్గా ఇంకో డెలివరీతో ముందుకు వస్తాడు.సర్లే నా వ్యూహం మార్చుకుందామని అనుకుంటే.. తను ఊహించని రీతిలో అటాక్ చేస్తాడు. లారా అయినా.. ఎవరైనా సరే ఆ బ్యాటర్ వికెట్ పడగొట్టాలనేదే అతడి లక్ష్యం. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో షేన్ వార్న్ దిట్ట. అయితే, నా వరకు మురళీ.. వార్న్ కంటే ఎక్కువగా ఒత్తిడిలోకి నెట్టేస్తాడు.అతడికే ఎక్కువ రేటింగ్అయితే, షేన్ వార్న్ బౌలింగ్లో.. ముఖ్యంగా మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో అతడు అద్భుతమైన స్పెల్తో మాయాజాలం చేయగలడు. తనలా ఇంకెవరూ మ్యాజికల్ స్పెల్ వేయలేరు. కాబట్టి నేను ఈ ఇద్దరిలో వార్న్కు ఎక్కువ రేటింగ్ ఇస్తాను.ఎందుకంటే.. మానసికంగానూ అతడు చాలా బలవంతుడు. తనకు అనుకూలించే పిచ్ల మీద ఆత్మవిశ్వాసంతో దూకుడు ప్రదర్శించగల సత్తా అతడి సొంతం. అతడొక ప్రత్యేకమైన బౌలర్’’ అంటూ బ్రియన్ లారా తన ఓటును షేన్ వార్న్కే వేశాడు.‘ది ఓవర్లాప్ క్రికెట్’ షోలో ఈ మేరకు అత్యుత్తమ స్పిన్నర్ ఎవరన్న అంశంపై లారా తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు. కాగా 52 ఏళ్ల వయసులో షేన్ వార్న్ ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. మార్చి 4, 2022లో థాయ్లాండ్ పర్యటనలో ఉన్నపుడు గుండెపోటుతో అతడు మరణించాడు.ఇక మేటి బ్యాటర్లలో ఒకడైన బ్రియన్ లారా.. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ (400)తో ఆల్టైమ్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికీ ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. కాగా లారా 1990- 2007 వరకు విండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా 131 టెస్టుల్లో 11953 పరుగులు, 299 వన్డేల్లో 10405 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 34 సెంచరీలు, 9 డబుల్ సెంచరీలు చేసిన లారా ఖాతాలో... 19 వన్డే శతకాలు కూడా ఉన్నాయి.చదవండి: జడేజా దూకుడుగా ఆడాల్సింది!.. టీమిండియా దిగ్గజాలకు ఇచ్చిపడేసిన పుజారా -
అతడి ఆటిట్యూడ్ వల్లే టీమిండియా ఓడిపోయింది: మహ్మద్ కైఫ్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు రవీంద్ర జడేజా పోరాడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. 193 పరుగల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక భారత్ ఓటమి పాలైంది.ఈ ఓటమిపై తాజాగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓటమికి కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) ఆటిట్యూడ్ కూడా ఓ కారణమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా లార్డ్స్ టెస్టులో గిల్ కాస్త దూకుడుగా వ్యవహరించాడు.మూడో రోజు ఆట ఆఖరిలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని పరుష పదజాలంతో గిల్ దూషించాడు. సమయాన్ని వృథా చేసేందుకు క్రాలీ ప్రయత్నించడంతో గిల్ తన సహనాన్ని కోల్పోయి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో చాలా మంది మాజీలు గిల్ ప్రవర్తనను తప్పు బట్టారు. తాజాగా ఈ జాబితాలోకి కైఫ్ కూడా చేరాడు."జాక్ క్రాలీతో శుబ్మన్ గిల్ గొడవ పడడం ఇంగ్లండ్ జట్టులో గెలవాలనే కసిని మరింత పెంచింది. ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఘోర ఓటమి తర్వాత వారి బ్యాటింగ్, బౌలింగ్, స్టోక్స్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇంగ్లండ్ కూడా కాస్త డిఫెండ్లో పడింది.కాబట్టి ఆ సమయంలో వారిని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. మన వ్యూహాలను సరిగ్గా అమలు చేసుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది. కానీ గిల్ మాత్రం అనవసరంగా క్రాలీతో గొడపడ్డాడు. ఈ సంఘటనను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యక్తిగతంగా తీసుకున్నాడు. అందుకే ఎప్పుడూ లేని విధంగా బంతితో నిప్పులు చెరిగాడు. శరీరం సహకరించకపోయినా అద్బుతమైన స్పెల్స్ను బౌలింగ్ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. గిల్ ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. అనవసర విషయాల్లో మన ఆటిట్యూడ్ చూపించడం మంచిది కాదు. ఏ విషయాల్లో దూకుడుగా వ్యహరించాలో గిల్ ముందు తెలుసుకోవాలి" అని ఎక్స్లో కైఫ్ రాసుకొచ్చాడు.చదవండి: టూర్లకు తిప్పుతున్నారు.. అరంగేట్రం మాత్రం చేయించరు: భారత మాజీ క్రికెటర్ -
‘అతడిని టూర్లకు తిప్పుతారంతే.. తుదిజట్టులో చోటు ఉండదు’
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ (WV Raman) విమర్శల వర్షం కురిపించాడు. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఆడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. నాయకత్వ బృందం ఆలోచన విధానం, నిర్ణయాలు ఎవరికీ ఓ పట్టాన అర్థం కావంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా టెస్టుల్లో గత కొంతకాలంగా టీమిండియా చేదు ఫలితాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైన భారత్.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకుంది. తాజాగా ఇంగ్లండ్ (IND vs ENG)లో పర్యటిస్తున్న టీమిండియా ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో వెనుకబడి ఉంది.బెంచ్కే పరిమితంఇక ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్ టూర్లోనూ టీమిండియాతో ఉన్న ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Eswaran). అయితే, ఇంత వరకు అతడికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఈ బెంగాల్ వెటరన్ ప్లేయర్ దేశవాళీ క్రికెట్లో అదరగొడుతూ.. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ.. తుదిజట్టులో మాత్రం అతడికి స్థానం దక్కడం లేదు.ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ డబ్ల్యూవీ రామన్ మాట్లాడుతూ.. ‘‘నిజానికి అభిమన్యు ఈశ్వరన్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వాలి. కానీ మేనేజ్మెంట్ అలా చేయడం లేదు. అతడి విషయంలో ఏదో ఒక నిర్ణయమైతే తీసుకోవాలి కదా!టూర్లకు తిప్పుతారంతే.. తుదిజట్టులో చోటు ఉండదుఓ క్రికెటర్ను వరుసగా టూర్లకు తిప్పుతారు.. కానీ తుదిజట్టులో మాత్రం చోటు ఇవ్వరు.. ఇలా చేయడంలో అర్థం ఉందా అసలు?.. ప్రత్యర్థి జట్టు, పిచ్ స్వభావం.. ఇలా పలు అంశాలను బట్టే తుదిజట్టు కూర్పు ఉంటుందని తెలుసు.. కానీ మరీ ఇలా ప్రతిసారీ అతడిని పక్కనపెట్టడం సరికాదు.కోచ్లు, సెలక్టర్లు బాగా ఆలోచించిన తర్వాతే జట్టును ఎంపిక చేస్తారు. మరి.. కొందరిని మాత్రం తుదిజట్టులో కనీసం ఒక్కసారైనా ఎందుకు ఆడించరు?.. తన గురించి యాజమాన్యం ఏమనుకుంటుందో అని సదరు ఆటగాడు కూడా ఆందోళనకు లోనవుతూ ఉంటాడు.అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలి.. జట్టులో ఎలా ఆడించాలన్న అంశాలపై మేనేజ్మెంట్కు కూడా అవగాహన ఉండదు. మరి అలాంటపుడు అసలు ఎంపిక చేయడం ఎందుకు? అభిమన్యు మంచి ప్లేయర్. అయితే, అతడిని ఆడించాలా వద్దా అన్న అంశంపై మేనేజ్మెంట్ ఏదో ఒక నిర్ణయానికి రావాలి.సెంచరీల వీరుడుఅంతేగాని.. సెలక్ట్ చేసిన ప్రతిసారీ బెంచ్కే పరిమితం చేయడం సరికాదు’’ అని యాజమాన్యం తీరును తప్పుబట్టాడు. రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ డబ్ల్యూవీ రామన్ ఈ మేరకు విమర్శలు చేశాడు. కాగా 29 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటికి 103 మ్యాచ్లు ఆడి 49కు పైగా సగటుతో 7841 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 27 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఒక్క మ్యాచ్కే వేటు వేస్తారా?అదే విధంగా.. కేవలం ఒక టెస్టులో విఫలమైనంత మాత్రాన సాయి సుదర్శన్పై వేటు వేయడం కూడా సరికాదని డబ్ల్యూవీ రామన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్తో తొలి టెస్టు సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ తొలి ప్రయత్నంలోనే డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 30 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. రెండో టెస్టు నుంచి అతడిని పక్కనపెట్టారు. మరోవైపు.. వరుస వైఫల్యాల వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్కు మాత్రం ఇప్పటికి జరిగిన మూడు టెస్టుల్లోనూ ఆడే అవకాశం ఇచ్చారు.ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్.చదవండి: అతడికి ఇంకొక్క అవకాశం ఇవ్వండి.. నాలుగో టెస్టులో ఆడించండి: కుంబ్లే -
వరల్డ్ నెం1 టెస్టు బ్యాటర్గా జో రూట్.. దిగజారిన జైశ్వాల్, గిల్ ర్యాంక్లు
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ మళ్లీ అగ్ర పీఠాన్ని అధిరోహించాడు. వారం రోజులు తిరగక ముందే తన సహచర ఆటగాడు హ్యారీ బ్రూక్ను అధిగమించి రూట్ టాప్ ర్యాంక్కు చేరుకున్నాడు. లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో సెంచరీతో చెలరేగిన రూట్.. ఒక స్ధానం మెరుగుపరుచుకుని నెం1 టెస్టు బ్యాటర్గా నిలిచాడు.భారత్ రెండో టెస్టు అనంతరం టాప్ ర్యాంక్కు చేరుకున్న హ్యారీ బ్రూక్.. ఇప్పుడు 862 పాయింట్లతో మూడో స్ధానానికి పడిపోయాడు. టాప్లో రూట్(888) కొనసాగుతుండగా.. విలియమ్సన్(867), బ్రూక్, స్టీవ్ స్మిత్(816) తర్వాత స్ధానాల్లో కొనసాగుతున్నారు. ఇక లార్డ్స్ టెస్టులో విఫలమైన యశస్వి జైశ్వాల్, శుబ్మన్ గిల్ రాంక్లు దిగజారాయి. జైశ్వాల్(801) ఒక్క స్ధానం డ్రాప్ అయ్యి ఐదో స్ధానంలో కొనసాగుతుండగా.. శుబ్మన్ గిల్ (765)ఏకంగా మూడు స్ధానాలు దిగజారి తొమ్మిదో ర్యాంక్కు పడిపోయాడు. అదేవిధంగా రిషబ్ పంత్ కూడా ఒక స్ధానం డ్రాప్ అయ్యి ఎనిమిదో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి టాప్-10 ర్యాంక్లో మొత్తంగా ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు.సెకెండ్ ప్లేయర్గాటెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్లో జో రూట్ అగ్రస్దానాన్ని కైవసం చేసుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. టెస్టుల్లో నెం1 ర్యాంక్లో కొనసాగుతున్న రెండో అతి పెద్ద వయష్కుడిగా రూట్ నిలిచాడు. 34 ఏళ్ల వయస్సులో రూట్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర టాప్లో ఉన్నాడు. సంగక్కర 37 ఏళ్ల వయస్సులో టెస్టుల్లో నెం1 బ్యాటర్గా నిలిచాడు.కాగా లార్డ్స్ టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు పోరాడినప్పటికి విజయం మాత్రం టీమిండియాకు వరించలేదు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: జడేజా దూకుడుగా ఆడాల్సింది!.. టీమిండియా దిగ్గజాలకు ఇచ్చిపడేసిన పుజారా -
జడేజాపై విమర్శలు!.. టీమిండియా దిగ్గజాలకు ఇచ్చిపడేసిన పుజారా
లార్డ్స్ టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతం. టాపార్డర్ చేతులెత్తేసిన వేళ.. టెయిలెండర్లతో కలిసి ఒక్కో పరుగు జత చేస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. భారీ తేడాతో ఓటమి ఖాయమనుకున్న తరుణంలో.. తన నిలకడైన బ్యాటింగ్తో భారత శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించాడు.అయితే, దురదృష్టవశాత్తూ టెయిలెండర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) పదో వికెట్గా వెనుదిరడంతో.. టీమిండియా ఓటమి ఖరారైంది. ఆఖరికి 22 పరుగుల తేడాతో గిల్ సేన పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తంగా 181 బంతులు ఎదుర్కొని అర్ధ శతకం (61; 4 ఫోర్లు, ఒక సిక్సర్) సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచిన జడేజా పోరాటం వృథా అయిపోయింది.జడేజా దూకుడుగా ఆడాల్సింది!అయితే, జడ్డూ జిడ్డు ఇన్నింగ్స్ ఆడకుండా ఉండాల్సిందంటూ టీమిండియా దిగ్గజాలు అనిల్ కుంబ్లే, సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) వంటి వాళ్లు అతడిని విమర్శించడం గమనార్హం. జడేజా కాస్త దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వీరు అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ బ్యాటర్, కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారా మాత్రం భిన్నంగా స్పందించాడు. వీరోచిత పోరాటం చేసిన జడేజాను విమర్శించడం ఎంతమాత్రమూ సరికాదంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.గొప్పగా బ్యాటింగ్ చేశాడు‘‘ఆ పిచ్పై జడేజా వేగంగా పరుగులు చేయడానికి ఆస్కారం లేదు. వికెట్ స్వభావం అలా ఉంది. టెయిలెండర్లు వికెట్ కాపాడుకుంటే.. నెమ్మదిగా అయినా సరే అతడు జట్టును లక్ష్యానికి మరింత చేరువగా తీసుకువచ్చేవాడు.అప్పుడు తనలోని దూకుడును బయటకు తీసి పని పూర్తి చేసేవాడు. నిజానికి అతడు గొప్పగా బ్యాటింగ్ చేశాడు. ఏదేమైనా అలాంటి పిచ్పై పరుగులు రాబట్టడం కష్టతరమనే చెబుతాను. అయితే, జడేజా స్ట్రెయిట్డౌన్ షాట్లు ఆడితే బాగుండేది. అదొక్కటే కాస్త మిస్ అయిందని చెప్పవచ్చు’’ అని పుజారా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది టీమిండియా.ఈ క్రమంలో లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. అయితే, లార్డ్స్లో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉంది. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు (జూలై 23- 27) జరుగనుంది.భారత్ వర్సెస్ ఇంగ్లండ్- మూడో టెస్టు సంక్షిప్త స్కోర్లు🏏ఇంగ్లండ్: 387 & 192🏏భారత్: 387 & 170.చదవండి: అతడికి ఇంకొక్క అవకాశం ఇవ్వండి.. నాలుగో టెస్టులో ఆడించండి: కుంబ్లే -
ఇంగ్లండ్కు బిగ్ షాక్
తాజాగా ముగిసిన లార్డ్స్ టెస్ట్లో భారత్పై స్వల్ప తేడాతో విజయం సాధించి, గెలుపు జోష్లో ఉన్న ఇంగ్లండ్కు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసినందుకు గానూ ఇంగ్లండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో 10 శాతం కోత విధించడంతో పాటు రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను కట్ చేసింది. ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ సభ్యుడు రిచీ రిచర్డ్సన్ ఇంగ్లండ్పై చర్యలకు ఆదేశించాడు.నిర్దేశిత సమయంలోపు ఇంగ్లండ్ రెండు ఓవర్లు వెనుకపడిందని రిచర్డ్సన్ తెలిపాడు. స్లో ఓవర్ రేట్ అనేది ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లోని ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కిందికి వస్తుందని అన్నాడు. స్లో ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘన కింద ఒక్కో ఓవర్కు 5 శాతం మ్యాచ్ ఫీజ్ కోత ఉంటుందని గుర్తు చేశాడు.దీని అదనంగా ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఒక్కో స్లో ఓవర్కు ఓ రేటింగ్ పాయింట్ కోత ఉంటుందని తెలిపాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నేరాన్ని అంగీకరించడంతో పాటు ప్రతిపాదిత శిక్షను స్వీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేదని రిచర్డ్సన్ ప్రకటించాడు.కాగా, లార్డ్స్ టెస్ట్లో (మూడవది) భారత్ ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల స్వల్ప తేడాతో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక బోల్తా పడింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. టెయిలెండర్ల సహకారంతో వీరోచితంగా పోరాడినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జులై 23 నుంచి ప్రారంభం కానుంది. -
అతడికి ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి.. నాలుగో టెస్టులో ఆడించండి: కుంబ్లే
ఇంగ్లండ్తో నాలుగో టెస్టు నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) టీమిండియా నాయకత్వ బృందానికి కీలక సూచనలు చేశాడు. లార్డ్స్ (Lord's Test)లో ఆడించిన తుదిజట్టునే మాంచెస్టర్లోనూ కొనసాగించాలని సూచించాడు. మూడో టెస్టులో టీమిండియా బాగానే ఆడిందని... అయితే, ఆఖరి వరకు పోరాడినా దురదృష్టవశాత్తూ ఓటమిపాలైందని పేర్కొన్నాడు.పొరపాట్లను సరిచేసుకుంటే నాలుగో టెస్టులో అనుకున్న ఫలితాన్ని రాబట్టవచ్చని.. కానీ ఇందుకోసం తుదిజట్టులో మాత్రం మార్పులు అవసరం లేదని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడుతోంది.ఆధిక్యంలో ఆతిథ్య జట్టుఈ క్రమంలో తొలుత లీడ్స్లో ఇంగ్లండ్ గెలుపొందగా.. రెండో టెస్టులో భారత్ ఎడ్జ్బాస్టన్లో జయభేరి మోగించింది. ఇక ఇరుజట్ల మధ్య ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన లార్డ్స్ టెస్టులో మాత్రం గిల్ సేన 22 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఫలితంగా ఇంగ్లండ్కు 2-1తో ఆధిక్యం దక్కింది.కరుణ్ నాయర్ వరుస వైఫల్యాలుకాగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (16, 6)తో పాటు కీలక ఆటగాళ్లు యశస్వి జైస్వాల్(13, 0 ), కరుణ్ నాయర్ (40, 14) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ సైతం తొలి ఇన్నింగ్స్ (74)లో రనౌట్ కావడం.. రెండో ఇన్నింగ్స్ (9)లో ఫెయిల్ అవడం టీమిండియా కొంపముంచింది.అయితే, వీరిలో ప్రధానంగా కరుణ్ నాయర్ వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన ఈ విదర్భ స్టార్కు ఇంగ్లండ్లో వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం ఇందుకు కారణం.ఇంగ్లండ్తో సిరీస్లో కరుణ్ ఇప్పటి వరకు చేసిన స్కోర్లు వరుసగా.. 0, 20, 31, 26, 40, 14. ముఖ్యంగా లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో అతడు అవుటైన తీరు అభిమానులకు సైతం ఆగ్రహం తెప్పించింది. దీంతో అతడిపై వేటు వేయాలనే డిమాండ్లు పెరిగాయి.పంత్ విషయంలో నో క్లారిటీఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే మాత్రం కరుణ్ నాయర్కు మద్దతుగా నిలవడం విశేషం. నాలుగో టెస్టులో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘మాంచెస్టర్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగితేనే బాగుంటుంది. నిజానికి లార్డ్స్లో మనవాళ్లు అద్భుతంగా ఆడారు.అవును.. మనం 22 పరుగుల తేడాతో ఓడిపోయిన మాట వాస్తవమే. అయినా మనవాళ్లు ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతం. గాయాల బెడదలు లేకుంటే ఇదే జట్టుతో కొనసాగవచ్చు. అయితే, రిషభ్ పంత్ (వేలికి గాయం) విషయంలో మాత్రం నేనేమీ కచ్చితంగా చెప్పలేను.అతడికి ఇంకొక్క అవకాశం ఇవ్వండిమరొక విషయం.. కరుణ్ నాయర్ తన చోటును పదిలం చేసుకుంటాడనే అనుకుంటున్నాను. ఎందుకంటే.. తొలి ఇన్నింగ్స్లో అతడు రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో అతడు అవుటైన తీరు నిరాశపరిచినా.. అతడి బ్యాటింగ్కు మాత్రం పేరుపెట్టలేము. అతడు నెలకొల్పిన భాగస్వామ్యం కూడా మ్యాచ్లో కీలకమైనదే.తొలి ఇన్నింగ్స్లో ఒకవేళ నాయర్ ముందే అవుటై ఉంటే.. అప్పుడు గిల్ మరింత ముందుగానే కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వచ్చేది. తొలి 20- 25 ఓవర్లు కీలకం. కాబట్టి ఈ విషయంలో నాయర్ను తప్పుబట్టడానికి లేదు. అతడు దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు.జో రూట్ అద్భుతమైన క్యాచ్ పట్టడం వల్ల వెనుదిరిగాడు. కాబట్టి ఇంకొక్క అవకాశం పొందేందుకు కరుణ్ నాయర్ అర్హుడు’’ అని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా జూలై 23- 27 మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. భారత్ ఎవరితో ఆడనుందంటే..?Ups & downs, fightbacks & heartbreaks, Day 5 of the Lord's Test had it all! 🙌"In the end, Cricket was the real winner!" ❤#ENGvIND | 4th Test starts WED, 23rd JULY, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/ak9WkvZ2G2— Star Sports (@StarSportsIndia) July 14, 2025 -
క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనత సాధించిన రవీంద్ర జడేజా
తాజాగా ముగిన లార్డ్స్ టెస్ట్లో వీరోచితమైన పోరాటం చేసి భారత్ను గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించి విఫలమైన రవీంద్ర జడేజా ఓ అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో జడ్డూ భారత్ను గెలిపించే ప్రయత్నంలో భాగంగా అజేయమైన 61 పరుగులు చేయడంతో అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా క్రికెట్ చరిత్రలో 7000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడంతో పాటు 600కు పైగా వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. జడ్డూకు ముందు కపిల్ దేవ్, షాన్ పొల్లాక్, షకీబ్ అల్ హసన్ మాత్రమే ఈ ఘనత సాధించారు.కపిల్ 356 మ్యాచ్ల్లో 9031 పరుగులు చేసి 687 వికెట్లు తీయగా.. పొల్లాక్ 423 మ్యాచ్ల్లో 7386 పరుగులు, 829 వికెట్లు.. షకీబ్ 447 మ్యాచ్ల్లో 14730 పరుగులు, 712 వికెట్లు తీశారు. జడేజా విషయానికొస్తే.. లార్డ్స్ టెస్ట్తో కలుపుకొని జడ్డూ 302 ఇన్నింగ్స్ల్లో 33.41 సగటున, నాలుగు సెంచరీలు, 39 అర్ద సెంచరీల సాయంతో 7018 పరుగులు చేశాడు. బౌలింగ్లో 29.33 సగటున 17 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 611 వికెట్లు తీశాడు.ఫార్మాట్ల వారీగా చూస్తే.. గతేడాది పొట్టి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జడ్డూ.. ఈ ఫార్మాట్లో 41 ఇన్నింగ్స్ల్లో 515 పరుగులు చేసి, 71 ఇన్నింగ్స్ల్లో 54 వికెట్లు తీశాడు. వన్డేల విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో 137 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన జడ్డూ 32.63 సగటున 13 అర్ద శతకాల సాయంతో 2806 పరుగులు చేసి, 196 ఇన్నింగ్స్ల్లో 231 వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పోలిస్తే జడేజాకు టెస్ట్ల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో జడ్డూ 124 ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీలు, 26 అర్ద సెంచరీల సాయంతో 36.97 సగటున 3697 పరుగులు చేశాడు. బౌలింగ్లో 156 ఇన్నింగ్స్ల్లో 15 ఐదు వికెట్ల ప్రదర్శనలు, మూడు 10 వికెట్ల ప్రదర్శనల సాయంతో 326 వికెట్లు తీశాడు.కాగా, లార్డ్స్ టెస్ట్లో (మూడవది) భారత్ ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల స్వల్ప తేడాతో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక బోల్తా పడింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. టెయిలెండర్ల సహకారంతో వీరోచితంగా పోరాడినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. -
టీమిండియా చెత్త రికార్డు.. ఆ విషయంలో పాకిస్తాన్, వెస్టిండీస్ కంటే దారుణం
లార్డ్స్ టెస్ట్లో (మూడవది) భారత్ ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల స్వల్ప తేడాతో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక బోల్తా పడింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. టెయిలెండర్ల సహకారంతో వీరోచితంగా పోరాడినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.లార్డ్స్ టెస్ట్లో టీమిండియా ఎంత పోరాడి ఓడినా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2013 నుంచి టీమిండియా 26 టెస్ట్ల్లో 150 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ కేవలం 2 సార్లు మాత్రమే విజయవంతమైంది. 17 మ్యాచ్ల్లో పరాజయంపాలవగా.. 7 మ్యాచ్లు డ్రా అయ్యాయి. భారత్ గెలిచిన రెండు సందర్భాల్లో ఒకటి 2021లో బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాపై కాగా.. రెండోది 2024లో రాంచీలో ఇంగ్లండ్పై.ఛేజింగ్ కష్టాలు.. సచిన్ రిటైర్మెంట్ నుంచి ఇంతే..!భారత్కు ఛేజింగ్ కష్టాలు కొత్తేమీ కానప్పటికీ.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ నుంచి పరిస్థితి మరింత దిగజారింది. 2013 నవంబర్లో సచిన్ టెస్ట్లకు గుడ్బై చెప్పగా.. అదే ఏడాది డిసెంబర్ నుంచి భారత్ 26 టెస్ట్ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే 150 ప్లస్ లక్ష్యాలను ఛేదించింది.గడిచిన 12 ఏళ్లలో టీమిండియా ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా చలామణి అయినప్పటికీ ఛేజింగ్ కష్టాలు ఎదుర్కొంది. స్వల్ప లక్ష్య ఛేదనల్లో పాకిస్తాన్, వెస్టిండీస్ లాంటి జట్లు కూడా భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ జాబితాలో టీమిండియా ఎనిమిదో స్థానంలో ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది.గడిచిన 12 ఏళ్లలో భారత్ 250 పరుగులలోపు లక్ష్యాలను ఛేదిస్తూ ఓడిన సందర్భాలు..2018 బర్మింగ్హామ్లో ఇంగ్లండ్పై 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 162 పరుగులకే ఆలౌట్2018 సౌతాంప్టన్లో ఇంగ్లండ్పై 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 184 పరుగులకే ఆలౌట్.2015 గాలెలో శ్రీలంకపై 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 112 పరుగులకే ఆలౌట్.2018 కేప్టౌన్లో దక్షిణాఫ్రికాపై 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 135 పరుగులకే ఆలౌట్.2024 హైదరాబాద్లో ఇంగ్లండ్పై 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 202 పరుగులకే ఆలౌట్. -
టఫ్ ఫైట్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): యూరప్ పర్యటనలో భారత్ ‘ఎ’ పురుషుల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మంగళవారం ఇంగ్లండ్తో జరిగిన హోరాహోరీ పోరులో భారత ‘ఎ’ జట్టు 2–3 గోల్స్ తేడాతో ఓడింది. మన జట్టు తరఫున మణీందర్ సింగ్, ఉత్తమ్ సింగ్ చెరో గోల్ చేశారు. ఈ టూర్లో భాగంగా తొలి మూడు మ్యాచ్ల్లో గెలిచి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకున్న భారత్... ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడింది.‘ప్రతి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. గత రెండు మ్యాచ్ల్లో పోరాడినా ఫలితం దక్కలేదు. మెరుగైన ప్రత్యర్థులతో మరో మూడు మ్యాచ్లు ఆడనున్నాం. వాటిలో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తాం’ అని కోచ్ శివేంద్ర సింగ్ అన్నాడు. తదుపరి మ్యాచ్లో బెల్జియంతో భారత జట్టు ఆడుతుంది. -
వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. భారత్ ఎవరితో ఆడనుందంటే..?
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్కు సంబంధించి వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ నిన్న (జులై 15) విడుదలైంది. ఈ మ్యాచ్లు సెప్టెంబర్ 25-28 మధ్య తేదీల్లో జరుగనున్నాయి. వరల్డ్కప్ మెయిన్ మ్యాచ్లు సెప్టెంబర్ 20 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జరుగనున్నాయి.ప్రపంచకప్కు అర్హత సాధించిన 8 జట్లు వార్మప్ మ్యాచ్ల్లో పాల్గొంటాయి. ఆస్ట్రేలియా మినహా ప్రతి జట్టు రెండ్రెండు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. వార్మప్ మ్యాచ్ల కోసం నాలుగు వేదికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వార్మప్ మ్యాచ్ల్లో భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్లు కూడా పాల్గొంటాయి. శ్రీలంక-ఏ జట్టు రెండు, భారత-ఏ జట్టు ఓ మ్యాచ్ ఆడనుంది.వార్మప్ మ్యాచ్ల్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 25న భారత్, ఇంగ్లండ్ మధ్య బెంగళూరు వేదికగా జరుగనుంది. వరల్డ్కప్ సన్నాహకంగా మొత్తం 9 వార్మప్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. భారత్ రెండో వార్మప్ మ్యాచ్ కూడా బెంగళూరులోనే సెప్టెంబర్ 27న న్యూజిలాండ్తో జరుగనుంది. అన్ని వార్మప్ మ్యాచ్లు డే అండ్ నైట్ ఫార్మాట్లో జరుగుతాయి.వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్..25 సెప్టెంబర్: ఇండియా v ఇంగ్లాండ్, BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్, బెంగళూరు, 3 PM25 సెప్టెంబర్: దక్షిణాఫ్రికా v న్యూజిలాండ్, M. చిన్నస్వామి, బెంగళూరు, 3 PM25 సెప్టెంబర్: శ్రీలంక v పాకిస్థాన్, కొలంబో క్రికెట్ క్లబ్, కొలంబో, 3 PM25 సెప్టెంబర్: బంగ్లాదేశ్ v శ్రీలంక ‘ఎ’, ఆర్.ప్రేమదాస, కొలంబో, 3 PM27 సెప్టెంబర్: ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్, బెంగళూరు, 3 PM27 సెప్టెంబర్: భారత్ v న్యూజిలాండ్, ఎం. చిన్నస్వామి, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు27 సెప్టెంబర్: శ్రీలంక v బంగ్లాదేశ్, కొలంబో క్రికెట్ క్లబ్, కొలంబో, 3 PM28 సెప్టెంబర్: దక్షిణాఫ్రికా v ఇండియా ‘ఎ’, BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్, బెంగళూరు, 3 PM28 సెప్టెంబర్: పాకిస్తాన్ v శ్రీలంక ‘ఎ’, కొలంబో క్రికెట్ క్లబ్, కొలంబో, 3 PM -
ఆర్సీబీ ప్లేయర్కు జాక్పాట్.. వేలంలో అత్యధిక ధర
నిన్న (జులై 15) జరిగిన మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20 టోర్నీ 2025 ఎడిషన్ వేలంలో ఆర్సీబీ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్ జాక్పాట్ కొట్టాడు. ఈ వేలంలో పడిక్కల్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. పడిక్కల్ను హుబ్లీ టైగర్స్ రూ. 13.20 లక్షలకు సొంతం చేసుకుంది. పడిక్కల్ తర్వాత ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా సన్రైజర్స్ హిట్టర్ అభినవ్ మనోహర్ (12.20 లక్షలు), కేకేఆర్ వెటరన్ మనీశ్ పాండే (12.20 లక్షలు), విధ్వత్ కావేరప్ప (10.80 లక్షలు), విద్యాధర్ పాటిల్ (8.40 లక్షలు) నిలిచారు.ఈ వేలంలో రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్కు నిరాశ ఎదురైంది. అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత సీజన్లో సమిత్ మైసూర్ వారియర్స్కు ఆడాడు. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కరుణ్ నాయర్ (6.8 లక్షలు), ప్రసిద్ద్ కృష్ణ (2 లక్షలు), మయాంక్ అగర్వాల్ (14 లక్షలు) లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు.మహారాజా ట్రోఫీ 2025 ఎడిషన్ ఆగస్ట్ 11 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మొదలుకానుంది. ఈ లీగ్లో మొత్తం 6 ఫ్రాంచైజీలు (మైసూర్ వారియర్స్, హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, మరియు గుల్బర్గా మిస్టిక్స్) పాల్గొంటాయి. ప్రతి ఫ్రాంచైజీ 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసుకుంది.జట్ల వివరాలు..శివమొగ్గ లయన్స్కౌశిక్ వి, హార్దిక్ రాజ్, అవినాష్ బి, నిహాల్ ఉల్లాల్, విధ్వత్ కావేరప్ప, అనిరుధ జోషి, అనీశ్వర్ గౌతమ్, ధృవ్ ప్రభాకర్, సంజయ్ సి, ఆనంద్ దొడ్డమణి, సాహిల్ శర్మ, భరత్ ధురి, దీపక్ దేవాడిగ, రోహిత్ కుమార్ కె, తుషార్ సింగ్, దర్శన్ ఎంబి. మరిబసవ గౌడ, శిరీష్ బాల్గార్మైసూర్ వారియర్స్కరుణ్ నాయర్, కార్తీక్ CA, ప్రసిద్ధ్ కృష్ణ, కార్తీక్ SU, మనీష్ పాండే, గౌతమ్ K, యశోవర్ధన్ పరంతప్, వెంకటేష్ M, హర్షిల్ ధర్మాని, లంకేష్ KS, కుమార్ LR, గౌతమ్ మిశ్రా, శిఖర్ శెట్టి, సుమిత్ కుమార్, ధనుష్ గౌడ, కుశాల్ M వాధ్వాని, శరత్ శ్రీనివాస్, షమంత్మంగళూరు డ్రాగన్స్అభిలాష్ శెట్టి, మక్నీల్ నోరోన్హా, లోచన్ ఎస్ గౌడ, పరాస్ గుర్బాక్స్ ఆర్య, శరత్ బిఆర్, రోని మోర్, శ్రేయాస్ గోపాల్, మేలు క్రాంతి కుమార్, సచిన్ షిండే, అనీష్ కెవి, తిప్పా రెడ్డి, ఆదిత్య నాయర్, ఆదర్శ్ ప్రజ్వల్, అభిషేక్ ప్రభాకర్, శివరాజ్ ఎస్, పల్లవ్ కుమార్ దాస్హుబ్లీ టైగర్స్కెసి కరియప్ప, శ్రీజిత్ కెఎల్, కార్తికేయ కెపి, మాన్వత్ కుమార్ ఎల్, అభినవ్ మనోహర్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ తాహా, విజయరాజ్ బి, ప్రఖర్ చతుర్వేది, సంకల్ప్ ఎస్ఎస్, సమర్థ్ నాగరాజ్, రక్షిత్ ఎస్, నితిన్ ఎస్ నాగరాజా, యష్ రాజ్ పుంజా, రితేష్ ఎల్ భత్కల్, శ్రీషా ఆచార్, నాథన్ మెల్లో, నిశిచిత్ పాయ్గుల్బర్గా మిస్టిక్స్వైషాక్ విజయ్కుమార్, లువ్నిత్ సిసోడియా, ప్రవీణ్ దూబే, స్మరణ్ ఆర్, సిద్ధత్ కెవి, మోనిష్ రెడ్డి, హర్ష వర్ధన్ ఖుబా, పృథ్వీరాజ్, లవిష్ కౌశల్, శీతల్ కుమార్, జాస్పర్ ఇజె, మోహిత్ బిఎ, ఫైజాన్ రైజ్, సౌరబ్ ఎమ్ ముత్తూర్, ఎస్జె నికిన్ జోస్, ప్రజ్వల్ పవన్, యూనిస్ అలీ బేగ్, లిఖిత్ బన్నూర్బెంగళూరు బ్లాస్టర్స్మయాంక్ అగర్వాల్, శుభాంగ్ హెగ్డే, నవీన్ MG, సూరజ్ అహుజా, A రోహన్ పాటిల్, చేతన్ LR, మొహ్సిన్ ఖాన్, విద్యాధర్ పాటిల్, సిద్ధార్థ్ అఖిల్, మాధవ్ ప్రకాష్ బజాజ్, రోహన్ నవీన్, కృతిక్ కృష్ణ, అద్విత్ ఎం శెట్టి, భువన్ మోహన్ రాజు, రోహన్ ఎం రాజు, నిరంజన్ నాయక్, ప్రతీక్ జైన్, ఇషాన్ ఎస్ -
భారత్తో తొలి టెస్ట్.. బ్యాట్తో విఫలమైనా, బంతితో చెలరేగిన మైఖేల్ వాన్ తనయుడు
భారత్, ఇంగ్లండ్ అండర్ 19 జట్ల మధ్య జరిగిన తొలి యూత్ టెస్ట్ డ్రాగా ముగిసింది. బెకెన్హమ్లోని కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆట చివరి రోజు అయిన నాలుగో రోజు భారత్ నిర్దేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 270 పరుగుల స్కోర్ వద్ద ఆగిపోయింది. భారత బౌలర్లకు మరికాస్త సమయం దొరికివుంటే ఈ మ్యాచ్లో ఫలితం తేలిది. విజయానికి యంగ్ ఇండియా మరో 3 వికెట్ల దూరంలో మాత్రమే ఉండింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ సారధి హమ్జా షేక్ (112) అద్భుతమైన సెంచరీతో ప్రతిఘటించారు. లోయర్ మిడిలార్డర్ బ్యాటర్లు బెన్ మేస్ (51), థామస్ రూ (50) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అంబరీష్ 2, దేవేంద్రన్, అన్మోల్జీత్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు.అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్లో 248 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ (56), విహాన్ మల్హోత్రా (63), అంబరీష్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కెప్టెన్ ఆయుశ్ మాత్రే 32 పరుగులకు ఔటయ్యాడు.బ్యాట్తో విఫలమైనా, బంతితో చెలరేగిన ఆర్చీ వాన్ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ మైఖేల్ వాన్ తనయుడు ఆర్చీ వాన్ బ్యాటింగ్లో రెండు ఇన్నింగ్స్ల్లో (2, 3) విఫలమైనా బంతితో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీసిన వాన్.. రెండో ఇన్నింగ్స్లో మరింత రెచ్చిపోయి ఏకంగా 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.మాత్రే సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్ కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 540 పరుగులకు ఆలౌటైంది. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ (14) ఈ ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు.సెంచరీ మిస్ చేసుకున్న ఫ్లింటాఫ్ తనయుడుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ (93) సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్లో 439 పరుగులకు ఆలౌటైంది. రాకీతో పాటు కెప్టెన్ హమ్జా షేక్ (84) సత్తా చాటారు. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు ఎకాంశ్ సింగ్ (59), రాల్ఫీ ఆల్బర్ట్ (50) అర్ద సెంచరీలతో రాణించారు.భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 3 వికెట్లతో సత్తా చాటగా.. అంబరీష్, వైభవ్ సూర్యవంశీ చెరో 2.. దీపేశ్ దేవేంద్రన్, మొహమ్మద్ ఎనాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు. రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో రెండో మ్యాచ్ జులై 20 నుంచి ప్రారంభం కానుంది. -
సిరాజ్ ఔటైనప్పుడు ఎలా అనిపించింది.. గిల్కు బ్రిటన్ రాజు ప్రశ్న
లండన్: ఇంగ్లండ్తో మూడో టెస్టులో చివరి బ్యాటర్ ఔటైనపుడు ఎలా అనిపించిందని బ్రిటన్ రాజు చార్లెస్-3 టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ను ప్రశ్నించారు. మంగళవారం లండన్లోని క్లారెన్స్ హౌస్ గార్డెన్లో కింగ్ చార్లెస్... భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లతో ముచ్చటించారు.ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన మూడో మ్యాచ్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. టాపార్డర్ ఆకట్టుకోలేకపోయినా... ఆఖర్లో టెయిలెండర్లు అద్భుతంగా పోరాడటంతో ఒకదశలో భారత జట్టు విజయం సాధిస్తుందనిపించింది.కానీ హైదరాబాదీ సిరాజ్ చివరి వికెట్ రూపంలో వెనుదిరగడంతో టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. బషీర్ వేసిన బంతిని సిరాజ్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా... బంతి నెమ్మదిగా వెళ్లి వికెట్లను తాకింది. దీంతో భారత్కు పరాజయం తప్పలేదు.భారత జట్లకు ఆతిథ్యమిచ్చిన సందర్భంగా కింగ్ చార్లెస్ దీని గురించి భారత సారథితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లండ్లో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి, డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా తదితరులు పాల్గొన్నారు.కింగ్ చార్లెస్తో భేటీ అనంతరం దానికి సంబంధించిన అంశాలను గిల్ పంచుకున్నాడు.‘కింగ్ చార్లెస్తో కలవడం చాలా బాగుంది. ఎన్నో విషయాల గురించి ఆయన మాట్లాడారు. మూడో టెస్టులో చివరి బ్యాట్స్మన్ ఔట్ అయిన విధానం చాలా దురదృష్టకరమని అన్నారు. అనుకోకుండా బంతి వికెట్ల మీదకు వెళ్లిందన్నారు. ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది అని ప్రశ్నించారు. అది దురదృష్టకరమని... సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన చేస్తామని కింగ్ చార్లెస్కు చెప్పాం.ఇంగ్లండ్లో ఎక్కడ మ్యాచ్లు ఆడినా మాకు విశేష ఆదరణ దక్కుతుంది. అందుకు తగ్గట్లే జట్టు కూడా విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తోంది. సిరీస్లో ఇప్పటి వరకు ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. మూడు మ్యాచ్లూ ప్రేక్షకులను అలరించాయి. టెస్టు మ్యాచ్ చివరి రోజు చివరి సెషన్లో ఒక జట్టు స్వల్ప తేడాతో మాత్రమే ఓడిందంటే... ఆ మ్యాచ్లో ‘క్రికెట్’ గెలిచినట్లే’ అని గిల్ అన్నాడు. ఇక భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో కింగ్ చార్లెస్ ప్రయాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కింగ్తో భేటీ అనంతరం నాలుగో టెస్టు కోసం పురుషుల జట్టు మాంచెస్టర్కు బయలుదేరగా... మహిళల జట్టు వన్డే సిరీస్ కోసం సౌతాంప్టన్కు తిరుగు పయనమైంది. -
రెండు రోజులముందుగానే...'క్రికెట్... రైట్ రైట్'...
లాస్ ఏంజెలిస్: మరో మూడేళ్ల తర్వాత జరగనున్న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ షెడ్యూల్ విడుదలైంది. 2028 జూలై 14 నుంచి 30 వరకు ఈ విశ్వక్రీడల సంరంభం కొనసాగనుంది. అయితే సంప్రదాయానికి భిన్నంగా ఈ ఏడాది పలు క్రీడాంశాల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు ముందే ఆరంభమయ్యే క్రీడాంశాల సంఖ్య పెరగగా... విశ్వక్రీడల చివర్లో నిర్వహించే అథ్లెటిక్స్ను ఈ సారి ముందే జరపనున్నారు. మొత్తం 351 మెడల్ ఈవెంట్స్ జరగనున్న ఈ విశ్వక్రీడల షెడ్యూల్లోని కొన్ని విశేషాలు... » 2028 జూలై 14న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుక జరగనుండగా... అంతకు రెండు రోజుల ముందే పలు క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. 1932, 1984 ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలిచిన లాస్ ఏంజెలిస్లోని విఖ్యాత ఎల్ఏ మెమోరియల్ కొలోజియంతోపాటు ఇంగ్లెవుడ్లోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ముగింపు వేడుకలకు ఎల్ఏ మెమోరియల్ కొలోజియం వేదికగా నిలుస్తుంది. » బాస్కెట్బాల్, క్రికెట్, హాకీ, హ్యాండ్బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్బాల్, వాటర్ పోలో వంటి ఈవెంట్లలో పోటీలు ముందే మొదలవనున్నాయి. » 1920 ఒలింపిక్స్ తర్వాత... విశ్వక్రీడల ప్రారంభ వేడుకకు ముందు ఇన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలు కావడం ఇదే తొలిసారి. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ, హ్యాండ్బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్బాల్ పోటీలు మాత్రమే ముందు ప్రారంభించారు. » ప్రధాన క్రీడా వేదిక లాస్ ఏంజెలిస్కు 50 కిలోమీటర్ల దూరంలోని పొమెనాలో క్రికెట్ పోటీలు జరగనుండగా... జూలై 12న ప్రారంభం కానున్న ఈ పోటీలు 29న ముగియనున్నాయి. జూలై 20, 29న మెడల్ మ్యాచ్లు నిర్వహిస్తారు. » టి20 ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీలో... పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొననున్నాయి. 1900 ఒలింపిక్స్లో చివరిసారి క్రికెట్ పోటీలు నిర్వహించగా... సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ప్రవేశ పెట్టారు. » అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) క్రికెట్తో పాటు బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రాస్, స్క్వాష్ వంటి పలు క్రీడాంశాలను లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో చేర్చేందుకు అనుమతి ఇచ్చింది. » ఆరంభ వేడుక తదుపరి రోజు అంటే జూలై 15న ట్రయాథ్లాన్లో తొలి మెడల్ ఈవెంట్ జరగనుంది. » ఒలింపిక్స్లో స్విమ్మింగ్ పోటీలు ముగిసిన తర్వాత అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం పరిపాటి కాగా... ఈసారి మొదట అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి చివరి వారంలో స్విమ్మింగ్ ఈవెంట్లు జరపనున్నారు. » 2028 జూలై 30న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు నిర్వహించనుండగా... చివరగా స్విమ్మింగ్ పోటీలు జరుగుతాయి. -
ఇక వన్డే సిరీస్ లక్ష్యంగా...
సౌతాంప్టన్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్లో పాల్గొనేందుకు వచ్చిన భారత మహిళల జట్టు మొదటి మిషన్ను విజయవంతంగా పూర్తిచేసింది. ఐదు టి20ల సిరీస్ను 3–2తో కైవసం చేసుకుంది. ఇప్పుడు రెండో మిషన్ కోసం శ్రమించేందుకు సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు ఇక్కడ తొలి వన్డే జరుగుతుంది. పొట్టి సిరీస్ ఇచ్చిన విజయోత్సాహంతో హర్మన్ప్రీత్ బృందం ఆత్మవిశ్వాసంతో ఉండగా... సొంతగడ్డపై సిరీస్ను కోల్పోయామన్న కసితో ఇంగ్లండ్ ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా వన్డే సిరీస్నూ కోల్పోయేందుకు ఏమాత్రం సిద్ధంగా లేని ఆతిథ్య జట్టు తొలి మ్యాచ్ నుంచి పట్టుబిగించాలని భావిస్తోంది. జోరు మీదున్న టీమిండియా ఇక్కడ తాజా టి20 సిరీస్లోనే కాదు... ఇటీవల శ్రీలంక గడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లోనూ భారత్ విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా, శ్రీలంకలను మట్టికరిపించింది. ఇప్పుడు ఇంగ్లండ్తో ద్వైపాక్షిక సిరీస్లోనూ గెలిచి వన్డే ప్రపంచకప్కు ముందు పూర్తిస్థాయి సన్నద్ధతను చాటాలని హర్మన్ప్రీత్ బృందం ఆశిస్తోంది. షఫాలీ వర్మ స్థానంలో యువ ఓపెనర్ ప్రతీక రావల్, స్మృతి మంధాన భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. ముక్కోణపు సిరీస్లో చెలరేగిన ప్రతీక, ఇక్కడ టి20 సిరీస్లో అదరగొట్టిన మంధాన వన్డేల్లో శుభారంభమిస్తే... జెమీమా, హర్మన్ప్రీత్, హర్లీన్, రిచా ఘోష్ మిడిలార్డర్ను చక్కబెట్టేస్తారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే తెలుగుతేజం స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి మ్యాచ్ మ్యాచ్కి పురోగతి సాధిస్తోంది. ఇంగ్లండ్లాంటి పిచ్లపై స్పిన్ మ్యాజిక్తో ప్రత్యర్థుల్ని కట్టిపడేయడం భారత జట్టుకు అదనపు బలం కానుంది. అనుభవజ్ఞులైన దీప్తి శర్మ, అరుంధతి రెడ్డిలతో కూడిన బౌలింగ్ దళం ఓవరాల్ పటిష్టంగా ఉంది. ఇక ఆతిథ్య జట్టు విషయానికొస్తే రెగ్యులర్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ అందుబాటులోకి రావడం జట్టుకు కాస్త లాభించే అంశం. అయితే 20 ఓవర్లనే సరిగ్గా ఎదుర్కోలేకపోయిన బాధ్యతలేని బ్యాటింగ్ దళంతో 50 ఓవర్ల వన్డేలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీక, హర్లీన్, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, అమన్జోత్, అరుంధతి. ఇంగ్లండ్: నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), సోఫియా, టామీ బ్యూమోంట్, సోఫీ ఎకిల్స్టోన్, లారెన్ బెల్, బౌచియర్, క్యాప్సీ, కేట్ క్రాస్, చార్లీ డీన్, అమీ జోన్స్, లారెన్ ఫిలెర్.76 భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 76 వన్డేలు జరిగాయి. 34 మ్యాచ్ల్లో భారత్, 40 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. మరో రెండు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు.35 ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్తో భారత జట్టు ఆడిన మ్యాచ్లు. ఇందులో 9 మ్యాచ్ల్లో భారత్ నెగ్గగా... 24 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ విజయం సాధించాయి. రెండు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. -
మళ్లీ టాప్–10లోకి షఫాలీ వర్మ
దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్లో తిరిగి టాప్–10లోకి దూసుకొచ్చింది. ఇంగ్లండ్తో సిరీస్లో 176 పరుగులతో మెరిసిన షఫాలీ... ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో నాలుగు స్థానాలు ఎగబాకి 655 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్కు చేరింది. ఫామ్లో లేని కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన షఫాలీ పునరాగమనంలో ఇంగ్లండ్పై 158.56 స్ట్రయిక్రేట్తో ఆకట్టుకుంది. దాని ఫలితంగానే ర్యాంకింగ్స్లో ముందంజ వేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి స్మృతి మంధాన (767 పాయింట్లు) మూడో ర్యాంక్లో కొనసాగుతోంది. బెత్ మూనీ (794 పాయింట్లు; ఆ్రస్టేలియా), హీలీ మాథ్యూస్ (774 పాయింట్లు; వెస్టిండీస్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ రెండు స్థానాలు కోల్పోయి 14వ ర్యాంక్కు పరిమితం కాగా... కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ 15వ స్థానంలో కొనసాగుతోంది. బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ దీప్తి శర్మ (732 పాయిట్లు) ఒక స్థానం కోల్పోయి 3వ ర్యాంక్లో ఉండగా... రాధా యాదవ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 15వ ర్యాంక్కు చేరింది. పాకిస్తాన్ బౌలర్ సాదియా ఇక్బాల్ అగ్రస్థానంలో ఉంది. హైదరాబాదీ బౌలర్ అరుంధతి రెడ్డి నాలుగు స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్లో నిలిచింది. -
రుతపర్ణ–శ్వేతపర్ణ జోడీ ఓటమి
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు శుభారంభం లభించలేదు. టోర్నీ తొలి రోజు మహిళల డబుల్స్ విభాగంలో ‘పాండా సిస్టర్స్’ జోడీ రుతపర్ణ–శ్వేతపర్ణ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. కొకోనా ఇషికావా–మైకో కవాజోయి (జపాన్) ద్వయంతో జరిగిన మ్యాచ్లో ఒడిశాకు చెందిన రుతపర్ణ–శ్వేతపర్ణ 13–21, 7–21తో ఓడిపోయింది. 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రెండు గేముల్లో ఆరంభ దశలో రుతపర్ణ–శ్వేతపర్ణ ఆకట్టుకున్నా... ఆ తర్వాత తడబడ్డారు. నేడు జరిగే మ్యాచ్ల్లో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో దక్షిణ కొరియా ప్లేయర్, ప్రపంచ 14వ ర్యాంకర్ సిమ్ జు యున్తో పీవీ సింధు... ప్రపంచ 7వ ర్యాంకర్ పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్)తో ఉన్నతి హుడా; రక్షిత శ్రీతో అనుపమ పోటీపడతారు. మరోవైపు పురుషుల సింగిల్స్లో తొలి రౌండ్లో చైనా ప్లేయర్ వాంగ్ జెంగ్ జింగ్తో లక్ష్య సేన్ ఆడతాడు. పురుషుల డబుల్స్లో భారత్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; హరిహరన్–రూబన్ కుమార్ జోడీలు పోటీపడుతున్నాయి. తొలి రౌండ్లో కాంగ్ మిన్ హియుక్–కి డాంగ్ జు (దక్షిణ కొరియా)లతో సాతి్వక్–చిరాగ్; కిమ్ వన్ హో–సియో సెంగ్ జే (దక్షిణ కొరియా)లతో హరిహరన్–రూబన్ తలపడతారు. -
బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో విజయం ఆఖరికి ఇంగ్లండ్ను వరించింది. ఇంగ్లండ్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ది కీలక పాత్ర. స్టోక్సీ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు.ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు కలిపి బ్యాటింగ్లో 77 పరుగులు చేసిన స్టోక్స్.. బౌలింగ్లో 5 కీలక వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం(టెస్టు క్రికెట్)లో నాలుగు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్గా స్టోక్స్ నిలిచాడు.ఈ మ్యాచ్ ముందు వరకు స్టోక్స్.. జో రూట్ (ఇంగ్లండ్), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), గ్లెన్ మెక్గ్రాత్ (ఆస్ట్రేలియా)లతో కలిసి చెరో మూడేసి అవార్డులతో సంయుక్తంగా ఉన్నాడు. తాజా మ్యాచ్తో ఈ దిగ్గజ త్రయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ అధిగమించాడు.స్టోక్స్ తొలిసారిగా 2015లో లార్డ్స్ మైదానంలో ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 2017,2019లో ఈ అవార్డు అతడికి వరించింది. మళ్లీ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత ఐకానిక్ గ్రౌండ్లో ప్లేయర్గా ఆఫ్ది మ్యాచ్గా స్టోక్స్ నిలిచాడు.ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుందిఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి లైమ్ డాసన్ వచ్చాడు. భారత్ కూడా తమ తుది జట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.చదవండి: భారత్ ఓటమికి కారణమదే.. అతడు మాత్రం అద్భుతం: సునీల్ గవాస్కర్ -
రాహుల్ ద్రవిడ్ కొడుకుకు బిగ్ షాక్..
బెంగళూరు వేదికగా మంగళవారం మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20 టోర్నీ-2025 వేలం జరిగింది. ఈ వేలంలో - మైసూర్ వారియర్స్, హుబ్లి టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, గుల్బర్గా మిస్టిక్స్ మొత్తం ఆరు ఫ్రాంచైజీలు తమ కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్నాయి.ఈ వేలంలో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్పై కాసుల వర్షం కురిసింది. అతడిని హుబ్లి టైగర్స్ రికార్డు స్థాయిలో రూ.13.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పడిక్కల్ నిలిచాడు. అదేవిధంగా హుబ్లి టైగర్స్ అభినవ్ మనోహర్ను సైతం రూ. 12.20 లక్షలకు సొంతం చేసుకుంది. హుబ్లి ఫ్రాంచైజీ వీరిద్దరిపైనే దాదాపు సగంపైగా మొత్తాన్ని ఖర్చుచేసింది. టీమిండియా వెటరన్, కేకేఆర్ ఆటగాడు మనీష్ పాండేను రూ. 12.20 లక్షలకు మైసూర్ వారియర్స్ దక్కించుకుంది.సమిత్ ద్రవిడ్కు బిగ్ షాక్..కాగా మహారాజా టీ20 వేలంలో భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అమ్ముడుపోలేదు. రూ. 50 వేలు కనీస ధరతో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. సమిత్ ద్రవిడ్ గత ఎడిషన్లో మైసూరు వారియర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.అయితే అంచనాలకు తగ్గటు జూనియర్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. గత సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడిన సమిత్.. 11.71 సగటుతో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం వేలంలో అమ్ముడు పోలేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇక ఈ మెగా టోర్నీ బెంగళూరులోని ఐకానిక్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆగస్టు 11 నుంచి 27 వరకు జరగనుంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ టోర్నీని ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు.ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఈవెంట్లో కరుణ్ నాయర్, ప్రసిధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఆడనున్నారు. -
బ్రిటన్ కింగ్ను కలిసిన టీమిండియా.. వీడియో వైరల్
ఇంగ్లండ్ పర్యటనలో భారత పురుషల, మహిళల జట్ల ప్లేయర్లు బ్రిటన్ కింగ్ చార్లెస్ IIIను కలిశారు. మంగళవారం లండన్లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ను శుబ్మన్ గిల్ సారథ్యంలోని మెన్స్ టీమ్, హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఉమెన్స్ టీమ్, హెడ్ కోచ్లు గౌతం గంభీర్, ముజుందార్లు సందర్శించారు.ఈ క్రమంలో హృదయపూర్వకంగా స్వాగతం పలికిన చార్లెస్ III.. కాసేపు వారితో ముచ్చటించారు. ప్రతీ ఒక్కరితో కరచాలనం చేస్తూ నవ్వుతూ పలకరించారు. అందరితో కలిసి ఆయన గ్రూపు ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్లేయర్లు, కోచింగ్ స్టాప్తో పాటు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం కింగ్ను కలిశారు. చాలా సంతోషంగా ఉంది: గిల్ఇక బ్రిటన్ కింగ్ను కలవడంపై భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. "కింగ్ చార్లెస్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మమ్మల్ని ఎంతో అప్యాయతగా పలకరించారు. మేము చాలా విషయాలు ఆయనతో సంభాషించాము. లార్డ్స్ టెస్టులో సిరాజ్ ఔటైన తీరు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.మాకు ఈ మ్యాచ్లో ఆదృష్టం కలిసిరాలేదని ఆయనకు చెప్పాను" అని గిల్ పేర్కొన్నాడు. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు పోరాడనప్పటికి టీమిండియాకు పరాజయం తప్పలేదు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.#WATCH | The United Kingdom: King Charles III met the Indian Men's Cricket team at St. James's Palace in London. pic.twitter.com/SjZU0DL6o1— ANI (@ANI) July 15, 2025 -
భారత్ ఓటమికి కారణమదే.. అతడు మాత్రం అద్భుతం: సునీల్ గవాస్కర్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతకలపడింది. రవీంద్ర జడేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు సాధించాడు. ఇక గిల్ సేన ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. లక్ష్య చేధనలో బ్యాటర్లు భాగస్వామ్యాలను నెలకొల్పకపోవడం వల్ల భారత్ ఓటమి పాలైందని ఆయన తెలిపారు."భారత రెండో ఇన్నింగ్స్లో కనీసం ఒక్కటైన 60 నుంచి 70 పరుగుల భాగస్వామ్యం నమోదైంటే ఫలితం మరో విధంగా ఉండేది. కానీ భారత బ్యాటర్లు అలా చేయడంలో విఫలమయ్యారు. స్పిన్నర్లు జో రూట్, షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు జడేజా దూకుడుగా ఆడలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ ఆ సమయంలో అతడు ఆడిన తీరు సరైనదే. ఎందుకుంటే బయట మరో వికెట్ లేదు. జడేజా పోరాటానికి పూర్తి మార్క్లు ఇవ్వాల్సిందేనని" అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నారు. కాగా భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం తమ ఓటమికి కారణం ఇదే చెప్పుకొచ్చాడు. ఒక 50 పరుగుల భాగస్వామ్యం వచ్చి వున్నా తాము గెలిచే వాళ్లమని గిల్ అన్నాడు. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి లైమ్ డాసన్ వచ్చాడు. భారత్ కూడా తమ తుది జట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs ENG: భారత్తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ -
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక టాప్లో ఆస్ట్రేలియా.. మరి టీమిండియా?
లార్డ్స్ టెస్టులో భారత్పై ఇంగ్లండ్ సంచలన విజయం, జమైకాలో జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్ను ఆస్ట్రేలియా చిత్తు చేయడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో 24 గంటల వ్యవధిలో రెండు టెస్టు మ్యాచ్లు క్రికెట్ అభిమానులను అలరించాయి. లార్డ్స్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మూడో టెస్టులో భారత్పై 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించగా.. జమైకాలో జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్ను 176 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. 204 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ కేవలం 29 పరుగులకే కుప్పకూలింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా విండీస్ రికార్డులకెక్కింది. మరోవైపు భారత్ మాత్రం ఆఖరి వరకు పోరాడి ఓటమి పాలైంది. ఈ రెండు ఫలితాలతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి.టాప్లో ఆసీస్..ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా 100 విజయ శాతం, 36 పాయింట్లతో డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అదేవిధంగా లార్డ్స్ టెస్టులో ఓటమి భారత జట్టుపై గట్టిప్రభావాన్ని చూపింది.ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో టీమిండియా(33.33 విజయ శాతం) నాలుగో స్ధానానికి పడిపోయింది. అయితే ఈ టెస్టుకు ముందు 50 శాతంతో నాలుగో స్దానంలో ఉన్న ఇంగ్లండ్.. ఇప్పుడు 66.67 విజయశాతంతో భారత్ను వెనక్కి నెట్టి రెండో స్ధానానికి దూసుకెళ్లింది.శ్రీలంకతో సమానంగా విజయం శాతం ఉన్నప్పటికి పాయింట్ల పరంగా ఇంగ్లండ్ ముందుంజలో ఉండడంతో రెండో స్ధానానికి చేరుకుంది. మూడో స్ధానంలో శ్రీలంక కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఖాతాలో 24 పాయింట్లు ఉండగా.. శ్రీలంక వద్ద 16 పాయింట్లు ఉన్నాయి.చదవండి: IND vs ENG: భారత్తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ -
టీమిండియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
టీమిండియాతో నాలుగో టెస్టుకు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మంగళవారం ప్రకటింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి ఎడమచేతి వాటం స్పిన్నర్ లియామ్ డాసన్ పునరాగమనం చేశాడు. లార్డ్స్ టెస్టులో గాయపడిన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ను ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ విషయాన్ని ఈసీబీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మూడో టెస్టులో బషీర్ చేతి వేలికి గాయం కావడంతో మిగిలిన రెండు టెస్టులకు బషీర్ దూరమయ్యాడు. డాసన్ చివరగా 2017లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. డొమాస్టిక్ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండడంతో డాసన్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. అతడికి బ్యాట్తో రాణించే సత్తా కూడా ఉంది. దీంతో తుది జట్టులో అతడికి చోటు దక్కడం దాదాపు ఖాయమన్పిస్తోంది. ఇక తొలి మూడు టెస్టులో విఫలమైన ఓపెనర్ జాక్ క్రాలీకి సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. అదేవిధంగా ఇంగ్లండ్ టెస్టు జట్టులో భాగంగా ఉన్న జేమీ ఓవర్టన్, సామ్ కుక్, తిరిగి కౌంటీ క్రికెట్లోకి ఆడేందుకు వారిని ఈసీబీ రిలీజ్ చేసింది. భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.లార్డ్స్లో హార్ట్ బ్రేకింగ్..ఇక లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ పోరాడి ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమ్ఇండియా 22 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 193 పరుగుల లక్ష్యఛేదనలో 170 రన్స్కు గిల్ సేన ఆలౌటైంది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 61 నాటౌట్) విరోచిత పోరాటం కనబరిచినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కార్స్ రెండు, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (డర్హామ్) - కెప్టెన్, జోఫ్రా ఆర్చర్ (సస్సెక్స్), గస్ అట్కిన్సన్ (సర్రే), జాకబ్ బెథెల్ (వార్విక్షైర్), హ్యారీ బ్రూక్ (యార్క్షైర్), బ్రైడాన్ కార్స్ (డర్హామ్), జాక్ క్రాలే (కెంట్), లియామ్ డాసన్ (హాంప్షైర్), బెన్ డకెట్ (నాటింగ్హామ్షైర్), ఓలీ పోప్ (సర్రే), జో రూట్ (యార్క్షైర్), జేమీ స్మిత్ (సర్రే), జోష్ టంగ్ (నాటింగ్హామ్షైర్), క్రిస్ వోక్స్ (వార్విక్షైర్) -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ గడ్డపై భారత యువ సంచలనం, అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ హవా కొనసాగుతోంది. బెకన్హామ్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న తొలి యూత్ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో విఫలమైన వైభవ్.. బౌలింగ్లో మాత్రం సత్తాచాటాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన వైభవ్ రెండు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హంజా షేక్(84),థామస్ రెవ్(34) వికెట్లను వైభవ్ పడగొట్టాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల వైభవ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ఓ యూత్ టెస్టు మ్యాచ్లో వికెట్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత అండర్-19 క్రికెటర్ మనిషీ పేరిట(15) ఉండేది. తాజా మ్యాచ్తో మనిషీ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.సూపర్ ఫిప్టీ..రెండో ఇన్నింగ్స్లో మాత్రం వైభవ్ బ్యాట్ ఝూళిపించాడు. 44 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్ ఆయూశ్ మాత్రే(32) రాణించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి యువ భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.ప్రస్తుతం క్రీజులో విహాన్ మల్హోత్రా (34), అభిగ్యాన్ కుందు (0) క్రీజ్లో ఉన్నారు. భారత్ 229 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చీ వాన్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 439 పరుగులకు ఆలౌటైంది.చదవండి: తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా, సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ -
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. షెడ్యూల్ విడుదల
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లోకి క్రికెట్ పునఃప్రవేశించనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్తో క్రికెట్ విశ్వక్రీడల్లోకి పునరాగమనం చేయనుంది. ఒలింపిక్స్లో క్రికెట్కు సంబంధించిన షెడ్యూల్ను జులై 14న ప్రకటించారు. ఈ షెడ్యూల్ను మూడేళ్లు ముందే ప్రకటించడం విశేషం.ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలు 2028 జులై 12 (ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు రోజుల ముందు) నుంచి 29 వరకు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్లు లాస్ ఏంజెలెస్కు 50 కిమీ దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్ప్లెక్స్లో ప్రత్యేకంగా నిర్మించబడే 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి.రాబోయే ఒలింపిక్స్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు అంతర్జాతీయ జట్లు విశ్వవేదికపై పోటీ పడతాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కోసం పోటీ జరుగుతుంది. మెడల్స్ మ్యాచ్లు (సెమీఫైనల్స్ మరియు బ్రాంజ్, గోల్డ్ మెడల్స్ మ్యాచ్లు) జులై 20 (మహిళలు), 29 (పురుషులు) తేదీల్లో జరుగుతాయి.జులై 14, 21 తేదీల్లో ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు లేవు.మ్యాచ్ జరిగిన ప్రతి రోజు రెండు మ్యాచ్లు ఉంటాయి. ఈ మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు, ఉదయం 7 గంటలకు మొదలవుతాయి.ఒలింపిక్స్లో క్రికెట్కు చివరి మరియు ఏకైక ప్రాతినిథ్యం 1900 పారిస్ ఒలింపిక్స్లో దక్కింది. నాడు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. అప్పుడు ఇరు జట్ల మధ్య ఓ అనధికారిక టెస్ట్ మ్యాచ్ జరగగా.. అందులో గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ను కేవలం రెండు రోజుల్లోనే ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.కాగా, 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లో క్రికెట్తో పాటు బేస్బాల్/సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్ (సిక్సస్), స్క్వాష్ జోడించబడ్డాయి. -
పల్లెకు పరిచయమైన "వర్చువల్ రియాలిటీ గేమింగ్".. స్పందన మామూలుగా లేదు..!
వర్చువల్ రియాలిటీ గేమింగ్ (VR Gaming) అనేది గేమింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన సాంకేతికత. ఇది ఆటగాళ్లను త్రిమితీయ (3D) వాతావరణంలోకి తీసుకెళ్లి, నిజంగానే ఆ ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్రీడలను VR హెడ్సెట్, మోషన్ కంట్రోలర్ లాంటి సాధనాలను ఉపయోగించి ఆడతారు. VR Gamingను కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా విద్య, శిక్షణ, వైద్య రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని పెద్దపెద్ద నగరాల్లో మాత్రమే ఈ VR Gaming సెంటర్లు వెలిశాయి.Few youths opened a "Virtual Reality Gaming Centre" in Karnataka 's village. The response was overwhelming 🤩 pic.twitter.com/hNTfIY0qoQ— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) July 14, 2025అయితే, ఇటీవల కర్ణాటకలోని హసన్ జిల్లాకు కొందరు ఔత్సాహిక యువకులు ఈ VR Gamingను ఓ మారుమూల పల్లెకు పరిచయం చేశారు. టెక్నాలజీ అంటే ఏమిటో తెలియని ఆ పల్లె ప్రజలు ఈ కాల్పనిక క్రీడలను తెగ ఎంజాయ్ చేశారు. సదరు యువత ఇచ్చిన Meta Quest VR Headsetలను ధరించి నిజంకాని ప్రపంచంలోకి వెళ్లిపోయారు.పిల్లలు, మహిళలు, వృద్దులు అన్న తేడా లేకుండా ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరు VR Gamingతో కలిగిన కొత్త అనుభూతిని ఆస్వాధించారు. VR Gaming ద్వారా బాక్సింగ్, బిల్డింగ్పై నడవడం లాంటి కాల్పనిక క్రీడలను ఆడారు. ఈ VR Gaming కేంద్రానికి విశేషమైన స్పందన రావడంతో సదరు యువకులు దీనికి సంబంధించిన వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు కూడా విపరీతమైన స్పందన వస్తుంది. -
పెళ్లిళ్లు.. విడాకులు.. హైదరాబాద్ స్పోర్ట్స్ స్టార్స్కి ఏమైంది..?
సెలబ్రిటీలకు సంబంధించి పెళ్లిళ్లు ఎంత గొప్పగా ప్రచారానికి నోచుకుంటాయో విడాకులు అంతకు మించి ప్రచారం పొందుతాయి. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలే వివాహ బంధాన్ని విఛ్చిన్నం చేసుకోవడంలో ముందుంటారని ఒక అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు అది దాదాపుగా అన్ని రంగాలకూ విస్తరించింది. అదే క్రమంలో ఇప్పుడు క్రీడారంగాన్ని కూడా అంటుకున్నట్టు కనిపిస్తోంది.తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన విడాకుల నిర్ణయాన్ని ఇన్స్ట్రాగామ్ ద్వారా ప్రకటించారు. పారుపల్లి కశ్యప్తో (సైనా భర్త) విడిపోయే నిర్ణయం తాను స్వయంగా తీసుకున్నానని, ఈ ప్రయాణంలో ‘‘పీస్, గ్రోత్, హీలింగ్’’ కోసం ఇద్దరం ఒకే మాటతో ముందుకు వెళుతున్నామని తెలిపింది. ఇది ఓ రకంగా షాకింగ్ అనే చెప్పాలి.సాధారణంగా స్పోర్ట్స్ స్టార్స్కు సంబంధించిన విడాకుల అంశాలపై ముందస్తు అంచనాలు, సూచనలు ఏవీ వెలువడడం జరుగదు. అదే సినిమా రంగానికి చెందిన వాళ్లయితే విడిపోవడానికి కాస్త ముందుగానే మీడియా ఈ విషయాన్ని పసిగట్టేయగలుగుతుంది.ఇక్కడ మరో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే... హైదరాబాద్ నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు, మరీ ముఖ్యంగా తమ క్రీడా విజయాలతో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన మహిళలది ఇదే బాట కావడం. గతంలో ఇదే విధంగా విడిపోయిన ప్రముఖ క్రీడాకారిణుల్లో సానియా మీర్జా అందరికీ చిరపరిచితం.ఆటతోనే కాకుండా అందంతో కూడా అందరి మనసుల్నీ దోచుకున్న టెన్నిస్ స్టార్ సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ బంధం చివరికి 2024 లో ముక్కలైంది. సానియా మీర్జా కూడా హైదరాబాద్ వాసే కావడం గమనార్హం.మరో క్రీడాకారిణి కూడా ఇదే నగరం నుంచి విడాకులు తీసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం వరకూ బ్యాడ్మింటన్ కి చిరునామాగా నిలిచిన గుత్తా జ్వాల చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆమె 2005లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కేవలం ఆరేళ్లకే అంటే 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.నాటి ఒక యువ టాలీవుడ్ హీరోతో అనుబంధం అంటూ పుకార్లకు కూడా ఎదుర్కున్న గుత్తా జ్వాల కూడా హైదరాబాద్ వాసే. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిష్టను నలుదిశలా చాటిన ఈ టాప్ స్పోర్ట్స్ స్టార్స్ యువతుల్లో క్రీడారంగం పట్ల ఎంతగా స్ఫూర్తి నింపారో తెలియంది కాదు.అయితే ఒకే నగరానికి చెందిన వీరంతా వ్యక్తిగత జీవితాల్లో ఒకే రకమైన ఒడిదుడుకులు ఎదుర్కోవడం విచిత్రం. కొసమెరుపు ఏమిటంటే... హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రికెట్ చిత్ర పటంలో చేర్చిన మహ్మద్ అజారుద్దీన్ కూడా విడాకులు తీసుకోవడం. ఆయన 1996లో సినీనటి సంగీతా బిజిలానీని పెళ్లి చేసుకుని 2010లో విడాకులు తీసుకున్నారు. -
గెలుపు జోష్లో ఉన్న ఇంగ్లండ్కు భారీ షాక్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా నిన్న (జులై 14) ముగిసిన మూడో టెస్ట్లో (లార్డ్స్) భారత్పై ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. లార్డ్స్ టెస్ట్లో విజయం సాధించి గెలుపు జోష్లో ఉన్న ఇంగ్లండ్కు భారీ షాక్ తగిలింది.ఆ జట్టు ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఎడమ చేతి వేలి ఫ్రాక్చర్ కారణంగా సిరీస్లోని తదుపరి రెండు టెస్ట్లకు దూరమయ్యాడు. బషీర్ చేతి వేలికి ఈ వారం చివర్లో శస్త్రచికిత్స జరుగనున్నట్లు ఈసీబీ తెలిపింది. బషీర్ లార్డ్స్ టెస్ట్లో మూడో రోజు తన బౌలింగ్లోనే రవీంద్ర జడేజా (తొలి ఇన్నింగ్స్) క్యాచ్ అందుకోబోయి గాయపడ్డాడు. ఆ గాయం తర్వాత బషీర్ ఆ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేదు.అయితే బషీర్ రెండో ఇన్నింగ్స్లో గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్కు దిగాడు. 9 బంతుల్లో 2 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత బషీర్ ఐదో రోజు ఎక్కువ భాగం డ్రెస్సింగ్ రూమ్కే పరిమితమయ్యాడు.అయితే ఛేదనలో టీమిండియా టెయిలెండర్లు అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్న దశలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బషీర్ను తిరిగి బరిలోకి దించాడు. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయని బషీర్.. చాలా సేపు తమ సహనాన్ని పరీక్షించిన మహ్మద్ సిరాజ్ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్ గెలుపును ఖరారు చేశాడు. ఈ సిరీస్లో బషీర్ 3 మ్యాచ్ల్లో 54.1 సగటున 10 వికెట్లు తీశాడు.బషీర్కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, టామ్ హార్ట్లీ పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. నాలుగో టెస్ట్ జులై 23 నుంచి మాంచెస్టర్లో ప్రారంభం కానుంది.కాగా, తాజాగా ముగిసిన లార్ట్స్ టెస్ట్ టీమిండియాకు గుండెకోత మిగిల్చింది. విజయానికి అత్యంత చేరువగా వచ్చినా భారత్ను ఓటమే పలకరించింది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆశలు పెట్టుకున్న పంత్, రాహుల్ విఫలం కాగా... 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) వీరోచితంగా పోరాడాడు. అయినా లాభం లేకుండా పోయింది.అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం భారత్ను దెబ్బ తీసింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. -
డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. సిక్సర్లతో విరుచుకుపడిన సీఎస్కే స్టార్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో సౌతాఫ్రికా ఘనంగా బోణీ కొట్టింది. నిన్న (జులై 14) హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన టోర్నీ ఓపెనర్లో సౌతాఫ్రికా ఆతిథ్య జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. జార్జ్ లిండే (3-0-10-3), లుంగి ఎంగిడి (4-1-15-1), నండ్రే బర్గర్ (4-0-22-1), ఎన్ పీటర్ (3-0-22-1), కార్బిన్ బాష్ (4-0-36-0) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి జింబాబ్వేను తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. 5 SIXES BY DEWALD BREVIS IN HIS RETURN TO T20I. 🤯🔥 pic.twitter.com/avZKMovpRj— Johns. (@CricCrazyJohns) July 14, 2025జింబాబ్వే ఇన్నింగ్స్లో సికందర్ రజా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే అజేయ అర్ద సెంచరీతో రాణించాడు. రజాతో పాటు బ్రియాన్ బెన్నెట్ (30), ర్యాన్ బర్ల్ (29) రెండంకెల స్కోర్లు చేశారు. మదెవెరె 1, క్లైవ్ మదండే 8, తషింగ ముసేకివ 9, మున్యోంగ 0, మసకద్జ 1 (నాటౌట్) పరుగుకు పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. తొలి బంతికే చిచ్చరపిడుగు లుహాన్ డ్రి ప్రిటోరియస్ డకౌటైనా, రుబిన్ హెర్మన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్), డెవాల్డ్ బ్రెవిస్ (17 బంతుల్లో 41; ఫోర్, 5 సిక్సర్లు) సౌతాఫ్రికా విజయానికి పునాది వేశారు. కార్బిన్ బాష్ (23 నాటౌట్) మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు. అతనికి జార్జ్ లిండే (3 నాటౌట్) సహకరించాడు. సౌతాఫ్రికా 15.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన బ్రెవిస్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సౌతాఫ్రికా తరఫున అతనికి ఇదే తొలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రీజా హెండ్రిక్స్ (11), కెప్టెన్ డస్సెన్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 3, ట్రెవర్ గ్వాండు 2 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో జింబాబ్వే, సౌతాఫ్రికా సహా న్యూజిలాండ్ కూడా పాల్గొంటుంది. తదుపరి మ్యాచ్ రేపు సాయంత్రం 4:30 గంటలకు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య హరారే వేదికగా జరుగనుంది. -
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్ట్లో భారత యువ జట్టు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్లో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్లో 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు మాత్రమే చేసి ఔటైన వైభవ్.. రెండో ఇన్నింగ్స్లో తన సహజ శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్లో 44 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన కెప్టెన్ ఆయుశ్ మాత్రే ఈ ఇన్నింగ్స్లో 32 పరుగులకే ఔటయ్యాడు. మరో స్టార్ ప్లేయర్ చవ్డా 3 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. విహాన్ మల్హోత్రా (34), అభిగ్యాన్ కుందు (0) క్రీజ్లో ఉన్నారు. భారత్ 229 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చీ వాన్ 3 వికెట్లు తీశాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 439 పరుగులకు ఆలౌటైంది. రాకీ ఫ్లింటాఫ్ (93), కెప్టెన్ హమ్జా షేక్ (84) సత్తా చాటారు. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు ఎకాంశ్ సింగ్ (59), రాల్ఫీ ఆల్బర్ట్ (50) అర్ద సెంచరీలతో రాణించారు. జాక్ హోమ్ (44), థామస్ రూ (34), జేడన్ డెన్లీ (27), జేమ్స్ మింటో (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 3 వికెట్లతో సత్తా చాటగా.. అంబరీష్, వైభవ్ సూర్యవంశీ చెరో 2.. దీపేశ్ దేవేంద్రన్, మొహమ్మద్ ఎనాన్, విహాన్ మల్హోత్రా తలో వికెట్ తీశారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 540 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు.కుర్ర చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. వైభవ్ 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసి అలెక్స్ గ్రీన్ బౌలింగ్లో రాల్ఫీ ఆల్బర్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.మిగతా బ్యాటర్లలో చవ్డా 11, మొహమ్మద్ ఎనాన్ 23, హెనిల్ పటేల్ 38, దీపేశ్ దేవేంద్రన్ 4, అన్మోల్జీత్ సింగ్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్రీన్, ఆల్బర్ట్ తలో 3 వికెట్లు తీయగా.. జాక్ హోమ్, ఆర్చీ వాన్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి మ్యాచ్ మినహా తొలి నాలుగు మ్యాచ్ల్లో చెలరేగిపోయాడు.తొలి మ్యాచ్లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు.ఐదో వన్డేలో 42 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్రేట్తో 33 పరుగులు చేశాడు. -
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 114 ఏళ్ల దిగ్గజ మారథాన్ రన్నర్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్గా పేరొందిన ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయసులో ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం జలంధర్-పఠాన్కోట్ హైవేపై కారు ఢీకొనడంతో ఫౌజా సింగ్ తలకు తీవ్ర గాయమైంది. ఫౌజాను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రాణాలు వదిలారు.ఫౌజా సింగ్ మృతదేహాన్ని విదేశాల్లో నివసిస్తున్న అతని పిల్లలు వచ్చే వరకు మార్చురీలో ఉంచనున్నారు. వారు వచ్చిన తర్వాతే అతని అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఫౌజా సింగ్ మరణం పట్ల పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫౌజా కుటుంబానికి, అతని అభిమానులకు సానుభూతి తెలియజేశారు. ఫౌజా ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.114 ఏళ్ల వయసులోనూ ఫౌజా తన బలం మరియు నిబద్ధతతో తరతరాలను ప్రేరేపించాడని అన్నారు. గతేడాది 'నాషా ముక్త్ - రంగాలా పంజాబ్' మార్చ్లో ఫౌజాతో పాటు నడిచే గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు గులాబ్ చంద్ కటారియా తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.కాగా, ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న పంజాబ్లోని జలంధర్లో జన్మించారు. భార్య, కొడుకు మరణంతో ఫౌజా సింగ్ మానసిక సమస్యలతో పోరాడుతూ 1992లో మరాథాన్వైపు మళ్ళారు. అప్పటి నుంచి ఫౌజా మారథాన్లో సంచలన ప్రదర్శనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఫౌజా సింగ్ లండన్, టొరంటో, న్యూయార్క్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మారథాన్లలో పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల మారథాన్ను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు టొరంటో మారథాన్ను 5 గంటలు 44 నిమిషాలు 4 సెకన్లలో ముగించి రికార్డు నెలకొల్పాడు.ఫౌజా 2004 ఏథెన్స్ మరియు 2012 లండన్ ఒలింపిక్స్ లకు టార్చ్ బేరర్ గా ఉన్నాడు. దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్, బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీతో కలిసి ఓ ప్రధాన క్రీడా బ్రాండ్ కోసం ప్రకటనలో కనిపించారు. -
వేలంలో రికార్డు ధర పలికిన అవినాశ్
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్ నాలుగో సీజన్లో తలపడే జట్ల ఆటగాళ్ల వేలంలో ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్ల కంటే గ్రేడ్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అత్యధిక మొత్తాల్ని వెచ్చించాయి. 520 మంది ఆటగాళ్లను వారి స్థాయిని బట్టి నాలుగు కేటగిరిల్లో ఉంచారు. అంతర్జాతీయ, ఐపీఎల్లో ఆడిన ఆటగాళ్లను ప్రత్యేక కేటగిరిగా తొమ్మిది మందిని ఉంచగా వారిలో ఎనిమిది మందిని ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఇలా రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రికీబుయ్కి అత్యధికంగా రూ.10.26 లక్షలు ఇచ్చారు. అయితే వేలంలో ఆల్రౌండర్లను దక్కించుకునే యత్నంలో ఫ్రాంచైజీలు రిటైన్ ఆటగాళ్లకంటే ఎక్కువ మొత్తాల్ని మిగతా గ్రూపుల ఆటగాళ్లకు వెచ్చించారు. అవినాశ్కు అత్యధికంగా రూ.11.05 లక్షలు పి.అవినాశ్ ఏకంగా 11.05 లక్షలు ధర పలికాడు. మార్కీ ఆటగాళ్ల కేటగిరిలో ఉన్న హనుమ విహారీని అమరావతి రాయల్స్, అశ్విన్ హెబ్బర్ను విజయవాడ సన్షైనర్స్, షేక్ రషీద్ను రాయల్స్ రాయలసీమ, కె.ఎస్.భరత్ను కాకినాడ కింగ్స్, నితీశ్ కుమార్ను భీమవరం బుల్స్ జట్లు పదేసి లక్షలతో వేలానికి ముందే దక్కించుకోగా సిహెచ్ స్టీఫెన్ను ఏడులక్షలకు, కేవి శశికాంత్ను ఐదు లక్షలకు తుంగభద్ర వారియర్స్ దక్కించుకుంది. ఇక ఈ కేటగిరిలో రికీబుయ్ను అత్యధిక ధరతో సింహాద్రి వైజాగ్ లయన్స్ దక్కించుకుంది. మార్కీ ప్లేయర్లగా ఏ గ్రేడ్లో ఉన్న అవినాశ్ను రూ.11.05 లక్షల అత్యధిక ధరతో రాయల్స్ రాయలసీమ దక్కించుకోగా పివి సత్యనారాయణ రాజును రూ.9.8 లక్షలకు భీమవరం బుల్స్, టి.విజయ్ను 7.55 లక్షలకు సింహాద్రి వైజాగ్ లయన్స్ వేలంలో దక్కించుకున్నాయి. ఆగస్టు 8 నుంచి 23వరకు నాలుగో సీజన్ ఏపీఎల్ నాలుగో సీజన్ ఆగస్టు 8వ తేదీ నుంచి 23 వరకు వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈసారి నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్లతో పాటు మొత్తంగా 25 మ్యాచ్లు జరగనుండగా ఏడు జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. -
ఓ పక్క స్టార్క్ మహోగ్రం.. మరో పక్క బోలాండ్ విశ్వరూపం
వెస్టిండీస్తో జరిగిన జమైకా టెస్ట్లో ఆసీస్ పేసర్లు చెలరేగిపోయారు. ఓ పక్క మిచెల్ స్టార్క్ మహోగ్రరూపం (7.3-4-9-6), మరో పక్క స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ ప్రదర్శన ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 27 పరుగులకే కుప్పకూలి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఫలితంగా 176 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పాటు 3 మ్యాచ్ల సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయింది.ఈ మ్యాచ్లో 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. స్టార్క్తో పాటు స్కాట్ బోలాండ్ అటాక్ చేయడంతో కేవలం 14.3 ఓవర్లలోనే తమ పోరాటాన్ని ముగించింది. స్టార్క్ 15 బంతుల వ్యవధిలో (W 0 0 0 W W 0 0 0 0 0 0 W 2 W) 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. బోలాండ్ తనవంతుగా హ్యాట్రిక్ వికెట్లతో విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బోలాండ్ వరుసగా 1, 2, 3 బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్ను పెవిలియన్కు పంపాడు. తద్వారా టెస్ట్ల్లో ఆసీస్ తరఫున 10వ హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా, డే అండ్ నైట్ టెస్ట్ల్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్లో 2 ఓవర్లు వేసిన బోలాండ్ కేవలం 2 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.టెస్ట్ల్లో ఆస్ట్రేలియా తరఫున హ్యాట్రిక్ తీసిన బౌలర్లు..ఫ్రెడ్రిక్ స్పోఫోర్త్హగ్ ట్రంబల్జిమ్మీ మాథ్యూస్లిండ్సే క్లైన్మెర్వ్ హ్యూస్డేమియన్ ఫ్లెమింగ్షేన్ వార్న్గ్లెన్ మెక్గ్రాత్పీటర్ సిడిల్స్కాట్ బోలాండ్చరిత్ర సృష్టించిన బోలాండ్జమైకా టెస్ట్లో స్కాట్ బోలాండ్ (Scott Boland) సరికొత్త చరిత్ర సృష్టించాడు. 1915 తర్వాత టెస్టు క్రికెట్లో కనీసం 2000 డెలివరీలు సంధించిన బౌలర్లలో అత్యుత్తమ సగటు కలిగిన ఆటగాడిగా నిలిచాడు. బోలాండ్ తన నాలుగేళ్ల కెరీర్లో 14 టెస్ట్ల్లో 16.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. ఈ ఆల్టైమ్ రికార్డు ఇంగ్లండ్కు ఆడిన సిడ్నీ బార్న్స్ పేరిట ఉంది. బార్న్స్ 1901- 1914 మధ్యలో ఇంగ్లండ్ తరఫున16.43 సగటుతో వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మిచెల్ స్టార్క్ విలయతాండవం ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్లయ్యారు. జాన్ క్యాంప్బెల్, కెవియోన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్, జేడన్ సీల్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. విండీస్ ఇన్నింగ్స్లో కేవలం జస్టిన్ గ్రీవ్స్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. స్టార్క్తో పాటు స్కాట్ బోలాండ్ (2-1-2-3), హాజిల్వుడ్ (5-3-10-1) కూడా విజృంభించడంతో విండీస్ టెస్ట్ క్రికెట్లో తమ అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది.అంతకుముందు ఆసీస్ కూడా రెండో ఇన్నింగ్స్లో 121 పరుగులకే కుప్పకూలింది. అల్జరీ జోసఫ్ (12-2-27-5), షమార్ జోసఫ్ (13-4-34-4), జస్టిన్ గ్రీవ్స్ (4-0-19-1) చెలరేగారు. ఆసీస్ ఇన్నింగ్స్లో కెమరూన్ గ్రీన్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లోనూ 143 పరుగులకే చాపచుట్టేసింది. ఆసీస్ బౌలర్లంతా మూకుమ్మడిగా చెలరేగారు. బోలాండ్ 3, హాజిల్వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్స్టర్ చెరో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో జాన్ క్యాంప్బెల్ (36) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో షమార్ 4, సీల్స్, గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీశారు. -
బీభత్సం సృష్టించిన స్టార్క్.. క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్కు కుప్పకూలిన వెస్టిండీస్
కింగ్స్టన్, జమైకా వేదికగా వెస్టిండీస్తో జరిగిన నామమాత్రపు మూడో టెస్ట్లో ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ బీభత్సం సృష్టించాడు. నిప్పులు చెరిగే బంతులతో విలయతాండవం చేశాడు. స్టార్క్ దెబ్బకు వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 27 పరుగులకే కుప్పకూలింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్. ఈ ఇన్నింగ్స్లో స్టార్క్ కేవలం 15 బంతుల వ్యవధిలో (W 0 0 0 W W 0 0 0 0 0 0 W 2 W) 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా నమోదైన ఐదు వికెట్ల ఘనత ఇదే.🚨 MITCHELL STARC: 7.3-4-9-6 🥶🔥- WEST INDIES BOWLED OUT FOR JUST 27 RUNS IN THE SECOND INNINGS....!!!! pic.twitter.com/Z3tFsjJalT— Johns. (@CricCrazyJohns) July 15, 2025ఈ ఇన్నింగ్స్లో మొత్తం 7.3 ఓవర్లు వేసిన స్టార్క్ కేవలం 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఫలితంగా వెస్టిండీస్ 204 పరుగుల లక్ష్య ఛేదనలో 27 పరుగులకే ఘోరంగా కుప్పకూలి 176 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ గెలుపుతో ఆసీస్ 3 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్టార్క్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇదే మ్యాచ్లో స్టార్క్ మరో ఘనత కూడా సాధించాడు. టెస్ట్ల్లో 400 వికెట్ల మైలురాయిని (402) అధిగమించాడు. పింక్ బాల్తో జరిగిన ఈ మ్యాచ్లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన స్టార్క్.. పింక్ బాల్తో తన గణాంకాలను మరింత మెరుగుపర్చుకున్నాడు.పింక్ బాల్తో మొత్తం 14 టెస్ట్లు ఆడిన స్టార్క్ 17.08 సగటున ఐదు 5 వికెట్ల ప్రదర్శనలతో 81 వికెట్లు తీశాడు.ఏడుగురు డకౌట్లుమిచెల్ స్టార్క్ విలయతాండవం ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్లయ్యారు. జాన్ క్యాంప్బెల్, కెవియోన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్, జేడన్ సీల్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. విండీస్ ఇన్నింగ్స్లో కేవలం జస్టిన్ గ్రీవ్స్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. స్టార్క్తో పాటు స్కాట్ బోలాండ్ (2-1-2-3), హాజిల్వుడ్ (5-3-10-1) కూడా విజృంభించడంతో విండీస్ టెస్ట్ క్రికెట్లో తమ అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది.అంతకుముందు ఆసీస్ కూడా రెండో ఇన్నింగ్స్లో 121 పరుగులకే కుప్పకూలింది. అల్జరీ జోసఫ్ (12-2-27-5), షమార్ జోసఫ్ (13-4-34-4), జస్టిన్ గ్రీవ్స్ (4-0-19-1) చెలరేగారు. ఆసీస్ ఇన్నింగ్స్లో కెమరూన్ గ్రీన్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లోనూ 143 పరుగులకే చాపచుట్టేసింది. ఆసీస్ బౌలర్లంతా మూకుమ్మడిగా చెలరేగారు. బోలాండ్ 3, హాజిల్వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్స్టర్ చెరో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో జాన్ క్యాంప్బెల్ (36) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో షమార్ 4, సీల్స్, గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీశారు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు (ఓ ఇన్నింగ్స్లో)..న్యూజిలాండ్- 26వెస్టిండీస్- 27సౌతాఫ్రికా- 30సౌతాఫ్రికా- 30సౌతాఫ్రికా- 35 -
ప్రేమతో టై... పెళ్లితో బ్రేక్!
మైదానంలో అలరించిన భారత క్రీడాకారులు పతకాలు, ట్రోఫీలతో పాటు అభిమానుల మనసుల్ని గెలుస్తారు. అలాగే తమ మనసు గెలిచిన వారితో మనసారా ఒక్కటవుతారు. టోరీ్నల్లో లాగానే మొదట పరిచయంతో ప్రేమపెళ్లికి ‘క్వాలిఫై’ అవుతారు. తర్వాత ‘మెయిన్ రౌండ్’లో ప్రేమించుకుంటారు. ‘ఫైనల్’కు వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారు. అయితే ఇక్కడితోనే ‘పెళ్లి’ టైటిల్కు శుభం కార్డు పడుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే! కొన్నాళ్లకు, కొన్నేళ్లకు కొన్ని క్రీడా జంటలకు ‘విడాకులు’తో అశుభం కార్డు పడుతోంది. అలా ఈ కోవలో ఒక్క‘టై’.. ‘బ్రేక్’ చేసుకున్న జంటల కథలు...క్రీడాకారుల విజయాలు వార్తలవడం సహజం. విజయవంతమైన క్రేజీ స్టార్ల ప్రేమలు కూడా హాట్ న్యూస్లే! తర్వాత ఫారిన్ ట్రిప్పులు, చెట్టాపట్టాల్ అన్నీ కూడా మీడియా కంటపడకుండా ఉండవు. చివరకు పెళ్లి ముచ్చట ఇవన్నీ బాగానే ఉన్నా... కొందరి ‘ప్రేమ–పెళ్లి–విడాకుల’ తంతు పరిపాటిగా మారడమే క్రీడాకారుల దాంపత్య బంధాన్ని పలుచన చేస్తున్నాయి. తాజాగా వెటరన్ బ్యాడ్మింటన్ స్టార్ల జోడీ సైనా నెహా్వల్, పారుపల్లి కశ్యప్ తాము విడిపోతున్నట్లు ప్రకటించింది. గతంలో పాపులర్ షట్లర్లు గుత్తా జ్వాల, చేతన్ ఆనంద్లు బ్యాడ్మింటన్ కోర్టులో జోడీ కట్టి... తర్వాత పెళ్లి పీటలెక్కారు. కొన్నాళ్లకే కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల ‘టై బ్రేక్’ జోడీల సంఖ్య ఎక్కువవుతోంది. వారి వివరాలివే...హార్దిక్ పాండ్యానటాషాభారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిచ్ మనసుపడి మనువాడాడు. 2020లో కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయిన సమయంలో తొలుత పెళ్లి చేసుకున్నారు. మళ్లీ 2023లో హిందూ, సెర్బియా మతాచారాల ప్రకారం మళ్లీ పెళ్లాడారు. కానీ ఇంతలా ఇష్టపడ్డ సెర్బియన్ నెచ్చెలితో పెళ్లి ముచ్చట కొన్నాళ్లకే ముగిసింది. 2024లో ఇద్దరు విడాకుల ప్రకటన చేశారు. ధావన్ అయేషాభారత క్రికెటర్ శిఖర్ ధావన్ సరిహద్దులు దాటిన ప్రేమ తదుపరి పెళ్లినాటి ప్రమాణాలు కూడా కొన్నేళ్ల తర్వాత గుదిబండగా మారడంతో చివరికి చెరోదారి చూసుకోవాల్సి వచి్చంది. మెల్బోర్న్లో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన అయేషా ముఖర్జీతో మొదలైన పరిచయం కొన్నాళ్లకే ప్రణయానికి దారితీసింది. ధావన్ కంటే అయేషా ఏకంగా 12 ఏళ్లు పెద్ద వయసు్కరాలు. అయితే ఈ వయస్సు ప్రేమకి, పెళ్లికి అడ్డంకి కాలేదు. 2012లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట పెళ్లి తర్వాత మనస్పర్థలతో 2023లో విడిపోయింది.చహల్ ధనశ్రీ భారత క్రికెట్లో మణికట్టు స్పిన్నర్గా బక్కపలుచని యోధుడు యజువేంద్ర చహల్ కొన్నాళ్లు వెలుగు వెలిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఐపీఎల్లో తమ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించిన చహల్... సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మతో ప్రేమలో పడ్డాడు. వీరిజంట నెట్టింట ‘మూడు రీల్స్... ఆరు జిగేల్స్’గా తెగ హల్చల్ చేసింది కొన్నాళ్లు! కానీ చిత్రంగా పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే చెదిరిపోయింది. ప్రేమ బాసలు, పెనవేసుకున్న ఊసులతో 2020లో మ్యారేజ్ చేసుకున్న చహల్–ధనశ్రీ వర్మ రెండేళ్లకే విడిపోయారు. 2022లో డివోర్స్ కార్డ్ వేశారు.షమీ హసీన్ జహన్ భారత సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ ప్రేమ పెళ్లి ముచ్చట వివాదాలు, ఆరోపణలతో నాలుగేళ్లకే క్లీన్»ౌల్డయ్యింది. తనకు పరిచయమైన హసీన్ జహన్తో కొంతకాలం ప్రేమాయణం జరిపిన తర్వాత 2014లో ఇద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే హసీన్ రచ్చకెక్కి మరీ గృహహింస కేసులు పెట్టి చివరకు 2018లో విడిపోయారు.సైనా కశ్యప్సింధు మేనియా ముందువరకు సైనానే సూపర్స్టార్గా వెలుగొందింది. కామన్వెల్త్ క్రీడల్లో రెండుసార్లు చాంపియన్గా నిలిచింది. ఎన్నో సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచింది. ఒకప్పుడు క్రీడా వార్తల్లో టెన్నిస్లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్లో సైనాల విజయాలే పతాక శీర్షికలయ్యేవి. 2012–లండన్ ఒలింపిక్స్లో సైనా కాంస్య పతకం గెలుచుకుంది అంతగా పాపులారిటీ సంపాదించుకున్న ఆమె... గోపీచంద్ అకాడమీలో శిక్షణ సందర్భంగా పారుపల్లి కశ్యప్ను ప్రేమించింది. వీరి ప్రేమాయణం 2018లో మూడుముళ్ల బంధంగా మారింది. ఏడడుగులు నడిచిన ఈ జంట ఏడేళ్లు పూర్తయ్యేసరికి తమ బంధానికి బైబై చెప్పింది. -
ENG Vs IND: పోరాడినా... పరాజయమే
లార్డ్స్ టెస్టులో భారత్ గుండె పగిలింది. విజయానికి ఎంతో చేరువగా వచ్చినా చివరకు ఓటమే పలకరించింది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆశలు పెట్టుకున్న పంత్, రాహుల్ విఫలం కాగా... 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా పోరాడినా లాభం లేకపోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ జట్టును ముందుండి నడిపించగా... పట్టుదలగా బౌలింగ్ చేసిన ఆతిథ్య జట్టు మ్యాచ్ చేజారకుండా కాపాడుకోగలిగింది. ఈ టెస్టులో పలు సందర్భాల్లో శుబ్మన్ గిల్ బృందం ఆధిక్యం ప్రదర్శించినా... కీలక క్షణాలను ఇంగ్లండ్ సరిగ్గా ఒడిసి పట్టుకుంది. టీమ్ వెనుకబడిన ప్రతీసారి పోరాటయోధుడిలా నేనున్నానంటూ ముందుకొచ్చి సత్తా చాటిన స్టోక్స్దే ఈ గెలుపు అనడం అతిశయోక్తి కాదు. లండన్: ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’లో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సోమవారం లార్డ్స్ మైదానంలో ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల స్వల్ప తేడాతో భారత్పై విజయం సాధించింది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం భారత్ను దెబ్బ తీసింది. 193 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ పదునైన బౌలింగ్తో స్వల్ప స్కోరును కూడా కాపాడుకోవడంలో సఫలమైంది. రెండు ఇన్నింగ్స్లలో కలిపి 77 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన బెన్ స్టోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. సిరీస్లో ఇంగ్లండ్ 2–1తో ముందంజలో ఉండగా... నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్లో జరుగుతుంది. ఆర్చర్ పదునైన బౌలింగ్... ఓవర్నైట్ స్కోరు 58/4తో ఆటను కొనసాగించిన భారత్కు చివరి రోజు సరైన ఆరంభం లభించలేదు. 11 పరుగుల వ్యవధిలో జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. గాయంతో బాధపడుతున్న పంత్ తడబడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఆర్చర్ అద్భుత బంతితో పంత్ (9)ను క్లీన్బౌల్డ్ చేయగా, స్టోక్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ (58 బంతుల్లో 39; 6 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూ కోరిన ఇంగ్లండ్ ఫలితం సాధించింది. తర్వాతి ఓవర్లోనే ఆర్చర్ తన బౌలింగ్లో అద్భుత రిటర్న్ క్యాచ్తో సుందర్ (0)ను పెవిలియన్ పంపించాడు. 82/7 వద్ద పరిస్థితి చూస్తే భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. జడేజా పోరాటం... అప్పటి వరకు 15 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసిన జడేజా... జట్టు భారాన్ని తనపై వేసుకున్నాడు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ తర్వాతి ముగ్గురు బ్యాటర్లతో అతను కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్తోనే ఒక్కో పరుగు జోడించడంతో పాటు అవతలి బ్యాటర్లను కాపాడుకుంటూ అతని ఇన్నింగ్స్ సాగింది. ఈ క్రమంలో పరుగుల రాక కూడా బాగా తగ్గిపోయింది. పదునైన డిఫెన్స్ చూపించగలిగినా... నితీశ్ కుమార్ రెడ్డి (53 బంతుల్లో 13; 1 ఫోర్) లంచ్కు ముందు వోక్స్ చక్కటి బంతికి వెనుదిరిగాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా (54 బంతుల్లో 5; 1 ఫోర్), జడేజా భాగస్వామ్యం ఏకంగా 22 ఓవర్ల పాటు సాగింది. సహనం కోల్పోయిన బుమ్రా భారీ షాట్ ఆడబోయి అవుట్ కాగా... మొహమ్మద్ సిరాజ్ (40 బంతుల్లో 4) అండతో జడేజా జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అయితే చివర్లో పెరిగిన ఉత్కంఠ మధ్య స్పిన్నర్ బషీర్ బౌలింగ్లో సిరాజ్ వికెట్తో భారత్ ఓటమి ఖాయయైంది. అలా ముగిసింది... భారత్ విజయానికి మరో 46 పరుగులు కావాల్సిన సమయంలో జడేజాతో సిరాజ్ జత కలిశాడు. జడేజా జాగ్రత్తగా స్ట్రయికింగ్ నిలబెట్టుకుంటుండగా... సిరాజ్ కూడా పట్టుదలగా 29 బంతులు ఆడి సహకరించాడు. మెలమెల్లగా భాగస్వామ్యం 13.1 ఓవర్లలో 23 పరుగులు పూర్తి చేసుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వికెట్ తీయలేక ఇంగ్లండ్ శిబిరంలో అసహనం పెరిగిపోతోంది. ఇలాగే సాగితే సింగిల్స్తో మరో 23 పరుగులు కావడం సాధ్యమే అనిపించింది. అయితే సిరాజ్ అనూహ్య వికెట్తో ఆట ముగిసింది. బషీర్ వేసిన బంతిని సిరాజ్ దానిని చక్కగా డిఫెన్స్ ఆడాడు. అయితే కింద పడిన బంతి నెమ్మదిగా అతని కాలి వెనక భాగం వైపు వెళ్లగా, దానిని సిరాజ్ గుర్తించలేకపోయాడు. తేరుకునేలోపే బంతి స్టంప్స్ను తాకి ఒక బెయిల్ కింద పడటంతో ఇంగ్లండ్ సంబరాలు చేసుకుంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387; భారత్ తొలి ఇన్నింగ్స్: 387; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 192; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) ఆర్చర్ 0; రాహుల్ (ఎల్బీ) (బి) స్టోక్స్ 39; కరుణ్ నాయర్ (ఎల్బీ) (బి) కార్స్ 14; గిల్ (సి) స్మిత్ (బి) కార్స్ 6; ఆకాశ్దీప్ (బి) స్టోక్స్ 1; పంత్ (బి) ఆర్చర్ 9; జడేజా (నాటౌట్) 61; సుందర్ (సి అండ్ బి) ఆర్చర్ 0; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) వోక్స్ 13; బుమ్రా (సి) (సబ్) కుక్ (బి) స్టోక్స్ 5; సిరాజ్ (బి) బషీర్ 4; ఎక్స్ట్రాలు 18; మొత్తం (74.5 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–5, 2–41, 3–53, 4–58, 5–71, 6–81, 7–82, 8–112, 9–147, 10–170. బౌలింగ్: వోక్స్ 12–5–21–1, ఆర్చర్ 16–1–55–3, స్టోక్స్ 24–4–48–3, కార్స్ 16–2–30–2, రూట్ 1–0–1–0, బషీర్ 5.5–1–6–1. -
ఓడినా గర్వంగా ఉంది.. అదే మా కొంపముంచింది: టీమిండియా కెప్టెన్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆఖరి వరకు పోరాడి ఓటమి పాలైంది. లక్ష్య చేధనలో 170 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(181 బంతుల్లో 61) విరోచిత పోరాటం చేశాడు.టాపర్డర్ విఫలం కావడంతో భారత్ లక్ష్యాన్ని చేధించలేకపోయింది. శుబ్మన్ గిల్(6), యశస్వి జైశ్వాల్(0), కరుణ్ నాయర్(14) తీవ్ర నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టి గిల్ సేన పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు కార్స్ రెండు, బషీర్, వోక్స్ తలా వికెట్ సాధించారు. ఈ హార్ట్బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ స్పందించాడు. ఆఖరి వరకు పోరాడిన తమ ఆటగాళ్లను గిల్ అభినందించాడు."ఈ మ్యాచ్లో ఓడినా.. చాలా గర్వంగా ఉంది. మేము గెలుపు కోసం చివరి సెషన్, చివరి వికెట్ వరకు ప్రయత్నించాము. కానీ దురదృష్టవశాత్తూ మేము లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము. అయితే చేతిలో చాలా వికెట్ల ఉండడంతో టార్గెట్ను ఈజీగా చేజ్ చేస్తామని భావించాను. కానీ ఇంగ్లండ్ బౌలర్లు మాత్రం మాపై పైచేయి సాధిస్తూ వచ్చారు.దీంతో టాపర్డర్లో 50 పరుగుల భాగస్వామ్యాలు ఒకట్రెండు వచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాము. కానీ మేము అలా చేయలేకపోవడంతోనే ఓటమి చవిచూశాము. వారు మా కంటే బాగా ఆడారు. అయితే జడేజా క్రీజులో ఉండడంతో మేము గెలుస్తామన్న నమ్మకం నాకు ఉండేది. అతడి చాలా అనుభవం ఉంది.అందుకే అతడికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎటువంటి సందేశం ఇవ్వలేదు. టెయిలాండర్లతో కలిసి అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. మా టెయిలాండర్లు(బుమ్రా, సిరాజ్) సైతం అతడికి సహకరించారు. కానీ ఆఖరికి మ్యాచ్ను ఫినిష్ చేయలేకపోయాము. తొలి ఇన్నింగ్స్లో పంత్ రనౌట్ ఆటను మలుపు తిప్పింది. ఒకానొక సమయంలో మొదటి ఇన్నింగ్స్లో మాకు 50 నుంచి 60 పరుగుల ఆధిక్యం లభిస్తుందని మేము అనుకున్నాము. కానీ పంత్ ఔట్ కావడంతో అంతా తారుమారైంది. ఈ పిచ్లో 150-200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదని మాకు తెలుసు. అందుకే మొదటి ఇన్నింగ్స్లో ఆధిక్యం పొందాలని భావించాము. కానీ మేము అనుకున్నది జరగలేదు. పరిస్థితులు చాలా త్వరగా మారిపోయాయి. నాలుగో రోజు ఆటలో చివరి సెషన్లో మేము కొంచెం మెరుగ్గా ఆడి వికెట్లు కోల్పోకపోయింటే పరిస్థితి మరోవిధంగా ఉండేది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ సరైన ప్రణాళికలతో బరిలోకి దిగింది.చివరి రోజు మాకు ఒక 50 పరుగుల భాగస్వామ్యం వచ్చి ఉన్నా గెలిచే వాళ్లం. మిగిలిన మ్యాచ్లలో మా తప్పిదాలను సరిదిద్దుకుంటాము. నాలుగో టెస్టుకు బుమ్రా అందుబాటుపై త్వరలోనే అప్డేట్ ఇస్తామని" గిల్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. -
జడేజా పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో 22 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించిలేక భారత జట్టు చతికల పడింది. ఈ స్వల్ప లక్ష్య చేధనలో 170 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినప్పటికి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆరంభం నుంచే..జడేజాతో పాటు కేఎల్ రాహుల్(54) పర్వాలేదన్పించగా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 58/4 ఓవర్నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. ఆరంభం నుంచే తడబడింది. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, నితీశ్ కాసేపు నిలకడగా ఆడి భారత గెలుపుపై ఆశలు రెకెత్తించారు. అయితే లంచ్ బ్రేక్కు ముందు నితీశ్ ఔట్ కావడంతో మ్యాచ్ మళ్లీ ఇంగ్లండ్ వైపు టర్న్ అయింది. ఆ తర్వాత జడేజా.. జస్ప్రీత్ బమ్రాతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు.బుమ్రా ఇంగ్లండ్ పేసర్లను ఎదుర్కొంటూ జడేజాకు మద్దతుగా నిలిచాడు. అయితే 50 బంతులకు పైగా బ్యాటింగ్ చేసిన బుమ్రా(5) భారీ షాట్కు ప్రయత్నించి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ సైతం తన వంతు సహకారం అందించాడు.కానీ ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్లో సిరాజ్ బౌల్డ్ కావడంతో టీమిండియా అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. సిరాజ్ సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంగ్లండ్ మాత్రం గెలుపు సంబరాల్లో మునిగి తేలిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టి గిల్ సేన పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు కార్స్ రెండు, బషీర్, వోక్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకే చేయగల్గింది. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఆలౌటైంది. సెకెండ్ ఇన్నింగ్స్లో బౌలర్లు అద్బుతంగా రాణించినప్పటికి.. బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చదవండి: మెడ చుట్టూ చేయి వేసి ఆపేశాడు!.. ఇచ్చిపడేసిన జడ్డూ -
లార్డ్స్లో సరికొత్త చరిత్ర.. 21 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఓ అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్లో మొత్తం బౌల్డ్ రూపంలో ఇరు జట్లు బౌలర్లు మొత్తం 14 వికెట్లను పడగొట్టారు. 21వ శతాబ్దంలో ఓ టెస్టు మ్యాచ్లో అత్యధిక బ్యాటర్లు బౌల్డ్ కావడం ఇదే తొలిసారి. భారత బౌలర్లు 12 బౌల్డ్లు చేయగా.. ఇంగ్లండ్ బౌలర్లు రెండు బౌల్డ్లు చేశారు.ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్-సౌతాఫ్రికా జట్లు పేరిట ఉండేది. 2005లో స్పోర్ట్స్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో సౌతాఫ్రికా, విండీస్ బౌలర్లు కలిపి 13 బౌల్డ్లు చేశాడు. తాజా మ్యాచ్తో ఈ ఆల్టైమ్ రికార్డును ఇంగ్లండ్-భారత్ బ్రేక్ చేశాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. భారత జట్టు పోరాడుతోంది. టీమిండియా విజయానికి ఇంకా 56 పరుగులు కావాలి. రవీంద్ర జడేజా(38), జస్ప్రీత్ బుమ్రా(4) ఉన్నారు.2000 నుంచి ఒక టెస్ట్లో అత్యధిక బ్యాటర్లు బౌల్డ్ అయిన మ్యాచ్లు ఇవే..14 - ఇంగ్లాండ్ వర్సెస్ భారత్, లార్డ్స్, 202513 - వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 200513 - పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, అబుదాబి, 201213 - ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా, నాగ్పూర్, 201513 - ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా, ఢిల్లీ, 2015 -
ఇంగ్లండ్ బౌలర్ ఓవరాక్షన్!.. ఇచ్చిపడేసిన జడ్డూ.. మధ్యలోకి స్టోక్స్
లార్డ్స్ టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ (Brydon Carse)- టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravidndra Jadeja) మధ్య గొడవ జరిగింది. కార్స్ చేసిన పనికి జడ్డూ గట్టిగానే ఇచ్చిపడేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) అడ్డుగోడలా నిలబడి వారిని విడదీయడంతో పరిస్థితి సద్దుమణిగింది.అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ మైదానంలో గురువారం మొదలైన మూడో టెస్టు తుది అంకానికి చేరింది. ఆఖరిదైన సోమవారం నాటి ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 58/4 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. ఆరంభం నుంచే తడబడింది.రిషభ్ పంత్ (9)ను జోఫ్రా ఆర్చర్ అద్భుత డెలివరీతో బౌల్డ్ చేయగా.. కేఎల్ రాహుల్ (39)ను స్టోక్స్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. నితీశ్ కుమార్రెడ్డి 53 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఫలితంగా భోజన విరామ సమయానికి భారత్ 39.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జడేజా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో.. కార్స్ అతడికి అడ్డు తగిలాడు.జడ్డూ మెడ చుట్టూ చేయి వేసిటీమిండియా ఇన్నింగ్స్లో 35వ ఓవర్లో రంగంలోకి దిగిన కార్స్ బౌలింగ్లో.. ఆఖరి బంతికి జడ్డూ నితీశ్ రెడ్డితో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. అయితే, సింగిల్కు వెళ్లే క్రమంలో జడ్డూకు కార్స్ అడ్డుగా నిలవగా.. బంతిని చూస్తూ పరుగుకు వెళ్లిన జడ్డూ అతడిని ఢీకొట్టాడు. దీంతో తాను పడిపోకుండా ఉండేందుకు అన్నట్లుగా... జడ్డూ మెడ చుట్టూ చేయి వేసి అతడిని బంధించేందుకు కార్స్ ప్రయత్నం చేయగా.. జడ్డూ విడిపించుకుని పరుగులు పూర్తి చేశాడు.ఇచ్చి పడేసిన జడేజాఅనంతరం కార్స్ దగ్గరికి వచ్చి ఏంటి సంగతి అంటూ అడుగగా.. కార్స్ దురుసుగా ఎదురు సమాధానం ఇచ్చాడు. దీంతో మాటామాటా పెరగగా.. స్టోక్స్ వచ్చి ఇద్దరినీ విడదీశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా లార్డ్స్' టెస్టులో ఇలాంటి జగడాలు ఎక్కువయ్యాయి. మూడో రోజు ముగింపు సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్.. ఇంగ్లండ్ ఆటగాడు జాక్ క్రాలీ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇక ఐదోరోజు రిషభ్ పంత్ను అవుట్ చేసిన తర్వాత జోఫ్రా ఆర్చర్ కూడా అతడిని స్లెడ్జ్ చేశాడు.చదవండి: ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: సునిల్ గావస్కర్ ఫైర్Drama, more drama! 👀#ENGvIND 👉 3rd TEST, DAY 5 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/DTsJzJLwUc pic.twitter.com/eiakcyShHV— Star Sports (@StarSportsIndia) July 14, 2025 -
తండ్రికి తగ్గ తనయుడు.. టీమిండియాపై వీరోచిత పోరాటం! సెంచరీ మిస్
ఇంగ్లండ్ యువ సంచలనం, అండర్-19 ఆటగాడు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాప్ తనయుడైన రాకీ.. బెకెన్హామ్ వేదికగా భారత అండర్-19తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో రాకీ ఫ్లింటాప్ తన వయసుకు మించిన పరిణతిని ప్రదర్శించాడు. కెప్టెన్ హమ్జా షేక్ తో కలిసి అతను 154 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓ దశలో సునాయసంగా తన సెంచరీ మార్క్ను అందుకునేలా కన్పించిన రాకీ.. 93 పరుగుల వద్ద దీపేష్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.అతడి ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ యువ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. క్రీజులో అల్బర్ట్(18),ఏకాన్ష్ సింగ్(59) ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే 202 పరుగుల వెనకంజలో ఉంది.అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 540 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో చెలరేగగా.. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు.చదవండి: ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: సునిల్ గావస్కర్ ఫైర్ -
ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: గావస్కర్ ఫైర్
లార్డ్స్ టెస్టులో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ (KL Rahul) అవుటైన తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాహుల్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని విమర్శించాడు. భారత బౌలర్ల విషయంలో ఒకలా.. ఇంగ్లండ్ బౌలర్ల విషయంలో మరోలా వ్యవహరించడం సరికాదన్నాడు. పక్షపాతంగా ఉండే టెక్నాలజీ ఎవరి కోసమంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా మూడో టెస్టులో ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ తడబడుతోంది. 58/4 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆఖరిదైన ఐదో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు వరుస షాకులు తగిలాయి. కీలక బ్యాటర్ రిషభ్ పంత్ (9) జోఫ్రా ఆర్చర్ సంధించిన సూపర్ డెలివరీకి బౌల్డ్ కాగా.. ఆ వెంటనే కేఎల్ రాహుల్ (39) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) బౌలింగ్లో బంతి రాహుల్ ప్యాడ్ను తగిలినట్లు అనిపించగా.. ఇంగ్లండ్ గట్టిగా అప్పీలు చేసింది. అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో స్టోక్స్ రివ్యూకు వెళ్లగా.. థర్డ్ అంపైర్ లెగ్ బిఫోర్ వికెట్గా ప్రకటించడంతో రాహుల్ క్రీజును వీడాల్సి వచ్చింది.రీప్లేలో బంతి రాహుల్ ప్యాడ్ను తగిలినట్లుగా కనిపించినప్పటికీ.. బ్యాట్ను కూడా తాకినట్లుగా మరో శబ్దం వినిపించింది. అయితే, ముందుగా బ్యాట్ను తాకిందా లేదంటే ప్యాడ్ను తాకిందా అనేది స్పష్టంగా తేలలేదు. అయితే, బాల్ ట్రాకింగ్లో మాత్రం బంతి స్టంప్స్ను ఎగురగొట్టినట్లుగా తేల్చిన థర్డ్ అంపైర్.. రాహుల్ను అవుట్గా ప్రకటించాడు.అసలు ఇదేం టెక్నాలజీఈ విషయంపై కామెంటేటర్ సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘ఏంటో.. ఈసారి ఆశ్చర్యకరంగా ఈసారి ఎక్కువగా బౌన్స్ అవ్వనేలేదు. భారత బౌలర్లు బౌలింగ్ చేస్తున్నపుడు మాత్రం.. రివ్యూల్లో బాల్స్ అన్నీ స్టంప్స్ మీదుగా వెళ్లిపోయినట్లుగా కనిపించాయి. అసలు ఇదేం టెక్నాలజీ అని నేను ప్రశ్నిస్తున్నా’’ అంటూ ఫైర్ అయ్యాడు.భారత్ తడ‘బ్యా’టుకాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టులో ఆఖరి రోజైన సోమవారం ఫలితం తేలనుంది. భోజన విరామ సమయానికి టీమిండియా 39.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి 81 పరుగుల దూరంలో ఉండగా.. ఇంగ్లండ్ గెలుపునకు కేవలం రెండు వికెట్లు తీస్తే చాలు.భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0), కరుణ్ నాయర్ (14), కెప్టెన్ శుబ్మన్ గిల్ (6) పూర్తిగా విఫలం కాగా.. నైట్ వాచ్మన్ ఆకాశ్ దీప్ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. రిషభ్ పంత్ (9), వాషింగ్టన్ సుందర్ (0), నితీశ్ కుమార్ రెడ్డి (13) నిరాశపరచగా.. ప్రస్తుతానికి భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. రవీంద్ర జడేజా 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.చదవండి: IND vs ENG: సిరాజ్కు భారీ షాకిచ్చిన ఐసీసీ -
ఎస్ఆర్హెచ్ కీలక ప్రకటన.. కోచ్గా 'ఊహించని ప్లేయర్'
సన్రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ కోచ్ టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్(Varun Aaron)ను ఎస్ఆర్హెచ్ మెనెజ్మెంట్ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎస్ఆర్హెచ్ వెల్లడించింది. గత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ కోచ్గా పనిచేసిన కివీస్ మాజీ ఆల్రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్ధానాన్ని భర్తీ చేయనున్నాడు.ఆరోన్కు అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. జార్ఖండ్కు చెందిన వరున్ ఆరోన్ 9 టెస్టులు, 9 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 29 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తరపున ఆడాడు.తన ఐపీఎల్ కెరీర్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా 95 టీ20ల్లో 93 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరోన్ చివరగా విజయ్ హాజారే ట్రోఫీ 2024-25 సీజన్లో జార్ఖండ్ తరపున ఆడాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు క్రికెట్కు వీడ్కోలు పలికిన ఈ స్పీడ్ స్టార్.. కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో సన్రైజర్స్ తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. 14 మ్యాచ్లు ఆడి కేవలం ఆరింట మాత్రమే విజయం సాధించింది.చదవండి: IND vs ENG: జోఫ్రా ఆర్చర్ సూపర్ డెలివరీ.. రిషబ్ పంత్కు మైండ్ బ్లాంక్! వీడియో -
జోఫ్రా ఆర్చర్ సూపర్ డెలివరీ.. రిషబ్ పంత్కు మైండ్ బ్లాంక్! వీడియో
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత జట్టు 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరుగుతున్నాడు.అతడి బౌలింగ్ ధాటికి భారత బ్యాటర్లు బెంబేలెత్తుతున్నారు. ఐదో రోజు ఆట ఆరంభంలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను అద్బుత బంతితో ఆర్చర్ బోల్తా కొట్టించాడు. ఆర్చర్ వేసిన డెలివరీకి పంత్ దగ్గర సమాధానమే లేకపోయింది. భారత ఇన్నింగ్స్ 21 ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్లో మూడో బంతికి పంత్ అద్బుతమైన బౌండరీ బాదాడు.ఆ తర్వాత ఐదో బంతికి పంత్ను క్లీన్ బౌల్డ్ చేసి ఈ ఇంగ్లండ్ పేసర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆర్చర్ ఆ ఐదో బంతిని రౌండ్ది వికెట్ నుంచి హాఫ్ స్టంప్ దిశగా హార్డ్ లెంగ్త్ డెలివరీగా పంత్ సంధించాడు. ఆ బంతిని పంత్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ పంత్ తన బ్యాట్ను కిందకు తీసుకొచ్చేలోపే బంతి స్టంప్స్ను గిరాటేసింది.దీంతో పంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే పంత్కు వద్దకి వెళ్లి స్లెడ్జ్ చేశాడు. అతడి వైపు చూస్తూ సీరియస్గా ఏదో అంటూ సెండాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అనంతరం వాషింగ్టన్ సుందర్ను కూడా సంచలన రిటర్న్ క్యాచ్తో ఆర్చర్ పెవిలియన్కు పంపాడు. టీమిండియా విజయానికి ఇంకా 93 పరుగులు కావాలి. క్రీజులో రవీంద్ర జడేజా(14), నితీశ్ కుమార్ రెడ్డి(5) ఉన్నారు.Split screen angles just hit different with Jofra 😍👌 pic.twitter.com/9kf7r2QmUk— England Cricket (@englandcricket) July 14, 2025చదవండి: IND vs ENG 3rd Test Day 5: తొలి సెషన్ కీలకం.. ఆరు వికెట్లు తీసి..: ఇంగ్లండ్ కోచ్ -
లండన్లో లవ్ బర్డ్స్.. ఆ ఫోటోలతో దొరికిపోయిన మహ్వశ్- చాహల్!
ప్రముఖ ఆర్జే మహ్వశ్ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో కనిపించడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. కానీ తమపై వస్తున్న కథనాలపై ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్న చాహల్ ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. తను ఎవరో మీ అందరికీ ఇప్పటికే తెలుసుగా అంటూ చాహల్ తన మనసులో మాట చెప్పేశాడు. దీంతో ఈ జంట డేటింగ్ నిజమేనంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలోనే చాహల్, ఆర్జే మహ్వశ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. లండన్లో ఈ ప్రేమజంట చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు తమ ఇన్స్టా వేదికగా షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్గ్రౌండ్లో లోకేషన్ ఓకేలా కనిపిస్తోంది. దీంతో ఈ లవ్ బర్డ్స్ తాజాగా లండన్లోనే వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాహల్ ఫోటోలు చూసిన ఓ నెటిజన్ మహ్వశ్ బాబీ తీశారా అంటూ కామెంట్ చేశాడు. వారిద్దరు డేటింగ్ చేస్తున్నారని నాకు తెలుసు అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.చాహల్, మహ్వశ్పై డేటింగ్ రూమర్స్క్రికెటర్ చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్నారు. అంతకుముందే మహ్వశ్, చాహల్ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లో జంటగా కనిపించడం.. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ పంజాబ్ కింగ్స్ టీమ్కు మద్దతుగా మ్యాచ్ల్లో సందడి చేసింది. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) -
లార్డ్స్లో గెలిచేది మేమే.. లంచ్ తర్వాత విజయ లాంఛనం: వాషీ
లార్డ్స్ టెస్టులో గెలుపు తమదేనని టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. ఐదో రోజు ఆటలో భోజన విరామ సమయం తర్వాత తాము గెలుపు జెండా ఎగురవేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ 387 పరుగులు చేయగా.. బదులుగా టీమిండియా కూడా తొలి ఇన్నింగ్స్లో సరిగ్గా అంతే స్కోరు చేసింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను భారత బౌలర్లు 192 పరుగులకే పడగొట్టేశారు. ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జో రూట్ (40), కెప్టెన్ బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (8)ల రూపంలో మూడు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు.. ఆఖర్లో షోయబ్ బషీర్ (2)ను పెవిలియన్కు పంపాడు.మిగతా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ తలా ఒక వికెట్ తీశారు. ఈ క్రమంలో ఆదివారమే లక్ష్య ఛేదన (193)కు దిగిన గిల్ సేన.. ఆట పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ఇక ఐదో రోజు ఆటలో టీమిండియా 135 పరుగులు చేస్తే లార్డ్స్లో విజయభేరి మోగించగలదు.ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ.. ‘‘మేము గెలవబోతున్నాము. మొదటి సెషన్లోనే ఈ పని పూర్తి కావచ్చు. బహుశా లంచ్ తర్వాత మా విజయం లాంఛనమే. ప్రస్తుతం మేము పటిష్ట స్థితిలోనే ఉన్నాము.అయితే, ఆట ముగిసే సరికి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఉంటే.. ఇంకాస్త ముందుగానే విజయం వరించేది. ఏదేమైనా ఆదివారం మేము అద్భుతంగా బౌలింగ్ చేశాము. ఒత్తిడి ఉన్నా ఎక్కడా తడబడలేదు’’ అని పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. 58/4 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం ఆట మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (9).. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే కేఎల్ రాహుల్ (39) కూడా వెనుదిరిగాడు.స్టోక్స్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 23.5 ఓవర్లలో 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. అంతకుముందు.. యశస్వి జైస్వాల్ (0), కరుణ్ నాయర్ (14), కెప్టెన్ శుబ్మన్ గిల్ (6), ఆకాశ్ దీప్ (1) పూర్తిగా నిరాశపరిచారు. కాగా తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్టులో భారత్ విజయం సాధించి.. సిరీస్ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. -
IND vs ENG 3rd Test: లార్డ్స్ టెస్టు.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు ఓటమి దిశగా పయనిస్తోంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత జట్టు 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖరి రోజు ఆట తొలి సెషన్లో టీమిండియాకు వరుస షాక్లు తగిలాయి.తొలుత ఆర్చర్ బౌలింగ్లో రిషబ్ పంత్(9) క్లీన్ బౌల్డ్ కాగా.. కేఎల్ రాహుల్(39) స్టోక్స్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్.. ఆర్చర్ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. 58/4 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ కేవలం 24 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. టీమిండియా విజయానికి ఇంకా 108 పరుగులు కావాలి. క్రీజులో జడేజా(10),నితీశ్ కుమర్ రెడ్డి(1) ఉన్నారు. భారత్ ఆశలన్నీ వీరిద్దరిపైనే ఉన్నాయి. ఒకవేళ ఇద్దరిలో ఎవరు ఔటైనా గిల్ సేనకు ఓటమి తప్పదు.చదవండి: లార్డ్స్లో గెలిచేది మేమే.. లంచ్ తర్వాత విజయ లాంఛనం: వాషీ -
దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఐడైన్ మార్క్రమ్.. జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. గత నెలలో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్బుత ప్రదర్శనకు గాను మార్క్రమ్కు ఈ ప్రతిషాత్మక అవార్డు దక్కింది. ఫైనల్ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన మార్క్రమ్..సౌతాఫ్రికాకు 28 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్ను అందించాడు.ఈ మ్యాచ్లో బంతితో కూడా అతడు రాణించాడు. ఈ అవార్డు కోసం మార్క్రమ్తో పాటు తన సహచరుడు టెంబా బావుమా, శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక పోటీ పడ్డారు. కానీ కీలకమైన ఫైనల్లో సెంచరీతో చేయడంతో మార్క్రమ్ వారిద్దరిని వెనక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.ఈ ప్రతిష్టత్మక ఐసీసీ అవార్డు అందుకోవడం తనకు దక్కిన అరుదైన గౌరవమని మార్క్రమ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. మరోవైపు మహిళల విభాగంలో ఈ అవార్డును వెస్టిండీస్ కెప్టెన్ హీలీ మాథ్యూస్ సొంతం చేసుకుంది. గత నెలలో దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన వన్డే, టీ20 సిరీస్లలో మాథ్యూస్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచింది.రెండు సిరీస్లలోనూ ఆల్ రౌండ్ షోతో మాథ్యూస్ అదరగొట్టింది. దీంతో ఆమె దక్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్, వెస్టిండీస్స్పిన్నర్ అఫీ ఫ్లెచర్లను అధిగమించి ఈ అవార్డును గెలుచుకుంది.చదవండి: IND vs ENG: సిరాజ్కు భారీ షాకిచ్చిన ఐసీసీ -
IND vs ENG: తొలి సెషన్ కీలకం.. ఆరు వికెట్లు తీసి..: ఇంగ్లండ్ కోచ్
టీమిండియా- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య మూడో టెస్టు ముగింపు దశకు చేరుకుంది. సోమవారం నాటి ఆటలో పైచేయి సాధించిన జట్టునే విజయం వరించనుంది. భారత్ గెలుపొందాలంటే ఆఖరి రోజు 135 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్కు ఆరు వికెట్లు తీయాల్సి ఉంది.మొదటి గంట కీలకంఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోతిక్ (Marcus Trescothick) టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు. ‘‘నాలుగోరోజు ఆట ఆఖర్లో మా వాళ్లు అద్భుతం చేశారు. ప్రేక్షకుల నుంచి కూడా మాకు విశేషమైన స్పందన లభించింది. వారి కేరింతలు మా వాళ్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.ఆరు వికెట్లు పడగొడతాంరేపు (సోమవారం) మొదటి గంట కీలకం. అప్పుడు టీమిండియా ఏమేరకు ఆధిపత్యం కొనసాగిస్తుందో.. ఏ మేర సానుకూల దృక్పథంతో ఉంటుందో చూడాలి. ఫస్ట్ అవర్లో మేమైతే మిగిలిన ఆ ఆరు వికెట్లు కూలుస్తామనే నమ్మకం ఉంది’’ అంటూ మార్కస్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం నాటి ఆట పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో జరుగుతోంది. ఇందులో భాగంగా లీడ్స్లో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండగా.. లార్డ్స్లో మూడో టెస్టు జరుగుతోంది.387- 387ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి.. 387 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్ (104) సెంచరీతో సత్తా చాటగా.. జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) అర్ధ శతకాలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా కూడా సరిగ్గా 387 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టగా.. రవీంద్ర జడేజా (74) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ మూడు, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో రెండు, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 192 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. బుమ్రా, సిరాజ్ రెండేసి వికెట్లు కూల్చారు. నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్లు చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు ఆదివారం నాలుగు వికెట్లు నష్టపోయి.. 58 పరుగులు చేసింది. చదవండి: IND vs ENG: సిరాజ్కు భారీ షాకిచ్చిన ఐసీసీ -
IND vs ENG: సిరాజ్కు భారీ షాకిచ్చిన ఐసీసీ
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ మేర జరిమానా వేసింది. అంతేకాదు.. సిరాజ్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది.సమంగా..కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా భారత్ ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడుతోంది. మొదటి రెండింటిలో తలా ఓ టెస్టు గెలిచి ఇరుజట్లు ప్రస్తుతం 1-1తో సమంగా న్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లార్డ్స్లో గురువారం మూడో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేసింది.టీమిండియా కూడా సరిగ్గా 387 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆదివారం నాటి నాలుగోరోజు ఆటలో భాగంగా 192 పరుగులకు ఆలౌట్ అయి.. టీమిండియాకు 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది.కీలక వికెట్లు కూల్చిన సిరాజ్ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో సిరాజ్.. ఇంగ్లిష్ జట్టు ఓపెనర్ బెన్ డకెట్ (12)తో పాటు.. వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చి.. టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. అయితే, డకెట్ను అవుట్ చేసిన సమయంలో సిరాజ్ సంబరాన్ని పట్టలేక అత్యుత్సాహం ప్రదర్శించాడు. డకెట్ భుజాన్ని రాసుకుంటూ వెళ్తూ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు.THE AGGRESSION FROM DSP SIRAJ AFTER DISMISSING DUCKETT. 🥶pic.twitter.com/AehUlhE29t— Mufaddal Vohra (@mufaddal_vohra) July 13, 2025 అలా అయితే ఓ మ్యాచ్ నిషేధం!ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 నిబంధనను సిరాజ్ ఉల్లంఘించినట్లయింది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో ఓ బ్యాటర్ అవుటైనపుడు వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, వారితో అనుచిత రీతిలో ప్రవర్తించడం నేరం. ఇందుకు ప్రతిగా అత్యుత్సాహం ప్రదర్శించిన బౌలర్కు తగిన శిక్ష పడుతుంది. ఇప్పుడు సిరాజ్ విషయంలోనూ ఇదే జరిగింది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ.. గడిచిన 24 నెలలకాలంలో సిరాజ్ రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు గానూ ఇప్పటికే తన ఖాతాలో ఉన్న ఓ డీమెరిట్ పాయింట్కు మరొకటి జతచేసింది.ఒకవేళ 24 నెలల కాలంలో ఓ ప్లేయర్ ఖాతాలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు గనుక చేరినట్లయితే అతడిపై మ్యాచ్ నిషేధం పడుతుంది. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 135 దూరంలో నిలిచింది. చదవండి: Divorce: సైనా అలా.. పారుపల్లి కశ్యప్ ఇలా!.. ఇన్స్టా పోస్ట్ వైరల్ -
చరిత్ర సృష్టించిన ఆసీస్ పేసర్.. 110 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి..
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ (Scott Boland) సరికొత్త చరిత్ర సృష్టించాడు. సమకాలీన బౌలర్లలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. 1915 తర్వాత టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.వెస్టిండీస్తో మూడో టెస్టు సందర్భంగా బోలాండ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, ఐదు టీ20లు ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత టెస్టు సిరీస్ మొదలుకాగా.. మొదటి రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది ఆసీస్.225 పరుగులకు ఆసీస్ ఆలౌట్ఈ క్రమంలో విండీస్- ఆసీస్ (WI vs AUS) మధ్య నామమాత్రపు మూడో టెస్టు జమైకా వేదికగా శనివారం మొదలైంది. కింగ్స్టన్లోని సబీనా పార్క్ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. కామెరాన్ గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 225 పరుగులు చేయగలిగింది. విండీస్ బౌలర్లలో షమార్ జోసెఫ్ నాలుగు వికెట్లు కూల్చగా.. జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.143 పరుగులకు కుప్పకూలిన విండీస్ఇక ఆసీస్ ఆలౌట్ అయిన తర్వాత తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్.. 143 పరుగులకే కుప్పకూలింది. జాన్ కాంప్బెల్ చేసిన 36 పరుగులే విండీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్. దీనిని బట్టి ఆసీస్ బౌలర్ల విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్కాట్ బోలాండ్ అత్యుత్తమంగా 13.1 ఓవర్లలో కేవలం 34 పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు. మిగతా వారిలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా వెస్టిండీస్తో టెస్టులో ఉత్తమంగా రాణించిన స్కాట్ బోలాండ్.. ఓ అరుదైన రికార్డును సాధించాడు. 1915 తర్వాత టెస్టు క్రికెట్లో కనీసం 2000 డెలివరీలు సంధించిన బౌలర్లలో అత్యుత్తమ సగటు కలిగిన ఆటగాడిగా నిలిచాడు. తన నాలుగేళ్ల కెరీర్లో 17.33 సగటుతో బోలాండ్ 59 వికెట్లు కూల్చాడు. ఇక 1901- 1914 వరకు ఇంగ్లండ్కు ఆడిన సిడ్నీ బార్న్స్ 16.43 సగటుతో వికెట్లు కూల్చాడు.1915 నుంచి ఇప్పటికి.. 2000 డెలివరీల తర్వాత అత్యుత్తమ బౌలింగ్ యావరేజ్ కలిగి ఉన్న బౌలర్లు (యాక్టివ్ క్రికెటర్లలో)👉స్కాట్ బోలాండ్ (ఆస్ట్రేలియా): 2021-2025- 17.33 సగటుతో 59 వికెట్లు👉బెర్ట్ ఐరన్మోంగర్ (ఆస్ట్రేలియా): 1928- 1933- 17.97 సగటుతో 74 వికెట్లు👉ఫ్రాంక్ టైసన్ (ఇంగ్లండ్): 1954- 1959- 18.56 సగటుతో 76 వికెట్లు👉అక్షర్ పటేల్ (ఇండియా): 2021-2024- 19.34 సగటుతో 55 వికెట్లు👉జస్ప్రీత్ బుమ్రా (ఇండియా): 2018-2025- 19.48 సగటుతో 217 వికెట్లు. చదవండి: ENG VS IND 3rd Test: 23 ఏళ్ల కిందటి రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్ -
Divorce: సైనా అలా.. పారుపల్లి కశ్యప్ ఇలా!.. ఇన్స్టా పోస్ట్ వైరల్
Saina Nehwal- Parupalli Kashyap Divorce: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్స్ పతక విజేత సైనా నెహ్వాల్ (Saina Nehwal) తన భర్త పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap)తో విడిపోతున్నట్లు ప్రకటించింది. తాము సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆదివారం రాత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ప్రకటన విడుదల చేసిన సైనాఈ మేరకు.. ‘‘జీవితం మనల్ని ఒక్కోసారి వేర్వేరు దిశల్లో ప్రయాణం చేయిస్తుంది. సుదీర్ఘ చర్చలు, ఆలోచనల తర్వాత.. నేను కశ్యప్ పారుపల్లి విడిపోవాలని నిర్ణయించుకున్నాం.శాంతియుత జీవనం, ఎదుగుదల, మానసిక ప్రశాంతత మా ఇరువురికీ ముఖ్యమని భావించి వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని భావించాము. మా ఇద్దరి బంధానికి సంబంధించి నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇక ముందు కూడా స్నేహితుల్లా ముందుకు సాగుతాం.ఇలాంటి క్లిష్ట సమయంలో మా గోప్యత, గౌరవానికి భంగం కలగకుండా మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరుకుంటున్నా’’ అని సైనా నెహ్వాల్ ఇన్స్టా స్టోరీ ద్వారా తమ విడాకుల విషయాన్ని వెల్లడించింది.బెస్టెస్ట్ అంటూ కశ్యప్ స్టోరీఅయితే, అదే సమయంలో పారుపల్లి కశ్యప్ మాత్రం విడాకుల గురించి ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. అంతేకాదు.. సైనా కంటే ముందే ఓ పోస్ట్ను ఇన్స్టాలో షేర్ చేశాడు. ఇందులో కశ్యప్ తన స్నేహితులతో కలిసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను రీషేర్ చేస్తూ.. ‘‘బెస్టెస్ట్’’ అంటూ స్టోరీ పెట్టాడు.కపుల్ గోల్స్ సెట్ చేసిన క్రీడా జంట.. అంతలోనే..అయితే, సైనాతో ఉన్న పాత ఫొటోలన్నీ కూడా పారుపల్లి కశ్యప్ అలాగే ఉంచాడు. ఆమెతో కలిసి టూర్లకు వెళ్లిన ఫొటోలన్నీ తన సోషల్ మీడియా అకౌంట్లో అలాగే అట్టిపెట్టుకున్నాడు. కాగా భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్ చాలా ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. 2018లో పెళ్లి బంధంతో ఒక్కటైన వీరు అన్యోన్యంగా ఉండేవారు. కెరీర్ పరంగానూ ఒకరికొరు అండగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేసే వాళ్లు.కానీ అకస్మాత్తుగా ఇలా సైనా నుంచి విడాకుల ప్రకటన రాగా.. కశ్యప్ మాత్రం ఇంకా స్పందించకపోవడం గమనార్హం. కాగా సైనాకు ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు భర్త కశ్యప్తో పాటు టూర్లకు వెళ్లే సైనా.. మరికొన్ని సార్లు తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణాలు చేసేది. ఇందుకు సంబంధించిన జ్ఞాపకాలను ఫొటోల రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేసేది సైనా. ఇక భర్తతో ఉన్న మధురానుభూతులను కూడా కెమెరాతో ఒడిసిపట్టి అభిమానులతో పంచుకునేది. చివరగా ఈ ఏడాది మేలో సైనా, కశ్యప్ సౌతాఫ్రికా టూర్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ సంతోషంగా గడిపిన క్షణాలను సైనా షేర్ చేసింది. అయితే, వీరి మధ్య విభేదాలు, విడాకులకు గల కారణం ఏమిటో మాత్రం తెలియదు.కెరీర్లో బెస్ట్కాగా సైనా లండన్ ఒలింపిక్స్-2012లో మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం గెలవగా.. అదే ఎడిషన్లో కశ్యప్ మెన్స్ సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా కశ్యప్ చరిత్ర సృష్టించాడు. -
ఎంఎల్సీ ఛాంపియన్గా ముంబై ఇండియన్స్.. ఫైనల్లో మ్యాక్స్వెల్ సేన చిత్తు
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్ విజేతగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ అవతరించింది. డల్లాస్ వేదికగా ఇవాళ (జులై 14) జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ వాషింగ్టన్ ఫ్రీడంను 5 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఎంఎల్సీలో ఎంఐకు ఇది రెండో టైటిల్. 2023 సీజన్లో ఈ జట్టు తొలిసారి టైటిల్ చేజిక్కించుకుంది. ఓవరాల్గా పొట్టి క్రికెట్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ఇది 13వ టైటిల్.ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు సాధించిన టీ20 టైటిళ్లు..MI CLT20 2011 విజేతMI IPL 2013 విజేతMI CLT20 2013ని గెలుచుకుందిMI IPL 2015ను గెలుచుకుందిMI IPL 2017ను గెలుచుకుందిMI IPL 2019 గెలిచుకుందిMI IPL 2020ని గెలుచుకుందిMI WPL 2023ని గెలుచుకుందిMINY 2023లో MLC గెలుచుకుందిMIE ILT20 2024 గెలుచుకుందిMICT SA20 2025 గెలుచుకుందిMI WPL 2025ని గెలుచుకుందిMINY MLC 2025 గెలుచుకుందిఈ సీజన్లో ఎంఐ న్యూయార్క్ నికోలస్ పూరన్ నేతృత్వంలో బరిలోకి దిగింది. పూరన్ ఎంఐ ఫ్రాంచైజీల తరఫున మూడో టైటిల్ సాధించాడు. ఎంఐ ఫ్రాంచైజీలకు అత్యధిక టైటిళ్లు అందించిన ఘనత రోహిత్ శర్మకు దక్కుతుంది. రోహిత్ ముంబై ఇండియన్స్కు 6 టైటిళ్లు అందించాడు. హర్మన్ప్రీత్ కౌర్ 2, రషీద్ ఖాన్, హర్భజన్ సింగ్ ఎంఐ ఫ్రాంచైజీలకు తలో టైటిల్ అందించారు. ఈ సీజన్లో వెటరన్ ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్ ఎంఐ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. పోలార్డ్కు ఆటగాడిగా ఇది 17వ టీ20 టైటిల్. ప్రపంచ క్రికెట్లో పోలార్డ్, డ్వేన్ బ్రావో మాత్రమే ఆటగాళ్లుగా 17 టైటిళ్లు సాధించారు.కాగా, ఈ సీజన్లో ఎంఐ అనూహ్య రీతిలో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించి, చివరికి టైటిల్నే సొంతం చేసుకుంది. అదృష్టం కొద్ది ప్లే ఆఫ్స్కు చేరిన ఎంఐ.. వరుసగా ఎలిమినేటర్, ఛాలెంజర్, ఫైనల్లో విజయాలు సాధించి ఛాంపియన్గా అవతరించింది. ఈ ఏడాది ఎంఐ ఫ్రాంచైజీలకు ఇది మూడో టీ20 టైటిల్. ఈ యేడు ఎంఐ సౌతాఫ్రికా టీ20 లీగ్, మహిళల ఐపీఎల్, తాజాగా మేజర్ లీగ్ క్రికెట్ టైటిళ్లను సాధించింది.ఫైనల్ విషయానికొస్తే.. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డికాక్ (77) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటి ఎంఐకి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఎంఐ ఇన్నింగ్స్లో మొనాంక్ పటేల్ 28, తజిందర్ డిల్లాన్ 14, పూరన్ 21, పోలార్డ్ 0, బ్రేస్వెల్ 4, కన్వర్జీత్ సింగ్ 22 (నాటౌట్), ట్రిస్టన్ లస్ 2, బౌల్ట్ 1 (నాటౌట్) పరుగులు చేశాడు. వాషింగ్టన్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 3, నేత్రావల్కర్, మ్యాక్స్వెల్, జాక్ ఎడ్వర్డ్స్, హోలాండ్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్ చివరి వరకు గెలుపు కోసం పోరాడింది. రచిన్ రవీంద్ర (70), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్), జాక్ ఎడ్వర్డ్స్ (33) వాషింగ్టన్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. చివరి ఓవర్లో వాషింగ్టన్ గెలుపుకు 12 పరుగులు అవసరం కాగా.. 22 ఏళ్ల కుర్ర పేసర్ రుషి ఉగార్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మ్యాక్స్వెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్లను సైలెంట్ చేసి ఎంఐకి అద్భుత విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో ఉగార్కర్ మ్యాక్స్వెల్ను (15) ఔట్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫలితంగా ఎంఐ రెండోసారి ఛాంపియన్షిప్ను చేజిక్కించుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో మిచెల్ ఓవెన్, ఆండ్రియస్ గౌస్ డకౌటై నిరాశపరిచారు. ఎంఐ బౌలర్లలో బౌల్ట్, ఉగార్కర్ తలో 2 వికెట్లు తీయగా.. కెంజిగే ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
ENG Vs IND: 23 ఏళ్ల కిందటి రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన శుభ్మన్ గిల్
లార్డ్స్ టెస్ట్లో టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనలో తడబాటుకు లోనైనప్పటికీ.. కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ ఘోరంగా విఫలమైనప్పటికీ (16, 6) రికార్డును చేజిక్కించుకోవడం విశేషం.ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. రెండో ఇన్నింగ్స్లో 6 పరుగులకు ఔటైన గిల్.. ఇంగ్లండ్లో ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో 23 ఏళ్ల కిందట రాహుల్ ద్రవిడ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో గిల్ ఓ డబుల్ సెంచరీ (269), 2 సెంచరీల (147, 161) సాయంతో 101.17 సగటున 607 పరుగులు సాధించాడు.ద్రవిడ్ 2002 ఇంగ్లండ్ పర్యటనలో 602 పరుగులు చేశాడు. ఇంగ్లండ్లో ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ అవతరించడంతో మరో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మూడో స్థానానికి పడిపోయాడు. విరాట్ 2016 ఇంగ్లండ్ పర్యటనలో 593 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ గడ్డ పై ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు (టాప్-5)..శుభ్మన్ గిల్ – 607 పరుగులు (2025లో)రాహుల్ ద్రవిడ్ – 602 పరుగులు (2002లో)విరాట్ కోహ్లీ – 593 పరుగులు (2018లో)సునీల్ గవాస్కర్ – 542 పరుగులు (1979లో)రాహుల్ ద్రవిడ్ – 461 పరుగులు (2011లో)మ్యాచ్ విషయానికొస్తే.. స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా తడపడుతుంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో గెలవాలంటే టీమిండియా ఇంకా 135 పరుగులు చేయాలి. కేఎల్ రాహుల్ (33) క్రీజ్లో ఉన్నాడు. ఓవర్నైట్ బ్యాటర్గా బరిలోకి దిగిన ఆకాశ్దీప్ (1) ఔట్ కావడంతో నాలుగో రోజు ఆట ముగిసింది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 0, కరుణ్ నాయర్ 14, శుభ్మన్ గిల్ 6 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. కీలకమైన రూట్ (40), జేమీ స్మిత్ (8), బెన్ స్టోక్స్ (33) వికెట్లతో షోయబ్ బషీర్ (2) వికెట్ తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బకొట్టాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లపై అటాక్ చేశాడు. టీ విరామం తర్వాత బుమ్రా క్రిస్ వోక్స్ (10), బ్రైడన్ కార్స్లను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు.తొలి సెషన్లో సిరాజ్, నితీశ్ కుమార్, ఆకాశ్దీప్ చెలరేగిపోయారు. డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్ ఔట్ చేశారు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
AUS Vs WI: రసవత్తరంగా సాగుతున్న విండీస్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్
జమైకా వేదికగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 181 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కెమరూన్ గ్రీన్ (42), పాట్ కమిన్స్ (5) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, షమార్ జోసఫ్ 2, జస్టిన్ గ్రీవ్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా 14, సామ్ కొన్స్టాస్ 0, స్టీవ్ స్మిత్ 5, ట్రవిస్ హెడ్ 16, బ్యూ వెబ్స్టర్ 13, అలెక్స్ క్యారీ 0 పరుగులకు ఔటయ్యారు.అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో 143 పరుగులకే కుప్పకూలింది. 36 పరుగులు చేసిన జాన్ క్యాంప్బెల్ విండీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో షాయ్ హోప్ (23), జస్టిన్ గ్రీవ్స్ (18), రోస్టన్ ఛేజ్ (18), బ్రాండన్ కింగ్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 3, హాజిల్వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్స్టర్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఖ్వాజా (23), హెడ్ (20), క్యారీ (21), కమిన్స్ (24) 20ల్లో ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 4, గ్రీవ్స్, జేడన్ సీల్స్ తలో 3 వికెట్లు తీశారు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్లు గెలిచి ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. -
SL Vs BAN: శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ జట్టు తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. నిన్న (జులై 13) జరిగిన టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (50 బంతుల్లో 76; ఫోర్, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో.. తౌహిద్ హృదోయ్ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్), షమీమ్ హొసేన్ (27 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్లతో రాణించారు. వీరు మినహా మిగతా బ్యాటర్లంతా కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తంజిద్ హసన్ 5, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ 0, మెహిది హసన్ మిరాజ్ 1, జాకెర్ అలీ 3, సైఫుద్దీన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో బినుర ఫెర్నాండో 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మహీశ్ తీక్షణ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. బంగ్లాదేశ్ బౌలర్లు ఊహించని రీతిలో రెచ్చిపోవడంతో 15.2 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్లో కేవలం పథుమ్ నిస్సంక (32), దసున్ షనక (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కుసాల్ మెండిస్ 8, కుసాల్ పెరీరా 0, అవిష్క ఫెర్నాండో 2, అసలంక 5, చమిక కరుణరత్నే 0, వాండర్సే 8, తీక్షణ 6, బినుర 6 పరుగులకే ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 3, షోరీఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో 2, ముస్తాఫిజుర్, మెహిది హసన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టీ20లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేసే మూడో టీ20 కొలొంబో వేదికగా జులై 16న జరుగనుంది. కాగా, టీ20 సిరీస్కు ముందు బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్లను శ్రీలంక కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0తో.. మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ శ్రీలంకలో పర్యటిస్తుంది. -
చరణి శ్రీకారం
ప్రాక్టీస్ సెషన్కు అందరికంటే ముందు హాజరవడం... శిక్షణ ముగిసిన తర్వాత కూడా ‘ఇంకొక్క బాల్ వేస్తా’ అంటూ కొనసాగించడం... అనుకున్న స్థానంలో బంతి వేసేంత వరకు అలుపెరగకుండా సాధన సాగించడం... వెరసి ఆ అమ్మాయిని ప్రత్యేకంగా నిలిపాయి! ఏజ్ గ్రూప్ టోర్నీలంటే ఏంటో తెలియకుండా... అండర్–19 ఊసే లేకుండా... నేరుగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆడే అవకాశం దక్కించుకున్న ఆ అమ్మాయి... ఆడింది రెండు మ్యాచ్లే అయినా తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో జాతీయ జట్టు నుంచి పిలుపు రాగా... అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనతో కట్టిపడేసింది. భిన్నమైన పిచ్లపై మరింత ప్రభావం చూపగలదని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేస్తే ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన తొలి టి20 సిరీస్లో 10 వికెట్లతో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణిపై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడావిభాగం : టి20 ఫార్మాట్లో ఇంగ్లండ్పై చెప్పుకోదగ్గ రికార్డులేని భారత జట్టు... ఈ పర్యటనలో భాగంగా ఆడిన తొలి టి20లో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నాటింగ్హామ్ వేదికగా జరిగిన తొలి టి20లో స్మృతి మంధాన సెంచరీతో చెలరేగడంతో భారత జట్టు భారీ స్కోరు చేయగా... ఛేదనలో ఇంగ్లండ్ చేతులెత్తేసింది. ‘శత’క్కొట్టిన స్మృతికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా... ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన శ్రీచరణి 4 వికెట్లతో అదరగొట్టింది. అయితే మంధాన మెరుపుల ముందు శ్రీచరణి బౌలింగ్ వాడి వెలుగులోకి రాలేదు. బ్రిస్టల్లో జరిగిన రెండో మ్యాచ్లోనూ మొదట టీమిండియా మంచి స్కోరు చేయగా... ఛేదనలో ఇంగ్లండ్ను కట్టడి చేసిన ఘనత ఆంధ్ర ప్లేయర్దే. 4 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు విజయానికి దూరమైంది.మూడో మ్యాచ్లోనూ నిలకడ కొనసాగించిన శ్రీ చరణి మరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకుంది. మాంచెస్టర్లో జరిగిన నాలుగో టి20లోనూ మరో 2 వికెట్లు తీసింది. ఆఖరి పోరులో వికెట్ పడగొట్టలేకపోయినా... ఓవరాల్గా ఐదు మ్యాచ్ల్లో కలిపి 10 వికెట్లు తీసిన శ్రీచరణి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కైవసం చేసుకుంది. అనూహ్య అవకాశం... ఇంగ్లండ్తో టి20 సిరీస్ ఆరంభానికి ముందు దీప్తి శర్మ, రాధ యాదవ్ వంటి సీనియర్ స్పిన్నర్లు జట్టులో ఉండటంతో శ్రీ చరణికి అసలు తుది జట్టులో చోటు దక్కుతుందా అనే అనుమానాలు రేకెత్తగా... సిరీస్ ముగిసే సమయానికి నైపుణ్యం గల బౌలర్ అనే స్థాయికి ఎదిగింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన శ్రీచరణి చిన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ప్రారంభించిన ఆట తనను అందలం ఎక్కిస్తుందని ఏ దశలోనూ ఊహించలేదు. జాతీయ జట్టు తరఫున నిలకడగా రాణించడమే తన లక్ష్యమని 20 ఏళ్ల శ్రీచరణి అంటోంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్... కెరీర్ ఆరంభంలో ఫాస్ట్ బౌలర్ కావాలని భావించింది. తగినంత ఎత్తు, అందుకు తగ్గ శరీర సౌష్టవం ఆమెను ఆ దిశగా ప్రోత్సహించగా... ఆంధ్రప్రదేశ్ హెడ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఆమెను స్పిన్ వైపు అడుగులు వేయించాడు. అపార ప్రతిభ ఉన్న శ్రీచరణికి ఆరంభంలో ఏదీ కలిసి రాలేదు. దీంతో అండర్–19 జట్టులో ఆమెకు చోటు దక్కలేదు. అయినా ఏమాత్రం నిరుత్సాహానికి గురికాని ఈ లెఫ్ట్ హ్యాండర్... వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ రోజురోజుకు మరింత మెరుగైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చొరవతో... డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి చెందిన హైదరాబాద్ మాజీ కెపె్టన్ అనన్య ఉపేంద్రన్ దృష్టిలో పడటంతో శ్రీచరణి దశ తిరిగింది. 2022 టి20 చాలెంజర్ ట్రోఫీలో చరణి బౌలింగ్ను గమనించిన అనన్య... ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందని ముందే ఊహించింది. ‘ఆ టోర్నీ మొత్తంలో శ్రీచరణి ప్రదర్శన నన్ను ఆకట్టుకుంది. మెరుగైన బౌలింగ్ యాక్షన్కు తోడు... బంతి మీద మంచి నియంత్రణ ఉండటం ఆమె బలం. ఇక మిగిలిన స్పిన్నర్లతో పోల్చుకుంటే కాస్త వేగంగా బంతులు వేస్తుండటంతో... ప్రత్యర్థులు షాట్లు ఆడలేక పోయేవారు. ఇంత ప్రతిభ ఉన్న అమ్మాయిని ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్–19 మహిళల ప్రపంచకప్లో పాల్గొన్న భారత జట్టులో చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. మంచి శరీర సౌష్టవం ఉండటంతో గాల్లోనే బంతిని తిప్పగల సహజ ప్రతిభ ఆమెకు అబ్బింది’అని అనన్య వెల్లడించింది. ఆ తర్వాత అనన్య ప్రోత్సాహంతో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అవకాశం దక్కించుకున్న శ్రీచరణి ఆడిన రెండు మ్యాచ్ల్లో 4 వికెట్లు పడగొట్టింది. ఈ దెబ్బతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న తెలుగమ్మాయి... ముక్కోణపు టోర్నీలో భాగంగా శ్రీలంకతో ఆడిన తొలి వన్డేలో రెండు వికెట్లతో సత్తా చాటింది. ఇప్పటి వరకు 5 వన్డేలు ఆడిన శ్రీచరణి 6 వికెట్లు పడగొట్టి భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది. సుదీర్ఘ కాలం ఆడాలనే లక్ష్యంతో... ఈ ఏడాది సొంతగడ్డపై ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు తమ బలాన్ని పెంపొందించుకోవాలని భావిస్తుండగా... అందులో భాగంగా యువ ప్రతిభకు విరివిగా అవకాశాలు ఇస్తోంది. అలా జట్టులోకి వచ్చిన శ్రీ చరణి ఇప్పటి వరకైతే తనమీద పెట్టుకున్న అంచనాలను అందుకుంది. మరి ఏడాది వ్యవధిలో ఇటు వన్డే ప్రపంచకప్ అటు టి20 వరల్డ్కప్ జరగనున్న నేపథ్యంలో శ్రీచరణి ఇదే నిలకడ కొనసాగిస్తే మెగా టోర్నీల్లో పాల్గొనడం ఖాయమే. ఆడింది తక్కువ మ్యాచ్లే అయినా... ఆమె సాధన చేసే తీరు, బంతిని సంధించే విధానం శ్రీ చరణిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. కెరీర్ ఆరంభంలోనే అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లతో కలిసి ఆడటం తనకు కలిసొచ్చిందని చరణి పేర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పేదని దాని వల్ల తన పని సులువైందని ఆమె వెల్లడించింది. ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్న శ్రీచరణి... పరిస్థితులను త్వరగా ఆకళింపు చేసుకొని అందుకు తగ్గట్లు బంతులు వేస్తుందని భారత మహిళల జట్టు బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వీ చెప్పాడు. స్వతహాగా సిగ్గరి అయిన శ్రీచరణి అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోంది. -
నాలుగో రౌండ్లో హంపి, దివ్య
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి, జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్ముఖ్ (మహారాష్ట్ర) నాలుగో రౌండ్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో హంపి 1.5–0.5తో కులోన్ క్లౌడియా (పోలాండ్)పై, దివ్య 1.5–0.5తో టియోడోరా ఇంజాక్ (సెర్బియా)పై విజయం సాధించారు. ఆదివారం జరిగిన మూడో రౌండ్ రెండో గేమ్లో హంపి 44 ఎత్తుల్లో క్లౌడియాను ఓడించింది. ఇంజాక్తో జరిగిన రెండో గేమ్ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. శనివారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్ను హంపి 102 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... ఇంజాక్తో జరిగిన గేమ్లో దివ్య 39 ఎత్తుల్లో గెలిచింది. మూడో రౌండ్లోని రెండు గేమ్లు ముగిశాక భారత్కే చెందిన ద్రోణవల్లి హారిక–స్టావ్రూలా (గ్రీస్), వంతిక అగర్వాల్–కాటరీనా లాగ్నో (రష్యా), వైశాలి–కరిస్సా యిప్ (అమెరికా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో ఈరోజు టైబ్రేక్ గేమ్లు నిర్వహించి విజేతలను నిర్ణయిస్తారు. -
జ్యోతి యర్రాజీ సర్జరీ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: గాయంతో ఇబ్బంది పడుతున్న భారత స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో 12.96 సెకన్ల టైమింగ్తో స్వర్ణం నెగ్గిన జ్యోతి... ప్రాక్టీస్ సందర్భంగా గాయపడింది. దీంతో పోటీలకు దూరమైన జ్యోతి... తాజాగా యాంటిరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్)కు సర్జరీ చేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రముఖ వైద్యుడు దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపింది. ‘గత కొన్ని వారాలు భారంగా గడిచాయి. గాయం కారణంగా అమితంగా ఇష్టపడే అథ్లెటిక్స్కు దూరంగా ఉండాల్సి రావడం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ శుక్రవారం సర్జరీ విజయవంతంగా పూర్తైంది. కష్ట సమయంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్లు, భారత అథ్లెటిక్స్ సమాఖ్యకు ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే తిరిగి కోలుకుంటా. రెట్టించిన ఉత్సాహంతో ట్రాక్పై అడుగుపెట్టాలని భావిస్తున్నా’ అని జ్యోతి పేర్కొంది. ఇటీవల నిలకడగా రాణిస్తున్న జ్యోతి... టోక్యో వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనాలని ఆశించినా... ఇప్పుడది సాధ్యపడేలా లేదు. వరల్డ్ అథ్లెటిక్స్ అర్హత మార్క్ 12.73 సెకన్లు కాగా... జ్యోతి నేరుగా ఈ అవకాశం దక్కించుకోకపోయినా ర్యాంకింగ్స్ ఆధారంగా ఆమెకు ఈ మెగా టోర్నీలో అవకాశం దక్కేది. -
భారత చెస్ 87వ గ్రాండ్మాస్టర్గా హరికృష్ణన్
చెన్నై: భారత చదరంగంలో మరో గ్రాండ్మాస్టర్ (జీఎం) అవతరించాడు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల హరికృష్ణన్ ఈ ఘనత సాధించాడు. ఫ్రాన్స్లో ముగిసిన లా ప్లాగ్ని అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్లో హరికృష్ణన్ జీఎం హోదా పొందడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్ను ఖరారు చేసుకున్నాడు. భారత్కే చెందిన ఇనియన్తో గేమ్ను ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణన్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో చివరి జీఎం నార్మ్ను అందుకున్నాడు. 2023లో బీల్ చెస్ ఫెస్టివల్లో తొలి జీఎం నార్మ్ పొందిన ఈ మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఎంకామ్) విద్యార్థి ఈ ఏడాది జూన్లో స్పెయిన్లో జరిగిన అందుజార్ ఓపెన్లో రెండో జీఎం నార్మ్ పొందాడు. ‘చాలా ఆనందంగా ఉంది. ఏడేళ్ల క్రితం గ్రాండ్మాస్టర్ హోదా కోసం ప్రయత్నం మొదలైంది. గత మూడేళ్లలో క్రమం తప్పకుండా టోర్నీల్లో పోటీపడుతున్నాను. కానీ జీఎం నార్మ్లు సాధించలేకపోయాను. అయితే రెండు నెలల వ్యవధిలో రెండు జీఎం నార్మ్లు పొంది గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నాను’ అని తమిళనాడుకే చెందిన గ్రాండ్మాస్టర్ శ్యాం సుందర్ మోహన్రాజ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న హరికృష్ణన్ వ్యాఖ్యానించాడు. -
వివాహబంధానికి సైనా, కశ్యప్ గుడ్బై
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా సైనా తమ విడాకుల విషయాన్ని ఆదివారం రాత్రి పోస్ట్ చేసింది. ‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశలకు తీసుకెళుతుంది. ఎంతో ఆలోచించి, సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత నేను, కశ్యప్ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం. పరస్పర అవగాహనతో సహృద్భావ వాతావరణంలో మా విడాకులు తీసుకుంటున్నాం. కశ్యప్తో నాకు ఎన్నో తీపి గుర్తులున్నాయి.ఇకపై మిత్రులుగా ఉంటాం. మా నిర్ణయాన్ని అందరు స్వాగతిస్తారని, ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా, కశ్యప్లు 2018లో పెళ్లి చేసుకున్నారు. సైనా రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్గా నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. -
బ్యాటర్లదే భారం
లార్డ్స్ విజేత... సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లే జట్టేదో నేడు తేలనుంది. నాలుగో రోజు 14 వికెట్లు పడ్డాయి. ఆఖరి రోజూ వికెట్ల జోరు కొనసాగితే మాత్రం ఎవరి అంచనాలకు అందని ఫలితమే వస్తుంది. పిచ్ మారుతున్న ధోరణి, బ్యాటర్లకు ఎదురవుతోన్న పరిస్థితి చూస్తుంటే... అగ్ని పరీక్ష తప్పదేమో! దీంతో బంతిని ఎదుర్కోవడం కంటే ప్రతి ఓవర్లో బ్యాటర్లు సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్ను మిగిలున్న 135 పరుగుల లక్ష్యం ఊరిస్తుంటే... పిచ్ ఇంగ్లండ్ను ఉత్సాహపరుస్తోంది. లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు ఆఖరి మజిలీకి చేరింది. మూడో రోజు ముగిసేసరికి సమంగా నిలిచిన జట్లు... నాలుగో రోజు బౌలర్ల పట్టుదలకు తలొగ్గాయి. భారత బ్యాటర్లు రాణిస్తే గెలుపు... ఇంగ్లండ్ బౌలర్లు పడగొడితే ముప్పు... ఏదేమైనా ఐదో రోజు ఆట రసవత్తర ముగింపునకు తెరలేపనుంది. ఇంగ్లండ్ను 200 పరుగుల్లోపే ఆలౌట్ చేశామన్న ఆనందాన్ని భారత టాపార్డర్ వికెట్లు ఆవిరి చేశాయి. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 17.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 33 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. బ్రైడన్ కార్స్ 2 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ మొదలైన రెండో ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (0) నిర్లక్ష్యంగా వికెట్ను పారేసుకోగా... కరుణ్ నాయర్ (14), కెప్టెన్ శుబ్మన్ గిల్ (6) కార్స్ అద్బుతమైన బంతులకు వికెట్ల ముందు దొరికిపోయారు. ‘నైట్వాచ్మన్’ ఆకాశ్దీప్ (1)ను స్టోక్స్ క్లీన్బౌల్ట్ చేశాడు. భారత్ చేతిలో 6 వికెట్లుండగా... గిల్ బృందం విజయానికి 135 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 62.1 ఓవర్లలో 192 పరుగుల వద్ద ఆలౌటైంది. జో రూట్ (96 బంతుల్లో 40; 1 ఫోర్), కెపె్టన్ బెన్ స్టోక్స్ (96 బంతుల్లో 33; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. భారత బౌలర్లలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 12.1–2–22–4 చక్కని స్పెల్తో తిప్పేశాడు. సిరాజ్ మొదలుపెడితే... అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 2/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ను సిరాజ్ తన పేస్ బౌలింగ్తో వణికించాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో డకెట్ (12)ను అవుట్ చేశాడు. కాసేపటికి ఒలీ పోప్ (4)ను ఎల్బీగా పంపాడు. సిరాజ్ పేస్ను గమనించిన కెప్టెన్ గిల్ మరో ఎండ్లో బుమ్రాను తప్పించి నితీశ్ కుమార్కు బంతిని అప్పగించడం ఫలితాన్నిచ్చింది. ఓపెనర్ క్రాలీ (22)ని నితీశ్ అవుట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లోనూ అతని వికెట్ను నితీశే తీశాడు. దీంతో 50 పరుగులకే ఇంగ్లండ్ 3 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో రూట్, హ్యారీ బ్రూక్ నిలబడేందుకు చేసిన ప్రయత్నం లంచ్వరకైనా నిలువలేదు. ఆకాశ్దీప్ ఓవర్లో మిడాఫ్ దిశగా భారీ సిక్సర్ బాదిన బ్రూక్ అదే జోరులో స్వీప్షాట్ ఆడే యత్నంలో బోల్తా పడ్డాడు. స్టంప్స్ లక్ష్యంగా సంధించిన ఆకాశ్ బంతి బ్రూక్ మిడిల్ స్టంప్ను పడేసింది. దీంతో 87 పరుగుల వద్ద అతను క్లీన్»ౌల్డ్ కావడంతో ఇంగ్లండ్ కీలకమైన నాలుగో వికెట్ కోల్పోయింది. 98/4 వద్ద లంచ్బ్రేక్కు వెళ్లారు. సుందర్ ఉచ్చులో... రెండో సెషన్లో ఇంగ్లండ్ తేరుకుంది. ఇటు రూట్, అటు కెప్టెన్ స్టోక్స్ నిలకడగా ఆడారు. పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశారు. దీంతో ఈ సెషన్లో భారత బౌలర్లు పడిన కష్టానికి తగిన ఫలితమైతే రాలేదు. అయితే సుందర్ మాయాజాలం మొదలవడంతో జట్టు స్కోరు 150 దాటిన తర్వాత రూట్, స్వల్ప వ్యవధిలోనే స్మిత్ (8) అవుటయ్యారు. ఈ సెషన్లో కేవలం 2 వికెట్లనే కోల్పోయి 77 పరుగులు జతచేసింది. అయితే మూడో సెషన్ ఇంగ్లండ్ను ముంచింది. స్టోక్స్ వికెట్ను పడేయడంతో సుందర్ ఆలౌట్కు సిద్ధం చేశాడు. వోక్స్ (10), కార్స్ (1)లను బుమ్రా బౌల్డ్ చేయగా, బషీర్ (2)ను బౌల్డ్ చేసి సుందర్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ముగించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387; భారత్ తొలిఇన్నింగ్స్: 387; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) జైస్వాల్ (బి) నితీశ్ 22; డకెట్ (సి) బుమ్రా (బి) సిరాజ్ 12; పోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 4; జో రూట్ సుందర్ 40; బ్రూక్ (బి) ఆకాశ్దీప్ 23; స్టోక్స్ (బి) సుందర్ 33; స్మిత్ (బి) సుందర్ 8; వోక్స్ (బి) బుమ్రా 10; కార్స్ (బి) బుమ్రా 1; ఆర్చర్ (నాటౌట్) 5; బషీర్ (బి) సుందర్ 2; ఎక్స్ట్రాలు 32; మొత్తం (62.1 ఓవర్లలో ఆలౌట్) 192. వికెట్ల పతనం: 1–22, 2–42, 3–50, 4–87, 5–154, 6–164, 7–181, 8–182, 9–185, 10–192. బౌలింగ్: బుమ్రా 16–3–38–2, సిరాజ్ 13–2–31–2, నితీశ్ 5–1–20–1, ఆకాశ్దీప్ 8–2–30–1, జడేజా 8–1–20–0, సుందర్ 12.1–2–22–4. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) ఆర్చర్ 0; రాహుల్ (బ్యాటింగ్) 33; కరుణ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కార్స్ 14; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కార్స్ 6; ఆకాశ్ దీప్ (బి) స్టోక్స్ 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 4 వికెట్లకు) 58. వికెట్ల పతనం: 1–5, 2–41, 3–53, 4–58. బౌలింగ్: వోక్స్ 5–2–11–0, ఆర్చర్ 4–0–18–1, స్టోక్స్ 4.4–0–15–1, కార్స్ 4–1–11–2. -
విన్నర్ సినెర్
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపాన్ని చూపిన ఇటలీ స్టార్, ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ ‘వింబుల్డన్ గ్రాండ్స్లామ్’ చాంపియన్గా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సినెర్ 4–6, 6–4, 6–4, 6–4తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సినెర్కు 30 లక్షల పౌండ్లు (రూ. 34 కోట్ల 85 లక్షలు), రన్నరప్ అల్కరాజ్కు 15 లక్షల 20 వేల పౌండ్లు (రూ. 17 కోట్ల 66 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. 3 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో గెలవడం ద్వారా గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన ఓటమికి 23 ఏళ్ల సినెర్ బదులు తీర్చుకున్నాడు. అంతేకాకుండా తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టైటిల్ను సాధించాడు. ఓవరాల్గా సినెర్ ఖాతాలో ఇది నాలుగో గ్రాండ్స్లామ్ టైటిల్ కావడం విశేషం. సినెర్ 2024, 2025లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్... 2024లో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు. సినెర్ చేతిలో ఓటమితో గ్రాండ్స్లామ్ ఫైనల్లో అల్కరాజ్కు తొలిసారి పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్కంటే ముందు 22 ఏళ్ల అల్కరాజ్ ఫైనల్ చేరిన ఐదు గ్రాండ్స్లామ్ టోర్నీల్లోనూ (2022 యూఎస్ ఓపెన్; 2023 వింబుల్డన్; 2023 ఫ్రెంచ్ ఓపెన్; 2024 వింబుల్డన్; 2025 ఫ్రెంచ్ ఓపెన్) విజేతగా నిలిచాడు. తొలి సెట్ కోల్పోయినా... గతంలో అల్కరాజ్ చేతిలో ఎనిమిదిసార్లు ఓడిపోయి, నాలుగుసార్లు మాత్రమే నెగ్గిన సినెర్ వింబుల్డన్ ఫైనల్లో శుభారంభం చేయలేకపోయాడు. తొలి సెట్లో 4–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... అల్కరాజ్ ధాటికి సినెర్ వరుసగా నాలుగు గేమ్లు కోల్పోయి సెట్ను 4–6తో చేజార్చుకున్నాడు. తొలి సెట్ను కోల్పోయినా... ఆందోళన చెందకుండా సంమయనంతో ఆడిన సినెర్ రెండో సెట్లో తొలి గేమ్లోనే అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్లను నిలబెట్టుకొని సెట్ను 6–4తో నెగ్గి 1–1తో సమం చేశాడు. మూడో సెట్లోని తొమ్మిదో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేసి పదో గేమ్లో సర్వీస్ను నిలబెట్టుకున్న సినెర్ సెట్ను 6–4తో దక్కించుకున్నాడు. నాలుగో సెట్లోనూ సినెర్ దూకుడు కొనసాగించి మూడో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్లను కాపాడుకొని సెట్తోపాటు విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. -
ENG VS IND 3rd Tests: స్వల్ప లక్ష్య ఛేదన.. తడబడుతున్న భారత్
లార్డ్స్ టెస్ట్లో భారత్ స్వల్ప లక్ష్య ఛేదనలో తడపడుతుంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో గెలవాలంటే టీమిండియా ఇంకా 135 పరుగులు చేయాలి. కేఎల్ రాహుల్ (33) క్రీజ్లో ఉన్నాడు. ఓవర్నైట్ బ్యాటర్గా బరిలోకి దిగిన ఆకాశ్దీప్ (1) ఔట్ కావడంతో నాలుగో రోజు ఆట ముగిసింది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 0, కరుణ్ నాయర్ 14, శుభ్మన్ గిల్ 6 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. కీలకమైన రూట్ (40), జేమీ స్మిత్ (8), బెన్ స్టోక్స్ (33) వికెట్లతో షోయబ్ బషీర్ (2) వికెట్ తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బకొట్టాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లపై అటాక్ చేశాడు. టీ విరామం తర్వాత బుమ్రా క్రిస్ వోక్స్ (10), బ్రైడన్ కార్స్లను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు.తొలి సెషన్లో సిరాజ్, నితీశ్ కుమార్, ఆకాశ్దీప్ చెలరేగిపోయారు. డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్ ఔట్ చేశారు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
ENG VS IND 3rd Test: స్వల్ప లక్ష్య ఛేదన.. ఆదిలోనే టీమిండియాకు షాక్
లార్డ్స్ టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించినట్లే సాధించి పట్టు చేజార్చుకునేలా ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 192 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఆతర్వాత స్వల్ప లక్ష్య ఛేదనను తడబాటుతో మొదలుపెట్టింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిర్లక్ష్యమైన షాట్ ఆడి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో జైస్వాల్ డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లోనూ ఆర్చర్రే జైస్వాల్ను ఔట్ చేశాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ వికెట్ నష్టానికి 5 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్కు (5) జతగా కరుణ్ నాయర్ క్రీజ్లోకి వచ్చాడు. క్రికెట్ మరో ఛాన్స్ ఇవ్వు అని ప్రాధేయపడి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ ఇప్పటివరకు ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో అయినా కరుణ్ రాణిస్తాడేమో చూడాలి. ఒక వేళ ఈ ఇన్నింగ్స్లో కరుణ్ బాగా ఆడకపోతే అతని స్థానం గల్లంతైనట్లే. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 188 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ గెలుపుకు 9 వికెట్లు కావాలి. ఇవాల్టి ఆటలో మరో గంట మిగిలి ఉంది. ఈ గంటలో భారత్ వికెట్ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వికెట్ పోగొట్టుకుంటే మాత్రం ఆతర్వాత వచ్చే ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ పిచ్పై 193 పరుగుల లక్ష్యం మరీ అంత చిన్నదేమీ కాదు. భారత బ్యాటర్లు ఎమరపాటుగా ఉంటే మాత్రం తగిన మూల్యం చెల్లింఉకోవాల్సి వస్తుంది.దీనికి ముందు భారత్ ఇంగ్లండ్ను 192 పరుగులకే కుప్పకూల్చింది. వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. కీలకమైన రూట్ (40), జేమీ స్మిత్ (8), బెన్ స్టోక్స్ (33) వికెట్లతో షోయబ్ బషీర్ (2) వికెట్ తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బకొట్టాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లపై అటాక్ చేశాడు. టీ విరామం తర్వాత బుమ్రా క్రిస్ వోక్స్ (10), బ్రైడన్ కార్స్లను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు.అంతకుముందు తొలి సెషన్లో సిరాజ్, నితీశ్ కుమార్, ఆకాశ్దీప్ చెలరేగిపోయారు. డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్ ఔట్ చేశారు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
వాషింగ్టన్ సుందర్ మాయాజాలం.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన ఇంగ్లండ్
లార్డ్స్ టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించింది. నాలుగో రోజు భారత బౌలర్లు చెలరేగిపోయారు. రెండు సెషన్లలోనే ఇంగ్లండ్ను 192 పరుగులకే కుప్పకూల్చారు. ఫలితంగా భారత్ 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. కీలకమైన రూట్ (40), జేమీ స్మిత్ (8), బెన్ స్టోక్స్ (33) వికెట్లతో షోయబ్ బషీర్ (2) వికెట్ తీసి ఇంగ్లండ్ను చావుదెబ్బకొట్టాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లపై అటాక్ చేశాడు. టీ విరామం తర్వాత బుమ్రా క్రిస్ వోక్స్ (10), బ్రైడన్ కార్స్లను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు.అంతకుముందు తొలి సెషన్లో సిరాజ్, నితీశ్ కుమార్, ఆకాశ్దీప్ చెలరేగిపోయారు. డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్ ఔట్ చేశారు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
తిప్పేసిన సుందర్.. పతనం అంచుల్లో ఇంగ్లండ్
లార్డ్స్ టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించింది. కడపటి వార్తలు అందేసరికి 185 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో ఉంది. వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కీలకమైన రూట్ (40), జేమీ స్మిత్ (8), బెన్ స్టోక్స్ (33) వికెట్లు తీసిన ఇంగ్లండ్ను చావుదెబ్బకొట్టాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కూడా అటాక్ మొదలుపెట్టాడు. టీ విరామం తర్వాత బుమ్రా క్రిస్ వోక్స్ (10), బ్రైడన్ కార్స్లను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు.అంతకుముందు తొలి సెషన్లో సిరాజ్, నితీశ్ కుమార్, ఆకాశ్దీప్ చెలరేగిపోయారు. డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్ ఔట్ చేశారు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
దుమ్మురేపుతున్న టీమిండియా బౌలర్లు.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్
లార్డ్స్ టెస్ట్లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపుతున్నారు. నాలుగో రోజు ప్రారంభం నుంచే చెలరేగుతున్న మన వాళ్లు టీ విరామం సమయానికి ఇంగ్లండ్ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. తొలి సెషన్లో సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్దీప్ విజృంభించగా.. రెండో సెషన్లో వాషింగ్టన్ సుందర్ సత్తా చాటాడు.టీ విరామం సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 175 పరుగులుగా ఉంది. బెన్ స్టోక్స్ (27), క్రిస్ వోక్స్ (8) ఇంగ్లండ్ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.తొలి సెషన్లో సిరాజ్ (7-2-11-2), నితీశ్ రెడ్డి (5-1-20-1), ఆకాశ్దీప్ (5-2-23-1) పదునైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించగా.. రెండో సెషన్లో సుందర్ (7-2-13-2) తన మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.భారత పేస్ అటాక్ ధాటికి ఇంగ్లండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్.. జేమీ స్మిత్ (8), జో రూట్ను (40) సుందర్ ఔట్ చేశాడు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
అత్యంత అరుదైన మైలురాయికి తాకిన జో రూట్
లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లండ్ స్టార్ మిడిలార్డర్ ఆటగాడు జో రూట్ ఓ అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో రూట్ టెస్ట్ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 8000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ (13492), మహేళ జయవర్దనే (9509), జాక్ కల్లిస్ (9033) తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ మైలురాయిని తాకే క్రమంలో రూట్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (7564) అధిగమించాడు.కెరీర్ తొలినాళ్లలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన రూట్.. నాలుగో స్థానానికి మారిన తర్వాత సంచలనాలు నమోదు చేశాడు. ఈ స్థానంలో రూట్ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు ఆడి తన జట్టుకు అపురూప విజయాలనందించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సూపర్ సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్లో తన జట్టును గాడిలో పెట్టే పనిలో ఉన్నాడు. లంచ్ విరామం తర్వాత రూట్ 31 పరుగులతో క్రీజ్లో కొనసాగుతున్నాడు. అతనికి జతగా బెన్ స్టోక్స్ (14) ఉన్నాడు. 35 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 129/4గా ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 250 పరుగులు చేసినా పెద్ద స్కోరే అవుతుంది. ఈ పిచ్పై ఛేజింగ్ చాలా కష్టంగా ఉండనుంది. భారత బౌలర్లు ఇంగ్లండ్ను 200లోపు ఆలౌట్ చేస్తేనే ఛేజింగ్కు సులువుగా ఉంటుంది.ఇవాళ తొలి సెషన్లో టీమిండియా పేసర్లు చెలరేగిపోయారు. సిరాజ్ (7-2-11-2), నితీశ్ రెడ్డి (5-1-20-1), ఆకాశ్దీప్ (5-2-23-1) పదునైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. భారత పేస్ అటాక్ ధాటికి ఇంగ్లండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్ ఔట్ చేశారు.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
వైభవ్ నిరాశపరిచినా, టీమిండియా భారీ స్కోర్
ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్ టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 540 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు. కుర్ర చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. వైభవ్ 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసి అలెక్స్ గ్రీన్ బౌలింగ్లో రాల్ఫీ ఆల్బర్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. మిగతా బ్యాటర్లలో చవ్డా 11, మొహమ్మద్ ఎనాన్ 23, హెనిల్ పటేల్ 38, దీపేశ్ దేవేంద్రన్ 4, అన్మోల్జీత్ సింగ్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్రీన్, ఆల్బర్ట్ తలో 3 వికెట్లు తీయగా.. జాక్ హోమ్, ఆర్చీ వాన్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి మ్యాచ్ మినహా తొలి నాలుగు మ్యాచ్ల్లో చెలరేగిపోయాడు.తొలి మ్యాచ్లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు.ఐదో వన్డేలో 42 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్రేట్తో 33 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో వైభవ్ ఇంత తక్కువ స్ట్రయిక్రేట్తో బ్యాటింగ్ చేయడం ఇదే మొదటిసారి. వైభవ్ తొలి నాలుగు మ్యాచ్ల్లో 130కి పైగా స్ట్రయిక్రేట్తో పరుగులు చేశాడు. వన్డే సిరీస్లో వైభవ్ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్ ప్రతి మ్యాచ్ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు. -
ENG VS IND 3rd Test, Day 4: చెలరేగిన భారత పేసర్లు.. కష్టాల్లో ఇంగ్లండ్
లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆట తొలి సెషన్లో టీమిండియా పేసర్లు చెలరేగిపోయారు. సిరాజ్ (7-2-11-2), నితీశ్ రెడ్డి (5-1-20-1), ఆకాశ్దీప్ (5-2-23-1) పదునైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. భారత పేస్ అటాక్ ధాటికి ఇంగ్లండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డకెట్ (12), ఓలీ పోప్ను (4) సిరాజ్ పెవిలియన్కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్ను (23) ఆకాశ్దీప్ ఔట్ చేశారు. లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. జో రూట్ (17), బెన్ స్టోక్స్ (2) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ 98 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100, పంత్ (74), జడేజా (72) రాణించారు. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు. భారత తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. -
నిప్పులు చెరిగినపేసర్లు.. స్వల్ప స్కోర్కే ఆలౌటైన ఆస్ట్రేలియా
జమైకా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు తొలి రోజు పైచేయి సాధించింది. ఆ జట్టు పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ఆటగాళ్లను బెంబేలెత్తించారు. ఫలితంగా ఆసీస్ 225 పరుగులకే ఆలౌటైంది. షమార్ జోసఫ్ 4, జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆదిలో సజావుగానే సాగింది. 28 పరుగులకే తొలి వికెట్ (కొన్స్టాస్ (17), 68 పరుగులకే రెండో వికెట్ (ఖ్వాజా (23)) కోల్పోయినా.. గ్రీన్ (46), స్మిత్ (48) ఆసీస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే గ్రీన్ ఔటైన తర్వాత ఆసీస్ 68 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు, టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. హెడ్ (20) ప్రతిఘటించే ప్రయత్నం చేసినా సబ్స్టిట్యూట్ ఆటగాడు ఆండర్సన్ ఫిలిప్ కళ్లు చెదిరే క్యాచ్తో అతన్ని పెవిలియన్ బాట పట్టించాడు. వెబ్స్టర్ 1, అలెక్స్ క్యారీ 21, కమిన్స్ 24, స్టార్క్ 0, బోలాండ్ 5 (నాటౌట్), హాజిల్వుడ్ 4 పరుగులు చేశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ కెవియన్ ఆండర్సన్ను (3) మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (8), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (3) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 209 పరుగులు వెనకుపడి ఉంది.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో గెలుచుకుంది. తొలి రెండు టెస్ట్ల్లో ఆసీస్ అద్భుత విజయాలు సాధించింది. నామమాత్రంగా సాగుతున్న చివరి మ్యాచ్లో తొలి రోజు విండీస్ పైచేయి సాధించడం విశేషం. -
సిరాజ్ అత్యుత్సాహం.. కొట్టేస్తావా ఏంటి..?
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ అద్భుతమైన బంతితో బెన్ డకెట్ను (12) బోల్తా కొట్టించాడు. పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో డకెట్ బుమ్రాకు సునాయాసమైన క్యాచ్ అందించాడు.డకెట్ను ఔట్ చేశాక సిరాజ్ పట్టలేని ఆనందంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. డకెట్వైపు కోపంగా చూస్తూ పెవిలియన్వైపు అడుగులేస్తున్న అతన్ని భుజంతో ఢీకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. సిరాజ్ ప్రవర్తనపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అంత ఓవరాక్షన్ అవసరం లేదని అక్షింతలు వేస్తున్నారు. కొట్టేస్తావా ఏంటని ప్రశ్నిస్తున్నారు.DSP SIRAJ ON DUTY AT LORD's 🫡📢 pic.twitter.com/6Sb0LiEuGl— Johns. (@CricCrazyJohns) July 13, 2025కాగా, ఈ మ్యాచ్లో సిరాజ్ మూడో రోజు చివర్లో కూడా ఇదే తరహా ప్రదర్శనతో నెటిజన్లచే చివాట్లు తిన్నాడు. మూడో రోజు ఆట ముగియడానికి ఆరు నిమిషాలు ఉండగా.. ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్ను ఆరంభించింది.ఈ సమయంలో భారత్ కనీసం రెండు ఓవర్లు అయినా బౌలింగ్ చేయాలని తహతహలాడింది. కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం ఒక్క ఓవర్ ఆడి మూడో రోజు ఆటను ముగించాలని భావించారు. దీంతో బుమ్రా వేసిన తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ పదేపదే అంతరాయం కలిగించి సమయాన్ని వృథా చేశాడు.ఈ క్రమంలో సహనం కోల్పోయిన గిల్.. క్రాలీని పరుష పదజాలంతో దూషించాడు. దీంతో జాక్ క్రాలీ కూడా వేలు చూపిస్తూ వాగ్వాదానికి దిగాడు. గిల్కు తోడుగా సిరాజ్ కూడా సీన్లోకి కావడంతో కాసేపు ఫీల్డ్లో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత అంపైర్లు జోక్యంతో చేసుకోవడంతో గొడవ సద్దమణిగింది. గిల్, సిరాజ్ ప్రవర్తనను క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. ఇంత ఓవరాక్షన్ అవసరం లేదని హితవు పలుకుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండు వికెట్లు సిరాజే తీసుకున్నాడు. తొలుత డకెట్ను ఔట్ చేసిన సిరాజ్, ఆతర్వాత ఓలీ పోప్ను (4) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 12 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ స్కోర్ 42/2గా ఉంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే.తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ రూట్ (104) సెంచరీ, జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ 387 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్ కేఎల్ రాహుల్ (100) సెంచరీ, పంత్ (74), జడేజా (72) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ చేసిన 387 పరుగుల వద్దనే ఆలౌటైంది. -
గిల్ నీ ప్రవర్తన బాగోలేదు.. విరాట్ కోహ్లిలా చేయొద్దు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే మూడో రోజు ఆట ఆఖరిలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. మూడో రోజు ఆట ముగియడానికి ఆరు నిమిషాలు ఉండగా.. ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్ను ఆరంభించింది.ఈ సమయంలో భారత్ కనీసం రెండు ఓవర్లు అయినా బౌలింగ్ చేయాలని తహతహలాడింది. కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం ఒక్క ఓవర్ ఆడి మూడో రోజు ఆటను ముగించాలని భావించారు. దీంతో బుమ్రా వేసిన తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ పదేపదే అంతరాయం కలిగించి సమయాన్ని వృథా చేశాడు.ఈ క్రమంలో సహనం కోల్పోయిన గిల్.. క్రాలీని పరుష పదజాలంతో దూషించాడు. దీంతో జాక్ క్రాలీ కూడా వేలు చూపిస్తూ వాగ్వాదానికి దిగాడు. గిల్కు తోడుగా సిరాజ్ ఎంటర్ అవ్వడంతో కాసేపు ఫీల్డ్లో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత అంపైర్లు జోక్యంతో చేసుకోవడంతో గొడవ సద్దమణిగింది. ఈ నేపథ్యంలో గిల్ తీరును ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్ తప్పుబట్టాడు. గిల్ ప్రవర్తన తనకు నచ్చలేదని అతడు విమర్శించాడు."ప్రతీ క్రీడలో కొంచెం గేమ్స్మ్యాన్షిప్ (కావాలనే సమయం వృథా చేయడం) ఉంటుంది. ఇంగ్లండ్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఏమి జరిగిందో, వారు ఎలా వ్యహరించారో నాకైతే తెలియదు. కానీ శుబ్మన్ గిల్ ప్రవర్తన మాత్రం నాకు నచ్చలేదు. అతడు కెప్టెన్ కాబట్టి అలా వ్యవహరించాడని అనుకుంటున్నా.ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పా, ఇతరుల వైపు వేలు చూపిస్తూ వారి ముందు నిలబడటం వంటివి చేయొద్దు. గిల్ను చూస్తుంటే గత కెప్టెన్ (కోహ్లీని ఉద్దేశించి) నాకు గుర్తొస్తున్నాడు. ఇలా చేయడం మీకు చెడ్డ పేరును తీసుకొస్తుంది. మైదానంలో దూకుడుగా ఉండడాన్ని నేను కూడా సమర్ధిస్తాను. కానీ శ్రుతిమించితే బాగోదు. భవిష్యత్తులో మీరు మరింత ఎదగాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రాట్ పేర్కొన్నాడు.For those who have missed the bollywood level acting of Shubman Gill 😅 #INDvsENG pic.twitter.com/1Djrf92vs0— Richard Kettleborough (@RichKettle07) July 13, 2025 -
IND vs ENG 3rd Test: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్
టెస్టు క్రికెట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. విదేశీ గడ్డపై ఒక టెస్టు సిరీస్(కనీసం 3 మ్యాచ్లు)లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో నాలుగు సిక్స్లు బాదిన టీమిండియా.. ఈ అరుదైన ఫీట్ను తమ పేరిట లిఖించుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ 34 సిక్సర్లు నమోదు చేసింది.ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్, న్యూజిలాండ్ పేరిట సంయుక్తంగా ఉండేది. 1974లో వెస్టిండీస్ జట్టు భారత్లో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 32 సిక్సర్లు నమోదు చేసింది. ఆ తర్వాత 2014లో యూఏఈ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కివీస్ కూడా సరిగ్గా 32 సిక్సర్లు కొట్టింది. తాజా మ్యాచ్తో కివీస్, విండీస్ను భారత్ అధిగమించింది.ఇక లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి 387 పరుగులు చేసింది. బదులుగా భారత్ కూడా తొలి ఇన్నింగ్స్లో చేసి 387 పరుగులే చేయగలిగింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్ల స్కోరు సమం అయింది. నాలుగో రోజు ఆట ఇరు జట్లకు కీలకం కానుంది. భారత బౌలర్లు మెరుగ్గా రాణించి ఇంగ్లండ్ను ఆలౌట్ చేస్తే మరో విజయం తమ ఖాతాలో వేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.చదవండి: నా వల్లే అలా జరిగింది.. పంత్ను ఏమి అనొద్దు: కేఎల్ రాహుల్ -
నా వల్లే అలా జరిగింది.. పంత్ను ఏమి అనొద్దు: కేఎల్ రాహుల్
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్కు టీమిండియా ధీటైన జవాబు ఇచ్చింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. అయితే మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్పై భారత్ ఆధిపత్యం చెలాయించింది.కానీ లంచ్ విరామానికి ముందు పంత్ వికెట్ను కోల్పోవడంతో కథ తారుమారైంది. అనవసరంగా రనౌట్ అయ్యి ఇంగ్లండ్కు తన వికెట్ను సమర్పించుకున్నాడు. కేఎల్ రాహుల్, పంత్ మధ్య సమన్వయలోపం వల్ల భారత్ వికెట్ కోల్పోవల్సి వచ్చింది.అయితే లేని పరుగు కోసం పంత్ ప్రయత్నించి రనౌటయ్యాడు అని చాలా మంది విమర్శించారు. కానీ ఈ పూర్తి బాధ్యతను రాహుల్ తీసుకున్నాడు. లంచ్ బ్రేక్కు ముందు సెంచరీ సాధించాలనే తన ఆత్రుత అనవసర రనౌట్కు అవుట్కు దారితీసిందని వెల్లడించాడు."ఈ మ్యాచ్లో మా ఇద్దరి మధ్య చాలా సంభాషణలు జరిగాయి. వీలైతే లంచ్ విరామానికి ముందే సెంచరీ సాధిస్తానని నేను పంత్తో చెప్పాను. బషీర్ లంచ్ బ్రేక్కు ముందు చివరి ఓవర్ వేయడంతో సెంచరీ చేయడానికి మంచి అవకాశం భావించాను.అందుకే పంత్ నాకు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టవ శాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే ఆ ఓవర్లో తొలి బంతికి బౌండరీ బాదే అవకాశముండేది. కానీ నేను మిస్ చేసుకున్నాను. ఆ బంతికి కేవలం సింగిల్ మాత్రమే లభించింది. దీంతో పంత్ మళ్లీ నన్ను స్ట్రైక్లోకి తీసుకురావాలనకున్నాడు. అందుకే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతడు రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఇది మా ఇద్దరికీ నిరాశ కలిగించింది. కానీ ఏ బ్యాటర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వాలని అనుకోరు. ఏదేమైనా ఆ రనౌట్ మా మూమెంటమ్ను దెబ్బతీసింది. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇంగ్లండ్ తిరిగి గేమ్లోకి వచ్చింది"అని రాహుల్ మూడో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఆ తర్వాత షోయబ్ బషీర్ బౌలింగ్లోనే రాహుల్ 177 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసిఔటయ్యాడు. ఈ కర్ణాటక ఆటగాడు రిషబ్ పంత్తో కలిసి నాలగో వికెట్కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ సూపర్ సెంచరీ.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్ -
ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ సూపర్ సెంచరీ.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే యశస్వి జైశ్వాల్, కెప్టెన్ శుబ్మన్ గిల్ వికెట్లు కోల్పోయిన భారత జట్టును.. తన సూపర్ పెర్ఫార్మెన్స్తో రాహుల్ ఆదుకున్నాడు.రిషబ్ పంత్తో కలిసి నాలగో వికెట్కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 177 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి రాహుల్ ఔటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.మూడో ప్లేయర్గా..సేనా( దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఏసియన్ బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. రాహుల్కు ఇది సేనా దేశాల్లో 11వ ఫిప్టీ స్కోర్ కావడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, బంగ్లా మాజీ ప్లేయర్ తమీమ్ ఇక్భాల్, సయీద్ అన్వర్ పేరిట సంయుక్తంగా ఉండేది.ఈ దిగ్గజ ఆటగాళ్లు తమ కెరీర్లో సేనా దేశాల్లో 10 సార్లు 50+ పరుగులు చేశారు. తాజా ఇన్నింగ్స్తో వీరిని కేఎల్ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో సునీల్ గవాస్కర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. అతడు 12 సార్లు 19 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్ధానంలో దిముత్ కరుణరత్నే(12) కొనసాగుతున్నాడు.ఇక లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది. -
ఐదో టీ20లో భారత్ ఓటమి.. అయినా సిరీస్ మనదే
ఇంగ్లండ్ మహిళలతో జరిగిన ఐదో టీ20లో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది.41 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్తో 75 పరుగులు చేసింది. ఆమెతో పాటు రిచా ఘోష్(24) రాణించాడు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(8), ఫస్ట్ డౌన్ బ్యాటర్ రోడ్రిగ్స్(1), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(15) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ఎకిలిస్టోన్ రెండు, స్మిత్, ఆర్లాట్ తలా వికెట్ సాధించారు.ఓపెనర్ల విధ్వంసం..అనంతరం 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు సోఫియా డంక్లీ(46), డేనియల్ వ్యాట్-హాడ్జ్(56) అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరితో పాటు టామీ బ్యూమాంట్(30) రాణించింది.భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. అయితే ఆఖరి టీ20లో భారత్ ఓటమిపాలైనప్పటికి.. తొలుత మూడు మ్యాచ్లు గెలవడంతో సిరీస్ను 2-3 తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జూలై 16 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: ఆఖరి ఓవర్లో గొడవ.. ఇంగ్లండ్ ఓపెనర్కు ఇచ్చిపడేసిన గిల్! వీడియో -
ఆఖరి ఓవర్లో గొడవ.. ఇంగ్లండ్ ఓపెనర్కు ఇచ్చిపడేసిన గిల్! వీడియో
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) అద్బుతమైన సెంచరీ సాధించాడు.అతడితో రిషభ్ పంత్ (112 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్లు), రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు.గిల్-క్రాలీ వాగ్వాదం..కాగా మూడో రోజు ఆట ఆఖరి ఓవర్లో హ్రైడ్రామా చోటు చేసుకుంది. భారత్ ఆలౌటైనంతరం రెండో ఇన్నింగ్స్ను ఇంగ్లండ్ ఆరంభించింది. సెకెండ్ ఇన్నింగ్స్లో భారత బౌలింగ్ ఎటాక్ను జస్ప్రీత్ బుమ్రా ఆరంభించాడు. మూడో రోజు మరిన్ని ఓవర్లు ఆడేందుకు ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే,బెన్ డకెట్లు ఏమాత్రం ఇష్టపడలేదు.ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్కు జాక్ క్రాలే పదేపదే అంతరాయం కలిగించి సమయాన్ని వృథా చేశాడు. మూడో బంతిని బుమ్రా డెలివరీ చేసే సమయంలో క్రాలీ ఒక్కసారిగా పక్కకు తప్పుకొన్నాడు. దీంతో బుమ్రా అసహనానికి లోనయ్యాడు. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం క్రాలీపై కోపంతో ఊగిపోయాడు. అతడి దగ్గరకు వెళ్లి వేలు చూపిస్తూ ఆడేందుకు ధైర్యం తెచ్చుకో అన్నట్లు సైగ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆఖరి బంతి పడేముందు క్రాలీ గాయం పేరిట డ్రామా చేశాడు. ఫిజియె మైదానంలోకి రావడంతో ఆట కాసేపు నిలిచిపోయింది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు జాక్ క్రాలీని చప్పట్లు కొడుతూ గేలి చేశారు. వెంటనే క్రాలీ కూడా వేలు చూపిస్తూ ఏదో అన్నాడు. ఆఖరికి అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది.Shubman Gill & Co. didn’t come to be played around, 𝙠𝙮𝙪𝙣𝙠𝙞 𝙔𝙚 𝙨𝙚𝙚𝙠𝙝𝙣𝙚 𝙣𝙖𝙝𝙞, 𝙨𝙞𝙠𝙝𝙖𝙣𝙚 𝙖𝙖𝙮𝙚 𝙝𝙖𝙞𝙣!#ENGvIND 👉 3rd TEST, DAY 4 | SUN 13th JULY, 2:30 PM | Streaming on JioHotstar pic.twitter.com/ix13r7vtja— Star Sports (@StarSportsIndia) July 12, 2025 Always annoying when you can't get another over in before close 🙄 pic.twitter.com/3Goknoe2n5— England Cricket (@englandcricket) July 12, 2025 -
ఆయుశ్ మాత్రే సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత అండర్–19 జట్టు దుమ్మురేపుతోంది. వన్డే సిరీస్ గెలుచుకున్న యువ భారత జట్టు... యూత్ టెస్టులో శుభారంభం చేసింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం బెకెన్హామ్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్–19 జట్టు 88 ఓవర్లలో 7 వికెట్లకు 450 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (115 బంతుల్లో 102; 14 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కగా... అభిజ్ఞ కుందు (95 బంతుల్లో 90; 10 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ కుమార్ (81 బంతుల్లో 85; 14 ఫోర్లు, 1 సిక్స్), విహాన్ మల్హోత్రా (99 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.వన్డే సిరీస్లో రికార్డు సెంచరీతో చెలరేగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (14) ఎక్కువసేపు నిలవలేకపోగా... అందులో పెద్దగా పరుగులు చేయలేకపోయిన ఆయుశ్ మాత్రే ‘శత’క్కొట్టాడు. అతడు రెండో వికెట్కు విహాన్తో కలిసి 173 పరుగులు జోడించాడు. టి20 తరహాలో ధనాధన్ ఆటతీరుతో రెచ్చిపోయిన అభిజ్ఞ, రాహుల్ నాలుగో వికెట్కు 27.4 ఓవర్లలోనే 179 పరుగులు జోడించడంతో యువభారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, ఆర్చీ వాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. బ్యాటర్లంతా దూకుడు కనబర్చడంతో తొలి రోజు యంగ్ఇండియా 5కు పైగా రన్రేట్తో పరుగులు రాబట్టింది. అంబ్రిష్ (31 బ్యాటింగ్), హెనిల్ పటేల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
నదీమ్తో నీరజ్ ఢీ
సిలేసియా (పోలాండ్): భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా... దాయాది పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్తో పోటీకి సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల 16న పోలాండ్ వేదికగా జరగనున్న సిలేసియా డైమండ్ లీగ్లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య శనివారం వివరాలు వెల్లడించింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్లో చివరిసారిగా ఈ ఇద్దరు తలపడగా... నదీమ్ జావెలిన్ను 92.97 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. నీరజ్ 89.45 మీటర్ల దూరంతో రజతం గెలుచుకున్నాడు. అంతకుముందు 2020 టోక్యో ఒలింపిక్స్లో చోప్రా పసిడి పతకం నెగ్గాడు. ఇటీవల భారత్ వేదికగా తొలిసారి జరిగిన అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టైటిల్ గెలిచిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా జోరు మీదున్నాడు. ఈ సీజన్లో వరుసగా మూడు టైటిల్స్తో అతను ఇప్పటికే ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ‘నదీమ్, నీరజ్ మధ్య ఆసక్తికర పోరు ఖాయం. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ ఇద్దరు ఒకే టోర్నమెంట్లో పాల్గొంటుండటం ఇదే తొలిసారి. ఒకరు ప్రపంచ చాంపియన్, మరొకరు ఒలింపిక్ చాంపియన్. వారి మధ్య సమరాన్ని చూసేందుకు పోలాండ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్ అథ్లెట్ యూరోపియన్ లీగ్ల్లో పాల్గొనడం చాలా తక్కువ. మరి ఈ సారి అతడికి నీరజ్కు మధ్య పోటీ ఎలా సాగుతుందో చూడాలి’ అని లీగ్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఏడాది తొలిసారి 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్ చోప్రా... మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్లో జావెలిన్ను 90.23 మీటర్ల దూరం విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.పారిస్ ఒలింపిక్స్ తర్వాత వరుసగా టోర్నీల్లో పాల్గొంటున్న నీరజ్ దిగ్గజ కోచ్ జాన్ జెలెజ్నీ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. మరోవైపు 28 ఏళ్ల నదీమ్... ఒలింపిక్ చాంపియన్గా నిలిచిన అనంతరం కేవలం ఒక్క టోర్నీలో మాత్రమే పాల్గొన్నాడు. సెపె్టంబర్లో టోక్యో వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరగనున్న నేపథ్యంలో ఈ లీగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో వరల్డ్ చాంపియన్గా నిలిచిన నీరజ్ దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. -
సినెర్ X అల్కరాజ్
లండన్: ప్రతిష్ఠాత్మక గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్లో పురుషుల సింగిల్స్ ఫైనల్కు వేళయింది. ఆదివారం జరగనున్న ఈ తుది పోరులో ప్రపంచ నంబర్వన్ జానిక్ సినెర్ (ఇటలీ), రెండో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) అమీతుమీ తేల్చుకోనున్నారు. గత నెల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఫైనల్లోనూ ఈ ఇద్దరే తలపడగా... అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఇలా ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్లో ఆ ఇద్దరు ఆటగాళ్లే ఫైనల్లో తలపడనుండటం రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) తర్వాత ఇదే తొలిసారి. ఈ ఇద్దరు దిగ్గజాలు 2006–2008 మధ్య వరుసగా మూడేళ్ల పాటు ఈ రెండు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లో ఢీకొన్నారు. ఆ ఇద్దరు కెరీర్కు వీడ్కోలు పలకగా... 38 ఏళ్ల జొకోవిచ్ కూడా గతంలో మాదిరిగా దూకుడు కనబర్చలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా నవతరం నిలకడ కనబరుస్తోంది. అందులో ముఖ్యంగా 22 ఏళ్ల అల్కరాజ్, 23 ఏళ్ల సినెర్ తమ పోరాట పటిమతో అభిమానుల మనసు దోచుకుంటున్నారు. అల్కరాజ్ ఇప్పటివరకు ఐదు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలవగా... సినెర్ మూడు నెగ్గాడు. గత 6 మేజర్ టైటిల్స్ను ఈ ఇద్దరే పంచుకోవడం విశేషం. ‘భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం లేదు. ప్రస్తుతానికైతే సినెర్తో పోటీని ఆస్వాదిస్తున్నా. మున్ముందు కూడా ఇలాగే సాగుతుందని చెప్పలేను. దిగ్గజాల సరసన మా పేర్లు జోడించడం ఆనందమే’ అని అల్కరాజ్ అన్నాడు. వింబుల్డన్లో గత రెండేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న ఈ స్పెయిన్ యంగ్స్టర్... ‘హ్యాట్రిక్’పై కన్నేశాడు. ఇప్పటి వరకు జాన్ బోర్గ్, సంప్రాస్, ఫెడరర్, జొకోవిచ్ వింబుల్డన్లో వరుసగా మూడు టైటిల్స్ సాధించగా... ఇప్పుడు ఆ జాబితాలో తన పేరు నమోదు చేసుకోవాలని అల్కరాజ్ తహతహలాడుతున్నాడు. సినెర్కు ఇది వరుసగా నాలుగో మేజర్ ఫైనల్ కాగా అందులో యూఎస్ ఓపెన్, ఆ్రస్టేలియా ఓపెన్లో విజయాలు సాధించాడు. గత నెలలో వీరిద్దరి మధ్య రోలాండ్ గారోస్లో 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ ఫైనల్లో సినెర్పై అల్కరాజ్ విజయం సాధించగా... ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఇటలీ ప్లేయర్ భావిస్తున్నాడు. -
ఒక్కటే మిగిలింది!
సాక్షి క్రీడా విభాగం : 2019...ఇగా స్వియాటెక్ తొలి సారి గ్రాండ్స్లామ్ బరిలోకి దిగిన ఏడాది. అంటే 2020లో నిర్వహించని వింబుల్డన్ను మినహాయిస్తే 26 గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఆమె బరిలోకి దిగింది. ఏడేళ్ల కెరీర్ కూడా పూర్తి కాకముందే ఆమె ఖాతాలో ఇప్పుడు ఆరు టైటిల్స్ ఉన్నాయి. 24 ఏళ్ల వయసుకే ఇన్ని ఘనతలు సాధించిన ఇగా... పురుషుల, మహిళల విభాగంలో వింబుల్డన్ నెగ్గిన తొలి పోలండ్ ప్లేయర్గా నిలిచింది. దూకుడైన ఆటతో ఆమె అన్ని సర్ఫేస్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. స్వయంగా ఇగా మాటల్లోనే చెప్పాలంటే ‘భారీ సర్వీస్లు, టాప్ స్పిన్, పదునైన బ్యాక్హ్యాండ్ నా ప్రధాన బలాలు’. ఇదే ఆటపై ఇప్పుడు ఆమె ప్రపంచ మహిళల టెన్నిస్ను శాసిస్తోంది. శనివారం అనిసిమోవాతో జరిగిన ఫైనల్లో ఆమె ఆధిక్యం ప్రదర్శించిన తీరు స్వియాటెక్ పదునును చూపించింది. క్రీడాకారులు, ఒలింపిక్స్లో పాల్గొన్న రోయర్ అయిన తండ్రి ప్రోత్సాహంతో తొలి అడుగులు వేసిన ఆమె ఇప్పుడు అసాధారణ ప్రదర్శనతో శిఖరానికి చేరింది. ఆమె ప్రొఫెషనల్ కెరీర్లో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. తొలిసారి 903వ ర్యాంక్తో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో అడుగు పెట్టిన ఆమె మూడేళ్ల పాటు చెప్పుకోదగ్గ విజయాలతో దూసుకుపోయింది. స్వియాటెక్ కెరీర్లో మూడేళ్లు 2022, 2023, 2024 అద్భుతంగా సాగాయి. తొలి సారి వరల్డ్ నంబర్వన్గా నిలవడంతో పాటు మూడు సీజన్ల పాటు ఆమె దానిని నిలబెట్టుకోవడం విశేషం. ఐదేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు క్లే కోర్టు ఫ్రెంచ్ ఓపెన్లో చాంపియన్గా నిలిచినా గ్రాస్ మాత్రం ఆమెకు కొరుకుడు పడలేదు. ఈ సారి విజేతగా నిలవడానికి ముందు ఆమె అత్యుత్తమ ప్రదర్శన క్వార్టర్ ఫైనల్ మాత్రమే. గత ఏడాదైతే మూడో రౌండ్లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత నవంబరులో డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో కొత్త వివాదం రేగింది. సస్పెన్షన్ ముగిసి మళ్లీ బరిలోకి దిగిన తర్వాత 2025లో కూడా ఆమె ప్రదర్శన గొప్పగా లేదు. రెండు గ్రాండ్స్లామ్లు ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్లలో ఇగా సెమీఫైనల్కే పరిమితమైంది. అయితే గ్రాస్కోర్టులో ప్రాక్టీస్ను తొందరగా మొదలు పెట్టేందుకు ఇది ఉపకరించింది. వింబుల్డన్కు ముందు సన్నాహక గ్రాస్ కోర్టు టోర్నీ బాడ్ హాంబర్గ్ ఓపెన్లో ఫైనల్కు చేరడంతో కాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు దానినే కొనసాగిస్తూ పచ్చికపై తన చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. హార్డ్ కోర్ట్పై యూఎస్ ఓపెన్ నెగ్గగా...ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రమే ఇంకా అందుకోవాల్సి వచ్చింది. ఇదే ఫామ్ కొనసాగితే 2026లోనే అది సాధ్యం కావచ్చు. -
వింబుల్డన్ క్వీన్ స్వియాటెక్
లండన్: పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ అసాధారణ ఆటతో వింబుల్డన్లో విజయకేతనం ఎగురవేసింది. గ్రాస్ కోర్టుపై తిరుగులేని ప్రదర్శన కనబర్చిన ఇగా 2025 వింబుల్డన్ చాంపియన్గా నిలిచింది. శనివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ స్వియాటెక్ 6–0, 6–0తో 13వ సీడ్ అమందా అనిసిమోవా (అమెరికా)ను చిత్తు చిత్తుగా ఓడించింది. కేవలం 57 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో స్వియాటెక్ ముందు అమందా ఏమాత్రం నిలవలేకపోయింది. స్వియాటెక్ కెరీర్లో ఇది తొలి వింబుల్డన్ టైటిల్ కాగా...ఓవరాల్గా ఇది ఆరో గ్రాండ్స్లామ్. ఈ గెలుపుతో మూడు సర్ఫేస్ (హార్డ్, క్లే, గ్రాస్)లలోనూ గ్రాండ్స్లామ్ నెగ్గిన ప్లేయర్గా స్వియాటెక్ గుర్తింపు పొందింది. నాలుగు ఫ్రెంచ్ ఓపెన్లు, ఒక యూఎస్ ఓపెన్ ట్రోఫీ నెగ్గిన పోలండ్ స్టార్ కెరీర్లో ఇక ఆ్రస్టేలియన్ ఓపెన్ మాత్రమే మిగిలి ఉంది. ఫటాఫట్... మ్యాచ్కు ముందు మాజీ వరల్డ్ నంబర్వన్ స్వియాటెక్పై సహజంగానే గెలుపు అంచనాలు ఉన్నాయి. అయితే సెమీస్లో వరల్డ్ నంబర్వన్ సబలెంకాపై సంచలన విజయం సాధించిన అనిసిమోవా గట్టి పోటీనిస్తుందని అంతా భావించారు. అయితే పోలండ్ స్టార్ ముందు అమెరికన్ ప్లేయర్ ఆటలు ఏమాత్రం సాగలేదు. తొలి సెట్లో ఏకంగా 14 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసిన అనిసిమోవా...రెండో సెట్లోనూ మరో 14 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్తో ప్రత్యరి్థకి మ్యాచ్ను అప్పగించింది. తొలి ఫైనల్ ఆడుతున్న ఒత్తిడి అమెరికన్లో కనిపించగా...స్వియాటెక్ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. 3 ఏస్లు సంధించిన పోలండ్ ప్లేయర్ ప్రత్యర్థి సర్వీస్ను 6 సార్లు బ్రేక్ చేసింది. ఆరో గ్రాండ్స్లామ్తో ఇగా విజయగర్జన చేయగా... ఓటమి అనంతరం అనిసిమోవా కన్నీళ్లపర్యంతమైంది. 2018లో స్వియాటెక్ బాలికల సింగిల్స్లో వింబుల్డన్ టైటిల్ నెగ్గింది. 6 స్వియాటెక్ కెరీర్లో ఇది ఆరో గ్రాండ్స్లామ్ టైటిల్100 గ్రాండ్స్లామ్లో స్వియాటెక్కు ఇది వందో విజయం. 2019లో తొలి సారి బరిలోకి దిగిన ఆమె 120 మ్యాచ్లలో 100 గెలిచింది.114 వింబుల్డన్ ఫైనల్ ఇలా 6–0, 6–0 (డబుల్ బీగెల్)తో ముగియడం 114 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1911 వింబుల్డన్ ఫైనల్లో డొరొతియా లాంబర్ట్ 6–0, 6–0తో డొరా బుత్బైని ఓడించింది. 1988 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో స్టెఫీగ్రాఫ్ 6–0, 6–0తో నటాషా జ్వెరెవాను చిత్తు చేసింది.నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్అల్కరాజ్ (స్పెయిన్) X సినెర్ (ఇటలీ) రాత్రి గం. 8:30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్చరీ ప్రపంచకప్లో జ్యోతి సురేఖ ‘హ్యాట్రిక్’
మాడ్రిడ్: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్లో ‘హ్యాట్రిక్’ పతకాలు సాధించింది. అయితే కాంపౌండ్లో తృటిలో రెండు స్వర్ణావకాశాల్ని చేజార్చుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఒక్కో రజతం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి 147–148తో ఎలా గిబ్సన్ (బ్రిటన్) చేతిలో పాయింట్ తేడాతో ఓడి రజతంతో తృప్తి పడింది. మరో కాంపౌండ్ టీమ్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో జ్యోతి, పర్ణిత్ కౌర్, ప్రీతికలతో కూడిన భారత జట్టు 225–227తో చైనీస్ తైపీకి చెందిన హువంగ్ జౌ, చెన్ యి సున్, చియు యు ఎర్ చేతిలో పరాజయం చవిచూసింది. మొదట 57–57తో తైపీ త్రయాన్ని నిలువరించిన భారత జట్టు... 58–56తో, 55–56తో మూడు రౌండ్లు ముగిసేసరికి 170–169తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఆఖరి నాలుగో రౌండ్లో గురి కుదరక రజతంతో సరిపెట్టుకుంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ (ఏపీ)–రిషభ్ యాదవ్ (హరియాణా) జోడీ 156–153తో పాలొ కొరాడో–డగ్లస్ నొలాస్కో (ఎల్ సాల్వడోర్) జంటపై గెలిచింది. -
ఆటకే వీడ్కోలు... ఆదాయంలో రారాజులు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి పుష్కరం గడిచింది. అతని సమకాలీకులు రాహుల్ ద్రవిడ్ (2012లో ఆఖరి మ్యాచ్), సౌరవ్ గంగూలీ (2008లో) తమ ఆటను ముగించి చాలా కాలమైంది. ఈతరం దిగ్గజం ధోని కూడా మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కొన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యారు. కానీ క్రికెట్ అభిమానుల్లో వీరందరి పట్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఆటకు సంబంధించిన లేదా క్రికెటేతర కార్యక్రమం అయినా సరే...వీరు హాజరైతే చాలు, దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. ఈ దిగ్గజ క్రికెటర్లకు వాణిజ్యపరంగా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో వీరు వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా పని చేస్తుండటం విశేషం. పైగా ఆయా బ్రాండ్లకు అంబాసిడర్లుగా మాత్రమే కాకుండా చాలా వ్యాపారాల్లో సహ భాగస్వాములుగా తాము కూడా మార్కెట్ను శాసిస్తున్నారు. – సాక్షి, క్రీడా విభాగంముగ్గురూ ముగ్గురేసచిన్ టెండూల్కర్ ప్రస్తుతం 25 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. వీటిలో 10 కంపెనీల్లో అతను సహ భాగస్వామి. సగం వాటిలో అతను కేవలం పెట్టుబడులు పెట్టడంతోనే సరిపెట్టగా... మరో సగం కంపెనీ వ్యవహారాల్లో తన సలహాలు, సూచనలు కూడా ఇస్తూ చురుకైన భాగస్వామిగా ఉన్నాడు.మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏకంగా 42 బ్రాండ్స్తో జత కట్టాడు. రెగ్యులర్గా ప్రకటనల్లో కనిపించే బ్రాండింగ్ కాకుండా ప్రీమియం స్పోర్ట్స్ టూరిజం కంపెనీ ‘డ్రీమ్ సెట్ గో’ను సొంత వ్యాపారంలా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక రాహుల్ ద్రవిడ్ వీరిలో మరింత ప్రత్యేకం. ఈ మిస్టర్ డిపెండబుల్ కనీసం సోషల్ మీడియాలో కూడా లేడు. కానీ 24 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యంగా నెమ్మదైన స్వభావానికి బ్రాండ్ అంబాసిడర్లాంటి ద్రవిడ్.. క్రెడిట్ కార్డ్ పేమెంట్ కంపెనీ ‘క్రెడ్’కోసం ‘నేను ఇందిరానగర్ గూండాను..’అంటూ చేసిన యాడ్ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.పేరు ప్రఖ్యాతలే పెట్టుబడిగా...క్రికెట్ నుంచి తప్పుకొని చాలా రోజులైనా ఈ మాజీలకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. దీనిపై వ్యాల్యుయేషన్ రంగంలో నిష్ణాతులైన హర్‡్ష తలికోటి మాట్లాడుతూ.. ‘సుదీర్ఘ కెరీర్లో వారు సాధించిన ఘనతలతో వచ్చిన పేరుప్రఖ్యాతులే కాదు.. ప్రజల్లో ఇప్పటికీ ఉన్న క్లీన్ ఇమేజ్, అభిమానులకు వారంటే ఉన్న గౌరవం, ఏళ్లు గడిచాక కూడా తమను తాము మార్చుకుంటూ ప్రస్తుత సెలబ్రిటీల్లో కూడా తమ ప్రత్యేకత నిలబెట్టుకోవడమే అందుకు కారణం’అంటాడు. పైగా తాము నమ్మిన, విశ్వాసం ఉన్నవాటితోనే జత కట్టడానికి వీరు సిద్ధమవుతారు. ‘గ్రండ్ఫోస్’పంప్స్ను తన ఇంట్లో ఎనిమిదేళ్లుగా వాడుతున్నాను కాబట్టి దానికి ప్రచారం చేసేందుకు సిద్ధమైనట్లు ద్రవిడ్ చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ.ధోని, విరాట్, రోహిత్ఈతరం అభిమానుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లి ప్రస్తుతం చెరో 45 బ్రాండ్లతో కలిసి పని చేస్తుండటం విశేషం. ఇటీవల ‘ఎజిలిటాస్’స్పోర్ట్స్ కంపెనీలో కోహ్లి రూ.40 కోట్లతో భాగస్వామిగా చేరి అన్నీ తానే అయి నడిపిస్తున్నాడు. 10 స్టార్టప్లలో అతను పెట్టుబడులు పెట్టాడు. ధోని కూడా ఫుడ్ అండ్ బేవరేజెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరో స్పేస్ కంపెనీల్లో భాగమయ్యాడు. అలాగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల నుంచి రిటైరైనా క్రేజ్ తగ్గలేదు. అడిడాస్, సియట్, నిస్సాన్ వంటి అనేక ప్రముఖ కంపెనీలకు ప్రకటనకర్తగా ఉన్నాడు. సుమారు 20 బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్నాడు.ఉభయతారక ఒప్పందాలుభారత్లో క్రికెటర్లకు పాన్ ఇండియా విలువ ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో ఒక్కో ప్రాంతం లేదా భాషకే పరిమితమయ్యే సినిమా తారలతో పోలిస్తే క్రికెటర్ల ప్రకటనలే పెద్ద సంఖ్యలో జనానికి చేరతాయని ప్రకటన రంగ నిపుణులు చెబుతున్నారు. బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాలు ఉభయతారకంగా ఉంటూ అటు ప్లేయర్లకు, ఇటు కంపెనీలకు కూడా లాభదాయకంగా ఉండటం కారణంగా ఇరు పక్షాల మధ్య సుదీర్ఘ కాలపు అనుబంధం కొనసాగుతోంది.ధోని బ్రాండింగ్ చేస్తున్న ఏరో స్పేస్ కంపెనీ ‘గరుడ’ఆదాయం ఏడాది తిరిగే లోగా రూ.15 కోట్ల నుంచి రూ. 123 కోట్లకు చేరగా, తర్వాతి సంవత్సరమే కంపెనీ పూర్తిగా లాభాల్లోకి మళ్లింది. కోకాకోలాతో గంగూలీ అనుబంధం 18 ఏళ్లుగా కొనసాగుతుండగా, పవర్ కంపెనీ ల్యుమినస్ 15 ఏళ్లుగా సచిన్తో కలిసి ఉంది. ఆటకు గుడ్బై చెప్పినా మార్కెటింగ్, బ్రాండింగ్ను తాము శాసించగలమని ఈ దిగ్గజాలంతా నిరూపిస్తున్నారు.⇒ ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్కు చెందిన ల్యూబ్రికెంట్స్ యాడ్లో ద్రవిడ్ నటించిన తర్వాత అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయని స్వయంగా కంపెనీ వెల్లడించింది. కర్ణాటకలో ‘గ్రండ్ఫోస్’పంప్స్తో ద్రవిడ్ జతకట్టిన తర్వాతే అవి ప్రజలకు మరింత చేరువయ్యాయి.⇒ ‘గరుడ’బ్రాండ్తో వచి్చన డ్రోన్ల వ్యాపారం పెరుగుదలకు ధోని మాత్రమే కారణమని ఆ సంస్థ సీఈఓ అగీ్నశ్వర్ వెల్లడించడం ‘కెప్టెన్ కూల్’విలువేమిటో చెబుతుంది. -
సరిగ్గా... సమంగా...
లార్డ్స్ మైదానంలో మూడు రోజు ఆట సమంగా ముగిసింది...భారత బ్యాటర్లు పట్టుదలగా నిలబడగా, ఇంగ్లండ్ కూడా కీలక సమయాల్లో వికెట్లతో మ్యాచ్లో నిలిచింది. సరిగ్గా ఇంగ్లండ్ చేసిన స్కోరునే భారత్ కూడా తొలి ఇన్నింగ్స్లో చేసింది. తొలి సెషన్లో రాహుల్–పంత్ల భాగస్వామ్యం, రెండో సెషన్లో జడేజా, నితీశ్ కుమార్ రెడ్డిల నిలకడ... భారత్ దీటైన స్కోరు చేసేందుకు దోహదం చేసింది. మూడు రోజులైనా ఎవరి పైచేయి ఖరారు కానీ ఈ ‘లార్డ్స్’ టెస్టును నేటి నాలుగో రోజే అటో... ఇటో... తేల్చనుంది. నిర్జీవమైన పిచ్పై రెండు రోజుల్లో 20 వికెట్లు సాధ్యమా అనేది సందేహమే! డ్రా కు, డ్రామాకు నేడు, రేపు రసవత్తర పోరు జరగనుంది.లండన్: బుమ్రా తన బౌలింగ్తో కూలగొట్టిన ప్రదర్శనకు దీటుగా భారత బ్యాటర్లు తలబడ్డారు. ఇంగ్లండ్ను సమష్టిగా ఎదుర్కొన్నారు. మూడో రోజంతా ఆడటంలో సఫలమైన టీమిండియా సరిగ్గా... సమానంగా ఇంగ్లండ్ చేసిన స్కోరే చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 119.2 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) సెంచరీ సాధించాడు. రిషభ్ పంత్ (112 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్లు), రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొక్కుబడిగా ఆడిన ఇంగ్లండ్ ఒక ఓవర్లో వికెట్ నష్టాపోకుండా 2 పరుగులు చేసింది. క్రాలీ (2 బ్యాటింగ్), డకెట్ (0) క్రీజులో ఉన్నారు. మూడో రోజు మరిన్ని ఓవర్లు ఆడేందుకు ఏమాత్రం ఇష్టపడని ఓపెనర్లు అదే పనిగా బుమ్రా ఓవర్ను ఎదుర్కొనేందుకు తాత్సారం చేశారు. దీంతో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ఇంగ్లండ్ ఓపెనర్ల తీరును తప్పుబట్టాడు. రిషభ్ పంత్ ఫిఫ్టీ ఓవర్నైట్ స్కోరు 145/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొలి సెషన్లో ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. పిచ్ సహకారంతో ఓపెనర్ రాహుల్, రిషభ్ పంత్ సాధికారికంగా ఆడారు. దీంతో ఆరంభంలోనే వికెట్ తీసి పట్టుబిగిద్దామనుకున్న ఇంగ్లండ్ ఆశలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చినా, స్పిన్ను ప్రయోగించినా ఈ జోడీ మాత్రం నింపాదిగానే పరుగులు రాబట్టింది. దీంతో ఈ సెషన్ అసాంతం భారత్దే పైచేయి అయింది. ఇద్దరు ఆచితూచి ఆడుతూనే, వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. రాహుల్, రిషభ్ల సమన్వయంతో పరుగుల రాకకు ఏ దశలోనూ ఇబ్బంది లేకపోయింది.చూస్తుండగానే జట్టు స్కోరు 200కు చేరింది. ఎట్టకేలకు లంచ్ విరామానికి ముందు ఇంగ్లండ్కు పంత్ వికెట్ రూపంలో ఓదార్పు లభించింది. లేని పరుగుకు ప్రయత్నించిన రిషభ్... స్టోక్స్ విసిరిన డైరెక్ట్ త్రోకు వికెట్ను సమరి్పంచుకున్నాడు. ఐదు మంది బౌలర్ల వల్ల కాని పనిని స్టోక్స్ ఒక్క త్రోతో విడగొట్టేశాడు. దీంతో నాలుగో వికెట్కు 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అతని వికెట్ పడిన 248/4 స్కోరు వద్దే లంచ్ బ్రేక్కు వెళ్లారు. రాహుల్ శతకానికి 2 పరుగుల దూరంలో నిలిచాడు. రాహుల్ శతక్కొట్టిన వెంటనే... రెండో సెషన్లో రాహుల్తో కలిసి జడేజా క్రీజులోకి వచ్చాడు. రాహుల్ సెంచరీ చేశాడన్న ఆనందం అతను అవుటవడంతోనే ఆవిరైంది. 176 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న కేఎల్ రాహుల్... తర్వాత ఒక్క పరుగైన చేయకుండా ని్రష్కమించాడు. టెస్టుల్లో రాహుల్కిది పదో సెంచరీ కాగా... క్రికెట్ మక్కా లార్డ్స్లో రెండో శతకం. 2021–22 సీజన్లోనూ అతను శతక్కొట్టాడు. కాగా అతని వికెట్ ఇంగ్లండ్ శిబిరానికి పెద్ద సాఫల్యం. అదృష్టం కొద్ది సులువైన రనౌట్ల నుంచి నితీశ్ బతికిపోవడం జట్టుకు కాస్త ఊరటనిచి్చంది. లేదంటే బ్యాటింగ్ చేసే సామర్థ్యమున్న నితీశ్ వికెట్ కూడా భారత్ కోల్పోయేది. జడేజాకు జతగా నితీశ్ కుమార్ (30; 4 ఫోర్లు) విలువైన పరుగులు చేయడంతో జట్టు స్కోరు 300 దాటింది. 316/5 స్కోరు వద్ద ఈ సెషన్ ముగిసింది. జడేజా అర్ధ సెంచరీ టి విరామం తర్వాత కాసేపటికే నితీశ్ వికెట్ను పారేసుకున్నాడు. స్టోక్స్ బంతిని ఎదుర్కోవడంలో పొరపడిన నితీశ్ కీపర్ స్మిత్ చేతికి క్యాచ్ అప్పజెప్పి వెళ్లాడు. తర్వాత క్రీజులోకి వచి్చన వాషింగ్టన్ సుందర్ (23; 1 ఫోర్, 1 సిక్స్) అండతో జడేజా 87 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. వీళ్లిద్దరి జోడీ కూడా ఆతిథ్య బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో వికెట్ తీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. ఏడో వికెట్కు సరిగ్గా 50 పరుగులు జతయ్యాక జడేజా అవుటయ్యాడు. ఇతను అవుటైన 11 పరుగుల వ్యవధిలోనే ఆకాశ్ దీప్ (7), బుమ్రా (0) సుందర్ వికెట్లను కోల్పోవడంతో భారత్ సరిగ్గా 387 పరుగుల వద్దే ఆలౌటైంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలిఇన్నింగ్స్: 387; భారత్ తొలిఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 13; రాహుల్ (సి) బ్రూక్ (బి) బషీర్ 100; కరుణ్ (సి) రూట్ (బి) స్టోక్స్ 40; శుబ్మన్ (సి) స్మిత్ (బి) వోక్స్ 16; పంత్ రనౌట్ 74; జడేజా (సి) స్మిత్ (బి) వోక్స్ 72; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) స్టోక్స్ 30; సుందర్ (సి) బ్రూక్ (బి) ఆర్చర్ 23; ఆకాశ్ (సి) బ్రూక్ (బి) కార్స్ 7; బుమ్రా (సి) స్మిత్ (బి) వోక్స్ 0; సిరాజ్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 12; మొత్తం (119.2 ఓవర్లలో ఆలౌట్) 387.వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107, 4–248, 5–254, 6–326, 7–376, 8–385, 9–387, 10–387.బౌలింగ్: వోక్స్ 27–5–84–3, ఆర్చర్ 23.2–6–52–2, కార్స్ 24–5–88–1, స్టోక్స్ 20–4–63–2, బషీర్ 14.5–2–59–1, జో రూట్ 10.1–0–35–0. ఇంగ్లండ్ రెండోఇన్నింగ్స్: క్రాలీ బ్యాటింగ్ 2; డకెట్ బ్యాటింగ్ 0; మొత్తం (1 ఓవర్లో వికెట్ నష్టపోకుండా) 2/0. బౌలింగ్: బుమ్రా 1–0–2–0.