breaking news
Sports
-
నేపాల్ సంచలన విజయం
టీ20 ప్రపంచ కప్ 2026ను నేపాల్ అద్భుతమైన విజయంతో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా మంగళవారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన గ్రూపు-సి మ్యాచ్లో స్కాట్లాండ్పై 7 వికెట్ల తేడాతో నేపాల్ గెలుపొందింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో నేపాల్కు ఇదే తొలి విజయం.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాటిష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్కాట్లాండ్ జట్టుకు ఓపెనర్ మైఖేల్ జోన్స్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతను 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు జార్జ్ మున్సే (27), బ్రాండన్ మెక్ముల్లెన్ (25) రాణించారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామీ 3 వికెట్లు పడగొట్టగా, నందన్ యాదవ్ 2 వికెట్లు సాధించాడు.అనంతరం లక్ష్య చేధనలో నేపాల్కు ఓపెనర్లు కుశాల్ భుర్టెల్(43), ఆసిఫ్ షేక్ (33) మంచి అరంభం ఇచ్చారు. అయితే మిడిల్ ఓవర్లలో నేపాల్ వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ దశలో స్టార్ ఆల్ రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీపేంద్ర సింగ్ కేవలం 23 బంతుల్లోనే 50 పరుగులు చేసి నేపాల్కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. అతడితో పాటు గుల్షాన్ జా కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. -
చెలరేగిన జోన్స్.. నేపాల్ టార్గెట్ ఎంతంటే..?
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 17) రాత్రి 7 గంటలకు మొదలైన నామమాత్రపు మ్యాచ్లో స్కాట్లాండ్, నేపాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది.ఓపెనర్ మైఖేల్ జోన్స్ (45 బంతుల్లో 71; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్కాటిష్ ఇన్నింగ్స్లో జోన్స్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మరో ఓపెనర్ జార్జ్ మున్సే (27), బ్రాండన్ మెక్ముల్లెన్ (25), కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (10), మార్క్ వాట్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో టామ్ బ్రూస్ (5), మాథ్యూ క్రాస్ (4), మైఖేల్ లీస్క్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.నేపాల్ బౌలర్లలో సోమ్పాల్ కామీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇతను 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. మరో బౌలర్ నందన్ యాదవ్ కూడా పర్వాలేదనిపించాడు. ఇతను 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కుషాల్ భుర్టెల్, కెప్టెన్ రోహిత్ పౌడెల్ తలో వికెట్ తీశారు. ఓ దశలో భారీ చేస్తుందనుకున్న స్కాట్లాండ్ చివర్లో త్వరితగతిన వికెట్లు కోల్పోయి ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది.అనంతరం ఛేదనకు దిగిన నేపాల్ ఆచితూచి ఆడుతుంది. తొలి 4 ఓవర్లలో ఆ జట్టు వికెట్లు కోల్పోకుండా 26 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు కుషాల్ భుర్టెల్ 14, ఆసిఫ్ షేక్ 12 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో నేపాల్ గెలవాలంటే మరో 145 పరుగులు చేయాలి. -
ఐసీసీ టోర్నీల్లో దారుణంగా పతనమవుతున్న ఆసీస్ గ్రాఫ్
ప్రపంచ మేటి క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆ జట్టు వరుసగా నాలుగు మెగా టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. 2024 టీ20 ప్రపంచకప్లో సూపర్-8 దశలో నిష్క్రమించిన ఈ 2021 ఎడిషన్ జగజ్జేత.. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్లోనే ఇంటిముఖం పట్టింది.ఆతర్వాత జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో మట్టికరిచిన ఈ 2021-23 ఎడిషన్ ఛాంపియన్.. ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్ నుంచి గ్రూప్ దశలోనే పలాయనం చిత్తగించింది.పలు దశాబ్దాలుగా ప్రపంచ క్రికెట్ను మకుటంలేని మారాజుగా శాశిస్తున్న ఆస్ట్రేలియాకు ఉన్నట్టుండి ఈ దుస్థితి ఏంటని పరిశీలిస్తే.. పలు ఆసక్తికర విషయాలు బయటకి వస్తాయి. ఇందులో మొదటిది, అతి ముఖ్యమైనది ఆ జట్టుకు వెన్నతో పెట్టిన తలపొగరు. అనాదిగా ఆసీస్ ఆటగాళ్లు ఇదే తలపొగరుతో ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లను తక్కువ చేస్తూ వచ్చారు.ఇటీవలికాలంలో వారికి ఆ తల పొగరు మరీ ఎక్కువైంది. ఎంతలా అంటే, ప్రతి క్రికెటర్ జీవితంలో ఒక్కసారైనా తన చేతులతో పైకెత్కుకోవాలని భావించే ప్రపంచకప్పై కాళ్లు పెట్టి, కెమెరాలకు ఫోజులిచ్చేంతలా. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిని తర్వాత ప్రస్తుత ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ బీరు తాగుతూ ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్లు పెట్టాడు. ఆ క్షణమే ఆసీస్ పతనం ప్రారంభమైనట్లుంది.విజయగర్వం తలకెక్కి మార్ష్ చేసిన ఆ పనికి ఆసీస్ క్రమంగా మూల్యం చెల్లించుకుంటూ వస్తుంది. తాజాగా అదే మార్ష్ సారథ్యంలోని ఆసీస్ జట్టు టీ20 ప్రపంచకప్ 2026లో పసికూన అయిన జింబాబ్వే చేతిలో దారుణంగా ఓడి, గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఆసీస్ జట్టు ఐసీసీ టోర్నీల్లో ఇటీవలికాలంలో పలచన పడటానికి మరో కారణం ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు. ప్రపంచ మేటి ఆటగాళ్లుగా చెప్పుకోబడే ఆ స్టార్ ఆటగాళ్లకు ఐసీసీ టోర్నీలంటే చులకన భావం. వారు యాషెస్ సిరీస్ లాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు కానీ, ప్రపంచ దేశాలనీ పాల్గొనే మెగా టోర్నీలకు ఇవ్వరు. కారణం ఎంటో వారికే తెలియాలి. గాయాలు చిన్నవైనా వారు ఇటీవలికాలంలో వాటి బూచిని చూపించి ఐసీసీ టోర్నీల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్కు ముందు కూడా ఇదే జరిగింది. ప్రస్తుత ఆసీస్ జట్టులోని స్టార్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ గాయాల పేరు చెప్పి, పొట్టి ప్రపంచకప్కు డుమ్మా కొట్టారు. వీరు లేని లోటు ఆసీస్ జట్టులో సుస్పష్టంగా కనిపించింది.ఇటీవలికాలంలో ఆసీస్ పతనానికి మరో కారణంగా ఆ జట్టు ఆటగాళ్లకు భారత ఉపఖండంపై ఉన్న చిన్నచూపు. మొదటి నుంచి వారు ఉపఖండంలో పర్యటించాలంటే ఎక్కువగా ఇష్టపడే వారు కాదు. ఇటీవలికాలంలో అది కాస్త ఎక్కువైంది. ఐపీఎల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత లీగ్ల్లో దండిగా డబ్బులు ముట్టజెప్పినా, ఎందుకో వారు ఉపఖండంలో ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ ఐపీఎల్లో ఆడినా కేవలం కొన్ని మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటారు. తాజాగా ముగిసిన ఐపీఎల్లో ఇది చాలా స్పష్టంగా బయటపడింది. ఈ విషయంలో వారి సమస్య ఏమిటో వారు స్వయంగా నోరు విప్పితే కానీ తెలీదు.పై విషయాల్లో వాస్తవాస్తవాలు పక్కన పెడితే.. ఆసీస్ జట్టు 2026 టీ20 ప్రపంచకప్ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించడానికి మాత్రం వారి తలపొగరే కారణమని మెజారిటీ శాతం క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.కాగా, ఆస్ట్రేలియా జట్టు ఓసారి (2021-23) వరల్ట్ టెస్ట్ ఛాంపియన్గా.. ఆరు సార్లు (1987, 1999, 2003, 2007, 2015, 2023) వన్డే ప్రపంచకప్ విజేతగా.. ఓసారి (2021) పొట్టి ప్రపంచకప్ జగజ్జేతగా నిలిచి ప్రపంచ క్రికెట్పై ఏకఛత్రధిపత్యం చలాయించిన విషయం తెలిసిందే. -
T20 WC 2026: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఆస్ట్రేలియా వైదొలగడంతో సూపర్-8 దశలో టీమిండియా ప్రత్యర్దులు ఖరారయ్యారు. సూపర్-8 గ్రూప్-1లో భారత్తో పాటు జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. గ్రూప్-1 మ్యాచ్లన్నీ భారత్లోనే జరుగుతాయి.భారత్ తమ తొలి సూపర్-8 మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.భారత రెండో సూపర్-8 మ్యాచ్ ఫిబ్రవరి 26న జరుగనుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.భారత్ తమ మూడో సూపర్-8 మ్యాచ్ను మార్చి 1న ఆడుతుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతుంది.గ్రూప్-1లో మిగతా మ్యాచ్ల షెడ్యూల్ ఇలా..-ఫిబ్రవరి 23- జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ (ముంబై, రాత్రి 7 గంటలకు)-ఫిబ్రవరి 26- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (అహ్మదాబాద్, మధ్యాహ్నం 3 గంటలకు)-మార్చి 1- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికా (ఢిల్లీ, మధ్యాహ్నం 3 గంటలకు)మరోవైపు సూపర్-8 గ్రూప్-2 బెర్త్ల్లో ప్రస్తుతానికి మూడు ఖరారయ్యాయి. రేపు (ఫిబ్రవరి 18) జరుగబోయే మ్యాచ్లో నమీబియాపై గెలిస్తే.. పాక్ నాలుగో బెర్త్ దక్కించుకుంటుంది. సూపర్-8 గ్రూప్-2లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్-2 మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. గ్రూప్-2కు సంబంధించి కూడా పలు సూపర్-8 మ్యాచ్లు ఖరారయ్యాయి.-ఫిబ్రవరి 22న ఇంగ్లండ్-శ్రీలంక (పల్లెకెలె, మధ్యాహ్నం 3 గంటలకు)-ఫిబ్రవరి 25న న్యూజిలాండ్-శ్రీలంక (కొలొంబో, రాత్రి 7 గంటలకు)-ఫిబ్రవరి 27న ఇంగ్లండ్-న్యూజిలాండ్ (కొలొంబో, రాత్రి 7 గంటలకు)గ్రూప్-1, గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. సెమీస్ మ్యాచ్లు మార్చి 4, 5 తేదీల్లో జరుగుతాయి. సెమీస్లో గెలిచిన జట్లు మార్చి 8న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్, ఫైనల్కు వేదికలు ఇంకా ఖరారు కాలేదు. -
షమీ 8 వికెట్ల ప్రదర్శన వృధా
జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు చేరువలో ఉంది. రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్లో ఫైనల్కు చేరేందుకు ఆ జట్టు మరో 83 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరో రోజు ఆట మిగిలి ఉంది.బెంగాల్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తున్న జమ్మూ టీమ్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. శుభమ్ పుండిర్ (23), వన్ష్రాజ్ శర్మ (9) క్రీజ్లో ఉన్నారు. చివరి రోజు జమ్మూ లక్ష్యాన్ని ఛేదిస్తే సరికొత్త చరిత్ర అవుతుంది. రంజీ చరిత్రలో జమ్మూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్కు చేరలేదు. ఇంకా చెప్పాలంటే సెమీస్కు చేరడం కూడా ఇదే మొదటిసారి.తొలి ఇన్నింగ్స్లో 26 పరుగులు వెనుకపడి కూడా అనూహ్యంగా పుంజుకొని, బెంగాల్ను 99 పరుగులకే (రెండో ఇన్నింగ్స్) కుప్పకూల్చిన జమ్మూ జట్టు, సరికొత్త చరిత్రకు అద్భుత పునాది వేసింది. అనంతరం స్వల్ప ఛేదనలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా ఏమాత్రం జంక లేదు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి మూడో రోజు ఆటను ముగించింది.మరోసారి చెలరేగిన నబీతొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన ఆకిబ్ నబీ మరోసారి విజృంభించాడు. రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటి బెంగాల్ను మడత పెట్టడంతో పెద్ద చెయ్యి వేశాడు. అతనికి సునీల్ కుమార్ (4-27), యుద్ధ్వీర్ చరక్ (5-0-29-2) సహకరించారు. వీరి ధాటికి బెంగాల్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. షాబాజ్ అహ్మద్ (24) ఒక్కడే 20కి పైగా పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సుదిప్ ఘరామీ సహా సుదిప్ చటర్జీ, ఆకాశ్దీప్ డకౌట్లయ్యారు.విజృంభించిన షమీఅంతకుముందు టీమిండియా ప్లేయర్ మహ్మద్ షమీ 8 వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో జమ్మూ తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులకు ఆలౌటైంది. బౌలింగ్లో చెలరేగిన నబీ బ్యాట్తోనూ రాణించడంతో జమ్మూ టీమ్ ఈ స్కోర్ చేయగలిగింది. నబీ (42).. యద్ద్వీర్ చరక్తో (33) తొమ్మిదో వికెట్కు 64 పరుగులు జోడించి, తన జట్టును 300 పరుగుల మార్కును దాటించాడు. అంతకుముందు కెప్టెన్ పరాస్ డోగ్రా (58), అబ్దుల్ సమద్ (82) అర్ద సెంచరీలతో రాణించారు.ఘరామీ అద్భుత శతకంఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. సుదిప్ ఘరామీ అద్భుత శతకంతో (146) కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులు చేసింది. ఆకిబ్ నబీ 5, సునీల్ కుమార్ 3 వికెట్లతో సత్తా చాటారు. -
IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉంది. గ్రూప్-ఎ నుంచి అమెరికా, నమీబియా వంటి పసికూనలపై గెలుపొందిన భారత్.. చివరగా దాయాది పాకిస్తాన్ను మట్టికరిపించిది.‘చిరకాల ప్రత్యర్థి’ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి.. లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు అర్హత సాధించింది. ఇక గ్రూప్-ఎలో భాగంగా నామమాత్రపు మ్యాచ్లో టీమిండియా బుధవారం రాత్రి (ఫిబ్రవరి 18) మరో పసికూన నెదర్లాండ్స్తో తలపడనుంది. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.అభిషేక్ శర్మ డకౌట్ అయినా..కాగా ఇప్పటికే సూపర్-8కు చేరిన తరుణంలో నెదర్లాండ్స్తో ఆడే తుదిజట్టులో భారత్ మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్గా అభిషేక్ శర్మ (0,0) రెండు మ్యాచ్లు ఆడి డకౌట్ అయినా.. అతడిని కొనసాగించడం ఖాయమే. దీంతో మరోసారి సంజూ శాంసన్కు మొండిచేయి తప్పదు.ఇక ఇప్పటికే ఓపెనర్గా ఇరగదీస్తూ.. పాక్పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ స్థానానికి ఢోకా లేదు. సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఈ జట్టులో తిలక్ వర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కొనసాగటం లాంఛనమే.బుమ్రాకు రెస్ట్.. అతడిపై వేటుఅయితే, పాక్తో మ్యాచ్ ఆడిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు నెదర్లాండ్స్ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అతడి స్థానంలో అర్ష్దీప్ సింగ్ రావడం పక్కా. అదే విధంగా.. కుల్దీప్ యాదవ్ను తప్పించి.. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తుదిజట్టులో ఆడించే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం.కాగా టీ20 వరల్డ్కప్ టోర్నీకి ముందు గాయపడిన వాషీ.. నమీబియాతో మ్యాచ్ నుంచి అందుబాటులోకి వచ్చాడు. పూర్తి ఫిట్నెస్ సాధించినప్పటికీ అతడి విషయంలో మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోలేదు. అయితే, నెదర్లాండ్స్తో నామమాత్రపు మ్యాచ్లో ఆడించి తదుపరి మ్యాచ్లకు అతడిని సన్నద్ధం చేయనున్నట్లు సమాచారం.నెదర్లాండ్స్తో మ్యాచ్కు భారత తుదిజట్టు (అంచనా)ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్.చదవండి: T20 WC: ఆస్ట్రేలియా అవుట్.. సూపర్-8కు జింబాబ్వే -
T20 WC: ఆస్ట్రేలియా అవుట్.. సూపర్-8కు జింబాబ్వే
ఊహించిందే జరిగింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. గ్రూప్-బి నుంచి ఐర్లాండ్- జింబాబ్వే మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ రద్దయిపోయింది.ఆస్ట్రేలియా ఎలిమినేట్శ్రీలంకలోని పల్లెకెలెలో వర్షం తెరిపినివ్వక పోవడంతో ఈ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో జింబాబ్వే పాయింట్ల సంఖ్య ఐదుకు చేరగా... ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది.మొత్తంగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్కప్ టోర్నీలో ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇందులో భాగంగా గ్రూప్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ వంటి పసికూనలతో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా పోటీలో ఉన్నాయి.ఐదు పాయింట్లతో అర్హత ఇక ఆది నుంచి అదరగొట్టిన శ్రీలంక ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లలో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్-బి నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. రెండో స్థానం కోసమైనా పోరాడాలని అనుకున్న ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై గెలిచిన ఆస్ట్రేలియా.. తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సోమవారం నాటి మ్యాచ్లో శ్రీలంక చేతిలోనూ చిత్తుగా ఓడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.మ్యాచ్ రద్దు కావడంతోమరోవైపు.. జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్లలో గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా ఐర్లాండ్తో జరగాల్సిన మూడో మ్యాచ్ రద్దు కావడంతో జింబాబ్వేకు మరో పాయింట్ వచ్చింది. నెట్రన్రేటు పరంగానూ జింబాబ్వే పటిష్ట స్థితి (+1.984)లో నిలిచింది. ఫలితంగా శ్రీలంకతో కలిసి జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధించగా.. మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియా అవమాన భారంతో నిష్క్రమించింది.ఇక గ్రూప్-బి తదుపరి నామమాత్రపు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆఖరిగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఒమన్తో తలపడుతుంది. మరోవైపు జింబాబ్వే గురువారం శ్రీలంకను ఢీకొడుతుంది.ఆఖరి బెర్తు ఎవరిదో?ఇదిలా ఉంటే.. గ్రూప్-ఎ నుంచి టీమిండియా సూపర్-8కు చేరగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అర్హత సాధించాయి. ఆఖరి బెర్తు కోసం గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, అమెరికా బరిలో ఉన్నాయి. కాగా గత వరల్డ్కప్ ఎడిషన్లో పాక్ను వెనక్కి నెట్టి అమెరికా సూపర్-8కు చేరిన విషయం తెలిసిందే.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్.. ప్రపంచ రికార్డు -
భారత స్టార్ను కిందకి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన పాక్ ప్లేయర్
ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భారత్ ప్లేయర్లకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. బౌలింగ్ ర్యాంకింగ్స్లో స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. టాప్ ప్లేస్కు పాక్ స్పిన్నర్ సదియా ఇక్బాల్ ఎగబాకింది. గత వారం ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉండిన సదియా రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. సదియా (743), దీప్తి శర్మ (729) మధ్య పాయింట్ల వ్యత్యాసం 14 పాయింట్లు మాత్రమే. ఆసీస్ పర్యటన తొలి టీ20లో పెద్దగా ప్రభావం (2-0-19-1) చూపకపోవడంతో దీప్తి టాప్ ర్యాంక్ను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు సదియా సౌతాఫ్రికాతో తాజాగా జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 5.82 ఎకానమీతో 5 వికెట్లు తీసి టాప్ ర్యాంక్కు చేరుకుంది.టాప్-10లోకి దూసుకొచ్చిన రేణుకా సింగ్తాజా ర్యాంకింగ్స్లో భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్ టాప్-10లోకి దూసుకొచ్చింది. ఆసీస్పై తొలి టీ20లో అద్భుత ప్రదర్శన (4-1-14-2) కనబర్చడంతో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకింది.అరుంధతి అదుర్స్ఇదే మ్యాచ్లో ఆకాశమే హద్దుగా (4-0-22-4) చెలరేగిన మరో భారత పేసర్ అరుంధతి రెడ్డి ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకొని 17వ స్థానానికి ఎగబాకింది. ఇదే మ్యాచ్లో రాణించిన స్పిన్నర్ శ్రీచరణి (3-0-14-2) ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని 39వ స్థానానికి ఎగబాకింది.బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం పెద్దగా మార్పుల్లేవు. బెత్ మూనీ, హేలీ మాథ్యూస్, స్మృతి మంధన టాప్-3లో కొనసాగుతున్నారు. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా.. జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఏకంగా 31 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి ఎగబాకింది. మిగతా చెప్పుకోదగ్గ మార్పుల్లో సౌతాఫ్రికా బ్యాటర్ అనెరీ డెర్క్సన్ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 76కు.. ఆసీస్ బ్యాటర్ జార్జియా వేర్హమ్ 9 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకారు.ఆల్రౌండర్ల విభాగంలోనూ పెద్దగా మార్పుల్లేవు. హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, దీప్తి శర్మ టాప్-3లో కొనసాగుతుండగా.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మాత్రం 5 స్థానాలు మెరుగుపర్చుకొని ఆరో స్థానానికి చేరింది. -
సెమీస్లో భారత్, పాక్
బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరాయి. ఇవాళ (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్ల్లో భారత-ఏ జట్టు నేపాల్పై.. పాకిస్తాన్-ఏ జట్టు యూఏఈపై ఘన విజయాలు సాధించి, ఫైనల్ ఫోర్లోకి ప్రవేశించాయి. సెమీస్లో భారత్, పాక్ ఎదుర్కోబోయే ప్రత్యర్ధులు ఎవరో రేపు జరుగబోయే బంగ్లాదేశ్-ఏ, మలేషియా.. శ్రీలంక-ఏ, థాయ్లాండ్ మ్యాచ్లతో తెలుస్తుంది.ఈ టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్లో (ఏ) ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, పాక్ మొదటి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్కు అర్హత సాధించాయి. ఈ గ్రూప్లో యూఏఈ.. భారత్, పాక్కు గట్టి పోటీనిచ్చింది. ఆ జట్టు కూడా భారత్, పాక్తో సమానంగా మూడింట రెండు మ్యాచ్లు గెలిచింది. ఇవాల్టి మ్యాచ్లో పాక్ చేతిలో ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏలో మరో జట్టు నేపాల్, ఆడిన 3 మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. గ్రూప్-బిలో బంగ్లాదేశ్-ఏ సెమీస్ బెర్త్ ఇదివరకే ఖరారైనప్పటికీ.. సెమీస్లో వారు ఎదుర్కోబోయే ప్రత్యర్ది ఎవరో మలేషియా మ్యాచ్ ఫలితంతో తెలుస్తుంది. ఎందుకంటే గ్రూప్-బిలో ఆ జట్టు స్థానాన్ని (1,2) మలేషియా మ్యాచ్ ఫలితం డిసైడ్ చేస్తుంది. గ్రూప్-బిలో మరో సెమీస్ బెర్త్ కోసం శ్రీలంక-ఏ, థాయ్లాండ్ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య రేపటి మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టుకే సెమీస్ బెర్త్ దక్కుతుంది. ప్రస్తుతం శ్రీలంక-ఏ, థాయ్లాండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో చెరో మ్యాచ్ గెలిచి బంగ్లాదేశ్-ఏ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్లో మలేషియా ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడి నాలుగో స్థానంలో ఉంది.ఫిబ్రవరి 20న జరిగే వేర్వేరు సెమీఫైనల్స్లో భారత్, పాక్ పోటీపడతాయి. సెమీస్లో ఈ రెండు జట్లు గెలిస్తే.. ఫైనల్లో ఎదురెదురుపడతాయి. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 22న జరుగనుంది.నేపాల్ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. తనూజా కన్వర్ 4, మిన్నూ మణి 3, కెప్టెన్ రాధా యాదవ్ 2 వికెట్లతో సత్తా చాటడంతో నేపాల్ 18 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ ఇన్నింగ్స్లో సమ్జానా ఖడ్కా (22) టాప్ స్కోరర్గా నిలిచింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వ్రిందా దినేశ్ 39 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ను విజయతీరాలకు చేర్చింది.మరో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈని పాక్ 17.2 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 11 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. -
T20 WC: జింబాబ్వే రైట్ రైట్.. అదే జరిగితే ఆసీస్ ఇంటికే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందే ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్ గాయాల కారణంగా దూరమయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయాడు.దీంతో కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 67 పరుగుల తేడాతో గెలుపొంది శుభారంభం అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆసీస్ అదే జోరు కొనసాగించలేకపోయింది.జింబాబ్వే చేతిలో ఓటమి.. లంక చేతిలోనూ చిత్తుతమ రెండో మ్యాచ్లో అనూహ్య రీతిలో పసికూన జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది ఆస్ట్రేలియా. తద్వారా జింబాబ్వే గ్రూప్-బి నుంచి సూపర్-8 అవకాశాలు మెరగుపరచుకోగా.. కంగారూ జట్టుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకతో సోమవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆసీస్ సూపర్-8 అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.గ్రూప్-బి నుంచి శ్రీలంక మూడింటికి మూడు గెలిచి సూపర్-8కు చేరగా.. జింబాబ్వే రెండింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్రన్రేటు (+1.984).పటిష్టస్థితిలో జింబాబ్వే.. అదే జరిగితే ఆసీస్ ఇంటికేమరోవైపు ఆస్ట్రేలియా మూడు ఆడి కేవలం ఒక్కటే గెలిచి.. 2 పాయింట్లతో ఉంది. నెట్రన్రేటు (+0.414) తదుపరి ఒమన్తో ఆసీస్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తేనే ఆసీస్ సూపర్-8 అవకాశాలు సజీవంగా ఉంటాయి.అయితే, దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆస్ట్రేలియాను వర్షం గండం వెంటాడుతోంది. ఆసీస్ కంటే పాయింట్లు, నెట్రన్రేటు పరంగా జింబాబ్వే పటిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో మంగళవారం ఐర్లాండ్తో మ్యాచ్లో గెలిస్తే జింబాబ్వే ఆరు పాయింట్లతో నేరుగా సూపర్-8 చేరితే ఆసీస్ ఇంటి బాటపడుతుంది.ఒకవేళ ఐర్లాండ్ చేతిలో జింబాబ్వే ఓడితే ఆసీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే, ఐర్లాండ్- జింబాబ్వే మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలెలో వర్షం పడుతున్న కారణంగా ఇరుజట్ల మధ్య మ్యాచ్కు టాస్ ఆలస్యమైంది. ఒకవేళ వర్షం తెరిపినివ్వకపోతే మ్యాచ్ రద్దైపోతుంది.ఓడినా మరో అవకాశం కూడా!అదే జరిగితే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు జింబాబ్వే ఖాతాలో పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుతుంది. తద్వారా ఆటోమేటిక్గా జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఆసీస్ టోర్నీ నుంచి ఘోర పరాభవంతో లీగ్ దశలోనే నిష్క్రమిస్తుంది. అన్నట్లు జింబాబ్వేకు మరో మ్యాచ్ కూడా మిగిలి ఉంది. శ్రీలంకతో గురువారం జింబాబ్వే తలపడుతుంది. ఐర్లాండ్తో మ్యాచ్లో ఫలితం తేడాగా వచ్చిన జింబాబ్వేకు ఇంకో అవకాశం మిగిలే ఉంటుందన్నమాట. UPDATE: T20 WC: ఆస్ట్రేలియా అవుట్.. సూపర్-8కు జింబాబ్వేచదవండి: గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై? -
సూపర్-8కు న్యూజిలాండ్.. మిగిలిన రెండు బెర్త్లు ఎవరివి..?
టీ20 ప్రపంచకప్ 2026లో మరో సూపర్-8 బెర్త్ ఖరారైంది. కెనడాపై గెలుపుతో న్యూజిలాండ్ ఫైనల్-8కు అర్హత సాధించింది. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక సూపర్-8కు చేరాయి. ఇక మిగిలింది రెండు బెర్త్లు మాత్రమే. ఆ రెండు ఎవరివి.. ఏయే జట్లు వాటి కోసం పోటీపడుతున్నాయి.. ఏ జట్లకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.. వంటి అంశాలపై ఈ కథనంలో చర్చిద్దాం.గ్రూప్-సి,డి నుంచి సూపర్-8 బెర్త్లు ఖరారైపోగా.. ఏ,బి గ్రూప్ల్లో ఓ బెర్త్ ఖరారైనా, మరో బెర్త్పై సందిగ్దత నెలకొంది. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ సూపర్-8కు క్వాలిఫై కాగా.. స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8కు అర్హత సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.గ్రూప్-ఏ నుంచి ప్రస్తుతానికి భారత్ ఒక్కటే సూపర్-8కు అర్హత సాధించింది. ఆడిన 3 మ్యాచ్ల్లో ఓడిన నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్ నుంచి మరో బెర్త్ కోసం టెక్నికల్గా 3 జట్ల మధ్య పోటీ ఉంది. అయితే ప్రధాన పోటీ మాత్రం యూఎస్ఏ, పాకిస్తాన్ మధ్యే ఉంటుంది. నెదర్లాండ్స్ టెక్నికల్గా టోర్నీలో ఉన్నా, ఆ జట్టు సూపర్-8 అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యం.పాక్, యూఎస్ఏ మధ్య ప్రధాన పోటీగా చెప్పుకుంటున్నా, పాక్కే సూపర్-8 అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ జట్టుకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. అది కూడా పసికూన నమీబియాతో. ఈ మ్యాచ్లో పాక్ గెలిస్తే.. నేరుగా సూపర్-8కు చేరుకుంటుంది. అప్పుడు యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. యూఎస్ఏ ఇప్పటికే తమ నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్లు పూర్తి చేసుకొని, పాక్తో సమంగా నాలుగు పాయింట్లు కలిగి ఉంది.యూఎస్ఏ సూపర్-8కు చేరాలంటే పాక్ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు పాక్, యూఎస్ఏ చెరి నాలుగు పాయింట్లు కలిగి ఉంటాయి. మెరుగైన రన్రేట్ ఆధారంగా యూఎస్ఏ సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం యూఎస్ఏ పాక్ కంటే మెరుగైన రన్రేట్ కలిగి ఉంది.గ్రూప్-ఏ నుంచి టెక్నికల్గా సూపర్-8 లైన్లో ఉన్న మరో జట్టు నెదర్లాండ్స్. ఈ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో భారత్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ గెలవడం అసాధ్యమే కాబట్టి, ఆ జట్టు అనధికారికంగా సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించింది. ఒకవేళ నెదర్లాండ్స్ భారత్పై ఘన విజయం సాధించి, పాక్ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడితే, అప్పుడు రన్రేట్ కీలకమవుతుంది. ఇలా జరిగిన పక్షంలో యూఎస్ఏ, పాక్, నెదర్లాండ్స్ జట్లలో మెరుగైన రన్రేట్ కలిగిన జట్టు సూపర్-8కు అర్హత సాధిస్తుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో శ్రీలంక ఇదివరకే సూపర్-8కు చేరిపోగా.. ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిగిలిన బెర్త్ కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ జట్లు పోటీపడుతున్నాయి. అధికారకంగా 3 జట్లు రేసులో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం జింబాబ్వే, ఆస్ట్రేలియా మధ్య ఉంటుంది. ఇవాళ (ఫిబ్రవరి 17) ఐర్లాండ్తో జరుగబోయే మ్యాచ్లో జింబాబ్వే విజయం సాధిస్తే.. మిగతా సమీకరణలతో పని లేకుండా జింబాబ్వే సూపర్-8కు, ఐర్లాండ్, ఆస్ట్రేలియా ఇంటి బాట పడతాయి. ఒకవేళ ఆస్ట్రేలియాకు సూపర్-8 బెర్త్ దక్కాలంటే.. ఆ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో ఒమన్పై భారీ విజయం సాధించాలి. అలాగే జింబాబ్వే తమ మిగిలిన రెండు గ్రూప్ మ్యాచ్ల్లో ఐర్లాండ్, శ్రీలంక చేతుల్లో భారీ తేడాతో ఓడాలి. ఇవాల్టి జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా, జింబాబ్వే సూపర్-8కు వెళ్తుంది. ఆసీస్, ఐర్లాండ్ ఇంటిముఖం పడతాయి. ఐర్లాండ్ సూపర్-8 అవకాశాలను పరిశీలిస్తే.. ఈ జట్టు నేడు జింబాబ్వేపై భారీ తేడాతో గెలవాలి. జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్లో శ్రీలంక చేతిలోనూ దారుణంగా ఓడాలి. ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచ్లో ఒమన్ చేతిలో ఓడాలి. అప్పుడు ఐర్లాండ్కు సూపర్-8 అవకాశం దక్కుతుంది. ఈ సమీకరణలు కార్యరూపాం దాల్చడం దాదాపుగా అసాధ్యమే కాబట్టి, ఐర్లాండ్ అనధికారికంగా సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించినట్టే. -
పాక్ మాజీ కెప్టెన్కు గావస్కర్ మద్దతు.. ప్రభుత్వానికి లేఖ
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు టీమిండియా దిగ్గజాలు అండగా నిలిచారు. ఇమ్రాన్ పట్ల పాక్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా పాకిస్తాన్కు తొలి ప్రపంచకప్ అందించిన లెజెండరీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్.ఇమ్రాన్ సారథ్యంలో 1992లో పాక్ వరల్డ్కప్ను ముద్దాడింది. ఇప్పటి వరకు మరే ఇతర పాక్ కెప్టెన్కు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించిన ఇమ్రాన్ ఖాన్ (Imran Khan).. పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలు, ఇతరత్రా కారణాలతో అతడు జైలు పాలయ్యాడు.జైలు జీవితంఈ క్రమంలో 2023 సెప్టెంబరు నుంచి జైలులోనే ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ఇటీవల క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. కంటిచూపు 85 శాతం పోయినట్లు ఆయన న్యాయవాది చెప్పారు. సరైన వైద్య సదుపాయం అందించాలని.. లేని పక్షంలో ఆయన పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.అండగా పద్నాలుగు మంది మాజీ కెప్టెన్లుఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ తదితరులు ఇమ్రాన్కు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా పద్నాలుగు మందితో మాజీ కెప్టెన్లతో కూడిన బృందం పాకిస్తాన్ ప్రభుత్వానికి పిటిషన్ పంపింది.ప్రభుత్వానికి లేఖ‘‘పాకిస్తాన్ మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్రికెట్కు అతడు అందించిన సేవలు ప్రశంసనీయం. కెప్టెన్గా పాకిస్తాన్కు తొలి వరల్డ్కప్ అందించిన వ్యక్తి అతడు.మాలో చాలా మంది అతడి ప్రత్యర్థిగా మైదానంలో దిగాము. అయితే, పోటీ ప్రపంచంలో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆల్రౌండర్గా చరిష్మా ఉంది. అంతేకాదు పాక్ ప్రధాని గానూ ఇమ్రాన్ పనిచేశారు.సంక్షోభ సమయంలో పగ్గాలు చేపట్టి దేశాన్ని ముందుకు నడిపించారు. అలాంటి వ్యక్తి పట్ల అనుచితంగా వ్యవహరించకూడదు. అంతర్జాతీయ స్థాయి వైద్యులను పిలిపించి ఆయనకు వైద్యం చేయాలని.. ఆ సమయంలో కుటుంబ సభ్యులు సైతం పక్కనే ఉండేందుకు అనుమతినివ్వాలని కోరుతున్నాం.గావస్కర్, కపిల్ దేవ్లతో పాటుచట్టపరంగానే వైద్య సదుపాయం అందించండి. కానీ ఆలస్యం చేయవద్దు’’ అని మాజీ కెప్టెన్లు పాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై భారత దిగ్గజాలు సునిల్ గావస్కర్, కపిల్ దేవ్తో పాటు మైకేల్ ఆథర్టన్, అలెన్ బోర్డర్, మైకేల్ బ్రేర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, నాజర్ హుసేన్, సర్ క్లైవ్ లాయిడ్, స్టీఫెన్ వా, జాన్ రైట్ సంతకాలు చేశారు.చదవండి: గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై? -
T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్.. ప్రపంచ రికార్డు
కెనడా క్రికెటర్, భారత మూలాలు ఉన్న యువరాజ్ సమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. తాజా ఎడిషన్లో భాగంగా పటిష్ట న్యూజిలాండ్తో మ్యాచ్లో యువరాజ్ ఈ ఘనత సాధించడం విశేషం.58 బంతుల్లోనేటీ20 వరల్డ్కప్-2026లో భాగంగా గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్- కెనడా (NZ vs CAN) మధ్య మంగళవారం నాటి మ్యాచ్లో.. టాస్ గెలిచిన కెనడా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కెనడా ఓపెనర్ యువరాజ్ సమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.పందొమ్మిదేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ కేవలం 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న యువరాజ్ సమ్రా 11 ఫోర్లు, ఆరు సిక్స్లు బాది 110 పరుగులు సాధించాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ చరిత్రలో తక్కువ బంతుల్లోనే సెంచరీ బాదిన అతి పిన్నవయస్కుడిగా యువరాజ్ నిలిచాడు.A HISTORIC MILESTONE! 🙌Canada’s Yuvraj Samra creates history with a breathtaking century, becoming the youngest centurion in T20Is! 🫡ICC Men’s #T20WorldCup | #NZvCAN | LIVE NOW ➡️ https://t.co/uuKxoyS6gX pic.twitter.com/bCbK9u8AIq— Star Sports (@StarSportsIndia) February 17, 2026 173 పరుగులు ఇక కివీస్తో మ్యాచ్లో యువరాజ్ శతకం (110)తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్, కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో నవనీత్ ధలీవాల్ (10) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. నికోలస్ కిర్టాన్ (2) విఫలమయ్యాడు. హర్ష్ థాకర్ 3, దిలాన్ హెలిగర్ 8 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా కెనడా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 173 పరుగులు స్కోరు చేసింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కైలీ జెమీషన్, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ తీయగా.. యువరాజ్ రూపంలో జేకబ్ డఫీ కీలక వికెట్ దక్కించుకున్నాడు.టీ20 ప్రపంచకప్ టోర్నీలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లు🏏యువరాజ్ సమ్రా (కెనడా)- చెన్నై వేదికగా న్యూజిలాండ్ మీద 2026లో 19 ఏళ్ల 141 రోజుల వయసులో🏏అహ్మద్ షెహజాద్ (పాకిస్తాన్)- మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ మీద 2014లో 22 ఏళ్ల 127 రోజుల వయసులో🏏సురేశ్ రైనా (ఇండియా)- గ్రాస్ ఐస్లెట్ వేదికగా సౌతాఫ్రికా మీద 2010లో 23 ఏళ్ల 156 రోజుల వయసులో🏏అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)- ఛట్టోగ్రామ్ వేదికగా శ్రీలంక మీద 2014లో 25 ఏళ్ల 83 రోజుల వయసులో🏏గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)- సిడ్నీ వేదికగా శ్రీలంక మీద 2022లో 25 ఏళ్ల 327 రోజుల వయసులో సెంచరీ.కివీస్ గెలుపుఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 15.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 76), రచిన్ రవీంద్ర 39 (బంతుల్లో 59) మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేశారు.చదవండి: గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై? -
T20 WC: పాక్ మరో ‘యూటర్న్’!.. ఈసారి ఎవరంటే?
టీ20 ప్రపంచకప్-2026 నేపథ్యంలో పాకిస్తాన్ వరుస ‘యూటర్న్’లతో వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్కు మద్దతుగా తాము టోర్నీనే బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తొలుత సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.మాట మార్చడమే పనిఆ తర్వాత మొదటికే మోసం వస్తుందని భావించి.. కేవలం టీమిండియాతో మ్యాచ్ మాత్రమే బాయ్కాట్ చేస్తామని ఏకంగా పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రకటన చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) రంగంలోకి దిగడంతో ఈ విషయంలోనూ పాక్ మాట మార్చింది.ఐసీసీతో పాటు పాక్ భద్రతా కారణాల గురించి మాట్లాడటంతో శ్రీలంక సైతం తమపై గతంలో పాక్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ లేఖ రాసింది. యూఏఈ కూడా పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరింది. ఆఖరికి బంగ్లాదేశ్ సైతం భారత్తో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్కు విజ్ఞప్తి చేసింది.ఈ నేపథ్యంలో ఐసీసీతో పాటు శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్ ఒత్తిళ్ల కారణంగా టీమిండియాతో మ్యాచ్ ఆడతామంటూ పాక్ అతి పెద్ద యూటర్న్ తీసుకుంది. అన్నట్లుగానే కొలంబో వేదికగా పటిష్ట భారత్తో తలపడ్డ పాకిస్తాన్ 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.నాలుక మడతేసిన అక్తర్ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పీసీబీ చైర్మన్ , మంత్రి మొహ్సిన్ నక్వీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసమర్థ వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ మండిపడ్డాడు. సీనియర్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది, షాదాబ్ ఖాన్ వరుసగా విఫలమవుతున్నా.. ఎందుకు ఆడిస్తున్నారని ప్రశ్నించాడు.ఆట పట్ల అవగాహన లేని వ్యక్తి చైర్మన్ అయితే ఇలాగే ఉంటుందంటూ నక్వీని ఉద్దేశించి అక్తర్ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్ వైరల్ కాగా అక్తర్పై విమర్శలు వచ్చాయి. దీంతో అతడు కూడా యూటర్న్ తీసుకున్నాడు. తాను నక్వీ భాయ్ను ఉద్దేశించి.. ‘‘చదువులేని వాడు, అసమర్థుడు’’ అని అనలేదంటూ మాట మార్చాడు.‘‘నేను నక్వీ భాయ్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆయనను అగౌరవపరచాలనే ఉద్దేశమే నాకు లేదు. అంతర్జాతీయ స్థాయిలో పాక్ క్రికెట్ దిగజారుతున్న తీరుపైనే నేను ఆవేదన వ్యక్తం చేశాను.నక్వీ భాయ్ మంచి వ్యక్తిఅసమర్థులైన వ్యక్తులు వ్యవస్థను నాశనం చేస్తారు అని మాత్రమే అన్నాను. అయితే, అది నక్వీ భాయ్ను ఉద్దేశించి మాత్రం కాదు. కానీ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. అదే కార్యక్రమంలో నేను నక్వీ భాయ్ మంచి వ్యక్తి అని చెప్పాను. కానీ ఆ మాటలను ప్రసారం చేయలేదు.అయితే, ఒక విషయంలో మాత్రం నక్వీ భాయ్పై నాకు నిజంగానే కోపం వచ్చింది. టీమిండియాతో ఆడమని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ మాట మీద నిలబడలేదు. మేమంతా ఆయనతోనే ఉన్నాం. మీకసలు సిగ్గుందా?అయినా సరే యూటర్న్ తీసుకోవడం నచ్చలేదు. ఈ విషయంలో పునరాలోచన చేసే ముందు నన్ను సంప్పదించాల్సింది’’ అని అక్తర్ తాను కూడా మాట మార్చేశాడు. ఈ నేపథ్యంలో ‘‘యూటర్న్ల మీద యూటర్న్లు.. మీకసలు సిగ్గుందా?’’ అంటూ నెటిజన్లు పీసీబీ, అక్తర్కు చివాట్లు పెడుతున్నారు.చదవండి: గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై? -
నిప్పులు చెరిగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
టీమిండియా వెటరన్ పేసర్, బెంగాల్ బౌలింగ్ స్టార్ మొహమ్మద్ షమీ మరోసారి సత్తా చాటాడు. రంజీ ట్రోఫీ 2025-26 రెండో సెమీస్ మ్యాచ్లో ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. కళ్యాణిలోని బెంగాల్ క్రికెట్ అకాడమీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జమ్మూ కశ్మీర్- బెంగాల్ మధ్య ఆదివారం మ్యాచ్ మొదలైంది.328 పరుగులకు ఆలౌట్టాస్ గెలిచిన జమ్మూ కశ్మీర్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బెంగాల్ బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (49), షాబాజ్ అహ్మద్ (42) రాణించగా.. సుదీప్ కుమార్ ఘరామి (146) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో సుమంత గుప్తా 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో బెంగాల్ 97.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్ అయింది.జమ్మూ కశ్మీర్ బౌలర్లలో స్టార్ పేసర్ అకీబ్ నబీ (Auqib Nabi) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. సునిల్ కుమార్ (Sunil Kumar) మూడు, యుధ్వీర్ సింగ్ చరఖ్, అబిద్ ముస్తాక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం జమ్మూ కశ్మీర్ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. మంగళవారం నాటి మూడో రోజు ఆటలో 302 పరుగులకు ఆలౌట్ అయింది.ఆది నుంచే నిప్పులు చెరిగిన షమీఆది నుంచే నిప్పులు చెరిగిన బెంగాల్ పేసర్ షమీ.. ఓపెనర్లు శుభం ఖజూరియా (3), యావర్ హసన్ (2)లను వచ్చీరాగానే వెనక్కి పంపాడు. అదే విధంగా అబ్దుల్ సమద్ (82), కన్హయ్య వాధవాన్ (29) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు.అంతేకాదు.. అబిద్ ముస్తాక్ (27), వన్షజ్ శర్మ (3), ఆకిబ్ నబీ (42), యుధ్వీర్ సింగ్ చరఖ్ (33)ల వికెట్లు కూడా షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. మిగిలిన బెంగాల్ బౌలర్లలో టీమిండియా స్టార్ ముకేశ్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ విజృంభణ కారణంగా తొలి ఇన్నింగ్స్లో బెంగాల్ 26 పరుగుల ఆధిక్యం సంపాదించగలిగింది.ఆడినా లాభమేంటి?గతేడాది మార్చిలో చివరగా టీమిండియా తరఫున వన్డే బరిలో దిగాడు షమీ. అంతకు ముందు నెలలో టీ20లు ఆడాడు. అయితే, అతడు భారత్ తరఫున టెస్టులు ఆడి దాదాపు మూడేళ్లు కావస్తోంది.ఫస్ట్క్లాస్ క్రికెట్లో సత్తా చాటినా టీమిండియా సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. తాజా రంజీ సీజన్లోనూ ఆకట్టుకున్నా అతడికి పిలుపునివ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీకి మ్యాచ్ ఫిట్నెస్ లేదని వ్యాఖ్యానించగా.. తాను ఆటతోనే సమాధానం చెబుతున్నానని షమీ కౌంటర్ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే తాజా మ్యాచ్లోనూ సత్తా చాటి మరోసారి టీమిండియా సెలక్ట ర్లకు గట్టి వార్నింగే ఇచ్చాడు.An 8️⃣-wicket masterpiece 🫡Watch 🎥Mohd. Shami wreaks havoc with his career-best First Class figures of 8/90 🔥 Updates ▶️ https://t.co/QXyCuRIgVM#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/f4F3TYnSWi— BCCI Domestic (@BCCIdomestic) February 17, 2026చదవండి: గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై? -
గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై?
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ త్వరలోనే తప్పుకోనున్నాడా? తన కాంట్రాక్టు ముగిసేంత వరకు కూడా అతడు పదవిలో కొనసాగడా?... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో మళ్లీ అతడి బంధం బలపడనుందా?..భారత క్రికెట్ వర్గాల్లో ఈ సందేహాలు తలెత్తడానికి ప్రధాన కారణం దైనిక్ జాగరణ్లో వచ్చిన కథనం. ఈ జాతీయ మీడియా అందించిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ రాయల్స్ గంభీర్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమ యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్న వేళ.. గంభీర్కు ఆ ఫ్రాంఛైజీ బంపరాఫర్ ఇచ్చినట్లు సమాచారం.వాటా ఇస్తారా?.. ట్రిపుల్ ధమాకా!ఫ్రాంఛైజీలో 2-3 శాతం వాటా ఇవ్వడంతో పాటు సీఈఓ పోస్టు కూడా ఇస్తామని గంభీర్ (Gautam Gambhir)కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా జట్టు మెంటార్గానూ అతడికి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే రాజస్తాన్ రాయల్స్ జట్టు మొత్తం గంభీర్ కనుసన్నల్లోనే నడుస్తుంది. సర్వం తానై జట్టును నడిపించే బాధ్యత ఈ మాజీ వరల్డ్కప్ విన్నర్కు దక్కుతుంది.ఒకవేళ గంభీర్ గనుక ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే టీమిండియా హెడ్కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం భారత క్రికెట్లో ఓ పదవిలో ఉన్న వ్యక్తి.. ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండరాదు. రెండుచోట్లా సదరు వ్యక్తి పనిచేసినట్లయితే అయితే ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్’ కిందకు వస్తుంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఆ వ్యక్తిపై వేటు పడుతుంది.టెస్టులలో ఫ్లాప్అయితే, రాజస్తాన్ ఆఫర్ను గంభీర్ అంగీకరించే అవకాశాలు దాదాపుగా శూన్యమనే చెప్పవచ్చు. టీమిండియా హెడ్కోచ్గా అతడు మిశ్రమ ఫలితాలు అందుకుంటున్నాడు. టెస్టుల్లో గౌతీ మార్గదర్శనంలో భారత్ ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్వాష్, పాతికేళ్ల తర్వాత సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది.అదే విధంగా ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోయింది. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం గంభీర్కు వరుస విజయాలు దక్కుతున్నాయి. 2025లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆసియా టీ20 కప్ 2025ని కూడా కైవసం చేసుకుంది.పరిమిత ఓవర్ల క్రికెట్లో హిట్ప్రస్తుతం డిఫెండింగ్ చాంపియన్గా టీ20 ప్రపంచకప్-2026 బరిలో దిగిన టీమిండియా ఈసారీ టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక 2024లో టీమిండియా హెడ్కోచ్గా పదవి చేపట్టిన గంభీర్ పదవీ కాలం 2027 వరల్డ్కప్ వరకు ఉంది. ఇలాంటి తరుణంలో గంభీర్ టీమిండియా విధులను కాదని.. రాజస్తాన్ రాయల్స్ ఆఫర్కి అంగీకరించే అవకాశం లేదని చెప్పవచ్చు. పట్టుదలకు మారుపేరుగా పేరొందిన గంభీర్ భారత్కు మరో ఐసీసీ టైటిల్ అందించిన తర్వాతే హెడ్కోచ్గా వైదొలిగే అంశంపై ఆలోచిస్తాడని అతడి అభిమానులు అంటున్నారు.ఐపీఎల్ వీరుడుటీమిండియా ఓపెనర్గా ఉన్నత శిఖరాలు అధిరోహించిన గౌతం గంభీర్ ఐపీఎల్లోనూ సత్తా చాటాడు. కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా రెండు టైటిళ్లు అందించాడు. అంతేకాదు.. 2024లో అదే జట్టుకు మెంటార్గా పనిచేసి మరోసారి ట్రోఫీని ముద్దాడేలా చేశాడు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్కు కూడా గంభీర్ మెంటార్గా పనిచేశాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఐపీఎల్లో మొత్తంగా 154 మ్యాచ్లు ఆడి 4218 పరుగులు సాధించాడు.చదవండి: గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్ -
పడిక్కల్ డబుల్ సెంచరీ.. కర్ణాటక అతి భారీ స్కోరు
రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో కర్ణాటక అతి భారీ స్కోరు సాధించింది. ఉత్తరాఖండ్ బౌలింగ్ను చితక్కొట్టి తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 736 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (141), స్మరణ్ రవిచంద్రన్ (135) భారీ శతకాలతో మెరవగా.. కెప్టెన్ దేవదత్ పడిక్కల్ డబుల్ సెంచరీ (232)తో కదం తొక్కాడు.736 పరుగులుమిగిలిన వారిలో కరుణ్ నాయర్ (60), వికెట్ కీపర్ బ్యాటర్ కృతిక్ కృష్ణ (60), విద్యాధర్ పాటిల్ (54) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 194.4 ఓవర్లలో 736 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అయితే, ఈ మ్యాచ్లో స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) విఫలం కాగా.. శ్రేయస్ గోపాల్ (0), విజయ్కుమార్ వైశాఖ్ (0) డకౌట్ అయ్యారు. శిఖర్ శెట్టి 12 పరుగులు చేయగా.. ప్రసిద్ కృష్ణ ఒక పరుగుతో అజేయంగా నిలిచాడు.ఇక ఉత్తరాఖండ్ బౌలర్లలో ఆదిత్య రావత్ నాలుగు వికెట్లు తీయగా.. మయాంక్ మిశ్రా మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా వారిలో అభయ్ నేగి, అన్వీశ్ సుధా, లక్ష్య రాజేశ్ రాయ్చందాని తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.రెండో రోజు ఆట సాగిందిలా..కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (232; 29 ఫోర్లు, 3 సిక్స్లు) డబుల్ సెంచరీ... స్మరణ్ (121 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ శతకం... వెరసి ఉత్తరాఖండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 355/2తో సోమవారం నాటి రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక... ఆట ముగిసే సమయానికి 180 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 689 పరుగులు సాధించింది.కరుణ్ నాయర్ (60; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి పడిక్కల్ మూడో వికెట్కు 129 పరుగులు ... స్మరణ్తో కలిసి నాలుగో వికెట్కు 59 పరుగులు జత చేశాడు. శ్రేయస్ గోపాల్ (0) డకౌట్కాగా ... కృతిక్ కృష్ణ ( 60; 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి స్మరణ్ ఆరో వికెట్కు 123 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో స్మరణ్ కెరీర్లో ఐదో ఫస్ట్క్లాస్ సెంచరీ సాధించాడు. కృతిక్ వెనుదిరిగాక ... విద్యాధర్ పాటిల్ (35 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్), స్మరణ్ మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. చదవండి: T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన శ్రీలంక.. ఇక లగేజి సర్దుకోవడమే! -
పోరాడి ఓడిన కరణ్ సింగ్
ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నమెంట్లో తొలి రోజు భారత క్రీడాకారుడు కరణ్ సింగ్కు నిరాశ ఎదురైంది. ‘వైల్డ్ కార్డు’తో నేరుగా సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగిన కరణ్ ఈ అడ్డంకిని దాటలేకపోయాడు. ఢిల్లీ లాన్ టెన్నిస్ సంఘం (డీఎల్టీఏ) కాంప్లెక్స్లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 436వ ర్యాంకర్ కరణ్ సింగ్ 6–4, 6–7 (5/7), 3–6తో ప్రపంచ 260వ ర్యాంకర్ డేనియల్ మైకెల్స్కీ (పోలాండ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కరణ్ ఏడు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సరీ్వస్ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రామ్కుమార్ రామనాథన్ 2–6, 2–6తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోగా... మనీశ్ సురేశ్ కుమార్ 6–3, 7–5తో యుసుంగ్ పార్క్ (దక్షిణ కొరియా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి సుమిత్ నగాల్, దిగ్విజయ్ ప్రతాప్ సింగ్, మానస్ ధామ్నె బరిలో ఉన్నారు. -
గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్
న్యూఢిల్లీ: గ్రూప్లోని గట్టి ప్రత్యర్థులు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోయిన అఫ్గానిస్తాన్ టి20 ప్రపంచకప్లో ఎట్టకేలకు మూడో మ్యాచ్లో గెలుపు బోణీ కొట్టింది. ‘సూపర్–8’ చేరే అవకాశాలను నిలబెట్టుకుంది. సోమవారం గ్రూప్ ‘డి’లో జరిగిన మ్యాచ్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (4 వికెట్లు; 21 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ఆల్రౌండ్ ప్రదర్శనతో అఫ్గానిస్తాన్ 5 వికెట్ల తేడాతో యూఏఈపై గెలుపొందింది. మొదట యూఏఈ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. సోహైబ్ ఖాన్ (48 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్లు) దంచేశాడు. అజ్మతుల్లా (4–0–15–4) నిప్పులు చెరిగే స్పెల్తో యూఏఈ బ్యాటర్లను కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అఫ్గానిస్తాన్ కెపె్టన్, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్లో అర్ఫాన్ హిట్వికెట్గా వెనుదిరిగాడు. దాంతో టి20 క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా రషీద్ ఖాన్ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ టి20ల్లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖానే (191) అగ్రస్థానంలో ఉన్నాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది. ఇబ్రహీం జద్రాన్ (41 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్), అజ్మతుల్లా రాణించారు. ఈ గ్రూప్లో దక్షిణాఫ్రికా ఆడిన మూడూ గెలిచి 6 పాయింట్లతో ఇప్పటికే ‘సూపర్–8’కు చేరింది. రెండు మ్యాచ్లు నెగ్గిన న్యూజిలాండ్ 4 పాయింట్లతో అఫ్గానిస్తాన్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈరోజు కెనడాతో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే అఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి ని్రష్కమిస్తుంది. న్యూజిలాండ్ ‘సూపర్–8’కు చేరుతుంది. -
ఇంగ్లండ్ దర్జాగా...
కోల్కతా: టి20 ప్రపంచకప్లో తదుపరి దశకు అర్హత పొందాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ మెరిపించింది. తొలిసారి ప్రపంచకప్లో ఆడుతున్న ఇటలీ జట్టు కడదాకా పోరాడింది. చివరకు మాజీ చాంపియన్ చేతిలో 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో గ్రూప్ ‘సి’ నుంచి ఇప్పటికే ‘సూపర్–8’కు చేరిన వెస్టిండీస్ సరసన ఇంగ్లండ్ చేరింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన హ్యారీ బ్రూక్ బృందం నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) కాసేపు మెరిపించినా... బట్లర్ (3) మళ్లీ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో నాలుగో మ్యాచ్ ఆడిన బట్లర్ ఇప్పటివరకు కనీసం మూడు పదుల స్కోరైనా చేయలేకపోయాడు. జాకబ్ బెథెల్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ బ్రూక్ (14), స్యామ్ కరన్ (25; 2 సిక్స్లు) ఇలా టాప్–6 బ్యాటర్లు ఇటలీ బౌలింగ్కు ఇబ్బంది పడితే... ఏడో వరుస బ్యాటర్ విల్ జాక్స్ (22 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్లు) ధనాధన్ సిక్స్లతో తేలికపడింది. అతను 21 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. జాక్స్ మెరుపుల వల్లే ఇంగ్లండ్ 200 పైచిలుకు స్కోరు చేసింది. గ్రాంట్ స్టివార్ట్, కలుగమగే చెరో 2 వికెట్లు తీశారు. ‘సిక్స్’ల పిడుగు మనెంటి కొండంత లక్ష్యం ఎదురైనా... టాప్–3 బ్యాటర్లలో ఆంథోని మోస్కా (0), స్మట్స్ (0) డకౌటైనా... ఇటలీ ఆందోళన చెందలేదు. పోరాటం వీడలేదు. లక్ష్యఛేదన కోసం కడదాకా పోరాడి 20 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ జస్టిన్ మోస్కా (34 బంతుల్లో 43; 7 ఫోర్లు), బెన్ మనెంటి (25 బంతుల్లో 60; 4 ఫోర్లు, 6 సిక్స్లు) చెలరేగారు. జస్టిన్ బౌండరీలతో ధాటిగా ఆడితే... మనెంటి భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో బెన్ 22 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. దీంతో ఇటలీ 22/3 దయనీయ స్థితి నుంచి 114/4 స్కోరుతో రేసులో పడింది. స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ కావడంతో లక్ష్యానికి దూరమైంది. అయినా సరే ఇటలీ ఆట ఆగిపోలేదు. గ్రాంట్ స్టివార్ట్ (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 5 సిక్స్లు) సైతం ఇంగ్లండ్ శిబిరంపై విరుచుకుపడటంతో ప్రత్యర్థి జట్టు ఆఖరి బంతిదాకా చెమటోడ్చింది. కరన్, ఓవర్టన్ చెరో 3 వికెట్లు తీయగా... ఆర్చర్కు 2 వికెట్లు దక్కాయి. -
‘శత’క్కొట్టిన నిసాంక
పల్లెకెలె: పాథుమ్ నిసాంక (52 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్లు) ‘శతక’ విధ్వంసంతో ఆ్రస్టేలియా గల్లంతైంది. ఈ టి20 ప్రపంచ కప్లో తొలి సెంచరీని ఆతిథ్య శ్రీలంక బ్యాటర్ నిసాంక అజేయంగా లిఖించాడు. దీంతో ‘హ్యాట్రిక్’ విజయాలతో లంక జట్టు ‘సూపర్–8’కు అర్హత సాధించింది. కీలకమైన మ్యాచ్లో ఓటమి పాలైన ఆ్రస్టేలియా ముందుకెళ్లే అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. ఇప్పుడు జింబాబ్వే ‘వరుస ఓటమి’లపైనే ఆసీస్ ‘సూపర్–8’ భవితవ్యం ఆధార పడింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన మ్యాచ్లో దాసున్ షనక నేతృత్వంలోని లంక 8 వికెట్ల తేడాతో ఆసీస్పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా నిరీ్ణత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కెపె్టన్ మిచెల్ మార్‡్ష (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్లు), ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 56; 7 ఫోర్లు, 3 సిక్స్లు) తొలి వికెట్కు 104 పరుగులు జోడించారు. 8.2 ఓవర్ల వరకు వికెట్ కోల్పోలేదు. ఇంతవరకు జోరుగా సాగిన ఆసీస్ అనూహ్యంగా మిగతా 11.4 ఓవర్లలో మరో 77 పరుగులే చేసి 10 వికెట్లను కోల్పోయింది. ఇన్గ్లిస్ (27; 3 ఫోర్లు), మ్యాక్స్వెల్ (22; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండు పదుల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. మ్యాక్స్వెల్ రివర్స్ స్వీప్తో బౌండరీకి యత్నించగా... బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద నిసాంక కళ్లు చెదిరే క్యాచ్తో అబ్బురపరిచాడు. లంక బౌలర్లలో హేమంత 3, చమీర 2 వికెట్లు తీశాడు. అనంతరం లంక 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి గెలిచింది. నిసాంక రెండో వికెట్కు కుశాల్ మెండిస్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్)తో 97 పరుగులు, తర్వాత పవన్ రత్నాయకే (28 నాటౌట్; 6 ఫోర్లు)తో అబేధ్యమైన మూడో వికెట్కు 79 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. ఆ్రస్టేలియా తమ చివరి లీగ్ మ్యాచ్లో 20న ఒమన్ జట్టుతో ఆడుతుంది. ఆసీస్ కంటే ముందే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్లు (నేడు ఐర్లాండ్తో; 19న శ్రీలంకతో) ఆడుతుంది. ఈ రెండింటిలో జింబాబ్వే ఒక్కటి గెలిచినా ‘సూపర్–8’కు అర్హత పొందుతుంది. ఒకవేళ జింబాబ్వే రెండింటిలో ఓడిపోయినా... రన్రేట్లో ఆ్రస్టేలియాకంటే మెరుగ్గా ఉంటేచాలు ‘సూపర్–8’ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. -
ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన శ్రీలంక.. ఇక లగేజి సర్దుకోవడమే!
టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం పల్లెకెలె వేదికగా జరిగిన గ్రూపు-బి మ్యాచ్లో ఆసీస్ను 8 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది.ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 56), కెప్టెన్ మిచెల్ మార్ష్ (54) మొదటి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఒక దశలో 104/0 తో ఉన్న ఆస్ట్రేలియాను లంక స్పిన్నర్లు దూషన్ హేమంత, దునిత్ వెల్లలాగే కట్టడి చేశారు. కేవలం 77 పరుగుల వ్యవధిలోనే ఆసీస్ తన 10 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో హేమంత మూడు వికెట్లు పడగొట్టగా.. చమీరా, కమిందు మెండిస్, వెల్లలాగే తలా వికెట్ సాధించారు.నిస్సాంక సూపర్ సెంచరీ..అనంతరం 182 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలోనే చేధించింది. లంక ఓపెనర్ పాథుమ్ నిస్సాంక అజేయ సెంచరీతో సత్తాచాటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన నిస్సాంక.. చివరి వరకు క్రీజులో నిలబడి టార్గెట్ను ఫినిష్ చేశాడు.నిస్సాంక 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. అతడితో వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (51), పవన్ రత్నాయకే(28) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిష్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.ఆసీస్ ఇంటికే!ఈ విజయంతో గ్రూపు-బి నుంచి శ్రీలంక సూపర్-8కు అర్హత సాధించింది. కానీ వరుసగా రెండు మ్యాచ్లలో ఓటమి పాలైన ఆసీస్ మాత్రం తమ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ గ్రూపు పాయింట్ల పట్టికలో జింబాబ్వే(4 పాయింట్లు) రెండో స్దానంలో ఉంది. ఆసీస్ సూపర్-8కు చేరాలంటే జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్లలో ఐర్లాండ్, శ్రీలంకపై ఓడిపోవాలి. అదేవిధంగా ఒమన్పై ఆసీస్ భారీ విజయం సాధించాలి. -
భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని మూడేళ్ల ముందే తెలుసు: శ్రీశాంత్
మాజీ భారత క్రికెటర్ S. Sreesanth ‘Rooted For Life’ పోడ్కాస్ట్లో తన జీవిత ప్రయాణాన్ని వివరించారు. Dr. Pradeep Sethi గారితో జరిగిన ఈ సంభాషణ క్రికెట్కి మాత్రమే పరిమితం కాకుండా జీవితం, నమ్మకం, మనోబలం వంటి ఎన్నో అంశాలపై సాగింది. చిన్ననాటి కష్టాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, వ్యక్తిగత ఆలోచనలు, ప్రపంచ కప్ వరకు తీసుకెళ్లిన సూత్రాలు – అన్నింటినీ శ్రీశాంత్ మనస్ఫూర్తిగా పంచుకున్నారు.ఎపిసోడ్ ప్రారంభంలోనే శ్రీశాంత్ అందరినీ – మతం, కులం అనే తేడా లేకుండా గౌరవించాలనే తన నమ్మకాన్ని చెప్పారు. జీవితం ఎత్తుపల్లాలు చూపినప్పుడు నిలబడటానికి ఒక బలమైన “బేస్” ఉండాలి అని ఆయన అభిప్రాయం. వినయం, ఆత్మగౌరవం రెండూ కలిసి నడవాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం గొప్పతనానికి మూలం అని స్పష్టం చేశారు.ఈ పోడ్కాస్ట్లో హృదయాన్ని తాకే భాగం ఆయన చిన్నప్పటి ఆరోగ్య సమస్యల గురించి. మొదటిసారి తనకు వచ్చిన ట్యూమర్ శస్త్రచికిత్స, ఆ సమయంలో తన తండ్రి చూపిన అచంచలమైన భక్తి గురించి శ్రీశాంత్ గారు భావోద్వేగంగా చెప్పారు.Ettumanoor Mahadeva Temple వద్ద ఒక రూపాయి కానుక, చేసిన ప్రార్థన తన జీవితాన్ని మార్చేసిందని, అది తనకు ఒక అద్భుతం లాంటిదని వివరించారు. భగవాన్ శివుడితో తన ఆధ్యాత్మిక అనుబంధం గురించి చెబుతూ, తన చేతిపై త్రిశూలం ఆకారంలో ఉన్న జన్మమచ్చను కూడా ప్రస్తావించారు.తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది సహా అందరినీ కుటుంబ సభ్యుల్లా గౌరవించాలనే విలువలు తన తండ్రి నేర్పారని చెప్పారు. మహాబలి కథ, ఓనం పండుగ ఉదాహరణగా తీసుకుని, మతం కంటే మానవత్వమే గొప్పదని పేర్కొన్నారు.సంతోషం, ఆనందం మధ్య తేడా గురించి మాట్లాడుతూ – విజయం వల్ల వచ్చే సంతోషం తాత్కాలికం కావొచ్చు, కానీ అంతరానందం మనలో నుంచే వస్తుందని అన్నారు. మంచి అయినా చెడు అయినా ప్రతి అనుభవం మనకు “తజుర్బా” ఇస్తుందని, అది మనల్ని మరింత బలంగా తయారు చేస్తుందని చెప్పారు.ICC World Twenty20 విజయానికి వెనుక ఉన్న “సీక్రెట్” గురించి మాట్లాడినప్పుడు, కప్ గెలవబోతున్నామనే నమ్మకం తనలో ముందే ఉన్నదని చెప్పారు. ట్రోఫీని చేతిలో పట్టుకున్నట్టు మూడు సంవత్సరాల ముందే ఊహించుకున్నానని వెల్లడించారు. ఆ టోర్నమెంట్లో తన కెరీర్కి మలుపుతిప్పిన క్యాచ్ గురించి కూడా గుర్తుచేసుకున్నారు.PRIDE – అంటే “Personal Responsibility in Delivering Excellence” – అనే తత్వం తన జీవితానికి ఆధారం అని చెప్పారు. జట్టులోంచి తప్పించబడిన సందర్భాలు, ఓటములు ఎదురైనప్పుడు కూడా క్రమశిక్షణ, రొటీన్, పాజిటివ్ సెల్ఫ్-టాక్ తనను నిలబెట్టాయని వివరించారు. తాత్కాలిక ప్రతిభ కంటే అలవాట్లు, క్రమబద్ధతే విజయానికి మూలం అని అన్నారు.తన పోటీ స్వభావం గురించి మాట్లాడుతూ, క్రీడల్లో ధైర్యం మరియు అజాగ్రత్త మధ్య ఉన్న సన్నని రేఖను వివరించారు. అస్టిగ్మాటిజం సమస్య, ఫాస్ట్ బౌలింగ్లో ఉన్న శారీరక ఒత్తిడి, అవుట్స్వింగ్ యార్కర్ సాధనలో చూపిన పట్టుదల గురించి పంచుకున్నారు.మైదానంలో తన సంబరాలు ఈగో వల్ల కాదు, ఆటపై ఉన్న నిజమైన ప్రేమ, ఉత్సాహం వల్లేనని చెప్పారు. విజయం ప్రయాణంలో ఇతరులను కూడా భాగస్వాములను చేయడం, పాజిటివ్ సందేశాలు పంచడం ఎంత ముఖ్యమో వివరించారు.ఈ పోడ్కాస్ట్లో కుటుంబం ప్రాధాన్యం, ప్రజా జీవితంలో మేనేజర్ల కంటే కుటుంబ సభ్యుల పాత్ర, ప్రపంచానికి ప్రేమ, పాజిటివ్ వైబ్స్ పంచాల్సిన అవసరం వంటి అంశాలు కూడా చర్చించబడ్డాయి. చివరగా తన నానమ్మ నేర్పిన జీవన పాఠాలు, యోగా ద్వారా సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో శ్రీశాంత్ గారు సూచనలు ఇచ్చారు. -
భారత్ చేతిలో ఘోర ఓటమి.. అర్ధరాత్రి పాక్ కీలక నిర్ణయాలు
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో ఘోర ఓటమి ఎదురైన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. నిన్న (ఫిబ్రవరి 15) మ్యాచ్ ముగిసిన వెంటనే పీసీబీ అర్దరాత్రి వేల అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ స్టార్ ఆటగాళ్ల పేర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది అని తెలుస్తుంది.వీరిద్దరిని తక్షణమే జట్టు నుంచి తప్పించాలని కొలొంబోలో ఉన్న దేశ ప్రతినిధులకు పీసీబీ అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. పాక్ తదుపరి ఆడబోయే నమీబియా మ్యాచ్లో బాబర్, అఫ్రిది స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీం షా, ఫకర్ జమాన్, ఖ్వాజా నఫాయ్ పేర్లు పరిశీలించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది.భారత్ మ్యాచ్లో జట్టు ప్రదర్శనపై పాక్ ప్రభుత్వం సైతం ఆగ్రహంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. స్టార్ ఆటగాళ్లను తప్పించే విషయంలో పీసీబీ కంటే పాక్ ప్రభుత్వ జోక్యమే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్ ప్రభుత్వంపై కూడా ఆ దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట. ముందుగా భారత్తో మ్యాచ్ ఆడమని ప్రకటించడమెందుకు, ఆతర్వాత తిరిగి ఆడటమెందుకని దుమ్మెత్తిపోస్తున్నారట. దేశ ప్రజల నుంచి ఒత్తిడి అధికం కావడంతో బాబర్, అఫ్రిది సహా మరికొంత మంది ఆటగాళ్లపై వేటు వేయాలని పాక్ ప్రభుత్వం పీసీబీకి సిఫార్సు చేసినట్లు వినికిడి.పాక్ ప్రజలు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నట్లు తెలుస్తుంది. టీమిండియా విషయంలో నఖ్వీ మొదటి నుంచి ఓవరాక్షన్ చేస్తున్నాడని మెజార్జీ పాక్ క్రికెట్ అభిమానులు అనుకుంటున్నట్లు సమాచారం. నఖ్వీని పీసీబీ అధ్యక్ష హోదాతో పాటు మంతివర్గం నుంచి కూడా బహిష్కరించాలని పాక్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయట. నఖ్వీ భారత్ చేతిలో ఓటమి తర్వాత తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు పలువురు పాక్ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ మైక్ హెస్సన్ను కూడా పరుష పదజాలంతో మందలించాడని తెలుస్తుంది.కాగా, భారత్తో మ్యాచ్లో పాక్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 61 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్, యూఎస్ఏపై అతికష్టం మీద గెలిచిన పాక్.. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో యూఎస్ఏ తర్వాత మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 18న నమీబియాతో మ్యాచ్ ఆటుఇటైతే పాక్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. అదే జరిగితే భారత్తో పాటు యూఎస్ఏ సూపర్-8కు చేరుకుంటుంది. -
T20 WC 2026: ఇంగ్లండ్ను భయపెట్టిన మరో పసికూన
టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్కు ప్రతి మ్యాచ్ గండంగా నడుస్తుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లీష్ టీమ్ను ప్రతి జట్టూ భయపెడుతుంది. తొలి మ్యాచ్లో నేపాల్ చేతిలో ఘోర పరాభవాన్ని వెంట్రుకవాసిలో తప్పించుకున్న బ్రూక్ సేన.. ఇవాళ (ఫిబ్రవరి 16) మరో పసికూన ఇటలీ చేతిలోనూ ఇంచుమించు అదే అనుభవాన్ని ఎదుర్కొంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఇటలీ, క్రికెట్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్ను భయపెట్టింది. అనుభవాన్నంతా రంగరించి ఈ ఇంగ్లండ్ బయటపడింది కానీ, ఏమరపాటుగా ఉండి ఉంటే మాత్రం చుక్కెదురయ్యేదే.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు ఎంచుకున్న ఇంగ్లండ్ను ఇటలీ బౌలర్లు తొలుత తెగ ఇబ్బంది పెట్టారు. ఆది నుంచి వరుస విరామాల్లో ఇంగ్లండ్ వికెట్లు తీశారు. ఆఖర్లో విల్ జాక్స్ (22 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకోబట్టి ఇంగ్లండ్ గట్టెక్కింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లను ఇటలీ బౌలర్లు ఏమాత్రం కుదురుకోనివ్వలేదు. కొన్ని పరుగులు చేసేలోపే వికెట్లు తీశారు. జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే ఇంగ్లండ్ 200 పరుగుల మార్కును తాకలేకపోయేది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో సాల్ట్ 28, బట్లర్ 3, బేతెల్ 23, బాంటన్ 30, బ్రూక్ 14, సామ్ కర్రన్ 25, ఓవర్టన్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఇటలీ బౌలర్లలో స్టీవార్ట్, కలుగమగే చెరో 2, స్మట్స్, అలీ హసన్, బెన్ మనెంటి తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇటలీ ఆదిలో తడబడినప్పటికీ.. బెన్ మనెంటి (60), జస్టిన్ మోస్కా (43), గ్రాంట్ స్టివర్ట్ (45) ఇంగ్లండ్ శిబిరంలో గుబులు రేపారు. మనెంటి.. మోస్కాతో కలిసి నాలుగో వికెట్కు 92 పరుగులు జోడించి ఇంగ్లండ్ను భయపెట్టాడు. బెన్ మనెంటి క్రీజ్లో ఉన్నంతసేపు ఇంగ్లండ్ ఫ్యాన్స్ వణికిపోయారు. మనెంటి భారీ సిక్సర్లు బాదుతూ ఇంగ్లండ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మనెంటి ఔటయ్యాక కూడా ఇటలీ కాసేపు పోరాడింది. అయితే ఈ దశలో ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకొని మ్యాచ్పై పట్టు సాధించారు. ఇటలీ పని అయిపోయిందన్న దశలో స్టీవర్ట్ తన మెరుపు విన్యాసాలతో మరోసారి ఇంగ్లండ్ను దడదడలాడించాడు. స్టీవర్ట్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడి ఎనిమిదో వికెట్కు జస్ప్రీత్ సింగ్తో కలిసి 18 బంతుల్లోనే 40 పరుగులు జోడించాడు.దీంతో ఇటలీ గెలుపుకు 12 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. స్టీవర్ట్ ఉన్న ఊపులో ఇటలీ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఈ సమయంలో సామ్ కర్రన్ స్టీవర్ట్ వికెట్ తీసి ఇంగ్లండ్ను ఊపిరి పీల్చుకునేలా చేశాడు. 19 ఓవర్లో కర్రన్ రెండు వైడ్లు వేసినా, మరో 3 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన స్టీవర్ట్ వికెట్ తీశాడు. అక్కడే ఇంగ్లండ్కు గెలుపుపై ఆశలు చిగురించాయి. కర్రన్ ఇచ్చిన ఊపుతో చివరి ఓవర్లో ఓవర్టన్ రెచ్చిపోయాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీసి ఇటలీని ఆలౌట్ చేశాడు. తద్వారా ఇటలీ 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సూపర్-8కు అర్హత సాధించగా.. ఇటలీ ఓడినా, గర్వంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇటలీ తమకంటే చాలారెట్లు మెరుగైన నేపాల్పై సంచలన విజయం సాధించి, క్రికెట్ ప్రపంచాన్ని మెప్పించింది. -
పాకిస్తాన్ మ్యాచ్లో శివుడి ప్రతిమ ఉన్న వాచ్ ధరించిన హార్దిక్.. ధర ఎంతో తెలుసా..?
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు లగ్జరీ వాచ్ల పట్ల ఉన్న పిచ్చి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బరోడా ఆటగాడు ప్రపంచంలో దొరికే దాదాపు అన్ని ఖరీదైన వాచ్లు తన కలెక్షన్లో కలిగి ఉన్నాడు. తాజాగా హార్దిక్ ధరించిన మరో లగ్జరీ వాచ్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నిన్న (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా దాయాది పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ Jacob & Co. Epic X Chrono 44mm Titanium వాచ్ ధరించి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఈ వాచ్ ధర భారత మార్కెట్లో రూ. 29 లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు ఉంటుందని అంచనా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. వాచ్ డయల్పై శివుడి ప్రతిమ చెక్కబడినట్లు తెలుస్తుంది. నిన్న శివరాత్రి కావడంతో హార్దిక్ తన భక్తిని ఈరకంగా చాటుకున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు.హార్దిక్ వాచ్ల కలెక్షన్హార్దిక్ వాచ్ల కలెక్షన్ గురించి గతంలో చాలా విషయాలు విన్నాం. అతని వద్ద రూ. 100 కోట్ల విలువ గల లగ్జీర వాచ్ల కలెక్షన్ ఉంటుందని అంచనా. గతంలో హార్దిక్ ధరించిన అతి ఖరీదైన వాచ్లపై ఓ లుక్కేద్దాం.- Richard Mille RM 27-04 – ధర ₹20 కోట్లు (2025 ఆసియా కప్ ట్రైనింగ్ సమయంలో ధరించాడు) - Richard Mille RM 27-02 – ధర ₹7 కోట్లు (2026 ప్రారంభంలో కనిపించాడు). - Richard Mille RM 56-03 Blue Sapphire – ధర ₹53–54 కోట్లు (ప్రపంచంలో ఈ వాచ్లు కేవలం మూడు మాత్రమే తయారు చేశారు). - Rolex Daytona Rainbow – ధర ₹4–5 కోట్లు (సఫైర్లు, డైమండ్లతో అలంకరించిన వాచ్).- Audemars Piguet Royal Oak – ధర ₹3.25 కోట్లు (డబుల్ బ్యాలెన్స్ వీల్ ఓపెన్వర్క్డ్ & పర్పెచువల్ క్యాలెండర్ (18K రోజ్ గోల్డ్). - Rolex Eye of the Tiger – ధర ₹2–2.5 కోట్లు (ప్రత్యేకమైన Rolex Cosmograph Daytona)భారత్-పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ హార్దిక్ బ్యాట్తో ప్రభావం చూపించలేకపోయినా, బంతితో సత్తా చాటాడు. 3 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్ (తొలి ఓవరే) కూడా ఉంది. ఈ మ్యాచ్లో అతను ఓ క్యాచ్ కూడా పట్టాడు. బ్యాట్తో రాణించకపోయినా, బంతితో మెరిసి హార్దిక్ భారత గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో భారత్ పాక్పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సూపర్-8కు అర్హత సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్లు కలిసికట్టుగా రాణించి పాక్ను 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూల్చారు. భారత గెలుపులో ప్రధానపాత్ర పోషించిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
న్యూజిలాండ్కు కొత్త కెప్టెన్
న్యూజిలాండ్ మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. స్టార్ ఆల్రౌండర్ అమేలియా కెర్ ఆ జట్టు నూతన ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా నియమించబడింది. సోఫీ డివైన్ గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో కెర్ న్యూజిలాండ్ సారధిగా బాధ్యతలు చేపట్టింది.25 ఏళ్ల కెర్ 2016లో 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కుడి చేతి వాటం బ్యాటర్, లెగ్ స్పిన్నర్ అయిన కెర్.. ఇప్పటివరకు 84 వన్డేలు, 88 టీ20లు ఆడింది. వన్డేల్లో 4 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 2304 పరుగులు చేసింది. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా (232*) ఉంది. అలాగే బౌలింగ్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా 106 వికెట్లు తీసింది. టీ20ల్లో 100కు పైగా స్ట్రయిక్రేట్తో, 5 హాఫ్ సెంచరీల సాయంతో 1453 పరుగులు చేసిన కెర్.. బౌలింగ్లో 2 నాలుగు వికెట్ల ప్రదర్శనల సాయంతో 95 వికెట్లు తీసింది.కెర్ 2024 టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకుంది. అదే ఏడాది ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకొని, ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ ప్లేయర్ అయ్యింది. కెర్ న్యూజిలాండ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా ఎంపికైన తర్వాత భావోద్వేగానికి లోనైంది. న్యూజిలాండ్ తరఫున ఆడటం నా చిన్ననాటి కల. ఇప్పుడు కెప్టెన్గా అవకాశం రావడం గొప్ప గౌరవమని పేర్కొంది. ఈ జట్టులో ఉన్న ప్రతిభ, కృషి, అంకితభావం నన్ను ఉత్సాహపరుస్తున్నాయి. మనం కలిసి గొప్ప విజయాలు సాధించగలమని నమ్ముతున్నాను అంటూ కెర్ సోషల్మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.కెర్ ఎంపికపై ఆ జట్టు హెడ్ కోచ్ బెన్ సాయర్ హర్షం వ్యక్తం చేశారు. కెర్ జట్టులో గౌరవం పొందిన నాయకురాలు. ఆమె నాయకత్వం న్యూజిలాండ్ మహిళల క్రికెట్ భవిష్యత్తుకు స్థిరత్వం, నిరంతరతను ఇస్తుందని అన్నారు. కెర్ తన కెప్టెన్సీ కెరీర్ను జింబాబ్వేతో జరిగే హోమ్ సిరీస్తో ప్రారంభించనుంది. ఫిబ్రవరి 25న సెడ్డన్ పార్క్లో జరిగే మొదటి టీ20 ఈ సిరీస్ మొదలవుతుంది. కెర్ ముందున్న సవాళ్లు - 2026లో ఇంగ్లండ్లో T20 ప్రపంచకప్ నిలబెట్టుకోవడం. - 2027లో శ్రీలంకలో ICC T20 ఛాంపియన్స్ ట్రోఫీ. - 2028లో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్, T20 ప్రపంచకప్. -
పెళ్లి పీటలెక్కబోతున్న ఇషాన్ కిషన్
టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్తో బిజీగా ఉన్న అతను.. మెగా టోర్నీ ముగిసాక తన ప్రేయసి అదితి హుండియాను మనువాడబోతున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఇషాన్ తాత అనురాగ్ పాండే స్వయంగా వెల్లడించారు. ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ.. ఇషాన్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, తాము అంగీకరించేందుకు సిద్దంగా ఉన్నాము. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్ పేరు అదితి. ఆమె ఓ మోడల్. పిల్లలను సంతోషపెట్టే వాటిని పెద్దలు అంగీకరించాలని అన్నాడు.#WATCH | Aurangabad, Bihar | Grandfather of Indian Cricketer Ishan Kishan, Anurag Pandey says, "...We are ready to accept whoever Ishan Kishan wants to marry. Aditi is his girlfriend...She is a model...One should accept what makes children happy..." (14.03) pic.twitter.com/narb5aZHtx— ANI (@ANI) February 14, 2026ఇషాన్కు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. ఇషాన్ నిన్న (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్పై చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ప్రధాన కారణంగా భారత్ పాక్ను 61 పరుగుల తేడాతో చిత్తు ఓడించింది. తన విధ్వంసకర ప్రదర్శనకు గానూ ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టులోకి అనూహ్యంగా వచ్చిన ఇషాన్ అంచనాలకు మించి రాణిస్తూ.. భారత క్రికెట్ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నాడు.పాక్పై వీరబాదడు తర్వాత ఇషాన్ పెళ్లి ప్రస్తావన రావడం అభిమానులకు జోష్నిస్తుంది. వాస్తవానికి ఇషాన్-అదితి బంధంపై చాలా రోజులుగా సోషల్మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండేవి. కొందరు వీరిని ప్రేమికులంటే, మరికొందరు కేవలం స్నేహితులు మాత్రమేనని అన్నారు. ఇషాన్ తాత తాజా ప్రకటనతో ఇషాన్-అదితి బంధం బహిర్గతమైపోయింది. పెళ్లిపై ఇషాన్ కాని, అదితి కాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, ఇరు కుటుంబాల్లో పెళ్లి చర్చలు మొదలయ్యాయనే విషయం సుస్పష్టమైంది.ఎవరీ అదితి హుండియా..?ఇషాన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా చెప్పుకుంటున్న అదితి హుండియా జైపూర్కు చెందిన ఓ ప్రముఖ మోడల్. ఈ అమ్మాయి 1997 జనవరి 15న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. అదితి జైపూర్లోని ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించింది. అదితి పాఠశాల విద్యను ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ జైపూర్లో అభ్యసించింది. జైపూర్లోని సెయింట్ జేవియర్ ఇన్స్టిట్యూట్లో కాలేజీ విద్యను పూర్తి చేసింది. అదితికి మోడలింగ్ అంటే పిచ్చి. ఆమె 2016లో ఎలైట్ మిస్ రాజస్థాన్ రన్నరప్గా నిలిచింది. ఆతర్వాత 2018 మిస్ దివా కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2017 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్గా నిలిచింది. 2018లో మిస్ సుప్రానేషనల్ ఇండియా టైటిల్ను గెలుచుకుంది. అదితికి ఫ్యాషన్ రంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. ఆమెకు సోషల్ మీడియాలో 2.7 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అదితి మోడల్గా, ఇన్ఫ్లూయెన్సర్గా నెటిజన్లకు సుపరిచితురాలు. అదితి 2019లో Pehla Wargi అనే వీడియో ఆల్బమ్లోనూ నటించింది.ఇషాన్-అదితి మధ్య బంధం 2019 ఐపీఎల్ సమయంలో బయటపడింది.అప్పటి నుంచి ఆమె తరుచూ ఇషాన్తో కనిపించేది. తాజాగా పెళ్లి ప్రస్తావన రావడంతో అదితి ఎవరనే విషయాన్ని క్రికెట్ అభిమానులు గూగుల్ చేయడం మొదలుపెట్టారు. -
ప్రపంచకప్ జట్టులో స్టీవ్ స్మిత్
ఆసీస్ దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులోకి లేటుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ముందుగా అనుకున్నట్లు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్కు ప్రత్యామ్నాంగా కాదు. స్మిత్ ఆసీస్ వరల్డ్కప్ టీమ్లోకి పేసర్ జోష్ హాజిల్వుడ్కు రీప్లేస్మెంట్గా వచ్చాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.కాలి గాయంతో బాధపడుతున్న హాజిల్వుడ్ సూపర్-8 సమయానికంతా కోలుకుంటాడని ముందుగా భావించారు. అయితే ఇలా జరగకపోగా.. హాజిల్వుడ్ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. హాజిల్వుడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడం వల్లనే ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించినట్లు సీఏ తెలిపింది.ఆసీస్ సెలెక్టర్లు స్పెషలిస్ట్ పేసర్ అయిన హాజిల్వుడ్ స్థానాన్ని స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన స్టీవ్తో భర్తీ చేయడం ఆసక్తికరంగా మారింది. పైగా స్టీవ్ అంతర్జాతీయ టీ20 ఆడక ఏడాదైపోయింది. టీ20 ప్రపంచకప్లో అతని చివరి ప్రదర్శన 2022లో వచ్చింది. స్టీవ్కు టీ20 ప్రపంచకప్తో పాటు యావత్ టీ20 ఫార్మాట్లోనే పెద్ద ట్రాక్ రికార్డు లేదు. అయితే స్టీవ్ ఎంపిక గత రికార్డులను చూసి కాకుండా, అతని తాజా బీబీఎల్ ప్రదర్శన ఆధారంగా జరిగింది. స్టీవ్ ఇటీవల ముగిసిన బీబీఎల్లో 59.80 సగటున, 167.97 స్ట్రయిక్రేట్తో 299 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే, ప్రస్తుత ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొని సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టీవ్ ఎంట్రీ ఆసీస్కు ఏమేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి. మరోపక్క ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ సేవలను కూడా తొలి రెండు మ్యాచ్లకు కోల్పోయింది. మార్ష్ గాయం కారణంగా ఐర్లాండ్, జింబాబ్వే మ్యాచ్లకు అందుబాటులో లేడు. తొలుత స్టీవ్ను మార్ష్కు బ్యాకప్గా ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతమందుతున్న సమాచారం ప్రకారం, మార్ష్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తర్వాతి మ్యాచ్కు అందుబాటులోకి రానున్నాడు. ఆసీస్ తమ తదుపరి మ్యాచ్లో (ఫిబ్రవరి 16) శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆసీస్కు చాలా కీలకం. ఈ మ్యాచ్లో ఓడితే ఆ జట్టు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గ్రూప్-బిలో ఆసీస్ ప్రస్తుతం శ్రీలంక, జింబాబ్వే తర్వాత మూడో స్థానంలో ఉంది. శ్రీలంక మ్యాచ్ తర్వాత ఆసీస్ గ్రూప్ దశలో ఒమన్తో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 20న జరుగనుంది.అప్డేటెడ్ ఆసీస్ జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కనెల్లీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎలిస్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా -
పటిష్ట స్థితిలో అమెరికా.. పాక్ సూపర్-8 చేరాలంటే?
టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్పై తమదే పైచేయి అని టీమిండియా మరోసారి నిరూపించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో సల్మాన్ ఆఘా బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తాజా ఎడిషన్లో వరుసగా మూడో విజయం నమోదు చేసిన టీమిండియా.. గ్రూప్-ఎ నుంచి సూపర్-8కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.తదుపరి నెదర్లాండ్స్తో బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్లో టీమిండియా తలపడుతుంది. మరోవైపు.. గ్రూప్-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్తో అమెరికా పోటీ పడుతోంది. కాగా లీగ్ దశలో అమెరికా నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుంది.పటిష్ట స్థితిలో అమెరికాఇందులో భారత్, పాకిస్తాన్ చేతిలో ఓడిన అమెరికా జట్టు.. నెదర్లాండ్స్, నమీబియా జట్లపై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లు సాధించింది. నెట్రన్రేటు +0.787గా ఉంది. ఇక టీమిండియా చేతిలో భారీ తేడాతో పాక్ ఓడిపోవడంతో అమెరికా సూపర్-8 ఆశలు సజీవమయ్యాయి.ఈ నేపథ్యంలో అమెరికాను దాటి సూపర్-8కు చేరాలంటే పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో తప్పక గెలవాలి. కొలంబో వేదికగా నమీబియాపై పాక్ గెలిస్తేనే సూపర్-8కు చేరుతుంది. అయితే, ఇరుజట్లలో పాక్ పటిష్టమైనదే అయినా.. అత్యంత నిలకడలేని జట్టుగా పాకిస్తాన్కు చెడ్డపేరు ఉంది.పాక్ సూపర్-8 చేరాలంటే?మరోవైపు.. ఈ టోర్నీలో అమెరికా, జింబాబ్వే, ఇటలీ, నేపాల్ వంటి పసికూన జట్లు పటిష్ట జట్లకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అమెరికా టీమిండియాకు గట్టి పోటీనివ్వగా.. జింబాబ్వే మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. నేపాల్.. రెండుసార్లు చాంపియన్ అయిన ఇంగ్లండ్ను వణికించగా.. తొలిసారి వరల్డ్కప్ ఆడుతున్న ఇటలీ నేపాల్ను చిత్తు చేసింది.కాబట్టి నమీబియాతో మ్యాచ్లో పాక్ జాగ్రత్తగా ఆడితేనే సజావుగా సూపర్-8కు చేరుతుంది. లేదంటే.. గత ఎడిషన్ మాదిరే ఈసారి లీగ్ దశలోనే నిష్క్రమించాల్సి ఉంటుంది. కాగా పాక్ తమ తొలి రెండు మ్యాచ్లలో నెదర్లాండ్స్, అమెరికాలను ఓడించి నాలుగు పాయింట్లు సంపాదించింది. నెట్రన్రేటు -0.403.నెట్రన్రేటు పరంగాకాబట్టి నమీబియాతో మ్యాచ్లో నెగ్గితేనే ఆరు పాయింట్లతో పాక్ అమెరికాను దాటి సూపర్-8లో అడుగుపెట్టగలదు. ఒకవేళ నమీబియా చేతిలో ఓడితే గనుక అమెరికాతో సమానంగా నాలుగు పాయింట్లు ఉన్నా నెట్రన్రేటు పరంగా యూఎస్ మెరుగ్గా ఉంది. కాబట్టి అక్కడా పాకిస్తాన్కు ప్రమాదమే పొంచి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి వెస్టిండీస్, టీమిండియా మాత్రమే సూపర్-8 బెర్తులను అధికారికంగా ఖరారు చేసుకున్నాయి.చదవండి: అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు, ఈ జనరేషన్ అత్యుత్తమ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. యావత్ పొట్టి ఫార్మాట్లో (అంతర్జాతీయ టీ20లు, ప్రైవేట్ లీగ్లు) 700 వికెట్ల మైలురాయిని తాకిన తొలి బౌలర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. 2015లో కెరీర్ మొదలుపెట్టిన రషీద్ టీ20 ఫార్మాట్లో 517 మ్యాచ్లు ఆడాడు. ఇందులో అతని సగటు 18.5 కాగా.. ఎకానమీ 6.59గా ఉంది. రషీద్ తన టీ20 కెరీర్లో 5 వికెట్ల ఘనతలు నాలుగు సార్లు.. 4 వికెట్ల ఘనతలు 18 సార్లు నమోదు చేశాడు. రషీద్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు 6-17గా ఉన్నాయి. రషీద్ తన జాతీయ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో పాటు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో టీ20 క్రికెట్ ఆడాడు. అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ తర్వాతి స్థానాల్లో (టాప్-5) విండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో, విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ (613), సౌతాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (572), విండీస్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ (508) ఉన్నారు. రషీద్ ఖాతాలో అత్యధిక టీ20 వికెట్ల రికార్డుతో పాటు చాలా ఆల్టైమ్ గ్రేట్ రికార్డులు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో రషీద్ నాలుగు హ్యాట్రిక్లు నమోదు చేశాడు. రషీద్ తన టీ20 కెరీర్లో 432 మంది స్పెషలిస్ట్ బ్యాటర్లను ఔట్ చేశాడు. టీ20ల్లో ఏ బౌలర్ ఇంతమంది స్పెషలిస్ట్ బ్యాటర్లను ఔట్ చేయలేదు. అలాగే రషీద్ భారత్, యూఏఈ, ఆస్ట్రేలియా దేశాల్లో 100కు పైగా వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా ఎవరూ సాధించలేదు. రషీద్ ఒక్క ఆసియా ఖండంలోనే 400కు పైగా వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా ఎవరి వల్ల కాలేదు. 2017 నుంచి 2025 వరకు రషీద్ ప్రతి ఏడాది కనీసం 50 వికెట్లు తీశాడు. ఇది కూడా ఎవరూ సాధించలేదు. బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ ద్వారా రషీద్ 379 వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా కేవలం రషీద్కు మాత్రమే సొంతం. ఫస్ట్క్లాస్ క్రికెట్లో విలియం లిల్లీవైట్, లిస్ట్-ఏ క్రికెట్లో వసీం అక్రమ్, టీ20 ఫార్మాట్లో రషీద్ ఖాన్ 700 వికెట్ల మైలురాయిని తాకిన తొలి బౌలర్లు.మ్యాచ్ విషయానికొస్తే.. యూఏఈపై ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. షోయబ్ ఖాన్ (68) అర్ద సెంచరీతో రాణించగా.. అలీషాన్ షరాఫు (40) పర్వాలేదనిపించాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 4 వికెట్లతో చెలరేగాడు. ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించారు. ఈ వికెటే రషీద్కు టీ20ల్లో 700వ వికెట్.అనంతరం బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇబ్రహీం జద్రాన్ (53) ఆఫ్ఘన్ గెలుపుకు పునాది వేయగా.. ఒమర్జాయ్ (40 నాటౌట్) తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. -
భారత్ చేతిలో ఓడినా.. చరిత్ర సృష్టించిన పాక్
టీమిండియా చేతిలో ఓడినా పాకిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో రెండుసార్లు 18 ఓవర్లపాటు స్పిన్ బౌలింగ్నే ప్రయోగించిన తొలి జట్టుగా నిలిచింది.స్పిన్ దళంపైనే నమ్మకంటీ20 వరల్డ్కప్-2026 టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్ ఆదివారం టీమిండియాతో తలపడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. తమ స్పిన్ దళంపైనే ఎక్కువగా ఆధారపడింది. స్పెషలిస్టు స్పిన్నర్లలో ఉస్మాన్ తారిఖ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 24 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయగా.. అబ్రార్ అహ్మద్ మూడు ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చుకున్నాడు.ఇక బ్యాటింగ్ ఆల్రౌండర్లు సల్మాన్ ఆఘా రెండు ఓవర్లు వేసి 10 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా.. నాలుగు ఓవర్ల కోటాలో సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు షాదాబ్ ఖాన్ ఒక ఓవర్ వేసి 17 రన్స్, మొహమ్మద్ నవాజ్ 4 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.షాహిన్ ఆఫ్రిది విఫలంఇలా నిర్ణీత 20 ఓవర్లలో 18 ఓవర్లు పాక్ స్పిన్నర్లే వేయగా.. ఏకైక పేసర్ షాహిన్ ఆఫ్రిది రెండు ఓవర్లు వేసి ఏకంగా 31 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా పాక్ ఇలా స్పిన్ దళాన్నే నమ్ముకోవడం ఇదే తొలిసారి కాదు. 2012 టీ20 వరల్డ్కప్ టోర్నీలో ఆస్ట్రేలియా మీద కూడా ఇదే తరహాలో ఇదే వేదికపై స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించింది పాక్.తద్వారా పొట్టి వరల్డ్కప్ ఈవెంట్లో అత్యధికంగా రెండుసార్లు 18 ఓవర్లు స్పిన్ వేయించిన తొలి జట్టు పాకిస్తాన్ నిలిచింది. కాగా కొలంబో పిచ్ స్పిన్కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. ఇక భారత్తో మ్యాచ్లో పాక్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.టీమిండియా ఇలాఈ మ్యాచ్లో పాక్ ప్రధానంగా స్పిన్ను నమ్ముకుంటే.. టీమిండియా పేసర్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. భారత పేసర్లలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.ఇక స్పిన్నర్లలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ మూడు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టగా.. పార్ట్టైమ్ స్పిన్నర్లు తిలక్ వర్మ రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ తీయగా.. రింకూ సింగ్ ఒక ఓవర్లో 9 పరుగులు సమర్పించుకున్నాడు.ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్కప్ ఎడిషన్లో పాకిస్తాన్ యూఎస్ఏతో మ్యాచ్లో కూడా ఏకంగా 16 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేయించడం గమనార్హం.చదవండి: అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు -
భీకర ఫామ్.. ఈసారి డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ ఎలైట్ 2025-26 సెమీ ఫైనల్లో కర్ణాటక కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వన్డౌన్లో వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రంజీ ట్రోఫీ తాజా సీజన్లో తొలి సెమీస్ మ్యాచ్లో కర్ణాటక- ఉత్తరాఖండ్ (karnataka vs uttarakhand) తలపడుతున్నాయి. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం మ్యాచ్ మొదలుకాగా.. మాజీ చాంపియన్ కర్ణాటక కర్ణాటక భారీ స్కోరు దిశగా సాగుతోంది.తొలిరోజే ఆధిపత్యంఇక ఈ దేశీ ఫస్ట్క్లాస్ టోర్నీ తొలిసారి సెమీఫైనల్ చేరిన ఉత్తరాఖండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన కర్ణాటక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 355 పరుగులు సాధించింది. టీమిండియా స్టార్లు కేఎల్ రాహుల్ (KL Rahul- 141; 11 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (148 బ్యాటింగ్; 16 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో అదరగొట్టారు.ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal- 5) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా... రాహుల్, పడిక్కల్ రెండో వికెట్కు 278 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. రాహుల్ అవుటయ్యాక వచ్చిన కరుణ్ నాయర్ (37 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా నిలకడ కనబరిచాడు.రెండో రోజు కెప్టెన్ డబుల్ సెంచరీ పూర్తిఈ నేపథ్యంలో 355/2 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన కర్ణాటక.. 125 ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్ల నష్టానికి 512 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ పడిక్కల్ 330 బంతుల్లో 29 ఫోర్లు, మూడు సిక్స్లు బాది 232 పరుగులు చేశాడు.పడిక్కల్ ఫస్ట్క్లాస్ కెరీర్లో డబుల్ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక కరుణ్ నాయర్ అర్ధ శతకం (105 బంతుల్లో 60) బాదగా.. శ్రేయస్ గోపాల్ డకౌట్ (0) అయ్యాడు. మిగిలిన వారిలో స్మరణ్ రవిచంద్రన్ 33, వికెట్ కీపర్ బ్యాటర్ కృతిక్ క్రిష్ణ 15 పరుగులతో క్రీజులో నిలిచారు. ఉత్తరాఖండ్ బౌలర్లలో ఆదిత్యా రావత్ మూడు వికెట్లు తీయగా.. అభయ్ నేగి, లక్ష్య రాజేశ్ రాయ్చందాని తలా ఒక వికెట్ పడగొట్టారు.సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న పడిక్కల్టీమిండియాకు దూరమైన పడిక్కల్ దేశీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో పుదుచ్చేరి, త్రిపుర జట్లపై వరుస శతకాలు బాదిన ఈ కర్ణాటక స్టార్.. అనంతరం రాజస్తాన్ (91), ముంబై (81 నాటౌట్) జట్లపై కూడా రాణించాడు. ఇక రంజీ ఎడిషన్లో చివరగా పంజాబ్తో మ్యాచ్లో సెంచరీ చేసిన పడిక్కల్.. తాజాగా సెమీ ఫైనల్లో ఉత్తరాఖండ్పై ‘ద్వి’శతక్కొట్టం విశేషం.చదవండి: IND vs PAK: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్ కెప్టెన్A captain’s masterpiece! 🎨Watch the moment Devdutt Padikkal brings up his maiden First-Class double ton 💯💯He soaks in the applause as the dressing room rises to acknowledge a special knock 👏Updates ▶️ https://t.co/SztwjvwUiI#RanjiTrophy @IDFCFIRSTBank @devdpd07 pic.twitter.com/0Qaa5DNU9z— BCCI Domestic (@BCCIdomestic) February 16, 2026 -
అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అడుగుపెట్టిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. విధ్వంసకర బ్యాటర్గా పేరొందిన అభిషేక్.. వరల్డ్కప్ టోర్నీలో ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్లలో పరుగుల ఖాతా తెరవనే లేదు.అగ్రస్థానంలో అభిషేక్పసికూన అమెరికాతో మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. తాజాగా పాకిస్తాన్తో ఆదివారం నాటి మ్యాచ్లో నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా చుట్టాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) బౌలింగ్లో షాహిన్ ఆఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అభిషేక్ శర్మ ఇలా విఫలం కావడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.అయితే, టీ20 వరల్డ్కప్లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు దూసుకెళ్లడంతో అభిషేక్ వైఫల్యాలపై పెద్దగా చర్చ జరగడం లేదు. లేదంటే అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తేవి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి అభిషేక్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రవిశాస్త్రి సూచనలు‘‘అతడి నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన రావాల్సి ఉంది. అందుకు ఇంకొంత సమయం పట్టవచ్చు. ఆటగాడి కెరీర్లో ఇలాంటివి సహజమే. అయితే, ఇందుకోసం ముందుగా అతడు తన పొరపాట్లు సరిచేసుకోవాలి.క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త సమయం తీసుకోవాలి. వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. ఎందుకంటే.. డాట్ బాల్స్ను బౌండరీలు, సిక్సర్లుగా మలచడం అతడికి కొత్తేమీ కాదు. ఇందుకు అతడు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.ఏదేమైనా క్రీజులో కుదురుకున్న తర్వాతే పని మొదలుపెట్టాలి’’ అని రవిశాస్త్రి అభిషేక్ శర్మకు సూచనలు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. పాక్పై టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. సూపర్-8లో అడుగుపెట్టింది.అంతకు ముందు తొలుత అమెరికా.. అనంతరం నమీబియా జట్లపై టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ శర్మ దూరమయ్యాడు. పాక్తో మ్యాచ్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చి డకౌట్ అయి నిరాశపరిచాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. కాగా అభిషేక్ శర్మ కెరీర్లో ఇదే తొలి వరల్డ్కప్ అన్న సంగతి తెలిసిందే.చదవండి: IND vs PAK: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్ కెప్టెన్ -
పనికిరాని వ్యక్తిని నమ్ముకుంటే ఇంతే: అక్తర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ తీరుపై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. అసమర్థులైన వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆట పట్ల కనీస అవగాహన లేని వ్యక్తిని చైర్మన్ చేయడం అన్నిటికంటే పెద్ద నేరం అంటూ ఘాటు విమర్శలు చేశాడు.61 పరుగుల తేడాతో చిత్తుకాగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా మిశ్రమ ఫలితాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2026లో పసికూనలు నెదర్లాండ్స్, అమెరికాలపై గెలిచిన సల్మాన్ ఆఘా బృందం.. టీమిండియా ముందు మరోసారి తలవంచింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో 61 పరుగుల తేడాతో చిత్తు ఓడిపోయింది.ఫలితంగా తదుపరి నమీబియాపై భారీ విజయం సాధిస్తేనే సూపర్-8 అవకాశాలను పాక్ సజీవం చేసుకోగలదు. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ పీసీబీ చైర్మన్, మంత్రి మొహ్సిన్ నక్వీ (Mohsing Naqvi) విధానాలను ఘాటుగా విమర్శించాడు.పనికిరాని వ్యక్తులు.. వీరిని నమ్ముకుంటే ఇంతే‘‘షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) గంటకు 125 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. ఆధునిక క్రికెట్లో ఇలాంటి చెత్త టాలెంట్ అవసరం లేదు. ఇక ఇంకో ప్లేయర్ (బాబర్ ఆజం)ను సూపర్ స్టార్ చేస్తారు. కానీ అతడు మీకోసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేడు.ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆయనకు అసలు తాను పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ని అన్న విషయం గుర్తుందో లేదో కూడా తెలియదు. అలాంటి పనికిరాని వ్యక్తులు జట్టును ఎలా రన్ చేయగలరు? ఈ ప్రపంచంలో అసమర్థ వ్యక్తిని అందలం ఎక్కించడమే అన్నిటికంటే పెద్ద నేరం. అర్హత లేని వాళ్లకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది.ఆయనొక అసమర్థుడు.. ఆట పట్ల ఏమాత్రం అవగాహన లేని వాడు. గత 15-20 ఏళ్లుగా పాక్ క్రికెట్ను ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు. టీమిండియాను ఓడించడం మనకు ఓ కలగానే మిగిపోయింది’’ అని అక్తర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.గతేడాది అలాఅదే విధంగా.. సీనియర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది, షాదాబ్ ఖాన్ వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు ఇవ్వడం ఏమిటని అక్తర్ ప్రశ్నించాడు. కాగా పాక్పై గెలుపుతో హ్యాట్రిక్ విజయం అందుకున్న టీమిండియా సూపర్-8కు చేరగా.. పాక్ రాత తదుపరి మ్యాచ్ ఫలితంతో తేలుతుంది. కాగా గత వరల్డ్కప్ ఎడిషన్లో పాకిస్తాన్ సూపర్-8 కూడా చేరకుండానే గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.చదవండి: నీకసలు బుద్ధి ఉందా?.. కుల్దీప్ యాదవ్పై హార్దిక్, సూర్య ఫైర్"THEY CANNOT PLAY HIM!" 🔥Jasprit Bumrah gets Saim Ayub & Salman Agha out in the same over! Pakistan are 3 down 🥶ICC Men’s #T20WorldCup | #INDvPAK | LIVE NOW 👉https://t.co/SpqYo6n3dL pic.twitter.com/2mVlsnJBqI— Star Sports (@StarSportsIndia) February 15, 2026 -
అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్ కెప్టెన్
టీమిండియా చేతిలో పాకిస్తాన్కు మరోసారి పరాభవమే ఎదురైంది. భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ గొప్పలకు పోయి.. ఆ తర్వాత దిగివచ్చిన దాయాదికి సూర్య సేన దిమ్మతిరిగేలా షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్-2026లో పాక్ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసి మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది.ప్రధాన కారణం వాళ్లేఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) స్పందిస్తూ.. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మా స్పిన్నర్లపైనే నమ్మకం ఉంచాము. కానీ వారు రాణించలేకపోయారు. ప్రణాళికలను అమలు చేయడంలో మా వాళ్లు సఫలం కాలేదు. గత ఆర్నెళ్లుగా వారు విజయవంతమైన దళంగా కొనసాగుతున్నారు.కానీ ఇప్పుడు అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయారు. ఇక మా బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. పవర్ ప్లేలోనే 3-4 వికెట్లు కోల్పోవడం ప్రతికూల ప్రభావం చూపింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది.పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందనే టాస్ గెలిచిన తర్వాత నేను బౌలింగ్ ఎంచుకున్నాను. బంతిపై గ్రిప్పింగ్ కూడా బాగానే ఉంది. కానీ మా వాళ్లు తమ వ్యూహాల్ని అమలు చేయలేకపోయారు. పరిస్థితికి తగ్గట్లు మా వాళ్లు బౌలింగ్ చేయలేదు.బ్యాటింగ్ ఆర్డర్ కూడా విఫలంమా బ్యాటింగ్ ఆర్డర్ కూడా విఫలమైంది. ఇలాంటి మ్యాచ్లలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం సహజమే. అయితే, మేము ఇప్పటికే ఎంతో క్రికెట్ ఆడాము. మాకు ఇలాంటి పరిస్థితులు కొత్తేమీ కాదు. తదుపరి మ్యాచ్లో గెలిచి సూపర్ 8కు చేరాలని పట్టుదలగా ఉన్నాము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. సమిష్టి వైఫల్యం కారణంగానే తాము పరాజయం పాలయ్యామని పొరపాట్లను అంగీకరించాడు.వికెట్లు తీసినా..కాగా కొలంబోలో టాస్ గెలిచిన పాక్.. తొలుత బౌలింగ్ చేయగా.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో స్పిన్ ఆల్రౌండర్లు సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లు తీయగా.. సల్మాన్ ఆఘా ఒక వికెట్ తీశాడు, ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్, పేసర్ , షాహిన్ ఆఫ్రిది ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే, పాక్ స్పిన్నర్లు వికెట్లు తీసినా కూడా పరుగులు కూడా ఎక్కువే ఇచ్చుకోవడం గమనా ర్హం.పెవిలియన్కు క్యూ కట్టిన బ్యాటర్లుఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ డకౌట్ కాగా.. సయీబ్ ఆయుబ్ 6.. వన్డౌన్ బ్యాటర్ సల్మాన్ ఆఘా 4, తర్వాతి స్థానాల్లో వచ్చిన బాబర్ ఆజం 5 పరుగులకే పెవిలియన్ చేరారు.BIGGEST WIN FOR INDIA OVER PAKISTAN IN T20Is (61 runs)! 🤯With that, they make it 8-1 in #INDvPAK in the ICC Men's T20 World Cup and qualify for the Super 8! 👏Watch them next in ICC Men's #T20WorldCup | #INDvNED | WED, 18 FEB, 6 PM! pic.twitter.com/na6yc5i7Pz— Star Sports (@StarSportsIndia) February 15, 2026వికెట్ కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (44) మెరుగ్గా రాణించగా.. షాహిన్ ఆఫ్రిది 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వాళ్లంతా తేలిపోయారు. టీమిండియా బౌలర్లలో స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ తలా ఒక వికెట్ తీశారు. పేసర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు కూల్చారు.చదవండి: అతడు అత్యద్భుతం.. ఇది ఇండియా కోసం: సూర్య -
నీకసలు బుద్ధి ఉందా?.. కుల్దీప్పై హార్దిక్, సూర్య ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. గ్రూప్-ఎలో తొలుత అమెరికా.. తర్వాత నమీబియాలను ఓడించిన భారత్.. మూడో మ్యాచ్లో పాకిస్తాన్ చిత్తు చేసింది. దాయాదిపై ఏకంగా 61 పరుగుల తేడాతో నెగ్గి సూపర్-8 దశకు అర్హత సాధించింది.తటస్థ వేదికైన కొలంబోలో ఆదివారం నాటి మ్యాచ్లో సూర్య సేన ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. టాస్ ఓడి తొలుత నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసిన టీమిండియా.. పాక్ను 114 పరుగులకే ఆలౌట్ చేసింది.మొదలుపెట్టి.. తానే ముగించాడుభారత బ్యాటర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) అదరగొట్టగా.. బౌలర్లు సమిష్టిగా రాణించారు. పాక్ ఇన్నింగ్స్లో వికెట్ల వేట మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya)నే.. చివరి వికెట్ కూల్చి విజయంతో ముగించాడు. పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (0)ను వచ్చీరాగానే వెనక్కి పంపిన హార్దిక్.. ఆఖరిగా ఉస్మాన్ తారిఖ్ (0)ను పెవిలియన్కు పంపి టీమిండియాను గెలుపును ఖరారు చేశాడు.క్యాచ్లు డ్రాప్ చేసిన ఇషాన్, కుల్దీప్ ఈ క్రమంలో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)పై హార్దిక్ పాండ్యా సీరియస్ అయ్యాడు. పాక్ ఇన్నింగ్స్లో పదిహేడో ఓవర్లో పాండ్యా బౌలింగ్కు దిగగా.. తొలి బంతి వైడ్ అయింది. అనంతరం షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) ఇచ్చిన క్యాచ్ను ఇషాన్ డ్రాప్ చేశాడు.దీంతో లైఫ్ పొందిన ఆఫ్రిది.. హార్దిక్ బౌలింగ్లో రెండో బంతిని సిక్సర్గా మలిచాడు. నిజానికి లాంగాన్ వద్ద ఫీల్డింగ్ పొజిషన్లో ఉన్న కుల్దీప్ దానిని జారవిడిచాడు. చేతుల్లో పడిన బంతిని డ్రాప్ చేశాడు. దీంతో హార్దిక్ పాండ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.Hardik pandya didn’t spare Kuldeep yadav after that dropped the catch ! The frustration on Kuldeep yadav face says it all. pic.twitter.com/4qazJi9M1d— Indian First (@MaheshJain68174) February 16, 2026మీకసలు బుద్ధి ఉందా?ఇషాన్తో పాటు కుల్దీప్ వైపు చూపిస్తూ.. ‘ఏం జరిగినా మీ ఇద్దరే కారణం.. మీకసలు బుద్ధి ఉందా?’ అన్నట్లుగా ఫైర్ అయ్యాడు. ఇక ఆ ఓవర్లో ఐదో బంతికి ఆఫ్రిది ఒక పరుగు తీయగా.. ఆఖరి బంతికి పాండ్యా తారిఖ్ను బౌల్డ్ చేయడంతో పాక్ కథ ముగిసిపోయింది. టీమిండియా విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18 ఓవర్లలో కేవలం 114 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ये गलत है ! Feeling bad for Kuldeep Yadav 😭#IshanKishan #INDvsPAK pic.twitter.com/Z7BfPy85Fc— Amrita Yadav (@AmritaYada60221) February 15, 2026సూర్య సైతంఇక విజయానంతరం కరచాలనం చేసుకునే సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం కుల్దీప్ యాదవ్ను గట్టిగానే మందలించాడు. ఈ చైనామన్ స్పిన్నర్ సులువైన క్యాచ్ను వదిలేశాడన్న కోపంతో సూర్య.. అతడిని చులకన చేసి మాట్లాడినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా పాక్తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.చదవండి: IND vs PAK: తిలక్ వర్మపై గంభీర్ సీరియస్ -
అతడు అత్యద్భుతం.. ఇది ఇండియా కోసం: సూర్య
పాకిస్తాన్పై టీమిండియా మరోసారి విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆధిపత్యాన్ని 8-1కు పెంచుకుంది. కొలంబోలో తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయి సల్మాన్ బృందం చిత్తు కాగా.. సూర్య సేన టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశకు అర్హత సాధించింది.ఇది సార్ మా బ్రాండ్ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav).. దాయాదిపై గెలుపు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ విజయం ఇండియా కోసం. ఈ మ్యాచ్లో ఎలా ఆడాలని ప్రణాళికలు రచించామో వాటిని పక్కాగా అమలు చేశాము. మా బ్రాండ్ను కొనసాగించాము.అతడు అత్యద్భుతంగా ఆడాడుఈ వికెట్ మీద తొలుత బ్యాటింగ్ చేయడం మంచిదని అనుకున్నాం. అనుకున్నట్లుగానే టాస్ ఓడినా మాకు బ్యాటింగ్ చేసే అవకాశమే వచ్చింది. ఇక ఇషాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో నిలకడైన, అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఇషాన్.. టీమిండియా తరఫునా అదే విధంగా రాణిస్తున్నాడు.ఈరోజు అతడు అత్యద్భుతంగా ఆడాడు. ఊహించని రీతిలో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. తిలక్, రింకూ, శివం కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఇక్కడ 175 పరుగులు చేయడం మంచి విషయం. చేయాల్సిన దానికంటే ఇంకో 15-20 పరుగులు ఎక్కువే చేశామనుకుంటున్నాం.బౌలర్లు సమిష్టిగా రాణించారుఇక పవర్ ప్లేలో అక్షర్ పటేల్ బాధ్యత తీసుకున్నాడు. వరుణ్, కుల్దీప్ కూడా రాణించారు. జట్టులోని ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-ఎలో భాగంగా భారత్- పాక్ ఆదివారం కొలంబో వేదికగా తలపడ్డాయి. ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది.ఇషాన్ విధ్వంసంఓపెనర్లలో అభిషేక్ శర్మ డకౌట్ కాగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఇషాన్ కిషన్ మెరుపు అర్ధ శతకం (40 బంతుల్లో 77)తో రాణించాడు. తిలక్ వర్మ (25), కెప్టెన్ సూర్య (32), శివం దూబే(27) ఫర్వాలేదనిపించారు. ఇక లక్ష్య ఛేదనలో పాక్ కేవలం 114 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీయగా.. తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. పేసర్లలో బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాక్ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్ గ్రూప్-ఎ నుంచి సూపర్-8 చేరిన తొలి జట్టుగా నిలిచింది.చదవండి: IND vs PAK: తిలక్ వర్మపై గంభీర్ సీరియస్ -
హాకీలో మళ్లీ ఓడిన భారత్
రూర్కెలా: సొంతగడ్డపై భారత పురుషుల హాకీ జట్టు తమ నిరాశాజనక ప్రదర్శన కొనసాగించి వరుసగా నాలుగో పరాజయం చవిచూసింది. భారత అంచె పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్లో టీమిండియా 2–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున ఆదిత్య లలాగే (50వ నిమిషంలో), సంజయ్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. అర్జెంటీనా జట్టుకు టడియో మారుకి (28వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించగా... టొమాస్ డొమెనె (18వ నిమిషంలో), లూసియో మెండెజ్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా తదుపరి మ్యాచ్ల కోసం భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. హోబర్ట్ వేదికగా ఈనెల 21న స్పెయిన్తో, 22న ఆ్రస్టేలియాతో... 24న స్పెయిన్తో, 25న ఆ్రస్టేలియాతో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. -
సంజయ్, మోనాంక్ మెరుపులు
చెన్నై: భారత సంతతి ఆటగాళ్లు సంజయ్ కృష్ణ మూర్తి (33 బంతుల్లో 68; 4 ఫోర్లు, 6 సిక్స్లు), కెపె్టన్ మోనాంక్ పటేల్ (30 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ షోతో అదరగొట్టారు. ఫలితంగా టి20 ప్రపంచకప్లో అమెరికా జట్టు రెండో విజయం అందుకుంది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో అమెరికా 31 పరుగుల తేడాతో నమీబియాపై గెలిచింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్కు దిగిన అమెరికా నిరీ్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. మోనంక్, జహంగీర్ (22) ఓపెనింగ్ వికెట్కు 68 పరుగులు జోడించి మెరుపు ఆరంభమిచ్చారు. తర్వాత సంజయ్, మిలింద్ కుమార్ (28; 1 ఫోర్, 1 సిక్స్) నాలుగో వికెట్కు 87 పరుగులు జతచేశారు. ఈ రెండు భాగస్వామ్యాలు అమెరికా భారీస్కోరుకు బాట వేశాయి. నమీబియా బౌలర్లపై ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజయ్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. నమీబియా బౌలర్లలో విలెమ్, ఎరాస్మస్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి ఓడింది. లారెన్ స్టీన్కాంప్ (39 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. స్మిత్ (31; 1ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. షాడ్లే వాన్కు 2 వికెట్లు దక్కాయి. నిరీ్ణత నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకున్న అమెరికా రెండు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగు పాయింట్లు సాధించి గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానానికి చేరింది. -
T20 World Cup 2026: భారత్ ‘రుద్ర’ రూపం
‘విక్రమార్కుడు మళ్లీ వెనక్కి వెళ్లి ఆ శవాన్ని భుజాన వేసుకొని మళ్లీ నడక సాగించాడు... చందమామ కథలో బేతాళ ప్రశ్నకు విక్రమార్కుడు సరైన సమాధానం ఇవ్వగానే బేతాళుడు మళ్లీ చెట్టెక్కటం... ‘బేతాళ పంచ విశతి’లో మళ్లీ మళ్లీ ఇదే దృశ్యం, ఇదే సంవాదం... భారత్, పాకిస్తాన్ మధ్య వరల్డ్ కప్లో మ్యాచ్ అంటే దీనికి సరిగ్గా సరిపోతుంది! ఐసీసీ టోర్నీలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ తేదీ ప్రకటనతో హడావిడి మొదలు... ప్రత్యక్షంగా మైదానంలో చూడాలనుకునే అభిమానుల ఏర్పాట్లు ఒక వైపు... ప్రసారకర్తల ప్రకటనలు మరోవైపు... వ్యాఖ్యాతలు, విశ్లేషకుల తీవ్ర చర్చ... మ్యాచ్ సమీపిస్తున్న కొద్దీ ఎన్నో కథలు, కథనాలు, వివాదాలు... ఈ మ్యాచ్ లేకపోతే క్రికెట్ లేదన్నట్లుగా ఏమార్పు... ఒక రకమైన యుద్ధ వాతావరణం... ఇరు జట్ల బలాబలాల మధ్య ఉన్న అంతరం గురించి అందరికీ తెలుసు... ఫలితం ఎలా రావచ్చో కూడా అంచనాకు రావచ్చు... అయినా సరే మ్యాచ్ గురించి హంగామా... చివరకు ఎప్పటిలాగే భారత్దే విజయం.పిచ్ బ్యాటింగ్కు తగినంత అనుకూలంగా లేదు... బంతి ఆగుతూ నెమ్మదిగా వస్తోంది. భారత్ ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలో ఇది కనిపించింది కూడా. కానీ ఆరంభంలో ఇషాన్ కిషన్ చూపించిన దూకుడు పిచ్ను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. మిగతా జట్టంతా కలిసి ఎక్స్ట్రాలు సహా 80 బంతుల్లో 98 పరుగులు రాబడితే... ఇషాన్ ఒక్కడే మిగిలిన 40 బంతుల్లో 77 పరుగులు చేసి మ్యాచ్లో అసలు తేడా ఏంటో చూపించాడు. టి20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై అత్యధిక స్కోరు నమోదు చేసిన తర్వాత ప్రత్యరి్థని నిలువరించడం భారత్కు ఏమాత్రం కష్టం కాలేదు. ఆరుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టగా, సమష్టి ప్రదర్శనతో పాక్ను టీమిండియా కుప్పకూలి్చంది. ఐదు ఓవర్ల లోపే టాప్–4 వికెట్లు కోల్పోయిన పాక్ కోలుకోలేకపోయింది. అసలు పాకిస్తాన్ తమకు ఏమాత్రం పోటీ కాదన్నట్లుగా నిరూపిస్తూ భారత్ ఏకపక్షంగా ఘన విజయం అందుకుంది. కొలంబో: టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై భారత్ తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఇప్పటి వరకు 7–1తో పైచేయి ఉండగా ఇప్పుడు ఎనిమిదోసారి పాక్ను విశ్వవేదికపై మట్టికరిపించింది. భారత్ ముందు పాక్ ఏమాత్రం నిలవలేకపోవడంతో ఊహించిన ఫలితమే వచి్చంది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాను చిత్తు చేసింది. టి20ల్లో పాక్పై భారత్కు ఇదే అతి పెద్ద విజయం. టాస్ గెలిచి పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో చెలరేగగా, సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో సయీమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. వరుసగా మూడో విజయంతో భారత్ ‘సూపర్ ఎయిట్స్’కు అర్హత సాధించింది. అహ్మదాబాద్లో బుధవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో భారత్ తలపడుతుంది. ఆసియా కప్ తరహాలోనే తమ నిర్ణయాన్ని కొనసాగిస్తూ ఈ మ్యాచ్లో కూడా పాక్ కెపె్టన్ సల్మాన్ ఆఘాకు భారత సారథి సూర్యకుమార్ ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదు. భారత్ చేతిలో భారీ ఓటమితో పాకిస్తాన్ ‘సూపర్–8’ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం నమీబియాతో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ తప్పనిసరిగా గెలిస్తేనే ‘సూపర్–8’ దశకు అర్హత సాధిస్తుంది. పాకిస్తాన్ ఓడిపోతే అమెరికా ‘సూపర్–8’కు చేరుతుంది. అభిశేక్ మళ్లీ డకౌట్... పార్ట్ టైమ్ స్పిన్నర్ సల్మాన్ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు బంతులు పరుగు తీయలేకపోయిన అభిశేక్ శర్మ (0) తర్వాతి బంతికి భారీ షాట్కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. టోర్నీలో అతనికి ఇది వరుసగా రెండో డకౌట్. అయితే ఇషాన్ చెలరేగిపోవడంతో జట్టు దూసుకుపోయింది. షాహీన్ అఫ్రిది ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను అబ్రార్ ఓవర్లోనూ 6, 4 కొట్టాడు. పవర్ప్లేలో భారత్ 52 పరుగులు చేసింది. అనంతరం అబ్రార్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన ఇషాన్ 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడిన ఇషాన్ను ఎట్టకేలకు 9వ ఓవర్లో పాక్ అవుట్ చేయగలిగింది. ఆ సమయంలో భారత్ స్కోరు 88 అయితే ఇషాన్ ఒక్కడే 76 బాదడం విశేషం! మరోవైపు తిలక్ వర్మ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ కాస్త తడబడుతూనే సాగింది. వరుసగా మూడో మ్యాచ్లోనూ అతను ఒకే స్కోరు (25) చేశాడు. తిలక్, పాండ్యా (0)లను అయూబ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఈ దశలో సూర్య, శివమ్ దూబే (17 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా పిచ్ అనుకూలంగా లేకపోవడంతో జాగ్రత్తగా ఆడారు. ఐదో వికెట్కు వీరిద్దరు 38 పరుగులు జోడించేందుకు 34 బంతులు పట్టాయి. అఫ్రిది వేసిన చివరి ఓవర్లో దూబే, రింకూ సింగ్ (11 నాటౌట్) కలిసి 2 ఫోర్లు, సిక్స్తో 16 పరుగులు రాబట్టారు. భిన్నమైన యాక్షన్తో తీవ్ర చర్చను రేకెత్తించిన ఉస్మాన్ తారిఖ్ (1/24) 2 ఫోర్లు మాత్రమే ఇచ్చి అందరికంటే మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఉస్మాన్ ఖాన్ మినహా... తొలి ఓవర్ నాలుగో బంతికి ఫర్హాన్ (0) అవుట్ కావడంతో మొదలైన పాక్ పతనం వేగంగా సాగింది. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో అయూబ్ (6), సల్మాన్ (4) వెనుదిరగ్గా, అక్షర్ తన తొలి ఓవర్లోనే బాబర్ ఆజమ్ (5)ను బౌల్డ్ చేశాడు. పవర్ప్లేలో జట్టు స్కోరు 38/4కు చేరింది. ఉస్మాన్ ఒక్కడే కాస్త పోరాడుతూ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే 57 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉస్మాన్ను అక్షర్ అవుట్ చేయడంతో పాక్ గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో షాహిన్ అఫ్రిది (19 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు సాధించినా లాభం లేకపోయింది. గత మ్యాచ్ ఆడిన తుది జట్టులో భారత్ రెండు మార్పులు చేసింది. అనారోగ్యం నుంచి కోలుకున్న అభిశేక్...సామ్సన్ స్థానంలో రాగా, అర్‡్షదీప్కు బదులుగా అదనపు స్పిన్నర్ కుల్దీప్ను మేనేజ్మెంట్ ఎంచుకుంది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (బి) అయూబ్ 77; అభిశేక్ (సి) అఫ్రిది (బి) సల్మాన్ 0; తిలక్ (ఎల్బీ) (బి) అయూబ్ 25; సూర్యకుమార్ (సి) అయూబ్ (బి) తారిఖ్ 32; పాండ్యా (సి) బాబర్ (బి) అయూబ్ 0; దూబే (రనౌట్) 27; రింకూ (నాటౌట్) 11; అక్షర్ (సి) అయూబ్ (బి) అఫ్రిది 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–1, 2–88, 3–126, 4–126, 5–159, 6–175, 7–175. బౌలింగ్: సల్మాన్ 2–0–10–1, షాహిన్ అఫ్రిది 2–0–31–1, సయీమ్ అయూబ్ 4–0–25–3, అబ్రార్ 3–0–38–0, షాదాబ్ 1–0–17–0, నవాజ్ 4–0–28–0, తారిఖ్ 4–0–24–1. పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (సి) రింకూ (బి) పాండ్యా 0; అయూబ్ (ఎల్బీ) (బి) బుమ్రా 6; సల్మాన్ (సి) పాండ్యా (బి) బుమ్రా 4; బాబర్ (బి) అక్షర్ 5; ఉస్మాన్ (స్టంప్డ్) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 44; షాదాబ్ (సి) దూబే (బి) తిలక్ 14; నవాజ్ (సి) దూబే (బి) కుల్దీప్ 4; ఫహీమ్ (సి) రింకూ (బి) వరుణ్ 10; అఫ్రిది (నాటౌట్) 23; అబ్రార్ (ఎల్బీ) (బి) వరుణ్ 0; తారిఖ్ (బి) పాండ్యా 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (18 ఓవర్లలో ఆలౌట్) 114. వికెట్ల పతనం: 1–0, 2–6, 3–13, 4–34, 5–73, 6–78, 7–78, 8–97, 9–97, 10–114. బౌలింగ్: పాండ్యా 3–1–16–2, బుమ్రా 2–0–17–2, అక్షర్ 4–0–29–2, వరుణ్ 3–0–17–2, కుల్దీప్ 3–0–14–1, తిలక్ 2–0–11–1, రింకూ 1–0–9–0. -
పాక్ను చిత్తు చేసిన భారత్.. సూపర్-8కు సూర్య సేన
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్పై తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్లో పాకిస్తాన్ను 61 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఓపెనర్ అభిషేక్ శర్మ (0) త్వరగానే అవుట్ అయినప్పటికీ.. ఇషాన్ కిషన్ మాత్రం సంచలన ప్రదర్శన కనబరిచాడు. కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. అయితే ఇషాన్ ఔటయ్యాక తిలక్ వర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (32) నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. కానీ చివరిలో శివం దూబే (27)., రింకూ సింగ్(4 బంతుల్లో 11) మెరుపులు మెరిపించారు. ఫలితంగా 170 పైగా భారత్ స్కోర్ సాధించగల్గింది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగట్టగా.. సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన భారత బౌలర్లుఅనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. టీమిండియా బౌలర్ల ధాటికి దాయాది జట్టు 18 ఓవర్లలో కేవలం ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(44) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాక్పై భారత్కు ఇది 8వ విజయం కావడం విశేషం. -
తిలక్ వర్మపై గంభీర్ సీరియస్
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ వర్మ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన తిలక్ తన జిడ్డు బ్యాటింగ్తో విసిగించాడు. ఓ వైపు ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతుంటే తిలక్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ హెడ్కోచ్ గంభీర్ అగ్రహానికి గురయ్యాడు.డ్రింక్స్ బ్రేక్ సమయంలో డగౌట్ నుంచి బయటకు వచ్చిన గంభీర్, తిలక్ వర్మతో చాలా సీరియస్గా మాట్లాడాడు. వేగంగా ఆడాలని, టార్గెట్ 170 దాటాలని గంభీర్ గట్టిగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో పాక్ స్పిన్నర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా 24 బంతుల్లో 104.17 స్ట్రైక్ రేటుతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు.pic.twitter.com/1MeAVMJPtQ— crictalk (@crictalk7) February 15, 2026 -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. యువరాజ్ రికార్డు బ్రేక్
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న హైవోల్టేజ్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికి.. ఇషాన్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.తిలక్ వర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఇషాన్ కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 40 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన కిషన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్పై టీ20ల్లో అత్యంతవేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2012లో అహ్మదాబాద్లో పాక్పై యువరాజ్ సింగ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్లో 27 బంతుల్లోనే ఆర్ధ శతకం బాదిన ఇషాన్.. 14 ఏళ్ల నాటి యువీ రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు.కాగా ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కిషన్తో పాటు సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(32) రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ అఘా, ఉస్మాన్ తరీఖ్, అఫ్రిది తలా వికెట్ సాధించారు. -
T20 WC 2026: అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్న అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పలు అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్నాడు. పాక్తో ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన హైవోల్టేజీ మ్యాచ్లో డకౌటైన అతను.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మొదటి రెండు మ్యాచ్ల్లో డకౌటైన మూడో ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు ఇమ్రుల్ కయేస్ ఈ అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. నెహ్రా, కయేస్ తమ వరల్డ్కప్ కెరీర్లలో ఒక్క పరుగు కూడా చేయకపోవడం మరో విశేషం.ప్రస్తుత ప్రపంచకప్లో యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన (తొలి బంతికే) అభిషేక్.. ఇవాళ పాక్తో జరిగిన మ్యాచ్లో నాలుగు బంతులు ఎదుర్కొని కూడా ఖాతా తెరవలేకపోయాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా రచించిన వూహ్యంలో చిక్కుకున్న అభిషేక్ అవాంఛిత ఈ రికార్డును మూటగట్టుకున్నాడు. అభిషేక్కు గత ఆరు ఇన్నింగ్స్ల్లో ఇది నాలుగో డకౌట్ కావడం మరో విశేషం.కోహ్లి రికార్డు సమంపాక్పై డకౌట్ కావడంతో అభిషేక్ మరో చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ తరఫున రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే సరసన చేరాడు. వీరంతా మెగా టోర్నీలో తలో రెండు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో ఆశిష్ నెహ్రా (3) టాప్ ప్లేస్లో ఉన్నాడు.సంజూతో సమానంగా..!తాజా డకౌట్తో అభిషేక్ మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నాడు. టీ20ల్లో భారత ఓపెనర్లలో రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా సంజూ శాంసన్ సరసన చేరాడు. అభిషేక్, సంజూ తమ టీ20 కెరీర్లలో తలో ఐదు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (10) అగ్రస్థానంలో ఉన్నాడు.భారీ స్కోర్ దిశగా టీమిండియాపాక్తో మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు తొలి 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) పాక్ బౌలర్లను ఊచకోత కోసి ఔటయ్యాడు. అంతకుముందు అభిషేక్ డకౌటయ్యాడు. ప్రస్తుతం సూర్యకుమార్ (21), తిలక్ వర్మ (25) క్రీజ్లో ఉన్నారు. -
IND vs PAK: అరెరే అభిషేక్.. ఇలా చేశావేంటి?
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో డకౌటైన అభిషేక్.. ఇప్పుడు కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో అదే తీరును కనబరిచాడు. భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బౌలింగ్లో చెత్త షాట్ ఆడి అభిషేక్ ఔటయ్యాడు.అమెరికాతో మ్యాచ్ తర్వాత అభిషేక్ కడుపు ఇన్ఫెక్షన్ గురయ్యాడు. దీంతో నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే పూర్తి ఫిట్నెస్ పాక్తో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. దాయాది జట్టుకు అభిషేక్ చుక్కలు చూపిస్తాడు అని భారత అభిమానులు భావించారు.కానీ ఈ పంజాబీ బ్యాటర్ తన చెత్త బ్యాటింగ్తో అందరిని నిరాశపరిచాడు. ఈ మ్యాచ్కు ముందు అభిషేక్ను ఉద్దేశించి పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ త్వరగా కోలుకోవాలని, మ్యాచ్లో ఆడాలని కోరుకుంటున్నట్లు సల్మాన్ పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టే తొలి ఓవర్ వేసిన సల్మాన్.. అభిషేక్పై పైచేయి సాధించాడు. దీంతో అభిషేక్ను ఔట్ చేసిన అనంతరం సల్మాన్ సంబరాల్లో మునిగితేలిపోయాడు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రాపాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్ -
T20 WC 2026: యూఎస్ఏకు మరో విజయం.. అదే జరిగితే పాక్ ఇంటికే..!
టీ20 ప్రపంచకప్ 2026లో యూఎస్ఏ మరో విజయం సాధించింది. ఇప్పటికే నెదర్లాండ్స్పై గెలుపొందిన అమెరికా.. తాజాగా (ఫిబ్రవరి 15) నమీబియాను కూడా మట్టికరిపించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. యూఎస్ఏకు సూపర్-8కు చేరే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ.. ఈ రెండు విజయాలు భారీ ఊరట కలిగిస్తాయి. ఎందుకంటే ఈ జట్టు ఆడుతున్నది రెండో ప్రపంచకప్పే అయినా, పలు చిరస్మరణీయ విజయాలు సాధించి, చిన్న జట్లలో మేటి జట్టుగా పేరు తెచ్చుకుంది. తమ కంటే ముందు నుంచే ప్రపంచకప్ ఆడుతున్న నెదర్లాండ్స్, నమీబియా లాంటి జట్లను ఓడించడం యూఎస్ఏను ప్రత్యేకంగా నిలుపుతుంది. గత ఎడిషన్లో (2024) ఈ జట్టు, వారి కంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్ను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎడిషన్లోనూ యూఎస్ఏ నుంచి ఆ స్థాయి ప్రదర్శన ఆశించినప్పటికీ వీలు పడలేదు. అయితే పాక్తో పాటు భారత్కు కూడా టఫ్ ఫైట్ ఇచ్చి అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ ఎడిషన్లోనూ యూఎస్ఏకు సూపర్-8కు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. పాక్.. భారత్, నమీబియా చేతుల్లో ఓడితే యూఎస్ఏకు సూపర్-8 బెర్త్ దక్కే అవకాశం ఉంది. ఇది జరిగితే పాక్, యూఎస్ఏ ఖాతాల్లో తలో నాలుగు పాయింట్లు ఉంటాయి. అప్పుడు పాక్ కంటే మెరుగైన రన్రేట్ కలిగి ఉంటే, యూఎస్ఏ సూపర్-8కి అర్హత సాధిస్తుంది. ఇలా జరగడం కష్టమైనా, అవకాశాలను మాత్రం తీసి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే భారత్, నమీబియాకు పాక్ను ఓడించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. నమీబియాకు గతంలో వారి కంటే మెరుగైన జట్లకు షాకిచ్చిన అనుభవం ఉంది. ఇది మరోసారి రిపీటైతే మాత్రం యూఎస్ఏ సూపర్-8కు, పాక్ ఇంటికి చేరతాయి.యూఎస్ఏ-నమీబియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో యూఎస్ఏ 31 పరుగుల తేఆతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (199-4) చేసిన యూఎస్ఏ.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. యూఎస్ఏ తరఫున బ్యాటింగ్లో కెప్టెన్ మోనాంక్ పటేల్ (52), సంజయ్ కృష్ణమూర్తి (68 నాటౌట్) రాణించారు. నమీబియా బౌలర్లలో మైబుర్గ్, కెప్టెన్ ఎరాస్మస్ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం నమీబియా యూఎస్ఏ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఎస్ఏ బౌలర్లు నమీబియా బ్యాటర్లను కట్టడి చేశారు. స్కాల్విక్ 2, శుభమ్ రంజనే, నేత్రావల్కర్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు. నమీబియా ఇన్నింగ్స్లో ఓపెనర్ స్టీన్కాంప్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. -
పాకిస్తాన్పై భారత్ ఘన విజయం
India vs pakistan Match live Updates: పాకిస్తాన్పై భారత్ ఘన విజయంకొలంబో వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 61 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. భారత బౌలర్ల దాటికి 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(44) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలా రెండు వికెట్లు సాధించారు. 👉16వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో పాక్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 17 ఓవర్లకు పాక్ స్కోర్: 109/7విజయానికి చేరువలో భారత్79 పరుగుల వద్ద పాక్ ఏడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన షాదాబ్ ఖాన్ తిలక్ వర్మ బౌలింగ్లో ఔటయ్యాడు.పీకల్లోతు కష్టాల్లో పాక్78 పరుగుల వద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.👉ఉస్మాన్ ఖాన్(44) రూపంలో పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది.ఉస్మాన్ ఖాన్ దూకుడు..9 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ 40 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు.పాక్ నాలుగో వికెట్ డౌన్34 పరుగుల వద్ద పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన బాబర్ ఆజం.. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 6 ఓవర్లకు పాక్ స్కోర్: 38/4పాక్ మూడో వికెట్ డౌన్13 పరుగుల వద్ద పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన సల్మాన్ అలీ అఘా.. బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.పాకిస్తాన్కు భారీ షాక్176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు తొలి ఓవర్లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సాహిబ్జాదా ఫర్హాన్ డకౌటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్లో సైమ్ అయూబ్(6) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 6 పరుగులకే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది.పాక్ టార్గెట్ ఎంతంటే?కొలంబో వేదికగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. 40 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(32) రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ అఘా, ఉస్మాన్ తరీఖ్, అఫ్రిది తలా వికెట్ సాధించారు.సూర్య కుమార్ ఔట్159 పరుగుల వద్ద కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ను టీమిండియా కోల్పోయింది. 32 పరుగులు చేసిన సూర్య.. ఉస్మాన్ తరీఖ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 159/5ఒకే ఓవర్లో రెండు వికెట్లుటీమిండియా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్ వేసిన సైమ్ అయూబ్ బౌలింగ్లో తిలక్ వర్మ(25) రెండో బంతికి వికెట్లు ముందు దొరికిపోగా.. నాలుగో బంతికి హార్దిక్ పాండ్యా డకౌట్గా వెనుదిరిగాడు.నిలకడగా ఆడుతున్న సూర్య, తిలక్ఇషాన్ కిషన్ ఔటైన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(25) ఆచితూచి ఆడుతున్నారు. 14 ఓవర్లకు భారత్ స్కోర్: 125/2ఇషాన్ కిషన్ ఔట్ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్కు తెరపడింది. 40 బంతుల్లో 77 పరుగులు చేసిన కిషన్.. సైమ్ అయూబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 9 ఓవర్లకు భారత్ స్కోర్: 89/2చెలరేగి ఆడుతున్న ఇషాన్పాక్తో మ్యాచ్లో ఇషాన్ కిషన్ చెలరేగి ఆడుతున్నాడు. కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇషాన్ 72 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 8 ఓవర్లకు భారత్ స్కోర్: 82/1దూకుడుగా ఆడుతున్న ఇషాన్5 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. అభిషేక్ తొలి ఓవర్లోనే వెనుదిరిగినప్పటికి కిషన్ మాత్రం(36) దూకుడుగా ఆడుతున్నాడు.అభిషేక్ శర్మ డకౌట్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. సల్మాన్ అలీ బౌలింగ్లో షాహిన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఇషాన్ కిషన్(12) మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 16/1బౌలింగ్ ఎంచుకున్న పాక్కొలంబో వేదికగా భారత్తో జరుగుతున్న గ్రూపు-ఎ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ బ్లాక్బాస్టర్ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో సంజూ శాంసన్పై వేటు పడింది. అదేవిధంగా అర్ష్దీప్ సింగ్ స్ధానంలో కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కింది. పాక్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రాపాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్కాసేపటిలో టాస్టీ20 ప్రపంచకప్-2026లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మెగా పోరుకు సర్వం సిద్దమైంది. మరి కాసేపటిలో కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ షూరూ కానుంది. ఇప్పటికే మైదానానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు వార్మాప్ అవుతున్నారు. -
భారత్-పాక్ హైవోల్టేజీ మ్యాచ్.. చరిత్ర ఏం చెబుతుందంటే..?
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడూ మహాసంగ్రామాలను తలపిస్తాయి. ప్రత్యేకించి ప్రపంచకప్లో ఈ రెండు జట్ల పోరాటాలు అంతకుమించిన అనుభూతిని కలిగిస్తాయి. మరీ ప్రత్యేకించి, టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్ల పోటీ ప్రళయ వాతావరణాన్ని సూచిస్తుంది.గెలుపోటములు ఎలా ఉన్నా, మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే ఇరు దేశాల అభిమానుల మధ్య వార్ మొదలవుతుంది. ఈ పరిస్థితి దాయాదుల సమరానికి మరింత హైప్ తెచ్చిపెడుతుంది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, అభిమానుల భావోద్వేగాలు ఈ మ్యాచ్లను మరింత ప్రత్యేకం చేస్తాయి. ఈ హైప్ భారత్, పాక్ అభిమానులనే కాక, విశ్వవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది.భారీ అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు ఉండేవి. బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయానికి నిరసనగా పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్ రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్ ఈ మ్యాచ్ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్ తిరిగి కార్యరూపం దాల్చడం ఈ మ్యాచ్ హైప్ను పీక్స్కు చేర్చింది. ఈ భారీ అంచనాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ హెడ్ టు హెడ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీలో భారత్కు పాక్పై స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 8 సార్లు ఎదురెదురుపడగా.. భారత్ ఏకంగా ఏడు సార్లు జయకేతనం ఎగురవేసింది. పాక్ ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే గెలుపొందింది. టీమిండియా ఇవాళ జరుగబోయే మ్యాచ్లోనూ గెలిచి పొట్టి ప్రపంచకప్లో తమ రికార్డును (8-1 మరింత మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది.భారత జట్టు ప్రస్తుతమున్న ఫామ్ను బట్టి చూస్తే, ఇది అంత కష్టమేమీ కాకపోవచ్చు. గత కొంతకాలంగా టీమిండియా పొట్టి ఫార్మాట్లో తిరుగులేని విజయాలు సాధిస్తూ నంబర్ వన్ స్థానంలో ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు భీకర ఫామ్లో ఉన్నారు. ప్రస్తుత పాక్ జట్టును టీమిండియా ఆడుతూపాడుతూ చిత్తు చేయవచ్చు. అలాగని ఉదాసీనంగా వ్యవహరిస్తే, 2021 ఎడిషన్లో ఎదురైన పరాభవం పునరావృతమయేక్య ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి టీమిండియా చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే లాజిక్ను అమలు చేస్తే బాగుంటుంది. మరో గంటలో (రాత్రి 7 గంటలకు) ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటి నుంచే టీవీలకు అతుక్కుపోయారు.వరుణుడి భయంఓ పక్క అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్ని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు.ఒకవేళ మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్, పాక్కు చెరో పాయింట్ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్ సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన భారత్-పాక్ సమరాలు..తొలి ఘట్టం – 2007 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో భారత్-పాక్ రెండు సార్లు తలపడ్డాయి. గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ టై అయ్యింది, కానీ బౌలౌట్లో భారత్ గెలిచింది. అదే టోర్నమెంట్ ఫైనల్లో మళ్లీ తలపడగా, ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది. ఇది భారత్-పాక్ టీ20 వరల్డ్కప్ పోరాటాలకు ఆరంభం. భారత్ ఆధిపత్యం అనంతరం 2012, 2014, 2016 వరల్డ్కప్లలో భారత్ వరుస విజయాలు సాధించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి బ్యాటర్లు అద్భుత ప్రదర్శనలతో భారత్ పాక్పై ఆధిపత్యం కొనసాగించింది. పాక్ చరిత్రాత్మక విజయం – 2021 దుబాయ్లో జరిగిన 2021 వరల్డ్కప్లో పాక్ భారత్ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇది పాక్కి వరల్డ్కప్ చరిత్రలో భారత్పై తొలి విజయం. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అద్భుత బ్యాటింగ్తో ఆ మ్యాచ్ పాక్ అభిమానులకు మరపురాని జ్ఞాపకం అయ్యింది. తిరిగి భారత్ ఆధిపత్యం 2022, 2024 వరల్డ్కప్లలో భారత్ మళ్లీ పాక్ను ఓడించింది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఈ గెలుపుల్లో కీలక పాత్ర పోషించారు. -
అదరగొట్టిన అరుంధతి.. ఆసీస్పై భారత్ ఘన విజయం
ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్పై డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల దాటికి 18 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది.కంగారూ జట్టు బ్యాటర్లలో జార్జియా వేర్హామ్(30) టాప్ స్కోరర్గా నిలవగా, లిచ్ఫీల్డ్(26), పెర్రీ(20) రాణించారు. భారత పేసర్ అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించింది. అరుధతితో పాటు మరో తెలుగు అమ్మాయి శ్రీ చరణి, పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు సాధించారు.అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ షఫాలీ వర్మ తన మెరుపు బ్యాటింగ్తో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. షఫాలీ కేవలం 11 బంతుల్లోనే 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి ఔటైంది. అయితే భారత్ స్కోర్ 50/1 (5.1 ఓవర్లలో) వద్ద ఉండగా వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. ఆట నిలిచిపోయే సమయానికి 21 పరుగులు ముందుంజలో ఉండడంతో భారత్ను విజేతగా నిర్ణయించారు. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి హర్మన్ సేన దూసుకెళ్లింది. రెండో టీ20 కాన్బెర్రా వేదికగా ఫిబ్రవరి 19న జరగనుంది. -
ఆసీస్ గడ్డపై జూలు విదిల్చిన టీమిండియా.. తొలి టీ20లో ఘన విజయం
2026 ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి టీ20లో టీమిండియా 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ వద్దతిలో) గెలుపొందింది.ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు జూలు విదిల్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చారు. పేసర్లు రేణుకా సింగ్ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ప్లేయర్ల భరతం పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.ఆసీస్ ఇన్నింగ్స్లో జార్జియా వేర్హమ్ (30) టాప్ స్కోరర్ కాగా.. ఫోబ్ లిచ్ఫీల్డ్ (26), ఎల్లిస్ పెర్రీ (20), జార్జియా వాల్ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్ మూనీ (5), ఆష్లే గార్డ్నర్ (4), అన్నాబెల్ సదర్ల్యాండ్ (3), కిమ్ గార్త్ (2), డార్సీ బ్రౌన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్ సోఫీ మోలినెక్స్ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.అనంతరం భారత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో వరుణుడు పలు మార్పులు ఆటంకం కలిగించాడు. జట్టు స్కోర్ 50-1 (5.1 ఓవర్లలో) వద్ద ఉండగా.. భారీ వర్షం ప్రారంభమై, ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన భారత్ను విజేతగా ప్రకటించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో షఫాలీ వర్మ (11 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) సహజ శైలిలో విరుచుకుపడింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి స్మృతి మంధన (16), జెమీమా రోడ్రిగ్స్ (9) క్రీజ్లో ఉన్నారు. షఫాలీ వికెట్ మోలినెక్స్కు దక్కింది. ఈ సిరీస్లో రెండో టీ20 ఫిబ్రవరి 19న కాన్బెర్రా వేదికగా జరుగనుంది. -
మా బౌలర్ను చూసి టీమిండియా భయపడుతోంది: పాక్ మాజీ కెప్టెన్
క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ హాట్ టాపిక్గా నిలిచాడు.అతడి బౌలింగ్ శైలి భిన్నంగా అందుకు కారణం. బౌలింగ్ చేసే సమయంలో కొన్ని సెకన్లు ఆగి బంతిని విడుదల చేయడం అతడి స్పెషాలిటి. ఇప్పటివరకు భారత బ్యాటర్లు ఒక్కరు కూడా అతడి బౌలింగ్ను ఒక్కసారి కూడా ఎదుర్కొలేదు. దీంతో ఈ వరల్డ్కప్ మ్యాచ్లో అతడిని భారత బ్యాటర్లు ఎలా ఆడుతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఉస్మాన్ కోసం టీమిండియా బ్యాటర్లు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే తారిక్ భారత్పై పైచేయి సాధించాడని హఫీజ్ అన్నాడు."ఉస్మాన్ తారిక్ ఇప్పటికే భారత్పై సైకిలాజికల్గా విజయం సాధించాడు. ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం, బాబర్ అజామ్ లేదా మరెవరి గురించి ఎవరూ చర్చించడం లేదు. మీడియా, ఫ్యాన్స్ అంతా తారిఖ్ గురించే మాట్లాడుతున్నారు. భారత డ్రెస్సింగ్ రూమ్లో కూడా తారిఖ్ పట్ల ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.అతడు పాకిస్తాన్ తరపున నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అయినప్పటికి అతడిని ఎదుర్కొవడానికి భారత్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ను కెప్టెన్ సల్మాన్ అఘా ఎలా ఉపయోగిస్తాడో చూడాలనుకుంటున్నాను. అతడిని 6వ ఓవర్లోనే రంగంలోకి దించితే బ్యాటర్లను కట్టడి చేయవచ్చు" అని తప్మాడ్ అనే ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్ పేర్కొన్నాడు. -
T20 WC 2026: పాక్తో మ్యాచ్.. టీమిండియాలో రెండు మార్పులు..?
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్-పాక్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ జరుగనుంది. కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొని ఉండేవి. బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ మ్యాచ్ రద్దు చేసుకున్నట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్ ఈ మ్యాచ్ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్ తిరిగి కార్యరూపం దాల్చడం ఈ మ్యాచ్ హైప్ను మరింత పెంచింది. ఓ పక్క క్రికెట్ అభిమానులు ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్, పాక్కు చెరో పాయింట్ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్ను సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు (8-1).ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. కడుపు నొప్పితో బాధపడుతూ, నమీబియాతో జరిగిన మ్యాచ్కు దూరంగా ఉన్న అభిషేక్ శర్మ జట్టులో తిరిగి రానున్నాడని సమాచారం. అభిషేక్ రాకతో సంజూ శాంసన్ తిరిగి బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. ప్రేమదాస స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుందన్న సమాచారం ఉండటంతో ఈ మ్యాచ్లో భారత్ అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అప్పుడు అర్షదీప్ సింగ్పై వేటు పడవచ్చు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తాడు. ఈ రెండు మార్పులు మినహా మిగతా జట్టు యధాతథంగా కొనసాగుతుంది.అభిషేక్, ఇషాన్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. వన్డౌన్లో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్, ఐదో ప్లేస్లో హార్దిక్ పాండ్యా, ఆరో స్థానంలో శివమ్ దూబే, ఏడో ప్లేస్లో రింకూ సింగ్, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, ఏకైక స్పెషలిస్ట్ పేసర్గా బుమ్రా బరిలోకి దిగవచ్చు. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా గడ్డపై తొలి మ్యాచ్లోనే భారత మహిళా బౌలర్లు చెలరేగిపోయారు. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆసీస్ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చింది.పేసర్లు రేణుకా సింగ్ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ప్లేయర్ల భరతం పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.ఆసీస్ ఇన్నింగ్స్లో జార్జియా వేర్హమ్ (30) టాప్ స్కోరర్ కాగా.. ఫోబ్ లిచ్ఫీల్డ్ (26), ఎల్లిస్ పెర్రీ (20), జార్జియా వాల్ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్ మూనీ (5), ఆష్లే గార్డ్నర్ (4), అన్నాబెల్ సదర్ల్యాండ్ (3), కిమ్ గార్త్ (2), డార్సీ బ్రౌన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్ సోఫీ మోలినెక్స్ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.కాగా, మల్లీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో తొలుత మూడు టీ20లు, ఆతర్వాత మూడు వన్డేలో, చివరిగా ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఆస్ట్రేలియాలో భారత పర్యటన షెడ్యూల్ఫిబ్రవరి 15- తొలి టీ20 (సిడ్నీ)ఫిబ్రవరి 19- రెండో టీ20 (కాన్బెర్రా)ఫిబ్రవరి 21- మూడో టీ20 (అడిలైడ్)ఫిబ్రవరి 24- తొలి వన్డే (బ్రిస్బేన్)ఫిబ్రవరి 27- రెండో వన్డే (హోబర్ట్)మార్చి 1- మూడో వన్డే (హోబర్ట్)మార్చి 6- ఏకైక టెస్ట్ (పెర్త్) -
పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టీ20 టోర్నీలో భారత్ పాక్పై ఘన విజయం సాధించింది. బ్యాంకాక్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్లో టీమిండియా పాక్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను భారత బౌలర్లు 93 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూల్చారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా (10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి) ఛేదించారు. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో రెండో స్థానానికి చేరింది. దీనికి ముందు మ్యాచ్లో భారత అమ్మాయిలకు యూఏఈ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది.తాజా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. సైమా ఠాకోర్ (4-0-14-2), కెప్టెన్ రాధా యాదవ్ (3-0-11-2), ప్రేమా రావత్ (3-0-16-2), జింటిమణి కలిట (3-0-18-1), మిన్నూ మణి (2.5-0-10-1), తనూజా కన్వర్ (3-0-19-0) పాక్ ప్లేయర్ల భరతం పట్టారు. పాక్ ఇన్నింగ్స్లో షావల్ జుల్ఫికర్ (23), గుల్ రుఖ్ (21), అనోశా నాసిర్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ తొలి బంతికే వికెట్ (హుమైరా ఖాజీ డకౌట్) కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ వ్రింద దినేశ్ (55) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి భారత్ను విజయతీరాలకు చేరింది. వ్రిందకు అనుష్క శర్మ (24), తేజల్ హసబ్నిస్ (12 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో వహీదా అక్తర్, మొమినా రియాసత్కు తలో వికెట్ దక్కింది. భారత్ గ్రూప్ దశలో తమ తదుపరి మ్యాచ్లో నేపాల్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 17న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్, యూఏఈ, నేపాల్ గ్రూప్-ఏలో ఉండగా.. థాయ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా గ్రూప్-బిలో ఉన్నాయి. -
పాక్ కోరిక నెరవేరుస్తాం: సూర్యకుమార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆసక్తికర సమరానికి సమయం ఆసన్నమైంది. దాయాదులు భారత్- పాకిస్తాన్ కొలంబో వేదికగా ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఆర్.ప్రేమదాస స్టేడియం వేదిక కాగా.. వర్షం పడే ప్రమాదం పొంచి ఉంది.ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో మ్యాచ్ నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) శనివారం నాటి ప్రెస్ కాన్ఫరెన్స్లో సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత్ తొలుత అమెరికాతో తలపడిన సంగతి తెలిసిందే.అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచినా.. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక నమీబియాతో రెండో మ్యాచ్కు ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అందుబాటులో లేకుండా పోయాడు. కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన అభిషేక్.. కోలుకున్నప్పటికీ యాజమాన్యం అతడికి విశ్రాంతినిచ్చింది.ఇక నమీబియాను చిత్తుగా ఓడించి సూపర్-8కు చేరువైన భారత్.. దాయాదిపై ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పాక్తో ఆడే భారత తుదిజట్టు ఎలా ఉండబోతున్న చర్చ జరుగుతోంది.అతడు ఆడాలని కోరుకుంటున్నాంఇదిలా ఉంటే.. భారత్తో మ్యాచ్కు ముందు పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) మాట్లాడుతూ.. “అతడు మంచి ప్లేయర్. అభిషేక్ రేపు ఆడతాడనే అనుకుంటున్నాం. మేము అత్యుత్తమ జట్టుతో పోటీ పడాలి అని అనుకుంటున్నాం. కాబట్టి అతడు కోలుకుని తిరిగి వస్తే బాగుంటుంది’’ అని అభిషేక్ శర్మను ఉద్దేశించి పేర్కొన్నాడు.పాక్ కోరిక నెరవేరుస్తాంఇదే విషయాన్ని సూర్య వద్ద విలేకరులు ప్రస్తావించగా.. “ఒకవేళ పాకిస్తాన్ మేము అభిషేక్ శర్మను ఆడించాలని కోరుకుంటే.. వారి కోరిక నెరవేరుతుంది. అతడు రేపు ఆడతాడు’’ అని సమాధానమిచ్చాడు. తద్వారా సంజూ శాంసన్పై వేటు వేయడం ఖాయమని చెప్పకనే చెప్పాడు సూర్య.అతడికీ చోటుఇక కొలంబో స్పిన్కు అనుకూలించే పిచ్ కాబట్టి లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తుదిజట్టులో ఉంటాడని సూర్య సంకేతాలు ఇచ్చాడు. “అతడి అవసరం ఉందనుకుంటే కచ్చితంగా ఆడిస్తాము’’ అని కుల్దీప్ను ఉద్దేశించి పేర్కొన్నాడు. కాగా అర్ష్దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ వచ్చే అవకాశం ఉంది.కాగా గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్లతో పాటు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతున్నాయి. అయితే, ఇప్పటికే చెరో రెండు విజయాలతో భారత్- పాక్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. అమెరికా సైతం సూపర్-8 రేసులో నిలిచే ప్రయత్నంలో ఉంది.భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుది జట్లు (అంచనా): భారత్సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాGuess who's back... back again! 💪😈#TeamIndia's Mr.Maximum, #AbhishekSharma, was spotted launching sixes during the training session in Colombo! Watch him next 👉 ICC Men's #T20WorldCup 👉 #INDvPAK | SUN, 15th FEB, 6 PM pic.twitter.com/CEkut5QxpP— Star Sports (@StarSportsIndia) February 14, 2026పాకిస్తాన్సల్మాన్ ఆఘా (కెప్టెన్ ), సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహిన్ అఫ్రిది, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్. చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ -
రాహుల్, పడిక్కల్ అద్భుత శతకాలు
ఉత్తరాఖండ్తో ఇవాళ (ఫిబ్రవరి 15) మొదలైన రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీఫైనల్లో కర్ణాటక జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (125 నాటౌట్), కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (111 నాటౌట్) అద్భుత సెంచరీలతో చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ఱాటక టీ విరామం సమయానికి వికెట్ నష్టానికి 263 పరుగులు చేసింది. రాహుల్, పడిక్కల్ సెంచరీల తర్వాత కూడా నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీల దిశగా సాగుతున్నారు.టాస్ ఓడి ఉత్తరాఖండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కర్ణాటక 18 పరుగుల వద్దనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) వికెట్ కోల్పోయింది. అయితే రాహుల్, పడిక్కల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్కు అజేయమైన 245 పరుగులు జోడించారు. మయాంక్ అగర్వాల్ వికెట్ ఆదిత్య రావత్కు దక్కింది.భీకర ఫామ్లో రాహుల్, పడిక్కల్కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నారు. టీమిండియా షెడ్యూల్ లేకపోవడంతో రంజీ బాట పట్టిన రాహుల్ ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లోనూ (130) అద్భుత శతకంతో మెరిశాడు. రాహుల్ అద్భుత శతకం కారణంగానే కర్ణాటక ముంబైపై గెలిచి సెమీస్కు చేరింది. అంతకుముందు పంజాబ్తో జరిగిన లీగ్ మ్యాచ్లోనూ రాహుల్ అర్ద సెంచరీతో రాణించాడు. దీనికి ముందు న్యూజిలాండ్తో జరిగిన రాజ్కోట్ వన్డేలోనూ (112) రాహుల్ అజేయ శతకంతో సత్తా చాటాడు. అంతకుముందు సౌతాఫ్రికాపై వరుసగా రెండు వన్డేల్లో అర్ద సెంచరీలతో రాణించాడు.పడిక్కల్ విషయానికొస్తే.. ఇతను కూడా ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. ఈ సెంచరీకి ముందు పంజాబ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన పడిక్కల్.. దానికి ముందు లిస్ట్-ఏ ఫార్మాట్లో పరుగుల వరద పారించాడు. పుదుచ్చేరి, త్రిపురపై వరుస శతకాలు, ఆతర్వాత రాజస్థాన్పై 91, ముంబైపై 81 (నాటౌట్) పరుగులు చేశాడు. రాహుల్, పడిక్కల్ ఇదే భీకర ఫామ్ను కొనసాగిస్తే.. కర్ణాటక మరోసారి రంజీ టైటిల్ గెలవడం ఖాయం. -
T20 WC 2026: విండీస్ మరోసారి.. తొలి జట్టు..!
రెండు సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ మూడో టైటిల్ దిశగా తొలి అడుగు వేసింది. 2026 ఎడిషన్లో ఆ జట్టు సూపర్-8కు అర్హత సాధించింది. ప్రస్తుత ఎడిషన్లో సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టు వెస్టిండీసే. నేపాల్పై విజయం సాధించడంతో విండీస్ సూపర్-8 బెర్త్ ఖరారైంది.ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన మ్యాచ్లో విండీస్ 9 వికెట్ల తేడాతో పసికూనను చిత్తు చేసింది. తొలుత బౌలింగ్లో నేపాల్ను 133 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసిన కరీబియన్ జట్టు.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జేసన్ హోల్డర్ బౌలింగ్లో (4-0-27-4) ఇరగదీసి నేపాల్ను దెబ్బేశాడు. మాథ్యూ ఫోర్డ్ (4-1-10-1) పొదుపుగా బౌలింగ్ చేసి నేపాల్ను కట్టడి చేశాడు. అకీల్ హోసేన్, షమార్ జోసఫ్, రోస్టన్ ఛేజ్ కూడా తలో వికెట్ తీసి నేపాల్ను ఇబ్బంది పెట్టారు. నేపాల్ ఇన్నింగ్స్లో దీపేంద్ర సింగ్ ఎయిరీ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఆఖర్లో సోమ్పాల్ కామీ (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నేపాల్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని విండీస్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. కెప్టెన్ షాయ్ హోప్ (61) అజేయమైన అర్ద సెంచరీతో విండీస్ను విజయతీరాలకు చేర్చాడు. హోప్కు హెట్మైర్ (46 నాటౌట్), బ్రాండన్ కింగ్ (22) సహకరించారు. ఈ ఓటమితో నేపాల్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. మెగా టోర్నీలో ఈ జట్టు ఆడిన 3 మ్యాచ్ల్లో పరాజయంపాలైంది. అయితే తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను మాత్రం ఓడించినంత పని చేసింది. ఇదొక్కటే ఈ ఎడిషన్లో నేపాల్కు ఊరట కలిగించే విషయం. ఫిబ్రవరి 17న ఈ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్ (స్కాట్లాండ్) ఆడనుంది. -
IND vs PAK: పాకిస్తాన్ 93 పరుగులకే ఆలౌట్
పాకిస్తాన్తో మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. దాయాదిని 93 పరుగులకే ఆలౌట్ చేశారు. ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్-2026 టోర్నమెంట్లో ఆదివారం నాటి మ్యాచ్లో భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి.తొలుత బ్యాటింగ్బ్యాంకాక్లోని టెర్థాయ్ క్రికెట్ మైదానంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆది నుంచే భారత బౌలర్లు పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. చుక్కలు చూపించిన భారత బౌలర్లుఓపెనర్లలో యుస్రా ఆమిర్ (1)ను సైమా ఠాకూర్ అవుట్ చేయగా.. వన్డౌన్ బ్యాటర్ ఒమైమా సొహైల్ (1)ను జింతిమణి కలిత, కెప్టెన్ హఫ్సా ఖలీద్ (1)ను ఐమా, హురైనా సజ్జద్ (2)ను కెప్టెన్ రాధా యాదవ్ పెవిలియన్కు పంపించారు.Captain Radha Yadav steps up and shows the way! 💙 Watch the Girls in Blue in action vs Pakistan A, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising | DP World Women’s Asia Cup Rising Stars 2026 pic.twitter.com/kjeq0xl5i8— Sony Sports Network (@SonySportsNetwk) February 15, 2026ఎమాన్ నాజర్ (4)ను అనుష్క శర్మ రనౌట్ చేయగా.. వహీదా అక్తర్ (7)ను ప్రేమా రావత్, మొమినా రియాసత్ (4)ను మిన్ను మణి సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేశారు. ఇలాంటి తరుణంలో ఓపెనర్ షవాల్ జుల్ఫికర్ (23)తో పాటు గల్ రుఖ్ (21) పోరాడే ప్రయత్నం చేయగా.. షవాల్కు రాధా యాదవ్, గుల్కు ప్రేమా రావత్ చెక్ పెట్టారు.𝐓𝐡𝐫𝐨𝐰 𝐢𝐭 𝐥𝐢𝐤𝐞 𝐀𝐧𝐮𝐬𝐡𝐤𝐚 🎯🔥A direct-hit special sends Eman Naseer back to the pavilion in style 💙Watch the Girls in Blue in action vs Pakistan A, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising | DP World Women’s… pic.twitter.com/XmUJMqOQIR— Sony Sports Network (@SonySportsNetwk) February 15, 2026 93 పరుగులకే ఆలౌట్ఫలితంగా 18.5 ఓవర్లలో కేవలం 93 పరుగులే చేసి పాక్-ఎ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సైమా ఠాకూర్, రాధా యాదవ్, ప్రేమా రావత్ తలా రెండు వికెట్లు తీయగా.. జింతిమణి కలిత, మిన్ను మణి చెరో వికెట్ పడగొట్టారు.కాగా ఆసియా కప్ రైజింగ్ టీ20 టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్- పాక్లతో పాటు యూఏఈ, నేపాల్ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్లో నేపాల్ను ఓడించి పాక్ అగ్రస్థానానికి చేరగా.. యూఏఈ చేతిలో ఓడిన భారత్ మూడో స్థానంలో ఉంది. తాజా మ్యాచ్లో పాక్ను ఓడించి గెలుపు బోణీ కొట్టాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. చదవండి: వైభవ్ సూర్యంశీ సంచలన నిర్ణయం! -
ఆసీస్కు షాకిచ్చిన ముజరబానీకి బంపరాఫర్!
ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జింబాబ్వే బౌలర్ బ్లెసింగ్ ముజరబానీకి బంపరాఫర్ వచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో వెస్టిండీస్ స్టార్ పేసర్ షమార్ జోసెఫ్ స్థానాన్ని ముజరబానీ భర్తీ చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. షమార్ జోసెఫ్పై వేటుకాగా మార్చి 26న పాక్ సూపర్ లీగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. రూ. 1.1 కోట్లకు (పాక్ కరెన్సీలో) కొనుగోలు చేసి షమార్ జోసెఫ్పై వేటు వేసింది. ఈ విండీస్ పేసర్ స్థానంలో జింబాబ్వే స్టార్ ముజరబానీని చేర్చుకుంది. అయితే, టెక్నికల్ కమిటీ నుంచి ఇందుకు ఆమోదం లభించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. షమార్ జోసెఫ్ను జట్టు నుంచి తొలగించడం పట్ల ఇస్లామాబాద్ యునైటెడ్ నోరు విప్పలేదు. అటు జోసెఫ్ సైతం మౌనంగానే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల పరస్పర అంగీకారంతోనే అతడు తప్పుకొన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది.కారణం అదేనా?కాగా 2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టెస్టుల్లో అరంగేట్రం చేసి.. సత్తా చాటిన షమార్ జోసెఫ్ వ్యక్తిగత ప్రవర్తనతో చిక్కుల్లో పడ్డాడు. అతడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్కు షమార్ ఆడటాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ అతడితో బంధం తెంచుకోవడం గమనార్హం.ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించిన ముజరబానీఇక జింబాబ్వే రైటార్మ్ పేసర్ బ్లెసింగ్ ముజరబానీకి పాకిస్తాన్ సూపర్ లీగ్ కొత్తేమీ కాదు. 2021లో టైటిల్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. అయితే, గత కొంతకాలంగా అతడు పేలవ ప్రదర్శనతో సతమతమయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో ముజరబానీ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం నాటి మ్యాచ్లో ముజరబానీ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి.. నాలుగు వికెట్లు కూల్చాడు. జోష్ ఇంగ్లిస్ (8), టిమ్ డేవిడ్ (0), మ్యాట్ రెన్షా (65), ఆడం జంపా (2) వికెట్లు తన ఖాతాలో వేసుకుని జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఆసీస్పై గెలిచిన జింబాబ్వే.. 2007 తర్వాత టీ20 వరల్డ్కప్ తర్వాత రెండోసారి కంగారూ జట్టును ఓడించింది.చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ -
వణికించిన పసికూన!.. పట్టలేనంత ఆనందం: హ్యారీ బ్రూక్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఇప్పటికే రెండు సంచలనాలు నమోదయ్యాయి. టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన ఇటలీ.. మూడోసారి వరల్డ్కప్ ఆడుతున్న నేపాల్ను ఓడించింది. ఇక మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే షాకిచ్చింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో చాంపియన్ జట్టును ఓడించింది.ఇక తాజాగా గ్రూప్-సిలో భాగంగా ఇంగ్లండ్కు పసికూన స్కాట్లాండ్ చెమటలు పట్టించింది. నేపాల్తో మ్యాచ్లో ఎలాగోలా గట్టెక్కిన బ్రూక్ బృందం.. స్కాటిష్ జట్టుపైనా అదే రీతిలో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.ఈరోజు కూడా గెలుపు గీత దాటేశాముఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన టామ్ బాంటన్ (Tom Banton)ను ప్రశంసించాడు. అదే విధంగా జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) సైతం మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. "ఈరోజు కూడా మేము గెలుపు గీతను దాటేశాము. పట్టలేనంత సంతోషం.మా స్పిన్ బౌలింగ్లో స్కాట్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ఆ సమయంలో వారు మాకంటే ముందంజలో నిలిచారు. అయితే, మేము తిరిగి పుంజుకున్నాం. ఆర్చర్ తన మ్యాజిక్ చూపించాడు.జాగ్రత్తగానే ఉంటాముఇక లక్ష్య ఛేదనలో బాంటన్ అద్భుతం చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి గొప్పగా ఆడాడు. కోల్కతా వికెట్ బాగుంది. సామ్ కర్రాన్ సైతం కాసేపు మెరుపులు మెరిపించాడు. మా చివరి మ్యాచ్లో ఇటలీతో తలపడతాం. వాళ్లతో జాగ్రత్తగానే ఉంటాము’’ అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. కాగా కోల్కతా వేదికగా శనివారం ఇంగ్లండ్- స్కాట్లాండ్ తలపడ్డాయి.వణికించిన పసికూనఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో 152 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (32 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మైకేల్ జోన్స్ (20 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లు రషీద్ (3/36), ఆర్చర్ (2/24), డాసన్ (2/34) స్కాట్లాండ్ బ్యాటర్ల పనిపట్టారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి గెలిచింది. ఆరంభమైన తొలి ఓవర్లో సాల్ట్ (2), రెండో ఓవర్లో బట్లర్ (3)... ఇలా ఇద్దరు మేటి హిట్టర్లను 13 పరుగులకే కోల్పోయింది. ఈ దశలో బెథెల్ (28 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ ఇంగ్లండ్ను ఆదుకున్నారు.గెలిపించిన బాంటన్అయితే జట్టు స్కోరు 79 వద్ద బెథెల్, కాసేపటికే కెప్టెన్ బ్రూక్ (4) వికెట్లు పారేసుకోవడంతో మళ్లీ 86/4 స్కోరు వద్ద ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. దీంతో జట్టును గెలిపించే బాధ్యతను పూర్తిగా తన భుజాన వేసుకున్న టామ్ బాంటన్ (41 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్ధసెంచరీతో గెలిపించాడు.బాంటన్కు తోడు సామ్ కరన్ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్లు), జాక్స్ (16 నాటౌట్)లు రాణించారు. ఫలితంగా ఇంకో 10 బంతులు మిగిలుండగానే ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మెక్ములెన్, క్యూరి, వీల్, లీస్క్ తలా ఒక వికెట్ తీశారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ తమ రెండోమ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. History made! ✍️England register their first-ever T20 World Cup win over a European side with a solid five-wicket victory over Scotland. 👏Up next ➡️ ICC Men’s #T20WorldCup | #NZvSA | LIVE NOW 👉 https://t.co/QWNvn10eTj pic.twitter.com/mscD1rxSmH— Star Sports (@StarSportsIndia) February 14, 2026చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ -
వైభవ్ సూర్యంశీ సంచలన నిర్ణయం!
విధ్వంసకర ఆట తీరుతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో సత్తా చాటి వెలుగులోకి వచ్చిన ఈ బిహారీ పిల్లాడు.. భారత్ తరఫునా అదరగొడుతున్నాడు. పద్నాలుగేళ్ల వయసులోనే అండర్-19 స్థాయిలో అదరగొడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వరల్డ్కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు.జింబాబ్వే వేదికగా ఇంగ్లండ్పై భారీ శతకం (80 బంతుల్లో 175) బాదిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ ఆరోసారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు భారత్ అండర్-19 జట్టు తరఫున ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డ మీద ఈ చిచ్చరపిడుగు సత్తా చాటాడు.అంతేకాదు.. దక్షిణాఫ్రికాలో ఏకంగా కెప్టెన్గా వ్యవహరించిన వైభవ్.. యూత్ వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడం విశేషం. ఇలా టీనేజ్లోనే క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ఆటతో బిజీగా ఉన్న కారణంగా చదువు విషయంలో ఏడాది వెనుకపడనున్నాడు.బిహార్లోని తేజ్పూర్కు చెందిన వైభవ్ సూర్యవంశీ.. అక్కడి మాడెస్టీ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17- మార్చి 11 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ క్లాస్ 10 బోర్డు ఎగ్జామ్కు వైభవ్ సూర్యవంశీ హాజరు కావాల్సి ఉంది. తొలుత వైభవ్ పరీక్షలు రాస్తాడని వార్తలు వచ్చాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది పరీక్షలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మాడెస్టీ స్కూల్ డైరెక్టర్ ఆదర్శ్ కుమార పింటూ నిర్ధారించారు. వైభవ్కు అడ్మిట్ కార్డు కూడా జారీ చేశామని.. అయితే, ఆఖరి నిమిషంలో అతడు మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలిపినట్లు పింటూ పేర్కొన్నారు. కాగా వరుస సిరీస్లు, వరల్డ్కప్ టోర్నీతో బిజీగా గడిపిన వైభవ్.. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ క్యాంపుతో ఐపీఎల్కు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. దీంతో పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాడని.. అందుకే ఈసారి పరీక్షలు రాయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆటతో పాటు వైభవ్ చదువును కూడా బ్యాలెన్స్ చేస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దిగ్గజాల క్వాలిఫికేషన్ తెలుసా?ఇక వైభవ్ పరీక్షలు స్కిప్ చేసిన నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాల విద్యార్హతల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఈ ముంబైకర్ ఆట మీద మాత్రమే దృష్టి పెట్టి అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్గా ప్రసిద్ధికెక్కాడు.మరోవైపు.. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఇంటర్ చదివాడు. రైల్వేలో ఉద్యోగం చేస్తూ టీమిండియాలోకి వచ్చి జట్టు గతినే మార్చివేశాడు ఈ జార్ఖండ్ డైనమైట్. ఇక ఢిల్లీకి చెందిన రన్మెషీన్ విరాట్ కోహ్లి కూడా పన్నెండో తరగతి వరకే చదివాడు. అదే విధంగా.. భారత్కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథి, ముంబైకర్ రోహిత్ శర్మ సైతం ఇంటర్తోనే ఆపివేసినట్లు తెలుస్తోంది.చదవండి: IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య -
IND vs PAK: ‘వర్షం పడాలని కోరుకుంటున్నా’
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. దాయాదులు భారత్- పాకిస్తాన్ పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) మ్యాచ్ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. వరుణుడి భయం అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది.వాన పడొద్దు దేవుడా!కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో గ్రూప్-ఎలో ఉన్న భారత్- పాక్ మధ్య మ్యాచ్కు శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్. ప్రేమదాస స్టేడియం వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే, ఆదివారం కొలంబోలో వాన పడే అవకాశాలు 93 శాతం ఉన్నట్లు ఆక్యూవెదర్ పేర్కొంది. సాయంత్రానికి వర్షం ముప్పు తగ్గినా అవుట్ ఫీల్డ్ తడిగా ఉంటే మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు సన్నగిల్లుతాయి.ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా వర్షం ప్రభావం ఈ మ్యాచ్పై పడకుండా చూడాలంటూ దేవుడిని వేడుకుంటున్నారు. క్రేజీ మ్యాచ్ కోసం తామంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని.. తమ ఆశలపై నీళ్లు చల్లవద్దని వరుణుడిని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ (Basit Ali) వింత వ్యాఖ్యలు చేశాడు.వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాఓ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. "ఆ సర్వాంతర్యామి (దేవుడు) నా ప్రార్థన విని వర్షం పడేలా చేయాలి’’ అని బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. ఇందుకు హోస్ట్.. "మీరు మ్యాచ్ మొత్తం చూడాలని అనుకోవడం లేదా?" అని అడుగగా.. "నేను వర్షం పడాలని కోరుకుంటున్నాను (I Want Rain)" అని పునరుద్ఘాటించాడు.అదే జరిగితే మ్యాచ్ రద్దుకాగా వరల్డ్కప్ గ్రూప్ దశ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉండదు. ఫలితం కోసం ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అదీ కుదరని పక్షంలో మ్యాచ్ రద్దైనట్లు అంపైర్లు ప్రకటిస్తారు. ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.ప్రస్తుతం టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత్.. అమెరికా, నమీబియాలపై గెలిచి నాలుగు పాయింట్లు సాధించగా.. పాకిస్తాన్ సైతం నెదర్లాండ్స్, అమెరికా జట్లను ఓడించి నాలుగు పాయింట్లతో ఉంది. అయితే, నెట్రన్రేటు పరంగా టీమిండియా (+3.050) పాకిస్తాన్ (+0.932) అత్యంత మెరుగ్గా ఉండి అగ్రస్థానాన్ని ఆక్రమించింది.ఇదేం కోరిక?ఒకవేళ దాయాదుల పోరు వర్షం వల్ల రద్దు అయిపోతే.. భారత్- పాక్ ఐదు పాయింట్లతో సూపర్-8 దశకు దాదాపుగా అర్హత సాధించినట్లే. గ్రూప్ దశలో అమెరికా, నెదర్లాండ్స్లకు చెరో మ్యాచ్ మిగిలి ఉండగా.. నమీబియా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే, నెదర్లాండ్స్ (-1.352), నమీబియా (-2.884) నెట్రన్రేటు మైనస్లలో ఉండటం గమనార్హం.ఇక గత వరల్డ్కప్ ఎడిషన్లో అనూహ్య రీతిలో పాకిస్తాన్ను ఓడించి టీమిండియాతో పాటు అమెరికా సూపర్-8కు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాక్ టోర్నీ నుంచి అవమాన భారంతో నిష్క్రమించింది. ఇక ఇప్పుడు భారత్ చేతిలో పాక్ గనుక భారీ తేడాతో ఓడితే మళ్లీ అమెరికాతో ప్రమాదం పొంచి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే భారత్- పాక్ మ్యాచ్ వాన వల్ల చెడిపోవాలని బసిత్ అలీ కోరుకుంటున్నాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.IND vs PAK T20 World Cup 2026: భారత్ ‘రుద్ర’ రూపంచదవండి: IND vs PAK: పాక్తో భారత్ మ్యాచ్.. మధ్యాహ్నమే! -
T20 WC 2026: ధోని ప్రపంచ రికార్డు బద్దలు
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఈ వికెట్ కీపర్ బ్యాటర్ బద్దలు కొట్టాడు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా శనివారం నాటి మ్యాచ్లో సౌతాఫ్రికా న్యూజిలాండ్తో తలపడింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన సఫారీ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది.యాన్సెన్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రొటిస్ బౌలర్లలో మార్కో యాన్సెన్ (Marco Jansen) నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఎంగిడి, కేశవ్ మహరాజ్, బాష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. మరోవైపు.. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (Quinton de Kock) కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (13) ఇచ్చిన క్యాచ్ను అందుకున్నాడు.ధోని వరల్డ్ రికార్డు బద్దలుఈ క్రమంలో టీ20 వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్గా డికాక్ చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ధోని పేరిట ఉండేది. టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో ధోని 32 ఇన్నింగ్స్లో 32 డిస్మిసల్స్లో భాగం కాగా.. డికాక్ 30 ఇన్నింగ్స్లోనే 33 సార్లు ప్రత్యర్థి బ్యాటర్ అవుట్ కావడంలో తన వంతు పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. కివీస్ విధించిన నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు సాధించింది. తద్వారా న్యూజిలాండ్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ మెరుపు, అజేయ అర్ధ శతకం (44 బంతుల్లో 86)తో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక మరో ఓపెనర్ డికాక్ మాత్రం (14 బంతుల్లో 20) నిరాశపరిచాడు.Aiden Markram goes big over long-on for his third six of the innings! 💥The Proteas have started strong, racing past the 50-run mark in under 4 overs.ICC Men’s #T20WorldCup | #NZvSA | LIVE NOW 👉https://t.co/QWNvn10eTj pic.twitter.com/Fz1rZvafPE— Star Sports (@StarSportsIndia) February 14, 2026టీ20 ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లు👉క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా)- 33 డిస్మిసల్స్👉ఎంఎస్ ధోని (ఇండియా)- 32 డిస్మిసల్స్👉కమ్రాన్ అక్మల్ (పాకిస్తాన్)- 30 డిస్మిసల్స్👉దినేశ్ రామ్దిన్ (వెస్టిండీస్)- 27 డిస్మిసల్స్.చదవండి: IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య -
పాక్తో భారత్ మ్యాచ్.. మధ్యాహ్నమే!
క్రికెట్ ప్రపంచంలో దాయాదులు భారత్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లకు ఉన్న ఆదరణ వేరు. ఏ స్థాయిలోనైనా చిరకాల ప్రత్యర్థుల పోరుకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వీరాభిమానులకు ఆదివారం (ఫిబ్రవరి 15) పండుగే. వారి కోసం భారత్- పాక్ మ్యాచ్ డబుల్ ధమాకా ఎదురుచూస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోఓ వైపు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ శ్రీలంక వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్- సల్మాన్ ఆఘా బృందంతో అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు మహిళల ‘ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (ACC Women's Asia Cup Rising Stars 2026)’ టోర్నీలో కూడా ఈ రెండు జట్ల మధ్య నేడు (ఆదివారం) పోరు జరగనుంది.మధ్యాహ్నం 12.30 గంటలకు ఆరంభంభారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు దాయాది మహిళా జట్ల మధ్య మ్యాచ్ మొదలు అవుతుంది. బ్యాంకాక్లోని టెర్థాయ్ క్రికెట్ మైదానం ఇందుకు వేదిక. కాగా మహిళ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లతో పాటు యూఏఈ, నేపాల్ తలపడుతున్నాయి.అగ్రస్థానంలో పాక్ఇక గ్రూప్-బి నుంచి ఆతిథ్య థాయ్లాండ్, బంగ్లాదేశ్-ఎ, శ్రీలంక-ఎ, మలేషియా జట్లు పోటీలో ఉన్నాయి. గ్రూప్-లో తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ నేపాల్పై 30 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు.. భారత్-ఎ జట్టు మాత్రం అనూహ్య రీతిలో పసికూన యూఏఈ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.రాధ యాదవ్ కెప్టెన్సీలోఫలితంగా గ్రూప్-ఎలో ప్రస్తుతానికి పాక్, యూఏఈ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్, నేపాల్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాగా భారత మహిళల సీనియర్ జట్టు సభ్యురాలైన రాధ యాదవ్ కెప్టెన్సీలో భారత్-ఎ జట్టు ఈ టీ20 టోర్నీ బరిలో దిగింది. మన మహిళల బృందంలో అనుష్క శర్మ, తేజల్ హసబ్నిస్, మిన్ను మణి, నందిని శర్మవంటి ఉమెన్ ప్రీమియర్ లీగ్ స్టార్లు కూడా ఉన్నారు.ఎక్కడ చూడాలంటే?ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత్- పాక్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, జియోహాట్స్టార్లో ప్రసారం కానుండగా.. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో దాయాదుల పోరును సోనీ స్పోర్ట్స్ టీవీ నెట్వర్క్, సోనీ లివ్ ఇండియాలో వీక్షించవచ్చు.UPDATES: పాక్ను చిత్తుగా ఓడించిన భారత్T20 World Cup 2026: భారత్ ‘రుద్ర’ రూపంచదవండి: T20 WC 2026: పాక్తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు -
IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య
పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు వైవిధ్యమైన బౌలర్ అన్న మాట వాస్తవమేనని.. అయితే, తాము మాత్రం అతడి ఆటకు లొంగమని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ ఆదివారం ముఖాముఖి తలపడనున్న విషయం తెలిసిందే. శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్.ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక.అపుడే చూస్తారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పలు విషయాలపై స్పందించాడు. ముఖ్యంగా పాక్ ఆటగాళ్లతో ఈసారి కరచాలనం చేస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘మేం చక్కటి క్రికెట్ ఆడేందుకే ఇక్కడికి వచ్చాం. అది మాత్రమే అత్యంత ముఖ్యం. మిగతావన్నీ అనవసర విషయాలు.షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పను. మ్యాచ్ ప్రారంభమైనప్పుడే మీరు చూస్తారు’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. సున్నా నుంచి మొదలుఇక టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో పాక్పై 7-1తో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తున్న అంశం ప్రస్తావనకు రాగా.. ‘‘పాక్పై పాత రికార్డు ఇక్కడ పనికి రాదు. మళ్లీ సున్నా నుంచి స్కోరు మొదలు పెట్టాల్సిందే’’ అని సూర్య నిజాయితీగా సమాధానం ఇచ్చాడు.అదే విధంగా ఉస్మాన్ తారిఖ్ (Usman Tariq)నైపుణ్యాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘పరీక్షలో సెలబస్ నుంచి కాకుండా ఇతర అంశాల గురించి ప్రశ్నలు వచ్చినంత మాత్రాన దానిని వదిలివేయలేము కదా!.. అతడి ఆటకు మేము లొంగిపోముఅతడొక వైవిధ్యమైన బౌలర్. అయినంత మాత్రాన మేము అతడి ఆట ముందు లొంగిపోము. అతడి బౌలింగ్లో ఆడేందుకు మా వాళ్లు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు’’ అని సూర్య పేర్కొన్నాడు.చకింగ్ ఆరోపణలుకాగా తన వైవిధ్యమైన బౌలింగ్ శైలితో పాక్ ఆఫ్స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ వార్తల్లో నిలుస్తున్నాడు. ‘చకింగ్ (సందేహాస్పద బౌలింగ్)’ చేస్తున్నాడంటూ ఆరోపణలు వినిపించినా...రెండు సార్లు అతడి యాక్షన్కు ఐసీసీ అనుమతి ఇచ్చింది. కాబట్టి నిబంధనల ప్రకారం తప్పు లేకపోవచ్చు. ఈ విషయం గురించి పలువురు మాజీ అంపైర్లు కూడా ఇదే చెప్పారు.అయితే బంతి విసిరే ముందు అతను కాస్త ఆగినట్లుగా ఉంటూ (పాజ్) వేయడం చర్చకు దారి తీసింది. ఇది బ్యాటర్ను గందరగోళంలో పడేయవచ్చని... బ్యాటర్ కూడా కాస్త జరిగి షాట్ ఆడటమే దీనికి ఉపాయమని అశ్విన్ విశ్లేషించాడు. అంత సీన్ లేదుఅయితే తారిఖ్ యాక్షన్ ఎలా ఉన్నా... అతడు సాధారణ ఆఫ్స్పిన్నర్ మాత్రమేనని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయ పడ్డాడు. భారత బ్యాటర్లు అతడి బౌలింగ్లో చెలరేగుతారని ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: T20 WC 2026: పాక్తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు -
అసలు సమరానికి సమయం
ఫిబ్రవరి 1...టి20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్... ఫిబ్రవరి 5...మాకు అవన్నీ తెలీదు...మా కొలంబో ఫ్లయిట్ బుక్ అయిపోయిందన్న సూర్యకుమార్... ఫిబ్రవరి 9...భారత్తో మ్యాచ్ ఆడేందుకు మేం సిద్ధమంటూ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటన... ఫిబ్రవరి 15...భారత్, పాక్ మధ్య కొలంబోలో మ్యాచ్కు రంగం సిద్ధం...ప్రపంచకప్లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మాట్లో అయినా కనిపించే ఆసక్తి, ఉత్సాహమే వేరు...1992 నుంచి అభిమానులు ఇది చూస్తూనే వచ్చారు...ఫలితం ఎలా ఉన్నా, ఏకపక్షంగా సాగినా ఈ మ్యాచ్కు ఉండే ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై సాగే సుదీర్ఘ వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థితిలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ లేదంటే సహజంగానే పెద్ద చర్చే జరిగింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది...కొలంబో వెళ్లే ఫ్లయిట్ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటే హోటళ్లలో ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమైనా ఖాళీ లేదనే సమాధానం వచ్చేస్తోంది. మైదానంలోనే ఉండి జట్టుకు మద్దతుగా నిలవాలనుకునే వేలాది మంది మాత్రమే కాదు...తమ ఇళ్లనుంచి కన్నార్పకుండా ప్రతీ బంతిని చూసే ఫ్యాన్స్ సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మరో వరల్డ్ కప్ పోరుకు ఇరు జట్లు సై అంటున్నాయి. ఇటీవల ఆసియా కప్లో 3–0తో పాక్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఈ సారి ఎలాంటి ప్రదర్శనతో చెలరేగుతుందో చూడాలి. కొలంబో: టి20 వరల్డ్ కప్లో మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు భారత్, పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతీ టి20 వరల్డ్ కప్లో తలపడుతున్న ఇరు జట్లు ఈ సారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. ప్రేమదాస స్టేడియంలో నేడు (ఆదివారం) జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో పాకిస్తాన్ను భారత్ ఎదుర్కొంటుంది. రెండు జట్లూ తమ తొలి రెండు మ్యాచ్లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా...ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈ సారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కుల్దీప్కు అవకాశం... భారత బ్యాటింగ్ లైనప్కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్ను ఇప్పటికే ప్రదర్శించారు. రింకూ సింగ్కు తగిన అవకాశం రాకపోగా, తిలక్ వర్మ కూడా రెండు సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా గత మ్యాచ్ తరహాలో భారీ స్కోరు ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత తన తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న సామ్సన్ మాత్రం విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ అనారోగ్యంనుంచి పూర్తిగా కోలుకుంటే సామ్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చేస్తాడు. అమెరికాపై డకౌట్ అయిన అభిషేక్ తన స్థాయికి తగినట్లు విజృంభిస్తే పాక్ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఒంటిచేత్తో అతను అందించే ఆరంభం భారత్ భారీ స్కోరుకు పునాది అవుతుంది. బౌలింగ్కు సంబంధించి తుది జట్టులో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఇక్కడి పిచ్ను బట్టి చూస్తే భారత్ మూడో రెగ్యులర్ స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు ‘మిస్టరీ’గానే ఉన్న వరుణ్ చక్రవర్తి, అక్షర్లతో పాటు కుల్దీప్ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అర్ష్ దీప్ స్థానంలో అతను ఆడతాడు. పాండ్యా, దూబే కూడా బౌలింగ్ భారం పంచుకుంటారు కాబట్టి రెగ్యులర్ పేసర్గా బుమ్రాకు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవలి ఫామ్, బలాబలాలను చూస్తే పాక్కంటే టీమిండియా ఎంతో ముందుంది. బాబర్ ఆజమ్ రాణించేనా... అమెరికాపై భారీ విజయం సాధించిన పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. పాక్ ఇప్పటికే ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు అబ్రార్, తారిఖ్లతో పాటు స్పిన్ ఆల్రౌండర్లు నవాజ్, షాదాబ్లతో ఆడుతోంది. అవసరమైతే అయూబ్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. వీరిలో తారిఖ్ మినహా మిగతా బౌలర్లందరిపై భారత్ గతంలోనే తమ ప్రతాపం చూపించింది. కొత్త తరహా, చర్చనీయాంశమైన యాక్షన్తో ఆడే ఆఫ్స్పిన్నర్ తారిఖ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరం. భారత్ తమ సన్నాహకాల్లో దీనిపై కూడా దృష్టి పెట్టి ఉండవచ్చు. పేసర్ షాహిన్ అఫ్రిది చాలా కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సారి కూడా భారత బ్యాటర్లను నిలువరించడం అతనికి కష్టం కావచ్చు. లైనప్లో టాప్–4 మాత్రమే రెగ్యులర్ బ్యాటర్లు ఉన్నారు. అయూబ్, కెప్టెన్ ఆగా ఆసియా కప్లో భారత్పై వరుసగా విఫలమవగా, ఫర్హాన్ ఒక్కడే రాణించాడు. కెప్టెన్ అయిన తర్వాత సల్మాన్ ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తమ జట్టుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా స్టార్ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న బాబర్ ఆజమ్ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. అతను తన సత్తాను ప్రదర్శించేందుకు ఇంతకంటే సమయం, వేదిక ఉండవని పాక్ అభిమానులు భావిస్తున్నారు. 13 భారత్, పాక్ మధ్య ఓవరాల్గా 16 మ్యాచ్లు జరగ్గా...13 గెలిచిన భారత్ 3 ఓడింది.7-1 టి20 ప్రపంచ కప్లో భారత్, పాక్ మధ్య 8 మ్యాచ్లు జరగ్గా... భారత్ 7 గెలిచి ఒకటే ఓడింది.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. అయితే బౌలర్లూ ప్రభావం చూపించగలరు. మ్యాచ్కు ముందు రోజు మాత్రమే భారత్ ఇక్కడ సాధన చేసింది. పాక్ జట్టు కొలంబోలోనే ఉన్నా... తమ రెండు మ్యాచ్లను ఎస్ఎస్సీ మైదానంలో ఆడింది కాబట్టి తేడా ఉండకపోవచ్చు. అయితే మ్యాచ్ను వాన గండం వెంటాడుతోంది. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తుది జట్లు (అంచనా): భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్ ), ఫర్హాన్, అయూబ్, బాబర్ ఆజమ్, షాదాబ్, ఉస్మాన్, నవాజ్, ఫహీమ్, షాహిన్ అఫ్రిది, తారిఖ్, అబ్రార్ టి20 ప్రపంచకప్లో నేడువెస్టిండీస్ X నేపాల్వేదిక: ముంబై; ఉదయం 11 గంటల నుంచిఅమెరికా X నమీబియావేదిక: చెన్నై; మధ్యాహ్నం 3 గంటల నుంచి -
మహిళల పోరులో పైచేయి ఎవరిదో!
సిడ్నీ: భారత మహిళల క్రికెట్ జట్టు కూడా కీలకమైన టి20 పోరుకు సిద్ధమైంది. భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు తొలి సమరం జరుగుతుంది. వన్డే వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టి20 సిరీస్ ఆడి క్లీన్స్వీప్ చేసిన హర్మన్ప్రీత్ సేన ఇప్పుడు ఒక పెద్ద జట్టుతో ప్రత్యర్థి గడ్డపై తలపడుతోంది. కెపె్టన్ హర్మన్తో పాటు రెగ్యులర్ ఆటగాళ్లు స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ బ్యాటింగ్లో చెలరేగితే భారత్ పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్ల్యూపీఎల్లో టాప్స్కోరర్గా నిలిచి అద్భుతమైన ఫామ్తో స్మృతి ఈ సిరీస్కు సిద్ధమైంది. గత టి20 వరల్డ్ కప్ తర్వాతి నుంచి 143.54 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధిస్తున్న స్మృతికి ఆసీస్ గడ్డపై కూడా మంచి రికార్డు ఉంది. క్రాంతి, అరుంధతి, శ్రీచరణి, శ్రేయాంక, రేణుకా సింగ్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటారు. మరో వైపు కొత్త కెప్టెన్ సోఫీ మోలినే నాయకత్వంలో ఆసీస్ బరిలోకి దిగుతోంది. గత 19 టి20 సిరీస్లలో ఆ్రస్టేలియా ఒక్కటి మాత్రమే ఓడింది. అలీసా హీలీ ఈ ఫార్మాట్నుంచి రిటైరైనా... ఇతర స్టార్లు ఎలైస్ పెరీ, సదర్లాండ్, మూనీ, లిచ్ఫీల్డ్, వోల్, వేర్హామ్లకు జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉంది. ఆ్రస్టేలియాలో భారత పర్యటనను ప్రతీ ఫార్మాట్కు వేర్వేరుగా కాకుండా తొలిసారి మూడు ఫార్మాట్లలో ప్రదర్శనను బట్టి సిరీస్ విజేతను నిర్ణయిస్తారు. 3 టి20, 3 వన్డేలు, ఒక టెస్టు తర్వాత ఇది తేలుతుంది. పరిమిత ఓవర్లలో ఒక విజయానికి 2 పాయింట్లు, టెస్టులో విజయానికి 4 పాయింట్లు...టెస్టు డ్రా అయితే చెరో 2 పాయింట్లు కేటాయిస్తారు. -
మార్క్రమ్, యాన్సెన్ జోరు
అహ్మదాబాద్: బౌలింగ్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కో యాన్సెన్ జోరు (4/40), బ్యాటింగ్లో కెప్టెన్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (44 బంతుల్లో 86 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుతో దక్షిణాఫ్రికా ఖాతాలో మరో విజయం చేరింది. గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్లో సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన మార్క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మార్క్ చాప్మన్ (26 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలిచింది. ఫెర్గూసన్, నీషమ్, రచిన్ రవీంద్రలకు తలా ఒక వికెట్ దక్కింది. టాపార్డర్ టపటపా... ఇన్గిడి మూడో ఓవర్లో అలెన్ 3 ఫోర్లు, 1 సిక్స్తో కివీస్ శిబిరానికి జోష్ తెచ్చాడు. యాన్సెన్ తర్వాతి ఓవల్లో సీఫెర్ట్ (13) అవుటైనా... అలెన్ 4, 6తో జోరు కొనసాగించే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఆరో ఓవర్ వేసిన యాన్సెన్ ఈ సారి రచిన్ రవీంద్ర (13), అలెన్ (17 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుకు చెక్పెట్టాడు. కివీస్ పవర్ ప్లే కష్టాల నుంచి కోలుకోకముందే కేశవ్ మహరాజ్... ఫిలిప్స్ (1)ను బౌల్డ్ చేయడంతో 64 పరుగుల వద్ద కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది.ఈ దశలో చాప్మన్ ధాటిగా ఆడి న్యూజిలాండ్ స్కోరు పెంచాడు. డారిల్ మిచెల్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో నీషమ్ (15 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో న్యూజిలాండ్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. యాన్సెన్ సగటున ఓవర్కు 10 చొప్పున పరుగులిచ్చినా కీలక వికెట్లు తీశాడు. రఫాడించిన మార్క్రమ్ కివీస్ చేసిందేమీ తక్కువ స్కోరు కాదు. దీంతో ఈ గ్రూప్లో రెండు పోటీ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరుగుతుందనుకుంటే మార్క్రమ్ ఏకపక్షంగా మార్చేశాడు. అతను ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా మూడో ఓవర్లోనే 50 స్కోరుకు చేరుకుంది. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద డికాక్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. కాసేపటికే మార్క్రమ్ 19 బంతుల్లోనే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా తరఫున వేగవంతమైన అర్ధశతకాన్ని సాధించాడు. రికెల్టన్ (11 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా కెప్టెన్లాగే కివీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 7.2 ఓవర్లలోనే వంద పరుగులు దాటింది. తర్వాత వచ్చిన బ్రెవిస్ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), మిల్లర్ (17 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో ఇంకో 2.5 ఓవర్లముందే సఫారీ లక్ష్యాన్ని దాటేసింది. -
బెల్జియం చేతిలో భారత్ ఓటమి
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భారత జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో బెల్జియం 4–2 గోల్స్ తేడాతో భారత్ను ఓడించింది. బెల్జియం తరఫున హ్యూగో లబుషేర్ (11వ నిమిషం), అలెగ్జాండర్ హెన్డ్రిక్ (14వ ని., 17వ ని.), ఆర్థర్ స్లూవర్ (15వ ని.) గోల్స్ నమోదు చేశారు. భారత ఆటగాళ్లలో ఆదిత్య అర్జున్ (24వ ని.), హర్మన్ప్రీత్ సింగ్ (37వ ని.) గోల్స్ సాధించారు. తొలి క్వార్టర్లో 3 గోల్స్ సాధించి బెల్జియం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్లో ఇరు జట్లు చెరో గోల్ చేయగా, మూడో క్వార్టర్లో భారత్ ఖాతాలో మరో గోల్ చేరింది. అయితే చివరి క్వార్టర్లో రాణించి ఓటమినుంచి తప్పించుకోవాలని భారత్ చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. శనివారం జరిగిన మరో మ్యాచ్లో జర్మనీ 6–1 గోల్స్ తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. నేడు జరిగే పోరులో అర్జెంటీనాతో భారత్ తలపడుతుంది. -
T20 WC 2026: స్కాట్లాండ్పై ఇంగ్లండ్ ఘన విజయం
టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం కోల్కతా వేదికగా స్కాట్లాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ రిచీ బెరింగ్టన్(49) టాప్ స్కోరర్గా నిలవగా.. మైకేల్ జోన్స్(33), బ్రూస్(24) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్చర్, డాసన్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడినప్పటికి, మిడిల్ ఆర్డర్ రాణించడంతో విజయాన్ని అందుకుంది.టామ్ బాంటన్(41 బంతుల్లో 63 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. జాకబ్ బెథెల్(32), సామ్ కర్రన్(28) రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో మెక్ముల్లన్, బ్రాడ్ వీల్, కుర్రీ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో గ్రూప్-సిలో ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరుకోగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. -
పాక్తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్లో ఉన్న టీమిండియా.. అదే జోరును దాయాది జట్టుపై కూడా కొనసాగించాలని భావిస్తోంది.అయితే ఈ హైవోల్టేజ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. తిరిగి పాక్తో మ్యాచ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే సంజూ శాంసన్పై వేటు పడనుంది.గత మ్యాచ్లో సంజూకు అవకాశం లభించినప్పటికి సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. దూకుడుగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అదేవిధంగా కొలంబో పిచ్ స్పిన్కు అనుకూలించే అవకాశముండడంతో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. నమీబియాతో మ్యాచ్లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్దీప్ సింగ్ లేదా రింకూ సింగ్లో ఎవరో ఒకరిని పక్కన పెట్టే అవకాశముంది. పాక్పై కుల్దీప్ యాదవ్కు అద్భుతమైన రికార్డు (3 టీ20ల్లో 8 వికెట్లు) ఉంది. కాబట్టి అతడిని తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో ఆదివారం వర్షం కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.పాక్తో మ్యాచ్కు భారత తుది జట్టు(అంచనా): సంజు శాంసన్/అభిషేక్ శర్మ,ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
'అతడితో జాగ్రత్త'.. పాక్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు వార్నింగ్
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. హై-వోల్టేజ్ పోరుకు ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ను తక్కువగా అంచనా వేయవద్దని భారత జట్టును భజ్జీ హెచ్చరించాడు.ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో భారత్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ పాకిస్తాన్ జట్టులో ఉస్మాన్ తారిక్ లాంటి అద్భుతమైన స్పిన్నర్ ఉన్నాడు. అతడిని భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. అయితే మన జట్టుపై పూర్తి నమ్మకం నాకు ఉంది. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. టీమిండియా ఎప్పటిలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి గెలుపు జెండా ఎగరవేస్తారని ఆశిస్తున్నాము అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.కాగా ఉస్మాన్ తారిఖ్ తన బౌలింగ్ యాక్షన్తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి బౌలింగ్ను ఆర్ధం చేసుకునేందుకు బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. బంతిని విసిరే ముందు కొద్దిసేపు ఆగి డెలివరీ చేసే అతడి బౌలింగ్ శైలి కేదార్ జాదవ్ను తలపిస్తోంది. అతడి బౌలింగ్ యాక్షన్పై వివాదాలు తలెత్తినప్పటికి.. ఐసీసీ మాత్రం క్లియరెన్స్ ఇచ్చింది. తారిఖ్ ఇప్పటివరకు కేవలం 4 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. పాక్ జట్టు కూడా అతడిపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది.చదవండి: T20 WC 2026: భారత ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే -
భారత ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ పోరుకు సమయం అసన్నమైంది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఆదివారం దాయాది జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇప్పటికే కొలంబోకు చేరుకున్న ఇరు జట్లు.. శనివారం సాయంత్రం తమ ప్రాక్టీస్ సెషన్ష్లలో పాల్గోనున్నాయి.కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్లో చోటు చేసుకున్న హ్యాండ్ షేక్ వివాదంపై అఘా మాట్లాడాడు. దేశాల మధ్య ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా, మైదానంలో మాత్రం క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని ఆఘా చెప్పుకొచ్చాడు."క్రికెట్ ఎల్లప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఆడాలి. క్రీడల్లో రాజకీయాలకు తావులేదు. క్రికెట్ ఒక జెంటిల్మ్యాన్ గేమ్. ప్రతీ ఒక్కరూ హుందాగా వ్యవహరించాలి" సల్మాన్ పేర్కొన్నాడు. అదేవిధంగా రేపటి మ్యాచ్లో భారత్-పాక్ ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా అన్న ప్రశ్నకు.. "రేపు మీకే తెలుస్తుంది" అని సల్మాన్ సమాధానమిచ్చాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగా కోలుకోవాలని, రేపటి మ్యాచ్లో ఆడాలని తాను కోరుకుంటున్నట్లు అఘా తెలిపాడు.కాగా పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఆసియాకప్లో పాక్ ఆటగాళ్లతో భారత్ కరచాలనం నిరకారించింది. ఆ తర్వాత భారత మహిళల జట్టు, అండర్-19 జట్టు కూడా అదే బాటలో నడిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో పాక్ ప్లేయర్లతో భారత్ హ్యాండ్ షేక్ చేయలేదు. ఇప్పుడు పొట్టి ప్రపంచకప్లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశముంది. -
ఒమన్ను చిత్తు చేసిన ఐర్లాండ్.. సెమీస్ ఆశలు సజీవం
టీ20 ప్రపంచకప్-2026లో ఐర్లాండ్ బోణీ కొట్టింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో ఒమన్పై 96 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. దీంతో ఐరీష్ జట్టు తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.టాపార్డర్ విఫలమైనప్పటికి మిడిలార్డర్ బ్యాటర్లు లోర్కాన్ టక్కర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. ముఖ్యంగా టక్కర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టక్కర్ కేవలం 51 బంతుల్లో 94 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి నాటౌట్గా నిలిచాడు. డెలానీ 30 బంతుల్లో 56 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. జార్జ్ డాక్రెల్ కేవలం 9 బంతుల్లోనే 5 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఒమన్ బౌలర్లలో షకీల్ అహ్మద్ మూడు, కలీం రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్.. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి 18 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది.ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ కలీం (50),హమ్మద్ మీర్జా (46) రాణించగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 3 వికెట్లు పడగొట్టగా.. బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ చెరో రెండు వికెట్లు తీశారు. -
కొలంబోకు చేరుకున్న అభిషేక్ తల్లిదండ్రులు.. పాక్తో మ్యాచ్కు డౌటే
టీ20 ప్రపంచకప్-2026లో కొలంబో వేదికగా ఆదివారం పాకిస్తాన్-భారత్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడుతాడా లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యాడు.అయితే ఆస్పత్రి నుంచి అభిషేక్ డిశ్చార్జ్ అయినప్పటికి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించికపోయినట్లు తెలుస్తోంది. కానీ అభిషేక్ భారత జట్టుతో కలిసి కొలంబోలో అడుగుపెట్టాడు. అతడు ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.కాగా శనివారం (ఫిబ్రవరి 14) సాయంత్రం జరిగే నెట్ సెషన్లో అభిషేక్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రాక్టీస్ తర్వాతే అతను పాకిస్థాన్తో మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ను చూసేందుకు అతడి తల్లిదండ్రులు కొలంబోకు చేరుకున్నారు. ఒకవేళ అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకోకపోతే సంజూ శాంసన్ ఓపెనర్గా కొనసాగనున్నాడు. -
పాక్తో మ్యాచ్.. అర్ష్దీప్ సింగ్ కంటే అతడే బెటర్: గవాస్కర్
టీ20 ప్రపంచకప్-2026లో హైవోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో బాగంగా ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి దాయాది జట్టుకు మరోసారి ఓటమి రుచిని చూపించాలని భారత్ పట్టుదలతో ఉంది.అయితే పాక్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్లు ఉండడంతో భారత్కు జట్టుకు గట్టి పోటీ ఎదురు కానుంది అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత టీమ్ మెనెజ్మెంట్కు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా గురువారం(ఫిబ్రవరి 12) నమీబియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ, అర్ష్దీప్ సింగ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు."నమీబియాతో మ్యాచ్లో భారత బౌలర్లందరూ వికెట్లు తీశారు. అర్ష్దీప్ ఓ వికెట్ పడగొట్టినప్పటికి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడితో మూడు ఓవర్లు మాత్రమే కెప్టెన్ బౌలింగ్ చేయించాడు. శివమ్ దూబే సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ను రొటేట్ చేసిన విధానం చూస్తుంటే పాక్ మ్యాచ్ కోసం ఒక ప్రణాళికతో ఉన్నట్లు కన్పిస్తోంది. పాక్తో మ్యాచ్కు అర్ష్దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. అందుకేనేమో నమీబియాతో మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్కు బదులుగా పాండ్యాతో మొదటి ఓవర్ను బౌలింగ్ వేయించాడు. అదేవిధంగా శ్రీలంక పిచ్లు స్పిన్కు ఎక్కువగా అనుకూలిస్తాయి. భారత్ గతంలోనూ ఇక్కడ ముగ్గురు స్పిన్నర్లతో ఆడింది. కాబట్టి కుల్దీప్ను జట్టులోకి తీసుకోవడం మేలు" అని గవాస్కర్ 'స్టార్ స్పోర్ట్స్' డిబేట్లో పేర్కొన్నాడు.చదవండి: Vaibhav Suryavanshi: క్రికెట్కు బ్రేక్.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ -
క్రికెట్కు బ్రేక్.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ
నిన్నటివరకు మైదానంలో బౌలర్లను బెంబేలెత్తించిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్లాస్రూమ్లో కూర్చుని పరీక్షలు రాసేందుకు సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షలకు అతడు హాజరు కానున్నాడు. బిహార్లోని సమస్తిపుర్లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైభవ్ ఈ పరీక్షలు రాయనున్నాడు.వైభవ్ సూర్యవంశీ మా పాఠశాలలో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కానున్నాడు. అతడికి ఇప్పటికే అడ్మిట్ కార్డ్ అందించాము. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వైభవ్ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతడు ఇంకా విద్యార్ధి కాబట్టి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదు. అందరితో కలిసే పరీక్షలు రాయనున్నాడు. అందుకు తగ్గట్టు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోడార్ స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ సిన్హా పేర్కొన్నారు.కాగా 14 ఏళ్ల వైభవ్ ఐపీఎల్-2025లో రాజస్తాన్ తరపున కేవలం 15 బంతుల్లో సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కూడా భారత్-ఎ జట్టు, అండర్-19 జట్టు తరపున సంచలన ప్రదర్శనలు చేశాడు. ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్లో సైతం దుమ్ములేపాడు. ఇంగ్లండ్తో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగులతో సత్తాచాటిన వైభవ్.. భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. మొత్తంగా 439 పరుగులు చేసిన వైభవ్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గా నిలిచాడు.చదవండి: వారెవ్వా జింబాబ్వే -
‘చిన్నస్వామి’లో కుంబ్లే, ద్రవిడ్ స్టాండ్స్
బెంగళూరు: చిన్నస్వామి క్రికెట్ స్టేడియం కొత్త స్టాండ్లతో ముస్తాబవుతోంది. భారత దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే పేర్లతో చిన్నస్వామి స్టేడియంలో స్టాండ్లను ఏర్పాటు చేయాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) నిర్ణయించింది. మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కేఎస్సీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో కమిటీ భారత్ తరఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన కుంబ్లే, టెస్టు క్రికెట్లో సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన పరుగుల వీరుడు ద్రవిడ్లు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ స్టాండ్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మాజీ మహిళా క్రికెటర్ శాంతా రంగస్వామి పేరిట మరో స్టాండ్ను ఏర్పాటు చేస్తారు. అనిల్ కుంబ్లే కేఎస్సీఏ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సహచరులు ద్రవిడ్, శాంతా రంగస్వామిలతో స్టాండ్లను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. -
భారత పోలో జట్టు పైచేయి
సాక్షి, హైదరాబాద్: రాధా టీఎంటీ అంతర్జాతీయ ఎరీనా పోలో చాంపియన్షిప్లో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. లక్సెంబర్గ్ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు 15–5 గోల్స్ తేడాతో నెగ్గింది. తొలి చక్కర్ ముగిశాక భారత్ 6–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్ తరఫున యూసుఫ్ అజ్మీ 2 గోల్స్, కున్వల్ విశాల్ సింగ్ 3 గోల్స్, మొహమ్మద్ నయీముద్దీన్ ఒక గోల్ చేశారు. రెండో చక్కర్లో భారత్ ఐదు గోల్స్ చేసి, రెండు గోల్స్ సమరి్పంచుకుంది. ఈ చక్కర్లో భారత్కు చెతానియా 2 గోల్స్, యూసుఫ్ అజ్మీ 2 గోల్స్ చేయగా, పెనాల్టీ ద్వారా మరో గోల్ వచి్చంది. చివరిదైన మూడో చక్కర్లో భారత్ నాలుగు గోల్స్ సాధించింది. చెతానియా, యూసుఫ్ అజ్మీ రెండు గోల్స్ చొప్పున చేశారు. -
వారెవ్వా జింబాబ్వే
ఆ్రస్టేలియా సొంతగడ్డపై ఆడినా... గడప దాటినా... ఫార్మాట్ ఏదైనా... చాంపియన్ జట్టు. ప్రొఫెషనలిజానికిమారుపేరు. అలాంటి జట్టు జింబాబ్వేలాంటి చిన్న జట్టుతో ఓడటం ఎవరి అంచనాలకూ అందని సంచలనమే! ఓ దుర్బేధ్యమైన జట్టు మళ్లీ అదే ప్రత్యర్థి చేతిలో రెండోసారి ఓడితే సంచలనానికి సీక్వెలే కదా! అవును... దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టి20 ప్రపంచకప్లో జింబాబ్వే... ఆస్ట్రేలియాపై సీక్వెల్ బొమ్మ చూపించింది. 2007లో మొదలైన టి20 వరల్డ్కప్లో అప్పటి వన్డే వరల్డ్ చాంపియన్ను కంగుతినిపించి ఔరా అనిపించిన జింబాబ్వే... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రస్తుత వన్డే విశ్వవిజేత ఆస్ట్రేలియాను మట్టికరిపించి తాజా టి20 ప్రపంచకప్లో పెను సంచలనం నమోదు చేసింది. కొలంబో: జింబాబ్వే జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో టి20 ప్రపంచకప్లో ఆ్రస్టేలియాను మరోసారి ‘0’ను చేసింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జింబాబ్వే తమ ఆధిక్యాన్ని ‘2’తో రెట్టింపు చేసుకుంది. 2007 టి20 ప్రపంచకప్లో కంగారూ జట్టుపై సాధించిన సంచలన విజయాన్ని 19 ఏళ్ల తర్వాత జింబాబ్వే తాజాగా రిపీట్ చేసింది. అప్పుడు మొదటి ప్రపంచకప్ అయితే ఇది పదోది. మధ్యలో 8 మెగా ఈవెంట్లు జరిగినా... ఇరుజట్లు తలపడలేదు. శుక్రవారం గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (56 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. క్రీజులోకి వచ్చిన ముగ్గురు బ్యాటర్లు తదివనషె మరుమని (21 బంతుల్లో 35; 7 ఫోర్లు), రియాన్ బర్ల్ (30 బంతుల్లో 35; 4 ఫోర్లు), కెప్టెన్ సికందర్ రజా (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు. ఆసీస్ ఈ 120 బంతులు ఆడలేదా? జింబాబ్వే లాంటి కూన జట్టు బ్యాటర్లు 120 బంతులెదుర్కొని ఇద్దరే అవుటైతే... జగజ్జేత కంగారు పడటమేంటి? పది మంది బ్యాటర్లు 117 బంతులకే అవుట్ కావడమేంటి? హెడ్ బృందానికి 170 లక్ష్యఛేదన ఏమాత్రం కష్టమైంది కాదు. కఠినమైంది కాదు. కానీ 19.3 ఓవర్లలోనే 146 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్లెసింగ్ ముజరబాని (4/19), బ్రాడ్ ఇవాన్స్ (3/23) ధాటికి ఓపెనర్లు ఇన్గ్లిస్ (8), కెప్టెన్ హెడ్ (17) గ్రీన్ (0), టిమ్ డేవిడ్ (0)... ఇలా టాప్–4 స్పెషలిస్టు బ్యాటర్లంతా పవర్ప్లేలో 29 పరుగులకే పెవిలియన్కు వెళ్లి ప్రేక్షకులైపోయారు.ఒకే ఒక్కడు మ్యాట్ రెన్షా (44 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్వెల్ (32 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) ఐదో వికెట్కు 77 పరుగులు జోడించడంతో 100 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే తర్వాతి బ్యాటర్లు స్టొయినిస్ (6), డ్వార్షుయిస్ (6), ఎలిస్ (7 నాటౌట్), జంపా (2), కునెమన్ (0)ల స్కోర్లు చూస్తే ఏ అత్యల్ప స్కోరుకో పరిమితమయ్యేదేమో! ఔరా మన్యొంగా... జింబాబ్వే ఫీల్డర్ మన్యొంగా కళ్లు చెదిరే క్యాచ్తో ఆకట్టుకున్నాడు. ఇవాన్స్ వేసిన 18వ ఓవర్లో డ్వార్షుయిస్ మిడ్వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. మున్యొంగా దూరంగానే ఉన్నప్పటికీ డీప్ మిడ్వికెట్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అదే వేగంతో డైవ్ చేసి అందుకున్న క్యాచ్ ఔరా అనిపించింది. టేలర్ స్థానంలో బెన్ కరన్... జింబాబ్వే సీనియర్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ గాయం కారణంగా టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఒమన్తో మ్యాచ్లో గాయపడిన అతను ఆసీస్తో పోరులో బరిలోకి దిగలేదు. టేలర్ స్థానంలో ఐసీసీ అనుమతితో బెన్ కరన్కు జింబాబ్వే చోటు కల్పించింది. బెన్ కరన్ తమ్ముడు స్యామ్ కరన్ ఇప్పటికే వరల్డ్ కప్లో ఇంగ్లండ్ తరఫున ఆడుతున్నాడు.2 ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టుతో జింబాబ్వే నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడింది. ఇందులో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. ఆసీస్పై జింబాబ్వే సాధించిన రెండు విజయాలు ప్రపంచకప్లోనే రావడం విశేషం.టి20 ప్రపంచకప్లో నేడుఐర్లాండ్ X ఒమన్వేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి ఇంగ్లండ్ X స్కాట్లాండ్వేదిక: కోల్కతా; మ.గం. 3 నుంచి దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్ వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
సూపర్ స్నేహిత్...
చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్ కంటెండర్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ సంచలన ప్రదర్శనతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ స్నేహిత్ 9–11, 15–17, 11–4, 11–6, 18–16తో ప్రపంచ 61వ ర్యాంకర్ మిజుకి ఒయ్కావా (జపాన్)ను బోల్తా కొట్టించాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో తొలి రెండు గేమ్లు కోల్పోయినప్పటికీ స్నేహిత్ పట్టువదలకుండా పోరాడాడు. వరుసగా మూడు గేమ్లు నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. నిర్ణాయక ఐదో గేమ్లో స్నేహిత్ 8–10తో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నాడు. వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన స్నేహిత్ 10–10తో స్కోరును సమం చేశాక 11–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆరుసార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 16–16 వద్ద స్నేహిత్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. -
మన ముకేశ్ గురి బంగారం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ జూనియర్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన పిస్టల్ షూటర్ ముకేశ్ నేలవల్లి చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. చివరిరోజు శుక్రవారం గుంటూరు జిల్లాకు చెందిన ముకేశ్ రెండు పతకాలు సాధించాడు. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం నెగ్గిన ముకేశ్... టీమ్ విభాగంలో సూరజ్ శర్మ (మధ్యప్రదేశ్), అభినవ్ దేశ్వాల్ (ఉత్తరాఖండ్)లతో కలిసి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో ముకేశ్ ఎనిమిది పతకాలు సాధించిన ముకేశ్ జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత్ క్లీన్స్వీప్ చేసింది. సూరజ్ శర్మ 585 పాయింట్లతో స్వర్ణం, ముకేశ్ 582 పాయింట్లతో రజతం, అభినవ్ దేశ్వాల్ 573 పాయింట్లతో కాంస్యం నెగ్గారు. సూరజ్, ముకేశ్, అభినవ్లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో 1740 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ధవళిక ఖాతాలో 2 పతకాలు ఇదే టోర్నీ జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ధవళిక దేవి రెండు పతకాలు సాధించింది. వ్యక్తిగత విభాగంలో ధవళిక 614.1 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలిచింది. టీమ్ విభాగంలో ధవళిక, ప్రాచి, అనుష్కలతో కూడిన భారత జట్టు 1835.6 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించింది. గచి్చ»ౌలిలోని గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో గత మూడేళ్లుగా కోచ్ వినోద్ కనోజియా వద్ద ధవళిక శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో సీనియర్, జూనియర్ విభాగాల్లో కలిపి భారత షూటర్లు 39 స్వర్ణాలు, 18 రజతాలు, 19 కాంస్యాలతో 76 పతకాలు నెగ్గి ‘టాప్’లో నిలిచారు. -
నేటి నుంచి ఐఎస్ఎల్
కోల్కతా: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నెలలపాటు కొనసాగిన సందిగ్ధత వీడింది. నేటి నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 12వ సీజన్ ఫుట్బాల్ టోర్నీ మొదలుకానుంది. మొత్తం 14 (బెంగళూరు, చెన్నైయిన్, ఈస్ట్ బెంగాల్, గోవా, ఇంటర్ కాశీ, జంషెడ్పూర్, కేరళ బ్లాస్టర్స్, మొహమ్మదాన్ స్పోరి్టంగ్, మోహన్ బగాన్ సూపర్ జెయింట్, ముంబై సిటీ, నార్త్ ఈస్ట్ యునైటెడ్, ఒడిశా, పంజాబ్, స్పోరి్టంగ్ క్లబ్ ఢిల్లీ) జట్లు టైటిల్ కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ఒక్కో జట్టు 13 మ్యాచ్లు ఆడుతుంది. నాకౌట్ దశ లేకుండా మూడు నెలలపాటు సాగే ఈ లీగ్లో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు విజేతగా అవతరిస్తుంది. సాల్ట్లేక్ స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్లో కేరళ బ్లాస్టర్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ మోహన్బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. రెండో మ్యాచ్లో ఇంటర్ కాశీ జట్టుతో ఎఫ్సీ గోవా జట్టు పోటీపడుతుంది. -
ఫైనల్లో రష్మిక జోడీ
పుణే: భారత మహిళల టెన్నిస్ రెండో ర్యాంకర్, హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక తన కెరీర్లో ఏడో డబుల్స్ టైటిల్కు విజయం దూరంలో నిలిచింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్) ద్వయం 7–5, 6–3తో పొలీనా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జంటపై విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక–అంకిత తమ తొలి సర్వీస్లో 27 పాయింట్లు, రెండో సర్వీస్లో 9 పాయింట్లు సంపాదించారు. తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేశారు. నేడు జరిగే ఫైనల్లో మిసాకి మత్సుదా–ఇరి షిమిజు (జపాన్)లతో రష్మిక–అంకిత తలపడతారు. -
రాణించిన సాయితేజ, హర్మీత్
చెన్నై: దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ చేతిలో ఓడిన అమెరికా ఎట్టకేలకు నెదర్లాండ్స్పై గెలిచి ఐసీసీ టి20 ప్రపంచకప్లో బోణీ చేసింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో మోనాంక్ పటేల్ సారథ్యంలోని అమెరికా 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గిన డచ్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్ చేపట్టిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మోనాంక్ (22 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), జహాంగీర్ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిగా ఆడే క్రమంలో అవుటయ్యారు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ సాయితేజ ముక్కామల (51 బంతుల్లో 79; 5 ఫోర్లు, 4 సిక్స్లు), శుభమ్ రంజనే (24 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేశారు. బాస్ డి లీడె 3 వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 15.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. బాస్ డి లీడె (23), కెపె్టన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (20)లు మాత్రమే రెండు పదుల స్కోరు చేయగలిగారు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మీత్ సింగ్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు, వాన్ షాల్విక్ 3 వికెట్లు, మోసిన్ 2 వికెట్లు తీశారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో నమీబియాతో అమెరికా తలపడుతుంది. -
T20 WC 2026: సత్తా చాటిన సాయితేజ.. యూఎస్ఏ భారీ స్కోర్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 13) రాత్రి మొదలైన మ్యాచ్లో యూఎస్ఏ, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో యూఎస్ఏ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి నెదర్లాండ్స్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన యూఎస్ఏ.. సాయితేజ ముక్కామల (79), శుభ్మ్ రంజనే (48 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.మిగతా యూఎస్ఏ ఆటగాళ్లలో మొనాంక్ పటేల్ (36), షయాన్ జహంగీర్ (20) కూడా రాణించారు. సంజయ్ కృష్ణమూర్తి (1), మిలింగ్ కుమార్ (3), హర్మీత్ సింగ్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మొహమ్మద్ మొహిసిన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడ్ (4-0-37-3) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లొగాన్ వాన్ బీక్ (4-0-28-1), కైల్ క్లెయిన్ (4-0-35-1), ఫ్రెడ్ క్లాసెన్ (3-0-32-1) కూడా పర్వాలేదనిపించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను నెదర్లాండ్స్ ధాటిగా ప్రారంభించింది. తొలి 5 ఓవర్లలో ఆ జట్టు 41 పరుగులు చేసింది. అయితే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మైఖేల్ లెవిట్ 3 పరుగులు చేసి కెంజిగే బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కాగా.. మ్యాక్స్ ఒడౌడ్ 13 పరుగులు చేసి హర్మీత్ సింగ్ బౌలింగ్లో మిలింద్ కుమార్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ గెలవాలంటే 90 బంతుల్లో మరో 156 పరుగులు చేయాలి. -
ఈ సెంటిమెంట్ రిపీటైతే టీమిండియాదే వరల్డ్కప్..!
టీ20 వరల్డ్కప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 13) పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.వాస్తవానికి టీ20 ప్రపంచకప్లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది మొదటిసారి కాదు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్లోనే (2007) జింబాబ్వే ఆసీస్కు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచకప్ల పరంగా చూసుకుంటే, జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది కూడా తొలిసారి కాదు. 1983 వన్డే ప్రపంచకప్లోనే జింబాబ్వే తొలిసారి ఆసీస్ను ఓడించింది. మొత్తంగా జింబాబ్వే తమ క్రికెట్ చరిత్రలో వారికంటే చాలా రెట్లు మెరుగైన ఆస్ట్రేలియాను ఐదు సార్లు ఓడించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో రెండు సార్లు (2007, 2026), వన్డే వరల్డ్కప్లో ఒకసారి (1983), సాధారణ వన్డేల్లో రెండు సార్లు (2014, 2022) జింబాబ్వే ఆసీస్కు షాకిచ్చింది.అయితే జింబాబ్వే ఆసీస్పై సాధించిన విషయాల్లో ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. అది భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే అంశం. అదేంటంటే.. జింబాబ్వే ప్రపంచకప్ టోర్నీల్లో ఆసీస్పై విజయం సాధించిన తొలి రెండు సందర్భాల్లో భారత్ జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే తొలిసారి ఆసీస్పై విజయం సాధించిన సందర్భంలో భారత్ తొలిసారి జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే ఆసీస్పై రెండోసారి విజయం సాధించిన సందర్భంలో భారత్ రెండో సారి జగజ్జేతగా నిలిచింది.ప్రస్తుత ప్రపంచకప్లో ఈ సెంటిమెంట్ రిపీటైతే, భారత్ మరోసారి జగజ్జేతగా అవతరించడం ఖాయమని టీమిండియా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గూగుల్ ఇండియా కూడా విశ్లేషించింది. తాజా ప్రపంచకప్లో ఆసీస్పై జింబాబ్వే విజయం సాధించిన తర్వాత ఈ విషయం సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈసారి కూడా టీమిండియానే టీ20 ప్రపంచ ఛాంపియన్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ సెంటిమెంట్కు అభిమానులు ప్రస్తుత జట్టు బలాన్ని, ఇటీవలి ఫామ్ను కూడా జోడిస్తున్నారు. భారత జట్టు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని, గత రెండేళ్లలో టీమిండియా ఫామ్ అద్వితీయంగా ఉందని, పై సెంటిమెంట్కు ఈ రెండు కలిస్తే భారత్కు తిరుగే ఉండదన్న విషయం స్పష్టమవుతుందని చర్చించుకుంటున్నారు. పై ఫ్యాక్టర్స్ అన్నీ వర్కౌటై భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్ కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ఇన్ని శుభ శకునాల మధ్య భారతీయులను ఓ చెడు శనుకం కూడా పలకరిస్తుంది. అదేంటంటే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉండి, మరోసారి ప్రపంచకప్ గెలవలేదు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఏమైనా వర్కౌటవుతుందేమోనని టీమిండియా ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. -
ఆసీస్ను చిత్తు చేసిన ఆనందంలో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్
2026 టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించి జోష్లో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. అనుభవజ్ఞుడైన వికెట్కీపర్-బ్యాటర్ బ్రెండన్ టేలర్ హామ్స్ట్రింగ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన తొలి మ్యాచ్లో (ఒమన్) టేలర్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్లో అతను మూడు అద్భుతమైన క్యాచ్లు పట్టడంతో పాటు 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సమయంలో టేలర్ కుడి కాలి హామ్స్ట్రింగ్తో ఇబ్బంది పడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. తొలుత గాయం చిన్నదే అనుకున్నా, వైద్య పరీక్షల తర్వాత ఆయన పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని తేలింది. దీంతో టేలర్ మెగా టోర్నీలో కొనసాగలేడని జింబాబ్వే క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టేలర్ స్థానాన్ని బెన్ కర్రన్తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. చరిత్రాత్మక ఆటగాడుటేలర్కు ప్రపంచ క్రికెట్లో ఎవరికీ లేని ఓ ప్రత్యేకత ఉంది. అతను 0మొదటి టీ20 ప్రపంచకప్ (2007), ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఆడిన ఏకైక ఆటగాడు. 40 ఏళ్ల వయసులోనూ టేలర్ జింబాబ్వే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆయన లేని లోటు జింబాబ్వేకు ఎదురుదెబ్బ అవుతుంది.కాగా, ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4), బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్షా (65), మ్యాక్స్వెల్ (31) విఫలయత్నం చేశారు. -
యూఏఈ చేతిలో చిత్తుగా ఓడిన భారత జట్టు
భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నమెంట్కు శుక్రవారం తెరలేచింది.బ్యాంకాక్ వేదికగా సాగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ వుమెన్-‘ఎ’ జట్టు నేపాల్ మహిళా జట్టుపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్లో భాగంగా భారత మహిళల-‘ఎ’ జట్టు యుఏఈతో తలపడింది. టెఱ్థాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.రాణించిన అనుష్క శర్మ, తనూజఓపెనర్లు హమైరా ఖాజీ (3), వ్రిందా దినేశ్ (16)లతో పాటు వన్డౌన్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్ (1) కూడా విఫలమైంది. కెప్టెన్ రాధా యాదవ్ (7), మిన్ను మణి (8), వికెట్ కీపర్ బ్యాటర్ మమత మడివాలా (1) చేతులెత్తేశారు.Calm Under Fire 😌 Anushka Sharma’s gritty 47 pushed India A to a competitive total 💥Watch our Girls in Blue take on the UAE in the DP World Women’s Asia Cup Rising Stars 2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising pic.twitter.com/r5I8fqLrJo— Sony Sports Network (@SonySportsNetwk) February 13, 2026ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ అనుష్క శర్మ (45 బంతుల్లో 47), స్పిన్నర్ తనూజ కణ్వార్ (25 బంతుల్లో 34) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. మిగిలిన వారిలో ప్రేమా రావత్ (4), సైమా ఠాకూర్ (3 నాటౌట్) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన భారత్ కేవలం 130 పరుగులే చేసింది.యూఏఈ బౌలర్లలో సమైరా ధర్నిధార్క మూడు, వైష్ణవి మహేశ్, కెప్టెన్ ఇషా ఓజా తలా రెండు వికెట్లు తీశారు. మిగిలిన వారిలో సురక్ష కొట్టె, అతిగె సిల్వా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ కేవలం 19.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.ఇషా ఓజా అజేయ హాఫ్ సెంచరీఓపెనర్లలో కెప్టెన్ ఇషా ఓజా అజేయ అర్ధ శతకం (61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 72)తో చెలరేగగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తీర్థ సతీశ్ (10) నిరాశపరిచింది. వన్డౌన్ బ్యాటర్ సమైరా (34) ఇషాతో కలిసి రెండో వికెట్కి 71 పరుగులు జోడించారు. మిగిలిన వారిలో రినిత రజిత్ (6) విఫలం కాగా.. హీనా హోచాందిని ఒక ఫోర్ బాది అజేయంగా నిలిచింది.ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన యూఏఈ 131 పరుగులు సాధించింది. తద్వారా భారత మహిళా జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న యూఏఈ కెప్టెన్ ఇషా ఓజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా యూఏఈ జట్టులో అధిక శాతం మంది భారత సంతతి ప్లేయర్లే ఉండటం విశేషం. UAE won by 7 wickets. India A will look to bounce back in the next game!Scorecard ▶️ https://t.co/L2wkjCKSKq#WomensRisingStarsAsiaCup pic.twitter.com/lGYXSFIDDD— BCCI Women (@BCCIWomen) February 13, 2026చదవండి: T20 WC 2026: టోర్నీ నుంచి ఆ జట్టు కెప్టెన్ అవుట్ -
పసికూనల పోరులో యూఏఈదే పైచేయి
టీ20 ప్రపంచకప్లో ఇవాళ (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం పసికూనలు యూఏఈ, కెనడా జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ మ్యాచ్లో యూఏఈ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా.. హర్ష్ ఠాకూర్ (50) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. నవ్నీత్ ధలీవాల్ (34), శ్రేయస్ మొవ్వ (21) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లంతా స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా 11, యువరాజ్ సమ్రా 5, నికోలస్ కిర్టన్ 4, జస్కరన్ సింగ్ 4 (నాటౌట్), సాద్ బిన్ జాఫర్ 5, డిలాన్ హేలిగర్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ (4-0-35-5) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సహకరించాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన యూఏఈ ఆదిలో కాస్త తడబడినప్పటికీ.. చివర్లో గేర్ మార్చి 19.4 ఓవర్లలో గెలుపు తీరాలకు (5 వికెట్ల నష్టానికి) చేరింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్ ఆర్యాంశ్ శర్మ (74 నాటౌట్), షోయబ్ ఖాన్ (51) పట్టుదలగా ఆడి యూఏఈని గెలిపించారు. కెనడా బౌలర్లలో సాద్ బిన్ జాఫర్ (4-0-14-3) యూఏఈ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కలీమ్ సనా (4-0-29-1), డిలన్ హేలిగర్ (4-0-33-0) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆర్యాంశ్, షోయబ్ పట్టుదల ముందు వీరి ఈ ప్రదర్శనలు ఉపయోగపడలేదు. -
IND vs PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్న్యూస్!
అవాంతరాలన్నీ తొలగి భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో దిగివచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తాము టీమిండియాతో ఆడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాయాదుల పోరును వీక్షించాలని ఉవ్విళ్లూరుతున్న అభిమానులకు ఓ చేదు వార్త.సాంకేతికంగా మ్యాచ్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినా.. వాతావరణం ఇందుకు సహకరించేలా కనిపించడం లేదు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలైన విషయం తెలిసిందే.అగ్రస్థానంలో టీమిండియామొత్తంగా ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా టీమిండియా అమెరికా, నమీబియాలపై గెలుపొందగా.. పాక్ జట్టు నెదర్లాండ్స్, అమెరికాలపై జయభేరి మోగించింది.ఫలితంగా గ్రూప్-ఎ నుంచి చెరో రెండు విజయాలతో భారత్- పాక్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చెరో నాలుగు పాయింట్లతో సమంగా ఉన్నా.. నెట్ రన్రేటు పరంగా భారత్ (+3.050).. పాకిస్తాన్ (+0.932) కంటే అత్యంత పటిష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు ఫిబ్రవరి 15న తలపడాల్సి ఉంది.వాన పడే అవకాశంశ్రీలంకలోని కొలంబోలో గల ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్- పాక్ (IND vs PAK) మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే, ఈ దాయాదుల పోరుకు వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఆదివారం ఉదయం వర్షం కురిసేందుకు 93 శాతం అవకాశం ఉంది.అంతేకాదు.. 26 శాతం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. అయితే, సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడే అవకాశాలూ కూడా ఉన్నాయి. వాన పడే ఛాన్స్ 13 శాతానికి తగ్గనుందని ఆక్యూవెదర్ వెల్లడించింది.యూటర్న్ తీసుకున్న పాక్ఇక మ్యాచ్ మొదలయ్యే సమయానికి వాన తగ్గే అవకాశం ఉన్నా.. ఒకవేళ రోజంతా వర్షం కురిస్తే అవుట్ఫీల్డ్ చిత్తడిగా మారే ప్రమాదం ఉంది. ఇది కూడా మ్యాచ్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు పాక్తో ఎనిమిది సార్లు ముఖాముఖి తలపడ్డ భారత్ 7-1 (విజయాలు)తో ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా బంగ్లాదేశ్కు మద్దతుగా తాము కూడా టీ20 వరల్డ్కప్-2026 బహిష్కరిస్తామంటూ పాక్ తొలుత ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేవలం భారత్తో మాత్రమే ఆడమంటూ నాటకాలు ఆడగా.. ఐసీసీ రంగంలోకి దిగడంతో యూటర్న్ తీసుకుంది.చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్ మాజీ క్రికెటర్పై భజ్జీ ఆగ్రహం -
T20 WC 2026: యూఏఈ తరఫున ఇరగదీసిన పాక్ జాతీయుడు
టీ20 ప్రపంచకప్ 2026లో యూఏఈకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాక్ జాతీయుడు జునైద్ సిద్దిఖీ చెలరేగిపోయాడు. 33 ఏళ్ల ఈ కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్.. ఇవాళ (ఫిబ్రవరి 13) కెనడాతో జరుగుతున్న మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది.సిద్దిఖీ తన కోటా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ యూఏఈ బౌలర్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టీ20 వరల్డ్కప్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి యూఏఈ బౌలర్ కూడా సిద్దిఖీనే. చాలామంది పాక్ క్రికెటర్లలాగే సిద్దిఖీ కూడా క్రికెట్ కెరీర్ కోసం యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ పౌరసత్వం పొంది 2019 నుంచి యూఏఈ జట్టుకు ఆడుతున్నాడు.యూఏఈ తరఫున ఇప్పటివరకు 88 టీ20లతో పాటు 63 వన్డేలు ఆడిన సిద్దిఖీ మొత్తంగా 208 వికెట్లు తీశాడు. యూఏఈ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు, అత్యంత విజయవంతమైన బౌలర్ సిద్దిఖీనే.మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈ, కెనడా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో కెనడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనుకున్నట్లుగా వారికి మంచి ఆరంభం లభించలేదు. సిద్దిఖీ ఇద్దరు కెనడా ఓపెనర్లను (యువరాజ్ సమ్రా (5), దిల్ప్రీత్ బజ్వా (11)) 5 పరుగుల తేడాతో పెవిలియన్కు పంపాడు.ఆతర్వాత వచ్చిన నవ్నీత్ ధలివాల్ (34), హర్ష్ ఠాకూర్ (50) బాధ్యతాయుతంగా ఆడి కెనడాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 58 పరుగులు జోడించడంతో కెనడా నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది. చివర్లో శ్రేయస్ మొవ్వ (21) ఉపయోగకరమైన పరుగులు చేశాడు. కెనడా ఇన్నింగ్స్లో హర్ష్, ధలివాల్, శ్రేయస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. యూఏఈ బౌలర్లలో సిద్దికీతో పాటు ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సత్తా చాటాడు.అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ కూడా తడబడుతుంది. 15 ఓవర్ల తర్వాత ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో యూఏఈ గెలవాలంటే 30 బంతుల్లో మరో 62 పరుగులు చేయాలి. -
T20 WC 2026: టోర్నీ నుంచి కెప్టెన్ అవుట్
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస పరాజయాలతో టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 అవకాశాలను ఐరిష్ టీమ్ సంక్లిష్టం చేసుకుంది.ఇలాంటి తరుణంలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (Paul Stirling) టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ శుక్రవారం వెల్లడించింది.కాగా టీ20 వరల్డ్కప్లో శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్లతో కలిసి గ్రూప్-బి నుంచి ఐర్లాండ్ పోటీలో దిగింది. తొలి మ్యాచ్లో శ్రీలంక చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిన స్టిర్లింగ్ బృందం.. రెండో పోరులో ఆస్ట్రేలియా చేతిలో 67 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.గాయపడిన కెప్టెన్కొలంబోలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగానే కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ గాయపడ్డాడు. అతడి కుడి మోకాలికి గాయమైంది. స్కానింగ్ నిమిత్తం ఆస్పత్రికి పంపగా గాయం తీవ్రంగా ఉందని తేలడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు.యువ బ్యాటర్ ఎంట్రీఇక పాల్ స్టిర్లింగ్ స్థానంలో 20 ఏళ్ల బ్యాటర్ సామ్ టాపింగ్ (Sam Topping) ఐర్లాండ్ ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. స్టిర్లింగ్ స్వదేశానికి పయనం కాగా.. సామ్ భారత్కు చేరుకోనున్నాడు. కాగా ఐర్లాండ్ తమ తదుపరి మ్యాచ్లో ఒమన్తో తలపడుతుంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ పోరుకు కొలంబో వేదిక. ఇదిలా ఉంటే.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే చెరో రెండు విజయాలతో టాప్-2లో ఉన్నాయి. జింబాబ్వే చేతిలో ఆసీస్ తాజా ఓటమి ఆ జట్టును క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఐర్లాండ్ జట్టు (అప్డేటెడ్)మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, సామ్ టాపింగ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్ మాజీ క్రికెటర్పై భజ్జీ ఆగ్రహం -
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ పేరు ప్రకటన
ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఓ కీలక ప్రకటన చేసింది. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లిపోవడంతో, నూతన కెప్టెన్గా యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారకంగా ప్రకటించింది.కెప్టెన్సీ రేసులో రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ పేర్లు వినిపించినప్పటికీ, యాజమాన్యం రియాన్వైపే మొగ్గు చూపింది. 2019లో రాయల్స్ తరఫునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన రియాన్ నాటి నుంచి ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. మొత్తం 7 సీజన్లలో 84 మ్యాచ్లు ఆడి 141.84 స్ట్రయిక్రేట్తో 1566 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కూడా అయిన రియాన్ 7 వికెట్లు కూడా తీశాడు. రియాన్ అత్యుత్తమ ప్రదర్శన 2024 సీజన్లో వచ్చింది. ఆ సీజన్లో అతను 149.21 స్ట్రయిక్రేట్తో 573 పరుగులు చేశాడు. గత సీజన్లో రియాన్ ఓ మోస్తరు ప్రదర్శనలు (166.52 స్ట్రయిక్రేట్తో 393 పరుగులు) చేశాడు.గత సీజన్లో సంజూ గైర్హాజరీలో రియాన్ 8 మ్యాచ్ల్లో కెప్టెన్గానూ వ్యవహరించాడు. అయితే అతనికి కెప్టెన్సీ పెద్దగా కలిసి రాలేదు. 8 మ్యాచ్ల్లో 6 పరాజయాలు మూటగట్టుకొని, కేవలం రెండే విజయాలు సాధించాడు. తదుపరి సీజన్లో రియాన్ ఫుల్టైమ్ కెప్టెన్గా ఏమేరకు రాణిస్తాడో చూడాలి. కాగా, తదుపరి సీజన్కు రాయల్స్కు కెప్టెన్తో పాటు నూతన హెడ్ కోచ్ కూడా రానున్నాడు. గత సీజన్ తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ వదవిని వదిలేయడంతో, ఆ స్థానంలో కుమార సంగక్కర బాధ్యతలు చేపట్టాడు. సంగక్కర-రియాన్ కలిసి 2026 ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ను నడిపిస్తారు.2008లో తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన రాయల్స్ అప్పటి నుంచి రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తుంది. ఈసారి కొత్త కెప్టెన్, కొత్త కోచ్తో పాటు చాలామంది కొత్త ఆటగాళ్లతో రాయల్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు..రియాన్ పరాగ్ (కెప్టెన్), శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, డొనొవన్ ఫెరియెరా, లుహాన్ డ్రి ప్రిటోరియస్, రవి సింగ్, అమన్ రావు పేరాల, షిమ్రోన్ హెట్మైర్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, యుద్ద్వీర్ సింగ్ చరక్, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, క్వేనా మఫాకా, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యశ్ రాజ్ పంజా, విజ్ఞేశ్ పుతుర్, బ్రిజేశ్ శర్మ, ఆడమ్ మిల్నే, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, నండ్రే బర్గర్ -
నిన్ను నాశనం చేస్తా: తీవ్ర స్థాయిలో మండిపడ్డ భజ్జీ
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్కు కోపమొచ్చింది. ఇంకోసారి ఇలాగే వాగితే సర్వనాశనం చేస్తా అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్పై భజ్జీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భజ్జీ క్రీడా విశ్లేషకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.పాక్ క్రికెటర్ల వెంటపడతాడుఈ క్రమంలో ఇటీవల యూఏఈ వేదికగా ILT20 లీగ్లో భజ్జీ బ్రాడ్కాస్టర్గా వ్యవహరించాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ (Usman Tariq)ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన్వీర్ అహ్మద్ అనే ఓ పాక్ మాజీ ఆటగాడు భజ్జీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెటర్లతో తిరుగుతూ ఉంటేనే నీకు గుర్తింపు అన్నట్లుగా ఓవరాక్షన్ చేశాడు.ఈ నేపథ్యంలో భజ్జీ ఘాటుగా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. ‘‘ఈ వీడియో ఓ తుచ్ఛ మానవుడి గురించి. అతడు నా గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు. అతడి పేరేంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను అతడిని ఇంత వరకు ఒక్కసారి కూడా చూడనేలేదు.ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రంలా బిల్డప్ఇలాంటి వ్యక్తి తనకంటూ గుర్తింపు సంపాదించుకునే క్రమంలో వివిధ ప్లాట్ఫామ్లలో డ్రామా చేస్తూ ఉంటాడు. నాకైతే ఆ వ్యక్తి గురించి ఏమాత్రం తెలియదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. అతడి పేరు తన్వీర్ అహ్మద్ అట.పాకిస్తాన్ తరఫున అతడు 3-4 మ్యాచ్లు ఆడి ఉంటాడు. కానీ తానేదో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ అన్నట్లుగా బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. ఓ బ్రాడ్కాస్టర్గా ILT20 టోర్నీలో నా పని నేను పూర్తి చేశాను. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఉస్మాన్ తారిఖ్ను ప్రశ్నలు అడిగాను.ఆ మ్యాచ్లో అతడు మూడు వికెట్లు తీసి తన జట్టును గెలిపించుకున్నాడు. ఓ బ్రాడ్కాస్టర్గా నేను అతడిని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యక్తి (తన్వీర్)కి ఇదే సమస్యగా మారిందట. పాకిస్తానీ క్రికెటర్ కనిపిస్తే చాలు వారి వెంట నేను తిరుగుతానట.దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలుచెవులు రిక్కించుకుని విను. నువ్వెవరో కూడా నాకు తెలియదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన దిగ్గజ క్రికెటర్లు ఎవరూ కూడా నీలాగా నోరు పారేసుకోలేదు. వాళ్లు తమకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నారు. కానీ నీలాంటి వాళ్లు.. జీవితంలో ఏదీ సాధించకపోయినా ఓ చోట కూర్చుని దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.నిన్ను నాశనం చేస్తా. . జాగ్రత్తఇప్పటికైనా మాట్లాడే విధానం తెలుసుకో. ఐదు మ్యాచ్లు ఆడిన వాడికి 100 మ్యాచ్లు ఆడిన వాడికి తేడా ఉంటుంది. కాబట్టి తన్వీర్ అహ్మద్ నీ స్థాయి ఏమిటో తెలుసుకో. మరోసారి ఇలాగే వాగావు అంటే నిన్ను నాశనం చేస్తా. జాగ్రత్త’’ అంటూ భజ్జీ ఫైర్ అయ్యాడు.కాగా టీమిండియా తరఫున హర్భజన్ సింగ్ 1998- 2016 మధ్య 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ ఖాతాలో 417 టెస్టు వికెట్లు, 269 వన్డే వికెట్లు, 25 టీ20 వికెట్లు ఉన్నాయి.మరోవైపు.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ తన్వీర్ అహ్మద్ పాక్ తరఫున 5 టెస్టులు, 2 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 17, 2, ఒక వికెట్ తీశాడు.చదవండి: IND vs PAK: 'ఈజీగా ఔట్ చేయవచ్చు'.. అభిషేక్ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆటగాడు -
ఆసీస్పై సంచలన విజయం.. జింబాబ్వే బౌలర్ సెంచరీ
టీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచనలం నమోదైంది. పసికూన జింబాబ్వే చేతిలో 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.జింబాబ్వే సాధించిన ఈ చారిత్రక విజయంలో పేస్ బౌలర్ బ్లెసింగ్ ముజరబానీ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కీలక ఆటగాళ్లు జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మ్యాట్ రెన్షా, ఆడమ్ జంపా వికెట్లు తీశాడు. అద్భుతమైన పేస్ వేరియేషన్స్తో పట్టిష్టమైన ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకుగానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.ఈ చారిత్రక ప్రదర్శన చేసే క్రమంలో ముజరబానీ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఈ మ్యాచ్లో తన చివరి వికెట్తో (జంపా) అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా జింబాబ్వే తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా, ఓవరాల్గా 35 బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ముజరబానీ ఈ ఘనతను కేవలం 85 మ్యాచ్ల్లోనే సాధించాడు. అతని సగటు 21.08గా.. ఎకానమీ 7.10గా ఉంది. జింబాబ్వే తరఫన టీ20ల్లో సెంచరీ కొట్టిన మరో ఇద్దరు బౌలర్లు రిచర్డ్ నగరవ (111 వికెట్లు), సికందర్ రజా (103 వికెట్లు). మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4) సహా బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్షా (65), మ్యాక్స్వెల్ (31) విఫలయత్నం చేశారు. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన స్టోయినిస్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో స్టోయినిస్ ఓ వికెట్ సహా 6 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అస్ట్రేలియా తరఫున 50 వికెట్లు సహా 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఆసీస్కు షాకిచ్చిన జింబాబ్వేటీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి, మైటి ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి, ఆతర్వాత ఆ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. బ్యాటింగ్లో బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), బౌలింగ్లో బ్లెస్సింగ్ ముజరబానీ (4-0-17-4) చెలరేగిపోయారు. బ్యాటింగ్లో బెన్నెట్తో పాటు మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) కూడా రాణించారు.బౌలింగ్లో ముజరబానీతో పాటు బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) కూడా సత్తా చాటారు.ఆసీస్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆసీస్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బౌలింగ్లో ఎల్లిస్ (4-0-34-0), జంపా (4-0-31-0) పరుగులు నియంత్రించినా వికెట్లు తీయలేకపోయారు. డ్వార్షుయిస్ (4-0-40-0)ను జింబాబ్వే బ్యాటర్లు ఉతికి ఆరేశారు. కుహ్నేమన్ (3-0-24-0) ప్రభావం చూపలేకపోయాడు. పార్ట్టైమ్ బౌలర్ మ్యాక్స్వెల్ ఒక్క ఓవర్కే (1-0-14-0) పరిమితమయ్యాడు. గ్రీన్ (1.1-0-6-1), స్టోయినిస్ (2.5-0-17-1) తలో వికెట్ తీశారు. స్టోయినిస్ బౌలింగ్ చేస్తుండగా తీవ్రంగా గాయపడి, ఓవర్ ముగియకుండానే మైదానాన్ని వీడాడు.అనంతరం బ్యాటింగ్లో ఆసీస్ దారుణంగా తేలిపోయింది. ఓపెనర్లు ఇంగ్లిస్ 8, హెడ్ 17 పరుగులు చేయగా.. ఆతర్వాత వచ్చిన గ్రీన్, టిమ్ డేవిడ్ డకౌట్లయ్యారు. ఈ దశలో మ్యాక్స్వెల్ (31), రెన్షా (65) ఆసీస్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జింబాబ్వే బౌలర్ల ధాటికి వీరు కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో స్టోయినిస్ (6), డ్వార్షుయిస్ (6), జంపా (2), కుహ్నేమన్ (0) ఇలా వచ్చి, అలా పెవిలియన్కు వెళ్లడంతో ఆసీస్ ఘోర పరాజయంపాలైంది. జింబాబ్వే టీ20 ప్రపంచకప్లో ఆసీస్ను ఓడించడం ఇదే మొదటిసారి కాదు. 2007 ఎడిషన్లోనూ ఆ జట్టు ఆసీస్ను మట్టికరిపించింది. -
'ఈజీగా ఔట్ చేయవచ్చు'.. అభిషేక్ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆటగాడు
టీ20 ప్రపంచకప్-2026లో అసలు సిసలైన సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ కేవలం ఒక 'స్లాగర్' (బంతిని బలంగా బాదడం) అని, బ్యాటింగ్ టెక్నిక్ లేదని అతడు విమర్శించాడు."అభిషేక్ శర్మ ఆడే విధానం చూస్తుంటే నాకు అతడు ఒక స్లాగర్ లాగే అనిపిస్తున్నాడు. ప్రతీ బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి ఆట తీరు ఉన్నవాళ్లు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అతడు సక్సెస్ అవుతారు. విఫలమయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ దగ్గర సరైన టెక్నిక్ లేదు.ప్రతీ 8 ఇన్నింగ్స్లలో ఒకసారి మాత్రమే అతడు రాణిస్తున్నాడు. మిగిలిన మ్యాచ్లలో తక్కువే పరుగులకే అవుట్ అవుతున్నాడు. అతడు ఒక చోట నిలబడి అన్ని బంతులను ఒకే ఏరియాలో వేయాలని కోరుకుంటాడు. బంతిని బాడీ లైన్ వేస్తే అతను ఇబ్బంది పడతాడు. అదేవిధంగా బంతి కొంచెం స్వింగ్ అయినా అతను ఆడలేడు.అయితే అభిషేక్ను నేనేమి తక్కువ చేసి మాట్లడడం లేదు. అతడి ఆటలో చాలా రిస్క్ ఉందని చెబుతున్నా. తనదైన ప్రత్యర్ధి జట్టును ముప్పు తిప్పలు పెట్టగలడు అని ఓ టీవీ ఛానల్ డిబేట్లో అమీర్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న అభిషేక్ శర్మను 'స్లాగర్' అని పిలవడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. అభిషేక్ లాంటి ఒక్క ప్లేయర్ అయినా మీ జట్టులో ఉన్నారా? అంటూ నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. కాగా కడుపు ఇన్ఫెక్షన్ వల్ల నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ దూరమయ్యాడు. పాక్తో మ్యాచ్కు ఈ పంజాబీ బ్యాటర్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. -
T20 WC: ఆసీస్కు షాకిచ్చిన పసికూన.. సంచలన విజయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ‘పసికూన’ జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. గ్రూప్-‘బి’లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- జింబాబ్వే జట్లు శుక్రవారం నాటి ఉదయం మ్యాచ్లో తలపడ్డాయి.ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ అజేయ అర్ధ శకతం (56 బంతుల్లో 64) సాధించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తాడివనాషే మరుమణి 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు.రజా మెరుపు ఇన్నింగ్స్వన్డౌన్లో వచ్చిన ర్యాన్ బర్ల్ (30 బంతుల్లో 35) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.చెలరేగిన ముజర్బానీఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టుకు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. బ్లెసింగ్ ముజర్బానీ జోష్ ఇంగ్లిస్ (8)ను.. బ్రాడ్ ఎవాన్స్ కెప్టెన్ ట్రవిస్ హెడ్ (17)ను వెనక్కి పంపించారు.వన్డౌన్లో వచ్చిన గ్రీన్ను ఎవాన్స్ డకౌట్ చేయగా.. ముజర్బానీ సైతం టిమ్ డేవిడ్ను పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు పంపాడు. పవర్ హిట్టర్లు ఇద్దరూ డకౌట్ కావడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, గ్లెన్ మాక్స్వెల్ (31)తో కలిసి మ్యాచ్ రెన్షా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.HISTORY MADE IN COLOMBO! 🤯🔥Composure. Belief. Zimbabwe have beaten Australia! 👏💥ICC Men’s #T20WorldCup | #CANvUAE | LIVE NOW 👉 https://t.co/xRf3Nc9OQ0 pic.twitter.com/1BXNa0ftxS— Star Sports (@StarSportsIndia) February 13, 2026ఈ క్రమంలో 34 బంతుల్లో రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 19వ ఓవర్లో ముజర్బానీ బౌలింగ్లో రెన్షా (44 బంతుల్లో 65) అవుట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే ఓవర్లో ఆఖరి బంతికి ముజర్బానీ ఆడం జంపా (2)ను కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 29 పరుగులుగా మారింది.146 పరుగులకే ఆలౌట్అయితే, ఆఖరి ఓవర్లో ఎవాన్స్ బౌలింగ్లో తొలి బంతికే నాథన్ ఎల్లిస్ ఫోర్ బాదాడు. కానీ ఆ తర్వాత ఎవాన్స్ ఆసీస్ను కోలుకోనివ్వలేదు. మూడో బంతికి మాథ్యూ కుహ్నెమన్ రనౌట్ (0) కావడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. జింబాబ్వే విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా జింబాబ్వే 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎవాన్స్ మూడు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మసకజ్ద, ర్యాన్ బర్ల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్కప్ టోర్నీలో తొలి ఎడిషన్ 2007లో ఆసీస్ను తొలిసారి ఓడించిన జింబాబ్వే.. మళ్లీ ఆసీస్పై గెలుపొందడం ఇదే మొదటిసారి.చదవండి: టీ20 ప్రపంచకప్లో సంచలనం.. నేపాల్పై ఇటలీ గెలుపుAND ANOTHER ONE GONE! 🔥Head pushes at it and chops it back onto his stumps! 🎯💥The SIUUU celebration is out in Colombo as Zimbabwe tighten their grip early! 🙌 Is there an upset on the cards?ICC Men’s #T20WorldCup | #AUSvZIM | LIVE NOW 👉 https://t.co/WBa4qbbxs0 pic.twitter.com/kzJ8M8j5ut— Star Sports (@StarSportsIndia) February 13, 2026 -
అతడు మా ‘వెన్ను’ విరిచాడు.. లేదంటే: నమీబియా కెప్టెన్
పసికూన నమీబియాకు టీ20 వరల్డ్కప్-2026లో వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత నెదర్లాండ్స్తో తలపడ్డ ఎరాస్మస్ బృందం.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.తాజాగా గురువారం నాటి మ్యాచ్లో టీమిండియా చేతిలో నమీబియా 93 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ (Gerhard Erasmus) తమ పరాజయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అతడు మా ‘వెన్ను’ విరిచాడుడెత్ ఓవర్లలో తమ బౌలర్లు అద్భుతంగా రాణించి భారత్ను కట్టడిచేయగలిగారని ఎరాస్మస్ జట్టును ప్రశసించాడు. అదే విధంగా.. టీమిండియా విధించిన భారీ లక్ష్య ఛేదనలో తాము శుభారంభమే అందుకున్నామని ఎరాస్మస్ పేర్కొన్నాడు. అయితే, భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తమ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచి.. కకావికలం చేశాడని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘పవర్ ప్లేలో మా ఆట చూసిన తర్వాత ఆశలు రేకెత్తాయి. ఇది (అరుణ్ జైట్లీ స్టేడియం) చిన్న మైదానం. ఇక మంచు ప్రభావం కూడా ఉంటుంది. 26 ఓవర్ల ఆట తర్వాత ఇది మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. స్పిన్నర్లకు కష్టమేనని భావించాము.అయితే, దురదృష్టవశాత్తూ వరుణ్ చక్రవర్తి వేసిన స్పెల్ మా బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచేసింది. లక్ష్య ఛేదనలో అతడు మమ్మల్ని దారుణంగా దెబ్బకొట్టాడు. ఏదేమైనా డెత్ ఓవర్లలో మా బౌలర్లు కూడా అదరగొట్టారు.మా బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఉందిఇప్పటికీ మేము 100 శాతం ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాం. అయితే, ఈ టోర్నీ ముగిసేలోపు కచ్చితంగా మా సత్తా ఏమిటో చూపిస్తాం. మా బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఉంది. కానీ ఈరోజు ప్రణాళికలను అమలు చేయలేకపోయాము. గత మ్యాచ్ కూడా ఇక్కడే ఆడాము. పిచ్లో ఎలాంటి మార్పూ లేదు.అయితే, ఈరోజు భారత బౌలర్లు నాణ్యంగా బౌలింగ్ చేసి మమ్మల్ని దెబ్బకొట్టారు. ముఖ్యంగా 6- 10 ఓవర్ల మధ్య మా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశారు’’ అని నమీబియా కెప్టెన గెర్హాడ్ ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.వరుణ్ అద్భుత స్పెల్కాగా ఢిల్లీ వేదికగా టీమిండియా- నమీబియా గురువారం తలపడిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన నమీబియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ఇక లక్ష్య ఛేదనలో నమీబియాను వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. రెండు ఓవర్ల బౌలింగ్లో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ లారెన్ స్టీన్కాంప్ (29), వన్డౌన్ బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ (13)లతో పాటు.. జేజే స్మిత్ (0)లను వరుణ్ అవుట్ చేశాడు.Aate hi k̶a̶a̶m̶ magic shuru kar diye! 🥶Varun Chakaravarthy wastes no time, strikes on his very first ball! ☝️ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/spt27bnTnu— Star Sports (@StarSportsIndia) February 12, 2026 కీలక బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుటయ్యాడు. చదవండి: T20 WC 2026: పాక్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! -
పిజ్జాలు తయారు చేసే షెఫ్.. టీ20 వరల్డ్కప్ ’హీరో’
టీ20 ప్రపంచకప్-2026లో ఇటలీ సంచలన విజయం సాధించింది. నేపాల్తో గ్రూప్ ‘సి’ మ్యాచ్లో అంచనాలను తలకిందులు చేస్తూ ఇటలీ అదరగొట్టింది. ముంబైలో గురువారం జరిగిన ఈ పోరులో ఇటలీ ఏకంగా 10 వికెట్ల తేడాతో నేపాల్పై జయభేరి మోగించడం విశేషం.క్రిషాన్.. మోస్కా బ్రదర్స్ అదుర్స్ఈ గెలుపులో అన్మదమ్ములు జస్టిన్ మోస్కా (44 బంతుల్లో 60 నాటౌట్), ఆంటోని మోస్కా (32 బంతుల్లో 62 నాటౌట్)లతో పాటు లెగ్ స్పిన్నర్ క్రిషాన్ కలుగమగేది కీలక పాత్ర. నేపాల్ను స్వల్ప స్కోరుకు పరిమితం చేయడంలో కలుగమగే ప్రధాన భూమిక పోషించగా.. లక్ష్య ఛేదనలో మోస్కా బ్రదర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇటలీకి తొలి విజయం అందించిన ఈ ముగ్గురు.. ఇటలీ వెలుపల జన్మించిన వారే కావడం గమనార్హం.మోస్కా బ్రదర్స్ తల్లిదండ్రులు ఇటలీ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లగా.. వీరిద్దరు సిడ్నీలో జన్మించారు. అయితే, ఆ తర్వాత క్లబ్ స్థాయి క్రికెట్లో మెళకువలు నేర్చుకుని ఇటలీకి తిరిగి వచ్చి తమ జాతీయ జట్టులో చోటు సంపాదించారు.శ్రీలంకలో పుట్టి పెరిగిఇక క్రిషాన్ కలుగమగేది మరో స్టోరీ. అతడు శ్రీలంకలో జన్మించాడు. క్రికెట్ అంటే అతడికి పిచ్చి అని చెప్పవచ్చు. చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకున్న కలుగమగే అండర్–15 స్థాయి వరకు శ్రీలంకకే ఆడాడు.అయితే అదే సమయంలో కలుగమగే కుటుంబం ఇటలీ వలస వెళ్లేందుకు సిద్ధమైంది. ఇటలీలో ఈ ఆట ఉండదు కాబట్టి తన క్రికెట్ కెరీర్ కోల్పోతానని భయంతో అతను వెళ్లడానికి ఇష్టపడలేదు. అయినా కుటుంబ అవసరాల దృష్ట్యా చివరకు తప్పలేదు. అయితే అక్కడికి వెళ్లాక క్రికెట్ అవకాశాలు రావడంతో పాటు... పరిస్థితి మారి ఏకంగా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.పిజ్జాలు చేసే షెఫ్.. టీ20 వరల్డ్కప్ ’హీరో’నిజానికి కలుగమగే ప్రొఫెషనల్ షెఫ్. ఇటాలియన్ స్పెషల్ పిజ్జాలు తయారు చేసే ‘లా విటా పిజారియా’ అనే హోటల్లో సోమవారం నుంచి శనివారం వరకు ‘షెఫ్’గా అతడు పని చేస్తాడు. కాబట్టి కేవలం ఆదివారాల్లో మాత్రమే అతడికి క్రికెట్ ప్రాక్టీస్ చేసే అవకాశం లభిస్తుంది. ఇలా వారానికి కేవలం ఒక్క రోజు మాత్రమే సాధన చేసే కలుగమగే ఏకంగా వరల్డ్కప్ హీరోగా నిలవడం విశేషం.ఇక నేపాల్తో మ్యాచ్లో 34 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్.. కెప్టెన్ రోహిత్ పౌడేల్ (23), దీపేంద్ర సింగ్ ఐరీ (17), గుల్షాన్ ఝా (3) రూపంలో మూడు వికెట్లు తీశాడు. ఇటలీ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కలుగమగే కేవలం 18 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం.123 పరుగులకేమ్యాచ్ విషయానికొస్తే... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. ఆరిఫ్ షేక్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్రోహిత్ పౌడేల్ (23), ఆసిఫ్ షేక్ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఇతర ప్రధాన బ్యాటర్లు కుశాల్ భుర్తేల్ (5), దీపేంద్ర సింగ్ ఐరీ (17) ప్రభావం చూపించలేకపోవడంతో నేపాల్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.ఇంగ్లండ్పై గత మ్యాచ్లో 17 ఫోర్లు, 7 సిక్స్లు బాదిన నేపాల్ బ్యాటర్లు ఈసారి.. 7 ఫోర్లు, 3 సిక్స్లు మాత్రమే నమోదు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లెగ్ స్పిన్నర్ క్రిషాన్ కలుగమగే (3/18) మూడు కీలక వికెట్లతో జట్టును దెబ్బ తీశాడు.మరో 44 బంతులు మిగిలి ఉండగానేఅనంతరం ఛేదనలో ఇటలీ ఎక్కడా తడబడకుండా అలవోకగా దూసుకుపోయింది. ఇటలీ 12.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అన్నదమ్ములు ఆంటోనీ మోస్కా (32 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్లు), జస్టిన్ మోస్కా (44 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) కలిసి అభేద్యంగా మరో 44 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. The Mosca brothers finish it in style! 🇮🇹🔥A dominant 10-wicket triumph over Nepal as Italy register their first-ever ICC Men’s T20 World Cup win 👏Statement made. History created.Next on ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/lKwkG3OSxX— Star Sports (@StarSportsIndia) February 12, 2026చదవండి: IND vs NAM: అంపైర్తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది? -
జైశ్వాల్, జడేజా కాదు.. రాజస్తాన్ కెప్టెన్గా సూపర్ స్టార్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు రాజస్తాన్ రాయల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు నూతన సారథిగా ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను రాయల్స్ యాజమాన్యం ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై రాజస్తాన్ రాయల్స్ ఫిబ్రవరి 13( శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు అధికారిక ప్రకటన చేయనుంది.గత సీజన్ వరకు కెప్టెన్గా పనిచేసిన సంజూ శాంసన్ స్దానాన్ని పరాగ్ భర్తీ చేయనున్నాడు. తొలుత పరాగ్తో పాటు రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు రాజస్తాన్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ రాజస్తాన్ మేనెజ్మెంట్ మాత్రం పరాగ్ వైపే మొగ్గు చూపినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.రియాన్ పరాగ్ 2019 నుంచి రాజస్తాన్ జట్టుతో కొనసాగుతున్నాడు. అస్సాం జట్టుతో పాటు రాజస్తాన్ కెప్టెన్గా కూడా పరాగ్కు పనిచేసిన అనుభవం ఉంది. ఐపీఎల్-2025 సీజన్లో గాయపడిన సంజూ శాంసన్ స్ధానంలో 8 మ్యాచ్లకు పరాగ్ నాయకత్వం వహించాడు. హెడ్ కోచ్ కుమార్ సంగక్కర సూచన మేరకు పరాగ్కు తమ జట్టు పగ్గాలను రాజస్తాన్ అప్పగించినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది సీజన్కు ముందు రాజస్తాన్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సంజూ శాంసన్ను సీఎస్కే ట్రేడ్ చేసిన రాజస్తాన్.. అందుకు బదులుగా స్టార్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కుర్రాన్లను తమ జట్టులోకి తీసుకుంది. అదేవిధంగా రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా తప్పుకోవడంతో కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో రాజస్తాన్ బరిలోకి దిగనుంది. -
IND vs NAM: అంపైర్తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది?
టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్తో మ్యాచ్కు ముందు తమకు అన్యాయం జరిగిందని ఎరాస్మస్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.మాకు ఆ అవకాశమే లేదుతమకు రాత్రి పూట ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా ఏర్పాటు చేయలేదని ఎరాస్మస్ (Gerhard Erasmus).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీరును విమర్శించాడు. తమ దేశంలో ఫ్లడ్లైట్లు ఉండవని.. అందుకే ఇక్కడైనా టీమిండియాతో నైట్ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ అవకాశం కల్పిస్తే బాగుండేదని పేర్కొన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రాత్రిపూట రెండు నైట్ ప్రాక్టీస్ సెషన్లు ఏర్పాటు చేశారని ఎరాస్మస్ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇక మ్యాచ్ సందర్భంగానూ ఎరాస్మస్ బౌలింగ్ శైలి చర్చకు దారి తీసింది.‘డెడ్ బాల్’బౌలింగ్ క్రీజ్ వద్ద నుంచి చాలా వెనుక ఉంటూనే ఎరాస్మస్ బంతులు వేస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఎరాస్మస్ తొలి ఓవర్లో దీనిని అంపైర్ టకర్ ‘డెడ్ బాల్’గా ప్రకటించాడు. ఈ క్రమంలో ఎరాస్మస్ అంపైర్తో వాదనకు దిగాడు. కాసేపు ఇద్దరి మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది.అయితే, ఎరాస్మస్ వేసిన మరుసటి ఓవర్లో మాత్రం అంపైర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. నిజానికి నిబంధనల ప్రకారం అది తప్పేమీ కాదు. అయితే తొలి ఓవర్లో మరీ అంపైర్ వెనక నుంచి బౌలింగ్ చేసిన ఎరాస్మస్ ఈసారి కాస్త ముందుకు వచ్చి అంపైర్కు కనపడేలా బౌలింగ్ చేయడంతో సమస్య రాలేదు.నాలుగు కీలక వికెట్లుఈ తరహా బౌలింగ్తో పాటు తన రెగ్యులర్ ఆఫ్ స్పిన్...రౌండ్ ఆర్మ్...ఇలా వైవిధ్యాన్ని చూపిస్తూ భారత బ్యాటర్లను కన్ఫ్యూజన్కు గురి చేసిన ఎరాస్మస్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61), తిలక్ వర్మ (21 బంతుల్లో 25), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52), అక్షర్ పటేల్ (0) రూపంలో కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు.కాగా ఢిల్లీ వేదికగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 93 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆల్రౌండర్, కెప్టెన్ ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు. చదవండి: వారిద్దరూ అద్భుతం.. కఠిన పిచ్పై కూడా అదరగొట్టారు: సూర్యUnfair advantage or smart bowling? 🤔@IrfanPathan, Piyush Chawla & Jatin Sapru share their thoughts on Gerhard Erasmus' action.ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/4EvladZTMz— Star Sports (@StarSportsIndia) February 12, 2026 -
పాక్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026లో భారత క్రికెట్ జట్టు రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. పాక్తో పోరు నాటికి పూర్తిగా కోలుకోనున్నట్లు తెలుస్తోంది.అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ తర్వాత అభిషేక్కు తీవ్రమైన కడుపు సమస్య రావడంతో న్యూఢిల్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతడు చికిత్స పూర్తి చేసుకొని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. అయితే నమీబియాతో మ్యాచ్కు ముందు అభిషేక్ ప్రాక్టీస్ కూడా చేశాడంట. ఈ విషయాన్ని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ధ్రువీకరించాడు.నమీబియాతో మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడుతాడని నేను అనుకుంటున్నాను. అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఈ రోజు అతడు ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని నాతో చెప్పాడని వరుణ్ అన్నాడు.2 కిలోలు తగ్గిన అభిషేక్అభిషేక్ శర్మ కూడా తన ఫిట్నెస్పై అప్డేట్ ఇచ్చాడు. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడిన అభిషేక్, చికిత్స సమయంలో రెండు కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తాను కేవలం పప్పు అన్నం మాత్రమే తింటున్నానని ఓ వీడియోలో అభిషేక్ పేర్కొన్నాడు. ఒకవేళ పాక్తో మ్యాచ్కు అభిషేక్ దూరమైతే, భారత ఇన్నింగ్స్ను సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ప్రారంభించనున్నారు. -
ఒకరేమో కార్పెంటర్.. మరొకరు పీఈటీ! ఎవరీ 'మోస్కా బ్రదర్స్'?
క్రికెట్ ప్రపంచానికి మరో అన్నదమ్ముల జోడీ పరిచయమైంది. వారిద్దరూ ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో తమ విధ్వంసకర బ్యాటింగ్తో సంచలనం సృష్టించారు. ఓపెనర్లగా బరిలోకి దిగిన ఆ జంట 124 పరుగుల లక్ష్యాన్ని ఊదిపడేసింది. వారే ఇటలీ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా. గురువారం వాంఖడే వేదికగా జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో నేపాల్ను పది వికెట్ల తేడాతో ఇటలీ చిత్తు చేసింది. మోస్కా బ్రదర్స్ అజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశారు. టీ20 ప్రపంచకప్లో ఇటలీకి ఇదే తొలి విజయం. ఆస్ట్రేలియా నుంచి వచ్చి... ‘మోస్కా బ్రదర్స్’ తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం ఇటలీ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లగా వీరిద్దరు అక్కడే సిడ్నీలో పుట్టారు. అక్కడి క్రికెట్ సంస్కృతి వల్ల ఆటపై మక్కువ పెంచుకొని ఇద్దరూ కలిసే ఆటను నేర్చుకోవడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేసేవారు. ఆస్ట్రేలియాలో క్లబ్ స్థాయిలో ఆడిన తర్వాత వీరిద్దరు ఇటలీ చేరారు. తమ కొత్త జట్టును తీర్చిదిద్దేందుకు ఇటలీకి ఇలాంటి ఆటగాళ్ల అవసరం ఏర్పడింది.ఈ క్రమంలో జాతీయ జట్టుకు ఎంపికైన వీరిద్దరు 2022లో ఒకే మ్యాచ్ ద్వారా (గ్రీస్పై) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం విశేషం. టోర్నీ ముగిసిన తర్వాత ‘మోస్కా బ్రదర్స్’ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోతారు. పెద్దవాడైన ఆంథోనీ పదేళ్ల పాటు కార్పెంటర్గా పని చేసి బాలఖైదీల కేంద్రంలో కార్పెంటర్ పనిని నేర్పించే ఉద్యోగంలో ఇటీవలే చేరాడు. మూడేళ్లు చిన్నవాడైన జస్టిన్ ఒక పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్నాడు.మెనెంటీ బ్రదర్స్’ కూడా... ‘మోస్కా బ్రదర్స్’కు ఆటలో స్ఫూర్తిగా నిలిచిన మరో ఇద్దరు ఆస్ట్రేలియన్ సోదరులు కూడా ఇటలీ జట్టులోనే ఉన్నారు. నేపాల్తో మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించిన హ్యారీ మెనెంటీæ చిన్నవాడు కాగా, బెన్ మెనెంటీ అతనికంటే మూడేళ్ల పెద్దవాడు. వీరు కూడా సిడ్నీకి చెందిన వారే. ఈ ఇద్దరి ప్రోత్సాహంతోనే క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ‘మోస్కా బ్రదర్స్’ ఇప్పుడు వారిద్దరిలో కలిసి ఇటలీ జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడటం విశేషం. అయితే ‘మెనెంటీ’లకు ఇప్పటికే చెప్పుకోదగిన అనుభవం ఉంది. బిగ్బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రయికర్స్, సిడ్నీ సిక్సర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు టాస్మేనియా తరఫున 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడారు.హాకీ వరల్డ్ కప్లో ఆడి... ఇటలీ టీమ్లో ఇద్దరు దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా ఉన్నారు. స్కాట్లాండ్తో మ్యాచ్లో కెపె్టన్గా వ్యవహరించిన దురదృష్టవశాత్తూ గాయంతో టోర్నీకి దూరమైన వేన్ లీ మాడ్సన్ స్వస్థలం డర్బన్. జాతీయ జట్టుకు టెస్టు ఆడే అవకాశం రాకపోయినా... మాడ్సన్కు ఏకంగా 253 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల అనుభవం ఉంది. అతను దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 2006 హాకీ వరల్డ్ కప్లో, 2006 కామన్వెల్త్ గేమ్స్లో ఆడటం విశేషం. సఫారీ టీమ్కు 2021 వరకు 6 వన్డేలు, 13 టి20లు ఆడిన జేజే స్మట్స్ ఇప్పుడు ఇటలీ టీమ్లో ఉన్నాడు. తన జీవితంలో ఒక్కసారి కూడా ఇటలీ దేశంలో అడుగు పెట్టకుండా అతను ఆ దేశం తరఫున వరల్డ్ కప్ ఆడుతుండటం ఆసక్తికరం.టీ20 ప్రపంచకప్లో అన్నదమ్ముల జోడీలు ఇవేటీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏడు అన్నదమ్ముల జోడీలు కలిసి మ్యాచ్లు ఆడాయి. తాజా ప్రపంచకప్లో ఇటలీ నుంచి రెండు ‘బ్రదర్స్’ జోడీలు ఆంథోనీ మోస్కా–జస్టిన్ మోస్కా; హ్యారీ మెనెంటీ–బెన్ మెనెంటీ రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగాయి. గతంలో ఇర్ఫాన్ పఠాన్–యూసుఫ్ పఠాన్ (భారత్; 2007)... నాథన్–బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్)... డ్వేన్ బ్రావో–డారెన్ బ్రావో (వెస్టిండీస్) ... మోర్నీ మోర్కెల్–అల్బీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా)... డేవిడ్ హస్సీ–మైక్ హస్సీ (ఆ్రస్టేలియా) ‘బ్రదర్స్’ కలిసి టి20 ప్రపంచకప్లో ఆడారు. -
వారిద్దరూ అద్భుతం.. కఠిన పిచ్పై కూడా అదరగొట్టారు: సూర్య
టీ20 ప్రపంచకప్-2026లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఢిల్లీ వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్లో నమీబియాను 93 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు. వరుసగా రెండు మ్యాచ్లోనూ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని సూర్య తెలిపాడు."ఈ మ్యాచ్లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించాం. జట్టు విజయంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. వాంఖడే వికెట్పై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. పిచ్ బ్యాటింగ్కు అంత అనుకూలంగా లేనప్పటికి ఇషాన్, సంజూ మాత్రం మా ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించారు. అదేవిధంగా వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా నెలకొల్పిన భాగస్వామ్యం మాకు చాలా కీలకంగా మారింది.క్లిష్ట సమయంలో వారిద్దరూ బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ప్రశంసనీయం. ఒక దశలో 240-250 పరుగులు దాటుతామనిపించినా, నమీబియా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. ఈ మ్యాచ్లో బుమ్రా తన కోటా 4 ఓవర్లను పూర్తి చేయడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా జస్ప్రీత్ తన రిథమ్ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నాము. అలాగే స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ప్రత్యర్దులకు చుక్కలు చూపిస్తున్నారు. వారిద్దరిది అద్భుతమైన కాంబినేషన్. హార్దిక్ పాండ్యా గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొత్త బంతితో, పాత బంతితో గానీ బౌలింగ్ చేసేందుకు పాండ్యా ఎప్పుడు సిద్దంగా ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. మా తదుపరి మ్యాచ్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాక్తో భారత్ తలపడనుంది.భారత్ ఆల్రౌండ్ షో..ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అనంతరం భారీ లక్ష్య చేధనలో 116 పరుగులకే కుప్పకూలింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీ20 ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో 93 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లో రెండింటిలోనూ మెన్ ఇన్ బ్లూ సత్తాచాటింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో టీమిండియా ఓ ప్రపంచ రికార్డును తమపేరిట లిఖించుకుంది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా వరుసగా 8 విజయాలు సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు వరుసగా రెండు విజయాలు నమోదు చేయడంతో ఈ అరుదైన భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ పొట్టి ప్రపంచకప్లో భారత్ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు వరుసగా 8 విజయాలు నమోదు చేశాయి.టీ20 ప్రపంచకప్లో వరుసగా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్లు ఇవేభారత్-10ఆస్ట్రేలియా-8దక్షిణాఫ్రికా-8ఇంగ్లండ్-7చదవండి: T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్ సింగ్ -
ఇషాన్, పాండ్యా చెలరేగగా...
బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు కాబట్టి భారత జట్టు ఈసారి ‘300’ కొడుతుందా అనే చర్చ మధ్య నమీబియాతో మ్యాచ్ మొదలైంది. ఆరంభంలో ఆట చూస్తే అది సాధ్యమే అని కూడా అనిపించింది. చివరకు వచ్చేసరికి ఇది జరగకపోయినా గత మ్యాచ్తో పోలిస్తే భారత బ్యాటింగ్ పదును పెరిగింది. అమెరికాతో ఆశించిన స్కోరుకంటే చాలా తక్కువగా నమోదు చేసిన టీమిండియా ఈసారి మాత్రం 200 దాటింది. ఆపై సమష్టి ప్రదర్శనతో బలహీన ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు తమ టి20 ప్రపంచకప్ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ మెరుపులు, వరుణ్ చక్రవర్తి పొదుపైన బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శన జట్టును గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్తో జరిగే అసలు పోరుపైనే అందరి దృష్టీ నిలిచింది. న్యూఢిల్లీ: టి20 వరల్డ్కప్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ గ్రూప్ ‘ఎ’లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్స్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించారు. నమీబియా కెప్టెన్, ఆఫ్స్పిన్నర్ గెరార్డ్ ఎరాస్మస్ (4/20) పొదుపైన బౌలింగ్ సహా 4 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్ చివరి 11 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు చేజార్చుకుంది. అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. లౌరెన్ స్టీన్కాంప్ (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా...వరుణ్ చక్రవర్తి 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజు సామ్సన్కు అవకాశం దక్కగా... బుమ్రా తిరిగి రావడంతోసిరాజ్ను తప్పించాల్సి వచ్చింది. తమ తర్వాతి మ్యాచ్లో భారత్ ఈ నెల 15న కొలంబోలో పాకిస్తాన్తో తలపడుతుంది. ఇషాన్ 6, 6, 6, 6, 4... అభిషేక్ గైర్హాజరులో అదృష్టవశాత్తూ మ్యాచ్ అవకాశం దక్కించుకున్న సంజు సామ్సన్ (8 బంతుల్లో 22; 1 ఫోర్, 3 సిక్స్లు) సిక్స్తో స్కోరింగ్ మొదలు పెట్టినా అది ఎక్కువసేపు సాగలేదు. షికోంగో ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. మరో ఎండ్లో ఇషాన్ తన జోరును మొదలు పెట్టాడు. 8 బంతుల వ్యవధిలో 4 ఫోర్లు కొట్టిన అతను... స్మిట్ వేసిన ఓవర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. పవర్ప్లే ముగిసేసరికి 86 పరుగులు చేసిన భారత్... 6.5 ఓవర్లలోనే 100 పరుగులను అందుకుంది. టి20 వరల్డ్ కప్లో అతి తక్కువ బంతుల్లో (35 బంతుల్లో) వంద పరుగులు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇషాన్ అవుటైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ (12), హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) కూడా తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే పాండ్యా, శివమ్ దూబే (16 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) భారీ భాగస్వామ్యంతో స్కోరు 200 దాటింది. వీరిద్దరు 39 బంతుల్లో 81 పరుగులు జత చేశారు. షికోంగో ఓవర్లో వరుసగా సిక్స్, 2 ఫోర్లు కొట్టిన హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. చివర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. టపటపా... ఛేదనలో దాదాపు సగం ఓవర్ల వరకు నమీబియా ప్రదర్శన మెరుగ్గానే ఉంది. పవర్ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. స్టీన్కాంప్తో పాటు ఫ్రైలింగ్ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), ఎరాస్మస్ (11 బంతుల్లో 18; 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. 9.1 ఓవర్లలో జట్టు 86/2 వద్ద నిలిచింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిది. భారత బౌలర్లు చెలరేగడంతో నమీబియా బ్యాటర్లు ఎవరూ నిలవలేకపోయారు. 8 పరుగుల వ్యవధిలో తర్వాతి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ కోలుకోలేకపోయింది. ఒకే స్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు పడ్డాయి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) షికోంగో (బి) ఎరాస్మస్ 61; సామ్సన్ (సి) స్టీన్కాంప్ (బి) షికోంగో 22; తిలక్ (సి) స్మిట్ (బి) ఎరాస్మస్ 25; సూర్యకుమార్ (స్టంప్డ్) గ్రీన్ (బి) స్కాల్ 12; పాండ్యా (సి) (సబ్) లీషర్ (బి) ఎరాస్మస్ 52; దూబే (రనౌట్) 23; రింకూ (సి) ఎరాస్మర్ (బి) స్మిట్ 1; అక్షర్ (బి) ఎరాస్మస్ 0; వరుణ్ (నాటౌట్) 1; అర్‡్షదీప్ (రనౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–25, 2–104, 3–120, 4–124, 5–205, 6–205, 7–206, 8–206, 9–209. బౌలింగ్: రూబెన్ 4–0–38–0, షికోంగో 3–0–41–1, స్మిట్ 4–0–50–1, హీన్గో 1–0–18–0, ఎరాస్మస్ 4–0–20–4, స్కాల్ 4–0–41–1. నమీబియా ఇన్నింగ్స్: స్టీన్కాంప్ (బి) వరుణ్ 29; ఫ్రైలింక్ (సి) దూబే (బి) అర్‡్షదీప్ 22; జాన్ నికోల్ (సి) అక్షర్ (బి) వరుణ్ 13; ఎరాస్మస్ (సి) తిలక్ (బి) అక్షర్ 18; స్మిట్ (బి) వరుణ్ 0; గ్రీన్ (హిట్వికెట్) (బి) దూబే 11; క్రూగర్ (సి) బుమ్రా (బి) అక్షర్ 5; రూబెన్ (బి) బుమ్రా 6; స్కాల్ (సి) అక్షర్ (బి) పాండ్యా 4; షికోంగో (ఎల్బీ) (బి) పాండ్యా 0; హీన్గో (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 116. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–86, 4–86, 5–88, 6–94, 7–111, 8–116, 9–116, 10–116. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–21 –2, అర్‡్షదీప్ సింగ్ 3–0–36–1, శివమ్ దూబే 2.2–0–11–1, జస్ప్రీత్ బుమ్రా 4–0–20–1, వరుణ్ చక్రవర్తి 2–0–7–3, అక్షర్ పటేల్ 3–1–20–2. టి20 ప్రపంచకప్లో నేడుఆ్రస్టేలియా x జింబాబ్వేవేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి కెనడా x యూఏఈవేదిక: న్యూఢిల్లీ; మ.గం. 3 నుంచి నెదర్లాండ్స్ x అమెరికావేదిక: చెన్నై; రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
మూడు పతకాలూ మనవే
న్యూఢిల్లీ: స్వదేశంలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్లో గురువారం సీనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. వ్యక్తిగతవిభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు టీమ్ ఈవెంట్లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్కోరును సాధించాడు. స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. భారత్కే చెందిన నీరజ్ కుమార్ 361.8 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... అఖిల్ షెరాన్ 343.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్లతో కూడిన భారత బృందం 1769 పాయింట్లతో టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్లు అడ్రియన్ కర్మాకర్ 353.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... మానవేంద్ర సింగ్ షెఖావత్ 338.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని నెగ్గారు. అడ్రియన్ కర్మాకర్, మానవేంద్ర సింగ్, ప్రిన్స్లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1741 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించింది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు భారత షూటర్లు 38 స్వర్ణాలు, 16 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి 70 పతకాలు సాధించారు. -
సెమీస్లో రష్మిక జోడీ
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్) ద్వయం 7–6 (9/7), 6–3తో భారత్కే చెందిన వైష్ణవి–వైదేహి జంటపై గెలుపొందింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక–అంకిత రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశారు. హైదరాబాద్కే చెందిన సహజ యామలపల్లికి మాత్రం నిరాశ ఎదురైంది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ (భారత్)–జుజానా పావ్లీకౌస్కా (పోలాండ్) జంట 6–4, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో పొలీనా బఖ్ముత్కినా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. -
స్నేహిత్ శుభారంభం
చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్ కంటెండర్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ స్నేహిత్ 9–11, 11–8, 8–11, 11–7, 11–6తో భారత్కే చెందిన దివ్యాంశ్ శ్రీవాస్తవపై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. భారత్కే చెందిన ఆకాశ్ పాల్, అంకుర్, హర్మీత్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. -
T20 World Cup 2026: నమీబియాపై టీమిండియా ఘన విజయం
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా నమీబియాతో నేడు (ఫిబ్రవరి 12) జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్య చేదనకు దిగిన నమీబియా జట్టు 116 పరుగులకే ఆలౌట్గా నిలిచింది. దీంతో 93 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.నమీబియా బ్యాటర్లలో లౌరెన్ స్టీన్క్యాంప్ 29 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, జాన్ ఫ్రైలింక్ 22 పరుగులు సాధించాడు. మిగితా బ్యాట్స్మెన్స్ తక్కువ స్కోర్కే వెనుదిరగడంతో నమీబియా జట్టు 116 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో వరుణ్ చకరవర్తి 3 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేలకు తలో వికెట్టు దక్కింది. బ్యాటింగ్లో 52 పరుగులతో రాణించిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కూడా రెండు వికెట్లు తీయడంతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. తొలుత టాస్ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్, హార్దిక్ క్రీజ్లో ఉన్నంత సేపు భారత్ ఇంకా భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్ సింగ్
భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్ మొత్తంలో (అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్, దేశవాలీ) 250 వికెట్లు పూర్తి చేసిన కొద్ది మంది బౌలర్ల సరసన నిలిచాడు. అర్షదీప్ కేవలం 188 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. జాన్ ఫ్రైలింక్ వికెట్ అర్షదీప్కు 250వ వికెట్.అర్షదీప్ కెరీర్ సగటు 22 లోపే ఉండగా, ఎకానమీ రేట్ 8పైగా ఉంది. టీ20 కెరీర్ మొత్తంలో అర్షదీప్ ఐదు సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అర్షదీప్ తన టీ20 కెరీర్లో ఎక్కువ శాతం భారత్, పంజాబ్, పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అర్షదీప్ అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున (121) అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా చలామణి అవుతున్నాడు. ఐపీఎల్లో అర్షదీప్ 97 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నమీబియాతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీలు బాది భారత్కు ఈ స్కోర్ అందించారు.మిగతా బ్యాటర్లలో సంజూ శాంసన్ (8 బంతుల్లో 22; ఫోర్, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 12; సిక్స్) ఆచితూచి ఆడారు. శివమ్ దూబే (16 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు.ఆఖర్లో రింకూ సింగ్ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్ పటేల్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్ సింగ్ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రూబెన్ ట్రంపల్మెన్ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్ (4-0-50-1), బెర్నాల్డ్ స్కోల్జ్పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్తోనే చాలించుకున్నాడు.భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ఓటమి దిశగా సాగుతుంది. 11 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 88-5గా ఉంది. వరుణ్ చక్రవర్తి 3, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసి నమీబియాను దెబ్బకొట్టారు. -
ఇషాన్ విధ్వంసం, హార్దిక్ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్.. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.ఇషాన్, హార్దిక్ క్రీజ్లో ఉన్నంత సేపు భారత్ ఇంకా భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ (8 బంతుల్లో 22; ఫోర్, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 12; సిక్స్) ఆచితూచి ఆడారు. శివమ్ దూబే (16 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో రింకూ సింగ్ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్ పటేల్ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్ సింగ్ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రూబెన్ ట్రంపల్మెన్ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్ (4-0-50-1), బెర్నాల్డ్ స్కోల్జ్పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్తోనే చాలించుకున్నాడు. -
T20 WC 2026: ఊచకోత.. చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్కు ముందు ఏ భారత వికెట్కీపర్ బ్యాటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. భారత్ టీ20 ప్రపంచకప్లో రెండు సార్లు ఛాంపియన్ (2007, 2024) అయినా, ఓ వికెట్కీపర్ బ్యాటర్ హాఫ్ సెంచరీ సాధించలేకపోవడం నిజంగానే ఆశ్చర్యకరం.20 బంతుల్లో హాఫ్ సెంచరీఈ రికార్డు హాఫ్ సెంచరీని ఇషాన్ కేవలం 20 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి, నమీబియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో శైలికి భిన్నంగా కాస్త నిదానంగా ఆడాడు. మూడో ఓవర్లో అతను సహజ మోడ్లోకి వచ్చాడు. ఆ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఇషాన్.. ఆమరుసటి ఓవర్లో మరో బౌండరీ కొట్టాడు. ఇషాన్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఉగ్రరూపం దాల్చాడు. స్మట్స్ వేసిన ఆ ఓవర్లో వరుసగా 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. ఆతర్వాత ఓవర్లో వరుసగా మరో సిక్సర్, బౌండరీ కొట్టాడు. అనంతరం 7వ ఓవర్ తొలి బంతికి మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో ఇషాన్ మొత్తం 24 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. ఇషాన్ ధాటికి భారత్ 7 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది.అంతకుముందు సంజూ శాంసన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ సైతం హ్యాట్రిక్ సిక్సర్లు, బౌండరీ కొట్టి, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు. సంజూ 8 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్ ఔటయ్యాక భారత స్కోర్ కాస్త నెమ్మదించింది.హార్దిక్ లైన్లోకి వచ్చాడుఅయితే హార్దిక్ పాండ్యా రాకతో భారత స్కోర్ మళ్లీ జోరందుకుంది. హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు.18.2 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 205/5గా ఉంది. శివమ్ దూబే (23), రింకూ సింగ్ క్రీజ్లో ఉన్నారు. -
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్ యాదవ్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్, నమీబియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ బాంబు లాంటి విషయాన్ని చెప్పాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంకా కోలుకోలేదని తెలిపాడు. అభిషేక్ ఒకటి లేదా రెండు మ్యాచ్లు మిస్ అయ్యే అవకాశముందని అన్నాడు. ఈ లెక్కన అభిషేక్ నమీబియా మ్యాచ్తో పాటు ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో జరుగబోయే మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండడని చెప్పకనే చెప్పాడు.యూఎస్ఏ మ్యాచ్ సమయంలో కడుపు నొప్పితో ఇబ్బంది పడిన అభిషేక్.. సమస్య అధికం కావడంతో కొద్ది రోజుల కిందట ఆసుపత్రిలో చేరాడు. నిన్ననే అభిషేక్ డిశ్చార్జ్ అయ్యాడని వార్తలు వచ్చినప్పటికీ.. ఇవాళ టీమిండియా కెప్టెన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే అభిషేక్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని స్పష్టంగా తెలుస్తుంది. అభిషేక్ పాకిస్తాన్తో మ్యాచ్కు కూడా దూరమైతే టీమిండయాకు ఎంతోకొంత మైనస్ అవుతుంది. అభిషేక్ ఇటీవలికాలంలో భారత విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. అతడు ఇచ్చే మెరుపు ఆరంభాలే మ్యాచ్ ఫలితాన్ని భారత్కు అనుకూలంగా మార్చాయి. అలాంటి అభిషేక్ ప్రపంచకప్లో కీలక మ్యాచ్కు అందుబాటులో ఉండకపోతే ఏమైనా జరిగే అవకాశం ఉంది.కాగా, నమీబియాతో మ్యాచ్లో అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే ఈ మ్యాచ్ కోసం భారత్ మరో మార్పు కూడా చేసింది. గత మ్యాచ్లో (యూఎస్ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు.గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్న సంజూఅభిషేక్ కడుపు సమస్యతో బాధపడుతుండటంతో నమీబియా మ్యాచ్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ అందివచ్చిన గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్నాడు. తొలి మూడు బంతులను జాగ్రత్తగా ఆడిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే ఆతర్వాతి బంతికే బౌలర్ బెన్ షికోంగో ఉచ్చులో (స్లో బాల్) చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తంగా సంజూ ఈ ఇన్నింగ్స్లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ వికెట్ నష్టానికి 35 పరుగులుగా ఉంది. ఇషాన్ కిషన్ 11, తిలక్ వర్మ ఒక్క పరుగుతో క్రీజ్లో ఉన్నారు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
T20 WC 2026: గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జోస్ బట్లర్
ఇంగ్లండ్ వికెట్కీపింగ్ బ్యాటర్ జోస్ బట్లర్ తన అసమాన క్యాచింగ్ ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బట్లర్ 122 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ ద్వారా వదిలిన బంతిని పట్టుకుని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్యాచ్ పట్టిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ప్రవేశించాడు. బట్లర్కు ముందు ఈ ఫీట్ను సాధించేందుకు చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవరి వల్ల కాలేదు.బట్లర్ మాత్రం తన అద్భుతమైన హ్యాండ్-ఐ కమ్యూనికేషన్తో, బంతిపైనే పూర్తి ఏకాగ్రత ఉంచి అద్భుతమైన క్యాచ్ను పట్టుకున్నాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా వికెట్కీపర్ బ్యాటర్ తిమోతి షానన్ జెబ్సీలన్ పేరిట ఉండేది. 2021లో తిమోతి 119.86 మీటర్ల ఎత్తు నుంచి పడ్డ బంతిని పట్టుకుని రికార్డు సృష్టించాడు. తాజాగా బట్లర్ తిమోతి రికార్డును అధిగమించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ప్రవేశించాడు. Jos Buttler Breaks World Record For Highest Cricket Catch! 🤯 pic.twitter.com/AZaZQtY0v2— The Switch | Kevin Pietersen (@kptheswitch) February 11, 2026ఈ ఫీట్కు క్రికెట్తో ఏ సంబంధం లేనప్పటికీ.. ఈ అనుభవం మాత్రం బట్లర్కు ఆన్ ఫీల్డ్ చాలా ఉపయోగపడుతుంది. ఫీల్డింగ్ సమయంలో ఎప్పుడైనా ఇలాంటి పరీక్ష ఎదురైతే బట్లర్ తప్పక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్లర్ ఇప్పటికే ఆన్ ఫీల్డ్లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్యాచ్లు పట్టుకున్నాడు. వికెట్కీపర్గానే కాకుండా ఫీల్డర్గానూ పలు మంచి అనుభవాలు కలిగి ఉన్నాడు. తాజా అనుభవం (గిన్నిస్ రికార్డు) మాత్రం బట్లర్ను చాలా ప్రత్యేకంగా ఉంచుతుంది. ఈ గిన్నిస్ రికార్డు ఫీట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది.ఇదిలా ఉంటే, బట్లర్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో బిజీగా ఉన్నాడు. ఈ విధ్వంసకర బ్యాటర్ ఇటీవలికాలంలో ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ప్రపంచకప్లోనూ బట్లర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. నేపాల్తో మ్యాచ్లో 26 పరుగులు చేసిన అతను.. నిన్న వెస్టిండీస్పై 21 పరుగులకు ఔటయ్యాడు. రెండు మ్యాచ్ల్లో బట్లర్కు శుభారంభాలే లభించినా, పెద్ద స్కోర్లుగా మలుచుకోలేకపోయాడు.బట్లర్ ఫామ్లాగే, మెగా టోర్నీ ఇంగ్లండ్ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తొలుత పసికూన నేపాల్ చేతిలో తృటిలో ఘోర పరాభవాన్ని తప్పించుకున్న ఈ జట్టు.. నిన్న విండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో విండీస్, స్కాట్లాండ్, ఇటలీ తర్వాత నాలుగో స్థానంలో ఉంది. -
నమీబియాతో మ్యాచ్.. టీమిండియాలో రెండు మార్పులు
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) రాత్రి 7 గంటలకు భారత్ వర్సెస్ నమీబియా మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చాడు. అలాగే గత మ్యాచ్లో (యూఎస్ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్తో తిరిగి వచ్చాడు. సిరాజ్ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు. మరోవైపు నమీబియా కెప్టెన్ కూడా ఈ మ్యాచ్లో కోసం రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.తుది జట్లు..భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో -
టీ20 ప్రపంచకప్లో సంచలనం
ఇటలీ క్రికెట్ చరిత్రలో ఈ రోజు (ఫిబ్రవరి 12) చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇవాళ ఈ యూరప్ జట్టు ప్రపంచకప్లో తమ తొట్టతొలి విజయాన్ని నమోదు చేసింది. ఇటలీ ఏదైనా వరల్డ్కప్కు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి. యూరోపియన్ క్వాలిఫయర్స్ ద్వారా ఇటలీ టీ20 ప్రపంచకప్ 2026 బెర్త్ దక్కించుకుంది.తొలి ప్రపంచకప్లో ఆడిన రెండో మ్యాచ్లోనే విజయం సాధించడం ఇటలీని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్లో ఇటలీ తమకంటే చాలా రెట్లు మెరుగైన, మూడోసారి ప్రపంచకప్ ఆడుతున్న నేపాల్పై సంచలన విజయం సాధించింది. రెండు రోజుల కిందట ఇదే నేపాల్ జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్ను ఓడించినంత పని చేసింది. అలాంటి నేపాల్ జట్టును ఇవాళ ఇటలీ సునాయాసంగా మట్టికరిపించింది.మట్టికరిపించడం అంటే ఏదో సాదాసీదాగా కాదు. ఏకంగా 10 వికెట్ల తేడాతో. ఈ గెలుపుతో ఇటలీ గ్రూప్-సిలో మిగతా జట్లకు (వెస్టిండీస్, ఇంగ్లండ్) వణుకు పుట్టిస్తుంది. ఈ మ్యాచ్లో ఇటలీ తమ రెగ్యులర్ కెప్టెన్ వేన్ మ్యాడ్సన్ లేకుండా బరిలోకి దిగి సంచలన విజయం సాధించింది. మ్యాడ్సన్ స్కాట్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో తీవ్రంగా గాయపడ్డాడు.తొలి మ్యాచ్లో ఇటలీకి స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్లో ఇటలీ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలి మ్యాచ్ నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో ఇటలీ రెండో మ్యాచ్లో తిరుగులేని విజయం సాధించి, క్రికెట్ ప్రపంచాన్నంతా తమ వైపు తిప్పుకుంది.తిప్పేసిన స్పిన్నర్లుటాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇటలీ నేపాల్ను 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు క్రిషన్ కలుగమగే (4-0-18-3), బెన్ మనెన్టి (4-0-9-2), స్మట్స్ (4-0-22-1) నేపాల్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పేసర్లు అలీ హసన్, జస్ప్రీత్ సింగ్ తలో వికెట్ తీసి నేపాల్ను దెబ్బేశారు.నేపాల్ ఇన్నింగ్స్లో 27 పరుగులు చేసిన ఆరిఫ్ షేక్ టాప్ స్కోరర్గా నిలువగా.. ఆసిఫ్ షేక్ (20), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (23), దీపేంద్ర సింగ్ ఎయిరీ (17), కరణ్ కేసి (18 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో కుషాల్ భుర్టెల్, సందీప్ లామిచ్చేన్ చెరో 5, లోకేశ్ బామ్, గుల్షన్ ఝా తలో 3, నందన్ యాదవ్ మరియు లలిత్ రాజ్బంశీ డకౌట్లయ్యారు.మోస్కా బ్రదర్స్ అదుర్స్124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు మోస్కా బ్రదర్స్ జూలు విదిల్చారు. ఈ ఇద్దరు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి, కేవలం 12.4 ఓవర్లలోనే తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. జస్టిన్ మోస్కా 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 60 పరుగులు.. ఆంథొని మోస్కా 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశారు. జస్టిన్, ఆంథొని ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇటలీ జట్టులో మరో అన్నదమ్ముల జోడీ ఉంది. ఈ మ్యాచ్లో ఇటలీకి తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన హ్యారీ మనెంటి, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ బెన్ మనెంటి ఇద్దరు అన్నదమ్ములు.చరిత్ర సృష్టించిన మోస్కా బ్రదర్స్ఈ మ్యాచ్లో మోస్కా బ్రదర్స్ చరిత్ర సృష్టించారు. తొలి వికెట్కు అజేయమైన 124 పరుగులు జోడించిన ఈ అన్నదమ్ములు.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి అన్నదమ్ముల జోడీగా చరిత్ర సృష్టించారు. -
మొన్న ఏమో ఇంగ్లండ్ను గడగడలాడించారు.. ఇప్పుడేమో ఇటలీ ముందు..!
టీ20 వరల్డ్కప్ 2026లో రెండు రోజుల కిందట పటిష్టమైన ఇంగ్లండ్ను ఓడించినంత పని చేసిన పసికూన నేపాల్, ఇవాళ (ఫిబ్రవరి 12) వారి కంటే చిన్న జట్టైన ఇటలీ ముందు తేలిపోయింది. మొన్న తన మెరుపు బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్లను గడగడలాడించిన లోకేశ్ బామ్.. ఇవాళ ఇటలీ బౌలర్ల ముందు తస్సుమన్నాడు. లోకేశ్తో పాటు ఏ ఒక్క ఆటగాడు కూడా సత్తా చాటలేకపోవడంతో ఇటలీతో మ్యాచ్లో నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది.27 పరుగులు చేసిన ఆరిఫ్ షేక్ టాప్ స్కోరర్గా నిలువగా.. ఆసిఫ్ షేక్ (20), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (23), దీపేంద్ర సింగ్ ఎయిరీ (17), కరణ్ కేసి (18 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో కుషాల్ భుర్టెల్, సందీప్ లామిచ్చేన్ చెరో 5, లోకేశ్ బామ్, గుల్షన్ ఝా తలో 3, నందన్ యాదవ్ మరియు లలిత్ రాజ్బంశీ డకౌట్లయ్యారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇటలీ అన్ని విభాగాల్లో నేపాల్ను కట్టడి చేసింది. ముఖ్యంగా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. స్పిన్నర్లు క్రిషన్ కలుగమగే (4-0-18-3), బెన్ మనెన్టి (4-0-9-2), స్మట్స్ (4-0-22-1) నేపాల్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పేసర్లు అలీ హసన్, జస్ప్రీత్ సింగ్ తలో వికెట్ తీసి నేపాల్ను దెబ్బేశారు. -
ఐపీఎల్లో అమ్ముడుపోని వారిపై పాకిస్తాన్ సూపర్ లీగ్లో కనకవర్షం
ఐపీఎల్ 2026 వేలంలో అన్సోల్డ్గా మిగిలిన పలువురు విదేశీ ఆటగాళ్లపై పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కనకవర్షం కురిసింది. పీఎస్ఎల్లో తొలిసారి వేలం విధానాన్ని ప్రవేశపెట్టగా, కొందరు విదేశీ స్టార్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఫలితంగా కొందరు ఫారిన్ ప్లేయర్లకు ఊహించని ధర లభించింది. జాక్పాట్ కొట్టిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఉన్నారు.ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోక, పీఎస్ఎల్ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు..డారిల్ మిచెల్: ఈ న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు ఐపీఎల్ 2026 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడ్డా, ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ పీఎస్ఎల్లో మాత్రం మిచెల్పై కనకర్షం కురిసింది. ఇతన్ని రావల్పిండి ఫ్రాంచైజీ ఏకంగా 8.05 కోట్ల పాక్ కరెన్సీకి కొనుగోలు చేసింది. ఈ మొత్తం భారత రూపాయల్లో 2.59 కోట్లవుతుంది.ఆడమ్ జంపా: ఐపీఎల్ 2025లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాను ఐపీఎల్ 2026లో వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్ఎల్ బాట పట్టాడు. అక్కడ అతన్ని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ 4.5 కోట్లకు (పాక్ కరెన్సీ) కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో ఇది రూ. 1.46 కోట్లకు సమానమవుతుంది.రిలీ రొస్సో: ఐపీఎల్లో వరుసగా రెండు సీజన్లలో (2025, 2026) అన్ సోల్డ్గా మిగిలిపోయిన సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ రిలీ రొస్సోను క్వెట్టా గ్లాడియేటర్స్ అనే ఫ్రాంచైజీ 5.5 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది. ఇది భారత కరెన్సీలో రూ. 1.8 కోట్లకు సమానం.పీఎస్ఎల్-2026 వేలంలో భారీ ధర దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు.. మార్క్ చాప్మన్- 7 కోట్లు (పాక్ కరెన్సీలో)ఆస్టన్ టర్నర్- 4.2 కోట్లుమైఖేల్ బ్రేస్వెల్- 4.2 కోట్లుకుసాల్ మెండిస్- 4.2 కోట్లుటామ్ కర్రన్- 4.2 కోట్లుకుసాల్ పెరీరా- 3.1 కోట్లుజేమ్స్ విన్స్- 3 కోట్లురిషద్ హొసేన్- 3 కోట్లు వీరితో పాటు పీటర్ సిడిల్, జోష్ ఫిలిప్, తబ్రేస్ షంషి, జాన్సన్ ఛార్లెస్, మ్యాక్స్ బ్రయాంట్, షమార్ జోసఫ్, ఓట్నీల్ బార్ట్మన్, గుడకేశ్ మోటీ, రిచర్డ్ గ్లీసన్, బెన్ మెక్డెర్మాట్, దసున్ షనక, సామ్ హార్పర్, బెవాన్ జాకబ్స్ తదితర ఆటగాళ్లకు కూడా పీఎస్ఎల్ వేలంలో ఓ మోస్తరు ధర లభించింది.పీఎస్ఎల్లో అమ్ముడుపోని ప్రముఖుల్లో షకీబ్ అల్ హసన్, కైల్ మేయర్స్, కొలిన్ మున్రో, అల్జరీ జోసఫ్, జేమ్స్ నీషమ్, జేసన్ రాయ్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, డేవిడ్ మలాన్, కేశవ్ మహారాజ్ తదితరులు ఉన్నారు. -
T20 WC 2026: మహ్మద్ నబీకి షాకిచ్చిన ఐసీసీ
అఫ్గనిస్తాన్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ నబీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో పదిహేను శాతం కోత విధించింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్లో టాస్ గెలిచిన అఫ్గన్ జట్టు తొలుత బౌలింగ్ చేసింది.సమ ఉజ్జీలుగాఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ప్రొటిస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో అఫ్గనిస్తాన్ సైతం 19.4 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి మూడు వికెట్లతో రాణించాడు. అఫ్గన్ కీలక ఆటగాళ్లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.రెండు సూపర్ ఓవర్లుఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. అఫ్గన్- ప్రొటిస్ ఈసారి కూడా చెరో పదిహేడు పరుగులు చేసి సమంగా నిలిచాయి. దీంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఈసారి సౌతాఫ్రికా పైచేయి సాధించి గెలుపు జెండా ఎగురవేసింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నబీ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. జార్జ్ లిండే బౌలింగ్లో ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, తాను క్రీజులో ఉన్న వేళ.. అఫ్గన్ పద్నాలుగో ఇన్నింగ్స్లో నబీ ఆన్ఫీల్డ్ అంపైర్తో వాదనకు దిగాడు.అంపైర్తో వాగ్వాదంలుంగి ఎంగిడి ధరించిన రిస్ట్ బ్యాండ్ గురించి నబీ ఫిర్యాదు చేస్తూ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అంపైర్తో గొడవపడ్డందుకు ఐసీసీ నబీకి జరిమానా వేసింది. ఈ మేరకు ‘‘ఐసీసీ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ డేవిడ్ గిల్బర్ట్ ముందు నబీ తన తప్పును అంగీకరించాడు. కాబట్టి తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది.అతడి మ్యాచ్ ఫీజులో పదిహేను శాతం కోత విధిస్తున్నాం. గడిచిన 24 నెలల కాలంలో ఇదే అతడి మొదటి తప్పిదం కావున ఒక్క డిమెరిట్ పాయింట్తో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: T20 WC IND vs NAM: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు -
T20 WC 2026: భారీ లక్ష్య ఛేదన.. చరిత్ర సృష్టించిన ఒమన్ ప్లేయర్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) ఉదయం జరిగిన మ్యాచ్లో శ్రీలంక, ఒమన్ తలపడ్డాయి. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంక 105 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కుసాల్ మెండిస్ (45 బంతుల్లో 61; 7 ఫోర్లు), పవన్ రత్నాయకే (28 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ దసున్ షనక (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 13, కమిల్ మిషారా 8, కమిందు మెండిస్ 19 (నాటౌట్), వెల్లాలగే 6 (నాటౌట్) పరుగులు చేశారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-0-28-0) మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జితేన్ రామనంది (4-0-41-2), సూఫ్యాన్ మెహమూద్ (4-0-60-1), జే ఒడేడ్రా (1-0-14-1) వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చారు. వసీం అలీ (3-0-38-0), నదీమ్ ఖాన్ (4-0-40-0)ను లంక బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఒమన్ ఆదిలోనే చేతులెత్తేసింది. వెల్లాలగే (4-0-17-1), తీక్షణ (4-0-11-2), చమీరా (2-0-19-2), కమిందు (2-0-10-1), హేమంత (4-0-45-1) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒమన్ ఇన్నింగ్స్లో నాలుగో స్థానంలో వచ్చిన వెటరన్ బ్యాటర్ మొహమ్మద్ నదీం (56 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.నదీం కాకుండా వసీం అలీ (27) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆమిర్ కలీమ్ 6, కెప్టెన్ జతిందర్ సింగ్ 1, హమ్మద్ మీర్జా 9, వినాయక్ శుక్లా 1, నదీం ఖాన్ 2, సూఫ్యాన్ మెహమూద్ 1, షా ఫైసల్ 1, జే ఒడేడ్రా 4 (నాటౌట్), జితేన్ రామనంది డకౌటయ్యారు.నదీం ప్రపంచ రికార్డుఒమన్ తరఫున ఏకైక అర్ద సెంచరీ చేసిన మొహమ్మద్ నదీం ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్లో అర్ద సెంచరీ చేసిన అతి పెద్ద వయస్కుడైన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నదీం వయసు 43 ఏళ్ల 161 రోజుల. గతంలో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉండేది. జయసూర్య 2009 ప్రపంచకప్ ఎడిషన్లో వెస్టిండీస్పై 39 ఏళ్ల 345 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు.మరో ప్రపంచ రికార్డు కూడా సమంఈ మ్యాచ్లో నదీం మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. 52 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసిన నదీం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో బంతుల పరంగా అతి నిదానంగా అర్ద సెంచరీ చేసిన ఆటగాడిగా పాక్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్ రికార్డును సమం చేశాడు. రిజ్వాన్ 2024 ఎడిషన్లో కెనడాపై 52 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనక చరిత్ర సృష్టించాడు. ఒమన్తో మ్యాచ్లో ధనాధన్ దంచికొట్టి.. గతంలో తన పేరిట ఉన్న రికార్డు తానే బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక- ఒమన్ గురువారం నాటి మ్యాచ్లో ముఖాముఖి ఎదురుపడ్డాయి.కుశాల్ మెండిస్ అర్ధ శతకంపల్లెకెలె వేదికగా టాస్ గెలిచిన ఒమన్.. ఆతిథ్య శ్రీలంకను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక (13), కమిల్ మిశారా (8) నిరాశపరచగా.. వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ అర్ధ శతకంతో అలరించాడు.మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న కుశాల్.. ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ పవన్ రత్ననాయకె ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్ బాది 60 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ దసున్ శనక సుడిగాలి ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు.కేవలం 19 బంతుల్లోనే ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన షనక.. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా శ్రీలంక తరఫున పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గతంలో పుణె వేదికగా 2023లో టీమిండియాతో మ్యాచ్లో షనక 20 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.WHERE’S THE BALL?! 🚀Back-to-back sixes as the Sri Lankan skipper marches towards his fifty, leading from the front and steering SL towards a massive total 👏🔥ICC Men’s #T20WorldCup | #SLvOMA | LIVE NOW 👉 https://t.co/JscJZV8hFa pic.twitter.com/oH7vFDDqqJ— Star Sports (@StarSportsIndia) February 12, 2026ఇక ఒమన్తో తాజా మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొన్న దసున్ షనక రెండు ఫోర్లు, ఐదు సిక్స్ల సాయంతో 50 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో కమిందు మెండిస్ ఏడు బంతుల్లో 19, దునిత్ వెల్లలగే నాలుగు బంతుల్లో 6 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. ఈ ఎడిషన్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది రెండు, జే ఒడేరా, సూఫ్యాన్ మెహమూద్ తలా ఒక వికెట్ పడగొట్టారు.శ్రీలంక తరఫున టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీలు సాధించిన ఆటగాళ్లు వీరే🏏దసున్ షనక- 2026 వరల్డ్కప్లో ఒమన్ మీద 19 బంతుల్లో🏏దసున్ షనక- 2023లో టీమిండియా మీద 20 బంతుల్లో🏏మహేళ జయవర్దనే- 2007 వరల్డ్కప్లో కెన్యా మీద 21 బంతుల్లో🏏కుమార్ సంగక్కర- 2009లో టీమిండియా మీద 21 బంతుల్లో.చదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ! -
ICC: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్ ఆరోపణలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియా- నమీబియా మధ్య గురువారం నాటి మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కాగా ఈసారి వరల్డ్కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, అమెరికాతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది నమీబియా. తొలి మ్యాచ్లో భాగంగా ఢిల్లీలో నెదర్లాండ్స్తో తలపడి ఓటమిపాలైంది. తమ రెండో మ్యాచ్లో భాగంగా పటిష్ట టీమిండియాను ఢీకొట్టనుంది నమీబియా.అన్యాయంఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఎరాస్మస్.. తమకు రాత్రి వేళ ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కలేదని అసహనం వ్యక్తం చేశాడు. తమ దేశంలో ఎన్నడూ నైట్ మ్యాచ్లు ఆడలేదని.. అనుభవం లేనందున తమకు ప్రాక్టీస్కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది తమకు అన్యాయం చేయడం లాంటిదేనని పరోక్షంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని తప్పుబట్టాడు.టీమిండియాకు రెండు.. మాకు సున్నా!కాగా ఈ టోర్నీలో నమీబియా తమ మ్యాచ్లు ఉదయం లేదంటే మధ్యాహ్నం ఆడనుంది. కేవలం టీమిండియాతో మ్యాచ్ను మాత్రమే రాత్రి షెడ్యూల్ చేశారు. అయితే, ఇంత వరకు తమకు ఫ్లడ్లైట్ల వెలుగులో ఆడిన అనుభవం లేదన్న ఎరాస్మస్.. కనీసం ప్రాక్టీస్కైనా అవకాశం లేకుండా పోయిందన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రెండు నైట్ సెషన్లు ఇచ్చారని వాపోయాడు. ఈ మేరకు.. ‘‘ఇండియాతో మ్యాచ్కు ముందు మాకు నైట్ సెషన్ కేటాయించలేదు. ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు. కానీ టీమిండియాకు మాత్రం రాత్రి పూట రెండు ప్రాక్టీస్ సెషన్లు ఇచ్చారనుకుంటా.నమీబియన్ల పోరాట పటిమ చూస్తారువాళ్లతో పాటు కెనడా కూడా నైట్ సెషన్లో ప్రాక్టీస్ చేసింది. నిజానికి కెనడా తదుపరి మ్యాచ్ మధ్యాహ్నం ఉంది. అయినా మేమేమీ వెనక్కి తగ్గము. నమీబియన్ల పోరాటం ఎలా ఉంటుందో చూపిస్తాము’’ అని గెర్హాడ్ ఎరాస్మస్ పేర్కొన్నాడు. అదే విధంగా..‘‘నమీబియాలో మాకు ఫ్లడ్లైట్లు ఉండవు. మా దగ్గర ఆ సదుపాయం లేదు. కాబట్టి ఈసారి కొత్తగా ఇక్కడ నైట్ ఆడటం సరికొత్త సవాలు. అయితే, మా వాళ్లలో కొంతమందికి విదేశీ లీగ్లలో ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం’’ అని ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.UPDATE: భారత్కు భారీ విజయం.. 93 పరుగులతో నమీబియా ఓటమిచదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ! -
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే అభిషేక్ శర్మ కడుపు నొప్పితో బాధపడుతుండగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ సైతం గాయపడ్డాడు. నమీబియాతో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కాలి బొటనవేలికి గాయమైనట్లు సమాచారం.పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్లో యార్కర్ను ఎదుర్కొనేందుకు ఇషాన్ సిద్ధపడగా.. బంతి బలంగా అతడి బొటనవేలికి తగింది. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే నెట్ సెషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు.గాయం గనుక తిరగబెడితేప్రస్తుతం అతడు బాగానే ఉన్నట్లు సమాచారం. అయితే, గాయం గనుక తిరగబెడితే ఇషాన్ మ్యాచ్కు అందుబాటులో ఉండటం కష్టమే. కాగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ గత మూడు రోజులుగా కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.అభిషేక్ డిశ్చార్జ్ అయినా..ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన అభిషేక్ బుధవారం డిశ్చార్జ్ అయినట్లు మరో బ్యాటర్ తిలక్ వర్మ వెల్లడించాడు. అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపాడు. అయితే, నమీబియాతో మ్యాచ్ ఆడతాడా? లేదా? అన్న అంశం మీద మాత్రం తిలక్ స్పష్టతనివ్వలేదు.ఇంతలో ఇషాన్ కిషన్కు కూడా స్వల్ప గాయం కావడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే, కాసేపటికే పరిస్థితి బాగుపడటంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే రాణా అవుట్కాగా యువ పేసర్ హర్షిత్ రాణా గాయం వల్ల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు.మరోవైపు.. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం వల్ల అమెరికాతో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే, ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించి నమీబియాతో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. ఇక తీవ్రమైన జ్వరం కారణంగా అమెరికాతో మ్యాచ్ ఆడలేకపోయిన బుమ్రా సైతం తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే.. అభిషేక్ శర్మ కోలుకోనట్లయితే ఇషాన్తో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్-‘ఎ’లో భాగంగా అమెరికాపై గెలిచిన టీమిండియా... తదుపరి గురువారం నమీబియాతో తలపడనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.చదవండి: IND vs NAM: మరో కూనతో పోరు -
IND vs PAK: సిగ్గులేని షోయబ్ మాలిక్!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘ఇంతకు మించి దిగజారవు అనుకున్న ప్రతిసారి.. నీ అసలైన నైజాన్ని బయటపెట్టుకుంటూ మరింత దిగజారుతూనే ఉంటావు.. కాస్తైనా సిగ్గుందా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అబద్ధాలు చెప్పే బదులు ‘అడుక్కుని తినవచ్చు కదా!’ అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ పాకిస్తాన్ ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ స్వయంగా ఇందుకు సంబంధించి ప్రకటన చేశాడు.ఎప్పటిలాగానే పాక్ యూటర్న్అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో ఎప్పటిలాగానే పాక్ మాట మార్చింది. భారత్తో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది. దీంతో తమకు యూటర్న్లు తీసుకోవడం మామూలేనని మరోసారి నిరూపించి నవ్వులపాలైంది. కానీ పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం కింద పడినా తమదే పైచేయి అన్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.బీసీసీఐ పదే పదే అడిగితేనే..ఇందులో భాగంగా మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తాను హోస్ట్గా ఉన్న ఓ న్యూస్ ఛానెల్లో ఓ ఫేక్ వీడియో ప్రదర్శించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడినట్లుగా ఓ వీడియో సృష్టించి.. అందులో ఆయన.. "బీసీసీఐ పదే పదే అభ్యర్థించడం వల్ల ఐసీసీ ప్రతినిధి పాకిస్తాన్ను టీమిండియాతో మ్యాచ్ ఆడేలా ఒప్పించారు.Pakistani sports show Har Lamha Purjosh hosted by Shoaib Malik, is circulating fake AI video of BCCI VICE PRESIDENT RAJEEV SHUKLA for selling chooran to the Pakistani audience pic.twitter.com/BMLmmD9sUe— Vishal (@Fanpointofviews) February 11, 2026స్పందించిన రాజీవ్ శుక్లాక్రికెట్ మనుగడకు ఇదే సరైన పరిష్కారం’’ అని అన్నట్లుగా AIతో మాయ చేశారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టగా.. రాజీవ్ శుక్లా స్వయంగా స్పందించారు. "పాకిస్తాన్తో ప్రపంచకప్ మ్యాచ్ గురించి నేను మాట్లాడినట్లుగా AIతో మాయ చేశారు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.తప్పుదారి పట్టించే ఈ వీడియోను నమ్మవద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వీడియోలు మీ ఫీడ్లోకి వస్తే రిపోర్టు కొట్టేయండి’’ అని రాజీవ్ శుక్లా స్పష్టతనిచ్చారు. కాగా భారత్- పాక్ మ్యాచ్కు మార్గం సుగమమైన వేళ.. "ఐసీసీ చైర్మన్ పర్యవేక్షణలో ఐసీసీ ప్రతినిధి సరైన విధంగా స్పందించి లాహోర్లో పాకిస్తాన్ బోర్డుతో చర్చలు జరిపారు.#WATCH | Delhi | On Pakistan to play against India at T20 cricket World Cup, BCCI Vice-President Rajeev Shukla says, "I am delighted to see the outcome of the deliberations initiated by ICC representative, supervised by the ICC Chairman and the representatives who had gone to… pic.twitter.com/3x9xSDyGMB— ANI (@ANI) February 10, 2026 ఎందుకిలా?బంగ్లాదేశ్ బోర్డుతోనూ మాట్లాడి మంచి పరిష్కారం కనుగొన్నారు. క్రికెట్ ప్రాధాన్యం, మనుగడకు ఇలాంటి నిర్ణయం సముచితమైనది’’ అని రాజీశ్ శుక్లా పేర్కొన్నారు. అయితే, షోయబ్ మాలిక్ మాత్రం తప్పుడు వీడియోను ప్రదర్శిస్తూ బీసీసీఐ అడుక్కునందు వల్లే పాక్ వారితో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకొందనే అర్థం వచ్చేలా దిగజారుడు వైఖరి ప్రదర్శించాడు. కాగా కొలంబో వేదికగా భారత్- పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న జరుగనుంది.కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా షోయబ్ మాలిక్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సానియాతో ఉంటూనే నటి, వివాహిత సనా జావెద్తో మాలిక్ "బంధం’’ కొనసాగించాడు. ఈ క్రమంలో సానియా అతడికి విడాకులు ఇవ్వగా.. సనా సైతం భర్తకు విడాకులు ఇచ్చి మాలిక్ను పెళ్లి చేసుకుంది.చదవండి: ENG vs WI: నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్ -
IPL కంటే ముందే ఆ టీ20 లీగ్లో వైభవ్ సూర్యవంశీ!
ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 ఫైనల్లో సత్తా చాటి మరోసారి ప్రశంసలు అందుకుంటున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లండ్తో టైటిల్ పోరులో ఈ పద్నాలుగేళ్ల బాలుడు కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ ఆరోసారి ప్రపంచకప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఈ నేపథ్యంలో ఈ భారత యువ క్రికెట్ తరంగాన్ని ఏకంగా దిగ్గజ గ్యారీ సోబర్స్తో పోల్చాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్. ఇక ఈ మెగా టోర్నీ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో వైభవ్ సూర్యవంశీ బిజీ కానున్నాడు. అయితే, అంతకంటే ముందే మరో దేశీ టీ20 లీగ్లో అతడు భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.IPL కంటే ముందే ఆ టీ20 లీగ్లోక్రిక్బజ్ కథనం ప్రకారం.. దేశీ కార్పొరేట్ టీ20 ఈవెంట్ డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో వైభవ్ పాల్గొననున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులతో చర్చలు తుదిదశకు చేరినట్లు సమాచారం. కాగా ఈ కాంపిటిషన్ ఫిబ్రవరి 23న మొదలుకానుంది.హార్దిక్ పాండ్యా సైతందేశీ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో ఆడతారు. ఐపీఎల్ కంటే ముందే పొట్టి క్రికెట్ వైబ్ ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా క్యాష్ రిచ్ లీగ్ కంటే ముందు ఈ టోర్నీలో ఆడటం యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. నవీ ముంబై వేదికగా జరిగే గతేడాది ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు ఆడారు. శివం దూబే, నేహాల్ వధేరా, దీపక్ చహర్ తదితరులు కూడా భాగమయ్యారు.పైసా వసూల్ ప్రదర్శనకాగా దేశీ క్రికెట్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ దృష్టిని ఆకర్షించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ చిచ్చరపిడుగు కోసం రాయల్స్ ఏకంగా 1.10 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అందుకు తగినట్లుగానే ఈ బిహారీ పిల్లాడు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. సంజూ శాంసన్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్కు జోడీగా ఓపెనర్గా వచ్చి.. తానేంటో నిరూపించుకున్నాడు.గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేయడంతో వైభవ్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో అదరగొట్టి యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో ధనాధన్ శతకాలతో ఆకట్టుకున్నాడు వైభవ్. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 సన్నాహకాల్లో భాగంగా ఫిబ్రవరి 21 వరకు ట్రెయినింగ్ సెషన్లో వైభవ్ పాల్గొనున్నాడు. చదవండి: ENG vs WI: నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్ -
T20 WC 2026: మళ్లీ మాట మార్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మరోసారి మాట మార్చింది. పదే పదే యూటర్న్లు తీసుకుంటూ నవ్వులపాలు అవుతోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకొన్న విషయం తెలిసిందే.భారత్లో తమకు భద్రత ఉండదని.. తమ వేదికను మరో ఆతిథ్య దేశం శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది బంగ్లాదేశ్. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బంగ్లా వాదనను కొట్టిపడేస్తూ పునరాలోచన చేయాలని గడువు ఇచ్చింది. అయినప్పటికీ తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం టోర్నీ నుంచి వైదొలగడానికైనా సిద్ధమే కానీ.. భారత్లో ఆడమని భీష్మించుకుని కూర్చుంది.బంగ్లాదేశ్ను తప్పించిఫలితంగా బంగ్లాదేశ్ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి అనుమతించింది ఐసీసీ. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకుని బంగ్లాకు మద్దతుగా నిలిచింది. తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామని నాటకాలు ఆడింది. అయితే, ఐసీసీ రంగంలోకి దిగగా.. పాక్ భారత్తో మ్యాచ్కు అంగీకరించింది.ఆటగాళ్ల నిర్ణయమే ఇదిఅదే విధంగా.. బంగ్లాదేశ్పై ఎలాంటి పెనాల్టీలు విధించబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం బంగ్లా క్రికెట్ బోర్డు, క్రికెటర్లు కలిసి టోర్నీని బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.ఇందులో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నాడు. గతంలో ఇదే వ్యక్తి ప్రభుత్వం ఆదేశించినట్లుగానే టోర్నీ నుంచి తప్పుకొంటున్నామని తెలిపాడు. ఆ తర్వాత ఈమేరకు నాలుక మడతేశాడు. దీంతో ఆసిఫ్ నజ్రుల్, బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.మరోసారి మాట మార్చేశాడుఈ క్రమంలో నష్టనివారణ చర్యలకు దిగిన ఆసిఫ్ నజ్రుల్ మరోసారి మాట మార్చాడు. ‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆడకూడదన్నది మా ప్రభుత్వ నిర్ణయమే. మరోసారి ఈ విషయాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించాడు.మీడియాతో మాట్లాడటానికి తాను పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడంతో బీసీబీ, క్రికెటర్ల నిర్ణయమేనని అనుకోకుండా చెప్పేశానని పేర్కొన్నాడు. తన మాటల్ని అందరూ అపార్థం చేసుకున్నారని నజ్రుల్ కవర్ చేశాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆటగాళ్లు శిరసా వహించారని.. ఈ విషయంలో వారికి క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే అలా మాట్లాడానని చెప్పుకొచ్చాడు.పరువు పాయేదీంతో నెటిజన్లు బంగ్లాదేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ను నిందించాలనే తొందరలో మీ ఆటగాళ్లను కూడా బలి చేసేందుకు సిద్ధపడి.. పరువు తీసుకుంటున్నారని చురకలు అంటిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొదలైంది.చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్ -
నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఇంగ్లండ్ తడబడుతోంది. గ్రూప్-‘సి’లో భాగంగా తొలుత నేపాల్తో తలపడ్డ హ్యారీ బ్రూక్ బృందం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తాజాగా బుధవారం నాటి మ్యాచ్లో మాత్రం వెస్టిండీస్ ముందు తలవంచింది.వెస్టిండీస్దే పైచేయిటీ20 ప్రపంచకప్ను రెండేసి సార్లు గెలుచుకున్న ఈ మాజీ చాంపియన్ల మధ్య ముంబైలో జరిగిన పోరులో వెస్టిండీస్దే పైచేయి అయింది. వాంఖెడే మైదానంలో విండీస్ స్పిన్ను ఎదుర్కోలేక ఇంగ్లండ్ విలవిల్లాడింది. ఫలితంగా విండీస్ చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.నిరాశకు గురయ్యాంఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తమ పరాజయంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘నిరాశకు గురయ్యాం. ఓటమి ఎల్లప్పుడూ బాధిస్తుంది. అయితే, ఈరోజు వెస్టిండీస్ అత్యద్భుతంగా ఆడింది. ఆ జట్టులో పవర్ హిట్టర్లు ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు.ప్రత్యర్థి బౌలర్ కాస్త తడబడినా వారు ఆ డెలివరీని సిక్సర్గా మలుస్తారు. అయితే, ఈరోజు వాళ్లు చేసిన స్కోరు ఛేదించదగ్గదే. మేము ఆశించినంతగా మంచు ప్రభావం లేదు. మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది.సాల్ట్ విధ్వంసకర ప్లేయర్మా ప్రణాళికలను సరిగ్గా అమలుచేయలేకపోయాము. టాపార్డర్ విషయంలో నేనేమీ మాట్లాడలేను. టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. సాల్ట్ విధ్వంసకర ప్లేయర్. ఇక జోస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నేపాల్ మీదైనా గెలిచాంఇప్పటికీ టోర్నీలో ముందుకు వెళ్లగలమనే నమ్మకం ఉంది. గత మ్యాచ్లో నేపాల్ మీదైనా గెలిచినందుకు దేవుడికి ధన్యవాదాలు. లేదంటే మేము కష్టాల్లో కూరుకుపోయేవాళ్లం. తదుపరి స్కాట్లాండ్, ఇటలీలపై సత్తా చాటి ముందుకు సాగుతాము’’ అని బ్రూక్ చెప్పుకొచ్చాడు.196 పరుగుల భారీ స్కోరుకాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షెర్ఫాన్ రూథర్ఫర్డ్ (42 బంతుల్లో 76 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. రోస్టన్ ఛేజ్ (29 బంతుల్లో 34; 6 ఫోర్లు), హోల్డర్ (17 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.స్పిన్నర్ల మాయాజాలం ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, జేమీ ఒవర్టన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ బెతెల్ (23 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించగా... జోస్ బట్లర్ (21), కెప్టెన్ హారీ బ్రూక్ (17) ప్రభావం చూపలేకపోయారు.చివర్లో స్యామ్ కరన్ (30 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడినా ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు. విండీస్ స్పిన్నర్లు గుడకేశ్ మోతీ 3, రోస్టన్ ఛేజ్ 2, అకీల్ హొసీన్ ఒక వికెట్తో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. చదవండి: SA vs AFG: ‘డబుల్ సూపర్’ ధమాకా -
IND vs NAM: మరో కూనతో పోరు
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా రెండో మ్యాచ్కు సిద్ధమైంది. తొలి పోరులో అమెరికాపై విజయం సాధించిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు గురువారం నమీబియాతో తలపడనుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తదుపరి మ్యాచ్లో దాయాది పాకిస్తాన్ తో ఆడనున్న టీమిండియా దానికి ముందు నమీబియాతో మ్యాచ్ను ప్రాక్టీస్గా వాడుకోవాలని భావిస్తోంది. బలాబలాలు, అనుభవం దృష్ట్యా ఇరుజట్లలో చాలా అంతరం ఉంది. తొలి మ్యాచ్లో అమెరికాపై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన టీమిండియా... నమీబియాపై కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. అస్వస్థత కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్లో బరిలోకి దిగలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పితో రెండు రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నాడు. బుధవారం డిశ్చార్జి అయి జట్టుతో కలిశాడు. అయితే నేటి పోరులో అతను ఆడే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ అభిషేక్ దూరమైతే సంజూ సామ్సన్కు అవకాశం లభించవచ్చు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి కోలుకోగా... ప్రాక్టీస్ సందర్భంగా ఇషాన్ కిషన్ కాలికి గాయమైంది. ఇక తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన నమీబియా... ‘పోరాడితే పోయేదేమీ లేదు’ అన్న చందంగా రాణించాలని చూస్తోంది. ఢిల్లీ పిచ్ అటు బౌలింగ్కు, ఇటు బ్యాటింగ్కు సమానంగా సహకరించనుంది. మైదానం చిన్నది కావడంతో కుదురుకుంటే భారీ స్కోర్లు ఖాయమే! అభిషేక్పైనే అందరి దృష్టి గత రెండేళ్లుగా భారత జట్టు టి20 ఫార్మాట్లో నిలకడగా విజయాలు సాధించడంలో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కృషి ఎంతో ఉంది. ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి చూస్తుండగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల ఈ ‘బిగ్ హిట్టర్’ వరల్డ్కప్ తొలి మ్యాచ్లో ‘డకౌట్’ అయ్యాడు. ‘పవర్ ప్లే’ లోపే మ్యాచ్ను లాగేసుకునే సత్తా గల అభిషేక్... రెండో మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే రూపంలో బ్యాటర్లకు కొదవలేదు. గత మ్యాచ్లో సూర్య కెప్టెన్ ఇన్నింగ్స్ కారణంగా భారత జట్టు మంచి స్కోరు చేయగలిగింది. వరల్డ్కప్నకు ఒక్క రోజు ముందు పేస్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తొలి మ్యాచ్లో మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అమెరికాతో పోరులో ఆడని బుమ్రా తుది జట్టులోకి వస్తే ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. వాషింగ్టన్ సుందర్ కోలుకున్నా... ఇప్పడు అతడిని తుది జట్టులోకి ఎంపిక చేయడం కష్టమే. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ భారం మోయనున్నారు. పోటీనిచ్చేనా! అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా అనుభవం లేని నమీబియా... టీమిండియాపై సంచలన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. 2021 ప్రపంచకప్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఏకైక మ్యాచ్ జరగ్గా... టీమిండియా అలవోక విజయం సాధించింది. అదే జోరు కొనసాగిస్తూ ఈ మ్యాచ్తో ప్లేయర్లంతా ఫామ్లోకి రావాలని భారత మేనేజ్మెంట్ భావిస్తోంది. నెదర్లాండ్స్తో పోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నమీబియాపై అంచనాలు లేకపోయినా... ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అని టీమిండియా యోచిస్తోంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నమీబియాపై ఫుల్ ప్రాక్టీస్ చేయాలని మనవాళ్లు చూస్తున్నారు. వరల్డ్కప్నకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత ‘ఎ’ జట్టు చేతిలోనూ నమీబియా పరాజయం పాలైంది. అలాంటిది బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ బౌలింగ్ను ఎదుర్కొని నమీబియా బ్యాటర్లు నిలవగలరా చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్/సామ్సన్, ఇషాన్, తిలక్, హార్దిక్, రింకూ, శివమ్ దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా/సిరాజ్, వరుణ్. నమీబియా: ఎరాస్మస్ (కెప్టెన్ ), స్టీన్ కాంప్, ఫ్రైలింక్, జాన్ నికోల్, జేజే స్మిత్, జెన్ గ్రీన్, లైచెర్, విలియమ్ మైబుర్గ్, రూబెన్, బెర్నార్డ్ స్కాట్జ్, బెన్ షికొంగో.టి20 ప్రపంచకప్లో నేడుశ్రీలంక X ఒమన్వేదిక: పల్లెకెలె; ఉ.గం. 11 నుంచి నేపాల్ X ఇటలీవేదిక: ముంబై; మ.గం. 3 నుంచిభారత్ X నమీబియావేదిక: న్యూఢిల్లీ; రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
సహజ, రష్మిక ఓటమి
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. భారత నంబర్వన్ సహజ యామలపల్లి, రెండో ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో తెలంగాణ అమ్మాయి సహజ 3–6, 2–6తో టాప్ సీడ్ లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్) చేతిలో, హైదరాబాద్ ప్లేయర్ రష్మిక 2–6, 1–6తో మనన్చాయ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయారు. డబుల్స్ విభాగం తొలి రౌండ్లో రష్మిక–అంకిత రైనా (భారత్) ద్వయం 6–1, 6–4తో జీల్ దేశాయ్–మాయా రాజేశ్వరన్ (భారత్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరింది. -
ముకేశ్కు స్వర్ణం, కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ ముకేశ్ నేలవల్లి రెండు పతకాలతో మెరిశాడు. బుధవారం జరిగిన జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ముకేశ్ కాంస్య పతకం సాధించాడు. ఏడుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ముకేశ్ 19 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్కే చెందిన సూరజ్ శర్మ 23 పాయింట్లతో రజతం నెగ్గగా... ఇండోనేసియా షూటర్ ఫవాజ్ 29 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఇదే ఈవెంట్ టీమ్ విభాగంలో ముకేశ్, సూరజ్, సాహిల్లతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ముకేశ్ బృందం 1729 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సీనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం సాధించాడు. అనీశ్ 23 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో అనీశ్, ఆదర్శ్ సింగ్, నీరజ్ కుమార్లతో కూడిన భారత బృందం 1708 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ టోరీ్నలో భారత షూటర్లు 35 స్వర్ణాలు, 15 రజతాలు, 14 కాంస్యాలతో కలిపి 64 పతకాలు గెలిచారు. -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
చెన్నై: భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని... చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో సాకేత్–సిద్ధాంత్ (భారత్) ద్వయం 2–6, 6–1, 10–2తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎరిక్ వాన్షెల్బోయిమ్ (ఉక్రెయిన్)–డెనిస్ యెవ్సెయెవ్ (కజకిస్తాన్) జంటను ఓడించింది. మరో మ్యాచ్లో గంటా సాయికార్తీక్ రెడ్డి–దిగ్విజయ్ సింగ్ (భారత్) జోడీ 4–6, 2–6తో నిక్కీ పునాచా (భారత్)–ప్రుచాయో ఇసారో (థాయ్లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. -
బెల్జియం చేతిలో భారత్ పరాజయం
రూర్కెలా: ప్రొ హాకీ లీగ్ కొత్త సీజన్ను భారత పురుషుల హాకీ జట్టు ఓటమితో ప్రారంభించింది. ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 1–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టును బెల్జియం జట్టు కట్టడి చేసింది. కేవలం రెండు పెనాల్టీ కార్నర్లు పొందిన భారత జట్టు అందులో ఒకదానిని సది్వనియోగం చేసుకుంది. ఆట 29వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను శిలానంద్ లాక్రా గోల్గా మలిచాడు. బెల్జియం తరఫున నెల్సన్ ఒనానా (23వ నిమిషంలో), థామస్ క్రాల్స్ (53వ నిమిషంలో), అర్నో వాన్ డెసెల్ (57వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. తమకు లభించిన ఏడు పెనాల్టీ కార్నర్లను బెల్జియం వృథా చేసుకోవడం గమనార్హం. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో అర్జెంటీనాతో భారత్ ఆడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో తాజా గెలుపుతో బెల్జియం 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. -
‘డబుల్ సూపర్’ ధమాకా
ప్రపంచకప్లో డజను మ్యాచ్లు ముగిసినా అభిమానులకు ఇంకా ఏదో వెలితి... కొన్ని చక్కటి ఇన్నింగ్స్లు, మరికొన్ని మంచి బౌలింగ్ ప్రదర్శనలు వచ్చినా అసలైన టి20 మజా మాత్రం ఇంకా కనిపించలేదు... ఇలాంటి సమయంలో బుధవారం జరిగిన పోరు ఫుల్ మీల్స్ను అందించింది... దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ కలిసి ఉత్కంఠతో నిండిన అద్భుత మ్యాచ్ను చూపించాయి... 20 ఓవర్ల సమరంలో ఇరు జట్లూ 187 పరుగులతో సమఉజ్జీలుగా నిలవగా, సూపర్ ఓవర్ తప్పలేదు. అక్కడా ఎవరూ తగ్గకుండా సమం–సమం అనడంతో మరో సూపర్ ఓవర్ ముందుకు వచ్చింది. ఈసారి మాత్రం ఆధిపత్యం ప్రదర్శించిన సఫారీ టీమ్ ఎట్టకేలకు గట్టెక్కింది. ప్రధాన పోరుతో పాటు రెండు సూపర్ ఓవర్లతో సాగిన డ్రామా టోర్నీకే హైలైట్గా నిలిచింది. దక్షిణాఫ్రికా ప్రదర్శనకంటే కీలక సమయాల్లో వరుస తప్పులు చేసిన అఫ్గానిస్తాన్ స్వయంకృతమే ఫలితాన్ని నిర్దేశించింది. అఫ్గాన్ బెస్ట్ బౌలర్ రషీద్ ఖాన్ రెండు సూపర్ ఓవర్లలో ఒక్కటి కూడా బౌలింగ్ చేయకపోగా... రెండో సూపర్ ఓవర్లో ఫామ్లో ఉన్న గుర్బాజ్ను కాకుండా నబీకి స్ట్రయిక్ అవకాశం ఇవ్వడం కూడా జట్టును ఓడించాయి. అహ్మదాబాద్: టి20 ప్రపంచకప్లో డజను మ్యాచ్ల తర్వాత అద్భుతమైన వినోదాన్ని చూసే అవకాశం అభిమానులకు దక్కింది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా ‘డబుల్ సూపర్ ఓవర్’లో అఫ్గానిస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రికెల్టన్ (28 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్లు), డికాక్ (41 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్కు 61 బంతుల్లో 114 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులకే ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (42 బంతుల్లో 84; 4 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎన్గిడి (3/26) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. స్కోర్లు సమం కావడంతో నిర్వహించిన తొలి ‘సూపర్ ఓవర్’లో ఇరు జట్లు సరిగ్గా 17 పరుగులే చేశాయి. దాంతో రెండో ‘సూపర్ ఓవర్’ను ఆడించాల్సి వచ్చింది. ఇందులో దక్షిణాఫ్రికా 23 పరుగులు చేయగా, 19 పరుగులు చేసిన అఫ్గానిస్తాన్ 4 పరుగులతో ఓడింది. దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం అందుకొని గ్రూప్ ‘డి’ నుంచి ‘సూపర్ ఎయిట్స్’కు చేరువ కాగా... వరుసగా రెండో ఓటమితో అఫ్గానిస్తాన్ ముందంజ వేసే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. చివరి ఓవర్ డ్రామా సాగిందిలా... ఆఖరి ఓవర్లో అఫ్గానిస్తాన్కు 13 పరుగులు అవసరం కాగా, ఒకటే వికెట్ ఉంది. తొలి బంతికి నూర్ను రబడ బౌల్డ్ చేసినా అది నోబాల్ అయింది. తర్వాతి బంతి వైడ్ కాగా, ఆ తర్వాత వేసిన బంతికి నూర్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను యాన్సెన్ వదిలేశాడు. ఆ వెంటనే నూర్ సిక్స్ బాదడంతో తొలి రెండు బంతుల్లోనే 8 పరుగులు వచ్చినట్లయింది. ఇక చేయాల్సింది 4 బంతుల్లో 5 పరుగులే. తర్వాతి బంతికి షాట్ ఆడి నూర్ సగం దూరం వచ్చినా... ఫరూఖీ వెనక్కి పంపడంతో పరుగు రాలేదు.ఓవర్ నాలుగో బంతి మళ్లీ నోబాల్ కావడంతో పాటు 2 పరుగులు తీయడంతో సమీకరణం మరింత సులువుగా మారింది. 2 బంతుల్లో 3 పరుగులు కావాలి, పైగా ఫ్రీ హిట్...బహుశా బ్యాటర్లకు ఇదే సూచన ఇచ్చేందుకు ‘వాటర్ బాయ్స్’ను పంపించగా, అంపైర్లు అనుమతించలేదు! నూర్ లాంగాఫ్ దిశగా కొట్టిన షాట్కు తొలి పరుగు సులువుగా రాగా, రెండో పరుగు తీసే ప్రయత్నంలో ఫారుఖీ నెమ్మదించడంతో రనౌటయ్యాడు. దాంతో స్కోర్లు సమమయ్యాయి. ఫీల్డర్ వైపు చూడకుండా వేగంగా పరుగెత్తి బ్యాట్తో డైవ్ చేసే ప్రయత్నం చేస్తే ఫారుఖీ పరుగు సునాయాసంగా పూర్తయ్యేది. అంతకుముందు మూడో బంతికి సింగిల్ నిరాకరించిన ఫారుఖీ అసలు సమయంలో సరిగా పరుగెత్తక తన జట్టుకు గెలుపును దూరం చేశాడు. దీని తర్వాత మరో రెండు బంతులు కూడా ఉన్నాయి కాబట్టి అఫ్గానిస్తాన్ ఈ రిస్క్ చేయకుండా ఉండాల్సింది.మొదటి సూపర్ ఓవర్: ఎన్గిడి బౌలింగ్లో అజ్మతుల్లా 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. అనంతరం ఫారుఖీ బౌలింగ్లో 5 బంతుల్లో 11 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా తప్పనిసరిగా సిక్స్ కొట్టాల్సిన స్థితిలో నిలిచింది. లో ఫుల్టాస్ను లాంగాఫ్ మీదుగా స్టబ్స్ సిక్స్ బాదడంతో దక్షిణాఫ్రికా కూడా 17 పరుగులే చేయగలిగింది. రెండో సూపర్ ఓవర్: అజ్మతుల్లా బౌలింగ్లో స్టబ్స్ వరుసగా 6, 1 రాబట్టగా, మిల్లర్ వరుసగా 2, 6, 6, 2 బాదడంతో 23 పరుగులు లభించాయి. ఆ తర్వాత కేశవ్ మహరాజ్ ఓవర్లో అఫ్గానిస్తాన్ తొలి 2 బంతుల్లో పరుగులేమీ చేయకుండా వికెట్ కోల్పోయింది. అయితే గుర్బాజ్ చెలరేగి వరుసగా 6, 6, 6 కొట్టడంతో పాటు తర్వాతి బంతి వైడ్గా పడింది. ఈసారి కూడా సిక్స్ కొడితే అఫ్గాన్ గెలిచే అవకాశాలు ఉండగా, చివరి బంతికి గుర్బాజ్ క్యాచ్ ఇచ్చాడు. 38 ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20ల్లో ‘సూపర్ ఓవర్’ ద్వారా ఫలితాలు వచ్చిన మ్యాచ్లు.2 అంతర్జాతీయ టి20ల్లో ‘డబుల్ సూపర్ ఓవర్’ ద్వారా ఫలితం తేలిన మ్యాచ్లు. ఈ రెండింటిలోనూ అఫ్గానిస్తాన్ ప్రత్యర్థిగా ఉండటం గమనార్హం. 2024లో అఫ్గానిస్తాన్పై భారత్ ‘డబుల్ సూపర్’లో గెలిచింది. 2025లో నేపాల్పై నెదర్లాండ్స్ ‘ట్రిపుల్ సూపర్ ఓవర్’లో నెగ్గింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) నబీ (బి) ఫారుఖీ 5; డికాక్ (సి) జద్రాన్ (బి) రషీద్ 59; రికెల్టన్ (ఎల్బీ) (బి) రషీద్ 61; బ్రెవిస్ (సి) నబీ (బి) ఒమర్జాయ్ 23; మిల్లర్ (నాటౌట్) 20; స్టబ్స్ (సి) ముజీబ్ (బి) ఒమర్జాయ్ 1; యాన్సెన్ (సి) అటల్ (బి) ఒమర్జాయ్ 16; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–12, 2–126, 3–127, 4–155, 5–159, 6–187. బౌలింగ్: ఫరూఖీ 4–0–32–1, ముజీబ్ 3–0–30–0, ఒమర్జాయ్ 4–0–41–3, నబీ 2–0–20–0, రషీద్ 4–0–28–2, నూర్ 3–0–35–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) లిండే (బి) మహరాజ్ 84; జద్రాన్ (బి) ఎన్గిడి 12; నైబ్ (సి అండ్ బి) ఎన్గిడి 0; అటల్ (సి) యాన్సెన్ (బి) రబడ 0; రసూలీ (రనౌట్) 15; ఒమర్జాన్ (సి) స్టబ్స్ (బి) ఎన్గిడి 22; నబీ (సి) మార్క్రమ్ (బి) లిండే 5; రషీద్ (సి) మిల్లర్ (బి) యాన్సెన్ 20; ముజీబ్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 15; ఫారుఖీ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 187. వికెట్ల పతనం: 1–51, 2–51, 3–52, 4–121, 5–121, 6–139, 7–164, 8–169, 9–175, 10–187. బౌలింగ్: ఎన్గిడి 4–0–26–3, యాన్సెన్ 4–0–42–1, రబడ 3.4–0–38–1, లిండే 3–0–39–1, మహరాజ్ 4–0–27–1, మార్క్రమ్ 1–0–14–0. -
టీ20 ప్రపంచకప్: ఇంగ్లాండ్కి షాకిచ్చిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు.. బుధవారం రాత్రి వాంఖడే వేదికగా తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో విండీస్ జట్టు విజయం సాధించింది. 30 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ని మట్టికరిపించింది. 76 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన రూథర్ఫర్డ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రూథర్ఫర్డ్ 76 పరుగులు చేయగా.. ఛేజ్ 34, హోల్టర్ 33 తలో చేయి వేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్, రషీద్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభమే దక్కినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. వరస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 19 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. సామ్ కరన్ 43 పరుగులతో కాస్త పోరాడినప్పటికీ ఇతడికి సహకారం అందించే బ్యాటర్లు కరువయ్యారు. ఫలితంగా ఈ టోర్నీలో విండీస్ రెండో విజయం నమోదు చేసింది. -
రూథర్ఫోర్డ్ వీరంగం.. హోల్డర్ మెరుపులు.. విండీస్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) రాత్రి 7 గంటలకు మొదలైన మ్యాచ్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.8 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (1), షాయ్ హోప్ (0) వికెట్లు కోల్పోయిన విండీస్ను షిమ్రోన్ హెట్మైర్ (23), రోస్టన్ ఛేజ్ (34) ఆదుకున్నారు. వీరిద్దరు ఔటయ్యాక రూథర్ఫోర్డ్ (76 నాటౌట్), హోల్డర్ (33) చెలరేగి ఆడి విండీస్కు భారీ స్కోర్ అందించారు. వీరిద్దరు చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించారు. పోటీపడి సిక్సర్లు బాది స్కోర్ను 200 దరికి చేర్చారు. రూథర్ఫోర్డ్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాదగా.. హోల్డర్ 17 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లు కొట్టాడు. మిగతా విండీస్ బ్యాటర్లలో రోవ్మన్ పావెల్ 14, రొమారియో షెపర్డ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (4-0-16-2) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ బ్యాటర్లను కట్టడి చేయగా.. జేమీ ఓవర్టన్ (4-0-33-2) పర్వాలేదనిపించాడు. జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసినా (4-0-48-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్లో సత్తా చాటిన సామ్ కర్రన్ (3-0-36-1) ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. జాక్స్ 2 ఓవర్లలో 32, డాసన్ 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను ఇంగ్లండ్ మెరుపు వేగంతో ప్రారంభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి, మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (15) ఆచితూచి ఆడుతుండగా.. జేకబ్ బేతెల్ (20) వేగంగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ వికెట్ నష్టానికి 67 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 84 బంతుల్లో 130 పరుగులు చేయాలి. -
టీమిండియాకు గుడ్ న్యూస్
రేపు (ఫిబ్రవరి 12) నమీబియాతో జరుగబోయే టీ20 ప్రపంచకప్ మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందుతుంది. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ, గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ శర్మ డిశ్చార్జ్ అయ్యాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని అభిషేక్ సహ టీమిండియా సభ్యుడు తిలక్ వర్మ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడించాడు. అయితే అభిషేక్ రేపటి మ్యాచ్ ఆడతాడా లేదా అన్నదానిపై మాత్రం తిలక్ క్లారిటీ ఇవ్వలేదు.అభిషేక్ జట్టుకు అందుబాటులోకి రావడంతో టీమిండియాకు మరో సమస్య వచ్చి పడింది. అభిషేక్ నమీబియా మ్యాచ్కు అందుబాటులోకి రాలేడేమోనని, జట్టు మేనేజ్మెంట్ సంజూ శాంసన్ను రేపటి మ్యాచ్కు సిద్దం చేసింది. సంజూ.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్తో కలిసి ఇవాళ కూడా నెట్స్లో చాలాసేపు శ్రమించాడు. మ్యాచ్ సమయానికి అభిషేక్ ఫిట్ అయితే, ఆఖరి నిమిషంలో అయినా సంజూకు హ్యాండ్ తప్పకపోవచ్చు.ఒకవేళ కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్ (ఫిబ్రవరి 15) వరకు అభిషేక్కు రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం, నమీబియాతో మ్యాచ్లో ఇషాన్, సంజూ భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. సంజూ నమీబియా మ్యాచ్లో రాణిస్తే.. పాక్తో మ్యాచ్కు ముందు అభిషేక్తో పోటీపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఇటీవలికాలంలో భీకర ఫామ్లో ఉన్న అభిషేక్ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో యూఎస్ఏపై గోల్డెన్ డకౌటయ్యాడు. ఆ మ్యాచ్ సందర్భంగానే అతను తొలుత అస్వస్థతకు గురయ్యాడు. ఆతర్వాత టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్లో (ఢిల్లీ) డిన్నర్కు వెళ్లినప్పుడు పరిస్థితి క్షీణించి, ఆసుపత్రిలో చేరాడు. ఈ ప్రపంచకప్లో అభిషేక్పై భారీ అంచనాలు ఉన్నాయి. అతను తన సహజ శైలిలో అందించే మెరుపు ఆరంభాలు మ్యాచ్ గతినే మార్చేస్తాయి. అభిషేక్ ప్రతి మ్యాచ్లో 30, 40 పరుగులు చేసినా టీమిండియా భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంటుంది. భారత బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది కాబట్టి, ఆ స్కోర్లను విజయంవంతంగా కాపాడుకోవచ్చు. అభిషేక్తో పాటు టీమిండియా సభ్యులంతా తలో మ్యాచ్లో సత్తా చాటినా భారత్ మరోసారి ప్రపంచకప్ ఎగరేసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
T20 WC 2026: పసికూనపై ఆస్ట్రేలియా ప్రతాపం
టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఘనంగా బోణీ కొట్టింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో పసికూన ఐర్లాండ్పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. 45 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. జోష్ ఇంగ్లిస్, మ్యాట్ రెన్షా తలో 37 పరుగులు.. కూపర్ కన్నోలీ, జేవియర్ బార్ట్లెట్ చెరో అజేయమైన 11 పరుగులు.. తాత్కాలిక కెప్టెన్ ట్రవిస్ హెడ్ , గ్లెన్ మ్యాక్స్వెల్ 9 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్, జార్జ్ డాక్రెల్, హ్యారీ టెక్టార్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఆదిలోనే చేతులెత్తేసింది. ఆడమ్ జంపా (4-0-23-4), నాథన్ ఎల్లిస్ (3.5-1-12-4) ధాటికి 16.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. మిగతా ఆసీస్ బౌలర్లలో కుహ్నేమన్ (4-0-29-1) కూడా రాణించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన జార్జ్ డాక్రెల్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు. డాక్రెల్ ఈ స్కోర్ చేయకపోయుంటే ఐర్లాండ్ 100 పరుగుల మార్కును కూడా దాటలేకపోయేది. మిగతా ఐరిష్ బ్యాటర్లలో లోర్కన్ టక్కర్ (24), రాస్ అదైర్ (12), గెరాత్ డెలానీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. -
బంగ్లాదేశ్ కెప్టెన్కు పాకిస్తాన్లో ఘోర అవమానం
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లాదేశ్కు వంత పాడిన పాకిస్తాన్, తదనంతరం పరిణామాల్లో ఆ దేశాన్ని ఏకాకిని చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రారంభం నుంచి బంగ్లాదేశ్ కోసం ఏదో చేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇచ్చిన పాక్, ఐసీసీతో చర్చల తర్వాత స్వలాభం చూసుకొని భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ఈ మొత్తం ఎపిసోడ్ను క్షుణ్ణంగా గమనిస్తే పాక్ బంగ్లాదేశ్ను ఫూల్ చేసిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాక్ ఐసీసీ అంక్షలకు భయపడి భారత్తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించగా.. బంగ్లాదేశ్ మాత్రం ప్రపంచకప్ నుంచి వైదొలిగి, ఏకాకిలా మిగిలిపోయింది.ఈ ఎడిసోడ్ నడుస్తుండగానే బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాక్లో జరిగే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. మొత్తం 50 మంది బంగ్లాదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ 2026 వేలంలో పాల్గొన్నారు. మూడు బేస్ ప్రైజ్ల విభాగాల్లో బంగ్లా ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు. బంగ్లాదేశ్ విషయంలో లేని ప్రేమను ఒలకబోసిన పాక్.. పీఎస్ఎల్ వేలంలో ఆ దేశ ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 50 మంది వేలం బరిలో నిలిస్తే.. కేవలం ఒకరిద్దరిని మాత్రం పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి. అమ్ముడుపోయిన వారికి కూడా పెద్ద మొత్తంలో ధర దక్కలేదు. ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ వేలంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ను కూడా పట్టించుకునే నాథుడే లేడు. వీరితో పాటు చాలామంది బంగ్లా స్టార్ ఆటగాళ్లవైపు పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు.బంగ్లాతో స్నేహం ఒలకబోసి, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ను కనీసం బేస్ ధరకు (48 లక్షల టాకాలు) కూడా కొనుగోలు చేయకపోవడం ఎంత ఘోర అవమానమో బంగ్లా ఆటగాళ్లకు అర్దం కావాలి. ఇకనైనా బంగ్లాదేశ్ పాక్ కపట నాటకాలకు పావుగా మారకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి. లిట్టన్ దాస్కు గతంలో పీఎస్ఎల్లో ఆడిన అనుభవం ఉన్నా, ఫ్రాంచైజీలు చిన్నచూపు చూశాయి. ఈ వేలంలో కొద్దోగొప్పో లబ్ది పొందింది రిషద్ హొసేన్. ఈ బంగ్లా ఆల్రౌండర్ను రావల్పిండి బేస్ ఫ్రాంచైజీ 3 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది. అలాగే ఐపీఎల్ నుంచి గెంటివేయబడ్డ ముస్తాఫిజుర్ రహ్మాన్ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ వేలానికి ముందే డైరెక్ట్ సైనింగ్ ద్వారా స్వల్ప మొత్తానికి దక్కించుకుంది. మొత్తంగా చూస్తే పీఎస్ఎల్ వేలంలో బంగ్లా ఆటగాళ్లను పట్టించుకునే నాథుడే లేడన్న విషయం స్పష్టమైంది. -
చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 'డబుల్ సూపర్ ఓవర్' సమరాలు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 11) ఓ చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఓ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్లో గెలుపు కోసం సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కొదమ సింహాల్లా పోరాడాయి. రెగ్యులర్ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా గెలుపు కోసం ఇరు జట్లు చివరి బంతి వరకు వేచి చూశాయి. అంతిమంగా సౌతాఫ్రికా చివరి బంతికి (రెండో సూపర్ ఓవర్) గెలుపు ఖరారు చేసుకొని విజేతగా నిలిచింది. ఒకవేళ ఈ సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమై ఉంటే, మ్యాచ్ మూడో సూపర్కు కూడా వెళ్లేది.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూపర్ ఓవర్ను 2008లో పరిచయం చేశారు. అప్పటివరకు స్కోర్లు సమమైన సందర్భాల్లో బౌల్ ఔట్ పద్దతి అమల్లో ఉండేది. సూపర్ ఓవర్ రాకతో బౌల్ ఔట్ పద్దతికి చరమగీతం పాడారు.అప్పటి నుంచి రెగ్యులర్ మ్యాచ్ల్లో స్కోర్లు సమమైన సందర్భంలో గెలుపును నిర్దేశించేందుకు సూపర్ ఓవర్ను ఉపయోగిస్తున్నారు. ఈ సూపర్ ఓవర్లో ఒక్కో జట్టుకు ఒక్కో ఓవర్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. బౌలర్ ఒక్కడే అయినా, ముగ్గురు బ్యాటర్లకు అవకాశం ఉంటుంది. ఇద్దరు ఔటైతే, బంతులు మిగిలున్నా సంబంధిత టీమ్ ఆలౌట్గా పరిగణించబడుతుంది. సూపర్ ఓవర్లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు చేస్తుందో ఆ జట్టే విజేతగా నిర్దారించబడుతుంది. సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమైతే రెండో సూపర్ ఓవర్ జరుగుతుంది. రెండో సూపర్ ఓవర్లోనూ సేమ్ రూల్స్తో ఇరు జట్లకు ఓ ఓవర్ అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా స్కోర్లు సమమైతే మూడో సూపర్ ఓవర్కు కూడా ఆస్కారముంటుంది. ఒకవేళ మూడో సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమైతే టోర్నమెంట్ పరిస్థితులు, షెడ్యూల్ ఆధారంగా బౌండరీ కౌంట్ రూల్ (ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టు) లేదా బౌలింగ్ కౌంట్ రూల్ (తక్కువ వికెట్లు కోల్పోయిన జట్టు) ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మూడే మూడు సందర్భాల్లో డబుల్ సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో ఓ మ్యాచ్ ట్రిపుల్ సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్లింది. 2025 జూన్ 16న నేపాల్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ట్రిపుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు మూడో సూపర్ వరకు ఓటమిని ఒప్పు కోలేదు. అంతిమంగా నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలో తొలి ట్రిపుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా చరిత్రకెక్కింది.అంతర్జాతీయ టీ20ల్లో తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ 2024 జనవరి 17న జరిగింది. ఈ మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ గెలుపు కోసం నువ్వా-నేనా అన్నట్లు పోరాడాయి. అంతిమంగా టీమిండియానే విజేతగా నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో రెండో డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ 2026 ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా రెండో సూపర్ ఓవర్ చివరి బంతికి గెలుపొందింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా రికార్డుల్లోకెక్కింది.అంతర్జాతీయ టీ20ల్లో కాకుండా మరో మ్యాచ్ కూడా డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. అది ఐపీఎల్ 2020లో భాగంగా జరిగింది. ఆ ఎడిషన్లో అక్టోబర్ 18న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గెలుపు కోసం రెండో సూపర్ ఓవర్ వరకు పోరాడాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ అంతిమ విజేతగా నిలిచింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా నిలిచింది. ఇవే కాకుండా మొత్తం టీ20 ఫార్మాట్లో చాలా సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి. ప్రత్యేకించి ప్రపంచకప్ను తీసుకుంటే, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి. 2012 ఎడిషన్లో న్యూజిలాండ్-వెస్టిండీస్.. అదే ఎడిషన్లో న్యూజిలాండ్-శ్రీలంక.. 2024 ఎడిషన్లో నమీబియా-ఒమన్.. అదే ఎడిషన్లో పాకిస్తాన్-యూఎస్ఏ మ్యాచ్లు సూపర్ ఓవర్ వరకు వెళ్లాయి. -
న్యూజిలాండ్కు గట్టి ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. బ్రేస్వెల్ ప్రపంచకప్కు ముందు భారత్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు (కాలి కండరానికి సంబంధించింది). అతను ప్రపంచకప్ సమయానికంతా ఫిట్నెస్ సాధిస్తాడని అశించినా కుదర్లేదు. వార్మప్ సమయంలో మరోసారి గాయపడ్డాడు. వైద్య పరీక్షల్లో అతని గాయం తీవ్రత అధికంగా ఉందని గుర్తించారు. కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో బ్రేస్వెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. బ్రేస్వెల్కు ప్రత్యామ్నాయంగా ఆశ్చర్యకర ఎంపిక జరిగింది. గత రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్న కోల్ మెక్కాంచీని బ్రేస్వెల్కు రీప్లేస్మెంట్గా ప్రకటించారు. మెక్కాంచీ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 6 వన్డేలు, 12 టీ20లు ఆడారు. 2024లో పాకిస్తాన్తో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మెక్కాంచీ ఇటీవల స్థానికంగా జరిగిన టోర్నీల్లో విశేషంగా రాణించాడు. 125 పరుగులు చేయడంతో పాటు 18 ఇన్నింగ్స్ల్లో 20 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్లో న్యూజిలాండ్ అండర్ డాగ్గా బరిలోకి దిగి, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించింది. ఈ జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్, యూఏఈపై భారీ విజయాలు నమోదు చేసింది. ఫిబ్రవరి 14 అహ్మదాబాద్లో పటిష్టమైన సౌతాఫ్రికాను ఢీకొనేందుకు సిద్దంగా ఉంది. ఫిబ్రవరి 17న తమ చివరి గ్రూప్ (డి) మ్యాచ్లో కెనడాతో తలపడనుంది. -
గ్యారీ సోబర్స్కి కార్బన్ కాపీ ఈ పిల్లాడు!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పద్నాలుగేళ్ల ఈ పిల్లాడిని దిగ్గజ గ్యారీ సోబర్స్తో పోల్చాడు. కాగా ఫార్మాట్లకు అతీతంగా ధనాధన్ దంచికొడుతూ క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వైభవ్.ధనాధన్బిహార్కు చెందిన ఈ కుర్రాడు గతేడాది ఐపీఎల్లో సత్తా చాటాడు. అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత అండర్-19 జట్టు తరఫున అదరగొట్టాడు. యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో విధ్వంసకర శతకాలు బాది రికార్డులు నెలకొల్పాడు.ఫైనల్లోనూ భారీ శతకంఇక ఇటీవల ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 ఫైనల్లోనూ ఇంగ్లండ్పై భారీ శతకం (175) బాది టీమిండియాకు టైటిల్ అందించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆట తీరు తనకు వెస్టిండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్ను గుర్తుకు తెస్తోందన్నాడు.గ్యారీ సోబర్స్కి కార్బన్ కాపీవిజ్డన్ క్రికెట్ వీక్లీ పాడ్కాస్ట్తో మాట్లాడుతూ.. “వైభవ్ను చూడగానే నాకు తొలుత గ్యారీ సోబర్స్ జ్ఞప్తికి వచ్చాడు. విధ్వంసకర రీతిలో బ్యాట్ను స్వింగ్ చేయడం.. ఆ టైమింగ్, పరిపూర్ణత సూపర్. అతడి హ్యాండ్ స్పీడ్, క్రీజులో కదిలే విధానం అన్నీ ఆ దిగ్గజం మాదిరే ఉంటాయి.అచ్చం సోబర్స్ లాగే అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తరంలోని ఆటగాడు కూడా ఇలా సోబర్స్ను నాకు గుర్తుచేయలేదు. అయితే, వైభవ్ మాత్రం తన బ్యాటింగ్ తీరుతో నన్ను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాట్ స్వింగ్ కోసం అతడు కాళ్లను కదిలించే విధానం సూపర్’’ అని మార్క్ బుచర్ వైభవ్ సూర్యవంశీని కొనియాడాడు. చదవండి: పాక్ స్పిన్నర్కు అశ్విన్ మద్దతు.. నెటిజన్స్ ఫైర్ -
రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా విజయం.. ఆఫ్ఘనిస్తాన్ వీరోచిత పోరాటం
అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యంత రసవత్తర సమరం టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కొదమ సింహాల్లా పోరాడాయి. రెండు జట్లు ఒక్క పట్టాన ఓటమిని అంగీకరించలేదు. అంతిమంగా సౌతాఫ్రికానే పైచేయి సాధించినప్పటికీ.. ఆఫ్ఘన్ తమ వీరోచిత పోరాటంతో యావత్ క్రికెట్ ప్రపంచం మనసులు గెలుచుకుంది.తొలుత రెగ్యులర్ మ్యాచ్లో స్కోర్లు సమం కాగా.. సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు చివరి బంతి వరకు పోరాడాయి. ఫైనల్గా సౌతాఫ్రికా రెండో సూపర్ ఓవర్ చివరి బంతికి విజయం సాధించింది.రెగ్యులర్ మ్యాచ్సౌతాఫ్రికా 187-6 (20 ఓవర్లు)ఆఫ్ఘనిస్తాన్ 187-10 (19.4 ఓవర్లు)ఫ్రీ హిట్కు రనౌట్రెగ్యులర్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలుపును కాలదన్నుకుంది. 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన తరుణంలో తొలి పరుగు పూర్తి చేసి, రెండో పరుగు ప్రయత్నంలో రనౌట్ రూపంలో వికెట్ కోల్పోయింది. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే ఆ బంతి ఫ్రీ హిట్. ఆఫ్ఘన్ కోల్పోయి వికెట్ చివరిది. దీంతో ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే ఒక్క పరుగు చేయలేక చేతుల్లోకొచ్చిన గెలుపును వదిలేసుకుంది.తొలి సూపర్ ఓవర్ఆఫ్ఘనిస్తాన్- 4, 6, 1, 1, 4, 1 (17 పరుగులు)సౌతాఫ్రికా- 1, 6, W, 4, 0, 6 (17 పరుగులు)రెండో సూపర్ ఓవర్సౌతాఫ్రికా- 6, 1, 2, 6, 6, 2 (23 పరుగులు)ఆఫ్ఘనిస్తాన్- 0, W, 6, 6, 6, Wd1, W (19 పరుగులు)ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాను 187 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. కెప్టెన్ రషీద్ ఖాన్ (4-0-28-2) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4-0-41-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా వికెట్లు తీశాడు. ఫజల్ హక్ ఫారూకీ (4-0-32-1) పర్వాలేదనిపించాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (3-0-30-0), మొహమ్మద్ నబీ (2-0-20-0), నూర్ అహ్మద్ (3-0-25-0) వికెట్లు తీయలేకపోగా.. పరుగులు దండిగా సమర్పించుకున్నారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (59), ర్యాన్ రికెల్టన్ (61) అర్ద సెంచరీలతో రాణించారు. డెవాల్డ్ బ్రెవిస్ (23), డేవిడ్ మిల్లర్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ మార్క్రమ్ (5), స్టబ్స్ (1) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఆఖర్లో జన్సెన్ (16) బ్యాట్ ఝులిపించాడు.188 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (84) చెలరేగిపోయాడు. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా, తన జోరును తగ్గించకుండా ఆఫ్ఘన్ను లక్ష్యం వైపు తీసుకెళ్లాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (22), రషీద్ ఖాన్ (20), నూర్ అహ్మద్ (15 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో ఆఫ్ఘన్ స్కోర్లు సమం చేసుకొని, లక్ష్యానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. మిగతా ఆఫ్ఘన్ ఆటగాళ్లలో ఇబ్రహీం జద్రాన్ 12, దర్విష్ రసూల్ 15, నబీ 5 పరుగులు చేయగా.. గుల్బదిన్ నైబ్, సెదిఖుల్లా అటల్, ముజీబ్, ఫజల్ హక్ డకౌట్లయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీసి ఆఫ్ఘన్కు గెలుపును దూరం చేశాడు. జన్సెన్, రబాడ, లిండే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ తీశారు. -
వరల్డ్కప్ జట్టులోకి స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 11) జరుగనున్న మ్యాచ్కు ముందు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయపడటంతో స్టీవ్ను హుటాహుటిన శ్రీలంకకు పిలిపించారు. స్టీవ్కు తొలుత ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.బిగ్బాష్లో అద్భుత ఫామ్లో ఉన్నా, స్టీవ్ను ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడంపై ముందు నుంచే విమర్శలు ఉన్నాయి. మార్ష్ అనూహ్యంగా గాయపడటంతో స్టీవ్కు అవకాశం లభించింది. స్టీవ్ ఫిబ్రవరి 13న జింబాబ్వేతో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రావచ్చని తెలుస్తుంది.కాగా, ఐర్లాండ్తో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలో మిచెల్ మార్ష్ గాయపడ్డాడు. తద్వారా అతను ఐర్లాండ్ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ట్రవిస్ హెడ్ ఆసీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి తగిలి మార్ష్కు టెస్టిక్యులర్ బ్లీడింగ్ సమస్య తలెత్తిందని వైద్యులు తెలిపారు.క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన ప్రకారం.. మార్ష్కు విశ్రాంతి అవసరం. వైద్యుల సూచనల ఆధారంగా తిరిగి ఆడే సమయం నిర్ణయించబడుతుంది. ఈ గాయం వల్ల ఆయన కదలికలు పరిమితం కావడంతో తక్షణమే జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసీస్ వేధిస్తున్న గాయాలుప్రస్తుత ప్రపంచకప్లో ఆసీస్ ఇప్పటికే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి సీనియర్ బౌలర్ల సేవలను కోల్పోయింది. ఇప్పుడు కెప్టెన్ మార్ష్ కూడా గాయపడటంతో జట్టు సమతుల్యత దెబ్బతింది. అయితే అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్ చేరిక, బ్యాటింగ్ లైనప్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.ప్రపంచకప్ గ్రూప్ దశలో ఆసీస్ షెడ్యూల్ - ఐర్లాండ్తో తొలి మ్యాచ్ – ఫిబ్రవరి 11 - జింబాబ్వేతో – ఫిబ్రవరి 13 - శ్రీలంకతో – ఫిబ్రవరి 16 - ఒమాన్తో – ఫిబ్రవరి 20 ఇదిలా ఉంటే, కొలొంబో వేదికగా ఐర్లాండ్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లు.. ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (కెప్టెన్), కర్టిస్ కాంఫర్, బెంజమిన్ కాలిట్జ్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, మాట్ రెన్షా, కూపర్ కోనోలీ, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్లెట్, మాథ్యూ కుహ్నెమాన్, ఆడమ్ జంపా -
అది లీగల్: పాక్ స్పిన్నర్కు అశ్విన్ మద్దతు
పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్కు టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. అతడి బౌలింగ్ యాక్షన్ను పెద్దగా తప్పుబట్టాల్సిన పనిలేదన్నాడు. క్రీజు వద్ద కాస్త ఆగి బంతిని రిలీజ్ చేయడంలో తప్పులేదని.. అది అతడి సహజ శైలి అని మద్దతుగా నిలిచాడు.పాకిస్తాన్ తరఫున గతేడాది అరంగేట్రం చేసిన ఉస్మాన్ తారిఖ్ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడే పాక్ జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. మంగళవారం అమెరికాతో మ్యాచ్లో పాల్గొన్నాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఉస్మాన్ తారిఖ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే, ఉస్మాన్ ప్రదర్శన కన్నా అతడి బౌలింగ్ యాక్షన్ తీరే నెట్టింట వైరల్గా మారింది. సందేహాస్పద రీతిలో అతడు బౌలింగ్ చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఘాటుగా స్పందించాడు.ఇది కొనసాగకూడదు‘‘పెనాల్టీ రన్ అప్ సమయంలో ఫుట్బాల్లో కూడా ఇలాంటివి అనుమతించరు. అతడి బౌలింగ్ యాక్షన్ ఏవిధంగా సమంజసం? సరే సరిగ్గానే బౌలింగ్ చేశాడనుకుందాం. మరి పాజ్ (కాసేపు ఆగడం) ఎందుకు ఇచ్చినట్లు? అది కూడా బంతిని రిలీజ్ చేసే సమయంలో ఇలా ఎందుకు చేశాడు? ఇది కొనసాగకూడదు’’ అని శ్రీవత్స్.. ఉస్మాన్ బౌలింగ్ చేస్తున్న దృశ్యాన్ని పంచుకున్నాడు. బౌలర్ మీదే ఆంక్షలు ఎందుకు?ఇందుకు అశ్విన్ స్పందిస్తూ.. ‘‘నిజమే.. ఫుట్బాల్లో కూడా ఇలాంటివి అనుమతించరు. మరి ఓ బ్యాటర్ స్విట్ హిట్ లేదంటే రివర్స్ షాట్ ఆడుతున్నపుడు అంపైర్ లేదంటే బౌలర్కు సమాచారం ఇవ్వకుండానే షాట్లు ఆడతారు కదా.అలాంటపుడు బ్యాటర్ మీద లేని ఆంక్షలు బౌలర్ మీదే ఎందుకు? నిజం చెప్పాలంటే బౌలర్ తన చేతివాటాన్ని మార్చే ముందు కచ్చితంగా అంపైర్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనను తొలుత మార్చాలి.ఏదేమైనా ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధమా? కాదా? అన్నది ఐసీసీ బౌలింగ్ యాక్షన్ టెస్టింగ్ సెంటర్లో మాత్రమే తేలుతుంది. అక్కడ మాత్రమే అతడిని పరీక్షించే అవకాశం ఉంటుంది.అతడి సహజశైలి కాబట్టి లీగలేనిబంధన ప్రకారం.. మోచేయిని నిటారుగా చేసి బంతిని రిలీజ్ చేయాలి. అయితే, అతడు బంతిని విసురుతున్నాడా? లేదంటే సరిగ్గానే బౌలింగ్ చేస్తున్నాడా అన్నది ఆన్ఫీల్డ్ అంపైర్ నిర్ధారించడం అసాధ్యం.ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మ్యాచ్ జరుగుతున్నపుడు రియల్టైమ్ టెస్టింగ్ టూల్ను వాడాలి. కానీ ఇక్కడ సరైన ఆధారం లేకుండా ఒకరిని నిందించడం తప్పు. ఏదేమైనా క్రీజులోకి వచ్చాక అలా పాజ్ ఇవ్వడం చట్టబద్ధమో కాదో చెప్పలేము. అయితే, అది అతడి సహజశైలి కాబట్టి లీగలే అని నేను నమ్ముతాను’’ అంటూ అశ్విన్ బదులిచ్చాడు.ఈ నేపథ్యంలో శ్రీవత్స్కు మద్దతుగా.. అశ్విన్ను వ్యతిరేకిస్తూ టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. ఉస్మాన్ బౌలింగ్ చేయకుండా బంతిని విసురుతున్న తీరు కనిపిస్తుంటే అశూ.. అతడికి మద్దతునివ్వడం ఏమాత్రం బాగాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు.చదవండి: ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగ్లాదేశ్Agree football doesn’t allow it!While the batter can be allowed to switch hit or reverse without informing the umpire or bowler, after him/her commits to start batting on one side, why are the restrictions only limited to the bowler?In fact the bowler isn’t allowed to change… https://t.co/AOV4OKhwcL— Ashwin 🇮🇳 (@ashwinravi99) February 11, 2026 -
ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మాట మార్చింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి వైదొలగడంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.కాగా భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తాము వరల్డ్కప్ టోర్నీ ఆడేందుకు రాలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి చేసింది. భారత్లో తమకు భద్రత ఉండదని.. మరో వేదికైన శ్రీలంకకు తమ మ్యాచ్లు మార్చాలని అభ్యర్థించింది.ప్రభుత్వ నిర్ణయానుసారమే..అయితే, బంగ్లా ఆరోపణల్లో నిజం లేదని తమ బృందం తేల్చించిందన్న ఐసీసీ.. పునరాలోచన చేయాల్సిందిగా బీసీబీకి చెప్పింది. కానీ.. తమ ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోవడం లేదని.. ప్రభుత్వ నిర్ణయానుసారం టోర్నీ నుంచి తప్పుకునేందుకైనా తాము సిద్ధమని బీసీబీ ఐసీసీకి స్పష్టం చేసింది.ఈ విషయం గురించి జనవరి 22న బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆటగాళ్లకు అర్థమయ్యేలా చెప్పేందుకే సమావేశం ఏర్పాటు చేశాము.నాకు తెలిసి వాళ్లు అర్థం చేసుకునే ఉంటారు. ఐసీసీలో మాకు న్యాయం దొరకదనే అనిపించింది. టోర్నీలో మేము ఆడేది.. లేనిది అంతా ప్రభుత్వ నిర్ణయమే’’ అని పేర్కొన్నాడు. ఇక బంగ్లా పద్ధతి మార్చుకోకపోవడంతో ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించి.. ర్యాంకింగ్ ఆధారంగా స్కాట్లాండ్ను అనుమతించింది ఐసీసీ.పాక్ యూటర్న్ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మద్దతుగా నిలిచి.. భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది. అయితే, ఐసీసీతో పాటు శ్రీలంక, యూఏఈ తదితర సభ్య దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో పాక్ యూటర్న్ తీసుకుంది. కొలంబోలో ఫిబ్రవరి 15న టీమిండియాతో మ్యాచ్ ఆడతామని స్పష్టం చేసింది.ఆటగాళ్లే నిర్ణయం తీసుకున్నారంటూ..ఇక బంగ్లాదేశ్ బోర్డుకు సైతం ఎలాంటి పెనాల్టీలు విధించబోమని ఐసీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆసిఫ్ నజ్రుల్ తమ మాటల్ని పూర్తిగా మార్చేశాడు. ‘‘ప్రపంచకప్ టోర్నీలో ఆడలేకపోయినందుకు మాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.టోర్నీలో ఆడకూడదన్నది పూర్తిగా బీసీబీ, ఆటగాళ్ల నిర్ణయమే. దేశ క్రికెట్ను రక్షించేందుకు వారు త్యాగాలు చేశారు. బంగ్లాదేశ్ ప్రజలను కాపాడుకునేందుకు.. జాతీయ సమగ్రతను చాటేందుకు వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అంటూ అర్థంపర్థం లేకుండా మరీ దారుణంగా నాలుక మడతేశాడు.ఛీ.. మరీ ఇంత దారుణమా?దీంతో బంగ్లాదేశ్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. యూటర్న్లు తీసుకోవడంలో బంగ్లా పాకిస్తాన్నే మించిపోతుందని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని సోషల్ మీడియా వేదికగా ఛీత్కరించుకుంటున్నారు. అనవసరంగా రాద్ధాంతం చేసి ఆటగాళ్ల కలలను నీరుగార్చారని బంగ్లా ప్రభుత్వంపై మండిపడుతున్నారు.కాగా భారత క్రికెట్, ఐసీసీతో సత్సంబంధాలు కొనసాగించి సమస్య పరిష్కరించుకోవాలని మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వంటి ఆటగాళ్లు బీసీబీకి సూచించారు. అయితే, బంగ్లా బోర్డులోని ఓ అధికారి అతడిని భారత ఏజెంట్ అంటూ విమర్శించాడు. ఈ నేపథ్యంలో క్రికెటర్ల సంఘం సమావేశం ఏర్పాటు చేసి అతడితో రాజీనామా చేయించేలా ఒత్తిడి తెచ్చారు.ఆటగాళ్లపై నెపంబంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ సైతం తమకు వరల్డ్కప్లో ఆడాలని ఉందని.. అయితే, ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటామని స్పష్టం చేశాడు. కానీ నజ్రుల్ మాత్రం ఇలా ఆటగాళ్లే టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారంటూ యూటర్న్ తీసుకోవడం గమనార్హం. కాగా బంగ్లాదేశ్లో కొన్నాళ్లుగా మైనారిటీ హిందువుల మీద హత్యాకాండ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్- బంగ్లా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న భారత్-శ్రీలంక వేదికగా రల్డ్కప్ టోర్నీ మొదలైన సంగతి తెలిసిందే.చదవండి: పాక్ ఫ్యాన్స్కు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్ -
T20 WC 2026: కివీస్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్ రికార్డు విజయం సాధించింది. చెన్నై వేదికగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తలపడింది కివీస్. చిదంబరం స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లోయూఏఈని ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు సత్తా చాటడంతో న్యూజిలాండ్కు ఈ విజయం సాధ్యమైంది. వరల్డ్కప్ టోర్నీ తాజా ఎడిషన్ తొలి పోరులో అఫ్గనిస్తాన్ను ఓడించిన న్యూజిలాండ్కు ఇది వరుసగా రెండో గెలుపు కావడం విశేషం. తద్వారా సూపర్ ఎయిట్కు కివీస్ మరింత చేరువైంది.77 బంతుల్లోనే 107 పరుగులుకాగా న్యూజిలాండ్తో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగింది యూఏఈ. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ (45 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), అలీషాన్ షరఫు (47 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్కు 77 బంతుల్లోనే 107 పరుగులు జోడించారు.మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీకి 2 వికెట్లు తీయగా.. జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రపంచ రికార్డు అనంతరం న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 175 పరుగులు సాధించింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.సీఫెర్ట్ 42 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లు బాది 89 పరుగులు.. అలెన్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 84 రన్స్తో అజేయంగా నిలిచారు. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.తద్వారా తొలి వికెట్కు 92 బంతుల్లోనే 175 పరుగులు జత చేసి చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఏ వికెట్కైనా అత్యధిక స్కోరు సాధించిన జోడీగా సీఫెర్ట్- అలెన్ ప్రపంచ రికార్డు సాధించారు. తమ అద్భుత ప్రదర్శనతో మరో 27 బంతులు మిగిలి ఉండగానే యూఏఈపై జట్టుకు విజయం అందించారు.టీ20 ప్రపంచకప్లో అత్యధిక భాగస్వామ్యం (ఏ వికెట్కైనా)🏏టిమ్ సీఫెర్ట్- ఫిన్ అలెన్ (న్యూజిలాండ్): 2026లో యూఏఈ మీద 175 నాటౌట్🏏జోస్ బట్లర్- అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్): 2022లో టీమిండియా మీద 170 నాటౌట్🏏క్వింటన్ డికాక్- రిలీ రొసోవ్ (సౌతాఫ్రికా): 2022లో బంగ్లాదేశ్ మీద 168 🏏మహేళ జయవర్దనే- కుమార్ సంగక్కర (శ్రీలంక): 2010లో వెస్టిండీస్ మీద 166🏏ఇబ్రహీం జద్రాన్- రహ్మనుల్లా గుర్బాజ్ (అఫ్గనిస్తాన్): 2024లో ఉగాండా మీద 154న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ స్కోర్లు👉యూఏఈ: 173/6(20)👉న్యూజిలాండ్: 175/0(15.2)👉ఫలితం: యూఏఈపై పది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జయభేరి.చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి..Absolute carnage 🔥New Zealand shatter records with the highest partnership and the highest successful chase without losing any wickets in ICC Men’s T20 World Cup history. 🇳🇿ICC Men’s #T20WorldCup | #PAKvUSA | LIVE NOW 👉 https://t.co/97PRnnpgoP pic.twitter.com/KjichpPvP0— Star Sports (@StarSportsIndia) February 10, 2026


