Sports
-
ఆస్ట్రేలియాకు ఘోర అవమానం
ఆరు సార్లు విశ్వవిజేత, ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ కూడా అయిన ఆస్ట్రేలియా వన్డే జట్టుకు ఘోర అవమానం జరిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న (జూన్ 9) జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయంపాలైన ఆ జట్టు.. మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో వరుసగా మూడో ఇన్నింగ్స్లోనూ ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ ఖాతా తెరవకుండానే కుప్పకూలింది.ఇటీవల పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లోనూ ఆస్ట్రేలియా ఓపెనర్లు రెండుసార్లు (చివరి రెండు వన్డేలు) ఒక్క పరుగు కూడా జోడించలేకపోయారు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ అదే పరిస్థితి పునరావృతం కావడంతో, వన్డే చరిత్రలో వరుసగా మూడు ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ వికెట్కు ఖాతా తెరవని జట్ల జాబితాలో ఆస్ట్రేలియా చేరింది.ఈ అవాంఛనీయ జాబితాలో ఇప్పటికే న్యూజిలాండ్ (2015) ఉండగా, తాజాగా ఆస్ట్రేలియా వారి సరసన నిలిచింది. అయితే అత్యంత చెత్త రికార్డు మాత్రం పసికూన పపువా న్యూ గినియా పేరిట ఉంది. 2022లో పపువా న్యూ గినియా వరుసగా నాలుగు వన్డే ఇన్నింగ్స్ల్లో ఓపెనింగ్ వికెట్కు ఒక్క పరుగు కూడా నమోదు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్వర్త్ లూయిస్) సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కుదేలైపోయారు.బ్యాటింగ్లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది. -
నైట్క్లబ్ వివాదం.. స్టోక్స్పై వేటు
నైట్క్లబ్ వివాదంలో చిక్కుకున్న ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్పై అందరూ ఊహించిన విధంగానే వేటు పడింది. న్యూజిలాండ్తో రెండో టెస్ట్కు అతడితో పాటు నైట్క్లబ్ వివాదంలో మరో నిందితుడు గస్ అట్కిన్సన్ను కూడా జట్టు నుంచి తప్పించారు. జట్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది.లార్డ్స్ టెస్ట్లో విజయానంతరం స్టోక్స్, అట్కిన్సన్లు లండన్లోని ఓ నైట్క్లబ్కు వెళ్లారు. వీరిద్దరు జట్టుకు విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూను ఉల్లంఘించి అక్కడ ఉండగా, ఓ రగ్బీ ఆటగాడితో ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ECB విచారణ చేపట్టిన తర్వాత ఇద్దరినీ రెండో టెస్ట్కు ఎంపిక చేయలేదు.దీంతో 2022లో స్టోక్స్కు కెప్టెన్సీ అప్పగించిన మాజీ సారథి జో రూట్ మళ్లీ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన రూట్వైపే ECB మొగ్గుచూపింది.స్టోక్స్ స్థానంలో జోర్డన్ కాక్స్, అట్కిన్సన్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ జట్టులోకి వచ్చారు. ఐపీఎల్ తర్వాత ఆర్చర్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.కాగా, నైట్ఫైట్ తర్వాత స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అతడు ఇప్పటికే వన్డే, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి టెస్ట్ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తాజా ఉదంతం తర్వాత స్టోక్స్ క్రికెట్ కెరీర్ మొత్తానికే గుడ్బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో గెలుపొంది, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో రెండో టెస్ట్ జూన్ 17 నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా మొదలుకానుంది.న్యూజిలాండ్తో రెండో టెస్ట్కు ఇంగ్లండ్ జట్టు..రూట్ (C), డకెట్, గే, బేతెల్, బ్రూక్, స్మిత్ (WK), రూ, కాక్స్, రెహాన్, రాబిన్సన్, జోఫ్రా, టంగ్, ఫిషర్, బేకర్, బషీర్ -
ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (జూన్ 10) జరిగిన తొలి మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది.భారత్ను గెలిపించేందుకు రిచా ఘోష్ (36 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. శ్రీచరణి తొలి బంతికి సింగిల్ తీసి రిచాకు స్ట్రయిక్ ఇచ్చింది. అప్పటికే జోష్లో ఉన్న రిచా.. రెండో బంతిని బౌండరీకి, మూడో బంతిని సిక్సర్కు తరలించి భారత్ను గెలుపు వాకిటి వరకు చేర్చింది.అయితే తొందరగా మ్యాచ్ను ముగిద్దామనే క్రమంలో నాలుగో బంతికి లిండ్సే స్మిత్ బౌలింగ్లో స్టంపౌటయ్యింది. అప్పటికీ భారత్కు గెలిచే అవకాశం ఉండింది. మిగిలిన రెండు బంతుల్లో ఆరు పరుగులు సాధిస్తే టీమిండియాదే గెలుపు. చేతిలో ఓ వికెట్ ఉండింది. అయితే ఐదో బంతికి రేణుకా సింగ్ కూడా ఔట్ కావడంతో భారత్ ఆలౌటై, మ్యాచ్ను చేజార్చుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో యామీ జోన్స్ (64), కెప్టెన నాట్ సీవర్ బ్రంట్ (57) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో డేనియెలా గిబ్సన్ (30 నాటౌట్) బ్యాట్ను ఝులిపించింది. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, షఫాలీ, రేణుకా, శ్రీ చరణి, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.భారత ఇన్నింగ్స్ విషయానికొస్తే.. రిచా మినహా జట్టులో ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేదు. షఫాలీ (13), యస్తికా (15), హర్మన్ (17), భారతి (18), రాధా యాదవ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ 3, డీన్, కోల్మన్, గిబ్సన్ తలో 2, వాంగ్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ప్రపంచకప్ రెగ్యులర్ మ్యాచ్లు జూర్ 12 నుంచి మొదలవుతాయి. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్-శ్రీలంక తలపడనున్నాయి. భారత్ జూన్ 14న జరిగే తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. -
అర్హతే లేదు.. అఫ్గనిస్తాన్పై సంచలన వ్యాఖ్యలు!
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు మదన్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు అసలు టెస్టు హోదా పొందే అర్హతే లేదన్నాడు. కనీస స్థాయి లేని జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఎందుకు అవకాశం ఇస్తుందో తనకు అర్థం కావడం లేదన్నాడు.ఐర్లాండ్తో పాటు టెస్టు హోదాకాగా 2001లో ఐసీసీ అఫిలియేట్ మెంబర్గా ఉన్న అఫ్గనిస్తాన్.. 2013లో అసోసియేట్ మెంబర్ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుని 2017లో ఐర్లాండ్తో పాటు టెస్టు హోదా పొందింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో 2018లో తమ తొలి టెస్టు ఆడి ఘోర పరాజయం చవిచూసింది.తాజాగా ముల్లన్పూర్లో మరోసారి టీమిండియాతో టెస్టులో తలపడ్డ అఫ్గనిస్తాన్ జట్టు.. ఇన్నింగ్స్ మీద 300 పరుగుల అతి భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ మదన్ లాల్ అఫ్గన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఎందుకు అనుమతిస్తున్నారు?‘‘అసలు అఫ్గనిస్తాన్ను టెస్టు క్రికెట్ ఆడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు? వాళ్లకు టెస్టు జట్టు హోదా ఎలా ఇచ్చారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. అఫిలియేట్ దేశాలకు కూడా వన్డే, టీ20 ప్రదర్శనలు, రికార్డుల ఆధారంగా టెస్టు హోదా ఇస్తున్నారు.నిజానికి అఫ్గనిస్తాన్ టీ20లలో మాత్రమే మెరుగ్గా ఆడుతోంది. వన్డేల్లో కూడా వాళ్లు మరింత దృష్టి సారించాలి. ముఖ్యంగా 50 ఓవర్ల పాటు అవుట్ కాకుండా నిలబడే సత్తా ఉండాలి. అలాంటి వాళ్లు ఏకంగా టెస్టు బరిలో దిగుతున్నారు.అఫ్గనిస్తాన్లో అవి శూన్యంభారత్తో మ్యాచ్లో 152, 112 పరుగులు మాత్రమే స్కోరు చేయగలిగారు. గతంలో 109, 102 పరుగులకే కుప్పకూలారు. టెస్టు క్రికెట్ను ప్రమోట్ చేసేందుకు ఇలాంటి జట్లను అనుమతించడం తగునా? నిజానికి ఐదు రోజుల క్రికెట్ ఆడేందుకు పూర్తిస్థాయి వ్యవస్థ, సదుపాయాలు అవసరం. కానీ అఫ్గనిస్తాన్లో అవి శూన్యం. అఫ్గన్ ఆటగాళ్లు చెత్తగా ఆడుతున్నారని నేను అనను.అయితే, వాళ్లకు టెస్టులు ఆడేందుకు వీలైన పరిస్థితులు లేవు. వాళ్లు ఇంతవరకు ఐదు రోజుల క్రికెట్కు అలవాటు పడనే లేదు. వ్యవస్థ సరిగ్గా లేనపుడు వాళ్లు మాత్రం ఏం చేయగలరు?’’ అని మదన్ లాల్ న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటికి పదమూడు టెస్టులు ఆడి.. నాలుగు మాత్రమే గెలిచింది. ఎనిమిదింట ఓడి.. రెండు డ్రా చేసుకుంది.చదవండి: గంభీర్ను పట్టించుకోని సీనియర్లు! -
T20 WC: జట్లు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
గతేడాది సొంతగడ్డపై భారత మహిళ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారిగా ఐసీసీ వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో చాంపియన్గా అవతరించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.ఆ తర్వాత టీమిండియా అదే జోరు కొనసాగిస్తూ స్వదేశంలో పొట్టి క్రికెట్ ప్రపంచకప్ గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విజేతగా నిలిచింది. ఇప్పుడు మహిళల వంతు వచ్చేసింది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 టీ20 మహిళా ప్రపంచకప్-2026 మొదలుకానుంది.ఈ మెగా టోర్నీలో సత్తా చాటాలని హర్మన్ బృందం పట్టుదలగా ఉంది. పురుషుల మాదిరే ఈసారి తామూ ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక న్యూజిలాండ్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలో దిగనుండగా.. గతేడాది రన్నరప్ సౌతాఫ్రికా కూడా ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. ఇక భారత జట్టు 2024లో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. ఈసారి లోపాలు సరిచేసుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.ఇంతకీ ఈ టోర్నీలో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? సారథులు ఎవరు?.. వేదికలు, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ? తదితర వివరాలు తెలుసుకుందామా?!షెడ్యూల్👉రౌండ్- రాబిన్ ఫార్మాట్👉జూన్ 12న వరల్డ్కప్ టోర్నీ మొదలు (ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక)👉భారత్ వర్సెస్ పాకిస్తాన్- జూన్ 14👉సెమీ ఫైనల్-1: జూన్ 30👉సెమీ ఫైనల్-2: జూలై 2👉జూలై 5న ఫైనల్తో ముగింపు.వేదికలు👉గ్రూప్, సూపర్-8 దశ: ఓల్డ్ ట్రఫోర్డ్, మాంచెస్టర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్, హెడింగ్లీ, లీడ్స్, హాంప్షైర్ బౌల్, సౌతాంప్టన్, ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్.👉సెమీ ఫైనల్- ది ఓవల్, ఫైనల్- లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జట్లుఆస్ట్రేలియాసోఫీ మోలినెక్స్ (కెప్టెన్), నికోలా క్యారీ, ఆష్లే గార్డనర్, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్ఫీల్డ్, తాహ్లియా మెక్గ్రాత్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగన్ షట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.బంగ్లాదేశ్నిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్), నహిదా అక్తర్ (వైస్ కెప్టెన్), షర్మిన్ అక్తర్ సుప్తా, శోభనా మోస్తరీ, షోర్నా అక్తర్, రీతు మోని, రబెయా ఖాన్, ఫాహిమా ఖాతున్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, మరుఫా అక్తర్, శంజిదా అక్తేర్ మఘ్లా, సుల్తానా ఖాతున్, దిలారా అక్తర్, జుయేరియా ఫిర్దోస్, తాజ్ నెహర్.ఇండియాహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్నెదర్లాండ్స్బాబెట్ డి లీడే (కెప్టెన్), కరోలిన్ డి లాంగే, ఫ్రెడెరిక్ ఓవర్డిజ్క్, హన్నా లాంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్, లారా లీమ్హూయిస్, మైర్తే వాన్ డెన్ రాడ్, ఫెబ్ మోల్కెన్బోయర్, రోసాలీ లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, స్టెరె కాలిస్పాకిస్తాన్ఫాతిమా సనా (కెప్టెన్), గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, ఇరామ్ జావేద్, ఇమాన్ ఫాతిమా, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, సైరా జబీన్, మునీబా అలీ, తుబా హసన్, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్, తస్మియా రుబాబ్.సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నెరీ డెర్క్సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయాబొంగా ఖాకా, సునే లూయస్, కరాబో మెసో, నోంకులులేకో మ్లాబా, కైలా రేనేకే, టుమీ సెఖుఖునేర్, చ్లోవాన్ నికెర్కెర్ఇంగ్లండ్నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, హీథర్ నైట్, లిన్సీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్-హాడ్జ్.ఐర్లాండ్గాబీ లూయిస్ (కెప్టెన్), అవా కానింగ్, క్రిస్టినా కౌల్టర్ రైలీ, అలనా డాల్జెల్, జార్జినా డెంప్సీ, అమీ హంటర్, ఆర్లీన్ కెల్లీ, లూయిస్ లిటిల్, ఐమీ మాగ్వైర్, లారా మెక్బ్రైడ్, కారా ముర్రే, లియా పాల్, ఓర్లా ప్రెండర్గాస్ట్, రెబెక్కా స్టోకెల్, ఆలిస్ టెక్టర్న్యూజిలాండ్మెలీ కెర్ (కెప్టెన్), సూజీ బేట్స్, సోఫీ డివైన్, ఫ్లోరా డెవాన్షైర్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, నెన్సీ పటేల్, జార్జియా ప్లిమ్మర్, ఇజ్జీ షార్ప్, లీ తహుహు.స్కాట్లాండ్కాథరిన్ బ్రైస్ (కెప్టెన్), క్లో అబెల్, ఒలివియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియనాజ్ ఛటర్జీ, గాబ్రియెల్లా ఫొంటెన్లా, కాథరిన్ ఫ్రేజర్, కిర్స్టీ గోర్డాన్, ఐల్సా లిస్టర్, మైసీ మాసీరా, అబ్తాహా మక్సూద్, మేగన్ మెక్కోల్, రేచల్ స్లేటర్, పిప్పా స్ప్రౌల్శ్రీలంకచమరి ఆటపట్టు (కెప్టెన్), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, ఇమేషా దులాని, నీలక్షిక సిల్వా, కవీషా దిల్హరి, హన్సిమా కరుణరత్నే, కౌషిణి నుత్యాంగన, సుగందిక దాసనాయక, నిమాషా మదుషాని, కావ్య మదుషాని, కావ్య మదుషాని, మల్కి మదర, మిథాలి అయోధ్య, చేతన విముక్తి.వెస్టిండీస్హేలీ మాథ్యూస్ (కెప్టెన్), చినెల్లే హెన్రీ, డియాండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్, అఫీ ఫ్లెచర్, ఆలియా అలీన్, షెమైన్ క్యాంప్బెల్లే, అష్మిని మునిసార్, కరిష్మా రామ్హారక్, జన్నీలియా గ్లాస్గో, జహజారా క్లాక్స్టన్, కియానా జోసెఫ్, మాన్షా హేగ్రుక్, జైదా జేమ్స్, మాండీ మంగ్రూ, షానిష హెక్టార్.ప్రత్యక్ష ప్రసారం👉స్టార్ స్పోర్ట్స్ (టీవీ), జియోహాట్స్టార్ (డిజిటల్).మ్యాచ్ ఆరంభ సమయాలుభారత కాలమానం ప్రకారం: మధ్యాహ్నం మూడు గంటలు, రాత్రి ఏడు గంటలు, పదకొండు గంటలకు ఆరంభం.చదవండి: గంభీర్ను పట్టించుకోని సీనియర్లు! -
టీమిండియా షెడ్యూల్లో మరో విదేశీ పర్యటన
భారత టెస్ట్ జట్టు షెడ్యూల్లో మరో విదేశీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. 2017 తర్వాత టీమిండియా తొలిసారి శ్రీలంక గడ్డపై (టెస్ట్ సిరీస్ కోసం) అడుగుపెట్టనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్లో జరగనుంది.బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు శ్రీలంకలోని ప్రముఖ వేదిక అయిన గాలే అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండగా, అది కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరగనున్నట్లు తెలుస్తోంది.భారత్ చివరిగా లంక గడ్డపై ఆడిన టెస్ట్ సిరీస్ను విరాట్ కోహ్లి నేతృత్వంలో 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత మళ్లీ భారత్ అక్కడ టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ టూర్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.టెస్ట్ సిరీస్తో పాటు లంక టూర్లో మూడు టీ20 మ్యాచ్లు కూడా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సిరీస్ నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. టెస్ట్ సిరీస్ షెడ్యూల్పై కూడా అధికారిక ప్రకటన లేనప్పటికీ.. పైన అనుకున్న షెడ్యూల్ ఖరారైనట్లు బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి ప్రకటించారు. -
పాక్ కెప్టెన్పై వేటు.. హెడ్కోచ్పై వేళాడుతున్న కత్తి!
పాకిస్తాన్ టెస్టు కెప్టెన్సీ పదవి నుంచి షాన్ మసూద్ను తొలగించే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. షాన్ మసూద్తో పాటు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్నతాధికారులు వారాంతంలో సమావేశం కానున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ పర్యటనలో బంగ్లా చేతిలో పాకిస్తాన్ 0-2తో టెస్టు సిరీస్లో వైట్వాష్ కావడంతో షాన్ మసూద్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించిన సల్మాన్ అలీ అఘాకు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు వినిపించాయి. దీంతో షాన్ మసూద్, కోచ్ సర్ఫరాజ్ అహ్మద్లు రాబోయే ఇంగ్లండ్, వెస్టిండీస్ టూర్ వరకు కొనసాగుతారా లేక తొలగిస్తారా అనేది మీటింగ్లో తేలిపోనుంది. ఇదే విషయంపై పీసీబీ సెలెక్టర్ ఒకరు స్పందించారు. ‘పాకిస్తాన్ టెస్టు కెప్టెన్గా సల్మాన్ అలీని నియమించడానికి బోర్డు అధికారులు ఇప్పటికే అనుమతి ఇచ్చారని, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నాం. ఇక సర్ఫరాజ్ అహ్మద్ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ హెడ్కోచ్ను కూడా మార్చే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. సర్ఫరాజ్ స్థానంలో మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ హెడ్కోచ్గా వచ్చే చాన్స్ ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సల్మాన్ అలీ అఘా పరిమిత ఓవర్ల కెప్టెన్గా కొనసాగుతున్నాడు. టెస్టు జట్టుకు కూడా అతడే నాయకత్వం వహించనుండడం లాంఛనం కానుంది. అయితే హెడ్కోచ్ పదవికి యూనిస్ఖాన్తో పాటు మరో మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం జరిగే మీటింగ్లో ఈ విషయాలపై పూర్తి స్పష్టత రానుంది.చదవండి: ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్మనీ ఎంతో తెలుసా? -
అఫ్గనిస్తాన్తో వన్డే.. వైభవ్ సూర్యవంశీ ఉంటాడు!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ఎ’ జట్టు తరఫున తొలి మ్యాచ్లోనే విఫలమయ్యాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మంగళవారం నాటి వన్డేలో ఓపెనర్గా బరిలోకి దిగాడు ఈ లెప్టాండర్ బ్యాటర్.వైభవ్ విఫలంఆరంభంలో బౌండరీలతో అలరించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. కాసేపటికే అవుటై ఉసూరుమనిపించాడు. మొత్తంగా 12 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో కేవలం 14 పరుగులు చేసి మహ్మద్ షిరాజ్ బౌలింగ్లో నిష్క్రమించాడు. ఇక మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2) విఫలమయ్యాడు.Bossing From Ball 1 😎Vaibhav Sooryavanshi - making a 𝙍𝙐𝙏𝙃𝙇𝙀𝙎𝙎 entry on the world stage. 💥 #SonySportsNetwork #SonyLIV #TalentTVCup #TeamIndia #SLvIND pic.twitter.com/tLBkRO2ySF— Sony Sports Network (@SonySportsNetwk) June 9, 2026రుతురాజ్ గైక్వాడ్ సెంచరీసాధారణంగా ఓపెనర్గా బరిలోకి దిగే ప్రియాన్ష్ ఆర్య లంకతో మ్యాచ్లో మూడో స్థానంలో వచ్చి (32 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు. టాపార్డర్ విఫలమైనా నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ(101)తో రాణించడంతో భారత్ గట్టెక్కింది. నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులు చేయగలిగింది.అయితే, విజయం కోసం మాత్రం చివరి వరకు తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ విధించిన 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47 ఓవర్లు ముగిసే సరికి లంక 261/6తో పటిష్టంగా ఉంది. ఆఖరి మూడు ఓవర్లలో 17 పరుగులే రావాల్సి ఉండగా.. విజయం లాంఛనమే అనుకున్నారు.బౌలర్ల విజృంభణతో..కానీ భారత బౌలర్లు ఆఖర్లో పది బంతుల్లోనే నాలుగు వికెట్లు కూల్చి ఆతిథ్య లంక జట్టు ఓటమిని శాసించారు. అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆయుశ్ బదోని, విప్రాజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీయగా... అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి.. సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది.ఇక తమ రెండో మ్యాచ్లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు గురువారం అఫ్గనిస్తాన్-‘ఎ’ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై చర్చ మొదలైంది. ఓపెనర్లుగా వైభవ్, ప్రభ్సిమ్రన్ విఫలమైనా వారిద్దరిని కొనసాగించాలని నాయకత్వ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా లంకపై గెలిచిన తుది జట్టుతోనే భారత్ అఫ్గన్తో వన్డే బరిలోనూ దిగనున్నట్లు తేలిపోయింది.అఫ్గనిస్తాన్-‘ఎ’తో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ (కెప్టెన్), ఆయుశ్ బదోని, అనుకుల్ రాయ్, సూయాన్ష్ షెడ్గే, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, విప్రాజ్ నిగమ్.చదవండి: వాళ్లకే దిక్కు లేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? -
టెస్ట్ల్లో సరికొత్త 'నంబర్ వన్'
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సరికొత్త నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్గా అవతరించాడు. సహచరుడు జో రూట్ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో అర్ద సెంచరీ సాధించి నంబర్ వన్ స్థానానికి చేరాడు. ఇదే మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో ఘోరంగా విఫలమైన రూట్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు.తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో సూపర్ సెంచరీతో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. 743 రేటింగ్ పాయింట్లు కలిగిన గిల్.. ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక రేటింగ్ కలిగిన బ్యాటర్గా నిలిచాడు.ఇదే మ్యాచ్లో సెంచరీ చేసిన మరో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ర్యాంక్లో (34) ఎలాంటి మార్పు లేదు. గిల్తో పాటు టాప్-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానంలో కోల్పోయి తొమ్మిదో స్థానానికి చేరాడు. ఓవరాల్గా తాజా ర్యాంకింగ్స్లో అత్యధిక లబ్ది పొందిన బ్యాటర్గా గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. ఫిలిప్స్ తాజాగా ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో ఓ మోస్తరు ప్రదర్శన చేసినప్పటికీ.. 15 స్థానాలు మెరుగుపర్చుకొని 40వ స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్లో కళ్లు చెదిరే ప్రదర్శన ఇచ్చిన ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ 7 స్థానాలు మెరుగుపర్చుకొని పదో స్థానానికి ఎగబాకాడు. ఆఫ్ఘన్ టెస్ట్లో సంచలన ప్రదర్శన ఇచ్చిన టీమిండియా అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ తొలిసారి టాప్-100లోకి ప్రవేశించాడు. ఆ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన సుతార్ 272 రేటింగ్ పాయింట్లు సాధించి 72వ స్థానంలో నిలిచాడు.మిగతా భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 14వ స్థానానికి చేరగా.. సిరాజ్ ఓ స్థానం కోల్పోయి 15వ స్థానానికి పడిపోయాడు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా వెటరన్ ఆటగాడు రవీంద్ర జడేజా టాప్ ప్లేస్ను నిలుపుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. -
ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్మనీ ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా యమా క్రేజ్ ఉన్న ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఫిఫా వరల్డ్కప్కు ఈసారి అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 39 రోజుల పాటు జరగనున్న సాకర్ సమరంలో 48 దేశాలు పాల్గొన నున్నాయి. ఫైనల్ సహా మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. మ్యాచ్ల నిర్వహణ, ఆరంభ వేడుకలకే పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ఫిఫా నిర్వాహకులు.. టోర్నీలో విజేతగా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ సహా సెమీఫైనలిస్ట్లు, క్వారర్ ఫైనలిస్ట్లు, గ్రూప్ దశలో వెనుదిరిగే జట్లకు అందించే ప్రైజ్మనీ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2022 ఫిఫా ప్రపంచకప్ విజేత అర్జెంటీనాఅయితే 1998 వరకు ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్మనీ సాధారణంగానే ఉండేది. అయితే 1998 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రైజ్మనీ విలువ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుత ఫిఫా వరల్డ్కప్లో మొత్తం ప్రైజ్మనీ విలువ 655 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 6 వేల కోట్లకు పైమాటే). 2022 ఫిఫా ప్రపంచకప్తో పోలిస్తే ప్రైజ్మనీ విలువ దాదాపు 50శాతం పెరగడం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీగా పిలవబడే ఈవెంట్ అయిన ఫిఫా ప్రపంచకప్తో క్రికెట్లో నిర్వహించే టీ20 ప్రపంచకప్తో పోల్చలేమని క్రీడా పండితులు పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్మనీలో టీ20 ప్రపంచకప్ ప్రైజ్మనీ సగం కూడా తూగదు. ఎందుకంటే ఫిఫా ప్రపంచకప్లో లీగ్ దశలో 17 నుంచి 32 స్థానాల్లో నిలిచే జట్లకు అందించే 11 మిలియన్ డాలర్లే ఐసీసీ టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్మనీ విలువ కావడం గమనార్హం. 2026 టీ20 ప్రపంచకప్ విజేత భారత్అందుకే ఐసీసీ టీ20 ప్రపంచకప్ విలువను ఫిఫా ప్రపంచకప్ విలువతో పోలిస్తే దాని కాలిగోటికి కూడా సరిపోదు. ఇక ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్మనీ అయిన 655 మిలియన్ అమెరికా డాలర్లను టోర్నీలో చాంపియన్స్గా నిలిచే జట్టు నుంచి లీగ్లో ఆఖరి స్థానంలో నిలిచే జట్లకు ఎలా పంచుతారనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఫిఫా ప్రపంచకప్ మొత్తం ప్రైజ్మనీ: 655 మిలియన్ డాలర్లుచాంపియన్స్: 50 మిలియన్ డాలర్లురన్నరప్: 33 మిలియన్ డాలర్లుమూడు, నాలుగు స్థానాలు: 27 మిలియన్ డాలర్లు5 నుంచి 8వ స్థానం : 19 మిలియన్ డాలర్లు9 నుంచి 16వ స్థానం: 15 మిలియన్ డాలర్లు17 నుంచి 32వ స్థానం: 11 మిలియన్ డాలర్లు 33 నుంచి 48వ స్థానం: 9 మిలియన్ డాలర్లు. దీనికి అదనంగా అర్హత సాధించిన ప్రతీ జట్టుకు సన్నాహక ఖర్చుల కింద మరో 1.5 మిలియన్ డాలర్లు అదనంగా లభిస్తాయి.మరోవైపు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మొత్తం ప్రైజ్మనీ విలువ 11.25 మిలియన్ డాలర్లు.చాంపియన్స్ (భారత్): 2.6 మిలియన్ డాలర్లురన్నరప్ (న్యూజిలాండ్): 1.42 మిలియన్ డాలర్లుమూడో స్థానం (దక్షిణాఫ్రికా): 1 మిలియన్ డాలర్లునాలుగో స్థానం (ఇంగ్లండ్): 974,423 డాలర్లు5 నుంచి 8వ స్థానం వరకువెస్టిండీస్ - 538,269 డాలర్లుపాకిస్తాన్ - 522,692 డాలర్లుజింబాబ్వే - 491,538 డాలర్లుశ్రీలంక - 475,962 డాలర్లుచదవండి: చతికిలపడ్డ బాలీవుడ్ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్! -
టీమిండియా యువ సంచలనానికి బంపరాఫర్
తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో అద్భుత ప్రదర్శనతో (7 వికెట్లు) ఆకట్టుకున్న టీమిండియా యువ సంచలనం మానవ్ సుతార్కు ఊహించని అవకాశం లభించింది. అరంగేట్రంలోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చిన అతడితో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోని ప్రముఖ జట్టైన వార్విక్షైర్ రెండు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ల ఒప్పందం చేసుకుంది.సుతార్కు ఈ డీల్ చాలా లక్కీగా పరిగణించబడుతోంది. టీమిండియా భవిష్యత్ ఇంగ్లండ్ పర్యటనల్లో అతడికి ఈ అనుభవం చాలా పనికొస్తుంది. స్పిన్నర్లకు పెద్దగా సహకరించని ఇంగ్లండ్ పిచ్లపై సుతార్ తన బౌలింగ్ను మెరుగుపర్చుకోవచ్చు. ఇంగ్లండ్లో రాణిస్తే సుతార్ భవిష్యత్తుకు తిరుగుండదు.అశ్విన్ రిటైర్మెంట్, జడేజా తరచుగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం భారత టెస్ట్ జట్టుకు విదేశీ పరిస్థితుల్లో స్థిరమైన స్పిన్నర్ అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో సుతార్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అనుభవం సాధించడం టీమిండియాకు చాలా ఉపయోగపడుతుంది.దేశీయ క్రికెట్లో అత్యుత్తమ ట్రాక్ రికార్డు (30 మ్యాచ్ల్లో 136 వికెట్లు) కలిగిన సుతార్.. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్తో టీమిండియా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ స్పెల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపుకు తిప్పింది. రెండో ఇన్నింగ్స్లోనూ సుతార్ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ మరో వికెట్ సాధించాడు. మొత్తంగా అరంగేట్ర టెస్ట్లో 7 వికెట్లు తీసి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకుగానూ అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. -
బిగ్ అనౌన్స్మెంట్..!
భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చని భావిస్తున్న ఓ ప్రతిపాదన ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫ్రాంచైజీ టి20 లీగ్ అయిన బిగ్బాష్ లీగ్ మ్యాచ్లను తొలిసారిగా భారత్లో నిర్వహించే దిశగా ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన నిజమైతే, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది ఓ కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.ఈ ప్రణాళికలో భాగంగా చెన్నై నగరం ప్రధాన వేదికగా పరిశీలనలో ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఐకానిక్ క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన చిదంబరం స్టేడియంను ఓ ప్రత్యేక బీబీఎల్ రెగ్యులర్ మ్యాచ్కు ఆతిథ్యమివ్వడానికి అనుకూలమైన వేదికగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా , బీసీసీఐ మరియు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య అనధికారిక చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.తాజాగా ఈ అంశానికి అధిక ప్రాధాన్యత లభించడానికి కారణం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారని వస్తున్న వార్తలు. ఆ పర్యటనలో మోదీ బిగ్బాష్ లీగ్ భారత ఎంట్రీపై "గ్రౌండ్ బ్రేకింగ్" ప్రకటన చేస్తారని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాలపై పలు సానుకూల ప్రకటనలు చేస్తారని సమాచారం.ఒకవేళ బిగ్బాష్ లీగ్ భారత ఎంట్రీ ప్రాజెక్ట్ సాకారమైతే, అంతర్జాతీయ టీ20 లీగ్లు పరస్పర దేశాల్లో మ్యాచ్లు నిర్వహించే కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్లలో పాల్గొనడంపై ఉన్న పరిమితులు, ఐపీఎల్ షెడ్యూల్తో సర్దుబాటు, ప్రసార హక్కుల పంపకం, లాజిస్టిక్స్ వంటి అంశాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. -
గంభీర్తో మాకు సంబంధం లేదు!.. సీనియర్ల రూటే వేరు!
అఫ్గనిస్తాన్తో సిరీస్తో టీమిండియా వన్డే ప్రపంచకప్-2026 సన్నాహకాలు మొదలుకానున్నాయి. గిల్ సేన స్వదేశంలో అఫ్గన్తో మూడు వన్డేలు ఆడేందుకు సన్నద్ధమైంది. గాయం కారణంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ సిరీస్కు దూరం కాగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం కాలు నొప్పితో దూరమయ్యే పరిస్థితి నెలకొంది.మరోవైపు.. లెజెండరీ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన దిగ్గజ ద్వయం రోహిత్- కోహ్లి వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.గంభీర్, అగార్కర్ విముఖత?వన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా రో-కో ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. వరల్డ్కప్ ఆడే విషయంలో రో-కో తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు.తలవంచనుఅయితే, ఇందుకు కోహ్లి ఇటీవలే గట్టి కౌంటర్ ఇచ్చాడు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే.. అందుకు తాను తలవంచనని చెప్పేశాడు. డ్రెసింగ్రూమ్లో తన అవసరం లేదనుకుంటే తన గురించి చర్చే అనవసరం అని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో రో-కో భవితవ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించాయి. సీనియర్ ఆటగాళ్లు గంభీర్, అగార్కర్లను కాదని యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.గంభీర్తో మాకు సంబంధం లేదు‘‘జట్టులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ గిల్ ప్రతీ విషయంలో డ్రెసింగ్రూమ్ గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్టు, టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు.అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. వన్డే వరల్డ్కప్ సన్నాహకాలు మొదలైపోయాయి. గంభీర్- గిల్ ఇకపై మరి కాస్త కఠినంగా ఉండవచ్చు. డ్రెసింగ్రూమ్లో తన ఐడియాలను బలంగా వినిపించవచ్చు.చాలా ఏళ్లుగా అత్యంత గొప్పగా.. సేవలు అందిస్తున్న సీనియర్లు వచ్చే పదహారు నెలల్లో జట్టులో తమ పాత్ర ఏమిటన్న అంశం గురించి గంభీర్తో కాకుండా నేరుగా యాజమాన్యంతో చర్చిస్తున్నారు. తమ భవితవ్యంపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: వాళ్లకే దిక్కులేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? -
చతికిలపడ్డ బాలీవుడ్ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్!
భారత క్రికెట్ ముఖచిత్రంలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న విరాట్ కోహ్లీ ఆసియా ఖండంలో అది పెద్ద స్టార్ క్రీడాకారుడిగా పేరు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ తర్వాత అంతటి పేరు సంపాదించిన కోహ్లీ ఫిట్నెస్, రికార్డులపై నిత్యం ప్రశంసల వెల్లువ కురుస్తూనే ఉంటుంది. 20 ఏళ్లుగా క్రికెట్ ఆడుతూ అసామాన్యమైన స్టార్డమ్ను పొందిన కోహ్లీ తాజాగా తన బ్రాండ్ పవర్ను మరోసారి చాటుకున్నాడు.భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా అగ్రస్థానంలో నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా, గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్బ్రాండ్ సంయుక్తంగా తొలిసారి విడుదల చేసిన 'మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీస్' ర్యాంకింగ్స్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్ బ్రాండ్ విలువను ఏకంగా రూ.3,542 కోట్లుగా లెక్కగట్టడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలవగా, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.క్రికెటర్ల ఆధిపత్యంఈ ర్యాంకింగ్స్లో క్రికెటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. టాప్ 10 జాబితాలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ధోనీ కూడా చోటు సంపాదించారు. కేవలం సంపాదన, ప్రఖ్యాతి ఆధారంగా కాకుండా.. ఒక సెలబ్రిటీకి ఉన్న విశిష్టత, అభిమానులతో అనుబంధం, సామాజిక బాధ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను నిర్ణయించారు. వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడంలో, బ్రాండ్లపై నమ్మకాన్ని పెంచడంలో సెలబ్రిటీల పాత్రను ఈ అధ్యయనం విశ్లేషించింది.విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడానికి పలు కారణాలు దోహదం చేశాయి. ప్యూమా, ఆడీ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు, ఫిట్నెస్ ఐకాన్గా ఆయనకున్న ఇమేజ్, ఇన్స్టాగ్రామ్లో 270 మిలియన్లకు పైగా ఉన్న భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆయన బ్రాండ్ విలువను అమాంతం పెంచాయి. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించచడంలో కీలక పాత్ర పోషించడం, ఫైనల్లో 42 బంతుల్లో 75 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడం కోహ్లీ మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. అయితే ఆఫ్గన్తో వన్డే సిరీస్కు కోహ్లీని ఎంపిక చేసినప్పటికీ, గాయం వల్ల అతడు జట్టుకు దూరమయ్యాడు.చదవండి: సెలెక్షన్ కమిటీపై భువనేశ్వర్ సంచలన వ్యాఖ్యలు! -
వాళ్లకే దిక్కులేదు!.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?
టీమిండియా సెలక్టర్ల తీరుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు.. ఆసియా క్రీడలు-2026 టోర్నీకి ప్రకటించిన టీ20 జట్టులో అర్హులకు చోటు దక్కలేదని మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లు కేవలం హెడ్కోచ్ గౌతం గంభీర్ వల్లే జట్టులో ఉన్నారని పెదవి విరుస్తున్నారు.ఇంతకంటే ఇంకేం చేయాలి?గత రెండేళ్లుగా ఐపీఎల్లో సత్తా చాటుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి వరుసగా రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్ (Rajat Patidar)ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. భారత టీ20 జట్టులో పాటిదార్కు చోటిచ్చేందుకు ఆస్కారం లేదని పేర్కొన్నాడు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్-2026 గెలిచిన జట్టు నుంచి చాలా మందిని తప్పించారని.. పాటిదార్ కోసం ఈ సంఖ్యను మరింత పెంచలేరని పేర్కొన్నాడు.ఆవేదన అర్థం చేసుకోగలను!.. కానీఈ మేరకు.. ‘‘భారత టీ20 జట్టులో రజత్ పాటిదార్ ఎందుకు లేడు? అతడు కచ్చితంగా జట్టులో ఉండాలి కదా!.. ఇంతకంటే గొప్పగా ఏ ఆటగాడైనా ఏం చేయగలడు?.. చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు.భజ్జీ (హర్భజన్ సింగ్) కూడా ఇలాగే ట్వీట్ చేశాడు. భజ్జీతో నేనూ ఏకీభవిస్తాను. అందరి మనసుల్లోనూ ఇదే భావన ఉంది. అర్హుడైనా అతడికి స్థానం దక్కలేదన్న ఆవేదనను నేనూ అర్థం చేసుకోగలను.అయితే, ఇక్కడ భావోద్వేగాల కంటే కూర్పుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రజత్ పాటిదార్కు చోటివ్వాలంటే ఎవరో ఒకరిని తీసేయాల్సి ఉంటుంది. మరి అతడి కోసం ఎవరిని బలి చేయాలంటారు?వాళ్లకే దిక్కులేదు.. అతడికి చోటు ఎలా?ప్రపంచకప్ గెలిచిన జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పైనే వేటు వేశారు. అతడితో పాటు రింకూ సింగ్నూ తప్పించారు. వీరిద్దరి స్థానంలో కొత్త సారథిగా శ్రేయస్ అయ్యర్, ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వచ్చారు.ఇంతకంటే ఇంకెన్ని మార్పులు చేయాలి? ప్రపంచకప్ గెలిచిన జట్టు నుంచి ఇంకెంత మంది సభ్యులను నిర్దాక్షిణ్యంగా తప్పించాలి?’’ అని ఆకాశ్ చోప్రా విమర్శకులను ప్రశ్నించాడు.సారథిగా సరైనోడుఏదేమైనా శ్రేయస్ అయ్యర్ సారథిగా సరైనోడని.. అందుకే మూడేళ్ల తర్వాత ఏకంగా కెప్టెన్గా టీ20 జట్టులో పునరాగమనం చేశాడని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్ గెలిచిన 35 ఏళ్ల సూర్యతో పాటు రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్లపై సెలక్టర్లు వేటు వేశారు.మరోవైపు.. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. అయితే, బుమ్రాను ఆసియా క్రీడల జట్టుకు మాత్రం ఎంపిక చేశారు. కొత్తగా శ్రేయస్ అయ్యర్తో పాటు యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రాగా.. రవి బిష్ణోయి, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్లకు కూడా చోటు దక్కింది.చదవండి: ‘అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో చోటు దండగ’ -
సెలెక్షన్ కమిటీపై భువనేశ్వర్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా వెటరన్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ తనను జాతీయ జట్టకు ఎంపిక చేయకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను ఎంపిక చేయాలని ఎవరిని అడుక్కోనని, టాలెంట్ను గుర్తించి జట్టులోకి ఎంపిక చేస్తే ఆడుతానంటూ భువీ కుండబద్దలు కొట్టాడు. టీమిండియాకు చాలాకాలం క్రితమే దూరమైన 36 ఏళ్ల భువనేశ్వర్ ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆర్సీబీ తరఫున ఆడిన భువనేశ్వర్ 28 వికెట్లతో అదరగొట్టాడు. తద్వారా ఆర్సీబీ వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో భువనేశ్వర్ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఇటీవలే ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆసియా గేమ్స్కు సంబంధించి టీమిండియా జట్లను ప్రకటించిన బీసీసీఐ భువనేశ్వర్కు మరోసారి మొండిచేయి చూపించింది. అయితే రెస్ట్ పేరుతో సిరాజ్ను ఈ టోర్నీల నుంచి తప్పించడంతో భువీ పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. కానీ అనూహ్యంగా సిరాజ్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో భువనేశ్వర్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే బుధవారం భువనేశ్వర్ కుమార్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇంటర్య్వూ ఇచ్చాడు. 'నేను టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. కానీ నా మనసులో ఉన్న మాటలను బయటపెట్టకపోవడం నా నైజం. ప్రతీ ఒక్కరు తమ పని తాము చేస్తున్నట్లే నా పని నేను చేస్తున్నా. బీసీసీఐ సెలెక్టర్లు కూడా వారి పని చేస్తున్నారు. ఎంపిక చేయడం, చేయకపోవడం వారి బాధ్యత. నేను సరిపోతానని భావిస్తే, వాళ్లే ఎంపిక చేస్తారు. నన్ను ఎంపిక చేయమని ఎవరిని అడగను. టీమిండియా తరఫున ఆడాలనే కోరిక ఇప్పటికీ నాలో బలంగా ఉంది. నేను మెరుగైన ప్రదర్శన చేస్తున్నా. టీమిండియా తరఫున ఆడడాన్ని ఇప్పటికీ ఒక అదృష్టంగానే భావిస్తాను.' అని ముగించాడు.టీమిండియాకు ఎంతోకాలం ఫ్రంట్లైన్ బౌలర్గా సేవలందించిన భువనేశ్వర్ 2022లో టీమిండియా తరఫున చివరిసారి ఆడాడు. నేపియర్లో న్యూజిలాండ్తో జరిగిన టీ20 మ్యాచ్ భువీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్కు పరిమితమైన తర్వాత సీనియర్లను పక్కనబెట్టి, యువ బౌలర్లకు అవకాశం ఇచ్చేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపింది. దీంతో భువనేశ్వర్ కుమార్ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో 2018లోనే భువీ టెస్టు కెరీర్ ముగిసిపోయింది. మరి ఈ లెక్కన భువనేశ్వర్ మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడా అంటే చెప్పడం కష్టమే. 36 ఏళ్ల వయసులోనే తన బౌలింగ్లో పదును తగ్గని భువనేశ్వర్ను ఆడించాలనుకుంటే మాత్రం ఇదే మంచి అవకాశం. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులో చాలా మార్పులు జరగనున్నాయి. రోహిత్, కోహ్లీ, జడేజా వంటి క్రికెటర్లు వీడ్కోలు పలికే అవకాశముంది. ఇప్పటికే ఐపీఎల్ పుణ్యమా అని ప్రిన్స్యాదవ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రానా వంటి బౌలర్లు రేపటి భారత బౌలింగ్ భవిష్యత్తుకు ఆశాకిరణంలా కనిపిస్తున్నారు.చదవండి: స్టోక్స్పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్? -
పాక్ జట్టు ప్రకటన.. బీసీసీఐ అలా.. పీసీబీ ఇలా!
ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. సల్మాన్ ఆఘాను తప్పించి అతడి స్థానంలో సాహిబ్జాదా ఫర్హాన్కు సారథిగా పగ్గాలు అప్పగించింది.స్టార్లు లేకుండానే...ఆసియా క్రీడల్లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాహిన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్ తదితరుల పేర్లు కనిపించలేదు. సల్మాన్ సహా వీరందరికీ విశ్రాంతినివ్వాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.కొత్త ముఖాలకు చోటుఈ క్రమంలోనే పాక్ ఫర్హాన్ కెప్టెన్సీలో ద్వితీయ శ్రేణి జట్టును ఆసియా క్రీడలకు పంపనుంది. ఈ ఈవెంట్లో ఫర్హాన్కు డిప్యూటీగా అబ్దుల్ సమద్ వ్యవహరించనున్నాడు. ఇక ఇంతవరకు అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయని ఆకిఫ్ జావేద్, అలీ రెజా, మాజ్ సదాకత్, సాద్ మసూద్లకు కూడా సెలక్టర్లు ఆసియా క్రీడల జట్టులో చోటిచ్చారు.పీసీబీ ఇలా.. బీసీసీఐ అలామరోవైపు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం ఆసియా క్రీడలకు పూర్తిస్థాయి జట్టును పంపేందుకు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన జట్టును ఇటీవలే ప్రకటించింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ఈ జట్టుకు ఎంపిక చేసింది.ముఖాముఖి పోరు ఉంటుందా?కాగా లీగ్ దశలో భారత్- పాకిస్తాన్ తలపడే పరిస్థితి లేకపోవచ్చు. అయితే, సెమీస్ లేదంటే ఫైనల్లో దాయాదులు ముఖాముఖి ఎదురుపడే అవకాశం ఉంది. ఇటీవల ఆసియా కప్-2026, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీల్లో భారత్ చేతిలో పాక్ మరోసారి భంగపడ్డ సంగతి తెలిసిందే.ఆసియా కప్లో ఫైనల్ చేరినప్పటికీ.. వరల్డ్కప్ టోర్నీలో కనీసం సెమీస్ కూడా చేరకుండానే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల్లో పూర్తిస్థాయి జట్టును కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును పీసీబీ రంగంలోకి దించడం విశేషం.తొలిసారి సారథిగాఇదిలా ఉంటే.. 30 ఏళ్ల సాహిబ్జాదా ఫర్హాన్ ఇప్పటి వరకు పాకిస్తాన్ తరఫున 46 టీ20 మ్యాచ్లు ఆడాడు. రెండు శతకాలు, పది అర్ధ శతకాల సాయంతో 1305 పరుగులు సాధించాడు. ఆసియా క్రీడల సందర్భంగా తొలిసారిగా పాక్ జట్టు కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు.కాగా సెప్టెంబరు 19- అక్టోబరు 4 వరకు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు- 2026 జరుగనున్నాయి. ఇక క్రికెట్ పోటీలను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. కాగా 2023లో బీసీసీఐ తొలిసారిగా పురుష, మహిళా జట్లను ఆసియా క్రీడలకు పంపగా.. రుతురాజ్ గైక్వాడ్, హర్మన్ప్రీత్ కౌర్ల సారథ్యంలో భారత్ రెండు విభాగాల్లోనూ పసిడి పతకాలు సాధించింది.ఆసియా క్రీడలకు పాక్ జట్టుసాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అబ్దుల్ సమద్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, అకీఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్ మిన్హాస్, హైదర్ అలీ, హసన్ నవాజ్, మాజ్ సదాకత్, సల్మాన్ మీర్జా, సాద్ మసూద్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), సుఫీయాన్ ముకీమ్.చదవండి: ‘అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో దండగ’ -
స్టోక్స్పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్?
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, సహచర బౌలర్ గస్ అట్కిన్సన్లు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బోర్డు అనుమతి లేకుండా నైట్క్లబ్కు వెళ్లిన స్టోక్స్, అట్కిన్సన్ ఫూటుగా తాగి బీర్బాటిళ్లు విసిరేసి అపరిచితులపై దాడి చేశారు. దీంతో జట్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు న్యూజిలాండ్తో రెండో టెస్టుకు వీరిద్దరిని సస్పెండ్ చేసే అవకాశముంది. స్టోక్స్, అట్కిన్సన్పై చర్యలు తీసుకోవడానికి ముందు మరింత సమాచారం సేకరిస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. సమాచార సేకరణలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఈసీబీ పేర్కొంది. ఈసీబీ తెలిపిన ప్రకారం.. స్టోక్స్ దాడి చేయడానికి ముందే రగ్బీ ఆటగాడు, 21 ఏళ్ల టోటోవా ఔవా స్టోక్స్, అట్కిన్సన్లపై పిడిగుద్దుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. టోటోవా ఔవాను కించపరిచే విధంగా స్టోక్స్ మాట్లాడాడని, ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నైట్క్లబ్లోనే స్టోక్స్, అట్కిన్సన్లతో టోటోవా ఔవాతో పాటు అతడి సహచరులు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టోక్స్ను కిందపడేసి టోటోవా పిడి గుద్దులు కురిపించాడు. అడ్డువచ్చిన అట్కిన్సన్ను కూడా చితకబాదాడు. అయితే గొడవ పతాక స్థాయికి చేరడంతో బౌన్సర్లు వారందరిని బయటికి పంపించేశారు. అయితే బయటికి వచ్చాకా స్టోక్స్, అట్కిన్సన్లు తమ వద్ద ఉన్న బీర్ బాటిళ్లను విసిరి టోటోవా అనుచరులను కిందపడేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడడం వీడియోలో బయటపడింది. ఈ దాడికి ముందే టోటోవా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఈసీబీ తెలిపింది. ఈ సమాచారం మొత్తం తమకు నైట్క్లబ్ సీసీటీవీ ఫుటేజీలో దొరికిందని వెల్లడించిన ఈసీబీ.. స్టోక్స్, అట్కిన్సన్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ స్టోక్స్పై వేటు పడితే కివీస్తో రెండో టెస్టుకు హ్యారీ బ్రూక్ జట్టును నడిపించనున్నాడు.ఎవరీ టోటోవా?ఇంగ్లండ్ క్రికెటర్ స్టోక్స్పై పిడిగుద్దుల వర్షం కురిపించిన టోటోవా ఔవా ఎవరని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. రగ్బీ ప్లేయర్ అయిన టోటోవా సరసెన్స్ అకాడమీలో రగ్బీ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఇప్పటివరకు రగ్బీ మ్యాచ్ ఆడలేదు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 125 కిలోల బరువుతో బాహుబలి రూపంతో ఆకర్షిస్తున్నాడు. స్టోక్స్తో గొడవపడిన టోటోవా ఔవా రాత్రికిత్రే స్టార్ అయి పోయాడు.Ben Stokes, the real street fighter 😭 waiting for the new fight video pic.twitter.com/iK0at0nSvg— Santoshvk18 (@269signofff) June 8, 2026చదవండి: మళ్లీ గాయపడిన పాండ్యా.. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరం! -
మళ్లీ గాయపడిన పాండ్యా.. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరం!
అప్గానిస్తాన్తో మూడు వన్డేల సిరీస్కు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో దూరమయ్యాడు. అయితే మంగళవారమే రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా తమ ఫిట్నెస్ను నిరూపించుకొని క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందినట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఈ ఇద్దరు ఆడుతారని బీసీసీఐ తెలిపింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. రీఎంట్రీ కోసం సీవోఈలో శిక్షణ తీసుకుంటున్న పాండ్యా బౌలింగ్ వేస్తున్న క్రమంలో అతడి కాలు బెణికినట్లు సమాచారం. దీంతో అతడు కోలుకోవడానికి మరో రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయం కావడంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని మెడికల్ టీమ్ వెల్లడించింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్కు పాండ్యా దూరమైనట్లే. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక సీవోఈ నుంచి క్లియరెన్స్ పొందిన రోహిత్ శర్మ మాత్రం ఆఫ్గన్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో పాండ్యా వెన్నునొప్పికి గురయ్యాడు. దీంతో సీజన్ ఆఖర్లో ముంబై జట్టుకు దూరమైన పాండ్యా నేరుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి చేరుకున్నాడు. పాండ్యా కోలుకొని ఫిట్నెస్ క్లియరెన్స్ కూడా సాధించడంతో అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఈ ఆల్రౌండర్ మళ్లీ గాయానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో చీలమండ గాయంతో పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా తన చివరి వన్డే మ్యాచ్ను 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి పాండ్యా వరుస గాయాలతో సతమతమవుతూనే వస్తున్నాడు.చదవండి: మెస్సీ విజృంభణ.. అర్జెంటీనా ఘన విజయం -
మెస్సీ విజృంభణ.. అర్జెంటీనా ఘన విజయం
ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ముందు డిపెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ చివరి వార్మప్ మ్యాచ్లో అదరగొట్టింది. అలబామా వేదికగా ఐస్లాండ్తో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. తన చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ వార్మమ్ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. మే 24న ఇంటర్ మియామి తరఫున ఆడుతూ కండరాల గాయానికి గురైన మెస్సీ పూర్తిగా కోలుకున్నాడు. ఐస్లాండ్తో మ్యాచ్లో పూర్తి స్థాయి ఫిట్నెస్తో కనిపించిన మెస్సీ కేవలం 20 నిమిషాల పాటే గ్రౌండ్లో ఉన్నాడు. కానీ తాను ఆడిన 20 నిమిషాల్లోనే రెండు కీలక పాస్లు సహా ఒక గోల్ చేయడం విశేషం. ఆట విషయానికొస్తే తొలి హాఫ్ ముగుస్తుందనగా మైదానంలో అడుగుపెట్టిన మెస్సీ అందించిన కీలక పాస్తో లారో మార్టినేజ్ గోల్పోస్ట్లోకి బంతిని తరలించాడు. దీంతో తొలి హాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరో 10 నిమిషాల్లో రెండో హాఫ్ ముగుస్తుందనగా మళ్లీ మైదానంలోకి వచ్చిన మెస్సీ ఈసారి తానే స్వయంగా గోల్ చేశాడు. మార్టినేజ్ అందించిన పాస్ను ఎలాంటి తప్పు చేయకుండా బంతిని గోల్పోస్ట్లోకి పంపించి మెస్సీ తన కెరీర్లో 117వ గోల్ సాధించాడు. దీంతో అర్జెంటీనా 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత అర్జెంటీనా మూడో గోల్ కొట్టడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు. మెస్సీ ఇచ్చిన పాస్ను అందుకున్న రోడ్రిగో డి పాల్ దానిని థియాగో అల్మాడాకు పాస్ చేయగా, అతడు బంతిని నేరుగా గోల్పోస్ట్లోకి కొట్టాడు. దీంతో అర్జెంటీనా 3-0తో ఐస్లాండ్పై విజయం సాధించింది. ఈ విజయంతో వార్మప్ మ్యాచ్లను ముగించిన మెస్సీ సేన ఫిఫా ప్రపంచకప్లో తమ తొలి మ్యాచ్ను జూన్ 16న అల్జీరియాతో ఆడనుంది. గ్రూప్-జెలో ఉన్న అర్జెంటీనా ఆ తర్వాత ఆస్ట్రియా, జోర్డాన్లను ఎదుర్కోనుంది.చదవండి: గెలిచామన్న గర్వం.. రెచ్చిపోయిన బంగ్లా బౌలర్! -
గెలిచామన్న గర్వం.. రెచ్చిపోయిన బంగ్లా బౌలర్!
బంగ్లాదేశ్ తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత ఆసీస్ను మట్టికరిపించిన బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే గెలిచామన్న గర్వమో లేక పొగరో తెలియదు కానీ బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రానా ఆస్ట్రేలియా కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ను స్లెడ్జింగ్ చేయడం మ్యాచ్లో హాట్టాపిక్గా మారింది. విషయంలోకి వెళితే.. 285 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ గోల్డెన్ డక్గా వెనుదిరగ్గా, మార్నస్ లబుషేన్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో కూపర్కు జత కలిసిన ఇంగ్లిస్ ఆసీస్ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. వీరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో నహీద్ రానా 11వ ఓవర్లో బౌలింగ్కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఇంగ్లిస్ను పెవిలియన్ చేర్చాడు. ఔట్సైడ్ అయిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో ఇంగ్లిస్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇంగ్లిస్ పెవిలియన్ వైపు వెళుతున్న తరుణంలో నహీద్ రానా అతడిని ఉద్దేశించి ఏదో అన్నాడు. ఇది విన్న ఇంగ్లిస్ నేరుగా నహీద్ రానావైపు దూసుకొచ్చి ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బంగ్లా కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ ఇంగ్లిస్ను అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఆ తర్వాత నహీద్ రానా వద్దకు వచ్చిన మెహదీ హసన్.. ఎమోషన్ కంట్రోల్ చేసుకో అని అనడం స్టంప్ మైక్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడాడు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. డక్వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు. Big Wicket for Bangladesh! Josh Inglis departs. Caught by Litton Das, bowled by Nahid Rana! pic.twitter.com/waRZRvW6mX— Bangladesh Cricket (@BCBtigers) June 9, 2026చదవండి: 'అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
'అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ'
హైదరాబాదీ, తెలుగు తేజం తిలక్ వర్మ భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ స్ధానంలో ఆ బాధ్యతలను తిలక్కు బీసీసీఐ అప్పగించింది. ఇకపై టీ20ల్లో శ్రేయస్ అయ్యర్కు డిప్యూటీగా అతడు వ్యవహరించున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఏషియన్ గేమ్స్కు జట్టు ఎంపిక సందర్బంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించడాన్ని భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. అదేవిధంగా ఐపీఎల్-2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ను ఎందుకు జట్టులో తీసుకోలేదని అతడు సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు."తిలక్ వర్మకు కెప్టెన్గా అసలు అనుభవమే లేదు. అదేవిధంగా అతడు ఫామ్లో కూడా లేడు. అతడికి భారీ షాట్లు ఆడే సత్తా సైతం లేదు. పాటిదార్ లాగా బౌలర్లను టార్గెట్ చేయలేడు. గత రెండు మూడు ఐపీఎల్ సీజన్ల నుంచి తిలక్ వర్మ ఆశించినంత మేర రాణించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లోనూ నిరాశపరిచాడు.అయినప్పటికి వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. మరోవైపు భారత టీ20 జట్టులో వాషింగ్టన్ సుందర్కు చోటు దక్కే అర్హత లేదు. అతడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున బౌలింగ్ కూడా చేయలేదు. కేవలం మిడిలార్డర్ బ్యాటర్గా ఆడాడు. టీమిండియాలో కూడా అతడు రెగ్యులర్గా బౌలింగ్ చేయడం లేదు. అలాంటప్పుడు అతడిని ఒక ఆల్రౌండర్గా ఎలా జట్టులోకి తీసుకున్నారో సెలక్టర్లకే తెలియాలి. అతడి స్ధానంలో పాటిదార్ను ఎంపిక చేయాల్సిందని" శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: అతడి కంటే భువీ ఎంతో బెటర్.. సెలక్టర్లు తప్పు చేశారు!? -
నాలుగేళ్ల విరామం.. 90 నిమిషాల్లో విజయం
నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. తన రీఎంట్రీ మ్యాచ్లో అదరగొట్టింది. క్వీన్స్ క్లబ్ ఛాంపియన్షిప్-2026 టోర్నీలో విక్టోరియా మ్బోకోతో(కెనడా) కలిసి ఆడిన సెరెనా, మహిళల డబుల్స్ మొదటి రౌండ్లో అద్భుతమైన విజయం సాధించింది. ఈ జోడీ మూడవ సీడ్ జంట అయిన ఎరిన్ రౌట్లిఫ్ (న్యూజిలాండ్), నికోల్ మెలిచార్-మార్టినెజ్ (అమెరికా)లపై వరుస సెట్లలో 7-6 (7-2), 6-2 తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్ కేవలం 90 నిమషాల్లో ముగిసిపోయింది.ఏజ్ గ్యాప్ 25 ఏళ్లు.. అయినా అద్భుత విజయంకాగా 44 ఏళ్ల సెరెనా విలియమ్స్, 19 ఏళ్ల విక్టోరియా మ్బోకోల మధ్య వయసు వ్యత్యాసం ఏకంగా 25 సంవత్సరాలు. అయినప్పటకి ఈ ద్వయం అద్భుతమైన సమన్వయంతో ప్రత్యర్ధి జంటను చిత్తు చేసింది. కాగా 2022 యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్కు బ్రేక్ ఇస్తున్నట్లు సెరెనా ప్రకటించింది.అయితే ఇటీవల తన మనసు మార్చుకున్న ఆమె తిరిగి కోర్ట్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటి ప్రొఫెషనల్ మ్యాచ్. వైల్డ్కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమె ఈ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది. సెరెనా కెరీర్లో మొత్తం 39 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. ఇందులో 23 మహిళల సింగిల్స్, 14 మహిళల డబుల్స్, రెండు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ ఉన్నాయి. -
అతడి కంటే భువీ ఎంతో బెటర్.. సెలక్టర్లు తప్పు చేశారు!?
ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ల కోసం ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో కీలక మార్పు చోటు చేసింది. ఈ టీ20 సిరీస్ల నుంచి స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 'వర్క్లోడ్ మేనేజ్మెంట్'లో భాగంగా సిరాజ్కు విశ్రాంతినిచ్చినట్లు బోర్డు తెలిపింది. అతడి స్ధానంలో కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణను జట్టులో తీసుకున్నారు. అయితే సిరాజ్ స్ధానాన్ని ప్రసిద్ద్ కృష్ణతో భర్తీ చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు.అతడికి బదులుగా వెటరన్ భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేయాల్సిందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రసిద్ద్తో పోలిస్తే భువీ ఎంతో బెటర్ అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. భువనేశ్వర్ నవంబర్ 2022 నుంచి భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ, డొమెస్టిక్ క్రికెట్తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు.ఇటీవల ముగిసిన ఐపీఎల్ 19వ సీజన్లో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 16 మ్యాచ్లలో 28 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ టీ20ల్లో కూడా ఈ యూపీ ఫాస్ట్ బౌలర్కు మంచి రికార్డు ఉంది. 87 మ్యాచ్లు ఆడి 6.96 ఎకానమీ రేట్తో 90 వికెట్లు పడగొట్టాడు. 36 ఏళ్ల భువీ ఇప్పటికి కొత్త బంతితో అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. ఈ ఆర్సీబీ పేసర్ ప్రస్తుతం యువ క్రికెటర్ల కంటే ఫిట్గా కనిపిస్తున్నాడు. దీంతో అతడిని తిరిగి జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినప్పటికి సెలక్టర్లు మాత్రం అతడి పేరును పరిగణలోకి తీసుకోవడం లేదు.ప్రసిద్ద్ కృష్ణ విషయానికి వస్తే.. టెస్ట్, వన్డేల్లో టీమిండియా తరపున కాస్త ఫర్వాలేదనిపించినప్పటికి, టీ20ల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి కేవలం 8 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2026 సీజన్లోనూ ఆశించినంత మేర రాణించలేకపోయాడు.ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ , శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ సింగ్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.చదవండి: ‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’ -
యువ జోరు...
నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో సత్తా చాటుకొని విశ్వవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాలని ఆయా జట్ల క్రీడాకారులు తాపత్రయపడుతుంటారు. ప్రతీ ప్రపంచకప్ కొందరిని హీరోలుగా చేస్తుంది. మరికొందరిని జీరోలుగా చేస్తుంది. ప్రపంచకప్ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాత్రికి రాత్రే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎందరో యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం సూపర్ స్టార్స్గా మారిన మెస్సీ, రొనాల్డో, నెమార్, ఎంబాపె, మోడ్రిచ్ తదితరులు ఈ దశను దాటి వచ్చినవాళ్లే. రేపటి నుంచి అమెరికా, కెనడా, మెక్సికోలలో మొదలయ్యే 23వ ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలోనూ పలువురు యువ ఆటగాళ్లు తమ విన్యాసాలతో అలరించేందుకు సై అంటున్నారు. ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నాడు స్పెయిన్కు చెందిన 18 ఏళ్ల లామినె యామల్. రెండేళ్ల క్రితం యూరో టోర్నీలో స్పెయిన్కు నాలుగోసారి టైటిల్ దక్కడంలో యామల్ కీలకపాత్ర పోషించాడు. తాజా ప్రపంచకప్లో యామల్ మెరిపిస్తే స్పెయిన్ టైటిల్ ఫేవరెట్గా మారుతుందనడంలో సందేహం లేదు. డిఫెండర్లను బోల్తా కొట్టించడంలో... సహచరులకు సమయస్ఫూర్తితో పాస్లు అందించడంలో... సుదూరం నుంచి గోల్పోస్ట్ లక్ష్యంగా కళ్లు చెదిరే కిక్లు కొట్టడంలో యామల్కు తిరుగులేదు. ఐదుసార్లు విజేత బ్రెజిల్ జట్టు తరఫున స్టార్ నెమార్ చివరిసారి ప్రపంచకప్లో ఆడుతుండగా... అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాడు 18 ఏళ్ల ఎస్టవో విలియన్. అభిమానులు ఇప్పటి నుంచే విలియన్ను ‘న్యూ నెమార్’గా పిలుస్తున్నారు. డిఫెన్స్ను ఛేదించి గోల్స్ కొట్టడంలో విలియన్కు మంచి పేరుంది. అర్జెంటీనా జట్టు కెప్టెన్ మెస్సీ రిటైరైనా ఆ జట్టు భవిష్యత్కు ఢోకా లేదని 18 ఏళ్ల ఫ్రాంకో మస్తాంటువానో తన ఆటతీరుతో భరోసా కల్పిస్తున్నాడు. వరుసగా రెండోసారి అర్జెంటీనా ప్రపంచకప్ టైటిల్ నెగ్గాలంటే మెస్సీతోపాటు ఫ్రాంకో ఆటతీరు కూడా కీలకం కానుంది. వరుసగా మూడోసారి ఫ్రాన్స్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశాలు సీనియర్ స్టార్స్ ఎంబాపె, డెంబెలె, 19 ఏళ్ల డిసిర్ డుయు ఆటతీరుపై ఆధారపడి ఉంది. ఇటీవల యూరో చాంపియన్స్ లీగ్ టైటిల్ నిలబెట్టుకున్న పీఎస్జీ జట్టుకు డిసిర్ డుయు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీరితోపాటు గిల్బెర్టో మోరా (మెక్సికో), ఇబ్రహీం ఎంబాయె (సెనెగల్), నికో పాజ్ (అర్జెంటీనా), అర్దా లెర్ (టర్కీ), పౌ కుబార్స్ (స్పెయిన్), యాన్ డియోమండె (ఐవరీకోస్ట్), ఆండ్రీ సాంతోస్ (బ్రెజిల్), ఎండ్రిక్ (బ్రెజిల్), ఆంటోనియో నూసా (నార్వే) కూడా సంచలన ప్రదర్శనతో మెరిపించే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి క్రీడా విభాగం -
ఓటమి అంచుల నుంచి...
దంబుల్లా: 278 పరుగుల లక్ష్యఛేదనలో 47 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక ‘ఎ’ జట్టు 261/6తో నిలిచింది. ఆ జట్టు విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండగా... చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ సహాన్ (72 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో జోరు మీదున్నాడు. ఇంకేముంది ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంక ‘ఎ’ జట్టు విజయం సాధించడం తథ్యమే అనుకుంటే... అక్కడే భారత ‘ఎ’ బౌలర్లు అద్భుతం చేశారు. 48వ ఓవర్లో 7 పరుగులు ఇ చ్చిన అన్షుల్ కంబోజ్... ప్రత్యర్థి కెప్టెన్ను అవుట్ చేయగా... అర్షద్ ఖాన్ వేసిన 49వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక ‘ఎ’ జట్టు 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (114 బంతుల్లో 101; 6 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ ( 97 బంతుల్లో 60; 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14; 3 ఫోర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (2) విఫలమయ్యారు. భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్లో వైభవ్... ఐపీఎల్ జోరు కనబర్చలేకపోయాడు. ప్రియాన్ష్ ఆర్య (32; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆయుశ్ బదోనీ (24; 2 ఫోర్లు), సూర్యాన్ష్ షెడ్గె (26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) తలా కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్లలో షిరాజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో లంక 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. సహాన్తో పాటు డికెవెల్లా (47), అవిష్క(45), సదీరా సమరవిక్రమ (46) రాణించారు. అయితే చివర్లో ఒత్తిడిని అధిగమించడంలో సఫలమైన భారత జట్టును విజయం వరించింది. భారత ‘ఎ’ బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోనీ, విప్రాజ్ నిగమ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. గురువారం జరగనున్న రెండో లీగ్ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడనుంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో హరిహరన్–అర్జున్ జోడీ
సిడ్నీ: ఆ్రస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హరిహరన్–ఎంఆర్ అర్జున్ (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో హరిహరన్–అర్జున్ ద్వయం 21–13, 21–13తో ఆర్డెన్ క్వాన్ లీ–స్టాన్లీ జింగ్ (అమెరికా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో డబుల్స్ మ్యాచ్లో దొడ్డవరపు అచ్యుతాదిత్య రావు–పోచాన అర్జున్ రెడ్డి (భారత్) జోడీ 15–21, 15–21తో ఇగావా–ఊయ్ యి హెర్న్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లో భారత ప్లేయర్ సనీత్ దయానంద్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సనీత్ 21–17, 21–15తో కరోనో (ఆస్ట్రేలియా)పై, రెండో రౌండ్లో 21–9, 21–16తో మింగ్ హాంగ్ లిమ్ (మలేసియా)పై గెలిచాడు. భారత్కే చెందిన మన్రాజ్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో 11–21, 18–21తో ఇగోని ఇవి (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. -
నైట్క్లబ్ వివాదం.. స్టోక్స్ కెరీర్కు ఎండ్ కార్డ్..?
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై సంచలన ప్రచారం జరుగుతోంది. తాజాగా న్యూజిలాండ్పై లార్డ్స్ టెస్టులో ఘన విజయం సాధించిన తర్వాత స్టోక్స్, సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్ జట్టు నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి కర్ఫ్యూ సమయంలో ఓ నైట్క్లబ్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వారు ఫుల్లుగా తాగి ఓ రగ్బీ ఆటగాడిపై దాడి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ వివాదం తర్వాత స్టోక్స్ తన కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 'ది క్రికెటర్' సీనియర్ జర్నలిస్ట్ జార్జ్ దోబెల్ ప్రకారం.. అతడు స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ కూడా ప్రకటించవచ్చు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.ఇదిలా ఉంటే, నైట్క్లబ్ ఘటనలో స్టోక్స్, అట్కిన్సన్ ఎవరిపై దాడికి పాల్పడలేదని ECB వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తప్పకపోవచ్చు. స్టోక్స్కు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ పీకల దాకా తాగి రచ్చ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. గతేడాది నవంబర్లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే నైట్క్లబ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్కు ముందు వెల్లింగ్టన్లోని ఓ నైట్క్లబ్కు వెళ్లిన బ్రూక్, అక్కడ బౌన్సర్తో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇంగ్లండ్ భవిష్యత్తు ఆశాకిరణం జేకబ్ బెథెల్తో కలిసి సదరు బౌన్సర్పై దాడి చేశాడు. అయితే దాడి పెద్దది కాకపోవడంతో ఈసీబీ వారిద్దరిని మందలింపుతో సరిపెట్టింది. -
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం
ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (జూన్ 9) జరిగిన తొలి మ్యాచ్లో 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్వర్త్ లూయిస్) సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది.ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన తాజా మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. తౌహిద్ హృదోయ్ (31), తస్కిన్ అహ్మద్ (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ (10-1-38-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. లియామ్ స్కాట్, మ్యాట్ రెన్షా తలో 2 వికెట్లతో పర్వాలేదనిపించారు. బార్ట్లెట్కు ఓ వికెట్ దక్కింది.లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. బ్యాటింగ్లో సత్తా చాటిన మొసద్దెక్ (10-1-37-2) బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (5.2-0-24-2), తస్కిన్ (5-0-28-1) కూడా రాణించారు. -
గైక్వాడ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపు
శ్రీలంకలో జరుగుతున్న ఏ-జట్ల ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఇవాళ (జూన్ 9) జరిగిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (101) సూపర్ సెంచరీతో, కెప్టెన్ తిలక్ వర్మ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో ఆయుశ్ బదోని (24), సూర్యాంశ్ షేడ్గే (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో అలరించారు. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్మ 32, ప్రభ్సిమ్రన్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 1 (నాటౌట్) పరుగు చేయగా.. ఐపీఎల్ 2026 తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు తీయగా.. కరుణరత్నే, సంకేత్, వనుజ సహాన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో (7 పరుగుల వ్యవధిలో) కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్ రాయ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టింది. జూన్ 11న జరిగే తదుపరి మ్యాచ్లో భారత్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ తలపడనున్నాయి. -
వైభవ్ నిర్దయగా సిక్సర్లు బాదాడు!.. ఇదే కొనసాగితే కష్టం!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయిందని.. ఇదే కొనసాగితే పొట్టి ఫార్మాట్ ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డాడు.గతేడాది కాలంగా రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. పద్నాలుగేళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ (35)తో కదంతొక్కిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఏడాది ఏకంగా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.ఆరెంజ్ క్యాప్ విజేతఐపీఎల్-2026లో మొత్తంగా పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్తో పాటు మరెన్నో బహుమతులు గెలుచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబడ వంటి స్టార్ బౌలర్ల బౌలింగ్లో సైతం వైభవ్ చితక్కొట్టడం విశేషం.ఇక ఈ సీజన్లో ఏకంగా 72 సిక్సర్లు బాదిన వైభవ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల ఆల్టైమ్ రికార్డును బద్దలుకొట్టాడు కూడా!.. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ, వివాదాస్పద కోచ్ గ్రెగ్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్లో.. ‘‘పదిహేనేళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ టోర్నీనే శాసించే స్థితికి వెళ్లాడు. 237కు పైగా స్ట్రైక్రేటుతో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ భూమి మీద ఉన్న అత్యుత్తమ బౌలర్లను కూడా తన బ్యాటింగ్తో ఉతికి ఆరేశాడు.సీజన్లో 72 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డునే బద్దలుకొట్టాడు. సంప్రదాయ క్రికెట్కు పూర్తి విరుద్ధంగా సరికొత్త బెంచ్మార్కు సృష్టించాడు. తనింకా పిల్లాడే. పూర్తి స్థాయిలో సీనియర్ ఆటగాడిగా మారిన తర్వాత అతడిని ఎవరూ ఆపలేరు.ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతంఅంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ బౌలర్లుగా గుర్తింపు పొందిన వారిని సైతం వేటాడేయగలడు. మారుతున్న క్రీడా విధానానికి ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతం. ఆధునిక టీ20 ఫార్మాట్ పారామీటర్లు కూడా మారిపోతున్నాయి.ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనల వల్ల సమతూకం దెబ్బతింటోంది. బ్యాటింగ్ చేసే జట్టుకు అదనపు పవర్హిట్టర్ను ఆడించే వీలు దొరుకుతోంది. వైభవ్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా తన ప్రభావం చూపాడు’’ అని గ్రెగ్ చాపెల్ పేర్కొన్నాడు.ఇలా అయితేనే టీ20 క్రికెట్ను కాపాడుకుందాంఅదే విధంగా.. టీ20 క్రికెట్ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ గ్రెగ్ చాపెల్ ఈ సందర్భంగా మూడు ప్రధాన సూచనలు చేశాడు. ‘‘బ్యాటింగ్ చేసే జట్టుకు చేతిలో పది వికెట్లు కూడా ఆరు వికెట్లే ఉండాలి. అప్పుడు బ్యాటర్లు బాదడమే పనిగా పెట్టుకోకుండా మంచి టెక్నిక్తో ఆడే ప్రయత్నం చేశారు.పిచ్ల మీద కనీసం 3 మి.మీ. మేర పచ్చిక ఉండేలా చూసుకోవాలి. తద్వారా కాస్త సీమ్ జనరేట్ అవుతుంది. ఒక్కోసారి పచ్చికతో కూడినవి.. మరోసారి పూర్తిగా పొడి పిచ్లను తయారు చేయాలి. తద్వారా వైవిధ్యం చేకూరుతుంది. లెగ్ బిఫోర్ వికెట్ విషయంలో కూడా మార్పులు చేయాలి’’ అని గ్రెగ్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. చదవండి: అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే! -
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
అఫ్గనిస్తాన్తో సిరీస్ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో ఈ మ్యాచ్ భాగం కాదు.కాబట్టి అఫ్గన్తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దొరికింది. మానవ్ సుతార్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.మూడు వన్డేలుఇదిలా ఉంటే.. జూన్ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.మరోవైపు.. ఇషాన్ కిషన్ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. దీంతో అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.ఇషాన్ వద్దు.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్కు బదులు యశస్వి జైస్వాల్కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్తో వన్డేలో కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్ను వన్డౌన్లో ఆడించాలి. శ్రేయస్ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్ ఐదు, హార్దిక్ పాండ్యా ఆరు, వాషింగ్టన్ సుందర్ ఏడు, హర్ష్ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్తో పాటు గుర్నూర్ బ్రార్ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్ కిషన్కు చోటు ఇవ్వలేదు.జైసూను ఆడిస్తారా?ఐపీఎల్-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా.. 16 మ్యాచ్లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ 602 పరుగులతో దుమ్ములేపాడు.అంతేకాదు సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్రైజర్స్ కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్ నాయర్ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.అఫ్గనిస్తాన్తో తొలి వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్.చదవండి: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ -
ఇద్దరు ప్రపంచకప్ సభ్యులపై వేటు
జూన్ 11 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జూన్ 9) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా షాయ్ హోప్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ముగ్గురు టీ20 ప్రపంచకప్ 2026 సభ్యులకు చోటు దక్కలేదు. ఇందులో ఇద్దరిపై (జాన్సన్ ఛార్లెన్, క్వింటన్ సాంప్సన్) వేటు పడగా.. అల్జరీ జోసఫ్కు వర్క్లోడ్ కారణంగా విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లు ఆకీమ్ ఆగస్టే, జువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్లకు ఈ జట్టులో అవకాశం ఇచ్చారు. విధ్వంసకర వీరులు హెట్మైర్, రూథర్ఫోర్డ్, షెపర్డ్, పావెల్, హోల్డర్ తమ స్థానాలను నిలుపుకున్నారు. శ్రీలంకతో ఈ సిరీస్ జూన్ 12, 14, 15 తేదీల్లో జమైకాలోని సబీనా పార్క్ వేదికగా జరుగనుంది.శ్రీలంకతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టుషాయ్ హోప్ (సి), జువెల్ ఆండ్రూ, అకీమ్ అగస్టే, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమార్ జోసఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్కాగా, శ్రీలంక క్రికెట్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతకుముందు రెండో వన్డే కూడా వర్షార్పణం అయ్యింది. ఈ సిరీస్లో జరిగిన ఏకైక వన్డేలో గెలవడంతో శ్రీలంక సిరీస్ను కైవసం చేసుకుంది.స్వదేశంలో సిరీస్ కోల్పోవడంతో విండీస్ జట్టు 2027 వన్డే వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. 2023-27 సైకిల్లో విండీస్ ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్గా టోర్నీలోకి అడుగుపెడతాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు-నవంబరు మధ్య జరుగనున్న సంగతి తెలిసిందే. -
BCCI: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టు నుంచి స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను తప్పించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోకాగా టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఫామ్లేమితో బాధపడుతున్న సూర్యను తప్పించి.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని జట్టును ఎంపిక చేయడమే కాకుండా.. కెప్టెన్గా నియమించింది.ఇక శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా జూన్ 26 నుంచి ఐర్లాండ్లో పర్యటించనుంది. తొలుత ఐర్లాండ్తో రెండు టీ20లు ఆడి.. ఆ తర్వాత ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. వైభవ్ సూర్యవంశీకి చోటుఇందుకోసం ప్రకటించిన జట్టులో తొలిసారిగా పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తాడని యాజమాన్యం తొలుత ప్రకటించింది.అందుకే సిరాజ్ను తప్పిస్తు న్నాంతాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ‘‘మా వైద్య బృందంతో చర్చల అనంతరం.. సిరాజ్కు విశ్రాంతి కావాలని భావించాము. పనిభారాన్ని తగ్గించే క్రమంలో అతడిని ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన నుంచి తప్పిస్తున్నాము. సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రికెట్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.సిరాజ్ స్థానంలో ప్రసిద్ కృష్ణను సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సిరాజ్కు బదులు ఐర్లాండ్, ఇంగ్లండ్లలో అతడు టీ20 సిరీస్లలో పాల్గొంటాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్కు టీమిండియా (అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ కృష్ణ.చదవండి: టీమిండియాలో చోటివ్వరా? సెంచరీతో కదంతొక్కాడు! -
టీమిండియాలో చోటివ్వరా? శతకంతో కదం తొక్కాడు!
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. శ్రీలంక-‘ఎ’ జట్టుతో తొలి వన్డేలో సెంచరీతో మెరిసి జట్టును ఆదుకున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో పాటు అఫ్గనిస్తాన్తో భారత్ వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. దంబుల్లా వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.వైభవ్ విఫలం..అయితే, ఆదిలోనే శ్రీలంక భారత్కు షాకిచ్చింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2), వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14)లను పెవిలియన్కు పంపి దెబ్బకొట్టింది. వన్డౌన్లో వచ్చిన ప్రియాంశ్ ఆర్య 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.శతకంతో కదంతొక్కాడుఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (97 బంతుల్లో 60)తో కలిసి 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.మిగిలిన వారిలో ఆయుశ్ బదోని 24, సూర్యాంశ్ షెడ్గే 26 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన భారత్ 277 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. చమిక కరుణరత్నె, గరుక సంకేత్, వనుజా సాహన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గనిస్తాన్తో వన్డేలకు ఎంపిక చేయని సెలక్టర్లుచివరగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అఫ్గనిస్తాన్తో స్వదేశంలో జూన్ సిరీస్కు రుతురాజ్ను ఎంపిక చేయలేదు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు ఆఖరి నిమిషంలో చోటిచ్చారు. ఇలాంటి తరుణంలో రుతురాజ్ భారత్-ఎ తరఫున శతక్కొట్టడం విశేషం. దీంతో తనను విస్మరించిన టీమిండియా సెలక్టర్లకు రుతు బ్యాట్తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్! -
ODI WC: కొంప ముంచిన వర్షం.. విండీస్కు తప్పని గండం!
సొంతగడ్డపై వెస్టిండీస్ చతికిలపడింది. పర్యాటక శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్ను కోల్పోయింది. ఫలితంగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య ఈ మెగా ఈవెంట్ జరుగనున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా విండీస్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేలు ఆడేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్లో పర్యాటక జట్టు చేతిలో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత రెండు వన్డేలు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో సిరీస్ 1-0తో శ్రీలంక వశమైంది.పదో స్థానంలో...ఫలితంగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. కాగా శ్రీలంకతో సిరీస్ ద్వారా ఈ సైకిల్ (2023-2027)లో విండీస్ ఇప్పటికి 32 మ్యాచ్లు పూర్తి చేసుకుంది.ఇందులో 11 గెలిచి, 18 ఓడిపోయింది. మిగిలిన మ్యాచ్లు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో మొత్తంగా 73 రేటింగ్ పాయింట్లతో వెస్టిండీస్ పట్టికలో పదో స్థానంలో ఉంది.టాప్-8లో ఉన్న జట్లు మాత్రమేకాగా పట్టికలో టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్గా టోర్నీలో అడుగుపెడతాయి.ఇక విండీస్కు ఈ సైకిల్లో దాదాపుగా తొమ్మిది మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో జూలైలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు ఆడనున్న కరేబియన్ జట్టు.. తదుపరి భారత పర్యటనలో మూడు వన్డేలు ఆడుతుంది. అనంతరం అఫ్గనిస్తాన్కు మూడు వన్డేల కోసం ఆతిథ్యం ఇస్తుంది. వరుసగా రెండోసారి..ఈ సిరీస్లలో వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శనతో గెలవాల్సి ఉంటుంది. వర్షం వల్ల ఈ మ్యాచ్లకు ఆటంకం కలిగితే విండీస్ అవకాశాలు మరింత సన్నగిల్లడం ఖాయం. అదే జరిగితే వెస్టిండీస్ వరుసగా రెండోసారి గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది.ఇందులో నాలుగు స్థానాల కోసం పది జట్లు పోటీలో ఉంటాయి. ఉదాహరణకు.. స్కాట్లాండ్, నమీబియా, ఐర్లాండ్ వంటి చిన్నజట్లు రీజినల్ క్వాలిఫయర్స్లో సత్తా చాటడం ద్వారా గ్లోబల్ క్వాలిఫయర్లో అడుగుపెడతాయి. కాగా గత ఎడిషన్లో వెస్టిండీస్కు ఈ టోర్నీలో ఘోర పరాభవం ఎదురైంది.గత ఎడిషన్కు అర్హత సాధించకుండానే..స్కాట్లాండ్, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి.. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి అర్హత సాధించకుండానే వెస్టిండీస్ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. రెండుసార్లు చాంపియన్గా నిలిచిన జట్టు ఈ మేరకు అర్హత కూడా సాధించకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఇక ప్రస్తుతం పటిష్టమైన ప్రత్యర్థులు న్యూజిలాండ్, టీమిండియాపై వెస్టిండీస్ సత్తా చాటాల్సి ఉంది. అఫ్గనిస్తాన్ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుత సైకిల్లో కూడా విండీస్కు క్వాలిఫయర్స్ ఆడే గండం తప్పకపోవచ్చని అనిపిస్తోంది. చదవండి: పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను -
కొంపముంచిన రుతురాజ్.. క్రికెట్ చరిత్రలో వింత రనౌట్!
ఇండియా-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే వింత రనౌట్కు మ్యాచ్ సాక్ష్యంగా నిలిచింది. విషయంలోకి వెళితే.. ఓపెనర్దిద్దరు తొందరగానే పెవిలియన్ చేరడంతో రుతురాజ్, ప్రియాన్ష్ ఆర్యలు ఆచితూచి ఆడారు. ఇద్దరు కలిసి చాలా బంతులెదుర్కొని 53 పరుగులు జోడించారు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో రుతురాజ్ చేసిన తప్పిదం కొంపముంచింది. రవిందు ఫెర్నాండో వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతినే గైక్వాడ్ సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత బంతికే హైడ్రామా చోటుచేసుకుంది. పాయింట్ దిశగా ఆడిన రుతురాజ్ రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే స్ట్రైక్ ఎండ్వైపు ఉన్న ప్రియాన్ష్ ఆర్య రుతురాజ్ రెండో పరుగు కోసం వచ్చిన విషయం గమనించలేదు. అప్పటికే క్రీజులో బ్యాట్ పెట్టాడు. కానీ అప్పటికే రుతురాజ్ స్ట్రైక్ ఎండ్వైపు వచ్చేశాడు. ఈలోగా బంతిని కీపర్ బౌలర్ వైపు విసిరే క్రమంలో ప్రియాన్ష్ బ్యాట్ను తొక్కడం కనిపించింది. ఇంతలో కీపర్ నుంచి బంతిని అందుకున్న బౌలర్ వికెట్లను గిరాటేశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్లో ఉండడంతో నిబంధనల ప్రకారం ఎవరు బ్యాట్ను మొదటగా క్రీజులో పెట్టారనేది అంపైర్లు పరిశీలించారు. రిప్లేలో ప్రియాన్ష్ ఆర్య బ్యాట్ క్రీజుపై ఉంచినప్పటికీ, ప్రియాన్ష్ కంటే ముందే రుతురాజ్ బ్యాట్ను క్రీజులో ఉంచడం కనిపించింది. దీంతో అంపైర్లు ప్రియాన్ష్ ఆర్యను రనౌట్ అయినట్లు ప్రకటించారు. ఇద్దరి మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ వింత రనౌట్ జరిగింది. ఇలాంటి వింత రనౌట్లకు పాకిస్తాన్ పెట్టింది పేరు. ఇప్పుడు రుతురాజ్, ప్రియాన్ష్లు వింత రనౌట్తో వార్తల్లోకెక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే 69 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రుతురాజ్ గైక్వాడ్ (101), కెప్టెన్ తిలక్ వర్మ (60 బ్యాటింగ్) ఆదుకున్నారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 150 పరుగులు జోడించారు. లిస్ట్-ఏ క్రికెట్లో మంచి రికార్డు కలిగిన రుతురాజ్ మరోసారి ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ సెంచరీతో మెరిశాడు. అయితే సెంచరీ చేసిన మరుక్షణమే రుతురాజ్ వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇండియా-ఏ 45 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అంతకముందు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (14) ఫామ్ను కొనసాగించడంలో విఫలమయ్యాడు.pic.twitter.com/Ga3qBawcIN— crictalk (@crictalk7) June 9, 2026చదవండి: మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్ అరుదైన ఫీట్! -
‘కొడితే సెంచరీ.. లేదంటే వస్తాడు.. అవుటై వెళ్లిపోతాడు’
స్వదేశంలో టీమిండియా అదరగొట్టింది. అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (126), ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టిన సంగతి తెలిసిందే. మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (81), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (81) అర్ద శతకాలతో మెరిశారు. కాగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గతేడాది కాలంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 800కు పైగా పరుగులు సాధించాడు. ఇక అఫ్గన్తో మ్యాచ్ సందర్భంగా 165 బంతుల్లో 100 రన్స్ చేసిన రాహుల్.. టెస్టు కెరీర్లో 12వ సెంచరీ నమోదు చేశాడు.అశ్విన్ సంచలన వ్యాఖ్యలుమొత్తంగా ఇప్పటికి టీమిండియా తరఫున 68 టెస్టులు ఆడిన రాహుల్ 4153 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సగటు 36.43. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కేఎల్ రాహుల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్లో లేకుంటే ఈ కర్ణాటక బ్యాటర్ నుంచి ఒక్క పరుగు కూడా ఆశించలేమన్నాడు.పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే..తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘విదేశాల్లో కఠినమైన పిచ్ల మీద ఆడటం వల్ల అతడి బ్యాటింగ్ సగటు తక్కువగా ఉందని చాలా మంది కేఎల్ రాహుల్ను వెనకేసుకువస్తారు. కానీ అతడిలో నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను.పిచ్ గనుక బ్యాటింగ్కు అనుకూలంగా లేకుంటే.. అతడు ఒక్క పరుగు కూడా చేయడు. ఇలా బ్యాటింగ్కు వెళ్తాడు. అలా అవుటై పెవిలియన్కు చేరతాడు. ఒకవేళ అదే స్థానంలో విరాట్ కోహ్లి ఉంటే.. అప్పుడతడు ఫామ్లో లేకపోయినా కనీసం 30, 33, 43.. లేదంటే 28 పరుగులైనా చేస్తాడు.కొడితే సెంచరీ.. లేదంటేకానీ కేఎల్ రాహుల్ మాత్రం 0- 10 మధ్య కూడా పరుగులు రాబట్టలేడు. ఫామ్లో ఉన్నాడంటే సెంచరీ అయినా చేస్తాడు. అది వేరే సంగతి. ఒకవేళ ఫామ్లో లేడంటే మాత్రం మనం అతడి నుంచి పరుగులు ఆశించకూడదు.కొడితే సెంచరీ.. లేదంటే ఇలా వెళ్లి అలా వచ్చేయడం.. కేఎల్ రాహుల్లో నేను ఈ రెండు మాత్రమే చూశాను. అతడు మధ్యస్థంగా ఆడటం ఎప్పుడూ చూడలేదు. అయితే, గత రెండేళ్లుగా అతడి ఆట తీరులో పరిణతి కనిపిస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగ్గా ఆడుతున్నాడు’’ అని అశ్విన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటికి 119 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన 34 ఏళ్ల కేఎల్ రాహుల్ ఖాతాలో తొమ్మిది డకౌట్లు, 31 సింగిల్ డిజిట్ స్కోర్లు ఉండటం గమనార్హం.చదవండి: పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను -
పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను: బంగ్లా కెప్టెన్
ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆడాలనేది ప్రతి ఒక్క క్రికెటర్ కల. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో మెరవాలని కోరుకోని ప్లేయర్ ఉండరు. అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రభుత్వ నిర్ణయం కారణంగా బంగారం లాంటి ఈ అవకాశాన్ని ఈ ఏడాది కోల్పోయారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి అర్హత సాధించినప్పటికీ.. ప్రభుత్వం పంతానికి పోవడంతో ఈవెంట్ నుంచే జట్టు నిష్క్రమించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్కప్ టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే.దౌత్యపరమైన ఉద్రిక్తతలుఅయితే, టోర్నీ ఆరంభానికి ముందు భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను బీసీసీఐ తొలగించింది. ఈ నేపథ్యంలో భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని.. ప్రపంచకప్ ఆడేందుకు అక్కడకు వెళ్లమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) కొత్త రాగం ఎత్తుకుంది.ప్రభుత్వ నిర్ణయం.. కాదు కాదు ఆటగాళ్లేనంటూ..తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీని కోరింది. అయితే, బీసీబీ వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము టోర్నీ నుంచే తప్పుకొంటున్నట్లు బీసీబీ ప్రకటించింది. ఇందుకు సరేనన్న ఐసీసీ.. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను వరల్డ్కప్లో ఆడించింది.అయితే, నాటి బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్.. టోర్నీ నుంచి తప్పుకోవాలన్నది తొలుత ప్రభుత్వ నిర్ణయమని చెప్పి.. ఆ తర్వాత తమ ఆటగాళ్లే దేశం కోసం భారత్లో ఆడలేదంటూ బాంబు పేల్చాడు. సర్వత్రా విమర్శలు రావడంతో మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు.భారత్లో ఎలాంటి సమస్యా లేకపోయినా..ఈ చేదు అనుభవాల గురించి ప్రపంచకప్-2026 బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన లిటన్ దాస్ తాజాగా స్పందించాడు. తాము పాకిస్తాన్లో తుపాకుల మధ్య క్రికెట్ ఆడిన సందర్భాలు ఉన్నాయని.. అలాంటిది భారత్లో ఎలాంటి సమస్యా లేకపోయినా టోర్నీ నుంచి వైదొలగడం తీవ్రంగా కలచివేసిందన్నాడు.ప్రథోమ్ అలోతో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు మాతో బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. మీరేం కోరుకుంటాన్నరో చెప్పండని అడిగారు. ప్రతి ఆటగాడు వరల్డ్కప్ ఆడాలనే అనుకున్నాడు. కానీ బోర్డుతో యుద్ధానికి దిగడం ఎవరికీ ఇష్టం లేదు.పాకిస్తాన్లో ఆడాము.. అంతకంటే ప్రమాదకరమా?కేవలం ప్రపంచకప్ టోర్నీ ఆడాలన్నదే మా కల. కానీ వాళ్లు భారత్లో భద్రత లేదని అన్నారు. అప్పుడు నేను నా వాదన వినిపించాను. ‘పాకిస్తాన్లో మేము క్రికెట్ ఆడాము. అప్పుడు గదుల వెలుపల తుపాకీలతో నిలబడి మాకు రక్షణ ఇచ్చారు.ఇంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులు అక్కడ (భారత్) ఉంటాయా?’ అని అడిగాను. కానీ వాళ్లు మాత్రం వినలేదు. తమకు నచ్చిన నిర్ణయమే తీసుకున్నారు. ఆటగాళ్లుగా వాళ్లు ఏం చెబితే మేము అదే వినాలి కదా!’’ అని లిటన్ దాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.బీసీసీఐతో సంబంధాల పునరుద్ధరణపై దృష్టికాగా బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీసీఐతో సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం బీసీబీ తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ను నియమించింది. పదవి చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిన తమీమ్ ఇక్బాల్.. బోర్డు తరఫున బీసీసీఐకి లేఖ రాయించాడు. ద్వైపాక్షిక సిరీస్ల పునరుద్ధరణ గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు.ఏదేమైనా పాత ప్రభుత్వం వల్ల తాము ఎంతో నష్టపోయామని.. వారి అనుచిత నిర్ణయం వల్ల వరల్డ్కప్ ఆడే అవకాశం కోల్పోయామని ఆటగాళ్లు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా ఐసీసీ గట్టిగానే మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మెగా టోర్నీలో ఆతిథ్య టీమిండియా విజేతగా నిలిచి... ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.చదవండి: అర్జున్ టెండుల్కర్ అదరగొట్టాడు -
మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్ అరుదైన ఫీట్!
వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరగాల్సిన మూడో వన్డే వర్షార్పణమైంది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను లంక 1-0తో కైవసం చేసుకుంది. దీంతో విండీస్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన మూడో కెప్టెన్గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతంలో అర్జున రణతుంగ, ఆటపట్టు ఈ ఫీట్ను సాధించారు. జమైకా వేదికగా జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది.కనీసం టాస్ వేసేందుకు కూడా వరుణుడు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని, మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో వన్డే కూడా వర్షార్పణమైన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో మాత్రం శ్రీలంక జట్టు 41 పరుగుల తేడాతో గెలిచింది. కరీబియన్ గడ్డపై 13 ఏళ్ల తర్వాత లంక విజయం సాధించడం విశేషం. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ గురువారం నుంచి మొదలుకానుంది. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్లు కూడా జరగనున్నాయి.చదవండి: రోహిత్, పాండ్యా ఫిట్నెస్పై కీలక అప్డేట్! -
రోహిత్, పాండ్యా ఫిట్నెస్పై కీలక అప్డేట్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పాండ్యాకు బీసీసీఐ సీఓఈ స్పోర్ట్స్ బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన పలు మ్యాచ్ సిమ్యులేషన్లలో పాండ్యా పాల్గొన్నాడని, ఎక్కడా అసౌకర్యంగా కనిపించలేదని మెడికల్ బృందం తెలిపింది. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న భారత్, ఆఫ్గన్ తొలి వన్డేలో పాండ్యా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ శుభవార్త చెప్పాడు. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు రోహిత్, పాండ్యా అందుబాటులో ఉంటారని తెలిపాడు. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్కు సంబంధించి సర్టిఫికెట్ను మెడికల్ సీవోఈ బృందం ఇంకా అందించలేదు. అయితే తనకు అందిన సమాచారం మేరకు రోహిత్, పాండ్యా ఫిట్నెస్ నిరూపించుకున్నారని, అయితే మెడికల్ టీమ్ ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వలేదని తెలిపాడు. అయితే వారి నుంచి ఒక్కసారి క్లియరెన్స్ వస్తే మాత్రం రోహిత్, పాండ్యాలు ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఆడతారని స్పష్టం చేశాడు. కానీ వన్డే సిరీస్లో ఈ ఇద్దరూ పాల్గొనాలంటే పాండ్యా, రోహిత్లు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ చాలా మ్యాచ్లకు అందుబాటులో లేడు. కండరాల గాయంతో గ్రూప్ దశలో ఐదు మ్యాచ్కు దూరమవ్వగా, పాండ్యా లీగ్ ఆఖరి దశలో వెన్నునొప్పి కారణంగా చివరి మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత పాండ్యా, రోహిత్ శర్మలు ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి వచ్చారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు! -
వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు!
టీమిండియాకు ఎంపికైన బీహార్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ శ్రీలంక-ఏతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో విఫలమయ్యాడు. ఓపెనర్గా వచ్చిన వైభవ్ 12 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. మూడు ఫోర్లతో ఊపు మీద కనిపించినప్పటికీ మొహమ్మద్ షిరాజ్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన వైభవ్ మిడాఫ్లో దొరికిపోయాడు. వైభవ్ కొట్టిన బంతిని సాహన్ అరాచిగే ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో వైభవ్ చెలరేగుతాడని ఆశించిన అభిమానులు నిరాశే ఎదురైంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన నెట్ సెషన్లో వైభవ్ కొంత సమయం రక్షణాత్మక బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాడు. సాధారణంగా దూకుడైన ఆటకు పెట్టింది పేరైన వైభవ్ వన్డే మ్యాచ్ కావడంతో పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇవాళ్టి మ్యాచ్లో మాత్రం వైభవ్ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఇండియా-ఏ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 7 ఓవర్లు ముగిసేసరికి ఇండియా జట్టు 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (12), రుతురాజ్ గైక్వాడ్ (2) పరుగులతో ఆడుతున్నారు.ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 16 మ్యాచ్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్లో తనడైన ముద్ర వేశాడు. దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను వణికించిన వైభవ్.. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.టీ20 ఫార్మాట్ లో ఇప్పటికే తన ముద్ర వేసిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న యువ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతడి దూకుడైన శైలి, భారీ షాట్లు ఆడగల సామర్థ్యం భారత క్రికెట్ వర్గాల్లో అంచనాలు పెంచాయి. ఇప్పుడు శ్రీలంక-ఏ, ఆ తర్వాత అఫ్గానిస్థాన్-ఏ జట్లపై కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాడు.గతేడాది ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నమెంట్లో యూఏఈపై ఇండియా-ఏ తరఫున వైభవ్ కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు బాదిన విషయం ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఆ ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన బుడ్డాడు.. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో కూడా అదే స్థాయి ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.Vaibhav Suryavanshi started brightly with a few beautiful strokes, but his innings was cut short on 14 off 12 balls, including three boundaries. pic.twitter.com/a2RiJi4SNn— CofCricket (@CofCricket) June 9, 2026చదవండి: ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం! -
విజేత రిత్విక్–రామ్ జోడీ.. హైదరాబాదీ ఖాతాలో తొలి టైటిల్
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రితి్వక్ చౌదరీ ఈ ఏడాది తన ఖాతాలో తొలి డబుల్స్ టైటిల్ను జమ చేసుకున్నాడు. అమెరికాలో జరిగిన టెక్సాస్ స్పైన్ అండ్ జాయింట్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టోర్నీలో రిత్విక్–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జోడీ విజేతగా నిలిచింది. తుది పోరులో టాప్ సీడ్ రిత్విక్–రామ్ ద్వయం 7–6 (7/2), 7–6 (7/4)తో జచారి ఫుచ్స్–వ్యాలీ థేన్ (అమెరికా) జంటపై నెగ్గింది. రిత్విక్–రామ్ జంటకు 4,980 డాలర్ల (రూ. 4 లక్షల 72 వేలు) ప్రైజ్మనీ, 75 పాయింట్లు లభించాయి. గత ఏడాది శాంటియాగో ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో నికోలస్ బరియంతోస్ (కొలంబియా)తో కలిసి రిత్విక్ డబుల్స్ టైటిల్ గెలిచాడు. -
అతడికి షరతులు వర్తించవా?.. అగార్కర్కు చురకలు!
ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్కు సంబంధించి టీమిండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో ఆటగాళ్ల ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్కు ముందు గాయానికి గురైన పేసర్ హర్షిత్ రాణా అప్పటినుంచి ఒక్క మ్యాచ్ ఆడకపోయినప్పటికీ మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. హర్షిత్ రాణా ఎంపికపై భారత మాజీ క్రికెటర్ శఠగోపన్ రమేశ్ అసహనం వ్యక్తం చేశాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఏ ప్రాతిపాదికన హర్షిత్ రాణాను ఎంపిక చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి ఎంపికల వల్ల మహ్మద్ షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మాట్లాడుతూ..‘హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు? మోకాలి శస్త్రచికిత్స అనంతరం దేశవాలీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా ఇప్పుడు మూడు జట్లకు ఎంపిక చేయడం పట్ల సమాధానం మాత్రం ఉండదు. కొన్నాళ్లుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న షమీ లాంటి క్రికెటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు. దేశవాలీ క్రికెట్లో ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాలనే నిబంధనను హర్షిత్ రాణా విషయంలో సెలెక్షన్ కమిటీ గాలికొదిలేసింది. కోహ్లీ, రోహిత్ ఇలా ఎవరైనా ఫిట్నెస్ నిరూపించుకుంటూనే జట్టులో చోటు ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. పాండ్యా గాయపడినప్పుడు కూడా జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందేనని అల్టీమేటం జారీ చేశారు. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ను కూడా న్యూజిలాండ్తో వన్డేలకు ముందు విజయ్ హజారే ట్రోఫీ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని కోరారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ హర్షిత్ రాణా విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడికి ఈ షరతులు ఎందుకు వర్తించవనేది అగార్కర్ సమాధానం చెప్పాలి.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక హర్షిత్ రాణా 2026 టీ20 ప్రపంచకప్కు టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ వార్మప్ మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 సీజన్కు కూడా దూరంగా ఉన్నాడు.చదవండి: ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం! -
రికార్డు స్థాయిలో 17 పతకాలు.. సత్తా చాటిన భారత రెజ్లర్లు
న్యూఢిల్లీ: ఉలాన్బాటర్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్, మహిళల ఫ్రీస్టయిల్ విభాగాల్లో కలిపి మొత్తం 17 పతకాలతో అదరగొట్టారు. మంగోలియా రాజధానిలో జరిగిన ఈ టోర్నీలో చివరిరోజు భారత రెజ్లర్లు దీపక్ (61 కేజీలు), సాగర్ జగ్లాన్ (74 కేజీలు), దినేశ్ (125 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. ఫైనల్స్లో దీపక్ 6–0తో అసిల్ ఐతాకిన్ (కజకిస్తాన్)పై, సాగర్ 3–2తో తామిర్ ఇషినిమయేవ్ (రష్యా)పై, దినేశ్ 2–0తో యెడిగె కాసిమ్బెక్ (కజకిస్తాన్)పై విజయం సాధించారు. సుమిత్ (57 కేజీలు), మోహిత్ కుమార్ (65 కేజీలు), జైదీప్ (74 కేజీలు), విక్కీ (97 కేజీలు) కాంస్య పతకాలు గెల్చుకున్నారు. దాంతో పురుషుల ఫ్రీస్టయిల్ టీమ్ విభాగంలో భారత జట్టు 152 పాయింట్లతో రన్నరప్గా నిలిచింది. 163 పాయింట్లు సాధించిన రష్యా జట్టుకు టీమ్ టైటిల్ లభించింది. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు సునీల్ కుమార్ (87 కేజీలు), నితేశ్ (97 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. సాహిల్ (60 కేజీలు) కాంస్య పతకాన్ని సంపాదించాడు. గ్రీకో రోమన్ విభాగంలో భారత జట్టు 119 పాయింట్లతో టీమ్ టైటిల్ దక్కించుకుంది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో మనీషా (57 కేజీలు), నేహా (59 కేజీలు), కాజల్ (76 కేజీలు) స్వర్ణ పతకాలు నెగ్గారు. నీలం (50 కేజీలు), హన్సిక లాంబా (55 కేజీలు), మాన్సి (62 కేజీలు), ప్రియ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. దాంతో టీమ్ విభాగంలో 149 పాయింట్లతో భారత జట్టు రన్నరప్గా నిలిచింది. 175 పాయింట్లతో ఉత్తర కొరియాకు టీమ్ టైటిల్ దక్కింది. -
ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం!
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వివాదంలో చిక్కుకున్నాడు. జట్టు బౌలర్ గస్ అట్కిన్సన్తో కలిసి ఫూటుగా మద్యం తాగి అపరిచితులపై దాడి చేసి వీరంగం సృష్టించాడు. తాజా ఉదంతంతో స్టోక్స్ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్టోక్స్తో పాటు అట్కిన్సన్పై నిషేధం విధించే అవకాశం లేకపోలేదు. ఈ ఘటనతో స్టోక్స్ టెస్టు కెప్టెన్సీకి కూడా ముప్పు పొంచి ఉంది. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు బుధవారం నుంచి జరగనుంది. మొదటి టెస్టు గెలిచిన ఆనందంలో కెప్టెన్ బెన్స్టోక్స్, బౌలర్ అట్కిన్సన్లు బోర్డు అనుమతి లేకుండా దొంగచాటుగా ఒక నైట్క్లబ్కు వెళ్లారు. ఇద్దరు పీకలదాకా మద్యం తాగారు. అనంతరం హోటల్ రూమ్ కు వస్తుండగా కొంతమంది అపరిచితులతో గొడవపడ్డారు . మాటా మాట పెరగడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బీర్ బాటిల్స్ విసురుకున్నారు. అట్కిన్సన్ వద్దని వారించినా స్టోక్స్ వినకుండా అవతలి వర్గంలో ఉన్న వ్యక్తుల్లో ఒకరిని కిందపడేసి విచక్షణారహితంగా కొట్టాడు. అయితే ఈ సంఘటనలో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. విషయం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు తెలియడంతో ఆగ్రహించింది. ఆటగాళ్లు బోర్డు అనుమతి లేకుండా బయటికి వెళ్లడమే తప్పని, అలాంటిది నైట్క్లబ్కు వెళ్లి పీకలదాకా మద్యం తాగి అపరిచితులపై దాడి చేయడం కరెక్టు కాదని అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ కమిటీ వేసినట్లు బోర్డు తెలిపింది. ఈ వ్యవహారంలో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సల తప్పు ఉందని తేలితే మాత్రం ఇద్దరిపై నిషేధం పడే అవకాశముంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఇద్దరిని వేర్వేరుగా విచారించినట్లు తెలుస్తోంది. దీంతో కివీస్తో రెండో టెస్టులో వీరిద్దరూ ఆడేది అనుమానమే. అంతేకాదు బెన్ స్టోక్స్ను కెప్టెన్సీ నుంచి తొలగించే అంశంపై కూడా ఒక నిర్ణయానికి రానున్నట్లు బోర్డు తెలిపింది. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్కు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాగే పీకల దాకా తాగి రచ్చ చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే గతేడాది నవంబర్లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే నైట్క్లబ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్కు ముందు వెల్లింగ్టన్లో ఒక నైట్క్లబ్కు వెళ్లిన బ్రూక్ బౌన్సర్తో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జాకబ్ బెథెల్ కూడా బ్రూక్తో కలిసి బౌన్సర్పై గొడవకు దిగాడు. అయితే దాడి పెద్దది కాకపోవడంతో ఈసీబీ వీరిద్దరిని మందలింపు చర్యతో సరిపెట్టింది. కానీ స్టోక్స్, అట్కిన్సన్ విషయంలో మాత్రం బోర్డు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ స్టోక్స్పై నిషేధం పడితే అతడి స్థానంలో హ్యారీబ్రూక్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు.Ben Stokes, the real street fighter 😭 waiting for the new fight video pic.twitter.com/iK0at0nSvg— Santoshvk18 (@269signofff) June 8, 2026చదవండి: టీ20 ముంబై లీగ్లో అర్జున్ టెండూల్కర్ విధ్వంసం! -
టీ20 ముంబై లీగ్లో అర్జున్ టెండూల్కర్ విధ్వంసం!
టీ20 ముంబై లీగ్ 2026 సీజన్లో అర్జున్ టెండూల్కర్ విజృంభించాడు. టోర్నీలో ఏఆర్సీఎస్ అంధేరీ తరఫున ఆడుతున్న అర్జున్ సోమవారం బాంద్రా బ్లాస్టర్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. మొదట బౌలింగ్లో మూడు వికెట్లు (3-1-11-3) కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో వన్డౌన్లో వచ్చిన అర్జున్ టెండూల్కర్ 34 బంతుల్లోనే 66 పరుగులు అజేయ ఇన్నింగ్స్తో మ్యాచ్లో వన్మ్యాన్ షో ప్రదర్శన చేశాడు. అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. 25 బంతుల్లోనే ఫిప్టీ మార్క్ను అందుకున్న అర్జున్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. అర్జున్ విధ్వంసంతో అంధేరీ 145 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ముషీర్ఖాన్ (38 బంతుల్లో 58 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్ అర్జున్ టెండూల్కర్ ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. ఓమ్ కేశ్కామత్ (36 బంతుల్లో 49) టాప్ స్కోరర్ కాగా, సాగర్ ఛాబ్రియా (23 బంతుల్లో 44) రాణించాడు. అర్జున్ మూడు వికెట్లు తీయగా, ప్రసూన్ సింగ్ 2, అజమ్ మిశ్రా, శివమ్ దూబే, ముషీర్ ఖాన్, ప్రగ్నేశ్లు తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్జెయింట్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఆడింది ఒక్క మ్యాచ్ అయినప్పటికీ, తన ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. బౌలింగ్లో 4 ఓవర్లు వేసిన అర్జున్ 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.Arjun Tendulkar picked up a wicket in his very first over, but the funniest part was Musheer Khan going in for the high-five 😭 Arjun hit his hand so hard Musheer was genuinely shocked and started telling everyone on the field to look at how hard he got hit 😂💀 pic.twitter.com/ldx9GCD2po— OldMonkOfCricket (@OldMonkofCric) June 9, 2026Match 16 | AA v BB: A performance to remember! Arjun Tendulkar bags the Player of the Match honours.📌 June 1-13 | Wankhede Stadium.🎟️ Tickets live at the link in bio. 🎥 Watch live on Jio Hotstar and Star Sports.🌐 Track live on https://t.co/2GVUXSuuuk and the T20 Mumbai… pic.twitter.com/2C4JBSxKVw— T20 Mumbai (@T20Mumbai) June 8, 2026Arjun Tendulkar hit such a massive six in today’s T20 Mumbai League match that the ball landed in the stands and struck a young child. The child appeared to be in a lot of pain and started crying loudly.😢 pic.twitter.com/yJIyGc3Oit— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 8, 2026 -
చూసేద్దాం...చివరిసారి!
ఏ ఆటలో అయినా నిలకడగా రాణిస్తూ... మంచి గుర్తింపు తెచ్చుకునే ప్లేయర్లు చాలా మంది ఉంటారు. కానీ తమ ఉనికితోనే మ్యాచ్ను రసవత్తరంగా మార్చేసి... చిన్న కదలికలతో ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధులను చేసేవారు కొందరే! స్టార్, సూపర్ స్టార్ స్థాయి దాటేసి అలా లెజెండ్గా మారిన పలువురు ప్లేయర్లు ఈ ‘ఫిఫా’ ప్రపంచకప్తో అంతర్జాతీయ ఫుట్బాల్కు టాటా చెప్పనున్నారు. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), నెమార్ (బ్రెజిల్), మొహమ్మద్ సలా (ఈజిప్ట్), లూకా మోడ్రిక్ (క్రొయేషియా), మాన్యుయెల్ న్యూయెర్ (జర్మనీ), విర్జిల్ వాన్ డిక్ (నెదర్లాండ్స్), కెవిన్ డి బ్రూనీ (బెల్జియం), సాడియో మానె (సెనెగల్), సన్ హెంగ్ మిన్ (దక్షిణ కొరియా), జేమ్స్ రోడ్రిగెజ్ (కొలంబియా) ఇలా ఈ జాబితా చాలా పెద్దదే! ఈ దిగ్గజాలను ఆయా దేశాల తరఫున అంతర్జాతీయ మ్యాచ్ల్లో చూడటం దాదాపు ఇదే చివరిసారి కానుంది. అలాంటి వాళ్ల కెరీర్ను ఓసారి పరిశీలిస్తే...మెస్సీ... అర్జెంటీనా తురుపుముక్క సుదీర్ఘ కాలంగా అర్జెంటీనా జట్టు తురుపుముక్కగా ఉన్న స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ ‘ఫిఫా’ ప్రపంచకప్–2026 తర్వాత కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. నాలుగేళ్ల క్రితం ఖతార్లో జరిగిన మెగా టోర్నీ సమయంలోనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న 39 ఏళ్ల మెస్సీ... అప్పుడు అర్జెంటీనా జట్టు వరల్డ్ చాంపియన్గా నిలవడంతో... సుదీర్ఘకాలంగా తాను కన్న కలను ఆస్వాదించేందుకు ఆటలో కొనసాగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 198 మ్యాచ్లాడిన మెస్సీ 115 గోల్స్ కొట్టాడు. ఐదుసార్లు ‘ఫిఫా’ వరల్డ్కప్లో పాల్గొన్న మెస్సీ... రికార్డు స్థాయిలో ఆరోసారి మెగా టోర్నీలో ఆడిన అనంతరం వీడ్కోలు పలికే అవకాశాలున్నాయి. మరే ఆటగాడికీ సాధ్యం కాని రీతిలో ఈ అర్జెంటీనా స్టార్ 26 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనున్న అర్జెంటీనా జట్టు... టైటిల్ను నిలబెట్టుకొని మెస్సీకి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తోంది. అతడి నాయకత్వ పటిమ, అనుభవం ఈ టోర్నీలో అర్జెంటీనాకు మరింత బలాన్నిస్తాయని యోచిస్తోంది. ఫిట్నెస్ ఎంతో కీలకమైన ఫుట్బాల్లో 39 ఏళ్ల వయసు వరకు కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. జాతీయ జట్టుతో పాటు క్లబ్లు కలుపుకుంటే కెరీర్లో మొత్తం 1151 అధికారిక మ్యాచ్లు ఆడిన మెస్సీ... 906 గోల్స్ చేశాడు.రొనాల్డో... ముందే చెప్పేశాడుయావత్ క్రీడా ప్రపంచం ‘సీఆర్7’గా పిలుచుకునే... ఫుట్బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ ప్రపంచకప్ అనంతరం కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. మెస్సీతో సరిసమానంగా రికార్డు స్థాయిలో ఆరోసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ బరిలోకి దిగనున్న 41 రొనాల్డో ఇదే తనకు చివరి ప్రపంచకప్ అని ఇప్పటికే వెల్లడించాడు. కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన రొనాల్డో లెక్కకు మిక్కిలి ట్రోఫీలు సైతం చేజిక్కించుకున్నాడు. అయితే సుదీర్ఘ కాలంగా ఎంతగానో తపిస్తున్నా ‘ఫిఫా’ విన్నర్స్ ట్రోఫీ మాత్రం అతడి చేతికి చిక్కలేదు. ‘ఔర్ ఏక్ ధక్కా... ఇస్ బార్ పక్కా’ అన్నట్లు తన చివరి ప్రయత్నంలో అయినా అందని ద్రాక్షను అందుకోవాలని రొనాల్డో భావిస్తున్నాడు. 2003లో తొలిసారి జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగిన రొనాల్డో... 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో పోర్చుగల్ తరఫున 226 మ్యాచ్లు ఆడి 143 గోల్స్ చేశాడు. ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన ‘అల్ నాసర్’ క్లబ్కు సారథ్యం వహిస్తున్న రొనాల్డో... ఇటీవలే సౌదీ ప్రొ లీగ్ టైటిల్ సాధించి ఫుల్ జోష్లో ఉన్నాడు. అదే ఊపు ప్రపంచకప్లోనూ కొనసాగిస్తూ తన చిరకాల లక్ష్యాన్ని అందుకుంటాడా చూడాలి. సీనియర్ స్థాయిలో ఇప్పటి వరకు 1320 మ్యాచ్లు ఆడిన రొనాల్డో 970 గోల్స్ చేశాడు. 41 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్కు ప్రతిరూపంగా నిలచే రొనాల్డో... సోషల్ మీడియాలో వంద కోట్లకుపైగా ఫాలోవర్స్ సంపాదించుకున్న తొలి వ్యక్తిగా అరుదైన ఘనత సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.నెమార్... బ్రెజిల్ గుండె చప్పుడు మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్ ఆడిన బ్రెజిల్ సూపర్ స్టార్ నెమార్ జూనియర్ చివరి టోర్నీకి సిద్ధమవుతున్నాడు. తన తరంలో జట్టుకు అందని ట్రోఫీని అందించాలనే బలమైన సంకల్పంతో ఉన్నాడు. అయితే ఫిట్నెస్ కారణాలరీత్యా అతడు అన్నీ మ్యాచ్లు ఆడతాడా అనేది సందేహమే. అత్యధికంగా ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) వరల్డ్ చాంపియన్గా నిలిచిన బ్రెజిల్ ‘సిక్సర్’ కొట్టాలంటే నెమార్ ప్రదర్శన కీలకం కానుంది. ఇది తనకు చివరి మెగా టోర్నీ అని 34 ఏళ్ల నెమార్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున 128 మ్యాచ్లు ఆడిన నెమార్... 79 గోల్స్ చేయడంతో పాటు మరో 59 గోల్స్కు సహకారం అందించాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా కొనసాగుతున్న నెమార్ చివరి వరల్డ్కప్లోనూ అదే నిలకడ కొనసాగించాలని భావిస్తున్నాడు. ఐదో ప్రపంచకప్ ఆడనున్న జర్మనీ గోల్ కీపర్ న్యూయెర్ (40 ఏళ్లు), మెక్సికో గోల్ కీపర్ ఒచోవా (40 ఏళ్లు), కొలంబియా కెప్టెన్ జేమ్స్ రోడ్రిగెజ్ (34 ఏళ్లు), సాడియో మానె (34 ఏళ్లు), విర్జిల్ వాన్ డిక్ (35 ఏళ్లు), కెవిన్ డి బ్రూనీ (35 ఏళ్లు), సన్ హెంగ్ మిన్ (34 ఏళ్లు) కూడా చివరిసారి ప్రపంచకప్లో కనిపించనున్నారు.సలా... వన్ మ్యాన్ షో క్లబ్ ఫుట్బాల్ లివర్పూల్ తరఫున సంచలనాలు నమోదు చేసిన ఈజిప్ట్ సూపర్ స్టార్ మొహమ్మద్ సలాకు కూడా ఇదే చివరి ‘ఫిఫా’ వరల్డ్కప్ కానుంది. 2010లో సీనియర్ స్థాయిలో తొలి మ్యాచ్ ఆడిన సలా జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 115 మ్యాచ్లాడి 67 గోల్స్ చేశాడు. అటాకింగ్కు పెట్టింది పేరైన సలా... రెప్పపాటులో ప్రత్యర్థి ప్లేయర్లను బోల్తా కొట్టించడంలో నేర్పరి. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి (2018లో) ప్రపంచకప్ బరిలోకి దిగిన సలా... 2 మ్యాచ్లాడి రెండు గోల్స్ చేశాడు. క్లబ్ ఫుట్బాల్లో 750కి పైగా మ్యాచ్లాడిన అనుభవం ఉన్న అతడు... ఈజిప్ట్ను ఎలా ముందుకు నడిపిస్తాడనేది కీలకం. మైదానంలో అతడి వేగం, గోల్స్ చేయడంలో అతడి సామర్థ్యంపై ఈజిప్ట్ భారీ ఆశలు పెట్టుకుంది. సుదీర్ఘ ‘ఫిఫా’ వరల్డ్కప్ చరిత్రలో ఈజిప్ట్ ఇప్పటి వరకు మూడుసార్లు (1934, 1990, 2018) మాత్రమే మెగా టోర్నీకి అర్హత సాధించింది. 33 ఏళ్ల సలాకు ఫిట్నెస్ పరంగా సమస్యలు లేకపోయినా... ఇప్పటి వరకు ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈజిప్ట్ వచ్చే సీజన్కు అర్హత సాధిస్తుందా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో... అతడికిదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలున్నాయి. లూకా మోడ్రిచ్... క్రొయేషియా ఆశ క్రొయేషియా మిడ్ఫీల్డర్ లూకా మోడ్రిచ్ ఐదోసారి ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ జట్టు ఆడిన సగానికి పైగా మ్యాచ్ల్లో బరిలోకి దిగిన 40 ఏళ్ల మోడ్రిక్ చివరిసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ టోర్నీ ఆడనున్నాడు. కెరీర్లో 196 మ్యాచ్లాడిన మోడ్రిచ్... 28 గోల్స్ చేశాడు. గోల్స్ పరంగా చూసుకుంటే సంఖ్య తక్కువే కనిపించినా మిడ్ఫీల్డ్లో అతడి అనుభవం జట్టుకు ఎంత బలాన్నిస్తుందో గత ప్రపంచకప్లో రుజువైంది. 2022 టోర్నీలో అనూహ్య ఆటతీరుతో జట్టును ముందుకు నడిపించిన మోడ్రిచ్... క్రొయేషియాను మూడో స్థానంలో నిలిపాడు. ప్రస్తుతం ఇటలీ లీగ్లో ఏసీ మిలాన్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న లూకా... ఇటీవల గాయపడి కోలుకున్నాడు. ముఖానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఈ టోర్నీలో అతడు సేఫ్టీ మాస్క్తో బరిలోకి దిగొచ్చు. క్రొయేషియా జట్టు సంధి దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో లూకా అనుభవం ఆ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేనేజర్ డాలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. – సాక్షి క్రీడా విభాగం -
ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నజరానా
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక నార్వే ఓపెన్ చెస్ టోర్నిలో టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన తమిళనాడు గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహకం లభించింది. విజేత హోదాలో చెన్నై వచ్చిన ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో సోమవారం సచివాలయంలో సీఎం విజయ్ను కలిశాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందను విజయ్ సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహానికి గాను చెక్ను అందజేశారు. అనంతరం ప్రజ్ఞానందతో చెస్ బోర్డు తెచ్చావా? అని అడిగి మరీ విజయ్ 15 నిమిషాలపాటు స్నేహపూర్వక గేమ్ ఆడారు. వీరిద్దరి మధ్య గేమ్ను ఛాంబర్లో ఉన్న క్రీడా మంత్రి ఆధవ్ అర్జునతో పాటుగా అ«ధికారులు ఆసక్తితో తిలకించారు. గేమ్లో తనను ఓడించిన ప్రజ్ఞానందను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. -
‘ఆసియా’ అంతంతే!
టేబుల్ టెన్నిస్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, బ్యాడ్మింటన్... తదితర వ్యక్తిగత క్రీడాంశాల్లో విశ్వవేదికపై ఆసియా దేశాల క్రీడాకారులు సంపూర్ణ ఆధిపత్యం చలాయిస్తుంటారు. కానీ జట్టు క్రీడ అయిన ఫుట్బాల్లో మాత్రం ఆసియా దేశాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. కోట్లాది మంది క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించే ఫుట్బాల్ ప్రపంచకప్లోనైతే ఆసియా దేశాలు చిరస్మరణీయ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. 2002లో దక్షిణ కొరియా–జపాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్లో దక్షిణ కొరియా జట్టు సెమీఫైనల్ చేరడమే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఆసియా దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ ప్రదర్శన. పెరిగిన ఆసియా బెర్త్లు... 32 జట్లతో ప్రపంచకప్ నిర్వహించినపుడు ఆసియాకు నేరుగా 4 బెర్త్లు దక్కేవి. ఇంటర్ కాన్ఫడరేషన్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా ఐదో బెర్త్కు కూడా అవకాశం ఉండేది. ఈసారి జట్ల సంఖ్య 48కి పెరగడంతో ఆసియా దేశాలు బెర్త్లు రెట్టింపై 8కి చేరుకున్నాయి. ఇంటర్ కాన్ఫడరేషన్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా తొమ్మిదో బెర్త్ కూడా అవకాశం లభించింది. 47 దేశాలు పోటీపడ్డ ఆసియా క్వాలిఫయింగ్ ద్వారా ఈసారి దక్షిణ కొరియా, జపాన్, ఆ్రస్టేలియా, సౌదీ అరేబియా, ఖతార్, ఉజ్బెకిస్తాన్, జోర్డాన్, ఇరాన్ జట్లు ఎనిమిది బెర్త్లు దక్కించుకోగా... ఇంటర్ కాన్ఫడరేషన్ ప్లే ఆఫ్ మ్యాచ్లో ఇరాక్ జట్టు 2–1 గోల్స్తో బొలీవియా జట్టును ఓడించి తొమ్మిదో బెర్త్ను సంపాదించింది. జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ జట్లు తొలిసారి ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధించాయి. ఆ మూడు జట్లపైనే... దక్షిణ కొరియా జట్టు 12వసారి, జపాన్ జట్టు 8వసారి బరిలోకి దిగుతున్నాయి. ఇరాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా జట్లకు ఇది ఏడో ప్రపంచకప్ కానుంది. ఖతార్, ఇరాక్ జట్లు రెండోసారి ప్రపంచకప్లో పోటీపడుతున్నాయి. జపాన్ జట్టు నాలుగుసార్లు, ఆస్ట్రేలియా రెండుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు వచ్చాయి. ఈసారి కూడా దక్షిణ కొరియా, జపాన్, ఆ్రస్టేలియా జట్లపైనే ఆసియా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మిగతా ఆరు జట్లు గ్రూప్ దశను దాటి ముందుకు వెళితే బోనస్ అనుకోవాలి. – సాక్షి క్రీడా విభాగం -
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్లో కీలక మార్పు
త్వరలో స్వదేశంలో భారత్తో జరుగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు సంబంధించి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ వీక్షకుల సంఖ్య పెంచేందుకు మూడు మ్యాచ్ల ప్రారంభ సమయాలను మార్చింది.వాస్తవానికి ఈ మ్యాచ్లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బ్రాడ్కాస్టర్లతో చర్చల అనంతరం వాటిని సాయంత్రం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) ప్రారంభించాలని నిర్ణయించారు.ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం భారత ప్రేక్షకులే. భారత్లో క్రికెట్కు ఉన్న విపరీతమైన ఆదరణ దృష్ట్యా, మ్యాచ్లు మరింత ఎక్కువ మంది వీక్షించేలా టైమింగ్ను మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బ్రిటన్కు చెందిన స్కై స్పోర్ట్స్, భారత్కు చెందిన సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లతో ECB సంప్రదింపులు జరిపింది.కాగా, జూలై 1 నుంచి 19 వరకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటనుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును తాజాగా ప్రకటించారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు ఈ సిరీస్కు సిద్ధమవుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడంతో ఈ పర్యటనపై మరింత ఆసక్తి నెలకొంది. -
టీమిండియాకు గుడ్ న్యూస్
త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందుతుంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పరీక్షల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సందర్భంగా రోహిత్ హామ్స్ట్రింగ్ గాయానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.తాజాగా ఆ పునరావాసాన్ని పూర్తి చేసుకొని CoEకు చేరాడు. అక్కడ రోహిత్కు మూడు రోజుల పాటు ఫిట్నెస్ పరీక్షలు, నెట్ సెషన్లు, బ్యాటింగ్ ప్రాక్టీస్ నిర్వహించనున్నారు. ఇందులో ఫ్లడ్లైట్ల కింద ప్రత్యేక బ్యాటింగ్ సెషన్ కూడా ఉండనుంది. ఈ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధిస్తేనే రోహిత్కు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఆడేందుకు వైద్యుల అనుమతి లభించనుంది.తొలుత జూన్ 9న జట్టుతో కలిసి వెళ్లాల్సి ఉన్న రోహిత్, ఇప్పుడు ఫిట్నెస్ క్లియరెన్స్ తర్వాత మాత్రమే జట్టులో చేరనున్నాడు. జూన్ 11న ధర్మశాలకు చేరుకుని, జూన్ 13న జరిగే తొలి వన్డేకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.39 ఏళ్ల రోహిత్ ఇటీవల ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, వన్డే ఫార్మాట్లో మాత్రం భారత జట్టుకు కీలక ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతోంది. 2027 ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యంతో రోహిత్ వన్డేల్లో కొనసాగుతున్నాడు. మిగతా ఫార్మాట్లకు ఇతను రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
రెచ్చిపోయిన స్పిన్నర్లు.. విండీస్ను చిత్తు చేసిన టీమిండియా
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్ల్లో టీమిండియా బోణీ కొట్టింది. కార్డిఫ్ వేదికగా విండీస్తో ఇవాళ (జూన్ 8) జరిగిన మ్యాచ్లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమైంది.భారత ఇన్నింగ్స్లో భారతి ఫుల్మాలి (56 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించగా.. షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (39), యస్తికా భాటియా (36) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ 7, రిచా ఘోష్ డకౌట్, రాధా యాదవ్ 1, శ్రేయాంక పాటిల్ 2, క్రాంతి గౌడ్ 4, శ్రీ చరణి 2 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ 4 వికెట్లతో సత్తా చాటగా.. కరిష్క రామ్హరాక్, ఆలియా అలెన్, డియాండ్రా డొట్టిన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఓపెనర్లు డొట్టిన్ (49), షెర్మైన్ క్యాంప్బెల్ (25) శుభారంభం అందించినా, శ్రేయాంక పాటిల్ (4-0-36-4), రాధా యాదవ్ (4-0-25-3) చెలరేగడంతో విండీస్కు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు మినహా విండీస్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. భారత్ జూన్ 10న జరగే తమ మరో మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడనుంది. -
వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై
కెప్టెన్సీతో పాటు టీమిండియాలో స్థానం కోల్పోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్లో కసి రగులుతోన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ముంబై లీగ్లో అతడు వరుస విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో 24 బంతుల్లో 48 పరుగులు చేసిన స్కై.. తాజాగా తానాడిన రెండో మ్యాచ్లో (మరాఠా రాయల్స్) మరింతగా చెలరేగిపోయి 36 బంతుల్లోనే అజేయమైన 72 పరుగులు చేసి తన జట్టును గెలుపు తీరాలు దాటించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ అవార్డును స్కై.. ఇదే మ్యాచ్లో 5 వికెట్లు తీసిన సహచరుడు సిల్వెస్టర్ డిసౌజాతో షేర్ చేసుకొని తన గొప్ప మనసును చాటుకున్నాడు.మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. సిల్వెస్టర్ డిసౌజా (3.5-0-21-5) ధాటికి 152 పరుగులకే ఆలౌటైంది. రాయల్స్ జట్టులో 36 పరుగులు చేసిన మ్యాక్స్వెల్ స్వామినాథన్ టాప్ స్కోరర్గా నిలువగా.. చిన్మయ్ రాజేశ్ సుతార్ (32 రిటైర్డ్ ఔట్), సాహిల్ జాదవ్ (15), కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (24), అయాజ్ ఖాన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ట్రంప్స్ నైట్స్ జట్టు.. సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ద సెంచరీతో పాటు నూతన్ కుమార్ గోయెల్ (56) అర్ద సెంచరీతో రాణించడంతో 16 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.కాగా, త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను తాజాగా ప్రకటించారు. ఫామ్ కోల్పోయిన కారణంగా భారత సెలెక్టర్లు సూర్యను జట్టును తప్పించి, కెప్టెన్సీ నుంచి తొలగించారు. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టు నూతన కెప్టెన్గా ఎంపికయ్యాడు. -
'ఆర్సీబీలోకి రావడమే ఇష్టం లేదు'
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును(ఆర్సీబీ) వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలిపిన అరుదైన కెప్టెన్గా రజత్ పాటీదార్ నిలిచాడు. వరుసగా ఒక జట్టుకు రెండు టైటిల్స్ అందించిన కెప్టెన్ల జాబితాలోనూ (ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ) పాటీదార్ చోటు దక్కించుకున్నాడు. తాజాగా పాటీదార్ మొదట్లో తనకు ఆర్సీబీకి ఆడడం ఇష్టం ఉండేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. యూట్యూబ్ చానెల్లో రోటోరిస్ సిరీస్లో జరిగిన ఇంటర్వ్యూలో పాటీదార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2021లో ఆర్సీబీ జట్టులో చేరిన తనను మొదట ఒక ప్రత్యామ్నాయ ఆటగాడిగా మాత్రమే చూశారని, అదే సమయంలో తన పెళ్లి ఉండడంతో మొదట ఆర్సీబీలో చేరేందుకు ఇష్టపడలేదని వెల్లడించాడు. పాటీదార్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పింది నిజమే. ఆర్సీబీ జట్టులోకి రావడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను తొలిసారి ఆ జట్టులోకి వచ్చిన సమ యంలో ప్రత్యామ్నాయంగానే చూశారు. తుది జట్టులో చోటు ఇవ్వరన్న విషయం క్లారిటీ ఉండడంతో ఆర్సీబీకి ఆడేందుకు సంకోచించాను. ఆర్సీబీలో జాయిన అయిన మొదట్లో కూడా అలాంటి సంకేతాలే వచ్చాయి. మేము నిన్ను ప్రత్యామ్నాయంగా మాత్రమే తీసుకున్నాం. కాబట్టి ప్రశాంతంగా ఉండు. ఎవరైనా గాయపడితే నీకు అవకాశం వస్తుంది అని ఆర్సీబీ యాజమాన్యం క్లియర్గా చెప్పింది. దీంతో ఆర్సీబీలోకి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అదే సమయంలో నా పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఒకవేళ ఆర్సీబీలోకి వచ్చినా బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చేది’ అని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ 2021 సీజన్కు ముందు జరిగిన మినీ వేలంలో పాటిదార్ను ఆర్సీబీ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో పెద్దగా ఆడే అవకాశం రాని పాటీదార్ నాలుగు మ్యాచ్ల్లో 71 పరుగులు మాత్రమే చేశాడు. 2022 ఐపీఎల్ మెగావేలంలో పాటీదార్ను ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే సీజన్ మధ్యలో లవ్నిత్ సిసోడియా గాయపడడంతో అతడి స్థానంలో పాటీదార్ను తీసుకుంది. ఈసారి పాటీదార్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ సీజన్ ఎలిమినేటర్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో పాటీదార్ అజేయ సెంచరీ ( 112 పరుగులు నాటౌట్) సంచలన ఇన్నింగ్స్తో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత పాటీదార్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఐపీఎల్ 2025 మెగావేలం తర్వాత ఆర్సీబీ పాటీదార్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్గా తొలి సీజన్లోనే పాటీదార్ ఆర్సీబీని చాంపియన్గా నిలిపాడు. తాజాగా ఈ సీజన్లోనూ మరోసారి ఆర్సీబీని చాంపియన్గా నిలిపి లక్కీ కెప్టెన్ అయిపోయాడు. పాటీదార్ కెప్టెన్గానే గాక బ్యాటర్గాను అదరగొట్టాడు. ఈ సీజన్లో పాటీదార్ 15 మ్యాచ్ల్లో 501 పరుగులు సాధించాడు.చదవండి: రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే? -
చరిత్ర సృష్టించిన టీమిండియా
తమ 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు అతి భారీ విజయం సాధించింది. ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలవడంతో ఈ ఘనత సాధించింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత్కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో తొలి టెస్ట్ ఆడిన భారత్.. ఇప్పటివరకు ఇన్నింగ్స్ పరంగా ఇంత భారీ విజయం సాధించలేదు.2018లో రాజ్కోట్ వేదికగా వెస్టిండీస్పై సాధించిన ఇన్నింగ్స్ 272 పరుగుల విజయం ఈ మ్యాచ్కు ముందువరకు వరకు భారత జట్టు అతి పెద్ద విజయంగా ఉండింది. ఇన్నింగ్స్ తేడా పరంగా భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 అతి పెద్ద విజయాలు ఇలా ఉన్నాయి.ఆఫ్ఘనిస్తాన్పై, ముల్లాన్పూర్ (2026) – ఇన్నింగ్స్ & 300 పరుగులువెస్టిండీస్పై, రాజ్కోట్ (2018) – ఇన్నింగ్స్ & 272 పరుగులుఆఫ్ఘనిస్తాన్పై, బెంగళూరు (2018) – ఇన్నింగ్స్ & 262 పరుగులుబంగ్లాదేశ్పై, మీర్పూర్ (2007) – ఇన్నింగ్స్ & 239 పరుగులుశ్రీలంకపై, నాగ్పూర్ (2017) – ఇన్నింగ్స్ & 239 పరుగులుభారత గడ్డపై ఇన్నింగ్స్ తేడాతో నమోదైన అతిపెద్ద విజయాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. 1958లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్పై వెస్టిండీస్ సాధించిన ఇన్నింగ్స్ మరియు 336 పరుగుల విజయం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.ఆసియా జట్ల పరంగా చూస్తే, 2002లో లాహోర్లో పాక్ న్యూజిలాండ్పై సాధించిన ఇన్నింగ్స్ మరియు 324 పరుగుల విజయం తర్వాత, భారత్ తాజా విజయం రెండో అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.కాగా, ముల్లాన్పూర్ టెస్ట్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చలాయించి, ఏకపక్ష విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.అనంతరం భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగి ఆఫ్ఘనిస్తాన్ను రెండు ఇన్నింగ్స్ల్లో (152, 112) అతి స్వల్ప స్కోర్లకే కుప్పకూల్చారు. ఫలితంగా ఆ జట్టు ఘోర ఇన్నింగ్స్ పరాభవాన్ని మూటగట్టుకుంది.అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 1), వాషింగ్టన్ సుందర్ (1, 4) ఆఫ్ఘన్ల భరతం పట్టారు. వీరికి కుల్దీప్ (3), ప్రసిద్ద్ కృష్ణ (3) జత కలిశారు. తొలి టెస్ట్లోనే 7 వికెట్ల ప్రదర్శనతో మెరిసిన మానవ్ సుతార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే?
క్రికెట్లో మనకు తెలియని పదాలు చాలానే ఉంటాయి. అయితే ఇందులో మనకు ముఖ్యంగా వినిపించే పదాలు క్యాచ్ అవుట్, రనౌట్, రిటైర్డ్ హర్ట్ అనేవి కామన్గా ఉంటాయి. తాజాగా టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్గన్ రెండో ఇన్నింగ్స్లో షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్కు రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్ (ఏబీఎస్ హర్ట్) అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో అఫ్గానిస్తాన్ 9వ వికెట్ కోల్పోగానే ఆలౌట్ అయినట్లు బిగ్స్క్రీన్పై ప్రత్యక్షమయ్యింది. దీంతో ఆబ్సెంట్ హర్ట్ అనే పదం చర్చకు దారి తీసింది.ఆబ్సెంట్ హర్ట్ అంటే?ఒక ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకముందే, అతను అనారోగ్యంతో లేదా గాయంతో బరిలోకి దిగకపోతే దీనిని ఏబీఎస్ హర్ట్గా సూచిస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని నిరూపిస్తూ కంకషన్ అని ప్రకటిస్తే తప్ప, అతడి స్థానంలో మరొక బ్యాటర్ను ఆడించేందుకు వీలుండదు. ఆ సమయంలో సదరు జట్టు ఒక బ్యాటర్ లేకుండానే ఆటను కొనసాగించాల్సి వస్తుంది. ఆఫ్గన్ బ్యాటర్ అష్రఫ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో జట్టు మేనేజ్మెంట్ అతడిని బ్యాటింగ్కు పంపలేదు. దీంతో తొమ్మిదో వికెట్ కోల్పోయిన అనంతరం ఆఫ్గన్ ఆలౌటైన్లు ప్రకటించారు.రిటైర్డ్ హర్ట్ అంటే?ఇక రిటైర్డ్ హర్ట్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయానికి గురైతే మైదానం వీడడం, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తాను ఆడగలననుకుంటే మళ్లీ క్రీజులోకి రావడాన్ని రిటైర్డ్ హర్ట్ అని పిలుస్తారు. ఈ రూల్ క్రికెట్లో ఎప్పటినుంచో అమల్లో ఉంది.రిటైర్డ్ ఔట్ అంటే?మ్యాచ్లో ఒక ఆటగాడు గాయం లేదా అంపైర్ అనుమతి లేకుండా తనంతట తానుగా క్రీజు వీడడాన్ని రిటైర్డ్ ఔట్ అంటారు. ఇలా చేస్తే మళ్లీ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉండదు. జట్టు స్కోరు పెంచాలనుకునే క్రమంలో హిట్టర్కు అవకాశం ఇచ్చేందుకు ఈ మధ్యన రిటైర్డ్ ఔట్ను ఆయా జట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.చదవండి: ఆఖర్లో గందరగోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్! -
సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్
టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన కెరీర్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో (టెస్ట్లు, దేశవాలీ మల్టీ డే మ్యాచ్లు) 100 వికెట్లు పూర్తి చేసుకున్న రేర్ లిస్ట్లో చేరాడు. ముల్లాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఒకటి, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన సుందర్.. 78 ఇన్నింగ్స్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇందులో నాలుగు 5 వికెట్ల ప్రదర్శనలు, రెండు 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. అదనంగా సుందర్ బ్యాటింగ్లో 2100 పైచిలుకు పరుగులు కూడా చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లోనూ అజేయ అర్ద సెంచరీతో రాణించాడు. మొత్తంగా అతడి ఫస్ట్ క్లాస్ బ్యాటింగ్ కెరీర్లో 3 సెంచరీలు, 11 అర్ద సెంచరీలు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్పూర్ టెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ తేడాతో పరంగా భారత్కు ఇదే అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 1), వాషింగ్టన్ సుందర్ (1, 4) ప్రత్యర్ది భరతం పట్టారు. వీరికి కుల్దీప్ (3), ప్రసిద్ద్ కృష్ణ (3) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు ఇన్నింగ్స్ల్లో (152, 112) అతి స్వల్ప స్కోర్లకే కుప్పకూలింది. తొలి టెస్ట్లోనే 7 వికెట్ల ప్రదర్శనతో మెరిసిన మానవ్ సుతార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 24, ధృవ్ జురెల్ 19, మానవ్ సుతార్ 28, మహ్మద్ సిరాజ్ 22, కుల్దీప్ యాదవ్ 9 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రహ్మాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది తలో వికెట్ తీశారు. -
ఆఖర్లో గందరగోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్!
టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మూడో రోజుల్లోనే ముగిసింది. మ్యాచ్లో టీమిండియా ఆఫ్గన్ను ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో మట్టికరిపించింది. టీమిండియా స్పిన్నర్లు మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను తిప్పేయడంతో అఫ్గానిస్తాన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా భారీ విజయం సాధించినప్పటికీ ఆఫ్గన్ ఇన్నింగ్స్ ఆఖర్లో గందరగోళం నెలకొంది. ఆఫ్గన్ ఇన్నింగ్స్లో 35.5 ఓవర్లో మొహమ్మద్ సలీమ్ సఫీ 9వ వికెట్గా వెనుదిరిగిన తర్వాత ఆఫ్గన్ ఆలౌటైనట్లు బిగ్స్క్రీన్పై వచ్చింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు సహా మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురయ్యారు. మరో వికెట్ ఉండగానే ఆలౌట్ ప్రకటించడం ఏంటని చర్చించుకున్నారు. అయితే ఫీల్డ్ అంపైర్ వచ్చి 11వ స్థానంలో బ్యాటింగ్కు రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయం కారణంగా ఆబ్సెంట్ హర్ట్ అయ్యాడని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ సమయంలోనే అష్రఫ్ కాలి గాయానికి గురవ్వడంతో బ్యాటింగ్కు రాలేదు. దీంతో టీమిండియా జట్టులో సంబరాలు షురూ అయ్యాయి.మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (100), శుబ్మన్ గిల్ (126) శతకాలతో చెలరేగగా, సాయి సుదర్శన్ (81), పంత్ (81), సుందర్ (52) అర్థశతకాలతో ఆకట్టుకున్నారు. ఆఫ్గన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో అఫ్గానిస్తాన్ 152 పరుగులకే కుప్పకూలింది. రహమత్ షా (60) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో మానవ్ సుతార్ 6 వికెట్లతో చెలరేగగా, ప్రసిధ్ క్రిష్ణ 3 వికెట్లు తీశాడు. దీంతో ఫాలోఆన్ ఆడిన అఫ్గానిస్తాన్ 112 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు.చదవండి: టీమిండియాకు షాక్.. ఆఫ్గన్పై గెలిచినా దండగే! -
వైభవ్పై బాలీవుడ్ క్వీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనలతో చెలరేగి, తొలిసారి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న 15 ఏళ్ల యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై రాజకీయ నేతగా మారిన బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీ ఈవెంట్తో ఆమె మాట్లాడుతూ.. వైభవ్ను ప్రశంసలతో ముంచెత్తారు. భారత క్రికెట్ కోసం అతడు విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ స్థాయిని కూడా దాటాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అతడిపై ఒత్తిడి పెట్టడం కాదు కానీ.. ఇండియాకి వరల్డ్కప్ తీసుకురావాలని ఆకాంక్షించారు. వైభవ్ను ఉద్దేశిస్తూ కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరవలవుతున్నాయి.ఇప్పటికే ఓసారి..!స్వల్ప అంతర్జాతీయ కెరీర్లో వైభవ్ ఇప్పటికే ఓసారి ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. తాజా అండర్-19 వరల్డ్కప్లో అతడు కళ్లు చెదిరే ప్రదర్శనలతో టీమిండియాకు ట్రోఫీ అందించాడు. ఈ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్పై వైభవ్ ఆడిన 175 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ యావత్ అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే హైలైట్గా నిలిచింది.ఐపీఎల్ 2026లో ఉగ్రరూపంఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న వైభవ్.. ఐపీఎల్ 2026లో ఉగ్రరూపం దాల్చాడు. ఈ సీజన్లో అతడు 16 ఇన్నింగ్స్లలో 776 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో ఏకంగా 72 సిక్సర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనల కారణంగా వైభవ్కు తొలిసారి టీమిండియాలో చోటు దక్కింది.ఇదిలా ఉంటే, త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఇటీవలే ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేశారు. పేలవ ఫామ్తో బాధపడుతున్న మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటు పడింది. అతడికి జట్టులో కూడా చోటు లభించలేదు. వైభవ్కు మాత్రం మూడు జట్లలో చోటు లభించింది. -
టీమిండియాకు షాక్.. ఆఫ్గన్పై గెలిచినా దండగే!
అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక అఫ్గానిస్తాన్ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. అయితే ఆఫ్గన్పై భారీ విజయం సాధించినప్పటికీ వరల్డ్ టెస్టు చాంపియన్షిఫ్ (డబ్ల్యూటీసీ) పట్టికలో భారత్ స్థానం మాత్రం మారకపోవచ్చు. ప్రస్తుతం గిల్ సేన 48.15 పర్సంటేజ్ పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. మరి ఆఫ్గన్పై టెస్టు విజయం సాధించినా డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారకపోవడానికి కారణమేంటనేది తెలుసుకుందాం. అఫ్గానిస్తాన్తో టెస్టు మ్యాచ్ డబ్ల్యూటీసీ చాంపియన్షిప్ సైకిల్లో లేదు. అందుకే ఈ మ్యాచ్లో భారీ విజయం సాధించినా ఎలాంటి పాయింట్లు రావు. అందుకే డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారదు. 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 9 టెస్టుల్లో నాలుగింట గెలిచింది. భారత్ తన డబ్ల్యూటీసీ సైకిల్ను ఇంగ్లండ్ టూర్తో మొదలుపెట్టింది. ఇంగ్లండ్తో సిరీస్ను డ్రా చేసుకున్న టీమిండియా సౌతాఫ్రికా చేతిలో మాత్రం క్లీన్స్వీప్కు గురైంది.అయితే వెస్టిండీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (8 టెస్టుల్లో 7 విజయాలు) 87.50 పర్సంటైల్తో తొలి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా (75 పర్సంటైల్తో) రెండో స్థానంలో, శ్రీలంక (66.67 పర్సంటైల్తో) మూడో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ (58.33), బంగ్లాదేశ్ (58.33) పర్సంటైల్తో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇంగ్లండ్ (37.88) ఏడో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ (8.33), వెస్టిండీస్ (4.13) పర్సంటైల్ పాయింట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.Leaving New Chandigarh with a massive win under the belt 🇮🇳A complete team performance from #TeamIndia 🤍Scorecard ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/MxUFJHvoq4— BCCI (@BCCI) June 8, 2026చదవండి: ‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్ అసహనం! -
మానవ్ మాయాజాలం.. టీమిండియా రికార్డు విజయం
న్యూ చండీఘడ్లోని ముల్లాన్పూన్ వేదికగా పసికూన ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ ఒకేసారి బ్యాటింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. భారత స్పిన్నర్లు ఏకంగా 16 వికెట్లు తీసి ఆఫ్ఘన్ల భరతం పట్టారు. తొలి ఇన్నింగ్స్లో అరంగేట్రం స్పిన్నర్ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్లో సుందర్ 4, కుల్దీప్ 3 వికెట్లతో సత్తా చాటారు. ఈ గెలుపు టీమిండియాకు పరుగుల పరంగా (ఇన్నింగ్స్) అతి భారీ విజయంగా నిలిచింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 564-8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 24, ధృవ్ జురెల్ 19, మానవ్ సుతార్ 28, మహ్మద్ సిరాజ్ 22, కుల్దీప్ యాదవ్ 9 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రహ్మాన్, కెప్టెన్ హష్మతుల్లా షాహిది తలో వికెట్ తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ను అరంగేట్రం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (22-10-33-6) తిప్పేశాడు. అతడికి ప్రసిద్ద్ కృష్ణ (11-2-37-3), సుందర్ (6.4-1-21-1) కూడా తోడవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టు తరఫున రహ్మత్ షా (60) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో ప్రతిఘటనే లేకుండా చేతులెత్తేసింది. ఈసారి సుందర్ (11-4-36-4), కుల్దీప్ (7.5-1-30-3), సుతార్ (10-2-29-1), సిరాజ్ (4-1-11-1) రెచ్చిపోవడంతో 112 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయంపాలైంది. -
‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్ అసహనం!
జూన్ 11 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి పొట్టి ప్రపంచకప్కు ఇంగ్లండ్ వేదిక కానుంది. టీ20 ప్రపంచకప్లో పాల్గొంటున్న ఆయా జట్ల కెప్టెన్లు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా లండన్లో ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొంది.ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ హర్మన్ప్రీత్ కౌర్ను ఉద్దేశించి..‘హర్మన్ప్రీత్ కౌర్.. ఇది మీకు చివరి టీ20 ప్రపంచ కప్ అవుతుందా? దీనిపై మీరేమంటారు?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా అసహనానికి గురైన హర్మన్ప్రీత్ కౌర్.. ‘ఇది నా చివరి వరల్డ్ కప్ ఎందుకు అవుతుంది? నేనేమైనా రిటైర్ అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా?’ అంటూ హర్మన్ప్రీత్ ఎదురుప్రశ్న వేశారు. దాంతో సదరు రిపోర్టర్ పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తూ.. ‘లేదు.. నేను కేవలం తెలుసుకోవాలని అడిగాను. ఇది మీ చివరి ప్రపంచకప్ కాదని వినడం నాకు సంతోషంగా ఉంది’ అని రిపోర్టర్ చెప్పారు. అయినప్పటికీ తగ్గని హర్మన్ప్రీత్ కౌర్.. ‘మరి అలాంటప్పుడు అసలు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు?’ అంటూ నిలదీశారు. హర్మన్ మాట్లాడుతూ.. వన్డే వరల్డ్కప్ నెగ్గడంతో సహజంగానే మాపై అంచనాలు ఉంటాయి. భారీ అంచనాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆ అంచనాలను అందుకుంటూనే ఆటపై పూర్తి ఫోకస్ను ఉండేలా చూసుకోవాలి. కానీ వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్లు వేర్వేరు. ఈ రెండింటికీ వ్యత్యాసం ఉంటుంది. మ్యాచ్ల విషయంలో ప్రజలు ఎంతో భావోద్వేగంతో ఉంటారు. వారు ఎప్పటికప్పుడు మమ్మల్ని నిశితంగా పరిశీలిస్తారు. ’ అని చెప్పుకొచ్చింది. గతేడాది సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ను గెలిచిన హర్మన్సేనపై భారీ అంచనాలున్నాయి. జూన్ 14 నుంచి భారత్ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా దాయాది పాకిస్తాన్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. -
టెస్టు క్రికెట్పై ఇంగ్లండ్ కెప్టెన్ ఆందోళన.. ముంచింది మీరేగా!
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంప్రదాయ టెస్టు క్రికెట్కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయంతో శుభారంభం చేసినప్పటికీ, మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన స్టోక్స్ టెస్టు క్రికెట్ చచ్చిపోయే స్థితిలో ఉందంటూ పేర్కొన్నాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్స్ మాట్లాడుతూ.. ‘లార్డ్స్ టెస్టులో మేము న్యూజిలాండ్ను 115 పరుగుల తేడాతో ఓడించినప్పటికీ నేను సంతోషంగా లేను. లార్డ్స్ పిచ్ టెస్టు క్రికెట్కు ఉత్తమమైనది కాదనేది నా అభిప్రాయం. ఐదు రోజుల పాటు జరగాల్సిన టెస్టు మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోవడమనేది ఆశ్యర్యం కలిగించింది. టెస్టు క్రికెట్ను అమితంగా ఇష్టపడే నాలాంటి వ్యక్తి .. ఇలాంటి వాటివల్ల మేలు జరుగుతుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. అయితే దీనికి గ్రౌండ్ నిర్వాహకులను తప్పుబట్టలేం. పిచ్ క్యురేటర్ కానీ, గ్రౌండ్స్మన్ కానీ ఒక అంచనాతోనే పిచ్ను రూపొందిస్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాచ్లు రెండు లేదా మూడు రోజుల్లో ముగిసిపోతే టెస్టు క్రికెట్ మనుగడకు ప్రమాదం పొంచి ఉంటుంది.2025-26 యాషెస్ సిరీస్లోనూ మాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆనాడు ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టులు రెండు రోజుల్లోనే ముగిశాయి. ఆసీస్లో ఇలా జరగడంపై అప్పుడు కూడా ఆందోళన వ్యక్తం చేశాను. తాజాగా మా సొంతగడ్డపై కూడా ఒక టెస్టు మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోవడంతో ప్రశ్నలన్నీ నావైపు తిరిగాయి. టెస్టు క్రికెట్ అనేది నా దృష్టిలో ఎన్నటికీ అత్యుత్తమ ఫార్మాట్. అది ఎప్పటికీ కనుమరుగవకూడదని బలంగా నమ్ముతాను.’ అని చెప్పుకొచ్చాడు.అయితే స్టోక్స్ వ్యాఖ్యలను క్రికెట్ అభిమానులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘సంప్రదాయ టెస్టు క్రికెట్కు బజ్బాల్ ఆటను పరిచయం చేసిందే మీరు.. ఐదురోజులు సాగాల్సిన మ్యాచ్లను బజ్బాల్ ఆటతో రెండు లేదా మూడు రోజుల్లో ముగించే మహత్తర కార్యక్రమానికి ఆద్యులు మీరేగా’ అంటూ కామెంట్లు చేశారు.ఇక న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. కివీస్పై 115 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. ఓలీ రాబిన్సన్ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఏడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మరో విశేషమేమిటంటే ఈ మ్యాచ్లో అన్ని వికెట్లు పేస్ బౌలర్లే పడగొట్టడం విశేషం. ఇక రెండో టెస్టు జూన్ 17 నుంచి ఓవల్ వేదికగా జరగనుంది.చదవండి: సీఎం విజయ్తో చెస్ సంచలనం ప్రజ్ఞానంద -
హెచ్సీఏ అధ్యక్షుడికి భారీ షాక్
హైదరాబాద్ క్రికెట్ అసోయేషిన్ అధ్యుక్షుడిగా అమర్నాథ్ నియమాకంపై తెలంగాణ హైకోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. అతని నియమాకం చెల్లదని, ప్రెసిడెంట్ పదవి నుంచి తొలిగించాలని హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. స్పెషల్ ఏజీఎం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని వెంటనే ఎన్నికోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సూచించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్సీఎ నూతన అధ్యుక్షుడిగా అమర్నాథ్ పేరును రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ప్రస్తుత అంబుడ్స్మన్ సురేష్ కుమార్ కైత్ ప్రకటించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో జగన్ మోహన్ రావ్ చేతిలో అమర్నాథ్ కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయాడు. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ మోహన్ రావ్ అవినీతి ఆరోపణలు కేసులో అరెస్ట్ కావడంతో ప్రెసిడెంట్ పదవి నుంచి అతడిని తప్పించారు. ఆ స్ధానంలో రన్నరప్గా నిలిచిన అమర్నాథ్కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అతడి ఎంపిక కూడా చెల్లదని కోర్ట్ తీర్పునివ్వడంతో మరోసారి హెచ్సీఎ ప్రెసెడింట్ పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
జడేజా వారసుడు దొరికేశాడు.. 38 ఏళ్లలో ఒకే ఒక్కడు
భారత క్రికెట్లో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్యేక స్ధానం ఉంది. 37 ఏళ్ల జడేజా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ తనదైన ముద్రవేసుకున్నాడు. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన ఈ సౌరాష్ట్ర వెటరన్ క్రికెటర్.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో మాత్రం ఆడుతున్నాడు.అతడి వయస్సు దృష్ట్యా త్వరలోనే టెస్ట్ క్రికెట్కూ వీడ్కోలు పలికే అవకాశముంది. దీంతో టీమిండియాలో జడేజా వారసుడు ఎవరన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ యువ స్పిన్నర్ వెలుగులోకి వచ్చాడు. తన స్పిన్ మాయాజాలంతో జడేజాను తలపిస్తున్నాడు. అతడే రాజస్తాన్కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్.అరంగేట్రంలో అదుర్స్ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. తన తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్లో 28 పరుగులతో రాణించిన సుతార్.. ఆ తర్వాత బౌలింగ్తో అఫ్గాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.తన వేసిన తొలి ఓవర్లోనే మొదటి అంతర్జాతీయ వికెట్ను అతడు పడగొట్టాడు. ఈ రాజస్తాన్ యువ ఆటగాడు పిచ్పై బంతిని బాగా టర్న్ చేయడంతో పాటు స్టంప్స్ను టార్గెట్ చేస్తూ తనలోని బౌలింగ్ స్కిల్స్ను చూపించాడు. మొదటి ఇన్నింగ్స్లో 22 ఓవర్లు బౌలింగ్ చేసిన సుతార్.. కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.సరికొత్త చరిత్రదీంతో మానవ్ సుతార్ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 21వ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్ల హాల్ సాధించాడు. మళ్లీ ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత సుతార్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అదేవిధంగా గత 38 ఏళ్లలో టెస్టు అరంగేట్రంలో ఒక ఇన్నింగ్స్లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్గా సుతార్ నిలిచాడు. ఇంతకముందు భారత దిగ్గజ బౌలర్ నరేంద్ర హిర్వాణీ తన అరంగేట్రం(1988)లో వెస్టిండీస్పై 61 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టారు.సుతార్ సక్సెస్ వెనక ద్రవిడ్మానవ్ సుతార్ సక్సెస్ వెనక టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ఇండియా-A, అండర్-19 జట్లకు ఆడే సమయంలో ద్రవిడ్ దృష్టిలో సుతార్ పడ్డాడు. నువ్వు బ్యాటింగ్ను ఎలాగైనా మేనేజ్ చేయగలవు, కానీ నీ బౌలింగ్పై ఎక్కువ దృష్టి పెట్టు అని ప్రతీసారి ద్రవిడ్ సలహా ఇచ్చేవాడంట.ఈ విషయాన్ని మానవ్ కోచ్ ధీరజ్ స్వయంగా తెలిపారు. కాగా ఆ సమయంలో ద్రవిడ్ బెంగళూరులోని ఎన్సీఎ హెడ్గా ఉన్నాడు. ప్రస్తుతం తరం క్రికెటర్లంతా వైట్బాల్ క్రికెట్ వైపు మొగ్గు చూపుతుంటే, మానవ్ మాత్రం అందుకు భిన్నంగా గత ఐదు, ఆరేళ్ల నుంచి రెడ్బాల్ క్రికెట్పైనే పూర్తి దృష్టి పెట్టాడు.ఇప్పటికే ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన సత్తాను నిరూపించుకున్నాడు. తన అరంగేట్ర సీజన్(2022-23 రంజీ ట్రోఫీ) రాజస్థాన్ తరఫున కేవలం 6 మ్యాచ్ల్లోనే 39 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు.నెట్స్లో టీమిండియా కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ సారధి శుబ్మన్ గిల్కు సుతార్ గంటల తరబడి బౌలింగ్ చేసేవాడు. గిల్ కూడా నెట్స్లో సుతార్ బౌలింగ్ను ఎదుర్కోవడానికే ఎక్కువ ఆసక్తి చూపించేవాడంట. దగ్గనుంచి అతడి స్కిల్స్ను చూసిన గిల్.. సుత్తార్ భారత జట్టుకు ఎంపిక కావడంలో తన వంతు పాత్ర పోషించాడు. -
సీఎం విజయ్తో చెస్ సంచలనం ప్రజ్ఞానంద
భారత చెస్ గ్రాండ్మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద నార్వే చెస్ చాంపియన్షిప్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో సోమవారం తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ని ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రజ్ఞానందను అభినందించడమే గాక అతడితో సరదాగా చెస్ ఆడాడు. అతడి ప్రదర్శనతో తమిళనాడు గర్విస్తోందని పేర్కొన్న విజయ్ ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల చెక్కును రివార్డుగా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ను రెండుసార్లు ఓడించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఓస్లో వేదికగా జరిగిన టోర్నీలో ప్రజ్ఞానంద ఫైనల్లో జర్మనీ గ్రాండ్మాస్టర్ విన్సెంట్ కీమర్ను మట్టికరిపించి చాంపియన్షిప్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. టోర్నీ ఆరంభంలో తడబడిన ప్రజ్ఞానంద చివరి దశలో అనూహ్యంగా ఫుంజుకున్నాడు. పదో రౌండ్ ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో ప్రజ్ఞానంద ముందు వరుసలో నిలిచాడు. ఆఖరి రౌండ్లో విన్సెంట్ కీమర్ను ఓడించిన ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్ను తొలిసారి సొంతం చేసుకున్నాడు. ఇక నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు అభినందించారు.#WATCH | Chennai | Tamil Nadu CM Vijay meets Indian Grandmaster R Praggnanandhaa and awards him Rs 50 lakh on behalf of the Sports Development Authority of Tamil Nadu after the chess player won the Norway Chess 2026 title.(Source: TNDIPR) pic.twitter.com/Lf4dNgYrEX— ANI (@ANI) June 8, 2026చదవండి: మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియన్స్! -
మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియన్స్!
టీమిండియా టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కు కూడా గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సూర్యకుమార్ను అన్ఫాలో చేసింది. టిట్ ఫర్ టాట్ అన్న తరహాలో సూర్యకుమార్ కూడా తన ఇన్స్టా అకౌంట్లో ముంబై ఇండియన్స్ పేజీని అన్ఫాలో చేయడమే గాక పేజీ నుంచి ముంబై ఇండియన్స్కు సంబంధించిన అన్ని ఫొటోలు, వీడియోలను తొలగించాడు. ప్రస్తుతం సూర్య ఇన అకౌంట్లో దీంతో ముంబై ఇండియన్స్తో సూర్యకుమార్కు బంధం ముగిసినట్లేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం అభిమానులు నిద్రలేచేసరికే ఇదంతా జరిగిపోవడంతో సూర్యకుమార్కు బ్యాడ్టైం నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది. మొన్న కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు లేకుండా చేసి బీసీసీఐ అవమానిస్తే.. ఇవాళ ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ను అన్ఫాలో చేసి అవమానించిందని అభిమానులు తెగ బాధపడిపోతున్నారు.సూర్యకుమార్ బయోను అభిమానులు పరిశీలించి చూడగా.. అతడి బయోలో ముంబై ఇండియన్స్తో పాటు ముంబై అనే పదాన్ని కూడా తొలగించాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ఇన్స్టా అకౌంట్లో ముంబై ఇండియన్స్కు సంబంధించి కేవలం ఒక్క ఫొటో మాత్రమే ఉంది. అది కూడా ధోని, రోహిత్ శర్మలతో కలిసి దిగిన ఫొటో ఉంది. సూర్య కంటే ముందే ముంబై ఇండియన్స్ను వీడుతున్నట్లు వార్తలు వచ్చిన ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా సూర్యకుమార్ అన్ఫాలో చేయడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్లో సూర్యకుమార్ పేలవ ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్లాడిన సూర్యకుమార్ 270 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. అతడి ఖాతాలో రెండు అర్థసెంచరీలు మాత్రమే ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ముంబై తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2018లో కేకేఆర్ నుంచి ముంబై ఇండియన్స్కు వచ్చిన సూర్యకుమార్ అప్పటి నుంచి ఎనిమిదేళ్లుగా ముంబైకే ఆడుతూ వచ్చాడు. ఇందులో ముంబై రెండుసార్లు (2019, 2020) ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమిండియాను మూడోసారి టీ20 చాంపియన్స్గా నిలిపిన సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ తాజాగా అతడి టీ20 కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి దూరమయ్యేలా చేసింది. శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్ను చేయడంతో ఇక టీమిండియాలో సూర్యకుమార్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్కు గుడ్బై చెప్పనున్నట్లు అటు సూర్యకుమార్ కానీ.. ఇటు ముంబై ఇండియన్స్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్ 2027 సీజన్కు ముందు సూర్యకుమార్ ముంబైని వీడుతాడా లేదా ఇవన్నీ ఊహాగానాలకే పరిమితమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.Suryakumar Yadav removed Mumbai Indians and Mumbai from his bio. He unfollowed Mumbai Indians. MI unfollowed him. He deleted all MI related pics and videos from his insta id. He changed his pfp too. What's cooking? pic.twitter.com/PL6ErA6tDc— SKY n Supla Shot (@sky_63_mr_t20i) June 7, 2026 -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. కెప్టెన్గా మళ్లీ అతడే
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్కు ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, స్పిన్నర్ తన్వీర్ సంఘా దూరమయ్యారు. మార్ష్ చీలమండ గాయం (Ankle Injury) కారణంగా తప్పుకోగా.. డేంజరస్ ఓపెనర్కు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతి ఇచ్చింది.మరోవైపు పాకిస్తాన్ పర్యటనలో గాయపడిన తన్వీర్ సంఘా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇక మరోసారి మార్ష్ స్ధానంలో జట్టు పగ్గాలను వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిష్కు క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ అప్పగించింది.అయితే జూన్ 17 నుంచి బంగ్లాతో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ సమయానికి జట్టుతో మార్ష్ కలుస్తాడని సెలెక్టర్ టోనీ డోడెమైడ్ తెలిపారు. కాగా కొత్తగా వన్డే జట్టులోకి మాథ్యూ షార్ట్, ఓలివర్ పీక్, టాడ్ మర్ఫీ వచ్చారు. ఓలివర్ పీక్, షార్ట్ పాకిస్తాన్తో వన్డేలు ఆడినప్పటికి.. మర్పీకి మాత్రం తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. కాగా ఇరు జట్ల మధ్య ఈ వన్డే సిరీస్ జూన్ 9 (మంగళవారం) నుండి ఢాకాలో ప్రారంభం కానుంది. పాక్తో సిరీస్ను 2-1తో కోల్పోయిన కంగారులు తిరిగి తమ రిథమ్ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు.బంగ్లాతో వన్డేలకు ఆసీస్ జట్టుజోష్ ఇంగ్లిస్ (కెప్టెన్/వికెట్ కీపర్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ, కూపర్ కానల్లీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్షా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే -
మానవ్ మాయ.. 152 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాతో జరుగుతున్న ఏకైక టెస్ట్లో భారత బౌలర్లు సత్తాచాటారు. అఫ్గాన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 58.4 ఓవర్లలో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. 113/5 ఓవర్ నైట్స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పర్యాటక జట్టు అదనంగా 39 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది.దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక భారత బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో సత్తాచాటాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు సాధించిన సుతార్.. ఇప్పుడు మూడో రోజు ఆటలో మరో 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ శతాబ్దంలో అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సాధించిన రెండో భారత ప్లేయర్గా సుతార్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2008లో అమిత్ మిశ్రా తన అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇక మానవ్తో పాటు ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టాడు.ఫాల్ ఆన్ ఆడనున్న అఫ్గాన్ఇక స్వల్ప స్కోర్కే పరిమితమైన అఫ్గానిస్తాన్ను ఫాల్ఆన్కు భారత్ అహ్హనించింది. 412 పరుగుల లోటుతో అఫ్గాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండిచా 564 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేఎల్ రాహుల్(100), శుబ్మన్ గిల్(126) సెంచరీలతో కదం తొక్కగా.. సుదర్శన్(81), పంత్(81) హాఫ్ సెంచరీలతో రాణించారు.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే -
శ్రీలంక, వెస్టిండీస్ రెండో వన్డే వర్షార్పణం
శ్రీలంక, వెస్టిండీస్ మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం అయింది. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 41 పరుగులు తేడాతో విజయం సాధించింది.దీంతో ప్రస్తుతం లంక జట్టు సిరీస్లో 1–0తో ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్స్టన్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం లంక జట్టుకు అదే తొలి విజయం. అలాగే కరీబియన్ దీవుల్లో శ్రీలంక జట్టుకు 13 ఏళ్ల తర్వాత ఇదే తొలి వన్డే గెలుపు. ఆదివారం జరగాల్సిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుందనుకుంటే... భారీ వర్షం కారణంగా అది సాధ్యపడలేదు. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే చివరిదైన మూడో వన్డే జరగనుంది. ఆ మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే -
టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే
జితేష్ శర్మ.. గతేడాది ఆఖరి వరకు భారత టీ20 జట్టులో ఫినిషర్గా, సెకండ్ వికెట్ కీపర్గా రేసులో ఉన్నాడు. కానీ టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఇషాన్ కిషన్ రీఎంట్రీతో పరిస్థితి తారుమారైంది. జితేష్ శర్మను పక్కన పెట్టి సెకెండ్ వికెట్ కీపర్గా కిషన్ను సెలక్టర్లు చోటు ఇచ్చారు.ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ ప్రధాన వికెట్ కీపర్ కాగా, అతడికి బ్యాకప్ కిషన్ ఉన్నాడు. అయితే కిషన్ తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తన పునరాగమనంలో ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ దుమ్ములేపాడు. వరల్డ్కప్తో పాటు ఇటీవల ముగిసిన ఐపీఎల్లోనూ ఇషాన్ దుమ్ములేపాడు. కిషన్ అద్భుతంగా రాణిస్తుండడంతో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు జితేష్కు అవకాశం లభించడం లేదు. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు ప్రకటించిన భారత జట్లలోనూ జితేష్కు చోటు దక్కలేదు. అయితే 32 ఏళ్ల జితేష్ శర్మ ఆ కసి, కోపాన్ని విదర్భ ప్రీమియర్ లీగ్-2026లో తన తొలి మ్యాచ్లో చూపించాడు. ఐపీఎల్లో నిరాశపరిచిన ఈ విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్.. తిరిగి తన ఫామ్ను అందుకున్నాడు. ఈ టోర్నీలో 'నెకో మాస్టర్ బ్లాస్టర్' జట్టుకు సారథ్యం వహిస్తున్న జితేష్ శర్మ... 'ఇండియా వారియర్స్' తో మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ ఆర్సీబీ ఆటగాడు ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 10 బంతుల్లోనే 5 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో నెకో మాస్టర్ బ్లాస్టర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఇండియా వారియర్స్ జట్టు మ్యాచ్ చివరి బంతికి 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో జితీష్ టీమ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.చదవండి: వైభవ్కు ముందుంది అసలు పరీక్ష: సౌరవ్ గంగూలీ -
చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత కెప్టెన్గా
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ను 564/8 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన భారత్.. అనంతరం బౌలింగ్లో పర్యాటక జట్టుకు చుక్కలు చూపిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 451 పరుగుల భారీ వెనుకంజలో ఉంది.అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో అదరగొట్టిన గిల్.. అదే జోరును అఫ్గాన్ మ్యాచ్లో కూడా కొనసాగించాడు. 177 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో 126 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్తో కెప్టెన్గా 1000 పరుగుల మైలురాయిని కూడా గిల్ అధిగమించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 101వ కెప్టెన్గా శుబ్మన్ నిలిచాడు. అయితే ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో గిల్ అత్యుత్తమ సగటు కలిగిన రెండో కెప్టెన్గా రికార్డులకెక్కాడు. ఈ మైలురాయిని అతడు ఏకంగా 82.76 సగటుతో అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్(101.51) మాత్రమే గిల్ కంటే మెరుగైన సగటును కలిగి ఉన్నాడు. ఈ జాబితాలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర 69.6 సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు. భారత క్రికెట్ నుంచి మాత్రం గిల్ కంటే ముందు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.అదేవిధంగా కెప్టెన్గా అత్యంత వేగంగా 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్లలో గిల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గిల్ కేవలం 15 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. తొలి స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(14 ఇన్నింగ్స్లు) ఉన్నారు. -
వైభవ్కు ముందుంది అసలు పరీక్ష: సౌరవ్ గంగూలీ
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి అడుగు దూరంలో నిలిచాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్కు ఎంపిక చేసిన భారత టీ20 జట్లలో 15 ఏళ్ల వైభవ్కు చోటు దక్కింది.దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ను సూర్యవంశీ అధిగమించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని ఇప్పుడే అంచనాల భారంతో ఒత్తిడికి గురిచేయకూడదని దాదా అభిప్రాయపడ్డాడు."వైభవ్ సూర్యవంశీకి ఇంకా కేవలం 15 ఏళ్లే. ఇప్పుడే అతడి నుంచి అద్భుతాలు ఆశించి ఒత్తిడి పెంచకండి. స్వేచ్ఛగా ఆడనివ్వండి. అంతర్జాతీయ క్రికెట్కు అలవాటు పడటానికి అతనికి కొంత సమయం ఇవ్వాలి. అయితే వైభవ్ ఒత్తిడి గురుంచి పెద్దగా పట్టించుకోడని నాకు అనిపిస్తోంది.అందుకే ఐపీఎల్లో ఒక సంచలనం మారాడు. కానీ భారత్ తరపున అత్యున్నత స్ధాయిలో ఆడేటప్పుడు కాస్త ఒత్తిడి ఉండడం సహజం. అంతకుతోడు ఐపీఎల్ ఆడే పరిస్థితులకు, యూకే పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. అక్కడ బంతి సీమ్ అవుతుంది.బౌన్స్ , మూవ్మెంట్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొత్త బంతిని ఎదుర్కొవడం బ్యాటర్లకు కష్టంగా ఉంటుంది. అయినప్పటికి వైభవ్ స్కిల్స్పై నాకు నమ్మకం ఉంది. అక్కడ కూడా అతడు అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను" అని గంగూలీ పేర్కొన్నాడు.అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్, గంగూలీ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. "వైభవ్ చాలా చిన్నవాడని, ఇంకా అనుభవం లేదని మనందరికి తెలుసు. కానీ అతడు తన ఆట తీరుతో సెలక్షన్ కమిటీ తలుపులు బద్దలు కొట్టి మరీ జట్టులోకి వచ్చాడు" అని డివిలియర్స్ అన్నాడు. కాగా భారత అండర్-19 జట్టు తరపున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా వైభవ్ తనను నిరూపించుకున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. తొలి భారత కెప్టెన్గా -
మనదే జోరు...
న్యూ చండీగఢ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత క్రికెట్ జట్టు... సొంతగడ్డపై అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టుపై పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్లో భారీ స్కోరు చేసిన టీమిండియా... ఆ తర్వాత తమకు అలవాటైన రీతిలో ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బిగించింది. ఓవర్నైట్ స్కోరు 368/3తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 127 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (177 బంతుల్లో 126; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకం తర్వాత ఎక్కువసేపు నిలవలేకపోగా... రిషబ్ పంత్ (121 బంతుల్లో 81; 6 ఫోర్లు, 3 సిక్స్లు), వాషింగ్టన్ సుందర్ (68 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో సత్తా చాటారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో సలీమ్ 140 పరుగులిచ్చి 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అఫ్గాన్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 39.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. రహమత్ షా (81 బంతుల్లో 43 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20) సహా టాపార్డర్ మొత్తం విఫలమైంది. భారత బౌలర్లలో అరంగేట్ర లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ 15.5 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్ కృష్ణకు రెండు వికెట్లు దక్కాయి. చేతిలో ఐదు వికెట్లు ఉన్న అఫ్గానిస్తాన్... టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 451 పరుగుల దూరంలో ఉంది. ఫాలోఆన్ ఇన్నింగ్స్ తప్పించుకోవాలంటే అఫ్గానిస్తాన్ మరో 252 పరుగులు సాధించాలి. మెరిసిన మానవ్ ఈ మ్యాచ్ ద్వారానే అరంగేట్రం చేసిన మానవ్ సుతార్... తొలి టెస్టులోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. పిచ్ స్పిన్కు సహకరిస్తున్న మాట వాస్తవమే అయినా... మానవ్ తన వైవిధ్యంతో కట్టిపడేశాడు. పదేపదే ఒకే చోట బంతిని వేస్తూ ఫలితం రాబట్టాడు. వరుసగా ఒకే ఎండ్ నుంచి 13 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన 23 ఏళ్ల మానవ్... తాను టెస్టు క్రికెట్కు పూర్తిగా సిద్ధమయ్యే వచ్చినట్లు నిరూపించుకున్నాడు. రవీంద్ర జడేజా తరహాలోనే లెఫ్టార్మ్ స్పిన్ వేయగలగడంతో పాటు... అవసరమైతే కింద వరుసలో బ్యాటింగ్కు వచ్చి ధాటిగా ఆడటంలో మానవ్ దిట్ట. ఈ మ్యాచ్లో అతడు బ్యాట్తోనూ మెరిశాడు. ఏడో స్థానంలో క్రీజులో అడుగుపెట్టి 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 28 పరుగులు చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) అఫ్సర్ (బి) సలీమ్ 24; రాహుల్ (సి) రహ్మనుల్లా (బి) జియాఉర్ రహమాన్ 100; సాయి సుదర్శన్ (సి) అఫ్సర్ (బి) సలీమ్ 81; గిల్ (సి) అఫ్సర్ (బి) సలీమ్ 126; పంత్ (సి) అజ్మతుల్లా (బి) హష్మతుల్లా 81; జురేల్ (బి) సలీమ్ 19; సుందర్ (నాటౌట్) 52; మానవ్ (సి) అఫ్సర్ (బి) సలీమ్ 28; సిరాజ్ (బి) సలీమ్ (22); కుల్దీప్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు: 22;మొత్తం (127 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్) 564. వికెట్ల పతనం: 1–41, 2–180, 3–247, 4–416, 5–452, 6–456, 7–510, 8–540. బౌలింగ్: జియాఉర్ రహమాన్ 24–2–91–1; అజ్మతుల్లా 22–5–67–0; సలీమ్ 27–3–140–6; ఖరోటె 23–0–115–0; అబ్దుల్ 7–0–43–0; హష్మతుల్లా 24–1–91–1. అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్: అబ్దుల్ (సి) సిరాజ్ (బి) మానవ్ 16; సాదిఖుల్లా (బి) ప్రసిధ్ 17; రహ్మానుల్లా (సి) సుదర్శన్ (బి) మానవ్ 12; రహమత్ షా (బ్యాటింగ్) 43; హష్మతుల్లా (ఎల్బీ) ప్రసిధ్ 20; అఫ్సర్ (సి అండ్ బి) మానవ్ 3; ఎక్స్ట్రాలు 2; మొత్తం (39.5 ఓవర్లలో 5 వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–28, 2–40, 3–62, 4–98, 5–113. బౌలింగ్: సిరాజ్ 6– 1–24–0; ప్రసిధ్ 7–0–27–2; మానవ్ 15.5–7–21–3; కుల్దీప్ 7–0–29–0; సుందర్ 4–0–12–0. -
పూర్వ వైభవం కోసం!
ఫుట్బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత నిలకడగా రాణిస్తున జట్లలో జర్మనీ జట్టు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్ జరగ్గా... అత్యధికసార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా జర్మనీకి పేరుంది. నాలుగుసార్లు (1954, 1974, 1990, 2014) విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ జట్టు... మరో నాలుగుసార్లు ఫైనల్లో ఓడిపోయి రన్నరప్గా (1966, 1982, 1986, 2002) నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానం (1934, 1970, 2006, 2010) సంపాదించింది. 2014లో బ్రెజిల్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్లో నాలుగోసారి చాంపియన్గా నిలిచిన జర్మనీ... ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడిపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లు రిటైర్ కావడం... వారి స్థానాలను భర్తీ చేసేవాళ్లు ఇంకా తయారు కాకపోవడం... వెరసి జర్మనీ జట్టు తొలిసారి వరుసగా రెండు ప్రపంచకప్లలో (2018, 2022) గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. రెండేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన ‘యూరో’ టోర్నీలో జర్మనీ క్వార్టర్ ఫైనల్లో చాంపియన్ స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక ప్రపంచకప్ క్వాలిఫయింగ్లో గ్రూప్ ‘ఎ’లో ఉన్న జర్మనీ 15 పాయింట్లతో టాపర్గా నిలిచి మెగా ఈవెంట్కు అర్హత సాధించింది. పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతున్న జర్మనీ ఈసారి గ్రూప్ దశ సులువుగానే దాటే అవకాశం ఉంది. గ్రూప్ ‘ఇ’లో కురసావ్, ఐవరీకోస్ట్, ఈక్వెడార్ జట్లతో జర్మనీకి చోటు కల్పించారు. జర్మనీ తొలి మ్యాచ్ను జూన్ 14న కురసావ్తో, రెండో మ్యాచ్ను జూన్ 20న ఐవరీకోస్ట్తో, జూన్ 25న ఈక్వెడార్తో ఆడుతుంది. మిడ్ఫీల్డర్లు జమాల్ ముసియాలా, ఫ్లోరియన్ విట్జ్, లెనార్ట్ కార్ల్, కాయ్ హావెట్జ్లతోపాటు వెటరన్ గోల్కీపర్ మాన్యుయెల్ న్యూయెర్ ప్రదర్శనపై జర్మనీ ముందంజ వేసే ఆశలు ఆధారపడి ఉన్నాయి. జర్మనీ జట్టుకు నాకౌట్ దశ ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్ ఎదురయ్యే అవకాశముంది. ఫ్రాన్స్ అడ్డంకిని అధిగమిస్తే జర్మనీ నుంచి అద్భుత ఫలితం ఆశించవచ్చు. – సాక్షి క్రీడావిభాగం -
రన్నరప్ అనిరుధ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టైటిల్ సాధించాలని ఆశించిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్కు నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్లో ఆదివారం ముగిసిన బర్మింగ్హామ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో అనిరుధ్ (భారత్)–టకెరు యుజుకి (జపాన్) ద్వయం రన్నరప్గా నిలిచింది. బెన్ జోన్స్–జోషువా పారిస్ (బ్రిటన్) జంటతో జరిగిన ఫైనల్లో అనిరు«ద్–టకెరు జోడీ 4–6, 6–7 (4/7)తో పోరాడి ఓడిపోయింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అనిరుధ్–టకెరు ఏడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తొలి సర్వీస్లో 37 పాయింట్లు, రెండో సర్వీస్లో ఆరు పాయింట్లు సాధించారు. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. అంతకుముందు తొలి రౌండ్లో అనిరు«ద్–టకెరు 4–6, 7–6 (7/5), 10–1తో ఫిన్ బాస్–స్కాట్ డంకన్ (బ్రిటన్)లపై, క్వార్టర్ ఫైనల్లో 7–6 (7/3), 6–3తో ఫిన్ రేనాల్డ్స్–జేమ్స్ వాట్ (న్యూజిలాండ్)లపై, సెమీఫైనల్లో 7–5, 7–6 (7/5)లతో డీగో హిడాల్గో (ఈక్వెడార్)–ప్యాట్రిక్ ట్రహక్ (అమెరికా)లపై గెలుపొందారు. రన్నరప్ అనిరుద్–టకెరులకు 5,220 (రూ. 4 లక్షల 95 వేలు) డాలర్ల ప్రైజ్మనీతోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది అనిరు«ద్–టకెరు ద్వయం బుసాన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో డబుల్స్ టైటిల్ గెలిచింది. -
వీల్చైర్ నుంచి విక్టరీ పోడియం వరకు...
రాకెట్ పట్టిన ప్రతి చిన్నారి కల ఒక్కటే... ఏనాటికైనా ఏ విభాగంలోనైనా గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాలని... అయితే తమ లక్ష్యం నెరవేరకుండానే... దానికి సమీపంలోకి రాకుండానే... ఎంతోమంది రాకెట్ వదిలేస్తారు.... కానీ కొందరుంటారు... ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా... ఎన్నిసార్లు విఫలమైనా... తమకంటూ ఒక రోజు వస్తుందనే నమ్మకంతో టైటిల్ వేటను కొనసాగిస్తుంటారు. ఆలస్యమైనా వారు జీవిత లక్ష్యం అందుకుంటారు... జీవన స్వప్నం సాకారం చేసుకుంటారు... ఆ కోవలోకే వస్తాడు జర్మనీకి చెందిన 29 ఏళ్ల అలెగ్జాండర్ జ్వెరెవ్. పుష్కరకాలం నుంచి ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడుతున్న జ్వెరెవ్ నాలుగో ప్రయత్నంలో తన గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ కలను నిజం చేసుకున్నాడు. పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపించాడు. నాలుగేళ్ల క్రితం ఏ వేదిక నుంచి గాయపడి వీల్చైర్లో బయటకు వెళ్లాడో... ఇప్పుడు అదే వేదికపై సగర్వంగా విన్నర్స్ ట్రోఫీని ఎత్తుకున్నాడు. – సాక్షి క్రీడా విభాగంఆరేళ్ల క్రితమే తొలి ప్రయత్నంలోనే అలెగ్జాండర్ జ్వెరెవ్ గ్రాండ్స్లామ్ సింగిల్స్ ట్రోఫీని ముద్దాడాల్సింది. డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా)తో జరిగిన 2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్ తొలి రెండు సెట్లు గెల్చుకున్నాడు. విన్నర్స్ ట్రోఫీకి కేవలం ఒక్క సెట్ దూరంలో ఉన్నాడు. అయితే జ్వెరెవ్ కలను థీమ్ భగ్నం చేశాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినా... పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన థీమ్ వరుసగా మూడు సెట్లు గెలిచి యూఎస్ ఓపెన్ చాంపియన్గా అవతరించాడు. జ్వెరెవ్ నిరాశగా వెనుదిరిగాడు. నాలుగేళ్లు గడిచాయి... 2024లో జ్వెరెవ్కు మరో ‘గ్రాండ్’ టైటిల్ అవకాశం లభించింది. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్లో... కానీ స్పెయిన్ రైజింగ్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ అసాధారణ ప్రదర్శన ముందు జ్వెరెవ్ ఎదురునిలువ లేకపోయాడు. చివరి రెండు సెట్లు చేజార్చుకున్న జ్వెరెవ్ టైటిల్ను కూడా వదులుకున్నాడు. ఏడాది తిరిగేలోపు 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్లో జ్వెరెవ్ ముచ్చటగా మూడో ‘గ్రాండ్’ చాన్స్ లభించింది. కానీ ఇటలీ స్టార్ యానిక్ సినెర్ ధాటికి జ్వెరెవ్ వరుస సెట్లలో చేతులెత్తేశాడు. మూడోసారి నిరాశతో ఇంటిదారి పట్టాడు. ఈసారి వదల్లేదు... కెరీర్లో 41వసారి గ్రాండ్స్లామ్ ఆడేందుకు జ్వెరెవ్ 11వసారి పారిస్కు వచ్చాడు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. సెర్బియా దిగ్గజం, 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. దాంతో జ్వెరెవ్ గ్రాండ్స్లామ్ టైటిల్ ఈసారి నెరవేరడం లాంఛనమే అనిపించింది.అనుకున్నట్లే... తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన జ్వెరెవ్ కెరీర్లో ఆడిన 41వ గ్రాండ్స్లామ్ టోర్నీలో విజేత ట్రోఫీని అందుకున్నాడు. 2022 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్ సందర్భంగా స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్థో సెమీఫైనల్ ఆడుతూ జ్వెరెవ్ జారిపడ్డాడు. గాయంతో చక్రాల కుర్చీతో మైదానాన్ని వీడాడు. ఇప్పుడు అదే మట్టికోర్టులో కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచాడు. జ్వెరెవ్ అద్భుత ప్రస్థానంలో కొన్ని ఆసక్తికర విషయాలను పరిశీలిస్తే... టెన్నిస్ ఫ్యామిలీ... జ్వెరెవ్ది అసలు సిసలు టెన్నిస్ కుటుంబం. అతడి తల్లిదండ్రులు ఇరినా జ్వెరెవా, అలెగ్జాండర్ జ్వెరెవ్ సీనియర్ ఇద్దరూ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్లే. ఈ జంట సోవియట్ యూనియన్ తరఫున ఆడింది. ఇక జ్వెరెవ్ సోదరుడు మిషా జ్వెరెవ్ కూడా ప్రొఫెషనల్ ఆటగాడే. అతడు ఏటీపీ టూర్లో పలు విజయాలు సాధించాడు. అతడి కుటుంబం భిన్న సంస్కృతులకు నెలవు. జ్వెరెవ్ ఇంట్లో మూడు భాషలు మాట్లాడుతారు. జర్మనీలో పుట్టి పెరగడంతో జర్మన్తో పాటు మూలాల కారణంగా రష్యన్, ఇంగ్లిష్ లో ధారాళంగా మాట్లాడగలరు. అమ్మ దిద్దిన చాంపియన్... ఇంట్లో అందరూ టెన్నిస్ ప్లేయర్లే కాగా... జ్వెరెవ్ ఆది గురువు మాత్రం తల్లే! శరీర దారుఢ్యంపై తండ్రి దృష్టి పెడితే... తల్లి ఇరినా మాత్రం అతడికి టెన్నిస్లో ఓనమాలు నేర్పింది. సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే తనకంటూ కొన్ని ప్రత్యేక షాట్లు ఉండాలని బలంగా నమ్మిన ఇరినా... జ్వెరెవ్కు బ్యాక్హ్యాండ్ షాట్ను పదేపదే ప్రాక్టీస్ చేయించేది. ఆమె కృషి వల్లే బ్యాక్హ్యాండ్ పవర్ ఫుల్ షాట్ తనకు అలవడిందని జ్వెరెవ్ గతంలో పలుమార్లు వెల్లడించాడు. చిన్నప్పుడు బాగా చురుకుగా ఉండే జ్వెరెవ్... ఓటమిని అస్సలు అంగీకరించలేకపోయేవాడని సోదరుడు మిషా తెలిపాడు. పసితనంలో జ్వెరెవ్ తన చేతిలో ఓడిపోతే... గెలిచే వరకు టెన్నిస్ కోర్టు వీడేవాడు కాదని గుర్తుచేసుకున్నాడు. హాకీ, ఫుట్బాల్ వదిలేసి... అందరు పిల్లల్లాగే చిన్నప్పుడు వేర్వేరు క్రీడలను ఇష్టపడ్డ జ్వెరెవ్.. టెన్నిస్తో పాటు హాకీ, ఫుట్బాల్ కూడా ఆడేవాడు. అయితే 12 ఏళ్ల ప్రాయంలో ఫ్లోరిడాలో జరిగిన ఒక జూనియర్ టోర్నమెంట్లో జ్వెరెవ్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. దీంతో టెన్నిస్పై కసి పెంచుకున్న అతడు ... మిగిలిన క్రీడలను పక్కనపెట్టి వంద శాతం టెన్నిస్పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఫ్యాషన్లోనూ తనదైన శైలి కోర్టులో ఆటతో పాటు... కోర్టు బయట ఫ్యాషన్తోనూ జ్వెరెవ్ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 2017 యూఎస్ ఓపెన్ సందర్భంగా అతడి ఫ్యాషన్... సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 1970 నాటి స్టయిల్లో అతడి డ్రెస్సింగ్ స్టయిల్కు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రముఖ సంగీత కళాకారుడు, డిజైనర్ ఫారెట్ విలియమ్స్ జ్వెరెవ్ కోసం ప్రత్యేకంగా దుస్తువులు డిజైన్ చేస్తాడు. ప్రత్యేక అతిథిలా....జ్వెరెవ్కు కుక్కలంటే చాలా ఇష్టం. ఏటీపీ టూర్ టోర్నమెంట్లలో జ్వెరెవ్ తరచూ తన పెంపుడు కుక్క ‘లోవిక్’తో దర్శనమిస్తాడు. లోవిక్కు అతడి జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతగానంటే... తనతో పాటు కోర్టులో తిరగడానికి దానికి ప్రత్యేక అతిథిగా అనుమతి పత్రాలు సైతం తీసుకున్నాడు.ముందే ఒలింపిక్ స్వర్ణంగ్రాండ్స్లామ్ టైటిల్ గెలవడానికి ముందే జ్వెరెవ్... ఒలింపిక్ స్వర్ణం నెగ్గాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో జ్వెరెవ్ పసిడి పతకం సాధించి... పురుషుల సింగిల్స్లో ఈ ఘనత సాధించిన తొలి జర్మనీ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో సెమీఫైనల్లో అతడు... సెర్బియా దిగ్గజం జొకోవిచ్ను ఓడించి ముందంజ వేశాడు. డయాబెటీస్తో పోరాడుతూనాలుగేళ్ల వయసు నుంచే టైప్–1 డయాబెటీస్తో ఇబ్బందిపడుతున్న జ్వెరెవ్... ఆ విషయాన్ని 2022లో బహిరంగంగా వెల్లడించాడు. కెరీర్లో చాలా వరకు మ్యాచ్ల విరామంలో వైద్యుల సూచన మేరకు ఇన్సులిన్ తీసుకున్నట్లు తెలిపాడు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పిల్ల్లలకు ఇన్సులిన్తో పాటు మరికొన్ని అత్యవసర మందులు అందించాలనే లక్ష్యంతో అతడు ‘అలెగ్జాండర్ జ్వెరెవ్’ ఫౌండేషన్ను స్థాపించాడు. -
జయహో జ్వెరెవ్
పారిస్: నిరీక్షణ ముగిసింది.... జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను గెల్చుకున్నాడు. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్లో రెండో సీడ్ జ్వెరెవ్ విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ జ్వెరెవ్ 6–1, 4–6, 6–4, 6–7 (5/7), 6–1తో ప్రపంచ 14వ ర్యాంకర్, పదో సీడ్ ఫ్లావియో కొబోలి (ఇటలీ)పై గెలిచాడు. 4 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది సమరంలో జ్వెరెవ్ నిర్ణాయక ఐదో సెట్లో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ ఫైనల్ ఆడిన కొబోలి చివరి సెట్లో తడబడ్డాడు. ఈ సెట్లో జ్వెరెవ్ మూడుసార్లు కొబోలి సర్వీస్ను బ్రేక్ చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ గాయంతో వైదొలగడం... ప్రపంచ నంబర్వన్ సినెర్ రెండో రౌండ్లోనే వెనుదిరగడం... సెర్బియా దిగ్గజం జొకోవిచ్ మూడో రౌండ్లోనే ఓడిపోవడం .... వెరసి జ్వెరెవ్కు తన ‘గ్రాండ్’ కలను నిజం చేసుకునేందుకు సువర్ణావకాశం లభించింది. నాలుగో ప్రయత్నంలో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్నుకైవసం చేసుకున్నాడు. 2020 యూఎస్ ఓపెన్, 2024 ఫ్రెంచ్ ఓపెన్, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్లో ఓడిపోయిన జ్వెరెవ్ ఈసారి మాత్రం వదల్లేదు. కాస్త ఒత్తిడికి లోనైనా... కీలకదశలో తన అనుభవంతో గట్టెక్కి ‘గ్రాండ్’ స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జ్వెరెవ్కు 28 లక్షల యూరోలు (రూ. 30 కోట్ల 62 లక్షలు), రన్నరప్ కొబోలికి 14 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 31 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. బోరిస్ బెకర్ (1996లో ఆస్ట్రేలియన్ ఓపెన్) తర్వాత గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన జర్మనీ ప్లేయర్గా జ్వెరెవ్ గుర్తింపు పొందాడు. -
WTC పాయింట్ల పట్టికలో మార్పులు
ఇవాళ ముగిసిన లార్డ్స్ టెస్ట్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ 115 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత WTC 2025-27 పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓటమితో న్యూజిలాండ్ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్పై గెలిచినా ఇంగ్లండ్ స్థానంలో ఎలాంటి మార్పు జరగలేదు. వారి PCT (పాయింట్ల శాతం) 31.67 నుంచి 37.88కి పెరిగినప్పటికీ ఏడో స్థానంలోనే కొనసాగుతోంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానానికి పడిపోవడంతో సౌతాఫ్రికా, శ్రీలంక రెండు, మూడు స్థానాలకు ఎగబాకాయి.భారత్ ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇటీవల పాక్ను రెండు మ్యాచ్ సిరీస్లో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉంది. వెస్టిండీస్ (9), పాకిస్తాన్ (8) జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.లార్డ్స్ టెస్ట్ విషయానికొస్తే.. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ పూర్తిగా చేతులెత్తేసింది. 138 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకపడిపోయింది.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ను 140 పరుగులకే ఆలౌట్ చేసింది. జేమీసన్ 5, నాథన్ స్మిత్ 3, విలియమ్ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం న్యూజిలాండ్ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ 5, టంగ్ 3, అట్కిన్సన్ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన జేమీసన్ టాప్ స్కోరర్గా నిలిచాడు.27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ అరంగేట్రం బ్యాటర్ ఎమిలియో గే (57), డకెట్ (33), జేమీ స్మిత్ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్ స్మిత్ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్ ఓరూర్కీ 2, మ్యాట్ హెన్రీ, జేమీసన్ తలో వికెట్ తీశారు.254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్ 5, రాబిన్సన్, టంగ్ తలో 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కాన్వే (41), గ్లెన్ ఫిలిప్స్ (44 నాటౌట్), కేన్ విలియమ్సన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 17న మొదలవుతోంది. -
టీమిండియాపై పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు
పాకిస్తాన్ ఆల్రౌండర్ ఖుష్దిల్ షా టీమిండియాను ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. తమ మధ్య జరిగే మ్యాచ్ల్లో అంపైరింగ్ నిర్ణయాలు, షెడ్యూలింగ్ సహా అనేక అంశాలు భారత్కు అనుకూలంగా ఉంటాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.తాజాగా ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. భారత్తో మ్యాచ్ల్లో చాలా విషయాలు వాళ్లకు అనుకూలంగా ఉంటాయి. అంపైరింగ్ నిర్ణయాలు, కొన్ని డ్రెస్సింగ్రూమ్ నిర్ణయాలు, మ్యాచ్ల నిర్వహణ కూడా వారి కోరికల మేరకే జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ గెలిస్తే ఆ ఆనందం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నాడు.భారత్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో..ఇటీవలికాలంలో భారత్పై పాకిస్తాన్ రికార్డు నిరాశాజనకంగా ఉంది. టీమిండియాపై పాక్ చివరిసారి 2022 ఆసియా కప్ సూపర్-4 దశలో విజయం సాధించింది. అప్పటి నుంచి జరిగిన ఆరు వరుస మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది.వన్డేల్లో అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత పాకిస్తాన్ భారత్ను ఓడించలేదు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఆరు వన్డేల్లోనూ భారత్దే పైచేయిగా నిలిచింది.గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలుభారత్కు అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందని కొందరు పాక్ మాజీలు గతంలోనూ ఆరోపించారు. అయితే ప్రస్తుత క్రికెటర్ ఖుష్దిల్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.ఖుష్దిల్ షా భారత్పై ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన వన్డేలో 39 బంతుల్లో 38 పరుగులు చేసి, వికెట్ తీసుకున్నప్పటికీ, ఆ మ్యాచ్లో పాక్ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. మొత్తంగా షా పాక్ తరఫున 15 వన్డేలు, 38 టీ20లు ఆడి 762 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు. -
కెప్టెన్ అయ్యాక శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత టీ20 కెప్టెన్గా నియమితుడయ్యాక శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి పనిచేయబోతున్న నేపథ్యంలో, తన నాయకత్వ శైలిని మార్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.ప్రస్తుతం ముంబై టీ20 లీగ్ ఆడుతున్న అయ్యర్ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. భారత జట్టు కెప్టెన్సీ పెద్ద సవాలే కానీ, దాని కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇంతకుముందు ఎలా ఉన్నానో, ఇకపై కూడా అలాగే ఉంటానని అన్నాడు. ఈ వ్యాఖ్యలను కొందరు గంభీర్కు పరోక్ష సందేశంగా అభివర్ణిస్తున్నారు.గంభీర్-అయ్యర్ గతంలో ఐపీఎల్లో కలిసి పని చేశారు. 2024లో వీరిద్దరి కాంబినేషన్లో (మెంటార్-కెప్టెన్) కేకేఆర్ టైటిల్ గెలిచింది. అంతకుముందు ఇద్దరూ ఆటగాళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడారు.అయ్యర్ శైలి ప్రత్యేకంఅయ్యర్ నాయకత్వంలో ప్రధానంగా కనిపించే అంశం ఆటగాళ్లపై నమ్మకం. ఒకసారి ఆటగాడికి అవకాశం ఇస్తే అతడికి పూర్తి మద్దతు ఇవ్వడం అయ్యర్ శైలిగా గుర్తింపు పొందింది.ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ప్రభ్సిమ్రన్ సింగ్ అభివృద్ధిలో అయ్యర్ పాత్ర కీలకమని పలుమార్లు ప్రశంసలు వచ్చాయి. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడం, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అయ్యర్ బలంగా భావిస్తారు. -
ఇందిరా పార్క్ వద్ద యువ క్రికెటర్ల ధర్నా
హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద "తెలంగాణ క్రికెట్ కోసం ప్రజా ఉద్యమం" పేరుతో నిర్వహించిన ధర్నాలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) నేతలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై పలు ఆరోపణలు చేశారు.టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు హెచ్సీఏలో సరైన అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన ఆటగాళ్లు హెచ్సీఏ వ్యవస్థ కారణంగా నష్టపోతున్నారని ఆరోపించారు.ప్రత్యేక తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలు, మండలాల స్థాయిలో ఇతర క్రీడలకు ఉన్నట్లుగా క్రికెట్కు కూడా ప్రత్యేక వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. బీసీసీఐ టోర్నమెంట్లలో ఆడాలంటే హెచ్సీఏ పరిధిలోనే ఉండాల్సిన పరిస్థితి జిల్లాల ఆటగాళ్లకు ఇబ్బందిగా మారిందన్నారు.హెచ్సీఏలో అవినీతి, అక్రమాలు జరిగాయని, ఎంపికల ప్రక్రియలో పారదర్శకత లేదని టీసీఏ నేతలు ఆరోపించారు. క్లబ్ల నమోదు, ఎన్నికలు, ఆర్థిక వ్యవహారాలు, క్రీడాకారుల ఎంపికలో పలు అక్రమాలు జరిగాయని వారు పేర్కొన్నారు. హెచ్సీఏలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.అలాగే హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీగ్లకు సంబంధించిన అనుమతులు, క్లబ్ల చట్టబద్ధత, పాలకవర్గ నియామకాలపై కూడా టీసీఏ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో సమర్పించిన ఫిర్యాదులపై ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామీణ, జిల్లా స్థాయి ఆటగాళ్ల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చరిత్రాత్మక లార్డ్స్ టెస్ట్లో ఇంగ్లండ్దే గెలుపు
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన చారిత్రక టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్లో లార్డ్స్లో జరిగిన 150వ మ్యాచ్ కావడంతో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలో 150 టెస్ట్లకు ఆతిథ్యమిచ్చిన తొలి స్టేడియం లార్డ్స్ క్రికెట్ మైదానం.పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లు స్వల్ప స్కోర్కే పరిమితమయ్యాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ను 140 పరుగులకే ఆలౌట్ చేసింది. జేమీసన్ 5, నాథన్ స్మిత్ 3, విలియమ్ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం న్యూజిలాండ్ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ 5, టంగ్ 3, అట్కిన్సన్ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన జేమీసన్ టాప్ స్కోరర్గా నిలిచాడు.27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ అరంగేట్రం బ్యాటర్ ఎమిలియో గే (57), డకెట్ (33), జేమీ స్మిత్ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్ స్మిత్ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్ ఓరూర్కీ 2, మ్యాట్ హెన్రీ, జేమీసన్ తలో వికెట్ తీశారు.254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్ 5, రాబిన్సన్, టంగ్ తలో 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో కాన్వే (41), గ్లెన్ ఫిలిప్స్ (44 నాటౌట్), కేన్ విలియమ్సన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 17న మొదలవుతోంది. -
పసిడి పతకం ముద్దాడిన సుచిత్ర అకాడమీ స్టార్లు
హైదరాబాద్ వేదికగా యోనెక్స్-సన్రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ (U-15) నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో సరికొత్త ఛాంపియన్లు అవతరించారు. సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన కిమ్కిమ్ ఖోంగ్సాయి, లియాన్సాంగ్పుయా జోడి మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో పసిడి పతకం కైవసం చేసుకున్నారు.ఫైనల్లో ప్రత్యర్ధిపై 21-10, 21-15 వరుస సెట్లలో గెలిచి ఛాంపియన్స్గా నిలిచారు. అంతకుముందు సెమీఫైనల్లో టోర్నీ రెండువ సీడ్ జోడీపై వీరిద్దరూ ఘన విజయం సాధించారు. కాగా కిమ్కిమ్ ఖోంగ్సాయి, లియాన్సాంగ్పుయా ఇద్దరూ మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు.వారిద్దరికి 'సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ'లో చేరకముందు కనీసం రాష్ట్ర స్థాయి మ్యాచ్లు కూడా అనుభవం లేదు. వారిని చిన్న వయసులోనే హైదరాబాద్ తీసుకొచ్చి, అకాడమీ తరపున డైరెక్టర్ కె. ప్రదీప్ రాజు ఉచిత కోచింగ్ ఇచ్చారు. -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్లో దంచికొట్టిన రాహుల్... టెస్టు ఫార్మాట్లోనూ అదే జోరు కొనసాగించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగం కానీ ఈ మ్యాచ్లో భారత్కు చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు.చక్కటి షాట్లతో మంచి టచ్లో కనిపించిన యశస్వి జైస్వాల్ త్వరగానే అవుటవడంతో... అఫ్గాన్ శిబిరంలో ఆనందం కనిపించింది. వనడౌన్ బ్యాటర్ సుదర్శన్ సాయంతో రాహుల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. చితూచి ఆడిన ఈ జంట ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది. మంచి బంతులను వదిలేసిన ఈ జోడీ... గతి తప్పిన బంతులపై విరుచుకుపడింది.దీంతో స్కోరుబోర్డు సాఫీగా సాగగా... అఫ్గాన్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జంటను విడదీయలేకపోయారు. అనుభవరాహిత్యం అఫ్గాన్ జట్టుకు ప్రతిబంధకంగా మారింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ బ్యాట్ను తాకిన బంతి... కీపర్ చేతిలో పడింది. అయితే అంపైర్ ఇది గుర్తించకపోగా... అఫ్గాన్ రివ్యూ కోరలేదు. తర్వాత రీప్లేలో అది స్పష్టంగా అవుట్ అని కనిపించింది. దీంతో బతికిపోయిన రాహుల్... టెస్టు ఫార్మాట్లో 12వ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.చరిత్ర సృష్టించిన రాహుల్రాహుల్ సరిగ్గా 100 పరుగుల వద్దే అవుట్ కావడం రాహుల్ కెరీర్లో ఇది మూడోసారి. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు ఖచ్చితంగా 100 పరుగుల వద్ద అవుట్ అయిన భారత బ్యాటర్గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తమ కెరీర్లో రెండేసి సార్లు ఇలా వంద పరుగుల వద్ద అవుట్ అయ్యారు. ఇప్పుడు రాహుల్ వారిని అధిగమించాడు. అంతేకాకుండా రాహుల్ తన టెస్ట్ కెరీర్లో చేసిన చివరి మూడు సెంచరీలు కూడా ఇలా వంద పరుగులు వద్దే ముగిశాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా మూడు సెంచరీలను ఇలా 'ఖచ్చితంగా 100' వద్దే ముగించిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. -
షాహీన్ అఫ్రిదికి ఊహించని షాక్
పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన రెడ్బాల్ శిక్షణ శిబిరంలో అతడికి చోటు దక్కలేదు. దీంతో షాహీన్ టెస్టు భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి.జూన్ 8 నుంచి జూలై 10 వరకు జరిగే రెడ్బాల్ క్యాంప్కు 22 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన పీసీబీ, షాహీన్ పేరును జాబితాలో చేర్చలేదు. అయితే జూన్ 15 నుంచి సెప్టెంబర్ 18 వరకు కొనసాగే వైట్బాల్ క్యాంప్లో మాత్రం అతడికి స్థానం కల్పించింది.ఆస్ట్రేలియాపై మెరిసినా..తాజాగా పాక్ ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ను గెలవడంలో (2-1) షాహీన్ కీలక పాత్ర పోషించాడు. మూడు ఇన్నింగ్స్ల్లో 7 వికెట్లు తీసి, 3.86 ఎకానమీతో ఆకట్టుకున్నాడు.అలాగే ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో కూడా రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్లు సాధించాడు. అయినప్పటికీ రెడ్బాల్ క్యాంప్ నుంచి అతడిని తప్పించడంపై ఆశ్చర్యకరంగా ఉంది.తీవ్ర విమర్శలుఇటీవలి కాలంలో పాక్ టెస్ట్ జట్టు ప్రదర్శనలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండోసారి వైట్వాష్కు గురికావడం, నాలుగు వరుస టెస్టుల్లో ఓడిపోవడం జట్టు ఘోర పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో భారీ మార్పులు చేయాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.రెడ్బాల్ క్యాంప్లో స్టార్ ఆటగాళ్లురెడ్ బాల్ క్యాంప్లో షాహీన్కు చోటు దక్కకపోయినా.. బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, సల్మాన్ అఘా, ఇమామ్ ఉల్ హక్, ఆమిర్ జమాల్ వంటి ప్రముఖులకు అవకాశం లభించింది.ఇదిలా ఉంట, పాక్ తదుపరి టెస్ట్ మ్యాచ్లు జులై ఆఖర్లో ఆడాల్సి ఉంది. జులై 25 నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు విండీస్లో పర్యటించనుంది. ఈ సిరీస్తో పాటు తదుపరి టెస్ట్ షెడ్యూల్ దృష్ట్యా పాక్ రెడ్ బాల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. -
టీమిండియాలో నో ప్లేస్.. గంటల వ్యవధిలోనే హ్యాట్రిక్తో చెలరేగిన షమీ
భారత క్రికెట్లో గత కొంతకాలంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే, అది మహ్మద్ షమీయే అని చెప్పాలి. ఎందుకంటే ఇతగాడు ఫార్మాట్లకతీతంగా ఎంత అద్భుతంగా రాణించినా, జాతీయ జట్టులోకి తిరిగి రాలేకపోతున్నాడు.హర్షిత్ రాణా లాంటి బౌలర్ ఏమీ సాధించకపోయినా, ప్రతిసారి జట్టులో దర్శినమిస్తున్న వేల, షమీకి జరుగుతున్న అన్యాయంపై కొందరు తీవ్రస్థాయిలో గళమెత్తుతున్నారు. హర్షిత్కు ఉన్న అర్హతలేంటి, షమీకి లేనివేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై బీసీసీఐని, సెలెక్టర్లను, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను నిలదీస్తున్నారు.తాజాగా ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించగా.. షమీకి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసినా, సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకోలేదు.తాను లేని భారత జట్లను ప్రకటించిన గంటల వ్యవధిలోనే షమీ హ్యాట్రిక్ వికెట్లు తీసి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. బెంగాల్ టీ20 లీగ్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ను సాధించాడు. ఈ టోర్నీలో సిలిగురి స్ట్రయికర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. రార్ టైగర్స్తో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో వరుస మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు.మొదటగా తన ఐపీఎల్ సహచరుడు షాబాజ్ అహ్మద్ను ఔట్ చేసిన షమీ.. ఆ తర్వాతి రెండు బంతుల్లో రోహిత్ కుమార్, దీపాంజన్ ముఖర్జీ వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా నాలుగు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.షమీ (4/27)తో పాటు కరణ్ లాల్ (3/36) అద్భుత బౌలింగ్ చేయడంతో రార్ టైగర్స్పై సిలిగురి స్ట్రయికర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో షమీ, కరణ్ లాల్ ధాటికి తడబడిన రార్ టైగర్స్ 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. -
‘వైభవ్ సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరపున అరంగేట్రం చేసేందుకు రంగం సిద్దమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ఎంపిక చేసిన భారత జట్టులో 15 ఏళ్ల సూర్యవంశీకి చోటు దక్కింది. దీంతో భారత జట్టు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ టెండూల్కర్ను వైభవ్ అధిగమించాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతి చిన్న వయస్సులోనే భారత జట్టు ఎంపికైన వైభవ్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడిని క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్మాన్లతో పోల్చడం సరికాదని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా వైభవ్ టీమిండియాకు ఎంపికవ్వడం తమ కుటుంబానికి ఒక పెద్ద కల నెరవేరిన క్షణమని సంజీవ్ తెలిపాడు.సంజీవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సచిన్, బ్రాడ్మన్లతో వైభవ్ను పోల్చడం నా దృష్టిలో చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ లెజండరీ క్రికెటర్లు అత్యున్నత స్థాయిలో దశాబ్దాల పాటు రాణించి, దేశానికి ఎన్నో అద్భుత విజయాలు అందించారు. ప్రస్తుతం వైభవ్ వారి పాదాల దుమ్ముతో కూడా సమానం కాడు. కాబట్టి ఇలాంటి పోలికలు అస్సలు పెట్టవద్దు. అదేవిధంగా వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు కూడా లెఫ్ట్ హ్యాండరే. కాబట్టి లారా బ్యాటింగ్ వీడియోలను వైభవ్కు చూపించాను. గత కొన్నేళ్లుగా లారా, యువరాజ్ సింగ్, ఇతర క్రికెటర్ల బ్యాటింగ్ వీడియోలు కూడా వైభవ్ చూస్తున్నాడు.అయినప్పటికి అతడి ఆటతీరు పూర్తిగా విలక్షణంగా ఉంటుంది. అతడు ఎవరిని అనుకరించకుండా తనదైన శైలిలో క్రికెట్ ఆడతున్నాడని" పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో వైభవ్ దుమ్ములేపాడు. 776 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.చదవండి: సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్!? -
టీమిండియాను 'ఆరేసిన' ఈ సలీమ్ సఫీ ఎవరు..?
ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్కు నాణ్యమైన స్పిన్నర్లను అందించే దేశంగా మంచి పేరుంది. ఈ దేశానికి చెందిన చాలామంది స్పిన్నర్లు (రషీద్ ఖాన్, ముజీబ్ రహ్మాన్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తదితరులు) విశ్వవ్యాప్తంగా మంచి పేరు గడించారు. స్పిన్నర్ల అడ్డా అయిన ఇలాంటి దేశం నుండి తాజాగా ఓ యువ పేసర్ వెలుగులోకి వచ్చాడు.తన కెరీర్లో రెండో టెస్ట్ మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అది కూడా టీమిండియా లాంటి పటిష్ట జట్టుపై. మరి ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరనుకుంటున్నారా..?అతడి పేరు మొహమ్మద్ సలీమ్ సఫీ. ఈ 23 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేస్ బౌలర్, ప్రస్తుతం ముల్లాన్పూర్ వేదికగా భారత్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. భారత బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న వేల, సఫీ ఒక్కడే ఆఫ్ఘన్ల పాలిట ఆశాకిరణంగా నిలిచాడు.బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై భారత బ్యాటర్లు చెలరేగి ఆడగా, సఫీ కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా.. ఇందులో 6 వికెట్లు సఫీ ఒక్కడే తీశాడంటే అతని ప్రభావం ఏమేరకు ఉందో ఇట్టే అర్దమవుతుంది.సఫీ బౌలింగ్లో ఔటైన భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, ధృవ్ జురెల్ లాంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్నారు.సఫీ నేపథ్యంస్వింగ్ బౌలింగ్లో నైపుణ్యం కలిగిన సఫీ బంతిని రెండు వైపులా కదిలించే సామర్థ్యం కలిగిన పేసర్. లైన్ అండ్ లెంగ్త్లో స్థిరత్వం లేకపోయినా, రిథమ్లోకి వస్తే మాత్రం బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టగలడు. ఆఫ్ఘన్ తరఫున రెండో టెస్ట్ ఆడుతున్న సఫీ.. 2 వన్డేలు, ఓ టీ20 కూడా ఆడాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేయగా.. అనంతరం బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ 28 పరుగుల వద్ద ఓపెనర్ అబ్దుల్ మాలిక్ (16) వికెట్ తీసి భారత్కు తొలి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం 40 పరుగుల వద్ద ప్రసిద్ద్ కృష్ణ మరో ఓపెనర్ సెదిఖుల్లా అటల్ను (17) క్లీన్ బౌల్డ్ చేసి ఆఫ్ఘన్ను కష్టాల్లోకి నెట్టాడు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 524 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (100), శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. -
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్!?
భారత క్రికెట్లో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్ధానం ముగిసింది. టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పించింది. అతడి స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ను కొత్త కెప్టెన్గా నియమించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలకు ప్రకటించిన భారత జట్లలో సూర్యకుమార్కు కనీసం ఆటగాడిగా కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. పేలవ ఫామ్ కారణంగానే సెలక్టర్లు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.భారత్కు ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ను అందించినప్పటికి అతడి ఫామ్ మాత్రం దారుణంగా పడిపోయింది. ఐపీఎల్-2026లోనూ సూర్య రాణించలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్యకుమార్ 13 ఇన్నింగ్స్ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ కారణాలతో అతడిని జట్టు నుంచి తప్పించారు.సూర్య రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?అయితే సూర్యకుమార్పై వేటు పడిన కొద్దిసేపటికే అతడికి సంబందించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. "భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. విమర్శలు, ఆన్లైన్ ట్రోలింగ్ వల్ల తీవ్ర నిరాశకు గురయ్యాను. అందుకే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను" అంటూ సూర్యకుమార్ పేరుతో ఉన్న ఒక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా స్క్రీన్షాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.అయితే అది ఫేక్ పోస్ట్ అని తేలింది. @unreal_skyy అనే ఒక ఫేక్ అకౌంట్ నుంచి ఎవరో ఆకతాయి చేసిన పోస్ట్ అది. అంతే తప్ప స్కై నుంచి కానీ బీసీసీఐ నుంచి కానీ అతడి రిటైర్మెంట్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సూర్య ప్రస్తుతం ముంబై టీ20 లీగ్లో ఆడుతున్నాడు.చదవండి: జట్టు నుంచి తీసేశారు.. కట్ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం? -
తప్పు మీద తప్పు.. ఆఫ్గన్ కొంపముంచిన కెప్టెన్!
టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ తప్పు మీద తప్పులు చేస్తోంది. తొలిరోజు కేఎల్ రాహుల్ ఔట్ విషయంలో రివ్యూలు తీసుకోవడంలో తడబడ్డ అఫ్గానిస్తాన్ రెండో రోజు ఆటలోనూ అదే తప్పును పునరావృతం చేసింది. ఫలితంగా టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక మ్యాచ్పై పట్టు సాధించేలా చేసింది. తొలిరోజు ఆటలో కేఎల్ రాహుల్ 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు అజ్మతుల్లా ఒమర్జయ్ వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రాహుల్ మిస్ అయ్యాడు. దీంతో బంతి అతడి బ్యాట్ను ముద్దాడుతూ కీపర్ చేతుల్లో పడింది. కీపర్ అఫ్సర్ జజయ్ ఔట్ అప్పీల్ చేసినప్పటికీ, అంపైర్ ఔటివ్వలేదు. అయితే కెప్టెన్ హస్మతుల్లా షాహిది కీపర్ను అడిగినప్పటికీ అతడు క్లారిటీతో లేకపోవడం వల్ల రివ్యూ వెళ్లలేదు.ఆ తర్వాత రిప్లేలో రాహుల్ బ్యాట్కు బంతి తాకినట్లు స్పైక్ రావడం కనిపించింది. దీంతో 16 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రాహుల్ ఆ తర్వాత శతకం బాదాడు. తొలిరోజు చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్వని అఫ్గానిస్తాన్ రెండోరోజు ఆటలోనూ అదే తప్పిదం చేసింది. ఈసారి గిల్ విషయంలో రివ్యూకు తీసుకోవడంలో విఫలమైంది. ఇన్నింగ్స్ 89వ ఓవర్లో ఒమర్జయ్ వేసిన బంతి గిల్ ప్యాడ్లను తాకింది. అయితే ఆఫ్గన్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ ఔటివ్వలేదు. అయితే ఒమర్జయ్ రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదిని కోరినప్పటికీ, అతడు బంతి ఇన్సైడ్ ఎడ్జ్ అవుతుందేమోనని భావించి రివ్యూ కోరలేదు. కానీ రిప్లేలో బ్యాట్కు బంతి ఎక్కడా తగలకుండా లెగ్ స్టంప్ను ఎగరేస్తున్నట్లు కనిపించింది. ఒకవేళ రివ్యూకు వెళ్లి ఉంటే గిల్ 109 పరుగుల వద్దే వెనుదిరిగేవాడు. ఈ రెండు తప్పుల తర్వాత కూడా ఆఫ్గన్ తమ లెక్కను సరిచేసుకోలేకపోయింది. ఆ మరుసటి బంతికే రిషబ్ పంత్ కూడా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒమర్జయ్ వేసిన బంతిని పంత్ షాడ్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. దీంతో బంతి కీపర్ అఫ్సర్ చేతిలో పడింది. అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ ఔటివ్వలేదు.సెకండ్ స్లిప్లో ఉన్న రహమనుల్లా గుర్బాజ్ మాత్రం బంతి పంత్ బ్యాట్కు తగిలిందని, రివ్యూ వెళ్లాలని కెప్టెన్ షాహిదికి కాన్ఫిడెంట్గా చెప్పాడు. కానీ షాహిది మాత్రం రివ్యూకు వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ అయినట్లు స్పైక్ రావడంతో కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. అలా 54 పరుగుల వద్ద ఔట్ ప్రమాదం నుంచి బయటపడిన పంత్ తన స్కోరుకు మరో 27 పరుగుల జత చేసుకున్నాడు. ఇలా మూడుసార్లు కీలక ఆటగాళ్లను ఔట్ చేసే విషయంలో ఆఫ్గన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ రివ్యూ తీసుకోవడంలో విఫలమై ఆఫ్గన్ కొంపముంచాడు. అతడి తప్పుల వల్ల టీమిండియా 550 పరుగుల మార్క్ను అందుకోగలిగింది. ఒకవేళ సరైన సమయంలో రివ్యూలు తీసుకొని ఉంటే టీమిండియా ఆట నాలుగు వందల్లోపే ముగిసి ఉండేది. మ్యాచ్ విషయానికొస్తే భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తవ్వగానే గిల్ డిక్లేర్కు పిలుపునిచ్చాడు. కేఎల్ రాహుల్, గిల్ సెంచరీలు చేయగా.. పంత్, సాయి సుదర్శన్, సుందర్లు అర్థసెంచరీలతో మెరిశారు. ఆఫ్గన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ 6 వికెట్లతో మెరవగా, జియావుర్ రెహమాన్, హస్మతుల్లా చెరొక వికెట్ తీశారు.చదవండి: ఆత్రుత ఎందుకు పంత్.. ఓపిక వహించాల్సింది! -
మహ్మద్ సిరాజ్ విధ్వంసం.. 183 స్ట్రైక్ రేట్తో మెరుపులు
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బ్యాట్తో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా బ్యాటింగ్ ఆర్డర్లో సిరాజ్కు టీమ్ మేనెజ్మెంట్ ప్రమోషన్ ఇచ్చింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కంటే ముందే 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే సలీమ్ సఫీ వేసిన ఫుల్ టాస్ బంతిని మిడ్-వికెట్ మీదుగా అద్భుతమైన ఫోర్ కొట్టి సిరాజ్ తన ఖాతాను తెరిచాడు. ఆ తర్వాత 120 ఓవర్ వేసిన అఫ్గాన్ స్పిన్నర్ నంగేయాలియా ఖరోటేను ఈ హైదరాబాదీ ఉతికిరేశాడు. రెండో బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్గా మలిచిన సిరాజ్.. ఆ తర్వాత రెండు బంతులను వరుసగా బౌండరీలు బాదాడు. ఆ ఓవర్లో అతడు 14 పరుగులు పిండుకున్నాడు. సాధారణంగా బంతితో అద్భుతాలు చేసే సిరాజ్.. ఇప్పుడు బ్యాట్తో మెరుపులు మెరిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడి బ్యాటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అన్నా నీలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సిరాజ్ మొత్తంగా 183 స్ట్రైక్ రేట్తో 12 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.ಧಮಾಕಾ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ನಮ್ಮ Siuuuu Raj!🔥ವೀಕ್ಷಿಸಿ | #INDvAFG | Only Test ➡️ DAY 2 | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports 2 ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#MohammedSiraj pic.twitter.com/6tomAfPYRb— Star Sports Kannada (@StarSportsKan) June 7, 2026 -
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్.. భువీ, షమీకి చోటు!
భారత టీ20 జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను తప్పించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. ఆ స్ధానంలో శ్రేయస్ అయ్యర్ను నూతన సారధిగా నియమించింది. సూర్యను కెప్టెన్గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే పక్కన పెట్టారు. అదేవిధంగా ఇటీవల పొట్టి ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమైన హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్లను కూడా టీ20 జట్టు నుంచి తప్పించారు. ఐపీఎల్-2026లో దుమ్ములేపిన వెటరన్ భువనేశ్వర్ కుమార్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రజత్ పాటిదార్లను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్కు ఎంపిక కాని భారత స్టార్ ఆటగాళ్లతో కూడా ప్రత్యామ్నాయ జట్టును ఎక్స్లో షేర్ చేశారు. ఈ జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్కు అవకాశమిచ్చారు. అదేవిధంగా గిల్,రాహుల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఉన్నాడు.అన్సెలక్టెడ్ ఆటగాళ్లతో కూడిన భారత టీ20 జట్టుశుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ -
తిలక్ వర్మకు జాక్ పాట్.. భారీ ధరకు అమ్ముడుపోయిన హైదరాబాదీ
తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TG20) తొలి సీజన్ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ తిలక్ వర్మకు జాక్ పాట్ తగిలింది. రూ.5 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన తిలక్ వర్మ భారీ ధర పలికాడు. అతడి కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్, నల్గొండ జట్లు పోటీపడ్డాయి. చివరకు తిలక్ను రూ.33 లక్షలకు మెదక్ జట్టు సొంతం చేసుకుంది. అదేవిధంగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తనయుడు చామ మిలింద్ ఆనంద్కు కళ్లు చెదిరే ధర దక్కింది. రూ.5 లక్షల బేస్ ప్రైస్తో వచ్చిన అతడిని రూ.17 లక్షల భారీ ధరకు అన్విత ఖమ్మం ఏసెస్ దక్కించుకుంది.మరోవైపు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ను రూ.14 లక్షలకు వరంగల్ వారియర్స్ సొంతం చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు అమన్ రావు పేరాలను రూ.12 లక్షలకు వరంగల్ వారియర్స్ దక్కించుకుంది.తిలక్కు డబుల్ జాక్పాట్కాగా తిలక్ వర్మ తాజాగా భారత టీ20 జట్టుకు కూడా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. 24 గంటలు గడవకముందే టీజీ టీ20 లీగ్ వేలంలో రికార్డు ధర సొంతం చేసుకోవడంతో అతడికి డబుల్ జాక్పాట్ తగిలినట్లైంది. కాగా ఈ మెగా టోర్నమెంట్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీలో మొత్తం మ్యాచ్లకు తిలక్, సిరాజ్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అదే సమయంలో భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఇక 21 రోజుల పాటు జరిగే ఈ లీగ్లో మొత్తం 32 మ్యాచ్లు జరుగుతాయి.అన్ని మ్యాచ్లను హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీ తొలి సీజన్ వేలం కోసం 1,300 మందికి పైగా ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా, హైదరాబాద్ క్రికెట్ ఆసోయేషన్ కేవలం 160 మంది ప్లేయర్లను మాత్రమే షార్ట్లిస్ట్ చేసింది.బరిలో ఉన్న 8 ఫ్రాంచైజీ జట్లు ఇవేహైదరాబాద్ ఈ-ఛాంపియన్స్మెదక్ ఫాల్కన్స్ (Medak Falcons)వరంగల్ వారియర్స్ (Warangal Warriors)అన్విత ఖమ్మం ఏసెస్ (Anvita Khammam Aces)అనురాగ్ నల్గొండ నైట్స్ (Anurag Nalgonda Knights)ప్రణవ రంగారెడ్డి రైజర్స్ (Pranava Ranga Reddy Risers)కరీంనగర్ డైమండ్స్ (Karimnagar Diamonds)పాలమూరు స్ట్రైకర్స్ (Palamuru Strikers) -
గంభీర్ మాట లెక్కచేయని పంత్.. ఆత్రుత ఎందుకు?
ముల్లన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా 500 పరుగుల దిశగా పయనిస్తోంది. మ్యాచ్లో కేఎల్ రాహుల్, గిల్ శతకాలు నమోదు చేయగా, పంత్ మాత్రం సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 121 బంతులాడిన పంత్ 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. షాహిది వేసిన ఇన్నింగ్స్ 103వ ఓవర్ నాలుగో బంతిని పంత్ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్కు తాకి గాల్లోకి లేచిన బంతిని ఫీల్డర్ అజ్మతుల్లా ఒమర్జయ్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైన పంత్ ఆఫ్గన్తో టెస్టులో మాత్రం మంచి ఈజ్తోనే బ్యాటింగ్ ప్రారంభించాడు. అయితే పంత్ బ్యాటింగ్ దిగడానికి ముందు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ డిఫెన్స్మోడ్కు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ బ్యాటింగ్ చేయాలని సూచించాడు. కానీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి తన శైలికి తగినట్లు ఫాస్ట్గా ఆడేందుకే పంత్ ప్రాధాన్యమిచ్చాడు. అయితే సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కాస్త తగ్గి ఆడుంటే బాగుండేది. భారీ షాట్ ఆడాలనే ఆత్రుతతో బంతిని బలంగా బాదినప్పటికీ టైమింగ్ కుదరక నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘కోచ్ గంభీర్ మాట లెక్కచేయకుండా ఆడావు.. మూల్యం చెల్లించుకున్నావు’.. ‘పంత్ నువ్వు మారవా.. అంత నిర్లక్ష్యం పనికిరాదు’.. ‘నిర్లక్ష్యం పంత్ కొంపముంచింది’.. ‘తొందరెందుకు పంత్.. కాస్త ఓపిక వహిస్తే సెంచరీ అయ్యేదిగా’ అంటూ అభిమానులు కామెంట్లు చేశారు. అయితే సెంచరీ మిస్ అయినప్పటికీ పంత్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. ఆఫ్గన్తో టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (14), మానవ్ సుతార్ (9) పరుగులతో ఆడుతున్నారు. 500 పరుగల మార్క్ చేరిన తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది. ఆఫ్గన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్ నాలుగు వికెట్లు తీయగా, జిహుర్ రెహ్మాన్, హష్మతుల్లా చెరొక వికెట్ తీశారు.Gautam Gambhir Instructs Rishabh Pant to Play Defensively Even Before He Enters to Bat 🙏 pic.twitter.com/UgVFRkzFqi— RP17 Gang™ (@RP17Gang) June 6, 202681 RUNS BY RISHABH PANT - highest score by an Indian wicketkeeper in Tests vs Afghanistan. pic.twitter.com/1St7OXFEJN— RP17 Gang™ (@RP17Gang) June 7, 2026చదవండి: టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ తొలి స్పందన! -
జట్టు నుంచి తీసేశారు.. కట్ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం?
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఊహించని షాకిచ్చింది. కెప్టెన్సీ బాధ్యతలతో పాటు పూర్తిగా జట్టు నుంచి కూడా అతడిని తప్పించింది. 2026 టీ20 ప్రపంచకప్లో భారత్కు ట్రోఫీ అందించినప్పటికీ, వ్యక్తిగత ఫామ్ లేమి కారణంగా సూర్యకుమార్పై వేటు వేశారు.అతడి స్దానంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఏషియన్ గేమ్స్ కోసం జట్టు ఎంపిక సందర్భంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పూర్తి స్ధాయిలో దేశవాళీ క్రికెట్లో ఆడాలని సూర్య భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోయేషన్కు తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఆడాలనేది తన కల అని స్కై ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన కలను నెరవేర్చుకునే దిశగా సూర్య అడుగులు వేయనున్నాడు. తన ఫామ్ను తిరిగి సాధించడానికి, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి దేశవాళీ టోర్నమెంట్లు ఆడాలని మిస్టర్ 360 ఫిక్స్ అయ్యాడు.అతడు చివరగా డొమాస్టిక్ క్రికెట్లో ఈ ఏడాది జనవరిలో ముంబై తరపున విజయ్హాజరే ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. రెడ్ బాల్ క్రికెట్ విషయానికి వస్తే గతేడాది జనవరిలో విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్లో బరిలోకి దిగాడు. సూర్యకుమార్ ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న దులీప్ ట్రోఫీ వెస్ట్జోన్కు ప్రాతినిథ్యం వహించే అవకాశముంది. సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టు తరఫున రెడ్ బాల్ క్రికెట్లో మొత్తం 14 సెంచరీలు సాధించాడు. అతడు ప్రస్తుతం ముంబై టీ20 లీగ్లో బిజీ బిజీగా ఉన్నాడు.చదవండి: టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ తొలి స్పందన! -
టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ తొలి స్పందన!
భారత జట్టు టీ20 కెప్టెన్గా తనను నియమించడంపై శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించాడు. ముంబై టీ20 లీగ్లో ముంబై ఫాల్కన్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడాడు. 'చాలా సంతోషంగా ఉంది. ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే పెద్ద విషయం. అలాంటిది ఒక జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప అనుభూతి. ఇది నా గౌరవాన్ని, బాధ్యతను పెంచింది. ఇన్నేళ్లుగా నాకు మద్దతిస్తూ అండగా నిలబడిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. టీ20 కెప్టెన్సీ ఇచ్చిన జోష్తో ఇవాళ ముంబై ఫాల్కన్స్ తరఫున కీలక ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా జట్టును గెలిపించడం సంతోషంగా ఉంది. నిజంగా నాకు ఇది కేక్పై ఐసింగ్లాగా అనిపించింది. అయితే ఇవాళ మ్యాచ్లో నాకు ప్రత్యర్థిగా ఉన్న సూర్యకుమార్ దగ్గరికి వెళ్లి అతడిని ఆప్యాయంగా పలకరించాను. అతడు కూడా నాకు కెప్టెన్సీ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇది నా జోష్ను డబుల్ చేసింది.' అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. సూర్యకుమార్ సారథ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుపై శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ముంబై ఫాల్కన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రంప్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (24 బంతుల్లో 48) టాప్ స్కోరర్గా నిలవగా.. నూతన్ కుమార్ (34)పర్వాలేదనిపించాడు. ఫాల్కన్స్ బౌలర్లలో ప్రతమేశ్ డాకే 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్కన్స్ అయ్యర్ విజృంభణతో 16.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాడు. ట్రంప్ నైట్స్ బౌలర్లలో హితేశ్ కడమ్ 2 వికెట్లు తీశాడు.What a day for @ShreyasIyer15 😍Named #TeamIndia's T20I captain, then followed it up with a match-winning knock against Triumphs Knights MNE! 👏Watch #T20Mumbai on Star Sports & JioHotstar! pic.twitter.com/m6BeCZV1XW— Star Sports (@StarSportsIndia) June 7, 2026क्या शानदार पल है! मैच के दौरान वानखेड़े स्टेडियम में Suryakumar Yadavने Shreyas Iyer को गले लगाया। 🥹❤️मुंबई के लड़के एक-दूसरे का साथ देते हुए। 🫂❤️ pic.twitter.com/YiZmJmHaNR— 𝓢𝓸𝓷 𝓢𝓲𝓷𝓰𝓱 𝓨𝓪𝓭𝓪𝓿 (@SONSINGH_Ya) June 7, 2026చదవండి: టెస్టులో సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ! -
ముగిసిన రెండో రోజు ఆట.. భారత్దే ఆధిపత్యం
India vs Afghanistan test Day 2 updates and Highlights: ముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది.రెండో రోజూ భారత్దేముల్లాన్పూర్ టెస్టులో అఫ్గాన్పై భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. పర్యాటక జట్టు భారత్ కంటే తొలి ఇన్నింగ్స్లో ఇంకా 451 పరుగులు వెనకబడి ఉంది. క్రీజులో రెహమత్ షా(43) ఉన్నాడు.కాగా భారత అరంగేట్ర ఆటగాడు మానవ్ సుతార్ బౌలింగ్, బ్యాటింగ్తో అదరగొట్టాడు. బ్యాటింగ్లో 28 పరుగులు చేసిన సుతార్, బౌలింగ్లో 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు. తొలి ఇన్నింగ్స్ను భారత్ 564/8 వద్ద డిక్లేర్ చేసింది.భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(100), శుభ్మన్ గిల్(126) సెంచరీలతో చెలరేగగా.. రిషబ్ పంత్(81), సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తాచాటారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ 6 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు జియూర్, షాహిది తలా వికెట్ సాధించారు.అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్హాస్మతుల్లా షాహిదీ(20) రూపంలో అఫ్గానిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో వికెట్లు ముందు షాహిదీ దొరికిపోయాడు.అఫ్గాన్ మూడో వికెట్ డౌన్గుర్భాజ్ రూపంలో అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన గుర్బాజ్.. సుతార్ బౌలింగ్లో ఔటయ్యాడు.రెండో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అటల్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 49/2తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్28 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్లో మొహమ్మద్ సిరాజ్ క్యాచ్ పట్టడంతో అబ్దుల్ మాలిక్ (16) ఔటయ్యాడు. మానవ్ సుతార్కు టెస్ట్ల్లో ఇది తొలి వికెట్. ఈ వికెట్ను అతడు తన తొలి ఓవర్లోనే తీయడం విశేషం. మాలిక్ ఔటయ్యాక అంపైర్లు టీ బ్రేక్కు పిలుపిచ్చారు.భారత్ భారీ స్కోర్అప్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో తమ తొలి ఇన్నింగ్స్ను భారత్ 564/8 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(100), శుభ్మన్ గిల్(126) సెంచరీలతో చెలరేగగా.. రిషబ్ పంత్(81), సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తాచాటారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ 6 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు జియూర్, షాహిది తలా వికెట్ సాధించారు.సిరాజ్ అవుట్టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 12 బంతుల్లో 22 పరుగులు చేసిన సిరాజ్.. సలీమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత్ స్కోర్: 543/8భారీ స్కోర్ దిశగా భారత్రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(14), మానవ్ సుతార్(9) ఉన్నారు. రెండో రోజు ఆటలో భారత్.. గిల్(100), రిషబ్ పంత్(81), జురెల్(19) వికెట్లు కోల్పోయింది.పంత్ అవుట్రిషబ్ పంత్(81) రూపంలో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. షాహిది బౌలింగ్లో ఔటయ్యాడు.ధ్రువ్ జురెల్ అవుట్19 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్.. సలీమ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు . 102 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్: 456-5భారత్ నాలుగో వికెట్ డౌన్416 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 126 రన్స్ చేసిన గిల్..సలీమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో ధ్రువ్ జురెల్ వచ్చాడు.రెండో రోజు ఆట ఆరంభంముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది. క్రీజులో రిషబ్ పంత్(50), శుబ్మన్ గిల్(106) ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. మొదటి రోజు ఆటలో కేఎల్ రాహుల్ శతక్కొట్టగా.. సాయిసుదర్శన్(81) హాఫ్ సెంచరీతో రాణించారు. అఫ్దాన్ బౌలర్లలో సలీమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జియావుర్ రెహమాన్ ఓ వికెట్ సాధించాడు.తుది జట్లుఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీభారత్ : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ -
టెస్టులో సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ!
15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన బీహార్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం క్రికెట్లో హాట్టాపిక్గా మారిపోయాడు. అరంగేట్రంకు ముందే అంతర్జాతీయ రికార్డులన్నీ బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీ20 ఫార్మాట్లో టీమిండియాకు ఎంపికైన వైభవ్ను ఇప్పుడు టెస్టుల్లోకి కూడా తీసుకుంటే బాగుంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ అనధికారిక టెస్టు మ్యాచ్లో సెంచరీ చేసిన వీడియోనూ ఎక్స్లో షేర్ చేసుకున్నారు. 2025 అక్టోబర్లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో భారత అండర్-19 జట్టు బ్రిస్బేన్ వేదికగా యూత్ టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 78 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. అప్పటికే ఐపీఎల్ 18వ సీజన్ ఆడిన వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసాన్ని అనధికారిక టెస్టులోనూ కొనసాగించాడు. ఆ మ్యాచ్లో 86 బంతుల్లో 113 పరుగులు చేసిన సూర్యవంశీ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్కు 152 పరుగుల భాగస్వామ్యాన్ని జతచేశాడు. అంతేకాదు వైభవ్ విధ్వంసంతో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టెస్టులోనూ టీ20 తరహా ఆటతో విజృంభించిన వైభవ్ను సంప్రదాయ క్రికెట్లోనూ ఆడించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఐపీఎల్కు, అంతర్జాతీయ మ్యాచ్లకు చాలా తేడా ఉంటుందని, మొదట టీ20 ఫార్మాట్లో తనను తాను నిరూపించుకోవాలని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా ఐదు హాఫ్ సెంచరీలున్నాయి. Just look at the dominance of Vaibhav Suryavanshi in test cricket.🤯- Vaibhav Suryavanshi playing test cricket like T20.😊pic.twitter.com/NvljSRcTAi— Cricket Central (@CricketCentrl) June 5, 2026చదవండి: చరిత్ర సృష్టించిన వైశాలీ.. అన్న బాటలోనే చెల్లి! -
చరిత్ర సృష్టించిన వైశాలీ.. తమ్ముడి బాటలోనే అక్క!!
భారత చెస్ గ్రాండ్మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద బాటలోనే సోదరి ఆర్ వైశాలీ నడిచింది. జపాన్ వేదికగా జరిగిన డబ్ల్యూఆర్ వుమెన్స్ చెస్ టూర్ టైటిల్ను వైశాలీ సొంతం చేసుకుంది. తద్వారా వుమెన్స్ క్యాండిడేట్ చెస్ టోర్నీ నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఎనిమిది మంది క్రీడాకారిణుల మధ్య జరిగిన ర్యాపిడ్ చెస్ ఈవెంట్లో వైశాలీ తొలి స్థానంలో నిలవగా, అలెంగ్జాడ్రా కొస్తేనుక్ (రష్యా), ఆంటోనెటా స్టిఫనోవా (బల్గేరియా) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 24 ఏళ్ల వైశాలీ శనివారం తన ఫైనల్ రౌండ్లో కజకిస్తాన్కు చెందిన గ్రాండ్మాస్టర్ అలువా నూర్మన్తో తలపడింది. రెండు గేముల పోరులో 1.5-0.5 తేడాతో చిత్తు చేసింది. అంతకముందు మాజీ చాంపియన్ కోస్టేనియుక్ను కూడా ఇదే తేడాతో ఓడించిన వైశాలీ ఫైనల్కు చేరుకుంది. ఇక క్వార్టర్ ఫైనల్లో వైశాలీ ఒక గేమ్ గెలిచి మరొక గేమ్ను డ్రా చేసుకుంది. ర్యాపిడ్ చెస్ టైటిల్ను గెలిచిన వైశాలీ నేటి నుంచి ప్రారంభం కానున్న బ్లిట్జ్ చెస్ ఈవెంట్ను కూడా గెలిచి డబుల్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ పోటీలో పాల్గొన్న ఇతర క్రీడాకారిణులు అన్నా సర్గ్స్యాన్, ఐరిన్ సుకందర్, అలువా నూర్మాన్,అజుమి సకాయ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.అయితే వైశాలీ ర్యాపిడ్ చెస్ టైటిల్ గెలవడానికి కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు ఆర్ ప్రజ్ఞానంద నార్వే క్లాసికల్ చెస్ టైటిల్ను గెలుచుకున్నాడు. చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ చాంపియన్షిప్ టైటిల్ గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచాడు.చదవండి: కెప్టెన్సీ తెచ్చిన జోష్.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం! -
కెప్టెన్సీ తెచ్చిన జోష్.. శ్రేయస్ అయ్యర్ విధ్వంసం!
టీమిండియా టీ20 కెప్టెన్గా ప్రమోషన్ కొట్టేసిన శ్రేయస్ అయ్యర్ టీ20 ముంబై లీగ్లో తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. మొదట మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఆ తర్వాత కెప్టెన్గా తన జట్టును గెలిపించడమే గాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. టోర్నీలో భాగంగా శనివారం సూర్యకుమార్ సారథ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జట్టుపై శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ముంబై ఫాల్కన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రంప్ నైట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ (24 బంతుల్లో 48) టాప్ స్కోరర్గా నిలవగా.. నూతన్ కుమార్ (34) పర్వాలేదనిపించాడు. ఫాల్కన్స్ బౌలర్లలో ప్రతమేశ్ డాకే 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్కన్స్ అయ్యర్ విజృంభణతో 16.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించాడు. ట్రంప్ నైట్స్ బౌలర్లలో హితేశ్ కడమ్ 2 వికెట్లు తీశాడు. మొత్తం మీద టీమిండియా టీ20 కెప్టెన్గా ఎంపికైన రోజునే ముంబై టీ20లీగ్లోనూ శ్రేయస్ విజృంభించడం చూస్తుంటే కెప్టెన్సీ ఇచ్చిన ఆనందం రెట్టింపు అయింది. ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ సూర్యకుమార్ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను అయ్యర్కు అప్పగించింది.ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ప్రకటించిన మూడు వేర్వేరు జట్లకు అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా మూడు జట్లలో చోటు సంపాదించి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. What a day for @ShreyasIyer15 😍Named #TeamIndia's T20I captain, then followed it up with a match-winning knock against Triumphs Knights MNE! 👏Watch #T20Mumbai on Star Sports & JioHotstar! pic.twitter.com/m6BeCZV1XW— Star Sports (@StarSportsIndia) June 7, 2026 View this post on Instagram A post shared by Sportskeeda Cricket (@sportskeedacricket)చదవండి: సూర్యను తొలగించడంపై రోహిత్ స్పందన! -
సూర్యను తొలగించడంపై రోహిత్ స్పందన!
టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయడంపై సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ స్పందించాడు. కెప్టెన్సీ అనేది అంత సులభంగా రాదని అయ్యర్ను చూస్తే తనకు స్పష్టంగా అర్థమవుతుందని తెలిపాడు. 2024లో కేకేఆర్కు టైటిల్ అందించిన అయ్యర్ మరుసటి ఏడాది పంజాబ్ కింగ్స్ను ఫైనల్ చేర్చాడు. ఐపీఎల్లో కెప్టెన్గా అతడి ప్రదర్శనలే ఇవాళ టీమిండియా టీ20 కెప్టెన్ను చేసిందని పేర్కొన్నాడు. అక్కడ నేర్చుకున్న విషయాలు ఇవాళ భారత కెప్టెన్సీకి అవసరమైన అనుభవాన్ని అందించనుందని తెలిపాడు. టీ20 ముంబై లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రోహిత్ శర్మ శనివారం మ్యాచ్కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా శ్రేయస్ అయ్యర్ ఆటతీరు చూసుకుంటే అతడు కెప్టెన్గా అద్భుతాలు చేయబోతున్నాడనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ముంబై క్రికెటర్లకు ఏదీ సులభంగా రాదని, కెప్టెన్సీ అనే హోదాను కష్టపడి సంపాదించుకోవాలన్న విషయం శ్రేయస్కు తెలుసు.’అని వివరించాడు. సూర్యకుమార్ను టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించడంపై కూడా రోహిత్ స్పందించాడు. ‘టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ తనదైన ముద్ర వేశాడు. సూర్యకుమార్కు కెప్టెన్సీ అంత సులభంగా దక్కలేదన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే సూర్యకుమార్ జట్టులోకి వచ్చే సమయానికే అతడి వయసు 31 లేదా 32 ఉంటుంది. ఆ వయసులో ఫామ్లో ఉండడమే గొప్ప విషయం. కానీ సూర్య దానిని అధిగమించడమే కాదు టీ20 క్రికెట్లో ఆటగాడిగా, కెప్టెన్గా తనదైన ముద్ర వేశాడు. ఎల్లప్పుడూ పోరాడడంలో సూర్య ముందుండే వాడు. భారత్కు మూడో టీ20 ప్రపంచకప్ రావడంలో కెప్టెన్గా అతడి పాత్ర అమోఘం. తనకు వచ్చిన అవకాశాలను సూర్య రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. ఐదేళ్లలోనే అతడు టీమిండియాకు ఎంతో చేశాడు. ముంబై ఆటగాళ్లలోనే ఇది స్వతహాగా ఉన్న లక్షణం. ఏదీ ఊరికే రాదు, కష్టపడి సంపాదించుకోవాల్సిందే అన్న విషయం మా క్రికెటర్లకు తెలుసు.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ గాయం కారణంగా అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆడడం అనుమానమే. గాయంతో బాధపడుతున్న భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ఈనెల 8న సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ (సీఓఈ)లో చేరనున్నాడు. బెంగళూరులోని ఈ సెంటర్లో అతడి ఫిట్నెస్ను పరీక్షించనున్నారు. మూడు రోజుల పాటు సీఓఈలో ఉండి, ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్తో వన్డే సిరీస్ కోసం జట్టుతో చేరనున్నాడు.Rohit Sharma congraluating Shreyas Iyer for becoming the T20 Captain of India ❤️- The Mumbai Boys! pic.twitter.com/vcDf8yrPXW— Johns. (@CricCrazyJohns) June 6, 2026చదవండి: క్రీడాస్ఫూర్తిని మంటగలిపిన కేఎల్ రాహుల్! -
వైభవ్ వచ్చేశాడు...
టి20 ప్రపంచ కప్లో భారత జట్టు విజేతగా నిలిపినా సరే... బ్యాటింగ్ ఫామ్ సూర్యకుమార్ యాదవ్కు ప్రతికూలంగా మారింది. ఊహించినట్లే సూర్యకుమార్ను కెప్టెన్సీ నుంచి తప్పించిన సెలక్టర్లు అంతటితో ఆగకుండా జట్టునుంచే తీసేశారు. విన్నింగ్ టీమ్లో సభ్యులైన మరో ఇద్దరిపై కూడా వేటు పడగా... అసాధారణ బ్యాటింగ్తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తొలిసారి సీనియర్ టీమ్లోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్లో చక్కటి బ్యాటింగ్తో పాటు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన శ్రేయస్ కొత్త సారథిగా బాధ్యతలు చేపడుతుండగా... హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీ ప్రమోషన్ సాధించాడు. ముంబై: టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న మూడు నెలల తర్వాత భారత క్రికెట్ జట్టు పలు మార్పులతో కొత్త సిరీస్కు సన్నద్ధమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో జరిగే టి20 సిరీస్ల కోసం 16 మంది సభ్యుల భారత జట్టును అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. దీంతో పాటు జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే 15 మంది సభ్యుల టీమ్ను కూడా సెలక్టర్లు ప్రకటించారు. జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్లో ఐర్లాండ్తో 2 టి20ల్లో తలపడిన అనంతరం భారత జట్టు జులై 2 నుంచి 11 మధ్య ఇంగ్లండ్తో 5 టి20లు ఆడుతుంది. శ్రేయస్పై నమ్మకం... టి20 ప్రపంచకప్ ప్రస్తుత విజేత 2028లో జరిగే తర్వాతి టోర్నీకి సిద్ధమయ్యేందుకు రెండేళ్లకు పైగా సమయం ఉంది. అదే ఏడాది లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో కూడా భారత్ బరిలోకి దిగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుంటూ టీమ్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ బృందంలో 31 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ నాయకుడిగా సరైన వ్యక్తి అని సెలక్టర్లు భావించారు. నిజానికి అయ్యర్ రెగ్యులర్గా టి20 జట్టులో సభ్యుడు కాదు. 2023 డిసెంబర్ తర్వాత అతను ఈ ఫార్మాట్లో భారత్కు ఆడలేదు. కానీ ఐపీఎల్ ప్రదర్శన అతడిని అందరికంటే ముందు నిలిపింది. మూడు వేర్వేరు టీమ్లు (ఢిల్లీ, కోల్తా, పంజాబ్)లను లీగ్లో ఫైనల్కు చేర్చిన ఏకైక కెప్టెన్గా గుర్తింపు పొందిన శ్రేయస్ నాయకత్వంలో 2024లో కోల్కతా టైటిల్ నెగ్గింది. బ్యాటర్గా కూడా గత ఏడాది విధ్వంసకర ప్రదర్శన కనబర్చిన అతను ఈ సీజన్లో కూడా మెరుగ్గా ఆడాడు. బ్యాటర్గా సూర్యకుమార్కు బదులుగా నాలుగో స్థానానికి అతను సరిగ్గా సరిపోతాడు కూడా. తిలక్కు అరుదైన చాన్స్... భారత టి20 జట్టులో రెగ్యులర్గా మారిన తిలక్వర్మకు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వైస్ కెప్టెన్సీ పదవి దక్కింది. తిలక్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఎ టీమ్కు సారథిగా ఉన్నాడు. భారత్ తరఫున 49 మ్యాచ్లలో 145.54 స్టైక్రేట్తో 1390 పరుగులు సాధించిన తిలక్ ఖాతాలో 2 సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున నిలకడైన ప్రదర్శన కూడా అతనికి తగినంత గుర్తింపు తెచి్చంది. అక్షర్ స్థానంలో అతను వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వైభవ్పై విశ్వాసం... అంచనాలకు తగినట్లుగానే కుర్రాడు వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు టీమ్లోకి ఎంపిక చేశారు. గత ఐపీఎల్ సీజన్లోనే ఆకట్టుకున్నా... ఈసారి మరింతగా విజృంభించి వైభవ్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా 237.30 స్ట్రైక్రేట్తో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన వైభవ్ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా అంతా భావించారు. అందుకే సెలక్టర్లు కూడా అతనిపై విశ్వాసం ఉంచారు. వైభవ్ ఐర్లాండ్తో తొలి టి20లో బరిలోకి దిగితే...భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 92 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) రికార్డును బద్దలు కొడతాడు. స్థానం కోల్పోయిన రింకూ, కుల్దీప్... వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులైనవారిలో సూర్యతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, బ్యాటర్ రింకూ సింగ్ టీమ్లో చోటు దక్కించుకోలేకపోయారు. రింకూ చాలా కాలంగా ఫామ్లో లేకపోగా... ఇటీవలి ఐపీఎల్ ఘోర వైఫల్యం కూడా కుల్దీప్పై వేటుకు ప్రధాన కారణం. ఆల్రౌండర్ హార్దిక్, పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్లనుంచి విశ్రాంతి కల్పించారు. నితీశ్ రెడ్డి పునరాగమనం... టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి టీమ్లోకి పునరాగమనం చేశాడు. అతను భారత్ తరఫున జనవరి, 2025లో ఆఖరి టి20 మ్యాచ్ ఆడాడు. ఇదే తరహాలో లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా మళ్లీ జట్టులోకి ఎంపికయ్యాడు. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు ఇప్పటికే ఎంపిక అయిన ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్కు ఇప్పుడు టి20 టీమ్లో స్థానం లభించింది. ఆసియా క్రీడలకు బుమ్రా.... విశ్రాంతి అనంతరం పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా క్రీడల్లో పాల్గొంటాడు. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రకటించిన 15 మంది టీమ్లో అతనికి స్థానం కల్పించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు ఎంపిక చేసిన జట్లలో ఉన్న మొహమ్మద్ సిరాజ్ స్థానంలో బుమ్రా వస్తాడు. 16వ ఆటగాడు ప్రిన్స్కు కూడా ఆసియా క్రీడల టీమ్లో చోటు దక్కలేదు.పాపం సూర్యకుమార్!గత ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని అందించిన తర్వాత కూడా తర్వాతి సిరీస్కు రోహిత్ శర్మ తన వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. రోహిత్తో పోలిస్తే సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఇంకా బాధాకరం. వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్సీతో పాటు అతనికి జట్టులో కూడా చోటు పోయింది. నిజానికి ప్రపంచ కప్కు ముందు చాలా కాలం పాటు అతని ఫామ్ పేలవంగా ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్పై మంచి ప్రదర్శనే ఇచ్చినా... ఆ తర్వాత మళ్లీ తడబాటు కనిపించింది. అయితే కీలకమైన టోర్నీకి ముందు కొత్త కెప్టెన్ వస్తే కష్టమని సెలక్టర్లు వెనక్కి తగ్గారు. మెగా టోర్నీలో అమెరికాపై మ్యాచ్ మినహా అతను అన్నింటా విఫలమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా అంతే స్థాయిలో మళ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. దాంతో సెలక్టర్లకు మరో ఆలోచన లేకపోయింది. పైగా 36 ఏళ్లకు చేరువవుతున్న ప్రస్తుత స్థితిలో మరో రెండేళ్ల తర్వాత జరిగే వరల్డ్ కప్కు కొనసాగించే అవకాశం ఎలాగూ లేదనేది వాస్తవం. ప్రపంచకప్, ఆసియా కప్లు గెలవడంతో పాటు తన సారథ్యంలో ఒక్క సిరీస్ కూడా కోల్పోని రికార్డు సూర్య సొంతం. టి20 క్రికెట్లో విధ్వంసక ఆటగాడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసినట్లే. ‘ఇది చాలా కఠిన నిర్ణయం. అతని పేలవ ఫామ్ కొంత కారణమే అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జట్టు అవసరాల కోసం తప్పలేదు. ప్రపంచ కప్ను గెలిపించిన తర్వాత జట్టునుంచి తప్పించడంపై చాలానే చర్చ జరిగింది. నేను కూడా అతనితో మాట్లాడి అంతా వివరించా’ అని అగార్కర్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టుశ్రేయస్ (కెప్టెన్), తిలక్ (వైస్ కెప్టెన్), అభిషేక్, సామ్సన్, వైభవ్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్, సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, సిరాజ్, అర్ష్ దీప్ , హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్. (ఆసియా క్రీడలకు సిరాజ్ స్థానంలో బుమ్రా ఎంపిక కాగా...ప్రిన్స్కు చోటు లేదు). -
ఆండ్రీవా అద్భుతం
పారిస్: రష్యా టీనేజ్ ప్లేయర్ మిరా ఆండ్రీవా అసాధారణ ఆటతో కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ ట్రోఫీని సొంతం చేసుకుంది. క్లే కోర్టుపై తన అద్భుత ప్రదర్శనతో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో వరల్డ్ నంబర్ 8 ఆండ్రీవా 6–3, 6–2 స్కోరుతో క్వాలిఫయర్ మాయ చావలిన్స్కా (పోలండ్)ను చిత్తు చేసింది. గంటా 22 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 19 ఏళ్ల ఆండ్రీవా జోరు ముందు 114వ ర్యాంకర్ మాయ నిలవలేకపోయింది. కోర్టులో ప్రత్యర్థికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో పోలండ్ అభిమానులు అండగా నిలిచినా...ఒత్తిడిలో పడకుండా ఆండ్రీవా ఆట ముగించింది. ఫ్రెంచ్ ఓపెన్లో నాలుగో ప్రయత్నంలో చాంపియన్గా నిలిచిన ఆండ్రీవా 1992 (మోనికా సెలెస్ – 18 ఏళ్లు) తర్వాత ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయసు్కరాలిగా నిలిచింది. విజేతగా నిలిచిన ఆండ్రీవాకు ప్రైజ్మనీగా 28 లక్షల యూరోలు (సుమారు రూ. 31 కోట్లు)...రన్నరప్ చావలిన్స్కాకు 14 లక్షల యూరోలు (సుమారు రూ.15.30 కోట్లు) ప్రైజ్మనీగా లభించాయి. 2023 మాడ్రిడ్ ఓపెన్లో సత్తా చాటి క్వార్టర్ ఫైనల్ వరకు దూసుకొచ్చినప్పుడే ఆండ్రీవా భవిష్యత్తులో పెద్ద స్థాయికి చేరుతుందని అంచనాలు మొదలయ్యాయి. రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్లో సెమీస్ వరకు చేరడంతో క్లే కోర్టులో ఆండ్రీవా ఆట పదును ఏమిటో కనిపించింది. నాడు గెలుపు అవకాశం చేజార్చుకున్నా...ఇప్పుడు టీనేజర్గానే రోలండ్ గారోస్లో ఆమె విజయనాదం చేయడం విశేషం. రష్యాలోని సైబీరియా ప్రాంత నగరం క్రస్నోయార్క్లో పుట్టిన ఆండ్రీవా ఆరేళ్ల వయసులో టెన్నిస్ మొదలు పెట్టింది. ఆ తర్వాత సోచి నగరానికి వెళ్లి శిక్షణ పొందింది. అయితే అత్యుత్తమ సౌకర్యాలతో ఆటలో స్థాయిని పెంచుకునేందుకు ఆమె కుటుంబం ఫ్రాన్స్లోకి ‘కాన్స్’ సిటీకి వెళ్లి స్థిరపడింది. ఆమెకంటే రెండేళ్లు పెద్దదయిన ఎరికా ఆండ్రీవా కూడా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయరే. సింగిల్స్లో 6 డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలుచున్న ఆండ్రీవా గత ఏడాది జూలైలో తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ (5)ను అందుకుంది. మాజీ ప్లేయర్, 1994 వింబుల్డన్ చాంపియన్ కొంషితా మార్టినెజ్ వద్ద ఆమె శిక్షణ తీసుకుంటోంది. మరో వైపు గ్రాండ్స్లామ్ నెగ్గిన రెండో క్వాలిఫయర్గా గుర్తింపు పొందేందుకు బరిలోకి దిగిన చావలిన్స్కా అసలు పోరులో పూర్తిగా తడబడింది. ఫైనల్ చేరే క్రమంలో ఒక్క టాప్–20 ప్లేయర్తో కూడా తలపడకపోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. కెరీర్లో చాలెంజర్, ఐటీఎఫ్ టోర్నీలో మాత్రమే నెగ్గి ఆమె కెరీర్లో ఎక్కువ భాగం టెన్నిస్ ఆడేందుకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చుకునేందుకే సరిపోయింది.రోలండ్ గారోస్లో రెండో రౌండ్ నెగ్గిన తర్వాత కూడా ఆమె వద్ద ఆ రోజు హోటల్ గదిలో ఆగేందుకు తగినన్ని డబ్బులు లేకపోయాయి. తాజా ప్రదర్శనతో తన కెరీర్ మొత్తంలో సాధించిన ప్రైజ్మనీకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తం చావలిన్స్కా రన్నరప్గా అందుకుంది. 114 ర్యాంక్తో బరిలోకి దిగిన చావలిన్స్కా ఫైనల్ చేరడంతో ఏకంగా 21వ ర్యాంక్కు చేరుకోనుంది. జ్వెరెవ్ X కొబోలినేడు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో 10వ సీడ్ ఫ్లావియో కొబోలి (ఇటలీ) తలపడతాడు. జ్వెరెవ్ గతంలో నాలుగు సార్లు గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్కు చేరినా...ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాడు. ఈ టోర్నీకి ముందు గత ఏడాది వింబుల్డన్లో క్వార్టర్ ఫైనల్ చేరడమే కొబోలి అత్యుత్తమ ప్రదర్శన. గతంలో ఇద్దరి మధ్య ఒకే ఒక మ్యాచ్ జరగ్గా...అందులో జ్వెరెవ్ గెలిచాడు. సా.6.30 నుంచి జరిగే ఈ మ్యాచ్లో సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్ యాప్లలో ప్రసారం అవుతుంది. -
‘సిక్సర్’ కొట్టేనా!
ఫుట్బాల్ చరిత్రలో మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు వరల్డ్కప్ గెలిచిన బ్రెజిల్ జట్టు... ఆరోసారి ట్రోపీ కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఖతార్ వేదికగా 2022లో జరిగిన ‘ఫిఫా’ ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్లో పోరాడి ఓడిన బ్రెజిల్... ఈ సారి ఎలాంటి పొరబాట్లకు తావివ్వకుండా కప్పును ముద్దాడాలని భావిస్తోంది. 1958, 1962, 1970, 1994, 2002 ఇలా ఐదు పర్యాయాలు వరల్డ్కప్ గెలిచిన బ్రెజిల్ గత కొంతకాలంగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఒకప్పటిలాగా భారీ అంచనాలు లేకపోవడం కూడా బ్రెజిల్ జట్టుకు కలిసిరానుంది. ‘ఫిఫా’ ప్రపంచకప్ చరిత్రలో జర్మనీ, ఇటలీ నాలుగేసి సార్లు విశ్వవిజేతలుగా నిలవగా... సాకర్ ఆల్టైమ్ గ్రేట్ పీలే ఒక్కడే బ్రెజిల్కు మూడుసార్లు ట్రోఫీ అందించాడు. ప్రస్తుతం ఆ స్థాయి ఆటగాళ్లు లేకపోయినా... నెమార్ జూనియర్పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ప్రపంచకప్ కోసం బ్రెజిల్ 26 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్కు డిఫెండర్ మార్కినోస్ కెప్టెన్ కాగా... 34 ఏళ్ల నెమార్ జూనియర్ దాదాపు తన చివరి వరల్డ్కప్ ఆడనున్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు నెమార్ గాయంతో ఇబ్బంది పడుతున్నా... బ్రెజిల్ జట్టు మేనేజర్ కార్లో ఆన్సెలొటి మాత్రం అతడిపై నమ్మకం ఉంచాడు. తనదైన రోజున క్షణాల్లో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల నెమార్ జట్టుకు బలమని ఆన్సెలొటి వెల్లడించాడు. గ్రూప్–‘సి’ నుంచి బరిలోకి దిగనున్న బ్రెజిల్కు ప్రధానంగా మొరాకో నుంచి ముప్పు పొంచి ఉంది. గత టోర్నీలో సెమీఫైనల్కు చేరిన మొరాకో ఈ సారి కూడా బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. అలాగే స్కాట్లాండ్, హైతీ కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని తపిస్తున్నాయి. గ్రూప్ దశలో జూన్ 14న మొరాకోతో తొలి మ్యాచ్ ఆడనున్న బ్రెజిల్... ఆ తర్వాత 20న హైతీతో, 25న స్కాట్లాండ్తో తలపడనుంది. గ్రూప్ దశ దాటడం పెద్ద కష్టం కాకపోయినా... నాకౌట్లో బ్రెజిల్ జట్టుకు అసలుసిసలు పోటీ ఎదురుకానుంది. – సాక్షి, క్రీడావిభాగం -
అబ్బాయిలకు స్వర్ణం... అమ్మాయిలకు కాంస్యం
కాకమిగహారా (జపాన్): ఆసియా కప్ అండర్–18 హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 4–1 గోల్స్ తేడాతో ఆతిథ్య జపాన్ను చిత్తుచేసింది. భారత్ తరఫున పుర్తి ఆశిష్ తాని (2వ, 28వ, 34వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించగా... కేతన్ ఖుషా్వహా (30వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. జపాన్ తరఫున నుమాడా గాకు (52వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు.సెమీఫైనల్లో పాకిస్తాన్పై నాలుగు గోల్స్తో సత్తాచాటిన ఆశిశ్... తుది పోరులోనూ అదే దూకుడు కొనసాగిస్తూ మూడు గోల్స్ కొట్టడంతో ప్రత్యర్థి పై ఒత్తిడి పెరిగింది. మూడు క్వార్టర్లు ముగిసే సరికే భారత్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా... చివర్లో జపాన్ ఒక గోల్ నమోదు చేసింది. ఇదే వేదికపై జరిగిన మహిళల టోర్నీలో భారత్కు కాంస్యం దక్కింది. కాంస్య పతక పోరులో భారత్ 3–0తో కొరియాపై విజయం సాధించింది. మన జట్టు తరఫున సందీప కుమారి (2వ నిమిషంలో), స్వీటీ కుజుర్ (16వ నిమిషంలో), నౌషీన్ నాజ్ (33వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. -
కెప్టెన్సీ నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే 'స్కై' వీరంగం
భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను ఇవాళ (జూన్ 6) తొలగించారు. కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా అతడికి ఉద్వాసన పలికారు. కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పేరును ప్రకటించారు.త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు జపాన్లో జరిగే ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఎంపిక చేశారు. ఈ మూడు జట్లలో స్కైకు చోటు లభించలేదు. తనపై వేటు పడిన తర్వాత కూడా హుందాగా వ్యవహరించి, కొత్తగా ఎంపికైన జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన స్కై.. వేటు పడిన గంటల వ్యవధిలో బ్యాట్తో ఫైరయ్యాడు. టీ20 ముంబై లీగ్లో భాగంగా సోబో ముంబై ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో (రాత్రి) 24 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి (ట్రయంప్ నైట్స్ ఎంఎన్ఈ కెప్టెన్గా) వీరంగం సృష్టించాడు. ఈ మ్యాచ్లో స్కై ప్రత్యర్ది జట్టులో కొత్తగా ఎంపికై భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉండటం మరో విశేషం. మ్యాచ్కు ముందు స్కై శ్రేయస్ను హత్తుకొని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ చూడచక్కని దృశ్యం సోషల్మీడియాలో వైరలవుతుంది.ముంబై టీ20 లీగ్ మ్యాచ్ విషయానికొస్తే.. సూర్య ఔటయ్యాక అతడి జట్టు గాడి తప్పింది. 19 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. స్కై క్రీజ్లో ఉన్నంతసేపు అతడి జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. తీరా చూస్తే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్ కూడా చేసేలా కనిపించడం లేదు. ప్రత్యర్ది జట్టు బౌలర్లలో ప్రథమేశ్ డాకే 3, యశ్ డిచోల్కర్ 2, సిద్దార్థ్ రౌత్, వేదాంత్ గోరే తలో వికెట్ తీసి స్కై జట్టును దెబ్బకొట్టారు. స్కై జట్టులో అతడితో పాటు అఖిల్ హెర్వాద్కర్ (12), నూతన్ కుమార్ గోయెల్ (34), మకరంద్ గిరీశ్ పాటిల్ (11) మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
పాపం పాటిదార్.. ఆర్సీబీ కెప్టెన్పై సానుభూతి వెల్లువ
ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఇవాళ ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. భారత సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ను తప్పించి శ్రేయస్కు కొత్త టీ20 కెప్టెన్గా పట్టం కట్టారు. సూర్యకు జట్టులో స్థానం కూడా గల్లంతైంది.యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారి భారత సీనియర్ జట్టు నుంచి పిలుపందింది. వైభవ్ మూడు జట్లలో చోటు దక్కించుకున్నాడు. తెలుగు ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కింది. తిలక్కు మరో జాక్పాట్ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్ డిప్యూటీగా ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత 2-3 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న హర్షిత్ రాణాకు మూడు జట్లలో చోటు లభించింది.హర్షిత్ అంశం ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026 అత్యుత్తమంగా రాణించిన భువనేశ్వర్ కుమార్ను కాదని ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా ఇవ్వని హర్షిత్కు ఇన్ని అవకాశాలు ఇవ్వడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. లేటు వయసులోనూ ఇరగదీస్తున్నా, జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోతున్న భువీపై సానుభూతి ప్రదర్శిస్తున్నారు.ఇదే క్రమంలో టీమిండియాకు ఎంపికయ్యే విషయంలో మరో ఆటగాడికి కూడా అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. ఆ ఆటగాడు ఆర్సీబీ సారధి రజత్ పాటిదార్. పాటిదార్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో ఆర్సీబీని ఛాంపియన్గా నిలబెట్టాడు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాక అతను వరుసగా రెండు సార్లు ఆర్సీబీకి టైటిల్ అందించాడు. 17 సీజన్లలో ఒక్క టైటిల్ కూడా సాధించలేని ఆర్సీబీ, పాటిదార్ సారథ్యంలో వరుసగా రెండు టైటిళ్లు సాధించడంతో అభిమానుల్లో అతడిపై క్రేజ్ను మరింత పెరిగింది.తాజాగా సీజన్లో పాటిదార్ కెప్టెన్గా సత్తా చాటడమే కాకుండా వ్యక్తిగతంగానూ ఇరగదీశాడు. 14 ఇన్నింగ్స్ల్లో 192.69 స్ట్రయిక్రేట్తో 41.75 సగటున 501 పరుగులు చేశాడు. ఇలాంటి అద్భుత ప్రదర్శన తర్వాత ఏ ఆటగాడికైనా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుతుందని అంతా భావిస్తారు. పాటిదార్ విషయంలోనూ అదే జరిగింది.తీరా చూస్తే భారత సెలెక్టర్లు తాజాగా ప్రకటించిన జట్ల విషయంలో అతడి పేరును పరిగణలోకి కూడా తీసుకోలేదు. కనీసం ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై అయినా అవకాశం ఇవ్వాల్సింది. అదీ జరగలేదు. దీంతో పాటిదార్పై భువనేశ్వర్ కుమార్ తరహాలో సానుభూతి వ్యక్తమవుతుంది. పాపం పాటిదార్ అంటూ అతని వ్యక్తిగత, ఆర్సీబీ అభిమానులు సోషల్మీడియా వేదికగా కామెంట్లు పడుతున్నారు.వాస్తవానికి వారి బాధలో అర్దం ఉంది. ఎందుకంటే, ప్రస్తుత భారత జట్టు నిర్మాణాన్ని బట్టి చూస్తే పాటిదార్ లాంటి డాషింగ్ మిడిలార్డర్ బ్యాటర్ ఎంతో అవసరం. నాలుగు, ఐదు స్థానాల్లో బరిలోకి దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల దిట్ట అతడు. ఇలాంటి ప్రదర్శనలను అతడి నుంచి ఇటీవలికాలంలో చాలా చూశాం. కాబట్టి సహజంగానే పాటిదార్ లాంటి ప్లేయర్ జట్టులో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ జట్టులో పరిమిత బెర్త్లకు మాత్రమే ఆస్కారం ఉండటంతో పాటిదార్కు మొండిచెయ్యి తప్పలేదు.ఆర్సీబీ అభిమానుల్లో ప్రస్తుతం ప్రకటించిన భారత జట్టుకు సంబంధించి మరో అసంతృప్తి కూడా ఉంది. ఛాంపియన్ జట్టు నుంచి కనీసం ఒక్క ఆటగాడికి కూడా ప్రాతినిథ్యం లభించలేదని వారు బాధపడుతున్నారు. ఐర్లాండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాఇంగ్లండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఆసియా క్రీడలకు భారత టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయి, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ -
‘అందుకే హార్దిక్ను కాదని నితీశ్ రెడ్డిని ఎంపిక చేశాం’
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాను చాంపియన్గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడి స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకే పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు. రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ భారత టీ20 జట్టు సారథిగా వ్యవహరించడమే ఇందుకు కారణం.అప్పుడు కెప్టెన్సీ చేజారిందిఅయితే, అనూహ్యంగా హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను కెప్టెన్ను చేసింది బీసీసీఐ. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నైపుణ్యాలున్న హార్దిక్ను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాడు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.కాలం గిర్రున తిరిగింది.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ద్వైపాక్షిక సిరీస్లలో ఎదురులేని శక్తిగా ఎదిగిన టీమిండియా.. ఈ ఏడాది స్వదేశంలో టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. సొంతగడ్డపై పొట్టి వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.సూర్యపై తప్పని వేటుకానీ ఊహించని రీతిలో బీసీసీఐ సూర్యపై వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టులోనూ స్థానం లేకుండా చేసింది. ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పగ్గాలు చేపట్టనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.పిల్లాడికి అవకాశంఐర్లాండ్తో పాటు.. ఇంగ్లండ్ టూర్.. ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. చిచ్చరపిడుగు, పదిహేనేళ్ల సూర్యవంశీని తొలిసారి టీమిండియాకు ఎంపిక చేసింది. అయితే, ఈ మూడు జట్లలోనూ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు.హార్దిక్కు దక్కని చోటుకాగా ఐపీఎల్-2026లో హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా.. ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో జట్టు పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచింది. ఇక హార్దిక్ పది మ్యాచ్లు ఆడి కేవలం 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.ఇక వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్లకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసినా.. అతడు ఆడే విషయంపై బీసీసీఐ ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.మూడు జట్లలోనూ నితీశ్ రెడ్డితాజాగా టీ20 జట్టు నుంచి పూర్తిగా పక్కనపెట్టేస్తూ టీమిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో యువ ఆల్రౌండర్, ఆంధ్రా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్.. ఆసియా క్రీడల జట్టులో అతడికి చోటు ఇచ్చారు.అందుకే అతడిని ఎంపిక చేశాంఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘వన్డేల్లో అతడు ముఖ్యమైన ఆటగాడు. అతడితో పాటుగా అరుదైన నైపుణ్యాలున్న నితీశ్ రెడ్డి మాకు దొరికాడు.రొటేషన్ పద్ధతిలో ఇద్దరి సేవలు వాడుకుంటాము. అందుకే హార్దిక్కు విశ్రాంతినిచ్చాము. వన్డే వరల్డ్కప్ నాటికి అతడు ఫిట్గా ఉంటాడో లేదో చూడాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. తద్వారా హార్దిక్ ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం సందేహం ఉన్నా.. వన్డే వరల్డ్కప్ టోర్నీలోనూ నితీశ్ రెడ్డినే ఆడిస్తామని అగార్కర్ పరోక్షంగా స్పష్టం చేశాడు. అదే జరిగి.. నితీశ్ రెడ్డి అద్భుతంగా ఆడితే.. హార్దిక్ మున్ముందు జట్టులో కొనసాగడం కూడా కష్టమే అవుతుంది. చదవండి: ‘మేము సెలక్ట్ చేయలేదు.. తనంతన తానే ఎంపికయ్యాడు’ -
భువీని కాదని హర్షిత్కు చోటు.. గంభీర్పై ఆగ్రహజ్వాలలు
భారత సీనియర్ క్రికెట్ జట్టులో కెప్టెన్లకే గ్యారెంటీ లేని రోజుల్లో, ఓ ఆటగాడు కోచ్ అండదండలతో దాదాపు ప్రతి జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. ఆ ఆటగాడి పేరే హర్షిత్ రాణా. ఈ 24 ఏళ్ల కేకేఆర్ పేసర్కు గంభీర్తో సత్సంబంధాలు ఉన్నాయి. గంభీర్ కేకేఆర్ కోచ్గా పని చేసే సమయంలో హర్షిత్ను బాగా వెనకేసుకొచ్చాడు. టీమిండియా కోచ్గా ఎంపికయ్యాక భారీ లాబీయింగ్ జరిపి హర్షిత్కు ఏకంగా భారత జట్టులోనే చోటు ఇప్పించాడు.అది కూడా ఏదో ఒక ఫార్మాట్కే అనుకుంటే పొరపాటే. మూడు ఫార్మాట్ల జట్లలో ఎవరున్నా, లేకపోయినా హర్షిత్ పేరు ఉంటుంది. బుమ్రా అయినా ఏదో ఒక సిరీస్ జట్టులో ఉండడేమో కానీ, హర్షిత్ మాత్రం దాదాపు ప్రతి జట్టులో ప్రత్యక్షమవుతాడు. హర్షిత్కు ఇంతలా అవకాశాలు వస్తున్నాయంటే, అతడేదో భారీ టాలెంటెడ్ అనుకుంటే పొరబడినట్లే. ఇప్పటివరకు అతడు టీమిండియా తరఫున 2 టెస్ట్లు, 14 వన్డేలు, 9 టీ20లు ఆడినా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా లేదు.ఇలాంటి ఆటగాడికి భారత సెలెక్టర్లు ఏం చూసి ఇన్ని అవకాశాలు ఇస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఏదో కోచ్ అండదండలతో నెట్టుకొస్తున్నాడు కానీ, హర్షిత్ దేశవాలీ జట్లకు కూడా చాలా ఎక్కువే. ఇది చాలామంది టీమిండియా అభిమానుల "అభిప్రాయం". తాజాగా గంభీర్-హర్షిత్ బంధం మరోసారి సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు ఇవాళ ప్రకటించిన మూడు వేర్వేరు భారత జట్లలో హర్షిత్కు చోటు దక్కింది. ఇతగాడు గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా సెలెక్టర్లు నేరుగా జాతీయ జట్టులో మరోసారి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి టీమిండియాకు ఎంపిక కావడానికి ఐపీఎల్ ప్రదర్శనలు కొలమానం కానప్పటికీ.. దురదృష్టవశాత్తు ఇటీవలికాలంలో ఇదే తంతు కొనసాగుతుంది.Look at the hypocrisy of Agarkar and Gambhir. They picked Harshit Rana, who was injured for 2-3 months, but left out Bhuvneshwar Kumar, the highest wicket-taker of this year's IPL. pic.twitter.com/BLS7ySwP6l— Aryan (@MStark_56) June 6, 2026ఐపీఎల్ ప్రదర్శనలనే పరిగణలోకి ఓ ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆర్సీబీ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు మొదటి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఈ సీజన్లో భువీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏకంగా టోర్నీ సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండో ఎడిషన్లో ఛాంపియన్గా నిలవడంలో ప్రధానపాత్ర పోషించాడు.భువీ లాంటి ఇన్ ఫామ్ బౌలర్ను కాదని గాయపడి 2-3 నెలుల ఆటకు దూరంగా ఉన్న హర్షిత్ లాంటి అన్ ఫిట్ బౌలర్కు ఏకంగా మూడు భారత జట్లలో అవకాశం ఇవ్వడాన్ని ప్రతి భారత క్రికెట్ అభిమాని తప్పుబడుతున్నాడు. హర్షిత్ ఎంపికలో ప్రతిసారి చక్రం తిప్పే కోచ్ గంభీర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. గంభీర్-చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అర్హతలేని ఆటగాళ్లను ఎంపిక చేసే మాఫియా నడుపుతున్నారని ఫైరవుతున్నాడు.కాగా, ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు ఇవాళ ప్రకటించిన మూడు వేర్వేరు భారత జట్లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. భారత సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ను తప్పించి శ్రేయస్కు కొత్త టీ20 కెప్టెన్గా పట్టం కట్టారు. సూర్యకు జట్టులో స్థానం కూడా గల్లంతైంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారి భారత సీనియర్ జట్టు నుంచి పిలుపందింది. మూడు వేర్వేరు జట్లలో చోటు దక్కించుకున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో హర్షిత్ రాణా ఒకరు. -
'మా టికెట్లు ఇచ్చేయండి'.. అభిమానులకు ఫిఫా అభ్యర్థన!
మరో వారం రోజుల్లో ఫిఫా వరల్డ్కప్కు తెరలేవనుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు కొనసాగనున్న టోర్నీలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్లకు సంబంధించి చాలా టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. అయితే వెబ్సైట్ పొరపాటు వల్ల చిన్న తప్పిదం జరిగిపోయింది. వెబ్సైట్లో తప్పిదం కారణంగా సుమారు 60 మంది అభిమానులు ఉచితంగా టికెట్లు పొందారు. అయితే వీటికి అభిమానులు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో ఫిఫా నిర్వాహకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వెబ్సైట్ లోపం వల్ల ఇలా జరిగిందని నిర్థారణకు వచ్చిన ఫిఫా ఆ 60 టికెట్లను వెనక్కి ఇచ్చేయాలని, వాటి స్థానంలో కొత్త టికెట్లు జారీ చేస్తామని అభిమానులను అభ్యర్థించింది. ఉచితంగా వస్తే వదలకూడదన్న సామెతను ఒంటబట్టించుకున్న అభిమానులు ఫిఫా అభ్యర్థనను పట్టించుకోలేదు. దీంతో ఫిఫా ఉన్నపళంగా ఆ టికెట్లను రద్దు చేసింది. అయితే తమ తప్పిదం వల్లే ఇలాంటి పొరపాటు జరగడంతో అసౌకర్యానికి చింతిస్తున్నామని ఫిఫా తెలిపింది. అయితే టికెట్లు రద్దు చేయాలని ముందు నిర్ణయించినప్పటికీ ఫ్యాన్స్ స్పందించడంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే తమకు వచ్చిన టికెట్లకు ఉన్న ధర మొత్తాన్ని చెల్లిస్తే హ్యాపీగా మ్యాచ్ చూసుకోవచ్చని తెలిపింది. అయితే ప్రపంచకప్ మ్యాచ్లకు సంబంధించి టికెట్లన్నీ అమ్ముడయ్యాయంటూ ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో మూడు నెలల క్రితమే ప్రకటించడం గమనార్హం. ఇక జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా డిపెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగనుంది.చదవండి: బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెటర్.. భారత జట్టులోకి స్వాగతం! -
బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెటర్.. భారత జట్టులోకి స్వాగతం!
శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్ కోసం ఇప్పటికే భారత-ఏ జట్టు ఆ గడ్డపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో తెలుగు కుర్రాడు షేక్ రషీద్కు చోటు దక్కడం ఆసక్తికర అంశంగా మారింది. ధ్రువ్ జురేల్ నేతృత్వంలోని జట్టులో సాయి సుదర్శన్, పడిక్కల్, రుతురాజ్, ఆయుష్ బదోని వంటి ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. 2021 అండర్-19 ఆసియా కప్ టోర్నీ ద్వారా షేక్ రషీద్ తొలిసారి బీసీసీఐ దృష్టిలో పడ్డాడు. జట్టు టైటిల్ గెలవడంలో షేక్ రషీద్ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్కు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ఆరంభంలోనే కోవిడ్ బారిన పడ్డాడు. అయితే లీగ్ దశ ఆఖరికి చేరుకున్న క్రమంలో తిరిగి జట్టులోకి వచ్చిన రషీద్ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో 108 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఫైనల్లోనూ కీలక హాఫ్ సెంచరీతో మెరిసిన షేక్ రషీద్ టీమిండియా టైటిల్ గెలవడంలోనూ సహాయపడ్డాడు.ఎవరీ షేక్ రషీద్?ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రషీద్ క్రికెట్ ప్రయాణం అడ్డంకులతో సాగింది. అతడి తండ్రి షేక్ వలీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొడుకు లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కష్టపడ్డాడు. తండ్రి త్యాగంతో ఇవాళ ఇండియా-ఏ జట్టుకు ఎంపికైన షేక్ రషీద్ త్వరలోనే జాతీయ జట్టుకు కూడా ఎంపికవ్వాలని కోరుకుందాం. అండర్-19 టీ20 ప్రపంచకప్ అతడికి గుర్తింపు తెచ్చినప్పటికీ దేశవాలీ క్రికెట్లో రాణించాలంటే రంజీ మ్యాచ్లు ఆడడం తప్పనిసరి. అందుకే 2022లో ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన షేక్ రషీద్ ఓర్పు, టెక్నిక్, సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యాన్ని అలవరుచుకున్నాడు. 2025-26 రంజీ సీజన్లో షేక్ రషీద్ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో షేక్ర రషీద్ మూడు శతకాలతో 627 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 27 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన షేక్ రషీద్ 46 సగటుతో 1831 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలున్నాయి. లంక పర్యటనలో ముందుగా శ్రీలంక, అఫ్గానిస్తాన్తో కలిసి ఇండియా-ఏ ట్రై వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి.శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, ఎన్ జగదీశన్, అమన్ మోఖడే, షేక్ రషీద్, జీషన్ అన్సారీఇండియా-ఏ టూర్ ఆఫ్ శ్రీలంక షెడ్యూల్జూన్ 25- తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)జులై 2- రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)చదవండి: గంభీర్ చేతిలో అంతుచిక్కని పదార్థం.. ట్రోల్ సరికాదు! -
BCCI: ప్రపంచకప్ గెలిచినా.. ఆ ఐదుగురిపై ‘వేటు’!.. కారణం?
ఊహాగానాలే నిజమయ్యాయి.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పురుషుల టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ను మార్చింది. టీమిండియాకు 2026లో ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసింది. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. మూడేళ్లుగా జట్టులోనే లేడుఐర్లాండ్ పర్యటన నుంచే అయ్యర్ బాధ్యతలు చేపట్టనుండగా.. ఇంగ్లండ్ టూర్, ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా బీసీసీఐ జట్టును ప్రకటించేసింది. ఇక ఈ ఏడాదే టీమిండియాకు వరల్డ్కప్ అందించిన సూర్యను కాదని.. దాదాపుగా మూడేళ్లుగా అసలు టీ20 జట్టులోనే లేని శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ కెప్టెన్గా ఎంపిక చేయడం విశేషం. గత మూడేళ్లుగా ఐపీఎల్లో సారథిగా, బ్యాటర్గా ఈ ముంబైకర్ సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం. మరోవైపు.. ఐపీఎల్-2026లో పరుగుల వరద పారించిన రాజస్తాన్ రాయల్స్ సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా తొలిసారి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచారు.ఆ ముగ్గురిపై వేటు.. ఆ ఇద్దరికి విశ్రాంతి!ఇదిలా ఉంటే.. స్వదేశంలో దాదాపు మూడు నెలల క్రితం టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగమైన భారత జట్టులోని సభ్యుల్లో ఐదుగురిని ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు ఎంపిక చేయలేదు సెలక్టర్లు. వీరిలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేశారు. అయితే, మిగతా నలుగురిని మాత్రం పూర్తిగా పక్కనపెట్టేశారు. వారెవరంటే..సూర్యకుమార్ యాదవ్కెప్టెన్గా 2023-2026 వరకు టీమిండియాను విజయపథంలో నడిపాడు సూర్యకుమార్ యాదవ్. అతడి సారథ్యంలో 52 మ్యాచ్లలో టీమిండియా ఏకంగా నలభై గెలిచింది.అయితే ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న సూర్య గత కొంతకాలంగా విఫలమవుతున్నాడు. దీంతో సెలక్టర్లు నిర్దయగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు జట్టులో కూడా చోటులేకుండా చేశారు. టీ20 ప్రపంచకప్- 2028 టోర్నీని దృష్టిలో పెట్టుకుని 35 ఏళ్ల సూర్యకు దాదాపుగా వీడ్కోలు పలికేశారు.హార్దిక్ పాండ్యాటీమిండియా టీ20 మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా ఈ టూర్ల నుంచి సెలక్టర్లు పక్కనపెట్టేశారు. ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్, ఆల్రౌండర్గా హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు.అదే సమయంలో వెన్నునొప్పితోనూ ఈ ఆల్రౌండర్ సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027 నాటికి అతడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సెలక్టర్లు టీ20 జట్టు నుంచి అతడిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.కుల్దీప్ యాదవ్ప్రపంచకప్ జట్టుకు ఎంపికైనప్పటికీ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు తుదిజట్టులో చాన్నాళ్లుగా చోటు దక్కలేదు. అతడికి బదులు వరుణ్ చక్రవర్తికి యాజమాన్యం పెద్దపీట వేసింది. నిజానికి 2024, 2026లలో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్లలో సభ్యుడైనా 31 ఏళ్ల కుల్దీప్.. ఈ రెండు టోర్నీలలో కలిపి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అయితే, ఈసారి అతడిని పూర్తిగా టీ20ల నుంచి పక్కనపెట్టేసి రవి బిష్ణోయికి అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.రింకూ సింగ్గత కొంతకాలంగా టీ20 జట్టులో భాగమైన రింకూ.. 2024 వరల్డ్కప్ జట్టులో రిజర్వు ప్లేయర్గా ఉన్నాడు. ఇక ఏడాది ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. అయితే, ఫినిషర్గా తన వంతు పాత్ర పోషించడంలో రింకూ విఫలమయ్యాడు. ఐపీఎల్లోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేదు. దీంతో సెలక్టర్లు అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.జస్ప్రీత్ బుమ్రాటీ20 ప్రపంచకప్-2026లో సత్తా చాటిన జస్ప్రీత్ బుమ్రా.. ఐపీఎల్-2026లో మాత్రం తేలిపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున కేవలం నాలుగు వికెట్లే తీశాడు.అయితే, బుమ్రా విషయంలో ప్రదర్శనను బట్టి కాకుండా.. అతడికి విశ్రాంతినిచ్చేందుకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వన్డే వరల్డ్కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని బుమ్రాను యూకే టూర్ నుంచి తప్పించారు. అయితే, ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు మాత్రం ఎంపిక చేశారు.చదవండి: వైభవ్ వచ్చేశాడు! -
గిల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ పరుగుల వరద పారిస్తుంది. ఈ ఇన్నింగ్స్లో ఇప్పటికే ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టగా.. తాజాగా కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. గిల్ 138 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో మూండకెల మార్కును తాకాడు. ఈ సెంచరీ గిల్కు 11వ టెస్ట్ సెంచరీ. ఓవరాల్గా 20వ అంతర్జాతీయ సెంచరీ. కేవలం 26 ఏళ్ల వయసులోనే గిల్ ఇన్ని సెంచరీలు చేయడం విశేషం.అరుదైన ఫీట్టీమిండియా కెప్టెన్గా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్ల్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా భారత్ తరఫున కెప్టెన్గా తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్గా నిలిచాడు. మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు.అంతేకాదు కెప్టెన్ అయిన అతి తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గానూ నిలిచాడు. ఇక ఓవరాల్గా భారత్ తరఫున కెప్టెన్గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.అలాగే అత్యధిక టెస్ట్ శతకాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో టాప్-5లోకి చేరాడు. గిల్ భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా 6 శతకాలు సాధించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (20) టాప్ ప్లేస్లో ఉండగా.. సునీల్ గవాస్కర్ (11), మొహమ్మద్ అజహారుద్దీన్ (9), సచిన్ టెండూల్కర్ (7) గిల్కు ముందున్నారు. గిల్ 6 టెస్ట్ శతకాలను కేవలం 15 ఇన్నింగ్స్లోనే సాధించడం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ అతి భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్ 368-3గా ఉంది. రాహుల్ (100), యశస్వి జైస్వాల్ (24), సాయి సుదర్శన్ (81) ఔట్ కాగా.. గిల్ (103), వికెట్కీపర్ రిషబ్ పంత్ (50) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో సలీం సాఫి 2, జియా ఉర్ షరిఫీ ఓ వికెట్ పడగొట్టారు. -
గంభీర్ చేతిలో అంతుచిక్కని పదార్థం.. ట్రోల్ సరికాదు!
ముల్లన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులేస్తోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ శతకంతో చెలరేగిత్, కెప్టెన్ గిల్ కూడా సెంచరీ దిశగా పరిగెడుతున్నాడు. సాయి సుదర్శన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ విషయం పక్కనబెడితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్లో తన చేతిలో ఒక అంతుచిక్కని పదార్థంతో కెమెరా కంటికి చిక్కాడు. అయితే అవి హోమియోపతి మెడిసిన్స్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే చిన్న డబ్బాలో రౌండ్గా ఉన్న పిల్స్ను చేతిలోకి తీసుకున్న గంభీర్ వాటిని నోటిలో పెట్టుకోవడం కనిపించింది. బహుశా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా గంభీర్ ఆ పిల్స్ను వాడుతున్నట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే అవకాశం చిక్కితే చాలు గంభీర్ను విమర్శించడమే పనిగా పెట్టుకునే కొందరు ఆకతాయిలు తమ నోటికి పనిచెప్పారు. సోషల్ మీడియా వేదికగా అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టడం కనిపించింది. 'గంభీర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని, వెంటనే అరెస్ట్ చేయాలని కొందరు పేర్కొంటే.. డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణాన్ని గంభీర్ పూర్తిగా చెడగొడుతున్నాడని, అతన్ని వెంటనే కోచ్ పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని' కామెంట్లు చేయడం గమనార్హం.అయితే ఆఫ్గన్తో టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ ఆకట్టుకున్నాడు. గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్లో సాయి సుదర్శన్ 104 బంతులెదుర్కొని 13 బౌండరీల సాయంతో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు రావాలని గంభీర్ తనకు చెప్పాడని సాయి సుదర్శన్ మ్యాచ్ విరామ సమయంలో పేర్కొన్నాడు. జైస్వాల్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్తో కలిసి సాయి సుదర్శన్ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలిరోజే టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. గిల్ (103), పంత్ (50) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ (100) శతకం సాధించాడు. 🚨DRUG DEALER GAUTAM GAMBHIR 🚨Gautam Gambhir was seen taking drugs while on-going India vs Afghanistan test match 👀 pic.twitter.com/9gJOYoy7jg— ; (@ReignofDhoni) June 6, 2026చదవండి: ఆఫ్గన్తో టెస్టు.. గిల్ అరుదైన ఫీట్! -
మేము కాదు.. తనంతట తానే సెలక్ట్ చేసుకున్నాడు: అగార్కర్
రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో పర్యటించే భారత టీ20 జట్టుకు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలు-2026 జట్టులోనూ అతడికి చోటు ఇచ్చారు.తండ్రిగా నేను సాధించే గొప్ప రికార్డు అదేఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తండ్రి సంజీవ్ సూర్యవంశీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆజ్తక్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రికార్డుల గురించి వైభవ్ అస్సలు పట్టించుకోడు. ఇప్పుడిక టీమిండియా తరఫున మ్యాచ్లు గెలవడంపైనే అతడి దృష్టి ఉంటుంది.వైభవ్ టీమిండియా గెలుపులో భాగమైతే తండ్రిగా నేను సాధించే అత్యంత గొప్ప రికార్డు అదే అవుతుంది’’ అని సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నారు. కాగా గతేడాది నుంచి ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.పరుగుల వరదరాజస్తాన్ రాయల్స్ తరఫున 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లోనూ 36 బంతుల్లో సెంచరీతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్లో పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించి.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అంతకు ముందు భారత్ అండర్-19 వరల్డ్కప్ గెలవడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించాడు.ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయడానికి గల కారణాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ‘‘తనను కచ్చితంగా ఎంపిక చేయాల్సిందే అనేలా వైభవ్ తన ఆటతో ఒక రకంగా మమ్మల్ని బలవంతపెట్టాడు. పదిహేనేళ్ల పిల్లాడని మాకూ తెలుసు.మేము కాదు.. తనంతట తానే సెలక్ట్ చేసుకున్నాడుఅయితే, చిన్న వయసులోనే రెండు ఐపీఎల్ సీజన్లలో వరుసగా సత్తా చాటడం మామూలు విషయం కాదు. కేవలం ఐపీఎల్ ఒక్కటనే కాదు.. భారత్ అండర్-19 జట్టు తరఫునా అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడి ప్రతిభను మాత్రమే మేము పరిగణనలోకి తీసుకున్నాము.టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తే అతడు తప్పక తన ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. మున్ముందు కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, వాటిని ఎదుర్కోగల సత్తా, టెంపర్మెంట్ వైభవ్కు ఉన్నాయి. ఒకరకంగా వైభవ్ తన ప్రదర్శనలతో తనకు తానే టీమిండియాకు ఎంపిక చేసుకున్నాడు’’ అని అగార్కర్ పేర్కొన్నాడు. కాగా పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్లోనూ అడుగుపెట్టాడు. సూపర్ ఫామ్ కొనసాగిస్తూ పదిహేనేళ్ల వయసుకే ఇప్పుడిలా టీమిండియాకు ఎంపికయ్యాడు.చదవండి: అందుకే సూర్యను తప్పించాము: అగార్కర్ -
ఉద్వాసనకు గురైన తర్వాత సూర్య మొదటి రియాక్షన్ ఇదే..!
2026 టీ20 ప్రపంచకప్ గెలిపించిన తర్వాత కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటు పడింది. త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్లలో అతనికి చోటు కూడా దక్కలేదు. కెప్టెన్గా ఉద్వాసన పలికినా, జట్టులో స్థానమైనా లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, సెలెక్టర్లు స్కైపై నిర్దయగా వ్యవహరించారు.ఇంత అవమానం జరిగినా స్కై చాలా హుందాగా వ్యవహరించాడు. తన ఉద్వాసన వార్త వెలువడిన గంటలోపే సోషల్మీడియా వేదికగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. "Wishing this highly skilled group all the best for challenges ahead" అంటూ పోస్ట్ చేశాడు.Suryakumar Yadav’s Instagram story. pic.twitter.com/7CGiqazniN— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 2026స్కై పరిణితి, హుందాతనానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. తనపై వేటు పడినా జట్టుకు శుభాకాంక్షలు తెలపడం అతని గొప్పతనం అంటూ కొనియాడుతున్నారు. భారత కెప్టెన్గా స్కైకు మంచి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ, వ్యక్తిగంతా ఇటీవలికాలంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ కారణంగా బీసీసీఐ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది.అతడి స్థానంలో నూతన కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఎంపిక చేసింది. భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడల కోసం భారత జట్లను ఇవాళ ప్రకటించాడు. ఈ మూడు జట్లకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించిన విధంగానే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారి సీనియర్ జట్టులో చోటు లభించింది. వైభవ్ మూడు జట్లలో చోటు దక్కించుకున్నాడు. తెలుగు ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కించుకున్నారు. తిలక్కు జాక్పాట్ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్ డిప్యూటీగా ఎంపికయ్యాడు.ఐర్లాండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాఇంగ్లండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షియువం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఆసియా క్రీడలకు భారత టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయి, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ -
ఆఫ్గన్తో టెస్టు.. గిల్ అరుదైన ఫీట్!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా బ్యాటర్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్ శతకంతో సరికొత్త రికార్డులు నెలకొల్పగా.. తాజాగా టీమిండియా సారథి శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. టీమిండియా కెప్టెన్గా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా భారత్ తరఫున కెప్టెన్గా తక్కువ ఇన్నింగ్స్లో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్గా గిల్ నిలిచాడు. మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు. అంతేకాదు కెప్టెన్ అయిన తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గానూ గిల్ నిలిచాడు. ఇక ఓవరాల్గా భారత్ తరఫున కెప్టెన్గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో గిల్ 11వ స్థానంలో నిలిచాడు. ఆఫ్గన్పై సాధించిన అర్థసెంచరీ గిల్కు తొమ్మిదోది కావడం విశేషం.ఇక గిల్ ఇప్పటివరకు 40 టెస్టు మ్యాచ్లాడి 2,843 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 8 అర్థసెంచరీలున్నాయి. మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. 68 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (65), రిషబ్ పంత్ (25) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు కేఎల్ రాహుల్ శతకం చేసిన వెంటనే ఔట్ అయ్యాడు. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)చదవండి: తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్ను తప్పించాం! -
శతక్కొట్టిన కేఎల్ రాహుల్
ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 164 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్ను అందుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు ఆతర్వాతి బంతికే జియా ఉర్ రహ్మాన్ షరిఫీ బౌలింగ్లో రహ్మానుల్లా గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ ఇలా సెంచరీ చేసిన వెంటనే ఔట్ కావడం మూడోసారి.ఈ సెంచరీ రాహుల్కు 12వ టెస్ట్ సెంచరీ. ఆఫ్ఘనిస్తాన్పై మొదటిది. 12 సెంచరీల్లో రాహుల్ సాధించిన ఆరో దేశం ఆఫ్ఘనిస్తాన్. మూడు ఫార్మాట్లో రాహుల్కు ఇది 22వ సెంచరీ. టెస్ట్ల్లో 12తో పాటు 8 వన్డే శతకాలు, 2 టీ20 శతకాలు రాహుల్ ఖాతాలో ఉన్నాయి. ఈ సెంచరీతో రాహుల్ భారత్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ (33) టాప్ ప్లేస్లో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్ (22), మురళీ విజయ్ (12) రాహుల్ (11) కంటే ముందున్నారు. తన 12 టెస్ట్ సెంచరీల్లో రాహుల్ 11 ఓపెనర్గా సాధంచగా.. ఒకటి మిడిలార్డర్ బ్యాటర్గా సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్లాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 64 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 276-3గా ఉంది. రాహుల్ (100), యశస్వి జైస్వాల్ (24), సాయి సుదర్శన్ (81) ఔట్ కాగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్ (62), వికెట్కీపర్ రిషబ్ పంత్ (2) క్రీజ్లో ఉన్నారు. -
తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్ను తప్పించాం!
తెలుగు క్రికెటర్ నంబూరి తిలక్ వర్మకు బీసీసీఐ వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం బీసీసీఐ ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్తో పాటు ఆసియా గేమ్స్కు టీమిండియా జట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీలకు వేర్వేరుగా ప్రకటించిన జట్లలో తిలక్ వర్మ చోటు దక్కించుకోవడమే గాక, శ్రేయస్ అయ్యర్కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. అయితే ఉన్నపళంగా అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను తిలక్ వర్మకు అప్పగించడంపై బీసీసీఐ స్పందించింది. జట్లను ప్రకటించిన అనంతరం సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడాడు. ‘రాబోయే రెండేళ్ల కాలంలో టీమిండియా చాలా టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులోనే 2028 టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. అక్షర్పటేల్ అప్పటి వరకు జట్టులో ఉంటాడా లేదా అనేది సందేహం. అందుకే మాకు తిలక్ వర్మ డిప్యూటీ కెప్టెన్ పదవికి సరైనోడిలా కనిపించాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పటికీ, రాబోయే రెండేళ్ల సైకిల్ను దృష్టిలో పెట్టుకొని తిలక్ వర్మను డిప్యూటీగా ఎంపిక చేయాలని నిర్ణయించాం. అందునా తిలక్ వర్మ ఒక అద్భుత ఆటగాడు. డిప్యూటీ కెప్టెన్గా అదనపు బాధ్యతలు ఇవ్వడం ద్వారా మరింత నేర్చుకుంటాడన్నది మా నమ్మకం.’ అని చెప్పుకొచ్చాడు. అజిత్ అగార్కర్ చెప్పినట్లుగానే తిలక్ వర్మ కొన్నేళ్లుగా భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. 2024లో సౌతాఫ్రికా గడ్డపై రెండు శతకాలు బాదిన తిలక్ వర్మ, ఆ గడ్డపై 3-1 తేడాతో సిరీస్ను గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక గతేడాది ఆసియా కప్ ఫైనల్లో భారత్ గెలవడంలో తిలక్ వర్మదే కీలకపాత్ర. ఆ మ్యాచ్లో 69 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటిదాకా బ్యాటర్గా రాణించిన తిలక్ వర్మ ఇకపై వైస్ కెప్టెన్సీ బాధ్యతలు సవాల్ విసరనున్నాయి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్తో పాటు 2028 టీ20 ప్రపంచకప్పై దృష్టి సారించిన నేపథ్యంలో తిలక్ వర్మ బ్యాటర్గా భారత బ్యాటింగ్లో మూల స్తంభాల్లో ఒకడిగా ఉండడంతో పాటు డిప్యూటీ నాయకత్వ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక అక్షర్పటేల్ వైస్కెప్టెన్ పదవిని కోల్పోయినప్పటికీ సీనియర్ స్పిన్నర్గా జట్టులో చోటు కాపాడుకున్నాడు.ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.చదవండి: కనిపించని సూర్యకుమార్ పేరు.. కెరీర్కు ఎండ్కార్డ్! -
కోహ్లి అవుట్.. రీప్లేస్మెంట్ను ప్రకటించిన బీసీసీఐ
అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి దూరమయ్యాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించే... అదే విధంగా ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత టీ20 జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.కొత్త టీ20 కెప్టెన్కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను తప్పించిన సెలక్టర్లు.. శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించారు. ఇక చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని కూడా టీమిండియాకు ఎంపిక చేసి యూకే టూర్తో పాటు ఆసియా క్రీడల జట్టులోనూ చోటిచ్చారు.కోహ్లి ఎప్పుడు వస్తాడో తెలియదుఈ జట్ల ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ విరాట్ కోహ్లి గురించి అప్డేట్ అందించాడు. కోహ్లి గాయంపై తమకు ఇంకా స్పష్టత రాలేదని.. అతడు ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటాడో తెలియదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నాటికి అతడు ఫిట్గా ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.కోహ్లి స్థానంలో అతడేఅదే సమయంలో విరాట్ కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్ను అఫ్గన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా కోహ్లి గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.రోహిత్ సంగతేంటి?ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గురించి మాత్రం బోర్డు ఎలాంటి అప్డేట్ అందించలేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఈ ముంబై ఇండియన్స్ స్టార్ ఇంతవరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకోనే లేదు.మరోవైపు.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే, గాయంపై స్పష్టత లేకపోవడంతో అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదని అగార్కర్ తెలిపాడు. కాగా అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్తో వన్డే సిరీస్ జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సందర్భంగా తెలియజేశారు.అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత జట్టు (అప్డేటెడ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ (ఫిట్నెస్ ఆధారంగా), హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్ ఆధారంగా).షెడ్యూల్జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికగా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ప్రపంచ క్రికెట్లో పెను సంచలనంగా మారిన 15 ఏళ్ల భారత బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. వైభవ్ తొలిసారి భారత సీనియర్ జట్టుకు ఎంపికై సరికొత్త పలు రికార్డులు నెలకొల్పాడు. త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన మూడు భారత జట్లలో ఈ బిహారి బుడ్డోడు చోటు దక్కించుకున్నాడు.తద్వారా అత్యంత పిన్న వయస్సులో భారత సీనియర్ జట్టుకు ఎంపికైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరటి 37 ఏళ్ల పాటు ఉండిన ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ 1989లో పదహారేళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ మీద అరంగేట్రం చేయగా.. వైభవ్ కేవలం పదిహేనేళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. జూన్ 26 నుంచి ఐర్లాండ్తో జరుగబోయే సిరీస్లో వైభవ్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైంది. ఈ లెక్కన పదిహేనేళ్ల 91 రోజుల వయసులో వైభవ్ టీమిండియా అరంగేట్రం చేయడం కూడా ఖరారైనట్లే.ఈ క్రమంలో వైభవ్ మరో చారిత్రక రికార్డు నెలకొల్పడం కూడా ఖాయమైంది. అత్యంత చిన్న వయసులో టీ20 అరంగేట్రం చేయనున్న ఐసీసీ ఫుల్ మెంబర్ జట్ల సభ్యుడిగా వైభవ్ చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ పేరిట ఉంది. ముజీబ్ 2018లో 16 ఏళ్ల 314 రోజుల వయసులో టీ20 అరంగేట్రం చేశాడు. త్వరలో (15 ఏళ్ల 91 రోజులు) వైభవ్ ముజీబ్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్గా అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన ఆటగాడి రికార్డు రొమేనియాకు చెందిన ఎం ఘెరసిమ్ పేరిట ఉంది. ఇతను 2020లో 14 ఏళ్ల 16 రోజుల వయసులో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. -
శ్రీలంక పర్యటన.. టీమిండియా కెప్టెన్గా ధృవ్ జురెల్
ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్లతో పాటు ఆసియా క్రీడలకు వేర్వేరు భారత జట్లను ఇవాళ (జూన్ 6) ప్రకటించారు. ఈ మూడు జట్లకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. ఇప్పటివరకు భారత టీ20 జట్టు కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్కు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. అందరూ ఊహించిన విధంగానే చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. వైభవ్కు మూడు జట్లలో చోటు దక్కింది. తెలుగు ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కించుకున్నారు. తిలక్కు జాక్పాట్ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్ డిప్యూటీగా ఎంపికయ్యాడు.ఇదే సందర్భంగా జూన్ 25 నుంచి శ్రీలంకలో పర్యటించాల్సిన భారత్-ఏ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా ధృవ్ జురెల్ ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా దేవదత్ పడిక్కల్ నియమించబడ్డాడు. ఈ జట్టులో సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, అన్షుల్ కంబోజ్ లాంటి ఐపీఎల్ స్టార్లు చోటు దక్కించుకున్నారు.శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, ఎన్ జగదీశన్, అమన్ మోఖడే, షేక్ రషీద్, జీషన్ అన్సారీఇండియా-ఏ టూర్ ఆఫ్ శ్రీలంక షెడ్యూల్జూన్ 25- తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే)జులై 2- రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ (గాలే) -
అందుకే సూర్యను తప్పించాం: అగార్కర్
అందరూ ఊహించిందే జరిగింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను కొత్త కెప్టెన్గా నియమించారు. శ్రేయస్ గత మూడేళ్లగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి.. ఉన్నపళంగా అతడిని కెప్టెన్గా ప్రకటించడం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.ఐపీఎల్-2024లో కెప్టెన్గా కోల్కతా నైట్రైడర్స్కు టైటిల్ను అందించిన శ్రేయస్.. ఆ తర్వాత సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్కు చేర్చాడు. అంతకుముందు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా కూడా అతడు విజయవంతమయ్యాడు. దేశవాళీ క్రికెట్లో సైతం ముంబై జట్టును నడిపించిన అనుభవం శ్రేయస్కు ఉంది.ఒక్క కెప్టెన్సీలోనే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా ఈ ముంబైకర్ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత టీ20 జట్టు బాధ్యతలను అయ్యర్కు అప్పగించారు. ఇక శ్రేయస్ అయ్యర్ను కొత్త కెప్టెన్గా నియమించడంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. శ్రేయస్ ఒక లీడర్గానూ, బ్యాటర్గానూ నిలకడగా రాణిస్తున్నాడని, అందుకే అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించామని అగార్కర్ తెలిపాడు."శ్రేయస్ ఇప్పటికే కెప్టెన్గా తనను తాను నిరూపించుకున్నాడు. అతడు గత కొన్నేళ్లుగా వేర్వేరు ఫ్రాంచైజీలను (ఢిల్లీ, కోల్కతా, పంజాబ్ కింగ్స్) సమర్థవంతంగా నడిపించడం మనం చూశాము. అయ్యర్ కెప్టెన్సీలోనే కేకేఆర్ ఛాంపియన్గా నిలిచింది. వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. గత టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యే రేసులో అతడు చివర వరకు ఉన్నాడు.కానీ టీమ్ కాంబినేషన్ కారణంగా అతడిని జట్టులోకి తీసుకోలేకపోయాము. భారత జట్టుకు వరల్డ్ కప్ అందించి, అద్భుతమైన ఫామ్లో ఉన్న ఒక కెప్టెన్ను మార్చడం చాలా కష్టమైన నిర్ణయం. కానీ భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా సూర్యను తప్పించాల్సి వచ్చింది. రాబోయో రెండేళ్ల కాలం మాకు చాలా ముఖ్యం.సూర్యకుమార్తో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాము. అన్ని విషయాలను అతడికి వివరించాము. అందుకు అతడు సానుకూలంగా స్పందించారు. ఏదేమైనప్పటికి భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అన్ని రకాలగా శ్రేయస్ అర్హుడని ప్రెస్ కాన్ఫరెన్స్లో అజిత్ పేర్కొన్నాడు. -
కనిపించని సూర్యకుమార్ పేరు.. కెరీర్కు ఎండ్కార్డ్!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్గా ముద్రపడిన సూర్యకుమార్ కెరీర్కు ఎండ్కార్డ్ పడింది. తాజాగా శనివారం ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్, ఆసియా గేమ్స్కు ప్రకటించిన టీమిండియా జట్టులో సూర్యకుమార్కు చోటు దక్కలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కనీసం సూర్య పేరును ప్రస్తావించలేదని స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా నాలుగు నెలల కిందట టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ కెరీర్ ఇలా అర్థంతరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. టీమిండియాకు ఆసియా కప్తో పాటు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకు వీడ్కోలు పలుకుతూ బీసీసీఐ చివరి మ్యాచ్ ఏమైనా ఆడిస్తుందేమో అని అభిమానులు ఆశించారు. కానీ బీసీసీఐ తన పంథా మార్చి ఫామ్లో లేని ఆటగాళ్లను నిరభ్యరంతంగా జట్టు నుంచి పక్కనబెట్టేస్తుంది. కొన్ని రోజులుగా కెప్టెన్సీ పదవి నుంచి మాత్రమే సూర్యను తప్పిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, ఇవాళ ప్రకటించిన జట్టులో సూర్యకుమార్ పేరు కనిపించకపోవడంతో అతడి కెరీర్కు ముగింపు పడినట్లయింది.తుఫానులా దూసుకొచ్చిన సూర్య31 ఏళ్ల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ అనతికాలంలోనే టీ20 క్రికెట్లో స్టార్ హోదాను పొందాడు. టీ20 స్పెషలిస్ట్గా పేరు పొందిన సూర్య మైదానం నలువైపులా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. దీంతో సూర్యకుమార్ జట్టు పగ్గాలు చేపట్టాడు. కెప్టెన్గా, బ్యాటర్గా అసమాన ప్రదర్శన కనబరిచిన సూర్య ఆట 2025 నుంచి పతనం దిశగా సాగింది. కెప్టెన్సీ ఒత్తిడిలో తన సహజసిద్ధమైన ఆటకు దూరంగా జరిగిన సూర్యకుమార్ ఫామ్లేమితో తంటాలు పడ్డాడు. టీ20 ప్రపంచకప్లోనూ సూర్య పెద్దగా రాణించింది లేదు. అయితే టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచకప్కు సూర్య కెప్టెన్ హోదాలో ఉండడమే అతడికి దక్కిన ఘనత అని చెప్పొచ్చు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లోనూ సూర్యకుమార్ పేలవ ప్రదర్శన చేయడంతో అతడి కెరీర్పై నీలినీడలు కమ్ముకున్నాయి. సీనియర్ అయినా, అనుభవం ఉన్నా సరే ఫామ్లో ఉన్న ఆటగాడిగే తన మద్దతు ఉంటుందని కోచ్ గౌతమ్ గంభీర్ కుండబద్ధలు కొట్టడంతో సూర్యకుమార్ కెప్టెన్సీతో పాటు జట్టులో అతడి చోటు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా గేమ్స్కు ప్రకటించిన జట్టులో సూర్యకుమార్ చోటు కోల్పోయాడు. సూర్యకుమార్ టీమిండియా తరఫున 113 టీ20లు ఆడి 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 25 అర్థసెంచరీలున్నాయి. దీంతో పాటు సూర్యకుమార్ 37 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. మొత్తంమీద టీమిండియాలోకి తుఫానులా దూసుకొచ్చిన సూర్యకుమార్ ఐదేళ్లు తిరక్కుండానే అశనిపాతంలా కిందకు పడిపోవడం గమనార్హం. చివరగా ఎన్నేళ్లు ఆడామాన్నది కాదు.. ఆడిన కొద్దికాలంలోనే తన పేరును చరితార్థం చేసుకున్న సూర్యకుమార్కు హ్యాట్సాఫ్. గుడ్బై మిస్టర్ 360.. సూర్యకుమార్ యాదవ్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఇక దబిడిదిబిడే! -
BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. ఇక దబిడిదిబిడే!
ఊహించిందే జరిగింది.. రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి సువర్ణావకాశం వచ్చింది. ఐపీఎల్-2026లో సత్తా చాటిన ఈ చిచ్చరపిడుగుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతడిని ఏకంగా టీమిండియాకు ఎంపిక చేసింది.సచిన్ రికార్డు బద్దలుజూన్లో ఐర్లాండ్, ఇంగ్లండ్లలో పర్యటించే భారత టీ20 జట్టుకు వైభవ్కు ఎంపిక చేసిన సెలక్టర్లు.. ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే జట్టులోనూ అతడికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు.అత్యంత పిన్న వయస్సులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా సచిన్ 1989లో పదహారేళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ మీద అరంగేట్రం చేశాడు. ఇక వైభవ్ కేవలం పదిహేనేళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్పై అతడు అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైపోయింది.నిలకడైన ఆట.. విధ్వంసకర బ్యాటింగ్గతేడాది రాజస్తాన్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో శతకాల మోత మోగించాడు.అండర్-19 వరల్డ్కప్ ఫైనల్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులతో రాణించి.. భారత్ విజేతగా నిలవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఈవెంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.అత్యధిక పరుగుల వీరుడిగా ఘనతఇదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున పూర్తి స్థాయి ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 36 బంతుల్లో శతక్కొట్టాడు. ఓవరాల్గా పదహారు మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు.తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు వైభవ్. ఇప్పటికే అత్యంత పిన్న వయస్సులోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ను కూడా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.పైసా వసూల్ ప్రదర్శన.. టీమిండియాకు ఎంపికఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని వీలైనంత త్వరగా టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వచ్చాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన బీసీసీఐ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదిహేనేళ్ల వయస్సులోనే అతడిని ఎంపిక చేయడం విశేషం. ఓవరాల్గా రాజస్తాన్ ప్లే ఆఫ్స్ను చేర్చి పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చిన వైభవ్.. ఇప్పుడు టీమిండియా తరఫున దుమ్ములేపేందుకు సిద్ధమయ్యాడు. చిన్న వయస్సులోనే భారత జట్టుకు ఎంపికైన వైభశ్ సూర్యవంశీకి శుభాభినందనలు.. అతడి బంగారు భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్!! చదవండి: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు జట్లు ఇవే -
క్రీడాస్ఫూర్తిని మంటగలిపిన కేఎల్ రాహుల్!
ముల్లన్పూర్ వేదికగా భారత్, అప్గానిస్తాన్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో కేఎల్ రాహుల్ అర్థసెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్తో కలిసి నిలకడగా ఆడుతున్న రాహుల్ రెండో వికెట్కు అతడితో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 36 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 153 పరుగులు చేసింది. అయితే మ్యాచ్లో కేఎల్ రాహుల్కు ఒక లైఫ్ లభించింది. జియావు్ రెహ్మాన్ వేసిన 11వ ఓవర్ మొదటి బంతిని కేఎల్ రాహుల్ కట్ షాటే ఆడే ప్రయత్నం చేశాడు. అయితే సరైన టైమింగ్ కుదరక బంతి బ్యాట్ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే క్యాచ్ అవుట్ అంటూ కీపర్ సహా ఆఫ్గన్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అప్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది రివ్యూ వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడు. అయితే బౌలర్తో పాటు సెకండ్ స్లిప్లో ఉన్న రహ్మనుల్లా గుర్బాజ్లు ఆత్మవిశ్వాసంతో రివ్యూకు వెళ్లాలని కెప్టెన్కు చెప్పినప్పటికీ, కీపర్ సందేహం వ్యక్తం చేయడంతో హష్మతుల్లా డీఆర్ఎస్కు వెళ్లలేదు. అయితే ఆ తర్వాత రిప్లేలో బంతి కేఎల్ రాహుల్ బ్యాట్కు తగిలినట్లు స్పైక్వచ్చింది. దీంతో రివ్యూ తీసుకోకుండా తప్పు చేశానే అని హష్మతుల్లా తెగ బాధపడిపోయాడు. అయితే చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం వల్ల లాభం లేనట్లే రివ్యూ వెళ్లకుండా ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం. ఈ విషయం పక్కనబెడితే కేఎల్ రాహుల్ తాను ఔట్ అని తెలిసినప్పటికీ బంతి ఎడ్జ్ అవ్వలేదంటూ అంపైర్కు సైగ చేసి పక్కదారి పట్టించాడని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ అభిమానులు మండిపడ్డారు. తాను ఔట్ కావద్దని ప్రతీ ఆటగాడిగా స్వార్థం ఉండడం సహజమేనని, కానీ కేఎల్ రాహుల్ క్రీడాస్ఫూర్తి ప్రదర్శిస్తూ అంపైర్ ఔట్ ఇవ్వకున్నా తనంతట తాను మైదానం వీడి ఉంటే అతడిపై గౌరవం పెరిగి ఉండేదని కామెంట్లు చేస్తున్నారు. అలా కాకుండా స్పోర్ట్స్ స్పిరిట్కు విరుద్ధంగా రాహుల్ చర్య ఉందని విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్లో ఒక లైఫ్ పొందిన కేఎల్ రాహుల్ టీమిండియా 107 పరుగుల వద్ద ఉన్నప్పుడు అర్థశతకం మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు బౌండరీలు ఉన్నాయి. ఈ అర్థశతకంతో కేఎల్ రాహుల్ 9వేల ఫస్ట్క్లాస్ పరుగులు కూడా పూర్తి చేసుకోవడం విశేషం.Rahul confused the AFG team and made them believe it was his bat's sound. Well Played Rahul 👏 https://t.co/enVYHa7AKe pic.twitter.com/OaWR4MrhLu— Varun (@The_MythBreaker) June 6, 2026చదవండి: పంథా మార్చిన బీసీసీఐ.. బలవంతంగా పంపుతున్న వైనం! -
టీమిండియా టీ20 కొత్త కెప్టెన్ ప్రకటన.. సూర్యవంశీకి ఛాన్స్
టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడి స్ధానంలో జట్టు పగ్గాలను మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు అప్పగించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లకు జట్టు ఎంపిక సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్కు డిప్యూటీగా హైదరాబాదీ తిలక్ వర్మను సెలక్టర్లు నియమించారు. వీటితో పాటు సెప్టెంబర్లో జరగనున్న ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించారు. ఏషియన్ గేమ్స్లో కూడా టీమిండియా కెప్టెన్గా అయ్యర్ వ్యవహరించనున్నాడు.వైభవ్కు ఛాన్స్ఇక ఐపీఎల్-2026లో దుమ్ములేపిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి టీ20 జట్టులో చోటు కల్పించారు. దీంతో 15 ఏళ్ల సూర్యవంశీ.. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయష్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయస్సులో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.సూర్య ఖేల్ ఖతంఇక టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ ప్రస్ధానం ముగిసినట్లే. సారధిగా భారత్కు టీ20 ప్రపంచకప్-2026ను అందించినప్పటికి.. పేలవ ఫామ్, భవిష్యత్తు ప్రణాళికల కారణంగా అతడిపై వేటు వేశారు. కెప్టెన్గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే సూర్యను తొలగించారు. గత కొంత కాలంగా టీ20లకే పరిమితమైన సూర్యను, ఇకపై మరి భారత జెర్సీలో చూడకపోవచ్చు.ప్రిన్స్ యాదవ్కు చోటుమరోవైపు వైభవ్తో పాటు ఈ ఏడాది సీజన్లో అదరగొట్టిన లక్నో సూపర్ జెయింట్స్ పేస్ బౌలర్ ప్రిన్స్ యాదవ్కు కూడా టీ20 జట్టులో చోటు దక్కింది. ప్రిన్స్ యాదవ్ ఇప్పటికే అఫ్గానిస్తాన్తో వన్డేలకు ఎంపికైన సంగతి తెలిసిందే.ఐర్లాండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణాఇంగ్లండ్ టీ20లకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఆసియా క్రీడలకు భారత టీ20 జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయి, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ -
‘శ్రేయస్ నన్ను తిట్టాడు.. కావాలనే పదకొండో ఓవర్లో బౌలింగ్’
గతేడాది ఐపీఎల్లో సత్తా చాటిన టీమిండియా స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్.. ఈసారి మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. పంజాబ్ కింగ్స్ తరఫున 2025లో 17 మ్యాచ్లలో కలిపి ఈ లెఫ్టార్మ్ పేసర్ 21 వికెట్లు కూల్చాడు.అయితే, ఐపీఎల్-2026లో మాత్రం పద్నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం 14 వికెట్లు మాత్రమే తీశాడు అర్ష్దీప్ సింగ్. దీంతో ఆటగాడిగా విమర్శలు మూటగట్టుకున్న అర్ష్.. వ్యక్తిగత ప్రవర్తనతోనూ వార్తల్లో నిలిచాడు.తిలక్ వర్మపై వివక్షపూరిత కామెంట్ ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు ఆ జట్టు ఆటగాడు తిలక్ వర్మను ‘అంధేరీ (నల్లోడా అన్న అర్థంలో)’ అని పిలిచి విమర్శలపాలయ్యాడు అర్ష్దీప్ సింగ్. ఆ తర్వాత యజువేంద్ర చహల్ విమానంలో వేపింగ్ (ఇ- సిగరెట్ తాగడం) చేస్తున్నట్లుగా ఉన్న వీడియో పంచుకుని వివాదానికి కారణమయ్యాడు.మొత్తానికి ఈ సీజన్లో అర్ష్దీప్ సింగ్ ఏ రకంగానూ అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సైతం అతడి పట్ల గుర్రుగా ఉన్నాడని, అతడిని తిట్టాడని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అర్ష్దీప్ సింగ్ తాజాగా ధ్రువీకరించాడు. పంజాబ్ కింగ్స్ తరఫున హర్లీన్ డియోల్ నిర్వహించే పాడ్కాస్ట్లో మాట్లాడుతూ..అర్ష్.. అక్కడేం చేస్తున్నావు?‘‘ఓరోజు మ్యాచ్లో నేను బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచాలని సరదాగా చిందులు వేస్తున్నాను. అంతలోనే శ్రేయస్ అయ్యర్ నన్ను గట్టిగా పిలిచాడు. ‘అర్ష్.. అక్కడేం చేస్తున్నావు?’ అని కాస్త కోపంగానే అడిగాడు.కావాలనే పదకొండో ఓవర్లో బౌలింగ్వెంటనే నన్ను బౌలింగ్ చేసేందుకు రమ్మన్నాడు. సాధారణంగా నేను తొలి రెండు ఓవర్లు.. అదే విధంగా 17, 20వ ఓవర్లో మాత్రమే బౌలింగ్కు వస్తాను. కానీ ఆరోజు శ్రేయస్ నన్ను పదకొండో ఓవర్లో బౌలింగ్ చేసేందుకు పిలిచాడు.ఆ పరిణామంతో నేను షాకయ్యాను. ఆ తర్వాత నన్ను పిలిచి కాస్త గట్టిగానే మాట్లాడాడు. మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడమన్నాడు. దృష్టి మరల్చకుండా ఏకాగ్రతతో ఉండాలని చెప్పాడు. బాగా ఆడితే.. లేదంటే అందరూ చెప్పేవాళ్లేఒక ఓవర్ నువ్వు బాగా వేశావంటే అంతా బాగానే ఉంటుంది. లేదంటే.. తిట్లు తప్పవు. ప్రతి ఒక్కరు అప్పుడు మన ‘ఫోకస్’ గురించే మాట్లాడతారు’’ అని అర్ష్దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.కాగా గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్.. ఈసారి కూడా ఆరంభంలో అదరగొట్టింది. వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ దిశగా దూసుకుపోయింది. అయితే, ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్లు ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. శ్రేయస్, అర్ష్ తదుపరి అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్లో కలిసి బరిలో దిగనున్నారు.చదవండి: ‘అతడు ఉంటే టీమిండియా వరల్డ్కప్ గెలవదు’🔴 SHREYAS IYER WAS UNHAPPY WITH MY BOUNDARY-LINE ENTERTAINMENT - ARSHDEEP SINGH 🤯🎙️: While I was fielding on the boundary and entertaining the crowd, Shreyas Iyer suddenly called out, ‘Arsh, what are you doing there?’ and asked me to come bowl. I usually bowl the 1st, 2nd,… pic.twitter.com/iS2bcGE7O9— Sam (@cricsam02) June 6, 2026 -
టీమిండియాలోకి కొత్త కుర్రాడు.. ఎవరీ మానవ్ సుతార్?
టీమిండియా తరపున మరో యువ ఆటగాడు క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. ముల్లాన్పూర్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. భారత టెస్ట్ క్యాప్ను అందుకున్న 319వ ప్లేయర్గా సుతార్ నిలిచాడు.వాస్తవానికి హర్ష్ దూబేకు తుది జట్టులో ఆడే అవకాశముస్తుందని అంతా భావించారు. కానీ మేనెజ్మెంట్ మాత్రం సుతార్ వైపు మొగ్గు చూపింది. దీంతో ఎవరి మానవ్ సుతార్ నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.ఎవరీ మానవ్ సుతార్?అతడి పూర్తి పేరు.. మానవ్ జగదుసకుమార్ సుతార్. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఆగస్టు 3, 2002న రాజస్థాన్లోని శ్రీ గంగనగర్లో జన్మించాడు. తన చిన్నతనం క్రికెటర్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమించాడు. మానవ్ శ్రీ గంగానగర్ జిల్లా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి అండర్-14, అండర్-16 టైటిళ్లను అందించాడు. ఆ తర్వాత అతడు రాజస్తాన్ అండర్-16, అండర్-19, అండర్-23 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అక్కడ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచడంతో రాజస్తాన్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం మానవ్కు లభించింది. 2022 రంజీ సీజన్లో ఆంధ్రప్రదేశ్పై తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర రంజీ సీజన్లోనే సుతార్ దుమ్ములేపాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. కేవలం 6 మ్యాచ్లలోనే 39 వికెట్లు పడగొట్టి రాజస్తాన్ తరపున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. తొలి 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో అతడు ఏకంగా 44 వికెట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తంగా ఇప్పటివరకు 29 రెడ్బాల్ క్రికెట్ మ్యాచ్లు ఆడిన సుతార్.. 2.94 ఏకానమీ రేట్తో 129 వికెట్లు సాధించాడు. ఇందులో ఆరు ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి. 8/33 అతడి అత్యుత్తమ గణాంకాలగా ఉన్నాయి. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కు బ్యాట్తో కూడా రాణించే సత్తా ఉంది. అతడి పేరిట ఓ ఫస్ట్క్లాస్ సెంచరీతో పాటు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనల కారణంగానే అతడిని జాతీయ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు.స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్నామ్యాయంగా అతడిని జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇండియా-ఎ తరపున కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. ఇప్పుడు తన అరంగేట్ర మ్యాచ్లో సీనియర్ జట్టు తరపున ఎలా రాణిస్తాడో చూడాలి. కాగా 12 ఏళ్ల తర్వాత రాజస్తాన్ నుంచి భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన తొలి ప్లేయర్గా సుతార్ నిలిచాడు. అదేవిధంగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.చదవండి: మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ -
పంథా మార్చిన బీసీసీఐ.. బలవంతంగా పంపుతున్న వైనం!
బీసీసీఐ తన పంథా మార్చేసిందా? ఒకప్పుడు స్టార్ క్రికెటర్లు రిటైర్ అవుతున్నారంటే వీడ్కోలు మ్యాచ్తో పాటు ఘనంగా సత్కారాలు, సన్మానాలు జరిగేవి. ఆటగాడు కోరుకున్న చోటే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా సన్నాహకాలు చేసే వారు. కానీ ఇప్పుడు అదంతా గతం గతః అన్నట్లుగా తయారైంది. సరైన ప్రదర్శన చేయకుండా జట్టుకు భారంగా మారిన సదరు ఆటగాడికి వీడ్కోలు మ్యాచ్ లేకపోగా బలవంతంగా జట్టు నుంచి పంపించే మహత్తర కార్యక్రమానికి తెర లేచింది. తాజాగా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో బీసీసీఐ అవలంబిస్తోన్న వైఖరి ఇందుకు ఉదాహరణ.బీసీసీఐ నుంచి ఘనంగా వీడ్కోలు అందుకన్న క్రికెటర్లలో సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, హర్భజన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. అయితే ఈ మధ్య కాలంలో ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోతే రిటైర్మెంట్కు సమయం వచ్చేసిందంటూ వార్తలు రావడం, ఆ తర్వాత కనీస వీడ్కోలు మ్యాచ్ కూడా లేకుండానే వాళ్లు రిటైర్ ఇవ్వడం జరిగిపోతున్నాయి. తాజాగా సూర్యకుమార్ను ముందు టీ20 కెప్టెన్గా తొలగించిన బీసీసీఐ ఇప్పుడు బలవంతంగా జట్టులో నుంచి పంపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీమిండియాలోకి లేటు వయసులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనతికాలంలోనే సూర్యకుమార్ టీ20 క్రికెట్లో స్టార్ హోదా పొందాడు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఆసియా కప్తో పాటు 2026 టీ20 ప్రపంచకప్ను నిలుపుకోవడం విశేషం. ధోని, రోహిత్ తర్వాత భారత్కు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్గా సూర్యకుమార్ నిలిచాడు. గంగూలీ, ద్రవిడ్, కోహ్లీలకు సాధ్యం కాని ఐసీసీ మేజర్ టైటిల్ సూర్య ఖాతాలో ఉండడం గమనార్హం. మరి ఇలాంటి హోదా పొందిన సూర్యకుమార్కు, కేవలం టీ20 స్పెషలిస్ట్గా ముద్రపడిన వ్యక్తికి గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరముంది. అంతేకాని పొమ్మనలేక పొగబెట్టడం అన్న తరహాలో బీసీసీఐ ప్రవర్తించడంపై టీమిండియా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ కెప్టెన్సీ పదవి నుంచి తొలగ2ఇంచారు కాబట్టి కనీసం ఆఫ్గన్తో టీ20 సిరీస్కు అతడిని పరిగణలోకి తీసుకొని సెండాఫ్ మ్యాచ్ ఆడేలా అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.గతంలో అలా..భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ 1986లో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. కానీ అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ఖాన్.. తమతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాలని గావస్కర్ను కోరాడు. దీనికి గావాస్కర్ ఒప్పుకోవడం, బీసీసీఐ కూడా ఓకే అనడంతో 1987లో పాక్తో టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత ఘనంగా వీడ్కోలు పలికాడు. పనిలో పనిగా గావస్కర్ 10వేల పరుగులు కూడా పూర్తయ్యాయి. అలా గావస్కర్ తన వీడ్కోలు మ్యాచ్ను ఎన్నటికీ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోయింది.టెండూల్కర్ 200వ టెస్టు మ్యాచ్భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ ఎలాంటి వీడ్కోలు ఇచ్చిందో అందరికీ తెలిసిందే. అతడి వందో సెంచరీ కోసం కొన్నేళ్లు వేచి చూడాల్సి వచ్చినా బీసీసీఐ అతడిని పక్కకు పెట్టలేదు. 2014లో ముంబైలోని తన హొంగ్రౌండ్లో 200వ టెస్టు మ్యాచ్ ఆడిన సచిన్కు స్టేడియం మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. ఆ మధురానుభూతులు ఇప్పటికీ తన కళ్ల ముందు ఉన్నాయని సచిన్ చాలాసార్లు పేర్కొన్నాడు.షాక్ ఇచ్చిన ధోని..భారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్గా ఎంఎస్ ధోనికి పేరుంది. రెండు ప్రపంచకప్లతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని సాధించిన ధోనికి 2019 వరల్డ్కప్లో సెమీస్ మ్యాచ్ చివరిది అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. 2019లో ఆటకు దూరమైన ధోని.. తాను తలచుకుంటే బీసీసీఐకి చెప్పి ఒక వీడ్కోలు మ్యాచ్ ఆడడం పెద్ద విషయం కాదు. కానీ ధోని అలా చేయలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం రావాలనే ఉద్దేశంతో 2020 ఆగస్టు 15 సాయంత్రం ఏడు గంటలకు తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్లో కేవలం ఒక పోస్టు పెట్టి ప్రకటించాడు.గంభీర్ రాక.. మారిన పరిస్థితులుటీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ భారత హెడ్కోచ్గా వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అనుభవానికి ప్రాధాన్యమివ్వకుండా ఫామ్లో ఉన్న ఆటగాడికే తన మద్దతు ఉంటుందని గంభీర్ వచ్చిన కొత్తలోనే కుండబద్దలు కొట్టాడు. తన సమకాలీన క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలోనూ ఇలాంటి వైఖరినే వ్యవహరించాడు. 2024లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్లో ఈ ఇద్దరు విఫలమయ్యారు. దీంతో తాము టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసిందని భావించిన రోహిత్, కోహ్లీలు స్వల్ప వ్యవధిలో గుడ్బై చెప్పేశారు. అలా కాదని వీళ్లిద్దరు బీసీసీఐకి తమకు ఒక చివరి టెస్టు మ్యాచ్ ఏర్పాటు చేయాలని అడిగి ఉంటే సమాధానం ఎలా వచ్చి ఉండేదో. ఇప్పుడు సూర్యకుమార్ వంతు వచ్చింది. ఒకప్పుడు మిస్టర్ 360 డిగ్రీస్ క్రికెటర్గా పేరు పొందిన సూర్యకుమార్ ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా మిగిలిపోయాడు. టీమిండియా క్రికెట్కు అతడు అందించిన రెండు కప్పులను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ అతడికి ఆఖరి టీ20 మ్యాచ్ ఆడే అవకాశం కల్పించాలని కోరుకుందాం.చదవండి: గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో! -
‘అతడు జట్టులో ఉంటే టీమిండియా వరల్డ్కప్ గెలవదు’
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీకి ముందు టీమిండియాకు కొన్ని మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ మూడు మ్యాచ్లు ఆడనుంది.రో-కో ఆడతారా?ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం టీమిండియా సొంతగడ్డపై వెస్టిండీస్తో మూడు.. అనంతరం న్యూజిలాండ్తో మూడు, శ్రీలంకతో మూడు వన్డేలు ఆడుతుంది. మొత్తానికి మెగా టోర్నీకి ముందు భారత్ దాదాపు పదిహేను వన్డేలు ఆడుతుంది. అయితే, దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వరల్డ్కప్లో ఆడతారా? లేదా? అన్న అంశంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.అనుభవజ్ఞులైన రో-కో జట్టులో ఉంటేనే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వాళ్లిద్దరు మెగా టోర్నీకి అందుబాటులో ఉండే విషయమై తమకు ఇంత వరకు సమాచారం లేదన్నాడు. కానీ రో-కో మాత్రం తాము ఈ ఈవెంట్కు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.గాయాల బెడదదేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడిన దిగ్గజ ద్వయం.. గత కొంతకాలంగా మంచి ఫామ్ కొనసాగించారు. అయితే, అఫ్గన్తో సిరీస్కు ముందు రోహిత్- కోహ్లి గాయపడటం మరోసారి చర్చకు తావిచ్చింది. 39 ఏళ్ల రోహిత్.. 38 ఏళ్ల కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నారు.కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరం కానుండగా.. రోహిత్ అఫ్గన్తో ఆఖరి వన్డే నాటికి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్కుడిగా చెప్పుకొనే గ్రీన్స్టోన్ లోబో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ జట్టులో ఉంటే టీమిండియా ఈసారి కూడా వన్డే వరల్డ్కప్ గెలవదని పేర్కొన్నాడు.రోహిత్ జట్టులో ఉంటే జట్టు గెలవదుటైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్ గెలిచే భారత జట్టులో రోహిత్ శర్మ భాగంగా ఉంటాడని నేను అనుకోవడం లేదు. చాలా మంది నన్ను ఇదే విషయం గురించి అడుగుతున్నారు. రోహిత్ అసలు జట్టులో ఉంటాడా? లేదా? అని వారు ఉత్సుకతతో ఉన్నారు.సెలక్టర్లు కోరుకుంటే అతడు జట్టులో ఉంటాడు. అయితే, ఒక విషయం స్పష్టంగా చెప్పగలను. రోహిత్ శర్మ జట్టులో ఉంటే మాత్రం టీమిండియా ఈసారి వరల్డ్కప్ గెలవదు’’ అని గ్రీన్స్టోన్ లోబో పేర్కొన్నాడు.సారథిగా ఇప్పటికే ఎన్నో విజయాలుఏదేమైనా ఇప్పటికే రోహిత్ శర్మ సారథిగా ఎన్నో విజయాలు సాధించాడన్న గ్రీన్స్టోన్ లోబో.. ముంబై ఇండియన్స్ కారణంగా అతడు వన్డే వరల్డ్కప్ గెలవలేకపోయాడని విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్గా రోహిత్ 2024లో టీ20 ప్రపంచకప్ సాధించాడు. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలోనూ అతడే సారథిగా ఉన్నాడు.అయితే, దురదృష్టవశాత్తూ కప్ గెలవలేకపోయాడు. నిజానికి ఫ్రాంఛైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడు ఐదు టైటిళ్లు గెలిచాడు. ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే.. వన్డేలపై మరింత దృష్టి పెట్టి వరల్డ్కప్ కొట్టేవాడు. ముంబై ఇండియన్స్ వల్ల టీమిండియా నష్టపోయింది’’ అని గ్రీన్స్టోన్ లోబో వ్యాఖ్యానించాడు.అభిమానుల ఆగ్రహంఈ నేపథ్యంలో జ్యోతిష్కుడి వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు భగ్గుమంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు లాజిక్ లేకుండా మాట్లాడటం సరికాదని.. అసలు దిగ్గజ ఆటగాడి గురించి మాట్లాడే అర్హతే నీకు లేదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. కాగా రోహిత్ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్)ని సొంతం చేసుకుంది.చదవండి: కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ -
మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026 సీజన్లో మెరుపులు మెరిపించిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు భారత్-ఎ జట్టు తరపున సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్-ఎ, శ్రీలంక జట్లతో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో భారత బృందం శనివారం లంక గడ్డపై అడుగుపెట్టింది.ఇందులో వైభవ్ కూడా ఉన్నాడు. అయితే దంబుల్లా ఎయిర్ పోర్ట్ వెలుపుల సూర్యవంశీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టడంతో సూర్యవంశీ అసహనానికి గురయ్యాడు. ఈ యువ క్రికెటర్ తన లగేజ్తో పాటు బస్సు వైపు వెళ్తుండగా, ఫ్యాన్స్ 'సెల్ఫీ'ల కోసం ఎగబడ్డారు. దీంతో తన సహనం కోల్పోయిన వైభవ్.. చేతులు జోడించి ఓ అభిమానిని దయచేసి దూరంగా వెళ్లండని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ట్రైసిరీస్లో భారత-ఎ జట్టు తిలక్ వర్మ కెప్టెన్సీలో ఆడనుంది. ఈ జట్టులో సూర్యవంశీతో పాటు ఐపీఎల్ స్టార్స్ ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఆయుష్ బదోని వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. మే 9న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించనుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.As soon as Vaibhav Suryavanshi arrived in Sri Lanka, he looked a bit upset. There was sadness and slight frustration visible on his face. He also seemed bothered by the fans, and his disappointment was clearly noticeable while taking pictures with them.👀 pic.twitter.com/8H48R1VLld— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 5, 2026 -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ఏడాది తర్వాత బరిలోకి దిగనున్న సూపర్ స్టార్
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో పాల్గోనేందుకు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నుండి అనుమతి లభించింది.దీంతో దాదాపు ఏడాది తర్వాత పాండ్యా వన్డేల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. కాగా గత నెలలో అఫ్గాన్తో సిరీస్కు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో పాండ్యాకు చోటు దక్కింది. కానీ వెన్ను గాయంతో బాధపడుతున్న పాండ్యాకు ఈ సిరీస్ ఆరంభానికి ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలని సెలక్టర్లు కండీషన్ పెట్టారు. దీంతో జూన్ 2న బెంగళూరులోని సీఓఈకి వెళ్లిన పాండ్యాకు వైద్యులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధించడంతో సీఓఈ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది. మరోవైపు తొడ కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఫిట్నెస్ పరీక్షను ఎదుర్కోనున్నాడు.ఇందులో పాసైతేనే అఫ్గాన్తో సిరీస్కు హిట్మ్యాన్ అందుబాటులో ఉంటాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్తో సెలక్షన్ కమిటీ భర్తీ చేయనుంది. ఇక ఈ సిరీస్కు ఇప్పటికే టీమిండియా స్టార్, రన్మిషన్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. కోహ్లి ప్రస్తుతం కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడి స్ధానాన్ని రుతురాజ్ గైక్వాడ్తో భర్తీ చేశారు.పాండ్యా విషయానికి వస్తే.. చివరిసారిగా 2025 మార్చిలో భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. పాండ్యా ఇప్పటివరకు 94 వన్డేలు ఆడి, 32.82 సగటుతో 1904 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడి పేరిట 91 వన్డే వికెట్లు ఉన్నాయి. అయితే వన్డే మ్యాచ్లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు అతడి శరీరం సహకరిస్తుందో లేదో చూడాలి. వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు ఇదేశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ*, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ (వైస్కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా*, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ENG vs NZ: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు
భారత చెస్ సంచలనం, 20 ఏళ్ల యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తాచాటాడు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ (Norway Chess) టోర్నమెంట్ విజేతగా ప్రజ్ఞానంద నిలిచాడు. చివరి రౌండ్లో జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్ను మట్టికరిపించి ఛాంపియన్షిప్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.అద్భుతమైన కమ్బ్యాక్ప్రజ్ఞానంద సాధించిన ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. టోర్నీ ఆరంభంలో అతడు తడబడ్డాడు. దీంతో అతడి కథ ముగిసిందని అంతా భావించారు. కానీ టోర్నీ చివరి దశలో అతడు పుంజుకున్న తీరు నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. పదో రౌండ్ ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో ప్రజ్ఞానంద ముందు వరుసలో నిలిచాడు. చివరి రౌండ్ ఆరంభానికి ముందు టైటిల్ కోసం ప్రజ్ఞానంద, వెస్లీ సో (అమెరికా), అలీరెజా ఫిరౌజ్జా (ఫ్రాన్స్) మధ్య పోటీ నెలకొంది. చివరి రౌండ్లో వెస్లీ సో, అలీరెజా ఫిరౌజ్జాపై 'అర్మగెడాన్' టై బ్రేకర్ మ్యాచ్లో విజయం సాధించి తన టైటిల్ ఆశలను సజీవంగా ఉంచుకున్నాడు. కానీ ప్రజ్ఞానంద మెయిన్ క్లాసికల్ మ్యాచ్లో విన్సెంట్ కీమర్ను ఓడించడంతో.. ఈ తమిళనాడు కుర్రాడుకి వెస్లీ సో కంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. దీంతో 18 పాయింట్లతో వెస్లీ(17)ను వెనక్కి నెట్టి ప్రజ్ఞానంద నార్వే చెస్ ఛాంపియన్గా అవతరించాడు. కాగా ఏడుసార్లు నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించడం గమనార్హం.🇮🇳 PRAGG WINS NORWAY CHESS 2026From last place in round 6, and 4 back-to-back wins, he finishes first 🤯🤯#NorwayChess pic.twitter.com/J0XbX91NQ4— Norway Chess (@NorwayChess) June 5, 2026ప్రముఖల అభినందనలునార్వే చెస్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ తదితరులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
రాహుల్, గిల్ సెంచరీలు.. టీమిండియా ఆధిపత్యం
అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో శనివారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 368 పరుగులు సాధించింది. గిల్ 103, పంత్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (24) నిరాశపరచగా.. కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో వన్డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ భారీ అర్ధ శతకం (81)తో అలరించాడు. అఫ్గన్ బౌలర్లలో మహ్మద్ సలీ సఫీ రెండు వికెట్లు తీయగా.. జియాఉర్ రహ్మాన్ ఒక వికెట్ పడగొట్టాడు.శుబ్మన్ గిల్ సెంచరీ82.5: సలీమ్ సఫీ బౌలింగ్లో సింగిల్ తీసి శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ గిల్. 138 బంతుల్లో సెంచరీ చేసిన గిల్. స్కోరు: 358/3 83).మూడు వందల మార్కు దాటిన టీమిండియా.. స్కోరు: 340/3(79)గిల్ 91, పంత్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ డౌన్సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మరుసటి బంతికే రాహుల్ అవుట్. క్రీజులోకి రిషభ్ పంత్. స్కోరు: 249/3 (61). గిల్ 39 పరుగులతో ఉండగా.. పంత్ రెండు పరుగులతో ఉన్నాడు.కేఎల్ రాహుల్ సెంచరీ60.1: జియాఉర్ రహ్మాన్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. కెరీర్లో 12వ టెస్టు సెంచరీ సాధించిన కర్ణాటక బ్యాటర్.45 ఓవర్లలో టీమిండియా స్కోరు: 191-2గిల్ 8, రాహుల్ 75 పరుగులతో ఉన్నారు.సాయి సుదర్శన్ అవుట్42.4: సలీమ్ సపీ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ (81). సెంచరీకి పందొమ్మిది పరుగుల దూరంలో పెవిలియన్ చేరిన సాయి. క్రీజులోకి కెప్టెన్ శుబ్మన్ గిల్ రాగా.. రాహుల్ 72 పరుగులతో ఉన్నాడు.సాయి అర్ద శతకం31.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్. స్కోరు: 133/1 (31.4)కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ29.3: నంగేయాలియా ఖరోటే బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. టెస్టు కెరీర్లో అతడికి ఇది 21వ హాఫ్ సెంచరీ. 31 ఓవర్లలో టీమిండియా స్కోరు: 121-1.లంచ్ బ్రేక్కు భారత్ స్కోరెంతంటే?లంచ్ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(37), సాయిసుదర్శన్(32) ఉన్నారు.నిలకడగా ఆడుతున్న సుదర్శన్, రాహుల్21 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(32), సాయిసుదర్శన్(26) ఉన్నారు.తొలి వికెట్ డౌన్టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన జైశ్వాల్.. సలీం బౌలింగ్లో ఔటయ్యాడు.నిలకడగా ఆడుతున్న భారత్భారత ఓపెనర్లు రాహుల్(16), యశస్వి జైశ్వాల్(20) నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. 16 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.బ్యాటింగ్ భారత్దేముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్తో రాజస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుత్తార్ భారత తరపున అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో అతడికి టీమిండియా తరపున ఆడే అవకాశం లభించింది.అదేవిధంగా సాయిసుదర్శన్కు కూడా తుది జట్టులో చోటు దక్కింది. ఈ తమిళనాడు ఆటగాడు ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ రానున్నాడు. ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు ఛాన్స్ ఇచ్చారు.తుది జట్లుఆఫ్ఘనిస్తాన్ : సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అఫ్సర్ జజాయ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేలియా ఖరోటే, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రెహమాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీభారత్ : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ -
ఇంగ్లండ్ బౌలర్ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ ఓలీ రాబిన్సన్ అదరగొట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రాబిన్సన్ తన అద్భుత బౌలింగ్తో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన రాబిన్సన్.. ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లను అవుట్ చేసి పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆ ఓవర్లో మూడో బంతికి కాన్వేను, ఐదో బంతికి విలియమ్సన్ను, ఆరో బంతికి రవీంద్రను అవుట్ చేసి 'త్రీ-వికెట్ మెయిడెన్' ఓవర్ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో అతడికి అది తొలి ఓవర్ కావడం విశేషం. దీంతో రాబిన్సన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్లో తాను వేసిన తొలి ఓవర్లోనే 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మొదటి ఇంగ్లీష్ బౌలర్గా రాబిన్సన్ రికార్డు సృష్టించాడు. జిమ్మీ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనత ఇది. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో రాబిన్సన్ ఏడో స్ధానంలో నిలిచాడు.తొలి ఓవర్లోనే మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లునువాన్ జోయ్సా (శ్రీలంక)ఇర్ఫాన్ పఠాన్ (భారత్ - హ్యాట్రిక్)డానియల్ వెట్టోరి (న్యూజిలాండ్)హారిస్ సోహైల్ (పాకిస్తాన్)మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)స్కాట్ బోలాండ్ (ఆస్ట్రేలియా)ఓలీ రాబిన్సన్ (ఇంగ్లాండ్)ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వరుసగా రెండో రోజు కూడా బౌలర్ల హవా కొనసాగింది. పేస్కు అనుకూలిస్తున్న పిచ్పై తొలి రోజు 16 వికెట్లు నేలకూలగా... శుక్రవారం రెండో రోజు 17 వికెట్లు పడ్డాయి. ఓవర్నైట్ స్కోరు 61/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్... 29.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. కైల్ జేమీసన్ (29 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... గ్లెన్ ఫిలిప్స్ (34) ఫర్వాలేదనిపించాడు.ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ 39 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్... ఈసారి కాస్త మెరుగ్గా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లు పరీక్షిస్తున్నా ఆతిథ్య జట్టు బ్యాటర్లు ఎదురు నిలిచారు. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 56 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది.అరంగేట్రం ఆటగాడు ఎమిలియో (95 బంతుల్లో 57; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా... బెన్ డకెట్ (33), జెమీ స్మిత్ (39) రాణించారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (0), హ్యారీ బ్రూక్ (0), జో రూట్ (8), బెథెల్ (14) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 6 వికెట్లతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ఇంగ్లండ్ జట్టు... ప్రత్యర్థి ముందు 254 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.ఛేదనకు దిగిన న్యూజిలాండ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 11.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (0), కేన్ విలియమ్సన్ (18); రూర్కె (0) పెవిలయన్ చేరగా... కాన్వే (12 బ్యాటింగ్; 1 ఫోర్) పోరాడుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 2 వికెట్లు తీశాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న న్యూజిలాండ్ విజయానికి ఇంకా 218 పరుగులు చేయాల్సి ఉంది. -
నేడే భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకు ఛాన్స్?
2026 టీ20 వరల్డ్ చాంపియన్గా నిలిచిన తర్వాత భారత్ తమ తర్వాతి సిరీస్కు సమాయత్తమవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్లలో జరిగే సిరీస్లలో తలపడే భారత జట్లను నేడు సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది. జూన్ 26న ప్రారంభమయ్యే ఈ టూర్లో భాగంగా ముందుగా ఐర్లాండ్తో 2 టి20లు జరుగుతాయి. ఆ తర్వాత ఇంగ్లండ్తో 5 టి20లు, 3 వన్డేలు ఉంటాయి. వీటితో పాటు సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే టీమ్ను కూడా అజిత్ అగార్కర్ నాయకత్వంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. సూర్యకుమార్పై వేటు తప్పదా! రెండు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుల ఎంపికను మినహాయిస్తే రెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. టి20 కెపె్టన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను తొలగించడం ఖాయమైపోయింది. అతని సారథ్యంలో వరల్డ్ కప్ గెలుచుకున్న వెంటనే ఇది చోటు చేసుకోనుండటం గమనార్హం. 2025లో ఐసీసీ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొని ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన తర్వాత కూడా రోహిత్ శర్మ తన కెపె్టన్సీని కోల్పోయాడు. సూర్య విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే రోహిత్ ఆటగాడిగా తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. కానీ సూర్య టీమ్లో కూడా చోటు కోల్పోనున్నాడు. వరల్డ్ కప్ నెగ్గినా సుదీర్ఘ కాలంగా అతని ఫామ్ పేలవంగా ఉంది. వరల్డ్ కప్లో 9 ఇన్నింగ్స్లలో కలిపి 242 పరుగులే చేసిన సూర్య... ఐపీఎల్లోనూ దానిని కొనసాగిస్తూ 13 ఇన్నింగ్స్లలో 270 పరుగులే చేయగలిగాడు. 2028 టీ20 వరల్డ్ కప్, అదే ఏడాది జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకొని టి20 టీమ్ను సిద్ధం చేస్తున్న సెలక్టర్లు 36 ఏళ్ల సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. సూర్య స్థానంలో మరో ముంబైకర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో అతని నాలుగో స్థానాన్ని కూడా భర్తీ చేయనున్నాడు. శ్రేయస్ 2023 డిసెంబర్లో భారత్ తరఫున చివరిసారిగా టి20 ఆడినా...ఐపీఎల్లో తన బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫైనల్కు చేర్చిన అతని నాయకత్వంలో 2024లో కోల్కతా విజేతగా నిలవగా... 2020, 2025లో ఢిల్లీ, పంజాబ్కు రన్నరప్గా నిలిచాయి. లాంఛనమేనా! మరోవైపు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి రావడం లాంఛనమే కావచ్చు. అసాధారణ ఆటతో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న వైభవ్ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఐపీఎల్లో ఏకంగా 237.30 సగటుతో అతను 776 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే భారత టీ20 జట్టు టాప్–3 అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్లతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్ను ఆడించడం కష్టంగా అనిపిస్తున్నా... ఆసియా క్రీడలకు మాత్రం అతను ఎంపిక కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. -
ఎన్ని రోజుల్లో ముగిస్తారు?
ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ టెస్టు క్రికెట్కు సిద్ధమైంది. గత నవంబర్లో తమ చివరి టెస్టు ఆడిన టీమిండియా ఇప్పుడు సొంతగడ్డపై బలహీన ప్రత్యర్థి అఫ్గానిస్తాన్తో తలపడుతుంది. ఎలాంటి ప్రమాణాల ప్రకారం చూసినా అఫ్గాన్కంటే ఎంతో పెద్ద స్థాయిలో ఉన్న మన టెస్టు జట్టును నిలువరించడం ప్రత్యర్థికి అసాధ్యం కావచ్చు. ఎనిమిదేళ్ల క్రితం తమ తొలి టెస్టులో భారత్నే ఎదుర్కొన్న అఫ్గాన్ టీమ్ రెండు రోజుల్లోనే చిత్తుగా ఓడింది. ఇప్పుడు ఈ టెస్టు ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి. న్యూ చండీగఢ్: వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగం కాదు... ఇరు జట్ల మధ్య ఆటలో, అనుభవంలో ఎంతో అంతరం ఉంది... పైగా భారత్ తమ స్వదేశంలో ఆడుతోంది. ఇలాంటి స్థితిలో సహజంగానే భారత్, అఫ్గానిస్తాన్ మధ్య టెస్టు మ్యాచ్పై ఆసక్తి తక్కువగా కనిపిస్తోంది. వారం రోజుల క్రితం వరకు ఆరు ఐపీఎల్ మ్యాచ్లతో ఇంద్రధనుస్సులా కనిపించిన ముల్లాన్పూర్ స్టేడియంలో ఆకర్షణ తగ్గిపోయింది. 38 వేల సామర్థ్యం గల మైదానం తొలి టెస్టుకు వేదిక అవుతున్నా... ఐదు రోజులకు రూ. 250తో టికెట్లు నిర్ణయిస్తే టెస్టు మ్యాచ్ ఆరంభానికి రెండు రోజుల ముందు 1700 టికెట్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితిలో నేటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ ఏకైక టెస్టులో ఢీకొంటున్నాయి. సుదర్శన్కు మరో చాన్స్... యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీ భారత్కు శుభారంభం అందిస్తే భారీ స్కోరుకు పునాది పడుతుంది. మూడో స్థానంలో ఇప్పటి వరకు సాయి సుదర్శన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా (6 టెస్టుల్లో కలిపి 302 పరుగులు)... కోచ్ గంభీర్ అతనిపై నమ్మకం ఉంచాడు. సుదర్శన్కు మరిన్ని అవకాశాలు ఇస్తామని స్పష్టంగా చెప్పడంతో అతని స్థానానికి కూడా ఢోకా లేదు కాబట్టి పడిక్కల్కు చాన్స్ లేదు. కెప్టెన్ గిల్, పంత్, జురేల్, సుందర్లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఇప్పటికే వన్డేలు, టి20ల్లో దాదాపుగా జట్టుకు దూరమైన పంత్ ఈ ఫార్మాట్లోనైనా చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఖాయం కాగా... ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్పై భారం ఉంది. సుందర్ రెండో స్పిన్నర్ కాగా, స్వదేశంలో భారత్ సాధారణంగా ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుంది. కొత్త ఆటగాళ్లు మానవ్ సుతార్, హర్ష్దూబేలలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. అశ్విన్, జడేజాలు ఇద్దరూ లేకుండా సొంతగడ్డపై చివరిగా భారత్ 2010లో టెస్టు ఆడింది! వారిద్దరిపైనే భారం... టెస్టుల్లో అడుగు పెట్టి ఎనిమిదేళ్లు దాటినా... అఫ్గానిస్తాన్ ఇప్పటి వరకు 12 టెస్టులే ఆడగలిగింది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలాంటి పెద్ద జట్లతో ఒక్కసారి కూడా తలపడలేదు. ఈ ఫార్మాట్లో టీమ్ పరిస్థితిని ఇది సూచిస్తోంది. అఫ్గాన్ తరఫున రెండు డబుల్ సెంచరీలు సాధించిన కెప్టెన్ హష్మతుల్లా, ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసిన రహ్మత్ షా బ్యాటింగ్పైనే జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. అజ్మతుల్లా కీలక ఆల్రౌండర్ కాగా, గుర్బాజ్ ఓపెనింగ్లో దూకుడుగా ఆడగలడని జట్టు ఆశిస్తోంది. రషీద్ ఖాన్ లేకపోవడంతో టీమ్ బౌలింగ్ బలహీనంగా మారింది. ఇలాంటి టీమ్ భారత్తో ఎంత వరకు పోరాడగలదనేది ఆసక్తికరం. 50 రిషభ్ పంత్కు ఇది 50వ టెస్టు. భారత్ తరఫున వికెట్ కీపర్లుగా ధోని (90), సయ్యద్ కిర్మాణీ (88) మాత్రమే ఇంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడారు.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. దాదాపు 40 డిగ్రీలతో ఉత్తరాదిలో తీవ్ర ఎండలు ఉండటం ఆటగాళ్లను బాగా ఇబ్బంది పెడుతోంది. -
ఈసారి ఇంట్లోనే చూసేద్దాం!
న్యూయార్క్: సాధారణంగా ‘ఫిఫా’ ప్రపంచకప్ అంటే ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు... మెగా టోర్నీ ఆరంభం నుంచే దేశవిదేశాల నుంచి అభిమానులు ఆతిథ్య దేశంలో వాలిపోవడం పరిపాటి. మైదానాలు, బార్లు, ఫ్యాన్ జోన్లు ఇలా ఎక్కడ చూసినా... సాకర్ ఫీవర్ కనిపిస్తుంటుంది. తమ అభిమాన ఆటగాళ్లను వరల్డ్కప్లో ప్రత్యక్షంగా వీక్షించాలనే ఉద్దేశంతో అభిమానులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మ్యాచ్లు చూసేందుకు మైదానాలకు వస్తుంటారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ‘ఫిఫా’ వరల్డ్కప్–2026 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఈ నెల 12న తొలి మ్యాచ్ జరగనుంది. అంటే మరో వారం రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది వీక్షించే క్రీడా సంబరానికి తెరలేవనుందన్నమాట. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి ఫ్యాన్స్ సందడి అంతగా కనిపించడం లేదు. దీని వెనక పలు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. టికెట్ ధరలు విపరీతంగా పెంచడంతో పాటు మ్యాచ్లను మూడు దేశాల్లోని వివిధ వేదికల్లో నిర్వహిస్తుండటంతో ప్రయాణ ఖర్చులు భారీగా పెరగడంతో... బయట నుంచి వచ్చే అభిమానులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అమెరికాలో పర్యటించడానికి కూడా చాలా మంది అభిమానులు వెనుకాడుతున్నారు. లండన్కు చెందిన ఐటీ ఉద్యోగి మైక్ విల్సన్ గత 20 ఏళ్లలో నాలుగు ప్రపంచకప్లను ప్రత్యక్షంగా వీక్షించాడు. ఫుట్బాల్కు వీరాభిమాని అయిన విల్సన్ ఈసారి మాత్రం ఇంట్లో కూర్చొనే మ్యాచ్లు చూడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అర్జెంటీనాకు చెందిన డాక్టర్ ఎమిలియానో గతంలో తమ దేశం ప్రపంచకప్లో ఆడుతుందంటే ఆ మ్యాచ్లకు తప్పక హాజరయ్యేవాడు. కానీ ఈసారి మాత్రం ఒకటీ రెండు మ్యాచ్లను తప్ప అన్నీంటిని ప్రత్యక్షంగా చూడాలనుకోవడం లేదని పేర్కొన్నాడు. నెదర్లాండ్స్కు చెందిన ఫైనాన్స్ మేనేజర్ పీటర్ బెర్గాకర్ 2010 ‘ఫిఫా’ ప్రపంచకప్ నుంచి నెదర్లాండ్స్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ చూశాడు. కానీ ఈసారి మాత్రం తమ జట్టు నాకౌట్కు చేరినా... అమెరికాలో మాత్రం అడుగుపెట్టబోనని అంటున్నాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతుందని కచ్చితంగా చెప్పలేకపోయినా... వీరాభిమానుల నుంచి ఇలాంటి స్పందన వస్తుండటం మాత్రం ఆశ్చర్యకరమే! చుక్కలనంటుతున్న టికెట్ ధరలు... 2022లో ఖతార్లో జరిగిన వరల్డ్కప్తో పోల్చుకుంటే ఇప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మెక్సికో, కెనడా, అమెరికాలో హోటళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి. మెగా టోర్నీ కోసం చేస్తున్న కొలువుకు సెలవు పెట్టడంతో పాటు... దాదాపు రెండు మూడేళ్ల నుంచి దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టినా అన్నీ మ్యాచ్లు చూడలేని స్థితి ఉందని అభిమానులు వాపోతున్నారు. గత వరల్డ్కప్లో గ్రూప్ దశ మ్యాచ్లకు మూడు టికెట్లకు కలిపి 69 డాలర్లు (రూ. 6,570) ఖర్చు అయితే... ఇప్పుడు అది ఏకంగా 265 డాలర్ల (రూ. 25, 234)కు పెరిగింది. అలాగే రష్యా, ఖతార్లో మెగా టోర్నీ జరిగినప్పుడు ఒక నగరం నుంచి మరో నగరానికి మధ్య నిర్వాహకులు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం మూడు దేశాల్లో కలిపి 16 మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఖతార్లోని గ్రౌండ్స్తో పోల్చుకుంటే వీటి మధ్య దూరం చాలా ఎక్కువ. అలాగే టికెట్ల అమ్మకాల విధానం, రీసేల్ టికెట్స్ పరిస్థితి అంతా సమీక్షించుకుంటే... అమెరికా దాకా వెళ్లి అగచాట్లు పడటం కంటే ఇంట్లో కూర్చొని హాయిగా మ్యాచ్లు చూడటం మిన్న అని జపాన్కు చెందిన టోమోనోరి అకుట్సు తెలిపాడు. గత ఐదు ప్రపంచకప్లను ప్రత్యక్షంగా వీక్షించిన అకుట్సు... ఈ టోర్నమెంట్కు ఇంత ఖర్చు అవుతుందని తెలిస్తే వరుసగా ఆరో ప్రపంచకప్ చూసే ప్రయత్నం మానుకునేవాడినని అంటున్నాడు. డైహార్డ్ ఫ్యాన్స్ కూడా దూరం... ఫుట్బాల్ అంటే పడిచచ్చే ఇంగ్లండ్ ఐటీ ఉద్యోగి విల్సన్... ఈసారి వరల్డ్కప్ మ్యాచ్లు ప్రత్యక్షంగా చూడకూడదని నిర్ణయించుకున్నాడు. టికెట్ ధరలు తమ పరిధిలో లేకపోవడంతో... స్నేహితులతో కలిసి ‘ఫిఫా’ మెగా టోర్నీ చూడాలనే ఆలోచనను మానుకున్నట్లు తెలిపాడు. ఇప్పటి వరకు ఎన్నో మ్యాచ్లు వీక్షించిన విల్సన్ ఏ వరల్డ్కప్ పోరు కోసం కూడా 200 డాలర్ల (రూ. 19,045)కు మించి ఖర్చు చేసింది లేదు. కానీ ఈ సారి ఆ డబ్బుతో ఓ నామమాత్ర మ్యాచ్కు చివరి వరుసలోనూ టికెట్ లభించే అవకాశం లేదని చెబుతున్నాడు. దీంతో ఈ వేసవిలో సాకర్ వినోదాన్ని ఆస్వాదించేందుకు బదులు దానికంటే చాలా తక్కువ డబ్బుతో పోర్చుగల్లో విహరించేందుకు వెళ్తున్నట్లు తెలిపాడు. సంపన్న వర్గాలకే పరిమితం... విశేష జనాదరణ ఉన్న ‘ఫిఫా’ ప్రపంచకప్ ఈసారి సంపన్న వర్గాలకే పరిమితమయ్యేలా కనిపిస్తుంది. టోర్నీ ఆరంభానికి చాలా ముందే ప్రణాళిక ప్రకారం టికెట్లు కొనుగోలు చేసుకున్న వారికి కాస్త కలిసిరానుంది. ఏడాది క్రితం స్కాట్లాండ్ జట్టు వరల్డ్కప్నకు అర్హత సాధించగా... తక్షణమే ఆ దేశానికి చెందిన క్యాంప్బెల్ లూయిస్ అతడి మిత్ర బృందం సాకర్ సమరం కోసం సమాయత్తమైంది. 28 ఏళ్ల తర్వాత స్కాట్లాండ్ జట్టు ప్రపంచకప్ ఆడుతుండటంతో భారీ డిమాండ్ ఉంటుందని ముందే ఊహించిన లూయిస్... అందుకు తగ్గట్లే జాగ్రత్త పడి ధరలు పెరగకముందే టికెట్లు కొనుగోలు చేసుకున్నాడు. ‘చివరిసారి మా జట్టు వరల్డ్కప్నకు అర్హత సాధించినప్పుడు మేమంతా చిన్న పిల్లలం. ఇన్నాళ్లకు ఆ సుందర దృశ్యాలు చూసే అవకాశం దక్కింది. మాతరంలో మరోసారి స్కాట్లాండ్ వరల్డ్కప్ ఆడుతుందో లేదో తెలియదు. అందుకే ఖర్చు కాస్త ఎక్కువైనా మ్యాచ్లను మాత్రం వదలకూడదని నిర్ణయించుకున్నాం’ అని లూయిస్ అన్నాడు.అమెరికా వీసాతిప్పలు‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ’ చందంగా... ఇప్పటికే టికెట్ ధరలు, ప్రయాణ ఖర్చు, వసతి భారం ఎక్కువై సాకర్ అభిమానులు ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు అమెరికా వీసా నిబంధనలు ప్రేక్షకులను మరింత భయపెడుతున్నాయి. 2018లో రష్యా, 2022లో ఖతార్ తమ దేశాల్లో జరిగిన వరల్డ్కప్లను వీక్షించేందుకు వచ్చే అభిమానుల కోసం వీసా అనుమతులను సులభతరం చేయగా... అమెరికా మాత్రం కఠినమైన వీసా నిబంధనలను పాటిస్తోంది. అల్జీరియా, కేప్ వెర్డే, ఐవరీకోస్ట్, సెనెగల్, ట్యూనీషియా వంటి దేశాల అభిమానులు అమెరికాలో అడుగుపెట్టాలంటే 15 వేల డాలర్లు (రూ. 14.28 లక్షలు) బాండ్ల రూపంలో చెల్లించాలని నిబంధన విధించింది. వరల్డ్కప్ దగ్గర పడుతున్నా కొద్ది దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో గత నెలలో అమెరికా ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది. కానీ అప్పటికీ ఆలస్యమైంది. అమెరికా వీసా నిబంధనల కారణంగానే తమ దేశం నుంచి ఎక్కువ మంది ‘ఫిఫా’ సమరం వీక్షించేందుకు వెళ్లడం లేదని ఉరుగ్వే ట్రావెల్ ఏజెన్సీ సంఘం అధ్యక్షుడు కార్లోస్ పెరా చెప్పాడు. జర్మనీకి చెందిన ఓ అభిమాని డొనాల్డ్ ట్రంప్ విద్వేశ పూరిత విధానాల వల్లే తాను అమెరికాలో వరల్డ్కప్ మ్యాచ్లు చూసేందుకు వెళ్లడం లేదని అన్నాడు. -
రొనాల్డో కల నెరవేరేనా!
యూరో టైటిల్... నేషన్స్ కప్ టైటిల్... చాంపియన్స్ లీగ్ టైటిల్... ఇంకా వివిధ దేశాల్లోని అంతర్జాతీయ ప్రొఫెషనల్ లీగ్లలో ముఖ్యమైన టైటిల్స్ అన్నింటిని పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సాధించాడు. అయితే ప్రపంచకప్ టైటిల్ మాత్రం ఈ స్టార్ ప్లేయర్కు అందని ద్రాక్షగానే ఉంది. ఆఖరి ప్రయత్నంగా 41 ఏళ్ల రొనాల్డో మరోసారి తన ప్రపంచకప్ కలను సాకారం చేసుకునేందుకు బరిలోకి దిగనున్నాడు. మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీ టాప్–5 ఫేవరెట్స్లో పోర్చుగల్ జట్టు కూడా ఉంది. 1966లో తొలిసారి ప్రపంచకప్లో ఆడిన పోర్చుగల్ జట్టు మూడో స్థానాన్ని సంపాదించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఆ తర్వాత ఏడుసార్లు ఈ విశ్వ సమరంలో బరిలోకి దిగిన పోర్చుగల్ జట్టు 2006లో నాలుగో స్థానాన్ని సాధించింది. మూడుసార్లు (1986, 2002, 2014) లీగ్ దశలో నిష్క్రమించింది. రెండుసార్లు ప్రిక్వార్టర్స్లో (2010), ఒకసారి క్వార్టర్ ఫైనల్లో (2022) వెనుదిరిగింది. వరుసగా ఆరో ప్రపంచకప్లో ఆడనున్న రొనాల్డో గత ఐదు ప్రపంచకప్లలో కనీసం ఒక గోల్ అయినా చేశాడు. ఈసారి కూడా రొనాల్డో ఖాతాలో గోల్ చేరితే ఆరు ప్రపంచకప్లలో గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీల్లో 15 గోల్స్ చేసిన రొనాల్డో... మరో రెండు గోల్స్ సాధిస్తే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా మరో రికార్డు సృష్టిస్తాడు. ప్రపంచకప్లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ; 16 గోల్స్) పేరిట ఉంది. తాజా ప్రపంచకప్లో గ్రూప్ ‘కె’లో ఉన్న పోర్చుగల్ తమ తొలి లీగ్ మ్యాచ్ను జూన్ 17న డీఆర్ కాంగో జట్టుతో... రెండో మ్యాచ్ను జూన్ 23న ఉజ్బెకిస్తాన్తో... మూడో మ్యాచ్ను జూన్ 27న కొలంబియాతో ఆడుతుంది. కొలంబియాను మినహాయిస్తే కాంగో, ఉజ్బెకిస్తాన్ జట్టుపై పోర్చుగల్ గెలుపు లాంఛనమే అనుకోవాలి. లీగ్ దశ దాటాక నాకౌట్ దశ నుంచి రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకమవుతుంది. రొనాల్డోతో సహా సీనియర్లు బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వా, విటిన్హా తదితరులు సమష్టిగా రాణించడంపైనే పోర్చుగల్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. నాకౌట్ దశలోని రెండు మ్యాచ్ల్లో పోర్చుగల్ గెలిస్తే ఆ జట్టుకు క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి క్రీడా విభాగం -
ఎవరో కొత్త విజేత?
పారిస్: మహిళల టెన్నిస్లో ఈరోజు కొత్త గ్రాండ్స్లామ్ చాంపియన్ అవతరించనుంది. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్లో శనివారం మహిళల సింగిల్స్ టైటిల్ పోరు జరగనుంది. క్వాలిఫయర్ మాయ చావలిన్స్కా (పోలాండ్), ఎనిమిదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం పోటీపడనున్నారు. చావలిన్స్కా గెలిస్తే... ఎమ్మా రాడుకాను (బ్రిటన్; 2021 యూఎస్ ఓపెన్ సింగిల్స్ విజేత) తర్వాత గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచిన రెండో క్వాలిఫయర్గా ఘనత వహిస్తుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), పదో సీడ్ ఫ్లావియో కొబోలి (ఇటలీ) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీఫైనల్లో జ్వెరెవ్ 7–5, 6–2, 3–6, 6–3తో మెన్సిక్ (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందాడు. రెండో సెమీఫైనల్లో గాయం కారణంగా అర్నాల్డి (ఇటలీ) బరిలోకి దిగలేదు. దాంతో అర్నాల్డి ప్రత్యర్థి కొబోలి (ఇటలీ) ఫైనల్ చేరుకున్నాడు. -
పాక్పై గెలిచి ఫైనల్లోకి భారత్
కాకమిగహారా (జపాన్): ఆసియా కప్ అండర్–18 హాకీ టోర్నమెంట్లో భారత జట్టు టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత జట్టు 5–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో జపాన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో జపాన్ 8–1 గోల్స్ తేడాతో మలేసియా జట్టును ఓడించింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున పుర్తి ఆశిష్ తాని (12వ, 49వ, 53వ, 56వ, నిమిషాల్లో) నాలుగు గోల్స్ చేయగా... షారుఖ్ అలీ (35వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. పాక్ జట్టు తరఫున ఆదిల్ (27వ నిమిషంలో), అస్లమ్ మొహమ్మద్ ఫర్హాన్ (37వ నిమిషంలో), ఉజేర్ అహ్మద్ ఖురేషి (42వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. భారత్కు లభించిన ఆరు పెనాల్టీ కార్నర్లలో మూడింటిని సద్వినియోగం చేసుకుంది. ఒక పెనాల్టీ స్ట్రోక్ను కూడా గోల్గా మలిచింది. పాక్ జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్లు రాగా ఒక దాంట్లో సఫలమైంది. ఇదే వేదికపై జరుగుతున్న మహిళల టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం పోటీపడనుంది. చైనా జట్టుతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు ‘షూటౌట్’లో 1–3 తేడాతో ఓటమి పాలైంది. నేడు జరిగే కాంస్య పతక మ్యాచ్లో దక్షిణ కొరియాతో భారత మహిళల జట్టు ఆడుతుంది. -
నార్వే ఓపెన్ చెస్ విజేత ప్రజ్ఞానంద
ఓస్లో: భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజేతగా అవతరించాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత పది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద 18 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన పదో రౌండ్లో ప్రజ్ఞానంద రెగ్యులర్ గేమ్లో 45 ఎత్తుల్లో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)పై గెలిచాడు. టోర్నీ నిబంధనల ప్రకారం రెగ్యులర్ గేమ్లో గెలిచినందుకు ప్రజ్ఞానందకు మూడు పాయింట్లు లభించాయి. మరోవైపు వెస్లీ సో (అమెరికా)–అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) రెగ్యులర్ గేమ్ ‘డ్రా’ అయింది. వీరిద్దరి మధ్య జరిగిన అర్మగెడాన్ గేమ్లో వెస్లీ సో 37 ఎత్తుల్లో అలీరెజాను ఓడించాడు. 17 పాయింట్లతో వెస్లీ సో రన్నరప్ గా నిలువగా... 15.5 పాయింట్లతో అలీరెజా మూడో స్థానాన్ని సంపాదించాడు. ప్రపంచ నంబర్వన్ 13 పాయింట్లతో కార్ల్సన్ నాలుగో స్థానం పొందాడు. 11 పాయింట్లతో కీమెర్ ఐదో స్థానంలో, ప్రపంచ చాంపియన్ గుకేశ్ 8 పాయింట్లతో చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. -
టీమిండియాకు షాక్.. ఆరు నెలలు ఆటకు దూరమైన కోహ్లీ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాలి పిక్క కండరాల గాయంతో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన కోహ్లీ తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో కోహ్లీ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దీంతో జూలైలో ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు కోహ్లీ దూరమైనట్లే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 'కోహ్లీ తొడ కండరంలో చీలిక వచ్చింది. ఈ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే ఇది నయం కావడానికి మాత్రం సుమారు ఆరు వారాల సమయం పట్టనుంది. దీనిలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోహ్లీ పునరావాసం పొందే అవకాశముంది. కాగా కోహ్లీ తన గాయంపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలోని ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలాను టెలి-కన్సల్ట్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్లో కండరాల్లో చీలిక వచ్చినట్లు రిపోర్ట్లో తేలింది.' అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు ముందు ఫిట్నెస్ మదింపు కోసం రోహిత్ శర్మ జూన్ 8న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది . ఈ సిరీస్ కోసం రోహిత్ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని లభ్యత పూర్తిగా ఫిట్నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ -
కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించినట్లుగా అనిపిస్తోంది. ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 140 పరుగులకే ఆలౌట్ చేశామన్న ఆనందం న్యూజిలాండ్కు ఎక్కువసేపు నిలవలేదు. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది. 61/6 క్రితంరోజు స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఎక్కువసేపు నిలవలేకపోయింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కైల్ జేమీసన్ (38 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. గ్లెన్ ఫిలిప్స్ (34) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 5 వికెట్లతో చెలరేగగా, జోష్ టంగ్ 3, అకిన్సన్లు రెండు వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ తడబడినప్పటికీ టీ విరామ సమయానికి 42 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (31), అకిన్సన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ఎమిలియో గే (57) అర్థసెంచరీ సాధించగా, బెన్ డకెట్ (33) పర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ మూడు వికెట్లు తీయగా, విలియం రూర్కీ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 193 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బౌలర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్పై మరో మూడు రోజులు ఆట మిగిలి ఉండడంతో ఇంగ్లండ్కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. That fifth-wicket feeling 🥰🤝 @IGcom pic.twitter.com/aeRVZsTyz3— England Cricket (@englandcricket) June 5, 2026చదవండి: వైభవ్ క్రేజ్.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొదలు! -
వైభవ్ క్రేజ్.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొదలు!
ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడిచింది. ఈ సీజన్లో 16 మ్యాచ్లాడిన వైభవ్ 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడంతో పాటు మోస్ట్ వాల్యుబల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసంపై దిగ్గజాలు సహా మాజీ క్రికెటర్లు అభినందించారు. వైభవ్ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని కూడా డిమాండ్లు వినిపించాయి. అయితే వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు విదేశాలకు కూడా పాకింది. విదేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు కూడా వైభవ్ను టీమిండియాకు ఎంపిక చేయాలని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోనూ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావన వచ్చింది. మ్యాచ్ తొలిరోజు మధ్యలో వర్షం పడడంతో విరామ సమయంలో కామెంటేటర్ సైమన్ డౌల్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. అతని బ్యాటింగ్ అద్భుతమంటూ, నేరుగా భారత జట్టులోకి తీసుకుంటారేమోనని పేర్కొన్నాడు. దీనికి సహచర కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు నాసిర్ హుస్సేన్, ఇయన్ వార్డ్ కూడా.. 'అవును వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన సమయం వచ్చేసినట్లుంది'అంటూ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ ఎంపికపై ఇంకా సమయం ఉందని బీసీసీఐ పేర్కొంది. 15 ఏళ్లే కావడంతో అతడికి క్రికెటర్గా చాలా భవిష్యత్తు ఉందని, ఈలోగా ఇండియా-ఏ తరఫున తన ఆటను చూపించే అవకాశమిస్తున్నట్లు తెలిపింది. లంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండియా-ఏ జట్టు శ్రీలంక-ఏ, అఫ్గానిస్తాన్-ఏ జట్లతో ట్రై సిరీస్ ఆడనుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 124 పరుగులతో ఆడుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 151 పరుగుల లీడ్లో ఉంది."Open the batting with Sooryavanshi!" 😅👀 pic.twitter.com/PL21ZRvWFA— Sky Sports Cricket (@SkyCricket) June 4, 2026చదవండి: గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో! -
గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో!
రెండు వారాల క్రితం.. మాయ చావ్లిన్స్కా ఒక క్వాలిఫయర్గా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఆడేందుకు పారిస్కు చేరుకుంది. స్పాన్సర్స్ ఎవరూ లేకపోవడంతో సొంత డబ్బులతోనే ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా క్వాలిఫయర్ రౌండ్లో విజయం సాధించింది. ఆ తర్వాత నాలుగో రౌండ్ వరకు చేరుకున్న ఆమె తన జీవితంలో ఇదే పెద్ద విజయం అని భావించింది. కానీ కట్చేస్తే ఇవాళ చరిత్రకు అడుగుదూరంలో నిలిచింది ఈ 24 ఏళ్ల పోలండ్ సంచలనం. శనివారం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ మిరా ఆండ్రీవాతో ఫైనల్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో మాయ చావ్లిన్స్కా తన అనుభవాలను పంచుకుంది.ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో పోలండ్కు చెందిన క్వాలిఫయర్ 24 ఏళ్ల మాయ చావ్లిన్స్కా చరిత్రకు అడుగుదూరంలో ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో శనివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చావ్లిన్స్కా రష్యాకు చెందిన మిరా ఆండ్రీవాను ఎదుర్కోనుంది. ఫైనల్లో గెలిచి టైటిల్ సాధిస్తే మాత్రం బ్రిటన్ స్టార్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను తర్వాత క్వాలిఫయర్ హోదాలో మహిళల సింగిల్స్ గ్రాండ్స్లామ్ టైటిల్ అందుకోనున్న క్రీడాకారిణిగా చావ్లిన్స్కా నిలవనుంది. ఈ నేపథ్యంలో టైటిల్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన చావ్లిన్స్కా టోర్నీ మధ్యలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. 'ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు స్పాన్సర్లు ఎవరు లేకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హోటల్ రూంలో దిగాను. తన దగ్గర చాలినన్ని డబ్బులు లేకపోవడంతో టోర్నీ మధ్యలోనే హోటల్ వాళ్లు బయటకు గెంటేస్తారేమోనని చాలా భయపడ్డాను. కానీ ఇవాళ అన్ని రౌండ్లను దాటుకొని ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. టైటిల్ గెలుస్తానో లేదో తెలియదు కానీ జీవితాన్ని మాత్రం గెలిచేశాను. టైటిల్ గెలిస్తే నా దేశానికి గొప్ప విజయమవుతుంది. ఈ టోర్నీ ద్వారా నాకు వచ్చే ప్రైజ్మనీతో కష్టాలు తీరిపోనున్నాయి' అని మాయ చావ్లిన్స్కా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్కు ముందు తన ప్రొఫెషనల్ కెరీర్ మొత్తం కలిపి చావ్లిన్స్కా సుమారు 864,000 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 8.22 కోట్లు) సంపాదించింది. అయితే ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిస్తే చావ్లిన్స్కా సుమారు మూడు రెట్లు అంటే రూ. 30 కోట్లకు పైగా అందుకోనుంది. అదే రన్నరప్గా నిలిస్తే రూ. 15 కోట్ల 41 లక్షలు తీసుకోనుంది.చేతిపై పచ్చబొట్టుఇక మాయ చావ్లిన్స్కా ఎడమచేతిపై 'ఫ్రీ' అనే అక్షరం పచ్చబొట్టుగా పొడిపించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ పచ్చబొట్టు వెనుక ఉన్న కారణాన్ని చెప్పడానికి చావ్లిన్స్కా ఇష్టపడలేదు. కానీ ఆమె చేతిపై ఉన్న ఫ్రీ అనే టాటూ పదం ఇవాళ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేర్చిందని అభిమానులు విశ్వసిస్తున్నారు.Jazda Maja 🇵🇱#RolandGarros pic.twitter.com/9daStziM7E— Roland-Garros (@rolandgarros) June 4, 2026What a way to qualify for your first Grand Slam final 🤩 #RolandGarros pic.twitter.com/QsZMwVWOGL— Roland-Garros (@rolandgarros) June 4, 2026చదవండి: అఫ్గానిస్తాన్కు షాక్.. గుడ్బై చెప్పనున్న రషీద్ ఖాన్! -
అఫ్గానిస్తాన్కు షాక్.. గుడ్బై చెప్పనున్న రషీద్ ఖాన్!
టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్టు రిటైర్మెంట్పై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్కు రషీద్ ఖాన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లో చాలాసేపు బౌలింగ్ చేయాల్సి రావడంతో, దీర్ఘకాలిక వెన్నునొప్పి వల్ల ఎక్కువ బంతులు వేయలేనని రషీద్ ఖాన్ గతం లోనే స్పష్టం చేశాడు. అయితే తాజాగా రషీద్ ఖాన్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా అనే దానిపై ఆ జట్టు కోచ్ రిచర్డ్ ఫైబస్ స్పం దించారు. 'రషీద్ ఖాన్ దీర్ఘకాలిక నడుమునొప్పితో బాధపడుతున్నాడు. టెస్టు క్రికెట్కు దూరమవ్వాలని రషీద్ ఎప్పుడో నిర్ణయిం చుకున్నాడు.అతడు దేశంతో పాటు చాలా ప్రైవేటు లీగ్స్లో ఆడుతుంటాడు. అయితే రషీద్ మా జట్టుకు ఫ్రంట్లైన్ బౌలర్ కావడంతో అతడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది. టెస్టు క్రికెట్కు దూరంగా ఉండాలని భావిస్తున్న రషీద్తో నేను రెడ్బాల్ క్రికెట్లో కొనసాగాలని అడుగుతాను. కానీ ఆడతాడా లేదా అన్నది అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.27 ఏళ్ల రషీద్ ఖాన్ 2023 వన్డే ప్రపంచకప్కు ముందు నుంచే వెన్నుగాయం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వస్తోంది. అప్పటినుంచి ఎక్కువసేపు బౌలింగ్ చేయడంలో రషీద్ ఖాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో తాను టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా అని రషీద్ ఖాన్ తెలిపాడు. కాబట్టి టెస్టు క్రికెట్లో ఆడాలా వద్దా అనేది అతడి ఇష్టానికే వదిలేస్తున్నాం' అని తెలిపాడు.కాగా రషీద్ ఖాన్ గైర్హాజరీలో అఫ్గానిస్తాన్ జట్టుకు హష్మతుల్లా షాహిది జట్టును నడిపించనున్నాడు. జట్టులో రహమనుల్లా జద్రన్, అఫ్సర్ జజాయ్, ఇక్రమ్ అలీఖిలి, అజ్మతుల్లా ఒమర్జయ్లు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇక అఫ్గానిస్తాన్ 2018లో టెస్టు హోదా పొందింది. అప్పటినుంచి 12 మ్యాచ్లాడగా, నాలుగు విజయాలు, ఏడు ఓటములు, ఒక డ్రా నమోదు చేసింది. అఫ్గానిస్తాన్ చివరగా గతేడాది అక్టోబర్లో జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ ఆడింది. అయితే ఆ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ 73 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్గా వెలుగొందుతున్న రషీద్ ఖాన్ ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. ఆ జట్టు తరఫున ఆరు టెస్టుల్లో 154 పరుగులు, 45 వికెట్లు; 117 వన్డేల్లో 1,393 పరుగులు, 210 వికెట్లు; 113 టీ20ల్లో 622 పరుగులు, 190 వికెట్లు తీశాడు.చదవండి: ఆసీస్పై సిరీస్ విజయం.. పాక్ క్రికెటర్కు బంపరాఫర్!


