breaking news
Nandyala
-
సబ్ జైలు ఆకస్మిక తనిఖీ
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని సబ్ జైల్ను మూడవ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సెల్ చైర్మన్ అమ్మన్నరాజ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులోని పరిసరాలను, వంట, స్నానపు గదులను పరిశీలించి, అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ పేద, వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని అన్నారు. అదేవిధంగా ఖైదీల హాజరు పట్టిని పరిశీలించి వారి ఆరోగ్యం, కేసులు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు న్యాయ సహాయం కోసం 15100కు సమాచారాన్ని అందజేయాలని, ఉచితంగా న్యాయవాది కోర్టులో వాదిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, లోక్అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, న్యాయ వాది బాలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): 2026 ఏడాదికి జాతీయ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్ధన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయా లు, జవహర్ నవోదయ విద్యాలయాలు, అటామిక్ ఎనర్జీ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండి, సివిల్, క్రిమినల్ కేసులు, ఆరోపణలు, క్రమశిక్షణ చర్యలు లేని ఉపాధ్యాయులు అనర్హులన్నారు. జూలై 15లోగా https:// national awardstoteachers. education.gov.in/ nominations వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సభ్యుడిగా శ్రీహరి
కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర యాంటీ క్వాకరీ (నకిలీ వైద్యుల నిరోధక) కమిటీని అధికారికంగా ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యుడిగా కోడుమూరుకు చెందిన డాక్టర్ శ్రీహరి కురువ నియమితులయ్యారు. ఈ నూతన సబ్ కమిటీ.. చైర్మన్ డాక్టర్ సుబ్బారాయుడు పర్యవేక్షణలో నేరుగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నకిలీ వైద్యానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం రావాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తు న్న వైద్యవర్గాల్లో ఈ కమిటీ ఏర్పాటు సరికొత్త ఆశలను రేకెత్తించిందని ఆయన అన్నారు. గతంలో ఇలాంటి కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయని, ఈసారి నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తామన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ కూడా పక్కాగా అమలు చేస్తామన్నారు. -
శభాష్ మారెప్ప
పెద్దకడబూరు: మండల కేంద్రానికి చెందిన మారెప్ప (దివ్యాంగుడు) తన నిజాయితీ చాటుకొని శభాష్ అనిపించుకున్నారు. వివరాలలోకి వెళితే.. పెద్దకడబూరుకు చెందిన చాకలి మధు సోమవారం తన ద్విచక్ర వాహనంలో బట్టల బ్యాగ్తో పాటు పైన పర్స్ పెట్టుకొని వెళుతున్నాడు. మెయిన్ రోడ్డులో పర్స్ కింద పడిపోయింది. ఇంటికి వెళ్లి చూసుకోగా పర్స్ లేకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ దారిలో తన త్రిచక్ర వాహనంలో వెళుతున్న మారెప్పకు పర్స్ కనపడింది. దాన్ని తీసి చూడగా రెండున్నర తులాల బంగారు నెక్లెస్తో పాటు రూ.1300 నగదు ఉన్నాయి. దీనిపై మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి ఎస్ఐ మారుతికి విషయం చెప్పాడు. ఎస్ఐ బాధితులను పిలిపించి బంగారంతో పాటు నగదును అప్పజెప్పారు. మారెప్ప నిజాయితీని మెచ్చుకొని నలుగురికి ఆదర్శంగా నిలవాలని పొగడ్తలతో ముంచెత్తారు. ఏఎస్ఐ ఆనంద్ ఉన్నారు. 1,58,375 హెక్టార్లలో పంటల సాగు కర్నూలు(అగ్రికల్చర్): జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైనప్పటికీ సాగులో పురోగతి కరువైంది. దాదాపు 20 రోజులుగా వర్షాల జాడ లేకపోవడంతో ఖరీఫ్ ముందుకు సాగడం లేదు. ఖరీఫ్ సాధారణ సాగు 4,35,104 హెక్టార్లు ఉండగా.. జూన్ చివరిలోపు 50 శాతం వరకు సాగు పూర్తి కావాల్సి ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 1,58,375 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మిమీ ఉండగా 102.7 మి.మీ వర్షపాతం నమోదైంది. 32 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ 20 రోజులుగా వర్షాలు కనుమరుగవడంతో సాగు మందగించినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో పత్తి సాగు పెరుగుతోంది. ఇప్పటి వరకు 1,30,662 హెక్టార్లలో సాగయింది. నల్ల రేగడి నేలలు ఎక్కువగా ఉండటం వల్ల పత్తి సాగు పెరుగుతోంది. మిగిలిన అన్ని పంటలు 27,713 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. కర్నూలు: కల్లూరు ఎస్టేట్ మహాలక్ష్మి నగర్కు చెందిన కొండపల్లి శ్రీను మే 13 నుంచి కనిపించడం లేదని, అదే నెల 27న నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొండపల్లి శ్రీను ట్రాన్స్పోర్టు కార్యాలయంలో డెలివ రీ బాయ్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అదే కాలనీకి చెందిన మౌలాలికి స్నేహితుడు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలసి ఉండేవారు. కొంతకాలం క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మౌలాలే కొండపల్లి శ్రీనును మద్యం సేవించేందుకు తీసుకెళ్లి హత్య చేసి శవాన్ని మాయం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆ చూకీ లభించకపోవడంతో మంగళవారం సా యంత్రం కుటుంబ సభ్యులు కాలనీ ప్రజలతో కలిసి నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకుని కొద్దిసేపు ఆందోళన చేశారు. ఫోన్ కాల్ డేటాను పరిశీలించి శ్రీను ఆచూకీ కనుగొనాలని సీఐను వే డుకున్నారు. సీఐ విక్రమసింహా స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కర్నూలు(అర్బన్): ఆలూరు మండలం పెద్ద హోతూరుకు చెందిన అంగన్వాడీ టీచర్పై టీడీపీ కార్యకర్త వేధింపులకు పాల్పడటం అమానుషం అని జిల్లా కురువ, బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక కార్యాలయం ఆవరణలో జరిగిన సమావేశంలో కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవపూజ ధనుంజయ ఆచారి, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. వేధింపుల కారణంగా బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిందితుడికి కఠినంగా శిక్షించాలని కోరారు. -
శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపండి
బొమ్మలసత్రం: సుధీర్ఘకాలం పోలీస్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన సిబ్బంది శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ అన్నారు. మంగళవారం పదవీ విరమణ పొందిన ఎస్ఐలు గోపాల్, నజీర్హుస్సేన్, హుస్సేన్బాషా, రంగయ్యతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు షేక్షావలి, తమ్మిరెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డిని ఎస్పీ ఆయన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దాదాపు 40 ఏళ్ల పాటు పోలీస్శాఖకు సేవలందించటం అభనందనీయమన్నారు. ఇప్పటి నుంచి ఆరోగ్యంపై దృష్టి నిలిపి సంతోషంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్బాషా, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పరిపాలన విభాగం అధికారులు వీరన్న, ఖాదర్బాషా, పోలీస్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షులు స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కొండంత భక్తి
కొండపైకి చేరుకుంటున్న అశేష భక్తజనం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఊరూరా ఘనంగా నిర్వహించారు. రెండో రోజు మంగళవారం మండల కేంద్రం కోసిగి కొండపై వెలసిన శ్రీ తిమ్మప్ప (ఆంజనేయ)స్వామికి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు తండోప తండాలుగా కొండపైకి చేరుకుని స్వామికి నారికేళలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి కొండంత భక్తిని చాటారు. ఇటీవల కొత్తగా పెళ్లి చేసుకున్న స్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. స్వామి దర్శనం అనంతరం కొండపై విహరిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. కోసిగిలో కొండ దిగువ భాగాన ఆదోని రోడ్డులోని బాపులదొడ్డి క్రాస్ రోడ్డు నుంచి కోసిగి వరకు పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డిల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. – కోసిగి -
వెండి నాగాభరణం సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి రంగారెడ్జి జిల్లా నాదర్గుల్కు చెందిన పి.రవీందర్ కుటుంబ సభ్యులు 416 గ్రాముల ఐదు శిరస్సులతో కూడి న వెండి నాగాభరణాన్ని, వెండి చెంబును విరాళంగా సమర్పించారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వెండి వస్తువులను అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవికి అందజేశారు. దాతలకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు. మూడేళ్లకే నూరేళ్లు ! ● డ్రైనేజీ కాల్వలో పడి బాలుడి మృతి జూపాడుబంగ్లా: బుడి బుడి అడుగులు వేస్తూ.. బోసి నవ్వులు నవ్వుతూ అప్పటి వరకు తల్లిదండ్రులను ఆనంద పరిచిన కుమారుడు అంతలోనే దూరమయ్యాడు. ప్రమాదవశాత్తూ ఇంటి వద్ద ఉన్న డ్రైనేజీ కాల్వలో పడి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఖలీల్, ఉమామహేశ్వరి దంపతులు మంగళవారం రాత్రి ఇంటి పనుల్లో నిమగ్నమయై ఉండగా.. పెద్ద కుమారుడు కిఫాయత్ (03) ఇంటి వద్ద ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాల్వలో పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై చుట్టుపక్కల ఇళ్లల్లో గాలించారు. ఆచూకీ లేకపోవడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా ఇంటివద్ద ఉన్న డ్రైనేజీ కాల్వలో బాలుడి పడినట్లు గుర్తించారు. వెంటనే బాలుడిని వెలికి తీసి 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగానే బాలుడు మృతి చెందాడు. -
గుప్తనిధుల వేట
ఎమ్మిగనూరుసెంట్రల్: మండలంలోని కోటేకల్లు గ్రామంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన కలకలం రేపింది. గ్రామంలోని కొండ మీద బసవేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. కార్తీకమాసం, శ్రావణ మాసంలో స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన దేవాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. మంగళవారం ఆలయానికి వెళ్లిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలుగకుండా, పురావస్తు సంపదకు నష్టం జరుగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
మామయ్య కానుకే మన్నిక
చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించిన స్కూల్ బ్యాగ్లలో డొల్లతనం విద్యార్థులకు శాపంగా మారింది. బ్యాగ్లు ఎక్కడికక్కడ చిరిగి పీలికలు కాగా విద్యార్థులు వాటితోనే అవస్థలు పడుతూ సి.బెళగల్ జెడ్పీ హైస్కూల్కు వెళుతూ కనిపించారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై 18 రోజులు గడిచినా విద్యార్థి మిత్ర కిట్లను ప్రభుత్వం అందించకపోవడంతో విద్యార్థులు పాత బ్యాగులతోనే స్కూళ్లకు వెళుతున్నారు. కొందరు విద్యార్థులు రెండేళ్ల కిందట వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన బ్యాగులను వినియోగిస్తుండటం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్లు పూర్తిగా చిరిగిపోగా, విద్యార్థుల గురించి ఆలోచించి వారికి మామయ్యగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్ల క్రితం అందించిన బ్యాగ్లు నేటికీ పటిష్టంగా ఉండటం ప్రజలను ఆలోచింపజేస్తోంది. నాణ్యత గురించి డప్పాలు చెప్పుకునే టీడీపీ నేతల పాలనలో డొల్లతనాన్ని బ్యాగులను చూస్తేనే బయటపెడుతోందని స్థానికులు అంటున్నారు. చిరిగిన బ్యాగులలో పుస్తకాలను పాఠశాలకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. – సి.బెళగల్ -
● జిల్లాలో మందకొడిగా ఎన్యుమరేషన్ ఫారాల ఆన్లైన్ నమోదు ● ఫారాల పంపిణీ 98 శాతం.. డిజిటలైజేషన్ 24.47 శాతం మాత్రమే ● అధికారుల పర్యవేక్షణా లోపంపై సర్వత్రా విమర్శలు
నంద్యాల(అర్బన్): ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ (సర్–2026) జిల్లాలో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేయడంలో చూపిన ఉత్సాహం... వాటిని ఆన్లైన్ పోర్టల్లో నమోదు (డిజిటలైజేషన్) చేయడంలో అధికారులు, సిబ్బంది పూర్తిగా విస్మరించారు. జిల్లాలో సోమవారం సాయంత్రం వరకు అందిన అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా లక్షలాది ఫారాలు సేకరించి కార్యాలయాల్లో మూలనపడేసేశారు కానీ.. వాటి కంప్యూటరీకరణ ప్రక్రియ మాత్రం దారుణంగా వెనుకబడింది. దాదాపు 14 రోజుల క్రితం ప్రారంభమైన సర్ కార్యక్రమం కేవలం 24.47 శాతానికే పరిమితమైంది. ఇదే అలసత్వం కొనసాగితే రాబోయే ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,629 మంది బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నా రు. మొత్తం 14,05,443 మంది ఓటర్లు ఉండగా.. అధికారులు ఇప్పటివరకు 13,80,388 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, రికార్డు స్థాయిలో 98.22 శాతం పూర్తి చేశారు. అయితే, సేకరించిన ఫారాలను కంప్యూటర్లలో నమోదు చేసే ప్రక్రియలో యంత్రాంగం చేతులెత్తేసింది. జిల్లా వ్యాప్తంగా 3,43,904 ఫారాలు మాత్రమే ఆన్లైన్ అయ్యాయి. అంటే దాదాపు 10.61 లక్షల మంది ఓటర్ల డేటా ఇంకా కార్యాలయాల్లోని ఫైళ్లలోనే మగ్గుతోంది. జిల్లా కేంద్రంలో 19.39 శాతమే.. జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా అందులో జిల్లా కేంద్రం నంద్యాలలో డిజిటలైజేషన్ అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ అత్యధికంగా 2,76,813 మంది ఓటర్లు ఉండగా 2,75,307 ఫారాలను పంపిణీ చేశారు. కానీ, డిజిటలైజేషన్ కేవలం 19.39 శాతంతో 53,677 ఫారాలు మాత్రమే పూర్తయ్యాయి. నందికొట్కూరు నియోజకవర్గంలో డిజిటలైజేషన్ ప్రక్రియ మరింత దారుణంగా ఉంది. అందులో 2,20,814 మంది ఓటర్లు ఉండగా 2,14,730 మందికి ఫారాలు పంపిణీ జరిగితే... ఆన్లైన్ నమోదు కేవలం 19.05 శాతం మాత్రమే కావడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ముంచుకొస్తున్న గడువు.. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో టాప్ పొజిషన్లో ఉన్న ఆళ్లగడ్డ నియోజవర్గంలో కూడా కేలవలం 34.08 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తి కావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ముంచుకొస్తున్నా డేటా ఎంట్రీ ప్రక్రియ ఇంత మందకొడిగా సాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూలై 14వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ, డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉంది. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేయనున్నారు. సర్వేల పేరుతో సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో సకాలంలో నమోదు చేయకపోకతే, అర్హులైన ఓటర్ల పేర్లు, ముసాయిదా జాబితా నుంచి గల్లంతయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి కేవలం ఫారాల పంపిణీ టార్గెట్లకే పరిమితం కాకుండా. ప్రత్యేక సిబ్బందిని (డేటా ఎంట్రీ ఆపరేటర్లను) నియమించి యుద్ధప్రాతిపదికన డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అసవరం ఉంది. లేని పక్షంలో సామాన్య ఓటరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పరిశీలకుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్.. డిజిడల్ జిల్లాలో సర్ సర్వే పరిస్థితి ఇలా.. -
బస్సులు లేక అవస్థలు
హొళగుంద: మండల కేంద్రంలో బస్టాండు నుంచి సినిమా టాకీస్ వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు కారణంగా ముద్దటమాగి, కోగిలతోట గ్రామాలకు ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయి విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారు. ఆయా గ్రామాలతో పాటు సుళువాయి, పెద్దహ్యాట, సమ్మతగేరి, ముగుమానుగుంది తదితర గ్రామాలకు కూడా ఇదే మార్గం కావడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ మార్గం కాకుండా వేరేవి ఉన్నా డ్రైవర్లు ఆ రూట్లో తిప్పేందుకు ఇబ్బందిగా ఉందని చెబుతూ కొన్నిసార్లు బస్సులను నడపడం లేదు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు రోజూ హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎడ్లబండ్లు, ఆటోలు, బైకులు ఏది దొరికితే వాటిపై ఎక్కి పాఠశాలకు వెళుతున్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు బడికి వెళ్లేందుకు రోజూ ఇబ్బందులు పడుతున్నారని ప్రత్యామ్నయ మార్గంలో బస్సులు నడపాలని ఆయా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పురోహితుల మధ్య రగడ
● కొలనుభారతి దేవి ఆలయంలో పూజల అడ్డగింత కొత్తపల్లి: మండలంలోని ఏకై క సరస్వతీ క్షేత్రం శ్రీశైల దేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతి దేవి ఆలయంలో పురోహితుల మధ్య రగడ మొదలైంది. ఈ నెల 23వ తేదీన కొంత మంది వ్యక్తులు శ్రీశైలం దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా కొలనుభారతి క్షేత్రంలో నవ చండీయాగం నిర్వహించారు. ఈ విషయమై శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ఆదేశాలతో ఏఈఓ ఫణిధర్ ప్రసాద్ను ప్రత్యేక అధికారిగా నియమించి విచారణ జరిపించారు. ఆలయ సిబ్బంది ఇద్దరు, పురోహితులను విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఈఓ ఆదేశాలతో పూరోహితులు అమ్మవారి క్షేత్రంలో పూజలు చేసేందుకు వచ్చారు. అయితే స్థానిక పురోహితులు శ్రీశైలం నుంచి వచ్చిన పురోహితులను అడ్డుకోవడంతో పాటు వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు ఆదేశాలతో మంగళవారం ఏఈఓ ఫణిధర్ ప్రసాద్ కొలనుభారతి క్షేత్రాన్ని చేరుకొని శ్రీశైలం పూజారులతో పూజలు చేయించేందుకు సహకరించాలని స్థానిక పురోహితులను కోరాగా వారు లెక్కచేయలేదు. ఈ విషయమై పురోహితులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీశైల దేవస్థానం ఈఓకు ఫిర్యాదు చేస్తామని ఏఈఓ ఫణిధర్ ప్రసాద్ వెల్లడించారు. యువకుడి ఆత్మహత్య కొత్తపల్లి: క్షణికావేశంలో యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డా డు. ఘటనపై కొత్తపల్లి ఎస్ఐ జయశేఖర్ మంగళవారం రాత్రి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పెద్దగుమ్మడాపురం గ్రామానికి చెంది న సంజపో గు కళ్యాణ్ (20)కు దైవభక్తి ఎక్కువ. మరికొద్ది రోజుల్లో అతని అక్క వివాహం జరిపించేందుకు కుటు ంబీకులు నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లి పత్రికలపై తనకు ఇష్టంలేని దేవుడి బొమ్మ ముద్రించారని, ఎలాగైనా తొలగించాలని కల్యాణ్ తండ్రితో చిన్న వాగ్వాదం చేశారు. తండ్రి కురుమయ్య పత్రికలను ముద్రించాం ఇప్పుడు తీసివేయడం కుదరదని చెప్పడంతో యువకుడు మన స్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయమై తండ్రి కురుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ● ప్రయాణికులకు తప్పిన ప్రమాదం.. కోడుమూరు రూరల్: కోడుమూరు నుంచి కర్నూలుకు వెళ్లే రోడ్డులో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్కు చెందిన ఆర్టీసీ బస్సు కోడుమూరు మీదుగా కర్నూలుకు వెళుతుండగా, పెద్దపాడు సమీపాన అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బస్సులోని ప్రయాణికులు ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. కర్నూలు: ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్ల విధులు, బాధ్యతలపై న్యాయ సేవా సదన్లో శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. కక్షిదారులకు సత్వరమే సేవలు అందించడం, అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం, చట్టపరమైన సమస్యలను పరిష్కరించడంలో సహకారం అందించాలని వారికి సూచించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు పాల్గొన్నారు. -
సర్వేపై ఆందోళన
సర్ ప్రక్రియపై ఓటర్లలో ఆందోళన నెలకొంది. అధికారులు టీడీపీ కార్యాలయాలు, సచివాలయాలు, దేవాలయ ఆవరణాలకు వెళ్లి మ్యాపింగ్ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జూన్ 15న ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఏం జరుగుతుందోననే ఆందోళ న అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఓటర్లలో మొ దలైంది. ప్రక్రియ మొదలైన నాటి నుంచి బీఎల్ఓలు రాజకీయ పార్టీ నాయకులతో సంబంధం లేకుండా ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలి. ఆ తర్వాత ఓటరు ఉన్నాడా.. లేదా అని విచారించాలి. అనంతరం మ్యాపింగ్ చేయాల్సి ఉంది. అయితే బీఎల్ఓలు 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత జాబితాను పట్టుకొని ఇంటిపేర్లతో సరిపోయినవి, వారికి బంధుత్వం ఉన్నవి, టీడీపీ బీఎల్ఏలు చెప్పినవి మ్యాపింగ్ చేసేస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అనేక మంది ఓట్లు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
బాలల రక్షణ కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి
నంద్యాల: పల్లెలు, పట్టణాల్లోని బాలల రక్షణ కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అన్నారు. పట్టణంలోని ‘వందేమాతరం సమావేశ మందిరం‘లో బాలల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలుపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు అధికారులు మెరుగుపరచుకోవాలన్నారు. బాలలపై జరిగే అన్యాయాలు, పోక్సో కేసులు, జేజే యాక్ట్ కేసులకు సంబంధించి పోలీస్, ఐసీడీఎస్, లేబర్, ఎడ్యుకేషన్ శాఖల వద్ద ఉన్న సమాచారంలో వ్యత్యాసాలు ఉండకుండా చూసుకోవాలన్నారు. కేసు నమోదైన 60 రోజుల్లో చార్జ్షీట్ ఫైల్ అయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ పై స్థాయిలో జరిగే సైద్ధాంతిక చర్చలకు, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నా రు. బాలికకు వివాహం జరగాలంటే కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తోందన్నా రు. సమావేశంలో కమిషన్ సభ్యులు చల్లా మధుసూదన్, జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్, ఐసీడీఎస్, పోలీస్, లేబర్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు పింఛన్ల పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): జూలై నెల పింఛన్ల పంపిణీ బుధవారం చేపట్టనున్నా రు. ఇందుకోసం రూ.194.43 కోట్లు విడుదలయ్యాయి. వార్డు, గ్రామ సచివాలయ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు నేడు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో జూలై నెలలో పింఛన్లు 4,44,853 ఉన్నాయి. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
● ఒకరికి గాయాలు వెల్దుర్తి: జాతీయ రహదారి 44పై అల్లుగుండు పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. తమిళనాడుకు చెందిన డ్రైవర్ శక్తి తన లారీని రోడ్డు పక్కన నిలిపి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టినప్పటికీ, ముందు సీట్లలోని ఎయిర్బ్యాగ్లు తెరుచుకోవడంతో డ్రైవర్, మరో యువకుడు ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. వెనుక సీట్లో కూర్చున్న హైదరాబాద్కు చెందిన వెంకటరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని అంబులెన్స్లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి గురైన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
అక్రమ వెంచర్ తొలగింపు
● ఏమైనా జరిగితే మీరే బాధ్యులంటూ యజమాని హల్చల్ ● బిత్తరపోయిన అధికారులు, సిబ్బంది నందికొట్కూరు: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల పక్కన వెలసిన అక్రమ వెంచర్ను మున్సిపల్ కమిషనర్ జి.వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి రంగస్వామి జేసీబీతో మంగళవారం తొలగించారు. ల్యాండ్ ఓనర్ బద్రిశెట్టి రంగయ్యకు చెందిన సర్వే నంబరు 790లో మూడెకరాల భూమిని నహిమూన్ రహిమాన్ అగ్రిమెంట్తో కొనుగోలు చేశాడు. తన వెంచర్ను తొలగిస్తే మా నాన్నకు ఏమైనా జరిగితే మీరే బాధ్యులు, ముందే ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. అని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని, సిబ్బందిని బెదిరించాడు. అక్కడి నుంచి మున్సిపల్ కార్యాల యం చేరుకొని ఇస్టానుసారంగా బెంచీలపై పిడిగుద్దులు గుద్దుతూ అధికారులను నానా దుర్భాషలాడారు. దీంతో కార్యాలయంలో పని చేసే ఉద్యో గులు అర్థం కాక బిత్తరపోయ్యారు. అంతేగాకుండా నా వెంచర్ గురించి పత్రికల్లో రాస్తే పాత్రికేయులపై కూడా కేసులు పెడతానని బెదిరించారు. -
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
శ్రీశైలం: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, ఆటపాటలతో విద్య బోధించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ సూర్యనారాయణ రాజు సూచించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీశైలం చేరుకున్న ఆయనకు డీసీపీఓ స్వప్న ప్రియదర్శిని, నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరమ్మ, మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజలిదేవిలు భ్రమరాంబ అతిథి గృహంలో ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాల)ను పరిశీలించారు. అక్కడినుంచి సున్నిపెంటలోని ప్రతిభ గురుకుల పాఠశాల, బీసీ హాస్టల్ను పరిశీలించి సమస్యలపై ఆరా తీశారు. శ్రీశైలంలోని మేకలబండలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మహిళా శిశు సంక్షేమ శాఖ సభ్యులు మధుసూదన్ రావు, వన్టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబు తదితరులు ఉన్నారు. -
వసతుల్లో వెనుక‘బడి’
కర్నూలు సిటీ: కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ గాడి తప్పింది. దేశానికి ఏపీ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఓ మోడల్గా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పిన విద్యాశాఖ మంత్రి చేతల్లో చూపించడంలో విఫలమయ్యారు. ఇందుకు గత నెలలో ఆ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో జిల్లాకు దక్కిన స్థానమే ఉదాహరణ. జిల్లాలో అన్ని యాజమాన్యాల బడులు 2,254 ఉండగా 4.57 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 1,445 ప్రభుత్వ యాజమాన్య స్కూల్స్ ఉండగా వాటిలో 2.49 లక్షల మంది పిల్లలు ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మన బడి నాడు–నేడు ద్వారా రెండు విడతలుగా పనులు జరిగాయి. మొదటి విడతలో 594 పాఠశాలల్లో రూ.166.25 కోట్లు ఖర్చు పెట్టి 9 రకాల మౌలిక సదుపాయాలు కల్పించే పనులు పూర్తి చేశారు. రెండో విడతలో 1051 స్కూళ్లలో రూ.504.16 కోట్లతో పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మౌలిక సదుపాయాల పనులను పూర్తిగా నిలిపి వేసింది. 1310 అదనపు తరగతి గదులు నిర్మించేందుకు పనులు మొదలు పెట్టగా వాటికి ఈ రెండేళ్లలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. అదే విధంగా 685 స్కూళ్లలో రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్ల ఫినిషింగ్, 701 స్కూళ్లలో విద్యుత్ సరఫరా పనులు, 714 స్కూళ్లలో తాగు నీటి కల్పన పనులు, 694 బడుల్లో మైనర్, మేజర్ పనులు, 380 స్కూళ్లలో కాంపౌండ్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో మౌలిక సదుపాయాల్లో జిల్లా చిట్టచివరి (28జిల్లాల్లో 28వ స్థానం) స్థానంలో నిలిచింది. విద్యార్థుల ప్రవేశాల్లో 11, విద్యార్థులు, టీచర్ హాజరులో 22, నిపున్ భారత్ మిషన్ కింద కేంద్రం చేపట్టిన ఎఫ్ఎల్ఎన్లో 27, విద్యాశాఖ అధికారుల తనిఖీల్లో 22, డ్రాపౌట్స్లో 24వ స్థానంలో జిల్లా నిలిచింది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ నెల 13వ తేదీన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారీయా హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మెన్గా, పాఠశాల విద్య అడిషనల్ డైరెక్టర్ వైస్ చైర్మెన్గా, పాఠశాల విద్య కడప ఆర్జేడీ, ఇద్దరు ఎంఈఓలు, ఇద్దరు గ్రేడ్ హెచ్ఎంలు, ఇద్దరు ఎన్జీఓలు సభ్యులుగా, డీఈఓ మెంబరు కన్వీనర్గా, కేపీఎంజీ అనే కన్సల్టెంట్ సభ్యులుగా ఉన్నారు. నేడు ఈ హైలెవల్ కమిటీ జిల్లాలో పర్యటించనుంది. గాడి తప్పిన విద్యావ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనలో అట్టడుగున జిల్లా నేడు జిల్లాలో పర్యటించనున్న హైలెవెల్ కమిటీ -
తీరని యూరియాతన
నందవరం: కూటమి పాలనలో రైతులకు యూరియా కష్టాలు తొలగడం లేదు. పొలాల్లో సాగు పనులు వదులుకొని వ్యవసాయ కార్యాలయాలు, సచివాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. సోమవారం మండల పరిధిలోని హాలహర్వి గ్రామ సచివాలయంలో ఆన్లైన్లో యూరియా పంపిణీకి చర్యలు చేపట్టారు. వందలాది మంది రైతులు ఉదయమే అక్కడి చేరుకొని బారులు తీరారు. తీరా ఓటీపీ చెప్పేందుకు మొబైల్ఫోన్ తప్పనిసరి అని లేకపోతే ఎరువులు ఇవ్వడానికి కుదరదని చెప్పడంతో చాలా మంది తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. గత ప్రభుత్వ హయాంలో అడగగానే అవసరమైన ఎరువులు ఇచ్చే వారని, ఇప్పుడేందుకు కొత్తకొత్త రూల్స్తో ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. -
శ్రీశైలంలో వైభవంగా గిరి ప్రదక్షిణ
శ్రీశైలం టెంపుల్: పౌర్ణమి సందర్భంగా జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం గిరిప్రదక్షిణను నిర్వహించారు. క్షేత్రంలోని ప్రాచీన మఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయించి భక్తిభావాలను పెంపొందించారు. సోమవారం సాయంత్రం స్వామిఅమ్మవార్ల మహామంగళహారతులు ఇచ్చిన అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలై గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం మీదుగా బయలువీరభద్రస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయరహదారి, సారంగధర మఠం మీదుగా హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి మహిషాసురమర్దిని, రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనం, నందిమండపం వద్దకు రావడంతో గిరి ప్రదక్షిణ ముగిసింది. దేవస్థాన అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అహోబిలంలో పౌర్ణమి పూజలు ఆళ్లగడ్డ: పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం అహోబిలంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయం ముఖద్వారం మండపంలో కొలువుంచారు. పంచామృతాలతో అభిషేకించి దూపదీపాలతో మహామంగళహారతి ఇచ్చారు. అనంతరం నైవేద్యం నివేదించారు. రాత్రి విశేషాలంకరణలో స్వామి ఉభయ దేవేరులతో కొలువుదీరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. పీజీఆర్ఎస్కు 105 ఫిర్యాదులు బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజల నుంచి 105 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ సునిల్షెరాన్ మాట్లాడుతూ.. ఫిర్యాదుల్లో చట్టపరిధిలో ఉన్న సమస్యలను వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించామన్నారు. కొన్ని సమస్యలను బాధితుల స్టేషన్ పరిధి అధికారులకు బదిలీ చేశామన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని, ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించామన్నారు. డీసీసీబీ సీఈఓగా బాలాజీరావు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఇవో)గా సీహెచ్ఆర్సీఎస్ బాలాజీరావు నియమితులయ్యారు. సీఈఓ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. డీసీసీబీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న పి.రామాంజనేయులు ఇన్చార్జి సీఇవోగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ సీఇవో నియమితులయ్యే వరకు ఇన్చార్జి సీఇవోను నియమించాలని ఆప్కాబ్ ఎండీకి డీసీసీబీ నుంచి లేఖ రాసినట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా ఆప్కాబ్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ అయిన బాలాజీరావును కర్నూలు డీసీసీబీకి ఇన్చార్జి సీఇవోగా నియమిస్తూ ఆప్కాబ్ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నూతన సీఇవోగా బాధ్యతలు చేపట్టిన బాలాజీరావును జనరల్ మేనేజర్లు పి.రామాంజనేయులు, శివలీల, డీపీడీఎం రంగనాథ్, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్కుమార్, ఏజీఎంలు త్రినాథ్రెడ్డి, గీత, సరోజమ్మ, రాఘవేంద్ర తదితరులను అభినందించారు. -
లే మామ.. మన ఊరికి వెళ్దాం..
నంద్యాల జిల్లా, ఎమ్మిగనూరురూరల్: కుమార్తె పెళ్లికి కొత్త దుస్తులు తీసుకొని వస్తూ తండ్రి ప్రభుదాస్(45), ఏరువాక పౌర్ణమి పండుగకు భార్య ఊరికి వెళ్తూ బోయ రవి (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బనవాసి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్వల్ప గాయాలతో ఉదయ్ అనే బాలుడు బయటపడ్డాడు.కుమార్తె పెళ్లికి దుస్తులు తీసుకొని వస్తూ.. పెద్దకడుబూరు గ్రామానికి చెందిన ప్రభుదాస్(45)కు శిరీష, రాణి, కీర్తన, ఉదయ్లు సంతానం. భార్య కొన్ని సంవత్సరాల కిత్రం భర్తను వదలి వెళ్లిపోయింది. రెండో కుమార్తె రాణికి జూలై 1,2 వ తేదీల్లో జాలమంచి గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయింది. కుమార్తె పెళ్లి కోసం ఎమ్మిగనూరుకు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి కొత్త దుస్తులు కొనుగోలు చేశారు. కుటుంబ సభ్యులను ఆటోలో పంపి ప్రభుదాస్(45), కుమారుడు ఉదయ్లు మోటార్ సైకిల్పై పెద్దకడుబూరుకు బయలుదేరారు.బనవాసి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న స్కూటర్ ఢీ కొనటంతో ఎగిరి కిందపడ్డారు. ప్రభుదాస్ రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడేమృతి చెందాడు. కుమారుడు ఉదయ్ రోడ్డు పక్కన మట్టిరోడ్డుపై పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు రోజుల్లో కుమార్తె వివాహం జరుగుతుందని అందరూ సంతోషంగా ఉన్న తరుణంలో తండ్రి ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అనాథలయ్యారు.పౌర్ణమి పండుగకు వెళ్తూ..చిన్నతుంబళానికి చెందిన కడుబురప్ప, ఉరుకుందమ్మల కుమారుడు బోయ రవి(22)కి ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి రాధికతో మూడు నెలల క్రితం పెళ్లి జరిగింది. బోయ రవి భార్య రాధిక పుట్టింటికి ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లారు. సోమవారం అత్తగారి ఊర్లో ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లేందుకు చిన్నతుంబళం నుంచి మోటార్ బైక్పై బోయ రవి బయలుదేరాడు. బనవాసి దగ్గర ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలుసుకొని ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులతో కలసి భార్య రాధిక వచ్చారు. అంబులెన్స్లో ఉంచిన మృతదేహాన్ని చూసి ‘లే మామ.. మన ఊరికి వెళ్దాం’ అంటూ రోదించారు. హెల్మెట్ ఉన్నా బోయ రవి ధరించకపోవటంతోనే తలకు బలమైన గాయం అయినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
తుంగభద్రలో ఇసు‘కాసు’రులు
రాత్రి వేళ తెలంగాణకు ఇసుకను తరలించడానికి జేసీబీతో టిప్పర్కు లోడ్ చేస్తున్న దృశ్యం, తెలంగాణకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఇసుక టిప్పర్లునందవరం: ఉచిత ఇసుక అంటూనే టీడీపీ నేతలు ఇసుకాసురులుగా అవతారమెత్తారు. తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్నారు. రాత్రి సమయాల్లో సరిహద్దులు దాటించి రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారు.అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. నందవరం మండలంలో నాగలదిన్నె, గంగవరం గ్రామాల్లో రెండు ఇసుక రీచ్లను ఏర్పాటు చేశారు. నాగలదిన్నె గ్రామానికి చెందిన నలుగురు టీడీపీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు తెర తీశారు. రీచ్ను తలపించేలా నాగలదిన్నె గ్రామంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, తుంగభద్ర నది ఒడ్డున వెలసిన సాయి బాబ ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలం ఇసుకను డంప్ చేసి రాత్రివేళ్లల్లో జేసీబీలతో తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నారు. భారీ మొత్తంలో ఇసుకను నాగలదిన్నె వంతెన మీదుగా తెలంగాణాకు తరలిస్తున్నారు. జేసీబీలతో నదిలో ఇసుకను పోగుచేసి తీరంలో భారీ డంప్ ఉంచారు. అక్కడి నుంచి రాత్రి కాగానే టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. రోజుకు 10 నుంచి 15 ట్రిప్పుల ఇసుక అక్కడి నుంచి తరలుతున్నట్లు అంచనా. నిద్రపోతున్న నిఘా నదికై రవాడి, నాగలదిన్నె గ్రామాల సమీపంలోని తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడం లేదు. కనీసం బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టులో కూడా తనిఖీలు లేవని తెలుస్తోంది. మైనింగ్, విజులెన్స్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో టీడీపీ నాయకుల ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక దందా చేస్తున్న టీడీపీ నాయకులు నాగలదిన్నె బ్రిడ్జి మీదుగా రాత్రి సమయంలో తరలింపు చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలం -
పెళ్లి చేయకుండానే.. పండుగ చూడకుండానే!
ఎమ్మిగనూరురూరల్: కుమార్తె పెళ్లికి కొత్త దుస్తులు తీసుకొని వస్తూ తండ్రి ప్రభుదాస్(45), ఏరువాక పౌర్ణమి పండుగకు భార్య ఊరికి వెళ్తూ బోయ రవి (22) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బనవాసి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్వల్ప గాయాలతో ఉదయ్ అనే బాలుడు బయటపడ్డాడు. కుమార్తె పెళ్లికి దుస్తులు తీసుకొని వస్తూ.. పెద్దకడుబూరు గ్రామానికి చెందిన ప్రభుదాస్(45)కు శిరీష, రాణి, కీర్తన, ఉదయ్లు సంతానం. భార్య కొన్ని సంవత్సరాల కిత్రం భర్తను వదలి వెళ్లిపోయింది. రెండో కుమార్తె రాణికి జూలై 1,2 వ తేదీల్లో జాలమంచి గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చియం అయింది. కుమార్తె పెళ్లి కోసం ఎమ్మిగనూరుకు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి కొత్త దుస్తులు కొనుగోలు చేశారు. కుటుంబ సభ్యులను ఆటోలో పంపి ప్రభుదాస్(45), కుమారుడు ఉదయ్లు మోటార్ సైకిల్పై పెద్దకడుబూరుకు బయలుదేరారు. బనవాసి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న స్కూటర్ ఢీ కొనటంతో ఎగిరి కిందపడ్డారు. ప్రభుదాస్ రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడేమృతి చెందాడు. కుమారుడు ఉదయ్ రోడ్డు పక్కన మట్టిరోడ్డుపై పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు రోజుల్లో కుమార్తె వివాహం జరుగుతుందని అందరూ సంతోషంగా ఉన్న తరుణంలో తండ్రి ప్రమాదంలో మృతి చెందటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అనాథలయ్యారు. పౌర్ణమి పండుగకు వెళ్తూ.. చిన్నతుంబళానికి చెందిన కడుబురప్ప, ఉరుకుందమ్మల కుమారుడు బోయ రవి(22)కి ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి రాధికతో మూడు నెలల క్రితం పెళ్లి జరిగింది. బోయ రవి భార్య రాధిక పుట్టింటికి ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లారు. సోమవారం అత్తగారి ఊర్లో ఏరువాక పౌర్ణమి పండగకు వెళ్లేందుకు చిన్నతుంబళం నుంచి మోటార్ బైక్పై బోయ రవి బయలుదేరాడు. బనవాసి దగ్గర ఎదురుగా వస్తున్న మోటార్ బైక్ ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలుసుకొని ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులతో కలసి భార్య రాధిక వచ్చారు. అంబులెన్స్లో ఉంచిన మృతదేహాన్ని చూసి ‘లే మామ.. మన ఊరికి వెళ్దాం’ అంటూ రోదించారు. హెల్మెట్ ఉన్నా బోయ రవి ధరించకపోవటంతోనే తలకు బలమైన గాయం అయినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రభుదాస్, బోయ రవి (ఫైల్)రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం బనవాసి సమీపంలో దుర్ఘటన గాయాలతో బయటపడ్డ బాలుడు -
ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమం
● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో జూలై నెలలో ఉద్యమం చేస్తామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు ఎస్. చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు.చంద్రశేఖర్, అజాంబేగ్ మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలన్నారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం పూర్తి అయినప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్ గురించి, సరెండర్ లీవ్ గురించి స్పందించడం లేదన్నారు. నాయకులు నాగేంద్ర కుమార్, మౌలాలి, జీవీ రమణ, నూరుల్లా, అమీర్, సుబ్బారాయుడు, శ్రీనివాసులు, నరసింహారావు సుధాకర్, షరీఫ్ పాల్గొన్నారు. -
శ్రీశైల శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, దేవస్థాన కీర్తి ప్రతిష్టలను పెంచేలా కృషి చేయాలని దేవస్థానానికి ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నియమించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దేవస్థాన
దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలని తెలుసుకున్నాడేమో కానీ.. అధికారంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడేమో.. శ్రీశైలం దేవస్థానం సభ్యుల్లో ఒకరు. ఓ వైపు దేవస్థానం అభివృద్ధిని విస్మరిస్తూ.. మరో వైపు ఉద్యోగులను అగౌరపరుస్తూ.. అందని కాడికి దోచుకుంటున్న ఓ సభ్యుడి తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీశైల దేవస్థానంలో అన్ని విభాగాలపై పట్టు సాధించేందుకు ఒక్కొ విభాగానికి ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. వీరిలో ఒకరు కన్వీనర్గా, మరో ఇద్దరిని సభ్యులుగా ఉంటారు. ఆ విభాగంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు ఏవిధంగా ఉపయోగపడుతాయని ఆ కమిటీ పర్యవేక్షిస్తుంది. క్షేత్రంలో అనునిత్యం పలు అభివృద్ధి పనులు చేపట్టే విభాగంలో తనకి అనుభవం ఉందని, సబ్ కమిటీ కన్వీనర్గా పట్టుబట్టి మరి ఆ అభివృద్ధి పనులు చేపట్టే విభాగానికి కన్వీనర్గా నియమించుకునేలా చేశాడట. సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అ విభాగపు అధికారులు, సిబ్బందితో సమావేశాలు సైతం నిర్వహిస్తున్నాడని తెలుస్తుంది. దేవస్థాన ట్రస్ట్బోర్డు సమావేశాల్లో సదరు సభ్యుడు అధికారులను నిలబెట్టి మరీ ప్రశ్నించడం, దేవస్థాన అధికారులకు కనీస మర్యాద కూడా ఇవ్వరనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల చర్చనీయాంశమైన ఓ విషయంపై బల్లలు గుద్ది ప్రశ్నించడం, ఇకపై ‘మీ జాతకం అంతా చెబుతా’ అంటూ అధికారులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తానికి సభ్యుడి వ్యవహారంతో ట్రస్ట్బోర్డు అభాసుపాలవుతోంది. కాటేజీ కేటాయించాల్సిందే.. ట్రస్ట్బోర్డు చైర్మన్కు మాత్రమే దేవస్థాన కాటేజీ కేటాయిస్తారు. సభ్యులకు మల్లికార్జున సదన్, గణేశసదన్ కేటాయిస్తారు. అయితే సదరు సభ్యుడు తాను ఎప్పుడు వచ్చిన చైర్మన్కు కేటాయించినట్లే తనకి కూడా కాటేజీ కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేవాడని సమాచారం. చేసేదేమి లేక అధికారులు కాటేజీ కేటాయించేవారట. అయితే ఉచితంగా కాటేజీ కేటాయించడంపై సభ్యుల్లో చర్చ జరగడం, ఉచితంగా కాటేజీ తీసుకుంటే మిగతా సభ్యులందరూ కూడా కాటేజీ కావాలని తమని అడిగితే సమస్య వస్తుందని, ట్రస్ట్బోర్డుపై కూడా విమర్శలు వస్తాయని సున్నితంగా ఆ సభ్యుడిని హెచ్చరించినట్లు సమాచారం. ఆతర్వాత ఉచితంగా తీసుకోకుండా నెల్లూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిర్మించిన కాటేజీలో డోనర్ కూపన్ తీసుకుని సగం అద్దె చెల్లిస్తూ అదే కాటేజీలో బస చేస్తూ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన రూటే సప‘రేటు’..దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు చేపట్టే ఓ విభాగానికి సబ్ కమిటీ కన్వీనర్ కావడంతో ఏ పని చేయాలన్న తనకు చెప్పాలని అధికారులకు హుకుం జారీ చేశాడట. అంతేకాకుండా ఆ విభాగంలో కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేసే ఓ అధికారిని తన అనుచరుడిగా చేసుకుని, వసతి ఉంటున్న కాటేజీకి అతనిని పిలిపించుకుని దేవస్థానంలో ఏమి అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, వాటిలో లోపాలు ఏంటని సమాచారం రాబట్టుకుని సదరు పని పర్యవేక్షిస్తున్న అధికారిని పిలిపించుకుని అతడిని బెదిరించడం పరిపాటిగా మారిందని సమాచారం. అలాగే ఆయా పనులు పర్యవేక్షిస్తున్న అందరి నుంచి అమ్యామ్యాలు వసూలు చేసి తనకు ఇవ్వా లని తన అనుచరుడిగా ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించి అల్టిమేటం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన తీరుతో అధికారులు తలలు పట్టుకున్నారు. పెద్దాయనది ఏమీ లేదు.. ట్రస్ట్బోర్డుకు పెద్దదిక్కుగా ఉన్న ఆయనకు ఇటీవల ఓ శస్త్ర చికిత్స జరిగి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనారోగ్య కారణాలతో రెండు ట్రస్ట్బోర్డు సమావేశాలకు శ్రీశైలానికి వచ్చి ప్రత్యక్షంగా హాజరుకాలేక వర్చువల్గా హాజరయ్యారు. దీంతో ఇంకా ఆ పెద్దాయనది ఏమి లేదు..అంత మనం ఎలా చెబితే ‘అలా’ అంటూ, ట్రస్ట్బోర్డును నేనే నడిపిస్తా.. మీరు సహకరించాలంటూ సభ్యులతో అంతర్గతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. తాను సభ్యుడిని అని మరచిపోయి దేవస్థాన అన్ని విభాగ అధికారులను కూడా చైర్మన్ హోదా తరహాలోనే ఆదేశాలు జారీ చేస్తారని దేవస్థాన అధికారులు గుసగులాడుకుంటున్నారు. శ్రీశైలం ట్రస్ట్బోర్డులో చర్చనీయాంశమైన ఓ సభ్యుడి వ్యవహరశైలి సభ్యుడి ప్రవర్తనతో అభాసుపాలవుతున్న ట్రస్ట్బోర్డు అభివృద్ధి పనులు చేపట్టే విభాగానికి పట్టుబట్టి కమిటీ కన్వీనర్గా ఎప్పుడు వచ్చినా కాటేజీ కేటాయించాల్సిందేనని హుకుం -
రెండు చుక్కలతో బంగారు భవిత
● కలెక్టర్ రాజకుమారినంద్యాల: రెండు పోలియో చుక్కలు చిన్నారుల బంగారు భవితకు ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం మూలసాగరంలోని ఎంఎస్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భారతదేశం పోలియో రహిత దేశంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల దేశాల్లో అక్కడక్కడ పోలియో కేసులు నమోదవ్వడం వల్ల వాటి నుంచి పిల్లలను రక్షించడానికి ఏటా జూన్, డిసెంబర్ మాసాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. అందుకు 0–5 సంవత్సరాలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 1,320 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న చిన్నారుల కోసం బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గర కూడా పోలియో చుక్కల కేంద్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత భారత్ను కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలన్నారు. అత్వవసర పరిస్థితుల్లో పోలియో కేంద్రాలకు వెళ్లలేని వారి కోసం ఈ నెల 29, 30 తేదీల్లో మాప్–అప్ కార్యక్రమం ద్వారా మిగిలిపోయిన పిల్లలందరికీ పోలియో చుక్కలు వైద్య సిబ్బంది ద్వారా ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మెప్మా పీడీ వెంకట దాసు, జిల్లా పల్స్ పోలియో నోడల్ ఆఫీసర్ రమేష్, జిల్లా ఇమ్యూనెజేషన్ అధికారి సుదర్శన్ బాబు, ప్రోగ్రామ్ అధికారులు శారద బాయి, లక్ష్మీప్రసన్న, ఎన్టీఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రాక్గార్డెన్లో ‘రణబాలి’
● సందడి చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నఓర్వకల్లు: రాక్గార్డెన్లో ఆదివారం సినిమా సందడి నెలకొంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రవిచంద్ర నిర్మాతగా, రాహుల్ సాంకేతి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రప్మిక మందన్న కథానాయకులుగా నటిస్తున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న విలన్కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్కు అంతరాయం కలగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. సినిమా షూటింగ్ను తిలకించేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించిన రాక్గార్డెన్లో మరోసారి సినిమా సినిమా షూటింగ్తో సందడిగా మారింది. -
గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ఫోర్స్ కమిటీ ఎంపిక
ఆత్మకూరు: వైఎస్సార్సీపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులను ఎంపిక చేస్తూ పార్టీ అధిష్టానం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కమిటీ సభ్యులుగా కాటసాని రాంభూపాల్రెడ్డి (వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు), హరికట్ల శివరామిరెడ్డి (డిస్ట్రిక్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్), శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే), కో ఆర్డినేటర్గా పీపీ నాగిరెడ్డి (మార్క్ఫెడ్ మాజీ చైర్మన్)ను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సర్వం త్యాగం చేస్తే విస్మరించడం తగదు నందికొట్కూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగులు నింపేందుకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన తమకు న్యాయం చేయకుండా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని నీటిముంపు నిరుద్యోగుల సంఘం నాయకులు జయన్న ప్రశించారు. పట్టణంలోని కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారి పక్కన శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు చేపట్టిన రిలే దీక్ష ఆదివారం 95వ రోజుకు చేరింది. ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చంద్రబాబు న్యాయం చేసినప్పుడు తమకెందుకు న్యాయం చేయలేరన్నారు. తాము నష్టపోయి 45 ఏళ్లు దాటినా పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. దీక్షలో నారాయణ, మురళి, జమ్మన్న, నాగసుంకన్న, నాగరాజు, నాగేంద్ర తదితరులు కూర్చొన్నారు. -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు దీరారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగు ణంగా దేవస్థానం విస్త్రత ఏర్పాట్లు చేసింది. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్ద దర్శనానికి వెళ్లే పలువురు ఐదేళ్ల లోపు చిన్నారులకు దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు పోలియో చుక్కలు వేశారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 29వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. బీసీ హాస్టళ్లలో ప్రవేశాలు పెంచాలి కర్నూలు(అర్బన్): బీసీ హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని వసతి గృహ సంక్షేమాధికారులను జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కే ప్రసూన ఆదేశించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభమైనా నేటి వరకు జిల్లాలోని రెండు, మూడు వసతి గృహాలకు రెన్యువల్ విద్యార్థుల హాజరు జీరో ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారులు విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని పలు బీసీ వసతి గృహాల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థుల డిమాండ్ చాలా ఉందన్నారు. అయితే ఆయా వసతి గృహాలకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలకు ఇబ్బందులు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ అంశంపై రెండు, మూడు రోజుల్లో హెచ్డబ్ల్యూఓలతో సమావేశం నిర్వహించి సమస్యను జిల్లా కలెక్టర్ ద్వారా డీఈఓ దృష్టికి తీసుకుపోతామన్నారు. నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం తెలిపారు. వినియోగదారులు 8977716661కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 7382614308కు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. -
మానసిక ఒత్తిళ్లతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఒకప్పుడు ఆధునిక జీవితం లేదు. ఖర్చులు తక్కువగా ఉన్నా ఇంట్లో ఒకరు సంపాదించినా కుటుంబమంతా హాయిగా జీవించేది. కానీ ఇప్పుడు ఇంట్లో అందరూ సంపాదించినా ఖర్చులకు సరిపోక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పుడంతా ఆ
● కర్నూలు నగరంలోని గణేష్నగర్కు చెందిన శివకృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను చేస్తున్న ఉద్యోగంలో ఇస్తున్న లక్ష్యాలు చేరుకోవడానికి అతను నిత్యం శ్రమించేవాడు. లక్ష్యాలను చేరుకునే క్రమంలో అతను తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. అది కాస్తా పానిక్ అటాక్గా మారడంతో కుటుంబసభ్యులు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పని ఒత్తిడి అన్ని చోట్లా ఉంటుందని, ప్రణాళికతో పని చేసుకుంటే ఏ పనైనా సులభమవుతుందని డాక్టర్ కౌన్సెలింగ్ చేసి పంపించాడు. ● ఆదోనికి చెందిన దుస్తుల వ్యాపారి రవిచంద్రకు ఇటీవలే వివాహమైంది. వివాహమైన కొన్నాళ్లకే వేరుకాపురం పెట్టాలని భార్య పోరు పెట్టసాగింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి వేరు కాపురం పెట్టేందుకు రవిచంద్రకు ఇష్టం లేదు. అలాగని ప్రేమగా చూసుకునే భార్య మాటను కాదనలేక లోలోపల సతమతమవుతూ నిద్రలేని రాత్రిళ్లు గడపసాగాడు. ఈ క్రమంలో అతనికి యాంగ్జైటీ, డిప్రెషన్ చుట్టుముట్టాయి. చికిత్స నిమిత్తం వైద్యుని వద్దకు అతన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అతని గురించి తెలుసుకున్న డాక్టర్ కుటుంబసభ్యులందరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే రవిచంద్రకు కొన్ని మందులు సూచించి పంపించాడు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీ చికిత్సకు ప్రతి రోజూ 100 నుంచి 120 మంది దాకా వివిధ మానసిక వ్యాధులతో బాధపడే వారు వస్తున్నారు. అందులో 40 శాతం కొత్తవారు ఉంటున్నారు. చికిత్సకు వచ్చిన వారిలో అధిక శాతం బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకునేవారు ఉంటున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స చేసి పంపిస్తున్నారు. ఈ సమయంలో రోగితో మసలుకోవాల్సిన తీరు గురించి కుటుంబసభ్యులకూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు రంగంలోనూ 25 మంది దాకా మానసిక వైద్యులు ఉన్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 150 నుంచి 200 మంది దాకా చికిత్స కోసం వెళ్తున్నారు. వీరే గాక జనరల్ ఫిజీషియన్లు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టుల వద్దకు వెళ్లే వారిలోనూ 20 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడేవారు ఉంటున్నారు. చికిత్సకు వెళ్లేవారిలో 30 శాతం మంది వృద్ధులు, 5 శాతం మంది పిల్లలు ఉండగా మిగిలిన వారిలో యువత, మధ్యవయస్సు వారు ఉంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. నిద్ర పట్టక..నిద్ర సరిపోక! పలు రకాల కారణాలతో మానవుని శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఫలితంగా మెదడులో కలిగే పలు రసాయన చర్యల ఫలితంగా పలు వ్యాధులకు ఆహ్వానం లభిస్తోంది. ఇందులో బీపీ, షుగర్, గుండెజబ్బులు, థైరాయిడ్ ప్రధానమైనవి. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే షుగర్, థైరాయిడ్ సమస్యలున్న వారి శరీరం తీవ్ర ఒడిదుడుగులకు లోనవుతూ ఉంటుంది. ఒక సమస్యను తగ్గించుకుంటే మరో సమస్య లేచి కూర్చుంటుంది. ఈ క్రమంలో ఈ రెండు సమస్యలున్న వారు తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ క్రమంలో సరైన నిద్రపట్టక, నిద్రసరిపోక, వ్యాధులు నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడేవారి సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. ఈ సమస్యలకు మూలం శారీరక శ్రమ లేకపోవడం, నియంత్రణలేని ఆహారం, ఎక్కువసేపు టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్లను చూడటమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం మానసిక జబ్బులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. వివిధ రకాల కారణాలతో మానసిక సమస్యలు అధికం కావడంతో పాటు ఆసుపత్రిలో మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుందన్న అవగాహన ప్రజల్లో పెరిగింది. ఈ కారణంగా మానసిక పరివర్తనలో ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆల్కహాలు, మత్తు పదార్థాలకు అడిక్షన్ అయిన వారు, బెట్టింగ్లకు బానిసైన వారు తమ వద్దకు ఎక్కువగా వస్తున్నారు. అన్ని రకాల మానసిక సమస్యలకు ఇక్కడ చికిత్స అందిస్తున్నాం. –డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, హెచ్ఓడీ, మానసిక జబ్బుల విభాగం, జీజీహెచ్, కర్నూలు యువత..పెడదోవ ఇటీవల కాలంలో యువతలో మానసిక సమస్యలు ఎక్కువైనట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా ఎక్కువ మంది గాంబ్లింగ్, బెట్టింగ్, మొబైల్ నెట్ అడిక్షన్తో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా యువతలో మొబైల్ గేమింగ్ దురలవాటు ఎక్కువైనట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో సొమటోఫామ్ డిజార్డర్ వేధిస్తున్నట్లు వారు గుర్తించారు. వివిధ రకాల ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బు పోగొట్టుకుని, దానివల్ల అప్పులు చేసి, వాటిని తీర్చలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. సంవత్సరం ఓపీ ఐపీ 2020 10,451 -- 2021 15,942 92 2022 19,475 175 2023 23,992 608 2024 26,803 758 2025 28,062 698 2026 13,127 272 మొత్తం 1,37,852 2,603 పెరుగుతున్న మానసిక ఆందోళన బాధితులు యువతలో సొమటోఫాం డిజార్డర్ కేసులు గాంబ్లింగ్, బెట్టింగ్, నెట్ అడిక్షన్తో సమస్యలు ఇతరుల్లో పలు కారణాలతో ఆందోళన కర్నూలు పెద్దాసుపత్రిలో రోజూ 120 మంది దాకా చికిత్స ప్రైవేటులోనూ రెట్టింపు స్థాయిలో వైద్యం -
నానాజీ.. నాలుక చీరేస్తాం!
● స్థాయి తెలుసుకొని మాట్లాడు ● ఎమ్మెల్సీ ఇసాక్బాషా నంద్యాల(అర్బన్): స్థాయి తెలుసుకుని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడితే బాగుంటుందని, లేదంటే నాలుక చీరేస్తామని ఎమ్మెల్సీ ఇసాక్బాషా హెచ్చరించారు. పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలంటూ వైఎస్సార్సీపీ నాయకులు శనివారం టూటౌన్ ఎస్ఐ కృష్ణారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో విమర్శలు సహజమని, విజ్ఞత మరిచి మాట్లాడితే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల అనుభవం, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓ పార్టీ నాయకుడిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పంతం నానాజీ నోరు పారేసుకోవడం దారుణమన్నారు. ఇలాంటి దుర్మార్గమైన మాటలు పలికే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర స్పాక్ పర్సన్ రవికుమార్, స్టేట్ ఎస్టీసెల్ సెక్రటరీ ఆంజనేయులు, కార్యదర్శి శంకర్నాయక్, వైఎస్సార్సీపీ జిల్లా లీగల్సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్సార్సీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా సెక్రటరీ దేవనగర్ బాషా, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రమణ, అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, నాయకులు సాయిరాంరెడ్డి, మాజీ కౌన్సిలర్లు చింతా శ్రీనివాసులు, మేస చంద్రశేఖర్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్
నంద్యాల: పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డ్లో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదామును జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీళ్లను తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతపై సమీక్షించారు. గోదాము పరిసరాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈవీఎంల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఆర్ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనోహర్ పాల్గొన్నారు. లింక్తో ఎరువులు విక్రయించరాదు ● జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ నంద్యాల: యూరియా, డీఏపీ ఎరువులతో ఎటువంటి లింక్ ప్రొడక్టులను జతచేసి విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆదేశించారు. తన కార్యాలయంలోని వీసీ హాల్లో జిల్లాలోని ఎరువుల తయారీ సంస్థల అధికారులు, హ్యాండ్లింగ్ ఆపరేటర్లతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేక్ పాయింట్ నుంచి ఎరువుల డీలర్లకు సరఫరా చేసే సమయంలో తప్పనిసరిగా జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఎమ్మార్పీ ప్రకారమే డీలర్లు ఎరువులను విక్రయించాలన్నారు. రైతులకు అవసరమైన మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా ఎరువుల సరఫరా చేయాలన్నార. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. ఎరువులను అవసరమైన ప్రాంతాలకు మాత్రమే డీలర్లు సరఫరా చేయాలన్నారు. సమావేశంలో నంద్యాల వ్యవసాయ అధికారి ప్రసాదరావు, మార్క్ఫెడ్ అధికారి హరినాథ్ రెడ్డి, సాంకేతిక వ్యవసాయ అధికారి కల్యాణ్ కుమార్, ఏఈఓ కవిత పాల్గొన్నారు. దేవస్థాన చిరుద్యోగిపై ‘ఇంటెలిజెన్స్’ ఆరా శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో తన హవా కొనసాగిస్తున్న చిరుద్యోగిపై ఇంటెలిజెన్స్ అంతర్గతంగా పూర్తిస్థాయిలో విచారించినట్లు తెలుస్తోంది. ‘సాక్షి’ దినపత్రికలో శనివారం ‘పలుకుబడే పెట్టుబడి..పరిచయాలే ఆదాయం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అసలు ఆ చిరుద్యోగి విధులు ఎక్కడ, ఏమి విధులు నిర్వహిస్తున్నాడు.. శ్రీశైలంలోని కొత్తపేటలో ఇల్లు కట్టుకునేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారు.. చిరుద్యోగి వెనక ఉన్న అధికారులు ఎవరు.. ఇతర విషయాలపై ఇంటలిజెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. పీఓఎస్ పరికరాల బహూకరణ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు 50 పీఓఎస్ పరికరాలను బహూకరించారు. శనివారం దేవస్థాన పరిపాలన భవనంలో బ్యాంకు అధికారులు దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావును కలిసి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. వీటితో భక్తులు ఆయా కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.టోల్గేట్, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం, ప్రసాదాల కౌంటర్లలో వీటిని వినియోగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తిరుపతి జోనల్ హెడ్, జనరల్ మేనేజర్ పత్రి శ్రీనివాసకుమార్, కర్నూలు రీజనల్ హెడ్, అసిస్టెంట్ మేనేజర్ డి.అనిల్కుమార్, శ్రీశైలం బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
రెండు చుక్కలు.. జీవితానికి వెలుగు
● నేడు పల్స్పోలియో కార్యక్రమం ● జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారుల గుర్తింపు గోస్పాడు: చిన్నారులకు రెండే రెండు చుక్కలు పోలియో బారిన పడకుండా చేస్తాయి. నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో తమ పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా పిల్లలకు పుట్టిన వెంటనే ఓరల్ పోలియో వ్యాక్సిన్ను (ఓపీవీ) జీరో డోస్ ఇస్తారు. చిన్నారులకు అంగ వైకల్యం రాకుండా ఉండేందుకు దీన్ని వేస్తారు. అలాగే పిల్లలు పుట్టిన 24 గంటల లోపు హెపటైటిస్–బి జీరో డోస్, బీసీజీ, ఆ తర్వాత ఆరు, పది, 14 వారాలకు, ఆ తర్వాత వివిధ రకాల వ్యాక్సిన్లు వేస్తారు. ఇవన్నీ వారికి ప్రమాదకరమైన జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి. జిల్లాలో 2.38 లక్షల మంది చిన్నారుల గుర్తింపు జిల్లాలో ఐదేళ్ల లోపు ఉన్న 2,38,404 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా అధికారులు గుర్తించారు. ఇందుకోసం 1,313 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పల్స్ పోలియోను పకడ్బందీగా నిర్వహించేందుకు 2,626 టీములను ఏర్పాటు చేశారు. 67 మొబైల్ టీమ్లు, 5,252 మంది సిబ్బంది పనిచేయనున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు ఉండే ప్రదేశాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర చోట్లకు 46 టీమ్లు వెళ్లి, అక్కడ ఉంటే చిన్నారులకు వాక్సిన్ వేస్తాయి. 26 హైరిస్కు ప్రాంతాలను గుర్తించారు. ఆదివారం వ్యాక్సినేషన్తో పాటు సోమ, మంగళ వారాల్లో మాపింగ్ ప్రోగ్రామ్లో భాగంగా హైరిస్క్ ప్రాంతాలను మొబైల్ టీమ్లో కవర్ చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో 51 పీహెచ్సీలు, 16 యూపీహెచ్సీల పరిధిలో నిర్వహంచనున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు పాల్గొంటున్నారు. -
12 గంటల నరకయాతన
● సీఎం పర్యటనతో ప్రయాణికుల అగచాట్లుమహానంది: ఎక్కడో సీఎం పర్యటిస్తుంటే 12 గంటల పాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేయడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్కాపురం జిల్లా కృష్ణంశెట్టిపల్లెలో సంజీవని లబ్ధిదారులతో సమావేశంతో పాటు అభివృద్ధి పనులకు శనివారం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలతో నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు, గుంటూరు, విజయవాడ వెళ్లే వాహనాలతో పాటు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపేయడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. చివరికి అంబులెన్స్ను సైతం పంపించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కిలోమీటర్ల మేర వాహనాలను నిలిపేయడంతో అన్నమో రామచంద్రా, దాహమో దేవా అంటూ ప్రజలు అల్లాడిపోయారు. గుంటూరు వైపు వెళ్లే వారిని మైదుకూరు మీదుగా, శ్రీశైలం వైపు వెళ్లే ప్రయాణికులను ఆత్మకూరు, దోర్నాల మీదుగా పంపించేశారు. -
మల్లన్న సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం న్యాయమూర్తి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయం ఆశీర్వచన మండపంలో న్యాయమూర్తికి వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. – శ్రీశైలం టెంపుల్ -
వైద్యులు లేక.. 108 రాక.. వృద్ధుడి మృతి
హాలహర్వి: సమయానికి 108 అంబులెన్స్ రాక, ఆటోలో అష్టకష్టాలు పడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వైద్యులు లేక ఒక వృద్ధుడు మృతి చెందాడు. హాలహర్వి మండలం పచ్చారపల్లి గ్రామానికి చెందిన బోయ లక్ష్మీనారాయణ (74) శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించగా అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణను ఒక ఆటోలో పచ్చారపల్లి నుంచి హాలహర్వి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కనీసం ఒక్క డాక్టర్ కూడా అందుబాటులోలేరు. డ్యూటీలో ఉండాల్సిన స్టాఫ్నర్స్ భోజనానికి వెళ్లారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న సమయంలో ఆలూరు అంబులెన్స్ హాలహర్వి ఆసుపత్రికి వచ్చింది. దానిలో బాధితుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమయం మించిపోవడంతో పరీక్షించిన ఆలూరు వైద్యులు లక్ష్మీనారాయణ మృతిచెందినట్లు నిర్ధారించారు. హాలహర్వి ఆసుపత్రిలో డాక్టర్లు లేక, 108 రాక వృద్ధుడు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
40 ఏళ్లుగా..
చిత్రంలో సైకిల్పై కనిపిస్తున్న వ్యక్తి పేరు రఘు. స్థానిక కేడీసీసీ బ్యాంక్లో దాదాపు 25 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతని వయస్సు ఇప్పుడు 50 ఏళ్లు కాగా.. 40 ఏళ్ల క్రితం తన నాన్న కొనిచ్చినా సైకిల్ను ఇప్పటికీ ఉపయోగిస్తున్నాడు. ఇతను నివసించే చౌడమ్మ కాలనీలో ఉదయాన్నే ప్రతి ఒక్కరూ అతని సైకిల్ బెల్ చప్పుడు వినాల్సిందే. కుటుంబ అవసరాలకు, బ్యాంకుకు ఇదే సైకిల్పైనే వెళ్తున్నాడు. ఓ వైపు సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరో వైపు పెట్రోల్ ఖర్చులు ఆదా చేస్తున్న రఘు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. – పత్తికొండ -
పరీక్షలు రాయండి!
బకాయి ఫీజు కట్టండి.. ● మెస్ బకాయిలు కడితేనే పరీక్షలకు అనుమతి ● పీజీ నాల్గవ సెమిస్టర్ విద్యార్థులకుఆర్యూ అధికారులు నోటీసులు ● నేటి నుంచి పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ● ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కూటమి ప్రభుత్వం కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. విద్యార్థుల అత్యుత్సాహం, అధికారుల పంతాలు వెరసి విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించడం, సస్పెండ్ చేయడం, కేసులు నమోదు కావడం లాంటి పరిణామాలు వర్సిటీ ప్రతిష్టను మసక బార్చేలా మారుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం వర్సిటీ పునః ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. వర్సిటీ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు మెస్ బిల్లుల బకాయిలు కట్టకపోవడంతో అధికారులు భోజనం పెట్టకుండా నిలిపేశా రు. దీంతో విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉందని, దాని గురించి ఆలోచించకుండా వెనుకబడిన ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులను కక్ష పూరితంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. వర్సి టీ అభివృద్ధికి వాడాల్సిన ఇంటర్నల్ ఫండ్స్ను వర్సిటీ అభివృద్ధికి వాడకుండా ఉద్యోగులకు జీతాలు అయితే చెల్లిస్తారు కానీ విద్యార్థులు మెస్ ఫీజులు కట్టలేదని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్సిటీ అధికారులేమో మెస్ బకాయిలు చెల్లిస్తేనే హాస్టళ్లను నిర్వహించగలమని చెబుతున్నారు. నేటి నుంచి పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు వర్సిటీ పరిధిలో పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ 472 మంది, సప్లిమెంటరీ 33 మంది విద్యార్థులు వర్సిటీ కళాశాల కేంద్రంతో పాటు నంద్యాల, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఆదోని జ్యోతిర్మయి డిగ్రీ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అధికారులు చెబుతున్న బకాయిల లెక్కలు ఇలా.. ● పీజీ రెండో సంవత్సరం విద్యార్థులు చెల్లించాల్సిన బకాయి రూ. 20.70 లక్షలు ● విద్యార్థులు కట్టిన బకాయి రూ. 11.03 లక్షలు ● ఇంకా విద్యార్థులు కట్టాల్సింది రూ. 9.66 లక్షలు ● ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 6.20 లక్షలు ● రీయింబర్స్ పోగా ఇంకా విద్యార్థులు కట్టాల్సింది రూ.2.64 లక్షలు రాయలసీమ యూనివర్సిటీ పరిపాలన భవనం వర్సిటీలో నోటీసుల జారీతో కలకలం హాస్టల్ బకాయిలు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకుంటేనే హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు రాయనిస్తామని వర్సిటీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వని ఏ ఒక్క విద్యార్థికై నా హాల్ టికెట్లు జారీ చేయొద్దని అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నో డ్యూస్ నోటీస్తో వర్సిటీలో కలకలం రేగుతోంది. గత పది రోజుల నుంచి వర్సిటీలో హాస్టళ్ల బకాయిల గురించి ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన ఆరుగురు విద్యార్థులను వర్సిటీ నుంచి సస్పెండ్ చేసి హాస్టల్ నుంచి బహిష్కరించడంతో పాట కేసు నమోదైంది. వీరిలో నలుగురు విద్యార్థులు నాల్గవ సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉంది. గతంలో ఇద్దరు విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించడం, ఒక విద్యార్థిపై కేసు నమోదు కావడం జరిగింది. వీరు ఇద్దరు సైతం పరీక్షలు రాయాల్సి ఉంది. వర్సిటీలో ఇలాంటి పరిణామాలు తరచూ చోటు చేసుకోడం పట్ల విద్యా వేత్తలు, మేధావులు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఎక్కడో ఒక చోటు పుల్స్టాప్ పడకపోతే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు నాశఽనం కావడంతో పాటు వర్సిటీ ప్రతిష్ట దిగజారిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టళ్ల మెస్ బకాయిలు చెల్లించాక నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తేనే హాల్ టికెట్స్ ఇచ్చి పరీక్షలకు అనుమతిస్తాం. కొంత ఫీ రీయింబర్స్ మెంట్ రావాల్సి ఉంది. అది కాక ఇంకా సుమారు రూ. 2 లక్షల వరకు బకాయి చెల్లించాల్సి ఉంది. విద్యార్థులు ఎప్పటికప్పుడు మెస్ బిల్లులు క్లియర్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. హాస్టళ్ల నిర్వహణ సులభమవుతుంది. బకాయిలు పేరుకుపోతే నిర్వహణ కష్టమవుతుంది. కొంత మంది విద్యార్థులు రీయింబర్స్మెంట్ వచ్చినా కట్టకపోవడం బాధాకరం. పరిస్థితులను అర్థం చేసుకొని విద్యార్థులు బకాయిలు చెల్లించి సహకరించాలి. – డాక్టర్ విజయ్కుమార్ నాయుడు, రిజిస్ట్రార్, ఆర్యూ -
పలుకుబడే పెట్టుబడి.. పరిచయాలే ఆదాయం
శ్రీశైలంటెంపుల్: పరమేశ్వరుడి పేరు పెట్టుకున్న ఓ చిరు ఉద్యోగి శ్రీశైల దేవస్థానంలో అక్రమాలకు పాల్పడుతున్నా అడిగేవారు లేరు. అటెండర్ విధులు నిర్వహిస్తున్న ఓ చిరుద్యోగి పేరుకే కాంట్రాక్ట్ ఉద్యోగి కానీ అతనిది అంతా హై రేంజ్ అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తనకు ఉన్న పలుకుబడి, రాజకీయ పరిచయాలతో దేవస్థానానికి ఉన్నతాధికారిగా వచ్చిన అధికారిని ప్రసన్నం చేసుకుని తన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. శ్రీశైల దేవస్థానంలో అటెండర్ స్థాయి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఓ చిరుద్యోగి ఎప్పుడు కూడా తన విధుల నిర్వర్తించకుండా బయట తిరుగుతుంటాడని సమాచారం. ముఖచిత్ర హాజరుకు మాత్రం వస్తాడని తెలుస్తోంది. మిగతా సమయాల్లో దేవస్థాన పరిపాలన కార్యాలయంలో, దర్శనాల కోసం ఆలయంలో తిరుగుతుంటాడని సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సదరు ఉద్యోగిని టోల్గేట్కు బదిలీ చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ ముఖ్య నాయకుడి సతీమణితో సిఫార్స్ చేయించుకోవడంతో కూటమి నేతలు కూడా కంగుతిన్నారు. తన బదిలీని నిలుపుదల చేసుకుని, తనకు నచ్చిన చోట, విధులకు హాజరుకాకపోయిన పట్టించుకోని ఓ విభాగంలో బదిలీ చేయాలని ఇతనే అధికారులకు చాయిస్ ఇవ్వడంతో అతనికి నచ్చిన విభాగానికి బదిలీ చేసినట్లు సమాచారం. తనకు పలుకుబడి ఉన్న ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు శ్రీశైలానికి వస్తే వారికి స్వామి అమ్మవార్ల దర్శనాలు చేయించే పనిలో నిమగ్నం అయి ప్రైవేట్ వ్యాపారం చేస్తాడని సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంలో తనకు పలుకుబడి ఉందని ఎవరికై నా దర్శనం కావాలంటే తనని సంప్రదించాలని చెబుతుంటాడని సమాచారం. శ్రీశైల దేవస్థానంలో ఉన్నతాధికారి తనకు సన్నిహితంగా ఉంటాడని, ముఖ్య అధికారి ఆశీస్సులు తనకు పుష్కలంగాా ఉన్నాయని, తాను ఏది చెబితే అది జరుగుతుందని దేవస్థాన అధికారులను భయబ్రాంతులకు గురిచేస్తాడని తెలుస్తోంది. భవనం అధికారులకు కనిపించదు.. దేవస్థాన కాంట్రాక్ట్ ఉద్యోగి దేవస్థాన స్థలాన్ని కబ్జా చేసి భవనం నిర్మిస్తుంటే అ వైపు కన్నెత్తి కూడా చూసే సాహసం చేయలేని పరిస్థితిలో దేవస్థాన రెవెన్యూ విభాగం ఉంది. అంటే సదరు ఉద్యోగి పవర్ ఎంత ఉందొ ఇట్లే అర్థమవుతుంది. సదరు చిరు ఉద్యోగికి ఉన్నతాధికారి ఆశీస్సులు కూడా ఉండడంతో ఆ ఉద్యోగి నిర్మాణం నిలుపుదల చేసేందుకు రెవెన్యూ విభాగ అధికారులు సాహసించలేక పోయారు. చిన్నపాటి వ్యక్తి ఏదైనా మరమ్మతులు చేసుకుంటే మాత్రం ముప్పతిప్పలు పెట్టే రెవెన్యూ విభాగ అధికారులు భారీ భవంతి నిర్మిస్తుంటే మాత్రం పట్టింకోకపోవడంపై ఆ మర్మం ఆ మల్లన్నకే ఎరుకా..!. ఉన్నతాధికారి అభయం..రెండు సెంట్ల స్థలం కబ్జా శ్రీశైలంలోని కొత్తపేట కాలనీలో సదరు చిరు ఉద్యోగి తన పలుకుబడిని ఉపయోగించి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ దేవస్థాన ఉన్నతాధికారి అభయంతో రెండు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశాడు. కబ్జా చేయడంతో పాటు ఆ స్థలంలో విశాలవంతమైన భవంతిని సైతం నిర్మిస్తున్నాడు. దేవస్థాన ఉన్నతాధికారి నుంచి అనుమతులు ఉన్నాయంటూ అధికారులను బెదిరిస్తూ అధ్యాత్మిక క్షేత్రాన్ని కబ్జాల మయం చేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన నెలవారి వేతనం సుమారు రూ.20 వేలు ఉంటుంది. అయితే అతను మాత్రం సుమారు రూ.20 లక్షల పైబడి భవంతిని నిర్మిస్తుండడంపై స్థానికులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. శ్రీశైల దేవస్థానానికి చెందిన స్థలాన్ని ఎంతటి వారైన ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. దేవస్థానం స్థలంలో ఇంటి నిర్మాణాల కోసం ఎవరికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. తిరుమల తిరుపతి తరహాలోనే శ్రీశైల దేవ స్థానంలో కూడా వైదిక సిబ్బంది మాత్రమే స్థానికంగా ఉంటారు. మిగిలిన ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు సున్నిపెంటకు తరలివెళ్లాల్సిందే. క్షేత్ర పరిధిలో సుమారు 3,600 మందిని సున్నిపెంటకు తరలించే ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఎవరు ఎంతటి నిర్మాణం చేసిన కచ్చితంగా తొలగిస్తాం. – శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
ఆటో, బైక్ ఢీ
ఆదోని రూరల్: గణేకల్–పాండవగల్ గ్రామాల మధ్య ఉన్న పాతరయ్యస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఓ యువకుడికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా, ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్దతుంబళం ఎస్ఐ విద్యశ్రీ తెలిపిన వివరాల మేరకు.. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నెమలికల్లు గోవిందు ప్రయాణికులతో మాధవరం నుంచి ఆదోనికి వస్తుండగా, గణేకల్ గ్రామానికి చెందిన అయ్యన్న బైక్పై పాండవగల్లు వైపు వెళ్తుండగా పాతరయ్య దేవాలయ సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అయ్యన్న(26) తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో డ్రైవర్తో పాటు ముగ్గురు ప్రయాణికులు వన్నూర్బీ, రెహానా, అయసూన్బీలకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యశ్రీ తెలిపారు. మద్యం మత్తులో బస్సు నడుపుతూ.. పత్తికొండ: ఫూటుగా మద్యం సేవించి అతివేగంగా ప్రైవేటు బస్సు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లను పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పత్తికొండ సీఐ జయన్న, ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దీప్తి శిశిర శుక్రవారం రాత్రి పత్తికొండ పట్టణ శివారులోని హోసూరు బైపాస్ దగ్గర బస్సు ఆపి ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...శుక్రవారం సాయంత్రం మంత్రాలయం నుంచి బెంగళూరుకు శ్రీగురు ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. మంత్రాలయం నుంచే వేగంగా, అడ్డదిడ్డంగా బస్సు నడుపుతూ ప్రయాణికులను బెంబేలెత్తించారు. పలువురు ప్రయాణికులు భయపడి వెంటనే 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పత్తికొండ పోలీసులను, ఆదోని ఆర్టీఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో వారు ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెంబడించి పత్తికొండ పట్టణ శివారులో నిలిపివేశారు. అనంతరం బస్సు డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా అతిగా మద్యం తీసుకున్నట్లు వెల్లడైంది. వెంటనే కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. ప్రయాణికులను ఇతర బస్సులలో బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
ఖరీఫ్ ఆశలు కరిగిపోతున్నాయ్..!
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఖరీఫ్ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు రెండు వారాలుగా వర్షాలు కేవలం జల్లులకే పరిమితమయ్యాయి. వర్షాలు తగ్గిపోగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గాలి తీవ్రత ఎక్కువైంది. దీంతో నేలలోని తేమ త్వరగా ఆవిరై పోతోంది. ఈ నెల మొదటి 10 రోజుల్లో ఆశాజనంగా వర్షాలు పడటంతో మొన్నటి వరకు ఖరీఫ్ పంటల సాగు జోరుగా సాగింది. దీంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. అయితే పలు మండలాల్లో అంతంత మాత్రం తేమలో విత్తనం వేయడం వల్ల మొలకలు రాక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ సీజన్ సాధారణ సాగు 4,35,104 హెక్టార్లు ఉండగా... ఇప్పటి వరకు 1,08,349 హెక్టార్లలో సాగు అయ్యాయి. ఇందుల్లో ఒక్క పత్తి పంటనే 95,008 హెక్టార్లలో సాగైంది. జిల్లాలో కంది 5,990 హెక్టార్లు, వేరుశనగ 4,938, ఆముదం 1,970, సజ్జ 285, మొక్కజొన్న 93, కొర్ర 63 హెక్టార్ల ప్రకారం సాగు అయ్యాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల ఈ పంటల పరిస్థితి కూడా ప్రశ్నార్థకమైంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 99 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతంలో 90 శాతం ఈ నెల 10వ తేదీలోపే నమోదైంది. అంటే రెండు వారాలకుపైగా వర్షాలు లేవు. ఎల్నినో ప్రభావం ఆగస్టు వరకు ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమై ఖరీఫ్ సాగుతుందా అనే అనుమానం రైతుల్లో నెలకొంది. పత్తిని కాపాడుకునేదెలా....! పత్తి సాగు చేయాలంటే కనీసం 75 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అప్పుడే విత్తనానికి తగిన తేమ ఉంటుంది. నెల మొదట్లో మోస్తరు వర్షాలు కురవడంతో జిల్లాలో ఒక్క పత్తి పంటనే 95,008 హెక్టార్లలో సాగైంది. అయితే నల్ల రేగడి నేలల్లో అంతంత మాత్రం తేమలోనే పత్తి విత్తనాలు విత్తుకోవడం వల్ల దాదాపు 25 వేల హెక్టార్లలో మొలకలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. 50 శాతం కూడా విత్తనాలు మొలకెత్తకపోవడంతో మళ్లీ విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎల్నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. పత్తి ప్రధానంగా ఆదోని, పెద్దకడుబూరు, మంత్రాలయం, హొళగుంద, దేవనకొండ, ఆస్పరి, మద్దికెర, పత్తికొండ, సీ.బెళగల్, హాలహర్వి, కల్లూరు మండలాల్లో ఎక్కువగా సాగైంది. ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో అనావృష్టి పరిస్థితులు నెలకొనడంతో ఇది వరకు సాగు చేసిన పత్తిని ఎలా కాపాడుకోడం ఎలా.. అనేది ప్రశ్నార్థకమైంది. నీటితడి ఇచ్చేందుకు కాలువల్లో చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది. పత్తి పంటకు బిందు సేద్యం సదుపాయం కల్పించుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు. అయితే సూక్ష్మ సేద్యం మంజూరు ప్రక్రియను ఇంతవరకు చేపట్టకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. -
ప్రపంచంలో కర్నూలుకు గుర్తింపు తీసుకొస్తాం
కర్నూలు (టౌన్): జైరాజ్ ఇస్పాత్ కంపెనీ నుంచి అత్యుత్తమైన ఉక్కును ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే కర్నూలుకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువస్తామని జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే గోయెంకా అన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలోని సాయి శక్తి ఏజెన్సీ, నంద్యాల రోడ్డులోని శ్రీ సా యి బిల్డింగ్ మెటీరియల్స్, నందికొట్కూర్ రోడ్డులోని ఆర్థ ట్రేడర్స్లలో జైరాజ్ ఎటూట్ ఎఫ్ఈ 550డీ టీఎంటీ డీలర్ షిప్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ.. ఉక్కు తయారీ కేంద్రంగా ఉక్కు ప్రపంచ పటంలో కర్నూలు నిలిచిపోతుందన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. త్వరలో ఏటా మిలియన్ టన్నుల వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఉక్కు పారిశ్రామికవేత్త విక్రమ్ సింహా రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు అపారమైన పారిశ్రామిక సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. జిల్లాలో ఒక పెద్ద సమీకృత ఉక్కు తయారీ కేంద్రాన్ని స్థాపించాలన్న జైరాజ్ ఇస్పాత్ నిర్ణయం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు. జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ డైరెక్టర్ రాజశ్రీజైన్, వైస్ ప్రెసిడెంట్ రమ్య కోడాలి, డీలర్లు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. -
కొత్త ట్రాక్టర్ ఇంజిన్ డెలివరీ ఇచ్చేందుకు వస్తూ
పాములపాడు: గుంటూరు నుంచి కొత్త ట్రాక్టర్ ఇంజిన్ డెలివరీ ఇవ్వడానికి వస్తున్న ఓ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సంఘటన శుక్రవారం కర్నూలు – గుంటూరు హైవేలో యర్రగూడరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు సొనాలిక షోరూం నుంచి నాలుగు ట్రాక్టర్ ఇంజిన్లు కర్నూలు జిల్లా ఆదోనిలో డెలివరీ ఇచ్చేందుకు డ్రైవర్లు బయల్దేరారు. మార్గమధ్యలో యర్రగూడూరు సమీపంలో కుక్క అడ్డురావడంతో తప్పించే ప్రయత్నంలో ఓ ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన డ్రైవర్ తిరుపతయ్య(33) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంట వచ్చిన మరో ట్రాక్టర్ ఇంజిన్ డ్రైవర్ మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో పంచనామా నిర్వహించి మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య కోసిగి: మండల కేంద్రం కోసిగి రైల్వే స్టేషన్లో డౌన్ లైన్ ట్రాక్పై గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపిన వివరాల మేరకు.. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉంటుందని, ఎడమ చేతిపై ‘అమ్మ ’అనే పచ్చబొట్టు ఉందన్నారు. ఆకుపచ్చని ఫుల్ టీషర్ట్, గులాబీ, నలుపు, తెలుపు రంగుల పూల చొక్కా, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ముఖం గుర్తు పట్టలేని విధంగా ఉందని, మృతుడి ఆచూకీ తెలిసిన వాళ్లు ఆదో ని రైల్వే స్టేషన్లో పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు -
పంట కాల్వకు అడ్డుకట్ట వేసిన టీడీపీ నాయకులు
● రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ నాయకుడికి వేధింపులు ఆళ్లగడ్డ: టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే పనిగా వారు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నాయకుడిపై కక్షతో ఏకంగా పంటకాల్వకు అడ్డుకట్ట వేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. తన పొలంలోని నీరు కాల్వ ద్వారా వెళ్లకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని రామచంద్రాపురం మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు చౌడయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 70 ఏళ్లుగా ఉన్న పంటకాల్వ ద్వారానే నీరు వెళ్తుందని ఇప్పుడు ‘అది ప్రభుత్వ కాల్వ కాదని మా సొంత పొలాల ద్వారా వెళ్తుంది’ అని అడ్డుకట్ట వేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కాల్వ పూడ్చడంతో ఎస్సీ కాలనీలోని మురుగునీరంతా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కూడా కాల్వను పూడ్చడంతో తన ఐదు ఎకరాల పొలంలో వర్షపు నీరు నిల్వ ఉండి సాగుచేసిన జొన్న పంట దెబ్బతినిందన్నారు. అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. -
భక్తిశ్రద్ధలతో మాతం
● బనగానపల్లెలో షియాల ప్రదర్శన బనగానపల్లె: మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రంను శుక్రవారం బనగానపల్లెలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తరువాత ఏపీలో ఆ స్థాయిలో ఇక్కడ మాతం నిర్వహించడం ప్రత్యేకత. ఊరేగింపులో బనగానపల్లె నవాబు వంశీయులు మీర్ఫజలే అలిఖాన్, ఆయన కుమారుడు గూలంఅలిఖాన్తో పాటు ఎక్కువ సంఖ్యలో షియా మతస్తులు పాల్గొన్నారు.నల్లటి వస్త్రాలు ధరించి భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీరంతా శోకగీతాలు అలపిస్తూ బ్లేడ్లు, చురకత్తులతో ఎదలు, వీపు పైనా మాతం నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు. కొండపేటలోని ఇమాంఖాసీం పీరు జుర్రేరువాగు వద్దకు చేరుకున్న అన్ని పీర్లను అలింగనం చేసుకుంది. పీర్లన్నింటినీ పట్టణంలోని జుర్రేరు వాగులో శుద్ధి చేసి అనంతరం వాటిని తీరిగి చావిళ్లకు తీసుకెళ్లారు. పలువురు దాతలు రస్నా, పానీయాలు, మంచి నీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉరేగింపునకు బనగానపల్లె పరిసర గ్రామాల నుంచి వేలాది మంది హిందూ, ముస్లింలు వచ్చి మాతం పీర్ల నిమజ్జనాన్ని చూశారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ మొహర్రం పదో రోజును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి సంతాప సూచకంగా వ్యాపార దుకాణాలు, సినిమా హాల్స్ మూసివేయగా, వీధిలైట్లను ఆర్పివేశారు. బనగానపల్లె పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పెరిగిన కోడిగుడ్ల ధరలు
గోస్పాడు: కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కో గుడ్డు ధర రూ.8 నుంచి రూ.9 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు ఒకలా, మారు మూల గ్రామాల్లో మరోకంగా ఉంటున్నాయి. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల నుంచి గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. జనవరి దాటాక నెలరోజుల పాటు 30 గుడ్ల ధరలు రూ. 120 నుంచి రూ. 130 వరకు ఉన్నాయి. నిలకడ లేకుండా ప్రతిరోజూ ఒక్కో గుడ్డు ధర 5 పైసల నుంచి 15 పైసల వరకు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం వందగుడ్ల ధర రూ. 675 నుంచి రూ.685 వరకు ఉంది. హైదరాబాద్, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల నుంచి కోళ్లను, గుడ్లను దిగుమతులు చేసుకోవాల్సి వస్తుండటంతో ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పట్టణాల్లో వ్యాపారులు ఒక్కొక్కటి రూ.8 వరకు విక్రయిస్తుండగా మారుమూల ప్రాంతాల్లో ఒక్కొక్క గుడ్డు ధర రూ.9 వరకు ఉంది. పెరిగిన ధరతో హోటళ్ల నిర్వాహకులు, బేకరీల యజమానులు ఆందోళన చెందుతున్నారు. అక్షరాలు నేర్పిన టీచరమ్మకు అ‘పూర్వ’ సన్మానం మహానంది: అక్షరాలు నేర్పి తమను ఉన్నతులు గా తీర్చిదిద్దిన టీచరమ్మకు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. టీచరమ్మ 75వ పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహానంది మండలం ఎంసీ ఫారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1979 నుంచి 1984 వరకు ఉపాధ్యాయురాలు దండు హేమలతమ్మ పనిచేశారు. ఆ సమయంలో ఆమె ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లలను పాఠశాలలో చేర్పించి చదువులు చెప్పారు. ఆమె వద్ద చదువులు నేర్చుకున్నవారిలో జడ్జీలు, ఉపాధ్యాయులు, బ్యాంకు మేనేజర్లు, పశుపరిశోధనా స్థానాల్లో వివిధ హోదాల్లో ఉన్నారు. హేమలతమ్మ 75వ పుట్టినరోజు సందర్భంగా నల్లమలలోని పచ్చర్ల వద్ద ఉన్న జంగిల్ క్యాంపులో కలిసి వేడుకలు వైభవంగా చేశారు. రాజంపేట జిల్లా జడ్జి ప్రవీణ్కుమార్, సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష, వ్యవసాయ కళాశాల ఏఈఓ డక్కా స్వామిదాసు, పశుపరిశోధనా స్థానం లైవ్స్టాక్ సిబ్బంది డక్కా ఎర్రన్న, కోటక్ బ్యాంకులో పనిచేస్తున్న డక్కా మాచర్ల, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్నాయక్, పొదిలి శ్రీనివాస్, న్యాయవాది డక్కా శరత్కుమార్, శ్యాంసన్, తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ఐటీడీఎంలో సర్టిఫికెట్ ప్రోగ్రాం కోర్సులు కర్నూలు సిటీ: ట్రిపుల్ఐటీడీఎంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్ టెక్నాలజీపై ఏఐసీటీఈ–క్యూపీ–పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రాంకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కో–ఆర్డినేటర్ నరేష్ బాబు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో సీఎస్ఈ ఫ్యాకల్టీ బోధన నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశించిన ప్రోగ్రాంకు వచ్చే నెల 5లోపు దర ఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 200 గంటల వ్యవధితో హైబ్రిడ్ విధానంలో(ఆన్లైన్, ప్రత్యక్ష తరగతులు) నిర్వహిస్తామన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో 50 మంది, డ్రోన్ టెక్నాలజీపై 50 మంది అధ్యాపకులకు శిక్షణనిస్తామన్నారు. ప్రత్యక్ష తరగతులకు ఉచిత వసతి కల్పిస్తామన్నారు. ఏఐసీటీఈ క్యూఐపీ పోర్టల్ https://qippg.aicte.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఏఎస్పీ అడ్మిన్గా ఖాదర్బాషా బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా ఖాదర్బాషా శుక్రవారం పదవీ భాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విధులు కొనసాగిస్తున్న అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబును కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా ఖాదర్ బాషాను నంద్యాలకు బదిలీ చేశారు. ఈయన స్వస్థలం అనంతపురం జిల్లా కాగా.. 2012లో డీఎస్పీగా పదవీ భాధ్యతలు స్వీకరించి డోన్, రంపచోడవరం, చిత్తూరు, విజయవాడ పట్ట ణాల్లో డీఎస్పీగా పనిచేశారు. అనంతంతం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది కోనసీమ జిల్లా, ఇంటలిజెన్స్ విభాగాల్లో విధులు నిర్వసి స్తూ నంద్యాల జిల్లాకు బదిలీపై వచ్చారు. -
ఈరన్న సన్నిధిలో పీర్ల దేవుడు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యకేత్రం అయిన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో వందేళ్ల నాటి ఆచారం కొనసాగింది. మొహర్రం పండుగకు ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలోని పీర్ల దేవుడు మొహర్రం పదవ రోజు (సహదత్) తెల్లవారుజామున ఈరన్న స్వామి దేవాలయంలోకి ఊరేగింపుగా చేరుకుంటారు. పీర్ల దేవుడిరాకతో అర్చకులు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ కొనసాగుతోంది. ఏడాదికోసారి జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం ఈ సంప్రదాయం కొనసాగింది. పీర్ల దేవుడు దేవాలయం వద్దకు చేరుకోగానే కోలాహలం మొదలైంది. పీరును ఆలయంలోకి తీసుకెళ్లి అర్చకులు పూజలు చేసి హారతి పట్టారు. సంప్రదాయ వేడుకను భక్తులు కనులారా తిలకించారు. పాతాళగంగలో గుర్తు తెలియని మృతదేహం శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని పాతాళగంగలో శుక్ర వారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహం లభించినట్లు వన్టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల మేరకు.. మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించగా అతని ప్యాంటు జేబులో రేపల్లె – గుంటూరు బస్ టికెట్ లభించిందన్నారు. మృతుని చొక్కాపై డీసెంట్ టైలర్స్ అని లేబుల్ ఉందని, మరే ఇతర ఎటువంటి ఆధారాలు లభించ లేదని తెలిపారు. మృతుడు రేపల్లెకు చెందిన వ్యక్తిగా భావించి, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిస్తే 9121101192, 9121110 1193కు సమాచారం ఇవ్వాలన్నారు. షార్ట్సర్క్యూట్తో కారు దగ్ధం ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని మైనార్టీ కాలనీ రోడ్డు ప్రాంతంలో కె.శ్రావ్య అనే మహిళకి చెందిన టాటా టియాగో ఈవీ కారు షార్ట్సర్క్యూట్తో దగ్ధమైంది. తమ ఇంటి ముందు ఉంచగా శుక్రవారం తెల్లవారుజామున కారులో మంటలు వ్యాపించాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపులో తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. -
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం
ఆదోని అర్బన్: కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ప్లాటును తనకు తెలియకుండా ఇతరులకు అమ్మేసిన వ్యక్తి న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కార్వన్పేటకు చెందిన దంపతులు రామచంద్ర, సంధ్య హెచ్చరించారు. ఈ మేరకు వారు గంగపుత్ర సంఘం సభ్యులతో కలసి అక్రమంగా ప్లాట్ అమ్మేసిన వ్యక్తి ఇంటి ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 2014లో నాన్ లేఅవుట్ కింద ఉన్న 348, 349/3 సర్వేలో ఉన్న మూడున్నర సెంట్ల ప్లాట్ను శివప్రసాద్ నుంచి కొనుగోలు చేశామన్నారు. అప్పటి నుంచి ఆ ప్లాట్లో బండలు పాతుకుని ఉన్నామన్నారు. అయితే 2025లో లే–అవుట్ చేసి తన ప్లాట్ను వేరే వ్యక్తికి అమ్మేయడంపై శివప్రసాద్ను నిలదీశామన్నారు. డబ్బులు కానీ, ప్లాట్ కానీ తిరిగి ఇవ్వాలని కోరితే అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడన్నారు. తనకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదన్నారు. తమకు న్యాయం జరిగేంతవరకు శివప్రసాద్ ఇంటి ముందు ధర్నా కూర్చొంటామని, లేదంటే అక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు గంగపుత్ర సంఘం కులస్తులు కోదండ, ప్రకాష్, శ్రీనివాసులు, దీపక్, వీరేష్, వై.పి.నాగరాజ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లమలలో అడవిదున్న
పెద్దదోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల అభయారణ్యంలోని తుమ్మలబైలు గిరిజన గూడెం సమీపంలో అడవిదున్న స్థానికుల కంటపడింది. దీంతో కొందరు యాత్రికులు తమ సెల్ఫోన్లలో అడవిదున్న సంచరిస్తున్న దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. 1870కు ముందు ఒక్కసారిగా మాయమైన అడవిదున్న 152 ఏళ్ల తరువాత 2022లో నల్లమల అభయారణ్యంలోని గుండ్ల బ్రహ్మేశ్వరం అడవుల్లో కనిపించడం అప్పట్లో చర్చనీయాంశఽమైంది. కొన్నేళ్ల తరువాత మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని పంట పొలాల్లో ప్రత్యక్షమైన అడవిదున్న.. కొన్ని రోజుల అనంతరం నల్లమల అభయారణ్యంలో స్థానికులకు తారసపడింది. ఇండియన్ గౌర్, ఇండియన్ బైసన్గా పిలుచుకునే అడవిదున్నలు నీలగిరి, మధ్యప్రదేశ్ అభయారణ్యాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటిని నల్లమల అభయారణ్యాలకు తరలించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా, అడవిదున్న సంచారంపై ఫారెస్ట్ రేంజి అధికారి హరిని సంప్రదించగా కొద్ది రోజులుగా గుండ్ల బ్రహ్మేశ్వరం, మార్కాపురం ఏరియాలో సంచరించిన అడవిదున్నే తిరిగి నల్లమల అభయారణ్యంలోకి ప్రవేశించి ఉండవచ్చన్నారు. -
కేజీబీవీ విద్యార్థినులకు కుళ్లిన అరటి పండ్లు
గోనెగండ్ల: గోనెగండ్లలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు గురువారం రాత్రి భోజ నం అనంతరం కుళ్లిన అరటి పండ్లను పంపిణీ చేశారు. అవి కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో విద్యార్థిను లు తినకుండా పాఠశాల బయట డబ్బాలో పడేశారు. అయితే మొహర్రం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రు లు గురువారం పాఠశాలకు వెళ్లడం, అక్కడ డబ్బాల లో కుళ్లిన అరటి పండ్లను చూసి జరిగిన విషయం తెలుసుకున్నారు. వీటిని కొందరు ఫొటోలు, వీడియో లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వైరల్ అవుతోంది.గోనెగండ్ల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థి నులకు మెనూ ప్రకారం భోజనం కూడా అందించడం లేదని తెలుస్తోంది. ఈ విషయమై కేజీబీవీ ప్రిన్సిపాల్ విద్యావతిని ప్రశ్నించగా బుధవారం రాత్రి మంచి అర టి పండ్లనే ఇచ్చామన్నారు. అరటి తొక్కలను సమీపంలోని బర్రెల పెంపకందారులు తీసుకెళ్తుండటంతో బ యటి డబ్బాలో పడేస్తామన్నారు. వీటిని బాలికల తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వైరల్ చేశారన్నారు. -
మొక్కజొన్న సాగుపై నీలినీడలు!
ఈ ఏడాది మూడు ఎకరాల సొంత పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాను. సేద్యాలు, విత్తనాలు, కూలీల ఖర్చు రూపంలో ఇప్పటికే రూ. 40 వేల దాక పెట్టుబడి వెచ్చించాను. వర్షాలు కురిస్తేనే పంట చేతికందుతోంది. గత ఏడాది మార్కెట్లో ధర లేకపోవడంతో క్వింటా రూ. 1700లకే అమ్ముకోవాల్సి రావడంతో నష్టపోయాను. – బుజ్జి, పాలసాగరం, ఆళ్లగడ్డ మండలం గతేడాది మొక్కజొన్న సాగుతో తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. పైరు చేతికందే తరుణంలో భారీ వర్షాలు, మార్కెట్లో గిట్టుబాటు ధర లేక పోవడంతో నష్టాలు తప్పలేదు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కజొన్న సాగు చేయడం లేదు. వరి, పచ్చజొన్న, హైటెక్ జొన్న పంటల సాగు చేసేందుకు విత్తనాలు సమకూర్చుకుంటున్నాను. – రాంభూపాల్రెడ్డి, రైతు, కోవెలకుంట్ల కోవెలకుంట్ల: ఎలినినో ప్రభావంతో మొక్కజొన్న సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీజన్ ప్రారంభమై 20 రోజులు కావస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈఏడాది ఖరీఫ్లో 61,615 హెక్టార్లలో సాగు సాధారణ విస్తీర్ణం. ఇందులో జిల్లాలోని పాములపాడు మండలంలో 7,501 హెక్టార్లలో, కొత్తపల్లి మండలంలో 6,461, జూపాడుబంగ్లా మండలంలో 6,195, నందికొట్కూరు మండలంలో 5,529, ఆత్మకూరు మండలంలో 5,085, రుద్రవరం మండలంలో 4,620, మిడుతూరు మండలంలో 4,345, పగిడ్యాల మండలంలో 3,024, బనగానపల్లె మండలంలో 2,980, ఆళ్లగడ్డ మండలంలో 2,705, చాగలమర్రి మండలంలో 2,010 హెక్టార్లలో మొక్కజొన్న సాగు కావాల్సి ఉంది. వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఇప్పటి వరకు ఆయా మండలాల పరిధిలో కేవలం 451 హెక్టార్లకే సాగు పరితమైంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురుస్తాయో లేదో అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల్లో సాధారణ వర్షాపాతానికి 20 నుంచి 40 శాతం లోపే వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటీకీ ప్రభావం అధికంగానే ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షపాత లోటుతో పంటలు సాగు చేయడం అసాధ్యమని, ఈ ఏడాది మొక్కజొన్న సాగు కష్టతరమేనని రైతులు వాపోతున్నారు. ఆగస్టులో సాధారణ వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటికీ అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్నది అంచనా వేయలేకపోతున్నారు. వర్షాభావ పరిస్థితులపై వాతావరణ నిపుణులు పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ రైతులకు భరోసా కల్పించేలా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. గతేడాది వెంటాడిన కష్టాలు.. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 54,150 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 55,408 హెక్టార్లలో సాగైంది. బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర సాగు నీరు వనరులు అందుబాటులో ఉండటంతో లక్ష్యానికి మించి సాగైంది. అయితే విత్తనం వేశాక వరణుడు ముఖం చాటేయడం, పైరు వివిధ దశల్లో తెగుళ్లు, పుప్పడి దశలో వేసవిని తలపించేలా ఎండలు, పంట చేతికందే తరుణంలో అధిక వర్షా లు మొక్కజొన్న రైతులను వెంటాడటంతో రైతులు కుదేలయ్యారు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే 20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడులు పరిమితమయ్యాయి. క్వింటా రూ. 2 వేల లోపే విక్రయించి నష్టాలు మూటగట్టుకున్నారు. సన్నగిల్లుతున్న ఆశలు గతేడాది జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో మే నెలలోనే విస్తారంగా వర్షాలు కురియడంతో రైతులు సకాలంలో మొక్కజొన్న పంట సాగు చేయగలిగారు. జూన్ రెండవ వారానికే 2,700 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది జిల్లాను కరువు, ఎల్నినో ప్రభావంతో వర్షాభావం వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. విత్తన పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సహకారం అందటంలేదు. జిల్లాలో 61,615 హెక్టార్లలో సాగు లక్ష్యం ఇప్పటి వరకు 451 హెక్టార్లకే పరిమితం గతేడాది ఇప్పటికే 2,700 హెక్టార్లలో సాగైన మొక్కజొన్న ఈ ఏడాది వర్షాల్లేక ముందుకు సాగని విత్తన పనులు ఆందోళనలో అన్నదాత -
మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
నంద్యాల (న్యూటౌన్): జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం(బాలురు, బాలికలు) మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ కోఆర్డినేటర్ ఎంఈ గీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టేట్ ర్యాంకు ప్రకారం ఎస్సీ–2 బాలికలకు 267–10,000, ఎస్సీ–3 వారికి 302 – 14,633, ఎస్టీ 947–14,678, బీసీ 02–2999 వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అలాగే ఎస్సీ–2 బాలురు 83–9996, ఎస్సీ–3 వారికి 3–14,504 వరకు, ఎస్టీ 656–14499, బీసీ 10–2500 వరకు మెరిట్ జాబితాలో ఉన్న వారు కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. బాలికలకు ఈ నెల 27న దిన్నెదేవరపాడులో ఉదయం 8.30 గంటలకు, బాలురకు ఈ నెల 29న చిన్నటేకూరులో ఉదయం 8.30 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 08518–295601 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.మెడికల్ బిల్లులు త్వరగా వచ్చేలా కృషి బొమ్మలసత్రం: పోలీస్ సిబ్బందికి పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులు త్వరగా వచ్చేలా కృషి చేయాలని జిల్లా పోలీస్ పరిపాలన విభాగం సిబ్బందికి అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ భవనంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సీనియారిటీ, పదోన్నతలుకు సంబంధించిన రికార్డుల్లో అవకతవకలకు తావులేకుండా చూడాలన్నారు. సిబ్బందికి సకాలంలో రుణాలు పొందేలా అన్ని రకాల పత్రాలు నమోదు చేయాలన్నారు. ఇంక్రిమెంట్లు, మిస్సింగ్ క్రెడిట్ టీఏలు, శాలరీ పెండింగ్ తదితర అంశాలపై దృష్టి నిలపాలని సూచించారు. సమావేశంలో పరిపాలనా విభాగం అధికారులు వీరన్న, ఖాదర్వలి, కవిత, సురేష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. 24 ఏళ్ల తర్వాత రేవనూరులో మొహర్రం కోవెలకుంట్ల: మండలంలోని రేవనూరులో 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది మొహర్రం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో గ్రామంలో రెండు దశాబ్దాలకుపైగా వేడుకలు జరపలేదు. గ్రామస్తులంతా కలసికట్టుగా ఐకమత్యంతో ఈ ఏడాది మొహర్రం జరిపేందుకు ముందుకొచ్చారు. గ్రామంలోని ఉసేన్వలిస్వామి దర్గా సమీపంలోని పీర్ల చావిడిలో బీబీఫాతిమా, ఇమాంకాశీం, పిల్లలపీరు, అలీ అక్బర్, దస్తగిరిస్వామి, హసన్, ఉసేన్ పీర్లను కొలువుంచారు. గురువారం పెద్ద సరిగెత్తును పురస్కరించుని భక్తులు పీర్లకు ఫాతేహాలు సమర్పించారు. పెద్ద సరిగెత్తు సందర్భంగా గ్రామంలోని భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇరవైనాలుగేళ్ల తర్వాత పీర్లపండుగ నిర్వహించటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అపరాల సాగు ఎంతో మేలు బండిఆత్మకూరు: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని నంద్యాల ప్రాంతీయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త మంజునాథ్ సూచించారు. ఈర్నపాడు గ్రామంలో గురువారం మండల వ్యవసాయాధికారి పవన్కుమార్ ఆధ్వర్యంలో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త మంజునాథ్, డీఆర్సీ ఏడీ చెన్నయ్య పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వరికి బదులుగా మినుము, పెసర వంటి అపరాలు, కొర్ర, సజ్జ, రాగి వంటి చిరుధాన్యాలను సాగు చేయడం లాభదాయకమన్నారు. ఆత్మ బీటీఎం ఉమామహేశ్వరి, వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్మయ్య, వసుంధర, నాంకేబాయ్ పాల్గొన్నారు. -
వైభవోపేతం.. గరుడోత్సవం
● నిజరూప దర్శనంతో భక్తులకు కనువిందు చేసిన ప్రహ్లాదవరదుడు ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనృసింహస్వామి జయంతిని పురస్కరించుకుని పెరియాళ్వార్ తిరునక్షత్ర వేడుకులు గురువారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి దిగువ అహోబిలంలో గరుడవాహనంపై అధిష్టించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో భాగంగా జ్యేష్ఠాభిషేకం (అభిద్యేయక అభిషేకం) వైభవంగా ప్రారంభమైంది. తొలుత ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వాములను కొలువుంచారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలతో 108 కలశాలతో కూడిన విశేష తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించి జ్యేష్ఠాభిషేకం పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి స్వయం తిరుమేనితో (నిజరూప) దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. జ్యేష్ఠాభిషేకం విశిష్టత అహోబిలం ఆలయంలో స్వామికి ఏటా మూడురోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. దీనినే అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు. అత్యంత ప్రాచీనమైన ఉత్సవమూర్తులు అభిషేకాలతో అరుగుదలకు లోనవుతాయి. అవిక్షయానికి గురికాకుండా పరిరక్షించేందుకు వాటికి బంగారు కవచాలు తొడుగుతారు. నిత్యాభిషేకాలు ఆ కవచాల మీదుగానే నిర్వహిస్తారు. దీంతో లోపల ఉన్న విగ్రహాలు అరుగుదలకు గురికావు. ఏడాదికి ఒకసారి ఆ కవచాలను తొలగించి, లోపల ఉన్న విగ్రహాలను శుభ్రం చేస్తారు. ఈ సమయంలోనే స్వామి స్వయం తిరుమేని (నిజరూప దర్శనం) తో భక్తులకు దర్శనం ఇస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా స్వామికి రోజుకో కవచం ధరింపజేస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు ముత్యాల కవచంతో స్వామిని అలంకరించారు. రెండో రోజు వజ్రకవచం, మూడో రోజు స్వర్ణకవచం ధరింపజేస్తారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వచ్చేంతవరకు ఈ స్వర్ణకవచంలోనే భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేక పూజలు ప్రధానార్చకుడు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
టీడీపీ నాయకుల మధ్య బాల్య వివాహం
● విచారణ జరుపుతున్న జిల్లా బాలిక సంరక్షణ అధికారి ఓర్వకల్లు: కొమ్ముచెరువు ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం టీడీపీ నాయకుల మధ్య బాల్య వివాహం జరిగింది. పోలీసులు, జిల్లా బాలిక సంరక్షణ అధికారి శారద తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గుడుంబాయి తండాకు చెందిన బాలికకు అదే తండాకు చెందిన ప్రసాద్ నాయక్తో గురువారం వివాహం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కొమ్ముచెరువు దేవాలయంలో వివాహం చేసేందుకు సిద్ధం అవగా.. వధువు తరఫున వచ్చిన సమాచారం మేరకు పోలీసులతో జిల్లా బాలికా సంరక్షణ అధికారిణి శారద అక్కడి చేరుకున్నారు. అప్పటికే టీడీపీ నాయకుల మధ్య వివాహం జరిపించారు. వధూవరులను అధికార పార్టీ నాయకులు ఆశీర్వదించారు. కాగా.. వధువు జనన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా వాస్తవం బయటకు వచ్చింది. పాఠశాలలో ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం బాలికకు 16 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. అయితే ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపలమడుగులో అక్కడి అధికారులు తప్పుడు తేదీతో ఇటీవల జన్మదిన ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇందులో ఏది నిజమైందో అధికారుల పరిశీలనలో తెలియాల్సి ఉంది. -
దినసరి కూలీలతో ఆర్భాటం
డోన్: తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు రాక సందర్భంగా డోన్ రెవెన్యూ, పోలీస్ అధికారులు దినసరి కూలీలతో ఆర్భాటం చేశారు. కోడుమూరు, కర్నూలు నుంచి పలువురు మహిళలను, యవకులను దినసరి కూ లీపై డోన్కు తరలించారు. డోన్ అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద గల షాదీఖానాలో వారికి వసతి ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పలు ప్రైవేట్ వాహనాల్లో వారిని జొన్నగిరికి తరలించారు. వీరికి ప్రతి ఒక్కరికి మైసూర్ గోల్డ్మైన్స్ అనే టీ షర్ట్లను, టోపీలను ఇచ్చారు. సీఎం కార్యక్రమానికి బౌన్సర్లు(రక్షణగా)గా పని చేయాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారిలో కొందరు మాట్లాడుతూ....800 వేతనం ఇస్తూ, భోజన వసతి కల్పిస్తామని చెప్పడంతో సీఎం చంద్రబాబు జొన్నగిరిలో పాల్గొనే సభకు తాము బౌన్సర్లుగా వెళ్లామన్నారు. -
రమణీయం.. సుదర్శనమూర్తి జయంతి ఉత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ సుదర్శన మూర్తి జయంతి వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే దిగువఅహోబిలంలో మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీ సుదర్శన మూర్తులను కొలువుంచారు. నవకలశస్థాపన అనంతరం, పంచామృతాలతో అభిషేకించారు. శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించి ఉత్సవమూర్తలను నూతన పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉభయ దేవురులతో కొలువైన శ్రీ నృసింహస్వామి ఎదురుగా శ్రీ సుదర్శన మూర్తిని కొలువుంచి వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ సదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. సుదర్శన హోమం ప్రత్యేకత సాధారణంగా నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి రోజున సుదర్శన హోమం నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే స్వాతి నక్షత్రానికి ముందు రోజు సుదర్శనమూర్తి జయంతి కావడంతో సుదర్శన హోమం నిర్వహించారు. సుదర్శనమూర్తి ఆరు చేతులతో ఆరు ఆయుధాలు కలిగి ఉండి వైష్ణవ దేవుళ్లను రక్షిస్తుంటారని భక్తుల విశ్వాసం. సుదర్శనమూర్తికి ఆదిదేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కావడంతో ప్రతి స్వాతి వేడుకల్లో సుదర్శన హోమం నిర్వహించడం ఆనవాయితీ. నేడు స్వాతి వేడుకలు స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులకు జేష్టాభిషేక వేడుకలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభిషేకం, అర్చనలు చేస్తారు. అనంతరం గరుడ సేవ కార్యక్రమాలు ఉంటాయి. -
చెంచులకు ఉచిత స్పర్శదర్శనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని బుధవారం చెంచులకు కల్పించారు. శ్రీశైలం ఐటీడీఏ వెలుగు ఏపీడీ పీక్లా నాయక్, ఎన్ఆర్ఈజీఎస్ ప్రాజెక్టు మేనేజర్ కె.జి.నాయక్, హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ బల్మూరి పరమేశ్ ఆధ్వర్యంలో పల్నాడు, నంద్యాల, మార్కాపురం జిల్లాల నుంచి 250 మంది చెంచు భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. అనంతరం చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం చెంచులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. చెంచు భక్తులతో పాటు ట్రస్ట్బోర్డు సభ్యురాలు గుల్లా గంగమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పెట్టుబడి భారమాయె.. మద్దతు కరువాయె!
గత మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. గత ఏడాది రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేయగా వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి. మార్కెట్లో ధర లేకపోవడంతో రూ. 70 వేల మేరకు నష్టపోయాను. ఈ ఏడాది ప్రభుత్వం వరికి పెద్దగా మద్దతు ధర ప్రకటించకపోవడంతో వరి సాగుపై ఆసక్తి లేదు. నాలుగు ఎకరాల పొలంలో పప్పుశనగ సాగు చేయాలనుకుంటున్నాను. ప్రభు త్వాలు రైతుల కష్టాన్ని గుర్తించి మద్దతు ధర పెంచాలి. – ప్రతాప్రెడ్డి, రైతు, భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం ఈ ఏడాది ఖరీఫ్లో నాలుగున్నర ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరా రూ. 40 వేల చొప్పున మరో 4.5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఆరు ఎకరాల్లో మిరప, మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకున్నాను. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో విత్తన పనులు సాగడం లేదు. ఈ ఏడాది ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాకు కేవలం రూ. 10 మాత్రమే పెంచడం విచారకరం. – రమణారెడ్డి, రైతు, చిన్నకొప్పెర్ల, కోవెలకుంట్ల మండలం కోవెలకుంట్ల: గత మూడేళ్ల నుంచి వ్యవసాయం కలసి రాకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకపోయారు. పెరిగిన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సేద్యాలు, కలుపు నివారణ, ఇతర వ్యయసాయ ఖర్చుల కనుగుణంగా మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ పంటల సాగు, పంట దిగుబడులకు మద్దతు ధరకు ఏమాత్రం పొంతన లేకపోవడం అన్నదాతను నిరాశ పరుస్తోంది. ఆయా పంటలకు ప్రతి ఏటా మద్దతు ధర నామమాత్రంగా పెంచుతున్నారే తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి ఈ నెల 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి ప్రకటించిన కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ)సాగు భారంతో పోలిస్తే నామమాత్రంగానే ఉన్నాయి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 2.52 లక్షల హె క్టార్లలో రైతులు వరి, మొక్కజొన్న, మినుము, మిరప, జొన్న, పెసర, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, పొద్దుతిరుగుడు, ఉల్లి, సోయాచిక్కుడు, తదితర పంటలు సాగు చేయాల్సి ఉంది. 2026–27 ఖరీఫ్ సీజన్లోని 10 రకాల పంటలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది ఆయా పంటలకు ప్రకటించిన మద్దతు ధర ఆశాజన కంగా లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో 69,483 హెక్టార్లలో వరి, 61,615 హెక్టార్లలో మొక్కజొన్న, 10,138 హెక్టార్లలో మినుము, 38,102 హెక్టార్లలో కంది, 15,143 హెక్టార్లలో పత్తి, 12,078 హెక్టార్లలో మిరప, 8,694 హెక్టార్లలో వేరుశనగ పంటల సాగు లక్ష్యం. గతేడాది సీజన్కు ముందే భారీ వర్షాలు కురియగా జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో సాగు ముందుకు సాగడం లేదు. వరికి ఏడేళ్లలో పెరిగింది రూ.100 ప్రతి ఏటా పంట ఉత్పత్తులకు కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తున్నా అనుకున్న మేర పెంచకపోవడంతో అన్నదాతకు వ్యవసాయం భారంగా మారుతోంది. కంటి తుడుపుగా ధర పెంచుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు దిగాలు చెందుతున్నారు. 2018–19 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సగటు వరి ధాన్యంపై సరాసరిన రూ. 100 లోపే మాత్రమే పెంచింది. మరోవైపు సాగు ఖర్చులు ఏటా రెట్టింపవుతున్నాయి. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి పంటకు గతేడాదికంటే ఈ ఏడాది కేవలం రూ. 72 ధర పెంచడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడిపై 1.5 రెట్లు మద్దతు ధర కల్పిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఎక్కడా కన్పించడం లేదు. పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో నిల్వ చేసుకునే సదుపాయం లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే పంట ఉత్పత్తులను విక్రయించి నష్టాల ఊబిలో కూరుకపోతున్నారు. పంటరకం 2025–26 2026–27 పెరిగిన ధర వరి సాధారణ 2,369 2,441 72 వరి ఏగ్రేడ్ 2,389 2,461 92 జొన్న హైబ్రీడ్ 3,699 4,023 324 జొన్న మాల్డాంని 3,749 4,073 324 సజ్జలు 2,775 2,900 125 రాగులు 4,886 5,205 319 మొక్కజొన్న 2,400 2,410 10 వేరుశనగ 7,263 7,517 450 పొద్దుతిరుగుడు 7,721 8,343 622 సోయాబీన్ 5,328 5,708 380 నువ్వులు 9,846 10,346 500 పత్తి(మీడియం) 7,710 8,267 577 పత్తి లాంగ్స్టేఫుల్ 8,110 8,667 557 కంటి తుడుపుగా మద్దతు ధర ప్రకటించిన కేంద్రం స్వల్ప పెంపుతోనే సరిపెట్టిన వైనం తడిచి మోపెడవుతున్న సాగు ఖర్చులు అన్నదాతను ఆదుకోని చంద్రబాబు సర్కార్ జిల్లాలో 2.52 లక్షల హెకార్ల ఖరీఫ్ పంటల సాగు లక్ష్యం వరి, మొక్కజొన్న, పంటలకు మద్దతు అంతంతే -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటేష్ శేషాద్రి తెలిపారు. న్నారు. నంద్యాల సబ్జైల్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలు పరిసరాలను, స్నానపు గదులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఖైదీల ఆరోగ్య విషయాలు, వారి నేర ప్రవృత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సుపైన అవగాహన కల్పించారు. ఖైదీలకు ఏదైనా అవసరం ఉంటే 15100కు సమాచారాన్ని ఇవ్వవలసిందిగా ఆయన కోరారు. జైలు సూపరిండెంటెంట్ గురుప్రసాద్రెడ్డి, లోకదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, న్యాయవాది బాలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి మహానంది: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్ధన్ రెడ్డి అన్నారు. గోపవరంలోని మండల పరిషత్ ప్రాధమిక, జిల్లా పరిషత్ పాఠశాలలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానోపాధ్యాయులు, ఉపా ధ్యాయులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్య, వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఎంఈఓలు రామసుబ్బయ్య, విజయ్కుమార్ పాల్గొన్నారు. పదవీ కాలం పొడిగింపు కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు ఉన్న పాలకవర్గంలో ఒకరిని మార్పు చేసింది. ఇప్పటి వరకు ఉన్న పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్న చింతల నాగకుమార్ స్థానంలో తోట రామభూపాల్ నియమితులయ్యారు. పాలకవర్గంలో మిగిలిన వారందరూ యథతథంగా కొనసాగుతారు. కేఎంసీకి 250 ఎంబీబీఎస్ సీట్లు రెన్యూవల్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలోని 250 ఎంబీబీఎస్ సీట్లను నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెన్యూవల్(పునరుద్ధరణ) చేసింది. 45 రోజుల్లోగా కళాశాలలో మౌలిక సదుపాయాలు, వైద్యపరమైన లోపాలను సరిదిద్దుకోవాలని షర తు విధించింది. ఎన్ఎంసీ పరిశీలనలో కళాశాలలో కనీస ప్రమాణాల ప్రకారం కొన్ని లోపాల ను గుర్తించారు. అయినప్పటికీ 2026–27 విద్యాసంవత్సరం కోసం అధ్యాపకుల లభ్యత, భౌతిక సౌకర్యాలను సరిదిద్దడంలో విఫలమైతే సీట్ల తగ్గింపు లేదా ప్రవేశాల నిలిపివేత సహా శిక్షణాత్మక చర్యలు తీసుకోవాల్సి రావచ్చని సూచించింది. అయితే తాము కళాశాలకు సంబంధించి అన్ని వివరాలను ఎన్ఎంసీకి పంపించామని, వారు కేవలం ఆఖరి పేజీని చూసి లోపాలు ఉన్నట్లు పొ రపాటు పడ్డారని, ఈ మేరకు తిరిగి వివరాలను ఆధారాలతో సహా పంపిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ పేర్కొన్నారు. -
పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు
కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జడ్జి కబర్ధి చేతుల మీదుగా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంపై ప్రచురించిన వాల్ పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కబర్ధి మాట్లాడుతూ ఫోక్సో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఉందన్నారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ 15100కు కాల్ చేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, ఎకై ్సజ్ మెజిస్ట్రేట్ అనిల్ కుమార్, లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రవేశాల్లో వెనుక‘బడి’
● ప్రభుత్వ పాఠశాలపై ఆసక్తి చూపని తల్లిదండ్రులు ● పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్న వైనందొర్నిపాడు: కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలలు చతికిల పడుతున్నాయి. నాణ్యమైన విద్యా బోధన, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వ మాటలను పిల్లల తల్లిదండ్రులు నమ్మడం లేదు. దీంతో తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుతున్నారు. గుండుపాపల ఎంపీపీ (మెయిన్), అమ్మిరెడ్డినగరంలోని ఎంపీపీ స్కూళ్లలో ఒకటవ తరగతిలో విద్యార్థులను చేర్పించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఈ పాఠశాలలో మొదటి తరగతిలో చేరుందుకు నలుగురు ఉన్నారు. కానీ తల్లిదండ్రులు అందరిని ప్రైవేటు స్కూళ్లో చేర్పించారు. దీంతో మొదటి తరగతిలో చేరుందుకు ఎవరూ లేరు. దీంతో ఉపాధ్యాయులు ఎలాగోలా ఒకరిని ఒప్పించి అన్సర్ అనే విద్యార్థిని మొదటి తరగతిలో చేర్పించారు. అప్పటికే ఆ విద్యార్థి ఓ ప్రైవేటు స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడ అడ్మిషన్ కావాలంటే ప్రైవేటు స్కూల్లో పేరు తొలగించేందుకు కాస్త ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. అలాగే వెల్దుర్తికి చెందిన మోక్షిత్ను కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకోవడంతో ఆ విద్యార్థి ఒకటవ తరగతిలో చేరారు. అయితే అప్పటికే ఓ ప్రైవేట్ స్కూ ల్లో చేర్పించడంతో ఇక్కడ అడ్మిషన్ కావడం లేదు. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో ఐదు తరగతులకు సంబంధించి 20 మంది విద్యార్థులు ఉన్నారు. 5 తరగతులు.. 9 మంది విద్యార్థులు అమ్మిరెడ్డినగరంలో రోజూ పాతిక మందిని ప్రైవేటు స్కూళ్లకు పంపుతారు. కానీ ఎంపీపీ స్కూల్లో మాత్రం కేవలం 9 మంది మాత్రమే ఉన్నారు. ఒకటవ తరగతిలో ఇద్దరు, రెండులో ఒకరు, మూడులో నలుగురు, ఐదులో ఇద్దరు ఉన్నారు. ఇక నాల్గవ తరగతిలో ఒక్కరూ కూడా లేక పోవడం గమనార్హం. అంతేగాక గ్రామంలో ఏకోపాధ్యాయుడు మస్తాన్వలి విద్యను బోధిస్తున్నాడు. -
వక్ఫ్ ఆస్తుల రక్షణలో మంత్రి ఫరూక్ విఫలం
● వక్ఫ్ బోర్డు స్థలాలను ప్రభుత్వ సంస్థలకు కేటాయించడం దారుణం ● ఎమ్మెల్సీ ఇసాక్బాషానంద్యాల: రాష్ట్ర మంత్రి ఫరూక్ వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ ఇసాక్బాషా విమర్శించారు. పట్టణంలోని శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కౌలూరు గ్రామం ఈద్గాకు చెందిన వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న పది ఎకరాల స్థలాన్ని కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి కేటాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఎన్ఎండీ ఫరూక్ వక్ఫ్ ఆస్తులను రక్షించాల్సింది పోయి, ఇలా కోర్టుల నిర్మాణానికి రాసివ్వడం ముస్లిం సమాజానికి ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. ‘ఒక్కసారి అల్లాకు ఇచ్చిన స్థలాలను కేవలం ముస్లింల ప్రయోజనాల కోసం, దైవకార్యాల కోసమే ఉపయోగించాలని, వాటిని అమ్మడం, బదలాయించడం నిషిద్ధమన్నారు. వక్ఫ్ ఆస్తులను కాపాడలేని మంత్రి ఫరూక్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నూనెపల్లి జామియా మసీదు ఆస్తులను కాపాడామన్నారు. కూటమి ప్రభుత్వం చాబోలు గ్రామం వద్ద ఉన్న వక్ఫ్ బోర్డుకు చెందిన 19 ఎకరాల 14 సెంట్ల భూమిని పోలీస్ హెడ్ క్వార్టర్స్కు కేటాయించడం దారుణమన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు జిల్లాలోని ముస్లిం మైనార్టీలంతా సంఘటితం కావాలన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీ సా, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైఎస్సార్సీపీ జనరల్ సెక్రెటరీ దేవనగర్ బాషా వైఎస్సార్సీపీ ముస్లిం నాయకులు సలముల్లా, గన్నీ కరీం,ఎం.గౌస్, తదితరులు పాల్గొన్నారు. -
దొంగలు దొరికారు!
● 195 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం బనగానపల్లె: అవుకు పోలీసు స్టేషన్ పరిధిలోని అన్నవరం, సింగనపల్లి, లింగంబోడు గ్రామాల్లో ఇటీవల వరుస చోరీలకు పాల్పడిన దొంగలు దొరికారు. మంగళవారం సాయంత్రం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ.26 లక్షల విలువైన 195 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన తోక మోసా, మిద్దె హుస్సేన్ వలి, తెలుగు వెంకటేశ్వర్లు చెడు వ్యసనాలకు బానిసై, ఈజీగా డబ్బు సంపాదనకు చోరీలను మార్గంగా ఎంచుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పగటిపూట తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడ్డారు. ఇంటి యజమానులు పని మీద బయటికి వెళ్లే సమయంలో ఇంటి బయట, గూళ్లలో ఉంచిన తాళం చెవులు తీసుకుని ఇళ్లలోకి ప్రవేశించి చోరీలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అవుకు ఎస్ఐ అశోక్, పోలీ సు సిబ్బంది మంగళవారం స్థానిక సాయిబాబా ఆలయం సమీపంలో వాహ నాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన పై ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల దొంగలు పట్టుబడ్డారు. చోరీ కేసులను త్వరితగతిన ఛేదించిన సీఐ మంజునాథ్రెడ్డి, ఎస్ఐ అశోక్, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్తో పాటు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. జిల్లాలో మూడు రోజులు వర్షాలు ఎమ్మిగనూరు సెంటల్ర్: జిల్లాలో ఈ నెల 24, 26, 27వ తేదీల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్రచౌదరి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ వయన్నార్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. -
జలధార పనుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు
● మైనర్ ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం ● ఆటోలో ప్రయాణించి చెరువుకు వద్దకు చేరుకున్న వైనం జూపాడుబంగ్లా: జలధార పనుల్లో నిర్లక్ష్యం సహించేది లేదని కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. రూ.60 లక్షల నిధులతో తంగ డంచ చెరువులో జరుగుతున్న జలధార పనులను మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు. చెరువు వద్దకు కారు వెళ్లేందుకు అవకాశం లేకపోవటంతో కలెక్టర్ మూడు కిలో మీటర్ల మేర ఆటోలో ప్రయాణించి చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువు విస్తీర్ణం, ఆయకట్టు, ఎస్టిమేషన్ వివరాల గురించి మైనర్ ఇరిగేషన్ అధికారులు సమాధానం చెప్పకపోవటంతో డీఈ మనోహర్, ఏఈ చిన్నమస్తాన్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెరువుకు సంబంధించిన సమగ్ర వివరాలతో నంద్యాలకు వచ్చి తనను కలవాలని ఆదేశించారు. జూపాడుబంగ్లా ఎత్తిపోతల పథకం మోటార్లు మరమ్మతులకు గురవ్వటంతో పొలాలకు సాగునీరు అందక ఇబ్బందులకు గురవుతున్నట్లు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో మోటార్ల మరమ్మతులకు రూ.10 లక్షలు, ఆయకట్టు రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాల వద్దకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ముందుగా కస్తూర్బా, గురుకుల పాఠశాలలను సందర్శించి ఎస్ఓ యశోద, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తిలకు పలు సూచనలు చేశారు. పాఠశాల ప్రహరీ వెంట మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ శ్రీధర్రెడ్డి, ఎంపీడీఓ గోపికృష్ణ, ఏఈ నాగేంద్రబాబు, ఏపీఓ రేష్మ పాల్గొన్నారు. -
దేవస్థానం చైర్మన్ ఆకస్మిక తనిఖీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రమేష్నాయుడు మంగళవారం కల్యాణకట్ట, కౌంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్యాణకట్టలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్ద్య చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది అందరూ కూడా సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించారు. భక్తులతో మర్యాదగా మెలగాలని క్షురకులకు, కౌంటర్ సిబ్బందికి సూచించారు. అలాగే భక్తులతో ముఖాముఖిగా మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి ● ఐటీడీఏ పీఓ పీవీఎస్ నాయుడు ఆత్మకూరు: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఐటీడీఏ పీఓ పీవీఎస్ నాయుడు సూచించారు. మండలంలోని బైర్లూటీ చెంచుగూడెంలోని ఆశ్రమ వసతి గృహాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల రిజిస్టర్ను పరిశీలించారు. విధుల్లో లేకున్నా సంతకం చేసి వెళ్లిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీరాములకు మెమో జారీ చేస్తున్నట్లు చెప్పారు. హాస్టల్లో వసతులు, భోజనం తదితర వివరాల గురించి విద్యా ర్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఉపాధ్యాయులు అనునిత్యం విద్యార్థులు చదువుకునేలా చూడాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం కరివేన గ్రామంలోని పీఎంవీడీవీకే (ప్రధాన మంత్రి వన్ ధన్ వికాస్ యోజన) హబ్ను సందర్శించి అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. ఆయన వెంట వెలుగు ఏపీడీ ఇట్లా నాయక్, సిబ్బంది ఉన్నారు. కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మార్చి నెలలో నిర్వహించిన పీజీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామన్నారు. ఫలితాలు https://rayala seemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి మొదటి సెమిస్టర్ పరీక్షలకు 463 మంది హాజరు కాగా 434 మంది ఉత్తీర్ణులయ్యారరు. సప్లిమెంటరీ పరీక్షలకు మొదటి సెమిస్టర్ పరీక్షలకు 48 మంది హాజరు కాగా 41 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. 916 పింఛన్ల కోత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో జూన్ నెల 4,45,769 పింఛన్లు ఉండగా.. జూలైలో 4,44,853కు తగ్గిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే 916 పింఛన్లపై కోతపడింది. ప్రతినెలా పింఛన్లలో కోత పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలో కొత్త పింఛను ఒక్కటీ ఇవ్వకపోవడం గమనార్హం. జూలై నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.194.43 కోట్లు బ్యాంకుల వారీగా నిధులు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 29 నుంచి సహకార వారోత్సవాలు కర్నూలు(అగ్రికల్చర్): అంతర్జాతీయ సహకార వారోత్సవాలు ఈ నెల 29 నుంచి జూలై 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలనే విషయమై సహకార శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్రంలో ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటై జూలై 6వ తేదీ నాటికి ఆరేళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రతి జిల్లాలో వరల్డ్ లార్జెస్ట్ గ్రైన్ స్టోరేజీ ప్లాన్ స్కీమ్ కింద రూ.2 కోట్లతో గోదాము నిర్మించనున్నారు. కల్లూరు మండలం పర్ల గ్రామంలో కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో 2,900 టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణానికి జూలై 6న భూమి పూజ నిర్వహించనున్నారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
డోన్ టౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్పాల్ ప్రసాద్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. itiadmissions.ap.gov.in/iti అనే వెబ్ సైట్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకుని ప్రింట్ కాపీని తీసుకోని దీనితో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల్లో జూలై 2 తేదీ లోపు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నా రు. వెరిఫికేషన్ చేయించకపోతే మెరిట్ లిస్ట్లో పేర్లు చేర్చబోమన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జర్నలిస్టు పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ నంద్యాల(అర్బన్): జిల్లాలోని ప్రైవేటు, కార్పొ రేట్ పాఠశాలల్లో అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తున్నా మని జిల్లా కలెక్టర్ రాజకుమారి సోమవారం తెలిపారు. ఈ మేరకు రాయితీకి సంబంధించిన జీవో కాపీని ఆమె జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. అహర్నిశలు సమాజ బాగు కోసం శ్రమించే జర్నలిస్టుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో చేరికకు రాయితీని ప్రకటించామన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్కు 128 ఫిర్యాదులు బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజల నుంచి 128 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు వివిధ సమస్యలను తనకు తెలియజేశారన్నారు. చట్టపరిధిలో సమస్యల ను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లా డి పరిష్కారం చూపామన్నారు. మిగతా సమస్యలను ఆయా స్టేషన్ల అధికారులకు బదీ లీ చేశామని, నిర్ణీత గడువులోగా సమస్యను పరిష్కరించేలా ఆదేశించామన్నారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలి నంద్యాల(వ్యవసాయం): రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీజీబీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం క్రెడిట్ ఔట్రీచ్ ప్రోగ్రాం ద్వారా రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.27.25 కోట్ల విలువ చేసే రుణాలను ఖాతాదారులకు అందజేశారు. అనంతరం ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తమ బ్యాంకు ద్వారా గృహ, వాహన, వ్యక్తిగత, విద్యా, ఆస్తి తనాఖా రుణాలు అతి తక్కువ వడ్డీతో మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ అధికారి సుధాకర్, స్ఫూర్తి కిరణ్, అమిత్ కుమార్, శేషసాయి కిరణ్, సృజన్ సీనియర్ మేనేజర్లు రమణయ్య, శేఖర్, బ్రాంచ్ మేనేజ ర్లు రీజన్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీనియర్ సహాయకులుగా ముగ్గురికి పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో జూనియర్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించారు. సోమవారం స్థానిక జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ముగ్గురు సీనియర్ సహాయకులకు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి పోస్టింగ్ ఆర్డర్స్ను అందించారు. పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పదోన్నతి పొందిన వారిలో పీ మల్లికార్జున రావునును ఆదోని ఎంపీపీ, డీ కిరణ్కుమార్ను పీఆర్ క్యూసీ సబ్ డివిజన్ కర్నూలు, డీ మౌలాలిని ఎంపీపీ పాణ్యంకు నియమించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. -
నాణ్యత ‘పగుళ్లు’బడి నవ్వుతోంది!
● నాసిరకంగా ఎస్సారెమ్సీ లైనింగ్ పనులు ● కనిపించని పర్యవేక్షణ అధికారులు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ వరకు చేపట్టిన లైనింగ్ పనుల్లో నాణ్యత మాయమవుతోంది. ఓ వైపు పనులు జరుగుతుండగా.. మరో వైపు పగళ్లు దర్శనమిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు సంక్షేమం దృష్ట్యా కృష్ణానది వరద సమయంలో నెల్లూరు, మద్రాసు తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం వాటా నీటిని సకాలంలో వేగంగా తరలించాలనే లక్ష్యంతో ఎస్సారెమ్సీ (శ్రీశైలం రైట్బ్రాంచ్ మెయిన్ కెనాల్) లైనింగ్ పనులు చేపట్టారు. ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నీటి విడుదల సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80వేలకు పెంచారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచర్ల వరకు 16.5 కిలో మీటర్ల మేర కుడి, ఎడమ గట్లకు లైనింగ్ చేయటంతో పాటు నీరు దిగువకు వేగంగా ప్రవహించేలా కాల్వ అడుగున కాంక్రీట్ బెడ్డు నిర్మించతల పెట్టారు. 2020లో రూ.1,017. 22 కోట్లతో నిర్మాణం పనులను పీఎన్సీ కంపెనీ వారు దక్కించుకున్నారు. పనులను దక్కించుకున్న ఈ కంపెనీ గుడ్విల్ తీసుకుని వ్యామ్ కంపెనీకి అప్పగించింది. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పనులను వ్యామ్ కంపెనీ నత్తనడకన చేపడుతోంది. ఆరేళ్లు గడిచినా నేటికీ పనులు పూర్తిచేయకపోవటం గమనార్హం. జరుగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటంతో ఓ వైపు పనులు చేస్తుండగానే మరో వైపు చేసిన లైనింగ్ పనులు బీటలు వారి కనిపిస్తోంది. దీంతో పనుల నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పదికాలాల పాటు ఉండాల్సిన ఎస్సార్మ్సీ కాల్వ లైనింగ్ను నాణ్యతగా నిర్మించాల్సిన అవసరం ఉంది. -
కష్టం.. నష్టం
వాన జాడ లేక రైతుల్లో గుబులు మొదలైంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు కాస్త ముందస్తుగా మిర్చి సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. మండల కేంద్రమైన రుద్రవరం, రెడ్డిపల్లె, ఆర్.నాగులవరం, ఆలమూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు మే నెలలో మిర్చి సాగు చేశారు. ప్రకాశం జిల్లా నుంచి మిర్చి నారు కొనుగోలు చేసి దాదాపు 600 ఎకరాల్లో నాటించారు. 40 రోజులకు పూత, పిందె రావాల్సి ఉంది. అయితే వర్షాలు సరిగ్గా కురవక పోవడంతో మొక్కల్లో ఎదుగుదల తగ్గింది. అలాగే ఎండలు అధికంగా ఉండటంతో ఆ మొక్కలకు బింగి తెగులు సోకింది. దీంతో మిర్చి మొక్కల ఆకులు ముడతలుగా చుట్టుకుని అలాగే ఉంటుండటంతో రైతులు చేసేదిలేక ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఒక్కో ఎకరానికి దాదాపు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రైతుల చేతికి చిల్లి గవ్వ కూడా దిగుబడి రూపంలో రాకుండానే పూర్తిగా నష్టపోతున్నారు. కౌలు రైతులు మరింత అధికంగా నష్టాలు చవి చూస్తున్నారు. రైతులు మిర్చి పైరును తొలగించి మొక్క జొన్న సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. – రుద్రవరం -
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ఈనెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల స్వీకరణ అనంతరం పల్స్ పోలియో కార్యక్రమం, డయేరియా నివారణ చర్యలు, వర్షాకాలంలో తలెత్తే అంటువ్యాధుల నియంత్రణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ డీఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమ వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశం పోలియో రహితంగా ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా వంటి దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్నందున ప్రతి సంవత్సరం ప్రత్యేక రక్షణ చర్యగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28వ తేదీన 90 నుంచి 95 శాతం మంది పిల్లలను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అనంతరం జూన్ 29, 30 తేదీలలో ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు అందజేస్తామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డయేరియా నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల్లో డైరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కి ంచగా నగదు రూపేణా రూ.5,45,55, 035 లభించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం దేవస్థానం అలంకార మండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు. గత 27 రోజులలో భక్తులు ఈ కానుకలను సమర్పించారు. అలాగే బంగారం 127 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి–3కేజీల 680 గ్రాములతో పాటు కొంత విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు. అలాగే 93రోజుల్లో అన్నదాన భవనంలోని అన్నప్రసాద వితరణ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.8,80,396 లభించిందన్నారు. -
పేదల సొంతింటి కల ధ్వంసం!
పొలంగా మారిన లే– అవుట్కుప్పగా పడిన పాట్ల సరిహద్దు రాళ్లురుద్రవరం: అధికార దర్పంతో రెండేళ్ల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు బరి తెగిస్తున్నారు. కొందరు వాగులు, వంకలు, చెరువులను చెరబట్టి ప్రకృతి సంపదను కొల్లగొట్టి రూ. లక్షలు సంపాదిస్తున్నారు. మరి కొందరు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను ఆక్రమించి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకొందరు ఏకంగా ప్రభుత్వ లేఅవుట్లను ఆక్రమించి పొలాలుగా మార్చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆయా శాఖలకు చెందిన అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా రుద్రవరం మండలంలోని హరినగరం గ్రామంలో గతంలో గిరిజనులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఓ టీడీపీ నేత ఆక్రమించేశాడు. రుద్రవరం మండలం హరినగరం వద్ద ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం లే – అవుట్గా మార్చింది. అందులో రోడ్లు వేసి ప్లాట్లుగా విభజించి నంబర్లతో కూడిన రాళ్లను పాతారు. ఆ లే – అవుట్లో హరినగరానికి చెందిన గిరిజనులతో పాటు చిత్రేనిపల్లె, నర్సాపురం గ్రామాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేసింది. అనుకున్నట్లుగానే అప్పట్లో ముందుగా హరినగరంలోని గిరిజనులు 20 మందికి పట్టాలు కూడా ఇచ్చారు. మిగిలిన వారికి కూడా ఇచ్చేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సాగుతుండగా పలు అనివార్య కారణాలతో లే –అవుట్లో గృహ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఇంతలో సాధారణ ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో పనులు నిలిచి పోయాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్క గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ప్రభుత్వ లే –అవుట్పై కన్నేశాడు. గత కొద్ది రోజుల నుంచి అక్కడ రాళ్లను తొలగించి పక్కనే కుప్పగా పోశాడు. ట్రాక్టరు, డోజర్తో ముళ్ల కంప, పిచ్చి మొక్కలు వంటి వాటిని తొలగించాడు. రోడ్లను చదును చేసి పొలంగా మార్చేశాడు. ఇదేమని పలువురు లబ్ధిదారులు అడిగినప్పటికీ వారిని లెక్క చేయలేదు. వర్షం కురవగానే విత్తు విత్తేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఇంత సాగుతున్నా రెవెన్యూ శాఖ సిబ్బంది, ఉద్యోగులు తమకేమి తెలియదన్నట్లు నిమ్మకుండి పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై తహసీల్దారు నాగవీణను వివరణ కోరగా వీఆర్వోతో వివరాలు సేకరించి ఆక్రమణలు అడ్డుకుంటామన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాకు ఇల్లు నిర్మించేందుకు స్థలం కేటాయిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నాయకులు కబ్జా చేస్తున్నా రు. సొంత ఇళ్లులేక, కట్టుకునేందుకు స్థలం లేక గతంలో ఎంతో ఇబ్బంది పడ్డాం. గత ప్రభుత్వ హయాంలో స్థలం దక్కిందని సంతోష పడ్డాను. కూటమి ప్రభుత్వం రెండేళ్లు గడిచినా ఒక్క గృహం కూడా మంజూరు చేయలేదు. ఆ పార్టీ నాయకుడు ఏకంగా లే – అవుట్ స్థలాన్నే కబ్జా చేశాడు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – ముత్యాలమ్మ, లబ్ధిదారు, హరినగరం ప్రభుత్వ లే – అవుట్ను ఆక్రమించిన టీడీపీ నేత పొలంగా మారిన గిరిజనుల ఇళ్ల ప్లాట్లు పట్టించుకోని రెవెన్యూ అధికారులు -
గతంలో పంపిణీ విధానమే మేలు
గతంలో రైతుల నుంచి పాసుపుస్తకం జిరాక్స్ ప్రతిని తీసుకుని వివరాలు రాసుకుని టోకన్ ఇచ్చేవారు. రైతులకు సమయం ఎంతో ఆదా అయ్యేది. ప్రస్తుతం రైతుసేవా కేంద్రాలకు వచ్చి పాసుపుస్తకం, ఆధార్కార్డు సమర్పించి వివరాలను నమోదు చేయించుకుని, మూడు సార్లు వచ్చిన ఓటీపీలను చెప్పాల్సి వస్తుంది. దీంతో రైతులు ఉదయం నుంచి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. – మహానంది, రైతు నేను 50 ఎకరాల్లో సోయాబీన్, ఆరు ఎకరాల్లో మొక్కజొన్న వేశా. ఎకరాకు డీఏపీ ఒక బస్తా ఇస్తే ఏరకంగా పంట సాగు చేయాలి? నాకున్న సొంత భూమికి ఇచ్చారు. కౌలుకు వేసుకున్న 20 ఎకరాల పొలానికి ఎరువులు ఎట్లా? పొలం కౌలుకు ఇచ్చిన వారు ఇక్కడ లేరు. వారు ఇక్కడకు వచ్చి యాప్తో వేలిముద్ర వేసి ఎరువులు ఇప్పించడం కుదురుతుందా? ఇప్పుడు నాకు సోయాబీన్కు డీఏపీ, యూరియా కావాలి. పంటను పండించాలా, నాశనం చేసుకోవాలా? ఇలాగైతే వ్యవసాయం చేయలేం! – శ్రీనివాసులు, రైతు పాములపాడు నేను నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. కొన్ని రోజులుగా డీలర్లు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదు. వరి మడులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికై నా యూరియా అందుబాటులో ఉంటే బాగుంటుంది. యూరియా అత్యవసరమవుతుంది. రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని చెబుతున్నారు. కానీ మాకు యాప్ తెలియదు. ప్రభుత్వమే అర్హులైన రైతులందరికీ యూరియా పంపిణీ చేయాలి. – కురవ భీరప్ప, రైతు, జొహరాపురం -
ఇప్పటి వరకు ఇవ్వలేదు
ఈ ఏడాది ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నా. మిరప, ఉల్లి సాగు చేయాలని పొలంలోనే నారు పోశా. మొక్కలు నాటుకొచ్చాయి కానీ అవసరమైన ఎరువులు లేవు. దీంతో నాటు వేయడం ఆపేశాను. రైతుకు ఇంట్లో ఎరువులు ఉంటేనే పంటలు సాగే చేసే ధైర్యం వస్తుంది. రైతుభరోసా కేంద్రాల దగ్గర సారోళ్ల అడిగితే ఎరువులు వస్తాయని చెప్పినారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ముఖ్యంగా యూరియా చాలా అవసరం. – రామాంజనేయులు, రైతు, పత్తికొండ చాలా ఏళ్లుగా పొలాలను కౌలు తీసుకుని పంటలను సాగు చేస్తున్నా. ఈ ఏడాది ఎరువులను తీసుకునేందుకు వీలుకుదరడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఎరువులు లేకుండా పంటలను ఎలా సాగు చేసుకోవాలి? ఇకనైనా ప్రభుత్వం తీరు మార్చుకుని రైతులందరికీ అవసరమైన ఎరువులను అందజేయాలి. – వెంకటేష్, కౌలు రైతు, సి.బెళగల్ పంటల సాగుకు సత్తువ ఎరువులు చాలా అవసరం. అలాంటి ఎరువులు ఏవీ అందుబాటులో లేవు. గత ప్రభుత్వంలో ఊర్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలోనే యూరియా, సత్తువ(డీఏపీ) ఎరువులు, పురుగు నివారణ మందులు అన్నీ ఆర్బీకేలో అందుబాటులో ఉండేవి. ఈ ప్రభుత్వ వచ్చాక ఆర్బీకేని ఆర్ఎస్కేగా పేరు మార్చారు తప్ప ప్రయోజనమేమీలేదు. ఇప్పుడు యూరియా తప్ప ఏవీ లేవు. ఎరువులు తెచ్చుకోవాలంటే డోన్కు 30 కిలోమీటర్లు, పత్తికొండకు 28 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. డోన్ నుంచి బస్తాకు ఆటో బాడుగ రూ.55. పత్తికొండ నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. ఆర్ఎస్కేల్లో విలువైన కియోస్క్ యంత్రాలు కూడా మూలనపడ్డాయి. ఏవీ పనిచేయడం లేదు. – ఈశ్వరరెడ్డి, రైతు, బొందిమడుగుల -
‘సర్ౖ’పె ఫిర్యాదు చేశారని..
● వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడిడోన్: నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే గ్రామల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సర్ సర్వేలో టీడీపీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. డోన్ మండలం కనపకుంట గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ కళ్యాణి ముఖ్య అనుచరులైన వెంకటేష్, భరత్ ఇంటిపై ఆదివారం ఉదయం టీడీపీ నాయకులు మధుసూదన్రెడ్డి, ఆయన కుమారుడు మాధవరెడ్డితో పాటు మరికొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ ముఖ్య కార్యకర్త వెంకటేష్కు రాయి తగిలి తల వెనుక భాగంలో తీవ్ర గాయమైంది. డోన్ ప్రభుత్వాసుప్రతిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన భరత్ డోన్రూరల్ ఎస్ఐ మమతకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం.. ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా గ్రామ టీడీపీ నాయకులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ ఆసిస్టెంట్ మాధవరెడ్డి గ్రామంలో బీఎల్ఓ వెంట తిరుగుతున్నారని, ఈ మేరకు ఫిర్యాదు చేశారనే అక్కసుతో వెంకటేష్, భరత్పై దాడి జరిగిందని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ జాకీర్ హుసేన్, పార్టీ నాయకుడు వంశీ ఆదివారం స్థానిక రూరల్ స్టేషన్కు వెళ్లారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. నిందితులను స్వేచ్ఛగా వదిలేసి గాయపడిన వారికి ఆసుప్రతిలో చికిత్స చేయించకుండా పోలీస్స్టేషన్లో ఉంచడం ఏమిటని ఎస్ఐ మమతను వారు నిలదీశారు. విచారణ కోసం పిలిపించామని, నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో యోగా కీలకం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యోగా పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఆవరణలో యోగాచార్యుల ఆధ్వర్యంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన కార్యక్రమాలను సమష్టిగా నిర్వహిస్తూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించు కుని జిల్లాలో గత 14 రోజులుగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించామన్నారు. వృత్తి పరమైన, వ్యక్తిగత జీవితాల్లో సమతుల్యత సాధించేందుకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,700 కేంద్రాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో సుమారు 4 లక్షల మంది ప్రజలు భాగస్వాములై యోగాపై తమ ఆసక్తిని చాటుకున్నారన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమన్నారు. విద్యార్థులు రోజుకు 20 నుంచి 30 నిమిషాలు యోగా సాధన చేస్తే తమ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలరని చెప్పారు. ఆయుష్ యోగా థెరపిస్ట్ తదితర యోగాసనాలను వేసి ప్రాముఖ్యతను వివరించారు. పాణ్యం మండలం విద్యార్థులు సమన్వయ యోగా ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 22వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆర్ఎంపీ అదృశ్యం బొమ్మలసత్రం: పట్టణంలోని స్థానిక విశ్వనగర్ వీధికి చెందిన ఆర్ఎంపీ నాగేశ్వరరావు గత వారం రోజులుగా అదృశ్యమైనట్లు పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. స్థానికుల వివరాల మేరకు గత 30 ఏళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే వారం రోజులుగా తన కుటుంబ సభ్యులతో సహా కనిపించడం లేదు. నాగేశ్వరరావు పట్టణంలోని కొందరి వద్ద రూ. 10 కోట్ల మేర అప్పు చేసి కనిపించకుండా వెళ్లాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఇంత వరకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారు. భక్తులకు బంకర్ బెడ్లు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లికార్జున, గణేశ సదన్ల వద్ద భక్తుల సౌకర్యార్థం బంకర్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు ట్రస్ట్బోర్డు నిర్ణయించినట్లు దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పొతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ట్రస్ట్బోర్డు చైర్మన్ రమేష్నాయుడు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 45 అంశాలు చర్చించగా 34 అంశాలు ఆమోదించారు. ఏడు అంశాలు వాయిదా, 4 అంశాలు తిరస్కరించారు. క్షేత్ర పరిధిలో పార్కింగ్ ప్రదేశాలు, ఆరుబయలు ప్రదేశాలలో హైమాస్ట్ టవర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్షేత్ర పరిధిలో పలు ప్రదేశాలలో ఎలక్ట్రికల్ వెహికల్ చార్జింగ్ సదుపాయాన్ని కల్పించాలని తీర్మానించారు. సమావేశంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, డీసీ చంద్రశేఖర్, ఏఈవోలు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం ఓర్వకల్లు: కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని పాలకొలను గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రామచంద్రుడు ఐదు నెలల క్రితం అకాల మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని కాటసాని రాంభూపాల్రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆది వారం కాటసాని స్వగృహంలో రామచంద్రుడు కుటుంబానికి రూ.30 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు పార్టీకి బలమైన పునాదులని, వారి కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. రామచంద్రుడు కుటుంబానికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. జెడ్పీటీసీ రంగనాథ్గౌడు, పాలకొలను రమేష్, అక్కిమి హనుమంతరెడ్డి పాల్గొన్నారు. -
‘నీట్’ రీ ఎగ్జామ్ ప్రశాంతం
● జిల్లాలో 1,401 మంది హాజరు ● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ నంద్యాల(న్యూటౌన్): వైద్య విద్య (యూజీ) కోర్సుల్లో ప్రవేశానికి ఎన్టీఏ ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రీఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. ఐదు కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించి సాయంత్రం 6.15 గంటల వరకు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 1,521 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1,401 మంది హాజరు కాగా 120 మంది గైర్హాజరయ్యారు. నంద్యాల పట్టణంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వయంగా సందర్శించి పరిశీలించారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ బొమ్మలసత్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాలికల హైస్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని నీట్ కోఆర్డినేటర్ టి. వెంకటేశ్వరరావు తెలిపారు. పరీక్ష ముగిసిన అనంతరం ఆన్సర్ షీట్లను నిర్దేశిత భద్రతా నిబంధనల ప్రకారం పోస్టల్ వ్యవస్థ ద్వారా సంబంధిత అధికారులకు పంపించే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. -
‘మిథ్యా’హ్న భోజనం
● మధ్యాహ్న భోజనంలో అమలు కాని మెనూ రుద్రవరం: పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని విద్యార్థులు తింటున్నారు. మరికొన్నిచోట్ల ఏజెన్సీ నిర్వాహకులు వడ్డించిందే తినాల్సిన పరిస్థితి నెలకొంది. రుద్రవరం మందలూరు ప్రభుత్వ పాఠశాలలో శనివారం బెల్లం పొంగలిని వడ్డించలేదు. విద్యార్థులు కేవలం అన్నం, చారు మాత్రమే తిన్నారు. ఇక్కడ పాఠశాలలో తాగేందుకు నీరులేక పోవడంతో పక్కనే ఉన్న శుద్ధజలం ప్లాంట్ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ ఒక్కో విద్యార్థి రూ.2 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ సమస్యపై ఎంఈఓ వెంకటస్వామిరెడ్డిని వివరణ కోరగా.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
గందరగోళం.. అయోమయం!
కర్నూలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) కాంట్రాక్ట్ టీచర్ల బదిలీల్లో నెలకొన్న గందరగోళంతో అందరూ అయోమయంలో పడ్డారు. జిల్లాలో 26 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో స్పెషల్ ఆషీసర్లుగా, పీఈటీ, సీఆర్టీలుగా సుమారుగా 315 మంది పని చేస్తున్నారు. ఇందులో 250 మంది వరకు కచ్చితంగా బదిలీ కావల్సిన వారు ఉన్నారు. వారిలో 202 మంది, రిక్వెస్ట్ బదిలీకి 84 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 275 ఖాళీలు బదిలీలకి గత నెల డిస్ప్లే చేసి మౌఖికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే బదిలీలు చేసి, బదిలీ అయిన వారిని కొత్త స్థానాల్లో చేరాలని కూడా సూచించారు. ఈ మేరకు చాలా మంది బదిలీ అయిన స్థానాల్లో చేరారు. అయితే జిల్లాలో సుమారుగా 46 మంది బదిలీలపై న్యాయస్థానాల్లో కేసులు వేసి వారిని యథాస్థానాల్లోనే కొనసాగేటట్లు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వీరందరూ తిరిగి వారి స్థానాల్లోకి రావడంతో వారి స్థానాల్లో చేరిన వారు సైతం తిరిగి వాళ్ల స్థానాల్లో వెళ్లాలా? లేకపోతే తదుపరి ఉత్తర్వులు ఇస్తారా? అనే విషయం తెలియక చిరుద్యోగులు మానసిన ఒత్తిడికి గురవుతున్నారు. కొంత మంది కేజీబీవీ కార్యదర్శికి పోన్లు చేసి తమ ఆవేదన చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కర్నూలు నగరానికి సమీపంలో ఉండే ఇద్దరు, ముగ్గురు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లుగా చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. బదిలీల ప్రస్తావన వచ్చి ప్రతిసారి తమ ఆర్థిక బలంతో కేసులు వేయించి బదిలీలను నిలిపి వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 15 ఏళ్లకుపైగా చాలా మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ టీచర్లు కుటుంబాలకు సూదురంగా పని చేయాల్సి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేసిన ఓ కేసు విషయంలో హైకోర్టు మినిమం టైం స్కేల్తో పాటు మరికొన్ని సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఉద్యోగులుగా పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంటీఎస్ అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై సమస్యలను నాన్చుతుందనే విమర్శలు ఉన్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత నెలలో కేజీబీవీల్లో పని చేసే టీచర్లకు బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం. చాలా మంది ఏళ్లుగా దూరం ఉన్న వారికి కూడా వారు అనుకున్న స్థానాలు రావడంతో చాలా సంతోష పడుతున్నారు. అయితే కొంత మంది కోర్టుకెళ్లడంతో వారిని కోర్టు ఆదేశాల మేరకు వారి స్థానాల్లోనే కొనసాగించి, అక్కడికి వచ్చిన వారిని సీనియారిటీ ఆధారంగా ఖాళీలను దృష్టిలో పెట్టుకొని స్థానాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటాం. వారంలోగా కచ్చితంగా బదిలీలపై స్పష్టత రానుంది. – డా.ఎన్బీ లోకరాజు, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ గత నెలలో కేజీబీవీ టీచర్ల బదిలీలకు కౌన్సెలింగ్ బదిలీలను అడ్డుకునేందుకు న్యాయస్థానాల్లో 46 మంది కేసులు వారి స్థానాల్లోనే కొనసాగేలా తాత్కాలిక ఉత్తర్వులు అప్పటికే కొత్త స్థానాల్లో విధుల్లో చేరిన ఉద్యోగులు ఎక్కడ పని చేయాలా అర్థంకాక ఆందోళన -
ఆళ్లగడ్డ మున్సిపల్ మాజీ చైర్మన్ మృతి
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పురపాలక సంఘం మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రామలింగారెడ్డి (87) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామలింగారెడ్డి శనివారం మధ్యా హ్నం తన నివాస గృహంలో ఉన్నట్టుండి కుప్ప కూలి పోయి మృతి చెందారు. సుదీర్ఘకాలం ఆళ్లగడ్డలో ఆసుపత్రి ఏర్పాటు చేసి డాక్టర్గా సేవలందించడంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ వైస్ చైర్మన్గా, చైర్మన్గా ఎన్నికై ఆళ్లగడ్డ పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. రామలింగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిలతో పా టు పలువురు వైఎస్సార్సీపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు. మద్దిలేటయ్య కిటకిటబేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం శుభ దినాల నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు. యూనిఫైడ్ సర్వేపై అభ్యంతరాలను తెలపండి కర్నూలు(అర్బన్): యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాలో కుటుంబ వివరాలకు సంబంధించి ఏవైనా తప్పులు, పొరపాట్లు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24లోగా ఫిర్యాదు చేసుకోవచ్చని జిల్లా స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు సచివాలయాల అధికారి టీవీ భాస్కర్నాయుడు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యంతరాలను ఆయా సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీల ద్వారా పోర్టల్లో నమోదు చేయవచ్చన్నారు. కులంతో సంబంధం లేని ఫిర్యాదులను ఈ నెల 26వ తేది నాటికి, కులంతో సంబంధం ఉన్న ఫిర్యాదులను ఈ నెల 27వ తేది నాటికి సరిచేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాను వ్యాలిడేషన్ చేస్తామన్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఉల్లి సాగు చేసే రైతులకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్కేవీవై) కింద నాణ్యమైన విత్తనాల కోనుగోలుపై 50 శాతం సబ్సిడీ లేదా హెక్టారుకు గరిష్టంగా రూ.3వేలు (ఏదీ తక్కువైతే అది) అందివ్వనున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని జాతీయ ఉద్యాన పరిశోధన, అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఆర్డీఎఫ్) అగ్రిఫౌండ్ డార్క్రెడ్ ట్రూత్ ఫుల్లీ లేబుల్డ్(టీఎస్) కిలో విత్తనాలు రూ.1,600, సర్టిఫైడ్ లేదా ఫౌండేషన్ విత్తనాలు కిలో రూ.1800 ప్రకారం సరఫరా చేస్తోందన్నారు. కే.883 ట్రూత్ ఫుల్లీ లేబుల్డ్(టీఎస్)విత్తనాలు కిలో రూ.1800లకు పంపిణీ చేస్తోందన్నారు. ఎన్హెచ్ఆర్డీఎఫ్ విత్తనాలే కాకుండా ఇతర ఏ ప్రయివేటు విత్తనాలు కొనుగోలు చేసినా సబ్సిడీ వర్తిస్తుందన్నారు. రైతులు విత్తనాల కొనుగోలుకు సంబంధించి దరఖాస్తుతో పాటు బిల్లులు, పట్టాదారు పాసు పుస్తకాల ప్రతులను రైతు సేవా కేంద్రాల్లో సమర్పించాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎస్బీఐ ఉద్యోగుల సంక్షేమానికి తారకనాథ్ కృషి
● డిప్యూటీ జనరల్ మేనేజర్ హేమ కర్నూలు(అగ్రికల్చర్): ఎస్బీఐ ఉద్యోగుల సంక్షేమానికి దివంగత కార్మిక నాయకులు వై.తారకనాథ్ ఎంతో కృషి చేశారని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ అన్నారు. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ కర్నూలు మాడ్యుల్ ఆధ్వర్యంలో వై.తారకనాథ్ 22వ వర్ధంతి సందర్భంగా శనివారం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, బేతంచెర్ల, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ఎస్బీఐ శాఖల్లో రక్తదాన శిబిరాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి పంపిణీ చేశారు. కర్నూలులోని డాక్టర్ వైఎస్సార్ సర్కిల్లోని మెయిన్ బ్రాంచ్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ ప్రారంభించారు. కర్నూలులో 70 మంది, ఎమ్మిగనూరులో 80 మంది, ఇతర పట్టణాల్లో 51 మంది ప్రకారం రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ విద్యాసాగర్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ పి.శ్రీకాంత్, నాయకులు ప్రవీణ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
● వైఎస్సార్సీపీ లీగల్సెల్ నాయకులునంద్యాల(వ్యవసాయం): రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పెద్ది శ్రీనివాసులు, స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తిమ్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, పట్టణ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ లీగల్సెల్ ప్రతినిధుల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో పోలీసుల పాత్ర ప్రధానమైనదని, అయితే కూటమి ప్రభుత్వంలో వారు రాజకీయ తొత్తులుగా మారారన్నారు. ఇటీవల కృష్ణలంక పోలీసు స్టేషన్లో సాయికృష్ణ అనే యువకుడి లాకప్డెత్ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి సాయికృష్ణ లాకప్డెత్ వివరాలను తెలుసుకున్నారన్నారు. అంతవరకు కనీసం స్పందించని ప్రభుత్వం నేడు కృష్ణలంక సీఐపై కేసు నమోదు చేయించిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, వాటిని పక్కకు తప్పించి వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. జూనియర్ న్యాయవాదులకు మోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జూనియర్ న్యాయవాదులకు రూ.5వేలు ఇచ్చేవారని వైఎస్సార్సీపీ లీగల్సెల్ నాయకులు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో జూనియర్ న్యాయవాదులకు రూ.10వేలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. 2025 డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదని, కేవలం వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడం పని పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్సెల్ నాయకులు కృష్ణారెడ్డి, వివేకానందరెడ్డి, సుబ్బయ్య, జగన్మోహన్రెడ్డి, రామాంజనేయులు, వసంత్రెడ్డి, శరత్, సాయిరాంరెడ్డి పాల్గొన్నారు. -
జూలై 11న మెగా లోక్అదాలత్
నంద్యాల (వ్యవసాయం): జాతీయ మెగా లోక్అదాలత్ను జూలై 11న నిర్వహిస్తున్నట్లు మూడో అదన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి అమ్మన్న రాజ తెలిపారు. కోర్టు ఆవరణలో పోలీస్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను గుర్తించి పరిష్కరించాలన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించి వారి మధ్య రాజీ కుదర్చాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీకర్రి, డీఎస్పీ మంద జావలి, వివిధ పోలీస్ స్టేషన్ సీఐలు, ఎస్ఐలు, ఎకై ్సజ్ అధికారులు, లోకదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. ట్రావెల్ బస్సుకు రూ. 5.15 లక్షల జరిమానా డోన్ టౌన్: ట్యాక్స్ చెల్లించకుండా వెళ్తున్న ట్రావెల్ బస్సు(జబ్బార్ ట్రావెల్స్)కు రూ.5.15 లక్షల జరిమానా విధించినట్లు డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. జాతీయ రహదారిపై ఉన్న అమకతాడు టోల్ ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన జబ్బార్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి మైసూర్కు వెళుతుండగా ఆపి తనిఖీ చేశారు. రోడ్డు ట్యాక్స్ చెల్లించకుండా వెళుతున్నట్లు గుర్తించి ఈ జరిమానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. నేడే నీట్ రీఎగ్జామ్ ● నంద్యాలలో ఐదు పరీక్ష కేంద్రాలు నంద్యాల: నీట్ యూజీ రీ ఎగ్జామ్ను ఆదివారం పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నంద్యాల పట్టణంలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పీఎస్సీ కేవీఎస్సీ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 1,521 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమై సాయంత్రం 5.15 గంటల వరకు జరుగుతుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల్లోపు చేరుకోవాలి. ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎవరినీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా లైవ్ మానిటరింగ్ ఉంటుంది. దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమయం నీట్ యూజీ రీ ఎగ్జామ్లో దివ్యాంగ విద్యార్థులకు అదనంగా ఒక గంట సమయం కల్పించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ తెలిపారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తన చాంబర్ నుంచి వీడియో సమావేశంలో పాల్గొన్నారు. -
అదనపు కోర్టులతో కేసులకు సత్వర పరిష్కారం
● ఎమ్మిగనూరులో రెండు కోర్టులు ● జూలై నెలాఖరులోపు ప్రారంభం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఎమ్మిగనూరురూరల్: అదనపు కోర్టుల ఏర్పాటుతో పెండింగ్లో ఉన్న చాలా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయనతోపాటు జిడ్జి పి.హేమ, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్అండ్బీ డీఈ నాగరాజు, బార్ అసోషియేషన్ సభ్యులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జి.కబర్ధి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు కోర్టులు ఏర్పాటుకు రూ. 96 కోట్లు కేటాయిస్తే కర్నూలు జిల్లాకు రూ. 21 కోట్లు వచ్చాయన్నారు. ఎమ్మిగనూరుకు ఉన్న కోర్టుతో పాటు అదనపు కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు రూ. 2 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతానికి పాత తహసీల్దార్ కార్యాలయంలో ఒక కోర్టు, కోర్టు అవరణలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయంలో మరో కోర్టు ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ సభ్యులు తమ భవాన్ని అదనపు కోర్టుకు ఇచ్చి తాము షెడ్స్లో ఉంటామని చెప్పటం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు కొత్త కోర్టులను జూలై నెలాఖరు లోపు ప్రారంభించనున్నట్లు, అంతలోపే సంబందిత అఽధికారులు మరమ్మతులు చేయించి సిద్ధం చేయాలన్నారు. ఎమ్మిగనూరు కోర్టులో ఇప్పటి వరకు 5 వేల కేసు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పుడు కొత్త కోర్టుల ఏర్పాటు చేస్తే వాటికి త్వరితగిగతి పరిష్కారం లభిస్తుందన్నారు. కక్షిదారులు తమ కేసుల అప్పీల్కు ఆదోని కోర్టుకు వెళ్లేవారని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే అదనపు కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపారు. గోనెగండ్ల మండలానికి సంబంధించిన కేసులు పత్తికొండ కోర్టుకు వెళ్లేవని, ఇక నుంచి ఎమ్మిగనూరు కోర్టుకు మార్పు చేసినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రషీదుల్లా, జనరల్ సెక్రటరీ కె.మల్లికార్జున, సీనియర్ న్యాయవాదులు పరమేశప్ప, లక్ష్మినారాయణరెడ్డి, డి. మల్లికార్జున, బార్ అసోసియేసన్ సభ్యులు పాల్గొన్నారు. -
అవుకులో అడుగంటిన జలాలు
● ఆయకట్టు రైతుల్లో ఆందోళనకొలిమిగుండ్ల(అవుకు): అవుకు రిజర్వాయర్ పదేళ్ల తర్వాత డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. సాధారణ నీటి మట్టం 4.148 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.79 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. దశాబ్దం తర్వాత ఈ పరిస్థితి తలెత్తడంతో రైతులు, ప్రజల్లో అందోళన నెలకొంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని భావిస్తున్నారు. ఇప్పటికే రిజర్వాయర్ జలకళతో సంతరించుకోవాల్సి ఉంది. రిజర్వాయర్కు చెందిన రివిట్మెంట్ రెండు సార్లు కుంగిపోవడంతో అధికారులు గాలేరు–నగరి వరద కాల్వ ద్వారా వైఎస్సార్ జిల్లాకు నీటిని వదిలారు. కట్టకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో రిజర్వాయర్లో రెండు టీఎంసీలు మాత్రమే నిల్వ చేశారు. లీకేజీని అరికట్టేందుకు రూ.45 లక్షలు ఖర్చు వెచ్చించి కర్ణాటక నుంచి నిపుణుల బృందాన్ని రప్పించారు. దాదాపు నెల రోజుల పాటు ప్రయత్నం చేసినా చివరకు 30 శాతం మాత్రమే లీకేజీని అరికట్టగలిగారు. ఇప్పుడు ఎగువ నుంచి నీళ్లు వచ్చినా పూర్తిస్థాయిలో నీటిని నింపుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రైతుల్లో కలవరం రిజర్వాయర్లోకి ఆశించిన స్థాయిలో నీరు రాకపోతే ఆయకట్టు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 50 గ్రామాలకు పైగానే తాగునీరు అందుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి మట్టం ఉంటే అక్కడి నుంచి ఎస్సార్బీసీ ద్వారా అవుకు రిజర్వాయర్లోకి వదులుతారు. రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కు చేరుకోవడంతో వరి పండించే రైతుల్లో కలవరం మొదలైంది. స్థానికంగా ఈ రిజర్వాయర్ కింద మూడు వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. రిజర్వాయర్లో నీటి నిల్వలు లేనందున ఎస్సార్బీసీ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. రిజర్వాయర్లో నీటిమట్టం తక్కువ ఉన్నందున లోకల్ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శ్రీశైలానికి కొంతమేర ఇన్ఫ్లో వస్తోంది. త్వరలోనే ఐఏబీ సమావేశం జరుగుతుంది. అందులో నిర్ణయం తీసుకుంటారు. నీటిమట్టం తక్కువగా ఉన్నందున రైతులు తొందరపడొద్దు. – శుభకుమార్, ఎస్సార్బీసీ ఈఈ -
బెల్టు షాపులపై దాడులు
కర్నూలు: అక్రమ మద్యం అమ్మకాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎకై ్సజ్ అధికారులు దాడులు విస్తృతం చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎ కై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్, ఎస్ఐలు రెహనా, మారుతీ ప్రసాద్, తేజ తదితరులు తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి కర్నూలు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. కర్నూలుకు చెందిన సుధాకర్ పొరుగు రాష్ట్రం తెలంగాణకు సంబంధించిన మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించి 12 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పసుపల గ్రామానికి చెందిన జ్యోతి వద్ద నుంచి 7 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు కొంతకాలంగా బెల్టు షాపులు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడటంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఐదుగురిపై కూడా కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవకద్రకు చెందిన రఫిక్, కల్లూరుకు చెందిన దస్తగిరి, కర్నూలుకు చెందిన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. -
నీట్ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
కర్నూలు సిటీ: నీట్ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీకి చెందిన ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు బస్సుల్లో నీట్ పరీక్ష హాల్ టికెట్ చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి పరీక్ష కేంద్రం నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అయితే కొరతను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎల్నినో కారణంగా పచ్చిమేత కొరతతో పాటు పశువులకు తాగునీటి కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో 7 లక్షల యూనిట్ల పశువులు ఉన్నాయని, ఆగస్టు నెల వరకు 3 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం కాగా 2.67 లక్షల టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉందన్నారు. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు 75 శాతం సబ్సిడీతో 46 టన్నుల పశుగ్రాసం విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అదే విధంగా 946 టన్నుల సమీకృత దాణా కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈపీఎండీఎస్ పద్ధతిలో 365 రోజులు భూమిని కప్పి ఉంచే నిరంతర పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. -
బాధాకరం
మాకు సొంత భూమి లేదు. కౌలుకు 6.50 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఈ సారి పత్తి సాగు చేశా. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి చేయూత లేదు. గత ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కింద ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని పక్కన పెట్టడం బాధాకరం. బ్యాంకులు కూడా పంట రుణాలు ఇవ్వడం లేదు. – శేషన్న, జి.సింగవరం, కర్నూలు మండలం మేం దేవాలయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాం. మాకు ఐదు ఎకరాలకు సీసీఆర్ కార్డును ప్రభుత్వం జారీ చేసింది. అన్నదాత సుఖీభవ కింద సాయం దక్కుతుందని ఆశించాం. ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. గత ఏడాది కూడా కౌలు రైతులను పట్టించుకోలేదు. ఈ సారి కూడా అన్యాయం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోకపోతే సాగులో ఎలా రాణిస్తాం? ఇప్పటికై నా చంద్రబాబు చొరవ తీసుకొని కౌలురైతులకు న్యాయం చేయాలి. – జంగం జంబులింగయ్య, ఆర్.కొంతలపాడు, కర్నూలు మండలం ● -
నీట్ పునఃపరీక్షకు పటిష్ట ఏర్పాట్లు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: నీట్ పునఃపరీక్షను ఈ నెల 21వ తేదీన సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్తో కలిసి నీట్ పునఃపరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన నీట్ పునఃపరీక్షను జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పీఎస్సీ డిగ్రీ కళాశాల, కేవీఎస్సీ డిగ్రీ, జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలోని ఈ ఐదు కేంద్రాల్లో మొత్తం 1,521 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారన్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 ప్రారంభమై సాయంత్రం 5.15 గంటలకు ముగుస్తుందన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక సడలింపులతో సాయంత్రం 6.20 గంటల వరకు సమయం కేటాయించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్షోరాణ్ మాట్లాడుతూ.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. నిర్దేశిత గుర్తింపు పత్రాలు లేని అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలో ప్రవేశం కల్పించడం సాధ్యం కాదన్నారు. సమావేశంలో డీఆర్ఓ రామునాయక్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, నంద్యాల ఏఎస్పీ మంద జావలి అల్ఫోన్స్, కలెక్టరేట్ ఏఓ సుభాకర్, డీఈఓ జనార్ధన్ రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకట రమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, నీట్ కోఆర్డినేటర్ టి. వెంకటేశ్వర్లు, వివిధ పరీక్షా కేంద్రాల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. -
క్షణికావేశంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఎమ్మిగనూరు రూరల్: క్షణికావేశంలో పట్టణంలోని తేరుబజార్లో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలివీ.. వంశీ, లావణ్య దంపతులకు శృతి(18), వెంకటసాయి సంతానం. వంశీ అనారోగ్యంతో ఏడు సంవత్సరాల కిత్రం మృతి చెందాడు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలను పనిచేసుకుంటు కష్టపడి చదివిస్తోంది. శృతి స్థానిక తిరుపతమ్మ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేసింది. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగా, ఎంసెట్ సైతం బాగా రాసినట్లు తెలుస్తోంది. అయితే శుక్రవారం ఉదయం ఇంటి పైన ఉన్న గదిలో తన బంధువుల అబ్బాయితో ఫోన్లో మాట్లాడినట్లుగా సమాచారం. ఇద్దరి మధ్య ఏమి గొడవ జరిగిందో కానీ శృతి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె కోసం తల్లి లావణ్య పైకి వెళ్లి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో కేకలు వేయ గా ఇంటి పక్కన వారు వచ్చి కిందకు దించారు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ మధుసూదన్రెడ్డి ఘటనాస్థలితో పాటు పోస్టుమార్టం గదిలో శృతి మృతదేహాన్ని పరిశీలించారు. కుమార్తె ఆత్మహత్యకు తమ బంధువుల అబ్బాయి కారణం కావచ్చని, విచారిస్తే అసలు నిజం బయటకు వస్తుందని మృతురాలి తల్లి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
లక్ష్యానికి దూరమై.. చైతన్యం కరువై!
ఆళ్లగడ్డ: కిశోర బాలికల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సమగ్ర సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కిశోరి వికాసం’ జిల్లాలో తూతూమంత్రంగా సాగుతోంది. సిబ్బంది నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి క్షేత్రస్థాయిలో శిక్షణా తరగతులు, అవగాహన సదస్సులు ఫొటోలకే పరిమితమవుతున్నాయి. లింగ వివక్ష, బాల్య వివాహాలు, పౌష్టికాహార ప్రాధాన్యం, ఆరోగ్య సమస్యలు వంటి అంశాలపై కౌమారదశ బాలికల్లో అవగాహన కల్పించేందుకు గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో పకడ్బందీగా నిర్వహించారు. ప్రస్తుతం అవగాహన సదస్సులు జరుగుతున్నాయనే సమాచారం కూడా ఎవరికీ తెలియడం లేదు. ‘కిశోరి వికాసం’ కార్యక్రమంలో భాగంగా 11– 18 ఏళ్ల మధ్య వయస్సున్న విద్యార్థులతో పాటు.. బడి బయట ఉన్న బాలికలను గుర్తించి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలి. సమావేశాల్లో సామాజిక అంశాలు, విద్య, వైద్యం, క్రీడలు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు.. వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పౌష్టికాహారం, రుతుక్రమ పరిశుభ్రత, సోషల్మీడియా, బా ల్య వివాహాలు, పునరుత్పత్తి, ఆరోగ్యం ప్రభావాలు, పిల్లల హక్కులు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, పోక్సో చట్టం, కౌమార దశలో రక్తహీనత, లింగ అసమానత, విద్య, కెరీర్, నైపుణ్యాభివృద్ధి, సైబర్ రక్షణ, ఆన్లైన్ భద్రత, ఆర్థిక అంశాల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, సాధికారత తదితర అంశాలపై షెడ్యూల్ ప్రకారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. వీటితో పాటు క్రీడలు, యోగా, వ్యాయామం వంటి వాటిపై సాధన చేయించాల్సి ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో ఇలాంటివి మచ్చుకై నా కనిపించడం లేదు. అక్కడక్కడా స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, ఒకరిద్దరు తల్లులతో సమావేశం ఏర్పాటు చేసి ఫొటోలు తీసుకుని ప్రచార ఆర్బాటం చేస్తున్నారు తప్పా.. కనీసం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు లేక పోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు లేవు.. పర్యవేక్షణకు రారు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన ‘కిశోరీ వికాసం’ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కావడం లేదు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలే తమ సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక స్థానిక విద్య, ఆరోగ్యం, సచివాలయ, మెప్మా, ఏఎన్ఎం, ఆశ, ఆర్పీ తదితర సిబ్బంది గైర్హాజరవుతుండంతో అంగన్వాడీ కార్యకర్తలే కార్యక్రమాన్ని మమ.. అనిపిస్తున్నారు. ఒక్క పూటకే పరిమితంపదకొండేళ్ల నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు బాలికలు, 15 నుంచి 18 సంవత్సరాల లోపు బాలురను గ్రూపులుగా విభజించి ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. బాలికలకు ఉదయం, బాలురకు మధ్యాహ్నం ఈ శిబిరాలు నిర్వహించాలి. అయితే జిల్లాలో ఎక్కడా ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఆయా తేదీలో మండలంలో ఏదో ఓ గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రంలో కేవలం కేంద్రం చిన్నారులతో సమావేశం ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటుండటంతో కిశోరి వికాశం శిబిరాల ఆశయం నేరవేరడం లేదు. తూతూ మంత్రంగా కిశోరి వికాసం నిర్వహణకు నిధులు విదల్చని ప్రభుత్వం చేతి నుంచి ఖర్చులు పెట్టుకుంటున్న అంగన్వాడీ కార్యకర్తలు కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఫొటోలకే పరిమితవుతున్న కార్యక్రమం -
ఉచిత న్యాయ సహాయం అందిస్తాం
నందికొట్కూరు: ఆర్థిక స్థోమత లేని రిమాండ్ ఖైదీలకు ఉచిత న్యాయవాది ఏర్పాటు చేస్తామని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి లీలా వెంకటశేషాద్రి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సబ్జైల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమాండ్ ఖైదీలతో ముఖాముఖి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారికి ఉచిత లాయర్ను నియమించామన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైన ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. సదుపాయలు, భోజనాలు గురించి ఆరా తీశారు. అనంతరం ఖైదీలకు ఆరోగ్య వైద్య పరీక్షలు డాక్టర్ ప్రవీణ్ చేశారు. సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి దివ్య ఖైదీలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సబ్జైల్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ప్యానల్ న్యాయవాది మద్దయ్య, నాగమద్దిలేటి, వైద్యులు ప్రవీణ్కుమార్, తదితరులు ఉన్నారు. విద్యార్థులకు వసతులు కల్పిస్తాం ● డీఈఓ జనార్దన్ రెడ్డి కొత్తపల్లి: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతికి అప్గ్రేడ్ కావడంతో ఎంఈఓ నాగరాజుతో కలసి డీఈఓ తనిఖీ చేశారు. అలాగే గ్రామంలో ఎంపీపీఎస్ స్పెషల్ పాఠశాలలో వసతులను, గదులను, మూత్రశాలలు, వంట గదులను పరిశీలించారు. పాఠశాలలో మనబడి నాడు–నేడు నిధులు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. ఆ నిధులతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించాలని ఎంఈఓకు సూచించారు. కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ అల్టర్నేటివ్ స్కూలింగ్ కో–ఆర్డీనేటర్ ప్రసన్న కుమార్, పర్యవేక్షణాధికారి జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. జూలై 1 నుంచి ఈ – ట్రాన్స్పోర్ట్ విధానం నంద్యాల(అర్బన్): వ్యవసాయ ఉత్పత్తులు, జీవన పశు గణన ఉత్పత్తి రవాణాకు సంబంధించి జూలై 1వ తేదీ నుంచి ఈ – ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తుందని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి షేక్ అబ్దుల్ రహిమాన్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ కమిటీ శాఖ ఆధ్వర్యంలో వసూళ్లు చేసే పన్నులను ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నామన్నారు. గతంలో పన్నుల చెల్లింపులకు వ్యాపారులు, ట్రేడర్లు ఇబ్బందులు పడేవారని, మ్యాన్వల్ పద్ధతిలో అవకతవకలు, అక్రమాలు ఉండేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ – మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో అవకతవకలకు చెక్ పడుతుందన్నారు. మార్కెటింగ్ శాఖకు సంబంధించి అనుమతులు, పన్నుల వసూళ్లు, తదితరాలు ఈ మార్కెటింగ్ విధానంలో జరుగుతాయని చెప్పారు. ఈ మార్కెటింగ్ విధానంపై వ్యాపారులు, వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పది సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. గత నెల 25 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించగా.. 8, 9, 10 తేదీల్లో మూల్యాంకనం చేశారు. పరీక్షలకు 10,187 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6,534 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలపై అనుమానాలు ఉంటే ఈనెల 26వ తేదీ వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. -
వ్యాయామ ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలి
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో స్టెప్ అప్ సౌకర్యం పొందిన వ్యాయామ ఉపాధ్యాయుల వేతనాలను యథావిధిగా చెల్లించాలని జిల్లా ఫ్యాప్టో చైర్మన్ రామచంద్రారెడ్డి, సెక్రటరీ జనరల్ షేక్ దస్తగిరి బాషా, డిప్యూటీ సెక్రటరీ జనరల్ పీవీ ప్రసాద్, నగిరి శ్రీనివాసులు, కో చైర్మన్ స్వామి శేఖర్ జిల్లా ఖజానా శాఖ అధికారులను డిమాండ్ చేశారు. గురువారం జిల్లా ఖజానా కార్యాలయంలో అసిస్టెంట్ జిల్లా ట్రెజరీ, అకౌంట్స్ అధికారి శ్రీనివాసులుకు కలిసి వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని పాఠశాల సహాయకులు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు ఒకే డీఎస్సీ ద్వారా పీఈటీలుగా ఎన్నికై విడతలవారీగా పాఠశాల సహాయకులుగా పదోన్నతి పొందారన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ 22 (బి) ప్రకారం జూనియర్ ఉపాధ్యాయులు వేతనంతో సమానంగా తమ వేతనాలను స్థిరీకరించుకున్నారని అయితే కొన్ని కారణాలతో సీనియర్ ఉపాధ్యాయుల స్టెప్ అప్ సౌకర్యాన్ని స్టెప్ డౌన్ చేస్తూ గత నెలలో జిల్లా ఖజానా అధికారి ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర అధికారుల నుండి వివరణ వచ్చేవరకు నంద్యాల జిల్లా ఖజానా అధికారి స్టెప్ డౌన్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్నారు. జూన్ నెల జీతాలను యథావిధిగా చెల్లించుటకు సబ్ ట్రెజరీ అధికారులకు తగు సూచనలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యులు శివకుమార్, రవి, ప్రసాద్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టాలు తొలగేనా?
గతేడాది యూరియా దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మార్కెట్లో అధిక ధరతో కొనుగోలు చేసి పైర్లు కాపాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు యాప్ ద్వారా ఎరువులు కొనాలని చెబుతున్నారు. రైతులకు అవసరమైన మేరకు ఇస్తారో లేదో తెలియదు. కష్టాలు తొలిగేలా లేవు. – గోపాల్రెడ్డి, రైతు, సాంబవరం, గోస్పాడు మండలం ఈ ఏడాది నాకున్న సొంత పొలంలో 1.25 ఎకరాల్లో మొక్కజొన్న, 2.17 ఎకరాల్లో మిరప సొగుకు పొలాన్ని సిద్ధం చేసుకున్నాను. మొక్కజొన్న సాగుకు అదును కాగా పంటల సాగు వివరాలు యాప్లో నమోదు చేయించుకున్నాను. యూరియా, డీఏపీ కొనుగోలుకు ఎరువుల దుకాణానికి వెళితే ఇవ్వడం లేదు. – కుళాయప్ప, రైతు, అమడాల, కోవెలకుంట్ల మండలం నాకున్న రెండు ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరా రూ. 10 వేలు కౌలు చెల్లించి మరో రెండు ఎకరాలకు కౌలుకు తీసుకున్నాను. నాలుగు ఎకరాల్లో బెండ, మొక్కజొన్న పంటలు సాగు చేసేందుకు పొలాన్ని సిద్ధం చేసుకున్నాను. యాప్తో సంబంధం లేకుండా రైతులకు కావాల్సిన ఎరువులను సరఫరా చేయాలి. – వెంకటేశ్వర్లు, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం -
బతకలేం.. ఆదుకోండి!
డోన్ టౌన్: ‘వ్యాపారంలో నష్టాలు వచ్చాయి.. బతకలేం.. ఆదుకోండి’ అంటూ సూసైడ్నోట్లో సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ , టీజీ భరత్కు విన్నవిస్తూ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. భర్త మృతి చెందగా భార్య చికిత్స పొందుతున్నారు. ఈ విషాదం గురువారం డోన్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. డోన్ పట్టణం శ్రీనివాసనగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసులశెట్టి నెయ్యి, పసుపు వ్యాపారం చేస్తున్నాడు. ఒక కంపెనీ బిస్కెట్ ఏజెన్సీ డీలర్గా ఉన్నాడు. వ్యాపారం కోసం పలుచోట్ల తెలిసిన వారి వద్ద, స్నేహితుల వద్ద దాదాపు రూ. 2 కోట్ల వరకు అప్పులు చేశాడు. వ్యాపారం కలిసి రాక నష్టాలు రావడంతో అప్పులు తీర్చే మార్గం లేక శ్రీనివాసులు మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం రాత్రి భార్య పద్మావతితో కలిసి ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయం పాలు పోయడానికి వచ్చిన వ్యక్తి గమనించిన స్థానికులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసుల పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. భార్య పద్మావతికి డోన్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతునికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు విద్య పూర్తి చేసుకొని ఉద్యోగ అన్వేషణలోఉన్నాడు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నుంచి రూ.2 కోట్లు అందించాలని, తమ కుమారుడు (సందీప్)కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇంతియాజ్బాషా తెలిపారు. సూసైడ్ నోట్లో సీఎం, డిప్యూటీ సీఎంలకు విన్నపం దంపతుల ఆత్మహత్యాయత్నం భర్త మృతి.. చికిత్స పొందుతున్న భార్య డోన్ పట్టణంలో విషాదం -
టీడీపీ నాయకుల అక్రమ మైనింగ్
● దేవదాయ, వక్ఫ్ భూముల ఆక్రమణ ● రోడ్డును తవ్వుతున్నా పట్టించుకోని అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్: అధికారంలో ఉన్నామని టీడీపీ నాయకులు బరితెగించారు. విలువైన ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. దేవదాయ శాఖ, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములను యథేచ్ఛగా ఆక్రమించారు. అలాగే రోడ్డును ధ్వంసం చేస్తూ మైనింగ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, దేవదాయశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. నిబంధనల ప్రకారం మైనింగ్ పనులు చేపట్టాలంటే రెవెన్యూ అధికారుల నుంచి ఎన్ఓసీ పొందాలి. అనంతరం మైనింగ్ అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి ఏమీ లేకుండానే బనగానపల్లె మండలంలోని పలుకూరు, రామకృష్ణాపురం గ్రామాల మధ్య టీడీపీ నాయకులు అక్రమంగా తవ్వకాలు చేపట్టి నాపరాయిని తరలిస్తున్నారు. ఈ విషయంపై అధికారులకుప్రజలు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రోడ్డు విధ్వంసం పలుకూరు గ్రామం నుంచి రామకృష్ణాపురం వరకు జెడ్పీ రహదారి ఉంది. రోడ్డులో రూ. కోట్ల విలువ చేసే నాపరాయి ఉండటంతో టీడీపీ నాయకుల కన్ను పడింది. ఎక్కడికక్కడ రోడ్డును ధ్వంసం చేస్తూ తమ అడ్డులేదన్న విధంగా ఇక్కడి విలువైన నాపరాయిని వెలికితీసి కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కు, సంబంధింత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని వక్ఫ్బోర్డు భూములు టీడీపీ నాయకుల ఆక్రమణలోనికి వెళ్లాయి. వీటిలో యథేచ్ఛగా మైనింగ్ చేపడుతున్నారు. అర్చకులు అడ్డుకున్నా.. పలుకూరు గ్రామ సమీపంలో శ్రీ చెన్నకేవశస్వామి ఆలయానికి చెందిన మాన్యం భూమి సర్వేనంబరు 230లో 4.83 సెంట్లు, 230/3లో 4.12 సెంట్లు, 326లో 13.75 సెంట్లు ఉంది. ఇదే గ్రామంలో శ్రీ రామేశ్వరస్వామి ఆలయానికి చెందిన మాన్యం భూమి సర్వే నంబరు 308లో నాలుగు ఎకరాలు ఉంది. ఈ భూముల్లో విలువైన ఖనిజం ఉండటంతో టీడీపీ నాయకులు అక్రమంగా మైనింగ్ పనులు చేపడుతున్నారు. రామేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమిలో ‘కూటమి’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఆలయానికి చెందిన అర్చకులు పలు విధాలుగా అడ్డుకుంటూ వచ్చారు. అలాగే జిల్లా కలెక్టర్తో పాటు మైనింగ్, దేవదాయశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం గత కొద్ది రోజులుగా చెన్నకేశస్వామి ఆలయానికి చెందిన భూముల్లో అక్రమ మైనింగ్ పనులు జరుగుతు న్నాయి. అక్రమ మైనింగ్ను అరికట్టి ఆలయ భూములు రక్షించాలని ఆలయ మాజీ చైర్మన్ కామిని బాలతిమ్మయ్య ఇటీవల జిల్లా కలెక్టర్తో పాటు బనగానపల్లె ఆర్డీఓ, మైనింగ్శాఖ ఏడీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు. -
జూలై 11న లోక్ అదాలత్
కర్నూలు: కోర్టులలో ఉన్న సివిల్, భూసేకరణ, పన్ను బకాయిలు, మున్సిపల్ కేసులు జులై 11న నిర్వహించనున్న లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు మున్సిపల్, సచివాలయ, కెనరా లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్, బీఎస్ఎన్ఎల్ అధికారులతో స్థానిక ప్రాంగణంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోర్టులలో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో భూసేకరణ, బ్యాంకు, మున్సిపల్, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. -
డోన్లో నకిలీ బంగారం గుట్టురట్టు
● పోలీసులను ఆశ్రయించిన బాధితులుడోన్: ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో తాము బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టామని, తక్కువ ధరకే వాటిని విడిపించి ఇస్తామని కొందరి వ్యక్తులు మోసం చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన గురువారం డోన్లో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. డోన్ పట్టణానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి నెల్లూరు, అనంతపురం నుంచి నకిలీ బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. డోన్ పట్టణంలోని రెండు బ్యాంకుల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులతో కుమ్మకై ్క వీటిని తాకట్టు పెట్టారు. ఇవి మేలిమి బంగారు ఆభరణాలని ప్రజలను నమ్మించి అతి తక్కువ ధరకే విడిపించి ఇచ్చారు. వాటిని తీసుకున్న ప్రజలు అవసరాలకు అమ్మేందుకు బంగారం దుకాణాలకు తీసుకెళ్లగా నకిలీవి అని తేలింది. దీంతో బాధితులు లబోదిబోమన్నారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన వారి తో పాటు బ్యాంకు ఉద్యోగులను నిలదీశారు. ఈ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంకు ఉద్యోగులు చెప్పడంతో బాధితులు గురువారం రాత్రి డోన్ అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. ఇందులో ముఠా ప్రమేయంతో పాటు బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉందని బాధితుడు విశ్వనాథ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. -
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
మహానంది: ప్రకృతి వ్యవసాయం రైతులు లాభదాయకమని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గాజులపల్లె గ్రామంలో కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫార్మ్పాండ్ను గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఆయిల్పామ్ తోటల్లో సాగుచేస్తున్న అంతర పంటల వివరాలు తెలుసుకున్నారు. తన పొలంలో వీడ్ మ్యాట్స్ వినియోగంతో రోజ్(గులాబీ), మేరీగోల్డ్(బంతిపూలు) సాగు చేస్తున్న విధానాన్ని కలెక్టర్కు రైతు హుసేన్ వివరించారు. తనకున్న మూడు ఎకరాల పొలంలో ఆపిల్ పంటను సాగు చేస్తున్న రైతు కూరగాయల మస్తాన్ను జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు. పత్తి సాగు పెరిగే అవకాశం నంద్యాల(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని ఆర్ఏఆర్ఎస్ పత్తి కీటక శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న ఐదు రోజుల వ్యవధిలో 70 నుంచి 80మి.మీ. వర్షపాతం నమోదు అయినప్పుడు మాత్రమే పత్తిని విత్తుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయని, అక్కడక్కడ సాగు చేసిన పత్తి మొక్కలు వాడుదశకు చేరుకున్నాయని తెలిపారు. వాడు నివారణకు పది గ్రాముల యూరియాను లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలన్నారు. అధిక ఉష్ణోగ్రతలతో రసం పీల్చు పురుగులు, పిండి నల్లి ఆశించే అవకాశం ఉందని తెలిపారు. పసుపు, నీలపు వర్ణపు జీగురు అట్టలు ఎకరాకు 40 చొప్పున ఏర్పాటు చేయాలని, ఫ్లోనీనిక్ అమైడ్ 0.3 గ్రాములు, అఫిడో ఫైరోఫిన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. పత్తిలో అంతర్ పంటలుగా కంది, జొన్నలను సాగు చేసుకోవచ్చని తెలిపారు. కందిని స్టెరిలిటీ మొజాయిక్ వ్యాధి ఆశించే అవకాశం ఉందని, దీని నివారణకు డైకోపాల్ అనే మందును పిచికారీ చేయాలన్నారు. డిప్యూటీ ఎంపీడీఓ సస్పెన్షన్ కొలిమిగుండ్ల: డిప్యూటీ ఎంపీడీఓ చంద్రమౌళీశ్వరగౌడ్ను పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ సస్పెండ్ చేసినట్లు ఇన్చార్జ్ ఎంపీడీఓ ప్రసాదరెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి అధికారికంగా సమాచారం ఉత్తర్వులు అందడంతో డిప్యూటీ ఎంపీడీఓకు వాట్సాప్ ద్వారా పోస్టు చేసినట్లు తెలిపారు. కాగా.. పాణ్యంలో విధులు నిర్వహించిన సమయంలో అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల మంజూరులో చంద్రమౌళీశ్వరగౌడ్ ఇష్టానుసారంగా వ్యవహరించారని మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి నంద్యాల(అర్బన్): హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ ఆదేశాల మేరకు గురువారం పోలీసు కార్యాలయ మైదానంలో హోంగార్డ్స్ పెరేడ్, దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోంగార్డుల సంక్షేమానికి పోలీసు శాఖ ఎప్పుడు కట్టుబడి ఉందన్నారు. ప్రతి ఏడాది హోంగార్డులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు అందించారు. జిల్లా సాయుధ బలగాల అడిషనల్ ఎస్పీ చిన్నికృష్ణ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, హోంగార్డు డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు. పరిపాలనాధికారులుగా ముగ్గురికి పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో సీనియర్ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి పరిపాలనాధికారులుగా పదోన్నతి కల్పించారు. గురువారం స్థానిక జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ముగ్గురు పరిపాలనాధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి పోస్టింగ్ ఆర్డర్స్ను అందించారు. వీరిలో ఎం.వీరభద్రయ్యను కౌతాళం ఎంపీడీఓ, బి.గిడ్డమూర్తిని జెడ్పీ, ఏవీ రమణయ్యను ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయానికి ఏఓలుగా నియమించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ ఏఓలుగా పదోన్నతి పొందిన వారు పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ఆర్యూ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోబోమని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసెర్ వి.వెంకట బసరావు హెచ్చరించారు. బుధవారం వర్సిటీలోని సెనేట్ హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్కుమార్నాయుడుతో కలిసి వర్సిటీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి ఏ ఒక్క పని చేపట్టలేదని, అలాంటప్పుడు అవకతవకలకు ఆస్కారమెక్కడిదన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించడంతో పాటు వర్సిటీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించే ఎవరినైనా ఉపేక్షించబోమన్నారు. విద్యార్థి సంఘాల నేతలకు చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా మార్పు రాకపోవడంతోనే ఇటీవల ఇద్దరు విద్యార్థులపై చర్యలు తీసుకున్నామన్నారు. నాన్ బోర్డర్స్ను వర్సిటీ హాస్టళ్లలోకి అనుమతించేది లేదన్నారు. వర్సిటీలో ఇప్పటికే నాలుగు కొత్త కోర్సులను ప్రారంభించామన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల బీఏ ఎకనామిక్స్(ఆనర్స్), బి.ఫార్మసీ కోర్సుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు. వర్సిటీకి ఐఎస్వో 4 స్టార్ రేటింగ్ వచ్చిందన్నారు. న్యాక్ అక్రిడిటేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించామన్నారు. సమావేశంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.విశ్వనాథరెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీవీ సుందరానంద్ తదితరులు పాల్గొన్నారు. -
యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
నంద్యాల(న్యూటౌన్): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో శిక్షణ పొంది గ్రామీణ నిరుద్యోగ యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. క్రాంతినగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఈఎస్టీఐ శిక్షణ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్తోపాటు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్నూలు రీజినల్ హెడ్ డి. అనిల్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని శిక్షణ సదుపాయాలను పరిశీలించారు. డైరెక్టర్ అరుణకుమారి, శిక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. టీడీపీ నాయకులపై కేసు ట్కాస్ఫోర్స్: ప్రేమ వివాహం చేసుకున్న దంపతులను విడగొట్టడంతోపాటు పోలీసుల విధులకు ఆటంకం కల్గించిన టీడీపీ నాయకులు సీమ సుధాకర్రెడ్డి, ఆయన తనయుడు సీమ సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన ఒక యువతి, డోన్ పట్టణం పాతపేటకు చెందిన ఒక యువకుడు ప్రేమించుకొని గత 20 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. యువకుడిని తీవ్రంగా కొట్టి యువతిని కారులో కిడ్నాప్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్కు గురైన యువతిని స్టేషన్కు తీసుకెళ్లగా టీడీపీ నాయకులు సీమ సుధాకర్రెడ్డి, ఆయన తనయుడు సీమ సుబ్బారెడ్డి అక్కడికి వచ్చారు. ఎస్ఐని బెదిరిస్తూ విధులకు ఆటంకం కల్గించారు. యువతిని బలవంతంగా వారి బంధువుల వెంట పంపారు. ఈ ఘటనపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. వైద్య విద్య ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(సెంట్రల్): ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్ఐసీ) ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ బి.దుర్గా ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీమా చేసిన ఉద్యోగుల పిల్లలు అందుకు అర్హులని, దేశవ్యాప్తంగా 695 ఎంబీబీఎస్, 28 బీడీఎస్, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లు కేటాయించినట్లు చెప్పారు. నీట్(యూజీ)–2026 ర్యాంకు ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్కు జూన్ 21వ తేదీలోపు, అలాగే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కోసం జూన్ 24వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 20న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ 23వ విడత ఆర్థిక సహాయం ఈ నెల 20న విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ–కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సాయం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 2026–27 సంవత్సరానికి మొదటి విడత పెట్టుబడి సాయం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రూ.5వేలు, పీఎం కిసాన్ కింద రూ.2వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నా యి. అయితే ఎంత మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పీఆర్ ఈఈగా శివసాగర్రెడ్డి బాధ్యతల స్వీకరణ కర్నూలు(అర్బన్): కర్నూలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఈగా జి.శివసాగర్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఈఈలకు ఈఈలుగా పదోన్నతి కల్పించిన నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లాలో డీఈఈగా విధులు నిర్వహిస్తున్న శివసాగర్రెడ్డికి ఈఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు నియమించారు. -
ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక న్యాయ సహాయ సెల్
● జిల్లా జడ్జి జి.కబర్ధికర్నూలు(టౌన్): ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి జి.కబర్ధి తెలిపారు. బుధవారం ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రత్యేక సెల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో విద్యాభ్యాసం, ఉపాధి నిమిత్తం ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజల సంక్షేమానికి న్యాయ సహాయ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, న్యాయవాదులు లక్ష్మీనారాయణ, శివరాం, సులోచన, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. ఖైదీలకు న్యాయసహాయం అందిస్తాం జైలులో ఉన్న ఖైదీలు వారికున్న హక్కులను తెలుసుకోవాలని, ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. బుధవారం జిల్లా జైలులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ను, ములాఖత్ హెల్ప్ డెస్క్ను తనిఖీ చేశారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపర్చాలని ఆదేశించారు. లీగల్ ఎయిడ్ న్యాయవాదులు శివరాం, సులోచన, హెల్ప్డెస్క్ న్యాయవాది ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
ఖాళీ కుర్చీలు నవ్వాయి!
ఈ చిత్రం బుధవారం టెక్కె మార్కెట్యార్డులో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమ’ సభలో కనిపించింది. సభకు మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి గురించి వారు చెప్పకుండా వైఎస్సార్సీపీ, ఆ పార్టీ నాయకులను విమర్శించడమే పనిగా చేసుకున్నారు. దీంతో వారి మాటలు వినలేక కొందరు అధికారులు అసహనానికి గురికాగా సభకు వచ్చిన ప్రజలు అక్కడి నుంచి జారుకున్నారు. మంత్రుల ప్రసంగాలకు ముందే ఖాళీ కుర్చీలు నవ్వుతూ కనిపించాయి. సభకు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, పలువురు ముఖ్య నాయకులు డుమ్మాకొట్టడం చర్చనీయాంశం అయ్యింది. – నంద్యాల(అర్బన్) -
పొలాలన్నీ ఇసుక దిబ్బలే!
ఏ పొలం చూసినా ఇసుక దిబ్బలే.. కుంబళనూరు–నదిచాగి మెయిన్ రోడ్డుకు ఇరువైపుల పొలాలన్నీ ఇసుక దిబ్బలతో దర్శనమిస్తున్నాయి. ఇక్కడికి సమీపంలో ఇసుక రీచ్ నిర్వహిస్తున్నారు. అయితే కుంబళనూరు కొత్త గ్రామం నుంచి పాత గ్రామం వరకు పొలాలన్నింటినీ నిర్వాహకులు రెండింతల కౌలుకు మాట్లాడుకున్నారు. ఇక ఏ పొలం చూసినా ఇసుకతో నింపేస్తున్నారు. ఈ కారణంగా వాహనదారులు ఈ దారిలో ప్రయాణమంటే చుక్కలు చూస్తున్నారు. కొద్దిగా గాలి వస్తే చాలు ఇసుక కళ్లలో పడుతుండటంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు నోరు మెదపకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. – కౌతాళం -
ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడి
దేవనకొండ: ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. బుధవారం మండలంలోని కరివేముల గ్రామంలో రైతు సదాశివరావు హై–డెన్సిటీ ప్లాంటేషన్ కింద సాగు చేస్తున్న మామిడి పంటను కలెక్టర్ పరిశీలించారు. సూక్ష్మ నీటిసాగు సదుపాయాలతో సాగు చేస్తున్న ఇలాంటి తోటలు అధిక ఉత్పాదకత సాధించడంలో ఆదర్శమన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా తోటల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం దేవనకొండలో పలువురు రైతులు 16 ఎకరాల్లో సాగు చేస్తున్న హైబ్రిడ్ కొబ్బరితోటతో పాటు మిశ్రమ, అంతర పంటల విధానాలను కలెక్టర్ పరిశీలించారు. ఆ తర్వాత మన గ్రోమోర్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో యూరియా, ఎరువుల విక్రయాల్లో ఫిర్యాదులు ఉంటే 155251, 8341302863 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో విఫలమైన బండగట్టు, కుంకనూరు, ఆర్ఎస్కే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణరెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కాంట్రాక్టర్పై టీడీపీ నేతల దాడి
సాక్షి టాస్క్ఫోర్స్, కర్నూలు: ఏయ్.. మేము ప్రజాప్రతినిధి అనుచరులం. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఓ మున్సిపల్ కాంట్రాక్టర్పై దాడికి పాల్పడిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. అడ్డొచ్చిన ఆ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్పై దౌర్జన్యం చేశారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలివీ.. మంగళవారం సాయంత్రం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కాంట్రాక్టర్గా, అసోసియేషన్ నాయకులుగా ఉన్న రంగయ్యకు స్థానికంగా శ్రీరామ నగర్కు చెందిన సునీల్ కుమార్ పని విషయం మాట్లాడాలి రమ్మని ఫోన్ చేశాడు. దీంతో ఆయన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన తరువాత మా ఏరియాలో పనులు చేస్తున్నావు కదా.. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు. గొడవకు దిగారు. అంత ఇచ్చుకోలేనని, తన వద్ద లేవంటూ సమాధానమిచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ప్రజా ప్రతినిధి అనుచరులు కాంట్రాక్టను తీవ్రంగా కొట్టారు. తలపై, చెవిపై దాడి చేశారు. అక్కడి నుంచి బాదితుడు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని వైద్యం చేయించుకున్నాడు. కర్ణబేరి దెబ్బతినిందని చెప్పడంతో మరో ప్రెవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ విషయమై ‘సాక్షి’ బాధితుడితో మాట్లాడగా.. ‘‘నగరంలోని శ్రీరామనగర్కు చెందిన టీడీపీ ముఖ్యనేత అనుచరులు రూ.5 లక్షలు డిమాండ్ చేశారన్నారు. ఇవ్వకుంటే ఎలా పనులు చేస్తావో చూస్తామని బెదిరించారు. ఇలాగైతే కర్నూలులో ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతాయని వాపోయినా వినిపించుకోలేదు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు జరుగలేదు. 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ కాంట్రాక్టర్గా ఉన్నా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పనులు చేయడం మాత్రమే తెలుసు. ఇప్పుడు కర్నూలులో పనులు చేయలేని పరిస్థితి ఉంది. ఓ వైపు చేసినా పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నాం. మళ్లీ ఇప్పుడు అధికార పార్టీ నేత అనుచరులంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. భయాందోళనకు గురి చేయడం ఎంతవరకు సమంజసం.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టించుకోని పోలీసులు బాధితుడు బుధవారం సాయంత్రం తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని, కనీసం ఫిర్యాదు తీసుకోలేదని రంగయ్య వాపోయాడు. న్యాయం కోసం జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ను కలుస్తానన్నారు. తనపై దాడి చేసిన టీడీపీ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతానన్నారు. -
టీబీ డ్యాంలో 9.9 టీఎంసీల నీరు
హొళగుంద: కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాంలో బుధవారం నాటికి 9.903 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇన్ఫ్లో 319 క్యూసెకులు ఉండగా.. బళ్లారి పట్టణానికి, ఆర్బీసీ కాలువలకు 380 క్యూసెక్కుల (అవుట్ఫ్లో) నీటిని వదులుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 1605.27 అడుగుల వద్ద 29.145 టీఎంసీల నీరు నిల్వ ఉండి ఇన్ఫ్లో 14,621 క్యూసెక్కులు నమోదైంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఇప్పటికే రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలాఉంటే బళ్లారి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు బుధవారం టీబీ డ్యాం నుంచి ఎల్లెల్సీకి నీరు విడుదల చేశారు. దాదాపు 180 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నారు. ఎల్లెల్సీకి వదులుతున్న నీరు బళ్లారి పట్టణానికి మాత్రమే కావడంతో ఆంధ్ర ప్రాంత రైతులు నిరాశకు లోనవుతున్నారు. -
కల ‘పది’లమై.. భవిత ప్రశ్నార్థకమై!
కర్నూలు(సిటీ): నగరంలోని నరసింహారెడ్డి నగర్ రైల్వేస్టేషన్ ఎదురుగా పూరి గుడిసెలో నివాసముంటోంది నగిరి శ్రీవల్లి. ఈమె తల్లి నగిరి లక్ష్మి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నగిరి రాముడితో రెండో వివాహమైంది. పెళ్లయిన మూడేళ్లకే చిన్నారి శ్రీవల్లితో పాటు తల్లిని వదిలి ముఖం చాటేశాడు. విధిలేని పరిస్థితుల్లో బిడ్డతో సహా లక్ష్మి తిరిగి కర్నూలుకు చేరుకుంది. రైల్వేస్టేషన్కు ఎదురుగా ఖాళీ స్థలంలో ఓ చిన్న హోటల్ ఏర్పాటు చేసుకుంది. అదీ కలిసిరాక, కుమార్తె జీవితం తనలా కాకూడదనే దృఢ నిశ్చయంతో సమీపంలోని హోటల్లో పాచీ పని చేయసాగింది. ఇదే సమయంలో కుమార్తె జీవితంలో అక్షర దివిటీ వెలిగించింది. ఒక్కో మెట్టు ఎదుగుతున్న తీరు చూసి మురిసిపోయింది. పదో తరగతి చేరుకున్న తరుణంలో తన కల నెరవేరుస్తుందని చుట్టుపక్కల వారితో ఆనందం పంచుకుంది. ఇంతలో అనారోగ్యం బారినపడి గత ఏడాది డిసెంబర్లో మరణించింది. తల్లి పనిచేస్తున్న హోటల్లోనే కూలీగా ఉంటున్న మేనత్త విజయలక్ష్మి ఆసరాగా నిలవడంతో విధి ‘పరీక్ష’కు ఎదురొడ్డి నిలిచింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 453 మార్కులు సాధించింది. కలగా ఉన్నత చదువు తల్లి మరణంతో జీవితంలో చీకటి అలుముకున్నా చదువులమ్మ ఒడిలో రాణించసాగింది. పదిలో మెరుగైన ఫలితం సాధించినా ఇంటర్మీడియెట్ చదివేందుకు లక్ష్మీ కటాక్షం కరువైంది. విధిలేని పరిస్థితుల్లో తన తల్లి పనిచేసిన హోటల్లోనే కూలీగా మారింది. అక్కడికి వచ్చి వెళ్లే వారిలో ఎవరో ఒకరు అక్షర జ్యోతి వెలిగించకపోతారా అని దీనంగా వేడుకుంటోంది. ఈ నేపథ్యంలోనే గత నెల జిల్లా కలెక్టర్ను కలిసి తన దీనగాథను ఏకరువు పెట్టింది. కనీసం కస్తూర్బాలో సీటు ఇప్పించాలని అర్థించింది. మేము రైల్వేస్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఈ ప్రాంతంలో ఎంతో మంది అనాథలు కళ్లెదుటే అనారోగ్యంతో చనిపోవడం చూశాం. అప్పుడు మా అమ్మ నువ్వు డాక్టర్వై ఇలాంటి పేదలకు వైద్యం చేయాలని ఎప్పుడూ చెబుతుండేది. అమ్మ కలను నెరవేర్చడమే నా లక్ష్యం. పదో తరగతి పాసైన సంతోషాన్ని కూడా అమ్మ చూడలేకపోయింది. – నగిరి శ్రీవల్లి పదో తరగతిలో 453 మార్కులు హోటల్లో పనిచేస్తూ చదివించిన తల్లి పరీక్షలకు ముందే అనారోగ్యంతో మృత్యువాత బాలిక ఉన్నత చదువులకు కరువైన చేయూత -
మొహర్రం ప్రారంభం
బనగానపల్లె రూరల్: ఆకాశంలో మంగళవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మొహర్రం నెల ప్రారంభౖమైంది. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొహ ర్రం నెలతో ముస్లింలకు నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి బన గానపల్లె పట్టణంలో నవాబు వంశీయులు మీర్ ఫజల్అలీఖాన్ ఆధ్వర్యంలో నవాబు కోటలోని హజరత్ అబ్బాస్ పీర్లను భక్తిగీతాల మధ్య ఆస్థానం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం పీర్లను అందంగా ముస్తాబు చేసి, పూలదట్టీలు సమర్పించారు. షీయా మతస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా ఈ నెల 23న చిన్న సరిగెత్తు, 24న మధ్య సరిగెత్తు, 26న జుర్రేరు వాగులో పీర్ల నిమజ్జనంతో మొహర్రం ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. మంత్రి బీసీ జనార్దన్రెడ్డి హజరత్ అబ్బాస్ పీర్లను దర్శించుకుని ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. బనగానపల్లెలో హిందూ, ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. మొహర్రం పురస్కరించుకుని ఆస్థానాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. సీఐ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వైఎస్సార్సీపీ ఫేస్బుక్ పేజీని స్తంభింపజేయడం దుర్మార్గం
కర్నూలు (టౌన్): వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని స్తంభింపజేయడం దుర్మార్గమని ఆ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి ఖండించారు. ఆయన మంగళవారం ఎస్వీ కాంప్లెక్స్లో మాట్లాడుతూ.. ప్రజాదరణ పొందిన పార్టీ అధికార పేజీని తొలగించడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ఉన్న రాజకీయ పార్టీకి చెందిన ఫేస్బుక్ పేజీని కనిపించకుండా చేయడం దుస్సాహసమని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 1.4 మిలియన్ ఫాలొవర్స్ ఉన్న ఫేస్బుక్ పేజీని స్తంభింపజేయడం ప్రజల గొంతుకను అణచివేయడమేనని ధ్వజమెత్తారు. నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నందునే వైఎస్సార్సీపీ అధికారిక పేజీకి ఇంత ఆదరణ లభించిందన్నారు. దీన్ని స్తంభింపజేయడం అంటే ప్రజల నుంచి వస్తున్న భావాలను, అభిప్రాయాలను ప్రపంచం దృష్టికి రానీయకుండా చేసే దురుద్దేశమేనని వివరించారు. ఇదంతా నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ‘సర్’ ముసుగులో ఓట్లు తొలగించే కుట్ర సర్ ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా ఓటర్ల కులం, ఏ పార్టీ సానుభూతిపరుడు అనే వివరాలపై ఆరా తీస్తోందని ఆరోపించారు. ఆ సమాచారం అంతా సర్ పేరుతో టీడీపీ యాప్ రూపొందించిందన్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి లిస్టు పంపిస్తున్నారని, వైఎస్సార్సీపీ మద్దతుదారులను గుర్తించి వారి ఓట్లను తొలగించేందుకు ఫారం– 7 వాడాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. టీడీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. -
ఏసీబీ వలలో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ
వెల్దుర్తి: స్థానిక మేజర్ పంచాయతీ సెక్రటరీ (గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్) కే లక్ష్మీనాథ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ కర్నూలు రేంజ్ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన సంధ్యపోగు సతీష్ కర్నూలు రోడ్డు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఉన్న 13వ వార్డు వీధిలో ప్రభుత్వ స్థలానికి డీ పట్టా పొంది గుడిసె వేసుకున్నాడు. ఈ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు అప్రూవ్ చేయాలని పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ని సంప్రదించాడు. నిబంధనల పేరుతో కాల యాపన చేస్తూ అప్రూవ్ ఫీజుతోపాటు రూ.50 వేలు అదనంగా డిమాండ్ చేశాడు. దీంతో సతీష్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో సెక్రటరీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు వల పన్నారు. ఈ మేరకు మంగళవా రం మధ్యాహ్న సమయంలో సెక్రటరీ లక్ష్మీనాథ్ తన కారులో కర్నూలు వెళ్తూ హనుమాన్ జంక్షన్ సమీపంలోని ఓ హోటల్ వద్ద సతీష్ నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం తమ కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. కూటమి ప్రభుత్వంలో స్థానిక టీడీపీ నాయకుడి రెకమెండేషన్తో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీగా వచ్చి అక్రమాలకు పాల్పడాడు. అప్పటి సర్పంచ్ ముత్యాల శైలజ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధులు దాదాపు రూ.3 లక్షలు మింగేశాడన్న ఆరోపణతో అధికారులు లక్ష్మీనాథ్ను డోన్ మండలం దొరపల్లెకు బదిలీ చేశారు. అవినీతికి అలవాటు పడిన లక్ష్మీనాథ్ మళ్లీ టీడీపీ నేతలను పట్టుకుని వెల్దుర్తికి బదిలీపై వచ్చాడు. మంగళవారం ఏసీబీ అధికారులు సెక్రటరీని పట్టుకున్నారనే సమాచారం అందుకున్న ఓ టీడీపీ నాయకుడు సంఘటనాస్థలికి చేరుకుని అతడిని కాపాడే ప్రయత్నం చేయడం కనిపించింది. ఇంటి నిర్మాణ అనుమతులకు రూ.50 వేలు డిమాండ్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు వల వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు -
ఫర్టిలైజర్ డీలర్లు విలువలు పాటించాలి
బనగానపల్లె రూరల్: ఫర్టిలైజర్ దుకాణం డీలర్లు విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటునందించాలని ఏడీఆర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎం,జాన్సన్ సూచించారు. మంగళవారం మండలంలోని యాగంటిపల్లె గ్రామ సమీపంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో సీనియర్ శాస్త్రవేత్త ధనలక్ష్మీ అధ్యక్షతన వ్యవసాయ ఇన్పుట్ డీలర్స్ 2024–25వ సంవత్సరం ఉత్తీర్ణత పొందిన డీలర్లకు డిప్లొమా పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ జాన్సన్ మాట్లాడుతూ.. డీలర్లు నేర్చుకున్న వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతాంగానికి చేరవేయాలని, రైతులకు సమయానుకూల వ్యవసాయ సూచనలు, సలహాలు ఇచ్చి పెట్టుబడి తగ్గించాలన్నారు. ఎరువులు, పురుగు మందులు, పంటను చూసి రైతులకు నాణ్యమైన మందులను సిఫార్సు చేయాలన్నారు. ఆత్మ పీడీ బాలాజీనాయక్, దేశీ కార్యక్రమ సమన్వయ కర్త విశ్వనాథ్రెడ్డి, కేవీకే ఏఈ సురేష్కుమార్ శాస్త్రవేత్తలు, డీలర్లు పాల్గొన్నారు. ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని నారాయణ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఆ స్కూల్లో బీఏఎస్ (బెస్ట్ అవైలబుల్ స్కూల్) పథకం కింద ఎంపికై న విద్యార్థుల చదువు ఆటంకంగా మారింది. బీఏఎస్ పథకం కింద 2016 నుంచి నారాయణ పాఠశాలలో ఎం.అజయ్కుమార్, ఎం.సుదర్శన్, బి.హస్నమని (10వ తరగతి), జై.రీటాఅనైన్య (7వ తరగతి) చదువుతున్నారు. విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలను పాఠశాల నిర్వాహకులు తప్పుగా నమోదు చేయడంతో పథకం కింద నిధులు బదాలాయింపు కాలేదు. తర్వాత తప్పు తెలుసుకొని బ్యాంకు ఖాతా వివరాలు సరిచేసి ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి పంపగా నేటికి ఫైల్ పెండింగ్లో ఉంది. అన్ని కార్పొరేట్ స్కూళ్లకు బీఏఎస్ కింద బకాయిలు మంజూరుకాగా స్థానిక నారాయణ స్కూల్కు మాత్రం పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోంది. మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ను కలిసి బీఏఎస్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఉన్నఫలంగా ఫీజులు చెల్లించాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి ఎమ్మిగనూరు విద్యార్థుల సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ సతీష్కుమార్ను వివరణ కోరగా విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా నమోదు కావడంతో నిధులు మంజూరు కాలేదని చెప్పారు. వివరాలు సరిచేసి పంపామని, ఇంకా అప్రూవ్ కాలేదని, విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. డ్రంకెన్ డ్రైవ్లో ఇద్దరికి జైలు డోన్ టౌన్: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు డోన్ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూరుల్లా జైలు శిక్ష విధించారు. పట్టణ సీఐ ఇంతియాజ్బాషా తెలిపిన వివరాల మేరకు.. పట్టణ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన పట్టణానికి చెందిన కేఈ సురేంద్రగౌడ్, ఎన్.నాగరాజులపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. సురేంద్రగౌడ్కు మూడు రోజులు, నాగరాజుకు నాలుగు రోజులు జైలు శిక్షలు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. -
నీట్ రీ టెస్ట్ను పకడ్బందీగా నిర్వహించాలి
నంద్యాల: నీట్ రీ టెస్ట్ను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. మంగళవారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎస్సీఎల్ఏ, వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. నీట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలోని బేతంచెర్ల మండలం గూటుపల్లి గ్రామానికి సంబంధించిన భూముల సమస్యను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. గూటుపల్లి గ్రామంలోని భూములన్నీ వెబ్ల్యాండ్ రికార్డుల్లో ‘వక్ఫ్ బోర్డు భూములు’ ‘ఎండోమెంట్ భూములు’గా నమోదై ఉండటంతో గ్రామ ప్రజలు వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామం మొత్తం ఈ విధంగా నమోదుకావడం వల్ల భూ లావాదేవీలు, హక్కుల నిర్ధారణ తదితర అంశాల్లో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మాట్లాడుతూ రెవెన్యూ, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ అంశాల పురోగతి, భూ సంబంధిత సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్ఓ రాము నాయక్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అమెరికా విమాన ప్రమాదంలో జిల్లా వాసి దుర్మరణం
కోసిగి/కౌతాళం: అమెరికాలో ఈనెల 15న జరిగిన విమాన ప్రమాదంలో కోసిగి మండలం తుంబిగనూరుకు చెందిన దాట్ల సుబ్రమణ్యం రాజు కుమారుడు సాయి కార్తీక్ వర్మ (26) దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. దాట్ల సుబ్రమణ్యం రాజు, పద్మావతి దంపతుల సొంత గ్రామం కోస్తాంధ్రలోని భీమవరం కాగా 30 ఏళ్ల క్రితం కోసిగి మండలంలోని తుంబిగనూరుకు వచ్చి స్థిరపడ్డారు. వీరి ఏకై క కుమారుడు సాయికార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరిలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. అక్కడే స్టాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కాన్సాస్ రాష్ట్రంలో ఉంటున్నారు. ఈనెల 15న ఆదివారం సరదాగా గడిపేందుకు స్కైడైవింగ్ సహాస క్రీడలో పాల్గొనేందుకు వెళ్లాడు. స్కైడైవింగ్కు తీసుకెళుతున్న చిన్న విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలడంతో మంటలు చెలరేగి 12 మంది అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిసింది. అమెరికాలో ఉద్యోగం చేస్తు చేదోడుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
మ్యాపింగ్పై అనుమానాలు
● ఈ నెల 15 నుంచి బీఎల్ఓ, బీఎల్ఏలు ఇంటింటికీ వెళ్లి సర్వే ● 14వ తేదీకే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 76.74శాతం పూర్తి చేసిన అధికారులు ● ఆదోనిలో ఏకంగా 89.17శాతం మ్యాపింగ్, ఆలూరులో84.54 శాతం ● 2002 ఓటరు జాబితాలోని పేర్లను, ఇప్పటి పేర్లతో పోల్చి మ్యాపింగ్ ● వాస్తవానికి ఇళ్లిళ్లూ తిరిగి ఎన్యుమరేషన్ ఫారం ఇచ్చిన తర్వాతే మ్యాపింగ్ చేయాలి ● అధికారుల ఒత్తిడితో ఓటరు జాబితాలు టేబుల్పై పెట్టుకుని పని పూర్తి -
ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఈ నెల 15న మొదలైంది. ప్రతీ బీఎల్ఓ ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి ఓటరు ఉన్నారా? లేదా? విచారించి అప్పుడు మ్యాపింగ్ చేయాలి. అయితే బీఎల్ఓలు మాత్రం 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత జాబితా టేబుల్పై పెట్టుకుని ఇ
● ఈ నెల 14వ తేదికి ఆదోనిలో 89.17శాతం మ్యాపింగ్ పూర్తయింది. ఆదోనిలో 2002లో కౌతాళం మండలం ఉండేది. ఆలూరు నియోజకవర్గంలోని కొన్ని పల్లెలు ఉండేవి. ఇవన్నీ ఇప్పటి జాబితాతో 89.17 శాతం మ్యాపింగ్ చేశారంటే ఎంత గమ్మత్తుగా ఉందో ఇట్టే తెలుస్తోంది. ● ఆలూరు నియోజకవర్గంలో 2002లో ఇప్పటి ఆదోని మండలంలోని కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 84.54 శాతం మ్యాపింగ్ చేశారు. ● మంత్రాలయం మండలం 2002లో ఎమ్మిగనూరు పరిధిలో ఉండేది. ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గం. ఇక్కడ 82.15 శాతం మ్యాపింగ్ చేశారు.సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎస్ఐఆర్ను ఎన్నికల సంఘం నిర్వహించడం సర్వసాధారణమే. అయితే పశ్చిమబెంగాల్లో దాదాపు 90లక్షల ఓట్లు తొలగింపు తర్వాత ఈ ప్రక్రియపై కూడా దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలు అనుమానాలు లేవనెత్తుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీలో ఉండటంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగినా ప్రభుత్వ యంత్రాంగం అధికారపక్షం కనుసన్నల్లో నడవడం సర్వసాధారణం. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో ‘ఎస్ఐఆర్’ జరుగుతున్న తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 24 ఏళ్ల తర్వాత జరిగే ఈ ప్రక్రియలో చనిపోయిన వారు, వలసలు, డబుల్ ఎంట్రీలు చాలా ఉన్నాయి. ప్రతీ ఇల్లు డోర్ టు డోర్ తిరిగి, వారికి రెండుచొప్పున ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి పూర్తి చేసిన తర్వాత జూలై 14లోపు వాటిని తిరిగి బీఎల్ఓలకు అందజేయాలి. ఆపై మాత్రమే మ్యాపింగ్ చేయాలి. సెప్టెంబర్ 22న తుది ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. అయితే ఈ నెల 14కే 76.74 శాతం మ్యాపింగ్ అధికారులు పూర్తి చేశారు. బీఎల్ఓలు ఏ ఇంటికి వెళ్లారు? ఎవరిని విచారించారు? అనేది జిల్లాలో ఏ ఒక్క ఓటరుకు తెలీదు. మీడియాకు సమాచారం లేదు. అలాంటప్పుడు జూన్ 15 కంటే ముందుగానే మ్యాపింగ్ బీఎల్ఓలు ఎలా చేశారు? అందులో పారదర్శకత ఎంత అనేది తేలాల్సిన ప్రశ్న. అధికారుల ఒత్తిడితోనే 76.74 శాతం మ్యాపింగ్ జిల్లా అధికారుల ఒత్తిడితోనే మ్యాపింగ్ హడావుడిగా చేసినట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులే చెబుతున్నారు. ‘ఏం చేస్తాం సార్! మాపై తీవ్ర ఒత్తిడి ఉంది. అందుకే 2002 ఓటరు జాబితాను పెట్టుకుని మ్యాపింగ్ చేశాం. నిజానికి మీరు చెప్పినట్లు డోర్ టు డోర్ తిరిగి మ్యాపింగ్ చేస్తూ ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాలి’ అని చెబుతున్నారు. ఇప్పటికే 76.74 శాతం పూర్తయింది. కోడుమూరులో 79.13, పత్తికొండలో 78.59, ఎమ్మిగనూరులో 76.73, పాణ్యం 69.53, కర్నూలులో 58.04 శాతం మ్యాపింగ్ పూర్తయింది. ఇళ్లు తిరగకుండా మ్యాపింగ్ చేసిన అధికారులు ఎన్యుమరేషన్ ఫారాల తర్వాత కూడా ఓటర్ల గుర్తింపు, తొలగింపులో ఏ మాత్రం పారదర్శకత పాటిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం ● ఒక పోలింగ్ బూత్ పరిధిలోని ఓటరు మరో బూత్కు ఇల్లు మారి ఉంటారు. వీరి ఓటు బదిలీ చేసి మ్యాప్ చేయాలి. ● చనిపోయిన వారి ఓట్లు మ్యాపింగ్ చేయకూడదు. పూర్తిగా తొలగించాలి. ● జిల్లా వాసుల ఓట్లు పల్లెలు, పట్టణాలతో పాటు హైదరబాద్, బెంగళూరులోనూ ఉన్నాయి. అంతర్ రాష్ట్రాల పరిధిలోని ఓట్లను కో రిలేషన్ చేసి ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ద్వారా వాటిని గుర్తిస్తారు. అప్పుడు డబుల్ ఓట్లు తేలతాయి. అప్పుడు ఫారం–ఏ, బీ ఇచ్చి ఏ రాష్ట్రంలో ఓటు ఉండాలి.. ఎక్కడకు బదిలీ చేయాలనేది నిర్ణయించాలి. అప్పుడు ఓటరు నిర్ణయం ప్రకారం ఓటు ఎక్కడ ఉండాలో తేలుస్తారు. ● సెప్టెంబర్ 22న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన తర్వాత ఫారం–6 ఇస్తారు. అప్పుడు కొత్త ఓట్లు చేరుస్తారు. ఫారం–6 ఇప్పుడు కూడా ఓటరు అడిగితే ఇవ్వాలి. ఫారం–6 నిరంతర ప్రక్రియ. ● అలాగే ఫారం–8 ద్వారా బూత్ పరిధిలోని ఓటు మరో బూత్కు మారుస్తారు. ● ఇవన్నీ కూడా పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం. అప్పుడు డబుల్ ఓట్లు తగ్గుతాయి. కచ్చితమైన ఓటరు జాబితా తేలుతుంది. పోలింగ్ శాతం పెరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు కూర్చుని మ్యాపింగ్ చేసినట్లు చేస్తే సర్ చేసినా ప్రయోజనం ఉండదు. నియోజకవర్గం పూర్తయిన మ్యాపింగ్ శాతం ఆళ్లగడ్డ 88.61 శ్రీశైలం 88.59 నందికొట్కూరు 80.7 నంద్యాల 78.33 కోడుమూరు 79.13 పత్తికొండ 78.59 ఎమ్మిగనూరు 76.73 కర్నూలు 58.04 పాణ్యం 69.53 మంత్రాలయం 82.15 ఆదోని 84.54 .. ఇవన్నీ చూస్తే ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థమవుతోంది. డోర్ టు డోర్ తిరగకుండా ఈ స్థాయిలో మ్యాపింగ్ చేయడం పట్ల రాజకీయ పార్టీల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. -
కమనీయం.. స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేపట్టారు. రథోత్సవంలో ముందుగా అర్చకులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థ రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళా రూపాలు ఏర్పాటు చేశారు. రథోత్సవంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యురాలు లక్ష్మీదేవి, ఆలయ ఏఈవో జి.స్వాములు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
నంద్యాల(వ్యవసాయం): నీట్ – 2026 రీ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా మంగళవారం తెలిపారు. ఈనెల 21వ తేదీన నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి నివాస స్థలం నుంచి పరీక్ష కేంద్రం వరకు, తిరుగు ప్రయాణంలో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని చేయవచ్చునని సూచించారు. పరీక్షవిద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీస్లు శిరివెళ్ల: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు గ్రామ సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీస్లు జారీ చేయాలని డీఎల్డీఓ శివారెడ్డి ఎంపీడీఓను ఆదేశించారు. మంగళవారం కోటపాడు, జీనేపల్లె గ్రామ సచివాలయలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయాల సిబ్బంది హాజర్ పట్టిక, రికార్డులను పరిశీలించారు. తల్లికి వందనం ఆన్లైన్, సామాజిక పింఛన్ల పంపిణీ తర్వాత మిగులు డబ్బులు తిరిగి కార్యాలయానికి చెల్లింపులో అలసత్వం వహించిన వెల్ఫేర్ అసిస్టెంట్పై డీఎల్డీఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్తో ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన డిజిటల్ అసిస్టెంట్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీఓ శివమల్లేశ్వరప్పను ఆదేశించారు. ఈ నెల 17లోగా యోగాంధ్ర రిజిష్ట్రేషన్లు పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి మనోహర్ను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అశ్వనికుమార్ పాల్గొన్నారు. అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి మంగళవారం కర్ణాటక రాష్ట్రం హుబ్లికి చెందిన కె.ఆనంద బసవరాజ్ రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు పి.దేవికకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. ఎరువుల అమ్మకాలు నిలుపుదల నంద్యాల(అర్బన్): ఎరువులను ఎమ్మార్పి కంటే అధికంగా అమ్ముతుండటంతో విజిలెన్స్, వ్యవసాయాధికారులు రూ.22.62 లక్షల ఎరువుల అమ్మకాలను నిలిపి వేశారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని నూకల ఎల్లయ్య, న్యూ వసువాహిణి, హర్షిత ఎంటర్ప్రైజెస్, లక్ష్మి వెంకట పద్మావతి ట్రేడర్స్లలో విజిలెన్స్ వ్యవసాయాధికారి విశ్వనాథ్, ఎస్ఐ వెంకటప్రసాద్, మండల వ్యవసాయాధికారి ప్రసాదరావుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 20:20:0:13 ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తుండటాన్ని తెలుసుకొని రూ.22.62 లక్షల విలువైన 95.6 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలిపి వేశారు. నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం బొమ్మలసత్రం: పోలీస్శాఖ సమష్టి కృషితో నంద్యాలను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని ఎస్పీ సునీల్ షోరాణ్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని పోలీస్ ఉన్నతాధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్ట్ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించామన్నారు. నిర్ణీత గడువులోగా పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచేలా చూడాలన్నారు. నమోదైన కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్లో నమోదు చేయాలని సూచించామన్నారు. తీవ్రమైన నేరాలపై దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. దోపిడీ, దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ దొంగలను పట్టుకునేందుకు అధునాతన సాంకేతికతను వినియోగించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు, ఏఎస్పీ జావళి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, రామాంజినాయక్, శ్రీనివాస్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
‘ఆత్మకూరు అనకొండ’ కేసును సీబీసీఐడీకి అప్పగించండి
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్లో భారీ మొత్తంలో ప్రభుత్వ సొమ్మును ఆ శాఖలో పర్యవేక్షక అధికారిగా ఉన్న చాంద్బాషా తన బంధువులు, పరిచయస్తుల ఖాతాలకు మళ్లించిన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. స్థానిక పోలీసులు కేసుమోదు చేసినప్పటికీ దర్యాప్తు నత్తనడకన సాగింది. ఈ కేసులో మొదట్లో రూ. లక్షల్లో స్వాహా అయినట్లు వెలుగు చూసినా అటవీ శాఖ అధికారుల విచారణలో రూ.7.80 కోట్లుగా తేలడంతో జిల్లాలో సంచలనమైంది. రూ. కోట్లలో ప్రభుత్వ నిధుల స్వాహా కావడంతో దర్యాప్తు వేగవంతానికి అటవీ అధికారు లు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ‘ఆత్మకూరు అనకొండ’ కేసు ప్రాధాన్యతను బట్టి సీబీసీఐడీకి అప్పగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు రాష్ట్ర అటవీశాఖ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) చలపతిరావు మంగళవారం తెలిపారు. నల్లమల అటవీ చెక్పోస్ట్లో వాహనాల నుంచి వసూలు చేసే పర్యావరణ రుసుం వంటి పలు ఇతర అటవీ శాఖా ఆదాయపు సొమ్మును ఫీల్డ్ డైరెక్టర్ ఖాతాకు పంపకుండా చాంద్బాషా కొత్తగా బంధువులు, కుటుంబీకుల పేరుపై కొత్త ఖాతాలు తెరిచి అందులోకి మళ్లించాడు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తరువాత గానీ అక్రమాలు బయట పడలేదు. ఈ కేసులో ప్రాథమిక అంచనాల మేరకు రూ.25 లక్షలు చాంద్ బాషా కాజేసినట్లు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తులో ఇది రూ.4 కోట్లు స్వాహా చేసినట్లు రికార్డు అయ్యింది. ఈ కేసులో చాంద్బాషాతో పాటు పలువురు అరెస్ట్ కూడా అయ్యారు కూడా. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అటవీశాఖ ఏడుగురితో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరు బ్యాంకు ఖాతాలను, ఇతర రికార్డులను పరిశీలించిన తరువాత అటవీశాఖ నిధుల స్వాహా కేసులో రూ.7.80 కోట్లు మాయం చేసినట్లు తేల్చారు. ఈ కేసుపై అప్పటి ఎన్ఎస్టీఆర్ ఎఫ్డీపీటీ బి. విజయకుమార్ కూడా తన నివేదికను ప్రభుత్వానికి అందించారు. నిబంధనలను అనుసరించి కేసును సీబీసీఐడీకి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర అటవీ దళాల ప్రధానాధికారి చలపతిరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖిత పూర్వంగా కోరారు. ఈ కేసులో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందోననే చర్చ జరుగుతోంది. ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర అటవీశాఖ ప్రధానాధికారి రూ.7.80 కోట్ల అటవీశాఖ సొమ్మును సొంత ఖాతాలకు మళ్లించిన ఉద్యోగి -
మల్లన్న సేవలో బ్రిగేడ్ కమాండర్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను సేనా మెడల్ గ్రహీత బ్రిగేడ్ కమాండర్ రాహుల్ మచ్హరాల్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం మల్లన్న దర్శనార్థం విచ్చేసిన కమాండెంట్ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద ఈఓ ఎం.శ్రీనివాసరావు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కమాండెంట్ దంపతులు మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, భ్రమరాంబా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గల ఆశీర్వచన మండపంలో కమాండెంట్ దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామి వారి జ్ఞాపికను అందించి సత్కరించారు. -
ఆర్డీఎస్ను సందర్శించిన కేఆర్ఎంబీ చైర్మన్
కర్నూలు(సిటీ): తుంగభద్ర నదిపై ఉన్న రాజోలి డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టను మంగళవారం కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ బిశ్వాస్, సభ్యులు కేకే జాన్గిడ్లు సందర్శించారు. ఆర్డీఎస్ కాలువకు తమకు కేటాయించిన నీరు రావడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి చేసిన ఫిర్యాదు మేరకు చైర్మన్ ఆనకట్టను, కాల్వను, తెలంగాణ వైపు ఉన్న హెడ్ రెగ్యులేటర్, గేట్లను, ఏపీ వైపు నిర్మాణంలో ఉన్న కుడి కాల్వ నిర్మాణ పనులు, ఆనకట్ట కింది భాగంలో ఉన్న పైపులను పరిశీలించారు. తమకు కేటాయించిన 15 టీఎంసీల నీరు ఆయకట్టుకు అందడం లేదని, ఆనకట్ట దిగువన ఏపీ వైపు వెళ్లే నీటిని బంద్ చేయించాలని తెలంగాణకు చెందిన ఇంజినీర్లు చైర్మన్ను కోరారు. అదే విధంగా కర్ణాటక ఇంజినీర్లు ఆర్డీఎస్ ఆనకట్ట అర్ధ అడుగు పెంచేందుకు చేపట్టిన పనులు ఏపీకి చెందిన వారు నిలిపివేశారని, దీనివల్ల తమ ఆయకట్టుకు అందాల్సిన నీరు అందడం లేదని చైర్మన్కు విన్నవించారు. ఆనకట్ట మీదుగా ఏపీ వైపు వచ్చిన చైర్మన్ ఆనకట్ట దిగువ భాగంలో ఉన్న పైపుల గురించి ఆరా తీశారు. ఆర్డీఎస్ కుడి కాలువ కేటాయింపులు, న్యాయస్థానంలో కేసుల వివరాలు చైర్మన్కు ఇంజినీర్లు వివరించారు. కేఆర్ఎంబీ చైర్మన్ పర్యటన షెడ్యూల్ ప్రకారం బుధవారం మధ్యాహ్నా నికి కేసీ కెనాల్కు నీటిని మళ్లించేందుకు నిర్మించిన సుంకేసుల బ్యారేజీని పరిశీలించాల్సి ఉంది. అయితే ఏ కారణం చేతనే తెలియదు కాని చైర్మన్ తన షెడ్యూల్ను మార్చుకుని కర్ణాటకలోని రాయచూరు నుంచి హైదరాబాదుకు వెళ్లిపోయారు. -
బకాయిలు కట్టకుంటే బయటే!
● ఆర్యూ హాస్టళ్లకు తాళాలు ● మెస్ బిల్లులు చెల్లిస్తేనే లోపలికి.. కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీలో రోజుకో సమస్య ఉత్పన్నమవుతోంది. విద్యార్థి సంఘాల నాయకుల గొడవలు, అధికారులు, విద్యార్థి సంఘ నేతల మధ్య వాగ్వివాదాలు, విద్యార్థులపై కేసుల నమోదు, యూనివర్సిటీ నుంచి బహిష్కరణ, తాజాగా వర్సిటీ హాస్టళ్లకు తాళాలు వేసి విద్యార్థులను అనుమతించకపోవడం లాంటివి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం, అడ్మిషన్ల సమయంలో ఇలాంటివి తీవ్ర ప్రభావం చూపుతాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. వర్సిటీ మెన్స్ హాస్టల్లో 600 మంది, ఉమెన్స్ హాస్టల్లో 450 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు చెల్లించాల్సిన ఫీజు కోట్లలో బకాయి ఉంది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో హాస్టళ్ల నిర్వహణ కష్టంగా మారింది. అధికారుల చర్యలు.. విద్యార్థులకు అవస్థలు వేసవి సెలవుల అనంతరం వర్సిటీ సోమవారం పునఃప్రారంభమైంది. రెండు రోజులు గడిచినా విద్యార్థులకు భోజనం అందడం లేదు. ఈ నెల 27 నుంచి పీజీ సెమిస్టర్, బీటెక్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాస్టల్ వసతి, మెస్ లేకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. మెస్ చార్జీల బకాయిలు చెల్లిస్తేనే హాస్టళ్లు తెరుస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో లైబ్రరీ రూమ్స్, హాస్టళ్ల బయటే విద్యార్థులు పడుకోవాల్సి వస్తోంది. తక్షణమే వసతి గృహాలు తెరవాలని విద్యార్థులు కోరుతున్నారు. -
పర్యాటకానికి దారేది..
బేతంచెర్ల: కనుమకింది కొట్టాల గ్రామ సమీపంలో ప్రసిద్ధి గాంచిన బిల్వసర్గం గుహలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సందర్శనకు వస్తున్నారు. ఈ గుహల వద్ద నాలుగు సినిమాల షూటింగ్ కూడా జరిగింది. అయితే రహదారిలో అడుగడుగునా గోతులు ఏర్పడ్డాయి. బురదమయంగా మారడంతో ద్విచక్రవాహనదారులు సైతం వెళ్లేందుకు భయపడుతున్నారు. బేతంచెర్ల నుంచి సుమారు 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ రహదారి నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 ఫిబ్రవరిలో రూ.3.35 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 2023లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. రహదారి ఘాట్ రోడ్డుగా ఉండడంతో ముందుగా రక్షణ గోడలు నిర్మించి, రహదారి వెంట కంకర వేశారు. ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పెండింగ్ పనులు పూర్తి చేయడం లేదు. రహదారి ఛిద్రమై వాహనాలు వెళ్లలేని దుస్థితి దాపురించినా పాలకులు పట్టించుకోవడం లేదు. -
తహసీల్దార్ కార్యాలయమా.. టీడీపీ ఆఫీసా?
బనగానపల్లె: బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయం టీడీపీ కార్యాలయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. సర్ సర్వే జరుగుతున్న సమయంలో ఈఆర్వో విభాగంలో మంత్రి బీసీ జనార్దన్రెడ్డి బంధువులైన ఇద్దరు టీడీపీ కార్యకర్తలను జిల్లా ఉన్నతాధికారులు ఎటువంటి వేతనాలు చెల్లించకుండా నియమించుకున్నారని ఆర్డీఓ నరేంద్రనాథ్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోమవారం బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతి పత్రం అందజేసి వివరాలు వెల్లడించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లను తొలగింపే ధ్యేయంగా కుట్ర జరుగుతుందన్నారు. ఈఆర్ఓ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న ఇద్దరిని ఇతర విభాగానికి మార్పు చేసి, వారి స్థానంలో సచివాలయం, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలని కోరారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని ఇద్దరు టీడీపీకి చెందిన కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించి సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్తో పాటు న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చివరకు అధికారులు స్పందించకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తానని కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు.. బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంలో దొంగ ఓట్ల నమోదుపై వారం రోజుల క్రితం నంద్యాలలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు స్వయంగా ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాటసాని రామిరెడ్డి గుర్తు చేశారు. ఈఆర్ఓ విభాగంలో ఆపరేటర్లుగా పని చేస్తున్న టీడీపీ కార్యకర్తలు ఫారం–6 అర్హత లేకున్నా టీడీపీ అనుచరులను ఓటర్లుగా చేర్చుతున్నారన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో బనగానపల్లె పట్టణంలోని 30 పోలింగ్ కేంద్రాల్లో కొత్తగా 170 మంది ఓటర్లను నమోదు చేశారన్నారు. అయితే 89వ బూత్లో ఫారం–6కు నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు బీఎల్ఓలు చెబుతుండగా 17 ఓట్లు ఎలా నమోదయ్యాయని ప్రశ్నించారు. బీఎల్వోలకు సంబంధం లేకుండానే ఏఈఆర్వో లాగిన్ నుంచి ఈఆర్వో లాగిన్కు పంపి 11 ఓట్లను అక్రమంగా నమోదు చేసినట్లు కాటసాని ఆరోపించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను అర్హులైనప్పటికీ ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారన్నారు. ఫారం–8 స్లిప్ ద్వారా ఇళ్లు మారిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓటర్లను పరిశీలించి మళ్లీ ఓటర్ల జాబితాలో నమోదు చేయకుండా ఉద్దేశ పూర్వకరంగా తొలగిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు అంబటి రవికుమార్రెడ్డి, అనిల్, జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రామ్మోహన్రెడ్డి, నాయకులు సుదర్శన్రెడ్డి, కాటసాని రామకృష్ణారెడ్డి, మౌలి, బలిజ రమణ పాల్గొన్నారు. ఎన్నికల విభాగంలో అనధికార వ్యక్తులు విధుల నిర్వహణ ఎలా దొంగ ఓట్లను చేర్చందుకు టీడీపీ నేతల కుట్ర అర్హులను తొలగిస్తే న్యాయ పోరాటం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి -
దేవుడు కనిపిస్తాడు..
బేతంచెర్ల: 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బేతంచెర్ల మండల పరిధిలోని అంబాపురం గ్రామం మీదుగా రూ. 5 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ క్రాస్ రోడ్డు నుంచి శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి ఆలయం వరకు బీటీ రహదారి ఏర్పాటు చేసింది. కాని అంబాపురం గ్రామ సమీపంలో కిలోమీటర్ మేర ఫారెస్టులో ఉండటంతో అనుమతులు రాక రహదారి నిర్మాణం నిలిపేశారు. అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి రాళ్లు తేలి ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి శనివారం బనగానపల్లె వైపు నుంచి మద్దిలేటి నరసింహస్వామి ఆలయానికి ఈ రహదారి మీదుగా భక్తులు చేరుకుంటారు. రాళ్ల రహదారిలో ప్రయాణించలేక దేవుడా.. అంటూ నిట్టూర్చుతున్నారు. -
భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలి
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే భక్తులు వంద శాతం సంతృప్తి చెందే విధంగా ఆయా సౌకర్యాలు మెరుగుపరచాలని కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దేవస్థానం అధికారులను ఆదేశించారు. సోమవారం దేవస్థాన పరిపాలన భవనంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. దేవస్థానం పరిధిలో మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ, శౌచాలయాల నిర్వహణ వంటి మౌలిక వసతుల కల్పనపై భక్తుల నుంచి వందశాతం సానుకూలత స్పందనే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి. మురళీబాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు బి. మల్లికార్జునరెడ్డి, కె. వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. భక్తులకు అందుబాటులోకి ఏడు కాటేజీలు శ్రీశైల దేవస్థానంలో నిర్మాణం పూర్తయి దాతల ఆధీనంలో ఉన్న ఏడు కాటేజీలను స్వాధీనం చేసుకున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు శ్రీశైల దేవస్థానంలో దాతల సహకారంతో 42 కాటేజీలు నిర్మించామన్నారు. కాటేజీల నిర్మాణం పూర్తయినప్పటికీ దేవస్థానానికి అప్పగించకపోవడంపై దేవస్థాన ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టామన్నారు. ఈ మేరకు ఈనెల 13వ తేదీన ఒక కాటేజీ అప్పగించారని అన్నారు. దాతల ఆధీనంలో ఉన్న మొత్తం ఏడు కాటేజీలను దేవస్థానం స్వాధీనం చేసుకుని, దినసరి అద్దైపె భక్తులకు వసతి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రైతులను మోసగించిన చంద్రబాబు నంద్యాల: చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్నదాతలను దారుణంగా మోసం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం పార్టీ రైతు విభాగం నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భరత్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ హయాంలో మే నెల రాగానే ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేదని, ప్రస్తుతం జూన్ నెల సగం దాటినా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రైతులకు అందలేదన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం ఒక్క రైతుకు కూడా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు కొండంత అండగా నిలిచి సున్నా వడ్డీ, పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందించిందని గుర్తు చేశారు. రైతులకు ఉపయోగపడే నంద్యాల పట్టణంలోని రెండెకరాల మార్కెట్యార్డు భూములను టీడీపీ కార్యాలయానికి కేటాయించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్.రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జనార్ధన్ రెడ్డి, మెట్టు వెంకటేశ్వర రెడ్డి, రత్నబాబు చౌదరి, వైఎస్సార్సీపీ రైతు విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు వంగాల మహేశ్వర రెడ్డి, నాగేశ్వర రెడ్డి, రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్, దేవేందర్ పాల్గొన్నారు. -
హైవేలోనూ గుంతలే..
డోన్ టౌన్: 44వ నంబరు జాతీయ రహదారి నియోజకవర్గంలో దాదాపు 50 కిలో మీటర్ల మేర ఉంది. డోన్ మండలంలోని జగదుర్తి గ్రామం నుంచి ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామం వరకు ఉన్న జాతీయ రహదారిలో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం కిలో మీటరుకు వంద గుంతలు ఏర్పడగా ప్యాచ్లు వేసి మమా.. అనిపించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్యాచ్లు ఛిద్రమై వాహనదారులను భయపెడుతున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్, ఎస్పీ, రవాణ శాఖ, కలెక్టర్ అధికారులు ఈ రహదారిపై బ్లాక్ స్పాట్లను గుర్తించారే కానీ చర్యలు తీసుకోలేదు. కార్లు, ఆటోలు, జీపులు, వ్యాన్లు, బైక్లు గుంతల్లో పడి మరమ్మతులకు గురవుతున్నట్లు వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏడాదిన్నరకే నూరేళ్లు!
● నీటి బకెట్లో పడి బాలుడి మృతి కొత్తపల్లి: బుడిబుడి అడుగులు వేస్తూ తన అల్లరితో కుటుంబంలో అందరినీ అలరించిన ఏడాదిన్నర చిన్నారికి నూరేళ్లు నిండాయి. ప్రమాదవశాత్తూ నీటి బకెట్లో పడి బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన గోకవరం గ్రామ పంచాయతీలోని మజారా గ్రామమైన ఎం.లింగాపురంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కదిరి ఆంజనేయులు, కృష్ణవేణి బాయిలకు ఓ కూతూరు, కుమారుడు ఉన్నారు. ఆంజనేయులు హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకు సిద్ధార్థ నందన్కు ఏడాదిన్నర వయస్సు ఉంది. ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతున్నాడు. ఆంజనేయులు సోమవారం ఉదయాన్నే హమాలీ పనులకు వెళ్లి భోజనం చేసేందుకు ఇంటికి వచ్చాడు. కృష్ణవేణి అతనికి భోజనం వడిస్తున్న క్రమంలో సిద్ధార్థ నందన్ ఇంట్లో నుంచి ఆడుకుంటూ బయటకు వెళ్లా డు. అయితే అప్పటికే ఇంటి ఆవరణలో ఆమె దుస్తులు ఉతికేందుకు బకెట్లో నిండుగా నీళ్లు పట్టి ఉంచింది. సిద్ధార్థ నందన్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బకెట్లో పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తల్లి బయటకు వచ్చి నీటిబకెట్లో తలకిందులుగా పడి ఉన్న కుమారుడిని చూసి లబోదిబోమంది. అపస్మారక స్థితిలో బాలుడిని కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి మార్గమధ్యలో మృతిచెందినట్లు ధ్రువీకరించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది. -
ప్రేమ జంటపై టీడీపీ నాయకుల దౌర్జన్యం
● పోలీసుల సమక్షంలో యువకుడికి బెదిరింపులు ● యువతిని కుటుంబ సభ్యులతో పంపిన నేతలు సాక్షిటాస్క్ఫోర్స్: ఓ ప్రేమ జంటను టీడీపీ నాయకులు విడదీశారు. ఈ ఘటన డోన్ అర్బన్ పోలీసు స్టేషన్లో సాక్షాత్తు పోలీసుల ఎదుట జరగటం చర్చానీయాంశం అయ్యింది. డోన్ పట్టణానికి చెందిన మమాబూబ్ బాషా అనే యువకుడు ప్యాపిలి మండలంలోని గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి వారం రోజుల క్రితం తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. పోలీసుల ఒత్తిడితో డోన్కు వచ్చిన ఆ ప్రేమ జంటను స్టేషన్లో ఒక పోలీసు అధికారి కౌన్సెలింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా అక్కడికి గార్లదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చేరుకున్నారు. పోలీసు అధికారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడమే కాక అమ్మాయిని తమ వెంట పంపాలని అధికార జులుం ప్రదర్శించారు. ఇందుకు అధికారి నిరాకరించడంతో టీడీపీ నాయకులు తీవ్ర పదజాలంతో దూషించారు. సమస్య తీవ్రరూపం దాల్చకుండా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మేజర్ అయిన యువతిని టీడీపీ నాయకునితో కలిసి వచ్చిన బంధువులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. ఈ తతంగం అంతా చూసి యువకుడి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యా రు. ప్రస్తుతం యువకుడు పోలీసుల అదుపులో ఉండగా యుతిని మాత్రం అధికార పార్టీ నాయకులు తమ వెంట తీసుకెళ్లారు. మేజర్లు అయిన ఒక ప్రేమ జంటకు భద్రత కల్పించాల్సిన పోలీసు అధికారులే మౌనం దాల్చడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా అర్బన్ సీఐ ఇంతియాజ్బాషాని ఈ విషయంపై వివరణ అడుగగా.. కౌన్సెలింగ్ అనంతరం అమ్మాయి అభీష్టం మేరకు వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. -
జగనన్న హయాంలోనే గిరిజనులకు పెద్దపీట
గత ఐదేళ్ల జగనన్న పాలనలో గిరిజనులకు పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర అన్నారు. గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవితో పాటు నామినేటెడ్ పదవుల్లో, స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత కల్పించి గిరిజనులకు నిజమైన రాజ్యాధికారం అందించారన్నారు. మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉమ్మడిగా ఉండేదని, అయితే జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించారన్నారు. నాడు జగనన్న ప్రతి తండాకు రోడ్లు, తాగునీరు, విద్యుత్, విద్య సౌకర్యాలు కల్పించి అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ప్రీతిబాయి కేసుపై ఎందుకు ప్రశ్నించవు.. సుగాలి ప్రీతిబాయికి అన్యాయం చేశారని, పవన్కల్యాణ్ ఆరోజు ఊగిపోయి మాట్లాడారని, ఈ రోజు సీబీఐకి కేసు విచారించడానికి తమవద్ద నిధులు లేవని, చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందదని వైఎస్సార్సీపీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర విమర్శించారు. అదే వైఎస్ జగన్ హయాంలో ప్రీతిబాయి కుటుంబానికి 5 ఎకరాల పొలం, 5 సెంట్ల స్థలం, తండ్రికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వడంతో పాటు కేసును సీబీఐకి ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. నేడు చంద్రబాబు ఈ కేసు పట్ల నోరు మెదపకున్నా నాడు ప్రశ్నించిన పవన్కల్యాణ్ నేడు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లలో 30 మంది గిరిజన చిన్నారులు చనిపోయినా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. గిరిజనులకు 1.86 లక్షల మందికి 3 లక్షల ఎకరాల ఆర్వోఆర్ పట్టాలు, 25,573 మందికి 38,801 ఎకరాల డీకేటీ పట్టాలు నాడు జగన్ గిరిజనులకు అందించారన్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 15వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. చౌడేశ్వరిదేవి ఆలయానికి రూ. లక్ష విరాళం బనగానపల్లె రూరల్: నందవరం శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి నంద్యాల పట్టణానికి చెందిన నల్లబోతుల ఉమాశంకర్, హనుమక్క కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని ఆదివారం అందజేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పీవీ కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు దాత కుటుంబసభ్యులను సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేశారు. సైక్లింగ్తో శారీరక దృఢత్వం బొమ్మలసత్రం: ప్రతిరోజు అరగంట పాటు సైక్లింగ్ చేయడంతో శారీరక ధృడత్వం లభిస్తుందని ఏఆర్ అడిషనల్ ఎస్పీ చిన్నికృష్ణ అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిట్నెస్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం ఆయన ఆధ్వర్యంలో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పోలీస్ అధికారులతో పాటు యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. స్థానిక పద్మావతినగర్ ఇండోర్ స్టేడియం నుంచి శ్రీనివాససెంటర్ మీదుగా గాంధీచౌక్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలిలో భాగంగా ఎన్నో అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వాటిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు వ్యాయామం, సైక్లింగ్ చేస్తూ ఆరోగ్యంగా జీవించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే వ్యాయామంపై ఆసక్తి పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు సూర్యమౌళి, వేణుగోపాల్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. బయలు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహా క్షేత్రంలో ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామి వారికి దేవస్థానం విశేష పూజలు నిర్వహించారు. అమావాస్య రోజున భక్తులు కూడా పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించింది. ఆదివారం 40 మంది భక్తులు ఈ విశేష పూజలు జరిపించుకున్నారు. ముందుగా మహాగణపతి పూజను జరిపించారు. పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించారు. ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని పండితులు పేర్కొంటున్నారు. బయలు వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్న ఈఓ తదితరులు -
డీలరూ.. కంది పప్పు ఏదీ!
బనగానపల్లె రూరల్: కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు చౌక దుకాణాల్లో నిత్యావసర సరుకుల పంపిణీలోనూ కోత విఽధిస్తోంది. ప్రతి నెల పేదలకు చౌక దుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధమ పిండి, జొన్నలు లేదా రాగులు అందజేయాల్సి ఉంది. అయితే రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం పంపిణీ తప్పా కంది పప్పు, జొన్నలు, రాగుల జాడ లేదు. అరకొరగా చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌక దుకాణాల్లో రూ. 67లకు కిలో కంది పప్పు ఇచ్చేవారు. ప్రస్తుతం మార్కెట్లో పేదలు కొనలేనిస్థితిలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో రూ.125–150 వరకు ఽఉంది. పేదలకు సబ్సిడీపై అందజేయాల్సిన నిత్యావసర సరుకుల పంపిణీ నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బనగానపల్లె నియోజవర్గంలోని బనగానపల్లె, కోవెలకుంట్ల, అవుకు, కొలిమిగుండ్ల సంజామల మండలాల్లో మొత్తం 193 రేషన్ దుకాణాల పరిధిలో 77,981 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్క కార్డుదారుడికి కిలో కందిపప్పును ప్రతి నెల సరఫరా చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కొన్ని నెలలు మాత్రమే బియ్యంతో పాటు అరకొరగా కందిపప్పును సరఫరా అయ్యింది. గత సంవత్సరం నుంచి రేషన్కార్డుదారులకు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. దీంతో చౌకదుకాణాల్లో కందిపప్పు ప్యాకెట్లు చూద్దామన్నా కనిపించడం లేదు. ఎప్పటి నుంచి ఇస్తారని కార్డుదారులు అడిగినా డీలర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు. చౌక దుకాణాల్లో బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ కందిపప్పు సరఫరాపై చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం మార్కెట్లో పెరిగిన ధరలతో పేదలపై భారం -
మహానందికి పోటెత్తిన భక్తులు
మహానంది: మహానంది క్షేత్రం శనివారం వీకెండ్ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటూ వివిధ ప్రాంతాలకు చెందిన వేలా ది మంది భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా దర్శన సౌకర్యం కల్పించారు.అయితే సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు మహా మంగళ హార తి సమయంలో భక్తులను అనుమతించకపోవడంతో ఆలయరాజగోపురం నుంచి అధికసంఖ్యలో వేచి ఉన్నారు. హారతి సమయం తర్వాత అందరిని ఒకేసారి అనుమతించడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అలాగే ఒక్కొక్క కొబ్బరి కాయకు విక్రయ దారులు రూ.50 తీసుకున్నట్లు భక్తులు తెలిపారు. అధికారులు స్పందించి నిబంధనల మేరకు కొబ్బరికాయల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కో రారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆలయ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, దేవస్థాన సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు. -
2002లో ఓటు హక్కు లేకపోతే ఏం చేయాలి?
కర్నూలు(సెంట్రల్): రేపటి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వేకు 2002 ఓటరు జాబితా అత్యంత కీలకం. ఈ జాబితా 2025 జాబితాలను పోల్చుతూ సర్వే చేస్తారు. ప్రస్తుతం జాబితాలో పేరు ఉండి.. 2002 జాబితాలో పేరు లేకపోతే ఏమి చేయాలన్నదే సందేహం. ఈ క్రమంలో ఓటర్ల సందేహాలను తీర్చేందుకు ఎన్నికల కమిషన్ ముందుకొచ్చింది. జాబితాలో పేర్లు లేని సందర్భాలు.. ● 2002లో పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్లిన ఆడవాళ్లు ● 2002లో ఓటు హక్కు వయసు రాకపోవడం ● 2002లో ఓటు హక్కు వచ్చినా ఏదైనా కారణం చేత ఓటరుగా నమోదు కాకపోవడం ● ప్రస్తుతం పైన చెప్పిన సందర్భాల ఓటర్ల వివరాలు 2025 జాబితాలో ఉంటాయి. అయితే 2002 జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో ‘సర్’ సర్వేలో సందేహాత్మక ఓటర్లుగా నిలుస్తారు. ఈ క్రమంలో వారంతా కింది నిబంధనలను ఫాలో అయితే 2002 జాబితాలో పేర్లు లేకపోయినా ఎన్నికల కమిషన్ ఓటరుగా ఆమోదిస్తుంది. ఆ నిబంధనలు ఏమిటంటే.. ● వీరు పుట్టిన ఊరికి వెళ్లాలి. ● అక్కడ 2002 జాబితాలో అమ్మ, నాన్న, తాత/అవ్వల పేరు ఉంటే వారి పేరు, సీరియల్ నంబర్ తెలుసుకోవాలి. ● ఆ సీరియల్ నంబర్ను మీరు ఇప్పుడు ఉంటున్న బీఎల్ఓకి ఇవ్వాలి. ● బీఎల్ఓ ఆ నంబర్తో సరిపోల్చుకొని జాబితాలో మ్యాపింగ్ చేస్తారు. ఇది చేయకపోతే ఏమి జరుగుతుంది? ● ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ● 2002 ఓటరు జబితా ఎక్కడ దొరుకుతుంది? ● ప్రతి ఊరి తహసీల్దార్ ఆఫీసు నుంచి 2002 ఓటరు లిస్టులను ఆ ఊరి బీఎల్ఓ/అంగన్వాడీ టీచర్కు ఇచ్చారు. ● మీరు పుట్టిన ఊరి బీఎల్ఓని కలిసి జాబితాను పొందవచ్చు. -
టెట్ నుంచి మినహాయించాలి
నంద్యాల(న్యూటౌన్): 2010 సంవత్సరానికి ముందు అపాయింట్మెంట్ అయిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు సురేష్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం ప్రకారం అందరూ టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇచ్చిందన్నారు. దీంతో విద్యాహక్కు చట్టం 2009లో వచ్చిందని, అంతకన్న ముందు నియామకం పొందిన ఉపాధ్యాయు లకు టెట్తో సంబంధం లేదన్నారు. యూ టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ ప్రసాద్ మాట్లాడుతూ అర్హత మార్కులు కాకుండా ఓసీ, బీసీ అనే కాకుండా అందరికీ 40 శాతం మార్కులు పెట్టాలని, సిలబస్ కూడా అందుకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. టెట్ను రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు వినతి పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే మండల, జిల్లా, రాష్ట్ర కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. సమావేశంలో యూటీఎఫ్ సభ్యులు సత్యప్రకాష్, కిశోర్, రామకృష్ణుడు, సుజాత, సంధ్యా, జ్యోతి, నాగచిన్నమ్మ, ప్రతాప్, నరసింహారెడ్డి, చంద్రశేఖర్, చిన్న య్య, తదితరులు పాల్గొన్నారు. -
● గతేడాది జూన్ ప్రారంభం నాటికి జీడీపీని చేరిన వరద నీరు ● ఈ ఏడాది ఇప్పటి వరకు కనిపించని వైనం
గా‘జల’దిన్నె వెలవెల! గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి నిల్వ రోజు రోజుకు తగ్గిపోతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది జూన్ నెల ప్రారంభం అయ్యే సరికి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరిది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు చుక్కనీరు రాలేదు. గతంలో జూన్ నెలలో 2 టీఎంసీలు నీరు నిల్వ ఉండి డోన్, కృష్ణగిరి, పత్తికొండ ప్రాంతాల్లో 120 గ్రామాలకు సరఫరా అయ్యేది. కర్నూలు, కోడుమూరు, లద్దగిరి, గూడూరు, బెళగల్, గుడిపాడు ప్రాంతాలకు తాగునీటి కోసం సరఫరా చేసేవారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో తాగునీటి పథకాలకు ఇబ్బంది లేదని అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది రబీలో ప్రాజెక్టు కింద దాదాపు 13 వేల ఎకరాలలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాదైన వర్షాలు కురిసి ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతుందో లేదో వేచిచూడాలి. ఇదిలా ఉండగా ప్రాజెక్టులో ఉన్న నీటిని ఇతర ప్రాంతాల వారు తమ రాజకీయ బలంతో నీటిని మళ్లించుకుని వెళ్తున్నారు. దీంతో ప్రాజెక్టు చుట్టు పక్కల గ్రామాలకు తాగునీటి సమస్య వస్తే ఎలా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. -
మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట
బేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం శుభ దినాలను పుర స్కరించుకొని జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజామున ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. అభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన పూజ ల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు. -
క్రైస్తవ సంఘం పవిత్రతకు ప్రతీక
● అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలి ● బిషప్ ది రైట్ రెవ.డా.పి.ఐజక్ వరప్రసాద్ ఆదోని: క్రైస్తవ సంఘం అనేది ఒక క్రమాని కి, పవిత్రతకు ప్రతీక అని సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ బిషప్ ది రైట్ రెవరెండ్ డా.పి.ఐజక్ వరప్రసాద్ తెలిపారు. చర్చీల్లో చొరబడుతున్న కొన్ని అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాయలసీమలోని ఐదు జిల్లాల్లో కొన్ని సీఎస్ఐ చర్చీల్లో కొందరు కాపరులే (పాస్టర్లు) బాధ్యతలు తప్పి ప్రవర్తించటం బాధాకరమని పేర్కొన్నారు. అటువంటి వారిపై ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొందరు డయాసిస్ చట్ట సభలు, సమావేశాల్లోకి దౌర్జన్యంగా చొరబడి, తోటి గురువులపై భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఎనిమిది మందిపై కడప వన్టౌన్లో క్రిమినల్ కేసు నమోదు చేయించామని పేర్కొన్నారు. అలాగే వాట్సాప్ ద్వారా చేస్తున్న అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూపు అడ్మిన్లపై తగు చర్యల కోసం సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశామన్నారు. ఇలాంటి వాట్సాప్ గ్రూపుల నుంచి గురువులు తక్షణమే వైదొలగాలని, ఇప్పటికే అల్లరిమూకలో ఉన్న కొందరిని డయాసిస్ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. -
అనాథ చెంచు యువతి పెళ్లికి సహాయం
ఆత్మకూరురూరల్: కొట్టాల చెర్వు చెంచు గూడెంకు చెందిన నాగమణికి చిన్నతనంలోనే తల్లిదండ్రి అనారోగ్యంతో మరణించారు. అనాథ అయిన నాగమణిని బంధువులు పెంచి పెద్ద చేశారే కానీ.. పెళ్లి చేసేంత స్థోమత వారికి లేదు. ఆమెకు ఇటీవల వివాహం కుదిరింది. అయితే పెళ్లికి కనీస ఖర్చులకు కూడా డబ్బుల్లేవు. ఈ విషయం తెలుసుకున్న ఇందిరేశ్వరం అటవీ సెక్షన్ ఎఫ్ఎస్ఓ మహబూబ్బాషా తన వంతుగా సహా యం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేర కు శనివారం ఆయన కొట్టాలచెర్వుకు వెళ్లి నాగమణికి రూ. 5 వేలు, ఒక బియ్యం ప్యాకెట్ ఉడతా భక్తిగా అందించారు. చెంచు యువతి వివాహానికి దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఫారెస్ట్ అధికారి మహబూబ్ బాషా కోరారు. అదుపు తప్పిన ట్రాక్టర్ సంజామల: రామభద్రునిపల్లె గ్రామ సమీపంలో శనివారం అదుపుతప్పిన ట్రాక్టర్ కల్వర్టులోకి దూసుకెళ్లింది. పేరుసోముల గ్రామానికి చెందిన షరీఫ్ ట్రాక్టర్లో నాపరాళ్ల లోడును సంజామలలో అన్లోడ్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా రామభద్రునిపల్లె సమీపంలో అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు లారీలు ఢీ.. ఇద్దరికి గాయాలు హాలహర్వి: రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన హాలహర్వి సమీపంలోని క్షేత్రగుడి దగ్గర శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని నుంచి సిమెంట్ లోడు వేసుకుని ఒక లారీ బళ్లారికి వెళ్తోంది. బళ్లారి నుంచి ఐరన్ వేసుకుని మరొక లారీ హాలహర్వికి వస్తోంది. రెండు లారీలు హాలహర్వి సమీపంలోని క్షేత్రగుడి దగ్గర ఎదురెదురగా ఢీకొన్నాయి. ఇద్దరు లారీ డ్రైవర్లు ఉమేష్ కుమార్, జగదీష్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. హాలహర్వి ఎస్ఐ ఈశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. -
విద్యుత్ వైర్ల దొంగలు హల్చల్
● 20 మంది రైతుల బోర్ల తీగలు అపహరణ పాణ్యం: వ్యవసాయ బోర్ల మోటార్లకు ఏర్పా టు చేసిన విద్యుత్ తీగలను దొంగలు అపహరించారు. మండల కేంద్రమైన పాణ్యం – వడ్డుగండ్ల రస్తాలో శనివారం తెల్లవారు జామున దాదాపు 20 బోర్లకు చెందిన తీగలను కట్ చేసి దొంగిలించారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులకు బోర్ల తీగలు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. స్టార్టర్ నుంచి భూగర్భంలో మోటార్కు అమర్చిన ఉన్న వైర్ను దొంగలు బలవంతగా లాగడం వలన కనెక్షన్ తెగిపోవడంతో రైతులపై భారం పడుతోంది. కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు రూ. 10 –15 వేల వరకు ఖర్చు అవుతోంది. భూగర్భంలో ఉన్న మోటార్ను బయటకు తీసి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తీగల దొంగల వల్ల పాణ్యంలో 20 మందిలపై భారం పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగలను పట్టుకుని చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
మాజీ కార్పొరేటర్పై అక్రమ కేసు
● అరెస్ట్, బెయిల్ మంజూరు ● అక్రమ కేసులపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే కాటసాని కర్నూలు (టౌన్): చిన్నపాటి గొడవలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 26వ వార్డు తాజా మాజీ కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే సంఘటనకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలించిన జడ్డి బెయిల్ మంజూరు చేశారు. వివరాల మేరకు.. కర్నూలు కృష్ణనగర్లోని వార్డు పరిధిలోకి వచ్చే విఠల్ నగర్ సవారి తోట వద్ద ఓ రోడ్డు విషయంలో దాదాపు నెలన్నర క్రితం స్థానిక టీడీపీ అనుచరుడుతో చిన్న పాటి గొడవ జరిగింది. రోడ్డును ఆక్రమించి ఇళ్లు కడుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న లక్ష్మీకాంత రెడ్డి పనులు నిలిపివేయాలని కోరారు. ఇదే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది జరిగి దాదాపు 48 రోజులవుతోంది. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకు అప్పట్లో కార్పొరేటర్, స్థానికుడి మల్లికార్జున ఇరువురిపై కేసులు నమోదు చేశారు. అయితే ఇన్ని రోజలు పట్టించుకోని పోలీసులు శనివారం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉదయం ఇరువురిని స్టేషన్కు పిలిపించి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని పరీక్షలు చేశారు. ఇద్దరిని జడ్జి అపర్ణ ఎదుట హాజరు పరిచారు. జడ్జి అన్నంటిని క్షుణంగా పరిశీలించి బెయిల్ మంజూరు చేశారు. అనంతరం ఇద్దరు కల్లూరులోని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిని కలిశారు. కాగా లక్ష్మీకాంత రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటసానికి ముఖ్య అనుచరుడుగా కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీలో చురుగ్గా పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతోనే టీడీపీ నేతలు అతనిపై కక్ష గట్టారని, నెలన్నర క్రితం జరిగిన సంఘటనను సాకుగా చూపుతూ పోలీసులతో అరెస్ట్ చేయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వైఎస్సార్సీపీలో బలమైన నాయకులను టార్గెట్ చేసుకొని అరెస్టులు చేయిస్తున్నారు. టీడీపీ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతూ వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేయడం తగదు. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదని టీడీపీ నాయకులు తెలుసుకోవాలి. – మాజీ ఎమ్మెల్యే కాటసాని -
ఉద్యోగుల ఊరు చెన్నాపురం
స్థితిగతులు మార్చిన చదువు చెన్నాపురం ఏరియల్ ఫ్యూ ఎమ్మిగనూరుసెంట్రల్: మట్టిని నమ్ముకున్న రైతులు తమ కష్టం బిడ్డలకు వద్దని వారిని బాగా చదివించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలను బిడ్డలు నిజం చేశారు. ఇప్పుడు చెన్నాపురం అంటే ఉద్యోగులపురంగా ఖ్యాతి గడించింది. ఎమ్మిగనూరు మండలంలోని చెన్నాపురం గ్రామంలో 320 కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ పత్తి, వరి, వేరుశనగ, మిరప పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. గ్రామంలో ప్రతి ఇంట్లో డిగ్రీ, పీజీ చేసిన విద్యావంతులున్నారు. గ్రామంలో 60 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా అధికంగా ఉపాధ్యాయ, పోలీస్ శాఖలో కొలువుదీరారు. ప్రభుత్వ పాఠశాలలోనే చదువులు గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే చదివారు. ఉత్తమ విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని గ్రామస్తుల నమ్మకం. గ్రామంలోని యువత తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి ఎటువంటి చెడు అలవాట్లకు పోకుండా చక్కగా చదువుకుని ఉన్నత విద్యావంతులుగా తయారయ్యారు. వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక వైపు చదువుతూనే ఉద్యోగాలు సాధించి కన్నవారి కలలను సాకారం చేశారు. గ్రామాభివృద్ధి పేరిట సేవా కార్యక్రమాలు గ్రామంలో ఉద్యోగాలు సాధించి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఉద్యోగులు గ్రామాభివృద్ధి కోసం కూడా పా టు పడుతున్నారు. చెన్నాపురం గ్రామాభివృద్ధి సంఘం పేరిట వివిధ సేవా కార్యక్రామాలు చేపట్టారు. పేదల కు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పోటీ పరీక్షలకు మెటీరియల్ అందించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్లలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. నూతనంగా ఉద్యోగాలు సాధించిన వారికి సన్మానాలు చేశారు.దశాబ్దాల క్రితం చెన్నాపురంలో నిరక్షరాస్యత అధికంగా ఉండేది. సంప్రదాయ వ్యవసాయంతో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టాల రావడంతో పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదని బడిబాట పట్టించారు. ఇది ఆ ఊరి స్థితి గతులను మార్చింది. నాడు ఒక్కరితో మొదలైన ప్రభుత్వ కొలువు నేడు పదుల సంఖ్యకు చేరింది. ఉపాధ్యాయ వృత్తిలో 14 మంది, పోలీస్శాఖలో 25 మంది రాణిస్తున్నారు. పోలీస్ శాఖలో ఒకరు సీఐగా, మరొకరు ఎస్ఐగా ఉన్నారు. గ్రామంలో ఇద్దరు ఎంబీబీఎస్ చదువుతున్నారు. మరికొంతమంది సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేట్ రంగాల్లో రాణిస్తున్నారు. -
రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం
● టీడీపీ కార్యకర్తల వేధింపులే కారణంనంద్యాల: టీడీపీ కార్యకర్తల వేధింపులు భరించలేక గోస్పాడు మండలంలోని నెహ్రూనగర్కు చెందిన రేషన్ డీలర్ వెంకట లింగారెడ్డి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలివీ.. వెంకట లింగారెడ్డి గ్రామంలో దాదాపు 20 సంవత్సరాలకు పైగా రేషన్ డీలర్గా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు లింగేశ్వర్ రెడ్డి జాతీయ ఉపాధి హామీ పథకం ఏర్పడినప్పటి నుంచి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంకటలింగారెడ్డి డీలర్పోస్టును, కుమారుడు లింగేశ్వరరెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును అధికారులపై ఒత్తిడి తెచ్చి తొలగించారు. వీరు అన్యాయంగా మమ్మల్ని తొలగించారని కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మేరకు తిరిగి డీలర్షిప్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు పొందారు. ఇదే క్రమంలో ఇంటి వద్ద చిన్నపాటి బంకు ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నాయకులు డీలర్ పోస్టు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు వీరికే రావడంతో ఈ వ్యవహారం మింగుడు పడక చివరకు వెంకటలింగారెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న బంకును గ్రామంలో ఉండకుండా తొలగించారు. దీంతో చేసేది లేక వెంకట లింగారెడ్డి కుటుంబం బంకును పక్కకు తీసుకొని ఇంటి వద్దనే ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా చాలదని వారి ఇంటి ఎదురుగా మట్టి తోలి ట్రాఫిక్ సమస్యను సృష్టించారు. దీంతో టీడీపీ నాయకుల ఆగడాలు భరించలేక వెంకటలింగారెడ్డి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తులసీశ్వరరెడ్డి అండతో గ్రామ టీడీపీ నాయకులు బైరెడ్డి కొండారెడ్డి(దత్తు కొండారెడ్డి), బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడి రమణారెడ్డి, తాడి రాఘవేంద్రరెడ్డిలు ఉద్దేశపూర్వకంగా తనను వేధిస్తుండటంతో అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు ‘సాక్షి’తో వాపోయాడు. -
అనారోగ్యంతో ఉండే పోలీసులను బదిలీ చేస్తాం
బొమ్మలసత్రం: వయసురీత్యా కొందరు పోలీసులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, వారి విజ్ఞప్తి మేరకు బదిలీ చేసేలా చూస్తున్నామని ఎస్పీ సునీల్షెరాన్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీసులకు గ్రీవెన్స్డే కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో పనిచేసే సిబ్బందితో పాటు హోంగార్డులు హాజరై ఎస్పీకి నేరుగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. భ్రమరాంబాదేవికి ఊయలసేవ శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబాదేవికి శుక్రవారం అమ్మవారి మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థాన అర్చకులు శాస్త్రోక్తంగా ఊయలసేవ నిర్వహించారు. సాయంత్రం ఏడు గంటలకు సేవా సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. ఊయలలో స్వామిఅమ్మవార్లను ఆశీనులను చేసి షోడశోపచార పూజల అనంతరం అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామ పూజలు జరిపించారు. అనంతరం శ్రీశైలం లోనీ అంకాలమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుడి గడ్డివాములకు నిప్పు ఆళ్లగడ్డ: వైఎస్సార్సీపీ నాయకుడి వరి గడ్డివాములకు టీడీపీకి చెందిన కొందరు దుండగులు నిప్పు పెట్టిన సంఘటన శుక్రవారం ఆళ్లగడ్డ మండలం యాదవాడలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వరిగడ్డి కొనుగోలు చేసి యాదవాడ గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరసింహారెడ్డి పొలం దగ్గర వాములు వేసుకున్నాడు. పొలం దగ్గర ఎవరూ లేని సమయంలో ఎవరో నిప్పు పెట్టడంతో వాములు దగ్ధమయ్యాయి. ‘చంద్రబాబు వె న్నుపోటుకు రెండేళ్లు’ నిరసనకు శుక్రవారం గ్రా మం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తలించుకురావడంతో జీర్ణించుకోలేని టీడీపీకి చెందిన కొందరు దుండగులే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారని నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మోస్తరు వర్షం నంద్యాల(అర్బన్): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఒక మోస్తరు వర్షం కురిసింది. బండిఆత్మకూరు మండలంలో అత్యధికంగా 49.2 మి.మీ, చాగలమర్రి మండలంలో అత్యల్పంగా 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది. జూపాడుబంగ్లాలో 44.8, వెలుగోడు 28.6, పాములపాడు 21.8, పగిడ్యాల 16.4, గడివేముల 14.8, కొత్తపల్లి 14.6, ఆత్మకూరు 12.8, మహానంది 12.2, శ్రీశైలం 10.2, మిడుతూరు 5.8, నంద్యాల అర్బన్ 4.4, కోవెలకుంట్లలో 1.6మి.మీ వర్షం కురిసింది. ఆర్యూ నుంచి ఇద్దరు విద్యార్థుల బహిష్కరణ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఇద్దరు విద్యార్థులను బహిష్కరిస్తూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వర్సిటీ కళాశాలలో తెలుగు పీజీ నాల్గవ సెమిస్టర్ చదువుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్కుమార్ను వర్సిటీ నుంచి బహిష్కరించారు. వర్సిటీ అధికారులపై నిందలు వేయడం, వర్సిటీ కళాశాల గురించి తప్పుడు ప్రచారాలకు పాల్పడటం, ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే కారణాలతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో విద్యార్థి వర్సిటీ కళాశాలలో ఇంగ్లిష్ పీజీ నాల్గవ సెమిస్టర్ చదువుతున్న రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్(ఆర్పీఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షులు బి.నాగరాజును వర్సిటీ నుంచి బహిష్కరించారు. ఇతను క్రమశిక్షణ లేని ప్రవర్తనతో ప్రవర్తించాడని, వర్సిటీ అధికారులతో అసభ్య పదజాలం వాడుతూ వాగ్వివాదానికి దిగాడనే కారణాలతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు. -
గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు వస్తున్న అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని 32వ స్వర్ణవార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ప్రజలకు అందుబాటులో సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వర్ణవార్డు పరిధిలోని కుటుంబాల వివరాలు, పథకాల అర్హతలు, సేవల డెలివరీ స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని నవీకరించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ వార్డుకు వచ్చిన పలువురు స్థానికులతో కలెక్టర్ ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అందిన వినతులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. -
వేసవి సెలవులను ఆనందంగా గడిపి మొదటి రోజు పాఠశాలకు వస్తున్న విద్యార్థులూ.. మీ బడుల రాత మారలేదు. గతేడాది ఏ సమస్యలు వేధించావో.. అవే మళ్లీ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం సర్కారు బడులపై శీతకన్ను వేయడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నాడు
కిట్టులోని వస్తువులు ఇండెంటు చేరినవి నోట్బుక్స్ 8,39,965 8,19,061 బ్యాగులు 1,39,679 0 బెల్టులు 93,644 0 బూట్లు 1,39,679 0 యూనిఫాం 1,39,679 1,39,679 డిక్షనరీలు 14,527 0 వర్క్బుక్స్ 89,442 82,975 టెక్ట్స్బుక్స్ 6,38,577 6,18,334 ఉయ్యాలవాడ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లకు సిమెంట్ రేకులను అడ్డుగా పెట్టిన దృశ్యం నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రెండేళ్లుగా దృష్టి సారించకపోవడంతో సమస్యలు వేధిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన విద్యార్థుల సంక్షేమ పథకాల పేర్లు మార్చడం తప్ప బడుల్లో ప్రగతి జాడలు కనిపించడం లేదు. 2026 – 27 విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభమవుతోంది. గతంలో మొదటి రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు కిట్లు ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కిట్లుగా పేరు మార్చారు కానీ... పాఠశాలల పునఃప్రారంభం రోజున ఇవ్వకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకు స్కూల్ పాయింటుకు పూర్తి స్థాయిలో బుక్స్ చేరలేదు. బ్యాగ్లు, బూట్లు, బెల్ట్లు ఒక్కటీ కూడా జిల్లా కేంద్రానికే రాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అసౌకర్యాల మధ్య ఆయా ప్రధానోపాధ్యాయులు పాఠశాలలు పునః ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 1,956 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2.71 లక్షలు మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 997, ప్రాథమికోన్నత 21, ఉన్నత పాఠశాలలు 327, ఎయిడెడ్ 46 పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలన్నీ శుక్రవారం నుంచి పునఃప్రారంభమై అరకొర వసతుల మధ్య చదువులు కొనసాగనున్నాయి. బ్యాగులు.. బూట్లు రాలేదు.. గతంలో పాఠశాలలు పునః ప్రారంభం రోజు పుస్తకాలు, కిట్స్ రెడీగా ఉండేవి. కూటమి సర్కారుకు ముందు చూపు లేకపోవడంతో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు విద్యా మిత్ర కిట్స్ అందుబాటులో లేవు. జిల్లాలోని 1,391 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 1.30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బెల్టులు, డిక్షనరీలు, బ్యాగులు, స్కూల్ యూనిఫాం, వర్క్ బుక్స్ ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో సగానికి పైగా కిట్లు స్కూల్ పాయింట్కు చేరలేదు. బూట్లు 1,39,679 అవసరం ఉండగా ఒక్కటి కూడా రాలేదు. డిక్షనరీలు 14,527 అవసరం ఉండగా ఒక్కటీ కూడా ఇవ్వలేదు. యూనిఫాం 1,39,679 మందికి ఒ క్కొక్కరికి మూడు జతల చొప్పున రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఒక జత మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాగులు, బూట్లు అసలే రాలేదు. ఎప్పుడు ఇస్తారో విద్యాశాఖ అధికారులకే స్పష్టత లేదు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం గత ప్రభుత్వంలో నాడు – నేడు కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. అసౌకర్యాల మధ్యనే విద్యార్థులు చదువుకోవాల్సిన దుస్ధితి ఉంది. అర్ధాంతరంగా ఆగిన పను లు కూటమి ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి. – సురేష్యాదవ్, వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడులను పట్టించుకోవడం లేదు. నిధులు మంజూరు చేస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. గత ప్రభుత్వంలో అదనపు తరగతి గదుల నిర్మాణాలు పది నుంచి 20 శాతం మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. నిధులు మంజూరు చేసి అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. – ఎర్రిస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈనెల 12 నుంచి యథావిధిగా అన్ని పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మెరుగైన విద్యా బోధన, వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో పుష్కలంగా ఉన్నాయి. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లల్ని చేర్పించాలి. కార్పొరేట్ పాఠశాలల్లో మూస పద్ధతిలో బట్టీ చదువులు ఉంటాయనేది గ్రహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలపై దృష్టి సారిస్తాం. – జనార్దన్రెడ్డి, డీఈఓ, నంద్యాల -
‘చెరువు పనులు మేమే చేస్తాం’
● పోలీసు స్టేషన్లో తెలుగు తమ్ముళ్ల పంచాయితీ బేతంచెర్ల: అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలతో గోర్లగుట్ట చెరువు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. చెరువు అభివృద్ధి కోసం మైనర్ ఇరిగేషన శాఖ రూ.9.6 లక్షల మంజూరు చేయగా పను లు ప్రారంభించిన రోజున వివాదం చెలరేగింది. చెరువులో కంప చెట్ల తొలగింపు, కట్ట బలోపేతం వంటి పనులకు ఆర్డర్ తెచ్చుకున్నామని ఓ టీడీపీ వర్గం బుధవారం పనులు ప్రారంభించింది. అయి తే అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుడు కూడా.. తన వద్ద పనుల అనుమతి ఉందంటూ పనులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోంది. మేమే పనులు చేస్తాం.. అంటూ రెండు వర్గాలు పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివాదం మరింత ముదరడంతో ఒక వర్గం వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇరు వర్గాల నాయకులను పోలీస్ స్టేషన్కు పిలిపించి చర్చలు నిర్వహించినట్లు సమాచారం. చెరువు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాల్సిన సమయంలో రాజకీయ ఆధిపత్య పోరు కారణంగా పనులు నిలిచిపోవడంపై గ్రామస్తులు విమర్శలు చేస్తున్నారు. -
వంతెన.. వంచన
డోన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మంజూరైన పలు అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. నిధులు లేవంటూ రెండేళ్లుగా ఎక్కడి పనులను అక్కడే నిలిపేసింది. నంద్యాల, కర్నూలు రైల్వే గేట్ల సమస్య కూడా ఇదే కోవకు వస్తాయి. పట్టణ నడి బొడ్డున ఉన్న గుంతకల్లు – నంద్యాల వైపు వెళ్లే రైల్వే గేటు, కర్నూలు – గుంతకల్లు వైపు వెళ్లే రెండు ప్రధాన రైల్వే గేట్ల కింద రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణం కోసం అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కృషి చేశారు. సమస్యను అప్పటి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ సహాయ మంత్రి పీయూస్ గోయల్, రైల్వే శాఖ జనరల్ మెనేజర్ గజనంద మాలవ్య, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మెనేజర్ అనూప్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు, మరో వైపు గుంతకల్ డీఆర్ఎంలతో కలిసి ఆర్యూబీ పనులు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ల ఆధ్వర్యంలో 32 కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులతో కలిసి ప్రతేక్య బృందాలుగా ఏర్పడి కలిసి విన్నవించడంతో ఆర్యూబీలు మంజూరయ్యాయి. గత ప్రభుత్వంలో రూ.12 కోట్లు కేటాయించారు. ఈ మేరకు 2023 జూలై 3వ తేదీ పనులకు బుగ్గన శంకుప్థాన చేశారు. ఈ పనులతో స్థల సేకరణలో నష్టపోయిన బాధితుల కోసం రూ.3 కోట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థలసేకరణ అటకెక్కింది. ఈ సందర్భంలో అండర్ పాస్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం మోకాలొడ్డడంతో ఆర్యూబీ పనులు అంగుళం కూడా కదలలేదు. అండర్ పాస్ నిర్మాణం పనుల కోసం అప్పటి కాంట్రాక్టర్ సిద్ధం చేసిన పదుల సంఖ్యలో సిమెంట్ రింగ్ బండ్ల్ నేటికీ నిరుపయోగంగా ఉన్నాయి. నేడు చలో నంద్యాల, కర్నూలు రైల్వే గేట్లు.. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయన స్వగృహం నుంచి పోలీస్ స్టేషన్, కోర్టు, పాత బస్టాండ్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో కలిసి చలో రైల్వే గేట్లు కార్యక్రమాన్ని చేపట్టారు. అత్యంత ప్రాధాన్యత ఉన్న రైల్వే గేట్ల వద్ద ఆర్యూబీ లాంటి సమస్యను పరిష్కరించకుండా మొద్దు నిద్ర పోతున్న కూటమి ప్రభుత్వాన్ని మేల్కొపడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజా ప్రతినిధులకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. మూడు ప్రధాన రైల్వే గేట్లతో పట్టణం మూడు భాగాలుగా విడిపోయింది. భవిష్యత్త్లో రైలు, గూడ్సుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూడు గేట్లను శాశ్వతంగా మూసివేస్తారు. వీటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాల వారి కోసం ఆర్యూబీ మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం అటకెక్కించడం దుర్మార్గం. రైల్వే గేట్ల సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. – బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మాజీ మంత్రి -
నాడు – నేడుకు నిధుల్లేవు..
గత ప్రభుత్వం పాఠశాలల్లో రెండవ విడత నాడు – నేడు కింద అదనపు గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, ప్రహరీలు, వంటగదుల నిర్మాణ పనులను తలపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులు నిలిచిపోయాయి. పాఠశాలలు ప్రారంభమవుతున్నా జిల్లాలో పలుచోట్ల వాటర్ ప్లాంట్లు, మరుగుదొడ్లు మరమ్మతులకు నోచు కోవడం లేదు. నాడు – నేడు నిధులతో స్కూళ్ల ప్రారంభ సమయానికి ముస్తాబు కావాల్సిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో 28 మండలాల్లో నాడు – నేడు పనుల్లో చివరి దశకు చేరుకున్న వాటిని పూర్తి చేయాలని భావించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 9.8 కోట్లతో మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు, వాటర్ ప్లాంట్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులు ఆదేశించినా పనులు నేటికీ కూడా పనులు పూర్తి కాలేదు. అదనపు తరగతి గదుల నిర్మాణాలు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పైసా కూడా విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. -
నేడు వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు
నంద్యాల: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్న డిమాండ్తో జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనాలన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల వంచన పాలనను ఎండగడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆందోళనలో భాగంగా ఈనెల 3వ తేదీన వైఎస్సార్సీపీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో పోస్టర్లు, బుక్లెట్లు ఆవిష్కరించామని, 4వ తేదీన మండల కేంద్రాల్లో టీడీపీ మ్యానిఫెస్టో, సూపర్ సిక్స్ హామీలు, బాండ్లను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశామన్నారు. జూన్ 8వ తేదీన ప్రభుత్వ వైఫల్యాలను చెప్పే విధంగా సమావేశాలు నిర్వహించి నల్ల బెలూన్లు ఎగురవేశామన్నారు. అలాగే చంద్రబాబు మోసాలను, టీడీపీ నాయకుల అక్రమాలను ఫొటో గ్యాలరీలు పెట్టి ప్రజలకు వివరించామన్నారు. ఈ నెల 12న శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ‘ బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు, నిరుద్యోగులు, యువకులు, మహిళలు భారీగా తరలి వచ్చి గళం వినిపించాలన్నారు. కాటసాని రాంభూపాల్రెడ్డి -
రిషీ.. పలకవేమీ?
గోనెగండ్ల: ‘రిషీ.. పలకవేమీ’ అంటూ తల్లిదండ్రులు బోయ రాజు, అరుణమ్మ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరికి మగపిల్లవాడు లేకపోవడంతో రాజు భార్య అరుణమ్మ చెల్లెలు నాగమణి కుమారుడు రిషీనిమూడేళ్ల క్రితం దత్తత తీసుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు. అయితే విధి వక్రీకరించించి గురువారం ఉదయం బాత్రూములో హీటర్ను పట్టుకుని రిషీ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతో ప్రేమతో పెంచుకున్న బాలుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.


