breaking news
Nandyala
-
నీటి కుంటలో పడి వ్యక్తి మృతి
డోన్ టౌన్: మండలంలోని ఓబులాపురం బుధవారం జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు(40) నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి మృతి చెందినట్లు రూరల్ సీఐ రాకేష్ తెలిపారు. గురువారం ఉదయం కుంట వైపు వెళ్లిన వారు నీటిలో తేలాడుతున్న శవాన్ని గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్లో ముగ్గు వ్యాపారం చేస్తున్న మృతుడు గత మూడు నెలలుగా ఓబులాపురంలోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య ఈశ్వరమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రామాంజనేయుల మృతి పట్ల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మృతుడు తిరిగి కుంట వద్దకు ఎందుకు వెళ్లాడని, ఇతర కారణాలు ఉన్నాయా.. ప్రశ్నిస్తున్నారు. -
కొలను భారతి దేవి హుండీ ఆదాయం రూ. 3.76 లక్షలు
కొత్తపల్లి: కొలనుభారతి దేవి క్షేత్ర అమ్మవారి హుండీ ఆదాయం రూ.3,76,373 వచ్చిందని శ్రీశైలం దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములు తెలిపారు. గురువారం శివపురం సమీపంలోని కొలనుభారతి క్షేత్ర ప్రాంగణంలో దేవదాయశాఖ అధికారి కార్తీక్ ఆధ్వర్యంలో అమ్మవారి హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ.. గత 7 నెలల 15 రోజులకు సంబంధించి హుండీని లెక్కింపు చేశామన్నారు. ఇందులో రూ.3,76,373 ఆదాయం వచ్చిందన్నారు. దీంతో పాటు 300 మిల్ల్లీ గ్రాముల బంగారు, 25 గ్రాముల వెండి అమ్మవారికి భక్తులు సమర్పించుకున్నారన్నారు. అయితే ఫిబ్రవరిలో హుండీ లెక్కించగా రూ. 2,17,635 ఆదాయం రాగా, ఇప్పుడు రూ.1,58,738 అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ మొత్తాన్ని అమ్మవారి ఖాతా లో భద్రపరుస్తామన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు దేవిక, సిబ్బంది పాల్గొన్నారు. నిమజ్జన వేళ విషాదం ● కేసీలో శవమై కనిపించిన వ్యక్తి పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్లో బుధవారం రాత్రి జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో ప్రమాదవశాత్తు కేసీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ టోపి చంద్రశేఖర్(55) గణేష్ నిమజ్జన విగ్రహాల ఊరేగింపు వెంబడి కేసీ కాలువకు చేరుకున్నాడు. కేసీ కాలువ వద్ద సరైన లైటింగ్ లేకపోవడం వలన ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను చీకట్లోనే కేసీ కాలువలోకి నిమజ్జనం చేశారు. రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కేసీలోకి పడేసిన వినాయక విగ్రహాలపై తేలియాడుతూ కనిపించిన శవాన్ని భక్తులు కేకలు వేశారు. గణేష్ విగ్రహంపై ఉన్న శవాన్ని బయటకు తీసి చూడగా మృతుడు బోయ టోపి చంద్రశేఖర్గా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. విగ్రహాలతో పాటు ప్రమాదవశాత్తు కేసీలో పడి మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు, బంధువులు అనుమానానం వ్యక్తం చేశారు. విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతంలో ఎలాంటి లైటింగ్ లేదని చీకట్లోనే నిమజ్జన వేడుకలు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. మృతుని భార్య హైమావతి ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి ఎస్ఐ నరేంద్ర కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. అయితే చంద్రశేఖర్ మృతికి లైటింగ్ కారణం కాదని, ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ప్రమాదవశాత్తు జారి పడ్డాడని ఎస్ఐ రెండు విధాలుగా చెబుతుండటం విశేషం. గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలు కర్నూలు కల్చరల్: ఉద్యోగార్థులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయ శాఖల్లో అందుబాటులో ఉంచుతామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆన్ డిమాండ్ మేరకు తెప్పించిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ను గ్రంథాలయ శాఖల బాధ్యులకు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్తో కలిసి అందజేశారు. చైర్మన్ మాట్లాడుతూ.. పాఠకులు కోరిన వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను తెప్పించామన్నారు. మొదటి విడతలో 30 గ్రంథాలయ శాఖలకు పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. డిప్యూటీ లైబ్రేరియన్ పెద్దక్క, గ్రంథాలయాధికారులు కృష్ణారెడ్డి, గోవింద రెడ్డి, మురళి, కౌసల్య, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలను బ్యాలెట్తోనే నిర్వహించాలి
● వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డికర్నూలు (టౌన్): కొన్నేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిన నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఈవీఎంలతో గెలవాలనే కుట్రలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి విమర్శించారు. ఇప్పటికే ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కొత్త ఓటర్లను పక్కన పెట్టి స్థానిక సంస్థలకు వెళ్లేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఈవీఎంలతో గెలుస్తామన్న ధీమాను ప్రభుత్వం వ్యక్తం చేస్తోందని, దీని వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు.? ఈ రెండున్నర ఏళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారన్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం వారిని దగా చేసిందన్నారు. డీఎస్సీలో నిరుద్యోగులను మోసం చేయడంపై మండిపడుతున్నారన్నారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మందిని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరించడం, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే కుట్రలు చేస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు. -
రంగాపురంలో యువకుడి హత్య
బేతంచెర్ల: మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన గంప ఎల్ల రమేష్ (24)ను కుటుంబీకులే దారుణంగా హత్య చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఎల్ల రమేష్ మద్యానికి బానిసై ఇంట్లో తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేసేవాడు. బుధవారం మద్యం తాగి వచ్చిన రమేష్ తండ్రి లింగన్నను, అన్న శివ నారాయణతో ఘర్షణ పడి దాడి చేశాడు. అతని వేధింపులు తాళలేక తండ్రి, అన్న ఇద్దరూ కలిసి గురువారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో తాడుతో రమేష్ గొంతుకు బిగించి హత్య చేశారని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వ ఆస్నత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అంతర్ జిల్లా సైబర్ మోసగాళ్ల అరెస్ట్
కోవెలకుంట్ల: స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయ పరిధిలో జరిగిన సైబర్ నేరాలకు సంబంధించిన మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం పట్టణానికి చెందిన కొలుసు శ్రీకాంత్, విజయవాడకు చెందిన సనపాల సాయి ప్రకాష్నాయుడును సైబర్ నేరస్తులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 25 లక్షల నగదు, నాలుగు మొబైల్ఫోన్లు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షోరాణ్ నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలను వెల్లడించారు. బాధితులు ఇలా మోసపోయారు.. ● సంజామల మండలం కానాలకు చెందిన దన్నాడ మల్లికార్జున సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 2024 డిసెంబర్ 2వ తేదీన ఇన్స్ట్రాగామ్లో స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఒక ప్రకటన చూసి దానిని ఓపెన్ చేయగా ఆర్యప్రాజెక్ట్ పల్స్ ఎక్స్బీ అనే వాట్సాప్ గ్రూపులో చేరితే స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందవచ్చని సైబర్ మోసగాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించారు. ఒక పెట్టుబడి ఖాతాను సృష్టించి వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించారు. బాధితుడు రూ. 22.80 లక్షలు పెట్టుబడుల నిమిత్తం ఆయా ఖాతాలకు జమ చేశాడు. తర్వాత అతని పెట్టుబడి ఖాతాలోరూ. 1.44 కోట్లు ఉన్నట్లు తప్పుడు వివరాలు చూపించారు. ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాలంటే మరో రూ. 25 లక్షలు ట్యాక్స్ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు వెంటనే జాతీయ సైబర్క్రైమ్ హెల్ప్లైన్ 1930కి కాల్ చేసి సమాచారమందించాడు. అనంతరం సంజామల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా 2025 జనవరి నెలలో పోలీసులు కేసు నమోదు చేశారు. ● కోవెలకుంట్ల మండలం రేవనూరుకు చెందిన చరణ్రాజ్ అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తండ్రి సుబ్బరాయుడు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఇంటి వద్ద ఉంటున్నాడు. ఆ ఉద్యోగాన్ని కుమారుడికి ఇవ్వాలంటే ఆర్టీసీ సంస్థ పేరుతో తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించాలని ఆర్టీసీ అధికారులు కోరగా గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన కోవెలకుంట్ల ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ. 5.24 లక్షలు రుణం తీసుకున్నాడు. ఆ మొత్తం తన బ్యాంకు ఖాతాలో జమ అయిన వెంటనే సైబర్ నేరగాళ్లు చరణ్రాజ్ వాట్సాప్కు ఏపీకే ఫైల్ పంపించారు. అది ఓపెన్ చేయగానే సెల్ఫోన్ హ్యాక్ కావడంతో నేరగాళ్లు ఆ మొత్తాన్ని వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవనూరు స్టేషన్లో కేసు నమోదైంది. రెండు సైబర్ నేరాలను చేధించిన పోలీసులు రూ. 25 లక్షల నగదు, ల్యాప్టాప్, సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ -
యువకుడి దుర్మరణం
● రెండు బైక్లను ఢీకొన్న కారు ● ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమంహాలహర్వి: కర్ణాటక సరిహద్దు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో 167వ జాతీయ రహదారిపై చింతకుంట గ్రామ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందారు. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న రెండు బైక్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మాచనూరు గ్రామానికి చెందిన దళవాయి శివకుమార్(25) అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బైక్పై వస్తున్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా వీరాపురం గ్రామానికి చెందిన దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మాచనూరు గ్రామానికి చెందిన మారెన్న, అంబమ్మ దంపతుల పెద్ద కుమారుడు దళవాయి శివకుమార్కు ఐదు నెలల క్రితం రాజేశ్వరితో వివాహమైంది. శివకుమార్ బళ్లారి జిల్లా కారేకల్లు గ్రామంలోని ఫ్యాక్టరీ ఏ–1 కంపెనీలో మెకానిక్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు. గురువారం మధ్యాహ్నం విధులకు హాజరయ్యేందుకు బైక్పై వెళ్తుండగా బళ్లారి నుంచి ఆదోని వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. శివకుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వెనుక మరో బైక్పై వస్తున్న బళ్లారి జిల్లా వీరాపురం గ్రామానికి చెందిన దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. శివకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని పీడీహళ్లి (హగరి) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు శివకుమార్ మృతిచెందడంతో బాధితా కుటుంబ సభ్యులు బోరున లపిస్తున్నారు. -
ఐపీడీ భవనం పనులు పూర్తి చేయాలి
● మాజీ ఎంపీ బుట్టా రేణుకకర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అర్ధంతరంగా నిలిచిపోయిన ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ (ఐపీడీ) భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం ఆమె కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిలిచిపోయిన ఐపీడీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు–నేడు కింద గత వైఎస్సార్సీపీ భుత్వం చేపట్టిన పనుల్లో దాదాపు 70 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులకు అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ భవనం పూర్తయితే 600కు పైగా పడకలు, 14 ఆధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. నిర్మాణ పనులు పూర్తిగాకపోవడంతో ఆపరేషన్ థియేటర్ల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే కీలక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పెండింగ్ పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులో తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. -
చాపకింద నీరులా ‘కుష్టు’
● సంవత్సర కాలంలో 35 కేసుల గుర్తింపు ● సకాలంలో చికిత్సతో వ్యాధి నయం ● ఈనెల 24 వరకు ఇంటింటి సర్వే గోస్పాడు: కుష్టు వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. నంద్యాల జిల్లాలో ప్రస్తుతం 196 మంది వ్యాధిగ్రస్తులున్నారు. వారి కోసం నంద్యాల సమీపంలో, డోన్లో లెప్రసీకాలనీలు ఏర్పాటు చేశారు. నంద్యాల సమీపంలో ఉన్న కాలనీ శిథిలమైపోగా అక్కడ వ్యాధిగ్రస్తులు లేరు. జిల్లాలో గతేడాది నుంచి ఈ ఏడాది వరకు కొత్తగా 35 కేసులను గుర్తించారు. బాధితులకు ప్రభుత్వం నెలకు రూ.6 వేల చొప్పున పింఛన్ అందిస్తోంది. అప్రమత్తత అవసరం... చర్మంపై స్పర్శ తగ్గిన మచ్చలు ఉండటం.. చేతులు, కాళ్లలో తిమ్మిరి రావడం.. చర్మం దళసరిగా మారడం.. నరాలు మందంగా అనిపించడం.. గాయాలు ఏర్పడినా నొప్పి తెలియకపోవడం.. కనుబొమ్మల వెంట్రుకలు రాలడం.. చెవి దళసరిగా మారడం.. తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను నివారించవచ్చు. కుష్టు లోనూ రెండు రకాల వ్యాధులు ఉంటాయి. పాసి బాసిల్లరీ వ్యాధి ఉన్న వ్యక్తికి శరీరంపై ఐదు రకాల మచ్చలు ఉంటాయి. మల్టీబాసిల్లరీ వ్యాధి సోకిన వ్యక్తి శరీరంపై ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటాయి. స్పర్శ ఉండదు. చర్మం బయాప్సీలో యాసిడ్ ఫాస్ట్ బాసిల్లిని కనుగొనడంతో రోగాన్ని నిర్ధారిస్తారు. మల్టీ డ్రగ్స్ థెరపీతో కుష్టు వ్యాధిని నయం చేసుకోవచ్చు. పాసిబాసిల్లరీ కుష్టుకు ఆరు నెలల పాటు డాప్సోన్, రిఫాంపిపిన్, క్లోఫాజిమైన్ మందులతో మల్టీబాసిల్లరీ వ్యాధి గ్రస్తులకు 12 నెలల పాటు చికిత్స అందిస్తారని వైద్యులు చెబుతున్నారు. అపోహలు వీడాలి కుష్టు వ్యాధిపై సమాజంలో అనేక అపోహలున్నాయి. వ్యాధిగ్రస్తుడిని తాకితే తమకు వస్తుందని, జీవితాంతం అంటువ్యాధిగానే ఉంటుందని భావిస్తుంటారు. వాస్తవానికి మైకోబ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్లే ఇది వస్తుంది. వ్యాధిగ్రస్తుడితో దీర్ఘకాలం సన్నిహితంగా ఉండటం వల్ల సంక్రమించే అవకాశం ఉంటుంది. తాకినంత మాత్రాన కుష్టు వ్యాధి రాదు. కలిసి భోజనంచేయడం, పక్కన కూర్చోవడం వల్ల కూడా సోకదు. చిన్న మచ్చలుగా ఉన్నప్పుడు తెలుసుకుంటే మందులతో కుష్టు వ్యాధిని నయం చేయొచ్చు. జిల్లాలో సర్వే చేస్తున్నాం. వ్యాధిసోకిన వారు ఎలాంటి భయాందోళన చెందకుండా జాగ్రత్తగా మందులు వాడేతే నయమవుతుంది. వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి. ఇంటి వద్దకు వచ్చే సర్వే బృందానికి ప్రజలు సహకరించాలి. – డాక్టర్ శారదాబాయి, జిల్లా కుష్టునిర్మూలన అధికారి, నంద్యాల ఇంటింటికీ వెళ్లి సర్వే ఈ ఏడాది జిల్లాలో కుష్టు వ్యాధి ప్రారంభ దశ లక్షణాలను గుర్తించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 19,40,810 మందికి 14 రోజులపాటు ఇంటింటి సర్వే ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా కుష్టు నివారణ అధికారి ఆధ్వర్యంలో 1,611 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు సభ్యులుంటారు. మహిళలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రతి బృందంలో ఒక మహిళా సభ్యురాలు ఉంటారు. సర్వేకు ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. -
అదనపు కోర్టులతో కేసుల సత్వర పరిష్కారం
● జిల్లా జడ్జి పి. వాసు ఎమ్మిగనూరు రూరల్: అదనపు కోర్టుల ఏర్పాటుతో పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి పి.వాసు అన్నారు. గురువారం పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయాలను జిల్లా జడ్జి పి.వాసు, స్థానిక మేజిస్ట్రేట్ పి.హేమ బార్ అసోసియేషన్ సభ్యులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి. వాసు మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు రూ.21 కోట్లు మంజూరు కాగా.. ఎమ్మిగనూరు కోర్టుతో పాటు అదనపు కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు రూ.2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి పాత తహసీల్దార్ కార్యాలయంలో ఒక కోర్టు భవనం, కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మరో కోర్టును సిద్ధం చేశామన్నారు. రెండవ విడత కింద 11 కోర్టులను ప్రారంభిస్తామన్నారు. పది రోజుల్లో ఎమ్మిగనూరులో రెండు కోర్టులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. వీరితో పాటు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ బి.లీలా వెంకటశేషాద్రి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి.రషీదుల్లా, జనరల్ సెక్రటరీ కె.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.నంద్యాల(అర్బన్): జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపు పేపర్ల కొరత వేధిస్తోంది. ఇదే అదనుగా మూడు రెట్లు అదనపు ధరలతో కొందరు బ్లాక్లో విక్రయిస్తున్నారు. మరి కొందరు పెద్ద సంఖ్యలో నిల్వచేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండు నెలలుగా స్టాంపుల కొరత ఉన్నా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు. ఈ నెల 1వ తేదీ నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అరొకరగా వస్తున్న వాటిని తమకు అనుకూలంగా ఉన్నవారికి పెద్ద మొత్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన వారు బ్లాక్లో కొనుగోలు చేయాల్సివస్తోంది. స్టాంపుల బ్లాక్ మార్కెట్ను అధికారులు అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇష్టానుసారంగా ధరలు జిల్లాలోని బండిఆత్మకూరు, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, పాణ్యం, డోన్, ప్యాపిలి, బగానపల్లె, బేతంచెర్ల, అవుకు, కోవెలకుంట్ల, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్టాంపులు దొరకకపోవడంతో క్రయవిక్రయ దారులు ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడంతో వారు వాటిని కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్లో స్టాంపులు కొనుగోలు చేయాల్సిరావడం భారంగా మారింది. నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరతతో ధరలు ఇష్టానుసారంగా పెంచారు. ఇదే పరిస్థితి కొనసాగితే అఫిడవిట్లు, ఒప్పందాలు, లీజుపత్రాలకు స్టాంపులు దొరక్క నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని క్రయవిక్రయ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని స్టాంప్ల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంజిల్లాలోని అన్ని సబ్రిజిస్టార్ కార్యాలయాలకు త్వరలో సంపూర్ణంగా స్టాంప్లు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే కొరత ఉంది. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తాం. బ్లాక్లో అదనపు ధరలకు స్టాంప్లు విక్రయిస్తే చర్యలు తప్పవు. –అశోక్, జిల్లా రిజిస్ట్రార్, నంద్యాల -
అధికారులను ప్రశ్నించిన జెడ్పీ చైర్మన్
● ఏటా వందల టీఎంసీల వరద నీరు సముద్రం పాలవుతోందని ఆందోళన ● రిజర్వాయర్ల నిర్మాణంతోనే నీటి సమస్యకు పరిష్కారమని సూచన ● హుందాగా సాగిన జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశం కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కేసీ కెనాల్కు 31.99 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. వీటిని పక్కనపెట్టి ఎలాంటి కేటాయింపులు లేని వెలిగొండకు ఇప్పటి వరకు 4.60 టీఎంసీల నీటిని ఎలా విడుదల చేస్తున్నారని చైర్మన్ పాపిరెడ్డి ప్రశ్నించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశం భవనంలో జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాయలసీమ రైతులను ఎండబెట్టి వెలిగొండకు నీటిని ఎలా తరలిస్తారని ఆయన అధికారులను నిలదీశారు. ఉమ్మడి జిల్లాలోని 77 చెరువులను హంద్రీనీవా నీటితో నింపితే భూగర్భ జలాలు రీచార్జ్ అవుతాయన్నారు. ఈ దిశగా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం నీటి మట్టం దిగువకు వస్తే చెరువులను ఎలా నింపుకోగలమన్నారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, చైర్మన్ పాపిరెడ్డి మధ్య కొద్ది సేపు చర్చ కొనసాగింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని చైర్మన్ గుర్తు చేశారు. రిజర్వాయర్ల నిర్మాణంతోనే నీటి సమస్యకు పరిష్కారం ప్రతి ఏడాది సముద్రం పాలవుతున్న వందల టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రిజర్వాయర్లను నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని.. ఈ అంశాన్ని కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కో రిజర్వాయర్ 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించుకుంటే సూపర్ ఎల్నినో వంటి విపత్కర పరిస్థితుల్లో సాగు, తాగు నీటికి ఏర్పడే ఇబ్బందులను అధిగమించవచ్చన్నారు. 2020–21 నుంచి 2025–26 సంవత్సరం వరకు 8,100 టీఎంసీల వరద నీరు సముద్రం పాలైందని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. సమావేశంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్ ఎ.సిరి, రాజకుమారి గణియా, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావుయాదవ్, జెడ్పీ సీఈఓ ఆర్.సుధాకర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డితో ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు హాజరయ్యారు. ‘సుజల’ను ఉపయోగంలోకి తీసుకురండి కర్నూలు జిల్లాలో ఆరు, నంద్యాల జిల్లాలోని రెండు ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకాలను వినియోగంలోకి తీసుకురావాలని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ మనోహర్ను కోరారు. కోడుమూరు మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులోనే పది పదహైదు రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ సుజలను ఉపయోగంలోకి తీసుకురావాలని జెడ్పీటీసీ బి.రఘునాథరెడ్డి కోరారు. ఎల్నినో నేపథ్యంలో రైతులకు పంటల బీమా పరిహారం అందించేందుకు నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనల ప్రకారం నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్నాం. పశుగ్రాసం సాగుతో పాటు పంటల బీమా, పీఎండీఎస్ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వచ్చే ఏడాది జూలై వరకు వర్షాలు ఆలస్యమయ్యే అవకాశం ముంది. అందుబాటులోని నీటి వనరుల్లో తాగునీటి అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి గత ఏడాది నష్టపోయిన పంటలకే నేటికీ ఇన్సూరెన్స్ అందలేదు. – జెడ్పీటీసీలు యుగంధర్రెడ్డి, రంగనాథ్గౌడ్ ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. రైతులు, కూలీలు వలస పోకుండా ఉపాధి పనులు పెంచాలి. – కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు నేను బతికే ఉన్నా. రికార్డుల్లో నేను చనిపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేశారు. ఈ కారణంగా నాలుగు విడతలుగా పీఎం కిసాన్ ఆర్థిక సాయం అందుకోలేకపోయాను. నాకు గూడూరు మండలం ఆర్.ఖానాపురం గ్రామంలో 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పత్తి, ఉల్లి, శనగ పంటలు సాగు చేస్తున్నా. ఎలాగూ నన్ను రికార్డుల్లో చంపేశారు. కనీసం నా భార్యకై నా వితంతు పింఛను ఇప్పించండి. – సమావేశంలో కలెక్టర్ను వేడుకున్న గూడూరు జెడ్పీటీసీ పి.మౌలాలితీర్మానాలు కర్నూలు, నంద్యాల జిల్లాలను తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు జిల్లాలుగా ప్రకటించాలి. తీవ్ర ఎల్నినో పరిస్థితులు ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా వీబీజీ రాంజీ పథకంలో పని దినాలు పెంచాలి. కౌలు రైతులందరికీ అన్నధాత సుఖీభవ పథకాన్ని, పంటల బీమా పథకాన్ని వర్తింపజేసి బ్యాంకులు రుణాలు అందించాలి. తాగునీటి అవసరాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. శ్రీశైలం ప్రాజెక్టు, గోరుకల్లు తదితర ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి. ఉమ్మడి జిల్లాలో సాగు, తాగు నీరు అందించే గుండ్రేవుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి. -
‘గణ’ వేడుక నేడే!
● నంద్యాలలో గణనాథుడి నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ● చిన్న చెరువు కట్ట వద్ద ఆరు క్రేన్లు నంద్యాల(వ్యవసాయం): జిల్లా కేంద్రమైన నంద్యాలలో గణేశ్ నిమజ్జనాన్ని శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు నిర్వహించనున్నారు. పట్టణ సమీపంలోని చిన్న చెరువు కట్టపై నూతనంగా తాత్కాలిక రోడ్డును నిర్మించారు. ఫ్లడ్లైట్లను, బారీగేట్లను ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆటోలు, ట్రాక్టర్లలో తీసుకొచ్చిన విగ్రహాలను చిన్న చెరువులో నిమజ్జనం చేయడానికి ఐదు ర్యాంప్లను, ఐదు క్రేన్లను సిద్ధంగా ఉంచారు. ఏర్పాట్లను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్లు శ్రీవాణి, శ్రీనివాసులు పరిశీలించారు. -
భార్య అరిచిందని.. భర్త షాకింగ్ నిర్ణయం
సాక్షి, నంద్యాల జిల్లా: కొత్తపల్లి మండలం ఎర్రమటం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్య అరిచిందని మనస్థాపానికి గురైన భర్త.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో పెద్ద మద్దిలేటి దక్కించుకున్నారు.అయితే, ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగా లేవని.. లడ్డూ వేలం మనకు సరికాదని భార్య.. మద్దిలేటికి గట్టిగా అరుస్తూ సర్ది చెప్పగా.. అవమానంగా భావించిన పెద్ద మద్దిలేటి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: రమా నందన కేసులో అసలేం జరుగుతోంది? -
మహిళలకు ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఈ సంస్థ డైరెక్టర్ కే.పుష్పక్ తెలిపారు. కొవ్వొత్తుల తయారీలో 12 రోజులు, జూట్ బ్యాగుల తయారీలో 14 రోజులు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి శిక్షణ మొదలవుతుందని పేర్కొన్నారు.19 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు మహిళలు అర్హులని, తెలుగులో చదవడం, రాయడం వచ్చి ఉండాలని, శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు నాలుగు ఫొటోలు, రేషన్కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కర్నూలు శివారు బి.తాండ్రపాడు సమీపంలోని కెనరా బ్యాంకు– గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (డీఆర్డీఏ–టీటీడీసీ పక్కన)లో సంప్రదించవచ్చన్నారు. అలాగే 08518–273710, 85002 72720, 90007 10508, 94409 05477 నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఆగంతకుల హల్చల్కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మహిళా హౌస్సర్జన్ల వసతి గదుల వద్దకు మంగళవారం రాత్రి ఇద్దరు ఆగంతకులు రావడంతో కలకలం రేగింది.పేయింగ్ బ్లాక్ పై అంతస్తులో ఉన్న హౌస్ సర్జన్ల గది వద్దకు అర్ధరాత్రి దాటాక ఇద్దరు వ్యక్తులు వచ్చి తలుపు తట్టారు.తలుపులు తెరిచి చూడగా గుర్తుతెలియని వ్యక్తులు కనిపించే సరికి వైద్య విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఎవరు మీరని ప్రశ్నించగా గతంలో ఇక్కడ క్యాన్సర్ వార్డు ఉంది కదా అందుకే వచ్చామని మద్యం మత్తులో పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీనిపై వైద్య విద్యార్థినులు ఆసుపత్రి అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆగంతకులను అదుపులోకి తీసుకుని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిలో ఒకరు న్యాయవాది, మరికరు విలేకరి అని చెప్పినట్లు సమాచారం. వైద్య విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. శ్రీశైలంటెంపుల్: సనాతన ధర్మం, హిందూ సమాజం, దేవదాయశాఖ నిబంధనలపై అవగాహన లేని శ్రీశైల దేవస్థాన ఉన్నతాధికారి అనాలోచిత నిర్ణయాలు సాధువులు, సన్యాసులకు శాపంగా మారాయని శ్రీశైలం సాధు భవన్ ట్రస్ట్ విమర్శించింది. ఈ మేరకు బుధవారం దేవస్థాన పరిపాలన భవనంలో ఈఓ శ్రీనివాసరావును ఏపీ సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు, అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి స్వామిజీ, ప్రధాన కార్యదర్శి అరవింద స్వామిజీ, స్థానిక అశ్రమాల పీఠాధిపతులు, నిర్వాహకులు, సాధువులు కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి సాధుసంతులు, జ్ఞానులు, పుణ్యపురుషులు, భిక్షువులు, అవధూతలు, సిద్దులు, గురువులు, అశ్రమ పీఠాధిపతులు శ్రీశైల మహాక్షేత్రానికి అనునిత్యం తరలివస్తుంటారని, వారి వలన క్షేత్రానికి ఎలాంటి నష్టం జరదన్నారు. శ్రీశైలంలో ఉంటున్న సాధువులు, సన్యాసులను క్షేత్రానికి 250 కి.మీ దూరంలో వదిలిపెట్టాలని గత నెల 19న ప్రకటించిన నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ అనాలోచిత నిర్ణయం తీసుకున్న అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం, శ్రీశైలక్షేత్ర మహిమ గురించి తెలియకుండా ఎలా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 23వ తేదీలోపు ఈఓ శ్రీనివాసరావు తగు నిర్ణయాన్ని మీడియా పూర్వకంగా వెల్లడించాలని లేని పక్షంలో ఈ నెల 23న ట్రస్ట్బోర్డు మీటింగ్ పురస్కరించుకుని ఆంధ్ర–తెలంగాణ సాధు సంతులు, ఆశ్రమాల స్వామిజీలతో కలిసి శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని, అప్పటికి పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త అందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. అంతకుముందు వీరంతా శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు కల్చరల్: బీఈడీ నాల్గో సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. రాయలసీమ యూనివర్సిటీ వైస్చాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాలను https:// rayalseemauniversity.ac.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 430 మంది విద్యార్థులు 526 పేపర్స్కు రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోగా 312 మంది 367 పేపర్లలో ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. -
కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది
కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ అదనపు మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కర్నూలులోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరుపాక్షిపై నమోదైన కేసులో న్యాయపరమైన విచారణ ప్రక్రియకు సంబంధించి బుధవారం ఆయన కోర్టులో వాదనలు సమర్పించారు. విచారణ అనంతరం న్యాయ స్థానం ప్రాంగణంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు జి.స్వాములు, ఇతర న్యాయవాదులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులను బనాయిస్తోందని విమర్శించారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిపై పెట్టిన కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్నారు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులు బనాయించినప్పటికీ తమకు న్యాయస్థానాలపైన, రాజ్యాంగంపైన పూర్తి విశ్వాసముందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే విరుపాక్షికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతు ఉందని, న్యాయపరంగా పూర్తి అండగా నిలుస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చట్టం ముందే తేల్చుకుంటామని, న్యాయ పోరాటం ద్వారా నిజాలను బయట పెట్టి ఎమ్మెల్యే విరుపాక్షికి న్యాయం జరిగేలా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి పి.సువర్ణ రెడ్డి, న్యాయవాదులు హనుమంతు రెడ్డి, జలందర్, వెంకటేశ్వర రెడ్డి, నరేంద్ర రెడ్డి, జీవన్ సింగ్, స్థానిక న్యాయవాదులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
శ్రీశైలానికి జీరో ఇన్ఫ్లో
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల జలాశయానికి మంగళవారం నుంచి బుధవారం వరకు ఇన్ఫ్లో రాలేదు.అయితే జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 30,913 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6.486 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్కు 13,210 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,033 క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజలస్రవంతికి 3,450 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 720 క్యూసెక్కులు, వెలిగొండ ప్రాజెక్ట్కు 3,500 క్యూసెక్కులు వదిలారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుధవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 111.9430 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 861.90 అడుగులకు చేరుకుంది. ‘ఉత్తమ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): ఉత్తమ జర్నలిస్టు అవార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్యన వారు అర్హులని పేర్కొన్నారు. మొత్తం 12 విభాగాల్లో అవార్డులు అందజేస్తున్నారని, పూర్తి వివరాలు https:// mediarelations.ap.gov.in/media వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు.గాలేరు– నగరి కాల్వలో ముగ్గురు గల్లంతు కొలిమిగుండ్ల(అవుకు): చేపల వేటకు వెళ్లి అవుకు మండలంలోని చెర్లోపల్లె సమీపంలోని గాలేరు– నగరి వరద కాల్వలో ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బేతంచెర్లకు చెందిన దర్వేష్ మహ్మద్ జీవనోపాధి నిమిత్తం రామాపురంలోని పాలీష్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. సాయంత్రం ఆరేళ్ల కుమారుడు ఆశీక్తో పాటు మహ్మద్గౌస్, మరో ఇద్దరు కలిసి కాల్వలో చేపల వేటకు వెళ్లారు. బాలుడు కాల్వలో జారి పడటంతో తండ్రితో పాటు మిగిలిన ఇద్దరు కాపాడేందుకు దూకారు. ఇందులో ఇద్దరికి ఈత రావడంతో క్షేమంగా బయటకు వచ్చారు. తండ్రి, కుమారుడుతో పాటు మహ్మద్ గౌస్ ఆచూకీ లభించలేదు. నాలుగు రోజుల క్రితం అధికారులు గాలేరు కాల్వ ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు నీటిని విడుదల చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కాల్వ వద్దకు చేరుకోని పరిశీలించారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రమాదం విషయం తెలియడంతో రామాపురం, చెర్లోపల్లె గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వీఆర్ఏల ‘సహాయ నిరాకరణ’ నంద్యాల(అర్బన్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని ఎన్కే రోడ్డులో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా వీఆర్ఏలకు ఒక్కరూపాయి వేతనం కూడా పెంచలేదన్నారు. వీఆర్ఏలకు వీఆర్ఓలుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మరణించిన వీఆర్ఏల స్థానంలో వయస్సుతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులను నియమించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఆశాలపై పనిభారం తగ్గించాలి గోస్పాడు: ఆశా వర్కర్లపై పనిభారం తగ్గించి, కనీసవేతనం రూ.26 వేల ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు రమణకుమారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆశా వర్కర్లతో కలసి ఇన్చార్జ్ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శారదాబాయికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈనెల 24 వరకు జరిగే లెప్రసీ సర్వేలో ఆశా వర్కర్లకు మినహాయింపు ఇవ్వాలన్నారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు కృపావతి, వెంకటేశ్వరమ్మ, వెంగమ్మ, సువర్ణ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రూ. 40లక్షలతో మండప నిర్మాణానికి సహకారం
మహానంది: నందీశ్వర అభిషేకం కోసం రూ. 40లక్షలతో మండప నిర్మాణానికి గుంటూరుకు చెందిన రవీంద్ర, లక్ష్మీ అపర్ణ దంపతులు సహకారం అందిస్తున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహానంది క్షేత్రంలో నంది సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన రాతి నంది విగ్రహ దాత రవీంద్రను కలిసేందుకు గుంటూరు వెళ్లినట్లు చెప్పారు. ప్రతి నెలా, రెండు నెలలకు ఒకసారి వచ్చే బహుళ త్రయోదశి రోజు నందీశ్వరస్వామికి ప్రదోషకాల అభిషేకం చేస్తున్నామన్నారు. అభిషేకం చేసిన ద్రవ్యాలు బయటికి వెళ్లే మార్గం లేక ఇబ్బందిగా ఉందన్నారు. నంది చుట్టూ భక్తులు నిలబడి పూజలు చేసేందుకు వీలుగా మండపం నిర్మించాలని విజ్ఞప్తి చేశామన్నారు. దీంతో స్పందించిన దాత రవీంద్ర, లక్ష్మీ అపర్ణ దంపతులు సుమారు రూ. 40లక్షలు వెచ్చించి నిర్మిస్తామని చెప్పారన్నారు. ఈ సందర్భంగా వారికి మహానందీశ్వరస్వామి మెమొంటో అందించినట్లు చెప్పారు. -
పోతిరెడ్డిపాడులో ‘తుప్పు’తిప్పలు!
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లకు మరమ్మతులు చేయకుండా రాష్ట్రప్రభుత్వం ఎన్నో తప్పులు చేసింది. ఫలితంగా తొమ్మిదో గేటు రోప్ తెగిపోయిందనే విమర్శలున్నాయి. వాస్తవానికి ప్రతి ఏటా పోతిరెడ్డిపాడు నుంచి నీటిసరఫరా నిలిచిన వెంటనే గేట్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఈ ఏడాదిలో మార్చి 17న పోతిరెడ్డిపాడు నుంచి నీటిసరఫరా నిలిచిపోయింది. అయితే గేట్ల మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గేట్లకు రబ్బర్సీల్స్ అమర్చకుండా, రోప్లను సరిచేయకుండా, పనికిరాని వాటిని మార్చకుండా అలాగే ఉండిపోయారు. ప్లంబర్బ్లాక్లను, ఫుట్రాక్ను కనీసం పరిశీలించలేదు. ఫలితంగా రోప్లు, రోప్రోలర్లు, బేరింగ్స్, ప్లంబర్బ్లాక్లు తుప్పుపట్టిపోయాయి. హెడ్రెగ్యులేటర్ పది గేట్ల ఉండగా నాలుగు ఎత్తితే దించలేం, దించితే ఎత్తలేమన్న దుస్థితికి చేరాయి. హడావుడిగా నూతన రోప్! పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను అపరేట్ చేసే పరిజ్ఞానం పర్యవేక్షణాధికారుల్లో లేకపోవటంతో ఎన్సీఎల్ సిబ్బంది సాయం తీసుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు 6న అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పోతిరెడ్డిపాడునుంచి నీటిని విడుదల చేశారు. గేట్లు మొరాయించకుండా అప్పుటికప్పుడు రోప్లకు గ్రీస్ పూయించారు. గేట్లకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ఈనెల 10న తొమ్మిదో గేటు తెగింది. తెగిన రోప్ స్థానంలో హడావుడిగా నూతన రోప్ను అమర్చారు. గేట్లపైన రంధ్రాలు పడిన ఫుట్రాక్కు తాత్కాలికంగా వెల్డింగ్ పనులు చేసి చేతులుదులుపుకొన్నారు. విరిగిన మూడో వగేటు ప్లంబర్బ్లాక్కు మరమ్మతులు చేయించలేదు. ఈ విషయమై పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ఏఈ విష్ణువర్ధన్రెడ్డిని వివరణ కోరగా.. విరిగిన ప్లంబర్బ్లాక్కు రెండు, మూడు రోజుల్లో మరమ్మతులు చేయిస్తామన్నారు. మిగిలిన పనులను ఒకదాని తర్వాత ఒకటి త్వరలో పూర్తిచేయిస్తామని పేర్కొన్నారు. నత్తనడకన హెడ్రెగ్యులేటర్ మరమ్మతులు విరిగిన మూడో గేటు ప్లంబర్బ్లాక్ తుప్పుపడుతున్న రోప్రోలర్లు, ప్లంబర్బ్లాక్లు, రోప్లు -
‘అవుకు’లో లీకేజీ నివారణకు ఏం చేశారు?
● అధికారులను ప్రశ్నించిన నిపుణుల కమిటీ సభ్యులుకొలిమిగుండ్ల(అవుకు): అవుకు రిజర్వాయర్లో లీకేజీ నివారణకు ఏం చేశారని అధికారులను నిపుణుల కమిటీ సభ్యులు ప్రశ్నించారు. రిజర్వాయర్ను బుధవారం కృష్ణా రివర్స్మేనేజ్మెంట్ బోర్డు మాజీ చైర్మన్ ఆల్వాల పరమేశం, జలవనరుల శాఖ రిటైర్డ్ సీఈ లక్ష్మిరెడ్డి, రిటైర్డ్ ఈఈ శ్రీకాంత్, రిటైర్డ్ ప్రొఫెసర్ శివకుమార్ పరిశీలించారు. రిజర్వాయర్కు అనుసంధామైన పాలేరు స్లూయిస్ వద్ద జరుగుతున్న నీటి లీకేజీ గురించి ఆరా తీశారు. లీకేజీ లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ఎస్సార్బీసీ అధికారులను అడిగారు. రిజర్వాయర్(తిమ్మరాజు కట్ట) వద్దకు చేరుకొని సింక్హోల్ సమస్యపై చర్చించారు. ఒకే చోట 2024, 2025లో కుంగిందని సంబంధిత అధికారులు వివరించారు. బండ్ కింద నుంచి వస్తున్న లీకేజిని అరికట్టేందుకు కర్ణాటకు నుంచి నిపుణులను పిలిపించామని, 30 శాతం నివారించగలిగామని తెలిపారు. ప్రస్తుతం ఇంకా లీకేజీ కొనసాగుతుందని చెప్పడంతో శాశ్వత పరిష్కారం ఏం చేయబోతున్నారని అధికారులను నిపుణుల కమిటీ సభ్యులు ప్రశ్నించారు. త్వరలోనే సింక్ హోల్ వద్ద జియో మైన్ ద్వారా లీకేజీ అరికట్టే చర్యలు చేపట్టబోతున్నామని చెప్పారు. రిజర్వాయర్ నీటి సామర్థ్యం తదితర అంశాలపై చర్చించారు. రిజర్వాయర్కు సంబంధించి త్వరలోనే నిపుణుల కమిటీ నివేదికను అందజేయనుంది. కమిటీ సభ్యుల వెంట ఎస్సార్బీసీ సర్కిల్–2 ఎస్ఈ లక్ష్మానాయక్, ఈఈ భవాని ప్రసాద్రెడ్డి, డీఈలు సాయికిరణ్, మల్లికార్జున, హైడ్రాలజీ డీఈ శిరీష, ఏఈఈ సుధాకర్ ఉన్నారు. -
స్కూలు ఆటో చక్రం కింద నలిగి చిన్నారి మృతి
పెద్దకడబూరు: స్కూలు వాహనం చక్రాల కింద నలిగి యస్విత (4) అనే చిన్నారి దుర్మరణం చెందిన సంఘటన నందవరం మండలం బాపురంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలు.. బాపురం గ్రామానికి చెందిన చిన్నరంగన్న, ఉర్మిళ దంపతుల ఒక్కగానొక్క కూతురు యస్విత పెద్దకడబూరు మండలం హెచ్.మురవణి నాలుగవ మైలురాయి వద్ద ఉన్న అక్షరభారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో నర్సరీలో చేరింది. స్కూలు యాజమాన్యం వారు ఆయా గ్రామాల నుంచి పిల్లలను ప్రైవేటు వాహనాలైన టాటా ఏసీ (టెంపో)లలో బడికి తీసుకొచ్చి సాయంత్రం ఇంటికి చేరుస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం టెంపోలో పిల్లలను ఎక్కించుకొని బాపురం గ్రామానికి వెళ్లారు. అక్కడ చిన్నారి టెంపో నుంచి దిగి ఇంటికి వెళ్లిపోతుంది. ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా టెంపోను వెనుకకు పోనివ్వడంతో చిన్నారికి తగిలి కింద పడిపోయింది. పాప తలపై టెంపో టైరు ఎక్కడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆటో డ్రైవర్ పాపను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో వారి బాధ వర్ణనాతీతం. యస్విత మృతికి కారణమైన స్కూల్ను సీజ్ చేయాలి చిన్నారి యస్విత మృతికి కారణమైన అక్షర భారతి స్కూల్ను సీజ్చేసి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్నాయుడు, పీడీఎస్యూజిల్లా నాయకులు నరసింహారెడ్డి పీడీఎస్ఓ జిల్లా నాయకుడు సురేంద్రబాబు, యూఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు సందీప్ బుధవారం పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థుల రవాణాకు స్కూలు బస్సులను ఏర్పాటు చేయకుండా ప్రైవేటు ఆటోలను ఏర్పాటు చేసి చిన్నారిని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులు చర్యలు చేపట్టి పాఠశాలను సీజ్ చేయాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
పిల్లల చదువు కోసం అడ్డదారి
అంతర్రాష్ట్ర మహిళా దొంగ అరెస్టు ● సీసీ ఫుటేజీ ద్వారా కేసులను ఛేదించిన పోలీసులు కర్నూలు: పిల్లల చదువుల దృష్ట్యా తల్లి దొంగగా మారి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మహిళల హ్యాండ్ బ్యాగుల నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేసిన నంద్యాల జిల్లా సిద్ధాపురం గ్రామానికి చెందిన అంతర్ రాష్ట్ర మహిళా దొంగ వాణిశ్రీ అలియాస్ వాణిని పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేసి 30 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీ కేవీ రాఘవేంద్ర, సీఐలు శేషయ్య, విక్రమసింహ తదితరులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. మంత్రాలయం ఆరాధనోత్సవాల సందర్భంగా.. పది రోజుల క్రితం తిరుపతికి చెందిన ఓ మహిళ అనంతపురంలో వివాహ కార్యక్రమానికి హాజరై అనంతరం మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి మఠానికి దర్శనం కోసం వెళ్లారు. ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని గుర్తు తెలియని మహిళ బ్యాగు జిప్ను తెరి చి అందులోని సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను అపహరించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు లు సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా వాణిశ్రీని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించింది. బస్సుల రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికులకు తెలియకుండా ఆభరణాలు అపహరించిన మరో మూడు చోరీ కేసులు త్రీటౌన్, ఫోర్త్టౌన్, పాణ్యం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం చోరీ కేసుల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లు విచారణలో బయ టపడింది. నిందితురాలి వద్ద నుంచి మొత్తం 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వెంకాయపల్లెలో నివాసం 10వ తరగతి వరకు చదువుకున్న వాణిశ్రీ పిల్లల చదువు కోసం కర్నూలు శివారులోని వెంకాయపల్లె వద్ద అద్దె ఇంట్లో నివాసముంటోంది. తరచూ సొంతూరు సిద్ధాపురానికి వెళ్లి వస్తూ బంధువుల సహకారంతో దొంగగా మారింది. ఈమె భర్త గోపి గౌడ్ ప్రస్తుతం వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. ఈమె తల్లి కూడా నందికొట్కూరు రోడ్డులోని ఓ కాలనీలో సొంతిల్లు నిర్మించుకుని అక్కడే నివాసముంటోంది. ఈమె తమ్ముడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈమెకు ఇద్దరు పిల్లలు సంతానం. ఒకరు ఏడో తరగతి, మరొకరు ఐదో తరగతి చదువుతున్నారు. భర్త జీతంపై వచ్చే ఆదాయం చాలక దొంగగా మారింది. ఈమైపె ఉత్తరప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం యాచారం ప్రాంతంలో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన ఈడిగ రాజేష్, నంద్యాల జిల్లా దొర్నిపాడు గ్రామానికి చెందిన జక్కుల శారదా దేవికి సంబంధించిన నగలు కూడా తస్కరించినట్లు నిందితురాలు అంగీకరించింది. అతి తక్కువ సమయంలో సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించి ఆమె వద్ద నుంచి 30 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినందుకు క్రైం పార్టీ పోలీసులు ఎస్పీ అభినందించారు. -
అప్పన్న ఆచార్యులు మృతి
కౌతాళం: టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు మాజీ స్పెషల్ ఆఫీసర్ అప్పన్న ఆచార్యులు (83) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. కౌతాళంకు చెందిన ఈయన 40 సంవత్సరాల పాటు తిరుమలలో మంత్రాలయం దాస సాహిత్య ప్రాజెక్టులో సేవలందించారు. హరే శ్రీనివాస అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరి నోట పలికేలా చేశారు. హరిదాస సాహిత్యాన్ని ప్రతి ఊరు, జిల్లా దేశ నలుమూలలకు చేర్చిన ఘనత ఈయనది. ఈయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం తెలిపారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ప్రహ్లాదచారి, కౌతాళం సింగల్ విండో అధ్యక్షుడు వెంకటపతిరాజు, ఉరుకుంద మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ చెన్నబసప్ప పలువురు సంతాపం తెలిపారు. ఎమ్మిగనూరు బీజేపీ నాయకులు గురురాజరావు, ప్రహ్లాదచారి తదితరులు సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
● సీఐ కారులోని మద్యం బాటిళ్లను పోలీసులు తీసేశారంటూ ఆరోపణలు ● దెబ్బతిన్న రెండు వాహనాలు
భక్తుల వాహనాన్ని ఢీకొట్టిన ఎకై ్సజ్ సీఐ కారు గోనెగండ్ల: స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి ఎమ్మిగనూరు ఎకై ్సజ్ సీఐ రమేష్ రెడ్డి నడుపుతున్న కారు కర్ణాటక భక్తులు ప్రయాణిస్తున్న తుపాన్ వాహనంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. వివరాలు.. కర్ణాటకలోని సిరుగుప్ప ప్రాంతానికి చెందిన భక్తులు తుపాన్ (ఏకే 36 ఎన్ 5715) వాహనంలో రెండు రోజుల క్రితం శ్రీశైలం వెళ్లి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మంగళవారం కర్ణాటకకు తిరుగుప్రయాణమయ్యారు. అలాగే ఎమ్మిగనూరు ఎకై ్సజ్ సీఐ రమేష్ రెడ్డి రాత్రి ఎమ్మిగనూరు నుంచి ఏపీ 39 కేఈ 2647 నంబరుగల కారులో కర్నూలుకు బయలుదేరారు. గోనెగండ్ల విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోకి రాగానే సీఐ ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా తుపాన్ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో సీఐ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తుపాన్ వాహనంలోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గోనెగండ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎకై ్సజ్ సీఐ అతివేగంగా కారు డ్రైవ్ చేస్తూ వచ్చి ఢీకొట్టినట్లు తుపాన్లో ఉన్న వారు ఆరోపిస్తున్నారు. సీఐ మద్యం సేవించి వాహనం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన సీఐను గోనెగండ్ల పోలీసులు విచారణ చేసి పంపినట్లు తెలిసింది. సీఐ కారులో కవర్లో ఉన్న మద్యం సీసాలను పోలీసులు వేరే వాహనంలోకి మార్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై గోనెగండ్ల సీఐ చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాద ఘటనపై విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
పేదలకు ఉచిత న్యాయ సేవలు
నందికొట్కూరు: ఆర్థిక స్థోమత లేని పేద ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయవాది ఏర్పాటు చేస్తామని కర్నూలు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. నందికొట్కూరులోని సబ్జైల్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముద్దాయిలతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వృద్ధులై 70 ఏళ్లకు పైబడిన వయస్సు ఉన్న వారికి, అనారోగ్యంతో బాధపడేవారికి ఉచిత న్యాయసహాయం అందిస్తామని తెలిపారు. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ గురించి సీనియర్ సివిల్ జడ్జి ఎ. శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి వి. దివ్య, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటర్లకు వివరించారు. సబ్జైల్లో వంటలను పరిశీలించారు. ఖైదీలకు ఆరోగ్య వైద్య పరీక్షలను డాక్టర్ ప్రవీణ్ చేశారు. సబ్జైల్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం పానల్ న్యాయవాది వెంకటేశ్వర్లు, పారా లీగల్ వలంటీర్లు శోభారాణి, చిన్నరాజు పాల్గొన్నారు. -
నంద్యాల: జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!
నంద్యాల: వేసవి ఆరంభంలో కనిపించే ఆ దృశ్యం.. ఈసారి వర్షాకాలంలోనే కనిపించింది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో కృష్ణమ్మ ఒడిలో మునిగిపోయిన సంగమేశ్వర ఆలయం మళ్లీ బయటపడింది. అయితే ఈసారి బయటపడిన వేగమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జలాధివాసమైన ఐదు వారాలకే ఆలయ శిఖరం కనిపించడంతో.. రానున్న రోజుల్లో నీటి లభ్యత ఎలా ఉండబోతోందన్న ఆందోళనలు మొదలయ్యాయి.శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు చేరినప్పుడు సప్త నదుల సంగమంలో కొలువైన ఈ ఆలయం క్రమంగా నీట మునుగుతుంది. సాధారణంగా నీటి మట్టం తగ్గి ఆలయం పూర్తిగా బయటపడటానికి చాలా నెలలు పడుతుంది. ముఖ్యంగా వేసవి ఆరంభంలోనే ఆలయ శిఖరం కనిపించడం ఆనవాయితీ. కానీ ఈసారి ఆగస్టు మొదటి వారంలో జలాధివాసమైన ఆలయ శిఖరం.. కేవలం ఐదు వారాల్లోనే బయటపడిందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. తగ్గిన ఇన్ఫ్లో.. వేగంగా తగ్గిన నీటిమట్టంసంగమేశ్వర ఆలయం ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా ఎనిమిది నెలలు నీట మునిగి ఉంటుంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టానికి అనుగుణంగా కనిపిస్తూ.. మళ్లీ కనుమరుగవుతూ ఉంటుంది. నీటిమట్టం 838 అడుగులకు చేరితే ఆలయంలోకి నీరు ప్రవేశిస్తుంది. 852 అడుగులకు చేరితే సాలాకార మండపం వరకు నీరు వస్తుంది. 865 అడుగులకు చేరితే ఆలయ శిఖరం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. అందుకే ఆలయ శిఖరం ఎప్పుడు బయటపడిందన్నది శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ పరిస్థితికి ఒక సూచికగా స్థానికులు భావిస్తుంటారు. క్లిక్ చేయండి: సంగమేశ్వరుడు చేసే ఈ అద్భుతం చూశారా?అయితే ఈసారి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా నదికి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. గత నెల రోజులుగా తాగు సాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. ఇదే కాకుండా.. ఇంత కష్టకాలంలోనూ జలవిద్యుత్ కోసం నీటిని వినియోగించడం విమర్శలకు తావిస్తోంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్లో 215 టీఎంసీలకు గానూ.. 118 టీఎంసీల నీరు ఉంది. ఈ లెక్కన.. నీటి మట్టం తగ్గడంతో మరో 15 నుంచి 20 రోజుల్లో ఆలయం పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.గతంలో నెలల తరబడి నీటిలోనే..సంగమేశ్వర ఆలయం మునగడం, బయటపడటం కొత్తేమీ కాదు. గతంలోనూ శ్రీశైలం జలాశయం నిండిన సమయంలో ఆలయం నీటిలో మునిగిపోయింది. నీటిమట్టం తగ్గిన తర్వాత మళ్లీ బయటపడింది. అయితే సాధారణంగా ఈ ప్రక్రియకు నెలల సమయం పడుతుంది. అందుకే ఈసారి కేవలం ఐదు వారాల్లోనే శిఖరం బయటపడటం ప్రత్యేకంగా నిలిచింది. గత ఏడాది కూడా ఆలయం సుదీర్ఘకాలం నీటిలోనే ఉండి.. నీటిమట్టం తగ్గిన తర్వాత బయటపడింది. ఈ నేపథ్యంలో ఈసారి ఇంత త్వరగా బయటపడటంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.ఎల్ నినో ప్రభావమేనా?వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వర్షాలు లేకపోయినా.. ఎగువన వరదతో ఆలయం నీట మునగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం, కృష్ణా నదికి వచ్చిన ఇన్ఫ్లో, శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల, సాగు–విద్యుత్ అవసరాలు.. ఇలా అనేక అంశాలు జలాశయంలో నీటిమట్టాన్ని ప్రభావితం చేశాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ సమయంతో పోలిస్తే ఇంత త్వరగా ఆలయం బయటపడటం మాత్రం నీటి పరిస్థితిపై ముందస్తు హెచ్చరికలా చూడాల్సిన అవసరం ఉందనే చర్చ జోరందుకుంది. -
ఆత్మకూరులో ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: ఆత్మకూరు పట్టణంలో ఒంటరి మహిళ రియాజున్నీసా (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటి బయట తాళం వేసి ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి భర్త రహమతుల్లా రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ రెండేళ్ల క్రితం మరణించారు. పిల్లలు లేకపోవడంతో మృతురాలు ఒంటరిగా జీవిస్తున్నారు. ఇంటి తాళం పగలగొట్టి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.మరో ఘటనలో..భార్య తో గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా డు. కర్నూలు నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు.. పింజరి నబీసా (37) మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో భార్య పింజరి మాబీతో గొడవ జరిగింది.క్షణికావేశంలో ఆయన ఇంట్లోని పైకప్పు కర్రకు చీరతో ఉరి వేసుకుని వేలాడుతుండగా కుటుంబ సభ్యులు గమనించి కిందకు దించి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు క్యాజువాలిటీ వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఇదీ చదవండి: కోడలిని హతమార్చి.. బావిలోకి దూకి..! -
బండిని లాగుతూ ఎద్దు మృతి
హొళగుంద: బండిని లాగుతూ ఉన్నట్టుండి కుప్పకూలి ఒక ఎద్దు అక్కడికక్కడే మృతిచెందింది. ఈ దుర్ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. హొళగుందకు చెందిన దిడ్డి నాగప్ప అనే రైతు తన ఎద్దులను బండికి కట్టి కోగిలతోట రోడ్డులో పొలం పనికి వెళ్తున్నాడు. ఒక ఎద్దు ఉన్నట్టుండి కిందపడిపోయి గిలగిల కొట్టుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఎద్దు విలువ దాదాపు రూ.80 వేలు ఉంటుందని రైతు విలపించాడు. వర్షాలు లేక పంటలు పండగ దివాలా తీస్తున్న సమయంలో కాడెద్దు మృతి చెందితే ఎలా బతకాలి అని రైతులు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ముద్దటమాగి గ్రామానికి చెందిన కురువ లింగన్న అనే రైతుకు చెందిన ఎద్దు కూడా పొలంలో మడక దున్నుతూ కుప్పకూలి మృత్యువాత పడింది. -
పోలీసు జులుం.. జర్నలిస్టుల ఆగ్రహం
పత్తికొండ: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరఫున బంధువులు దాడి చేయడంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పత్తికొండలో యువకుడి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అందోళనను కవరేజ్ చేయడం కోసం వెళ్లిన జర్నలిస్టులపై అర్బన్ సీఐ జయన్న రాయలేని భాషలో దూషణకు దిగారు. అంతటితో ఆగకుండా రిపోర్టర్ నాగరాజును మెడ పట్టుకొని బయటకు తోశాడు. దీంతో జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం చెందారు. పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు, జర్నలిస్టు యూనియన్ నాయకులు రాజాసాహెబ్, సాలురంగడు, నాగరాజు, రంగన్న మాట్లాడారు. పత్తికొండ పోలీస్స్టేషన్ ఏర్పడిన సమయం నుంచి ఎంతో మంది అధికారులు వచ్చారని, అందరూ హుందాగా వ్యవహరించారన్నారు. చట్టం ఏమిచెబుతుందో మరచిపోయి సీఐ జయన్న వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్కు రావాలంటే సామాన్యులు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతివారిని అసభ్య పదజాలంతో దూషించడం దారుణమన్నారు. సీఐ ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ఎస్పీ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తామన్నారు. జర్నలిస్టులు మధుబాబు, రాముడు, మంజునాథ్, నాగరాజు, షపీ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు ముమ్మరం చేయండి
కర్నూలు(అగ్రికల్చర్): ట్రాన్స్కో, డిస్కమ్లలో అభివృద్ధి, సాంకేతిక అంశాల్లో పురోగతి సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ సూచించారు. శుక్రవారం విద్యుత్ భవన్లోని ఎస్ఈ చాంబర్లో ట్రాన్స్కో, డిస్కమ్లకు సంబంధించిన టెక్నికల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిస్కమ్ పరిధిలోని హెచ్టీ సబ్ స్టేషన్లలో అదనపు 33 కేవీ ఫీడర్ల ఏర్పాటును ముమ్మరం చేయాలన్నారు. 132 కేవీ సబ్స్టేషన్, కర్నూలు నుంచి పోలీసు క్వార్టర్స్ ఫీడర్, 132 కేవీ సబ్స్టేషన్, ఎమ్మిగనూరు నుంచి నూతన పార్లపల్లి ఫీడర్, 220 కేవీ ఏపీ కార్బైడ్ సబ్ స్టేషన్ నుంచి 33/11 కేవీ ప్రభుత్వ సర్వజన వైద్యశాల సబ్ స్టేషన్ వరకు నూతన ఫీడర్ల ఏర్పాటుకు అవసరమైన అంచనాలను త్వరగా సమర్పించాలని సూచించారు. అదే విధంగా ఏపీ కార్బైడ్ సబ్స్టేషన్లో ఉన్న రెండు 33 కేవీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని 33.5 ఎంవీఏ నుంచి 50 ఎంవీఏకు పెంచే పనులకు ఇప్పటికే అనుమతులు లభించాయని తెలిపారు. అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు కూడా అందుబాటులో ఉన్నందున పనులు సత్వరం చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల విద్యుత్ ఉత్పత్తికి, డిమాండ్కు గణనీయమైన వ్యత్యాసం ఏర్పడటంతో అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణం, దీర్ఘకాలిక చర్యలపై చర్చించారు. ఏపీ ట్రాన్స్కో ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈలు సురేష్కుమార్, రాజశేఖర్, చెన్నారెడ్డి, మహేష్కుమార్, విజయరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏర్పాటు చేస్తావా? చావులు చూస్తావా?
హైకోర్టు శాశ్వత బెంచ్ను ● సీఎం చంద్రబాబుకు న్యాయవాదుల అల్టిమేటం ● కర్నూలులో భారీ బైక్ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట నిరసన ● మద్దతు తెలిపిన ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు కర్నూలు(సెంట్రల్): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తావా లేదంటే మా చావులను చూస్తావా అంటూ న్యాయవాదులు సీఎం చంద్రబాబునాయుడుకు అల్టిమేటం జారీ చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ అంటూ 2014 నుంచి కనీసం వందసార్లు అబద్ధాలు ఆడుతూ వస్తున్నారని, సిగ్గు అనిపించడంలేదా అని ప్రశ్నించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు కర్నూలులో బైక్ ర్యాలీ నిర్వహించారు. కోర్టు భవనం సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీకి ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో రోడ్లన్నీ స్తంభించి పోయాయి. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, సీనియర్ న్యాయవాదులు నాగలక్ష్మీదేవి, వై.జయరాజు, మురళీ మాట్లాడుతూ.. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తానని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. 2014 ఎన్నికల ముందు కూడా ఇదే హామీ ఇచ్చి కాలం గడిపారని గుర్తు చేశారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కాలం వెళ్లదీస్తుండడంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చి హైకోర్టు సర్క్యూట్ బెంచ్ను ఏర్పాటు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. సర్క్యూట్ బెంచ్తో ఏమి చేసుకోవాలని ప్రశ్నించారు. శాశ్వత హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేయకపోతే పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకుడు రత్నం ఏసేపు విజయభాస్కరరెడ్డి, రైతు కూలీ సంఘం నాయకుడు సుంకన్న, ఎస్డీపీఐ నాయకుడు చాంద్బాషా, బుడగ జంగాల నాయకుడు తూర్పాటి మనోహర్, సీపీఎం నాయకుడు పుల్లారెడ్డి, సీపీఐ నాయకుడు రామకృష్ణారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, రిటైర్డ్ ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్ పాల్గొన్నారు. -
ఈరన్నస్వామికి ప్రత్యేక పూజలు
కౌతాళం: అమావాస్య సందర్భంగా శుక్రవారం ఉరుకుంద ఈరన్నస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారి మూలవిరాట్కు సుప్రభాతసేవ అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. దర్శనం కోసం గంటకు పైగా సమయం పట్టింది. భక్తుల సౌకార్యర్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప డిపోలవారు ప్రత్యేక బస్సులను నడిపారు. కౌతాళం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్లన్నకు నృత్యనీరాజనం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆలయ దక్షిణమాఢవీధిలోని నిత్యకళావేదికపై హైదరాబాద్కు చెందిన నృత్య అకాడమి వారు సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. ర్యక్రమంలో నాట్యగణపతి, ప్రణవాకారం, భో శంభో, శివపంచాక్షరి, శివాష్టకం తదితర గీతాలకు, అష్టకాలకు రమేష్, విశిష్ట, జీవిత, చరిత్ర, సహస్ర, నిత్యవర్షిణి, సాత్విక తదితరులు నృత్యప్రదర్శన ప్రదర్శించారు. మందు బాబులకు జైలు శిక్ష డోన్ టౌన్: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టణ పోలీసులకు పట్టుబడిన ముగ్గు రు వ్యక్తులకు జైలు శిక్ష పడిందని సీఐ ఇంతియాజ్బాషా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ పట్టణానికి చెందిన చిన్నబాబు అనే యువకునికి ఏడు రోజులు, పట్ట ణంలోని కొత్తపేటకు చెందిన ఈడిగ కుందనం ఉపేంద్రగౌడ్, చిగురమానుపేటకు చెందిన గుండెపోగు దేవేంద్రకు మూడు రోజుల పాటు జైలు శిక్షలు విధిస్తూ జడ్జి నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు సీఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపటం వలన వారి ప్రాణాలతో పాటు అమాయక ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల పోలీసు, న్యాయశాఖలు కఠిన చర్యలు తీసుకుంటుందని సీఐ ఇంతియాజ్బాషా తెలిపారు. దోమల నివారణకు చెరువుల్లో ‘గంబూసియా’ విడుదల కర్నూలు(హాస్పిటల్): దోమల లార్వాల నివారణకు మలేరియా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని పలు చెరువుల్లో గంబూసియా చేపల ను వదిలారు. జిల్లా మలేరియా అధికారి టి. వెంకటేశులు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో ని కోడుమూరు, పత్తికొండ, దేవనకొండ, కర్నూలు రూరల్ సబ్ యూనిట్ పరిధిలోని వివిధ గ్రామాల్లో నీరు నిల్వ ఉన్న బావులు, నీ టి గుంతలు, చెరువులను పరిశీలించారు. దో మల లార్వా అభివృద్ధిని అరికట్టేందుకు ఈ చేపలను వదులుతున్నట్లు మలేరియా అధికారి వెంకటేశులు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి ఎస్.విజయ్కుమా ర్, సబ్ యూనిట్ అధికారులు రంగస్వామి, వెంకటేశ్వర్లు, కృష్ణుడు, నజీర్ అహ్మద్, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. రేషన్ బియ్యం స్వాధీనం డోన్ రూరల్: ప్యాపిలి మండల కేంద్రంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 250 కేజీల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి పట్టుకొని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. సమాచారం అందుకున్న ఆర్ఐ సుజాత, రెవెన్యూ అధికారులు సత్యనారాయణ, శివానందలు పాల్గొన్ని రేషన్ బియ్యం ఉన్న ఆటోను స్టేషన్కు తరలించి సీజ్ చేయించారు. కొందరు వ్యక్తులు ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యాన్ని సేకరించి డోన్, ప్యాపిలి, కొత్తపల్లి, కేఈ కృష్ణమూర్తి నగర్ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన పాయింట్కు తరలిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఆయా ప్రాంతాలకు చేరిన తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
టీబీ డ్యాంకు నిలిచిన ఇన్ఫ్లో
● 87 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి శుక్రవారం ఉదయం ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. డ్యాం ఎగువ భాగంలోని ఆగుంబే, శృంగేరి, తీర్థనహళ్లీ, చిక్మంగళూరు, కొడుగు, వరనాడు, శివమొగ్గ, కొప్పి తదితర ప్రాంతాల్లో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో డ్యామ్కు ఇన్ఫ్లో గత కొద్ది రోజులుగా క్రమేణా తగ్గుతూ శుక్రవారం నాటికి జీరోగా నమోదైంది. ఇక 9,993 క్యూసెక్కులను డ్యాం నుంచి వివిధ కాలువలకు (ఔట్ఫ్లో) వదులుతున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1633 అడుగులతో 105.788 టీఎంసీలు కాగా శుక్రవారం ఉదయానికి 1628 అడుగుల వద్ద 87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో తగ్గడంతో డ్యాంలో నీటి నిల్వ వేగంగా తగ్గుతూ వస్తుందని బోర్డు అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా ఎండలు, నీటి వాడుక పెరగడంతో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీరు డ్యాంలో ఖాళీ అవుతుంది. కాగా గత రెండేళ్లుగా రైతులు ఎల్లెల్సీ కింద పూర్థిస్థాయిలో పంటలు సాగు చేసుకోలేక పోతున్నారు. గతేడాది గేట్లు అమర్చే కారణంతో ఒక పంటకు మాత్రమే నోచుకోగా ఈ ఏడాది ఎల్నినో (వర్షాభావ) పరిస్థితి కారణంగా సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా కష్టంగా మారే పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ప్రభావం ఇంకా ఉన్నా ఎండాకాలాన్ని తలపిస్తున్న ఈ పరిస్థితిని తలుచుకుని వచ్చే ఎండాకాలంలో ఇంకా ఎలాంటి దారుణ పరిస్థితు లు ఏర్పడుతాయోనని అటు అధికారులు, ఇటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
గ్రావెల్ తవ్వకాలపై అధికారుల దాడులు
మహానంది: యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలపై ‘సాక్షి’లో గురువారం ‘మట్టి .. కొల్లగొట్టి!’’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా మైనింగ్ శాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు నంద్యాల జిల్లా మైనింగ్ శాఖ ఏడీ వేణుగోపాల్, సిబ్బంది శుక్రవారం మహానంది మండలం బసవాపురం చెరువు పరిసరాల్లో జరుగుతున్న మట్టి తవ్వకాల వద్దకు చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరి ంచారు. ఈ సందర్భంగా ఏడీ వేణుగోపాల్ మాట్లాడుతూ మైనింగ్శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. నోటీసులు జారీ చేసి వివరణ కోరిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహానంది మండల రెవెన్యూ అధికారులతో మాట్లాడి అవి ప్రభుత్వ భూములా లేక ప్రైవే టు భూములా అనే వివరాలు సేకరించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా మైనింగ్ శాఖ అధికారులు వస్తున్నారన్న సమాచారం వెళ్లడంతో శుక్రవారం గ్రావెల్ తరలింపు ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. మైనింగ్ శాఖతో పాటు పట్టించుకోవాల్సిన కీలక శాఖల అధికారులు అటువైపు వెళ్లకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు ప్రభుత్వం జీవనోపాధి కోసం ఇచ్చిన భూముల్లో మట్టిని తరలిస్తున్న వైనంపై ఎన్ఓసీ ఇచ్చారా..?, రైతుల అంగీకార పత్రం తీసుకున్నారా..?, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లాంటివి ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. ఓ కీలక శాఖ అధికారి నేనున్నా అంటూ భరోసా ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమీప పొలాల రైతులు చర్చించుకుంటున్నారు. -
పుడమి తల్లికి లేఖ రాద్దాం రండి
నంద్యాల(న్యూటౌన్): సోషల్ మీడియా రాకతో ఉత్తరం ఇప్పుడు చుట్టం చూపు అవుతుంది. నేటి తరానికి అసలు ఉత్తరం ఊసే తెలియకపోగా పాత తరం ఉత్తరం ఊసులు మర్చిపోతుంది. అందుకే ఉత్తరాన్ని గుర్తు చేసేందుకు పోస్టల్ శాఖ ’దాయ్ ఆఖర్’ కార్యక్రమాన్ని ఏటా దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది ‘భూమాతకు ఒక లేఖ– ప్రకృతిని రక్షించడానికి నా వాగ్దానం’ అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. 18 ఏళ్లలోపు వారు ఒక కేటగిరీగా, 18 ఏళ్లు పై బడిన వారిని మరొక కేటగిరీగా పరిగణిస్తారు. విజేతలకు నాలుగు కేటగిరీల్లో మొత్తం 12 బహుమతులు అందిస్తారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ లేదా పైబడి ఉన్నారని తెలియజేస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జతపరిచాలి. లేఖను తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రాసి అక్టోబరు 31వ తేదీలోగా నిర్ణీత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. నగదు బహుమతులు ఇలా.. ఉత్తమ లేఖలను ఎంపికచేసి మొదటి, ద్వితీయ, తతీయ బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతికి రూ. 25 వేలు (రాష్ట్ర స్థాయి) రూ.50 వేలు (జాతీయ స్థాయి), రెండవ బహుమతికి రూ.10 వేలు (రాష్ట్ర స్థాయి), రూ25 వేలు (జాతీయ స్థాయి), మూడవ బహుమతికి రూ. 5 వేలు (రాష్ట్ర స్థాయి), రూ.10 వేలు (జాతీయ స్థాయి) అందిస్తారు. ఎలా రాయాలంటే.. ఎన్వలప్ కవర్లో పంపాలనుకునే వారు ఏ–4 సైజ్ పేపర్పై 1000 పదాలకు మించకుండారాసి పంపాలి. ఇన్ల్యాండ్ లెటర్ కార్డుపై రాసే వారు 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. లేఖలను రాసిన నంద్యాల జిల్లా వారు ఎస్పీవోఎస్, నంద్యాల డివిజన్ అడ్రస్కు పంపాల్సి ఉంటుంది. ప్రజలు అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలి. ఉత్తరాలపై ప్రజలకు, ఈ తరం వారికి తెలి యజేసేందుకు పోస్టల్ శాఖ దేశ వ్యాప్తంగా దాయ్ ఆఖరును నిర్వహిస్తోంది. ప్రోత్సాహకంగా నగదు బహుమతులు కూ డా అందజేస్తుంది. అక్టోబరు నెలాఖరుతో గడువు ము గుస్తుంది. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత పదాల్లో లేఖను రాసి లేఖలను పంపాలి. నిర్ణీత తేదీ తర్వాత వచ్చే లేఖలను స్వీకరించం. – అప్పన్నస్వామి, పోస్టల్ సూపరింటెండెంట్, నంద్యాల హెడ్ పోస్టాఫీసులు 1 సబ్ పోస్టాఫీసులు 457 బ్రాంచి పోస్టాఫీసులు 283 జాతీయ స్థాయిలో తపాలాశాఖ లేఖా రచన పోటీలు ‘దాయ్ ఆఖర్’ పేరుతో లేఖల ఆహ్వానం అక్టోబర్ 31 వరకు అవకాశం విజేతలకు రూ. 50 వేల వరకు నగదు బహుమతులు -
అంధకారం.. పాముకాటుతో మహిళకు ప్రాణాపాయం
ఆస్పరి: కరెంట్ కోతతో ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక రాత్రి పూట అంధకారంలో బయటకు వచ్చిన మహిళ పాముకాటుకు గురయ్యారు. ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఈ దుర్ఘటన గురువారం రాత్రి హలిగేర గ్రామంలో చోటుచేసుకుంది. అస్పరి మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఐదు రోజులుగా రాత్రి పూట విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గురువారం రాత్రి హలిగేర గ్రామంలో కరెంట్ పోయింది. ఉక్కపోత తాళలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కీర్తన అనే మహిళను రక్త పింజరి పాము కాటు వేసింది. గ్రామస్తులు రక్త పింజరిని చంపేసి కీర్తనను ఆదోనిలోని ఒక ప్రవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మండలంలోని 27 గ్రామాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ప్రజలు తెలిపారు. -
పెద్ద కోతలు లేకుండా ఎండోస్కోపితో శస్త్రచికిత్స
● కర్నూలులో ఈఎన్టీ వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు వర్క్షాపులో పాల్గొన్న వైద్య విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యంకర్నూలు(హాస్పిటల్): పెద్ద కోతలు లేకుండా సూక్ష్మమైన ఎండోస్కోపి సహాయంతో శస్త్రచికిత్స ఎలా చేయాలో ఈఎన్టీ వైద్యులు వివరించారు. కర్నూ లు నగరంలో మూడు రోజుల పాటు నిర్వహించే 44వ రాష్ట్రస్థాయి ఈఎన్టీ వైద్యుల సదస్సు ప్రారంభమైంది. ఇందులో భాగంగా శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజీలో ఐదు అంశాలపై వర్క్షాప్లు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 348 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హా జరయ్యారు. గొర్రె తలపై ఎండోస్కోపిక్ సైనస్ సర్జ రీ ఎలా చేయాలో చూపించారు. అలాగే గొర్రె ఊపిరితిత్తులు, కృత్రిమ నమూనాలపై బ్రాంకోస్కోపి విధానాన్ని వివరించారు. ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీపై శిక్షణ ఇచ్చారు. ముఖం రూపాన్ని, ఆకారాన్ని మెరుగుపరిచేందుకు, పునరుద్ధరించేందుకు చేసే వైద్య ప్రక్రియలను నిపుణులైన ఈఎన్టీ వైద్యులు వివరించారు. వర్క్షాప్ల అనంతరం నూతన వైద్యుల శాసీ్త్రయ పరిశోధనతో కూడిన రోగుల వైద్య/శస్త్రచికిత్స విధానాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఈఎన్టీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నిర్వహణ కార్యదర్శి డాక్టర్ బి.జయప్రకాష్రెడ్డి, నిర్వాహక చైర్మన్ డాక్టర్ పి.హరికృష్ణ మాట్లాడుతూ ఇలా ంటి కార్య శిబిరాలు తరచుగా నిర్వహిస్తే వైద్యుల్లో నైపుణ్యం మెరుగుపడుతుందన్నారు. శని, ఆదివారా ల్లో రాష్ట్రస్థాయి మహాసభలు నంద్యాల రోడ్డులోని కె.ఫార్చూన్లో నిర్వహిస్తామన్నారు. వీటిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి డాక్టర్ మహేంద్రకుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హరిచరణ్ పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వచ్చి అనంతలోకానికి..
కౌతాళం: దైవదర్శనానికి వచ్చి మూర్చవ్యాధితో భక్తుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన శుక్రవారం ఉరుకుందలో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నగరానికి చెందిన చాకలి నరసింహ, శివమ్మ దంపతుల కుమారుడు రేవంత్ (20) తన పిన్ని కుమారుడు సురేష్తో కలిసి స్వామి దర్శనానికి గురువారం రాత్రి ఉరుకుందకు వచ్చాడు. స్వామి దర్శనం అనంతరం అక్కడే బస చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున స్థానికంగా ఉన్న ఎల్ఎల్సీలో స్నానం కోసం దిగి ఫిట్స్ రావడంతో మునిగిపోయాడు. కాలువలో గాలించగా ఉదయం 10గంటల ప్రాంతంలో శవమై తేలాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కర్నూలు నుంచి మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుని తండ్రి నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ దావూద్బాషా తెలిపారు. యానిమల్ యాక్ట్ కింద ముగ్గురు అరెస్ట్ ఎమ్మిగనూరురూరల్: మొసలిని హింసించిన కేసులో యానిమల్ యాక్ట్ కింద ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆదోని ఫారెస్ట్ రేంజ్ అధికారిణి తేజస్వి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. నందవరం మండలం నాగలదిన్నె సమీపంలో తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం తగ్గటంతో మొసలి బయటకు వచ్చిందన్నారు. నది దగ్గర ఉన్న సి.బెళగల్ మండలం తిమ్మనదొడ్డికి చెందిన రామాంజనేయులు, నందవరం మండలం మిట్లసోమపురానికి చెందిన రామగోవిందు, సోమలగూడురుకు చెందిన తిక్కయ్య మొసలిని హింసించినట్లు సోషల్మీడియాలో వైరల్ అయిందన్నారు. వారిని పారెస్ట్ సిబ్బంది అరెస్ట్ చేసి ఎమ్మిగనూరు కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తేజస్వి తెలిపారు. వన్యప్రాణులను హింసించినా, చంపినా శిక్షలు కఠినంగా ఉంటాయని చెప్పారు. -
మత్స్యశాఖ అధికారుల చేతివాటం
● లైసెన్స్ రెన్యూవల్కు మామూళ్ల వసూళ్లు ● పింఛన్ దరఖాస్తు సిఫారసుకు రూ.2 వేలు డిమాండ్ పగిడ్యాల: చేపల వేటనే జీవనాధారంగా కుటుంబ పోషణ చేస్తున్న మత్య్సకారుల లైసెన్స్ రెన్యూవల్, పింఛన్ దరఖాస్తు కోసం అధికారులు మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు గడువు ఈ నెల 16వ తేదీ వరకు అవకాశం కల్పించింది. మండలంలోని నెహ్రూనగర్ గ్రామంలో దాదాపు 1000 మందికి పైగా మత్య్సకార లైసెన్స్దారులు పింఛన్కు దరఖాస్తు చేసేందుకు సచివాలయాలకు క్యూ కట్టారు. అయితే గ్రామ మత్య్సశాఖ అసిస్టెంట్ లైసెన్స్ రెన్యూవల్ చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఏటా లైసెన్స్ రెన్యూవల్ చేసుకున్నా మత్య్సకారుల నుంచి రూ. 600, లైసెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా రెండు, మూడేళ్లు ల్యాప్స్ అయిన వారి నుంచి రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మత్స్యకార పింఛన్ దరఖాస్తును సిఫారసు చేసేందుకు మత్య్సశాఖ అభివృద్ధి అధికారి సంతకం చేయాలంటే రూ. 2 వేలు సమర్పించుకోవాల్సిందేనని డిమాండ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికారులు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే దరఖా స్తును సిఫారసు చేస్తారో లేదోననే అనుమానాలను మత్య్సకారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వసూళ్ల వెనుక గతంలో ఇక్కడ పని చేసి బదిలీ అయిన ఉద్యోగి పాత్ర ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయమై నందికొట్కూరు మత్య్సశాఖ అభివృద్ధి అధికారి భరత్లాల్ను ‘సాక్షి’ వివరణ కోరగా లైసెన్స్ రెన్యూవల్ చేసేందుకు రూ. 500లు మాత్రమే చెల్లించాలన్నారు. మత్య్సకారుల నుంచి అక్రమ వసూళ్లకు ఎవరూ పాల్పడడం లేదన్నారు. -
చంద్రబాబుకు ఓటుకు నోటు కేసు భయం
● చేతకాని సీఎం హయాంలో 38టీఎంసీలు కాదుకదా 3టీఎంసీలూ వాడుకోలేం ● రాయలసీమ ప్రజలపై ద్వేషంతోనే రాయలసీమ లిఫ్టు భూస్థాపితం ● పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను పరిశీలించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శిల్పా, దారాసుధీర్ జూపాడుబంగ్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ప్రాంత ప్రజలు, రైతాంగంపై ప్రదర్శిస్తున్న కక్షపూరిత ధోరణిని వ్యతిరేకిస్తూ ప్రజలు, రైతులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ అన్నారు. తెగిన పోతిరెడ్డిపాడు 9వ గేటు రోప్ను పరిశీలించటానికి శుక్రవారం వీరు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకొన్న నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం పోతిరెడ్డిపాడు గేట్లు మూసివేసి హెడ్రెగ్యులేటర్ వద్దకు వెళ్లకుండా అటకాయించారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, సీఐకి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరికి ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయనాయక్ ఐదుగురికి అనుమతివ్వాలని సీఐకి సూచించినా.. కాటసాని, శిల్పా, దారాలను మాత్రమే అనుమతించారు. నందికొట్కూరు నియోజకవర్గ పరిశీలకుడు బుడ్డా శేషారెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నాయకులను అనుమతించకపోవటంతో గేటు వద్దే నిలిచిపోయారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ తెగిన 9వ గేటు, విరిగిన 3వ గేటు ప్లంబర్బ్లాక్ను పరిశీలించారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రైతాంగం సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 44వేల క్యూసెక్కుల నీటివిడుదలకు అనుగుణంగా 10గేట్లతో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ను నిర్మించారన్నారు. ఎస్సార్బీసీ కాల్వకు 19 టీఎంసీల నీటిని వాడుకోవాల్సిన అధికారం మనకు ఉందన్నారు. శ్రీశైలం జలాశయంలో 66 శాతం ఆంధ్రప్రదేశ్, 34 శాతం నీటిని తెలంగాణ వాడుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు నీటిని వాడుకుంటున్నా చంద్రబాబు అడ్డుకోకపోవడానికి కార ణం ఏంటో బహిర్గతం చేయాలన్నారు. తెలంగాణ దుశ్చర్యలను గమనించిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి 840 అడుగుల నుంచే నీటిని వాడుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి 90 శాతం మేర పూర్తిచేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్టును సమాధి చేసి రాయలసీమ రైతాంగానికి, ప్రజలకు తాగు, సాగునీరులేకుండా చేశారని మండిపడ్డారు. చేతకాని సీఎం ఉన్నంత కాలం 38 టీఎంసీల నీళ్లు కాదు కదా 3 టీఎంసీలు కూడా వాడుకోలేని దరిద్రం దాపురించింది. 3, 9 గేట్లు పైకి లేపలేని పరిస్థితిని చూశాం. తొమ్మిదొవ గేటు రోప్ తెగిందనే విషయం తెలుసుకొని ఉదయం నందికొట్కూరు ఎమ్మెల్యే పోతిరెడ్డిపాడు వద్దకు వచ్చి ఉన్నగేట్లు మూసి వేయించారు. మరి గేట్లు మూసి ఏం సాధించాలనుకున్నాడో అర్థం కావటం లేదు. ఓటుకు నోటు కేసులోంచి బయటపడేందుకే చంద్రబాబు రాజధానిని వదులుకొని విజయవాడకు వచ్చారని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దీన్ని అలుసుగా తీసుకుని శ్రీశైలం నీటిని యథేచ్ఛగా వాడుకుంటున్నాడన్నారు. తెలంగాణలో నిర్మించిన, నిర్మిస్తు న్న ఏ ప్రాజెక్టుకు అనుమతుల్లేవన్నారు. – శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే పోతిరెడ్డిపాడు మెయింటెనెన్స్ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాయలసీమ ప్రజలకు నీళ్లు అలవాటు చేస్తే వారు ప్రశ్నిస్తారు. వారు ప్రశ్నిస్తే మన పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంటుందనే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ను చంద్రబాబునాయుడు పర్యవేక్షించకుండా శిథిలమయ్యేలా చేస్తున్నారు. – దారా సుధీర్, నందికొట్కూరు సమన్వయకర్త -
వైఎస్సార్సీపీలో నియామకాలు
కర్నూలు (టౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురికి వైఎస్సార్సీపీ పదవులు దక్కాయి. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన కాల గగ్గారి మధుసూధన్ను పార్టీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. అలాగే నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన ఆకుల నాగ లింగమయ్యను జిల్లా వీరశైవ లింగాయత్ విభాగం అధ్యక్షులుగా నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు కర్నూలు కల్చరల్: దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.రామాంజనేయులు ఆదేశించారు. శుక్రవారం కర్నూలు డీసీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, ఇన్స్పెనక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సమావేశంలో కర్నూలు అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, నంద్యాల డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ పాండురంగారెడి పాల్గొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ -
మల్లన్న సేవలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శుక్రవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆయనకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ, అర్చకస్వాములు స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవిని దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి గౌరవార్థం వేదపండితులు వేదగోష్టి నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు అనుగ్రహభాషణ చేశారు. హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు గోస్పాడు: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జిలానీ, ఇన్చార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో శుక్రవారం హజ్యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హజ్ యాత్ర–2027 వెళ్తున్న యాత్రికులకు రెండవ రోజు వైద్య శిబిరంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 150 మందికి వైద్య పరీక్షలు పూర్తి చేశామన్నారు. ప్రతి ఒక్కరికీ సీబీపీ, ఎల్ఎఫ్టీ, చెస్ట్ ఎక్స్రే, ఈసీజీ, ఆర్బీఎస్, బ్లడ్షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందించామన్నారు. జిల్లా హజ్ సొసైటీ అధ్య క్షులు డాక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ ఆధ్వర్యంలో యాత్రికులకు భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రసన్న లక్ష్మి, శంకర్ నరేన్, మహమ్మద్ రఫీ, నుసృద్ పాల్గొన్నారు. ఎస్సార్బీసీ ఈఈ బాధ్యతల స్వీకరణ కొలిమిగుండ్ల(అవుకు): అవుకు ఎస్సార్బీసీ ఈఈగా భవాని ప్రసాద్రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గోరుకల్లు ఈఈగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ఉన్నతాధికారులు అవుకు ఎస్సార్బీసీ అదనపు బాధ్యతలు అప్పగించారు. విధుల్లో చేరగానే డీఈలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అవుకు రిజర్వాయర్, ఇతర స్లూయిస్లకు సంబంధించిన లీకేజీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులకు కృషి చేస్తామన్నారు. అంధుడి కుటుంబంపై కక్ష సాధింపు కొలిమిగుండ్ల: నిరుపేద అంధుడి కుటుంబంపై అధికార పార్టీ కార్యకర్తలు మానవత్వాన్ని మర్చిపోయి కక్ష సాధింపు చర్యలకు దిగారు. మండల కేంద్రం కొలిమిగుండ్ల ఎస్సీ కాలనీకి చెందిన నాగభూషణంకు పదేళ్ల క్రితం కంటి చూపు పూర్తిగా పోయింది. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు అతనికి పింఛన్ సైతం అంద డం లేదు. భార్య ఫక్కీరమ్మ ఎస్సీ ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్ల నుంచి స్వీపర్గా పని చేస్తు వచ్చే వేతనంతో కుటుంబాన్ని పోషిస్తుండేది. ఇటీవల కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు ఉన్నట్లుండి ఫక్కీరమ్మను పనిలో నుంచి తొలగించి తమ వాళ్లను నియమించారు. ఇదేమని ప్రశ్నించినందుకు తనపై దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దాడి చేసిన వాళ్లపై కాకుండా తిరిగి తమపైనే పోలీసులు కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏడాది పాటు వేతనం రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కుటుంబాన్ని పోషించేందుకు హోటల్తో పాటు ఇతర ఇళ్లలో పని చేస్తున్నానని వాపోయారు. తమలాంటి వాళ్లపైనా అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యల కు పాల్పడటం సరికాదన్నారు. -
నిర్వహణకు నీళ్లొదిలారు!
● పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద వరుస ఘటనలు ● నిన్న తెగిన 9వ గేటు రోప్ ● నేడు 3వ గేటు ప్లంబర్బ్లాక్ కట్ ● మరమ్మతులకు మంజూరైన నిధులు ఏమైనట్లు రాయలసీమ ప్రాజెక్ట్లకు జీవనాడిగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా ఆ నిధులతో పనులెక్కడ చేశారో అధికారులకే తెలియాలి. రెండు రోజుల వ్యవధిలో 9వ గేటు రోప్ తెగడం, 3వ గేటు ప్లంబర్బ్లాక్ కట్ కావడం చూస్తే నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రూ.20 లక్షలు, ఈ ఏడాది రూ.46 లక్షల నిధులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ రోప్ రోలర్లు తుప్పు పట్టి కనిపిస్తుండటంతో గేట్లకు మరమ్మతులు చేయడం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది ఆలస్యంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేశారు. మరో వైపు నిధులు మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే గేట్లకు మరమ్మతులు చేయించకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గురువారం సాయంత్రం అధికారుల పర్యవేక్షణలో తొమ్మిదో గేటును పైకి ఎత్తి కిందికి దించేందుకు యత్నించగా గేటు రోప్ తెగిపోయింది. దీంతో గేటు గ్రూస్లో కిందికి దిగింది. శుక్రవారం మూడోవ గేటు ప్లంబర్బ్లాక్ కట్ కావడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇలా ఒక్కొక్కగేటు ఓ రకంగా మరమ్మతులకు గురవుతుండటంతో నీటి విడుదలకు ఆటంకం కలిగే అవకాశం నెలకొంది. ఉన్నతాధికారులు వెంటనే పోతిరెడ్డి హెడ్రెగ్యులేటర్ను సందర్శించి లోపాలను గుర్తించి సరిచేయాల్సిన అవసరం ఉంది. -
తొంగి చూస్తే కన్నీళ్లు !
ప్రస్తుతం చుక్క నీరు లేని బావిఎండిన పంటలు.. అడుగంటిన బావులు.. నెర్రెలిచ్చిన చెరువులు.. జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంట పొలాలను రైతులు ఇక లాభం లేదని దున్నేస్తున్నారు. టీడీపీ పాలనలో కరువు ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో ఈ బావిని చూస్తే అర్థమవుతోంది. 2022 అక్టోబర్ నెలలో కర్నూలు–నంద్యాల జాతీయ రహదారి పక్కనున్న పూడిచెర్ల పొలాల్లో ఓ బావి నిండు కుండను తలపించింది. ఇప్పుడు ఆ బావిలో చుక్క నీరు లేని పరిస్థితి. కరువు తీవ్రతకు ఈ దృశ్యం అద్దం పడుతుండగా.. ఈ దారిన వెళ్లే స్థానికులు ఎండిన బావిని చూసి రానున్న రోజులు ఇంకెంతటి దారుణ పరిస్థితులు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
ఐదు రోజుల పని విధానం తక్షణం అమలు చేయాలి
కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకింగ్లో ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. యుఎఫ్బీయూ పిలుపు మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేపట్టిన బ్యాంకుల సమ్మె విజయవంతమైంది. సమ్మెలో భాగంగా కార్పొరేట్ బ్యాంకులు మినహా పబ్లిక్, ప్రైవేటు సెక్టారు బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకుల సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల మూతతో లావాదేవీలు స్తంభించిపోయాయి. యుఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ ఇ.నాగరాజు నాయకత్వంలో బ్యాంకు ఉద్యోగులు జిల్లా పరిషత్ నుంచి రాజ్విహార్ మీదుగా ఐదు రోడ్ల కూడలి, రాజ్ థియేటర్ మీదుగా కేఇ ప్లాజా వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా యూనియన్ ముఖ్య నేతలు మాట్లాడుతూ గత వేతన ఒప్పందంలో బ్యాంకుల యాజమాన్య సంస్థ ఐబీఏ ఐదు రోజుల బ్యాంకింగ్కు అంగీకరించి ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకపోవడం దారుణమన్నారు. బ్యాంకు లాభాల్లో ప్రతి ఉద్యోగి పాత్రను గుర్తించి అందరికీ ఆమోదయోగ్యమైన పీఎల్ఐ విధానం తీసుకురావాలని కోరారు. ఇప్పటికై నా స్పందించకపోతే ఈ నెల 28, 29, 30 తేదీల్లో సమ్మె నిర్వహిస్తామని, అప్పటికీ స్పందించకపోతే అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐబీఈఏ నాయకులు శివకృష్ణ, అనిల్ రెడ్డి, ఏఐబీవోసీ నాయకులు రాజు, పుష్పక్కుమార్, ఎన్సీబీఈ నాయకులు విద్యాసాగర్, శ్రీకాంత్, ఏపీజీబీ నాయకులు హనుమంతు, ఐబో నాయకులు మంజునాథ్, విజయ్, హనుమంతురెడ్డి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మట్టి వినాయకులనే పూజిద్దాం
నంద్యాల(వ్యవసాయం): వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని ఐసీడీఎస్ పీడీ లీలావతి దేవి పేర్కొన్నారు. శుక్రవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ల కార్యాలయంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కులమతాలకు అతీతంగా నిర్వహించే అతిపెద్ద పండుగ అని, ప్లాస్టారాఫ్ ప్యారీస్ విగ్రహాలను వాడకుండా మట్టి విగ్రహాలతో పూజించాలని వారు కోరారు. పండుగ అనంతరం ఇంట్లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరమ్మ, వన్స్టాఫ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత
నంద్యాల: జిల్లాలోని పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జూపాడు బంగ్లా సమీపంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటు ఎత్తుతుండగా రోప్ తెగిపోయి గేటు కింద పడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిశీలనకు వైఎస్సార్సీపీ నేతలు అక్కడకు బయల్దేరి వెళ్లారు. .అయితే వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గేటుకు తాళం వేసి మరీ అడ్డుకున్నారు పోలీసులు. మీడియాను సైతం అనుమతించలేదు. ప్రభుత్వం డొల్లతన బయటపడుతుందనే అక్కడకు వెళ్లిన తమను అడ్డకున్నారని వైఎస్సార్సీపీ విమర్శించింది. కాగా, శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేసే సమయంలో పోతిరెడ్డిపాడు తొమ్మిదో నెంబరు ఐరన్ గేటుకు సంబంధించిన రోప్ అకస్మాత్తుగా తెగిపోయింది. గేట్లు ఎత్తుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో గేటు ఊడిపోయి కింద పడిపోయింది. శ్రీశైలం బ్యాక్వాటర్ పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్న తరుణంలో ఇది చోటు చేసుకుంది. ఇదీ చదవండి:మధ్యాహ్న భోజనం ఇంత అధ్వానమా? -
ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరి
గోస్పాడు: వరుణుడు కరుణించలేదు.. పాలకులు కనికరం చూపలేదు.. చివరకు ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి ఎల్నినో భయం వెంటాడుతున్నా దేవుడిపై భారం వేసి సేద్యం పనులు చేపట్టారు. బోర్లు, బావుల కింద మొదట్లో సాగు ఊపందుకుంది. ఎలాగైనా వానలు కురుస్తాయి.. ప్రాజెక్ట్లు నిండుతాయనే భావనంతో విత్తనాలు వేశారు. అడపాదడపా వానలతో పంటలు మొలకెత్తినా తర్వాత వరుణుడు మొహం చాటేశాడు. రైతులకు నీటి సమస్య తీవ్రమైంది. పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నం చేసినా చివరకు దక్కించుకోలేకపోతున్నారు. ఇక చేసేదేమి లేక పంటలను కొందరు జీవాలు, పశువులకు మేతగా వదిలేశారు. మరికొందరు పంటను దున్నేసి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 2.20 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా 1.30 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగయింది. పూర్తిగా నమోదు కావాల్సిన పంటల సాగు ఇప్పటికీ కూడా సగభాగమే నమోదు అయిందంటే అందుకు వర్షాలు లేక పోవడమే కారణం. అయితే కృష్ణానది ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసి శ్రీశైలానికి భారీగా వరద నీరు చేరింది. ఈ క్రమంలో వెలుగోడు, గోరుకల్లు రిజర్వాయర్లను నింపారు. అయితే అధికారులు మాత్రం పంటల సాగుకు నీరు విడుదల చేయడం లేదు. తాగునీరు అవసరాల పేరుతో కుంటలు, నీటి ట్యాంకులు నింపేందుకు మాత్రమే అంటూ కేసీకి నీటిని విడుదల చేశారు. కనీసం పంటకు ఒక తడి నీరు పెడితే పంట చేతికందుతుందని రైతులు కోరుతున్నారు. పంటలను కాపాడుకోలేక.. జిల్లాలో అధికంగా సాగుచేసే పైర్లలో వరి ప్రధానమైనది. అయితే ఈ ఏడాది 70 వేల హెక్లార్ల సాధారణ విస్తీర్ణంలో ఇప్పటి వరకు 16 వేల హెక్టార్లు మాత్రమే సాగు అయినట్లు అధికారులు చెబుతున్నారు. మెక్కజొన్న, కంది, మినుము వంటి పైర్లు అంతంతమాత్రంగానే సాగు కాగా వేసిన పైర్లకు సాగునీరు అందక పైర్లు పెరుగుదల నిలిచిపోయి గిడిసబారి వాడిపోతున్నాయి. ఇక చేసేదేమి లేక పంటలను వదిలేసే వారు కొందరైతే.. మరికొందరు ఉన్నవాటిని కూడా దున్నేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వచ్చినంత దుర్భర పరిస్థితి ఎన్నడూ రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి చివరకు పైర్లను కాపాడుకోలేకపోయారు. మినుము పైరులో రెండు బస్తాలలోపు దిగుబడులే వస్తుండగా వాటిలో కూడా నాణ్యమైన ధాన్యం ఉండటం లేదు. శ్రీశైలానికి వరదొచ్చినా సాగునీరు లేదాయె ఆరుతడి పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు బోర్లు, బావులు అడుగంటడంతో ఎండిన పంటలు -
బాబుది దుర్మార్గమైన పాలన
రాష్ట్రంలో వానలు లేక పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు అల్లాడుతున్నారు. వీరిని ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కారు ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ప్రశ్నించే వారిపై దాడులు, దౌర్జన్యాలతో చంద్రబాబు దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారు. – పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల మాజీ ఎంపీ నంద్యాల(అర్బన్): రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామ సమీపంలోని ఎస్ఆర్ కన్వేన్షన్లో ఆదివారం కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరైన ఈ సమావేశంలో మొదట దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాలు, 12 నుంచి 22 వ తేదీ వరకు మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటికీ వెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజలకు వివరించడంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన మంచిని తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన బుక్లెట్లను సైతం ప్రతి ఇంట్లో అందజేయాలని సూచించారు. అలాగే స్థానికంగా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలే వైఎస్సార్సీపీ బలమని చెప్పారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు సైనికుల్లా పనిచేయాలన్నారు. కూటమి పాలనలో మెగా డీఎస్సీ దగా డీఎస్సీగా మారిందని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి అర్హులకు అన్యాయం చేశారన్నారు. డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయన్నది జగమెరిగిన సత్యమని, అందుకే సీబీఐ విచారణకు కూటమి సర్కారు భయపడుతుందన్నారు. వెన్నుపోటు పాలన రెండున్నరేళ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మహిళలు, నిరుద్యోగులు, రైతులను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు మహిళలకు మాయమాటలు చెప్పారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ దోచుకోవడం.. దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. 2025లో నిర్వహించింది మెగా డీఎస్సీ అంటూ లోకేష్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అది మెగా కాదు.. దగా డీఎస్సీ అని వైఎస్సార్సీపీ నిరూపించిందన్నారు. యువగళంలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు డీఎస్సీ నిర్వహించారని విమర్శించారు. దమ్ముంటే అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని లేకపోతే లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్చార్జ్లు, పరిశీలకులు, సీఈసీ, ఎస్ఈసీ సభ్యులకు పార్టీ గుర్తింపు కార్డులను కాటసాని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పీపీనాగిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ నాయకులు బుడ్డా శేషారెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా నాయకురాలు శశికళారెడ్డి, సీఈసీ, ఎస్ఈసీ సభ్యులు రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. అయినా, ఏదో గొప్పగా చేశానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవమేమిటో ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం సమష్ఠిగా పనిచేయాలి. – ఇసాక్బాషా, ఎమ్మెల్సీ ఈ నెల 23 నుంచి గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటి ప్రచారం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం సాగించాలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలి వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని పిలుపు -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
నంద్యాల(న్యూటౌన్): స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 7వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు క్యూకంపార్ట్మెంట్లలో పాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి. పోతిరెడ్డిపాడు నుంచి కొనసాగుతున్న నీటివిడుదల జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంటి నీటివిడుదల కొనసాగిస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం డ్యాంలో ఉదయం 868.80 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 867.80 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 4, 6 గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి సరఫరా చేసినట్లు వెల్లడించారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి గాలేరినగరి సుజల స్రవంతి కాల్వకు 7వేల క్యూసెక్కులు, కేసీ ఎస్కేప్ కాల్వకు వెయ్యి క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. సర్క్యూట్ బెంచ్ వద్దు.. శాశ్వత హైకోర్టు బెంచ్ కావాలి కర్నూలు: ‘సర్క్యూట్ బెంచ్ వద్దు.. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ కావాలి’ అంటూ నినాదాలతో న్యాయవాదులు హోరెత్తించారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్తో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 14వ రోజు ఆదివారం కొనసాగాయి. శాశ్వత హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమ ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని న్యాయవాదులు ప్లకార్డులను ప్రదర్శించారు. హైకోర్టు బెంచ్ కోసం కొంతకాలంగా వివిధ రూపాల్లో న్యాయవాదులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేవరకు అన్ని పక్షాల రాజకీయ నేతలు, ప్రజాసంఘాల సహకారంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రుడు స్పష్టం చేశారు. న్యాయవాదుల దీక్షలో సాద్విక, నిస్సీ, జి.మురళీకృష్ణ, ఎస్.మహమ్మద్ అన్వర్ సాదత్, గోపాల్ యాదవ్, ఈదుల బాలాజీ రెడ్డితో పాటు న్యాయ విద్యార్థి హేమంతేశ్వర మునిరాజు పాల్గొన్నారు. న్యాయవాదులు పెద్ద ఎత్తున తమ విధులు బహిష్కరించి దీక్షా శిబిరాన్ని సందర్శించి రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు రసూల్ ఖాన్ తదితరులు దీక్ష చేస్తున్న న్యాయవాదులకు మద్దతు తెలిపారు. -
టీడీపీ నాయకుల మట్టి‘మేత’కు అడ్డగింత
● భైరవాణిలో మట్టి తరలింపునకు అడ్డుకున్న ప్రజలుమహానంది: భైరవాణి చెరువులో మట్టి తరలింపును గోపవరం గ్రామస్తులు శనివారం రాత్రి అడ్డుకున్నారు. గ్రామ సమీపంలోని భైరవాణి చెరువులో రైతుల అవసరాల పేరుతో ఆగస్టు 28న 10,300 క్యూబిక్ మీటర్ల మేరకు పూడికతీతకు టీడీపీ నాయకులు అనుమతులు తీసుకున్నారు. రెండు రోజులు గ్రామ పరిధిలో రైతులకు మాత్రమే తరలిస్తున్నామని నమ్మించారు. నంద్యాల మండలం పొన్నాపురం, అయ్యలూరిమెట్ట, పెద్దకొట్టాల గ్రామాలతో పాటు సమీప గ్రామాల్లో ఉన్న ఇటుకల బట్టీలకు మట్టిని తరలించి సుమారు రూ. 14లక్షలు సంపాదించారని సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఆరు టిప్పర్లను, జేసీబీని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. తరలిస్తున్న మట్టిని చెరువులోనే వేయించి టిప్పర్లను వెనక్కి పంపించారు. అనుమతులు ఉంటే అర్థరాత్రి వేళ ఎందుకు తరలిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. అనుమతులకు విరుద్ధంగా మట్టి తరలింపునకు అడ్డుకట్ట వేయకపోతే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
పంటలు దెబ్బతిని తీవ్ర నష్టం
ఖరీఫ్ సీజన్ దాదాపుగా చివరి దశకు వచ్చింది. కాల్వలకు నీరు విడుదల చేసి ఉంటే అంతో ఇంతో పంటలు చేతికందేవి. సాగునీరు అందకపోవడంతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. పెట్టుబడిలో పైసా కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఈ ఖరీఫ్ సీజన్ రైతులకు అప్పులే మిగిల్చింది. – గోపాల్రెడ్డి, రైతు ఏటా వరి, మొక్కజొన్న తదితర పంటలతో వ్యవసాయం కళకళలాడేది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా కరువు దాపురించింది.ఎటు చూసి నా బీళ్లే కనిపిస్తున్నాయి. బోర్లు, కాల్వల కింద సాగు చేసిన పంటలకు నీరందక రైతులు దున్నేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నంద్యాలను కరు వు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి. – మార్క్, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు -
మట్టి వినాయకులకు ప్రాధాన్యమివ్వండి
● ఉత్సవాల్లో డీజేకి అనుమతి లేదు ● వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఏఎస్పీ నంద్యాల(వ్యవసాయం): వినాయక చవితి వేడుకల్లో మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని ఏఎస్పీ సుస్మిత సూచించారు. ఆదివారం రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో వినాయక ఉత్సవ కమిటీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పండుగను భక్తిశ్రద్ధలతో ఐదు రోజులు పాటు నిర్వహించుకోవాలన్నారు. ఎత్తైన విగ్రహాలు కాకుండా తక్కువ ఎత్తు ఉండే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువకులు నిమజ్జనోత్సవంలో మద్యం సేవించి పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలు ఏవైనా ఉంటే కేంద్ర ఉత్సవ సమితి దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఉత్సవాల్లో డీజే ఏర్పాటుకు అనుమతులు ఇవ్వమన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వినాయక వేడుకలను విజయవంతం చేయాలని చెప్పారు. అనంతరం ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ, తహసీల్దార్ శ్రీనివాసులు, కమిషనర్ శేషన్న, డీఈ నాగరాజు, కేంద్ర సమితి సభ్యులు రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అన్నదాన పథకానికి రూ. 3 లక్షల విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3 లక్షల విరాళాలు అందించారు. గురువారం నాగర్కర్నూలుకు చెందిన బాలనాగయ్య రూ.లక్ష, గుంటూరుకు చెందిన ఎం.అమృత రూ.లక్ష, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఎం.రామకృష్ణారెడ్డి రూ.లక్ష విరాళాన్ని దేవస్థాన సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.ఫణిధరప్రసాద్కు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. సర్వర్ పని చేయదు.. విద్యుత్ ఉండదు! చాగలమర్రి: కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వింతతువులు, వికలాంగులు, వృద్ధులు సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా దరఖాస్తు పూర్తి కావడం లేదు. నెట్వర్క్ సరిగా లేక పోవడం, సర్వర్ డౌన్ అవుతుండటంతో దరఖాస్తుదారులు గంటల కొద్ది అక్కడే నిరీక్షించాల్సి వస్తోంది. మరో వైపు మండలంలో విద్యుత్ తీగల మరమ్మతులు జరుగుతుండటంతో అప్రకటిత విద్యుత్ కోతలు ఆటంకంగా మారాయి. దీంతో రోజుకు 5 నుంచి 10 లోపే దరఖాస్తులు ఆన్లైన్ అవుతున్నాయి. దీంతో దరఖాస్తుదారులు, సచివాలయ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. దరఖాస్తుకు ఆరు రోజులు గడువు కనిపిస్తున్నా.. అందులో మూడు రోజులు సెలవులు ఉండటంతో దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలని ప్రజలు వాపోతున్నారు. 15న ధ్రువపత్రాలతో హాజరు కావాలి నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ల పెన్షనరీ బెన్ఫిట్స్ మంజూరు, ఫ్రీ రెగ్యులరైజేషన్ సర్వీసును పరిగణలోకి తీసుకునేందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసిందని డీఈఓ జనార్దన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలో పని చేస్తున్న ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లందరూ తమ ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్, సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 15న డీఈఓ కార్యాలయానికి చేరుకుని ధ్రువీకరణ ప్రక్రియ ను పూర్తి చేసుకోవాలన్నారు. నేటి నుంచి నాలుగు రోజులు బ్యాంకుల బంద్ కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకులకు ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలనే డిమాండ్తో అన్ని బ్యాంకు యూనియన్లు శుక్రవారం సమ్మె చేపట్టనున్నట్లు జిల్లా కన్వీనర్ నాగ రాజు తెలిపారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు సమ్మెలో కార్పొరేట్ బ్యాంకులు మినహా పబ్లిక్ సెక్టారు, ప్రయివేటు సెక్టారు బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు పాల్గొంటాయన్నారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు బ్యాంకులు బంద్ కానున్నాయి. 11న సమ్మె పాటిస్తుండగా.. 12న రెండవ శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి సెలవులు ఉన్నాయి. బ్యాంకుల సమ్మెకు సీఐటీయూ మద్దతు ప్రకటించింది. వేలం పాటలో రూ.73 లక్షల ఆదాయం పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన తలనీలాల వేలం పాటలో రూ.73.20 లక్షల ఆదాయం వచ్చింది. ఈఓ రామకృష్ణ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు చెందిన పుల్లయ్య అనే పాట దారుడు అత్యధిక పాట పాడి వేలం దక్కించుకున్నారన్నారు. గత ఏడాది రూ.51.77 లక్షల ఆదాయం సమకూరగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.21.42 లక్షలు అధిక ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలి పారు. జిల్లా దేవదాయ శాఖ పర్యవేక్షణ అధికారి మోహన్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. -
అడుగంటిన ‘ప్రథమ’ ఆశలు!
కర్నూలు సిటీ: కర్ణాటక రాష్ట్రంలోని హొస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయంలో 89 టీఎంసీల నీరు ఉన్నా..ఔట్ ఫ్లో 9,819 క్యూసెక్కులు ఉన్నా.. కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదిలో చుక్కనీరు కనిపించడం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నది తడారి ఎడారిగా కనిపిస్తోంది. నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజీలో నీరు అడుగంటిపోయింది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్న నీటిని సైతం బుధవారం ఉదయం బంద్ చేశారు. ప్రథమ పూజ్యుడైన వినాయక నిమజ్జనానికి నీరు ఇవ్వలేమని మంత్రి టీజీ భరత్ చెప్పారు. దీంతో ముందస్తుగా డబ్బులు ఇచ్చి పెద్ద విగ్రహాలను తీసుకొచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదీ దుస్థితి.. తుంగభద్ర నదిలో ఏటా 250 నుంచి 400 టీఎంసీలకుపైగా నీటి లభ్యత ఉంది. ఇందులో 10 శాతం నీటిని కూడా వినియోగించుకోని పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో సైతం డ్యాంకు 89 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అయితే ఆ నీరుతో కనీసం ప్రజల తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. టీబీ డ్యాం లో నీటి లభ్యతలో దమాషా ప్రకారం కేసీ కెనాల్కు ఐదు టీఎంసీల నీటి వాటా వస్తుంది. ఆ నీటిని నది ద్వారా విడుదల చేస్తే 20 శాతం కూడా రాదని ఇంజినీర్లు అంటు న్నారు. అయితే తుంగభద్ర దిగువ కాలువ నీటిని జీడీపీ (గాజులదిన్నెప్రాజెక్టు)కు మళ్లించి..అక్కడి నుంచి కేబీసీ కాలువ ద్వారా జి.శింగవరం సమీపంలో కేసీ కాలువకు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. ఈ విషయం ఇంజినీర్లకు సైతం తెలిసినా ఎందుకు ఆ వైపుగా మంత్రిని, కలెక్టర్ను ఒప్పించలేకపోతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేసీలోనే నిమజ్ఞనం చేసుకోవచ్చు గాజులదిన్నె ప్రాజెక్టులో ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులోకి హంద్రీ–నీవా కాలువ 110 కి.మీ దగ్గర వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన స్లూయిజ్ నుంచి 250 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో పాటు తుంగభద్ర దిగువకాలువ పరిధిలోని తాగునీటి ట్యాంకులు నింపిన తరువాత ఆ నీటిని జీడీపీలోకి మళ్లించేందుకు అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువ నీటి ని విడుదల చేసి 6 కి.మీ. దగ్గర క్రాస్ రెగ్యులేటర్ క్లోజ్ చేస్తే ఆ నీరు కర్నూలు బ్రాంచ్ కెనాల్ 7.78 కి.మీ దగ్గర నుంచి 42 కి.మీ. వరకు ప్రవహిస్తుంది. ఆ నీటిని ఉల్చాల దగ్గర ఓ వాగులో కి వదిలేస్తే జి.శింగవరం దగ్గర కేసీ కాలువలోకి చేరుతుంది. ఆ నీటితో కర్నూలు తాగునీటి అవసరాలు, ఆ నీటిలోనే కర్నూలు నగరంతో పాటు చుట్టు గ్రామాల ప్రజలు వినాయక నిమజ్జనం చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ టీడీపీ నేతలు ఆ దిశగా ఆలోచన చేయలేదు. విగ్రహాలు చిన్నవి ఏర్పాటు చేసుకోండి అంటూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుంగభద్ర నదిలో కనిపించని నీరు వెలవెలబోతున్న సుంకేసుల జలాశయం వినాయక నిమజ్జనానికి తప్పని తిప్పలు గుండ్రేవుల నిర్మిస్తే..! కేసీ కాలువకు తుంగభద్ర జలాల్లో 31.9 టీఎంసీల నీటిని కేటాయించినా నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేవు. సుంకేసుల లో 1.2, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వా యర్లో 2.965 టీఎంసీలకు మాత్రమే నిల్వ చేయవచ్చు. ఏటేటా నీటి ప్రవాహ రోజులు తగ్గిపోవడంతో కేసీ కెనాల్ కింద సాగుకు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపుల మేరకు నీటిని నిల్వ చేసుకునేందుకు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న గుండ్రేవులు ప్రాజెక్టును(20 టీఎంసీల నిల్వ సామర్థ్యం) నిర్మిస్తే నీటి కష్టాలు తొలుగుతాయి. కర్నూలు నగరంతో పాటు చుట్టూ ఉండే పల్లెల్లో వినాయక నిమజ్ఞనానికి ఎలాంటి నీటి కష్టాలు లేకుండా ఉంటాయి. -
జియారత్తో ముగిసిన ఎల్లార్తి ఉరుసు
హొళగుంద: ఎల్లార్తిలో షేక్షావలి, షాషావలి తాతల ఉరుసు గురువారం జియారత్ కార్యక్రమంతో ప్రశాంతంగా ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళునాడు నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దర్గాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవంలో భాగంగా 8న గంధం, 9న ఉరుసు, 10న జియారత్ కార్యక్రమాలు జరిగాయి. దర్గాల సయాద్ నసీన్ ముతవలి, పీఠాధిపతి నూర్బాబా ఖాద్రి భక్తులకు ధర్మసందేశాన్ని ఇచ్చి ఆశీర్వదించారు. ఏపీ వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో ఈఓ ఇమ్రాన్, ఇన్స్పెక్టర్ సోహెల్ పర్యవేక్షణలో జరిగిన ఉరుసులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హొళగుంద ఎస్ఐ దిలీప్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కర్నూలు(హాస్పిటల్): ఫైనాన్స్ వారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతకు ముందు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. బాధితుని కథనం మేరకు.. దేవనకొండ మండలం ఈదుల దేవరబండ గ్రామానికి చెందిన సుంకన్న కుమారుడు బి.బ్రహ్మయ్య(32) ఊళ్లో తండ్రికి చెందిన ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో కోడుమూరులో ఓ చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. ఆయన మూడున్నర ఏళ్ల క్రితం ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో రూ.10 లక్షల రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా రూ.18వేలు కంతు చెల్లిస్తూ వచ్చాడు. అయితే మూడు నెలలుగా అతను కంతులు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులపై బ్రహ్మయ్య కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్లోగా బకాయిలు చెల్లించాలని కోర్టులు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా సరే ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు కొందరు నెలరోజులుగా బ్రహ్మయ్య వద్దకు వచ్చి బకాయిలు తీర్చాలని, లేకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తూ వచ్చారు. రెండు రోజుల క్రితం ఈ బెదిరింపులు మరీ ఎక్కువ కావడంతో బాధపడుతూ బ్రహ్మయ్య బుధవారం రాత్రి కోడుమూరులోని తన హోటల్ ఎదుట క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స నిమిత్తం వెంటనే అతన్ని కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు. రైలు ఢీకొని వ్యక్తి మృతి కడప కోటిరెడ్డిసర్కిల్: కడప రైల్వేస్టేషన్లో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో గుండప్ప అనే వ్యక్తిని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. మృతుడు కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పీఆర్ పల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
● విద్యాశాఖ జేడీ మువ్వా రామలింగం మంత్రాలయం రూరల్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీ రాష్ట్రవిద్యాశాఖ జేడీ మువ్వా రామలింగం అన్నారు. మాధవరం, విద్యానగర్లోని ఎస్ఎంకెవీ జిల్లా ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. మాధవరం జిల్లా ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. విద్యానగర్లోని ఎస్కేవీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడు, సిబ్బందితో మట్లాడుతూ.. 750 పైగా ఉన్న విద్యార్థులు ఉన్న హైస్కూల్ ప్రహారిగోడ లేక పోవడం ఆశ్యర్యానికి గురిచేసిందన్నారు. మంత్రాలయం ఆర్సీఎన్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడారు. అన్ని పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. ఎంఈఓలు నాగభూషణం, రాఘన్న, హెచ్ఎంలు బోజరాజు, రామాంజనేయులు పాల్గొన్నారు. వానల్లేక జొన్నపంట తొలగింపు మద్దికెర: వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్న జొన్న పంటను రైతు మిడుతూరు ప్రతాప్ గురువారం తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మద్దికెర సమీపంలో మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని జూన్లో జొన్న సాగు చేశానన్నారు. అడపాదడపా వర్షాలతో పైరు పెరిగా ఆగస్టు నుంచి వానల్లేక ఎండిపోయిందన్నారు. పెట్టుబడి కింద రూ.75,000 ఖర్చు వచ్చిందని, పంట ఎండిపోతుండటంతో పశువులకు మేతగా వస్తుందని తొలగించినట్లు చెప్పారు. అంతర పంటగా వేసిన కంది కూడా ఎండిపోతోందని రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. డోన్ ఏఎస్ఐ మృతి డోన్ టౌన్/ కర్నూలు (టౌన్): డోన్ పట్టణ పోలీసు స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తు న్న మద్దిలేటి (56) అనారోగ్య సమస్యలతో గురువారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న ఆయనను ఇటీవల కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కోలుకొలేక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్బాషా కర్నూలుకు వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఏఎస్ఐ కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్త మద్యానికి బానిస కావడంతో.. బనగానపల్లె రూరల్: భర్త మద్యానికి బానిసై రోజు వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె పట్టణంలోని బుడగజంగాల కాలనీకి చెందిన లక్ష్మీదేవి(45) భర్త పెద్ద తిరుపాల్ మద్యానికి బానిసై కుటుంబీకులతో రోజూ ఘర్షణ పడేవాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తతో మద్యం అలవాటు మానిపించేందుకు ఎంతో ప్రయత్నించింది. అయినా మార్పు రాకపోవడంతో గురువారం విష పౌడర్ను నీటిలో కలుపుకుని తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.. కాగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు హెడ్కానిస్టేబుల్ జనార్దన్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ ఉయ్యాలవాడ: కాంట్రాక్టర్ను బెదిరించి డబ్బులు లాక్కపోయిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం కాంట్రాక్టర్ దూదేకుల జమాల్ బైక్పై వెళ్తుండగా గ్రామ సమీపంలో కాకరవాడ గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్, రవి దాడి చేసి కొట్టి, బెదిరించి రూ. 5 వేలు నగదు దోచుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం ఉయ్యాలవాడ కరెంట్ ఆఫీస్ సమీపంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి బైక్, రూ. 5 వేలు నగదు, రెండు బైక్ స్టీల్ స్టంప్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారన్నారు. -
అప్రకటిత కోతలు ఎత్తేయండి
ఆదోని: మండలంలోని గణేకల్లు సబ్స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు వీరారెడ్డి, డి.రామాంజనేయులు ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ కోత విధించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం విషయం తెలుసుకుందామంటే అధికారుల ఫోన్లు కూడా పనిచేయడం లేదన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రెండు రోజులుగా కోతలు కోవెలకుంట్ల: బనగానపల్లె నియోజకవర్గంలోని పలు మండలాల్లో లోడ్ రిలీఫ్(ఎల్ఆర్) పేరిట రెండు రోజులుగా రాత్రి వేళల్లో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం రాత్రి 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విద్యుత్ కోత విధించగా.. గురువారం సాయంత్రం 6.45 గంటల నుంచి రాత్రి 8.20 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. రెండు రోజుల నుంచి ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు గంటల తరబడి చీకట్లో మగ్గుతున్నారు. ఉక్కపోతతో పాటు దోమల మోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
అప్పుల ఉరికి అన్నదాత బలి
కోడుమూరు రూరల్: వానలు లేక, పంటలు పండక తీవ్రంగా నష్టపోయిన కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన రైతు బోయ లక్ష్మన్న (35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బోయ లక్ష్మన్న తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో ఎనిమిది ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఎనిమిది ఎకరాల్లో పత్తి, రెండెకరాల్లో కంది పంట సాగు చేశాడు. వానల్లేక పంటలన్నీ మొలక దశలోనే ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. పంటల సాగుకు, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరుకున్నాయి. గురువారం భార్య శారదమ్మ అన్నకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో రైతు బోయ లక్ష్మన్న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం కుమారుడు సోమేష్ హైస్కూల్ నుంచి ఇంటికి రాగా తండ్రి బోయ లక్ష్మన్న ఉరేసుకుని ఉండటాన్ని గమనించి లబోదిబోమంటూ చుట్టుపక్కల వారిని పిలుచుకువచ్చాడు. అప్పటికే రైతు బోయ లక్ష్మన్న మృతి చెంది ఉన్నాడు. రైతుకు భార్య శారదమ్మతో పాటు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ పెద్ద దిక్కు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
మట్టి వినాయకుడిని పూజిద్దాం
కర్నూలు(సెంట్రల్): మట్టితో చేసిన వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయాధికా పీవీ కిషోర్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరు జి.నరసింహులు, లయన్స్ క్లబ్ కార్యదర్శి రాయపాటి శ్రీనివాస్ సూచించారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పీసీబీ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఏక్యాంపు మాంటిస్సోరి స్కూల్, కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేశవరెడ్డి స్కూల్, శ్రీజ స్కూల్, దుపాడులోని అశోక ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు మట్టి వినాయకులను పూజించాలని కోరుతూ అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులను పర్యావరణహిత పద్ధతులను అవలంబించేలా మట్టి వినాయక విగ్రహాల తయారీ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం పీసీబీ కార్యాలయంలో బహుమతులను అందజేస్తామని అధికారులు తెలిపారు. -
సబ్స్టేషన్ ముట్టడి
కౌతాళం: విద్యుత్ సరఫరాను సక్రమంగా అందించాలని కోరుతూ హాల్వి సబ్స్టేషన్ను ముట్టడించిన ఘటన బుధవారం రాత్రి 11గంటలకు చోటు చేసుకుంది. హాల్వి, గొతులదొడ్డి, వల్లూరు గ్రామస్తులు వందలాదిగా తరలివచ్చి హాల్వి విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. విద్యుత్ కోతలు సాయంత్రం 5 నుంచి రాత్రి 11గంటల వరకు విధించడం పట్ల ఆయా గ్రామస్తులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి సబ్స్టేషన్కు తాళం వేశారు. రాత్రిళ్లు విద్యుత్ సరఫరా నిలిపేస్తే ఎలా బతికేదని వాపోయారు. ఏఈ, డీఈని పిలిపించండని రెండు గంటల పాటు సిబ్బందిని లోపలికి పోకుండా అడ్డుకున్నారు. రాత్రి 11గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో శాంతించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. -
రికార్డుల నిర్వహణ లేదు.. కార్మికులకు భద్రత లేదు!
● ఆధ్య అగ్రిక్రాప్ సైన్స్ కంపెనీలో అధికారుల తనిఖీలు ● లోపాలను గుర్తించి హెచ్చరించిన వైనం జూపాడుబంగ్లా: తంగడంచ రెవెన్యూ పరిధిలోని ఆధ్య అగ్రిక్రాప్సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో నిర్వహణ లోపాలు అధికారుల తనిఖీలో వెలుగు చూశాయి. గురువారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గంగాధర్రావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు టెక్నికల్ ఏఓ ఆయూబ్బాషా, ఏడీఏ గిరీష్, ఏఓ కృష్ణారెడ్డి కంపెనీని తనిఖీ చేశారు. తనిఖీ నిమిత్తం అధికారులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కంపెనీ నిర్వాహకులు ఉత్పత్తి నిలిపేసి లేబర్ను బయటకు పంపించేశారు. కంపెనీలో నిల్వ చేసిన డబ్బాలు, ప్రొడక్ట్ కవరింగ్ లేబుల్స్, ల్యాబ్లను అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం తయారు చేస్తున్న 24 రసాయనిక మందులకు సంబంధించి యాంటీ డోస్ ఇంజెక్షన్లు కంపెనీలో అందుబాటులో లేకపోవటంతో నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 80 మంది లేబర్ పనిచేస్తుండగా ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల ప్రాణాపాయం సంభవిస్తే యాంటీడోస్ లేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రథమ చికిత్స గది, చికిత్స నిర్వహించేందుకు డాక్టర్ను నియమించకపోవటంతో నిర్వాహకులపై మండిపడ్డారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ ఆధ్య కంపెనీలో 124 రకాల ప్రొడెక్టుల తయారీకి అనుమతి ఉన్నప్పటికీ ప్రస్తుతం 24 రకాల మందులు తయారుచేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ నిర్వహణలో లోపాలను గుర్తించి సరి చేసుకోవాలని కంపెనీ యాజమాన్యానికి సూచించామన్నారు. తనిఖీ నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్తో పాటు కమిషనర్కు అందజేస్తామన్నారు. -
శ్లోక పారాయణం.. ప్రతిభా పాటవం
బనగానపల్లె రూరల్: బనగానపల్లె జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థిని నుస్త్రత్ భగవద్గీత శ్లోకాల పారాయణ పొటీల్లో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. పట్టణంలోని ఎన్జీఓ కాలనీలోని ముస్లిం కుటుంబానికి చెందిన గడ్డం మహబూబ్బాషా, దిల్షాద్బేగం దంపతుల కుమార్తె నుస్త్రత్ స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలు గౌరి ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పారాయణంపై శిక్షణ పొందారు. ఈ పాఠశాలలోని మొత్తం 22 మంది విద్యార్థినులు ఉపాధ్యాయురాలు గౌరి ఆధ్వర్యంలో గత ఎప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం సుమారు గంట పాటు భగవద్గీత శ్లోకాల పారాయణంలో శిక్షణ తీసుకున్నారు. వీరంతా జూలై 19న వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులోని ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణ భారతదేశ స్థాయి భగవద్గీత పోటీల్లో పొల్గొన్నారు. మొదటి విడత పోటీలకు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులతో పాటు ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలు రెండు దశల్లో జరిగాయి. మొదటి దశలో 113 మంది విద్యార్థులను, రెండవ విడత భగవద్గీత పోటీలకు ఎంపిక చేయగా ఇందులో జెడ్పి బాలికల ఉన్నత పాఠశాల నుంచి ముస్లిం విద్యార్థిని నుస్త్రత్ పాటు మొత్తం 22 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. రెండవ దశ పోటీలు ఆగస్టు 2వ తేదీన జరిగాయి. భగవద్గీతలోని 108 శ్లోకాల నుంచి విద్యార్థులకు ఉపయోగపడే మొదటి 54 శ్లోకాలను తీసుకొని రెండవ స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో బనగానపల్లె జెడ్పీ బాలికల పాఠశాల విద్యార్థులు నుస్త్రత్, శృతి ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు అడిగిన శ్లోకాలను దోషరహితంగా, రాగయుక్తంగా, భావయుక్తంగా, శ్రావ్యంగా వినిపించారు. మొదటి బహుమతి రూ.లక్షను నుస్త్రత్ దక్కించుకోగా రెండవ బహుమతిని విద్యార్థిని శృతి గెలుచుకున్నారు. విద్యార్థిని నుస్త్రత్ ముస్లిం మతానికి చెందిన వారైనా భగవద్గీత శ్లోకాల పారాయణంలో ఎలాంటి భయం బెరుకు లేకుండా పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపడంతో బనగానపల్లె ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు. అలాగే విద్యార్థిని నుస్త్రత్ గతేడాది నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లోనూ ప్రతిభ చాటి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాటు అందించే ఉపకార వేతనానికి ఎంపికై నట్లు హెచ్ఎం ప్రసాదరావు తెలిపారు. అలాగే 2024లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బనగానపల్లె లాల్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహమ్మద్ ప్రవక్త చరిత్రకు సంబంధించిన క్విజ్ పోటీల్లోనూ పాల్గొని బహుమతి సాధించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్శ్రీ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతేశ్రీశ్రీ భావం: ఓ అర్జునా! చంచలమైన మనస్సును నియంత్రించడం కష్టమనేది నిజమే. కానీ, ‘అభ్యాసం’ అంటే పట్టుదలతో కూడిన నిరంతర సాధన ద్వారా దీనిని కచ్చితంగా సాధించవచ్చు. ఒక విషయాన్ని నేర్చుకోవడంలో రోజువారీ పట్టుదలే అభ్యాసం. భగవద్గీతలోని ఈ శ్లోకం బనగానపల్లెకు చెందిన ఓ విద్యార్థిని ప్రతిభకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాల పారాయణ పొటీల్లో ముస్లిం మతానికి చెందిన విద్యార్థిని రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. భగవద్గీత శ్లోకాల పారాయణ పోటీల్లో రాణిస్తున్న ముస్లిం విద్యార్థిని నుస్త్రత్ దక్షిణ భారతదేశ స్థాయిలో ఇస్కాన్ నిర్వహించిన పోటీల్లో ప్రతిభ మొదటి బహుమతి రూ.లక్ష కై వసం చదువుల్లోనూ ముందంజ -
నమ్మ కన్నడ నాడు!
ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంత వాసుల జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం అరుదైన విద్యుత్ కాంతులతో జిగేల్మంది. గురువారం టీబీ బోర్డు అధికారులు కొత్త రంగు రంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ చేశారు. జలాశయానికి సంబంధించి 33 క్రస్టుగేట్లు కలిగిన ప్రాంతం మొత్తం కర్ణాటక రాష్ట్ర జెండా (రాష్ట్రీయ జెండా) రంగుల లైట్లను ఏర్పాటు చేసి రాత్రి వాటిని పరీక్షించారు. ఇటివల స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండా రంగుల లైట్లు ఏర్పాటు చెసిన అధికారులు నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవను దృష్టిలో ఉంచుకుని ఈ దీపాలను ఏర్పాటు చేసి పరీక్షించినట్లు తెలుస్తోంది. ఈ దీపాలు వెలిగిన వేళ టీబీ డ్యాం ఈ కొత్త విద్యుత్ కాంతులతో ప్రకాశించింది. – హొళగుంద -
19న కర్నూలులో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు
కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) జిల్లా నాలుగవ, ఏపీ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ మొదటి జిల్లా మహాసభలను ఈనెల 19న కర్నూలులో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.గోరంట్లప్ప తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా మహాసభల పోస్టర్ను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభలను కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో నిర్వహిస్తామన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలతోపాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. జర్నలిస్టు ల హక్కుల పరిరక్షణకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. జిల్లా మహాసభలకు అన్ని నియోజకవర్గాల జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శివశంకర్, జిల్లా సీనియర్ నాయకులు పి.చంద్రయ్య, టిజి ప్రసాద్, డి.చంద్రమోహన్, వినయ్ కుమార్, శివన్న, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు డి.హుస్సేన్, వడ్డే శ్రీనివాసులు, విజయ్ కరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు మెరుగైన ఇంటర్న్షిప్తో పాటు, ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు తెలిపారు. గురువారం వర్సిటీలో జరిగిన సమావేశంలో ప్లేస్మెంట్స్కు ఎంపికై న 48 మంది విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంటర్న్షిప్ – ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆప్టిట్యూడ్, ఇంటర్వ్యూ నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. విద్యార్థులకు మరిన్ని ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించేందుకు ప్రముఖ సంస్థలతో సమన్వయం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య బి.విజయకుమార్ నాయుడు, ఇంజినీరింగ్ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య వెంకట సుందరానంద పుచ్చ, వర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అధికారులు డాక్టర్ జి. సురేంద్ర పాల్గొన్నారు. -
జుమ్మాలదిన్నెలో హెల్త్ క్యాంప్
కోసిగి: ‘విజృంభిస్తున్న విషజ్వరాల’ అనే శీర్షికన గురువారం సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. కోసిగి ప్రాథమిక వైద్యాధికారి ఇబ్ర హీం, ఆదోని మలేరియా సబ్యూనియట్ ఆఫీసర్ మంజునాథ్ తమ సిబ్బందితో కలిసి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. గ్రామంలో వైద్య బృంద సభ్యులు ఇంటింటా తిరిగారు. జ్వరాలు ప్రబలిన వారిని పరీక్షలు చేసి ఆరోగ్య పరిస్థితుల అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రతి కాలనీలో మురుగు కాల్వలను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ను పంచాయతీ కార్యదర్శి అయ్యస్వామి చల్లించారు. దోమలు రాకుండా దోమ తెరలను వాడాలని సూచించారు. గ్రామంలో మూడు రోజుల పాటు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. అధికారులు గ్రామానికి రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేసి ‘సాక్షి’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రాణం తీసిన కరెంట్ కోత
ఆళ్లగడ్డ: విద్యుత్ కోత వల్ల ఆక్సిజన్ అందక ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. రుద్రవరం మండలం ముత్తలూరు దళిత కాలనీకి చెందిన పద్మావతి(45) కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందిగా ఉంటే ఇంటి వద్దే ఆక్సిజన్ పెట్టుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఓ మిషన్ తీసుకొచ్చి ఎప్పుడు అవసరమైతే అçప్పుడు దానితో ఆక్సిజన్ అందిస్తున్నారు. బుధవారం సా.6 గంటలకు గ్రామంలో విద్యుత్ కోత విధించడంతో ఉక్కపోతకు గురైన పద్మావతి ఉక్కిరిబిక్కిరితో శ్వాస పీల్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బందిపడింది. ఎంతకూ విద్యుత్ రాకపోవడంతో పద్మావతి పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందింది. -
మహిళ అదృశ్యం
బొమ్మలసత్రం: పట్టణంలోని ఎంఎస్ నగర్కు చెందిన లక్ష్మిదేవి అనే మహిళ అదృశ్యమైనట్లు త్రీటౌన్ పోలీసులు బుధవారం తెలిపారు. సోమవారం ఇంటి నుంచి బయల్దేరిన లక్ష్మిదేవి రైల్వే స్టేషన్ వరకు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా వెలుగులోకి రాగా తర్వాత ఆమె కనిపించకుండా పోయిందన్నారు. లక్ష్మిదేవి కూతురు పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ 81062 20337, 90525 06394 నంబర్లను సంప్రదించాలని కోరారు. సుంకులమ్మ ఆలయంలో చోరీ బేతంచెర్ల: మండల పరిధిలోని ఎం.పేండేకల్లు గ్రామంలో ఆదివారం రాత్రి సుంకులమ్మ ఆలయంలో హుండీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఆలయ పూజారి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. చోరీ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి ఆలయానికి భద్రతా చర్యలు చేపట్టి, చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే గాకుండా ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కూలీ పనికి వెళ్లి పాముకాటుతో మృతి పాణ్యం: మండల పరిధిలోని తమ్మరాజుపల్లె గ్రామంలో పాముకాటుకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందారు. బుధవారం ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మండలి రమాదేవి (32) రోజులాగే ఉదయం 6 గంటలకు బెండకాయలు తెంపేందుకు వెళ్లారు. 7 గంటల సమయంలో ఆమె ఎడమ కాలికి విష పురుగు కాటువేసింది. తోటి కూలీలు, కుటుంబసభ్యులు హటాహుటిన చికిత్స నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు. పరిక్షించిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు రోజు కూలి పని చేసుకుంటూ కుటుంబానికి తనవంతు అండగా ఉన్నారు. మృతురాలికి భర్త మహేంద్ర, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దివ్యాంగ మైనర్పై అత్యాచారయత్నం ● కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు ఆళ్లగడ్డ: కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక యువకుడు అభంశుభం తెలియని మానసిక దివ్యాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలేని అమాయక బాలిక అతడి వికృత చేష్టలకు భయపడి కేకలు వేయడంతో గమనించిన కాలనీవాసులు కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణ శివారులోని ఎంవీ నగర్ కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలిక పుట్టుకతోనే మానసిక ఎదుగుదల లోపించింది. ఆ కాలనీ పరిధిలోని వీధుల్లో తిరుగుతుంటుంది. ఈ బాలికపై కన్నేసిన శివభార్గవ అనే యువకుడు బాలిక దొమ్మరికాలనీ సమీపంలోని రోడ్డు వెంట ఒంటరిగా వెళ్తుండగా మాయమాటలు చెప్పి పక్కనున్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లాడు. దస్తులు తొలగించి వికృత చేష్టలకు పాల్పడటంతో అభంశుభం తెలియని బాలిక భయంతో ఏడుస్తూ గట్టిగా కేకలు వేసింది. గమనించిన అటుగా వెళ్తున్న వారు అక్కడకు వెళ్లి బాలికను రక్షించి అకృత్యానికి పాల్పడుతున్న శివభార్గవను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పట్టణ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. పత్తి పైరు దున్నివేత బనగానపల్లె: అసలే ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, ఇక యర్రనళ్లి ప్రభావంతో పత్తి పైరు దెబ్బతిందని, ఎన్ని క్రిమి సంహారక మందులు వాడినా ఫలితం లేకపోవడంతో రైతులు రోటావేటర్తో పైరును తొలగిస్తున్నారు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం మండలంలో రైతులు వ్యవసాయ బోర్లు, వర్షాధారం కింద సుమారు 1500 ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పైరులో ఎదుగుదల లోపించింది. కాస్తోకూస్తో ఉన్న పైరును యర్రనళ్లి విపరీతంగా ఆశించినట్లు రైతులు వాపోతున్నారు. యర్రనళ్లి నివారణకు ఖరీదైన క్రిమి సంహారక మందులు వాడినా ఏమాత్రం అదుపుకాక పూత, పిందెలు నేల రాలుతుంటంతో దిగుబడిపై ఆశలు వదులుకుని పైరును తొలగిస్తున్నారు. దుక్కిసేద్యాలు, విత్తనాలు, వ్యవసాయ కూలీలు, రసాయన క్రిమి సంహారక మందులకు ఎకరానికి రూ.20–30వేలు పెట్టుబడి పెట్టినట్లు రైతులు వాపోతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు పంట పూర్తిగా దెబ్బతినడంతో తమ పరిస్థితి ఎమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
అయ్యో‘పాప’ం
● ఆడబిడ్డను వదిలేసిన తల్లిదండ్రులు ఆలూరు: ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామ సమీపంలోని బ్రహ్మయ్య దేవాలయం వద్ద అప్పడప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలేసి వెళ్లిన సంఘటన బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో జరిగింది. దేవాలయం ముందు కళ్లు తెరవని, అప్పుడప్పుడే పుట్టిన శిశువును వదిలేసిన విషయాన్ని దేవాలయం సమీపంలోని కొందరు గుర్తించారు. ఈ విషయాన్ని కమ్మరచేడు గ్రామస్తులకు దేవాలయ నిర్వాహకులు సమాచారం చేరవేశారు. కమ్మరచేడు గ్రామానికి చెందిన ఖాశీం అనే వ్యక్తి పసికందును ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు పోలీసుల సమక్షంలో ఆదోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అమ్మ ఒడిలో సేదతీరాల్సిన పసిబిడ్డకు ఆసుపత్రిలో చికిత్సలు చేస్తున్నారు. -
రేషన్ బియ్యం అక్రమ నిల్వపై దాడులు
హొళగుంద: మండల కేంద్రంలోని ఈబీసీ, సినిమా రోడ్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని బుధవారం సాయంత్రం డీఎస్ఓ (డిస్ట్రిక్ సివిల్ సప్లై ఆఫీసర్) రాజారఘువీర్ దాడులు చేసి పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్నూలు నుంచి వచ్చిన ఆయన సీఎస్డీటీ దీప, తహసీల్దార్ లక్ష్మిరాజు, ఎస్ఐ దిలీప్కుమార్తో కలిసి దాడులు చేపట్టారు. ఈబీసీ కాలనిలోని ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 15 బస్తాల (6.25 క్వీంటాళ్లు) రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అలాగే సినిమా రోడ్డులోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 77 క్వింటాళ్లు (189 బస్తాలు) బియ్యాన్ని దాడులు చేసి పట్టుకోగా ఆ ఇంటి వారితో పాటు స్థానికులు డీఎస్ఓ, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగారు. అవి రేషన్ బియ్యం కాదని, రైతులు పండించిన బియ్యమని వాదించారు. అయితే బియ్యం నిల్వలో పీడీఎస్ బియ్యం కలిసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాటిని టెస్టింగ్ కోసం కర్నూలు ల్యాబ్కు పంపుతున్నట్లు తహసీల్దార్ లక్ష్మిరాజు తెలిపారు. రేషన్ బియ్యం కలిసి ఉంటే బాధ్యులపై కేసులు నమోదు చేసి బియ్యం బస్తాలను సీజ్ చేస్తామన్నారు. టెస్టింగ్ రిపోర్ట్ గురువారం సాయంత్రం వస్తుందని ఆయన వెల్లడించారు. మొత్తం బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంచారు. డీటీ నిజాముద్దీన్ తదితరులు వెంట ఉన్నారు. -
మద్యం షాపుల లైసెన్సు మరో ఏడాది పునరుద్ధరించండి
కర్నూలు (టౌన్): మద్యం షాపుల లైసెన్సుల గడువు ఈ నెల 30న ముగుస్తున్నందున మరో ఏడాది పాటు రెన్యూవల్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలను నాటుసారా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా తయారు చేయకుండా పాత నేరస్తులపై నిఘా ఉంచాలని వారందరినీ సంబంధిత తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల మద్యం, నకిలీ మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల మద్యం కేసుల్లో, గ్రేవ్ క్రైం కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి అరెస్టు చేయకుండా ఉన్న పెండింగ్ కేసుల ముద్దాయిలను సత్వరమే అరెస్టు చేయాలని దర్యాప్తు అనంతరం చార్జ్షీటు కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు (కర్నూలు), రవికుమార్ (నంద్యాల), ఏఈఎస్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, విజయకుమార్, కర్నూలు, నంద్యాల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
వినాయక చవితి ప్రశాంతంగా జరుపుకోవాలి
కర్నూలు (టౌన్): వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలను కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వివిధ మతాల పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ ఎవరి మనోభావాలకు భంగం కలుగకుండా ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు. వాట్సప్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాద్యమాల్లో వచ్చే నిర్ధారణ లేని సందేశాలు, రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలను గుడ్డిగా నమ్మవద్దన్నారు. అలాగే బాధ్యతారహితంగా ఇతరులకు షేర్ చేయవద్దన్నారు. అనుమానాస్పద సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియజేయాలన్నారు. చట్ట ప్రకారం డీజేల శబ్ధం 70 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని సీజ్ చేస్తామన్నారు. వినాయక ఘాట్లో తగినంత నీటి లభ్యత లేని పక్షంలో నగర శివారులోని నన్నూరు టోల్ప్లాజా, ఉలిందకొండ ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లకు తగిన చర్యలు ఉంటాయన్నారు. కర్నూలు నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, 9వ రోజు నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా కొనసాగుతాయని సమావేశంలో గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, మత పెద్దలు హామీ ఇచ్చారు. కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు, మత పెద్దలు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మానసిక వైద్యులను సంప్రదించాలి
ఇటీవల కాలంలో ఆత్మహత్యకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వైద్యులను సంప్రదించి చికిత్స అందేలా చేయాలి. అక్కడి వైద్యులు మందులతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి సాధారణ జీవితం గడిపేలా చేస్తారు. –డాక్టర్ చైతన్యకుమార్ నేరెళ్ల, మానసిక వైద్యులు, జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం ఆత్మహత్యలపై మాట్లాడకూడదని ఇప్పటికీ అపోహలు ఉన్నాయి. కానీ దీని గురించి చర్చిస్తే చాలా వరకు ఆత్మహత్యలను నివారించవచ్చు. ఇటీవల కాలంలో బెట్టింగ్కు అలవాటు పడి ఎక్కువ మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెద్దలు ఈ విషయమై చర్చించి పరిష్కారం కనుగొనాలి. –డాక్టర్ కె.నాగిరెడ్డి, సైకియాట్రిస్ట్, కర్నూలు -
మొక్క మొక్కకు నీటి తడి!
కౌతాళం: వరుణదేవా.. కరుణుంచు అని అన్నదాతలు వేడుకుంటున్నారు. వర్షాలు లేక రైతన్నలు సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతన్నారు. కొందరు రైతులు ఎలాగైనా పంటలను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఖర్చుతో కూడుకున్నా సరే వెనుకుంజ వేయకుండా ముందుకు సాగుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. సాగు చేసిన మిరప పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి మగ్గుతో చెట్లకు పోస్తున్న దృశ్యం బుధవారం మండల పరిధిలోని బదినేహాల్ గ్రామంలో కనిపించింది. రైతు ముత్తమ్మ గారి నాగరాజు మిరప పైరు ఎండకుండా భార్య లక్ష్మితో పాటు కూలీల ద్వారా మొక్కలకు మగ్గుతో నీరు పోస్తున్నారు. తాను రెండెకరాల భూమిని కౌలుకు తీసుకుని ముందస్తుగా ఎకరాకు రూ.35 వేలు చొప్పున చెల్లించి పొలం సాగు చేసినట్లు రైతు తెలిపాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల లేత దశలోనే పంట ఎండిపోతోందని ఇప్పడు కాపాడకపోతే పూర్తి నష్టం జరుగుతుందని చెప్పారు. పంటను కాపాడుకునేందుకు నీళ్ల ట్యాంకర్కు బాడుగకు తెచ్చుకుని మొక్కలకు పోస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కౌలుతో పాటు రూ.60 వేల వరకు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. మొక్కలకు నీళ్లు పోస్తే పెట్టిన పెట్టుబడైన వస్తుందన్న నమ్మకంతో పని చేస్తున్నట్లు రైతు నాగరాజు చెప్పారు. పంట చేతికొచ్చేటప్పటికి ఎంత ఖర్చవుతుందో అర్థం కావడం లేదని వాపోయారు. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
కోసిగి: మండల పరిధిలోని జుమ్మాలదిన్నె గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గత వారం రోజులుగా గ్రామంలో 20 మందికి పైగా జ్వరం బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతూ అవస్థలు పడుతున్నారు. గ్రామానికి చెందిన రాగయ్య అనే వ్యక్తి ఆదోనిలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకోగా రూ.60 వేలు ఖర్చయినట్లు వాపోయారు. అలాగే తిక్కయ్య, కృష్ణ, మల్లేశ్వరితో పాటు మరో ముగ్గురు జ్వరంతో ఆదోనిలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ప్రసాద్, సునీత దంపతుల కుమారుడు వైభవ్ తేజ్ అనే బాలుడికి మూడు రోజులుగా కోసిగిలో వైద్య సేవలు అందించినా జ్వరం తగ్గడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. రాజు, సువర్ణమ్మ దంపతుల పిల్లలు జస్వన్, మహిమాలీ, ఈషా జ్వరంతో చికిత్స పొందుతున్నారు. మరికొందరు స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్సలు చేయించుకున్నట్లు తెలిపారు. గ్రామం చుట్టూ మట్టి దిబ్బలు, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టకపోవడంతో విషజ్వరాలు ప్రబలుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి దోమలు నివారణ చర్యలు, పారిశుద్ధ్య పనులు చేయించాలని కోరుతున్నారు. కుమారుడికి మూడు రోజులుగా జ్వరం తగ్గలేదని చూపుతున్న తండ్రి ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స పొందిన రాగయ్యఆదోనిలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిక్కయ్య -
పారదర్శకంగా రెవెన్యూ సేవలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల (న్యూటౌన్): రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ ఆదేశించారు. మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్తో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు. 22ఏ నిషేధిత భూముల జాబితా, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రీ–సర్వే, రెవెన్యూ–1 సేవలు, హౌసింగ్ ఫర్ ఆల్, భూసేకరణ, పీజీఆర్ఎస్, ఐవీఆర్ఎస్, ఓఆర్సిఎంఎస్ తదితర అంశాలపై పురోగతిని సమీక్షించారు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల పూర్తి వివరాలు రెవెన్యూ అధికారుల వద్ద ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. యానిమల్ కాంప్లెక్స్, వెల్నెస్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు తదితర భవనాలకు భూములను ముందుగానే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించి, 15 రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని పాణ్యం తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ శ్రీరామ్, ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులు దేశద్రోహుల్లా కనిపిస్తున్నారా?
● నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిబొమ్మలసత్రం: సమాజంలో జరిగే అవినీతిని ప్రజలకు చూపించే జర్నలిస్టులు ప్రభుత్వానికి దేశద్రోహుల్లా కనిపిస్తున్నారా అని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి , ఎమ్మెల్సీ ఇసాక్బాషా ప్రశ్నించారు. గత ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా నిర్బంధించి రిమాండ్కు తరలించిన జర్నలిస్టులు నాగచంద్రుడు, సురేష్ కుటుంబ సభ్యులను వారు బుధవారం పరామర్శించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. నిజాలను ప్రజలకు చూపించిన జర్నలిస్టులను రాజకీయ ఒత్తిళ్లతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తలుపులు బద్దలుకొట్టి అక్రమంగా నిర్బంధించడం చట్టవ్యతిరేకమన్నారు. పోలీసులు అలా అరెస్ట్ చేయటానికి జర్నలిస్టులు ఉగ్రవాదుల్లా, దేశద్రోహుల్లా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. న్యాయశాఖా మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ కుమారులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. అనధికార వ్యక్తులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటం సరైందికాదన్నారు. టీవీ ఛానల్లో లోగుట్టు కార్యక్రమం ద్వారా మంత్రి కుమారులపై వచ్చిన కథనం వాస్తవం కాదా అని నిలదీశారు. వార్త ప్రసారాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు పాలనను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా, జర్నలిస్ట్లను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందన్నారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరించటం బాధాకరమన్నారు. -
ఘనంగా ఎల్లార్తి ఉరుసు
● శేక్షావలి, షాషావలి దర్గాలను దర్శించుకున్న భక్తులు ● గంధం మోసిన పీఠాధిపతి నూర్బాబాహొళగుంద: రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన దర్గాల్లో ఒకటైన ఎల్లార్తి శేక్షావలి, షాషావలి తాతల దర్గా ఉరుసులో భాగంగా బుధవారం ఉరుసుతో పాటు తెల్లవారుజామున దర్గాలకు చేరిన గంధం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మత సామరస్యానికి ప్రతాకగా నిలిచే ఈ ఉత్సవాలను తిలకించడానికి రాష్ట్ర నలమూలల నుంచే కాకా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వచ్చారు. పురవీధుల్లో ఊరేగిన గంధం తెల్లవారుజామున దర్గా పీఠాధిపతి నూర్బాబా దర్గాలో ప్రత్యేక ఫాతెహాలు చదివి అక్కడి నుంచి గంధం మోసుకుని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి తిరిగి దర్గాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు, పకీరులు ప్రదర్శించిన కర్రసాము విన్యాసాలు, నృత్యాలు, పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. గంధం దర్గాకు చేరడంతో భక్తులు ఆయా దర్గాల్లో సమాధులను దర్శించుకుని నైవేద్యాలు, చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతెహాలు చేశారు. బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉరుసులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య పర్యవేక్షణలో ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో హొళగుంద ఎస్ఐ దిలీప్కుమార్తో పాటు 60 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గురువారం జియారత్ కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవంలో భక్తులకు ఎస్ఎస్వీ ఆధ్వర్యంలో ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, ఆదోని మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. -
శ్రీశైలంలో సేవలు చివరి స్థానానికి!
శ్రీశైలంటెంపుల్: రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాలను సందర్శించే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైల ఆలయానికి చివరిస్థానం లభించింది. ప్రతి నెలా వాట్సప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా?, ఆలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా?, ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా?, పారిశుద్ద్యం సంతృప్తికరంగా ఉందా? అనే అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. గత 4వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు జరిపిన సర్వే వివరాలను సోమవారం వెల్లడించారు. ఈ సర్వేలో మొదటి ర్యాంక్ విజయవాడ, రెండో ర్యాంక్ ద్వారక తిరుమల, మూడో ర్యాంక్ శ్రీకాళహస్తి, నాల్గో ర్యాంక్ అన్నవరం, ఐదో ర్యాంక్ కాణిపాకం, ఆరో ర్యాంక్ సింహాచలం, చిట్టచివరి ఏడో ర్యాంక్ శ్రీశైల దేవస్థానానికి దక్కింది. గత ఆగస్టు నెలలో 67శాతం సంతృప్తి చెందితే సెప్టెంబరు నెలకు వచ్చేసరికి 65.5శాతానికి పడిపోయింది. అక్టోబర్ 11 నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేది వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మహోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ప్రాథమిక సమావేశాన్ని బుధవారం దేవస్థానం పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని విభాగాలు ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలన్నారు. ఉత్సవాల సందర్భంగా తగిన విద్యుద్దీపాలంకరణ, సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ, పోలీసు శాఖ సమన్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఈఓ ఆదేశించారు. ఎస్సార్బీసీకి నేడు నీటి విడుదల బంద్ పాణ్యం: ఎస్సార్బీసీ ప్రధానకాల్వకు గురువారం నీటి విడుదల బంద్ చేస్తున్నట్లు నిలిపివేస్తున్నట్లు ఈఈ రాఘురామిరెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ నుంచి అవుకు జలాశయానికి తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని తరలించినట్లు పేర్కొన్నారు. గురువారం ఉదయం నుంచి కాల్వకు గేట్లు మూసివేస్తామన్నారు. తదుపరి ఆదేశాల వచ్చేంత వరకు ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయబోమన్నారు. చనుగొండ్ల కొండల్లో చిరుత పులుల జంట డోన్ టౌన్: మండలంలోని చనుగొండ్ల గ్రామ సమీప కొండల్లో జంట చిరుత పులల సంచారం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుత పులులను బంధించి సంరక్షణ కేంద్రాలకు తరలించాలని కోరుతున్నారు. శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.30 కోట్లు మంత్రాలయం: హుండీల్లోని కానుకలతో శ్రీరాఘవేంద్రస్వామి మఠానికి 16 రోజులకు గాను రూ 3.30 కోట్లు సమకూరింది. బుధవారం శ్రీమఠం రాజ్యాంగణ భవనంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 8 వరకు సంబంధించి 16 రోజుల హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. అందులో నగదు రూపేణా రూ 3,20,66,639, నాణేలా రూపంలో రూ.10,02,500, అలాగే 47 గ్రాముల బంగారం, 632 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్కోనాపూర్, అనంతపురాణిక్ పాల్గొన్నారు. -
పంటలు పండవనే సాకుతో..
గాజులపల్లె, బసవాపురం గ్రామాల పరిధిలో గతంలో ప్రభుత్వం పేదలకు సాగు, జీవనాధార నిమిత్తం డీకేటీ భూములు ఇచ్చింది. నిబంధనల ప్రకారం వీటిని అమ్మడం, విక్రయించడం చట్టరీత్యా చెల్లదు. అయితే ఈ భూములకు సాగు నీరు సరిగా లేకపోవడంతో పాటు నల్లమల శివారులో ఉండటంతో కొందరు రైతులు అలాగే వదిలేశారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడం వలన కాంట్రాక్టర్లు వీటిపై కన్నేశారు. రైతులకు ఆశ చూపి ఎకర భూమిని రూ. 2 లక్షల నుంచి రూ. 3లక్షలు పెట్టి కొనుగోలు చేస్తూ గ్రావెల్, ఎర్రమట్టి తరలింపు చేస్తూ పొలాలను చెరువులుగా మారుస్తున్నారు. మరికొన్ని పొలాల కోసం కాంట్రాక్టర్లు అన్వేషిస్తున్నట్లు సమీప పొలాల రైతులు తెలుపుతున్నారు. ఒక పొలంలో 100 నుంచి 120 అడుగుల లోతుతో మట్టిని తీస్తే ఏర్పడే గుంతలతో భవిష్యత్తులో పక్క పొలాలకు నీళ్లు అందే పరిస్థితి లేదని ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎండుతున్న పంట‘కేసీ’ చూడండి సార్!
ట్యాంకర్ ద్వారా నీరు పడుతున్న రైతు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవు. పైగా బోరు బావుల్లో నీరు అడుగంటిపోతున్నాయి. వీటికి తోడు రాత్రి వేళల్లో లోడ్ రిలీఫ్ పేరుతో సుమారు రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రయత్నాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మహానంది మండలం బొల్లవరం గ్రామంలోని ఓ రైతు తాను సాగు చేసిన మొక్కజొన్నను కాపాడుకునేందుకు ట్యాంకర్తో కేసీ నుంచి నీరు తెచ్చి పంటకు పారించుకున్నాడు. ఇది లా ఉండగా కేసీ కాలువ అధికారులు రైతులు ఫొటో లు తీసి బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మానవత్వంతో స్పందించి తమపై కనికరం చూపాలని పలు గ్రామాల రైతులు వేడుకుంటున్నారు. – మహానంది -
మినుము రైతు కుదేలు!
కోవెలకుంట్ల: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రైతులకు కలిసిరాలేదు. వివిధ పంటలపై ఎల్నినో పంజా విసరడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. మినుము రైతు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎకరాకు బస్తా దిగుబడి కూడా రాని పరిస్థితి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 10,188 హెక్టార్లలో మినుము సాగు చేయాల్సి ఉండగా ఆయా మండలాల పరిధిలో 12,451 హెక్టార్లలో సాగైంది. జిల్లాలో అత్యధికంగా ఆళ్లగడ్డ మండలంలో 2,464 హెక్టార్లలో, గోస్పాడు మండలంలో 2,300, దొర్నిపాడు మండలంలో 3,075, శిరువెళ్ల మండలంలో 1,070 హెక్టార్లలో సాగైంది. సేద్యాల, విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు ఎకరాకు రూ. 18 వేల నుంచి రూ. 20 వేలకు పైగా వెచ్చించారు. పైరు చేతికందే వరకు వర్షాలు కురియకపోవడం, ఎండలు అధికం కావడం, విపరీతమైన గాలులు వీస్తుండటంతో పైరులో ఎదుగుదల ఆగిపోయింది. పైరు పూతకు రావాల్సి ఉండగా ఎండిపోతుండటంతో వేలాది ఎకరాల్లో పైరును దున్ని వేసి నష్టాలు చవి చూశారు. ఎకరాకు అరబస్తా దిగుబడులు గత ఏడాది మినుము సాగుతో నష్టాలు మూటగట్టుకున్న రైతులు ఈ ఏడాది ఆ నష్టాన్ని పూడ్చుకుందామని భావించి సాధారణ విస్తీర్ణాన్ని మించి మినుము పంట సాగు చేశారు. విత్తనం వేసినప్పటి నుంచి వరుణుడు ముఖం చాటేయడం, సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. బోర్లు, ఇతర సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న రైతులు ఎకరాకు రూ. 6 వేల నుంచి రూ. 8 వేలు వెచ్చించి రెండు, మూడు తడులు సాగునీరు మళ్లించినా ప్రకృతి ప్రతికూల పరిస్థితులతో ప్రయోజనం లేకుండా పోయింది. ఎకరాకు కనీసం మూడు నుంచి నాలుగు బస్తాల దిగుబడులు వస్తాయనుకుంటే ప్రకృతి అనుకూలించకపోవడంతో ఎకరాకు అరబస్తా దిగుబడులు మాత్రమే రావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల పిచికారీ, కలుపు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో వేలాది రూపాయలు వెచ్చించారు. వర్షాభావ పరిస్థితులతో దిగుబడులు భారీగా తగ్గి పెట్టుబడులు నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైరుకోసం పెట్టిన పెట్టుబడిలో కనీసం ఒక భాగం దిగుబడులు కూడా రాకపోవడంతో దిగాలు చెందుతున్నారు. సొంత పొలాలు ఉండి మినుము సాగు చేసిన రైతులు పెట్టుబడుల రూపంలో నష్టపోగా కౌలుకు తీసుకుని సాగు చేసిన కర్షకులకు ఎకరాకు రూ. రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు నష్టం వాటిల్లడంతో లబోదిబోమంటున్నారు. వెంటాడిన వర్షాభావం జిల్లాలో 12,451 హెక్టార్లలో సాగైన మినుము పెట్టుబడి ఎకరాకు రూ. 20వేల పై మాటే ప్రారంభమైన కోత, నూర్పిడి పనులు ఎకరాకు బస్తాలోపే దిగుబడులు -
30 ఎకరాల్లో మినుముసాగు
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 15 ఎకరాల సొంత పొలంతో పాటు ఎకరాకు రూ. 18 వేలు కౌలు చెల్లించి మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని 30 ఎకరాల్లో మినుము సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సాగునీటి తడులు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలు ఖర్చుచేశాను. పైరు పూత, పిందె దశలో అధిక ఎండలు, చీడపీడల కారణంగా దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ఎకరాకు బస్తాకు మించి దిగుబడులు వచ్చే సూచనలు కనిపించడం లేదు. – సుబ్బరాయుడు, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం ఈ ఏడాది ఖరీఫ్లో 16 ఎకరాల్లో మినుము పంట వేశాను. పెట్టుబడుల రూపంలో ఎకరాకు 20 వేలు వెచ్చించాను. వర్షాభావ పరిస్థితులతో పైరు ఎండి పోవడంతో పది ఎకరాల్లో పంటను దున్ని వేశాను. మిగిలిన పైరులో దిగుబడులు వస్తాయనుకుంటే ఇటీవల తీవ్ర ఎండల కారణంగా ఎండిపోయింది. ఈ ఏడాది మినుము సాగుతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. అధికారులు పంట నష్టం చెల్లించి మినుము రైతులను ఆదుకోవాలి. – వెంకట్రామిరెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం -
వితంతువుల పింఛన్కు ని‘బంధనాలు’
కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి అంటూ ప్రకటన ఇచ్చే ముందు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలపై దృష్టి సారించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వితంతు పింఛన్కు దరఖాస్తు చేసుకునే వారు రేషన్కార్డులో భర్తల పేరు తొలగించుకోవాల్సిందని చెప్పటంతో ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యమంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కొందరు తహసీల్దార్ కార్యాలయం వద్దకు పరుగులు తీస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తహసీల్దార్ డిజిటల్ సంతకం చేసి పంపుతున్నారు. అయితే రేషన్కార్డులో చనిపోయిన వారి పేర్లు డిలీట్ కావడం లేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువులోగా రేషన్కార్డులో పేర్లు తొలగిపోతాయా లేదా అనే సందిగ్ధంలో వితంతువులున్నారు. ఈ విషయమై తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్ను వివరణ కోరగా.. సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నందున ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. – జూపాడుబంగ్లా సార్.. గడువు పొడిగించండి! 08 ఏఎల్ఆర్ 61. పింఛన్కు దరఖాస్తు చేసేందుకు సచివాలయం వద్దకు చేరుకున్న ప్రజలు కొత్త పింఛన్ల దరఖాస్తుకు గడువు పొడిగించాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయిందని, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం సమయం సరిపోవడం లేదని, పనులు మానుకుని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేకపోతున్నామని మండల కేంద్రమైన హాలహర్వికి చెందిన పింఛన్ దరఖాస్తుదారులు వాపోతున్నారు. మీ సేవా కేంద్రాలు, సచివాలయాల వద్ద సాంకేతిక సమస్యలతో దరఖాస్తుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 16వ తేదీ వరకు ఉన్న గడువును ప్రభుత్వం నెలాఖరు వరకు పొడిగించాలని కోరుతున్నారు. – హాలహర్వి -
డప్పు కళాకారుల పింఛన్లపై స్పష్టత కరువు
కర్నూలు(అర్బన్): ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథక ంలో భాగంగా వివిధ రకాల పింఛన్లకు దరఖాస్తు ప్రక్రి య ప్రారంభమైనా, డప్పు కళాకారుల విషయంలో స్పష్టత కొరవడింది. డప్పు కళాకారులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్కార్డు, రేషన్కార్డు/ఆదాయ ధృవీకరణ పత్రంతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన సర్టిఫికేట్ ను అందజేయాలని స్పష్టం చేశారు. కాగా, గతంలో జిల్లాలోని డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులను అందించారు. అయితే ప్రస్తుతం పింఛన్ల దరఖాస్తు కు సచివాలయాలకు వెళితే సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన సర్టిఫికెట్ను అందజేయాలని కచ్చితంగా చెబుతున్నారని వాపోతున్నా రు. ఈ నేపథ్యంలోనే మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన డప్పు కళాకారులు పదుల సంఖ్యలో స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి వచ్చి తమకు సర్టిఫికెట్లు అందించాలని కోరారు. అయి తే ఈ విషయంలో తమ శాఖకు చెందిన ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక చెబుతున్నా రు.పింఛన్లకు దరఖాస్తు సమయం చాలా తక్కువగా ఉండటం, మూడు రోజులు వరుస సెలవులు కావ డం దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
దరఖాస్తు ప్రక్రియలో జాప్యానికి తావివ్వొద్దు
నంద్యాల(న్యూటౌన్): కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో జాప్యానికి తావివ్వొ ద్దని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని అయ్యలూరు మెట్ట 1, 2 స్వర్ణ వార్డులను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా నూతన పింఛన్ల కోసం దర ఖాస్తు చేసుకునే విధానాన్ని స్వయంగా పరిశీలించి, దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలు సుకున్నారు. ఒక్కో దరఖాస్తు ప్రక్రియకు పడుతున్న సమయం, దరఖాస్తుకు అవసరమైన పత్రాలు, అర్హత ప్రమాణాలు తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ కోసం వచ్చే వృద్ధులు, ఇతర లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్ పథకం ప్రయోజనం అందేలా సమర్థవంతంగా పనిచేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా, పారదర్శకంగా, సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. -
రెండో రోజు అంతే..
పింఛన్ల దరఖాస్తుకు సర్వర్ మొరాయిస్తుండటంతో రెండో రోజు మంగళవారం కూడా ప్రజలు ఇంటిముఖం పట్టారు. సోమవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో అర్హులు సచివాలయాల వద్దకు చేరుకుంటున్నారు. అయితే సర్వర్ మొరాయించడంతో గంటల తరబడి పనులు మానుకుని అక్కడే వేచి ఉండాల్సి వస్తోంది. ఉదయం ఒకటి రెండు దరఖాస్తులు పూర్తయ్యేసరికి సర్వర్ మొరాయించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రమైనా దరఖాస్తులు పూర్తి కాకపోవడంతో ఇంటి దారి పట్టారు. – గోనెగండ్ల -
అంతా వ్యాపారం!
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం సదర్శనకు అనునిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. క్షేత్రంలో భక్తుల రద్దీతో ఇక్కడ ఏ వ్యాపారం చేసిన వ్యాపారులు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతారు. ఇందుకోసం శ్రీశైల క్షేత్రంలో వ్యాపారం నిర్వహించుకునేందుకు పలువురు వ్యాపారులు ఆసక్తి చూపుతారు. వ్యాపారులతో పాటు తామేమి తక్కువ కాదు అన్నట్లు టీడీపీకి చెందిన ముఖ్యనేత తనకు ఉన్న వ్యాపారాన్ని విస్తరించేందుకు పావులు కదిపారు. తనకు ఉన్న డెయిరీ ద్వారా పాలు, పాల ఉత్పత్తులు విక్రయించుకునేందుకు దుకాణం కేటాయించాలని దేవస్థానానికి విజ్ఞప్తి చేశారు. దేవస్థాన ఉన్నతాధికారి టీడీపీ ముఖ్యనేత వద్ద స్వామిభక్తి పొందేందుకు అడిగిందే తడవుగా అగమేఘాల మీద అనుమతులు మంజూరు చేశారు. క్షేత్రంలో ప్రధాన కూడలి వద్ద దుకాణానికి స్థలం కేటాయించారు. దుకాణ నిర్మాణ పనులు సైతం చకాచకా జరిగిపోతున్నాయి. మాస్టర్ప్లాన్లో భాగంగానే గతంలో షాపులను తొలగించిన ప్రదేశంలో ఇప్పుడు మళ్లీ షాపు కేటాయించడంపై దేవస్థాన ఉన్నతాధికారి తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. దేవస్థానం మాస్టర్ప్లాన్లో భాగంగా ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న దుకాణాలను సైతం తొలగించి రోడ్లను విస్తరణ చేశా రు. అలాగే నందిమండపం వద్ద సైతం ఉన్న దుకా ణాలను తొలగించి వారికి ప్రత్యామ్నాయంగా ఇతర ప్రదేశాలలో దుకాణాలు కేటాయించారు. క్షేత్ర అభి వృద్ధి కోసం గతంలో దుకాణాలు తొలగించిన చోట ఇప్పుడు అదే ప్రదేశంలో షాపు కేటాయించడం వెను క పెద్ద కథే నడిచిందని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు మెప్పు కోసం నిబంధనలను సైతం లెక్కచేయకుండా అనుమతలిచ్చినట్లు సమాచారం. దేవస్థానం ఉన్నతాధికారి పాలనలో దేవస్థానం భక్తుల సంతృప్తి స్థాయిలో చివరి స్థానానికి చేరిందని ప్రభుత్వ పెద్దలు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ ముఖ్యనేత చెందిన డెయిరీ కాకుండా ఇంకా చాలా ప్రైవేట్ డెయిరీ లు సైతం శ్రీశైలంలో ఉన్నాయి. వాటికి కూడా ప్రధా న కూడలిలో స్థలాన్ని కేటాయించాలనే విజ్ఞప్తులు సైతం వస్తాయనే అవగాహన లేకుండా అనుమతులు ఇవ్వడంపై అధికారి తీరును పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారిని వివరణ కోరగా.. సంఘం డెయిరీకి, వారి ఉత్పత్తులను అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీగిరిలో టీడీపీ నేత డెయిరీకి అగ్రతాంబూలం మాస్టర్ప్లాన్లో భాగంగా దుకాణాలు తొలగించిన ప్రదేశంలో డెయిరీకి స్థలం కేటాయింపు చకాచకా జరుగుతున్న నిర్మాణ పనులు దేవస్థాన ఉన్నతాధికారి తీరును ప్రశ్నిస్తున్న దుకాణదారులు -
సిబ్బంది లేరు.. సమయం లేదు !
కొత్త పింఛన్ల దరఖాస్తుకు గడువు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో అర్హులైన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాల వద్ద బారులుదీరుతున్నారు. ముఖ్యంగా మండల కేంద్రమైన గడివేములలో రెండు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకే ఒక్క డిజిటల్ అసిస్టెంట్ ఉండటంతో లబ్ధిదారులు గంటల కొద్ది వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సచివాలయాలకు సిబ్బందిని కేటాయించా లని పలువురు కోరుతున్నారు. – గడివేముల రుద్రవరం మండలం ఎల్లావత్తుల సచివాలయంలో విద్యుత్ కోతతో వేచి ఉన్న దరఖాస్తుదారులు -
నీటిని అనధికారికంగా మళ్లిస్తే చర్యలు
● సాగునీరు అందించడం సాధ్యం కాదు ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(న్యూటౌన్): తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన నీటిని అనధికారికంగా మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి హెచ్చరించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో సాగునీరు అందించడం సాధ్యం కాదని, రైతులకు కఠినంగా కాకుండా మర్యాదపూర్వకంగా వివరించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 14 లక్షల పశుసంపద ఉన్నందున ప్రజలతో పాటు పశువుల తాగునీటి అవసరాలను తీర్చాలన్నాపరు. కేసీ కెనాల్, కొలిమిగుండ్ల బ్రాంచ్ కెనాల్, ఎస్ఆర్బీసీ కాలువల ద్వారా విడుదలైన నీటిలో ఒక్క నీటి బొట్టు కూడా వృథా కాకూడదన్నారు. ప్రతి కుంట, చెరువు, 13 ఎస్ఎస్ ట్యాంకులను నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. -
12న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు(టౌన్): జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాలులో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్లోనివిల్, రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ఫ్యామిలీ కేసులు, చెక్బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ కేసులు, 10 సంవత్సరాలు పైబడిన సివిల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి లోక్ అదాలత్ను విజయవంతం చేయాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సహకారం అందించి ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాదర్శి లీలా వెంకట శేషాద్రి, ఉమ్మడి కర్నూలు జిల్లాల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ మీట్లో సత్తాచాటిన పోలీసులకు ఎస్పీ అభినందన
బొమ్మలసత్రం: ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సత్తాచాటిన నంద్యాల జిల్లా పోలీసులను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునిల్ షొరాన్ అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నాగార్జున యూనివర్సిటీలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు పోటీలు నిర్వహించగా జిల్లా పోలీసులు ఏడు బంగారు, పది వెండి, 13 కాంస్య పతకాలు సాధించడం సంతోషమన్నారు. పోలీసు మహిళా విభాగంలో మార్షల్ ఆర్ట్స్, రెజ్లింగ్, ఆర్మ్ రెజ్లింగ్ తదితర క్రీడల్లో ఓవరాల్ చాంపియన్షిప్లో మొదటి స్థానంలో జిల్లా మహిళా పోలీసులు నిలవడం అభినందనీయమన్నారు. అలాగే పురుషులు రెండో స్థానంలో నిలవడం హర్షించదగ్గ విషయమన్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ఖాదర్బాషా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ చిన్నికృష్ణ, డీఎస్పీలు, శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా ఏకాదశి ఉత్సవం
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మూలమూర్తులను సుప్రభాతసేవతో మేల్కొల్పి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచారు. పంచామృతాలతో అభిషేకించి వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య ధూపదీపాలతో మహా మంగళహారతి అందించారు. రాత్రి విశేష అలంకరణలో స్వామి, అమ్మవార్లు పల్లకీపై కొలువుదీరి తిరువీధిలో విహరించారు. -
పీజీఆర్ఎస్కు 110 ఫిర్యాదులు
బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 110 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్షొరాణ్ మాట్లాడుతూ.. కొన్ని ఫిర్యాదులను ఆయా పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి పరిష్కరించామన్నారు. మరికొన్నింటిని ఆయా స్టేషన్ అధికారులకు బదిలీ చేశామన్నారు. ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. పింఛన్లకు కొత్త దరఖాస్తుల స్వీకరణ నంద్యాల(న్యూటౌన్): ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అర్హులైన కొత్త లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంపై జిల్లా, మండల స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద సెప్టెంబరు 7 నుంచి 16వ తేదీ వరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో కొత్త పింఛన్ దరఖాస్తులను స్వీకరించి, ఆన్లైన్ లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్ఓ రామునాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పర్యాటక విశిష్టత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పర్యాటక విశిష్టత అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా టూరిజం శాఖ అధికారి సునీల్కన్నా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈనెల 18లోగా ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ 5వ అంతస్తు, స్టాలిస్ కార్పొరేట్ ఆటోనగర్ విజయవాడకు పంపాలన్నారు. దరఖాస్తులను నిర్దేశిత నమూనాలో పోస్టు ద్వారా, స్వయంగా ఆర్డ్ కాపీ సమర్పించాలన్నారు. ప్రతి దరఖాస్తుతో 100 పదాలకు మించని సంక్షిప్త వివరణ ఉండాలన్నారు. వివరాలకు సెల్ : 9440841126, 8297098022కు సంప్రదించాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్తో బస్సు డ్రైవర్కు జైలు చాగలమర్రి: మద్యం సేవించి బస్సు నడుపుతున్న వ్యక్తికి ఆళ్లగడ్డ స్పెషల్ కోర్టు మెజిస్ట్రేట్ రవికుమార్ ఐదు రోజులు సాధారణ జైలు శిక్ష విధించినట్లు చాగలమర్రి ఎస్ఐ ఎం. రాజారెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబరు 7వ తేదీ తెల్లవారుజామున చాగలమర్రి టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా డ్రైవర్ విట్టల్ అతిగా మద్యం సేవించి హైదరాబాద్ నుంచి బస్సు నడుపుతూ వస్తున్నాడు. వాహనాన్ని ఆపి బ్లీతింగ్ అనలైజర్తో పరీక్షించగా 200ఎంజి పరిమితికి మించి మెతాదు నిర్ధారణ అయ్యింది. నిందితున్ని అరెస్టు చేసి ఆళ్లగడ్డ స్పెషల్ మెజిస్ట్రేట్ రవికుమార్ ఎదుట హాజరుపరచగా ఐదు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ ఎం రాజారెడ్డి తెలిపారు. అమ్మానాన్న మృతితో అనాథలుగా... ఆళ్లగడ్డ: తల్లిదండ్రులు మృతిచెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ విషాద ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని పాలసాగరం సమీపంలో నివాసముండే కరీం బాషా (37), అతని భార్య నశీమున్లు ఇంట్లో వివిధ రకాల నూనెలను గానుగ ఆడించి జీవనం కొనసాగించే వారు. ఆరు నెలల కింత్రం నశీమున్ గానుగ మిషన్ ఆడిస్తూ ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. అప్పటి నుంచి ఇద్దరు కుమార్తెలు తస్లీం, సోఫియాల బాధ్యతను తండ్రి కరీం బాషా తీసుకున్నాడు. అయితే ఆదివారం రాత్రి గుండోపోటు రావడంతో మృతి చెందాడు. సోమవారం ఉదయం తండ్రి ఎంతకూ లేకపోవడంతో చిన్నారులు వెళ్లి ఎంత పిలిచినా పలకలేదు. భయపడిన చిన్నారులు గట్టిగా ఏడుస్తూ కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి చూసి గుండెపోటుతో మృతి చెందినట్లు గుర్తించారు. తల్లిదండ్రులు లేక ఆ చిన్నారులు అనాథలుగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వంస్పందించి ఆ చిన్నారుల చదువుల బాధ్యతను స్వీకరించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.కరీం బాషా కుమార్తెలు -
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన జెడ్పీటీసీ సభ్యులు
తమకు అందించాల్సిన గౌరవ వేతనాలను పూర్తి స్థాయిలో పెండింగ్లో పెట్టడంతో జెడ్పీటీసీ సభ్యులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అంశంపై పలుమార్లు జెడ్పీ సీఈఓ, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా, ఎలాంటి ఫలితం కనిపించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనున్న వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులకు జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి వేతనాలను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. తమకు కూడా వేతనాలను అందించాలని ఉమ్మ డి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు కోరుతున్నారు. మరో ఇరవై రోజుల్లో తమ పదవీ కాలం పూర్తి అవుతున్న దృష్ట్యా పెండింగ్లో ఉంచిన గౌరవ వేతనాలను చెల్లించాలని స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఆళ్లగడ్డ: ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారంతా.. పాలనా పరమైన అంశాల్లో వారి ఆమోదం (కోరం) తప్పనిసరి. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనాల్సిన వారిని చంద్రబాబు ప్రభుత్వం కరివేపాకులా తీసి పారేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తూ చిన్న చూపు చూస్తోంది. మరో ఇరవై రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం ముగుస్తున్నా.. నేటికీ ప్రభుత్వం వేతనాల రూపంలో వీరికి కోట్ల రూపాయలను బకాయి పెట్టింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందించే గౌరవ వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే తంతు! ‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనం పెంచుతాం.. స్థానిక సంస్థలకు పూర్వ వైభవం తెస్తాం’.. అని టీడీపీ అధినే చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వేతనం పెంచడం దేవుడెరుగు పదవీకాలం ముగుస్తున్నా గౌరవ వేతనాన్ని ఇవ్వకుండా ఎంపీటీసీ సభ్యులను తీవ్రంగా వేధించారు. హోదాలో జిల్లా ప్రథమ పౌరుడైన జిల్లా పరిషత్ చైర్మన్కు ప్రభుత్వం నెలకు రూ.40 వేలు, జెడ్పీటీసీ సభ్యులకు రూ.6 వేలు, మండల పరిషత్ అధ్యక్షులకు రూ.6 వేలు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులకు (ఎంపీటీసీలకు) రూ.3 వేలను గౌరవ వేతనంగా అందించాల్సి ఉంది. ఈ మొత్తం కేవలం వారి హోదాను గౌరవించి ఇవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు సంబంధించిన గౌరవ వేతనాలపై పెదవి విప్పడం లేదు. గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలకు ఎప్పటికప్పుడు నిధులు విడుదలవుతూ వచ్చాయి. 2024 ఎన్నికల కంటే ముందు మూడు, నాలుగు నెలలు మినహా మిగిలిన ఐదు సంవత్సరాల్లో గౌరవ వేతనాలను రెగ్యులర్గా విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 27 నెలలుగా స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. పలు సమావేశాల్లో అడుగుతున్నా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో జరుగతున్న మండల సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు తమ వేతనాలకు సంబంధించి పలు మార్లు ప్రశ్నిస్తున్నా, వినతి పత్రాలు అందిస్తున్నా, నేటి వరకు ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో కూడా పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించినా, ఆశించిన స్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనాలకు సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి పలుమార్లు పీఆర్అండ్ఆర్డీ కార్యాలయానికి కరస్పాండెన్స్ జరుగుతున్నా, వేతనాలు విడుదల చేసే అంశంలో మాత్రం స్పష్టత కొరవడింది. జెడ్పీటీసీలకు అందించాల్సిన గౌరవ వేతనాలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేశాం. గతంలో జెడ్పీటీసీలు అందించిన వినతి పత్రాలను కూడా ప్రభుత్వానికి పంపించారు. జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. – ఆర్.సుధాకర్రెడ్డి, జెడ్పీ సీఈఓ అధికారిక లెక్కల ప్రకారం జెడ్పీ చైర్మన్తో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు ప్రభుత్వం ఈ ఏడాది ఆగష్టు నెల వరకు రూ.10,38,11,463లను బకాయి పడింది. జెడ్పీ చైర్మన్కు నెలకు రూ.40 వేల ప్రకారం 27 నెలలకు రూ.10.80 లక్షలు 52 మంది జెడ్పీటీసీ, కోఆప్షన్ సభ్యులకు నెలకు రూ.6 వేల ప్రకారం 27 నెలలకు రూ. 87.48లక్షలు 53 మంది ఎంపీపీ, 778 మంది ఎంపీటీసీలకు రూ.7,16,04,000 స్థానిక ప్రజాప్రతినిధులపై చంద్రబాబు ప్రభుత్వం ‘చిన్న చూపు’ జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులకు 27 నెలలుగా అందని గౌరవ వేతనం ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులదీ ఇదే పరిస్థితి వీరికి ప్రభుత్వం చెల్లించాల్సింది రూ.8.95 కోట్లు మొత్తంగా రూ. 10.38 కోట్లు పెండింగ్ మరో 20 రోజుల్లో ముగియనున్న స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం -
జాప్యమెందుకు
ప్రతి నెలా ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను పెండింగ్లో పెట్టడమేంటి? ఈ విషయంపై సహచర జెడ్పీటీసీలతో కలిసి సీఈఓ దృష్టికి తీసుకుపోయాం. నేటి వరకు గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. రవాణా ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. – డీ దొరబాబు, జెడ్పీటీసీ సభ్యుడు, ఆస్పరి గౌరవ వేతనాలను అందించే విషయంలో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే సహచర జెడ్పీటీసీలతో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. పక్కనున్న వైఎస్సార్ కడప జిల్లాలో జెడ్పీ సాధారణ నిధుల నుంచి పెండింగ్లో ఉన్న జెడ్పీటీసీల గౌరవ వేతనాలను విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. – ఈ రంగనాథ్గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు, ఓర్వకల్లు సర్పంచ్ కాలం గడువు ముగిసినా మేం ఇంకా పదవిలోనే కొనసాగుతున్నాం. అయినా పాలన అంతా ఎలాంటి పదవులు లేని టీడీపీ నేతలతోనే కొనసాగిస్తున్నారు. అధికారులు సైతం ప్రొటోకాల్ పాటించడం లేదు. గౌరవం ఇవ్వక పోయినా వేతనమైనా ఇస్తుందనుకుంటే అదీలేదు. గడువు ముగిసే లోపైనా ఇస్తారో లేదో? – ఎద్దుల రాజేశ్వరి, ఎఎంపీటీసీ సభ్యురాలు, చింతలచెరువు, చాగలమర్రి మండలం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాకు ఒక్క రూపాయి కూడా గౌరవ వేతనం ఇవ్వలేదు. నాకు రూ. 78 వేల వేతనం రావాలి? ఎప్పుడు ఇస్తారో తెలియదు. సొంత ఖర్చులతో ప్రతి మండల సమావేవానికి హాజరయ్యా. పదవీ కాలం ముగిసేలోపైనా బకాయిలు చెల్లిస్తారో లేదో? – పెద్ద పేరయ్య, ఎంపీటీసీ సభ్యుడు, హరివరం, ఉయ్యాలవాడ మండలం -
ఎమ్మెల్యే పొలాలకు నీళ్లు.. రైతుల పొలాలకు కన్నీళ్లా?
● శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీరుపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ధ్వజం వెలుగోడు: ఎల్నినో ప్రభావంతో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పొలానికి మాత్రం సాగునీరు ఎలా అందుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి ప్రశ్నించారు. రైతుల కష్టాలను వివరిస్తూ, ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ సోమవారం బుడ్డా శేషారెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘ఒకవైపు ఎల్నినో ప్రభావంతో రైతులు సాగునీటి కోసం అల్లాడుతున్నారు. తాగునీటికి మాత్రమే నీళ్లు విడుదల చేస్తున్నామని అధికార పార్టీ నాయకులు, అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు చెరువులు, కుంటలు నింపి పశువులకు నీరు అందించడంతో పాటు భూగర్భ జలాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ కృష్ణా జలాలను, కాలువల ద్వారా వస్తున్న నీటిని చెరువులకు మళ్లించకుండా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి పొలానికి మాత్రం నేరుగా నీరు ఎలా పారుతోంది?’’ అని బుడ్డా శేషారెడ్డి ప్రశ్నించారు. మిగతా రైతుల పరిస్థితి ఏంటి? ‘‘కాలువల వెంట ఇరిగేషన్ అధికారులు, లస్కర్లను, సిబ్బందిని కాపలాగా పెట్టి తూముల వద్ద నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఆ నిఘా అంతా ఎమ్మెల్యే పొలాలకు నీళ్లు సక్రమంగా చేరేందుకేనా? మేడం కలెక్టర్ గారు, ఎస్పీ గారు క్షేత్రస్థాయిలోకి వచ్చి రైతుల పొలాలను పరిశీలించండి. పక్కనే ఉన్న పొలాలు నెర్రెలు వారి ఎండిపోతుంటే ఎమ్మెల్యే పొలంలో మాత్రం మనుషులను పెట్టి నీళ్లు పారిస్తున్నారు. మొన్ననే ఒక రైతు కొత్తగా బోరు వేసినా భూగర్భ జలాలు అందక కొద్దిసేపు నీరు వచ్చి మళ్లీ ఆగిపోతున్నాయి. నారుమడులు పూర్తిగా ఎండిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి. సొంత పొలాలకు మాత్రమే నీరు మళ్లించుకుంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటి?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి ‘‘తెలుగుగంగ, కేసీ కెనాల్, ఇతర కాలువలకు నీళ్లు బ్రహ్మాండంగా పారినప్పుడు తాను రైతునని చెప్పుకోవడం సులభమే. పక్క రైతులు ప్రశ్నిస్తే అహంకారంతో సమాధానం చెప్పకుండా, ప్రజల కడుపుకొట్టే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అన్నట్టుగా వ్యవహరించకండి. రైతులందరికీ సమానంగా సాగునీరు అందించండి.’’ అని బుడ్డా శేషారెడ్డి పేర్కొన్నారు. -
పైళ్లెన నాలుగు నెలలకే..
● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఆదోని అర్బన్: పట్టణ శివారులోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్లోని పర్వతాపురం క్రాస్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని బుడుదూ రు గ్రామానికి చెందిన సోమశేఖర్, శాంతమ్మ(21)కు నాలుగు నెలల క్రితం వివాహమైంది. శ్రావణ మాసం కావడంతో బైక్పై బాబాయి కొడుకు ఆకాష్తో కలసి ఉరుకుంద క్షేత్రానికి బయలుదేరారు. ఆదోని పట్టణ సమీపంలోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్లోని పర్వతాపురం క్రాస్ వద్ద స్పీడు బ్రేకర్ను గమనించకుండా వేగంగా వెళ్లడంతో వెనుక కూర్చున్న శాంతమ్మ(21) ఎగిరి కింద పడటంతో తీవ్రంగా గాయపడింది. ఆ క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడటంతో బాలుడు ఆకాష్కు గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శాంతమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయం
కర్నూలు(సెంట్రల్): నంద్యాలలో జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం అన్యాయమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరంట్లప్ప, జిల్లా నాయకులు టీజీ ప్రసాదు, నగర అధ్యక్షుడు ఎం.శివశంకర్ అన్నారు. జర్నలిస్టుల అరెస్టులను నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాలలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారులు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై ఐ న్యూస్ చానెల్ చేసిన కథనంపై టీడీపీ నాయకులు, పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. మొదటగా కొందరు టీడీపీ నాయకులు వార్తా కథనాన్ని యూట్యూబ్ నుంచి తొలగించాలని పోలీసుల ద్వారా రాయబారం నడిపారన్నారు. అయితే కథనాన్ని తొలగించే అధికారం తమ చేతిలో ఉండదని రిపోర్టర్లు చెప్పడంతో వారిపై డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలతో ఓ టీడీపీ నాయకుడితో ఫిర్యాదు తీసుకొని ముగ్గురు రిపోర్టర్లపై కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. అంతేగాక నంద్యాలలో ఉంటున్న ఇద్దరు రిపోర్టర్లను అర్ధరాత్రి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యు లు భయపడేలా అరెస్టు చేశారని, మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేయడం అన్యాయమన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, కేసులను పూర్తిగా ఎత్తి వేయాలని కోరారు. జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించాలి
గోనెగండ్ల: రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించాలని, ఇందుకు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె. రాఘవేంద్ర చౌదరి, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ టీ. చందన అన్నారు. సోమవారం కేవీకే బనవాసి ఆధ్వర్యంలో తాడిపత్రి జేసి దివాకర్ రెడ్డి వ్యవసాయ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం 10 మంది విద్యార్థులతో కలసి పిల్లిగుండ్ల, ఒంటెడుదిన్నె గ్రామాల్లో పీఆర్ఏ పద్ధతులపై గ్రామీణ అవగాహన కార్యక్రమం చేపట్టారు. రైతులతో కలిసి గ్రామ పటం, రిసోర్స్ మ్యాపింగ్, ప్రాబ్లమ్ ట్రీ వంటి పీఆర్ఏ పద్ధతులను వివరించారు. మిరప, పత్తి, ఉల్లి తదితర పంటల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, తెల్లదోమ నివారణకు పసుపు నీలం జిగురు అట్టలను ఎకరానికి 10 చొప్పున ఏర్పాటు చేసుకోవాలన్నారు. పత్తిలో 13–0–45, మెగ్నీషి యం సల్ఫెట్ పిచికారి, వీఏఎం వినియోగం ద్వారా మొక్కల ఒత్తిడి తట్టుకునే శక్తి, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. ఉల్లిలో తామర పురుగు, ఆకు మాడు సమస్యలకు ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఆధారిత జీవ నియంత్రణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. -
ఇద్దరి ప్రాణాలను బలిగొన్న అతివేగం
భూత్పూర్: జాతీయ రహదారిపై భూత్పూర్ పట్టణ సమీపంలోని బ్రిడ్జిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. ఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి జడ్చర్ల నుంచి కర్నూలు వైపు కోళ్ల లోడ్తో వెళ్తున్న ఓ డీసీఎం టైరు పంచర్ కావడంతో బ్రిడ్జిపై కుడివైపున ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి కారులో వస్తున్న హరీశ్గౌడ్(26) పరిస్థితిని గమనించి డీసీఎం వెనుక కారును నిలిపాడు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో డీసీఎం కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న డీసీఎం కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరీశ్గౌడ్, కారును ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్ జి.శేఖర్ (30) అక్కడికక్కడే మృతిచెందారు. వివాహానికి వెళ్తుండగా విషాదం మృతుడు హరీశ్గౌడ్ హైదరాబాద్లో కారు మెకానిక్గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి భార్య కల్యాణితో కలిసి బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్లోని ఆదోని డివిజన్ బుర్కుంట గ్రామంలోని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కల్యాణికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
ముగ్గురు నిందితుల అరెస్ట్
బేతంచెర్ల: పట్టణంలోని అల్లా బకాష్ దర్గా కాలనీలో మహిళపై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ రమేష్ బాబు సోమవారం తెలిపారు. వివరాల మేరకు.. గత నెల 31 పాత కక్షల నేపథ్యంలో మినుగ విజయ్, అతని అనుచరులు హసన్, విక్రమ్లు షేక్ హుస్సేన్బీ ఇంటికి వెళ్లి ఆమె కుమారుడిని చూపించాలంటూ ఆమెతో గొడవపడి దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం కర్నూలు రహదారిలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేశారు. అనంతరం డోన్ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ ముగ్గురికి రిమాండు విధించినట్లు ఎస్ఐ రమేష్ బాబు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పాములపాడు: కర్నూలు – ఆత్మకూరు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాలపల్లి గ్రామా నికి చెందిన గొల్ల జయకృష్ణ (26) మృతి చెందాడు. స్థానికులు తెలిపి న వివరాల మేరకు.. కర్నూలు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ట్రాలీ వాహనం పంచర్ కావడంతో రహదారిపై పక్కకు నిలిపారు. పాములపాడు వైపు నుంచి బైక్పై జయ కృష్ణ స్వగ్రామానికి వెళ్తుండగా కంబాలిపల్లి వద్ద అదుపుతప్పి నిలిచి వున్న ట్రాలీ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఈ ఘటనపై పాములపాడు ఎస్ఐ తిరుపాలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మెట్లపై నుంచి పడి..ఆదోని అర్బన్: పెద్దతుంబలం గ్రామానికి చెందిన రజాక్(35) సోమవారం ఇంట్లో మెట్లపై నుంచి కింద పడి మృతి చెందినట్లు పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందరన్నారు. మృతుడి భార్య గౌసియా, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉరుకుందలో గుర్తు తెలియని వ్యక్తి మృతి కౌతాళం: ఉరుకుంద గ్రామం ఈరన్నస్వామి దేవాలయ పరిసర ప్రాంతంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం దాదాపు 50 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు సమాచారం కౌతాళంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. మృతునికి సంబంధించిన ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు. మృతుని గురించి సమాచారం తెలిస్తే కౌతాళం పోలీసులను ఆశ్రయించాలన్నారు. కర్నూలు(హాస్పిటల్): చిన్న వయస్సులో గర్భం దాల్చడం తల్లీబిడ్డలకు ప్రమాదకరమని రాష్ట్రీయ కిశోర స్వాస్త్య కార్యక్రమ కన్సల్టెంట్ మల్లికార్జున చెప్పారు. సోమవారం కర్నూలు నగరంలోని పెద్దమార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు టీనేజ్ గర్భంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కిశోర బాలికలకు బాల్యవివాహాల నివారణ, టీనేజీ గర్భదారణ దుష్పరిణామాలు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలకు బలవంతం చేస్తే 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్ మాట్లాడుతూ నిల్వ చేసిన జంక్ఫుడ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులు శ్రీవిద్య, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. టార్చ్ లైట్లతో నిరసన ఆదోని రూరల్: రాత్రి వేళ విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా మండలంలోని పాండవగల్లులో సోమవారం రాత్రి సీపీఎం నాయకులు టార్చ్లైట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి లింగన్న, మండల కార్యదర్శివర్గ సభ్యులు జె.రామాంజనేయులు మాట్లా డుతూ.. రాత్రి సమయాల్లో అధికారులు విద్యుత్ కోతలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. ఉదయం పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకున్న కూలీలు, ప్రజలకు విద్యుత్ కోతల వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలను నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు పాండురంగ, అనీఫ్బాషా, పార్టీ సభ్యులు నర్సిరెడ్డి, హనుమంతరెడ్డి, కొండయ్య, తాయప్ప, భీమాంజి, నాగరాజు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసు ఛేదన
● మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితుల అరెస్ట్ఆదోని అర్బన్: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మపై జరిగిన హత్యాయత్నం కేసును ఆదోని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. దారుణానికి ఒడిగట్టిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్లో సోమవారం డీఎస్పీ వెంకటరమణ, టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన నరసమ్మ భర్త శీను ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం మున్సిపాలిటీలో శీను ఉద్యోగం నరసమ్మకు లభించగా, అక్కడే పనిచేస్తున్న చిన్న ఈరన్నతో ఆమెకు పరిచయం ఏర్పడి వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఈరన్న స్థానిక అమరావతినగర్కు చెందిన శిరీషను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే నరసమ్మతో ఉన్న సంబంధాన్ని ఈరన్న కొనసాగించడానికి ప్రయత్నించడంతో అతని కుటుంబీకులు అడ్డు చెప్పారు. ఈ క్రమంలో నరసమ్మపై గతంలో శిరీష తన కుటుంబీకులతో కలసి దాడి చేసింది. వారిపై నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసులయ్యాయి. దీంతో పెద్దలతో పంచాయతీ జరిపిన అనంతరం ఈరన్న, శిరీష సాయిబాబానగర్లో ఉంటున్నారు. నరసమ్మతో దూరంగా ఉండడం, కుటుంబ పరిస్థితులతో మనస్తాపానికి గురైన ఈరన్న ఈ ఏడాది జూలై 26వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈరన్న మృతికి నరసమ్మనే కారణమని భావించిన శిరీష కక్ష పెంచుకుని హత్య చేయాలని పథకం వేశారు. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ కొత్త బస్టాండు సమీపంలో విధులు నిర్వహిస్తున్న నరసమ్మపై శిరీష, ఆమె తల్లి సుజాత, అత్తామామలు రాములమ్మ, ఈరన్న, ఆడబిడ్డ హేమ, చిన్నమ్మ అంజినమ్మలు దాడి చేశారు. కంట్లో కారం చల్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. నరసమ్మ కేకలు వేయడంతో సహ ఉద్యోగులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు 70 శాతం శరీరం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వైద్యులు కర్నూలుకు రెఫర్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై నిందితుల కదలికలను గమనించి, ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అమరావతినగర్ రోడ్డు, బసాపురం జంక్షన్ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసును 24 గంటల్లోపు చేధించిన టూటౌన్ సీఐ రాజశేఖర్రెడ్డి, సిబ్బందిని అభినందించామన్నారు. -
కనుల పండువగా ఈరన్న స్వామి చక్రస్నానం
● తుంభద్రమ్మ ఒడిలో ఓలలాలిడిన స్వామి వారు ● బ్రహ్మరథం పట్టిన భక్తులు కోసిగి/మంత్రాలయం: ఏటి గట్టున భక్తజనం వీక్షిస్తుండగా.. మంగళ వాయిద్యాలు మోగుతుండగా.. పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈరన్న స్వామి తుంగభద్రమ్మ ఒడిలో ఓలలాడారు. నృసింహుని పుణ్యస్నానంతో ఆధ్యాత్మిక తరంగాలతో తుంగభద్రమ్మ పరవశించింది. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఉరుకుంద ఈరన్న స్వామి (లక్ష్మీనరసింహ స్వామి) పల్లకోత్సవం చివరి సోమవారం కడు వైభవంగా సాగింది. తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుని స్వామి వారి విగ్రహాన్ని పల్లకీలో కొలువుంచి పాదయాత్రగా ఉరుకుంద నుంచి కోసిగి మండలం కందుకూరు గ్రామం రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న తుంగభద్రనది చెంతకు చేరారు. ముందుగా ఆలయ డిప్యూటీ కమిషనర్ కె. వాణి ఆధ్వర్యంలో తుంగభద్రమ్మకు హారతులు పట్టి సారె సమర్పించారు. అనంతరం నరసింహా స్వామికి జై.. అంటూ .. స్వామి వారికి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నది ఒడ్డున దింపుడు కట్టపై స్వామి వారిని కొలువుంచి అభిషేకాలు గావించి మహామంగళ హారతులు ఇచ్చారు. భక్తులు స్వామి వారికి నారికేళాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరిగి యథావిధిగా పల్లకీలో ఊరేగింపుగా బయలు దేరారు. కందుకూరు గ్రామంలో స్వామి వారికి మేళతాళాలతో డప్పువాయిద్యాలతో గ్రామ ప్రజలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. అనంతరం కామన్దొడ్డి, తిప్పలదొడ్డి, కరణి, గ్రామాల మీదుగా ఉరుకుంద క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రావు, రామ్మోహన్, ఉపప్రధాన అర్చకులు మహాదేవప్ప, సీనియర్ అసిస్టెంట్ వీరేష్లు ఉన్నారు. పల్లకోత్సవం ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కోసిగి, కౌతాళం సీఐలు మంజునాథ్, యుగంధర్, కోసిగి, ఎమ్మిగనూరు రూరల్, పెద్దకడబూరు ఎస్ఐలు రమేష్ రెడ్డి, శ్రీనివాసులు, మారుతి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరూరా జాతర ఈరన్న స్వామి పల్లకీ చేరుకున్న గ్రామాల్లో జాతరను తలపించింది. కోసిగి మండలం కందుకూరు గ్రామంలో పల్లకీ చేరుకోగా స్వామి పాదాల చెంత భక్తులు నీటితో పాదాభిషేకం చేయగా, అడుగడునా కోక పాన్పులు పరుచగా పల్లకీ ముందుకు సాగింది. భక్తులు అడుగడునా నారికేళాలు సమర్పించి పూజలు చేపట్టారు. స్వామి పల్లకీ ముందుకు సాగిన గ్రామాల్లో గాజులు, మిఠాయి అంగళ్లు, చిన్నారుల రంగుల రాట్నాలు, బొమ్మలు అంగళ్లతో పండుగ వాతావరణం నెలకొంది. -
ధ్యానం కోసం వచ్చి దోపిడీకి పాల్పడి!
● వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్ ● నిందితుడి నుంచి బంగారు నగలు, బైక్ రికవరీ సి.బెళగల్: ఐదు రోజుల క్రితం సంగాల గ్రామంలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మండల కేంద్రం సి.బెళగల్కు చెందిన బోయ గుంటి రంగన్నగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం సి.బెళగల్ పోలీసు స్టేషన్లో కోడుమూరు సీఐ త్రబేజ్, ఎస్ఐ వేణుగోపాల్రాజుతో కలిసి నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. సీఐ వివరాల మేరకు.. సి.బెళగల్కు చెందిన బోయ గుంటి రంగన్న ఇంటి వద్ద వ్యవసాయ పనులు, జీవాలను పోషిస్తున్నాడు. ఇతను సమీపంలోని సంగాల గ్రామంలో ధ్యాన పిరమిడ్ కేంద్రానికి వెళ్లేవాడు. కాగా ధ్యాన కేంద్రం పక్కనే ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలు ఇల్లూరి సంజీవమ్మ ధ్యాన పిరమిడ్లో నిత్యం జ్యోతి వెలిగిస్తూ ఉండేది. ఈ క్రమంలో వృద్ధురాలిని రంగన్న పరిచయం చేసుకుని ఆమె ఇంటిపై నిఘా ఉంచాడు. రోజూ ఆమె కదలికలను గమనిస్తూ ఆమె వద్ద ఉన్న నగలను దోచుకోవాలని పథకం వేశాడు. ఈ మేరకు ఈ నెల 3వ తేదీ ఉదయం హెల్మెట్ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. రాడ్తో చంపుతా అంటూ వృద్ధురాలిని బెదిరించి, తర్వాత దాడి చేసి బంగారు గొలుసు, రెండు బంగారు గాజులను తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సి.బెళగల్ పోలీసులు విచారణ చేపట్టి దొంగతనానికి పాల్పడిన రంగన్నను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 8.9 తులాల బరువున్న రూ.13 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు చోరీకి ఉపయోగించిన బైకు, హెల్మెట్, ఇనుపరాడ్, ఇతర వస్తువులను నిందితుడిని నుంచి సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. కాగా కేసును త్వరగా ఛేదించిన ఎస్ఐ వేణుగోపాల్రాజు, కానిస్టేబుల్ శ్రీనివాసులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా కేసు ఛేదనలో ప్రతిభ చూపిన హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, ఈశ్వరయ్య, జానకిరాముడులను సీఐ, ఎస్ఐలు రివార్డుతో అభినందించారు. -
కర్నూలు రేంజ్ పోలీసు క్రీడాకారుల ప్రతిభ
కర్నూలు (టౌన్): ఇటీవల నాగార్జున యూనివర్సీటీలో ఈనెల 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ పోలీసు స్పోర్ట్స్ మీట్లో కర్నూలు రేంజ్ క్రీడాకారులు 86 పతకాలు సాధించినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ వెల్లడించారు. విజేతలను తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అభినందించారు. కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలో 54 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచారన్నారు. మహిళల విబాగంలో ఓవరాల్ చాంపియన్షిప్గా మొదటి స్థానం, పురుషుల విభాగంలో రెండవ స్థానంలో నిలిచారని తెలిపారు. అలాగే సైంటిఫిక్ ఎయిడ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినాలజీ డ్యూటీ మీట్ విభాగంలో కర్నూలు రేంజ్కు చెందిన ఇన్స్పెక్టర్ ప్రథమ బహుమతి సాధించినట్లు తెలిపారు. కర్నూలు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్, నంద్యాల ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. తల్లిని కాపాడే ప్రయత్నంలో.. ● తండ్రిపై కుమారుడి దాడి ● తీవ్ర గాయాలై తండ్రి మృతి వెల్దుర్తి: తండ్రి వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన తల్లి గొంతు నులిపేస్తున్న తండ్రిని కుమారుడు కట్టెతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన వెల్దుర్తి మండల కేంద్రం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఐజీ నగర్లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ షేక్షావలి (45), మస్తాన్బీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. షేక్షావలికి పట్టణంలోనే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 5వ తేదీ శనివారం రాత్రి ఇదే విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నిస్తున్న భార్య మస్తాన్బీని షేక్షావలి గొంతు నులిమి దాడి చేస్తుండగా పెద్ద కుమారుడు మస్తాన్ వలి గమనించి తన తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కట్టెతో తండ్రి తలపై దాడిచేశాడు. దీంతో షేక్షావలికి తీవ్ర రక్తస్రావమైంది. మెట్లపై జారి పడ్డాడని గాయాలపాలైన తండ్రిని ఆటోలో స్థానిక ఆసుపత్రిలో చేర్చాడు. మెరుగైన వైద్యానికి కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిని కాపాడే క్రమంలోనే మస్తాన్ వలి తన తండ్రిపై దాడిచేసినట్లు తేలింది. మృతుని సోదరుడు ఈదురుబాషా ఫిర్యాదు మేరకు మస్తాన్వలిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దారుణం
సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దారుణం జరిగింది. నర్సమ్మ (30) అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమె మున్సిపాలిటీ కాంట్రాక్ట్ వర్కర్క్గా విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారు జామున ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా విధులు నిర్వహిస్తున్న నర్సమ్మపై దాడి చేసిన దుండగులు.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలార్పి, 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. -
వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం
● వ్రతంలో పాల్గొన్న 1,233 మంది చెంచు, 500 మంది ఇతర భక్తులుశ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమ నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం శ్రావణ నాల్గవ శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది. శుక్రవారం ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా చంద్రవతి కళ్యాణ మండపంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలోని పలు చెంచుగూడేలకు చెందిన 1,233 మంది చెంచు మహిళా భక్తులు, 500 మంది ఇతర మహిళా భక్తులు పాల్గొని వ్రతాన్ని జరిపించుకున్నారు. వ్రతాలకు కావలసిన పూజాద్య్రాలన్నింటిని దేవస్థానమే సమకూర్చింది. వ్రత కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం వేర్వేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా వ్రతం జరిపించారు. వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు, అమ్మవారి శేవస్త్రాలను కూడా అందజేశారు. సంప్రదాయబద్ధంగా జరిపిన వ్రతంలో మహాగణపతిపూజ, వేదికపై ఆశీనులను చేసిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపించారు. వరలక్ష్మీవ్రతంలో భాగంగా భక్తులందరి చేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవిని సమంత్రకంగా అవాహన చేశారు. అనంతరం అర్చకులు వ్రతకథను పఠించి వ్రత మహిమా విశేషాలను భక్తులకు తెలియజేశారు. చివరిగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు. భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. -
మహిళ దారుణ హత్య
● పొలంలో మృతదేహం లభ్యం ● విచారణ చేస్తున్న పోలీసులు పత్తికొండ రూరల్: పత్తికొండ మండల పరిధిలోని కోతిరాళ్ల గ్రామ పొలాల్లో గురువారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కోతిరాళ్లకు చెందిన హరిజన శాంతమ్మ (65) ఉదయం పొలం పనులకు వెళ్లి రాత్రయినా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి ఆమె కోసం వెతికారు. శాంతమ్మను గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది చంపిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ వెంకట్రామయ్య, ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులునాయక్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆస్తి వివాదం కారణంగా బంధువులే హత్య చేసి ఉంటారనే అనుమానంతో మృతురాలి కుమారుడు హరిజన కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ కోణంలో అనుమానితుల మీద విచారణ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం డీఎస్పీ వెంకట్రామయ్య, ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులునాయక్, ఎస్ఐ రాందాస్ గ్రామానికి వెళ్లి హత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మృతిపై విచారణ చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
చదువుల వనంలో సాహితీ సేద్యం
డోన్ పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయునిగా పని చేస్తున్న డాక్టర్ దేవేంద్రప్ప రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన ఈయన 2002 డీఎస్సీలో ఎంపికై తెలుగు ఉపాధ్యాయునిగా అవుకు మండలం కునుకుంట్ల పాఠశాలలో చేరారు. ఈయన తెలుగు భాషపై పట్టు సాధించి సాహిత్యంపై అడుగులు వేశారు. విధులు నిర్వహించే పాఠశాలల్లో విద్యార్థులకు భాషాభివృద్ధి, బాల సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించడంతో పాటు నైతిక విలువలు, సృజనాత్మక, క్రమశిక్షణ విషయాలను విద్యార్థులకు బోధిస్తూ ఆదర్శంగా నిలిచారు. సాహిత్యం పట్ల మక్కువతో ఆయన ఆశావాది, ఆభ్యుదయ భావకుడు, అంబేడ్కకర్ శతకం అనే గ్రంథాలు రచించారు. అలాగే సృజనా స్రవంతి, చదువు ఎదుగు, అనిత అనే కథానికలకు సంపాదకత్వం వహించారు. రాష్ట్రంలో అనేక సాహితి సంస్థల నుంచి పురస్కారాలు, సత్కారాలను పొందారు. ఈ క్రమంలో ఆయనను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఈ పురస్కారం తనకు మరింత ప్రోత్సాహానిచ్చిందన్నారు. – డోన్ రూరల్ -
ఓటరు జాబితా సవరణ పేరుతో సైబర్ మోసాలు
కర్నూలు (టౌన్): ఓటరు జాబితా సవరణ, ఓటరు కార్డులో పేర్లు, వివరాల మార్పుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ప్రతినిధులుగా పరిచయం చేసుకుని ఓటరు వివరాలు తప్పుగా ఉన్నాయని, దరఖాస్తు తిరస్కరణకు గురైందని చెప్పి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం వాట్సాప్ ద్వారా నకిలీ లింకులు, అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ పంపించి తక్కువ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ బ్యాంకు, కార్డు వివరాలు, ఓటీపీలు సేకరించి నగదు కాజేసే అవకాశం ఉందన్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
పైర్లు ‘బావు’రుమంటున్నాయి !
ఉమ్మడి కర్నూలు జిల్లాను కరువు అతలాకుతలం చేస్తోంది. ఎక్కడ చూసినా నోళ్లు తెరిచిన బీళ్లే. ఇక లాభం లేదని ఎండిపోయిన పొలాలను దున్నేస్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పించక మానవు. అప్పులు చేసి.. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటలు మట్టిలోనే కలిసిపోతుంటే రైతుల ఆవేదన వర్ణనాతీతం. ఇంతటితో అయిపోలేదని, ముందుంది తీవ్రమైన కరువని శాస్త్రవేత్తలు హెచ్చరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జలాశయాల్లో నీరులేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బావుల్లోకి తొంగి చూస్తే కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వీటి కింద సాగుచేసిన పంటలు ఎక్కడికక్కడ ఎండిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
బాబు, పవన్, లోకేష్.. జాబ్లు మీకేనా, మాకివ్వరా?
● కర్నూలులో ఆశావహ పోలీసు అభ్యర్థుల మూడు రోజుల రిలే నిరాహారదీక్షలు ప్రారంభంకర్నూలు(సెంట్రల్): తమ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ పదవులు పొంది తమనే మరచిపోయారని ఆశావహ పోలీసు అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందారు. శుక్రవారం కర్నూలులో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ను విడుదల చేయాలని కోరుతూ కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలకు చెందిన ఆశావహ పోలీసు అభ్యర్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ప్రభుత్వం పోలీసులను అట్టుపెట్టి ఈ దీక్షలను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిరుద్యోగులు గ్రూపులుగా విడిపోయి నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్లో ఉన్న ధర్నా చౌక్కు చేరుకొని దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాము, చైతన్య, అంజి, చంద్ర మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందన్నారు. తరువాత నాలుగేళ్ల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచినా ఉద్యోగాల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్ ప్రతి ఏడాది జాబ్క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా జాబ్ క్యాలెండర్లో ఒక్క పోస్టునైనా భర్తీ చేయలేకపోయారన్నారు. జాబ్ లేస్ క్యాలెండర్ను రూపొందించిన ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను కేవలం 1,600 చూపడం అన్యాయమన్నారు. అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిత, డీజీపీ చెప్పిన విధంగా 11,639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. పోలీసు అభ్యర్థులు వయో పరిమితి 35 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని అబ్దులాపురానికి చెందిన ఓ వివాహిత శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇటిక్యాల నాగరాజుకు అనంతపురం జిల్లా సద్దలదిన్నెకు చెందిన వరలక్ష్మికి (38)తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు సంతానం ఉన్నారు. భర్త రోజు మద్యం సేవిస్తూ ఉండేవాడు. వరలక్ష్మి క్రిమి సంహారక మందు తాగిందని తన బావమరిది దేవేంద్రకు ఫోన్ చేయడంతో తాడిపత్రికి తీసుకురావాలని సూచించాడు. అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి ఎలాంటి మందు తాగలేదని సమాధానం ఇచ్చాడు. తెల్లవారాక వరలక్ష్మి మృతి చెందిందని బావమరిదికి విషయం చేరవేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నగీనా గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు, క్రిమిసంహారక మందు తాగినట్లు ఆనవాళ్లు కూడా లేవు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి గల కారణాలు తెలుస్తాయని ఎస్ఐ వెల్లడించారు. మోటార్ల చోరీ : నిందితుల అరెస్టు పాములపాడు: వ్యవసాయ బావుల వద్ద విద్యు త్ మోటార్ల చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. మండలంలోని తుమ్మలూరు, క్రిష్ణరావుపేట, కోల్స్ ఆనందాపురం గ్రామాల్లో విద్యుత్ మోటార్లు చోరీకి గురైనట్లు బాధిత రైతుల నుంచి ఫిర్యాదులొచ్చాయన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డి నగర్కు చెందిన చంటి, నర్సమ్మ అనే ఇద్దరి నుంచి 5 మోటార్లు రికవరి చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రమాదవశాత్తు వలస కార్మికుడి మృతి ఓర్వకల్లు: రేకుల షెడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వలస కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కన్నమడకల గ్రామ శివారులోని ఓ సిలికాన్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి చోటు చేసుకోగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కన్నమడకల గ్రామ సమీపంలో కేఈ సోదరుల స్థలంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు నూతన షెడ్ నిర్మాణం చేపట్టారు. పనుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా, నర్సన్నపేట గ్రామానికి చెందిన రెడ్డి కిరణ్కుమార్ (27) పైపులకు వెల్డింగ్ చేస్తుండగా గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు షెడ్కు నిర్మించిన ఇనుప పైపు ఊడి కిరణ్కుమార్పై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఏఎస్ఐ పాండురంగస్వామి తెలిపారు. -
అంకిత భావంతో వి‘జయం’..
అందరి ఉపాధ్యాయుల్లా ఆమె పాఠశాలకు వెళ్లామా.. పాఠాలు చెప్పామా.. ఇంటికి తిరిగి వచ్చామా అనుకోలేదు. దాదాపు 28 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఆమె చూపిన అంకితభావానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. దేవనకొండ మండలం కరివేముల ఎంపీపీఎస్ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న శీలం జయమ్మ సొంతూరు వెలుగోడు మండలం వేగులగూడూరు. 1998 ఆగస్టు 21న హాలహర్వి మండలం హాలహర్వి ఆదిఆంధ్ర పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా విధుల్లో చేరారు. తర్వాత దేవనకొండ మండలం కరివేముల, జూపాడుబంగ్లా మండలం మండ్లెం, నందికొట్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (పేట)లో విధులు నిర్వర్తించారు. గతేడాది జూన్లో కరివేముల ఎంపీపీ పాఠశాలకు పీఎస్ హెచ్ఎంగా పదోన్నతిపై వచ్చారు. ఆమె ఎక్కడ విధులు నిర్వర్తించినా విద్యార్థుల్లో దాగిన ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీయడం, విద్యార్థులు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎంపికయ్యేలా ప్రోత్సహించడం, చదువుకు దూరంగా విద్యార్థుల ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి బడిలో చేర్పించారు. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెబుతూ విద్యలో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దారు. కరివేముల పాఠశాలకు హెచ్ఎంగా వచ్చినప్పటి నుంచి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషిచేశారు. అలాగే గ్రామంలో జానకి వావిలాల కృష్ణమూర్తి ట్రస్టు హాస్టల్ కూడా వచ్చింది. ఆమె సేవలను గుర్తించిన అధికారులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు రావడం ఆనందంగా ఉందని, తన సేవలను కొనసాగిస్తానని చెప్పారు. – దేవనకొండ -
శాశ్వత బెంచ్ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు
కర్నూలు (టౌన్): హైకోర్టు శాశ్వత బెంచ్పై ప్రభుత్వం స్పష్టమైన అధికారిక ప్రకటన చేసే వరకు ఉద్యమం ఆగదని జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శి టీ.మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్యర్యంలో కోర్టు విధులకు హాజరయ్యే సమయంలో ధరించే నల్లకోటుకు బదులుగా సివిల్ డ్రెస్లో కూర్చొని న్యాయవాదులు 12వ రోజు దీక్షలను కొనసాగించారు. వారు మాట్లాడుతూ.. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువవుతాయన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో హైకోర్టు శాశ్వత బెంచ్పై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంపై న్యాయవాదులుగా తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. 12వ రోజు దీక్షల్లో ఈదుల బాలాజీ రెడ్డి, మురళీక్రిష్ణ, నేతన్యా, రాజేంద్రప్రసాద్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. న్యాయవాదుల దీక్షలకు పలువురు మద్దతు సర్క్యూట్ బెంచ్ కాకుండా కర్నూలులో శాశ్వతంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని గత 11 రోజలుగా న్యాయవాదులు చేపడుతున్న రిలే నిరహార దీక్షలకు పలువురు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. రాయలసీమ యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్ డాక్టర్ మన్సూర్ ఆలీఖాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, లౌకిక రాజ్య పరిరక్షణ వేదిక కన్వీనర్ నరసింహా తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈసీహెచ్ సమావేశానికి హాజరవ్వాలి కర్నూలు(సెంట్రల్): ఈసీహెచ్ పాలీక్లినిక్ నెల వారీ సమావేశానికి ప్రతి మాజీ సైనికుడు హాజ రై విజయవంతం చేయాలని కర్నూలు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీసుమెన్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు యు.సుధాకర్, వెంకటేశ్వర్లు, ట్రెజరర్ మలికార్జున శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. మాజీ సైనికులకు సంబంధించి అధునాతన వైద్యం అందించడంలో ఈసీహెచ్ ఆఫీసర్ ఇన్చార్జ్ విఫలమైన నేపథ్యంలో అందరూ హాజరై హక్కుల కోసం నిలదీయా ల్సి ఉందన్నారు. ఆసుపత్రి ఎంప్యానెల్మెంట్, అందుబాటులో లేని వైద్య సదుపాయాలు, మందుల సరఫరా, రెఫరల్స్, వైద్య సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను సమావేశంలో చర్చించనున్న నేపథ్యంలో మాజీ సైనికులు హాజరు కావాలని కోరారు. ఇంటింటి సర్వేపై అభ్యంతరాల స్వీకరణ కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు తెలపాలని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ కోరారు. శుక్రవారం కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ఎస్ఈసీ ఆదేశాల మేరకు గత నెల 18 నుంచి 24వ తేది వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహించామన్నారు. ఆ మేరకు గుర్తించిన ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్ల జాబితాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈ నెల 3 నుంచి 6వ తేది వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6వ తేది వరకు గ్రామ సభలను నిర్వహించి తుది ఓటరు జాబితాలను రూపొందిస్తామన్నారు. ఈ జాబితాలను జిల్లా కలెక్టర్ ఆమోదంతో 7వ తేదీన తుది జాబితాలను ప్రచురిస్తామన్నారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీడీఓ ఎల్.భరత్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జాకీర్ పాల్గొన్నారు. భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు కల్పించాలిశ్రీశైలంటెంపుల్: శ్రీశైల యాత్రకు విచ్చేసే భక్తులందరూ సంతృప్తి చెందేలా ప్రతి ఒక్క సిబ్బంది కృషి చేయాలని శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైల దేవస్థాన పరిపాలనాంశాలపై ఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశమందిరంలో నిర్వహించిన సమావేశానికి డీఈవో చంద్రశేఖర్, అన్ని యూనిట్ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఏఈలు పాల్గొన్నారు. అన్ని విభాగాలు కూడా అధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తులరద్దీకి అనుగుణగా ఆయా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇంజనీరింగ్ అధికారులు శాసీ్త్రయ అంశాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. -
సతీష్కు సరిలేరెవ్వరు!
విధులు నిర్వహిస్తున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం, అక్కడ చదువుతున్న విద్యార్థుల ఉన్నతికి పాటుపడటంలో బనగానపల్లె పట్టణం కొండపేట ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు సతీష్కుమార్ ముందంజలో ఉన్నారు. బనగానపల్లె పట్టణానికి చెందిన ఈయన 2002 అక్టోబరులో బనగానపల్లె మండలంలోని గిరిజన ప్రాంతమైన గులాం అలిబాద్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన బాలికలు చాలా మంది 6వ తరగతి చదివే అవకాశం లేక ఇళ్ల వద్దనే ఉండిపోయారు. ఆ సమస్యను సతీష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి యూపీ పాఠశాల మంజూరైంది. 2009లో వెంకటాపురం ఎంపీయూపీఎస్ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులుగా చేరారు. అక్కడ గణితం, ఇంగ్లిషులో విద్యార్థులు వెనుకబడి ఉన్నారని గుర్తించి ప్రత్యేక ప్రణాళిక బోధనతో విద్యార్థులను తీర్చిద్దారు. ఎన్ఆర్ఐలు, గ్రామస్తుల సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. 2017లో టంగుటూరు ఎంపీపీఎస్ పాఠశాలకు బదిలీ అయ్యారు. ఆయన విధులు నిర్వర్తించే పాఠశాలలో విద్యార్థులకు వసతులు కల్పించడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో తనదైన ముద్ర వేస్తున్నారు. తన సేవలను గుర్తించిన ప్రభు త్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. – బనగానపల్లె -
ఆదిమూర్తి పాఠాలు.. 2.5 లక్షల వీక్షకులు
తరగతి బోధనతో పాటు ఉపాధ్యాయ శిక్షణ, సైన్స్ ప్రాజెక్టులు, క్విజ్లు, డిజిటల్ బోధన, విద్యార్థుల మార్గదర్శకత్వం వంటి అనేక రంగాల్లో కృషి చేస్తున్న ఆదోని మండలం విరుపాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మైత్రి ఆదిమూర్తికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. ఆదోనికి చెందిన ఈయన 2003లో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2023లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. తరగతి బోధనకే పరిమితం కాకుండా గత 12 సంవత్సరాలుగా సర్వశిక్ష అభియాన్, ఆర్.ఎం.ఎస్.ఏ. శిక్షణలు, కాంప్లెక్స్ సమావేశాలు, పదో తరగతి ఓరియంటేషన్ తరగతులు, ఎన్నికల నిర్వహణపై శిక్షణ తదితర కార్యక్రమాల్లో రిసోర్స్ పర్సన్గా సేవలందించారు. అలాగే ఇన్స్పైర్, ఎన్సీఎస్సీ, కౌశల్ క్విజ్ వంటి కార్యక్రమాల కోసం అనేక మంది సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. ఆదిమూర్తి మార్గదర్శకత్వంలో 2023లో ఒక విద్యార్థి జిల్లా స్థాయి ఎన్సీఎస్సీకి ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. అలాగే పదో తరగతి భౌతిక శాస్త్రానికి సంబంధించిన ‘మార్గదర్శి’ స్టడీ మెటీరియల్ రచయితగా కూడా ఆయన సేవలందించారు. గత నాలుగేళ్లుగా కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న కౌషల్ జిల్లా స్థాయి క్విజ్ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తూ క్విజ్ మాస్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఫిజికల్ సైన్స్కు సంబంధించిన యూట్యూబ్ చానల్ ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధనా వనరులను అందిస్తున్నారు. ఆయన రూపొందించిన వీడియోలను 2.5 లక్షలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వీక్షించి ప్రయోజనం పొందారు. అంతే కాకుండా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఉపయోగపడే పలు మూల్యాంకన పత్రాలను రూపొందించారు. – ఆదోని -
చెంచు విద్యార్థుల చదువులకు ‘ఆధార’మై..
నిరుపేద కుటుంబంనుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన అతను పేద విద్యార్థులకు చుక్కానిగా నిలుస్తున్నారు. ఆత్మకూరు మండలం బాపునంతపు రం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు 16 ఏళ్ల క్రితం 2010 నవంబర్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ప్రస్తుతం కొట్టాలచెరువు చెంచుగూడెంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వ హిస్తున్నారు. చెంచుగిరిజన పిల్లలు చదువుకు దూరంగా ఉండడంతో వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చేలా చేశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో సొంత ఖర్చులతో రంగులు వేయించారు. పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు కార్డులు అందజేశారు. వెదురుబొంగులతో అదనపు తరగతి గదిని ఏర్పాటు చేయించారు. ఆర్డీటీ సహకారంతో విద్యా వలంటరీ నియమించారు. దాతల సహకారంతో మినరల్ వాటర్ ఏర్పాటు చేయించారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. చెంచు గిరిజన గూడెం విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తన లక్ష్యమన్నారు. – ఆత్మకూరు -
విలువలతో కూడిన విద్యతో గుర్తింపు
బండిఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జి.శ్రీనివాసులు 2012లో జూనియర్ లెక్చరర్ల నియామకంలో స్టేట్ టాపర్గా నిలిచారు. అప్పటి నుంచి 2021 సంవత్సరం వరకు మిడుతూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 2021లో కర్నూలు నగరంలోని కెవిఆర్ బాలికల జూనియర్ కాలేజీకి బదిలీపై వచ్చారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేసి సేవా దృక్పథాన్ని పెంపొందించారు. అత్యుత్తమ ఫలితాలతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా బోధన సాగిస్తున్నారు. కేవీఆర్ కాలేజీలో పని చేస్తున్న ఓ చిరుద్యోగి కిడ్నీలు పాడై చికిత్సకు ఇబ్బంది పడుతుండటంతో కొంత సొమ్ము వసూలు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. గతేడాది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. – కర్నూలు సిటీ -
మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి
నందికొట్కూరు: డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెట్లో అర్హత లేకపోయినా 2025 డీఎస్సీలో ఉద్యోగాలు ఎలా ఇచ్చారో మంత్రి లోకేశ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులైన అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడితే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. టెట్ అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇచ్చిన సంఘటన డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్లో బయటపడిందని స్పష్టం చేశారు. డీఎస్సీ అవకతవకలపై మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాళ్లను వైఎస్సార్సీపీ స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పినా ఎందుకు ముందడుగు వేయలేదని నిలదీశారు. డీఎస్సీలో అక్రమాలను బయటకు తీసేందుకు సీబీఐకు అప్పగించాలని కోరారు. అలాగే సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు నిరుద్యోగి భృతి నెలకు రూ.3 వేలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. సూపర్సిక్స్ హామీలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయకులు అబ్దుల్లా, సతీష్రెడ్డి, శశాంక్, బన్నీ, చరణ్, మన్సూర్, రంగ, తదితరులు పాల్గొన్నారు. – డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ -
బోధన సృజనాత్మకం
విద్యార్థులు సులభంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా బోధించేందుకు కొందరు ఉపాధ్యాయులు కృషి చేస్తుంటారు. అందులో తుగ్గలి మండలం లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అద్దంకి చంద్రమోహన్ ఒకరు. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఆయన ప్రస్తుతం లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. 2008లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఆయన పలు పాఠశాలల్లో పని చేశారు. టీఎల్ఎం (టీచింగ్, లెర్నింగ్, మీటీరియల్) రూపొందించారు. స్వతహాగా చేసిన టీఎల్ఎం ద్వారా విద్యార్థులకు బోధిస్తూ ఉత్తమ ఫలితాలు రాబడుతున్నారు. సాంకేతికత సాయం, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వినూత్నంగా పాఠాలు బోధించడం ఆయన ప్రత్యేకత. వంద శాతం ఎన్రోల్ మెంట్, నో బ్యాగ్ డే, యోగా, క్విజ్, చిత్ర లేఖనం తదితర వాటిని అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఎక్కువగా గుర్తుండే విధంగా సబ్జెక్టుల్లోని ప్రతి అంశాన్ని ప్రయోగాత్మక పద్ధతిలో బోధించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటూ విద్యార్థుల ఉన్నతికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. జీ.ఎర్రగుడి పాఠశాలలో పనిచేసిన సమయంలో రాష్ట్ర స్వచ్ఛ విద్యాలయ పురస్కారం, 2024లో ఉపాధ్యాయ రత్న, 2025లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం పట్ల చంద్రమోహన్ ఆనందం వ్యక్తం చేశారు. అవార్డుతో మరింత బాధ్యత పెరుగుతుందని, భవిష్యత్లో మరింత మెరుగైన విద్య అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. – తుగ్గలి -
రాజన్నకు పుష్పాంజలి
నంద్యాల(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ సూక్ష్మ పూల బొమ్మలతో రాజన్న చిత్రం గీసి పుష్పాంజ లి అర్పించారు. వైఎస్సార్ తనదైన శైలిలో చిరునవ్వులు చిందిస్తున్నట్లు చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా కోటేశ్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతు బాంధవుడిగా పేరు పొందారన్నారు. ఆయ న మరణం కోట్లాది ప్రజలను వేదనకు గురి చేసిందన్నారు. రాజన్న నవ్వు వికసించిన పువ్వుల వలే స్వచ్ఛంగా ఉంటుందని కొనియాడారు. వైద్యులా.. భూత వైద్యులా? ఆదోని: తనపై మహిళా డాక్టర్ క్షుద్రపూజలు చేయించిందంటూ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చ కు దారితీసింది. ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్గా డాక్టర్ ఆది నాగేష్, అనస్థటిస్ట్గా డాక్టర్ లక్ష్మీ మోనాలిసా పనిచేస్తున్నారు. ఆది నాగేష్ ఆదోనిలో క్లినిక్ కూడా నడుపుతున్నారు. 3 రోజుల క్రితం క్లినిక్ నుంచి ఆయనకు అర్జంటుగా రావాలని ఫోన్ వచ్చింది. ఆయన హుటాహుటిన వెళ్లి సిబ్బందిని విచారించారు. క్లినిక్ ఎదుట నల్లటి కవర్ క్లినిక్ ప్రధాన ద్వారం ఎదుట ఒక నల్ల బ్యాగు ఉండటాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఒక నర్సు భర్త ధైర్యం చేసి ఆ బ్యాగ్ను తెరిచి చూసి బిత్తరపోయారు. అందులో అనుమానాస్పద వస్తువులతో పాటు క్షుద్రపూజలు చేసిన సామగ్రి ఉంది. ఒక రాగి రేకు మీద డాక్టర్ ఆది నాగేష్ పేరు రాయబడి ఉంది. సీసీ కెమెరా ఫుటేజీతో కలకలం విషయం తెలుసుకున్న డాక్టర్ ఆది నాగేష్ సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఓ మహిళ నల్లటి కవర్ను తీసుకొచ్చి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉంచి వెళ్లినట్లు ఫుటేజీలో కనిపించింది. ఆ మహిళ తన సహద్యోగి డాక్టర్ లక్ష్మీ మోనాలిసాగా గుర్తించి బిత్తరపోయారు. ఆస్పత్రి సిబ్బంది కూడా షాక్కు గురయ్యారు. పోలీసుస్టేషన్కు చేరిన వివాదం తాను చేసిన తప్పును ఎంతకూ ఒప్పుకోకపోవడంతో డాక్టర్ లక్ష్మీ మోనాలిసాపై డాక్టర్ ఆది నాగేష్ ఆదోని టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నాన్ కాగ్నిజబుల్ కేసు కావడంతో కోర్టు అనుమతితో కేసు నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాల్సిందేనని, అవసరమైతే జిల్లా ఎస్పీని కూడా కలుస్తానని డాక్టర్ ఆది నాగేష్ అంటున్నారు. మరో వైపు తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళనని, తాను కూడా డాక్టర్ ఆది నాగేష్పై అట్రాసిటీ కేసు పెడతానని తన సన్నిహితుల వద్ద డాక్టర్ లక్ష్మీ మోనాలిసా చెబుతున్నట్లు సమాచారం. దేవతతో రాజకీయం దేవనకొండ: సోదరుల్లా కలిసిమెలిసి ఉండే రెండు గ్రామాల మధ్య టీడీపీ నాయకులు రేపిన చిచ్చు వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయానికి ముగింపు పలికింది. ఏకంగా మారెమ్మ దేవతను రాజకీయాలకు వాడుకోవడం ఆ పార్టీ నాయకులకే చెల్లింది. గద్దెరాళ్ల మారెమ్మ పుట్టినిల్లు అయిన పల్లెదొడ్డి నుంచి ప్రతి శ్రావణమాస మూడో మంగళవారం భక్తులు బోనాలతో వచ్చి అమ్మవారికి చల్ల సమర్పిస్తే రెండు గ్రామాలు సుఖసంతోషాలతో వర్ధిళ్లుతాయని ప్రజల నమ్మకం. అయితే గతంలో ఎప్పుడూ లేనివిధంగా జూన్ 5న కూటమి ప్రభుత్వ నాయకులు కొత్తగా ఆలయ కమిటీని ఏర్పరుచుకున్నారు.కమిటీలో చైర్మన్ పదవి మొదలుకుని మెంబర్ల దాకా పల్లెదొడ్డి గ్రామస్తులను ఎవరినీ సంప్రదించకుండా ఆలూరు టీడీపీ ఇన్చార్జ్ కనుసన్నల్లో నచ్చిన వారికి పదవులు ఇచ్చుకున్నారు. దీంతో ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చు పెట్టినట్లు అయ్యింది. గద్దెరాళ్ల మారెమ్మ అంటేనే మొదటగా గుర్తుకొచ్చేది. అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నది పల్లెదొడ్డి బోనాలు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గ్రామాన్ని వదిలి ఆలయంతో సంబంధం లేని గ్రామాల్లోని వారికి పదవులు ఇవ్వడంతో పల్లెదొడ్డివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మారెమ్మవ్వ ఆలయ కమిటీలో పల్దొడ్డి గ్రామవాసులకు ప్రాధాన్యత కల్పించలేదని, అలాంటి చోట తమ ఊరి బోనాలు కూడా అవసరం లేదని, తమ గ్రామంలోనే బోనాల సంబరం జరుపుకుంటామని గ్రామ పెద్దలందరూ తీర్మానించుకున్నారు. వందల ఏళ్ల సాంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నా దేవదాయ శాఖ అధికారుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ శ్రావణమాసం మూడో మంగళవారం అమ్మ వారికి చల్లదనం పల్లెదొడ్డి, గద్దెరాళ్ల ప్రజలు ఎవరి ఊళ్లలో వారు జరుపుకున్నారు. అసలే ఒక పక్క వర్షాలు లేక కరువు తాండవిస్తోందని, మరో పక్క గ్రామాల ప్రజలు ఎవరికి వారుగా ఉంటే వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో జరిగే అమ్మవారి దేవరలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
సీమ కల్పతరువు అవుకు రిజర్వాయర్
కోవెలకుంట్ల: మహానేత జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులు ఆయా జిల్లాల రైతాంగానికి ఊపిరిలూదా యి. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్ను రూ.70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్లో శంకుస్థాపన చేశారు.దీని ద్వారా కర్నూలు,కడప జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు, రిజర్వాయర్కు అనుసంధానంగా జీఎన్ఎస్ఎస్ వరద కాల్వ నుంచి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది లక్ష్యం. శ్రీశైలం జలాశ యం నుంచి అవుకు రిజర్వాయర్లోకి నీరు చేరేందుకు 30 వ ప్యాకేజీ కింద రూ.401 కోట్లతో 12 కిలోమీటర్ల మే ర రెండు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి 20 వేల క్యూసెక్కుల వరదజలాలను రిజర్వాయర్లో నింపు తున్నారు. వైఎస్సార్ కలల సాకారమైన అవుకు రిజర్వాయర్ సీమ జిల్లాలకు కల్పతరువుగా మారింది. -
వ్యక్తి దారుణహత్య
ఆళ్లగడ్డ: పట్టణ శివారు పాలసాగరం వ్యవసాయ పొలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఆంజనేయులు (27)ను ఎవరో దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని నాయీ బ్రాహ్మణ కాలనీకి చెందిన ఆంజనేయులుకు ఐదేళ్ల క్రితం రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో వివాహం అయ్యింది. అతడు సోమవారం రాత్రి ఇంటి వద్ద ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బయటకు వెళ్లి వద్దామని చెప్పి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం పట్టణ శివారులోని పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న తోటలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెళ్లి చూడగా మృతుడు ఆంజనేయులుగా గుర్తించారు. అతని భార్య సుబ్బులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజరావు తెలిపారు. మృతదేహం పడిఉన్న చోట మద్యం బాటిల్లు ఉండటంతో మద్యం మత్తులో ఘర్షణ జరిగి హత్య చేశారా? లేక వివాహేతర సంబంధం కారణమా? ఇతర కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు -
సబ్సిడీ వేరుశనగ స్వాహా!
డోన్ టౌన్ (ప్యాపిలి)/డోన్: తమది రైతు ప్రభుత్వం అంటూ టీడీపీ నాయకులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీకి పొంతన లేకుండా పోతోంది. రైతులకు అందాల్సిన సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలను అధికారుల అండదండలతో టీడీపీ నాయకులు బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నాలుగు రోజుల క్రితం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనం మరువకముందే సబ్సిడీ వేరుశనగను బ్లాక్ మార్కెట్కు తరలించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 29న డోన్ నియోజకవర్గంలోని ఎనుగుమర్రి గ్రామంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్రెడ్డి సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామానికి మంజూరైన విత్తనాలను అర్హులైన రైతులకు అందించకుండా గ్రామ టీడీపీ నాయకుల సిఫార్సుతో కొద్దిమంది ఆ పార్టీ వారికి అందించి మిగతా విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలోని సచివాలయంలో ఉంచిన స్టాకును అదే గ్రామానికి చెందిన వ్యాపారికి విక్రయించగా సదరు వ్యక్తి వాటిని రెండు వాహనాల్లో బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. -
అశ్వవాహనంపై విశ్వమోహనుడు
● వైభవంగా 6వ రోజు ఆరాధన వేడుకలు ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రాలయం: మంగళకర వాయిద్య నాదాలు.. భక్తజనుల జయజయ పఠనాలు.. పండితుల వేద ఘోషల మధ్య ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు అశ్వ వాహనంపై కొలువుదీరారు. పండితుల ఉయ్యాల జంపాలతో ఉత్సవమూర్తి శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో కడు వైభవంగా ఊరేగారు. రాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రహ్లాదరాయలకు అశ్వవాహన సేవ గావించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో ముందుగా ఊంజల మంటపంలో ఉత్సవమూర్తికి చతుర్వేద పారాయణం గావిస్తూ ఉయ్యాల సేవ నిర్వహించారు. అనంతరం ప్రాంగణ వీధుల్లో అశ్వ వాహనంపై కనుల పండువగా ఊరేగింపు సాగింది. ఆనవాయితీలో భాగంగా చెక్క, వెండి, అంభారి, స్వర్ణ, నవరత్న రథాలపై ఉత్సవమూర్తిని ఊరేగించారు. 6వ రోజు వేడుకల్లో రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పూజలు, రాయరు పాదపూజ, మూలదేవర సంస్థాన పూజ చేపట్టారు. ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్జోషి, మేనేజర్–3 శ్రీపతి ఆచార్, మేనేజర్–4 సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు ఆరాధన ఆఖరిరోజు సందర్భంగా సర్వ సమర్పణోత్సవం జరుగనుంది. ఉత్సవం సందర్భంగా ఏకకాలంలో పంచవాహనాలపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు, రాఘవేంద్రులను శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో ఊరేగిస్తారు. ఉదయం అనుమంత్రాలయం తుంగభద్ర గ్రామం మృత్తిక బృందావన క్షేత్రంలో ఆరాధన వేడుకలు, రథయాత్ర నిర్వహిస్తారు. -
మాజీ ఎమ్మెల్యే గంగుల గృహ నిర్బంధం
ఆళ్లగడ్డ: మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వెలుగోడు రిజర్వాయర్ సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను మంగళవారం ఉదయం పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని బయటకు వెళ్లేందుకు వీల్లేదని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వాయర్ సందర్శనకు వెళ్తే కూడా ప్రభుత్వం ఎందుకు బెంబేలెత్తుందో అర్థం కావడం లేదన్నారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి తెలుగుగంగ, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని ప్రశ్నిస్తే పోలీసులతో గృహ నిర్భంధం చేయడం సమంజసం కాదన్నారు. పోలీసుల అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఉరుకుంద హుండీ ఆదాయం రూ.1.41కోట్లు కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాసం మూడవ గురు, సోమవారాలకు సంబంధించి ఆరు రోజుల హుండీని మంగళవారం లెక్కించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. నగదు రూపంలో రూ.1,41,05,560 రాగా.. వెండి 25 కేజీల 300 గ్రాములు, బంగా రం 16 గ్రాముల 980 మిల్లీగ్రాములు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. అలాగే యుఎస్ఏ డాలర్లు 8 వచ్చాయన్నారు. లెక్కింపు కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణాధికారి కమలాకర్, దేవాలయ సిబ్బ ందితో పాటు ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి, ముఖ్యఅర్చకులు, ఆలయ పర్యవేక్షకులు వెంకటేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. పీఆర్ ఎస్ఈగా కేజేఎస్ చంద్రారెడ్డి బాధ్యతల స్వీకరణ కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరుగా కేజేఎస్ చంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్క డ ఎస్ఈగా విధులు నిర్వహించిన జి.ప్రభాకర్రెడ్డి గత ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఈఈగా విధులు నిర్వహిస్తున్న కేజేఎస్ చంద్రారెడ్డికి ఎస్ఈగా పదోన్నతి కల్పించి ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నూతన ఎస్ఈని ఇంజినీర్లు కలిసి పూలబొకేలతో అభినందనలు తెలిపారు. ముగిసిన బీమా గడువు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 3,48,390 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్కు సంబంధించి వాతావరణ ఆధారిత బీమా కింద వేరుశనగ, పత్తి.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి, మొక్కజొన్న, కందులు, జొన్న, ఆముదం, మిర్చి, కొర్ర, సజ్జ, ఉల్లి నోటిఫై అయ్యాయి. వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లింపు గడువు జూలై చివరితో పూర్తి కాగా.. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ప్రీమియం చెల్లింపు గడువు ఆగస్టు 31తో ముగిసింది. నోటిఫై చేసిన పంటలు 3,40,842 హెక్టార్లలో సాగయ్యాయి. ఇందులో 3,30,482.74 హెక్టార్లకు ప్రీమియం చెల్లించినట్లు స్పష్టమవుతోంది. మొత్తం 2,86,322 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. నంద్యాల జిల్లాలో వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద 1,00,094 హెక్టార్లకు ప్రీమియం చెల్లించారు. ఈ జిల్లాలో 1,48,546 మంది రైతులు పంటల బీమా చేసుకోగా.. ఇందులో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులు 6,725 మంది ఉండగా.. నాన్ లోని ఫార్మర్స్ 1,41,821 మంది ఉండటం గమనార్హం. క్వింటా ఉల్లి రూ.4,139 కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఉల్లి సాగు తగ్గిపోవడంతో కొరత ఏర్పడుతోంది. కర్నూలు జిల్లాలో 19,241 హెక్టార్ల సాధారణ సాగు ఉండగా కేవలం 4,988 హెక్టార్లలో సాగయింది. మార్కెట్కు ఉల్లి తక్కువగా వస్తోంది. కేవలం 686 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు మార్కెట్కు రాగా కనిష్టంగా రూ. 2,393, గరిష్టంగా రూ.4,139 ధర లభించగా.. సగటు ధర రూ.3,839 నమోదైంది. కర్నూలు మార్కెట్లో వేరుశనగ ధర క్వింటాకు గరిష్ట ధర రూ.9,329, ఆదోని మార్కెట్లో రూ.8,999 ప్రకారం ధర లభించింది. ఆదోని మార్కెట్కు పత్తి 1,064 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.5,469, సగటు ధర రూ.9,769 పలికింది. -
కేజీబీవీ సీటు ఇప్పించండి మేడం
నందవరం: ‘చదువుకోవాలని ఉంది. కేజీబీవీలో సీటు ఇప్పించండి.. మేడం’ అంటూ పెద్దకడబూరు మండలం, కమ్మలదిన్నెకు చెందిన కురవ కావేరి జిల్లా కలెక్టర్ ఏ.సిరిని వేడుకుంది. మంగళవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్కు కేజీబీవీలో సీటు కేటాయించాలని కోరుతూ కావేరి వినతి పత్రం అందజే సింది. 7వ తరగతి వరకు చదివానని, తర్వాత తల్లిదండ్రులు చదివించలేకపోవడంతో మధ్యలోనే వదిలేశానని తెలిపింది. కేజీబీవీలో దరఖాస్తు చేసుకు న్నా సీటు రాకపోవడంతో చదువుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నందవరం మండల కేంద్రంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటున్నానని, తనకు కస్తూర్బాలో సీటు ఇప్పి ంచి చదివించాలని జిల్లా కలెక్టర్ను ఆ బాలిక వేడుకుంది. కలెక్టర్ స్పందిస్తూ కేజీబీవీలో సీటు కేటాయి స్తామని హామీ ఇవ్వడంతో కావేరి సంతోషం వ్యక్తం చేసింది. -
కలెక్టర్కు బంగారు పతకం
నంద్యాల(న్యూటౌన్): ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశిష్ట సేవలు అందించినందు కు జిల్లా కలెక్టర్ రాజకుమారికి రెడ్క్రాస్ బంగారు పతకం, ప్రశంసా పత్రం లభించింది. మంగళవారం విజ యవాడలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో 2024–25 సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రెడ్క్రాస్ ద్వారా విశిష్ట సేవలు అందించిన కలెక్టర్లను రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ సత్కరించారు. నంద్యాల జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటు, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ప్రారంభం, ‘మీ ఇంటికి మీ డాక్టర్’ కార్యక్రమం అమలు తదితర ప్రజోపయోగ కార్యక్రమాలను సమర్థవంతంగా అమ లు చేసినందుకు కలెక్టర్ రాజకుమారికి ఈ పురస్కారం లభించింది. -
నేడు వైఎస్సార్ వర్ధంతి
కర్నూలు(టౌన్): ప్రజల గుండెల్లో కొలువైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 2004 సంవత్సరం మే నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్ల పాలన స్వర్ణ యుగాన్ని తలపించింది. 2009 సంవత్సరం ఏప్రిల్లో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఆయన పాలనలో రూపుదిద్దుకున్న ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పార్టీలు, కులమతాలకు అతీతంగా అందించడం ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2009 సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన తుదిశ్వాస విడిచారు. మహానేత మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ చిరునవ్వు మదిమదిలో సజీవంగా ఉండటం విశేషం. ప్రతి ఏడాది ఆయన వర్ధంతి కార్యక్రమాల్లో ప్రజలు తమకు చేకూరిన లబ్ధిని గుర్తు చేసుకొని మనసులోనే నివాళులర్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులతో పాటు కర్నూలు నగరంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కర్నూలులోని స్టేట్ బ్యాంకు వద్దనున్న వైఎస్సార్ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అలాగే జిల్లాలో గురురాఘవేంద్ర, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, అవుకు రిజర్వాయర్ వంటి ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఆయనకే సొంతం. ఈ నేపథ్యంలో వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయా ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి నీళ్లు తీసుకొచ్చి బుధవారం వైఎస్సార్ విగ్రహాలకు జలాభిషేకం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
పారే నీటిలో నీవే.. చిరునవ్వులో నీవే !
నేడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కరువు నేలలో జలసిరులు కృష్ణగిరి: జిల్లాలో నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గాన్ని హంద్రీ – నీవా కాలువ ఏర్పాటు చేసి కృష్ణాజలాలతో సస్యశ్యామలం చేసింది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపు 80 వేల ఎకరాలకు సాగు నీరు అందించారు. దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్ మండలంలోని 50 గ్రామాలకు, డోన్ పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ.55 కోట్లతో తాగునీరు అందించారు. వెల్దుర్తి మండలంలో మల్లెపల్లె వద్ద ఎత్తిపోతల పథకం, కృష్ణగిరి మండలంలో కృష్ణగిరి, కంబాలపాడు, ఆలంకొండ ఎత్తిపోతల పథకాలతోపాటు కృష్ణగిరి సమీపంలో 0.016 టీఎంసీలతో రిజర్వాయర్ ద్వారా ఏడు గ్రామాల్లోని 5,100 ఎకరాలకు సాగునీరు అందించారు. అలాగే పత్తికొండ మండలంలోని పందికోన వద్ద ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఏర్పాటుచేశారు. దీంతోపాటు లక్కసాగరం వద్ద, దేవనకొండ మండలం గుండ్లకొండ ఎత్తిపోతల పథకం సమీపంలో చానల్ కాలువలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మరో 5,100 ఎకరాలకు సాగునీరు అందుతోంది. జలయజ్ఞంతోపాటు ఈ ప్రాంత ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందింది కూడా వైఎస్సార్ పాలనలోనే అనేది జగమేరిగిన సత్యం. అందుకే ఇక్కడి ప్రజలు అయనను అనుదినం స్మరించుకుంటున్నారు. రైతు బాంధవుడు తుగ్గలి: వరుస కరువులతో 2004కు ముందు రైతులు కష్టాలతో కొట్టుమిట్టాడే రోజులవి. భూములు సాగుకు నోచుకోక బీడుగా మారాయి. మరోవైపు విద్యుత్ చార్జీల భారం. రైతులు వ్యవసాయం చేయడానికి వెనుకాడే పరిస్థితి. ఆ సమయంలో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల రుణమాఫీ చేయడంతో పాటు బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తానంటే హేళన చేశారు. కానీ రైతు సంక్షేమం కోసం తాను ఎంత ఖర్చు అయినా చేస్తానని రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులకు మాట ఆడలేని పరిస్థితి తెచ్చారు. ఇప్పటికీ ఆ పథకం కొనసాగుతుండటం ఆయన చలువే అని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో కృష్ణగిరి, పందికోన వద్ద రిజర్వాయర్లు నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరు అందేలా కృషి చేశారు. -
వరద బాధితులకు అండగా..
నంద్యాల(అర్బన్): వరద ప్రభావంతో నంద్యాలలో సర్వం కోల్పోయి ని రాశ్రయులుగా మారిన వారికి డాక్టర్ వైఎస్సార్ అండగా నిలిచారు. 2007 జూన్ 21న పట్టణం వరద ముంపునకు గురై అధికంగా నష్టపోయింది. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో జూన్ 24న వైఎస్సార్ స్వయంగా పర్యటించి, బాధితులను పరామర్శి ంచారు. ప్రజల కష్టాన్ని కళ్లారా చూసి న వైఎస్సార్ వరద ముప్పు నుంచి కాపాడతానని హామీ ఇచ్చారు. ఆ మేరకు శ్యామ కాలువ, కుందూ నది,మద్దిలేరును వెడల్పు చేసి వరద ముప్పు తప్పించడానికి రూ.92 కోట్లను మంజూరు చేశారు. వైఎస్ నగర్, పీవీ నగర్లలో తాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రె యిన్లకు రూ.3.62 కోట్లను మంజూరు చేశారు. ఆయ న హయాంలో నంద్యాల నియోజకవర్గంలో దాదాపు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. -
ఆర్టీసీ బస్సు.. ప్రయాణమంటేనే హడల్
● బస్సు టైర్ పేలి ముగ్గురికి గాయాలు ● భయాందోళనకు గురైన ప్రయాణికులు ● రద్దీలో అస్వస్థతకు గురైన మహిళ మృతి పత్తికొండ: గమ్యస్థానాలకు చేరకుండా మార్గం మధ్యలోనే మరమ్మతులకు గురై ఆగిపోతూ ఆర్టీసీ బస్సులు హడలెత్తిస్తున్న సంఘటనలతో ప్రయాణికులు కలవరపడుతున్నారు. మంగళవారం ఉదయం పత్తికొండ నుంచి ఆదోనికి బయలుదేరిన ఆదోని డిపోకు చెందిన ఏపీ 39 యూఎస్ 5609 నంబరు గల బస్సు దేవనబండ–ఆటికెలగుండు గ్రామాల మధ్య టైర్ పేలడంతో ఆగిపోయింది. పేలుడు తీవ్రతకు టైర్ ఉన్న చోట సీట్లో కూర్చున్న హోసూరు, పత్తికొండ, ఆదోనికి చెందిన వెంకటేష్, కార్తీక్, గిరి అనే ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఉన్నఫళంగా పెద్ద శబ్దంతో టైరు పేలడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు కాసేపు ఏమి జరిగిందో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం ప్రయాణికులు 108కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ వాహనం సిబ్బంది గాయపడిన వారిని ఆస్పరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ఘటన జరగడంతో ముప్పు తప్పిందని, రక్షణ గోడలు లేని వంతెన వద్ద టైరు పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు. డిపో మేనేజర్పై మండిపాటు ఆదోని, పత్తికొండ రెండు డిపోలకు మేనేజర్గా వ్యవహరిస్తున్న రెహమాన్పై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పత్తికొండ డిపోలో కాలం చెల్లిన బస్సులలో ప్రతిరోజు ప్రయాణం నరకప్రాయంగా మారింది. బస్టాండ్ నుంచి బయలుదేరిన బస్సులు గమ్యస్థానాలకు చేరకుండా అనునిత్యం మార్గం మధ్యలో నిలిచిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీనికితోడు పత్తికొండ బస్టాండ్కు వచ్చే ఇతర డిపోల సిబ్బంది ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇతర డిపోలకు చెందిన బస్సులు సమయపాలన లేకుండా నడపడం వల్ల అందుబాటులో ఉన్న బస్సులపై రద్దీ తీవ్రత పడుతుంది. దీంతో బస్సులో ప్రయాణం చేసేవారు అవస్థల నడుమ ప్రయాణాలు చేస్తున్నారు. అదే విదంగా రద్దీ వల్ల సోమవారం సాయంత్రం పత్తికొండ బస్డాండ్లో గుంతకల్కు చెందిన హసీనా అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై వైద్య చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయింది. పత్తికొండ డిపో మేనేజర్గా ఉన్న రెహమాన్ సంక్రమంగా విధులకు రాకపోవడం పాటు ఇక్కడ పనిచేసే సిబ్బంది విధులపై కూడా సంక్రమంగా పర్యవేక్షణ చేయడం లేదు. దీంతో మేనేజర్ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవే సమస్యలపై నేరుగా గతంలో చాలా మంది రీజనల్ మేనేజర్ శ్రీనువాసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తోపులాటలో అస్వస్థతకు గురైన మహిళ మృతి కర్నూలు నుంచి గుంతకల్కు బస్సులో ప్రయాణిస్తున్న గుంతకల్కు చెందిన హసీనా (55) అనే మహిళ సోమవారం సాయంత్రం పత్తికొండ బస్టాండ్లో వాష్రూమ్కు దిగింది. తిరిగి బస్సు ఎక్కే క్రమంలో రద్దీ వల్ల జరిగిన తోపులాటలో ఊపిరి అందక స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆమె కుమారుడు స్థానికుల సహకారంతో వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విధుల్లో ఉన్న వైద్యాధికారి మణిదీప్ ఆమెకు వైద్య చికిత్సలు నిర్వహించారు. అయితే ఆమె కోలుకోలేక మృతి చెందింది. బస్సులో రద్దీ వల్లనే తన అమ్మ అకారణంగా చనిపోయిందని కుమారుడు దాదాపీరా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. -
దిశ, వన్స్టాప్ సెంటర్ తనిఖీ
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని దిశ, వన్స్టాప్ సెంటర్ను గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాలకు సంబంధించి రిజిస్టర్లను పరిశీలించారు. వన్స్టాప్ సెంటర్లో చేరే వారి వివరాలను, వారి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, సంబంధిత సంతకాలు కచ్చితంగా తీసుకోవాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. బాధితులకు విక్టిమ్ కాంపెన్సేషన్ త్వరగా అందేలా కృషి చేయాలని అక్కడి సిబ్బందికి చెప్పారు. అక్కడున్న నివాసితులకు లీగల్ సర్వీసెస్ యాక్ట్ – 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హులని తెలిపారు. వారి భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన సమస్యలు వస్తే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. -
దరఖాస్తుల ఆహ్వానం
డోన్ రూరల్: రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో ఏర్పాటు చేస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లకు సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ డిప్యూటీ డైరెక్టర్ జింకా శ్రీకాంత్, ఐటీఐ ప్రిన్సిపాల్ నాగకేశాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డేటా అనోటేటర్ అసిస్టెంట్ (3) ఓసీ, డేటా క్యూరెటర్ అసిస్టెంట్ (3) ఓసీ–1, బీసీ–1, ఎస్సీ–1, పోస్టులు డోన్ ఐటీఐలో అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, అభ్యర్థులు ఎంపికకు సంబంధించి 22 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల్లోపు వివరాలను సమర్పించాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు దగ్గర్లోని ఐటీఐ ప్రధానాధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు. నియామక ప్రకియ డిప్యూటీ డైరెక్టర్ రీజినల్ ఆఫీస్, ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్, పద్మావతిపురం, తిరుచానూర్ రోడ్డు, తిరుపతి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య డోన్ టౌన్: మండలంలోని చింతలపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు కుమ్మరి వెంకటస్వామి (27) చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఆగస్టు 28న తండ్రి మందలించడంతో వెంకటస్వామి ఇంటి నుండి వెళ్లిపోయి గ్రామ సమీపంలో గోసానిపల్లె నుంచి ధర్మారం గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు గుండా పొలాల్లోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. వెంకటస్వామికి నాలుగు సంవత్సరాల క్రితం హరిప్రియ అనే యువతితో వివాహం జరిగింది. ఉడుములపాడు సమీపంలోని ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగించేవారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన అతని కోసం కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో గురువారం అటు వైపు పొలం పనులకు వెళ్లిన వారికి దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి లక్ష్మిదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. ఆటో ఢీకొని వ్యక్తి మృతి కర్నూలు (సిటీ): కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఇ.తాండ్రపాడు గ్రామంలో ఆటో ఢీకొనడంతో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. అదే గ్రామంలోని టీజీ నగర్కు చెందిన ఎం.రాజేంద్ర బాబు (56) బార్బర్ షాప్ నిర్వహిస్తున్నాడు. రాత్రి షాప్కు మూత వేసి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలోని వంతెన వద్ద ఇ.తాండ్రపాడుకు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టారు. ప్రమాదంలో రాజేంద్రబాబుకు తీవ్ర గాయాలైనప్పటికీ ఆటోడ్రైవర్ అలాగే ముందుకెళ్లిపోయాడు. అదే దారిలో వెళ్తున్న కొందరు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి కోలుకోలేక మృతిచెందాడు. మృతుడికి భార్య ఎన్.శంకరమ్మ, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఏఎస్ఐ కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత బొమ్మలసత్రం: కారు ప్రమాదంలో మృతిచెందిన ఆళ్లగడ్డ ఏఎస్ఐ సురేష్రెడ్డి కుటుంబానికి రూ. 20.80 లక్షల చెక్కును జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ గురువారం అందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏఎస్ఐ సురేష్రెడ్డి ఈఏడాది 7వ నెలలో కారు ప్రమాదంలో మృతిచెందాడన్నారు. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. మృతిచెందిన పోలీస్ కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్బాషా, కార్యాలయ అధికారులు వీరన్న, కవిత, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామినాయక్ ఉన్నారు. హైకోర్టు బెంచ్ సాధించే వరకు ఉద్యమం కర్నూలు: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ సాధించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని న్యా యవాదులు స్పష్టం చేశారు. వారి రిలే నిరాహార దీక్షలు 11వ రోజు గురువారం కొనసాగాయి. న్యాయవాదులు నిస్సీ, గౌతమ్ శేఖర్, తులసి ఈ శ్వర్ రెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న న్యాయవాదుల విధుల బహిష్కరణ ఈనెల 11వ తేదీ వరకు కొనసాగించాలని తీర్మానించారు. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు తెలిపారు. -
ఉద్యాన పంటలతో ఎగుమతులు సాధ్యమే!
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యాన పంటల్లో ఎగుమతులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే సాగులో తగిన జాగ్రత్తలు చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఐ కార్ ప్రధాన శాస్త్రవేత్త విజయ్ అవినాష్ లింగం సూచించారు. కర్నూలులోని ఉద్యాన భవన్లో గురువారం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ప్రపంచ విజయం దిశగా సాధికారత సాధించడం, ఎగుమతుల సన్నాహకాలపై సమగ్ర శిక్షణలో భాగంగా జిల్లాలోని ఎఫ్పీఓల ప్రతినిధులకు ఎగుమతులపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఐ కార్ ప్రధాన శాస్త్రవేత్త మాట్లాడుతూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులపై అవగాహన కల్పించారు. ఏఏ పంటలకు ఎగుమతులకు అవకాశాలు ఉన్నాయి. ఎగుమతులలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల పాత్ర తదితర వాటిని వివరించారు. కర్నూలు జిల్లా ఉద్యాన పంటల సాగుకు నిలయంగా మారుతోందని, ఎగుమతులకు అవకాశం ఉన్నప్పుడే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. ఉద్యాన శాఖ, నాబార్డు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు బాగా పని చేస్తున్నాయని, ఎగుమతులకు అవకాశం కల్పించడం ద్వారా సంఘాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. వివిధ సంఘాల ప్రతినిధుల అనుమానాలను నివృత్తి చేశారు. ఎగుమతులకు నాబార్డు, ఎపిడా సంపూర్ణంగా సహకరిస్తున్నాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆప్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ప్రతినిధి నబిరసుల్, నాబార్డు డీడీఏం సుబ్బారెడ్డి, ఎపిడా మేనేజర్ పెద్దస్వామి, జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి
నంద్యాల(న్యూటౌన్): మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలని డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక డీఆర్డీఏ కార్యాలయంలో నేషనల్ ఎంటర్ పెన్యూర్ డే క్యాంపెయిన్, పీఎంఎఫ్ఎంఈ గ్రాడ్యుయేషన్డే పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదికి బ్యాంక్ లింకేజీ రుణం కింద రూ.1,342 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.573 కోట్లు మంజూరయ్యాయన్నారు. అలాగే సీ్త్రనిధి ద్వారా ఈ ఏడాదికి రూ.378 కోట్ల రుణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.127.74 కోట్లు ఇచ్చామన్నారు. మండలాల వారీగా సాధించాల్సిన లక్ష్యాలు, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకెళ్లాలని ఆదేశించారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ అనిల్ మాట్లాడుతూ మహిళలు డీపీఎంఎస్, ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు, యూనియన్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. -
ఎండుతున్న పొలాన్ని చూసి ఆగిన రైతు గుండె
మహానంది: మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన బండారు శేఖర్ (45) ఎండుతున్న పొలాన్ని చూసి ఆవేదనతో గుండెపోటుకు గురై గురువారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన శేఖర్ తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు 5.50 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇటీవల వర్షాలు లేక వరి పంట ఎండిపోవడంతో ఆందోళన చెందాడు. ఈ మేరకు గత రెండు రోజుల నుంచి పొలం ఎండిపోతోందని కుటుంబ సభ్యులతో చెబుతూ మనోవేదనకు గురయ్యాడు. పొలం ఎండిపోతే పోయింది.. అప్పులు ఎలాగైనా తీర్చుకుందామని కుటుంబ సభ్యులు ఓదార్చుతూ వచ్చారు. అయినప్పటికీ మనోవేదనకు గురైన ఆయన గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురికావడంతో చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకోలేక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతిచెందిన శేఖర్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
బాక్సింగ్ పోటీలు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని మధుమణి ఆసుపత్రి ఆడిటోరియంలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ జోనల్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభించినట్లు డాక్టర్ మధుసూదనరావు, అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ తెలిపారు. వారు గురువారం మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అమరావతి క్రీడా పోటీల్లో బాక్సింగ్లో జిల్లా క్రీడాకారులు ఒక బంగారు పతకం, నాలుగు రజత పతకాలు సాధించి తృతీయ స్థాయిలో నిలవడం గర్వకారణమన్నారు. నంద్యాల జిల్లాల్లో బాక్సింగ్ శిబిరాలు, రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. క్రీడాకారులు నిరంతర సాధన ద్వారా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా బాక్సింగ్ కార్యదర్శి ఫయాజ్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లాల నుంచి 150 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని, వివిధ వెయిట్ కేటగిరీల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నాయకులు ఫయాజ్, నూర్బాషా, చంద్రశేఖర్, నాగేంద్ర, ఆనంద్, ఉపేంద్ర, గణేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఆర్యూలో విద్యార్థి సంఘం నేత హల్చల్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అనుచరుడు బుధవారం రాత్రి వర్సిటీలో వీరంగం సృష్టించాడు. వీసీని కలవడానికి అనుమతివ్వలేదనే కారణంతో వీసీ పీఏతో మొదలైన దూషణల పర్వం, వీసీ డ్రైవర్, ఒక సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులను అసభ్య పదజాలంతో విరుచుపడ్డాడు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.విజయ్కుమార్ నాయుడు ఎదుటే దూషణల పర్వం కొనసాగింది. రిజిస్ట్రార్ను ఉద్దేశించి ‘‘కడపలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు అది పోయింది, నీ విషయంలో జోక్యం చేసుకోలేదు. వీసీకి, రిజిస్ట్రార్కు నేను ఎంత సపోర్ట్ చేశానో తెలుసా’’ అంటూ విరుచుకుపడ్డాడు. ‘‘మా ఆడబిడ్డపై దాడి చేస్తారా.. మా గవర్నమెంట్ ఇది, ఎవరు నన్ను ఆపేది, అయితే సస్పెండ్ చేస్తారు అంతే కదా. ఇక్కడ అందరి జాతకాలు తెలుసు. ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేలు, రూ.లక్ష తీసుకొని డ్రామాలు చేస్తారా’’ అంటూ వీరంగం సృష్టించాడు. బైరెడ్డి శబరి అక్కకు ఒక్క ఫోన్ చేస్తే.. అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు రిజిస్ట్రార్ ఇలాగే చేస్తే పోలీసులను పిలవాల్సి వస్తుందని చెప్పడంతో ఆయనతో పాటు మాట్లాడటానికి రిజిస్ట్రార్ ఛాంబర్కు వెళ్లాడు. విద్యార్థులు గొడవ పడితేనే సస్పెండ్, వర్సిటీని బహిష్కరించే వర్సిటీ అధికారులు, మరి వర్సిటీ పరిపాలనాధికారి ఎదుటే, పరిపాలనా భవనంలోనే ఇష్టానుసారం అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడ్డ విద్యార్థి సంఘం నాయకునిపై ఏమి చర్యలు తీసుకుంటారోననే చర్చ వర్సిటీలో సాగుతోంది. -
అంతా శివయ్యే చూసుకోవాలి!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగం అత్యంత కీలకం. ఈ విభాగం ద్వారా క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీగిరిలో త్వరలో సుమారు రూ.800 కోట్లతో మూడు విడతలుగా మాస్టర్ ప్లాన్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించాలని ట్రస్ట్బోర్డు ఆశిస్తోంది. అయితే దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ) రిటైర్ కావడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జ్ డీఈఈ హోదాలో ఇద్దరు ఏఈఈలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రంలో ఇంజినీర్ల కొరతతో అభివృద్ధి పనులకు అటంకం కలగనుంది. దేవస్థానంలో ఇంజినీర్ల కొరత రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైల మహాక్షేత్రం రెండవది. శ్రీశైల దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో ఈఈలు ఇద్దరు ఉండాలి. అలాగే సివిల్–2, ఎలక్ట్రికల్–1, వాటర్ సఫ్లై–1 ఇలా నలుగురు డిప్యూటీ ఈఈలు ఉండాలి. అలాగే హెడ్ డ్రాఫ్ట్స్మెన్–ఒకరు, డ్రాఫ్ట్స్మెన్–ఇద్దరు ఉండాలి. ఒక్కో డీఈఈ కింద ఐదుగురు సహాయ ఇంజినీర్లు ఉండాలి. ఒక్కో ఏఈకి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అంతేగాకుండా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్స్, ఫిట్టర్, పంప్ ఆపరేటర్, సూపర్వైజర్స్, మేషన్ (మేస్త్రి), కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, హెల్పర్స్ ఉండాలి. దేవస్థానంలోని ఇద్దరు ఈఈల్లో ఒకరు జూన్లో, మరొకరు ఆగస్టులో రిటైర్ అయ్యారు. దీంతో రెండు ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నలుగురు డీఈఈలకు గాను ఎవరు లేరు. 20 మంది ఏఈలకు గాను నలుగురు రెగ్యులర్, మరికొంత మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్స్మెన్ ఒకరు మాత్రమే ఉన్నారు. అంతేగాకుండా ఇద్దరు ఏఈఈలు, ఇన్చార్జ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ (సివిల్, ఎలక్ట్రికల్) ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అనుభవం ఉన్న అధికారి అయితే.. సుమారు రూ.800 కోట్లతో మూడు విడతల్లో చేపట్టనున్న మాస్టర్ప్లాన్ అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే గతంలో దేవస్థానంలో పనిచేసిన అనుభవం కలిగిన అధికారిని ఈఈగా నియమించాలనే వాదన వినిపిస్తోంది. రూ.800కోట్ల అభివృద్ధి పనులు ఎటువంటి అంతరాయం లేకుండా వేగంగా, క్షేత్రంలో మౌలిక వసతులు, దేవస్థాన ఇంజినీరింగ్ పనులపై అవగాహన ఉండి గతంలో క్షేత్రంలో పనిచేసిన ఈఈను శ్రీశైలానికి డెప్యూటేషన్ లేదా బదిలీపై నియమించాలని కొన్ని నెలల క్రితం ఈఓ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్కు లేఖ సైతం రాశారు. అయితే టీడీపీ ముఖ్యనేత అనుచరుడు ఆర్అండ్బీ శాఖలో ఈఈగా ఉన్న ఓ అధికారిని దేవస్థాన ఈఈగా డెప్యూటేషన్పై తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా దేవదాయ శాఖ అధికారులు శ్రీశైల దేవస్థానంలోని ఇంజినీరింగ్ విభాగంపై దృష్టిసారించి అనుభవం, అర్హత కలిగిన ఇంజినీర్లను నియమించి, మాస్టర్ప్లాన్ పనులు పూర్తి నాణ్యతతో నిర్మించేలా పర్యవేక్షణ చేసేందుకు అవరమైన పూర్తిస్థాయి ఇంజినీర్లను నియమిస్తారో లేక టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడి సూచించిన ఆర్అండ్బీ శాఖ ఈఈని డెప్యూటేషన్పై నియమిస్తారో చూడాలి. శ్రీశైల దేవస్థానంలో అభివృద్ధి పనులకు ఇంజినీర్లు కరువు దేవస్థానంలోని ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రిటైర్డ్ శ్రీగిరిలో త్వరలో మూడు విడతల్లో రూ.800 కోట్లతో మాస్టర్ప్లాన్ పనులు రూ.800 కోట్ల మాస్టర్ప్లాన్కు ఆటంకం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి శ్రీశైల దేవస్థానంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. దేవస్థాన ట్రస్ట్బోర్డు సుమారు రూ.800 కోట్లతో మూడు విడతల్లో మాస్టర్ప్లాన్లో భాగంగా క్యూకాంప్లెక్స్, పబ్లిక్ ఎనిమిటీస్, టాయిలెట్స్, సాలు మండపాలు నిర్మించాలని భావిస్తున్నారు. అయితే దేవస్థానంలో ఈఈలు లేకపోవడంతో మాస్టర్ప్లాన్ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మాస్టర్ప్లాన్ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ, నాణ్యతతో నిర్మాణ పనులు, పర్యవేక్షణ చేపట్టేందుకు దేవస్థానంలో ఈఈలు లేరు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో మాస్టర్ప్లాన్ అమలుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. -
శ్రీశైలంలో 145 టీఎంసీలు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో గురువారం సాయంత్రానికి 144.8036 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటి మట్టం 870.70 అడుగులకు చేరుకుంది. జలాశయానికి వస్తున్న ఇన్ఫ్లో కంటే దిగువ ప్రాజెక్ట్లకు విడుదల చేస్తున్న ఔట్ఫ్లో ఎక్కువగా ఉండడం వలన జలాశయ నీటిమట్టం రోజురోజుకు పడిపోతుంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి కేవలం 8,328 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలంకు విడుదలవుతుంది. బుధవారం నుంచి గురువారం వరకు జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 27,434 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం (సున్నిపెంట) ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.రవీంద్రబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు www. itiadmissions.ap.gov.in వెబ్సైట్లో ఈనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదవ తరగతిలో మెరిట్ ప్రకారం 7వ తేదీ మధ్యాహ్నం 2.30లకు శ్రీశైలం ఐటీఐలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్కు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు 9493252324, 9441181072ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఫలించిన శిల్పా పోరాటం ● కేసీ, కుందూకు నీటి విడుదల బండి ఆత్మకూరు: సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి చేపట్టిన సమర శంఖారావం కార్యక్రమం ఫలితాన్నిచ్చింది. వెలుగోడు రిజర్వాయర్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కాలువలకు ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదు. దీంతో రైతులు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈనెల ఒకటవ తేదీన శిల్పా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు పిలుపునకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంటనే వీబీఆర్ నుంచి కాల్వలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో అధికారులు హామీ ఇచ్చిన మేరకు గురువారం కుందూ, కేసీ కెనాల్కు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. దీంతో ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కరువు ఉరుముతోంది
● రెండున్నర నెలలుగా జాడలేని వర్షాలు ● దాదాపు అన్ని పంటల్లో దిగుబడులు జీరో ● ఉమ్మడి జిల్లాలో రూ.2500 కోట్ల పెట్టుబడి మట్టిపాలు ● కర్నూలు జిల్లాలో 43 శాతం, నంద్యాల జిల్లాలో 43.1 శాతం లోటు వర్షపాతం ● ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లే.. పాణ్యం మండలం కొణిదేడులో నీరు లేక నెర్రలిచ్చిన వరి పొలంకర్నూలు జిల్లాలో 3,44,171 హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. హెక్టారుకు రూ.50 వేల ప్రకారం రూ.1,720 కోట్ల పెట్టుబడి నష్టం జరిగింది.నంద్యాల జిల్లాలో 1,55,477 హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. కేవలం పెట్టుబడి రూపంలోనే రూ.773 కోట్లు మట్టిపాలయింది. -
రూ.3.20 లక్షల పెట్టుబడి నష్టం
16 ఎకరాల్లో పత్తి సాగు చేశాం. అంతరపంటగా కంది వేసుకున్నా. రెండున్నర నెలలుగా చినుకు జాడ లేదు. పత్తి, కంది పంటలు పూర్తిగా దెబ్బతిన్నా యి. ఎకరాకు సగటున రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాం. మొత్తంగా రూ.3.20 లక్షల వరకు పెట్టుబడిని కోల్పోయాం. గతంలో ఎప్పుడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవు. – శ్రీనివాసరెడ్డి, రైతు, వెల్దుర్తి సొంత పొలం ఆరు ఎకరాలు ఉంటే, 34 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఇప్పటి వరకు మిర్చి 10 ఎకరాలు, కంది 15 ఎకరాలు, సద్దలు 8 ఎకరాల ప్రకారం 33 ఎకరాల్లో పంటలు వేశాం. వర్షాలు లేకపోవడం వల్ల ఏడు ఎకరాలు ఖాళీగా ఉంది. సాగు చేసిన పంటలకు ఎకరాకు రూ.15వేల ప్రకారం రూ.4.95 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఎకరాకు కౌలు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంది. పంటలు పండకపోయినప్పటి కౌలు మాత్రం రూ.3.40 లక్షలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.8.35 లక్షలు నష్టం వాటిళ్లుతోంది. కరువు మా జీవితాన్ని పూర్తిగా కాటేసింది. – లింగరాజు, రైతు, మద్దికెర -
ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లే..
ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న తదితర పంటలు దాదాపు 28వేల హెక్టార్లలో... నంద్యాల జిల్లాలో 30వేల హెక్టార్లలో పంటలను దున్నేశారు. ప్రత్యామ్నాయంగా జొన్న, కొర్ర, స్వల్పకాలిక రకాలైన కంది, పెసర, అలసంద, ఉలువలు, వంటి పంటలు సాగు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు కూడా వర్షాల అవసరం ఉంది. కనీసం 100 మి.మీ వర్షపాతం నమోదు కావాలి. ఎల్నినో ప్రభావం వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. వర్షాలే లేకపోతే ప్రత్యామ్నాయ పంటల సాగు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎల్నినో తీవ్రతను పరిశీలిస్తే ఈ సారి రబీ సీజన్పైనా ఆశలు వదులు కోవాల్సిందేనని తెలుస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్లో మూడు నెలలు గడచిపోయాయి. మామూలుగా ఈ పాటికి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకోవాల్సి ఉంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా ఏడారి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 3,44,171 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. నంద్యాల జిల్లాలో 1,55,648 హెక్టార్లలో పంటలు వేశారు. దాదాపు అన్ని పంటలు నెల నుంచి 90 రోజుల దశలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో పత్తి 2,32,671 హెక్టార్లలో సాగయింది. మామూలుగా పత్తిలో ఈ పాటికి ఒకసారి పత్తి తీస్తారు. మొదటి సారి పత్తి తీయడంలోనే ఎకరాకు 3–4 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. అలాంటిది పత్తి వేసి 90 రోజులు గడుస్తున్నా కిలో దిగుబడి కూడా తీయలేని పరిస్థితి. పత్తి మొక్కలు కనీసం 3–4 అడుగుల ఎత్తు పెరగాలి. ఈ సారి ఏర్పడిన అనావృష్టి వల్ల ఒక్క అడుగు ఎత్తు కూడా పెరగకపోవడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క పత్తిలోనే కాదు.. వేరుశనగ, కంది, ఆముదం తదితర అన్ని పంటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లాలో మొక్కజొన్న, కంది, మినుము, వరి, పత్తి ప్రధాన పంటలు. ఒక్క డోన్ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని ప్రాంతాలకు నీటిపారుదల సదుపాయం ఉంది. కానీ మొదటిసారి నీటిపారుదల స్తంభించింది. సాగైన పంటల్లో దిగుబడులు దాదాపు జీరో కావచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలే స్పష్టం చేస్తున్నారు. దెబ్బతీసిన ఎల్నినో.. వరుసగా 21 రోజులు వర్షం లేకపోతే ఒక డ్రై స్పెల్గా పరిగణిస్తారు. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో జూన్ 14న ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మినహా ఎక్కడా భారీ వర్షం లేదు. అంటే దాదాపు రెండున్నర నెలలుగా వర్షాలు లేకపోవడం ఇదే మొదటిసారి. ఉమ్మడి జిల్లాలో దాదాపు ప్రతి మండలంలో మూడు డ్రై స్పెల్లు రావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల జిల్లాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షపాతం 428.3 మి.మీ ఉండగా.. 243.8 మి.మీ వర్షపాతం మాత్ర మే నమోదైంది. కర్నూలు జిల్లాలో జూన్ నుంచి ఆగస్టు వరకు 286.4 మి.మీ సాధారణ వర్షపాతం ఉండగా.. 164.5 మి.మీకే పరిమితమైంది. గత 50 ఏళ్లలో అనేక సార్లు ఎల్నినో ప్రభావం ఏర్పడింది. అయితే వర్షాలు కాస్త మెరుగ్గానే కురిశాయి. ఈ సంవత్సరం ఏర్పడిన ఎల్నినోను అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంటున్నారు. -
వివాహేతర సంబంధం.. భర్తను చంపిన భార్య
కర్నూలు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను కడతేర్చిన çఘటన ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నాయీబ్రాహ్మణ కాలనీలో నివాసముండే ఆంజనేయులు (27)కు రుద్రవరం మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన సుబ్బులుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ క్రమంలో సుబ్బులుకు చాగలమర్రి మండలం తోడేండ్లపల్లె గ్రామానికి చెందిన గురుప్రసాద్ ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విషయం తెలుసుకున్న ఆంజనేయులు భార్యను హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని సుబ్బులు తన ప్రియుడు గురుప్రసాద్తో కలిసి కుట్ర పన్నింది. ఈ మేరకు గురుప్రసాద్, అతని స్నేహితుడు షరీఫ్ ఆదివారం రాత్రి ఆంజనేయులను మద్యం తాగుదామంటూ నమ్మించి పాలసాగరం రోడ్డులోని మొక్కజొన్న పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయులకు మద్యం తాగించి తర్వాత రాళ్లతో తలపై మోది హత్య చేశారు. సోమవారం హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మృతుడి భార్య ఏమి తెలియనట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి దగ్గరున్న తన భర్తను పిలుచుకు పోయారని, తెల్లారే సరికి హత్య చేశారని నమ్మబలికింది. ఆమె మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు ఒప్పుకుంది. దీంతో సుబ్బులు, గురుప్రసాద్తో పాటు హత్య కు సహకరించిన షరీఫ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా హత్య జరిగిన ఒక రోజులోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ నాగరాజారావు, ఎస్ఐ చిన్న పీరయ్యను డీఎస్పీ అభినందించారు. -
మొక్కజొన్న పంటపై పందుల దాడి
గడివేముల: ఆరుగాలం కష్టపడి సాగు చేస్తున్న పంటలపై పందులు స్వైర విహారం చేయడంతో రైతులు నష్టపోతున్నారు. గడివేముల సమీపంలోని పొలాల్లో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంటలపై పందులు దాడులు చేస్తున్నాయి. గ్రామానికి చెందిన కౌలు రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మొక్కజొన్న పంటపై పందులు దాడి చేయంతో పంటంతా ధ్వంసమైంది. మరో నెలలో చేతికి రావాల్సిన పంట మొత్తం నాశనమైంది. పందుల నిర్వాహకులకు హెచ్చరించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నా రు. పందులకు భయపడి రాత్రిళ్లు పొలం వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. వచ్చే నెల 9న తుది ఓటరు జాబితా నంద్యాల(అర్బన్): తుది ఓటరు జాబితా ప్రచురణ అక్టోబర్ 9న ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పారదర్శకంగా ఓటరు జాబితా తయారీకి చర్యలు చేపడుతున్నామన్నారు.‘సర్’లో భాగంగా ఈనెల 10 వరకు అభ్యంతరాలు,దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారం చూపిన తర్వాత ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందని పేర్కొన్నారు. ఓటరు వివరాలు తెలుసుకునేందు కు వెబ్సైట్, మొబైల్ ద్వారా 1950 నంబరుకు ఈసీఐ స్పేస్ ఓటరు ఐడీ కార్డు నంబరుతో మెసేజ్ చేస్తే ఓట రు వివరాలు తెలుసుకోవచ్చన్నారు. కొత్తగా ఓటరు నమో దుకు వెబ్సైట్కు ఈసీఐనెట్ మొబైల్ అప్లికేషన్, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, బీఎల్ఓలను సంప్రదించి దరఖాస్తును సమర్పించుకోవాలన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బీఎల్ఓలు, జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొని పోవచ్చన్నారు. పదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం వెలుగోడు: పదేళ్ల బాలికపై ఆరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన వెలు గు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబరు 1న మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికకు వెలుగోడు పట్టణానికి చెందిన వృద్ధుడు చిన్న బయన్న మాయమాటలు చెప్పాడు. ఊరి బయట ఉన్న శివాలయం వెను క చెట్ల పొదల్లోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. మహానంది: మహానంది దేవస్థానం పరిధిలోని దుకాణాలపై బుధవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దేవస్థానం పరిధిలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తూ భక్తుల సొమ్మును దోచుకుంటున్నారని కొందరు భక్తులు ఇటీవల జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ నాగరాజు, సిబ్బంది బాషా, తదితరులు దాడులు చేశారు. ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్న వారికి రూ. 2 వేల వరకు జరిమానాలు విధించారు. పట్టించుకోని దేవస్థానం అధికారులు.. మహానంది దేవస్థానం పరిధిలో తోపుడు బండ్లతో పాటు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసుకుని సుమారు వంద మందికిపైగా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారులు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ భక్తుల నుంచి అధికంగా వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. ఈ విషయంపై దేవస్థానం అధికారులు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని భక్తులు మండిపడుతున్నారు. గతంలో దుకాణాల వద్ద టీ, కాఫీ, కూల్డ్రింక్స్, తదితర వస్తువుల ధరలను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశా రు. కానీ వ్యాపారులు మాత్రం వాటిని రెండు మూడు రోజులు మాత్రమే ఉంచి మూలన పడేశారు. వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుని ఎమ్మార్పీకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
భక్తుల మొర ఆలకించేదెవరు?
● గతంలో ‘డయల్ యువర్ ఈఓ’ కార్యక్రమంతో అధికారుల దృష్టికి భక్తుల సమస్యలు ● ఉత్సవాలు, ముఖ్యమైన పర్వదినాల పేరుతో ఎగనామం ● నామమాత్రంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులు ఉపయోగంలేని ఫిర్యాదుల బాక్స్లు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం సాధారణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రకటిస్తున్నా.. కనీసం వారి సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేయడం లేదు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎదురైన కష్టాలను చెప్పుకునేందుకు దేవస్థానం అవకాశం ఇవ్వడం లేదు. శ్రీశైల క్షేత్రంలో కొలువైన భ్రమరాంబా సమేతా మల్లికార్జున స్వామి కటాక్షం పొందేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు నిత్యం తరలివస్తారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు దర్శన సౌకర్యాలు, పలు ఆర్జితసేవలు, లడ్డూప్రసాదాలు, అన్నప్రసాద వితరణ, వైద్యసౌకర్యాలు, వసతి, టికెట్ల కౌంటర్లు, డోనేషన్ కౌంటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యానవనాల నిర్వహణ, పార్కింగ్ తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు భక్తులకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఎటువంటి సౌకర్యాలు మెరుగుపర్చాలి, ఆర్జితసేవల నిర్వహణ ఎలా ఉంది, స్వామిఅమ్మవార్ల అలంకార దర్శన సౌకర్యాలు, స్పర్శదర్శనం, దర్శన సమయ వేళలు, ఇంకా పలు విషయాలపై భక్తుల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, క్షేత్రాభివృద్ధికి భక్తుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకోవడం, భక్తుల అసౌకర్యాలపై ఫిర్యాదులు స్వీకరించడం వాటిని పరిష్కరించడం, తదుపరి పునరావృతం కాకుండా చూడాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ తరహాలో ఏర్పాటు చేశారు. మోగని ‘డయల్ యువర్ ఈఓ’ ఫోన్ భక్తుల నుంచి వచ్చిన సూచనల మేరకు, రాష్ట్ర దేవదాయశాఖకమిషనర్ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని 2021 డిసెంబరు 22న అట్టహాసంగా ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 08524–287111నెంబరును కేటాయించారు. ప్రతి బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు భక్తులు ఫోన్ చేసి తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమం అనంతరం అన్ని విభాగాల అధికారులతో, సిబ్బందితో ఈఓ సమీక్షించి భక్తుల నుంచి వచ్చిన ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొన్ని వారాల పాటు సజావుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారానికి ఒకరోజు కాకుండా నెలలో ఒక రోజు మాత్రమే నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం శ్రీశైల దేవస్థానంలో ముఖ్య పర్వదినాలు, ముఖ్యమైన రోజులు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాల నిర్వహణ సాకుతో కార్యక్రమానికి మొత్తానికి ఎగనామం పెట్టారు. దేవస్థానం డయల్ యువర్ ఈఓ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ఫిర్యాదుల బాక్స్లను ఏర్పాటు చేశారు. దేవస్థాన పరిపాలన భవనం వద్ద, వసతి గదుల కేంద్రాల వద్ద, సీఆర్వో కార్యాలయం, క్యూలైన్ల వద్ద, అన్నప్రసాద వితరణ భవనం వద్ద తదితర ప్రదదేశాలలో ఫిర్యాదుల బాక్స్లు ఏర్పాటు చేశారు. కానీ ఫిర్యాదుల బాక్స్లపై అవగాహన లేని భక్తులు వాటిని వినియోగించడం లేదు. అసలు ఫిర్యాదు బాక్స్లు ఉన్నాయో లేదో భక్తులకు అవగాహన లేదు. ఇప్పటికై న దేవస్థాన అధికారులు స్పందించి గతంలో నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని పునఃప్రారంభించి ఆ కార్యక్రమం ద్వారా భక్తుల నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించి క్షేత్రాభివృద్ధికి దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు. -
శోభాయమానం.. సర్వసమర్పణోత్సవం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రుల 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. వేడుకల్లో భాగంగా శనివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు సర్వ సమర్పణోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తిని పంచవాహనాలపై ఊరేగించారు. గజ, అశ్వ, సింహ, మయూరం వాహనాలపై కొలువుంచి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు వాహ నోత్సవానికి శ్రీకారం పలికారు. అశేష భక్తజన వాహిని మధ్య రాయరు ఎంతో రమణీయంగా ఊరేగారు. అనంతరం ఊంజల మంటపంలో రాయరుకు ఉయ్యాల, ఛామర్ల సేవ కానిచ్చారు. యోగీంద్ర మంటపంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మంత్రాలయం మండలంలో అనుమంత్రాలయంగా పేరుగాంచిన తుంగభద్రలో ఆఖరి రోజు ఉత్సవాలు నిర్వహించారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గ్రామాన్ని చేరుకుని మృత్తిక బృందావనానికి విశేష పూజలు చేపట్టారు. అనంతరం పండితులు, భక్తులు వసంతోత్సవం జరుపుకుని మంగళహారతులు పట్టారు. వేడుకలో భక్తులకు రాఘవేంద్రుల వైభవాన్ని ప్రవచించారు. -
నేడు కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు(టౌన్): మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, విజయమనో హరి దంపతుల కుమారుడు జనక్దత్తారెడ్డి, శ్రీయల వివాహ రిసెప్షన్కు మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు. ఉదయం బెంగళూరు నుంచి బయలు దేరి 11.40 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలోని హెలిపాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 12 గంటలకు సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ కళాశాలలో ఏర్పా టు చేసిన రిసెప్షన్కు హాజరవుతారు. నూతన వధువరూలను ఆశీర్వదించి 20 నిముషాలు అక్కడే ఉంటారు. అనంతరం 12.35 గంటలకు తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళతారు. కాగా రిసెప్షన్కు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మా జీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరవుతున్నారు. మెగా డీఎస్సీ టీచర్ విద్యార్హతలపై విచారణ కర్నూలు(సిటీ): మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎస్జీటీ టీచర్ విద్యార్హతలపై బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్లో ఎస్జీటీ టీచర్గా ఈడిగ ప్రభాకర్ పనిచేస్తున్నారు. ఈయన మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ టీచర్గా ఎంపికయ్యారు. ఈయన విద్యార్హతలపై అనేక ఆరోపణలు విస్తృత ప్రచారం కావడంతో డీఈఓ ఎల్.సుధాకర్ విచారణ చేపట్టారు. కర్నూలు డిప్యుటీ డీఈఓ శ్రీధర్ బాబు, కల్లూరు ఎంఈఓ–2 వనజకుమారి ప్రభాకర్ సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆ సందర్భంగా ఈడిగ ప్రభాకర్ టెట్ అర్హత పొందలేదని అంగీకరించారు. విచారణ నివేదికను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు పంపించనున్నట్లు డీఈఓ వెల్లడించారు. విద్యుత్ శాఖ ఎస్ఈగా శ్రీనివాసరెడ్డి నంద్యాల(అర్బన్): ఏపీఎస్పీడీసీఎల్ నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా(సూపరింటెండెంట్ ఇంజనీర్) శ్రీనివాసరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక కార్యాలయంలో ఈఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి పదోన్నతిపై ఎస్ఈగా బాధ్యతలు తీసుకున్నారు. ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్కుమార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా తిరుపతికి పదోన్నతిపై వెళ్లారు. ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డిని ఏపీపవర్ డిప్లొమా ఇంజినీరింగ్ అసోసియేషన్ సర్కిల్ సెక్రటరీ రామయ్య, ప్రెసిడెంట్ జ్ఞానసూర్యుడు, డీ–1 ఏఈ నాగరాజు, చంద్రశేఖర్, తదితరులు కలిసి అభినందనలు తెలిపారు


