Nandyala
-
ఎమ్మెల్యే వస్తారని..
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆత్మకూరు పట్టణంలోని రేషన్ దుకాణం. బియ్యం, కాటా, అన్ని సిద్ధంగా ఉన్నా.. కార్డుదారులు, డీలరు ఎక్కడికి పోయారని అనుకుంటున్నారా..? డీలరు రాఘవేంద్ర ఆదివారం ఉదయం 8.30 గంటలకే దుకాణం తెరిచాడు. అయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన తర్వాత బియ్యం పంపిణీ చేస్తామని తేల్చి చెప్పాడు. ఉదయం 10 గంటల వరకు వేచి ఉన్న కార్డుదారులు ఆ తర్వాత వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరిగ్గా 11 గంటల తర్వాత వచ్చి దుకాణం ప్రారంభించి పంపిణీ చేపట్టారు. అయితే అప్పటికే కార్డుదారుల్లో కొందరు పనులకు వెళ్లిపోవడంతో మొదటి రోజు రేషన్ తీసుకోలేక పోయారు. -
బాబుది వెన్నుపోటు చరిత్ర
ఆళ్లగడ్డ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చరిత్ర అంతా మోసం, దగా, వెన్నుపోట్లు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 4వ తేదీన నిర్వహించే ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం.. నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల్లో కల్లబొల్లి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను చూస్తుంటే భయమేస్తోందంటూ బీద ఏడుపులు ఏడవటం చంద్రబాబుకే సాధ్యమన్నారు. ఆర్థిక వ్యవస్థ సరిపోదని, సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలను ఎగతాళి చేస్తున్నారని విమర్శించారు. ప్రతి మంగళవారం తెచ్చే అప్పులు ఎవరికి పంచుతున్నారన్నారని ప్రశ్నించారు. రెడ్బుక్ను చూసి ఎవరూ భయపడే పడే పరిస్థితిలో లేరని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నాగేశ్వర్రావు, నరసింహారెడ్డి, సుధాకర్రెడ్డి ఉన్నారు. -
ఎండీయూ వ్యవస్థ ఎంతో మేలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం ఎంతో బాగుండేది. వీధుల్లో సైతం వాహనాలను తీసుకొని వచ్చి ఆపరేటర్లు రేషన్ పంపిణీ చేసేవారు. సమయం వృథా కాకుండా ఉండేది. రేషన్ సరుకులు సైతం సక్రమంగా కార్డు దారులకు అందేవి. కూటమి ప్రభుత్వం తెచ్చిన డీలర్ వ్యవస్థ చిక్కులతో కూడుకుంది. ప్రస్తుత తరుణంలో సమయం ఎంతో విలువైంది. దూరాన ఉన్న షాపుకు వెళ్లి సమయం వృథా చేసుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం పునరాలోచన చేసి ఎండీయూ వ్యవస్థను తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది. – రత్నస్వామి, ఎస్బీఐ కాలనీ, నంద్యాల గంటల తరబడి నిలబడాల్సిందే రేషన్ షాపునకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటే క్యూలో ఎక్కువ సమయం నిలబడాల్సి వస్తుంది. డీలర్లు సరుకులు అయి పోయాయని చెబుతారేమోనని కార్డు దారులు క్యూలైన్లో ఉంటున్నారు. ఒక్కో కార్డు దారుడు రేషన్ తీసుకోవాలంటే 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన రెండుమూడు గంటలు సమయం కేటాయిస్తే తప్ప రేషన్ సరుకులు అందేలా లేవు. జనాలు ఎక్కువగా ఉన్నారు. రేపు రావాలంటూ డీలర్లు హుకుం జారీ చేస్తుంటే.. రేషన్ వద్దు.. ఏమీ వద్దు అనే పరిస్థితులు వస్తున్నాయి. – రవి, పొన్నాపురం మా పరిస్థితి అర్థం కావడం లేదు ఎండీయూ వాహనం ఉన్నంత వరకు రేషన్ సరుకులు తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. ఈనెల నుంచి డీలర్ వద్దే సరుకులు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. మాఊరు నుంచి సరుకులు తీసుకోవాలంటే నాలుగు కి.మీ దూరంలో ఉన్న కమ్మవారిపల్లె పోయి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మాపరిస్థితి అర్థం కావడం లేదు. డీలర్ ఇక్కడికే వస్తారా లేదా అనేది తెలియడం లేదు. – గంగోత్రి, లక్ష్ముంపల్లె, కొలిమిగుండ్ల మండలం ప్రజలపై కక్ష సాధింపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలపై కక్షసాధింపులా ఉన్నాయి. జూటూరు గ్రామంలోని రేషన్ దుకాణం వద్ద మజరా గ్రామమైన కోల్స్నందాపురం ప్రజలు కిలో మీటరు దూరం వచ్చి సరుకులు తీసుకొని పోవాలి. బైక్ ఉన్నవాళ్లు సరే. బైక్ లేని వాళ్లు కాలినడకన వచ్చి తీసుకెళ్లాల్సిందే కదా. ఈ నిర్ణయం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. –తిరుపతయ్య, జూటూరు, పాములపాడు మండలం -
కేంద్రీయ విద్యాలయానికి రాజకీయ గ్రహణం!
● విద్యా సంవత్సరం ప్రారంభం కావస్తున్నా వెలువడని ప్రవేశాల నోటిఫికేషన్ ● తాత్కాలిక తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వ ఐటీఐ కళాశాల భవనం సిద్ధం ● అడ్డుకుంటున్న కూటమి నేతలు ● జిల్లా కేంద్రానికి తరలించేందుకు ఎంపీ శబరి ప్రయత్నం?డోన్: కేంద్రీయ విద్యాలయం మంజూరు.. శాశ్వత భవన నిర్మానానికి స్థలం కేటాయింపు.. తరగతుల నిర్వహణకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారుల అనుమతి.. తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు డోన్ ఐటీఐ నూతన భవనం ఎంపిక, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నియామకం.. అయినా రాజకీయ గ్రహణంతో విద్యా సంవత్సరం ప్రారంభం కావస్తున్నా ప్రవేశాల నోటిఫికేషన్ ఇప్పటి వరకు వెలువడలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కేంద్ర విద్య మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులను ఒప్పించి డోన్కు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించారు. మంజూరై రెండేళ్లు గడిచినా తరగతుల నిర్వహణకు కూటమి నేతలు బ్రేక్ వేస్తున్నారు. సకల వసతులతో కూడిన తాత్కాలిక భవనం సిద్ధం చేసినా ప్రవేశాల నోటిఫికేషన్ వెలువడకుండా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి అడ్డుపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డోన్లోని ప్రభుత్వ ఐటీఐ కళశాల భవనాలలో తరగతుల నిర్వహణకు అన్ని వసతులు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందాలు పలు మార్లు ధ్రువీకరించినా కూడా ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ కాకపోవడంతో ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డోన్కు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని జిల్లా కేంద్రం నంద్యాల తరలించేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో కేంద్ర ఉద్యోగస్తుల పిల్లలు, ప్రతిభా విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించినట్లయితే ఒకటి నుంచి 8 వరకు తరగతులు నిర్వహించే అవకాశం ఉందని డోన్ ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. ఒక్కొక్క తరగతికి 40 మంది విద్యార్థులను కేటాయిస్తామన్నారు. డోన్ కేంద్రీయ విద్యాలయానికి ఇన్చార్జీ ప్రిన్సిపాల్గా కర్నూలు విద్యాలయ ప్రిన్సిపాల్ ఇందిరా ప్రియదర్శినిని నియమించారు. అయినా పాఠశాల ప్రవేశాలకు నోటిఫికేషన్ జాప్యమవుతుండటంతో అటు ఉద్యోగులు, ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నా జాప్యం.. డోన్కు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది డిసెంబర్ 31వ తేదీన డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఐటీఐలో నాన్లోకల్ విద్యార్థుల బస కోసం రూ.3 కోట్ల వ్యయం చేసి అత్యాధునిక వసతులతో నిర్మించిన భవన సముదాయంలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని నిర్వహించుకోవచ్చునని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ మహంద్ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం సభ్యులు ఈ భవనాన్ని సందర్శించి సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అయినా పాఠశాల ప్రారంభంపై అధికారులు నోరు మెదపడం లేదు. విద్యా హబ్గా డోన్.. డోన్ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విద్య, వైద్య, తాగు, సాగు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అభివృద్ధి కోసం రూ.3 వేల కోట్లు కేటాయించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బాల, బాలికల కోసం నాలుగు ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, బేతంచెర్లలో ప్రభుత్వ ఐటీఐ, ప్యాపిలి మండలంలో వెటర్నిటీ పాలిటెక్నిక్, గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం, ఉర్దూ పాఠశాల లాంటివి అనేకం ఏర్పాటు చేయడంతో నంద్యాల జిల్లాలో డోన్ విద్యాహబ్ స్థాయికి ఎదిగింది. డోన్కు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని ఈ ఏడాది ప్రారంభిస్తే విద్యా కిరీటంలో మరో కలికితురాయిగా నిలిచిపోవడం ఖాయమని ప్రజలు భావిస్తున్నారు.జాప్యం చేస్తే న్యాయ పోరాటం అట్టడుగు బలహీన వర్గా ల్లో ప్రతిభ గల నిరుపేద పిల్లలకు వైఎస్సార్సీపీ ప్రభు త్వం కార్పొరేట్ స్థాయి విద్యను అందించింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రీయ విద్యాలయాన్ని డోన్కు మంజూరు చేయించాం. ఈ ఏడాది తరగతులు ప్రారంభించకుండా స్కూల్ను జిల్లా కేంద్రానికి తరలించేందుకు టీడీపీ కూటమి నేతలు ప్రయత్నిస్తే న్యాయ పోరాటం చేస్తాం. – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి -
నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల(న్యూటౌన్): స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించ వచ్చున్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు తమ అర్జీలు కూడా నమో దు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. శాస్త్రోక్తంగా పల్లకీ సేవ శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులను ఉంచి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ‘రియల్’ మోసం కృష్ణగిరి: అమకతాడు సమీపంలోని జాతీయ రహదారికి సమీపంలో రియల్ ఎస్టేస్ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేశారు. దీంతో ఆదివారం కొనుగోలు దారులు నిరసన తెలిపారు. గ్రామ సమీపంలోని విశ్వాస్ అండ్ వీవీకే, రాయలసీమ రతనాలసీమ టౌన్షిప్ వారు వెంచర్ వేశారని బాధితులు తెలిపారు. నమ్మి కొనుగోలు చేశామ ని, ఇదే ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ వెంచర్ ఓనర్ విజయ్కుమార్ను సంప్రదించాలని ప్రయత్నించగా అందుబాటులోకి రావడం లేదన్నారు. దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని శివయ్య, ముత్యాలయ్య,శిరీష తదితరులు కోరారు. శ్రీమఠం.. భక్తజనసంద్రం మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయం ఆదివారం భక్తజన సంద్రమైంది. ఇరు తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా మంత్రాలయానికి తరలి వచ్చారు. రాఘవేంద్రస్వామి మూల బృందావన దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. మంచాలమ్మ, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. -
కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు రైతు సన్నద్ధమవుతుండగా ప్రభుత్వ చర్యలు మాత్రం ఆ దిశగా కనిపించడం లేదు. ‘రైతు సంక్షేమమే ధ్యేయం.. వ్యవసాయానికి సాంకేతిక సాయం.. రైతులను ఆదుకుంటాం’.. అంటూ పాలకులు సభల్లో ఊదరగొట్టారే కానీ నష్టాల ఊబీలో ఉన్న రైతుకు చేయూత అందించిన దాఖలాల్లే
మొక్కజొన్న సాగుకు సిద్ధమయ్యా ఈ ఏడాది 2 లక్షల రూపాయాలు ముందస్తు కౌలు చెల్లించి 13 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాను. వర్షాలు, సాగునీరు అనుకూలంగా మారటంతో వారం రోజుల నుంచి మొక్కజొన్న విత్తనం నాటే పనుల్లో నిమగ్నమయ్యాను. మొక్కజొన్న విత్తనం నాటేందుకు కూలీలకు ఎకరాకు రూ. 1,500 కూలి చెల్లించేలా ఒప్పందం చేసుకుని విత్తనం వేశాను. – కొత్తూరు, రైతు, వెలగటూరు, కోవెలకుంట్ల మండలం గతేడాది నష్టపోయా గత ఏడాది ఖరీఫ్లో అధిక వర్షాలు, తెగుళ్లు, పంటచేతికందే తరుణంలో తుపాన్ల ప్రభావంతో మిరప, మొక్కజొన్న పంటల్లో దిగుబడులు తగ్గిపోయాయి. ఈ ఏడాది మే నెల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ కలిసి వస్తుందని భావిస్తున్నాను. ఈ ఏడాది మిరప, మొక్కజొన్న పంటల సాగుకు పొలాన్ని సిద్ధం చేసుకుంటున్నాను. – సుధాకర్రెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలి వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలి. గతేడాది వివిధ పంటల్లో దిగుబడులు తగ్గి, మార్కెట్లో గిట్టుబాటు ధర లేక నష్టాలు చవిచూశాము. ఈ ఏడాది జొన్న, మినుము పంటల సాగుకు సమాయత్తమవుతున్నాను. వర్షాలు అనుకూలంగా మారటంతో సాగు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాను. – సుబ్బరాయుడు, రైతు, కోవెలకుంట్ల ● నేటి నుంచి సీజన్ ప్రారంభం ● అనుకూలిస్తున్న ముందస్తు వర్షాలు ● జిల్లాలో 2.37 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యం ● సకాలంలో రైతులకు విత్తనాలందేనా ● అన్నదాత సుఖీభవ కోసం రైతుల నిరీక్షణకోవెలకుంట్ల: గతేడాది చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో ఖరీఫ్ సీజన్లో వివిధ పంటల సాగుతో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది కోటి ఆశలతో సాగుకు సన్నద్ధమవుతున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ ప్రారంభం కానుండటంతో సాగు అన్ని విధాలా కలిసొస్తుందన్న భావన అన్నదాతలో ఆశలు రేకెత్తిస్తోంది. సీజన్కు ముందే వర్షాలు అనుకూలంగా మారటంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాధి ఖరీఫ్లో 2,37,863 హెక్టార్లలో వరి, పత్తి, మినుము, కంది, మొక్కజొన్న, ఆముదం, వేరుశనగ, సోయాచిక్కుడు, ఉల్లి, కొర్ర, బెండ, తదితర పంటల సాగు లక్ష్యం. మరో రెండు రోజుల్లో ఖరీఫ్ ప్రారంభం కానుండటంతో వివిధ పంటల సాగుకు రైతులు సిద్ధం చేసుకుని విత్తనానికి సమాయత్తమవుతున్నారు. గత ఏడాది వివిధ పంటల్లో తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులు ఆ నష్టాన్ని ఈ ఏడాది పూడ్చుకునేందుకు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాలు అనుకూలంగా మారటంతో పత్తి, మిరప, కంది, మొక్కజొన్న పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో ఇప్పటికే పత్తి, మొక్కజొన్న విత్తన పనుల్లో రైతులు బిజీ అయ్యారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం జీలుగ విత్తనాలను మాత్రమే సబ్సిడీపై సరఫరా చేస్తోంది. కంది, మినుము, తదితర విత్తనాల పంపిణీపై దృష్టి సారించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క‘రుణ’ లేక ఖరీఫ్ రైతులకు పెట్టుబడి సమస్య ప్రధానంగా ఉంది. బ్యాంకులు రైతులకు అవసరమైన పంట రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. 2025–26లో వ్యవసాయ రంగానికి ఉమ్మడి జిల్లాలో రూ.16 వేల కోట్ల రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు పాత రుణాలను రెన్యువల్ చేయడం మినహా కొత్త రుణాలు లేదు. ప్రభుత్వం చేయూత ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. బది‘లీలలు’ రైతుల కష్టాలను వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదు. బదిలీల వ్యవహారం సాగుతుండటంతో కొందరు పైరవీలు చేస్తున్నారు. అనుకూలమైన స్థానానికి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీలను జూన్ 2వ తేదీ ఆర్థరాత్రిలోపు ముగించాల్సి ఉంది. మూడవ తేదీ బదిలీలు వివరాలు బయటికి వస్తాయి. అంటే జూన్ మొదటి వారం వరకు విత్తనాలు, రైతు సమస్యల గురించి పట్టించుకునే వారు లేరు. నష్టాలు గట్టేక్కేనా.. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో వాతావరణం అనుకూలించక వివిధ పంటల్లో కన్నీటి దిగుబడులు వచ్చాయి. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 54 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగైంది. పైరు ఆరంభంలో వర్షాబావం, పంట చేతికందే తరుణంలో తుఫాన్ వెంటాడి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపడటంతో దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్లలోపే దిగుబడులు పరిమితమయ్యాయి. అలాగే వరి కూడా ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరకపోయారు. అలాగే 36 వేల హెక్టార్లలో కంది సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల్లో లక్ష్యాన్ని మించి 42 వేల హెక్టార్లలో రైతులు కంది పంట సాగు చేశారు. తెగుళ్లు, తుపాన్ల ప్రభావంతో ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడులు రావడంతో రైతులపై కోలుకోలేని దెబ్బపడింది మిరప, వేరుశనగ, ఆముదం, జొన్న, ఉల్లి, పత్తి, సోయా చిక్కుడు పంటల సాగులో దిగుబడులు తగ్గి రైతులకు నష్టాలే మిగిలాయి. రైతుకు దక్కని భరోసా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ. 20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వంలోనే రైతులు అప్పులు చేసి రెండు సీజన్లు ముగించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి మరలా ఖరీఫ్ సీజన్ప్రారంభం కానుంది. ఈ ఏడాదైనా పెట్టుబడి సాయం అందుతుందో లేదో అనే సందిగ్ధత రైతుల్లో నెలకొంది. ఇప్పటికే కొందరు రైతులు అప్పులు చేసి విత్తనాలు, రసాయన ఎరువులు కొనుగోలు చేశారు.జిల్లాలో ముఖ్యమైన పంటల సాగు సాధారణ విస్తీర్ణం పంట రకం సాగు లక్ష్యం (హెక్టార్లలో) వరి 65,255 మొక్కజొన్న 50,515 కంది 36,243 పత్తి 18,827 మిరప 12,715 వేరుశనగ 11,993 మినుము 9,451 ఉల్లి 4,240 సోయా చిక్కుడు 4,176 బెండ 3,699 ఆముదం 2,921 కొర్ర 1,858ఈ ఏడాది ఆదివారం నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనానికి ముందే ప్రభుత్వం నుంచి సబ్సిడీ విత్తనాలు అందుతాయని రైతులు భావించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా సీజన్ ప్రారంభంలోనే జీలుగ, పిల్లిపెసర, మినుము, కందులు, వేరుశనగ, తదితర విత్తనాలను రైతులకు సరఫరా చేసింది. కూటమి ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఇప్పటి వరకు కేవలం జీలుగ విత్తనాలను మాత్రమే రైతులకు సరఫరా చేస్తోంది. సీజన్కు ముందు రోజు కొన్ని పంటల విత్తన ధరలను ఖరారు చేస్తూ ప్రభుత్వం అరకొరగా విత్తన కేటాయింపులు చేసింది. జిల్లాకు 892 క్వింటాళ్ల కందులు, 25 క్వింటాళ్ల మినుములు, పది క్వింటాళ్ల పెసర, 70 క్వింటాళ్ల కొర్ర, 154 క్వింటాళ్ల దయాంచా విత్తనాలను మాత్రమే మంజూరు చేయడం గమనార్హం. ఆయా పంటలకు సంబంధించి వేలాది ఎకరాల్లో పంటల సాగు సాధారణ విస్తీర్ణం కాగా అతి తక్కువ క్వింటాళ్ల విత్తన కేటాయింపులు చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విత్తనాలను సైతం జూన్ నెలలో పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
మద్దిలేటయ్య కిటకిట
బేతంచెర్ల: మద్దిలేటి నరసింహ స్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వేసవి సెలవులు కావడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పంచామృతాభిషేకం, కుంమార్చన, ఆకుపూజ, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలి ● ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా బొమ్మలసత్రం: పోలీస్శాఖలో పనిచేసి పదవీవిరమణ పొందిన ఉద్యోగులు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్రాణా అన్నారు. శనివారం స్థానిక కార్యాలయంలో పదవీ విరమణ పొందిన నంద్యాల ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మయ్య, డీసీఆర్బీ ఎస్ఐ శంకర్రావు, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ జగన్మోహన్రెడ్డిని ఎస్పీ సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పోలీస్శాఖ నుంచి పొందాల్సిన బెనిఫిట్స్ త్వరగా అందేలా చూస్తామన్నారు. ఎప్పుడు తమతో అవసరమున్నా నేరుగా కార్యాలయానికి వచ్చి సమస్యలు విన్నవించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా సాయుధ బలగాల అడిషనల్ ఎస్పీ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నంద్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కోర్సుల్లో చేరేందుకు పదవ తరగతి పాస్ అయిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏడీఆర్ జాన్సన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 28 నుంచి జూన్ 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. www. angrau.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల కార్యాలయాన్ని (9989625208)ను సంప్రదించాలన్నారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 828.20 అడుగులు శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 828.20 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 47.7648 టిఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం నుంచి శనివారం వరకు జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్ల నుంచి శ్రీశైలానికి 74,135 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దిగువ ప్రాజెక్ట్లకు 2,149 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 0.291 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 0.484 మిలియన్ యూట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 1,733 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 416 క్యూసెక్కులను వదిలారు. మే నెలలో 165 శాతం అధిక వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి మే నెలలో అధిక వర్షాలు కురిశారు. మే నెల మొత్తం వేసవి ఉంటుంది. వేసవిలో కురిసే వర్షాలను ఆన్ సీజనల్గా వ్యవహరిస్తారు. అలాంటిది అన్ని మండలాల్లో వర్షాలు పడటంతో వేసవి తీవ్రత ఈ సారి పెద్దగా కనిపించలేదు. మామూలుగా అయితే రోహిణి కార్తెలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండాలి. ఈ సారి రోహిణి కార్తె చల్లదనం పంచింది. 2024 వేసవిలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవిలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదు కావడం గమనార్హం. మే నెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ ఉండగా 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే 165 శాతం అధిక వర్షం కురిసింది. జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ మొదలు కానుంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ. ఉంది. మే నెలలో మురిపించిన వర్షాలు జూన్లో ఏ స్థాయిలో మెరిపిస్తాయనేది వేచి చూడాల్సిందే. -
పుణ్యక్షేత్రాల అభివృద్ధికి అహల్యా బాయి కృషి
శ్రీశైలంటెంపుల్: దేశంలోని పలు పుణ్యక్షేత్రాల పునరుద్ధరణకు అహల్యా బాయి హూల్కర్ కృషి చేశారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖమంత్రి సత్యకుమార్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన మహారాణి అహిల్యాభాయి హూల్కర్ 300వ జయంతి సందర్భంగా శనివారం శ్రీశైలంలోని మల్లికార్జున కల్యాణ మండపంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అహిల్యాబాయి అతి చిన్న వయస్సులోనే రాజ్యభారాన్ని చేపట్టి సుపరిపాలన చేశారన్నారు. కాశి, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, రుషికేష్, శ్రీశైలం, పూరి, రామేశ్వరం, ఓంకారేశ్వరం, మహాబలేశ్వర్, ఉడిపి, గోకర్ణ, కాట్మండ్, నాసిక్, శ్రీనగర్ తదితర పుణ్యక్షేత్రాల పునరుద్ధరణకి సహకరించిన మహా గొప్ప పవిత్రమూర్తి అని ఆమె సేవలను కొనియాడారు. ఆమె జయంతి వేడుకలను శ్రీశైలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, మహాపుణ్యక్షేత్రంలో జరుపుకోవడం క్షేత్ర ప్రజల అదృష్టమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ నాయకురాలు కొంపల్లి మాధవిలత, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, బుడ్డా శ్రీకాంత్రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి మోమిన్ షబానా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్రెడ్డి, మండల అధ్యక్షుడు చదువుల శ్రీను, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
సీమ ప్రాజెక్ట్లపై ‘కూటమి’ కపట ప్రేమ
కొత్తపల్లి: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వానిది కపట ప్రేమ అని, ఏడాదైనా ఒక్క ప్రాజెక్ట్ను కూడా పట్టించుకోలేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. శనివారం సంగమేశ్వరం వద్ద సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన చేయకుండా అమరావతి కేంద్రంగా నిధులన్నీ అక్కడే ఖర్చుపెట్టడంతో రాష్ట్రం దివాలా తీసిందని, ఇందుకు చంద్రబాబు కారణమన్నారు. ఏపీ అంటే అమరాతి, పోలవరం మాత్రమే కాదని రాయలసీమ కూడా అందులో భాగమేనన్నారు. రాయలసీమలో ప్రతి ఎకరానికి నీరు ఇస్తామని, అందుకు తగ్గట్లుగా బ్లూ ప్రింట్ తయారు చేసామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ దగ్గర వున్న ఆ బ్లూ ప్రింట్ ద్వారా ఏ విధంగా నీళ్లు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం వేలాది భూములను త్యాగం చేసిన నిర్వాసితులను ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు అది మరచి నేడు గోదావరి – బానకచర్ల అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపడం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనన్నారు. సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు లేవంటున్న అమరావతి ప్రాంతంలో ఐకానిక్ టవర్ల కోసం వేలాదికోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మోసాన్ని ప్రతి గడపకు వెళ్లి ఎండగడతామన్నారు. కార్యక్రమంలో సామాజిక రాయలసీమ వేదిక కన్వీ నర్ డాక్టర్ నాగన్న, విరసం నాయకులు వరలక్ష్మి, పినాకపాణి, అనంతపురం ఓపీడీఆర్ రామ్ కుమార్, భారతీయ కిసాన్ సంఘ్ వైఎస్సార్ కడప జిల్లా నాయకులు వెల్లాల సహదేవరెడ్డి, సీపీఎం నాయకుడు రాజశేఖర్, మహిళా హక్కుల వేదిక నాయకులు మణెమ్మ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు రామకృష్ణారెడ్డి, జానోజాగో నాయకులు మహబూబ్ బాషా, యాగంటి బసవేశ్వర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం దివాలాకు చంద్రబాబే కారణం పట్టిసీమతో నీళ్లు ఇస్తామని బానకచర్ల నాటకాలెందుకు ? రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి -
‘ఇంటి వద్దే పింఛను’ నామమాత్రమే!
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఆస్తవ్యస్తంగా మారింది. ఇంటిదగ్గరే పింఛన్ల పంపిణీ నామమాత్రమే అవుతోంది. జూన్ నెల పింఛన్ల పంపిణీ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టారు. పింఛనుదారుల ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో పంపిణీ చేసే అవకాశం కల్పించినప్పటికీ లబ్ధిదారులను ఒక్కచోటుకు చేర్చడం, లేకపోతే సచివాలయాల వద్దకు పిలిపించుకొని పంపిణీ చేయడం గమనార్హం. కర్నూలు జిల్లాలో 2,37,200 పింఛన్లు ఉండగా సాయంత్రం 6 గంటల సమయానికి 92.30 శాతం పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,13,377 పింఛన్లు ఉండగా 91.08 శాతం పంపిణీ పూర్తయింది. వివిధ కారణాలతో పింఛన్లు తీసుకోని వారు ఈనెల 2వ తేదీన తీసుకోవచ్చని డీఆర్డీఏ అధికారులు తెలిపారు. -
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
● 4న వెన్నుపోటు దినం భారీగా నిర్వహిద్దాం ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు (టౌన్): విద్యార్థులను, మహిళలను, రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఈనెల 4న నిర్వహించే ‘వెన్నుపోటు దినం’ నిరసనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. కల్లూరులోని తన గృహంలో పాణ్యం నియోజకవర్గంలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. ప్రశ్నించిన వారిని వేఽధించడమే పనిగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో దళితుల బహిష్కరణ వంటి దుర్మార్గపు పాలన జరుగుతోందన్నారు. వేలం లేకుండా, క్యాబినెట్లో చర్చించకుండా దేవదాయ భూములను టీడీపీ నాయకులకు అప్పగించేందుకు చీకటి జీవో తెచ్చారని ఆరోపించారు. టీడీపీ నాయకులకు అనుకూలంగా పోలీసులు అత్యుత్సాహం చేయడం తగదన్నారు. అనంతరం ‘వెన్నుపోటు దినం’ పోస్టర్లను అవిష్కరించారు. కార్పొరేటర్ దండు లక్ష్మీకాంతా రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు సూర్యనారయణ రెడ్డి, మిడుతూరు శ్రీనివాసులు, పార్టీ నాయకులు హనుమంతరెడ్డి, భీమేశ్వరరెడ్డి, క్రిష్ణమూర్తి, కర్నూలు డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి, కార్పొరేటర్లు నారాయణ రెడ్డి, నాగలక్ష్మీరెడ్డి. అరుణ, సుదర్శన్ రెడ్డి, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
డోన్: రాష్ట్రంలో విధ్వంసం, విద్వేషం, అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికై న వ్యక్తులతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం లేకపోతే అభివృద్ధి ఫలాలు అందవన్నారు. డోన్ నియోజకవర్గంలో రూ.3 వేల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు కేవలం 10 శాతం మాత్రమే మిగిలివుంటే టీడీపీ కూటమి నాయకులు వాటిని పూర్తిచేయకుండా ఆ ఫలాలను ప్రజలకు దూరం చేయడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. డోన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. అభివృద్ధి పనులు ఎందుకు నిలిపారు? ‘నియోజకవర్గంలో రూ.3వేల కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులలో సింహభాగం పూర్తిచేసి ప్రజలకు సకాలంలో అందించిన సంతృప్తి మాకు కలిగింది. మిగిలిన 10 శాతం పనులను కూటమి నేతలు పూర్తిచేయకపోవడం విచారకరం. యువత ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీడీఆర్ నిర్మాణ పనులు ఎందుకు నిలిపివేశారో చెప్పాలి. గుండాల, మద్దిలేటిస్వామి, ముచ్చట్ల, కంబగిరి స్వామి ఆలయాల పునరుద్ధరణ పనులకు ఎందుకు అడ్డు తగులుతున్నారో అర్థంకావడం లేదు. డోన్లో ఏడు పార్కులు నిర్మిస్తే వాటి ఆలనాపాలనా పట్టించుకోకుండా విధ్వంసానికి పాల్పడుతున్నారు. రూ.5 కోట్లతో నిర్మించిన క్లబ్ హౌస్ను పేకాట క్లబ్గా మార్చేశారు. కేంద్రీయ విద్యాలయాన్ని సిద్ధంచేస్తే ఇప్పటివరకు తరగతులు ఎందుకు ప్రారంభించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. అలాగే, సుమారు రూ.300 కోట్లతో గోరకల్లు రిజర్వాయర్ నుంచి శుద్ధజలాల్ని నియోజకవర్గ ప్రజలకు అందించేందుకు 77 ఓవర్హెడ్ ట్యాంకులతో పాటు పైపులైన్లను పూర్తిచేసినా టీడీపీ నేతలు ఇప్పటివరకు ప్రారంభించలేదు. అక్కసుతోనే బ్రేక్ ఇక రూ.40 కోట్లతో నిర్మించిన ప్రభుత్వాసుపత్రిలో కూటమి ప్రభుత్వం ఫర్నిచర్ కూడా ఏర్పాటుచేయలే ని దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలబాలికల కోసం సొంత హాస్టల్ భవనాలను నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిస్తే నేటి ప్రభుత్వం వాటిని రద్దుచేయడం దురదృష్టకరం. కోట్లాది రూపాయలతో నిర్మించిన సబ్రిజిస్ట్రార్, టీటీడీ కళ్యాణ మండపాలు, క్లబ్ హౌస్ లాంటివన్నీ నిరుపయోగంగా మార్చారు. టీడీపీ కూటమి నేతలు అభివృద్ధి పనులను పూర్తిచేయడంలేదు ‘గోరుకల్లు’ పరిధిలో 77 ట్యాంకులు పూర్తయినా ఇప్పటివరకు ప్రారంభించలేదు మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపాటు -
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. ఉయ్యాలవాడ మండలంలో అత్యధికంగా 29.6 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా వెలుగోడు మండలం 0.4 మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా ప్యాపిలిలో 23.2, కొలిమిగుండ్ల 12.6, కోవెలకుంట్ల 12.2, రుద్రవరం 12.0, బనగానపల్లె 9.6, సంజా మల 9.2, డోన్ 8.0, శిరివెళ్ల 7.2, ఆళ్లగడ్డ 7.0, గోస్పాడు 6.4, అవుకు 5.2, దొర్నిపాడు 4.8, చాగలమర్రి 2.0 మి.మీ వర్షం కురిసింది. నేటి నుంచి పింఛన్ల పంపిణీ నంద్యాల(న్యూటౌన్): ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు ఈనెల 31 నుంచి పంపిణీ చేయాలని డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో పింఛన్లు ఒక్కరోజు ముందే శనివారం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెలకు సంబంధించి జిల్లాలో 2,13,377 మందికి రూ.91.96 కోట్లు మంజూరు చేశారన్నారు. శనివారం ఉదయం 6.30 గంటల నుంచి పింఛన్దారుల ఇంటి వద్దకు సచివాలయ సిబ్బంది చేరుకోని పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. డీఎల్డీఓలు, ఎంపీడీఓలు పింఛన్ల పంపిణీపై పర్యవేక్షించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పొడిగింపు నంద్యాల(న్యూటౌన్): వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాజకుమారి శుక్రవారం తెలిపారు. గతంలో రెన్యువల్ చేసిన అక్రిడిడేషన్ కాల పరిమితి మే 31వ తేదీ నాటికి ముగుస్తున్న నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించారన్నారు. తుంగభద్రకు వరద కర్నూలు సిటీ: తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం 4,504 క్యుసెక్కుల వరద నీరు సుంకేసుల బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలో 1.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో 4,345 క్యుసెక్కుల నీరు ఒక గేటు మీటర్ పైకెత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. 159 క్యూసెక్కులు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. సబ్సిడీ విత్తన ధరలు ఖరారు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్లో పంపిణీ చేసే విత్తనాలకు ప్రభుత్వం సబ్సిడీలను ఖరారు చేసింది. జిల్లాకు వేరుశనగతో పాటు 892 క్వింటాళ్ల కందులు, 25 క్వింటాళ్ల మినుములు, 10 క్వింటాళ్ల పెసర, 70 క్వింటాళ్ల కొర్ర, 154 క్వింటాళ్ల దయంచా, 11 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను కేటాయించింది. విత్తనాల పంపిణీ జూన్ రెండవ వారం నుంచి చేపట్టే అవకాశం ఉంది. ● మినుము కిలో పూర్తి ధర రూ.138 ఉండగా.. సబ్సిడీ రూ.41.40. ● పెసర కిలో పూర్తి ధర 135 ఉండగా.. సబ్సిడీ రూ.40.50. ● కందులు కిలో పూర్తి ధర రూ.109.50 కాగా.. సబ్సిడీ రూ.32.85. ● కొర్ర కిలో పూర్తి ధర రూ.60 ఉండగా.. సబ్సిడీ రూ.30. ● వేరుశనగ కిలో పూర్తి ధర రూ.93 కాగా.. సబ్సిడీ రూ.37.20. -
తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ నాడు నిర్వహించిన పంచాంగ శ్రవణం సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నేటికీ నెరవేరని పరిస్థితి. ముఖ్యమంత్రిది ఓ మాట, మంత్రులది మరో మాట కావడంతో జిల్లాలో దాదాపు 10వేల మంది వలంటీర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయ
వలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు ఎలా కొనసాగిస్తాం. లేని పిల్లవానికి ఏమి పేరు పెట్టమన్నట్లుంది. – శాసనమండలిలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామికోవెలకుంట్ల/ఆళ్లగడ్డ/నంద్యాల అర్బన్: ప్రతి ఇంటికి నవరత్నాలు చేర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచింది. అందులో భాగంగానే ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా నిలిచేలా నియమించిన వలంటీర్ల సేవలు గడప గడపను తాకాయి. ఈ సేవా బలగం కూటమి మోసానికి బలైంది. చివరకు ప్రజలకు దూరమై.. ఉపాధి కోల్పోయారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 10,508 మంది వలంటీర్లు దాదాపు ఐదేళ్లపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో కీలకపాత్ర పోషించారు. అయితే గత ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని నెలకు వారికి రూ. 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని కూటమి నేతలు హామీలు గుప్పించి మోసం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా వలంటీర్ వ్యసవ్థను పట్టించుకున్న పాపాన పోలేదు. వలంటీర్లు లేకపోవడంతో ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అందించిన సేవలను వలంటీర్లు, ప్రజలు మరోసారి గుర్తు చేసుకున్నారు. కూటమి సర్కార్ వలంటీర్ వ్యవస్థను దగా చేయడంపై తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు. వలంటీర్లు లేక ఏడాది కాలంగా పడుతున్న అవస్థలు, సమస్యలను చెప్పుకొచ్చారు. ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామునే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల తలుపు తట్టి ఠంచన్గా పింఛన్లు పంపిణీ చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు లేవకముందే వారి ఇళ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులను యోగక్షేమాలను పలకరించి మరీ అందజేశారు. అప్పటి ప్రభుత్వం అమలు చేసిన 32 సంక్షేమ పథకాలను అందించడంలో వలంటీర్లు ఎనలేని సేవలందించారు. తమకు కేటాయించిన 50 ఇళ్లలో ఆయా పథకాలకు అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించి అందుకు అవసరమైన ధ్రువపత్రాలను సేకరించి గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేయించారు. కుల, పథకాల మంజూరులో ఎలాంటి అక్రమాలు, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు. కరోనాలో ప్రాణాలను లెక్కచేయకుండా 2020 మార్చి నెల నుంచి రెండేళ్లపాటు కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కాలంలో సైతం వలంటీర్లు ప్రాణాలకు తెగించి ఆయా కుటుంబాలకు అండగా నిలిచారు. వారికి కేటాయించిన కుటుంబాల్లోని వ్యక్తులు వైరస్బారిన పడితే కుటుంబ సభ్యులు సైతం దగ్గరకు రాని పరిస్థితి ఉండేది. ఆ సమయంలో వలంటీర్లు రోగికి వైద్య సేవలందించేందుకు ఎంతగానో కృషి చేశారు. రోగులకు మందులు అందించడం, ఫీవర్ సర్వే, వైద్యుల సలహాలు, సూచనలు అందజేసి కరోనా వారియర్స్గా నిలిచారు. నియోజకవర్గాల వారీగా పనిచేసిన వలంటీర్లు నియోజకవర్గం మొత్తం వలంటీర్లు బనగానపల్లె 1,564 ఆళ్లగడ్డ 1,495 నంద్యాల 1,542 నందికొట్కూరు 1,376 డోన్ 1,435 శ్రీశైలం 1,241 పాణ్యం, 1,855 గడివేముల మొత్తం 10,508కూటమి సర్కార్ దగా వలంటీర్ల సేవలను గుర్తించిన కూటమి నేతలు గత ఎన్నికల సమయంలో వలంటీర్ వ్యవస్థను పావుగా వాడుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, నెలకు రూ. 10 వేలు వేతనం అందజేస్తామని హామీలు గుప్పించారు. అధికారంలోకి రాగానే ఆ వ్యవస్థను పట్టించుకోకుండా తుంగలో తొక్కింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు ఎన్నిమార్లు ఆందోళన కార్యక్రమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. రూ. 10 వేలు వేతనం అందుతుందని ఆశపడిన వలంటీర్లకు నిరాశే మిగిలింది. వ్యవస్థను కొనసాగించకుండా నిర్వీర్యం చేయడంతో వలంటీర్లు జీవనానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నారు. వ్యవసాయ, ఉపాధి కూలీలుగా, వివిధ వ్యాపార సంస్థల్లో గుమాస్తాలుగా పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గౌరవ వేతనంతోపాటు నవరత్న పథకాల్లో పలు సంక్షేమ పథకాలు వలంటీర్ల కుటుంబాలకు వర్తించేవి. ఈ పథకాల ద్వారా వచ్చే డబ్బులతో వలంటీర్ల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిచేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వలంటీర్లుగా కొనసాగించకపోవడం, సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ఆ కుటుంబాట్లో చీకట్లు అలుముకున్నాయి. -
బాబు మోసానికి రోడ్డునపడి
చిత్రంలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్న యువకుడి పేరు వెంకటేష్, సొంతూరు మండల కేంద్రం రుద్రవరం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్గా పనిచేశాడు. ప్రతి నెల గౌరవ వేతనంగా రూ.5వేలు ఇచ్చేవారు. అలాగే చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి జీవనోపాధి లేకుండా చేసింది. ఎన్నికలకు మందు అధికారంలోకి వస్తే వలంటీర్లకు గౌరవ వేతనం కింద రూ.10వేలు ఇస్తామని కూటమి నేతలు బహిరంగానే ప్రకటించారు. అధికారంలోకి వచ్చకా పెంపు మాట పక్కన పెడితే ఉన్న వలంటీర్ వ్యవస్థనే తొలగించారు. దీంతో కుటుంబ పోషణకు ఊరిలో పని ఉన్నప్పుడు వెంకటేష్ ట్రాక్టర్ డ్రైవర్గా వెళ్తున్నాడు. -
వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి
ఐదేళ్లపాటు వలంటీర్గా పనిచేసి తనకు కేటాయించిన 70 కుటుంబాలకు విశిష్ట సేవలందించాను. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామునే లబ్ధిదారులకు ఫించన్లు అందజేశాను. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి నవరత్న పథకాల వర్తింపులో తమ వంతు కృషి చేశాను. కూటమి ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. – కౌసర్, వలంటీర్, సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలం ఇప్పుడు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది వలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో ఇంటి వద్దకే అన్ని రకాల సేవలందేవి. సంక్షేమ పథకాలు, వివిధ ధృవపత్రాలను వలంటీర్లు ఇళ్ల వద్దకే తీసుకొచ్చి ఇచ్చేవారు. ఏడాది నుంచి వలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో సేవలు అందటం లేదు. ప్రభుత్వం నుంచి ఏ చిన్నపని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇందుకోసం వ్యయ, ప్రయాసలు ఎదుర్కొవాల్సి వస్తోంది. – నాగయ్య, లబ్ధిదారుడు, కోవెలకుంట్ల కరోనాను దీటుగా ఎదుర్కొన్నాం కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించాం. వైరస్బారిన పడిన వ్యక్తుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి వైద్యసేవలందేలా కృషి చేశాం. ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపులో ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా పనిచేశాం. వలంటీర్ల సేవలను గుర్తించి ప్రస్తుత ప్రభుత్వం వలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. – సౌజన్య , వలంటీర్, వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం వలంటీర్లను మరిచిపోలేం గతంలో వలంటీర్లు ఉన్నప్పుడు పింఛన్లతో పాటు అన్ని ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దకు వచ్చి అందించేవారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకండా ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందేవాళ్లం. అలాగే వలంటీర్లు ఆసుపత్రికి కూడా తీసుక పోయేవారు. ప్రస్తుతం నేను పక్షవాతంతో మంచంలో ఉన్నాను. గతంలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా వలంటీర్లు వైద్య చూపించి ఇంటివద్ద విడిచి వెళ్లేవారు. – సువార్తమ్మ, క్రిష్టిపాడు -
అధిక ఎరువులవినియోగంతో అనర్థాలు
మహానంది: అధిక దిగుబడుల కోసం రైతులు మోతాదుకు మించి ఎరువులు వినియోగిస్తే అనేక అనర్థాలు ఉత్పన్నమవుతాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు. గురువారం బుక్కాపురం గ్రామంలో నిర్వహించిన ‘వికసిత కృషి సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రసాయనాలు, అధిక శాతం నీరు పంటలకు ఇవ్వడం ద్వారా భూసాంద్రత, కార్బన్ కంటెంట్, సూక్ష్మ పోషకాలు తగ్గే అవకాశం ఉందన్నారు. పొలాల్లో ప్రకృతి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని కలెక్టర్ రైతులకు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 రైతు గ్రూపులకు డ్రోనన్లను అందించామని చెప్పారు. జిల్లాలో రైతు తలసరి ఆదాయాన్ని పెంచేలా వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు కుంచపు లక్ష్మీ నరసమ్మ, గ్రామ సర్పంచ్ కందుల వరలక్ష్మమ్మ, జెడ్పీటీసీ మహేశ్వర రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి నాగరాజు, ఐసీఏఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సూగన్న, కేవీకే శాస్త్రవేత్త రమణయ్య, ఆత్మ పీడీ రత్నకుమార్, ఏడిఏ రాజశేఖర్, ఏఓ నాగేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.పారా రోయింగ్ పోటీల్లో బంగారు పతకాలుప్యాపిలి: పట్టణానికి చెందిన కొంగనపల్లి వెంకటనారాయణ పారా రోయింగ్లో తన సత్తా చాటుతున్నారు. థాయ్లాండ్లో ఈ నెల 26 నుంచి ఏషియన్ ఇండో రోయింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో వెంకటనారాయణ పాల్గొన్నారు. ఏడు దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో వెంకటనారాయణ రెండు కిలోమీటర్ల దూరాన్ని 7.5 నిమిషాలు, 500 మీటర్ల దూరాన్ని 1.3 సెకండ్ల వ్యవధిలోనే చేరుకున్నారు. సింగిల్స్ విభాగంలో రెండు బంగారు పతకాలను సాధించినట్లు వెంకటనారాయణ తెలిపారు.రూ.61 లక్షల ఆదాయంమహానంది: మహానందిలో గురువారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపులో భాగంగా 61 రోజులకు రూ. 62,17,845 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభిషేక మండపంలో శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయాలతో పాటు శ్రీ కోదండ రామాలయం, వినాయక నంది, ఆంజనేయస్వామి ఆలయాల హుండీ కానుకలను లెక్కించారు. అందులో భాగంగా ఆయా హుండీల ద్వారా రూ. 61,59, 832, అన్నప్రసాదం విభాగం ద్వారా రూ. 26,683, గో సంరక్షణ ద్వారా రూ. 31,330 వచ్చింది అన్నారు. కార్యక్రమంలో ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్ రెడ్డి, ఎం. నీలకంఠ రాజు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.విండ్ పవర్ ఉత్పాదనకు భూముల పరిశీలనబేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం, బేతంచెర్ల, గూటుపల్లె, ఎం. పెండేకల్లు, ముద్దవరం, కొలుములపల్లె గ్రామాల్లో విండ్ పవర ఉత్పాదనకు ప్రభుత్వ భూములను జేసీ విష్ణు చరణ్ గురువారం పరిశీలించారు. ఏకో రన్ సంస్థ ఆధ్వర్యంలో విండ్ పవర్ ఉత్పాదనకు అవసరమైన భూములు కేటాయించేందుకు ఆర్డీఓ నరసింహులు, తహసీల్దార్ ప్రకాశ్ బాబు, సర్వే బృందంతో కలిసి జేసీ ఆయా గ్రామాల్లో భూములను పరిశీలించారు. 27.80 ఎకరాల్లో 44 గాలి మరలు ఏర్పాటు చేసేందుకు సంస్థ చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం కనుమ కింది కొట్టాల గ్రామంలోని బిల్ల స్వర్గం గుహలను సందర్శించారు. -
అరచేతిలో వైకుంఠం ‘సూపర్–6’
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతోంది. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సూపర్–6 హామీలతో అరచేతిలో స్వర్గం చూపించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో హామీలను ప్రజల ముందుంచి ఎన్నికల్లో లబ్ధి పొందారు. అయితే ప్రభుత్వం ఏర్పాటై నెలలు గడుస్తున్నాయే కానీ, ఒక్క హామీ కూడా పట్టాలెక్కని పరిస్థితి. ముఖ్యంగా రైతులు నిలువునా మోసపోగా.. అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి తాము చేసిన పొరపాటును ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు అటకెక్కడంతో ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం తగ్గిపోయింది. ఫలితంగా ప్రతి ఒక్క రంగంపైనా ఆ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా చూపుతోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ప్రభుత్వ పాలనపై ప్రజలను కలువగా.. తమ కన్నీటి ఘోషను కథలు కథలుగా ఏకరువుపెట్టారు.కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఏడాది పాలన నేపథ్యంలో ‘సాక్షి’ పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలంలోని ఉల్లిందకొండ, చిన్నటేకూరు, బస్తిపాడు, బోల్లవరం, లక్ష్మీపురం గ్రామాలకు వెళ్లింది. రైతులు, కార్మికులు, మహిళలు, వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను కలిసింది. దాదాపు 100 మందితో మాట్లాడితే 90 మంది ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను గుప్పించారని, సంక్షేమం అంటే ఏమిటో చూపిస్తామని చెప్పి నమ్మించారని.. తీరా ఇప్పుడు చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయారని వాపోయారు. రంగులు మార్చడం, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని తెలుసని, అయితే ఈసారి ఏదో చేస్తారని అనుకుని మోసపోయామని చెప్పడం గమనార్హం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొని తాము ఏమి కోల్పోయామో వివరించారు. వీరి మనోభావాలను పరిశీలిస్తే పల్లె కన్నీటి గాథలు వర్ణనాతీతం.● జిల్లాలోని మొత్తం రైతుభరోసా కేంద్రాలు 411 ఉండగా... వీఏఏలు 210 మంది, వీహెచ్ఏలు 101 ఉన్నారు. ఆర్బీకేల ద్వారా వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబందించి 32 రకాల సేవలు అందుతున్నాయి. రోజు సగటున ఒక్కో ఆర్బీకేలో కనీసం 75 మంది సేవలు పొందడం జరిగేది. ప్రస్తుతం ఐదారు మందికి కూడ సేవలు అందడం లేదు.● గ్రామ, వార్డు సచివాలయాలు 516 ఉండగా.. 4,297 పోస్టులు మంజూరయ్యాయి. ప్రస్తుతం 3,810 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సచివాలయాలలో 36 రకాల సేవలు అందుతున్నాయి. రోజుకు ఒక్కో సచివాలయంలో సగటున 165 మంది సేవలు పొందడం జరిగేది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రోజుకు 20 మంది కూడా సేవలు పొందని పరిస్థితి.అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారు వ్యాపారాలు పడిపోయాయిఇది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లక్ష్మిపురం గ్రామంలో నిర్మించిన సచివాలయం. నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రారంభానికి నోచుకోలేదు. తాగుబోతులకు నిలయంగా మారుతోంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఎన్నికల ముందు ఒంటికాలిపై లేచిన టీడీపీ నేతలు, ఇప్పుడు లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఇలాంటి భవనాలను ప్రజా సేవకు వినియోగించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
మాటలైతే చెప్పారు కానీ..
నేను చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్నా. పొదుపు సంఘంలో ఉన్నా. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు ఎన్నో మాటు చెప్పినారు కానీ, ఒక్కటీ అమలు చేయలేకపోయారు. ఒక్కరి దగ్గర కూడా చేతిలో డబ్బులు ఆడటం లేదు. సంవత్సరం అయిపోయినా, ఇంకెప్పుడు పథకాలు ఇస్తారో తెలుస్తలేదు. – నిర్మలమ్మ, బొల్లవరం గ్రామం బియ్యం తప్ప ఏమిస్తున్నారు జగన్ ప్రభుత్వంలో ఇంటి వద్దకే సరుకులు ఇస్తుండ్రి. ఇప్పుడు ఆ బండ్లను కూడా తీసేసినారంట. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క బియ్యం తప్ప ఏమీ ఇస్తలేరు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చక్కెర, కందిపప్పు, జొన్న, రాగులు పంపిణీ చేస్తుండ్రి. ఇప్పుడు తలుచుకుంటే బాధయితాంది. – మహబూబ్ బీ, వృద్ధురాలు, బస్తిపాడు పెట్టుబడులకు ఎవరిని అడుక్కోవాల గత సంవత్సరం పండించిన పొగాకు ఇప్పటికీ ఇంట్లోనే ఉండిపోయింది. ధర చూస్తే ఏడుపొస్తుంది. ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు వానలు పడుతున్నాయి. సాగుకు లక్ష రూపాయల వరకు అవసరం. చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ కింద డబ్బులు ఇస్తాడనుకున్నాం. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితున్నా ఒక్కరూపాయి ఇచ్చింది లేదు. పెట్టుబడులకు ఎవరిని అడుక్కోవాల. మా బతుకు నాశనమైనాయి. – మినల్లా హుసేన్, బస్తిపాడు ల క్ష్మిపురంలోని సచివాలయం దగ్గర చిన్నపాటి హోటల్ బయట కూర్చున్న పరమేష్, సుంకన్న, మునిస్వామి, ఉసేన్బాషాలతో మాట్లాడగా.. చంద్రబాబునాయుడు మాట్లాడితే రాజధాని అమరావతి అంటాడే కానీ, రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. -
‘అప్పుడు చెంబెడు నీళ్లు.. మట్టి తెచ్చారు..ఈసారి అదీ లేదు’
నంద్యాల జిల్లా: టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో పాకిస్తాన్ పై విజయం సాధించిన భజనకీర్తనలే చేస్తున్నారే తప్ప ఇంకేమీ లేదంటూ సీపీఎం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు మధు విమర్శించారు. ఈరోజు(గురువారం) ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘ టీడీపీ మహానాడు మోదీ హయాంలో పాకిస్తాన్ పై విజయం సాధించామని భజన కీర్తనలకే పరిమితమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడులకు లొంగిపోయి.. పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పజెప్పకుండా, ఏ విషయం తేలకుండా మిగిలిపోయిన ఆపరేషన్ సిందూర్ ను మహానాడు వేదికగా పొగుడుతున్నారు. చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ ను, ఎన్టీఆర్ ను పొగిడినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలు పెట్టుకుని ప్రజలను మోసం చేసే చర్యలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణ సమయంలో గతంలో నరేంద్ర మోదీ చెంబెడు నీళ్లు, మట్టి తెచ్చారు.ఈసారి అది కూడా తేలేదు. ప్రత్యేక హోదా లేదు. విభజన హామీలు లేవు. రూ. 1500 కోట్ల నిధులు లేవు. అలాగే వాగ్దానాలు నెరవేర్చలేదు.రాజధాని పేరుతో కార్పొరేట్ రాజధాని చేస్తున్నారు తప్ప.. ప్రజల రాజధాని కాదు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మోదీని విమర్శించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు మారిపోయింది. పవన్ ది నాలుక లేక తాటిమట్ట నాకు అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు.. ఇప్పుడు చంద్రబాబు చేతులెత్తేశారు. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లొంగుబాటు రాష్ట్రానికి తీరని లోటు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితిని గాలికి వదిలేసి 12 రోజుల్లో కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నామని చంద్రబాబు చెప్పడం ఏంటి?, టీడీపీ మహానాడు వైఫల్యాల పుట్ట. మహానాడులో ఇరగదీసింది ఏమీలేదు. మహానాడు ప్రజలపై భారం మోపేందుకు , పచ్చి అవకాశవాదంగా మార్చుకునేందుకు పెట్టారే తప్ప మహానాడుతో ఒరిగేదేమీ లేదు. అవకాశవాదంతో రాజకీయాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కొనసాగడం సాధ్యం కాదు’ అని హెచ్చరించారు. -
నాటుసారా విక్రయాలు ఎక్కడంటే..
● బనగానపల్లె మండలం పసుపల పంచాయతీ పరిధిలోని కొండప్రాంతాల్లో నాటుసారా బట్టీలు వెలిశాయి. ● రామతీర్థం పరిసర ప్రాంతాల్లోనూ, ప్యాపిలి మండలంలోని అలేబాద్తండా పరిసరా ప్రాంతాల్లో ‘నాటు’ ఘాటు వస్తోంది. ● అవుకు మండలంలోని కొండమనాయునిపల్లి, పిక్కిల్లిపల్లి తండా, ఇస్రానాయక్ తండా మంగంపేట తండా మరి కొన్ని ప్రాంతాల్లోను నాటుసారా బట్టీలు ఉన్నాయి. వీటిలో ప్రతి రోజూ వందల లీటర్ల నాటుసారాను తయారు చేస్తున్నారు. ● కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం, కోటపాడుకు గ్రామాల్లో నాటు సారా విక్రయిస్తున్నారు. -
తల్లి మందలించిదని పిల్లలు పరారీ
డోన్ టౌన్: తల్లి మందలించిందని పిల్లలు పరారీ అయ్యారు. బస్సు ఎక్కి డోన్కు వచ్చిన ముగ్గురు చిన్నారులను స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు చేరదీసి ఎట్టకేలకు తల్లిదండ్రులకు చేర్చారు. అనంతపురం రామచంద్ర నగర్కు చెందిన అక్షర(12)అనే అమ్మాయిని తల్లి మందలించింది. దీంతో ఆ చిన్నారి కోపంతో తమ్ముడు అశ్వర్థ(8), స్నేహితురాలు షాహిద(10)ని వెంట బెట్టుకొని తమ వద్ద ఉన్న రూ.250 డబ్బులతో డోన్ వరకు ఆర్టీసీ బస్సులో వచ్చారు. బస్టాండ్లో దిగి ఇందిరాగనర్ ఆంజనేయ స్వామి ఆలయ పరిస ప్రాంతాల్లో సంచరిస్తుండగా.. స్ఫూర్తి సంస్థ సభ్యులు చేరదీసి ఆరా వివరాలు తెలుసుకున్నారు. వాట్సాప్ ద్వారా ఆనంతపురంలో తెలిసిన మిత్రులకు పిల్లల పోటోలను పంపంగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ముగ్గురు పిల్లలను పోలీసులకు అప్పజెప్పారు. అనంతపురం త్రీ టౌన్ పోలీసుల సహాయంతో డోన్ పట్టణ పోలీసు స్టేషన్ ఎస్ఐ శరత్కుమార్రెడ్డిని కలిసి తల్లిదండ్రులు పిల్లలను తీసుకెళ్ళారు. డోన్లో చేరదీసిన స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు -
ఇదీ దౌర్జన్యం..
మంచినీరు కంటే పల్లెల్లో నాటుసారా పుష్కలంగా దొరుకుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటుసారా అమ్మకాలు తీవ్రం అయ్యాయి. టీడీపీ నాయకుల అండతో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు. ఫోన్ కొడితే చాలు క్షణాల్లో నాటు సారా ప్యాకెట్లను డోర్ డెలివరీ చేస్తున్నారు. సెబ్ వ్యవస్థ నుంచి ఎకై ్సజ్గా మార్పు చెందాక ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. నాటుసారా ఖాళీ ప్యాకెట్లు ఎక్కడ చూసినా కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. ● గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు ● గతేడాది డిసెంబర్ 12న మిర్జాపురం గ్రామంలో ఒకరు మృతి ● రాష్ట్ర ప్రభుత్వం ‘నవోదయ’ నిర్వహించినా ఫలితం శూన్యం సాక్షి టాస్క్ఫోర్స్: గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా ‘గప్పు’మంటోంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు లభిస్తోంది. నాటు సారాను తాగి కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవోదయ 2.0 అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. టీడీపీ నాయకుల సహకారంలో బనగానపల్లె నియోజకవర్గంలో నాటుసారా తయారీ కొనసాగుతోంది. సారా తయారీ కోసం వాడే నల్ల బెల్లం, తుమ్మ చెక్క, నవసారం.. తదితర ముడి సరుకులను వారే అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. నాటు సారాను తయారు చేసిన వారు ఇళ్ల ముందు గొయ్యి తీసి బండరాళ్లతో కప్పి పెట్టి అమ్ముతున్నారు. కొలిమిగుండ్లలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నాటు సారా వ్యాపారుల నుంచి మామూళ్లు పొందుతూ కొందరు ఎకై ్సజ్ శాఖ అధికారులు నివారణ చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అడ్డదారుల్లో.. నాటుసారా వ్యాపారులు కూలీలను ఏర్పాటు చేసుకుంటారు. కొండ ప్రాంతాల్లో తయారు చేసిన నాటుసారాను ప్లాస్టిక్ కవర్లలో నింపి వాటిని గొనే సంచుల్లో ఉంచుకొని మోటర్ సైకిల్ ద్వారా తరలిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు రాత్రి వేళ్లల్లో అడ్డదారుల్లో సరఫరా చేస్తున్నారు. ఆయా గ్రామాల జనాభాను బట్టి నాటుసారాను విక్రయిస్తున్నారు. నాటుసారా చౌకగా లభిస్తున్నందున చాలా మంది దానిని తాగి రోగాలు తెచ్చుకుంటున్నారు. కొందరు మృత్యువాత పడుతున్నారు. నాపరాతి గనుల్లో రోజువారి పనులకు వెళ్లే కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన పిక్కిలి నాగన్న(65) నాటుసారా తాగి గతేడాది డిసెంబర్ 12న మృత్యువాత పడ్డాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం వీధిన పడింది. పేదిరికంలో తీవ్ర అవస్థలు పడుతోంది. ఇటీవల అవుకు మండలానికి చెందిన నాటుసారా వ్యాపారం చేస్తున్న ఒకరిని ఎకై ్సజ్ పోలీసులు తీసుకవచ్చి స్టేషన్లో ఉంచారు. ఇదే మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ఒకరు స్టేషన్కు వచ్చి దౌర్జన్యంగా స్టేషన్లో ఉంచిన తమ వ్యక్తిని తీసుకవెళ్లారు. ఎకై ్సజ్ పోలీసులు ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయారు. ప్రతి గ్రామంలో టీడీపీ నాయకులే బట్టి బెల్టు షాపుల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. నాటుసారా విక్రయాలకు కొంత డబ్బు వసూలు చేస్తున్నారు. ఈ విషయం కొందరు ఎకై ్సజ్ పోలీసులకు తెలిసినా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. గతంలో సారా కేసుల్లో ఉండి సాధారణ జీవితం గడుపుతున్న వారిని పిలిచి ‘ మీపై పోలీసులు కేసులు పెట్టిస్తాం.. నాటుసారా తయారు చేయండి’ అని టీడీపీ నాయకులే బెదిరిస్తున్నారు. -
ప్రయాణికుల కస్సుబస్సు!
బస్సులన్నీ మహానాడుకే! ● గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజల అవస్థలు ● జిల్లా నుంచి 200 బస్సులకు పైగా మహానాడుకు తరలింపు ● ప్రైవేటు స్కూల్ బస్సులను సైతం వదలని టీడీపీకర్నూలు(సిటీ): కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు ఆర్టీసీ, ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఆ పార్టీ కార్యకర్తలను తరలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్లలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను వినియోగించబోమని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మహానాడుకు జిల్లాలోని వివిధ డిపోలకు చెందిన 200 ఆర్టీసీ బస్సులను తరలించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆర్టీసీ బస్సులు లేకపోవడం, సుదూర ప్రాంతాలకు చెందిన బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇవీ ఇబ్బందులు.. ● బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో వేలాదిమంది ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లేందుకు ప్రయత్నించారు. ● ప్రైవేటు వాహనదారులు సైతం అడ్డగోలుగా ప్రయాణ చార్జీలు పెంచి వసూలు చేశారు. ● జిల్లాలోని వివిధ డిపోల్లో 360 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిలో 200 బస్సులకు పైగా మహానాడుకు మళ్లించారు. అందుబాటులో ఉన్న అరకొర బస్సుల్లో ప్రయాణానికి ప్రజలు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ● జిల్లా కేంద్రం నుంచి సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు ముందస్తుగా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు సైతం రిజర్వేషన్లు రద్దు చేశారు. అంతటా అశ్రద్ధ ● తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులను తరలించడంలో ఉన్న శ్రద్ధ అందుబాటులో ఉన్న బస్సుల ద్వారా గ్రామీణ, మారుమూల, సుదూర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులను తరలించే విషయంలో ఆర్టీసీ అధికారులు ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. ● కనీసం ఉన్న బస్సులను సైతం నడిపేందుకు ఆయా డిపోలకు చెందిన అధికారులతో సమన్వయం చేయలేదు. ప్రయాణికుల ఇబ్బందులను కొందరు అధికారులు ఆర్ఎం దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. ● మహానాడుకు తరలించేలా ఆయా స్కూళ్ల, కాలేజీల యాజమాన్యాలకు చెప్పి బస్సులను పంపించాలని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా నుంచి సుమారు 187 బస్సులను బలవంతంగా టీడీపీ మహానాడుకు తీసుకెళ్లిపోయారు. -
వ్యక్తిగత పరిశుభ్రత అవసరం
గోస్పాడు: ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుదర్శన్బాబు అన్నారు. డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయం వద్ద అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో రుతు చక్ర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్పోస్టర్లు విడుదల చేశారు. జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ అంకిరెడ్డి, కాంతరావునాయక్, డాక్టర్ శ్రీజ, సిబ్బంది గురుస్వామి, గుర్రప్ప, శివరాం, సరళగంగ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇంటర్ విద్యాధికారిగా శంకర్నాయక్ నంద్యాల(న్యూటౌన్): మిడుతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న శంకర్నాయక్ను నంద్యాల జిల్లా ఇంటర్ విద్యాధికారిగా బదిలీ చేశారు. విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు బుధవారం శంకర్నాయక్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యను బోధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రతి అధ్యాపకుడు అంకింత భావంతో పని చేయాలన్నారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను కిందిస్థాయి సిబ్బంది అభినందించారు. ఇదిలా ఉండగా..జిల్లా ఇన్చార్జ్ ఇంటర్ విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న సునీత గోస్పాడు జూనియర్ కళాశాల రెగ్యులర్ ప్రిన్సిపాల్గా వెళ్లారు. ఘనంగా ఎన్టీఆర్ జయంతి నంద్యాల(న్యూటౌన్): దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. తెలుగు ఖ్యాతిని దేశ నలుమూల వ్యాప్తి చేయడానికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, పర్యాటక శాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సుంకేసులకు స్వల్పంగా పెరిగిన వరద
కర్నూలు(సిటీ): తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతం, జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కురిసిన వర్షాలకు తుంగభద్ర నదికి బుధవారం వరద నీటి ప్రవాహం పెరిగింది. ఉదయం 9 గంటలకు 13,395 క్యూసెక్కుల వరదనీరు సుంకేసుల బ్యారేజీలోకి వచ్చి చేరగా 4 క్రస్టు గేట్లు మీటరు పైకెత్తి 13,236 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు బ్యారేజీలోకి వరదనీటి ప్రవాహం కొంత తగ్గింది. 8,917 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉండగా 2 గేట్లు మీటరు పైకెత్తి 8,758 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 159 క్యూసెక్కుల నీరు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని తాగునీటి అవసరాల నిమిత్తం కేసీ కాలువకు విడుదలవుతోంది. తుంగభద్రకు..నందవరం: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ, తీర్థనహళ్లి, ఆగుంబే, బళ్లారి, వరినాడు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుడడంతో తుంగభద్ర నదికి వరద నీరు వస్తోంది. బుధవారం మండల పరిధిలోని నాగలదిన్నె గ్రామంలో బ్రిడ్జి వద్ద తుంగభద్ర నది వరద నీరు ప్రవాహం పెరిగింది. నదీకి వరద నీరు రావడంతో రైతులు ఖరీఫ్ సాగు సన్నద్ధమవుతున్నారు. -
పొలంలోనే ఆగిన ఊపిరి
మంత్రాలయం: రెక్కల కష్టానికి రైతు పిచ్చగింట్లు శంకరన్న(45) ఎప్పుడూ భయడలేదు. పొలమే ప్రాణంగా జీవనం సాగిస్తూ వచ్చాయి. వివిధ పంటలు పండిస్తూ ఉండేవాడు. అయితే ఆ రైతును పొలంలోనే విద్యుత్ ప్రాణం తీసింది. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో మంత్రాలయం మండలం 52 బసాపురం గ్రామానికి చెందిన రైతు పిచ్చగింట్లు శంకరన్న, ఆయన భార్య పార్వతి బుధవారం పొలానికి గుంటక పాయడానికి వెళ్లారు. కరెంటు రావడంతో గుంటక పాస్తున్న శంకరయ్య బోరు మోటారు ఆన్ చేయడానికి బోరు దగ్గరకు వెళ్లాడు. అయితే బోరు మోటారు కనెక్షన్ విద్యుత్ తీగ డ్యామేజ్(అతుకులు) అయ్యింది. డ్యామేజ్ అయిన చోట అనుకోకుండా ఆ రైతు కాలు పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. భర్త మృతి చెందడంతో భార్య పార్వతి శోకసంద్రంలో మునిగిపోయింది. శంకరన్నకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వీరేష్ తెలిపారు. విద్యుదాఘాతంతో రైతు మృతి -
వెండి బిస్కెట్లు విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థానానికి కర్ణాటక రాష్ట్రం దావణగేరి జిల్లా జగలూరుకు చెందిన యు.లోకమూర్తి 10 వెండి బిస్కెట్ల(5 కేజీలు)ను విరాళంగా సమర్పించారు. బుధవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని అమ్మవారి ఉప ప్రధానార్చకులు విజయకుమారాస్వామి, పర్యవేక్షకులు ఎం.రవికుమార్, అమ్మవారి ఆలయ ఇన్స్పెక్టర్ రామానాయుడు, జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు. అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేశారు. -
సర్కారు నిర్లక్ష్యం.. రైతుకు శాపం
వ్యవసాయమే జీవనాధారమైన అన్నదాతకు 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లు కలిసిరాలేదు. విత్తనం వేసినప్పటి నుంచి పంట ఉత్పత్తులు చేతికందే వరకు పడరానిపాట్లు పడ్డారు. వరి, మిరప, మొక్కజొన్న, పొగాకు సాగు చేసిన రైతులకు కష్టాలు, నష్టాలే మిగిలాయి. పైరు వివిధ దశల్లో చీడపీడలు, అధికవర్షాలు, వాతావరణం అనుకూలించక దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. అష్టకష్టాలు పడి అరకొరగా దిగుబడులు దక్కించుకున్నా మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేక దిగుబడులను దళారుల చేతిలో పెట్టి నష్టాలు మూటగట్టుకున్నారు. – కోవెలకుంట్ల ● రైతుకు కలసి రాని 2024–25 వ్యవసాయ సీజన్ ● వరి, మొక్కజొన్న, మిరప, పొగాకుకు దక్కని మద్దతు ధర ● కల్లం దాటని దిగుబడులు ● గగ్గోలు పెడుతున్న అన్నదాత కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి సమీపంలో కల్లంలో రాశులుగా పోసిన వడ్లు ఏడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు ఎకరాకు రూ. 30 వేలు చెల్లించి ఏడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాను. మొదటి పంటగా మినుము సాగు చేసి రబీ సీజన్లో మొక్కజొన్న పంట వేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 40 వేలు వెచ్చించాను. అకాల వర్షాలతో పంటంతా నేల వాలింది. కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డాను. పెట్టుబడి కూడా చేతికందలేదు. – భూపాల్రెడ్డి, ఆకుమల్ల, సంజామల మండలం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. దిగుబడి చేతికందే సమయంలో మార్కెట్లో పంటల ధర లు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది రబీ సీజన్లో కుందూ నది పరివాహకంలో ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేశాను. మార్కెట్లో బస్తా రూ. 1,300 లోపే పలు కుతోంది. ఈ ధరకు అమ్మితే పెట్టుబడులు కూడా రావు.కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటా రూ. 2,200 కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. – గోపాల్రెడ్డి, గుళ్లదూర్తి, కోవెలకుంట్ల మండలం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. మార్కెట్లో మద్దతు ధర లేకపోవడాన్ని గుర్తించి వరి, మొక్కజొన్న, జొన్న, తదితర పంట ఉత్పత్తులను కొనుగోలుకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుత కూటమి సర్కార్ రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో వరి, మొక్కజొన్న, మిరప, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో వివిధ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. సాధారణ వరి ధాన్యం క్వింటా 2,300, ఏగ్రేడ్ రకం 2,320 ధర నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్లో వరికి ధర లేకపోవడంతో ఈ సమయంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం విక్రయించాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ధాన్యం కల్లాలు దాటడం లేదు. జొన్నలు క్వింటా రూ. 3,371, కంది రూ. 7,550 ప్రకారం విక్రయాలు జరుపుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే జొన్న పంటచేత కంది రైతులు అప్పట్లోనే దిగుబడులు విక్రయించుకున్నారు. ప్రసుత్తం రైతుల వద్ద పెద్దగా జొన్న, కంది దిగుబడులు లేవు. ఈ కొనుగోలు కేంద్రాలు రైతులకంటే వ్యాపారులకు వరంగా మారాయి.కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయానికి భరోసా లేక రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఓ వైపు ప్రకృతి కరుణించకా.. మరో వైపు ప్రభుత్వం ఆదుకోకా కష్టాల సాగులో నష్టాల పాలయ్యారు. ఖరీఫ్ వరి సాగులో ఆశించిన స్థాయిలో దిగుడులు రాక అప్పులపాలైన రైతులు ఆ నష్టాన్ని రబీ సీజన్లో (ఎండకారు) పూడ్చుకోవచ్చనుకుంటే చివరకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో బోర్లు, బావులు, ఎస్సార్బీసీ, కేసీకెనాల్, కుందూనది, పాలేరు, కుందరవాగు, తదితర సాగునీటి వనరుల ఆధారంగా రబీలో 90 వేల ఎకరాల్లో రైతులు కర్నూలు, నంద్యాల సోనా, 555, షుగర్లెస్ రకాలకు చెందిన వరి సాగు చేశారు. ఎకరాకు పెట్టుబడి రూ. 35 వేల నుంచి రూ. 40 వేలు వెచ్చించారు. అయితే ఆయకట్టుకు నీరందక, కొన్ని ప్రాంతాల్లో దోమపోటు, అగ్గి తెగులు ఆశించడంతో తెగళ్ల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు అదనంగా క్రిమి సంహారక మందులు పిచికారి చేయాల్సి వచ్చి అదనపు భారం పడింది. తీరా పైరు కోత దశకు చేరుకున్న తరుణంలో అకాల వర్షాలు వెంటాడాయి. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడులు వచ్చాయి. అష్టకష్టాలు పడి పంటను దక్కించుకుంటే వరి రైతును మార్కెట్లో గిట్టుబాటు ధర వేధిస్తోంది. బస్తా రూ. 1,250 మాత్రమే పలుకుతుండటంతో ఈ ధరకు విక్రయిస్తే చేసిన కష్టమంతా పెట్టుబడులకే సరిపోతుందని రైతులు వాపోతున్నారు. దీనికితోడు పైరు చేతికందే తరుణంలో రెండు, మూడుసార్లు అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు, పెనుగాలులకు వరి నేలవాలి వడ్లు రాలిపోయి నష్టపోయారు. నేలవాలిన వరిని కట్టలు కట్టి నూర్పిడి చేసేందుకు రైతులపై అదనపు భారం పడింది. ముంచిన మిరప.. జిల్లా బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, కుందూనది, పాలేరు, కుందరవాగు, తదితర సాగునీటి వనరుల ఆధారంగా 21 వేల ఎకరాల్లో సూపర్–10, తేజ, డబ్బీ బ్యాడీ రకాలకు చెందిన మిరప సాగు చేశారు. మిరప నార, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సాగునీరు మళ్లింపు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 2 లక్షలకు పైగా వెచ్చించారు. కౌలు రైతులకు రూ. 50 వేలు అదనపు భారం పడింది. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో మిరపకు తెగుళ్లు ఆశించి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. దిగుబడులు తగ్గడం, మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా రూ. 8 వేలకు మించలేదు. పొగాకు రైతు డీలా.. ఈ ఏడాది పొగాకు సాగులో అరకొరగా దిగుబడులు, కొనుగోలు కేంద్రాల్లో సరైన ధర లభించకపోవడంతో రైతులు డీలా పడ్డారు. రైతులకు అండగా నిలవాల్సిన పొగాకు కంపెనీలు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను నట్టేట ముంచారు. రబీ సీజన్లో జిల్లాలో 8,374 ఎకరాల్లో సాగైంది. ఎకరాకు రూ. 40 వేల వరకు పెట్టుబడి వెచ్చించారు. ఎకరాకు 15 క్వింటాళ్ల ఉంచి 18 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని భావిస్తే ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల కారణంగా ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లలోపే దిగుబడులు పరిమితమయ్యాయి. కొన్ని పొగాకు కంపెనీలు క్వింటాకు రూ. 18,500 ధర చెల్లిస్తామని అగ్రిమెంట్ చేసుకుని పంట చేతికందిన తర్వాత ఆ ధరకు విక్రయించకపోవడంతో రైతుల పరి స్థితి అగమ్యగోచరంగామారింది. క్వింటా రూ. 11వేల నుంచి రూ. 12 వేలు మాత్రమే చెల్లించి విక్రయాలు జరపడంతో రైతులు క్వింటాపై దాదాపు రూ. 6 వేలకు పైగా నష్టపోవాల్సి వచ్చింది. మొక్కజొన్నలో కన్నీటి దిగుబడులు జిల్లాలో రబీ సీజన్లో 32,682 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూ పంలో ఎకరాకు రూ. 40 వేలు వెచ్చించారు. పైరు నెల రోజుల దశలో ఉండగా విల్ట్(ఎండు తెగులు) వైరస్ సోకిమొక్కలు ఎండిపోయి చనిపోయాయి.ఎండు తెగులు బారి నుంచి పంటను కాపాడు కునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. తెగులు ఆశించిన పైరులో ఎకరా కు 18 నుంచి 22 క్వింటాళ్లకు మించి దిగుబడులు రా లేదు. కోత, నూర్పిడికి ఎకరాకు రూ. 2వేలకు పైగా అదనపు భారం పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో క్వింటా రూ. 2,200 ధర పలుకుతోంది. -
కమిషనర్కు అస్వస్థత
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్య ఉండటంతో వైద్య పరీక్షలు నిమిత్తం మంగళవారం స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం స్టంట్ వేసినట్లు తెలిసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమిషనర్ను పలువురు పరామర్శించారు. జేసీ విష్ణుచరణ్, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసాతో పాటు అధికారులు, సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాసు మాట్లాడుతూ కమిషనర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
ముందస్తుగా ఆశల ‘నైరుతి’
నంద్యాల(అర్బన్): నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందస్తుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా జూన్ ఒకటిన కేరళను తాకే ‘నైరుతి’ ఈ సారి ఈ నెల 26నే తాకాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున ఈనెల 29 నాటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఏటా జూన్ రెండో వారంలో రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసేవి. ఈసారి దాదాపు 10 రోజులు ముందుగానే వర్ష సూచన ఉండటంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నా రు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 6లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చే ఖరీఫ్ పంటలకు నైరుతి రుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. భారీ విస్తీర్ణంలో వరి, పత్తి, కంది, మొక్కజొన్నతో పాటు మరో 15 రకాల పంటలు సాగు చేస్తారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు ఎండ వేడిమితో ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడంతో కాస్త ఊరట చెందుతున్నారు. -
కట్టేశారు.. వదిలేశారు!
● భక్తులకు ఉపయోగపడని ప్రసాద్ స్కీం నిర్మాణాలు ● నిరుపయోగంగా యాంపీ థియేటర్ ● భక్తులను అలరించని సౌండ్స్ అండ్ లైట్ షో ● అలంకారప్రాయంగాశిఖరేశ్వరం వాచ్ టవర్ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టిన నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయి. కేంద్ర పర్యాటక శాఖ ‘పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్ డ్రైవ్’ ప్రసాద్ పథకం కింద శ్రీశైలక్షేత్రంలో రూ.43.08 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ భక్తులకు అందుబాటులోకి రాలేదు. 2017లో శ్రీశైలంలో ప్రసాద్ పథకం ద్వారా పనులు ప్రారంభించారు. కేంద్రం మంజూరు చేసిన పనులను రాష్ట్ర పర్యాటక శాఖ, శ్రీశైల దేవస్థాన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టారు. ముఖ్యంగా లైట్ అండ్ షోకు రూ.6కోట్లు, అదనపు ఎలక్ట్రానిక్ పరికరాలకు రూ.50 లక్షలు, ఆలయంలో ఇత్తడి క్యూలైన్ నిర్మాణానికి రూ.2.30 కోట్లు, ఆలయ విభాగంలో గోశాల వద్ద సాంస్కృతిక ప్రదర్శన శాల (యాంఫీథియేటర్) రూ.7.99 కోట్లతో మొత్తం ఆలయ విభాగంలో సుమారు రూ.17.43 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే రూ.4.38 కోట్లతో శిఖరేశ్వరం వద్ద పర్యాటక సౌకర్య కేంద్రం, వాచ్ టవర్, పుష్కరిణి అభివృద్ధి, శిఖరేశ్వరం విద్యుద్దీకరణ, పార్కింగ్, ఇత్తడి క్యూలైన్, ఇనుప క్యూలైన్ తదితర పనులు చేపట్టారు.రూ.75.06లక్షలతో హఠకేశ్వరం వద్ద పర్యాటక సౌకర్య కేంద్రం, రూ.35.24 లక్షలతో పంచమఠాల వద్ద విద్యుద్దీకరణ చేపట్టారు. ఆయా పనుల నిర్మాణాలు 2021లో పూర్త య్యాయి. భవనాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2022 డిసెంబరు 26న ప్రారంభోత్సవం జరిగింది. నంది సర్కిల్ వద్ద పర్యాటక సౌకర్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. కాగా ఆయా నిర్మాణాలు పూర్తయి భక్తులకు సేవలు అందించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ కొన్ని అందుబాటులోకి రాలేదు. లేజర్ షో.. కనిపిస్తే ఒట్టు శ్రీశైల ఆలయ చరిత్ర, ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, క్షేత్ర ప్రాశస్త్యం తదితర విషయాలను లేజర్ షో ద్వారా తెలుగు, ఇంగ్లీషు, కన్నడ భాషలలో భక్తులను అలరించేందుకు సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేశారు. అయితే సౌండ్ అండ్ లైట్ షో పారంభమైన కొన్ని రోజులు మాత్రమే ప్రదర్శించారు. ఆ తరువాత సుమారు ఏడాది నుంచి సౌండ్ అండ్ లైట్ షో పనిచేయడం లేదు. కేవలం సాంకేతిక సమస్య కారణంతో నిలిచిన లేజర్షోను ఏడాదిగా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉత్సవాలకే పరిమితం.. ఔటర్రింగ్రోడ్డు వద్ద, గోశాలకు ఎదురుగా రూ.7.99కోట్లతో యాంపీథియేటర్ (సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన శాల) నిర్మాణం చేపట్టా రు. ఆలయానికి అరకిలోమీటర్ దూరంలో ఉంది. ఓపెన్ ఆడిటోరియం తరహాలో ఎత్తయిన కాంక్రీట్ పిల్లర్లతో నిర్మాణం చేపట్టి, గ్రానైట్ బండలతో గ్యాలరీ ఏర్పాటు చేశారు. మధ్యలో కళాకారుల నృత్యప్రదర్శన వేదిక ఏర్పాటు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలోనే మాత్ర మే ఈ యాంపీథియేటర్ను వినియోగిస్తున్నారు. మిగిలిన రోజుల్లో వినియోగించడం లేదు. దీంతో రూ.7.99 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన యాంపీ థియేటర్ నిరుపయోగంగా మారాయి. -
అందుబాటులోకి తీసుకొస్తాం
సౌండ్ అండ్ లైట్ షోకు సంబంధించి సాంకేతిక సమస్య ఉంది, వెంటనే సమస్యను పరిష్కరించి పునరుద్ధరిస్తాం. శిఖరేశ్వరం, హఠకేశ్వరం వద్ద పర్యాటకుల సౌకర్య కేంద్రాల వినియోగం కోసం సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాం. త్వరలో కంప్యూటర్ సైతం ఏర్పాటు చేసి ఉద్యోగి లాగిన్ సౌకర్యం కల్పించి భక్తులు ఆయా సౌకర్యాలు వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తాం. యాంపీథియేటర్లో కళాప్రదర్శన తిలకించేందుకు ఆలయం నుంచి భక్తులు వెళ్లేందుకు దాతల సహకారంతో ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తాం. శిఖరేశ్వరం వద్ద రెండు బైనాక్యులర్స్ ఏర్పాటుకు టెండర్ పిలిచాం. వాటి సహాయంతో క్షేత్రాన్ని సందర్శించవచ్చు. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ● -
పోస్టల్ కొత్త ఖాతాలకు స్పెషల్ డ్రైవ్
కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో ‘ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు’ ద్వారా కొత్త ఖాతాలను తెరిచేందుకు ఈ నెల 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ కొత్త ఖాతాలకు ఆధార్ను అనుసంధానం చేయడంతో పాటు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.ఇందులో భాగంగా కొత్త ఐపీపీబీ బ్యాంకు ఖాతాలను తెరవడం, ఇప్పటికే ఉన్న ఐపీపీ బీ బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ చేయడం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్లను సులభతరం చేయడం ప్రాథమిక లక్ష్యమన్నారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న 15,365 ఖాతాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న 434 పోస్టాఫీసుల ద్వారా పునరుద్ధరణ జరుగుతుందన్నారు. మరింత సమాచారం కోసం లబ్ధిదారులు సమీపంలోని పోస్టాఫీసులను సంప్రదించాలన్నారు. -
వినియోగంలోకి రాని సౌకర్య కేంద్రాలు..
భక్తుల సౌకర్యార్థం ప్రసాద్ స్కీంలో శిఖరేశ్వరం వద్ద, హఠకేశ్వరం వద్ద పర్యాటకుల సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వమణకు రెండు, మూడు సార్లు టెండర్లు సైతం పిలిచినా ఎవరు ముందుకు రాలేదు. దీంతో రూ.కోట్లు పెట్టి నిర్మించిన సౌకర్య కేంద్రాలు భక్తులకు వినియోగంలోకి రాకపోగా నిరుపయోగంగా ఉన్నాయి. ఆయా భవనాలను వినియోగంలోకి తీసుకురాకపోతే శిథిలావస్థకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే శిఖరేశ్వరం వద్ద భక్తులు క్షేత్రాన్ని వీక్షించేందుకు వీలుగా వాచ్ టవర్ను ఏర్పాటు చేశారు. వాచ్ టవర్ నిర్మాణం కోసం రూ.60 లక్షలు వెచ్చించారు. ప్రస్తుతం వాచ్ టవర్ నిరుపయోగంగా ఉంది. -
న్యాయ సహాయం పొందండి
నంద్యాల(వ్యవసాయం): మానసిక వికలాంగుల సంక్షేమ కోసం న్యాయ సహాయం అందించేందుకు ఎల్ఎస్యూఎం కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. నంద్యాల శివారు ప్రాంతంలోని శాంతిరాం ఆసుపత్రిలోని మానసిక వికలాంగుల విభాగాన్ని మంగళవారం ఆయన లీగల్ సర్వీస్ యూనిట్ ఫర్ మావోనియా కమిటీ సభ్యులతో కలసి తనిఖీ చేశారు. అనంతరం వార్డులోని మానసిక వికలాంగులతో కలిసి మాట్లాడుతూ వారి ఆరోగ్యాల గురించి తెలుసుకుని, న్యాయపరమైన హక్కుల గురించి వారికి తెలియజేశారు. ఆయన వెంట న్యాయవాదులు శేషసాయి, జీవన్ కుమార్, శాంతిరాం హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ వసంత్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ పీఎస్ మూర్తి తదితరులు ఉన్నారు.రామాలయంలో ప్రతిష్టోత్సవాలకు ఏర్పాట్లుసాక్షి టాస్క్ఫోర్స్: ఎస్.చెన్నంపల్లెలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయ స్వామి ఆలయంలో యథావిధిగా ప్రతిష్టోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. కూటమి నాయకులు పోలీసుల ద్వారా ఉత్సవాలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే వైనంపై ‘ఆలయ ప్రతిష్టోత్సవాలకు రాజకీయ రంగు’ అనే శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో విశ్వహిందూపరిషత్, ఆర్ఎస్ఎస్ నాయకులతో పాటు పోలీసులు స్పందించారు. వీహెచ్పీ నాయకులు గ్రామంలోని ఇరువర్గాల నాయకులు, గ్రామస్తులతో వేర్వేరుగా ఆలయ ప్రతిష్టోత్సవాలపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రతిష్టోత్సవాల్లో అందరూ భాగస్వాములై ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించడంతో అంగీకరించారు. గ్రామంలోని ఇరువర్గాలతో పోలీస్ స్టేషన్కు చేరుకుని గ్రామంలో చర్చించిన అంశాలను పోలీసులకు వివరించారు. విగ్రహ ప్రతిష్టోత్సవాలకు అనుమతి ఇప్పించేలా చొరవ తీసుకున్నారు. దీంతో అనుకున్న ప్రకారమే ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరుగనున్నాయి.జెడ్పీ పరిధిలో బదిలీలకు 134 దరఖాస్తులుకర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలో బదిలీలకు అర్హులైన 134 మంది ఉద్యోగులు తమ దరఖాస్తులను అందజేసినట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపీడీఓ, పరిపాలన అధికారులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు, లైబ్రరీ, ల్యాబ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారన్నారు. వీరిలో ఐదేళ్లు ఒకే ప్రాంతంలో సర్వీస్ పూర్తి చేసుకున్న వారు 57 మంది ఉన్నారన్నారు. -
వినతుల పరిష్కారంపై శ్రద్ధ చూపండి
నంద్యాల(న్యూటౌన్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన వినతులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీఓపెన్ అయిన 48 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న 1,374 ఫిర్యాదులకు సంబంధించిన ఆడిట్ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సర్వే లలో భాగంగా మన మిత్ర క్యాంపెయిన్ కు సంబంధించి ఇంకా 12,724, సిటిజన్ ఈకేవైసీ 2,23,024, చిల్డ్రన్ వితౌట్ ఆధార్ 6,554, హౌసింగ్ ఇమేజ్ జియో కోఆర్డినేట్కు సంబంధించి 622 పెండింగులో ఉన్నా యని వాటిని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో 246 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రామునాయక్ ్ల తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
యోగాతో ఆరోగ్యకర జీవితం
శ్రీశైలంటెంపుల్: యోగా సాధన ద్వారా ఆరోగ్యకరమైన జీవితం, మానసిక ప్రశాంతత పొందవచ్చునని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం శ్రీశైలంలోని చంద్రవతి కల్యాణ మండపంలో యోగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. అనంతరం ఒంగోలుకు చెందిన ప్రముఖ శిక్షకులు, యోగాచార్య గంధవళ్ళ బాలసుబ్రహ్మ ణ్యం యోగాసనాలు వేయించారు. శారీరక అసనాలు, శ్వాసపై ధ్యాస, ధ్యానం, ప్రాణామాయం, ముద్రలు మొదలైనవన్నీ యోగాలో ప్రధాన క్రియలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, పలు విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.గోరుకల్లు మరమ్మతులకు టెండర్లుపాణ్యం: గోరుకల్లు జలాశయ కట్ట మరమ్మతులకు టెండర్లు ఆహ్వానించినట్లు ఈఈ సుభకుమార్ సోమవారం తెలిపారు. ఇటీవల కట్ట కుంగిపోవడంతో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపామని, ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. దీంతో సోమవారం టెండర్ నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. రూ. 2.50 కోట్లతో చేపట్టే మరమ్మతు పనులు టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 3.50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.శ్రీశైలంకు 7,279 క్యూసెక్కుల ఇన్ఫ్లోశ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలోకి 7,279 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరింది. సుకేసుల జలాశయం నుంచి, సెల్ఫ్ క్యాచ్మెంట్లో కురిసిన వర్షం కారణంగా ఆదివారం నుంచి సోమవారం వరకు ఇన్ఫ్లో వచ్చి చేరింది. డ్యాం పరిసర ప్రాంతాల్లో 46.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో స్వల్పంగా 0.088 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 196 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సోమవారం సాయంత్రానికి జలాశయంలో 39.9680 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 818.80 అడుగులకు చేరుకుంది.శ్రీశైలం కిటకిటశ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. సోమవారం వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకుని, ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. -
ఆలయ ప్రతిష్టోత్సవాలకు రాజకీయ రంగు
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను అడ్డుపెట్టుకొని చేస్తున్న అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. చివరకు ఆలయాలు, దేవుళ్లనూ వదిలిపెట్టని పరిస్థితి. కొలిమిగుండ్ల మండలం ఎస్.చెన్నంపల్లెలో ఆలయ ప్రతిష్టోత్సవా లు జరగకుండా పోలీసులను అడ్డుపెట్టుకొని అనుమతివ్వకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయనే దురుద్దేశంతో ఈ నీచానికి దిగజారారు. రెండు రోజుల్లో ప్రతిష్టా కార్యక్రమాలు జరగాల్సి ఉండగా ఆగిపోవడంతో గ్రామస్తులతో పాటు భక్తులు కూటమి నాయకుల తీరుపై మండిపడుతున్నారు. ఆలయం నిర్మాణం పూర్తి కావడంతో నెల రోజుల ముందుగానే ప్రతిష్టకు సంబంధించి వేదపండితులతో చర్చించి సాంప్రదాయ బద్ధంగా ఆలయాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ముందు నుంచి వైఎస్సార్సీపీ గ్రామ నాయకులే ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. పార్టీలకతీతంగా గ్రామస్తులందరూ కలసికట్టుగా చేసుకోవాలని ఉద్దేశంతో వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ నాయకుల ఇంటింటికి వెళ్లి ప్రతిష్టా కార్యక్రమానికి ఆహ్వానించారు. దైవ కార్యక్రమం అనే ఆలోచన లేకుండా అధికారం మాది, మా కనుసన్నల్లో ప్రతిష్ట జరగాలనే దుర్బుద్ధితో పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిష్ట చేయకుండా అడ్డుకోవడం విమర్శలకు తావిస్తోంది. కాటసాని హాజరు కాకూడదని.. ఆలయ ప్రతిష్ట ఉత్సవాలకు సంబంధించి నిర్వాహకులు, వైఎస్సార్సీపీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేదపండితులు మొదలుకొని షామియానాలు, అన్నదానం కోసం సర్వం సిద్ధం చేసి అడ్వాన్సులు కూడా చెల్లించారు. ఊర్లో మొదటి సారిగా కొత్త గుడి ప్రారంభం కానుండటంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇళ్లకు రంగులు వేసుకొని ముస్తాబు చేసుకొని బంధువులను ఆహ్వానించారు. కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో వేడుకలకు నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. ఆలయ ప్రారంభానికి అనుమతి ఇవ్వకుండా పోలీసులు వారం రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారు. దాతలు ఇచ్చిన విరాళాల పుస్తకాన్ని పరిశీలించి ఎక్కువ భాగం వైఎస్సార్సీపీ నాయకులే ఉన్నారు.. టీడీపీ నాయకులతో ఎందుకు విరాళాలు ఇప్పించుకోలేదని ప్రశ్నించారు. ఆల యం ప్రారంభం కావాలంటే కొన్ని కండీషన్లు విధించారు. అందులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాట సాని రామిరెడ్డి ముఖ్యంగా ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాకూడదనే మెలిక పెట్టారు. గ్రామంలోని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతిష్టకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో చేసేదిలేక ఆలయ ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. దేవుడి దగ్గర నీచ రాజకీయాలకు పాల్పడిన కూటమి నాయకులతో పాటు వారి చెప్పుచేతల్లో మెలుగుతున్న పోలీసుల వ్యవహారశైలిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిదేళ్లకు ఆలయం పూర్తి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న చిన్న చెన్నకేశవస్వామి ఆలయం తప్ప మరో ఆలయం లేదు. ఆ ఆలయంలో కూడా పెద్దగా పూజలు జరిగేవి కావు. ఊర్లో మంచి ఆలయాన్ని నిర్మించుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు భావించారు. 2017లో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సీతారామాలయం నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. పెరిగిన ఖర్చులతో ఆ నిధులు సరిపడకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఆలయం మొదలు పెట్టి తొమ్మిదేళ్లు అవుతుందని భావించి త్వరగా పూర్తి చేయాలనుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు ఇతర గ్రామాలకు చెందిన పార్టీ నాయకులతో ఎక్కువ భాగం విరాళాలు సేకరించారు. వాటి ద్వారా త్వరగా పనులు పూర్తి చేశారు. ఎస్.చెన్నంపల్లెలో రామాలయ నిర్మాణం ఈనెల 29నుంచి 31 వరకు ప్రతిష్టా కార్యక్రమాలు వారం రోజులుగా అనుమతివ్వని పోలీసులు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టాలని హుకుం మాజీ ఎమ్మెల్యే హాజరు కాకూడదని మెలిక -
కోటీశ్వరుడి కోడలికి జాబ్కార్డు
● ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుపై టీడీపీ నేత కన్ను ● సొంతూల్లో పని చేసేందుకు మొమమాటం ● పక్క ఊరిలో పని చేసినట్లు ఫొటోకు ఫోజు ● సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఫొటో ● చర్చనీయాంశంగా మారిన అధికారుల తీరుసాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ నేతల బరితెగింపునకు మరో నిదర్శనం ఇది. ఓ నాయకుడు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోడలికి ఇప్పించేందుకు చేస్తున్న లీలలు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గోస్పాడు మండలం దీబగుంట్లలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ గత కొంత కాలంగా ఖాళీగా ఉంది. అయితే ఇసుకపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వర్రెడ్డి తన కోడలికి ఈ పోస్ట్ ఇప్పించుకోవాలనుకున్నాడు. ఇదే తడవుగా దండె కావ్య ప్రవల్లిక పేరు మీద పది రోజుల క్రితం అధికారుల సహకారంతో జాబ్కార్డు పుట్టించాడు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కు అర్హత సంపాదించాలంటే జాబ్ కార్డు ఉన్న వ్యక్తి 25 రోజులు కూలీలతో పాటు పనిచేసి ఉండాలి. టీడీపీ నాయకుడు ఈశ్వరరెడ్డి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావటంతో దీబగుంట్లలో అప్పటికే 700 మందికి పైగా కూలీలు ఉన్న ప్రాంతానికి తన కోడలిని పనికి పంపలేకపోయాడు. ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలనే తపనతో సమీపంలోని పసురపాడు గ్రామంలో కావ్య ప్రవల్లిక పనిచేస్తున్నట్లు ఫొటో తీసుకున్నారు. అక్కడి అధికారులు ఆమెను నిలబెట్టి పనిచేస్తున్నట్లు కాకుండా తానొక్కటి పనిని పరిశీలిస్తున్నట్లు ఫొటోలు దింపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు మండలంలో వైరల్ కావడంతో అక్కడి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. కోటీశ్వరుల కుటుంబ సభ్యులకు జాబ్ కార్డు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. -
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
బొమ్మలసత్రం: కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బదులుగా మద్యాన్ని డోర్డెలివరీ చేస్తుండటంతో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని కూటమి నేతలు మద్యపాన రాష్ట్రంగా మార్చడంతో నేరాల సంఖ్య పెరిగి పోతుందన్నారు. మద్యం మత్తులో కామాంధులు బరితెగిస్తున్నారన్నారు. సోమవారం స్థానిక ఉదయానంద హోటల్లో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్యెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాట సాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాఽథ్రెడ్డి, నందికొట్కూరు ఇన్చార్జ్ దారా సుధీర్కుమార్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు ఒంటరిగా తిరగలేని పరిస్థితిని కూటమి నేతలు తీసుకొచ్చారన్నారు. చాగలమర్రికి చెందిన నాలుగేళ్ల చిన్నారి గుడికి వెళితే మద్యం మత్తులో ఉన్న కామాంధుడు అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో చిన్నారులు గుడికి, బడికి వెళ్లినా ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ఏరులై పారుతుండటం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను అరికట్టాలని చిన్నారి తల్లి ఆవేదన చెందటమే ఇందుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని ఎన్నికల ముందు కూటమి నేతలు గగ్గోలు పెట్టారని తీరా అధికారంలోకి వచ్చాక మహిళల ప్రాణాలకు సైతం రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఊరూరా మద్యం దుకాణాలు, బెల్టు దుకాణాలు 24 గంటలు కొనసాగుతున్నాయన్నారు. తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమ్మకంతో నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలుగా నియమించటం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి నేతల దాకా అందరినీ సమన్వయ పరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కార్యకర్తలకు ధైర్యం నింపుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తామన్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి -
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులను ఉంచి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.కొండ నిండా భక్తులుశ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. పలువురు భక్తులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రత్యేక సమయాల్లో స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికనంద్యాల(న్యూటౌన్): స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు తమ అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు.పచ్చ నేతల నల్ల మట్టి వ్యాపారం!పగిడ్యాల: టీడీపీ నాయకులు నల్లమట్టి వ్యాపారానికి తెరశారు. ఈనెల 14న పాతూరు తిప్ప నుంచి గ్రావెల్ బింగను అక్రమంగా తరలిస్తున్న వైనాన్ని ‘పాతూరు తిప్ప కరిగిపోతోంది’ అనే శీర్షికన సాక్షి దినపత్రిక కథనాన్ని ప్రచురిచింది. ఈ కథనంపై తహసీల్దార్ శివరాముడు స్పందించారు. అనుమతి లేకుండా గ్రావెల్, నల్లమట్టి తరలించరాదని ఆదేశాలు ఇచ్చారు. భూగర్భ శాఖ(మైనింగ్) అధికారులకు అర్జీ పెట్టుకోవాలని చెప్పారు. అయితే తహసీల్దార్ ఆదేశాలను పట్టించుకోకుండా టీడీపీ నాయకుడైన ఎంపీటీసీ సభ్యుడి కనుసన్నల్లో నల్లమట్టి వ్యాపారం సాగుతోంది. కృష్ణానది నీటి మునక భూముల్లో లభ్యమయ్యే నల్లమట్టిని చాలా లోతుకు తవ్వి ఒక ట్రిప్పును అవసరమైన రైతుల పొలాలకు రూ. 1,100ల ప్రకారం అమ్ముతున్నారు.శ్రీశైలంలో 39.5 టీఎంసీలుశ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో ఆదివారం సాయంత్రానికి 39.4936 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 818.20 అడుగులకు చేరుకుంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఎగువ సుంకేసుల ప్రాజెక్ట్, లోకల్ క్యాచ్మెంట్ నుంచి 8,942 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. జలాశయం నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పాదన అనంతరం 7,259 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడిచి పెట్టారు. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 3.366 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 2 మీమీ వర్షం కురిసింది. -
కరోనాలో ప్రాణాలకు సైతం తెగించి..
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు సైతం తెగించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటింటికీ రేషన్ డెలివరీ చేశారు. కరోనాకు భయపడి ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాలేని పరిస్థితుల్లో రేషన్ బండ్లు ఇంటి ముంగిటకు చేర్చి నిత్యావసరులు అందజేశారు. అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా కృష్ణా జిల్లాలో వచ్చిన వరద బాధితులకు వరద నిధికి తమ జీతంలో 10 శాతం మొత్తం విరాళంగా ప్రకటించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా 100 ఎండీయూ వాహనాల ద్వారా ఆహార పంపిణీ చేయించారు. అంగన్వాడీ, ఐసీడీఎస్లకు బియ్యం సరఫరా కార్యక్రమం కూడా వీళ్లే అదనంగా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మూడేళ్ల బకాయిలు ఇంత వరకు రాకపోవడం విచారకరం. -
రైతుకు లంచాల ‘షాక్’
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని కోరిన రైతుల నుంచి కొందరు విద్యుత్ శాఖ అధికారులు మామూళ్లు వసూళ్లు చేస్తున్నారు. ఇటీవల నంద్యాల జిల్లాలో ఒక రైతుకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కోసం రైతులు మీసేవ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో ముమ్మరంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 11,500 మంది వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా విద్యుత్ అధికారులు వెళ్లి బోరు పాయింట్ నుంచి విద్యుత్ పోల్ ఉన్న ప్రాంతం వరకు ఎన్ని పోల్స్ పడుతాయో తెలుసుకోవాలి. అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని పడుతాయో అంచనా వేయాలి. ఇందుకోసం రైతులు వేలాది రూపాయల ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోంది. అలాగే ఎస్టిమేట్లు వేయడానికి విద్యుత్ అధికారులు వెళ్లడానికి రైతులు ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయాల్సి దుస్థితి నెలకొంది. ఎస్టిమేట్లు తయారు చేసిన తర్వాత డిమాండ్ నోటీసు ఇస్తే దాని ప్రకారం రైతు వాటా మొత్తాన్ని డీడీ చెల్లించాల్సి ఉంది. అయితే మండలస్థాయిలోనే మంజూరు అయితే ఒక రేటు, సబ్ డివిజన్ స్థాయిలో మంజూరు అయితే ఇంకో రేటు, డివిజన్ స్థాయిలో మంజూరు అయితే మరో రేటు ఉంటుంది. వెరసి ముడుపుల భారం రైతులపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఉంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెటీరియల్ ఇవ్వాలన్నా ముడుపులే! రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా స్పందించరు. ‘‘ మీకు ఇంకా మెటీరియల్ రాలేదు.. రావడానికి మరో నెల రోజులు ఆలస్యం కావచ్చు.. కాకపోతే ఖర్చు అవుతుంది’’ అని బేరం పెట్టడం గమానార్హం. నిబంధనల ప్రకారం మెటీరియల్ను డిపార్టుమెంటు వాహనాల్లోనే తరలించాల్సి ఉంది. అయితే వాహనాలు రిపేరీలో ఉన్నాయని, డ్రైవర్ లేడని రవాణా భారాన్ని రైతులపైనే వేస్తున్నారు. అధికారులు మాత్రం డిపార్టుమెంటు వాహనాలతో ట్రాన్స్పోర్టు చేశామని రికార్డు చేసుకొని డీజిల్ కాజేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చుక్కలు చూడాల్సిందే! ఎస్టిమేట్లు వేయించుకోవడం ఒక ఎత్తు అయితే లైన్ వేయించుకోవడం మరో ఎత్తుగా మారింది. డిమాండ్ నోటీసుకు అనుగుణంగా రైతులు తమ వాటా మొత్తాన్ని చెల్లించిన తర్వాత పోల్స్ సరఫరా చేస్తారు. పోల్స్ ఇవ్వాలంటే ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. పోల్స్ సంఖ్యను బట్టి ముడుపుల రేటు పెట్టినట్లు సమాచారం. పోల్స్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్, కేబుల్, కండక్టర్ విద్యుత్ శాఖ స్టోర్ నుంచి డ్రా చేస్తారు. అయితే రైతుకు ఇవ్వరు. మళ్లీ ముడుపులు ముడితేనే పోల్స్ పాతి, లైన్ వేస్తారు. విద్యుత్ లైన్ నుంచి బోరు పాయింటు దగ్గరకు లైన్ వేయడానికి 180 మీటర్ల వరకు ప్రభుత్వం భరిస్తుంది. 11 కేవీ లైన్ వేస్తే 180 మీటర్లకు దాదాపు రూ.60 వేలు, ఎల్టీ(లోటెన్షన్) లైన్ వేస్తే రూ.45 వేలు వరకు ఖర్చు వస్తుంది. అవసరాన్ని బట్టి 11 కేవీ లేదా ఎల్టీ లైన్ వేస్తారు. 180 మీటర్లు దాటితే ఆ ఖర్చు రైతు భరించాల్సి ఉంది. లైన్ దూరాన్ని, ఎస్టిమేట్ మొత్తాన్ని బట్టి ముడుపుల రేటు ఉంటుంది. లైన్ వేయాలంటే కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. ముడుపులు ఇస్తేనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకూ మామూళ్లు ఇవ్వాల్సిందే ఇటీవల ఏసీబీకి పట్టుబడిన విద్యుత్ శాఖ అధికారి -
సీమ ప్రాజెక్ట్లపై నిర్లక్ష్యం వీడాలి
నంద్యాల(అర్బన్): పాలకులు రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్లపై నిర్లక్ష్యం వీడాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవం సందర్భంగా సంగమేశ్వరం వద్ద ఈనెల 31న నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం నంద్యాల రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక విక్టోరియా రీడింగ్ రూంలో రైతుల సంఘీభావ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో నిర్మించిన ప్రాజెక్టులు ఒక్కొక్కటి నిర్వీర్యమవుతున్నాయన్నారు. శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ దెబ్బతినడం, అలగనూరు రిజర్వాయర్ కుంగిపోవడం, అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు కొట్టుకు పోవడం, గోరుకల్లు రిజర్వాయర్ కట్ట దెబ్బతినడం, తుంగభద్ర డ్యాంకు భద్రత లేకపోవడం, గాలేరినగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు ఇంకా కొనసాగుతున్నా పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. సంగమేశ్వరంలో నిర్వహించే బహిరంగ సభలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల ని కోరారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించిన వాల్పోస్టర్లను రైతు సంఘం నాయకులతో కలిసి విడుదల చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు యూనస్, కార్యదర్శి నాగకుమార్, కొమ్మ శ్రీహరి, దండె సుధాకర్, నాగన్న, కరీంబాషా, మహబూబ్బాషా, శ్రీరాములు, అసదుల్లా, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయపోరాటానికి సిద్ధం
అగ్రిమెంట్ కాలం ఉండగానే మమ్మల్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయం. మా వాహనాలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాలో పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి ఎన్ఓసీ ఇప్పించాలి. మాకు న్యాయం చేయకుండా జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం సరఫరా చేస్తే ప్రభుత్వంతో న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం. – ఖాజా శ్రీనివాసులు, ఎండీయూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నంద్యాల ఉపాధి కోల్పోయాం వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషించుకునే వీలుండేది. గత నాలుగేళ్లుగా ఎండీయూ వాహనంపై ఆధారపడి జీవిస్తున్నాను. ఒక్కసారిగా ఎండీయూ వాహనాలను తొలగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం అన్యాయం. ఉపాధి కోల్పోతున్న ఆపరేటర్లకు న్యాయం చేయకపోతే ఆందోళనలకు సిద్ధమవుతాం. – రమణ, ఎండీయూ ఆపరేటర్, నంద్యాల -
కార్మికుల వినూత్న నిరసన
కోడుమూరు రూరల్: గూడూరులో నగర పంచాయతీ కార్మికులు మెడకు ఉరిగి తగిలించుకుని వినూత్న రీతిలో శనివారం ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారంలో భాగంగా వారం రోజుల నుంచి గూడూరు నగర పంచాయతీ కార్మికులు విధులను బహిష్కరించి దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఆరవింద్, మధు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. చాలీచాలని జీతాలతో ఏళ్ల తరబడి దుర్భర జీవితాలు అనుభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి 15 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు, నెలనెలా జీతాలు సక్రమంగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కార్మికులు అల్లిబాషా, డూకేశ్వరరావు, షబ్బీర్బాషా, ఆంజనేయులు, బసవరాజు, జయన్న, ఖాజాహుసేన్, ప్రభాకర్, ఉసేన్ పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్య కోవెలకుంట్ల: స్థానిక ఎల్ఎం కాంపౌండ్కు చెందిన యువకుడు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన వివరాలు.. ఎల్ఎం కాంపౌండ్కు చెందిన రమేష్(36) కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పిల్లలకు కొత్త దుస్తులు తీసుకొచ్చే విషయంలో శుక్రవారం రాత్రి భార్య, భర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనికి తోడు కొంతకాలం నుంచి రమేష్ క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారి సాయంతో తలుపు బద్ధలు కొట్టి ఫ్యాన్కు వేలాడుతున్న రమేష్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుని భార్య సుధారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి గోనెగండ్ల: మండల పరిధిలోని చిన్న మరివీడు గ్రామానికి చెందిన ఎం.రవి(32) విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సీఐ విజయ భాస్కర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రవికు భార్య రోజా ఉంది. వీరు గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రవి ఇటీవల కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. గురువారం కొత్త ఇంటికి స్లాబ్ వేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆ ఇంట్లో కరెంట్ పడడం లేదని రవి పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య రోజా ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టి గృహప్రవేశం చేయకుండానే రవి మృతిచెందడంతో భార్య, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
తోడుకున్నోడికి తోడుకున్నంత!
కూటమి నేతల ఆశీస్సులు ఉంటే చాలు.. అనుమతులతో పనిలేదు. చలానాలు అసలే అక్కర్లేదు. తోడుకున్నోడికి తోడుకున్నంత. ఇదీ కౌతాళం మండలం గుడికంబాళి గ్రామ సమీపంలో ప్రభుత్వ ఇసుక రీచ్లోని దుస్థితి. ఇటీవల నదికి వరద నీరు రావడంతో అక్కడ అధికారికంగా ఇసుక రవాణాకు అనుమతులిచ్చారు. ఇదే అదునుగా చేసుకున్న కూటమి అనుకూల ట్రాక్టర్ల యజమానులు నదిలో వాలిపోయారు. తోడేళ్లుగా మారి ఇసుకనంతా తరలిస్తున్నారు. తమ ఆదాయ వనరుగా మార్చుకుని రీచ్లో అడ్డంకులకు తావు లేకుండా ఇసుకను దాటిస్తున్నారు. శనివారం గుడికంబాళి రీచ్ నుంచి వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా ఏ ఒక్క అధికారి అటు వైపు తొంగి చూడలేదు. – మంత్రాలయం -
విజిలెన్స్ అధికారుల సోదాలు
ఆదోని అర్బన్: విజిలెన్స్ అధికారులు శనివారం పట్టణంలో సోదాలు నిర్వహించారు. రైతు బజారులోని మూడు కిరాణాషాపుల్లో ఎటువంటి లైసెన్సులు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి రాజారఘువీర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫుడ్ సప్లై చేస్తున్న వారిపై కేసు నమోదు చేశామన్నారు. అంతకుముందు వ్యవసాయ మార్కెట్యార్డులో వేరుశనగకాయల దిగుబడులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. తూకాల్లో ఏవైనా మోసాలు జరుగుతున్నాయా, పట్టీలు ఎక్కువ తక్కువ వేస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వంటశాలను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంలో వంట చేయడం, కోడిగుడ్ల సైజు చిన్నగా ఉండటంతో కేసు నమోదు చేశారు. రైతు బజారులోని లైసెన్స్ లేని మూడు కిరాణాషాపులపై కేసు నమోదు చేశారు. పెట్రోల్ బంకును తనిఖీ చేసి, టాయిలెట్లు సరిగాలేవని, వాహనాలకు ఉచితంగా గాలి పట్టే సౌకర్యం ఏర్పాటు లేదని గుర్తించారు. అనంతరం వాటర్ ప్లాంటును పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి లీటర్ బాటిళ్లు బిల్లులు లేకుండా సరఫరా అవుతుండటం, వాటర్ ప్యాకెట్లపై సీల్ లేకుండా ఉండడంపై ఆరా తీశారు. అనంతరం జిల్లా సివిల్ సప్లై అధికారి రాజారఘువీర్ మాట్లాడుతూ కర్నూలు, ఆదోనిలో తనిఖీలు నిర్వహించామన్నారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. తనిఖీల్లో ఫుడ్సేఫ్టీ అధికారి రాజగోపాల్, అసిస్టెంట్ మార్కెట్యార్డు డైరెక్టర్ నారాయణమూర్తి, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ సత్యవతి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీరాములు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సందీప్, కన్జూమర్ ప్రొటెక్షన్ సెక్రటరీ శివమోహన్రెడ్డి పాల్గొన్నారు. ● ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఫుడ్ సప్లై సిబ్బందిపై కేసు నమోదు -
కోలుకోలేక ఉపాధి కూలీ మృతి
కృష్ణగిరి: మండలంలోని అమకతాడు గ్రామానికి చెందిన ఉపాధి కూలీ మానుకింది అనసూయమ్మ (42) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతి చెందింది. ఈసీ మధు తెలిపి న వివరాలు.. శుక్రవారం గ్రామ సమీపంలో కాలువ వద్ద జరుగుతున్న ఉపాధి పనులకు హాజరైన అనసూయమ్మ పనిచేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటా హుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా అదే రోజు రాత్రి ఫిట్స్ రావడంతో కోలుకోలేక మృతి చెందినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త రామాంజనేయులు, కు మారుడు, కుమార్తె ఉన్నా రు. మృతురాలికి ప్రభు త్వం ద్వారా వచ్చే సహా య సహకారాలకు సిఫా రసు చేసినట్లు ఈసీ తెలిపారు. -
రేపు అనంతపురంలో వ్యవసాయ అధికారుల బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో మండల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరిటెండెంట్లు, పరిపాలన అధికారుల బదిలీల ప్రక్రియ జోనల్ స్థాయిలో సోమవారం అనంతపురంలో జరుగనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మండల వ్యవసాయ అధికారుల్లో ఒకే స్టేషన్లో ఐదేళ్లు పైబడి పని చేస్తున్న వారు 32 మంది ఉన్నారు. ఏడీఏల్లో ఒకరు లాంగ్ లీవ్లో ఉన్నారు. ఒకే స్టేషన్లో ఐదేళ్లు పైబడి పని చేస్తున్నవారు ఆరుగురు ఉన్నారు. వీరందరు బదిలీ కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం రిక్వెస్ట్పై జీరో సర్వీస్ ఉన్న వారు కూడా బదిలీకి అర్హులేనని ప్రకటించడంతో వ్యవసాయ శాఖలో బదిలీల జాతర నెలకొంది. జిల్లాలో కల్లూరు, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలకు గతంలో ఎపుడూ లేని పెద్ద ఎత్తున పైరవీలు నడుస్తున్నాయి. ఇప్పటికే కూటమి పార్టీల నేతలను ముడుపులతో ప్రసన్నం చేసుకుని లైన్ క్లియర్ చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిఫార్స్ లేఖలతో దరఖాస్తులు చేసుకున్నారు. లేఖలతో పాటు ఫోన్లు కూడా చేయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం బదిలీలకు శ్రీకారం చుట్టనున్నారు. రాయలసీమ జిల్లాల్లో అనంతపురం డీఏఓ సీనియర్ కావడంతో అక్కడ అడిషినల్ డైరెక్టర్ కృపానందం ఆధ్వర్యంలో బదిలీలు చేపట్టనున్నారు. -
ఆర్ఎంపీలు స్కానింగ్కు రెఫర్ చేయొద్దు
కర్నూలు(హాస్పిటల్): గర్భిణిలకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలని ఆర్ఎంపీలు రెఫర్ చేయవద్దని డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భిణిలలో పిండం పెరుగుదల, జన్యుపరమైన వ్యాధులు, అంగవైకల్యం తదితర వాటిని గుర్తించేందుకు అర్హత కలిగిన వైద్యులు మాత్రమే అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం రెఫర్ చేయవచ్చన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎంపీలు గర్భిణిలను స్కానింగ్ కోసం రెఫర్ చేయరాదని హెచ్చరించారు. ఆర్డబ్ల్యూఎస్లో బదిలీల ప్రక్రియ కర్నూలు (అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో జోన్ ఫోర్ పరిధిలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ల బదిలీలను శనివారం చేపట్టారు. ఆర్డబ్ల్యూఎస్ సీఈ హరేరామ్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బదిలీల ప్రక్రియకు ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన పర్యవేక్షణ ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బి.నాగేశ్వరరావు మాట్లాడుతూ బదిలీలకు అర్హులైన జోన్ ఫోర్ పరిధిలో 8 మంది డీఈఈలు, 34 మంది సెక్షన్ ఆఫీసర్లకు బదిలీల ప్రతిపాదనలను ఈఎన్సీ కార్యాలయానికి పంపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తయిన వారు బదిలీ కానున్నారని తెలిపారు. -
వైద్యసేవలకు ఆన్లైన్ శోధన
● మందులు తెలుసుకొని సొంత వైద్యం ● వైద్యుల వద్దకు వెళ్లినా రాసిచ్చిన మందులపై అనుమానం ● మంచివో.. కాదోనని ఇంటర్నెట్లో తెలుసుకునే ప్రయత్నం ● సోషల్ మీడియా కథనాలను అనుసరిస్తున్న వైనం ● తెలిసీ తెలియని వైద్యంతో అవస్థలు కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3వేల దాకా రిటైల్ మెడికల్ షాపులు, ఏజెన్సీలు ఉన్నాయి. దీంతో పాటు 12వేల దాకా ఎంబీబీఎస్, స్పెషాలిటీ, సూపర్స్పెషాలిటీ కోర్సులు అభ్యసించిన వైద్యులూ ఉన్నారు. వీరితో పాటు వైద్యవిద్యను అభ్యసిస్తున్న వారు మరో 3వేల మంది దాకా ఉంటారు. ఇక ఫార్మాసిస్టులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆర్ఎంపీలు మరో 15వేల దాకా ఉంటారు. వీరందరూ అల్లోపతి వైద్యంపై ఆధారపడి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చిన ప్రజలు వీరిలో ఎవరో ఒకరిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఇంటర్నెట్ సదుపాయం అందరికీ అందుబాటులోకి రావడం, విద్యావంతులు పెరగడం, ముఖ్యంగా సాఫ్ట్వేర్, ఇంటర్నెట్పై యువతకు పట్టురావడం వంటి విషయాల కారణంగా ఆన్లైన్లో తమకు వచ్చిన ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని వెతకడం అధికమైంది. క్షణాల్లో వచ్చే సమాచారం ఆధారంగా తమకు ఈ కారణంగానే ఆరోగ్య సమస్య వచ్చిందని భావించి మెడికల్ షాపులకు వెళ్లి మందులు తీసుకుని వాడే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. భౌతికంగాపరీక్షిస్తేనే.. మంచి పేరున్న వైద్యుని వద్దకు వందల కిలోమీటర్లు ప్రయాణించి రోగులు చికిత్స కోసం వెళ్తుంటారు. అలా వెళ్లిన వారు అవసరమైతే గంటల తరబడి క్యూలో ఉండి చికిత్స తీసుకుని వెళ్తుంటారు. ఫలానా డాక్టర్ చేయి తగిలితేనే(హస్తవాసి) సగం రోగం నయం అవుతుందన్న నమ్మకంతో ఉన్న వారూ ఉన్నారు. ఈ నమ్మకంతోనే ఇప్పటికీ చాలా మంది వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నమ్ముకున్న వైద్యుల వద్దే చికిత్స తీసుకుంటారు. సదరు డాక్టర్ భౌతికంగా రోగిని పరిశీలించడమే గాక వారి యోగక్షేమాలు అడగడం, నవ్వుతూ మాట్లాడటం, ఏమీ కాదులే అని ధైర్యం చెప్పడంతో వారికి సగం రోగం నయమవుతుంది. కొందరు సీనియర్ వైద్యులు ఇప్పటికీ రోగిని భౌతికంగా ముట్టుకుని చేతులు, కాళ్లు కదిపి, పొట్టను ఒత్తి చూసి, నాడి పట్టుకుని పరీక్షించి వైద్యం చేస్తుంటారు. ఇలాంటివన్నీ ఆన్లైన్లో లభించవని పెద్దలు చెబుతుంటారు. ఎంతగా ఆన్లైన్ సేవలు అభివృద్ధిలోకి వచ్చినా మనిషిని చూసి వైద్యం ఇచ్చి ధైర్యం చెబితేనే తగ్గుతుందని వారు భావిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో చోటు
బొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో నంద్యాల జిల్లాకు చెందిన ఆరుగురికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానం కల్పించారు. డోన్ నియోజకవర్గానికి చెందిన బోరా మల్లికార్జున రెడ్డికి స్టేట్ బూత్ కమిటీ వింగ్ సెక్రటరీగా, గుండ జయచంద్రకు స్టేట్ ఇంటలెక్చవల్స్ ఫోరమ్ జాయింట్ సెక్రటరీగా, మేకల బాలయ్యకు స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన పీ కిషోర్కుమార్ గౌడ్ను స్టేట్ బూత్ కమిటీస్ వింగ్ సెక్రటరీగా, కునుకుంట్ల రమణను స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా నియమించారు. అలాగే పాణ్యం నియోజకవర్గానికి చెందిన జెట్టి ప్రభుదాస్ను స్టేట్ దివ్యాంగుల విభాగం జనరల్ సెక్రటరీగా నియమించారు. -
ప్రతి కుటుంబం మరుగుదొడ్డిని ఉపయోగించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి గోస్పాడు: జిల్లాలో ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్లో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు, పారిశుద్ధ్యంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై సర్వే చేయించి వాటి వినియోగానికి చర్యలు తీసుకునేలా ఈఓఆర్డీలు, ఎంపీడీఓలకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో ట్యాంకుల పరిశుభ్రత, క్లోరినేట్ చేసిన తాగునీటి సరఫరా, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలపై సమీక్షించి ఎప్పటికప్పుడు పీఆర్వన్ యాప్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారాలను తొలగించడంతోపాటు గ్రామాల్లో ఉన్న చెత్తకుప్పలను పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆవరణలో కమ్యూని టీ ఇంకుడు గుంతలతో పాటు కమ్యూనిటీ శాని టరీ కాంప్లెక్స్ల వివరాలు సేకరించడంతో పాటు వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెల మూడో శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి పరిశుభ్రత కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి డీపీఓ శివారెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 16 మంది డిబార్ కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన సెమిస్టర్ పరీక్షలకు 1,181 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 10,775 మందికి 9,616 మంది హాజరు కాగా 1,159 మంది గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 6వ సెమిస్టర్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు 207 మందికి 185 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. చూచిరాతలకు పాల్పడిన 16 మంది విద్యార్థులను గుర్తించి డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మంది ఇప్పుడు ఆన్లైన్లో వైద్యం గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఏఐ, చాట్ జీపీటీ లాంటి సైట్లలో ఏ విషయం అడిగినా ఒక్క క్షణంలోనే సమాచారం వస్తోంది. వాటినే నమ్మి వైద్యులను అనుమానించే వారూ ఎక్కువయ్యారు. ఫలానా వైద్యుడు తమను మోసం
● కర్నూలుకు చెందిన రాజ్కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో ఎగ్జిక్యూటివ్. రోజూ వందల కిలోమీటర్లు తిరగడంతో అతనికి ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుంటుంది. దీంతో తరచూ డాక్టర్ వద్దకు వెళ్లడం దేనికని ఆన్లైన్లో తనకు వచ్చిన ఆరోగ్య సమస్యకు పరిష్కారాన్ని వెతికి మెడికల్ షాపులో మందులు కొని వాడుతున్నాడు. ఓ రోజు మందు లు వికటించి ఆసుపత్రికి వెళితే ఎలా పడితే అలా మందులు వాడకూడదని వైద్యులు చికిత్స చేసి పంపించారు. ● కర్నూలుకు చెందిన ఓ బి.ఫార్మసి విద్యార్థిని తనకు ఇటీవల ఛాతీలో నొప్పి ఉంటే ఆన్లైన్లో టైప్ చేసి చూసుకుంటే హార్ట్ ఎటాక్ అని చూపించింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కలిసింది. పరీక్షించిన వైద్యులు వచ్చింది హార్ట్ ఎటాక్ కాదని, కండరాల నొప్పిగా నిర్ధారించారు. ● నంద్యాలకు చెందిన రామాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని పనిచేయాల్సిందే. ఇంటర్నెట్పై మంచి పట్టు ఉంది. దీంతో తనతో పాటు ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలువచ్చినా ఆన్లైన్లో వెతికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఆయన తల్లికి ఒకసారి మందులు వికటించి ఇబ్బంది రావడంతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. ఆన్లైన్ పరిష్కారం ప్రతిసారీ మంచిది కాదని వైద్యులు హితవు పలికారు. ఇవీ నష్టాలు.. ఆరోగ్య సమస్య కొంతైతే ఆన్లైన్లో వివరాలు కొండంత ఉంటాయి. దానిని చూసి రోగి మరింత ఆందోళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా మరింత కృంగిపోతాడు. ఆందోళనకు గురైతే శారీరకంగా మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఆన్లైన్లో తమ ఆరోగ్య సమస్యలు వెతికి ముందుగానే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని డాక్టర్ వద్దకు వెళ్తున్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఒక్కో వ్యక్తికీ ఒక్కో శరరీతత్వం ఉంటుంది. వారి జన్యువులు, వారి ఆరోగ్యాన్ని బట్టి రోగ లక్షణాలు ఉంటాయి. అందరినీ ఒకే విధంగా చూడలే మని వైద్యులు చెబుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన చికిత్స ఉంటుందని, ఆన్లైన్ వైద్యాన్ని గుడ్డిగా నమ్మొద్దని సూచిస్తున్నారు. -
భవనం.. భద్రమేనా?
● శ్రీశైల క్షేత్రంలో కొనసాగుతున్న భవన నిర్మాణాలు ● నామమాత్రంగా క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు ● ప్రైవేట్ సత్రాల నిర్మాణాలపై పర్యవేక్షణ చేపట్టని దేవస్థానం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనునిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. దేవస్థానం నిర్మించిన పలు భవనాల ద్వారా భక్తులు వసతి పొందుతున్నారు. భక్తులకు వసతి, అన్నప్రసాదం అందించేందుకు పలు ప్రైవేట్ సత్రాలు సైతం వెలిశాయి. అయితే ఇటీవల సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో శ్రీగిరిలో ఉన్న భవంతులు భద్రమేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. శ్రీగిరిలో దేవస్థాన భవంతులతో పాటు దాతలు సహకారంతో అనేక ప్రైవేట్ కాటేజీలు, ప్రైవేట్ సత్రాలు సైతం నిర్మిస్తున్నారు. ఆయా నిర్మాణాల నాణ్యత ఎవరు పర్యవేక్షణ చేస్తున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా క్షేత్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు సైతం క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ తమకు తెలిసిన ల్యాబ్లో వారికి అమ్యామ్యాలు ఇచ్చుకుని తెచ్చుకుంటున్నట్లు సమాచారం. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాకుండా దాతల సహకారంతో పలు కాటేజీలు సైతం నిర్మిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం సహకారంతో పలువురు దాతలు పలు కాటేజీల నిర్మాణాలు చేపడుతున్నారు. దేవస్థానం స్థలం కేటాయిస్తే అందులో దాతలు తమకు ఇష్టం వచ్చిన రీతిలో కాటేజీ నిర్మాణాలు చేపట్టి దేవస్థానానికి అప్పగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఆయా నిర్మాణాల బాధ్యత పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగిస్తున్నారు. ఎవరు తక్కువ ధరకు నిర్మిస్తామని ముందుకు వస్తే వారికి అప్పగిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు గాలికొదిలేస్తున్నారు. కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారనేది ఆ పర మేశ్వరుడికే ఎరుక అనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ స్థానికంగా ఉంటే.. శ్రీశైల దేవస్థానం చేపట్టే అభివృద్ధి పనులు, ప్రైవేట్ సత్రాల, కాటేజీల నిర్మాణాలు పూర్తిస్థాయిలో నాణ్యతగా ఉండాలంటే శ్రీశైలంలోనే క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఏర్పాటు చేసి, తరచూ పరీక్షలు నిర్వహించాలి. తద్వారా నాసిరకం పనులకు చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం చేపట్టిన పనులపై దేవస్థానం పర్యవేక్షించి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.నాణ్యత ప్రమాణాలు గాలికి.. దేవస్థాన ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు నివసిస్తున్న శివసదనంశ్రీశైల క్షేత్రంలో చేపట్టే ఆయా అభివృద్ధి కార్యక్రమా ల్లో నామమాత్రపు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా పనుల కు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు తెలిసిన ప్రైవేట్ క్వాలి టీ కంట్రోల్ ల్యాబ్లో ముడుపులు ఇచ్చి ధ్రువీకరణ సర్టిఫికెట్లు తీసుకువస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీశైలంలో చేపట్టిన ఔటర్రింగ్రోడ్డు, గణేశసదన్ (224 గదుల వసతి సముదాయం), పుష్కరిణి, మాడవీధులు, నక్షత్రవనం తదితర పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని పలువురు విజిలెన్స్కు ఫిర్యాదులు చేయడంతో ఆయా పనులపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. గతంలో భక్తులకు వసతి సౌకర్యార్థం శ్రీశైలంలో నిర్మించిన వెంకయ్యసత్రం, పొన్నూరు సత్రం, పెద్దసత్రం, శివసదనం, పలు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని ప్రస్తుతం భక్తులకు వసతి గదులుగా కేటాయించడం లేదు. అయితే వాటిని దేవస్థానంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగులకు కేటాయించారు. ఈ భవంతులు నిర్మించి సుమారు 30 సంవత్సరాలు అవుతున్నట్లు సమాచారం. ఆయా భవనాలలో సుమారు 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. శ్రీగిరి ఉన్న ఆ భవనాలు భద్రమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సింహాచలం అప్పన్న ఆలయంలో చోటు చేసుకున్న సంఘటనలు ఇక్కడ చోటు చేసుకోకుండా అధికారులు ఆయా భవంతులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
కచ్చితమైన సమాచారం ఉండదు
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారు, యువతలో ఎక్కువగా ఆన్లైన్లో ఆరోగ్య విషయాలు బ్రౌజ్ చేయడం చేస్తుంటారు. నెట్లో కొన్ని నమ్మకమైన వెబ్సైట్లు, యాప్స్ మినహా అన్నింటిలోనూ కచ్చితమైన సమాచారం ఉండదు. కచ్చితత్వంలేని సమాచారాన్ని చదివితే మనసు మరింత ఆందోళనకు గురవుతుంది. ఆరోగ్య సమస్యల వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అంతేగానీ ప్రతి విషయానికీ ఆన్లైన్పై ఆధారపడటం మంచిది కాదు. –డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, హెచ్వోడి, సైకియాట్రి విభాగం, జీజీహెచ్, కర్నూలు వైద్యులను నేరుగా సంప్రదించాలి ఇటీవల ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను ముందుగా ఆన్లైన్లో వెతకడం ఎక్కువైంది. అందులో వచ్చిన సమాచారాన్ని చూసి మరింత ఆందోళనకు గురై మా వద్దకు వస్తున్నారు. కొందరైతే ఆన్లైన్లో వెతికి అందుకు అనుగుణంగా అన్ని రకాల పరీక్షలు చేయించుకుని వస్తున్నారు. టెస్టుల్లో కొన్ని అబ్నార్మల్ చూపిస్తాయి. వాటిని చూసి టెన్షన్ పడుతుంటారు. కొన్ని అబ్నార్మల్ ఉన్నా ఎలాంటి లక్షణాలు లేకపోతే ఏమీ కాదు. ఆన్లైన్ వైద్యాన్ని నమ్ముకోకుండా వైద్యులను నేరుగా సంప్రదించి చికిత్స తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. –డాక్టర్ మీనుగ శ్రీనివాసులు, జనరల్ ఫిజీషియన్, జీజీహెచ్, కర్నూలు ● -
ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటం
నంద్యాల(న్యూటౌన్): కూటమి ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటమాడుతుందని సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు తోటమద్దులు, మహమ్మద్ గౌస్, సీపీఎం పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్లు విమర్శించారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని సీపీఎం కార్యాలయం నుంచి ఎండీయూ వాహనాలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఓ రామునాయక్కు అందజేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఖాజా శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు ఎండీయూ వాహనాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎండీయూ వాహనాలకు కాల పరిమితి ఉన్నా జూన్ 1వ తేదీ నుంచి ఎండీయూ ఆపరేటర్లను తొలగిస్తున్నామని చెప్పడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ఎండీయూ ఆపరేటర్లు 9,260 మంది ఉన్నారని, కూటమి ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఎండీయూ వాహనాలను కొనసా గించాలని, లేని పక్షంలో ఎండీయూ వాహన ఆపరేటర్లతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడిస్తామని సీఐటీయూ నేతలు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవస్థలను నాశనం చేస్తుందని వారు విరమ్శించారు. ఇప్పటికే 3 లక్షల మంది వలంటీర్లను, మద్యం దుకాణంలో పని చేసే 30వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికే సాగనంపిందన్నారు. అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కూటమి నేతలను ఉన్న ఉద్యోగాలను తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికులను, ప్రజలను మోసగించడం తప్ప కూట మి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోతుందన్నారు. సీఐటీయూ నాయకులు, ఎండీయూ ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ నిలిపివేత దారుణం -
‘పీఎంశ్రీ’ పనులు వేగవంతం చేయండి
నంద్యాల(న్యూటౌన్): పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద జిల్లాలో 40 పాఠశాలల్లో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలపై ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత కింద 28 పాఠశాలలు, రెండో విడత కింద 12 పాఠశాలల్లో రసాయన ప్రయోగశాల, ప్లే గ్రౌండ్స్, లైబ్రరీ, ఆర్ఓ ప్లాంట్లు, కిచెన్ గార్డెన్స్ తదితర 144 పనులు మంజూరయ్యాయన్నారు. మొదటి విడతలో 28 పాఠశాలల్లో ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణాలను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించాలన్నారు. పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులు జూన్ 6వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. కిచెన్ గార్డెన్స్కు సంబంధించి ఫెన్సింగ్ పూర్తయిందని విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కూడా స్కూల్ కమిటీ వారిని సమన్వయం చేసుకుంటూ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏసీపీ ప్రేమాంత్ కుమార్, డీఈఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజకుమారి -
భ్రమరాంబాదేవికి ఊయలసేవ
శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీశైల భ్రమరాంబాదేవికి దేవస్థాన అర్చకులు శాస్త్రోక్తంగా ఊయలసేవ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 7గంటలకు ప్రారంభమైన సేవలో భాగంగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ముందుగా సేవా సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. ఊయలలో స్వామిఅమ్మవార్లను ఆశీనులను చేసి షోడశోపచార పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి అష్టోత్తరం, ఖడ్గమాల, సహస్రనామ పూజలు జరిపించారు. అలాగే శ్రీశైల గ్రామ దేవతగా పిలవబడుతున్న అంకాలమ్మ అమ్మవారికి విశేషపూజలు నిర్వహించారు. కొనసాగుతున్నపది సప్లిమెంటరీ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలోని 35 పరీక్ష కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన భౌతిక శాస్త్రం పరీక్షకు 632 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 2,657 మంది విద్యార్థులకు గాను 2025 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయి. ఓపెన్ టెన్త్ పరీక్షల్లో భాగంగా సాంకేతిక విజ్ఞానం, గృహ విజ్ఞాన శాస్త్రం పరీక్షకు నాలుగు కేంద్రాల్లో 214 మంది విద్యార్థులకు గాను 188 మంది హాజరు కాగా 269 మంది గైర్హాజరయ్యారు. అదే విధంగా ఇంటర్మీడియెట్ పరీక్షల్లో భాగంగా గణితం, చరిత్ర, వ్యాపార గణక శాస్త్రం పరీక్షలు రెండు కేంద్రాల్లో 115 మంది విద్యార్థులకు గాను 105 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. కోడుమూరుకు చేరిన జీడీపీ నీరు కోడుమూరు రూరల్: పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నీరు శుక్రవారం కోడుమూరు వద్ద హంద్రీకి చేరుకున్నాయి. హంద్రీ పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి జీడీపీ ఎడమ కాల్వ ద్వారా 40క్యూసెక్కుల చొప్పున వర్కూరు సుద్ధవాగు మీదుగా గత మూడు రోజుల నుంచి కోడుమూరు హంద్రీనదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మరో నాలుగైదు రోజులు నీరు వదిలితే పూర్తిస్థాయిలో మంచినీటి పథకాలకు చేరుకుంటాయని కోడుమూరు ఆర్డబ్ల్యుఎస్ ఏఈ ప్రసాద్ తెలిపారు. -
సర్వం మార్చి.. మంగళం పాడి
నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగు మాధ్యమానికి తూట్లు పొడుస్తోందని గత ఐదేళ్లగా అక్కసు వెళ్లగక్కిన కూట మి నాయకులు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు మాధ్యమానికి మంగళం పాడేయాలని నిర్ణ యించారు. రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేదంటూ విద్యాశాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కలిపి 1,490 ఉండగా అందులో 1,50,155 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్మీడియెట్లో సైతం ఇన్నాళ్లు తప్పనిసరిగా ఉన్న తెలుగు సబ్జెక్టును ఐచ్ఛికం చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి తెలుగు అధ్యాపకులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో తెలుగు మాధ్యమానికి అన్యాయం చేస్తున్నారని, తెలుగులోనే బోధన, చదువులు కొనసాగాలని గగ్గోలు పెట్టిన కూటమి పార్టీల పెద్దలు, నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక తమ స్వరం మార్చుకుంటున్నారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ తెలుగుమాధ్యమం లేదంటూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల తెలుగుభాషాభిమానులు, ఏపీ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లాశాఖ ప్రతినిధులు మండిపడుతున్నారు. నాడు తెలుగుకు అన్యాయం జరగకుండా... తెలుగు సబ్జెక్టుకు అన్యాయం జరగకుండా.. తెలుగును సబ్జెక్టును తప్పనిసరి చేస్తూనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంగ్లిషు మీడియంను తీసుకోచ్చింది. పేద, మధ్య తరగతి పిల్లలు పోటీ ప్రపంచంతో పోటీపడి రాణించాలని ఆనాడు ఇంగ్లిషు మీడియంలో చదువు, సీబీఎస్సీ సిలబస్ అమలు విషయంలో ఎవరెన్ని చెప్పినా ఆనాటి గత సర్కారు వెనక్కి తగ్గలేదు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఐఐటీ, ఎంబీబీఎస్ వంటీ కోర్పులను కూడా తెలుగు మాధ్యమంలో బోధించాలని పేర్కొంటే ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం పాఠశాలల్లో ఆ నిబంధనలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పునర్వ్యవస్థీకరణలో తీవ్ర అన్యాయం.. పాఠశాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1 నుంచి 8 తరగతులు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను తీసే యడం తీవ్ర అన్యాయమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులు మండిపడుతున్నాడు. 8వ తరగతి తర్వాత రాబోయే పదో తరగతిలో తెలుగు ఉత్తీర్ణత ప్రభావితం కానుందని గుర్తుచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీ నాయకులు మాటలు, ప్రకటనలు విని నిలువునా మోస పోయామని తెలుగు భాషాభిమానులు, తెలుగు ఉపాధ్యాయులు, లెక్చరర్లు తమ అక్రోశం వెల్లగక్కుతున్నారు. దురుద్దేశం తేటతెల్లం.. ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు టీచర్లు ఉండరా..? అంటే అవుననే సమాధానం పాఠశాల విద్యా శాఖ చెబుతోంది. ఈ మేరకు పునర్వ్యవస్థీకరణ జీవో లో ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు బోధకులు పాఠశాలలకు కేటాయించకుండా మార్గదర్శకాలను వెలువరించింది. 2001లో విస్తతంగా ప్రాథమికోన్నత పాఠశాలలు నెలకొల్పినప్పుడు ఏర్పాటైన స్టాఫ్ ప్యాటర్న్ను 2025 వరకు కొనసాగించడం ద్వారా మెరుగైన విద్యా ప్రమాణాలు సాధ్యమయ్యాయి. తాజాగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు పోస్టులను ఎత్తివేయడం వారి దురుద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల తెలుగు బోధనను ఎవరు చేపడతారో ప్రశ్నార్థకంగా మారిందని భాషాభిమాను లు, రాష్ట్ర భాషోపాధ్యా సంస్థ జిల్లాశాఖ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ● తెలుగుభాష పట్ల గౌరవం ఉంటే తక్షణం పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలి. ● విద్యార్థుల రేషియో ఆధారంగా బడుల్లో తెలుగు ఉపాధ్యాయులను నియమించాలి. ● తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి, ఉద్యోగాలు పొందేందుకు 2 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ● ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ కళాశాల స్థాయి వరకు తెలుగు మాధ్యమంలో విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలి. తీవ్ర అన్యాయం రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమానికి పాతరేసేలా కూటమి ప్రభుత్వం దుందుడుకు చర్యలు చేపడుతోంది. విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్య మం లేదంటూ పేర్కొనడం విచారకరం. కూటమి ప్రభుత్వం ఆనాడు చేసిన ప్రకటనలకు ప్రస్తుతం పూర్తి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం తగదు. – కన్నయ్య, రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు, నంద్యాల తెలుగుకు వెలుగేదీ? నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూటమి పార్టీల పెద్దలు, నాయకులు, అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లిషుమీడియం, సీబీఎస్సీ సిలబస్ పట్ల అనరాని మాటలు అన్నారు. ఆ వాఖ్యలు, ప్రకటనలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. తీరా అధికారంలోకి వచ్చాక తెలుగు మాధ్యమాన్ని అధఃపాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేయాలి. – హుసేన్మియా, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా ప్రధానకార్యదర్శి, నంద్యాల తెలుగు మాధ్యమానికి చంద్రబాబు సర్కారు మంగళం నాడు ప్రేమ ఒలకబోసి.. నేడు జీఓ తెచ్చి బడుల్లో తెలుగు మీడియం లేదంటూ ఉత్తర్వులిచ్చిన పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఇంటర్లో తెలుగు సబ్జెక్టును ఆప్షనల్ చేసిన వైనం మండిపడుతున్న భాషాభిమానులు -
మృత్యువు మింగేసింది!
● పొలంలోని నీటి తొట్టిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి గోనెగండ్ల: పొలంలో నీటి తొట్టిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తూ మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటన గోనెగండ్లలో శుక్రవారం చోటు చేసు కుంది. స్థానిక కురువ పేటకు చెందిన బోయ మందకల్, సరస్వతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండవ కూతురు మాధురి(12) ఆరవ తరగతి వరకు చదివి మధ్యలో బడి మానేసింది. అలాగే అదే కాలనీకి చెందిన బోయ రంగప్ప నాయు డు, మహేశ్వరి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరి రెండో కుమార్తె మంజుల (12) కూడా బడి మానేసింది. రోజు మాదిరిగా సరస్వతి, మహేశ్వరి శుక్రవారం ఓ రైతు పొలంలో పత్తి విత్తనాలు విత్తేందుకు వెళ్తుండగా వారి బిడ్డలు మాధురి, మంజుల కూడా వెంట వెళ్లారు. తల్లులు పొలంలో పత్తి విత్తనాలు విత్తుతుండగా మధ్యాహ్న సమయంలో ఆ చిన్నారులు ఇద్దరు పొలంలోని నీటి తొట్టి దగ్గరకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు అందులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి పోయారు. కొద్ది సేపటి తర్వాత పిల్లలు కనిపించక పోవడంతో అనుమానంతో నీటి తొట్టిలో చూడగా ఇద్దరు విగతజీవులుగా కనిపించడంతో గుండెలు బాదుకున్నారు. కుమార్తెల మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఉపాధ్యాయ బదిలీలకు వేళాయె!
కర్నూలు సిటీ/నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయుల బదిలీలకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా కేంద్రంగా బదిలీలు చేసేందుకు ఇటీవలే షెడ్యూల్ జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధ్యాయుల బదిలీల కోసం టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్–2025 ను తీసుకొచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 2023 మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టారు. రెండేళ్లకు జరుగుతున్న బదిలీలకు ఆన్లైన్లో ఈ నెల 21 నుంచే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మొదటగా ప్రధానోపాధ్యాయులు, ఆ తరువాత స్కూల్ అసిస్టెంట్ టీచర్లు, అనంతరం సెకండ్ గ్రేడ్ టీచర్లను బదిలీలకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. నిబంధనలు ఇవీ.. ● ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్లు, ఇతర కేటగిరీ టీచర్లు 8 ఏళ్ల పాటు ఒకే చోట పని చేస్తూ ఉంటే కచ్చితంగా బదిలీ కానున్నారు. ● స్టడీ లీవ్ పేరుతో సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులు(ఆగస్టులోపు) 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే బదిలీ కానున్నారు. ● విద్యాశాఖ వెబ్సైట్లో ముందుగా ప్రధానోపాధ్యాయులకు దరఖాస్త్తులకు అవకాశం ఇవ్వగా, ఆ గడువు గురువారంతో ముగిసింది. స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 24, ఎస్జీటీలకు ఈ నెల 27వ తేదితో ముగియనుంది. ● ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాలు ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 24, స్కూల్ అసిస్టెంట్లకు 26,27, ఎస్జీటీలకు ఈ నెల 31వ తేదీన ప్రకటించనున్నారు. ● జాబితాలపై అభ్యంతరాలకు ఈ నెల 25న హెచ్ఎం, 28న ఎస్ఏ, 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఎస్జీటీలకు అవకాశం ఇచ్చారు. ● తుది సీనియారిటీ జాబితా ఖాళీలను హెచ్ఎంలకు ఈ నెల 27, ఎస్ఏలకు 31, ఎస్జీటీలకు జూన్ 6వ తేదిన ప్రదర్శించనున్నారు. ● బదిలీలకు ఆప్షన్లను హెచ్ఎంలకు ఈ నెల 28, ఎస్ఏలకు జూన్ 1,2, ఎస్జీటీలకు జూన్ 7నుంచి 10వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ● హెచ్ఎంలకు ఈ నెల 30, ఎస్ఏలకు జూన్ 4, ఎస్జీటీలకు జూన్ 11వ తేదీన బదిలీలు ఇవ్వనున్నారు. బదిలీలకు 8,042 పోస్టుల ఖాళీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు 15,564 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు అయ్యాయి. ఇందులో రెగ్యులర్ టీచర్లు 12,191 మంది, మినిమం టైం స్కేల్ టీచర్లు 361 మంది పని చేస్తున్నారు. డీఎస్సీ–2024 ద్వారా 2,645 మంది టీచర్లను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం 16,898 మంది టీచర్ పోస్టులు అవసరం ఉంది. ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన జీఓ నంబరు 21 ప్రకారం వర్కింగ్ సర్ప్లస్ 499, ఖాళీల సర్ప్లస్ 1,194 టీచర్ పోస్టులు ఉన్నాయి. దీంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల కొరత పోస్టులు 1,334, టీచర్లు 1,701 మంది ఉండగా, వివిధ మేనేజ్మెంట్లలోకి 344 పోస్టులను కన్వర్ట్ చేశారు. ఎస్జీటీ/స్కూల్ అసిస్టెంట్ పోస్టులని అధిగమించడం ద్వారా సృష్టించిన పోస్టుల సంఖ్య 100 ఉన్నాయి. బదిలీలకు ఉమ్మడి జిల్లాలో 8,042 పోస్టులను ఖాళీగా విద్యాశాఖ చూపుతోంది. ఇందులో క్లియర్ వెకేన్సీలు 2,766 ఉండగా, 8/5 అకడమిక్ ఈయర్స్ పూర్తి చేసుకున్న వారు 2,216 మంది టీచర్లు ఉన్నారు. ఇద్దరు టీచర్లు ఫారీన్ సర్వీస్లు ఉన్నారు. పునఃవిభజన ఖాళీలు(రీ–అపోర్సిమెంట్ ఖాళీలు) 1,486, స్టడీ లీవ్లో 25 మంది, కొత్తగా మంజూరై ఖాళీలుగా 1,547 ఉండగా, మొత్తం కలిపి 8,042 పోస్టులను ఖాళీలు విద్యాశాఖ చూపించింది. ఈ నెల 27 వరకు దరఖాస్తులకు అవకాశం జూన్ 11 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తివ్యవసాయ శాఖలో.. కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన బదిలీలపై కర్నూలు, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారులు పీఎల్ వరలక్ష్మి, మరళీకృష్ణ, పరిపాలన అధికారి, సూపరింటెండెంట్లు గురువారం సమావేశమై చర్చించారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో అటెండర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారుల బదిలీలు జరుగుతాయి. కొందరు ‘కూటమి’ నేతల సిపారస్సు లెటర్లు తెచ్చి కోరుకున్న చోటుకు బదిలీ అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీల ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ జూన్ 2 వతేదీన ఉత్తర్వులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. -
ఆగస్టు చివరికి సారా రహిత జిల్లాగా చేయాలి
కర్నూలు: నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా కర్నూలు జిల్లాను ఆగస్టు చివరి నాటికి నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించేలా పనిచేయాలని జిల్లా ఎకై ్సజ్ అధికారులను ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు. విజయవాడ నుంచి బుధవారం రాత్రి కర్నూలు చేరుకున్న రాహుల్ దేవ్ శర్మ బీ.క్యాంప్లోని పోలీస్ గెస్ట్ హౌస్లో బస చేశారు. గురువారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఎకై ్సజ్ కార్యాలయానికి చేరుకున్నారు. నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా నోడల్ ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు, ఏఈఎస్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, సీఐలు రాజేంద్రప్రసాద్, చంద్రహాస్, జయరాం నాయుడు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నవోదయం 2.0 అమలు తీరు, జిల్లాలో ఉద్యోగుల పనితీరుపై సమీక్షించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి బార్డర్ చెక్పోస్టుల పనితీరును సమీక్షించారు. చెక్పోస్టులలో నిఘాను పెంచి అక్రమ మద్యం జిల్లాలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. రీజనల్ ఎకై ్సజ్ ల్యాబ్ను, అందులోని పరికరాలను పరిశీలించి ల్యాబ్ పనితీరును సమీక్షించారు. రిపోర్టులు తయారైన వెంటనే సంబంధిత స్టేషన్లకు స్పెషల్ మెసెంజర్ల ద్వారా పంపాలన్నారు. జిల్లా కార్యాలయం ఆవరణం మొత్తం కలియదిరిగి ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం మాదవరం, ఛత్రగుడి చెక్పోస్టులను తనిఖీ చేశారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ -
యోగాపై అవగాహన కల్పించాలి
నంద్యాల(న్యూటౌన్): యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో యోగా ఆంధ్రా–2025 కార్యక్రమాల నిర్వహణపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణకు యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో 7 లక్షల మందిని యోగా ఆంధ్రా యాప్లో ఈ నెల 27వ తేదీలోగా నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 21వ తేదీ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు మాసోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. అందులో భాగంగా శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో మే 31న, జూన్ 7న మహానందిలో, జూన్ 13న బెలూం గుహల వద్ద, జూన్ 20న పచ్చర్ల జంగిల్ క్యాంప్లో యోగా నిర్వహణ కార్యక్రమాలకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జూన్ 16వ తేదీన 5 వేల మంది విద్యార్థులతో యోగా కార్యక్రమం చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జూన్ 2 నుంచి 14వ తేదీ వరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద యోగా ఆంధ్రా–2025కు సంబంధించి పోస్టర్లను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
శ్రీశైల దేవస్థానానికి రూ.5లక్షల విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గురువారం హైదరాబాద్కు చెందిన ఎం.శివాజీ రూ.5 లక్షల విరాళాన్ని అందించారు. అన్నప్రసాద వితరణకు రూ. 2 లక్షలు, గో సంరక్షణ నిధి పథకానికి రూ.2లక్షలు, ప్రాణదాన ట్రస్ట్కు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు హిమబిందుకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు రసీదు, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రం అందజేసి సత్కరించారు. భూరీసర్వేలో పొరపాట్లకు తావివ్వొద్దు బనగానపల్లె రూరల్: మండలంలో జరుగుతున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని సర్వేయర్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. గురువారం తిమ్మాపురం గ్రామంలో భూముల రీసర్వే పనులను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ముందుగా సమాచారం ఇచ్చి రీసర్వే చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. రీసర్వే సమయంలో సర్వేయర్లు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ నారాయణరెడ్డి, ఆర్ఐ ప్రవీణ్నాయక్ తదితరులు ఉన్నారు. శ్రీమఠంలో భక్తుల సందడి మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో రాఘవేంద్రస్వామి దర్శనార్థం భక్తులు వేలా దిగా తరలివచ్చారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో రావడంతో మంత్రాలయ క్షేత్రం కళకళలాడింది. తుంగభద్ర నదికి వరద నీరు రావడంతో నదీతీరంలో భక్తుల కోలాహలం కనిపించింది. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, తర్వాత రాఘ వేంద్రుల మూల బృందావన దర్శనాలు చేసుకున్నారు. రాఘవేంద్రుల దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది. -
రూ.4.13 కోట్లు ఇంకా సర్దుబాటు కాలేదు
స్టాంప్ డ్యూటీ సర్దుబాటుకు సంబంధించి ప్రతి మండలంలో ఒక లైజనింగ్ అధికారికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగిస్తు చేసిన ప్రయత్నంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.9,34,68,168లు సర్దుబాటు అయ్యాయి. అలాగే 2020–21లో రూ.4 కోట్లు, 2021–22లో 5 కోట్లు, 2022–23లో రూ.5.48 కోట్లు, 2023–24లో రూ.5.02 కోట్లు సర్దుబాటు అయ్యాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అపోర్షనేట్ అయిన మొత్తం రూ.4.13 కోట్లు ఇంకా సర్దుబాటు కాలేదు. స్టాంప్ డ్యూటీ స్థానిక సంస్థలకు సర్దుబాటు అయితే వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు కనీసం అపోర్షనేట్ కూడా చేయకపోవడం ఏమిటి? దీంతో జిల్లా పరిషత్కు ఎంత సర్దుబాటు చేయాలనే విషయంపై కూడా స్పష్టత కొరవడింది. – ఎర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ చైర్మన్ స్థానిక సంస్థలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి ప్రభుత్వ నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో స్థానిక సంస్థలు ఆర్థికంగా నిర్వీర్యం అయిపోతున్నాయి. అంతంతమాత్రం ఆదాయం ఉన్న జిల్లా పరిషత్కు ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ విడుదల కాకుంటే ఎలా? స్టాంప్ డ్యూటీ కింద స్థానిక సంస్థలకు విడుదలయ్యే 1.5 శాతం నిధులతో గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. అయితే ఈ నిధులను సర్దుబాటు చేయడంలో జరుగుతున్న జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే నిధులు జెడ్పీకి జమ అయ్యేలా చూడాలి. – ఆర్బీ చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు, గడివేముల ● -
జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో సింహభాగం వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధుల పాలన కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆయా సంస్థలను ఆర్థికంగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థ
● స్టాంప్ డ్యూటీ జమ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు? ● జెడ్పీకి సర్దుబాటు కాని అపోర్షన్డ్ మొత్తం రూ.4.13 కోట్లు ● అపోర్షన్డ్ చేయని మొత్తం దాదాపు మరో రూ.6 కోట్లు ● ప్రధాన ఆదాయ వనరుపై దెబ్బకొట్టే యత్నం ● చిన్న పనులను కూడా చేపట్టలేని స్థితిలో స్థానిక సంస్థలు కర్నూలు(అర్బన్): స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్టాంప్ డ్యూటీపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను చేపట్టింది. దీంతో ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ ఆయా స్థానిక సంస్థలకు జమ కావడం లేదు. జిల్లా పరిషత్కు స్టాంప్ డ్యూటీ నిధులను విడుదల చేయవద్దని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో వినియోగదారులు రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంప్ డ్యూటీ కింద 6.5 శాతం చెల్లించాల్సి ఉంది. ఇందులో 5 శాతం ప్రభుత్వానికి పోగా, మిగిలిన 1.5 శాతం స్థానిక సంస్థలకు జమ చేయాల్సి ఉంది. నయాపైసా ఇవ్వలేదు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు స్థానిక సంస్థలకు స్టాంప్ డ్యూటీ కింద నయాపైసా సర్దుబాటు చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అపోర్షన్డ్ చేసిన మొత్తం రూ.4,13,63,139 నేటికి జిల్లా పరిషత్కు సర్దుబాటు కాలేదు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నేటికీ స్థానిక సంస్థలకు తమ వాటా ఎంత మొత్తాన్ని సర్దుబాటు చేయాలనే విషయాన్ని కూడా తెలియజేయకపోవడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలోనే ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు దాదాపు 141 నెలలకు సంబంధించి నేటికి అపోర్షనేట్ చేయలేదు. ఈ మొత్తం కూడా దాదాపు రూ.6 కోట్ల వరకు ఉండవచ్చని జెడ్పీ పాలకవర్గం అంచనా వేస్తోంది. చిన్న పనులు కూడా చేపట్టలేని స్థితిలో.. స్టాంప్ డ్యూటీ సర్దుబాటు కాకపోవడంతో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ పరిధిలో చిన్న చిన్న పనులను కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టాంప్ డ్యూటీ మొత్తం విడుదలైతే గ్రామాల్లో డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, ఇతరత్రా పనులకు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే ఏడాది కాలంగా స్టాంప్ డ్యూటీ విడుదలపై నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో స్థానిక సంస్థలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. -
తీర్మానాల తిరస్కరణపై విచారణ
కోవెలకుంట్ల: మండల పరిషత్ పాలక మండలి అనుమతి లేకుండా వివిధ అభివృద్ధి పనులపై అధికారులు ఏక పక్షంగా తీర్మానం, వాటిని ఎంపీపీ తిరస్కరణ చేయడం తదితర విషయాలపై గరువారం జెడ్సీ సీఈఓ నాసర రెడ్డి విచారణ చేపట్టారు. వివిధ గ్రామాలో డ్రైనేజీ నిర్మాణానికి రూ.26 లక్షల మండల పరిషత్ నిధు లు మంజూరు చేయాలని నివేదిక పంపారు. ఆ తీర్మానాలను ఎంపీపీ తిరస్కరించడంతో జెడ్పీ సీఈఓ నాసర రెడ్డి గురువారం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లడుతూ.. పాలక మండలి అనుమతి లేకుండా తీర్మానాలు చేయడం, వాటిని ఎంపీపీ తిరస్కరించడం తదితర అంశాలపై ఎంపీపీ భీమిరెడ్డి రమాదేవి, ఎంపీడీఓ వరప్రసాద్రావును విచారణ చేశామని, తుది నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామన్నారు. -
కొనసాగుతున్న కక్ష సాధింపు.. భూమా కిశోర్రెడ్డిపై కేసు
నంద్యాల: జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో భూమా కిశోర్రెడ్డిపై కేసు నమోదైంది. చికెన్ ధరలపై ప్రజల తరపున ప్రశ్నించినందుకు భూమా కిశోర్రెడ్డిపై అఖిల ప్రియ అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజల పక్షాన నిలబడి చికెన్ ధర ఎందుకు పెంచారని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అంటూ కూటమి ప్రభుత్వంపై భూమా కిశోర్రెడ్డి మండిపడ్డారు.అక్రమంగా కేసులు నమోదు చేయడం సరికాదన్న భూమా కిషోర్ రెడ్డి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చికెన్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేక పనులు చేస్తే.. ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు. ఎన్ని అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కానీ భయపడేది లేదని భూమా కిషోర్రెడ్డి అన్నారు. -
నంద్యాల: పంటి నొప్పితో వెళ్తే.. ప్రాణం తీసిన ఆర్ఎంపీ వైద్యుడు
సాక్షి, నంద్యాల జిల్లా: పంటి నొప్పితో వెళితే ఓ వైద్యుడు ప్రాణం తీశాడు. సంజామల మండల కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకంతో మహిళ మృతి చెందింది. సంజామల మండలం చిన్న కొత్తపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (52) రెండు రోజులుగా పంటి నొప్పి ఉండటంతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లింది. ఇంజెక్షన్ నరానికీ ఇవ్వగా ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.దీంతో 108 ద్వారా కోవెలకుంట్ల ఆసుపత్రికి ఆర్ఎంపీ వైద్యుడు తరలించగా, అప్పటికే ఆ మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ వైద్యుడు పరారిలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
పొగాకు రైతుకు కంపెనీల కాటు
ఆత్మకూరు: అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలు నేరుగా రైతుల వద్దకు వచ్చాయి. పొగాకు సాగు చేయండి క్వింటా రూ.15,500 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పాయి. ఆ మేరకు రైతులతో ఒప్పందం కూడా చేసుకున్నాయి. కంపెనీల మాటలు నమ్మి వేలాది ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చాక కంపెనీలు ప్లేటు ఫిరాయించాయి. అధికంగా పొగాకు సాగు చేశారంటూ కొనుగోలు చేయకుండా మోసం చేశాయి. దీంతో కంపెనీల మాటలు నమ్మి నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం పొగాకు కొనుగోలు చేయకపోతే తమ ఇళ్లు, పొలాలు, ఆస్తులన్నీ అమ్మినా అప్పులు తీరవని నంద్యాల జిల్లాకు చెందిన పొగాకు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 20 రోజులుగా కొనుగోళ్లు నిలిపివేత గతేడాది పొగాకు సాగు తక్కువగా ఉండటంతో రైతులను ప్రోత్సహించేందుకు ఐటీసీ, చుక్కబర్రి కంపెనీలు ముందుకొచ్చాయి. క్వింటా రూ.15,500 చొప్పున కొనుగోలు చేస్తామని గతేడాది ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో జిల్లాలో 17,215 ఎకరాల్లో పొగాకును సాగుచేశారు. ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, నంద్యాల, పాణ్యం, ఓర్వకల్లు, నందికొట్కూరు, బేతంచెర్ల, నంద్యాల ప్రాంతాల్లోని రైతులు అత్యధికంగా పొగాకును సాగుచేశారు. కంపెనీల అగ్రిమెంట్ ఉండటంతో కొందరు రైతులు కౌలుకు తీసుకుని 50 ఎకరాలు కూడా సాగు చేశారు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. రైతుల ఇళ్లు, కల్లాల వద్ద కుప్పలు కుప్పలుగా పొగాకు కనిపిస్తోంది. జిల్లా మొత్తం మీద 2,06,580 క్వింటాళ్ల పొగాకు దిగుబడి వచి్చంది. అయితే, తాము అగ్రిమెంట్ ఇచ్చిన దానికంటే రైతులు ఎక్కువగా పొగాకు సాగు చేశారని, దిగుబడి కూడా పెరిగిందని కంపెనీలు కొనుగోళ్లు నిలిపివేశాయి. సీజన్ ప్రారంభంలో కేవలం 20 నుంచి 40 శాతం పొగాకు మాత్రమే కొనుగోలు చేశాయి. దాదాపు 20 రోజులుగా కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశాయి. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో రైతుల వద్ద రూ.150 కోట్లకు పైగా విలువైన పొగాకు నిల్వలు ఉన్నాయి.మా ఇంటి వద్ద 100 క్వింటాళ్ల పొగాకు ఉంది మా ఇంటి వద్ద 100 క్వింటాళ్ల పొగాకు ఉంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పొగాకును సాగు చేశా. కంపెనీలు పొగాకు సాగు చేయాలని చెప్పాయి. అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. కానీ నేటికీ పొగాకును కొనుగోలు చేయలేదు. ఏమి చేయాలో తెలియడం లేదు. పొగాకును వర్షంలో తడవకుండా కాపాడుకోలేకపోతున్నాం. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలి. – రామచంద్రుడు, రైతు, కొత్త రామాపురం నంద్యాల జిల్లాపొలం, ఇల్లు అమ్మినా అప్పులు తీరవు ఎనిమిది ఎకరాల్లో పొగాకు సాగుచేశాం. 80 క్వింటాళ్లకు పైగా పొగాకు నిల్వ ఉంది. కంపెనీలు ఎప్పుడు కొనుగోలు చేస్తాయో చెప్పడం లేదు. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఆ అప్పులు ఎలా తీర్చాలో కూడా తెలియడం లేదు. కంపెనీలు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం పొగాకు కొనుగోలు చేయపోతే మా పొలం, ఇల్లు అమ్ముకున్నా అప్పులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. – శంకర్, రైతు, ఆత్మకూరు, నంద్యాల జిల్లాకంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలి ప్రభుత్వ పెద్దలు తరచూ కంపెనీలు పొగాకు కొనుగోలు చేస్తాయని ప్రకటిస్తున్నారు. కానీ మా జిల్లాలో మాత్రం కంపెనీలు 20 రోజులుగా రైతుల నుంచి కిలో పొగాకు కొనలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి అగ్రిమెంట్ ప్రకారం పొగాకు కొనుగోలు చేసేలా చూడాలి. – రవీంద్ర, రైతు, కొత్త రామాపురం, నంద్యాల జిల్లా -
సీఐపై దాడి కేసులో ఏడుగురికి జైలు, జరిమానా
కర్నూలు: స్థానిక బంగారుపేటలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలోని ఆక్రమణల తొలగింపు సమయంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ పార్థసారధిరెడ్డిపై దాడి చేసిన ఏడుగురు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ కర్నూలు అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దివాకర్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు 2021 నవంబర్ 30న అక్రమ కట్టడాలను తొలగించేందుకు బందోబస్తుగా అప్పటి రెండో పట్టణ సీఐ పార్థసారధిరెడ్డి, కోడుమూరు సీఐ శ్రీధర్ సిబ్బందితో బంగారుపేటలోకి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో జేసీబీతో ఆక్రమణలు తొలగిస్తుండగా కొంతమంది రాళ్లతో పోలీసులపై దాడి చేయగా సీఐకి గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స అనంతరం టూటౌన్లో ఫిర్యాదు చేశారు. బంగారుపేటకు చెందిన లక్ష్మి, నీలిషికారి బెల్కీ, ఎన్.నరసింహులు, నీలిషికారి సుగుణ, ప్రసాద్, నీలి షికారి నాగమణి, నీలిషికారి బెగినిలపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. రేపటి నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో కర్నూలు (టౌన్): ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పోను మంత్రి టీజీ భరత్ ప్రారంభించనున్నట్లు క్రెడాయ్ కర్నూలు చైర్మన్ గోరంట్ల రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గౌరు చరితా, బొగ్గు ల దస్తగిరి, కలెక్టర్ పి.రంజిత్బాషా, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మేయర్ బీవై.రామ య్య, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొంటారన్నారు. ప్రాపర్టీ షోలో 60 మంది బిల్డ ర్లు, నిర్మాణ వస్తువుల సరఫరాదారులు, ఇంటీరియర్ డిజైనర్లు పాల్గొంటారన్నారు. ప్రధాన స్పాన్సర్గా రాగమయూరి బిల్డర్స్, కో స్పాన్సర్గా స్కందాన్షి ఇన్ ఫ్రా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఆటో పెవిలియన్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని, క్రెడాయ్ కన్వీనర్ ఎన్.శ్రీనివాసరావు, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి టీఏవీ ప్రకాష్, ఇతర క్రెడాయ్ సభ్యులు పాల్గొంటున్నట్లు తెలిపారు. -
వర్షానికి కూలిన బ్రిడ్జి
కల్లూరు: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలోని గంజివాగు బ్రిడ్జి కూలిపోయింది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతోపాటు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లక్ష్మిపురం గ్రామంలోని గంజివాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో రైతులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గ్రామంలో పర్యటించారు. గంజివాగుపై కూలిన బ్రిడ్జితోపాటు గ్రామంలోని కమ్యూనిటీ హాల్ను పరిశీలించారు. -
రేపు జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు
ఓర్వకల్లు: మండలంలోని లొద్దిపల్లె గ్రామంలో ఈనెల 23న జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ హనుమజ్జయంతి సందర్భంగా నిర్వహించే పోటీలలో మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున నగదు బహుమతులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న ఎడ్ల యజమానులు అదే రోజు ఉదయం 7 గంటల్లోగా రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9502653201, 9949865259, 9398283631 నంబర్లను సంప్రదించాలన్నారు. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన టిప్పర్ మద్దికెర: మండలంలోని బురుజుల వద్ద హంద్రీనీ వా కాలువ వెడల్పు పనులు జరుగుతున్నాయి. బుధవారం కాలువ వెంబడి మట్టిని తరలిస్తుండగా అదుపుతప్పి టిప్పర్ కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు స్పందించి వెంటనే డ్రైవర్ను బయటకు తీసి చికిత్స కోసం గుంతకల్లు వైద్యశాలకు తరలించారు. -
ముందే వచ్చిన వర్షాకాలం!
● జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు ● గూడూరులో 49.2 మిమీ వర్షపాతం నమోదు ● తగ్గిన ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): ఈ సారి వానాకాలం ముందే వచ్చినట్లుంది. కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హాలహర్వి, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, తుగ్గలి మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. గూడూరులో అత్యధికంగా 49.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కోడుమూరులో 47.6, కల్లూరులో 38.8, హొళగుందలో 19.4, గోనెగండ్లలో 16.4, సీ.బెళగల్లో 13.4, కౌతాళంలో 12.6, ఓర్వకల్లులో 12.4 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. మే నెలకు సంబంధించి 21వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 27.2 మి.మీ ఉండగా... 77.9 మి.మీ వర్షపాతం నమోదైంది. హంద్రీకి ఒక మోస్తరుగా నీరు వచ్చింది. కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. గరిష్టంగా 36 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రానున్న రెండు, మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 17 వేల క్యూసెక్కుల వరదనీరు సి.బెళగల్: కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదిలో దాదాపు 17 వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నది పూర్తి స్థాయిలో రెండు దడులను తాకుతూ వరదనీరు ప్రవహిస్తుండటంతో నదికి జలకళ సంతరించుకుంది. కాగా మండల పరిధిలోని తుంగభద్ర తీర ప్రాంత గ్రామాల్లో రైతులు ముందస్తు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్డీఎస్ జళకళ కోసిగి: మండలంలోని కందుకూరు గ్రామ సమీపంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టపై తుంగభద్ర నది జళకళ సంతరించుకుంది. మండలంతో పాటు నదితీర పై ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వర్షపు నీరు నదికి చేరుకున్నాయి. దీంతో ఆర్డీఎస్ ఆనకట్టపై రెండు అడుగుల మేర ఎత్తులో ఎక్కి దిగువ ప్రాంతం కర్నూలు వైపు ప్రవహిస్తోంది. ముందస్తు వర్షాలు కురిసి నది పుష్కలంగా ప్రవహించడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బెస్తలకు రాజకీయగుర్తింపు ఇవ్వాలి
కర్నూలు(అర్బన్): బెస్తలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని అఖిల భారత బెస్త మహాసభ రాష్ట్ర కోకన్వీనర్ టి.సాయిప్రదీప్ కోరారు. బుధవారం స్థానిక బిర్లా కాంపౌండ్ సమీపంలోని డాక్టర్ బ్రాహ్మారెడ్డి ప్రజా వైద్యశాల సమావేశ భవనంలో బెస్త ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ముందుగా భగవాన్ శ్రీ వ్యాస మహర్శి చిత్ర పటానికి నేతలు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిప్రదీప్ మాట్లాడుతూ బెస్తలు రాజకీయ పదవులకు నోచుకోవడం లేదన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం రావాల్సిన రాజ్యాంగపరమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు కోల్పోయినా, కనీసం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల్లోనూ బెస్తలకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. త్వరలో ప్రకటించనున్న మార్కెట్యార్డు, దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, ఇతర పదవుల్లో బెస్తలను నియమించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నాయకులు భాస్కర్రావు, ఉదయ్, పీజీ వెంకటేష్, ఆనంద్రాజు, జయన్న, ఎద్దుల వెంకటేశ్వర్లు, గ్యాస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ముస్లింపర్సనల్ లా బోర్డు రాష్ట్ర కన్వీనర్ రఫిక్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏక్యాంపులోని ఎంఎంఐ షాదీఖానాలో సయ్యద్ జాకీర్ మౌలానా రషీద్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్బాబు, న్యాయవాది సుబ్బయ్య, అవాజ్ కమిటీ కార్యదర్శి ఎస్ఎండీ షరీఫ్, మైనార్టీ నాయకుడు షేక్ హఫీజ్, ఇలియాజ్, సమాచారహక్కు నాయకులు జయన్న, ఎమ్మార్పీఎస్ నాయకుడు కిరణ్, కాంగ్రెస్ మీడియా ఇన్చార్జ్ అమానుఉల్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఫిక్ అహ్మద్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపుతోందని, అందులో భాగంగానే వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 25 మానవహారం, 27న ఎస్టీబీసీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహిస్తామని, జూన్ 3న మహిళలతో సమావేశం ఉంటుందని తెలిపారు. -
వినిపిస్తుందో లేదో మిషన్ నిర్ధారిస్తుంది
కర్నూలు(హాస్పిటల్): పుట్టుకతో చెవుడు...మూగ సమస్యతో బాధపడుతుంటారు కొందరు. ఇలాంటి వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడియోమెట్రి పరీక్షలు నిర్వహించి వినికిడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. ఇప్పటివరకు ఈ యంత్రాన్ని అమరిస్తే వినిపిస్తుందా లేదా అని రోగి సంజ్ఞలు చేస్తే దానిని బట్టి నివేదికలు ఇచ్చేవారు. దీనిని ఆసరగా చేసుకుని కొందరు ఎలాంటి సమస్య లేకపోయినా ఉన్నట్లు నటించి వికలాంగ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. ఇలాంటి వాటిని చెక్పెట్టేందుకు ఇప్పుడు బేరా పరీక్ష అందుబాటులోకి వచ్చింది. బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈఎన్టీ విభాగం ఓపీ వద్ద ఏర్పాటు చేసిన బేరా పరీక్ష కేంద్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఎన్టీ హెచ్వోడి డాక్టర్ వీరకుమార్ మాట్లాడుతూ బేరా పరీక్ష ద్వారా రోగికి వినిపిస్తుందా లేదా అన్నది మిషనే నిర్ధారిస్తుందన్నారు. సదరం సర్టిఫికెట్లతో పాటు వినికిడి లోపం, శ్రవణ నాడీ రుగ్మతలు, వినికిడిని ప్రభావితం చేసే నాడీ సంబంధిత పరిస్థితులను నిర్ధారించడంలో ఈ బేరా టెస్ట్ మిషన్ సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో సీఎస్ఆర్ఎంవో డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, డాక్టర్ శివబాలనాగాంజన్, ఈఎన్టి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ చిన్న లింగన్న, డాక్టర్ మమతాదేవి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్
● 16 మోటార్ బైక్లు స్వాధీనంఎమ్మిగనూరురూరల్: గత కొంత కాలంగా మోటార్ బైక్ల దొంగతనమే తన ప్రవృత్తిగా మార్చుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ నుంచి 16 మోటార్ బైక్లను రికవరీ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక పట్టణ పోలీస్స్టేషన్ అవరణలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మధుసుధన్రెడ్డి వివరాలు వెల్లడింఆచరు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించినట్లు చెప్పారు. సి.బెళగల్ మండలం పొలకల్ బీసీ కాలనీకి చెందిన ఉప్పరి వీరేష్, అదే గ్రామానికి చెందిన వర్థన్ అలియాస్ ఇక్బాల్, కోడుమూరుకు చెందిన అబ్దుల్ కలామ్ అలియాస్ మచ్చాలు ముఠాగా ఏర్పడి మోటార్ బైక్ల చోరీలకు చేయటం మొదలు పెట్టినట్లు చెప్పారు. మీరి ముగ్గురిపై పట్టణ పోలీస్స్టేషన్లో 11 , కర్నూల్ –2 టౌన్లో 2, కర్నూల్ తాలూకా స్టేషన్లో 1, సి. బెళగల్ స్టేషన్లో 1, కర్నాటక రాష్ట్రం బళ్లారి గాంధీనగర్ పోలీస్స్టేషన్లో 1 చొప్పున కేసులు ఉన్నాయన్నారు. ఏ1 నిందితుడు ఉప్పర వీరేష్ పట్టణంలోని మంత్రాలయం రోడ్డ్ ఉప్పర కాలనీ కొట్టాల దగ్గర అనుమాన్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం రావటంతో వెళ్లి పట్టుకొన్నట్లు చెప్పారు. విచారణలో మోటార్ బైక్లను దొంగతనం చేసినట్లు అంగీకరించటంతో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. బైక్ల కేసులో ఇప్పటికే కోడుమూరుకు చెందిన అబ్దుల్కలాం అలియాస్ మచ్చా కర్నూల్ తాలూకా పోలీస్స్టేషన్లో ఉన్నాడని, మరో నిందితుడు సి. బెళగల్ వర్థన్ అలియాస్ ఇక్బాల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. పట్టబడిన 16 మోటార్ బైక్ల విలువ రూ. 16.50 లక్షలు ఉంటుందని తెలిపారు. -
నాటుసారా స్వాధీనం
కర్నూలు: ఎకై ్సజ్ అధికారులు 55 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ తన సిబ్బందితో కాల్వ గ్రామ సమీపంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గుడుంబాయి తండాకు చెందిన మాలవత్ ధను నాయక్ ద్విచక్ర వాహనంపై 40 లీటర్ల సారా తీసుకెళ్తూ ఎకై ్సజ్ అధికారులను చూసి బైక్, 40 లీటర్ల సారాను వదిలేసి పారిపోయారు. సారాతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి ధను నాయక్ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. గుమ్మితం తండాలో నాటుసారా బట్టీలపై దాడులు జరిపి వార్తే వీరాంజనేయ నాయక్ వద్ద 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపారు. దాడుల్లో సబ్ఇన్స్పెక్టర్ నవీన్బాబు, కానిస్టేబుళ్లు మురహరిరాజు, మధు, రామలింగయ్య, ఈరన్న, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను అప్రమత్తం చేయాలి
బొమ్మలసత్రం: భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు స్తంభాలు, చెట్ల కింద ఉండకుండా అప్రమత్తం చేయాలని పోలీస్ అధికారులకు ఎస్పీ అధిరాజ్సింగ్రాణా సూచించారు. బుధవారం తన కార్యలయంలో ఆయన మాట్లాడారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న వారు వర్షం పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన విజిబుల్ పోలీసింగ్లో భాగంగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న 94 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. శ్రీశైలంలో తొట్టెల నిర్మాణం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని పైకప్పుల నుంచి లీకేజీ అరికట్టేందుకు దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం సున్నపు, జాజికాయ, బెల్లం తదితర వస్తువుల మిశ్రమాన్ని కలుపుకునేందుకు ఆలయంలో పలు ప్రదేశాలలో తొట్టెల నిర్మాణం చేపడుతున్నారు. పూణేలోని ఉత్తరాదేవి చారిటబుల్ట్రస్ట్ వారితో పురాతన పరిరక్షణ పద్ధతులను అనుసరించి ఆలయంలో పైకప్పుల నుంచి లీకేజీని అరికట్టే పనులు చేపడుతున్నారు. దేవాలయాల ప్రాంగణంలో పరిరక్షణ పనులు చేపట్టడం శుభపరిణామమని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. గతంలో (1965–70, 2013–14 సంవత్సరాల్లో) శ్రీశైల ఆలయంలో స్థానభ్రంశం చెందిన నిర్మాణాలను యథాతధం చేసిన తరువాత పరిరక్షణ పనులు చేపట్టాలని కోరారు. మందులపై తప్పుడు ప్రకటనలు ఇస్తే చర్యలు ● ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి కర్నూలు(హాస్పిటల్): ప్రజలను తప్పుదోవ పట్టించేలా మందుల వినియోగంపై ప్రకటనలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి హెచ్చరించారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ అధిక బరువు తగ్గిస్తామని, పలు రకాల వ్యాధులు నయం చేస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన పలు సంస్థలపై ఇటీవల కేసులు నమోదు చేశామన్నారు. అందులో ఇండోర్కు చెందిన ఈమాన్ డ్రగ్స్, నందికొట్కూరుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి, బనగానపల్లి మండలం బానుముక్కల గ్రామంలోని పక్షవాత నివారణ కేంద్రాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కర్నూలు నగరంలోని గణేష్నగర్ సమీపంలోని పార్థగ్రాండ్లో ఫిజీషియన్ శాంపిల్స్ అక్రమంగా నిల్వ ఉంచుకున్న ఉదయ్కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఇతనిపై ఇప్పటికే పలుమార్లు కేసులు ఉన్నట్లు తెలిపారు. అలాగే నంద్యాలలో శ్రీ వైష్ణవి మెడికల్స్పై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మత్తును కలిగించే మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): సీ క్యాంప్లోని ప్రభుత్వ శారీరక వికలాంగుల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా కోరారు. హాస్టల్లో 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. నిబంధనల మేరకు వంద మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు కార్యాలయ ఫోన్ నంబర్ 08518–277864ను సంప్రదించాలన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం కర్నూలు సిటీ: ఏపీ ఈఏపీ సెట్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. కర్నూలులో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో మొదటి రోజున ఉదయం 1,247 మందికి గాను 1,177 మంది, మధ్యాహ్న సెషన్లో 1,255 మందికి గాను 1,182 మంది హాజరయ్యారు. నంద్యాలలోని మూడు కేంద్రాల్లో మొదటి రోజు ఉదయం 544 మందికి గానూ 520 మంది, మధ్యాహ్నం 543 మందికి గానూ 523 మంది హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. -
దివ్యాంగులకు రీవెరిఫికేషన్ కష్టాలు
బనగానపల్లె: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ పొందుతున్న దివ్యాంగులు తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బుధవారం బనగానపల్లె ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు కొలిమిగుండ్ల, బి ఉప్పలూరు, నాగశెట్టిపల్లి, హనుమంతుగుండం, ఎర్రగుడి గ్రామాలకు చెందిన సుమారు 70 మంది దివ్యాంగులు వచ్చారు. ఉదయం 8 గంటలకు వచ్చినా వైద్యాధికారులు మ ధ్యాహ్నం 12 వరకు అందుబాటులో లేరు. ఆ తర్వాత వచ్చిన వైద్యులు వచ్చినా సర్వర్ పని చేయలేదంటూ సంబంధిత సిబ్బంది సాయంత్రం 5 గంటల వరకు బయోమెట్రిక్ వేయించు కోలేదు. మళ్లీ గురు, శుక్రవారం రావాలంటూ సిబ్బంది పేర్కొనడంతో దివ్యాంగులు తీవ్ర ఆవేదన చెందుతూ వెనుతిరిగి పోయారు. -
ఇంటి వద్ద రేషన్ పంపిణీ బంద్
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు పెంచలమ్మ. శిరివెళ్లకు మజరా గ్రామమైన వెంకటేశ్వరపురంలో నివాసం ఉంటున్నారు. రేషన్ బండి రాకపోతే గతంలో లాగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే శిరివెళ్లకు వెళ్లాలని ఈమె చెబుతున్నారు. వృద్ధాప్యంలో కాలినడకన ఎలా వెళ్లి తెచ్చుగోలనని ఈమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఎండీయూ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం ● 1 నుంచి రేషన్ దుకాణాల వద్దనే పంపిణీ ● కిలోమీటర్లు నడిచి వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సిన దుస్థితి ● ఆందోళనలో 5,41,804 మంది రేషన్ కార్డుదారులు ● రోడ్డున పడనున్న 702 మంది ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు ఆళ్లగడ్డ: రేషన్ కార్డుదారులకు ఐదేళ్లు దూరమైన రేషన్ కష్టాలు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. ఇంటివద్దకే వచ్చి రేషన్ ఇచ్చే ఎండీయూ వాహనాల వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. జూన్ 1 నుంచి పాత పద్ధతిలో రేషన్ దుకాణాలవద్దనే సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇక మీదట రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే తండాలు, గూడేలతో పాటు శివారు కాలనీల వాసులు రాళ్లు రప్పలు దాటుకుంటూ ఎంతదూరమైనా దుకాణం దగ్గరకు వెళ్లాల్సిందే. రోడ్డున పడనున్న ఆపరేటర్లు, హెల్పర్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2021లో ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే ప్రక్రియను ప్రారంభించింది. జిల్లాలో 351 ఎండీయూ వాహనాలు ఉండగా 351 మంది ఆపరేటర్లు, 351 మంది హెల్పర్లను నియమించారు. ఒక్కో వాహనానికి నెలకు రూ. 21 వేలు అందిస్తున్నారు. రెండు, మూడు దుకాణాల పరిధిలో కార్డుదారులకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్యావసరాలను అందిస్తూ వచ్చారు. అనేక మంది ఆపరేటర్లు, హెల్పర్లు దీన్నే జీవనాధరంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల నిలిపివేస్తే 702 కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడుతుంది. వీరి జీవనాధారం దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తారని భావించి ఓటేసి అధికారం కట్టబెడితే తమ కడుపులు కొట్టడం భావ్యం కాదని ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని కోరుతున్నారు. 2027 వరకు ఒప్పందం ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా ఎండీయూ నిర్వాహకులకు 2027 వరకు ఒప్పందం ఉంది. వాహనాల కంతులు సైతం అప్పటివరకూ బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ఎండీయూ వాహనం ధర రూ 5.80 లక్షలు కాగా అందులో 10 శాతం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా.. మిగిలింది ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇందుకు గాను ఎండీయూ నిర్వాహకుడు రూ. 3 వేలు చెల్లిస్తుండగా మిగిలిన రూ. 8 వేలు ప్రభుత్వం ప్రభుత్వం నెలలా చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ పథకాన్ని రద్దు చేస్తే ఈ ఒప్పందాన్ని ఏం చేస్తారని చర్చించుకుంటున్నారు. జిల్లాలోని తెల్ల రేషన్ కార్డులు 5,41,804ప్రతి నెలా కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం7,600 టన్నులుజిల్లాలోని రేషన్ దుకాణాలు 1,204ఎండీయూ హెల్పర్లు 351ఎండీయూ ఆపరేటర్లు 351ఎండీయూ వాహనాలు 351 -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు, మూడేళ్ల క్రితం కావేరి–జాదు రకం బీటీ పత్తి విత్తనాలు రైతులను నిండా ముంచేశాయి. 17 మండలాల్లో దాదాపు 2,400 ఎకరాల్లో పత్తి దెబ్బతినగా.. 1,899 మంది రైతులు నష్టపోయారు. ఎకరాకు 3 క్వింటాళ్ల వరకు నష్టం జరిగిందని, క్వింటాకు రూ.7,300 ప్
బీటీ పత్తి విత్తనాలకు సొంత ధ్రువీకరణ ● కంపెనీల తీరుపై వ్యవసాయ శాఖ మీనమేషాలు ● కో–మార్కెటింగ్ పేరిట బీటీ పత్తి విత్తన వ్యాపారం ● సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్ల పేరుతో దందా ● తరచూ విత్తనం కారణంగా దెబ్బతింటున్న పంట ● గతంలో నిండా ముంచిన ‘కావేరి–జాదు’ ● బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్లు బ్లాక్ విక్రయాలుకర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం మొత్తం మీద పత్తి 5,28,361 హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే దాదాపు 50 శాతం వరకు సాగవుతోంది. కర్నూలు జిల్లాలో 2,34,409 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 18,827 హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటం వల్ల దశాబ్దాలుగా పత్తి రైతుల పాలిట తెల్ల బంగారం అవుతోంది. ఇక్కడ హైబ్రిడ్ పత్తి, బీటీ పత్తి విత్తనోత్పత్తి కూడా ఎక్కువగా ఉంటోంది. విత్తన కంపెనీల దృష్టి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాపైనే ఉండటం గమానార్హం. రాష్ట్రం మొత్తం మీద జరిగే మార్కెటింగ్ ఒక ఎత్తు అయితే, ఇక్కడి మార్కెటింగ్ మరో ఎత్తు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పత్తి సాగుకు విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ కో–మార్కెటింగ్, సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్.. ఇలా రకరకాల పేర్లతో పత్తి విత్తన ప్యాకెట్లను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏది ఒరిజినల్, ఏది నకిలీ తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. వాస్తవానికి కో–మార్కెటింగ్ అనేది లేదు. కానీ అనధికారికంగా సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేర్లతో రైతులను దగా చేస్తున్నా వ్యవసాయ శాఖ చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో 250 కంపెనీలు దాదాపు 1000 దాకా బీటీ పత్తి విత్తన రకాలను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. పంట దెబ్బతింటే దేవుడే దిక్కు! పత్తి విత్తన నాణ్యతపై వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీలే సొంతంగా ధ్రువీకరించుకుంటున్నాయి. ఈ కారణంగా పంట దెబ్బతింటే ఆయా కంపెనీలదే పూర్తి బాధ్యత. అయితే పంట దెబ్బతిన్న సమయంలో వాతావరణ పరిస్థితులను కారణంగా చూపుతూ కంపెనీలు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పంట దెబ్బతిన్నప్పుడు పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 ఖరీఫ్ సీజన్లో కూడా ఒక పేరొందిన కంపెనీ విత్తనంతో సాగు చేసిన పత్తి పలు చోట్ల దెబ్బతినింది. అయితే ఆ కంపెనీ వ్యవసాయ యంత్రాంగాన్ని ముడుపులతో లోబరుచుకొని ఇతర కారణాలతో పంట దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. బ్లాక్లో పత్తి విత్తనాలు ఈ సారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నందున ఈ నెల చివరి వారం నుంచే పత్తి విత్తనాలు నాటుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వందల కంపెనీలు, రకాలు మార్కెట్ను ముంచెత్తుతున్నా.. వీటికి అనుమతులు ఉన్నాయా, లేదా అని వ్యవసాయశాఖ పటించుకున్న పాపాన పోవడంలేదు. ప్రధానంగా రెండు కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లను బ్లాక్లో అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలోకి ఒకవైపు తెలంగాణ నుంచి, మరోవైపు కర్ణాటక నుంచి అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాలోకి వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో పత్తి లూజు విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో నకిలీలు, అనుమతి లేని విత్తనాలను జోరుగా అమ్మకాలు సాగిస్తున్నా వ్యవసాయ శాఖ నుంచి స్పందన కరువైంది. హెచ్టీ పత్తి సాగు ప్రమాదకరం పత్తిలో హెచ్టీ విత్తనాలకు కేంద్రం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. పత్తిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. హెచ్టీ పత్తిలో కలుపు నివారణకు గ్లైపోసేట్ మందును పిచికారి చేస్తే కలుపు నాశనం అవుతుంది తప్ప.. పత్తి పంటకు ఏమీ కాదు. హెర్బిసైడ్ టాలరెంట్(హెచ్టీ) బీటీ పత్తి విత్తనాలు జీవవైవిధ్యానికి ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్రం వీటికి అనుమతివ్వలేదు. అయినప్పటికీ కొంతమంది రైతులు హెచ్టీ పత్తి సాగు చేస్తున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ వచ్చి హెచ్టీ పత్తి విత్తనాలను గుర్తించేందుకు తనిఖీలు జరిపి పరీక్షలు నిర్వహించారు. అయితే తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహించారనే చర్చ జరుగుతోంది. బీటీ టెక్నాలజీని మ్యాన్శ్యాంటో కంపెనీ తెచ్చింది. బీటీ టెక్నాలజీని పొంది విత్తనోత్పత్తి, ప్యాకింగ్, మార్కెటింగ్ చేసుకోవాలంటే మ్యాన్శ్యాంటో నుంచి లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కంపెనీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో 45 కంపెనీలకు లైసన్లు ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే ఒక్క కంపెనీకి మాత్రమే లైసన్స్ ఉంది. కో–మార్కెటింగ్ పేరుతో ఉమ్మడి జిల్లాలో 10 వరకు కంపెనీలు ఉండగా.. సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేరుతో వందలాది కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల మార్కెటింగ్లో నిమగ్నమయ్యాయి. 450 గ్రాముల బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ ఎంఆర్పీ రూ.901. నూజివీడు కంపెనీ రేవంత్ రకం ప్యాకెట్లను రూ.1,300 పైబడిన ధరతో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. యుఎస్ అగ్రీ కంపెనీకి చెందిన 7067 రకాన్ని రూ.1,200 వరకు బ్లాక్లో అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. -
ఆళ్లగడ్డలో అడుగుపెట్టనివ్వను!
ఆళ్లగడ్డ: ‘పార్టీలో నా ప్రమేయం లేకుండా పదవులు ఇస్తున్నారు. నాకు తెలియకుండా ఎవరికైనా పదవి ఇస్తే ఊరుకోను. వారిని నియోజకవర్గంలో అడుగుపెట్టనిచ్చేది లేదు..’ అని ఆళ్లగడ్డలో సోమవారం రాత్రి జరిగిన మినీ మహానాడులో టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. ఆమె వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. శిరివెళ్ల మండలానికి చెందిన నరసింహారావుకు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యే అఖిలప్రియ అధిష్టానానికి చెప్పడంతోపాటు అదే మండలానికి చెందిన శ్రీకాంత్రెడ్డికి ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అయినా అధిష్టానం ఆమె మాట లెక్క చేయకుండా నరసింహారావుకే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతోనే మినీ మహానాడులో అధిష్టానానికి అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చినట్లు టీడీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.అఖిలప్రియకు షాక్.. ఇన్చార్జిగా వాసు? ఇటీవల ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై మీడియాలో వరుస కథనాలు రావడంతో పార్టీ పరువుపోతోందని అఖిలప్రియపై టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ను కలిసేందుకు ఆమె వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. దీనికితోడు ఇటీవల అమరావతిలో ప్రధానమంత్రి సభకు అఖిలప్రియకు పాస్లు పంపకపోవడం, సీఎం కర్నూలుకు వచ్చినప్పుడు కూడా ఆమెకు ఆహ్వానం లేకపోవడంతో అక్కడకు వెళ్లలేదన్న అంశాలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకైనా సిద్ధమని మినీ మహానడు వేదికగా అఖిలప్రియ హెచ్చరిక జారీ చేయడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారని, ఆళ్లగడ్డకు టీడీపీ ఇన్చార్జిగా సీపీ వాసును నియమించేందుకు రంగం సిద్ధమైందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
హిందీ పరీక్షకు 356 మంది గైర్హాజర్
నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో మంగళవారం జరిగిన హిందీ పరీక్షకు 356 మంది గైర్హాజరైనట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. జిల్లాలో 35 పరీక్ష కేంద్రాల్లో 504 మంది విద్యార్థులకు గాను 148 మంది విద్యార్థులు (29.36) శాతం పరీక్షకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్, 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షల్లో భాగంగా ఇంగ్లిష్ పరీక్ష నాలుగు కేంద్రాల్లో నిర్వహించగా 105 మంది విద్యార్థులకు గాను 86 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి నంద్యాల(న్యూటౌన్): తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో పని చేస్తున్న కెప్టెన్, డ్రైవర్స్కు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏఓ రవికుమార్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, బాలవెంకట్, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిషన్లు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలకు ఒక సారి కాకుండా ప్రతి నెల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సీఐటీయూ అనుబంధ యూనియన్ అధ్యక్షుడు ఖాజా, రఫీ, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, ట్రెజరర్ సుభాన్, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, రసూల్, ఖాదర్, బాషా, మనోహర్, తదితరులు పాల్గొన్నారు. తూనికలు, కొలతలపై అవగాహన నంద్యాల(వ్యవసాయం): పంచ కొలతల దినోత్సవం సందర్భంగా స్థానిక రిటైల్ మర్చంట్ వ్యాపారస్తుల కార్యాలయంలో మంగళవారం తూనికలు, కొలతలపై వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ప్రకొలతల జిల్లా సహాయ అధికారి జిలాని బాషా ఆధ్వర్యంలో అవగామన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనాలన్నారు. ప్యాకేజీ వస్తువులపై ఎమ్మార్పీ, తయారీ తేదీలు తప్పక ప్రకటించి ఉండాలన్నారు.జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు న్యాయవాది అమీర్బాషా ఆహార పదార్థాలు, పెట్రోలు, బంగారు వస్తువుల విక్రయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డగాళ్ల మల్లికార్జున, అధికారులు అనిత, ఖాజా హుసేన్ నాగప్రసాద్ అల్లూరయ్య శ్రీనివాసు గుప్తా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం డిగ్రీ కళాశాలకు నాక్ గ్రేడ్ శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ అక్రిడిటేషన్ కమిటీ ‘బి’ గ్రేడ్ను మంజూరు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్బాషా మంగళవారం తెలిపారు. కళాశాలలో బోధన, వసతులు, తరగతి గదులు, క్యాంటీన్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, పచ్చదనం, పరిశుభ్రత అంశాలను అక్రిడిటేషన్ కమిటీ పరిశీలించింది. అలాగే కళాశాల డెవలెప్మెంట్ కమిటీ, అలూమినీ అసోషియేషన్ సహకారం పరిగణలోకి తీసుకొని ‘బీ’ గ్రేడ్ను మంజూరు చేసింది. ఈ సందర్భంగా అలూమిని అసోసియేషన్ అధ్యక్షుడు సాల్మన్ మాట్లాడుతూ భవిష్యత్లో ‘ఎ’ గ్రేడ్ సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని, అందుకు ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్ధులు సహకరించాలని కోరారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(న్యూటౌన్): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులును సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలనాగన్న, నాగరాజు, కాశన్న, దేవదానం, రవికాంత్ బాబు, రమేష్ నాయక్, వెంకటేష్ నాయక్, మురళీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను ఎప్పటికపుడు విచారించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కేసు వివరాలతో కూడిన నివేదికలను వారం రోజులకు ముందుగానే డీవీఎంసీ సభ్యులు అందజేయాలన్నారు. ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2025 వరకు 287 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా 471 మంది బాధితులకు సంబంధించి రూ.6.27 కోట్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు లేవనెత్తిన అంశాలు, గ్రామాల్లో శ్మశాన వాటికల ఏర్పాటుపై సంబంధిత ఆర్డీఓలు, అధికారులు దృష్టి పెట్టాలన్నారు. సఫాయి కర్మాచార్యులకు తగిన సౌకర్యాలు కల్పిస్తాం... సఫాయి కర్మాచారులు కాలువలు పరిశుభ్రం చేసేటప్పుడు తగిన మాస్కులు, గ్లౌజులు అందజేస్తామన్నారు. అదే విధంగా సఫాయి కర్మాచారులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ మంద జావలి అల్ఫోన్స్, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు విశ్వనాథ్, నరసింహులు, అరుణజ్యోతి, ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్, అదనపు మున్సిపల్ కమీషనర్ దాస్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
ఐఐటీ/నీట్ అకాడమీ ప్రవేశాలకు 25న పరీక్ష
కర్నూలు(అర్బన్): 2025–26 విద్యా సంవత్సరా నికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ/నీట్ అకాడమీ ల్లో ప్రవేశానికి రెండవ దశ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. మొదటి దశ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో పంపించామన్నారు. చిన్నటేకూరు కేంద్రానికి కేటాయించిన అభ్యర్థులు తాజాగా డౌన్ లోడ్ చేసుకున్న హాల్టికెట్ లేదా పాత హాల్టికెట్ తో ఈ నెల 25న ఉదయం 11 గంటల్లోపు హాజరు కావాలన్నారు. పరీక్ష సమయం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామ న్నారు. సమాచారం కోసం http://apbragcet. apcfss.inను సందర్శించాలని డీసీఓ కోరారు. గోరుకల్లు కట్ట పనులకు ప్రణాళిక రూపొందించండి పాణ్యం: గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశంలో త్వరగా పనులు చేసేందుకు ప్రణాళికలు రూ పొందించాలని ఎస్సార్బీసీ ఎస్ఈ పునర్ధనరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశాన్ని పరి శీలించి మాట్లాడారు. ఇటీవల ఎక్స్ఫర్ట్ కమిటీ సభ్యు లు గోరుకల్లును సందర్శించారని చెప్పారు. జలాశయంలో 3.5 టీఎంసీల నీరు ఉండడంతో పనులు చేసేందుకు వీలుపడదన్నారు. నీటి నిల్వను తగ్గించడంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. రివిట్మెంట్ పనులు పూర్తి చేస్తేనే గోరు కల్లు రిజర్వాయర్లో వరదనీటిని నిల్వ చేసేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఈఈ సుభకుమార్, డీఈఈలు జ్యోతి, గీతారాణి పాల్గొన్నారు. మైనారిటీలకు సబ్సిడీ రుణాలు ● దరఖాస్తుకు ఈ నెల 25 ఆఖరు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిష్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ. లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిస్టియన్ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకొని ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూ రవుతుందన్నారు. అర్హులు తమ వివరాలను ( https:// apobmms. apcfss.in) వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయంలో, లేదా 9848864449, 9440822219ను సంప్రదించవచ్చన్నారు. -
రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి అన్నదాతకు అడుగడుగునా సాయమందించి అండగా నిలుస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎగనామం పెడుతోంది. మొదటి ఏడాదిలో ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసినా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. మరో పది రోజుల్లో మళ్లీ ఖరీఫ్ సీజన్ ప్రారంభంకానుండటంతో ఈ ఏడాద
● అన్నదాత సుఖీభవపై కూటమి సర్కారు ప్రకటనలకే పరిమితం ● రూ. 20 వేల సాయం మొదటి సంవత్సరం ఉత్తిదే! ● మళ్లీ పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం ● ఈ ఏడాదైనా భరోసా దక్కేనానని అనుమానం సాగుకు పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతు వైఎస్సార్సీపీ పాలనలో ఇలా.. కోవెలకుంట్ల: పంటల సాగుకు ఏటా పెట్టుబడి పెరిగిపోతుంది. విత్తనం, సేద్యం, రసాయన ఎరవులు, పురుగు మందులు, కూలీలు.. ఇలా ఎన్నో ఖర్చులు. పెట్టుబడికి అప్పులు చేయడం, పంటలు చేతికందక నష్టపోవడం రైతులకు పరిపాటిగా మారింది. అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి విస్మరిస్తోంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 2.51 లక్షల మంది రైతులు ఉన్నారు. ముందస్తు వర్షాలు ఆశాజనకంగా మారటంతో ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. గతేడాది వరి, మిరప సాగుతో తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులు ఆ నష్టాన్ని ఈ ఏడాది పూడ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. వరిసాగులో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడులు మాత్రమే రావడం, బస్తా రూ. 12 వందలు కూడా ధరలేకపోవడంతో నష్టపోయారు. మిరపలో ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోవడం, క్వింటా రూ. 8 వేలు ధర పలకపోవడంతో నష్టాల ఊబిలో కూరక పోయారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రూ. 20 వేలు ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆ హామీ ఇప్పటి వరకు నెరవేర లేదు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో అధిక విస్తీర్ణంలో పప్పుశనగ పంట సాగు చేయగా వర్షాభావం, తెగుళ్లు వెంటాడి దిగుబడులు తగ్గిపోగా మద్దతు ధర లేక పంట ఉత్పత్తులను ఇప్పటి వరకు గోదాముల్లో భద్రపరుచుకున్నారు. రెండు సీజన్లలో పంటలు నష్టపోయినా ప్రభుత్వసాయం దక్కలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. రబీసీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినడంతో జిల్లాలోని బనగానపల్లె, సంజామల, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, బేతంచెర్లను కరువు మండలాలుగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ మండలాలకు ఎలాంటి కరువు సాయం అందలేదు. కేంద్రబృందం పర్యటించినా అందని సాయం.. 2023–24 సంవత్సరంలో రబీ సీజన్లో ఆయా వర్షాభావ పరిస్థితుల్లో 38,801 హెక్టార్లలో శనగ, జొన్న, మినుము, కంది, మొక్కజొన్న, తదితర 16 రకాల పంటలు దెబ్బతిన్నట్లు అప్పట్లో అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాకు నష్టపరిహారం కింద రూ. 37.76 కోట్ల అవసరమవుతాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్రబృందం గత ఏడాది జూన్ నెల 20వ తేదీన జిల్లాలో పర్యటించింది. కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులతో సాగు చేసిన పంటల్లో తీవ్ర నష్టం వాటిల్లి పెట్టుబడులు నేలపాలయ్యాయని రైతులు కేంద్రబృ ందం ఎదుట ఏకరువు పెట్టారు. శనగ, జొన్న, మినుము, కంది, మొక్కజొన్న, తదితర పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. వర్షాభావంతో రైతులకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని, నివేదికలను ప్రభుత్వానికి పంపంచి అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్రబృందం హామీ ఇచ్చింది. జిల్లాలో కేంద్రబృందం పర్యటించి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు పంటనష్ట పరిహారం ఊసే లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ఐదేళ్లలో రైతు భరోసా సాయం వివరాలు సంవత్సరం రైతులసంఖ్య అందిన సాయం (లక్షల్లో) (రూ. కోట్లలో) 2019-20 2.09 283.31 2020-21 2.15 291.51 2021-22 2.15 291.05 2022-23 2.21 298.67 2023-24 2.19 220.97 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండుగలా సాగింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను అన్నివిధాలా ఆదుకున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల సాగుకు పెట్టుబడుల కోసం వడ్డీవ్యాపారులను ఆశ్రయించకుండా ప్రతి ఏటా పీఎం కిసాన్ నిధితో కలిపి వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రూ. 13,500 అందించారు. విత్తనానికి ముందే పెట్టుబడిసాయం అందటంతో రైతులు విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహార మందులు కొనుగోలు చేసి వివిధ రకాల పంటలు సాగు చేసి ఆయా పంటల్లో అధిక దిగుబడులు సాధించారు. గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఎరువులు, క్రిమి సంహారక మందులు సరఫరా చేసి రైతన్నకు దన్నుగా నిలిచారు. పంటకు ముందే మద్దతు ధర ప్రకటించి మార్కెట్లో గిట్టుబాటు ధర లేని సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం సంభవిస్తే అదే సీజన్లో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకున్నారు. -
కొను‘గోడు’పట్టదా..?
● ఐదు రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద ఆగిన జొన్నల లారీలు, ట్రాక్టర్లు ● రోజుల తరబడి నిరీక్షిస్తున్న రైతులు ● పట్టించుకోని పాలకులు, అధికారులు ● ఆందోళనలో జొన్న రైతులు ఆళ్లగడ్డ: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతన్న ఆపసోపాలు పడుతున్నాడు. కొను గోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఐదురోజులుగా జొన్న రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఓ వైపు వరుణుడు ఉరుముతుండగా.. మరో వైపు వాహనాల అద్దె భయపెడుతుండగా జొన్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం జొన్నలు మద్ధతు ధర రూ. 3,371తో కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నంద్యాలలో కొనుగోలు కేంద్రం నిండిపోవడంతో అధికారుల సూచన మేరకు రైతులు తమ జొన్నలను లారీలు, ట్రాక్టర్లతో తీసుకుని ఆళ్లగడ్డ కొనుగోలు కేంద్రానికి చేరుకుంటున్నారు. అయితే ఐదు రోజులుగా వచ్చిన రైతులకు ట్రక్ సీట్ ఇస్తున్నారే తప్ప అన్లోడ్ చేసే వారు లేక పోవడంతో రైతులు రాత్రి పగలు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సుమారు 100 మంది దాక రైతులు, డ్రైవర్లు అందరు మార్కెట్ యార్డులోనే ఉంటున్నామని అయినా ఎపుడు దించుకుంటారో, అస్సలు దించుకుంటారో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సిబ్బందిని అడిగితే ‘ట్రక్ సీట్ ఇచ్చేవరకే మాకు సంబంధం.. దించుకుంటారో లేదా అన్నది కొనుగోలు కేంద్రంలో ఉన్నవారు చూసుకోవాలి అని సమాధానమిస్తున్నారు. అక్కడ మాత్రం సమాధానం ఇచ్చే వారు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్య ఏమిటో తెలియకపోవడంతో చివరకు కొందరు రైతు లు స్థానిక ఎమ్మెల్యే అఖిలప్రియకు సమస్యను విన్నవించగా. .‘మాట్లాడుదాం మిని మహానాడు దగ్గరకు రండి చెప్పారు. ఎంతో ఆశతో అక్కడకు వెళితే పట్టించుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఐదు రోజులుగా అక్కడే! ఇక్కడ జొన్నల లోడు లారీ దగ్గర నిల్చున్న రైతు నంద్యాల మండలం కానాలకు చెందిన శివారెడ్డి. నంద్యాలలో గోడౌన్ ఫుల్ అయిందని ఆళ్లగడ్డ గోడౌన్కు వెళ్లమని చెప్పడంతో తన 340 సంచుల జొన్నలను లారీ బాడుగకు తీసుకుని ఆళ్లగడ్డకు వేసుకొచ్చాడు. ఐదు రోజులైనా దించుకోక పోవడంతో అక్కడే ఉంటున్నాడు. లారీ బాడుగ రూ. 18,000, ఇవ్వడంతో పాటు హాల్టింగ్కు రోజుకు రూ. 2 వేలు, బత్తా రూ. 100 ఇవ్వాల్సి వస్తోంది. దీంతో పాటు ఐదు రోజులుగా లోడు అలాగే ఉండటంతో లారీ టైర్లు దెబ్బతింటాయని, దానికి కూడా డబ్బులు ఇవ్వాలని డ్రైవరు భయపెడుతున్నాడు. మరోవైపు కురుస్తున్న వర్షానికి జొన్నలు తడిసిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతు శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.బాడుగ తడిసి మోపెడు.. ఇక్కడ ట్రక్ సీట్ (జొన్నలు దించుకోమని మార్క్ఫెడ్ సిబ్బంది ఇచ్చిన రసీదు) చూపుతున్న ఈ రైతు బండారు శ్రీనివాసులు. మండల కేంద్రం దొర్నిపాడుకు చెందిన ఈ రైతు తన 100 ప్యాకెట్ల జొన్నలు కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు శనివారం రాత్రి ఆళ్లగడ్డ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. వచ్చిన వెంటనే మార్క్ఫెడ్ సిబ్బంది ఆన్లైన్లో అన్నీ పరిశీలించి ట్రక్ సీట్ ఇవ్వడంతో సంతోషంతో కొనుగోలు కేంద్రం (ప్రభుత్వ మార్కెట్ యార్డు)కు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ బారులుదీరి నిలుచున్న వాహనాలను చూసి ఏమైంది?.. అని ఆరా తీయడంతో తన కంటే ముందు నుంచే ఇక్కడ ఉన్నామని దించుకునే నాథుడే లేడని చెప్పడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. రోజుకు రూ. 3 వేలు ట్రాక్టర్ బాడుగతో పాటు ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. -
దిగుబడులు అంతంతగానే
ఎకరాకు రూ. 12,500 కౌలు చెల్లించి ఎనిమిది ఎకరాల్లో రబీ సీజన్లో వరి సాగు చేశాను. పైరు పొట్టదశలో కుందరవాగుకు సాగునీరు నిలిచిపోయింది. ఎన్నో కష్టాలు పడి సాగునీరు మళ్లించుకున్నాను. ఎరువులు, పురుగు మందులు, కోత, నూర్పిడి, సాగునీరు మళ్లింపు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 35 వేల నుంచి 40 వేలు పెట్టాను. పెట్టుబడులు భారీగా పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి. – ప్రతాప్రెడ్డి, రైతు, భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం పెట్టుబడుల కోసం అప్పులు చేశాను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విత్తనానికి ముందే రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ. 13,500 సాయమందేది. ఆ మొత్తంతో విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు ఎలాంటి డోకా ఉండేదికాదు. గత ఏడాది నుంచి పెట్టుబడి సాయం అందలేదు. రబీ సీజన్లో జొన్న, శనగ పంటలు సాగు చేశాను. పెట్టుబడికోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. – రామసుబ్బరాయుడు, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం ఈ ఏడాదైనా పెట్టుబడిసాయం ఇవ్వాలి ఈ ఏడాది నాకున్న మూడున్నర ఎకరాల పొలంతోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప, మొక్కజొన్న పంటలు సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నాను. గత ఖరీఫ్, రబీసీజన్లలో పెట్టుబడిసాయం అందలేదు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఖరీఫ్సీజన్ ప్రారంభంకానుంది. ఈ ఏడాదైనా పెట్టుబడిసాయం అందించి ఆదుకోవాలి. – కుళాయప్ప, రైతు, అమడాల, కోవెలకుంట్ల మండలం ● -
గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
బొమ్మలసత్రం: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు అడిషనల్ ఎస్పీకి 67 వినతులను అందించారు. కొన్ని సమస్యలను ఆయన ఫోన్లో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను త్వరగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ జయరాముడు పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
ప్యాపిలి: మండల పరిధిలోని ఎస్ రంగాపురంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు, సునీతల కుమారుడు చరణ్ (10) సోమవారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన చరణ్.. వేసవి సెలవులు కావడంతో తోటి మిత్రులతో కలసి ప్రతిరోజూ గ్రామ శివారులోని కుంటలో ఈత నేర్చుకునేవాడు. రోజులాగే సోమవారం కూడా ఈతకు వెళ్లాడు. నీటిలో మునిగిపోకుండా వీపునకు ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని కాసేపు ఈత కొట్టాడు. తర్వాత ప్లాస్టిక్ డబ్బా తొలగించి కుంటలోకి దూకి బయటకు రాలేకపోయాడు. కొద్ది సేపటి తర్వాత అదే కుంటలో ఈత కొడుతున్న కొందరు అడుగున తమకు ఏదో తగులుతోందని గుర్తించారు. వెంటనే అందరూ కలిసి అడుగున ఉన్న చరణ్ను బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.బాలికపై లైంగికదాడికి యత్నం బేతంచెర్ల: మండల పరిధిలోని బుగ్గానిపల్లె తండాలో ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిన్నారి ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన హరీష్ నాయక్ మాయమాటలు చెప్పి తన ఇంటిపైకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నంచాడు. చిన్నారి కేకలు వేస్తూ తప్పించుకుని వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దేవనకొండ: అప్పుల బాధతో దేవనకొండకు చెందిన గిడ్డిగారి ప్రకాష్(48) అనే రైతుసోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూడు ఎకరాల పొలంలో పంటలు పండిస్తూనే సెంట్రింగ్ పనులు చేస్తూ ప్రకాష్ జీవనం సాగించేవాడు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలు సరిగా పండలేదు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి దాదాపు రూ.15 లక్షలు దాకా అప్పులపాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక నిత్యం సతమతమవుతూ ఉండేవాడు. భార్య పిల్లలు బంధువుల శుభకార్యానికి వెళ్లగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా శవమై వేలాడుతున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీస్స్టేషన్కు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించండి
నంద్యాల(న్యూటౌన్): ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 213 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. స్వీకరించిన ప్రతి అర్జీకి కచ్చితమైన పరిష్కార మార్గాలు చూపాలన్నారు. 49 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వీటన్నింటినీ తక్షణమే పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న 62 వీఐపీ అర్జీలను కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణ 43.15 శాతం మాత్రమే జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న డేటాను త్వరితగతిన సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సర్వేలలో భాగంగా మన మిత్ర క్యాంపెయిన్కు సంబంధించి ఇంకా 13,724 పెండింగ్ ఉందని, వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి 2,367 పెండింగ్లో ఉన్నాయని, సంబంధిత సర్వేను వెంటనే పూర్తి చేయాలన్నారు. మిస్సింగ్ సిటిజన్స్కు సంబంధించి 712, సిటిజన్ ఈకేవైసీ 2,34,772 మందికి పెండింగ్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
ముట్టడికి తరలిరండి
నంద్యాల(న్యూటౌన్): ఈనెల 21న ఉమ్మడి జిల్లా విద్యాశాఖ కార్యాలయం, 23న విజయవాడలోని విద్యాభవన్ ముట్టడి కార్యక్రమాలకు ఉపాధ్యాయులు తరలిరావాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు సాంబశివుడు, రామపక్కీర్రెడ్డి, మహమ్మద్ కాశీం, రామచంద్రారెడ్డి, అబ్దుల్అజీజ్, వెంకటరమణ కోరారు. సోమవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయ ఆవరణంలో ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు మాధవస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాల పునర్వీభజన, క్రమబద్దీకరణకు ప్రభుత్వం జారీ చేసిన 19, 20, 21 ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, జీఓ నెం.117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ముట్టిడి కార్యక్రమాలకు ప్రతి ఉపాధ్యాయుడు తరలిరావాలన్నారు. సమావేశలలో ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు భాస్కరరెడ్డి, కృష్ణారావు, మౌలాలి, సుబ్బయ్య, కృష్ణార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నేర్పిస్తున్నందుకు తృప్తిగా ఉంది
16 ఏళ్ల నుంచి ఆధునిక నృత్యంలో శిక్షణ ఇస్తున్నాను. ఈ శిబిరంలో శిక్షణ పొందిన వారు కొందరు డ్యాన్స్ అకాడమీలను స్థాపించుకున్నారు. మరికొందరు ప్రైవేటు విద్యాసంస్థల్లో డ్యాన్స్ మాస్టర్లుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో తృప్తిగా ఉంది. – రాజాహుసేన్, డ్యాన్స్ మాస్టర్ నృత్యం నేర్చుకుంటున్నా ఆరేళ్ల నుంచి వేసవిలో నృత్యం నేర్చుకుంటున్నాను. ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. బాగా నేర్పుతున్నారు. జూన్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంటుందంటా. అందుకే బాగా నేర్చుకుంటున్నాను. – గోవర్ధిని, శిక్షణ పొందుతున్న విద్యార్థిని భవిష్యత్తులోనూ నేర్పిస్తా ఎక్కువ మంది చిన్నారులు ఆధునిక నృత్యంపైనే ఆసక్తి చూపుతున్నారు. నాలుగైదేళ్ల చిన్నారులు కూడా హుషారుగా, ఎంతో జోష్తో పాల్గొంటున్నారు. ఫీజు లేకపోయినా సరే చిన్నారులకు నేర్పుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మున్ముందు కూడా చిన్నారులకు డ్యాన్స్ నేర్పిస్తా. – డాక్టర్ లలితాసరస్వతి, భరతనాట్యం డ్యాన్స్ మాస్టర్ -
అరకొరగా విత్తన కేటాయింపులు
విత్తన పంపిణీలో అంతులేని నిర్లక్ష్యం ● వర్షాలు కురుస్తున్నా స్పందించని ప్రభుత్వం ● బకాయిలు చెల్లిస్తేనే విత్తన సరఫరా అంటున్న కంపెనీలు ● ఇప్పటి వరకు మొదలుకాని ప్రాసెసింగ్ ప్రక్రియ ● గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మే 15 నుంచే పంపిణీ ● ఇప్పుడు అరకొర కేటాయింపులతో సరి ● వర్షాలు కురుస్తుండటంతో దిక్కుతోచని రైతులు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మంచుకొస్తోంది. వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ విత్తనం అందుబాటులో లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారుతోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు మే నెల 15 నుంచే విత్తన పంపిణీ జరిగింది. వర్షాలు పడిన వెంటనే విత్తనాల కోసం ఎదురు చూడకుండా సకాలంలో విత్తుకునే అవకాశాన్ని కల్పించింది. 2024 ఖరీఫ్ సీజన్ సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల సకాలంలో విత్తన పంపిణీ సాధ్యమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో విత్తన పంపిణీపై దృష్టి సారించని పరిస్థితి. సబ్సిడీ పంపిణీలో వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు ప్రధానమైనవి. ఈ విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ సరఫరాకు కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచి రేట్లు ఖరారు చేసినప్పటికీ సంబంధిత కంపెనీలు విత్తన సరఫరాకు సిద్ధంగా లేవని తెలుస్తోంది. ఇంతవరకు ప్రాసెసింగ్ ప్రక్రియనే మొదలు పెట్టలేదంటే పంపిణీ ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో రైతులు వేరుశనగ విత్తనం కాయల కోసం వ్యాపారులను ఆశ్రయించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024–25 బకాయిలు చెల్లిస్తేనే విత్తన సరఫరా రాష్ట్రం మొత్తం మీద ఏపీ సీడ్స్కు విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు 45 వరకు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 3 కంపెనీలు సరఫరా చేయాల్సి ఉంది. 2024–25 ఖరీఫ్ సీజన్లో వేరుశనగ, రబీ సమయంలో సరఫరా చేసిన శనగ(బెంగాల్గ్రామ్), ఇతర విత్తనాలకు ఏపీ సీడ్స్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సబ్సిడీ మొత్తం ప్రభుత్వం నుంచి ఏపీ సీడ్స్కు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం ఏపీసీడ్స్కు ఒక్క రూపాయి కూడా విదిల్చకపోవడం వల్ల సరఫరా చేసిన కంపెనీలకు నగదు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. బకాయిలు చెల్లిస్తేనే విత్తనాలు సరఫరా చేస్తామంటూ కంపెనీలు బీష్మించాయి. విత్తనాల కోసం రైతులకు తప్పని తిప్పలు ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నా విత్తన పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ సారి సబ్సిడీ విత్తన పంపిణీ విషయమై కూటమి ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశం ఉండటంతో రైతులు విత్తనాల కోసం దిక్కులు చూస్తున్నారు. ఇప్పటి వరకు వేరుశనగ క్వింటా ధర రూ.6,500 ఉండగా.. వ్యాపారులు ఉన్నట్లుండి ధరను పెంచేశారు. ఈ సారి విత్తనాల పంపిణీ దిశగా ప్రభుత్వ చర్యలు లేకపోవడం వ్యాపారులకు కలసి వస్తోంది. ధరలను అడ్డగోలుగా పెంచి దోపిడికి పాల్పడే ప్రమాదం ఏర్పడింది. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు సమస్య ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉన్నందున పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు డిమాండ్ ఉంది. నంద్యాల జిల్లాలో వరి ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో కూడా వరి సాగవుతోంది. వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలైన జీలుగ, పిల్లిపెసర, సన్హెంఫ్ విత్తనాలు విత్తుకొని 45 రోజుల సమయంలో దున్ని పొలంలో కలిపేస్తారు. ఇందువల్ల భూమికి అన్ని పోషకాలు కలిగిన ఎరువులు లభిస్తాయి. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు జిల్లాకు కనీసం 3,500 క్వింటాళ్లు అవసరం. అయితే ఏపీ సీడ్స్ వద్ద కేవలం 1000 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. కంపెనీలు విత్తన సరఫరా చేయడంలో చేతులెత్తేశాయి. ఇప్పటికే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల కోసం రైతులు వ్యవసాయ అధికారులు, ఏపీ సీడ్స్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో విత్తనాలను అందుబాటులో పెట్టకపోతే రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్లో వేరశనగ ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో 54,170 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 11,943 హెక్టార్ల వరకు సాగయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వేరుశనగ సాగు చేపట్టేందుకు 32,181 క్వింటాళ్ల విత్తన కాయలు అవసరమని మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నివేదించారు. ఆయా జిల్లాల అధికారులు వినతిని కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఉమ్మడి జిల్లాకు తూతూమంత్రంగా 11,108 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. సాధారణంగా గత ఏడాది ఏఏ విత్తనం ఏ మేర పంపిణీ అయిందో దానికి అనుగుణంగా విత్తనాలను కేటాయిస్తారు. గత ఏడాది ఖరీఫ్లో కర్నూలు జిల్లాకు 14,395 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 3,062.7 క్వింటాళ్ల ప్రకారం విత్తన పంపిణీ జరిగింది. కనీసం ఈ ప్రకారమైన కేటాయించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. కర్నూలు జిల్లాకు 9,099, నంద్యాల జిల్లాకు 2,009 క్వింటాళ్లతో సరిపెట్టడం గమనార్హం. ఈ కేటాయింపులు చూసి అధికారులు పంపిణీ ఎలా చేపట్టాలోనని తలలు పట్టుకుంటున్నారు. -
పొగాకును కొనుగోలు చేయాలి
నంద్యాల(అర్బన్): రైతులు పండించిన పొగాకు దిగుబడులను కంపెనీలు కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు. పొగాను కొనుగోలు చేసేలా కంపెనీలతో అధికారులు చర్చలు జరపాలన్నారు. జిల్లాలో రైతులు పండించిన పొగాకును ఒప్పందం మేరకు కంపెనీలు తక్షణమే కొనుగోలు చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆద్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యత లోపం పేరుతో పొగాకు బేళ్లను వెనక్కు పంపకుండా ఒప్పందం మేరకు పండించిన దిగుబడులను క్వింటా రూ.18,500తో కొనుగోలు చేయాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. కంపెనీలతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి రామచంద్రుడు, సభ్యులు ప్రసాద్, నరసయ్య, రైతులు రఘురామిరెడ్డి, నారాయణ, వెంకటేశ్వరగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. -
వాల్మీకి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
ఆదోని సెంట్రల్: ఎమ్మిగనూరులో నిర్వహించిన కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ వాల్మీకి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తామని, వారు భవిష్యత్లో ఉన్నత స్థానానికి ఎదిగేలా చూస్తామన్నారు. వాల్మీకి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారు అభివృద్ధి వైపు నడిచేలా చూస్తామన్నారు. గౌరవాధ్యక్షులుగా కర్నూలుకు చెందిన టి.బాలవెంకటేశ్వర్లు (రిటైర్డ్ ఉద్యోగి), అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన బి.మల్లన్న, (ఏడీ, వెటర్నరీశాఖ), ప్రధాన కార్యదర్శిగా ఆదోనికి చెందిన బి.సుధాకర్బాబు (ఉపాధ్యాయుడు), కోశాధికారిగా కోసిగికి చెందిన ఎస్.వెంకటరెడ్డి (ఉపాధ్యాయుడు), ఇతర సలహాదారులు, ఉపాధ్యక్షులు, అదనపు కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకున్నట్లు చెప్పారు. వాల్మీకి ఉద్యోగ సంఘం గౌరవ సలహాదారుడు వెంకన్న, ఉపాధ్యక్షుడు హుసేని, ఇతర నాయకులు పులుసు నారాయణ, తిమ్మారెడ్డి, లక్ష్మీనారాయణ, రఘునాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్లో కొనాల్సి వస్తుందేమో
ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తాం. గత ఏడాది వరకు మే 15 నుంచే వేరుశనగ సహా అన్ని రకాల విత్తనాల పంపిణీ చేశారు. ముందస్తుగా విత్తనాలు సిద్ధం కావడంతో వర్షాలు కురిసిన వెంటనే సకాలంలో విత్తుకు అవకాశం ఉండేది. ఈ సారి సబ్సిడీపై విత్తనాల పంపిణీ జరుగుతుందో, లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. విత్తనాల కోసం దిక్కుతు చూడాల్సి వస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో విత్తనాలు అందుబాటులోకి రాకపోతే బ్లాక్లో కొనాల్సిందే. – సత్యప్ప, మామిళ్లకుంట, తుగ్గలి మండలం ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియదు 13 ఎకరాల్లో వరి, వేరుశనగ 8 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. మామూలుగా అయితే పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు వినియోగించం. మొదటిసారిగా వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు విత్తుకోవాలనుకున్నాం. కానీ వ్యవసాయ శాఖ ఇంతవరకు విత్తనాల పంపిణీ చేపట్టలేదు. కేటాయింపులు అరకొరగా ఉన్నాయి. ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చెప్పడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని మొదటిసారి చూస్తున్నాం. – కెంచప్ప, గజ్జెహళ్లి, హొలగొంద మండలం -
వడ్ల వ్యాపారిపై కేసు నమోదు
అవుకు: నకిలీ రశీదులు సృష్టించి లారీలను చెక్పోస్టులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్న వడ్ల వ్యాపారిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు, బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపిన వివరాలు.. అవుకు పట్టణానికి చెందిన వడ్ల వ్యాపారి సాయి ఈనెల 5న రాత్రి 10 గంటలకు వరి బస్తాల లోడ్ లారీని అవుకు నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా బేతంచెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు వద్ద మార్కెట్ కమిటీ అసిస్టెంట్ తనిఖీ చేశారు. కడప జిల్లా కమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి బిల్లు చెల్లించినట్లు ఉన్న రశీదులను లారీ డ్రైవర్ చూపించాడు. అసిస్టెంట్కు రశీదులపై అనుమానం వచ్చింది. లారీ డ్రైవర్ మార్కెట్ కమిటీ అసిస్టెంట్కు సుపరిచితుడు కావడంతో విషయాన్ని ఆరా తీశారు. దీంతో నకిలీ రశీదులని తెలియడంతో వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. బిల్లులు ఎవరిచ్చారని డ్రైవర్ను విచారించగా అవుకు గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి సాయి ఇచ్చినట్లు చెప్పడంతో బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి అవుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దీంతో సాయిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. -
ఏపీ ఈఏపీ సెట్కు 94.04 శాతం హాజరు
కర్నూలు సిటీ: ఏపీ ఈఏపీ సెట్ సోమవారం ప్రారంభం కాగా 94.04 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కర్నూలు జిల్లాలో 9, నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 3,190 మందికిగాను 3,000 మంది (94.04 శాతం) హాజరయ్యారు. కర్నూలు నగరంలో 7 కేంద్రాలు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో ఉదయం సెషన్ పరీక్షకు 1,597 మందికిగాను 1,492 మంది, మధ్యాహ్నం సెషన్లో జరిగిన పరీక్షకు 1,593 మందికిగాను 1,508 మంది హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో 3 కేంద్రాలలో ఉదయం సెషన్లో 713 మందికి 659 మంది, మధ్యాహ్నం సెషన్లో 711 మందికిగాను 659 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కర్నూలు నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. సమయానికి చేరుకోలేక వెనుదిరిగిన ఇద్దరు విద్యార్థులు -
నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్
బొమ్మలసత్రం: జిల్లాలో నేరాల నియంత్రణకు ముఖ్యమైన ప్రాంతాల్లో సోమవారం కార్డెన్ సెర్చ్ జరిపామని ఎస్పీ అదిరాజ్సింగ్రాణా తెలిపారు. ఆత్మకూరు సబ్డివిజన్లోని పాములపా డు, ఇస్కాల, మండ్లెం, ఆళ్లగడ్డ పరిధిలోని చింతకుంట గ్రామాల్లో వేకువజామున సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ధ్రువపత్రాలు లేని 44 వాహనాలు, అక్రమంగా నిల్వ ఉంచిన 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రౌడీషీటర్లు, పలు అనుమానితుల ఇళ్లను సోదాలు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలకు నేరాల పట్ల అవగాహన కల్పించామన్నారు. కార్డెన్ సెర్చ్లో సీఐలు సురేష్కుమార్రెడ్డి, యుగంధర్, మురళీధర్రెడ్డి పాల్గొన్నారు. ప్రశాంతంగా ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలోని 35 సెంటర్లలో ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు 1,231 మంది గాను 729 మంది విద్యార్థులు హాజరు కాగా 502 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, 15 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అలాగే సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి హిందీ పరీక్ష నాలుగు కేంద్రాల్లో నిర్వహించగా 16 మంది విద్యార్థులకు గాను 12 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఇంటర్ హిందీ పరీక్షకు రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా 68 మందికి గాను 56 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు డీఈఓ తెలిపారు. డీసీహెచ్ఎస్ బాధ్యతల స్వీకరణ గోస్పాడు: జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త(డీసీహెచ్ఎస్)గా డాక్టర్ ఓ లలిత సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేస్తున్న సివిల్ సర్జన్ ఆర్థోపెడిక్ డాక్టర్ జఫరుల్లాను ఉన్నతాధికారులు ఆళ్లగడ్డకు బదిలీ చేశారు. ఆ స్థానంలో బనగానపల్లె ఆసుపత్రి చిన్న పిల్లల విభాగం సివిల్ సర్జన్ డాక్టర్ ఓ లలితను ఇక్కడికి బదిలీ చేయడంతో ఆమె విధుల్లో చేరారు. ఐఎఫ్ఎస్కు డీటీఓ ఐశ్వర్యారెడ్డి ఎంపిక సాక్షి, నంద్యాల: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించిన ఐఎఫ్ఎస్ 2024 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. యూపీఎస్సీ గత ఏడాది నవంబర్, డిసెంబర్ మెయిన్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించి తుది ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 143 మంది అభ్యర్థులు ఐఎఫ్ఎస్ సర్వీసులకు ఎంపికయ్యారు. అందులో డీటీఓ ఐశ్వర్యారెడ్డి 13వ ర్యాంకు సాధించి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఐశ్వర్యారెడ్డి ఏడు నెలల క్రితం జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. ఐశ్వర్యారెడ్డి ఎంపికపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం కోసం ధర్నా ఎమ్మిగనూరుటౌన్: ఈనెల 19 రోజులు గడిచినప్పటికీ రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణం లక్ష్మీపేట వాసులు సోమవారం ధర్నా చేశారు. ప్రతి నెలా మొదటి వారంలోనే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ నెల ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంతో తాము పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసుకొని బతికే తమకు రేషన్ బియ్యం పంపిణీ చేయకుంటే ఎలా అని లక్ష్మి, నర్సమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలైన తమకు సత్వరం రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. -
తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి
ఆలూరు రూరల్(కర్నూలు): అందరూ వివాహ వేడుకల్లో ఆనందంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో కల్యాణ తంతు నిర్వహించాల్సి ఉంది. ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం నిలిచిపోయింది. శనివారం రాత్రి హుళేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన ఆనంద్ (19) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆదోని ఆస్పత్రిలో పూర్ణచంద్ర, కర్నూలు ఆస్పత్రిలో తిమ్మప్ప చికిత్స పొందుతున్నారు. ఆస్పరికి చెందిన తిమ్మన్న, శుకుంతల కుమారుడు ఆనంద్.. కాగా అతని సోదరి వివాహం హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం గ్రామం కాగా తిమ్మప్పది ఆస్పరి మండలం చిగిళి గ్రామం. శనివారం రాత్రి ఆనంద్ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ మృతితో అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఎమ్మెల్యే పరామర్శ.. ఆనంద్ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆనంద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఐదుగురితో విచారణ కమిటీ ఏర్పాటు
ఆత్మకూరు అటవీడివిజన్లో ఒక సామాన్య టైపిస్టుగా దినసరి వేతనంతో చేరిన చాంద్బాషా అంచెలంచెలుగా డిపార్ట్మెంట్లో పదోన్నతులు పొందుతూ చివరకు ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైరయ్యారు. ఈయన సర్వీస్ చివరి 15 సంవత్సరాలు ఆత్మకూరు అటవీ డివిజన్ ప్రధాన కార్యాలయంలోనే తిష్ట వేసి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి తదితర ప్రాంతాలకు బదిలీ అయినా డిప్యూటేషన్పై ఇక్కడే పని చేయడంతో పైఅధికారులకు విషయం తెలియకుండా పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసుకోవడానికి అవకాశం లభించినట్లు సమాచారం. అక్రమాలు వెలుగు చూడటంతో ఒక ఐఎఫ్ఎస్ అధికారితో దర్యాప్తు చేయించి రిపోర్టు ఉన్నతాధికారులకు పంపిన తరువాతే ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట రూ.20లక్షలు ఖాతాలు మారినట్లు పేర్కొన్న అధికారులు ఆతరువాత ఇంకొంత నిశితంగా రికార్డుల పరిశీలన చేసి రూ.కోట్లలో అవినీతి జరిగిందని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సహాయ కన్జర్వేటర్ సాయిబాబా అటవీదళాల ప్రధానాధికారి పీసీసీఎఫ్ ఏకే నాయక్కు సమగ్ర నివేదికను పంపారు. ఈ మేరకు ఆయన ఐదుగురితో కూడిన ఒక దర్యాప్తు కమిటీని నియమించారు. ఆధారాల సేకరణ అనంతరం కేసును సీఐడీకి అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సమగ్ర నివేదిక అందజేశాం ఆత్మకూరు అటవీడివిజన్ ప్రధాన కార్యాలయంలో అకౌంట్స్ సూపరింటెండెంట్గా పని చేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చాంద్బాషా అక్రమాలపై అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదికను అందజేశాం. ప్రభుత్వ సొమ్మును తన సొంత ఖాతాకు మళ్లించడంతో ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అక్రమాలు రూ. కోట్లలో ఉండటంతో ఐదుగురి సభ్యులతో విచారణ కమిటీ దర్యాప్తు చేపడుతోంది. – వి. సాయిబాబా, ప్రాజెక్ట్ టైగర్, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు -
అన్న ప్రసాద వితరణపై పర్యవేక్షణ
శ్రీశైలం టెంపుల్: భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణపై నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలని అధికారులను ఈఓ శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం రాత్రి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈఓ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ అన్నప్రసాద వితరణలో ఆయా వంటకాలన్నీ రుచికరంగా ఉండేటట్లు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి హాలును కూడా ప్రత్యేకంగా సిబ్బంది ఒకరు నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. అన్నప్రసాద వితరణకు సంబంధించి సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఉదయం వేళలో అన్నప్రసాదాలను, సాయంత్రం అల్పాహారాన్ని ఎటువంటి ఆలస్యం కాకుండా భక్తులకు అందజేస్తుండాలన్నారు. భక్తులతో మర్యాదతతో మెలగాలని అన్నప్రసాద వితరణ సిబ్బందిని ఆదేశించారు. చిట్టీల పేరుతో కుచ్చుటోపీ ● పోలీసులను ఆశ్రయించిన బాధితులు ప్యాపిలి: పైసా పైసా కూడబెట్టుకుని చిట్టీలు వేసుకున్న వారికి ఒ వ్యక్తి కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో బాధితులు లబోదిబో అంటూ శనివారం ప్యాపిలి పోలీసులను ఆశ్రయించారు. దాదాపు రూ. 35 లక్షలకు పైగా మోసం చేసినట్లు తెలుస్తోంది. ప్యాపిలికి చెందిన సుభాన్ బాషా గత కొద్ది సంవత్సరాలుగా ప్యాపిలిలో పలు వ్యాపారాలు చేస్తూ ప్రజల వద్ద నమ్మకం కుదుర్చుకున్నాడు. దీంతో అతన్ని నమ్మిన పలువురు అతని దగ్గర భారీగా చిట్టీలు వేశారు. చిట్టీ ముగిసినా పలువురికి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బుకు కూడా ప్రతి నెలా వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. మరి కొందరికి డబ్బులు ఇవ్వకుండా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. చిట్టీలతో పాటు పలువురి దగ్గర భారీ మొత్తంలో అప్పులు కూడా చేశాడు. ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ప్యాపిలిలో సుభాన్బాషా కనిపించకపోవడం, ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తాము మోసపోయినట్లు గ్రహించారు. ఈ విషయమై సుభాన్ బాషా తండ్రి సిలార్ బాషాను బాధితులు నిలదీయగా తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని చెప్పాడు. దీంతో బాధితులు బండి నరేంద్ర కుమార్, ఆలా ప్రభాకర్ రెడ్డి, షేక్ ఖాజా హుసేన్,వెంకటేశ్, మలికే సర్వర్ సాహెబ్, పలనాటి అంజనమ్మ, బండి నాగరాజు తదితరులు ఎస్ఐ మధుసూదన్కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 42 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం 10,192 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 9,103 మంది పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ సునిత తెలిపా రు. 1,089 మంది గైర్హాజరయ్యారయ్యారన్నా రు. అలాగే రెండో సంవత్సరం పరీక్షలకు 2,959 మంది విద్యార్థులకు గాను 2,779 మంది హాజరు కాగా 180 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. శనివారం కామర్స్, కెమిస్ట్రీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ సునిత తెలిపారు. మహానందిలో వీకెండ్ సందడి మహానంది: మహానందిలో శనివారం వీకెండ్ సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ కామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కొనసాగింది. స్థానిక అలంకార మండపంలో వేదపండితులు బ్రహ్మశ్రీ రవిశంకర అవధాని ఆధ్వర్యంలో ఆలయ పండితులు, అర్చకులు శ్రీ గంగ, శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి దంపతులకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం చేపట్టారు. రాత్రి ఏకాంతసేవ పూజ లు నిర్వహించారు. యాగశాలలో స్వామి, అమ్మవారి దంపతులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా ఏకాంత సేవ పూజలు చేపట్టారు. -
పర్యావరణాన్ని కాపాడుకుందాం
పాణ్యం: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం పాణ్యంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో చెత్తను సేకరించారు. స్థానిక మహిళలకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నానాటికీ కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటుందన్నారు. అందరూ మొక్కలు నాటి పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. అనంతరం ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసి బెంచ్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీపీఓ శివారెడ్డి, ఎంపీపీ ఉసేన్బీ, తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగసుంకమ్మ ఈఓఆర్డి చంద్రమౌళేశ్వర్గౌడ్, ఎంఈఓ కోటయ్య, ఏపీఓ శేషన్న, ఆర్డబ్ల్యుఏస్ ఏఈ మధుశేఖర్ పాల్గొన్నారు. -
ఆర్భాటాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు
డోన్: సంపద సృష్టించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా నిర్మిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఆడంబరా లు, ఆర్భాటాలకు పోయి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. శనివారం చిన్న మల్కాపురంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త దొంతిరెడ్డి కృష్ణారెడ్డి ఇంటిలో పాత్రికేయులతో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కడా కూడా అమలు చేయకుండా ఏడాది కాలంగా ప్రజలను మభ్యపెడుతున్న ఘన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి నేతలు ఏడాదిగా రాష్ట్రమంతట హెలికాప్టర్లలో గాలికి తిరుగుతూ ప్రజా ధననాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం అనంతరం ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నేరవేర్చకుండానే ఏడాది కాలంలోనే రూ. లక్షల కోట్ల అప్పు చేయడం కూటమి ప్రభుత్వానికి చెల్లిందన్నారు. పోరాటాలకు సిద్ధం కండి రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు బుగ్గన పిలుపునిచ్చారు. అక్రమ కేసులు, దాడు లు ప్రజాస్వామ్య పరిరక్షణకు విఘాతం కల్గిస్తాయన్నారు. రాబో యే కాలంలో కూటమి ప్రభుత్వం ఆరాచక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఉద్యమాలు నడిపేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అన్యాయంగా అమాయకులపై అక్రమంగా కేసులు బనాయించి అధికారంలో స్థిరంగా ఉండాలనుకోవడం భ్రమ అన్న సంగతిని కూటమి నేతలు గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో పారిశ్రామికవేత్తలు గోపాల్రెడ్డి, మాహానందరెడ్డి, మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు సోమేష్యాదవ్, మల్లికార్జునరెడ్డి, వైస్ ఎంపీపీ ఎర్రిస్వామి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏడాదిగా సంక్షేమం, అభివృద్ధి లేదు సంపద సృష్టి అంటూ కూటమి నేతలు హెలికాప్టర్లలో పర్యటనలు డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకే చెల్లు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి -
చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలే!
కర్నూలు(సెంట్రల్): రాయలసీమలోని తాగునీటి ప్రాజెక్టులన్నీ టీడీపీ చేపట్టినవేనని సీఎం చంద్రబాబునాయుడు అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. దివంగత నేద వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో రాయలసీమలోని చాలా ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. కల్లూరులోని తన నివాసంలో శనివారం కాటసాని విలేకరులతో మాట్లాడారు. గోరుకల్లు రిజర్వాయర్కు ప్రధానమంత్రి ఉన్న సమయంలో పీవీ నరసింహారావు భూమి పూజ చేశారని తెలిపారు. 1994 ముందే కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కాలువలను పూర్తి చేశారన్నారు. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నా నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. 2004లో సీఎంగా వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి గోరుకల్లు రిజర్వాయర్తో ప్రజలకు నీళ్లు ఇచ్చారన్నారు. హాస్యాస్పదం ఎస్ఆర్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులను టీడీపీ హయాంలో చేపట్టినట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమని కాటసాని అన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వైఎస్సార్ హయాంలోనే జరిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కర్నూలు పర్యటనకు సీఎం చంద్రబాబు ఎందుకు వచ్చినట్లో అర్థం కావడం లేదన్నారు. స్వచ్ఛాంద్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పరిసరాలను పరిశుభ్రం చేయడానికి ఎక్కడి నుంచైనా సందేశం ఇస్తే సరిపోతుందన్నారు. అయితే ఆయన మాత్రం ఆ పనిమీదనే జిల్లా పర్యటనకు వచ్చారని, ఆయన రాకతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఖర్చు వచ్చిందన్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటిస్తే ఆ జిల్లాకు ఏదైనా ప్రాజెక్టు లేదా ఏదైనా సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి వస్తారన్నారు. చంద్రబాబు మాత్రం రైతు బజార్ను శుభ్రం చేయడానికి రావడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే చంద్రబాబునాయుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారని, సంక్షేమ పథకాలను ఎవరూ అడగకూడదని ఆగస్టు, జూన్ అంటూ చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో ఒక్క సాగుప్రాజెక్టును నిర్మించలేదు గోరుకల్లును నిర్వీర్యం చేశారు ఆయన పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమిటి? వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి -
కమనీయం.. పాండురంగడి చక్రస్నానం
కోవెలకుంట్ల: పట్టణంలోని రంగరాజుపేటలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో శనివారం వసంతోత్సవం, స్వామివారి చక్రసాన్న కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యులు పాండురంగడికి పంచామృతాభి షేకం, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, తదితర పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం స్వామివారి వసంతోత్సవాన్ని నిర్వహించి భక్తులు రంగులు చల్లుకున్నారు. వేసవికాలంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుని 11 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో కల్యాణం, వాహన సేవలు, రథోత్సవ కార్యక్రమాల్లో స్వామివారి వేడిని చల్లార్చేందుకు, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోనేటిలో చేపట్టిన చక్రస్నాన కార్యక్రమం కమనీయంగా కొనసాగింది. రాత్రి ధ్వజారోహణ, కంకణ నిమజ్జనం, నాకబలితో ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన పాండురంగడి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరిరోజు నిర్వహించిన కార్యక్రమాలను తిలకించేందుకు పట్టణంతోపాటు చుక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కోనేటి ప్రాంగణం జనసంద్రమైంది. -
కక్ష సాధింపుతోనే అక్రమ అరెస్ట్లు
బొమ్మలసత్రం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని అరెస్ట్ చేయించారని మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా ఆరోపించారు. శిల్పా నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ప్రజలకు చెప్పుకోదగిన మేలు ఏమి చేయలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేశారన్నారు. సూపర్సిక్స్ పథకాల గురించి ఎవరైనా మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు నమోదు చేయటం దౌర్భాగ్యమన్నారు. సూపర్సిక్స్ పథకాల అమలుపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని ఏదో ఒక సమస్యలు చూపించి మభ్యపెడుతున్నారని వివరించారు. అసలు స్కామ్లే లేనిచోట లిక్కర్స్కామ్ల పేరుతో డ్రామా మొదలు పెట్టి కక్ష సాధింపు కోసం ఇద్దరు రిటైర్డ్ అధికారులను అరెస్ట్ చేసి దాన్ని భూతద్దంలో ప్రజలకు చూపించటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుతో పాటు స్కిల్ స్కామ్లో నిందితులను కేంద్రప్రభుత్వమే గతంలో అరెస్ట్లు చేపట్టిందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బెల్టు షాపులు లేకుండా చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం ఆదాయం కోసం పల్లెల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగిస్తుందని విమర్శించారు. ఆధారాలు లేకపోయినా వేధింపులు అధికారులపై కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ రంగుపులిమి కేసుల నమోదుతో పాటు సరైన పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయటం మంచిదికాదన్నారు. సోషల్మీడియాలో ఆక్టివ్గా ఉన్నవారిపై ఒక్కొ వ్యక్తిపై 17 కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేయటం దారుణమన్నారు. సమావేశంలో జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్లు బషీద్, మజీద్లు పాల్గొన్నారు. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్ అన్యాయం మాజీ ఎమ్యెల్యే శిల్పారవి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా -
సర్దుబాటుతో చతికిల‘బడి’
● ఒకే పాఠశాలలో మాయమైన 10 ఉపాధ్యాయ పోస్టులు పత్తికొండ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన సర్దుబాటు ప్రక్రియ పత్తికొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను దెబ్బతీసింది. పాఠశాలకు 40 ఉపాధ్యాయ పోస్టులు మంజూరవగా ఇక్కడ 31మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కుదించారు. దీంతో 10 పోస్టుల వరకు ఇతర ప్రాంతాలకు కేటాయించారు. ఇప్పుడు 21మంది ఉపాధ్యాయులు మాత్రమే ఇక్కడ ఉండనున్నారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉంది. మొత్తం 1,300 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. తరగతుల వారీగా సెక్షన్లు విభజించి బోధన కొనసాగిస్తూ వచ్చారు. ఈ ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడటంతో తల్లిదండ్రులు వలసబాట పట్టి పిల్లలను కూడా తీసునకెళ్లారు. దీంతో విద్యార్థుల సంఖ్య 800కు తగ్గింది. దీంతో పాఠశాలలో 10 ఉపాధ్యా పోస్టులు మాయమయ్యాయి. -
వార్షిక ప్రణాళికలను రూపొందించండి
నంద్యాల(న్యూటౌన్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు వార్షిక ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రణాళికల రూపకల్పనపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 ఎకరాల్లో సాగవుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని అదనంగా మరో 25 ఎకరాలకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని చేపట్టేందుకు ఇదివరకే 40 డ్రోన్స్ వినియోగించారని, మరో 40 డ్రోన్ల వినియోగానికి చర్యలు చేపట్టాలన్నారు. మత్స్య శాఖకు సంబంధించి 63వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తితో పాటు సీడ్ ఉత్పత్తిపై దృష్టి సారించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి ఎంఎస్ఎంఈ పార్క్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏపీ టూరిజం స్టార్ హోటల్ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయించామని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సీపీఓ వేణుగోపాల్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సైనికులకు జోహార్లు కర్నూలు(సెంట్రల్): ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులు తోక జాడించారని, భవిష్యత్లో టెర్రరిస్టులు భారత్ వైపు చూడాలంటే భయపడేలా చేసిన సైనికులకు జోహార్లు అని మాజీ సైనికుల జిల్లా అధ్యక్షుడు నర్రా పేరయ్య చౌదరి అన్నారు. శుక్రవారం జిల్లా మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు జై భరత్ మాతాకి జై అంటూ వందలాది మంది మాజీ సైనికులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆపరేషన్ సింధూర్తో భారత్ సైనిక బలమేమిటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలుకోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించారు. రూటు, గడ్డం రామకృష్ణ, కె.రాముడు, మనోహర్రాజు, మున్నీర్, రవీంద్ర, సూర్య నారాయణ పాల్గొన్నారు. 75శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలుకర్నూలు(అగ్రికల్చర్): పశుగ్రాసం విత్తనాలు 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు పశుగ్రాసాల సాగుకు జొన్న విత్తనాలు 9 టన్నులు కేటాయించినట్లు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 5 కిలోల బ్యాగుల్లో లభిస్తాయని, పూర్తి ధర రూ.460 ఉండగా.. సబ్సిడీ రూ.345 ఉంటుందని, రైతులు రూ.115 చెల్లించాలని సూచించారు. ఏకవార్షిక రకానికి చెందిన జొన్న విత్తనాల కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు. ● అదేవిధంగా జిల్లాకు సమీకృత దాణా కూడా కేటాయించారన్నారు. 50 కిలోల బస్తా ధర రూ.1,110 ఉండగా.. 50 శాతం సబ్సిడీ రూ.555 పోను రైతులు రూ.555 చెల్లించాలన్నారు. -
రైతుల ఆశలపై ‘నీళ్లు’
● ఆయకట్టుకు అందని సాగునీరు ఆలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు సరిగ్గా కురవలేదు. కాలువలకు సక్రమంగా సాగు నీరు కూడా రాలేదు. దీంతో అన్నదాతలకు కన్నీరే మిగిలింది. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుంచి ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు నీరు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పట్టించుకోకుండా రైతుల ఆశలపై ‘నీళ్లు’ చల్లింది. ఇదీ ప్రతిపాదన.. ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు హెచ్ఎల్సీ మెయిన్ కాలువ నుంచి నీరు వస్తుంది. మొత్తం 14,555 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం కాలువకు 650 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నారు. అయితే 150 నుంచి 200 క్యూసెక్కులు సాగునీరు (హెచ్ఎల్సీ మెయిన్ కాలువ నుంచి) మించి విడుదల కావడం లేదని రైతులు వాపోయారు. చిప్పగిరి గ్రామానికి రెండు కిలోమీటర్ల సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువకు ప్రత్యేకంగా తూము (డీపీ)ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ తూము ఏర్పాటు చేస్తే దాదాపు 80 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పట్టించుకోని ప్రభుత్వం కాలువకు నీరు రాక, పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువకు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలనే అధికారుల ప్రతిపాదనను పక్కన పెట్టారు. దీంతో ఆయకట్టు రైతులకు పంటలు పండటం లేదు. హామీలను గాల్లోకి వదిలేశారు ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన హామీలను గాల్లోకి వదిలేశారు. ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదు. సాగు ప్రాజెక్టులు నిర్మించాలని, కాలువలకు తూములు ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం లేదు. హెచ్ఎన్ఎస్ నుంచి ఏబీసీకి సాగునీరు విడుదల చేయాలి. నగరడోణ గ్రామ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తిచేయాలి. – బి. విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే అనుమతులు రాలేదు ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు సాగుటిని విడుదల చేసేందుకు హెచ్ఎన్ఎస్కు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలని గతంలో రూ. 3 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. వాటర్ యూజర్స్ కమిటీ పర్యవేక్షణ చేయాల్సి ఉంది. – చంద్రశేఖర్, హెచ్ఎల్సీ ఆలూరు ఏబీసీ డీఈ -
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం
● ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ‘కూటమి’ పాలన ● తప్పుడు కేసులు, అసత్య ప్రచారమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ● హామీలు అమలు చేయని సీఎం చంద్రబాబు ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డోన్ పట్టణంలోని తన స్వగృహంలో శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టులు చేయించి శునకానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. మోసం బాబు నైజం అధికార దాహంతో నోటికి వచ్చిన హామీలనిచ్చి విస్మరించడం సీఎం చంద్రబాబు నాయుడు నైజ మని బుగ్గన ఆరోపించారు. సూపర్సిక్స్ పథకాలంటూ అట్టడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు గత చరిత్ర సమస్తం అబద్ధపు వాగ్దానాలు, అసత్య ప్రచారాలతో నిండిపోయిందన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. కక్ష సాధింపు చర్యలతో, అక్రమ అరెస్టులతోనే ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోందని బుగ్గన ధ్వజమెత్తారు. సమావేశంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్కుమార్, మున్సిపల్ వైస్చైర్మన్ జాకీర్హుసేన్, సింగిల్విండో మాజీ అధ్యక్షులు తిరునాంపల్లె తిరుమలరెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, క్లస్టర్ యూనిట్ మాజీ సభ్యులు నాగభూషణంరెడ్డి, జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షుడు పోసు్ట్రపసాద్, పార్టీ నాయకులు కురుకుందు హరి, గజేంద్రారెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి, చంద్ర, ధారా ప్రతాప్రెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం..కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బుగ్గన అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం డొల్లతనాన్ని జానాలకు అర్థమయ్యేరీతిలో వివరించాలని తెలిపారు. తల్లికి వందనం, రైతు భరోసా, విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాలకు మంగళం పాడి కూటమి ప్రభుత్వం తల్లి, పిల్లల ఉసురు పోసుకుందని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుపరిపాలన చేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుందనే విషయం అందరికీ తెలిసేందనన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతీయ, రాజకీయ పార్టీల భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక హామీ కూడా అమలు చేయలేదని, వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. -
మోసం చేసి పర్యటనా?
● ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బి.గిడ్డమ్మ కర్నూలు(సెంట్రల్): ఎన్నికల సమయంలో మహిళలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గిడ్డమ్మ విమర్శించారు. మోసం చేసిన వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నారని ప్రశ్నించారు. శుక్రవారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, తల్లికి వందనం కింద ఎంత మందిపిల్లలు ఉంటే అందరికీ రూ.15,000 ఇస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారనప్నారు. సంపద సృష్టించి మహిళలను లక్షాధికారులను చేస్తానని చెప్పి బిచ్చగాళ్లను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి భారతి, పావని పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. జీతాలు రాక గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాలు ప
ఆళ్లగడ్డ: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో ఉపాధి హామీ పథకంలో ఏపీఓ, ఈసీ టీఏ, ఎఫ్ఏ, కంప్యూటర్ ఆపరేటర్లు 677 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా సమన్వయంతో పనులు చేస్తున్నారు. దాదాపు 60 వేల కుటుంబాలకు ఉపాధి పనులు కల్పిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పనులు గుర్తించడం, ప్రతి రోజు కూలీలతో చేయించడం, సకాలంలో వేతనాలు అందిస్తున్నారు. కాంపోటెంట్ పనులకు బిల్లులు చెల్లించడంలో వీరందరి పాత్ర కీలకం. అయితే వీరే సుమారు మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం! ఉపాధి కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించే బాధ్యతలో అధికారులు, సిబ్బంది కీలక భాగస్వాములు. ఉపాధి పనుల్లో పండ్ల తోటల పెంపకం, సాగునీటి కాల్వలు, చెరువులు, నీటి కుంటలు, డంపింగ్ యార్డ్లు, గోకులాల నిర్మాణాలు, నర్సరీల నిర్వహణ ఉంటాయి. ‘ఉపాధి’ కూలీలకు వారవారం వేతనం బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా అధికారులు, సిబ్బంది చూడాలి. అయితే వీరికి సకాలంలో జీతాలు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే వేతనాలు తెచ్చిన అప్పులకు వడ్డీలకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు ఏదీ? ఉపాధి హామీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారిని రెండు సంవత్సరాలు దాటితే ఫిక్స్ టెన్యూర్ ఎంప్లాయ్గా గుర్తించాలి. అయితే ఏళ్లు గడుస్తున్నా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగానే చాలీచాలని వేతనాలు అందజేస్తున్నారని మండి పడుతున్నారు. లక్ష్యాలు విధిస్తూ పనిభారం పెంచుతున్న ప్రభుత్వం ఫిక్స్ టెన్యూర్ ఎంప్లాయ్గా గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ బిల్లులు రూ. 100 కోట్లు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేసిన వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు జిల్లాలో సుమారు రూ. 100 కోట్లకు చేరుకున్నాయి. సుమారు ఆరు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితంగా మొదలు పెట్టిన పనులన్నీ సంపూర్తిగా నిలిచిపోయాయి. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేసిన పనులకే బిల్లుల రాని కారణంగా కొత్తవి చేపట్టెందుకు వెండర్లు ఎవరూ ముందుకు రావడంలేదు. ‘ఉపాధి’ సిబ్బందికి మూడు నెలలుగా అందని జీతాలు కుటుంబాల పోషణకు ఆపసోపాలు రూ. 1.30 కోట్లకు పైగా వేతన బకాయిలు జీతాల కోసం 677 మంది ఉద్యోగుల ఎదురు చూపు -
బాబు మాట.. నీటి మూట!
హామీ ఇవ్వడం అధికారంలోకి వచ్చాక దానిని మరచిపోవడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని పలువురు ఆరోపిస్తున్నారు. శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలే ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. శ్రీశైలం నీటిముంపు నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తానని 2003, 2016, 2019, 2024లో టీడీపీ అధినేత మాట ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. నాలుగు సార్లు హామీలు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదని నీటిముంపు బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.నందికొట్కూరు: శ్రీశైలం వద్ద కృష్ణానదిపై జలాశయం నిర్మాణానికి 1963లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కింద సుమారు 12 వేల కుటుంబాలు సర్వం కోల్పోయాయి. మొత్తం 66 గ్రామాల్లో లక్ష ఎకరాల భూమి ముంపునకు గురైంది. 44 రెవెన్యూ గ్రామాలు, 22 మజరా గ్రామాలకు చెందిన ప్రజలు నిర్వాసితులయ్యారు. వీరు నాలుగు దశాబ్దాలుగా ఉద్యోగం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. వీరి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టుతో ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు కలుగుతోంది. నిర్వాసితులు మాత్రం న్యాయం కోసం నేటికీ పోరాడాల్సి వస్తోంది. ఏం జరిగిందంటే.. శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం 1982లో ఉద్యమ బాటపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు.. శ్రీశైలం ముంపు బాధిత ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా 1986లో జీఓ 98 జారీ అయ్యింది. దీంతో అప్పట్లో 1,200 మంది ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన జీవోను టీడీపీ అధినేత చంద్రబాబు తుంగలో తొక్కేశారు. ఉద్యోగాలు ఇస్తామని పలుమార్లు హామీ ఇచ్చినా అమలు చేయలేదు. న్యాయం కోసం ఎదరు చూపు శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మొదటి జాబితాలో 965 మందిని అర్హులుగా ప్రకటించారు. 2012లో కేవలం 120 మందికి మాత్రమే తాత్కాలిక పద్ధతిలో లష్కర్ ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సయమంలో రెండో జాబితాను తయారు చేయించినా ఉద్యోగాలు ఇవ్వలేదు. దీంతో నీటిముంపు నిరుద్యోగులు మళ్లీ పోరాటం కొనసాగించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే ఇప్పటికీ చాలా మంది పెళ్లిళ్లు కూడా చేసుకోలేదు. కొందరు ఆనార్యోగాల కారణంగా మృతి చెందారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చి 45 సంవత్సరాలు అవుతున్నా నిర్వాసితులకు ఉద్యోగం కలగానే మిగిలింది. ధర్నాలు, దీక్షలు చేసి నిర్వాసితులు అలసిపోయారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. హామీని ఇలా ‘నీరు’గార్చారు.. ● శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని 2003లో సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో హామీ ఇచ్చారు. ● సీఎం హోదాలో 2016లో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద జలహారతి కార్యక్రమంలో ఇదే హామీ ఇచ్చారు. ● సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో నందికొట్కూరుకు వచ్చి నీటిముంపు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని వాగ్దానం చేశారు. ● 2024లో జరిగిన ఎన్నికల్లో నందికొట్కూరు పటేల్ సెంటర్లో టీడీపీ అధినేతగా చంద్రబాబు ప్రసంగించారు. శ్రీశైలం నిర్వాసితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ● నిర్వాసితులు గత ఏడాది ఆక్టోబర్ 28న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతి పత్రం అందజేశారు. ఆరు నెలల దాటినా డిప్యూటీ సీఎం సమస్యకు మార్గం చూపించలేదు. అమలు కాని సీఎం చంద్రబాబు హామీ న్యాయం చేయాలంటున్న శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన 66 గ్రామాలు అప్పట్లో భూములు కోల్పోయిన 12 వేల కుటుంబాలు -
నేటి నుంచి ఆటోమేటిక్ ఫిట్నెస్ పరీక్షలు
కర్నూలు: రవాణా శాఖ పరిధిలో సామర్థ్య పరీక్షలు (ఫిట్నెస్ టెస్ట్) సులభతరం కానున్నాయి. జిల్లాలో భారీ వాహనాలు, రవాణా వాహనాలకు ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్ట్(ఏటీఎస్) స్టేషన్ వసుధ ఇండస్ట్రీస్ ఏజెన్సీ దక్కించుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో సుమారు లక్షకు పైగా రవాణా వాహనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటికి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ) ప్రత్యక్షంగా తనిఖీ చేసి ధృవపత్రాలను జారీ చేస్తున్నారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి ఏటీఎస్ ద్వారా వాహన సామర్థ్య పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించి ధృవపత్రాలు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు కర్నూలు ఉప రవాణా శాఖ కార్యాలయం, ఆదోని ప్రాంతీయ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు స్వయంగా ఎంవీఐలే జారీ చేశారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల మేరకు నేటి నుంచి (16వ తేదీ) ఫిట్నెస్ సేవలు రవాణా శాఖ కార్యాలయాల్లో నిలిపివేశారు. నంద్యాల జిల్లాలో చాబోలు వద్ద ఈనెల మొదటి వారంలోనే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ను ప్రారంభించగా.. కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద శుక్రవారం నుంచి ఏటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏటీఎస్ ద్వారా 54 రకాల పరీక్షలు చేస్తారు. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలో కేవలం రెండు కేంద్రాలే ఏర్పాటు చేయడం, మిగిలిన ప్రాంతాల వాసులు అక్కడికి వెళ్లాలంటే అవస్థలు తప్పేలా లేవు. ఆదోనికి చెందిన వాహనదారులు చిన్నటేకూరు వద్దకు, డోన్కు చెందిన వాహనదారులు చాబోలు కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉండటం గమనార్హం. ఇదే సమయంలో ముందస్తు సమాచారం లేకుండా రవాణా శాఖ కార్యాలయాల్లో ఫిట్నెస్ సేవలు నిలిపివేయడంతో రెండు రోజుల ముందే ఆన్లైన్లో స్లాట్ పొందిన గూడ్స్ వాహన యజమానులు అయోమయంలో పడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రయివేట్ స్టేషన్ రవాణా శాఖ కార్యాలయాల్లో ఎఫ్సీ సేవలు నిలుపుదల -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూల బృందావనం దర్శనాలు చేసుకున్నారు. రాఘవేంద్రుల బృందావన దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పట్టింది. భక్తుల రాకతో దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళప్రసాదం కౌంటర్లు కిటకిటలాడాయి. నిత్య వేడుకల్లో భాగంగా రాయరు ప్రతిమకు ఊంజల మంటపంలో ప్రత్యేక ఆర్జిత సేవలు చేశారు. అనంతరం బంగారు పల్లకీలో రాయరు బృందావన ప్రతిమను రమణీయంగా ఊరేగించారు.శ్రీమఠం ప్రాంగణంలో భక్తులు -
తడిసిన ధాన్యం.. అన్నదాత దైన్యం
వర్షపాతం వివరాలు.. మండలం వర్షపాతం (మి.మీ) ఆత్మకూరు 51.4 రుద్రవరం 50.8 కొత్తపల్లి 50.4 డోన్ 26.8 గడివేముల 22.2 దొర్నిపాడు 20.4 మహానంది 19.2 పాములపాడు 17.4 కోవెలకుంట్ల/బేతంచెర్ల 16.6 అవుకు 15.2 గోస్పాడు 13.2 ప్యాపిలి 13.0 వెలుగోడు 10.6 పాణ్యం 10.0నంద్యాల(అర్బన్): జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయి రైతులకు దైన్యమే మిగిలింది. ఆత్మకూరు, కొత్తపల్లి, రుద్రవరం, చాగలమర్రి మండలాల్లో నష్టం ఎక్కువగా ఉంది. అనేక ప్రాంతాల్లో స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూరు మండలం కరివేన, నల్లకాల్వ, సిద్ధాపురం, బాపనంతపురం గ్రామాల్లో కల్లాల్లోని ధాన్యం తడిసి పోయింది. కొత్తపల్లి మండలం వీరాపురం, సంగమేశ్వరం, లింగాపురం గ్రామాల్లో వర్షపునీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● చాగలమర్రి మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున పిడుగుపాటుతో మేకల కాపరి చంద్రశేఖర్ మృతి చెందారు. మూడు మేకలు కూడా మృత్యువాత పడ్డాయి. ● రుద్రవరం మండలంలో రోడ్లు జలమయమయ్యాయి. గ్రామాల్లో అక్కడక్కడ చెట్లు విరిగి రహదారులకు అడ్డంగా పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోవడంతో వాటిని దాచేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ● డోన్, గడివేముల, మహానంది, పాములపాడు, కొలిమిగుండ్ల, బేతంచెర్ల అవుకు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. -
యాగంటిలో జిల్లా కలెక్టర్ దంపతులు
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వరస్వామికి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దంపతులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ ఈఓ చంద్రుడు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. యాగంటిపల్లె గ్రామ ఉపసర్పంచ్ బండి మౌలీశ్వరరెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నాటుసారా నివారణకు టోల్ఫ్రీ నంబరు 14405 నంద్యాల(న్యూటౌన్): నాటుసారా నివారణకు 14405 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం నవోదయం 2.0 కార్యక్రమ పటిష్ట అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 3,474 లీటర్ల నాటు సారా సీజ్ చేశామన్నారు. ఎకై ్సజ్ శాఖ వారి తరఫున 198 , పోలీసు సహకారంతో 47 కేసులను నమోదు చేశామన్నారు. ప్రాహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఈఓ జనార్దన్రెడ్డి, డీఎఫ్ఓ నాగమునేశ్వరి పాల్గొన్నారు. ఏపీ ఈసెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ కర్నూలు సిటీ: ఏపీ ఈసెట్ ఫలితాలను గురువారం అనంతపురం జేఎన్టీయూ అధికారులు విడుదల చేశారు. ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కర్నూలు జిల్లాలో 1,261 మంది పరీక్షలకు హాజరుకాగా 1,146 మంది ర్యాంకులు పొందారు. నంద్యాల జిల్లాలో 791 మంది హాజరుకాగా 736 మంది ర్యాంకులు సాధించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రూమెంటేషన్ ఇంజినీరింగ్లో ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి చెందిన దొమ్మల హేమంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అదే విధంగా డోన్ మండలంలోని రామదుర్గం గ్రామానికి చెందిన అప్పల ప్రణీత్ రెడ్డికి 6వ ర్యాంకు వచ్చింది. బీఎస్సీ ఎంపీసీలో నందికొట్కూరు విద్యా నగర్కి చెందిన పెరుమళ్ల రాజేష్ 6వ ర్యాంకు, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎమ్మిగనూరుకి చెందిన కె.రఘు 6వ ర్యాంకు, ఈఈఈలో ఎమ్మిగనూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన మడుగుల అమర్నాథ్ 7వ ర్యాంకు, బనగానపల్లె గొల్లపేటకు చెందిన జి.శ్రీనివాసులు 10వ ర్యాంకు సాధించారు. ఫార్మాసీలో కర్నూలు బుధవారపేట హబీబ్ ముబారక్ నగర్కి చెందిన షేక్ ముస్కాన్ 6వ ర్యాంకు, షేక్ తజ్మీన్ 10వ ర్యాంకు సాధించారు. -
కిలో చికెన్కు రూ.20 కమిషన్ ఇవ్వాల్సిందే.. ఆళ్లగడ్డలో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
సాక్షి, నంద్యాల: చంద్రబాబు రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టిస్తుంటే, టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రెండడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఆక్రమ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు.ఇటీవల,నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కిలో చికెన్కు రూ.10 మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ హుకుం జారీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు తామేం తక్కువేం తినలేదంటూ టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అఖిల ప్రియ మహిళా అనుచరులు రెచ్చిపోతున్నారు.చికెన్ కోళ్లను తమవద్దే కొనాలంటూ వ్యాపారస్తులకు హూకుం జారీ చేస్తున్నారు. చికెన్ కోళ్లను తమ వద్ద కొనుగోలు చేయకపోతే చికెన్ సెంటర్లను మూసేస్తామని బెదిరిస్తున్నారు. కేజీ చికెన్ మీద రూ.20 రూపాయిలు కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు.ఈ క్రమంలో తాము చిరు వ్యాపారులమని, కమిషన్లు ఇచ్చుకుంటూ పోతే..తమ కుటుంబ పోషణ భారమవుతుందటూ చికెన్ షాపు వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతల ఆగడాలపై వ్యాపారస్తులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. కేజీకి రూ.20 రూపాయలు కమిషన్ ఇవ్వాలని, కోళ్లను తమ దగ్గరే కొనుగోలు చేయాలంటూ టీడీపీ నేతల ఆగడాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల బెదిరింపులు దౌర్జన్యాలు భరించలేక జిల్లా ఎస్పీని కలిసిని ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమరి చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు. -
ధరల పతనం.. జీరో వ్యాపారం!
● మార్కెట్ఫీజు లేకుండానే సరిహద్దులు దాటుతున్న ధాన్యం ● ముడుపుల వసూళ్ల కోసం చెక్పోస్టుల్లో అనధికార వ్యక్తులు కర్నూలు(అగ్రికల్చర్): రైతులు పండించిన పంటలకు ధరలు పతనం కావడంతో వ్యాపారుల లాభం కోసం, స్వప్రయోజనాల కోసం కొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలు జీరో వ్యాపారానికి గేట్లు ఎత్తాయి. ముడుపుల వసూళ్ల కోసం చెక్పోస్టుల్లో అనధికార వ్యక్తులను నియమించినట్లు విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీలో సాగైన వరి నెల రోజుల నుంచి రైతుల ఇంటికి వస్తోంది. ధర లేకపోవడంతో రైతుల నుంచి ధాన్యాన్ని దళారులు, వ్యాపారులు కొనుగోలు చేసి ‘జీరో’ పై సరిహద్దులు దాటిస్తున్నారు. మార్కెట్ కమిటీ అధికారులకు ముడుపులు ముట్టచెబుతూ.. యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఆదాయం కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడం లేదని, ఇందులో భాగంగానే ధాన్యం జీరోపై తరలించేందుకు గేట్లు తెరిచారనే విమర్శలు వస్తున్నాయి. వ్యాపారుల అక్రమాలు ఇలా.. ధాన్యం క్రయవిక్రయాలపై 2 శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. రైతులే స్వంతంగా ఇతర ప్రాంతాల్లో విక్రయించుకోవడానికి తరలిస్తే ఎటువంటి ఫీజు ఉండదు. వ్యాపారుల నుంచి మాత్రమే ఫీజు వసూలు చేస్తారు. ధాన్యం క్వింటాలు ధర రూ.2,000 వరకు ఉంటోంది. లారీ సామర్థ్యాన్ని బట్టి 300 క్వింటాళ్ల వరకు లోడ్ చేస్తారు. లారీ ధాన్యం విలువ రూ.6 లక్షలు ఉంటుంది. నిబంధనల ప్రకారం 2 శాతం ప్రకారం రూ.12 వేలు మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఎక్కడైనా సరే ఒక్కచోట ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. వ్యాపారులు లారీకి రూ.12 వేలు ఫీజు చెల్లించడం మనసొప్పక మార్కెట్ కమిటీ అధికారులకు ముడుపులు ఇచ్చుకొని తరలిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్కడక్కడ ముడుపుల కింద రూ.6000 పోయినా రూ.6000 మిగులు ఉంటుందనేది వ్యాపారుల ఉద్దేశం. కర్ణాటకకు తరలుతున్న ధాన్యం... పాణ్యం, నంద్యాల, శిరువెళ్ల, రుద్రవరం, బండిఆత్మకూరు తదితర మండలాల్లో పండించిన ధాన్యం కర్ణాటక రాష్ట్రానికి తరలుతోంది. ప్రధానంగా కర్ణాటకలోని సిరుగుప్పకు వెళ్తున్నట్లు సమాచారం.హైదరాబాద్కు కూడా కొంతమేర ధాన్యం వెళ్తోంది. ప్రధానంగా రాత్రి వేళల్లోనే రోజుకు 20 నుంచి 30 లారీల వరకు ధాన్యం ఎలాంటి మార్కెట్ ఫీజుల చెల్లించకుండా వెళ్తోంది. పాణ్యం, కర్నూలు మార్కెట్ కమిటీలకు చెందిన చెక్పోస్టుల్లో ఎక్కడో ఒక చోట మార్కెట్ ఫీజు వసూలు చేయాల్సి ఉన్నా.. మామూళ్లు తీసుకుంటున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కర్నూలులోని చౌరస్తా చెక్పోస్టులో అనధికార వ్యక్తిని నియమించి ముడుపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక దృష్టి సారించాం మార్కెట్ ఫీజు ఫీజు చెల్లించకుండా వ్యాపారులు ధాన్యాన్ని జిల్లా సరిహద్దు దాటించకుండా ప్రత్యేక స్క్వాడ్ల ఏర్పాటు చేశాం. జీరో వ్యాపారం నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. – నారాయణమూర్తి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి -
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు కిట్ల పంపిణీ
నంద్యాల(న్యూటౌన్): వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన కిట్లను పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం, శాప్ ఆధ్వర్యంలో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ శిబిరాల్లో 8 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారన్నారు. ప్రతి శిక్షణ శిబిరానికి రూ. 5 వేల విలువ చేసే క్రీడా కిట్లు ఇచ్చామన్నారు. క్యాంపు ఇన్చార్జ్ కు గౌరవ వేతనం రూ.1,500, క్యాంపు నిర్వహణకు రూ. 500 చొప్పున మొత్తంగా 50 క్రీడా శిక్షణ శిబిరాలకు రూ.3.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. శిబిరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇస్తారన్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి శాఖ అధికారి ఎంఎన్వీ రాజు, శిక్షకులు, క్యాంపు కోచ్లు పాల్గొన్నారు.265 మంది విద్యార్థుల గైర్హాజరునంద్యాల(న్యూటౌన్): జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు 265 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ సునీత తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 7,071 మందికి గాను 6,852 మంది హాజరు కాగా 219 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు రెండో సంవత్సరం విద్యార్థులు 1,407 మందికి గాను 1,361 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యంబొమ్మలసత్రం: నేరనివారణ లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. గడిచిన 48 గంటల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 38 మందిపై, బహిరంగంగా మద్యం సేవించిన 136 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నైట్బీట్లలో భాగంగా ప్రతిరోజు సిబ్బంది వారి పరిధిలో గస్తీ నిర్వహిస్తున్నారని, అనుమానితుల వివరాలు సేకరించి వారి వేలిముద్రలు తీసుకుని దొంగతనాలు, అల్లర్లు, గొడవలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గడిచిన 48 గంటల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన 599 మంది పై రూ.4.62 లక్షల జరిమానా విధించామన్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 38 మంది పై కేసులు నమోదు చేశామన్నారు.టెండర్ దశలో డీఎంఎఫ్, నాబార్డు పనులుకర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎంఎఫ్(2024–25), నాబార్డు ఆర్ఐడీఎఫ్(2025–26) నిధులతో చేపట్టనున్న రోడ్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు వి.రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలకు పూర్తి ఇబ్బందిగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామన్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 29 రోడ్లు, ఒక బిల్డింగ్ పనికి సంబంధించి రూ.42.58 కోట్లతో పాలనా అనుమతులు వచ్చాయన్నారు. పనులను ప్రారంభించేందుకు ఈ నెల 9నుంచి 23వ తేది మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆన్లైన్లో టెండర్లు దాఖాలు చేసేందుకు సమయం ఇచ్చారన్నారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే 23వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు టెక్నికల్ బిడ్స్ను.. 26న ఉదయం 11 గంటలకు ఫైనాన్సియల్ బిడ్స్ను ఓపెన్ చేస్తామన్నారు. టెండర్ ప్రాసెస్ పూర్తయిన అనంతరం పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు.జాతీయ వైద్య కమిషన్ సభ్యులుగా డాక్టర్ చంద్రశేఖర్కర్నూలు(హాస్పిటల్):జాతీయ వైద్య కమిషన్ మెడికల్ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యులుగా రాష్ట్రం తరపున కర్నూలుకు చెందిన డాక్టర్ పి.చంద్రశేఖర్ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ఉన్న ఆయనకు జాతీయ వైద్య కమిషన్ సభ్యులుగా నామినేట్ చేయడం పట్ల స్థానిక వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
లైసెన్స్ ఫీజు 20వ తేదీలోగా చెల్లించాలి
కర్నూలు: జిల్లాలోని మద్యం దుకాణాల ఐదో విడత లైసెన్స్ ఫీజు ఈనెల 20లోపు చెల్లించేలా చూడాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో నంద్యాల, కర్నూలు జిల్లాల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా నమోదైన నేరాలు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులు, నాటుసారాను సమూలంగా నిర్మూలించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. కర్నూలు జిల్లాలో 40 శాతం గ్రామాలను నెలాఖరుకు సారా రహిత ప్రాంతాలుగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలు జిల్లాలో 430 మంది, నంద్యాల జిల్లాలో 352 మంది పాత నేరస్థులు ఉన్నారని, వారందరినీ నెలాఖరు లోపు తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాలన్నారు. ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడి జైలుకు వెళ్లినప్పటికీ వృత్తిని మానుకోని వారిపై ఒక్కో స్టేషన్ పరిధిలో ఒకరిపై నెలాఖరులోపు పీడీ కేసులు నమోదు చేయాలన్నారు. నవోదయం 2.0 అమలులో భాగంగా సారా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కానిస్టేబుల్కు బీట్ పరిధిని నిర్ణయించి సారా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణారెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడ్తో పాటు ఉమ్మడి జిల్లాల ఇన్స్పెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. -
అనుకున్నట్లే జరిగింది. మంత్రి టీజీ భరత్ కుటుంబానికి చెందిన ఆల్కలీస్ ఫ్యాక్టరీ విస్తరణపై చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ పూర్తి ఏకపక్షంగా సాగింది. పక్కా స్క్రిప్ట్ ప్రకారం ఎవరు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని ముందే కొంతమందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి వారితో అను
పోలీస్, రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలోనే దాడి కాలుష్య కారకాలు వెదజల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించా. ఇంతలోనే కర్నూలుకు చెందిన కొందరు గూండాలు నన్ను ఎత్తుకొని వెనుక వైపు తీసుకెళ్లారు. విచక్షణరహితంగా కొట్టారు. చివరకు కింద పడేసి గొంతుపై చెప్పుల కాళ్లతో తన్నారు. పోలీసులు చూసినా పట్టించుకోలేదు. ఇది ప్రజాస్వామ్యమా, లేదంటే టీజీ వెంకటేష్స్వామ్యమా. ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేసి మళ్లీ కలెక్టర్ సమక్షంలో నిర్వహించాలి. – రాఘవేంద్ర, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రైవేట్ గూండాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణా? టీజీవీ గ్రూపు ఏర్పాటు చేయనున్న ప్రమాదకర పీటీఎఫ్ఈ, సీపీవీసీ పరిశ్రమ విస్తరణకు సంబంధించి బుధవారం గొందిపర్లలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా ప్రైవేట్ గూండాల కనుసన్నల్లో జరిగింది. ప్రజా సంఘాల నాయకులపై ప్రైవేట్ సైన్యం విచ్చలవిడిగా దాడి చేసింది. అభ్యంతరాలను ఇవ్వడానికి వెళితే తీసుకోకుండా దాడులు చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని పరిశ్రమ విస్తరణను అడ్డుకోవాలి. లేదంటే పోరాటాలకు దిగుతాం. – వై.నగేష్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నా సెల్ఫోన్ను లాక్కున్నారు నేను నాకున్న అభ్యంతరాలను ఇవ్వాలని ముందుగానే సభకు వెళ్లాను. అయితే నన్ను కొందరు ప్రైవేట్ గూండాలు గుర్తించి మధ్యలో బయటకు లాక్కెళ్లి పడేశారు. అప్పుడే నా సెల్ఫోన లాక్కున్నారు. అందులో ఏమీ లేవన్నా వినలేదు. ఇంతవరకు నా సెల్ను ఎవరిని అడిగినా ఇవ్వడంలేదు. రేపు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తా. – ఎండీ ఆనందబాబు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాయలసీమ ఆల్కలీస్ ఫ్యాక్టరీకర్నూలు(రూరల్)/కర్నూలు(సెంట్రల్): రాయలసీమ ఆల్కలీస్ ఫ్యాక్టరీలో టెఫ్లాన్(పీటీఎఫ్ఈ) తయారీ పరిశ్రమ కోసం బుధవారం గొందిపర్లలో ప్రజాభిప్రాయసేకరణ సభ నిర్వహించారు. కాలుష్యనియంత్రణ మండలి ఈఈ కిషోర్కమార్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఆర్డీవో సందీప్కుమార్, తహసీల్దార్ రమేశ్బాబుతో పాటు యాజమాన్యం తరఫున మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ పాల్గొన్నారు. సభలో 30మంది దాకా తమ అభిప్రాయాలు చెప్పారు. అయితే గొందిపర్లతో పాటు టీజీ వెంకటేశ్కు అనుకూలంగా ఉన్న వ్యక్తులు భారీ సంఖ్యలో సభకు హాజరయ్యారు. ఫ్యాక్టరీ నిర్మాణం, పీటీఎఫ్ఈ తయారీకి వాడే పీఎఫ్ఓఏతో కలిగే కాలుష్యం తదితర అంశాలపై కొన్ని రోజులుగా పలువురు శాస్త్రవేత్తలు, పౌరసంఘాలు, వామపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. ఈక్రమంలో వారెవ్వరినీ సభలోకి రాకుండా యజమాన్యం కట్టడి చేసింది. వచ్చిన కొద్దిమందిపై కూడా టీజీ ప్రైవేటు సైన్యం భౌతికదాడులు చేసి గెంటేసింది. కవరేజీకి వెళ్లిన పత్రికా విలేకరుల సెల్ఫోన్లు సైతం లాక్కోవడం గమనార్హం. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి నగేశ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆనంద్బాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే ప్రైవేటు సైన్యం, పోలీసులు వారిని అక్కడి నుండి లాక్కుని బయటకు తీసుకెళ్లారు. టీజీ ప్రైవేటు సైన్యం రాఘవేంద్ర గొంతుపై కాలుతో తొక్కేశారు. ఎండీ ఆనంద్బాబుపై పిడిగుద్దలు గుద్ది మొబైల్ఫోన్ కూడా లాక్కున్నారు. నగేశ్, రామకృష్ణను కూడా బయటకు లాగేసి విచక్షణా రహితంగా దాడి చేశారు. ఓవైపు ఆర్డీవో సందీప్కుమార్ మాట్లాడేందుకు అందరికీ అవకాశం ఇస్తామని చెబుతుంటే మరోవైపు టీజీ ప్రైవేటు సైన్యం ప్రజా సంఘాలు, వామపక్షాల ప్రతినిధులను విచక్షణారహితంగా లాక్కెళ్లి దాడి చేయడం గమనార్హం. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా వారు ప్రేక్షక పాత్ర పోషించడంతో పాటు ప్రైవేటు సైన్యానికి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో ప్రజాసంఘాలు, వామపక్షాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయసేకరణ జరుగుతుంటే కనీసం అభిప్రాయాలు వినేందుకు కూడా యాజమాన్యం అంగీకరించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పీటీఎఫ్ఈ వాడకానికి వాడే రసాయనం ఏంటో స్పష్టత ఇవ్వని వైనం పీటీఎఫ్ఈ తయారీకి పీఎఫ్ఓఏ వాడుతున్నారని శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నాయి. అయితే టీజీ వెంకటేశ్ పీఎఫ్ఓఏ వినియోగించబోమని, దానికి ప్రత్యామ్నాయం వాడతామని మంగళవారం ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా ఏ రసాయనం వాడతారో స్పష్టత ఇవ్వలేదు. బుధవారం జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఏ రసాయనాలు వాడతారు? ఏ టెక్నాలజీ వాడతారు అనేది ప్రభుత్వానికి సమర్పించిన ఈఐఏ(పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక)లోనూ పేర్కొనలేదు. అసలు టెక్నాలజీ, ఏ రసాయనాలు వాడుతారో యజమాన్యానికి స్పష్టత లేకుండా, ప్రజలకు స్పష్టం చేయకుండా గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. టీజీ గ్రూపు ఆల్కలీస్ ఫ్యాక్టరీ విస్తరణపై ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ ఫ్యాక్టరీపై అభ్యంతరాలు చెప్పిన వారిపై భౌతిక దాడులకు దిగిన యాజమాన్యం డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ అధ్యక్ష, కార్యదర్శులపై విచక్షణారహితంగా దాడి వార్తలు కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరుల మొబైల్ఫోన్లు లాగేసుకున్న భద్రతా సిబ్బంది తమకు అనకూలంగా మినిట్స్ నమోదు చేసి ప్రభుత్వానికి సిఫారసు ఫ్యాక్టరీకి అనుకూలంగా మినిట్స్ పంపేందుకు సిద్ధమైన అధికారులుజీవనోపాధి కోల్పోతాం కెమికల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వొద్దు రాయలసీమ ఆల్కలిస్ (ఎస్ఆర్ఎఎిసీ) ఫ్యాక్టరీకి అనుబంధంగా రసాయనాల తయారీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారులు సంఘం జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్ వినతిప త్రం ఇచ్చారు. ఫ్యాక్టరీ చుట్టూ పది గ్రామాల్లో చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారు జీవన ఉపాధి కోల్పోతారని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. టీజీవీ ఆల్కలిస్ ఫ్యాక్టరీలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కెమికల్ ఫ్యాక్టరీ వద్దని అధికారులకు పలువురు వినతిపత్రాలు అందజేశారు. ఇ.తాండ్రపాడు గ్రామాన్ని టీజీ వెంకటేష్ దత్తత తీసుకొని ధోబీఘాట్ నిర్మిస్తామని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా అమలు చేయలేదని గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తంగా 30మంది అభిప్రాయాలను కమిటీ సేకరించింది. దీని మినిట్స్పై నివేదికను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వశాఖకు పంపనున్నారు. అధికారులు పూర్తిగా యజమాన్యానికి లొంగిపోయి నిజాలు దాచి వారికి అనుకూలంగా నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజాభిప్రాయసేకరణ అప్రజాస్వామిక నిర్వహించడం, ప్రతినిధులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఐక్య వేదిక, వామపక్షాల ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ ఎదుట భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రజాసంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. సభలో ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించకపోవడం, విద్యార్థి, ప్రజా, యువజన సంఘాలపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిరసనకు ప్రజాస్వామ్య వాదులు తరలిరావాలన్నారు. -
సీఎం పర్యటనలో మార్పు
కర్నూలు(సెంట్రల్)/(అగ్రికల్చర్)/కల్లూరు/పాణ్యం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన మారింది. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న పాణ్యంలో సీఎం పర్యటించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని కర్నూలుకు మార్చారు. దీంతో గత రెండు రోజుల నుంచి పాణ్యంలో ఉన్న అధికారులు ఏర్పాట్లను విరమించారు. ప్రతినెలా మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారు. ఈ నెల 17న కర్నూలులో సీఎం పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్లోని కాన్ఫరెన్స హాలులో అఽధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కర్నూలులోని సీక్యాంపు రైతుబజార్లో జరిగే స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు, ఇద్దరు రైతులతో మాట్లాడతారని తెలిపారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసే ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారని, మూడు వేల మందికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకముందు జిల్లా కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రైతు బజార్, ప్రజా వేదిక ఏర్పాటు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి సీఎం పర్యటనను విజయవంతం చేద్దామన్నారు. ● స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమానికి జేసీ నవ్య ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సహాయకులుగా ఉంటారు. ప్రజావేదిక ఇన్చార్జిగా జెడ్పీ సీఈఓ వ్యవహరిస్తారు. 17న కర్నూలు రానున్న ముఖ్యమంత్రి -
నా బిడ్డ జొలికొస్తే వదిలేదేల్యా..
నంద్యాల: బిడ్డలంటే తల్లికి పంచ ప్రాణాలు. మనుషులైనా.. జంతువులైనా అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకలి తీర్చడంతో పాటు ఆపదలో ప్రాణాలను సైతం అడ్డేస్తుంది. ఇందుకు నిదర్శనమే గోమాత ఘటనే. తోడేళ్ల గుంపులా కుక్కలు ఆవు దూడపై దాడికి యత్నించగా, తల్లి ఆవు గంట పాటు దూడను కాపాడుకునేందుకు కుక్కలతో చేసిన పోరాటం చూసినా వారు ఎవరైనా ‘ఇది కదా తల్లి ప్రేమ’ అని అనక మానరు. మంగళవారం మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల్లో మేత కోసం ఆవుల మంద వారం రోజులుగా తిరుగుతోంది. ఓ ఆవుకు దాహం వేయడంతో తన బిడ్డతో కలిసి తాగునీటి కోసం ఊళ్లోకి వచ్చింది. గమనించిన కుక్కలు దూడపై మూకుమ్మడిగా దాడికి యతి్నంచాయి. దీంతో ఆవు తన బిడ్డను కాపాడుకోవడానికి సుమారు గంటపాటు వీరోచిత పోరాటం చేసింది. చివరికి అలసిన కుక్కలు తోక మూడిచి వెళ్లిపోయాయి. -
ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్
ఒక బిడ్డకు జన్మనివ్వాలన్నది ప్రతి మహిళ కల. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో సంతానలేమితో బాధపడే వారి వేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మాత్రం కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే చేతులారా అబార్షన్ చేయించుకుంటున్నారు. ఆడ బిడ్డ పుడితే అత్తింటకర్నూలు(హాస్పిటల్): ‘భ్రూణ హత్యలు వద్దు.. ఆడ పిల్లలను బతకనిద్దాం.. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు’.. అంటూ అధికారులు పలు వేదికలపైఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. జిల్లాలో భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 240 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవి 8, రెన్యువల్ కోసం వచ్చినవి మరో 15 దాకా ఉన్నాయి. వీటికి జిల్లా కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంది. అధికారికంగా ఉన్న స్కానింగ్ కేంద్రాలే గాక అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అనుమతులు లేకుండా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకుని స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్లలో కొందరు వైద్యులు స్కానింగ్ ద్వారా లింగనిర్ధ్దారణ చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు నిర్ధ్దాక్షిణ్యంగా అబార్షన్(భ్రూణహత్య)లు చేయించుకుంటున్నారు. ఇందుకు సాక్ష్యంగా అప్పుడప్పుడూ కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిసర ప్రాంతాలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని శివారు ప్రాంతాల్లో మృతశిశువులు వెలుగు చూస్తుంటాయి. ఇలా లభించిన వాటి గురించి ఏ ఒక్క అధికారి కూడా విచారణ చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు జిల్లాలో నమోదు కాలేదు. అంతెందుకు గత పదేళ్లలో ఒక్క స్కానింగ్ కేంద్రం, వైద్యులపై కూడా స్కానింగ్ అక్రమాల గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ నెలలో జిల్లాలో వైద్యుల బృందం 40 స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లింది. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిపోర్టులు, మిషన్లు, వైద్యుల వివరాలు, గర్భిణిల వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని అధికారులకు రిపోర్టు ఇవ్వడం గమనార్హం.ఆర్ఎంపీలకు నజరానాలుజిల్లాలో డోన్, కృష్ణగిరి, ఆదోని, పత్తికొండ, కోసిగి, హొళగుంద, పెద్దతుంబళం, చిన్నతుంబళం, మంత్రాలయం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కౌతాళం వంటి వెనుకబడిన ప్రాంతాలే గాక తెలంగాణా, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి సైతం స్కానింగ్ కోసం గర్భిణులు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరుకు వస్తుంటారు. ఇందులో కొందరికి అప్పటికే ఆడపిల్లలు జన్మించి ఉండటంతో మళ్లీ ఆడబిడ్డ జన్మిస్తే కుటుంబంలో పెద్దలు ఒప్పుకోరని భావించి స్కానింగ్లో ఆడబిడ్డ అని తేలితే అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధపడి వస్తారు. ఈ మేరకు కర్నూలులోని కొత్తబస్టాండ్, గాయత్రి ఎస్టేట్, బుధవారపేట, ఎన్ఆర్ పేట, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలకు గర్భిణులను తీసుకొస్తారు. లింగ నిర్ధారణతో పాటు అవసరమైతే భ్రూణహత్య(అబార్షన్) చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ తతంగంలో మొత్తం సూత్రధారులు ఎక్కువగా ఆర్ఎంపీలే ఉంటున్నారు. లింగనిర్ధారణకు రూ.4వేల నుంచి రూ.5వేలు, అబార్షన్కు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా తీసుకుంటున్నారు. ఇందులో ఆర్ఎంపీలకు 20 నుంచి 40 శాతం వరకు కమీషన్ ముట్టజెబుతున్నారు. -
తిరిగి దాడులు, తనిఖీలు నిర్వహిస్తాం
జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గత ఏప్రిల్లో 40 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అయితే ఆయా కేంద్రాలను తిరిగి తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులను నిగ్గు తేలుస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు, వివరాలు బహిర్గతం గాకుండా చేసి, సదరు స్కానింగ్ కేంద్రంపై దాడులు నిర్వహిస్తాం. రెగ్యులర్గా ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తాం. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్వో, కర్నూలు ● -
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల(న్యూటౌన్): డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో కిసాన్ డ్రోన్స్ వినియోగంపై గ్రూప్ కన్వీనర్, కో–కన్వీనర్, అధికారులు, ఎఫ్పీఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు గ్రూపులకు కూడా డ్రోన్లు పంపిణీ చేశామని, జిల్లాలో ఇప్పటి వరకు 40 డ్రోన్ల వరకు వినియోగించడం జరుగుతోందన్నారు. రాను న్న రోజుల్లో అధునాతన సాంకేతికత డ్రోన్లు రాను న్నాయన్నారు. డ్రోగో కృషి 3ప్రో అనే డ్రోన్ సుమా రు 9.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని అందులో 80 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. వీటిని ఆటోమేటిక్, మాన్యువల్ పద్ధతి ద్వారా వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. నానో యూరియా వినియోగానికి డ్రోన్లను ఉపయోగించుకోవచ్చునన్నారు. రసాయన ఎరువుల విచ్చల విడిగా వినియోగిస్తే భూసారం తగ్గిపోయి దిగు బడులు తగ్గుపోతాయన్నారు. జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలైన నువ్వులు, బ్లాక్ గ్రామ్, సోయా, కొర్ర తదితర పంటలు వేసేలా రైతులను ప్రోత్సాహించాలన్నారు. అంతకుముందు పలువురు కిసాన్ డ్రోన్స్ సాంకేతిక వినియోగం, ఉపయోగాలు, బ్యాంకు రుణం తదితర అంశాలపై వ్యవసాయ అధికారులు, రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఎల్డీఎం రవీందర్ కుమార్, ఆర్ఆర్ఎస్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ రామకృష్ణా రావు, నాబార్డు డీడీఎం, డ్రోన్ నిర్వాహకులు చైతన్య, రైతులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
12 మండలాల్లో అకాల వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 12 మండలాల్లో వర్షాలు కురిశాయి. నందవరంలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 69.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలు రూరల్లో 32.2, కర్నూలు అర్బన్లో 25.4, కల్లూరులో 23.2, మద్దికెరలో 7.6, ఓర్వకల్లో 6.8 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 7.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 14న 3 మి.మీ, 15న 7.4, 16న 9, 17న 8.3 మిమీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నంద్యాల జిల్లాలో 14న 2.1, 15న 9.8, 16న 12.1, 17న 10.1 మిమీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వాము వ్యాపారులు సిండికేట్ ● తగ్గిన ధరలతో నష్టపోతున్న రైతులు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను నష్టాలకు గురి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్కు మంగళవారం 88 మంది రైతులు 280 క్వింటాళ్ల వాము తెచ్చారు. కనిష్ట ధర రూ.611, గరిష్ట ధర రూ.24,306 లభించింది. సగటు ధర కేవలం రూ.10,288 మాత్రమే నమోదైంది. వ్యాపారులు ఒకటి, రెండు లాట్లకు మాత్రమే ఎక్కువ ధర వేసి మిగిలిన లాట్లకు తక్కువ ధరలు కోట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే సగటు ధర రూ.10 వేలు మాత్రమే నమోదైందని రైతులు వాపోతున్నారు. కాగా వాము వ్యాపారులు టెండర్ హాల్లో యథేచ్ఛగా తిరుగుతూ ధరలను తారుమారు చేస్తున్నట్లు తెలుస్తోంది. టెండర్ హాల్లో కంప్యూటర్ ఆపరేటర్లను లోబరుచుకొని తమకు అనుకూలంగా ధరలు మారుస్తున్నారనే చర్చ జరుగుతోంది. హ్యాండ్లూమ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు నంద్యాల(న్యూటౌన్): వెంకటగిరిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నందు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఓఎస్డీ గిరిధర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల డిప్లోమా కోర్సులకు హ్యాండ్లూమ్ టెక్నాలజీ 53 సీట్లు, తమిళనాడులో 12 సీట్లు, కర్ణాటకలోని గడగ్ నందు నాలుగు సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన వారు www.iihtvgr.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 93999 36872ను సంప్రదించవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 1వ తేదీ వరకు గడువు ఉందని వెల్లడించారు -
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండా విద్యా శాఖాధికారులు ఏక పక్షంగా నిర్ణయాలతో ప్రభుత్వ విద్యారంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి గ్రామంలో 1 నుంచి 5 తరగతులతో ప్రాథమిక పాఠ శాలలను తప్పనిసరిగా కొనసాగించాలి. 1 నుంచి 10 తరగతుల విధానాన్ని ఉపసంహరించు కోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలకు అన్ని రకాల సబ్జెక్టు టీచర్లను నియమించాలి. – నగరి శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ జిల్లా సెక్రటరీ, నంద్యాల అధిక సంఖ్యలో ఉండే ఎస్జీటీ ఉపాధ్యాయులకై నా మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలి. బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్–2 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ తరగతులు బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించి అదనంగా పోస్టులను కేటాయించాలి. –శివయ్య, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నంద్యాలఏకపక్ష నిర్ణయాలతో గందరగోళం -
● గోరుకల్లు జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల బృందం
పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే నీటి నిల్వ పాణ్యం: గోరుకల్లు జలాశయం పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే నీటి నిల్వకు అవకాశం ఉంటుందని నిపుణుల బృందం సభ్యులు అధికారులకు సూచించారు. జలాశయం కట్ట కుంగిపోతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఎక్స్ఫర్ట్ కమిటీ సభ్యు లు సందర్శించారు. కమిటీలోని సీడీఓ సీఈ విజయభాస్కర్, సీఈ కబీర్బాషా, ఎస్ఈ శివకుమార్రెడ్డి, ఈఈ మనోహరెడ్డి, సుభకుమార్, డీఈలు రీనా, కేధారేశ్వరరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఈఈ ప్రసూనాదేవి తదితరులు జలాశయాన్ని సందర్శించారు. ముందుగా డ్యామ్ డిజైన్, కట్ట కుంగిన ప్రాంతం, జారుతున్న రాతిపరుపు, లీకేజీలు తదితర అంశాలను పరిశీలించారు. ఒకే చోట కట్ట కుంగడంపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం కట్ట కుంగిన చోటా ఎత్తు 259 మీటర్లు మాత్రమే ఉందని, 265.06 మీటర్లు ఎత్తు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కట్ట పూర్తి స్థాయిలో నిర్మించి కాంక్రీట్ చానెళ్లు ఏర్పాటు చేస్తే వర్షపు నీరు కట్టలోకి వెళ్లకుండా నేరుగా జలాశయంలోకి వెళ్తుందన్నారు. భూమి లోపల పొరల వల్ల కూడా కట్ట కుంగే ప్రమాదం ఉందన్నారు. కట్టలోని 7 ప్యానెళ్లలో రాతి పరుపు దెబ్బతిన్నట్లు గుర్తించి లూస్ సాయిల్ను తొలగించాలన్నారు. కొత్తగా కంకర, ఇసుకతో ఫిల్ చేసి కట్టను పటిష్టం చేయాలని సూచించారు. జలాశయంలో పరిశీలించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. వారి వెంట డీఈఈలు జ్యోతి, గీతా, శివప్రసాద్, ఏఈలు, జేఈఈలు పాల్గొన్నారు. -
● ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం ● త్వరలో వెలువడనున్న నోటిఫికేషన్? ● జిల్లాలో 3 వేల మందికి పైగా అర్హులు ● బదిలీలపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ● తమ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్
నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయ బదిలీలకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలవడనుంది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, జీఓ 117 రద్దు మార్గదర్శకాల విడుదలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం, విద్యాశాఖ ఏకపక్షంగా నిర్ణయా లు తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన దరఖాస్తు, స్థానాల ఎంపిక, కేటాయింపు ఇలా మొత్తం ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగనుంది. నంద్యాల జిల్లా ప్రాతిపదికన నిర్వహించే బదిలీలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2023 జూన్లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టింది. గతేడాది ఎన్నికల నేపథ్యంలో బదిలీల ప్రక్రియను చేపట్టలేదు, రెండేళ్ల తర్వాత తిరిగి నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి జూన్ 1 నుంచి మే 31వ తేదీ వరకు విద్యా సంవత్సరం ప్రాతిపదికన తీసుకోనున్నారు. ఇందులో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు కనీస సర్వీసు రెండు సంవత్సరాల నుంచి ఎనిమిదేళ్ల వరకు తీసుకోనున్నారు. గ్రేడ్–2 హెచ్ఎంలకు ఐదేళ్లుగా నిర్ణయించారు. ఖాళీల వివరాలు డిస్ప్లే ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి బదిలీ కోరుకునే ఉపాధ్యాయులకు డిస్ప్లే చేస్తారు. ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఉన్న అన్ని ఖాళీలను బదిలీల్లో చూపుతారు. ● 2020 మే 31కు ముందు పాఠశాలల్లో చేరిన హెచ్ఎంలకు ఐదేళ్లు అదే పాఠశాలల్లో విద్యా సంవత్సరాలు పూర్తవుతున్నందున తప్పని సరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ● 2017 మే 31కి ముందు పాఠశాలల్లో చేరిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నందున తప్పని సరిగా బదిలీ కావాలి. ● 2027 మే నెలాఖరులోపు ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉండే అవకాశం ఉంది. ● జిల్లా వ్యాప్తంగా అన్ని క్యాడర్లకు సంబంధించి 4,927 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో తప్పని సరి బదిలీలకు సంబంధించి 3 వేల మంది దాకా ఉండవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల వివరాలు.. చర్చలలో ఒక తీరు, నిర్ణయాలు మరో తీరు ఉపాధ్యాయుల బదిలీలు, పదో న్నతులకు సంబంధించిన విధి విధానాల పై ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపినప్పుడు ఒక తీరుగా, నిర్ణయాలను అమలు చేసేటప్పుడు మరో తీరుగా వ్యవహరిస్తోంది. జీఓ 117ను బేషరతుగా రద్దుచేసి, దాని స్థానంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి దాని ఆధారంగా మాత్రమే పాఠశాలలను పునః వ్యవస్థీకరించాల్సి ఉండగా అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని దిగజార్చి మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెడ్మాస్టర్గా నియమిస్తామనడం సరికాదు. – సుబ్బన్న ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు, నంద్యాల -
పాతూరు తిప్ప కరిగిపోతోంది!
పగిడ్యాల: అక్రమార్జనే ధ్యేయంగా అధికార పార్టీ నేతలు సహజ వనరుల లూటీకి తెగబడ్డారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా శ్రీశైలం రిజర్వాయర్ మునక భూముల్లోని బింగ గ్రావెల్ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నెహ్రూనగర్ పాతూరు తిప్పలో వేల టన్నుల విస్తారమైన బింగ గ్రావెల్ నిక్షిప్తమై ఉంది. ఈ గ్రావెల్ను కొల్లగొట్టేందుకు అధికార పార్టీ నాయకుల కన్ను తిప్పపై పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక ట్రిప్పు బింగ గ్రావెల్ను రూ. 1,600 ప్రకారం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుమారు పది ట్రాక్టర్లలో రోజుకు 120 ట్రిప్పులకు పైగా గ్రావెల్ను తరలిస్తున్నారు. గ్రావెల్ దందాపై తహసీల్దార్ శివరాముడును వివరణ కోరగా.. గ్రావెల్ అక్రమ తరలింపును నిలిపివేయాలని ఆదేశించామన్నారు. అయితే గ్రావెల్ కోసం అర్జీ ఇవ్వగా దానిని భూగర్భ, గనుల శాఖ అధికారులకు పంపామని తహసీల్దార్ పేర్కొనడం గమనార్హం. అధికార పార్టీ నేతల అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా బింగ గ్రావెల్ తరలింపు రోజూ వందకు పైగా ట్రిప్పులు లూటీ -
● అమ్మ ప్రేమ గెలిచింది!
బిడ్డలంటే తల్లికి పంచ ప్రాణాలు. మనుషులైనా.. జంతువులైనా అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకలి తీర్చడంతో పాటు ఆపదలో ప్రాణాలను సైతం అడ్డేస్తుంది. ఇందుకు నిదర్శనమే గోమాత ఘటనే. తోడేళ్ల గుంపులా కుక్కలు ఆవు దూడపై దాడికి యత్నించగా, తల్లి ఆవు గంట పాటు దూడను కాపాడుకునేందుకు కుక్కలతో చేసిన పోరాటం చూసినా వారు ఎవరైనా ‘ఇది కదా తల్లి ప్రేమ’ అని అనక మానరు. మంగళవారం మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల్లో మేత కోసం ఆవుల మంద వారం రోజులుగా తిరుగుతోంది. ఓ ఆవుకు దాహం వేయడంతో తన బిడ్డతో కలిసి తాగునీటి కోసం ఊళ్లోకి వచ్చింది. గమనించిన కుక్కలు దూడపై మూకుమ్మడిగా దాడికి యత్నించాయి. దీంతో ఆవు తన బిడ్డను కాపాడుకోవడానికి సుమారు గంటపాటు వీరోచిత పోరాటం చేసింది. చివరికి అలసిన కుక్కలు తోక మూడిచి వెళ్లిపోయాయి. – దొర్నిపాడు -
భ్రామరీకి లక్ష కుంకుమార్చన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం లక్ష కుంకుమార్చన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీశైలానికి స్వయంగా రాలేని భక్తులు వారి గోత్ర నామాలతో లక్ష కుంకుమార్చనలో పరోక్ష సేవగా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి 26 మంది భక్తులు పరోక్షసేవ ద్వారా పాల్గొన్నారు. మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు చెబుతున్నారు. లక్ష కుంకుమార్చన సేవను జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని సంతాన సౌఖ్యం కలుగుతుందన్నారు. మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకోండినంద్యాల(న్యూటౌన్): పదో తరగతి మార్కుల జాబితాను www. bsc.ap.gov.in అందు బాటులో ఉందని, విద్యార్థులు డోన్లోడ్ చేసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగాయన్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలు వచ్చాయన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి వెబ్సైట్లో మార్కుల జాబితాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏవైనా దిద్దుబాట్లు ఉన్నట్లు అయితే ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్లలో సవరణలు అమలు చేయడానికి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దృష్టికి తెలియజేయాలన్నారు. అడ్మిషన్కు సక్రమంగా పాఠశాలల రికార్డులను జోడించాలన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సంక్షిప్తం మార్కుల జాబితా పత్రం ఈనెల 25వ తేదీలోగా సమర్పించాలని డీఈఓ తెలిపారు. 17న పాణ్యంకు సీఎం రాక పాణ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17వ తేదీన పాణ్యం రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ మండల రెవెన్యూ అధికారులతో సమీక్ష చేపట్టారు. సీఎం పర్యటన షెడ్యూల్డ్ అధికారకంగా రావడంతో ఆర్డీఓ, తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డి కలిసి హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాణ్యం హైవేలోని చందమామ హోటల్ ఎదురుగా ఉన్న ప్రయివేట్ వెంచర్ను పరిశీలించారు. మరో స్థలాన్ని పరిశీలించనున్నారు. పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో బహిరంగ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు గురించి ఆర్డీఓ అడిగి తెలుసుకున్నారు. అధికారికంగా సీఎం పర్యటన ఖరారైనట్లు ఎంపీడీఓ ప్రవీణ్కుమార్ తెలిపారు. 67 మందికి గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 67 మంది గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 31 మందికి, నంద్యాల జిల్లాలో 36 మందికి పదోన్నతి లభించిందన్నారు. వీరిలో కర్నూలు జిల్లాకు 10 మందిని, నంద్యాల జిల్లాకు 10 మందిని కేటాయించి మిగిలిన వారిని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు కేటాయిస్తు సీపీఆర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొందేందుకు 34 మంది జూనియర్ అసిస్టెంట్లకు అర్హత ఉందన్నారు. ఈ మేరకు అనుమతి కోరుతున్నామని డీపీఓ వెల్లడించారు. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): భానుడి భగభగలు పెరిగాయి. కొద్ది రోజులుగా 40 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సోమవారం పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాణ్యంలో 40.5, రుద్రవరంలో 40.2, శిరువెళ్లలో 40, గూడూరులో 39.3, కోడుమూరులో 39.2, వెల్దుర్తిలో 39.1 డిగ్రీల ప్రకారం నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ తెలిపారు. -
ఫైల్పై ఆరా తీస్తున్నాం
ఎన్ఎస్టీఎఫ్డీసీ రుణాలకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిన విషయంపై ఆరా తీస్తున్నాం. ఎవరైనా కావాలని ఫైల్ను మాయం చేశారా? లేక కార్యాలయంలోనే ఎక్కడైనా మిస్ అయ్యిందా? అనే కోణంలో విచారణ చేయిస్తున్నాం. అప్పట్లో కార్యాలయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులు ఫైల్ను తమ ప్లేస్లోకి వచ్చిన వారికి అప్పగించారా, లేదా అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. ఫైల్ కనిపించకుండా పోవడం వల్ల ఈ పథకం కింద తీసుకున్న రుణాల రికవరీ కష్టతరమవుతోంది. – కె.తులసీదేవి, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారిణి● -
గిరిజన సంక్షేమ శాఖలో రుణాల ఫైల్ గల్లంతు
● 2018–19లో 11 మందికి రూ.1.57 కోట్ల రుణాలు ● ఇందులో 7 ఇన్నోవా, 2 బొలేరో వాహనాలు ● కార్పొరేషన్కు చెల్లించాల్సిన రుణం రూ.96.86 లక్షలు ● ఇప్పటి వరకు చెల్లించింది రూ.10.45 లక్షలు ● రికవరీ తక్కువగా ఉందని ఉన్నతాధికారుల అసహనం ● షూరిటీ ఇచ్చిన వారికి నోటీసులు పంపేందుకు కనిపించని ఫైల్ -
ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే నిదర్శనం. అర్హులు రుణాలు అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. అడ్డదారిలో రుణాలు దక్కించుకున్న వాళ్లు ఎంచక్కా షి‘కారు’ చేస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగులను బుట్టలో వేసుకొని రుణాలు తిరిగి చెల్లించకుండా
రూ.16,58,300లకు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్ఎస్టీఎఫ్డీసీ లోన్ రూ.9,94,980 కాగా, ట్రైకార్ సబ్సిడీ రూ.5,80,405లుగా నిర్ణయించారు. అలాగే లబ్ధిదారుని వాటా రూ.82,915 చెల్లించిన వారికి వాహనాలు కేటాయించారు. రూ.10.60 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్ఎస్టీఎఫ్డీసీ లోన్ రూ.6.36 లక్షలు, సబ్సిడీ రూ.3.71 లక్షలు కాగా.. లబ్ధిదారుని వాటా రూ.53 వేలు చెల్లించిన వారికి బొలెరో వాహనాలను అందించారు. ఇన్నోవా కారు రూ.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో లోన్ రూ.6 లక్షలు కాగా, సబ్సిడీ రూ.3.50 లక్షలు. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి ట్రాక్టర్లు మంజూరైంది. ఇన్నోవా కారురెడిమేడ్ గార్మెంట్ యూనిట్ యూనిట్ ఏర్పాటుకు రూ.10 లక్షలను మంజూరు చేశారు. ఇందులో లోన్ 8.50 లక్షలు, సబ్సిడీ రూ.లక్ష. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి రుణం మంజూరు చేశారు. బొలెరో వాహనం -
మద్యం దుకాణానికి దరఖాస్తుల ఆహ్వానం
బొమ్మలసత్రం: పగిడ్యాల మండలానికి చెందిన మద్యం దుకాణానికి గీత కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీలోగా జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. నాన్ రీఫండబుల్ ఫీజు రూ. 2 లక్షలు చలానా రూపంలో సమర్పించాలని సూచించారు. ఫిర్యాదులు పునరావృతం కావొద్దు బొమ్మలసత్రం: పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్రాణా పోలీసుల అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అందిన ఫిర్యాదుల్లో అధికంగా అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, ఉద్యోగాల పేరుతో మోసాలు, తప్పుడు పత్రాలతో ఆస్తుల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ సూర్యమౌళి పాల్గొన్నారు. పీహెచ్సీల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి ఉయ్యాలవాడ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించా రు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లో పీహెచ్సీల్లో వైద్య సేవలు అందడం లేదని కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పీహెచ్సీల్లో కనీస మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు దుస్థితిపై, రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో వున్నాయా లేవా వైద్యాధికారులు, సిబ్బంది ఆసుపత్రులకు వస్తున్నారా లేదా సమయ పాలనపై ఆరా తీయాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఇన్చార్జ్ ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మండల పరిధిలోని పెద్దయమ్మనూరు, ఉయ్యాలవాడ, మాయలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వసతుల కల్పనపై నివేదిక అందజేస్తామన్నారు. -
పొగాకు కంపెనీలపై చర్యలు తీసుకోండి
నంద్యాల(న్యూటౌన్): ఒప్పందానికి అనుగుణంగా పొగాకు కొనుగోలు చేయకుండా రైతులను వేధిస్తున్న ప్రైవేటు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, మహానంది, పాణ్యం, కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల్లో పలు రైతుల నుంచి ప్రైవేటు కంపెనీ లు ముందుగానే అగ్రిమెంట్ చేసుకుని పంట చేతికొచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్న ధరకు కొనుగోలు చేయడం లేదన్నారు. పొగాకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడులు మాట్లాడుతూ.. అలయన్స్ వన్, జీపీఐ, ఎంఎల్ గ్రూప్, ఐటీసీ లాంటి కంపెనీలు జిల్లా రైతులతో క్వింటా రూ.18,500 మేర కొనుగోలు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకొని పొగాకు కొను గోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇళ్లలో పొగాకు నిల్వ చేసుకోవడంతో రంగుమారి నాణ్యత దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వసుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు కంపెనీలతో చర్చించి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో ఏపీ రైతు సంఘం నాయకు లు సుబ్బరాయుడు, సురేష్, పొగాకు రైతులు బుజ్జయ్య, రఘురామిరెడ్డి, సుబ్బు, నారాయణ, థామస్, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంపెనీలతో కలెక్టర్ చర్చలు జరిపి న్యాయం చేయాలి అగ్రిమెంట్ ధర ఇప్పించాలని డిమాండ్ -
రాష్ట్రంలో రాక్షస పాలన
బొమ్మలసత్రం: కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తుందని ఎమ్మెల్సీ ఇసాక్బాషా విమర్శించారు. సోమవారం స్థానిక మాజీ ఎమ్యెల్యే శిల్పారవి చంద్రకిషోర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానవీయమన్నారు. కూటమి నేతల మెప్పు కోసం పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం మంచిది కాదన్నారు. మాజీ మంత్రి, ఒక మహిళ అని చూడకుండా ఆమైపె సీఐ దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీఐ సుబ్బనాయుడును సీఐ గారు..అని సంభోదించినప్పటికీ ఆమెను కారులో నుంచి బైటికి లాగి కిందకు దింపటం ఎంత దుర్మార్గమన్నారు. ఇటీవల గుంటూ రు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, నైటీ మార్చుకుని చీరతో వస్తానని ఆమె బ్రతిమాలినా వినకుండా.. చీర కారులోనే మార్చుకోమని పోలీసులు చెప్పడం ఎంతటి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలన రాక్షసపాలనను తలపిస్తుందని, ఇలాగే కొనసాగితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలు తెలపాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కూటమి నేతలు రెడ్ బుక్ పాలనను మాత్రం సజావుగా సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, అధికార పత్రినిధి అనిల్ అమృతరాజ్, మాజీ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్ కృష్ణమోహన్, నాయకులు లక్ష్మీనారాయణ, సాయిరామ్రెడ్డి, రహంతుల్లా, భాస్కర్రెడ్డి, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్బాషా -
‘మీ కోసం’లో అర్జీల సమాచారం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(న్యూటౌన్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల (తాజా పరిస్థితిని) సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు అర్జీల నమోదు, ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నంబర్ను కూడా సంప్రదించవచ్చునన్నారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే మాత్రమే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలన్నారు. వినతులలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అధిక శాతం వస్తున్నాయన్నారు. వినతులను సక్రమంగా పరిష్కరించని కారణంగా 47 రీఓపెన్ అయ్యాయని, వీఐపీ అర్జీలు 7 పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. జిల్లాలో బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు 975 మార్గదర్శులను గుర్తించామని, ఆళ్లగడ్డ మండలం నుంచి ఇంకా మార్గదర్శుల నివేదిక రావాల్సి ఉందని వెంటనే పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. 203 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.