breaking news
Nandyala
-
50 కిలోల పంచలోహ విగ్రహం విరాళం
జూపాడుబంగ్లా: తాటిపాడు గ్రామ ంలోని వీరభద్రస్వామి ఆలయానికి గురువారం 50 కిలోల పంచలోహ అమ్మవారి విగ్రహాన్ని విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, సరోజినీదేవి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాసరావు, వెంకటరమణరావు, కుమా ర్తె ధనలక్ష్మి రూ.1.45 లక్షల విలువైన 50 కిలోల పంచలోహ లలితాదేవి అమ్మవారి విగ్రహాన్ని అందజేశారు. తమిళనాడులోని కుంభకోణంలో తయారు చేయించినట్లు దాతలు తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని ఆలయ పెద్దలు హరీష్రెడ్డి, అంబిరెడ్డి, అర్చకులు రాజేష్, మురళీమోహన్ అందుకున్నారు. -
చివరి చూపు లేకుండా అంత్యక్రియలు
● సున్నిపెంట శ్మశానంలో ఐదు మృతదేహలకు ఖననం ● చివరి చూపునకు నోచుకోని బంధువులు, స్నేహితులు ● పది మంది కుటుంబ సభ్యుల హాజరు శ్రీశైలంటెంపుల్: సొంత ఊరు, బంధువులు, స్నేహితులు ఉన్నా..అత్యంత దయనీయంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. మృతదేహాల నుంచి దుర్వాసన వస్తుండడంతో సొంత ఊరికి కూడా తీసుకెళ్లలేక సున్నిపెంట శ్మశానంలో ఖననం చేశారు. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న బంధువులు మినీవ్యాన్లో శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అప్పటికే ఆత్మహత్య చేసుకుని మూడు రోజులు కావడంతో మృతదేహాల నుంచి దుర్వాసన వస్తోంది. దీంతో మృతదేహాలకు సున్నిపెంట గ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు సుధాకర్ పెద్దనాన్న కుమారులు, సుధాకర్ పెద్ద అక్క ఆదిలక్ష్మీ భర్త గోగుల రాముడు, ఇతర కుటుంబ సభ్యులు సుమారు పది మంది కన్నీటి రోదనల నడుమ అత్యంత దయనీయంగా దహనసంస్కారాలు నిర్వహించారు. సొంత గ్రామం, బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఉన్నా చివరి చూపుకు సైతం నోచుకోలేదు. ఆరోగ్యం బాగాలేదని, చూపించుకుని వస్తామని చెప్పి అనంత లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ‘నేను వస్తానన్నా వద్దని, మేమే వస్తాం అని చెప్పి కడసారి చూపుకు కూడా నోచుకోకుండా శివయ్య చెంతకు వెళ్లింది’ అని ఆదిలక్ష్మీ భర్త రోదిస్తుంటే అక్కడ ఉన్నవారి కళ్లలో నీళ్లు తిరిగాయి. దేవస్థానం, పోలీసు శాఖ నిర్లక్ష్యం వీడేనా? శ్రీశైలంలో ఉన్న పలు సత్రాలను, వసతి గదులను దేవదాయ ధర్మదాయ నిబంధనల మేరకు నిర్వర్తిస్తున్నారా, అతిక్రమిస్తున్నారా అనే విషయాలపై తరచూ తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. సత్రాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి తగు జాగ్రత్తలు, సూచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనల మేరకు వసతి గదులు కేటాయిస్తున్నారా అని దేవస్థానం, పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహిస్తే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా అరికట్టే అవకాశం ఉంటుందని పలువురు భక్తులు పేర్కొంటున్నారు. -
ఘనంగా మిలాద్–ఉన్–నబీ
నంద్యాల(వ్యవసాయం): మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన బుధవారం మిలాద్–ఉన్–నబీ వేడుకను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైద్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రవక్త వాడిన వస్తువులను ప్రదర్శించారు. చాంద్బాడా వీధిలోని సాహెబ్ మసీదులో ఆసారెముబారక్ నిర్వహించారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త వారి తలవెంట్రుకలు, ప్రవక్త వాడిన కంబలి, పవిత్ర మక్కా కిస్వా శారీను ప్రదర్శించారు. వాటిని ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుని సర్వ మానవాళి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మంజుబాషా దర్గా నిర్వాహకుల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మతపెద్దలు మాట్లాడుతూ.. మానవాళి శాంతి కోసం అల్లాహ్ పంపిన దూతగా మహమ్మద్ ప్రవక్త ఈ భూప్రపంచలోనికి వచ్చారన్నారు. మతగురువులు సయ్యద్ షర్బుద్దీన్, హుసేనీ, అసదుల్లా, సయ్యద్ కరీముల్లా, మొయిద్దీన్ హుసేనీ, సయ్యద్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. -
జగదుర్తిలో టీడీపీ నాయకుల రౌడీయిజం
● వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి ● ఐదుగురుకి గాయాలు సాక్షి టాస్క్ఫోర్స్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు తిరగకుండా ఉండేందుకు టీడీపీ నాయకులు రౌడీయిజం చేశారు. డోన్ మండలం జగదుర్తిలో బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేశారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాజేశ్వరరెడ్డి, శ్రీధర్రెడ్డి, దామోదర్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, సోమశేఖర్రెడ్డి, కోదండరామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డితో పాటు మరి కొంత మంది పట్టుడు కర్రలతో దాడి చేసినట్లు గాయపడిన వారు తెలిపారు. వైఎస్స్రా్సీపీ నాయకులు మోహన్రెడ్డి, రఘునాథరెడ్డి, ఉప్పరి వెంకటేశ్వర్లు, బోయ సుంకన్న, బోయ సురేష్ ఇళ్లకు వెళ్లి దాడి చేసినట్లు బాధిత కుటుం సభ్యులు తెలిపారు. దాడిలో మోహన్రెడ్డి, రఘునాథరెడ్డి తలలకు బలమైన తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురికి గాయాలు కావడంతో వీరిని గ్రామస్తులు డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్లి పరిస్థతిని సమీక్షించారు. -
పోలీసుల కోసమే క్యాంటీన్
బొమ్మలసత్రం: మార్కెట్ కంటే అతి తక్కువ ధరకు పోలీసులకు నిత్యావసరాలు అందించాలనే లక్ష్యంతో పోలీస్ క్యాంటీన్ను ఏర్పాటు చేశామని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ను బుధవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. పోలీస్ శాఖలో పనిచేసే వారు హోదాతో సంబంధం లేకుండా ఇక్కడ కొనుగోలు చేయవచ్చన్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్బాషా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ చిన్నికృష్ణ, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కుడిగట్టు కేంద్రంలో నిలిచిన విద్యుదుత్పాదన శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో గత 20వ తేదీ నుంచి విద్యుత్ ఉత్పాదన నిలిపేశారు. వర్షాభావ పరిస్థితులతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఆశాజనకంగా లేదు. శ్రీశైలం జలాలపై ఆధారపడిన రైతాంగం తమ పొలాలకు సాగునీరు ఇవ్వాలని ఆందోళనలు చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రాంతంలోని ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో నిర్విరామంగా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. ఇక కుడిగట్టు కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పాదన జరిపితే శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు తగ్గిపోయే అవకాశం ఉండటంతో ఉత్పాదనను నిలిపివేశారు. ప్రభుత్వ, లోడ్ డిశ్పాచ్ ఆదేశాలు రాగానే కుడిగట్టులో తిరిగి ఉత్పత్తి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. చెంచులకు ఉచిత స్పర్శదర్శనం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని బుధవారం చెంచులకు కల్పించారు. శ్రీశైలం చెంచుగూడేంతో పాటు మార్కాపురం జిల్లాల నుంచి 40 మంది చెంచు భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. తప్పెట వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ స్పర్శ దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు వీరికి ఆహ్వానం పలికారు. అనంతరం మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనములో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. నంద్యాలలో ఐదు రోజుల గణేశ్ ఉత్సవాలు నంద్యాల(వ్యవసాయం): జిల్లా కేంద్రమైన నంద్యాలలో సెప్టెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వినాయక చవితి వేడుకలను నిర్వహించనున్నట్లు గణేశ్ కేంద్ర సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గణేశ్ కేంద్ర సమితి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరపత్రాలను, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో మూడు రోజుల పాటు నంద్యాలలో ఐదు రోజుల పాటు వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహించేందుకు సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా రాజశేఖర్రెడ్డి, మహేష్రెడ్డి, దండు వెంకటేశ్వర్లు, నాగదీప్ పాల్గొన్నారు. -
శ్రీశైలం హుండీ ఆదాయం రూ.5.88కోట్లు
శ్రీశైలంటెంపుల్: భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేణా రూ.5,88,89,846 లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆలయంలోని అలంకార మండపంలో ఉభయ దేవాలయాల్లోని హుండీలలో గత 35రోజులల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. బంగారం 87గ్రాముల 200 మిల్లీగ్రాములు, వెండి 4కేజీల 250 గ్రాములు లభించినట్లు ఈఓ తెలిపారు. అలాగే యుఎస్ఏ డాలర్లు 540, యుఏఇ దిర్హమ్స్ 1610, సింగపూర్ డాలర్లు 20, ఇంగ్లాండ్ పౌండ్స్ 140, మలేషియా రింగిట్స్ 21, సౌదీరియాల్స్ 10, బహ్రైన్దినార్ 109, ఓమన్బైసా 100, ఓమన్ రియాల్స్ 5 లభించినట్లు ఈఓ తెలిపారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపు చేపట్టారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు కె.కాంతివర్ధిని, ఉప్పుటూరి సుబ్బలక్ష్మి, పి.యు.శివమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, శివసేవకులు పాల్గొన్నారు. -
అతిథుల కోసమే ప్రత్యేక వంటలు
శ్రీశైల క్షేత్ర సందర్శనకు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసే అతిథులను గౌరవించడం కోసం మాత్రమే కొన్ని ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తాం. వంటకాలలో నిషేధిత వస్తువులైన ఉల్లి, వెల్లుల్లి వినియోగించే ప్రసక్తే లేదు. మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాలకు తరలివచ్చే జిల్లా అధికారుల బృందానికి, సిబ్బందికి ప్రత్యేకంగా వంట మనుషులను, ప్రత్యేక పొయ్యి ఏర్పాటు చేసి వంటలు సిద్ధం చేస్తాం. భక్తులకు సిద్ధం చేసే అన్నప్రసాదం పవిత్రంగా తయారు చేస్తాం. త్వరలో అతిథుల కోసం దేవస్థాన అన్నప్రసాద భవనం కాకుండా ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేసి, చెఫ్, వడ్డనకు మనుషులను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
శివ సన్నిధిలో ప్రాణాలొదిలారు
శ్రీశైలం టెంపుల్: కుటుంబ కష్టాలకు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్ (36), అతడి పెద్దక్క గోగుల ఆదిలక్ష్మి (50), చిన్నక్క మల్లేశ్వరి (45), చెల్లెలు పల్లపు శ్రీదేవి (33), మల్లేశ్వరి కుమారుడు మణికంఠ విగత జీవులై కనిపించారు. సత్రంలోని రూమ్ నంబర్–11లో సుధాకర్, అతని మేనల్లుడు మణికంఠ గదిలోని హాల్లో ఫ్యాన్కు ఉరేసుకోగా, మిగిలిన ముగ్గురు మహిళలు స్నానాల గదిలో చీరతో ఉరేసుకున్నారు. మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. సత్రం గదినుంచి దుర్వాసన రావడంతో నిర్వాహకులు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. 26 రోజుల నుంచి వీరంతా వడ్డెర సత్రంలో బస చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ మాట్లాడుతూ.. ‘గత నెల 28న సుధాకర్తో పాటు ఆయన ముగ్గురు తోబుట్టువులు, మేనల్లుడు శ్రీశైలం వచ్చారు. రోజుకు రూ.800 అద్దె చెల్లిస్తూ వడ్డెర సత్రం గదిలో ఉంటున్నారు. ఇన్ని రోజులు ఉండకూడదని చెప్పినా ఆరోగ్యం బాగాలేదంటూ కొనసాగారు. సుధాకర్కు ఇంకా వివాహం కాలేదు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేసినా భర్తలను వదిలేసి ఇంటివద్దే ఉంటున్నారు. వారంతా ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారు. బత్తలపల్లిలోని వారి బంధువులకు సమాచారం ఇచ్చాం. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’ అని చెప్పారు. ఆలయ ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వసతి గదుల్లో భక్తుల బసకు 48 గంటలే అనుమతి ఉందన్నారు. కానీ, సత్రం నిర్వాహకులు నిబంధనల్ని ఉల్లంఘించి గదులు కేటాయించారన్నారు. ప్రైవేటు సత్రాలన్నీ నిబంధనల ప్రకారం గదులు కేటాయించాలని ఆదేశించారు. -
సూసైడ్ స్పాట్స్గా మారిన పుణ్యక్షేత్రాలు
గతంలో బావులు, చెరువుల్లో దూకడం, ఆ తర్వాత ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు దూకి చనిపోవడం వంటి ఘటనలు వరుసగా జరిగాయి. ఇలాంటి వాటిని ట్రెండ్ అంటారు. కాలానుగుణంగా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు సూసైడ్ స్పాట్స్గా మారుతుంటాయి. ఇప్పుడు పుణ్యక్షేత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఎప్పుడో ఎవరో కొందరు పుణ్యక్షేత్రంలో ఆత్మహత్య చేసుకున్నారన్న మీడియా, సోషల్ మీడియాలో చూసి ఉంటారు. వీరికేదైనా ఆత్మహత్య చేసుకోవాలన్న బలమైన తలంపు వచ్చినప్పుడు వారు కూడా అలాంటి ప్రాంతాలను ఎంచుకుంటారు. – డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, సైకియాట్రి హెచ్ఓడీ, కర్నూలు జీజీహెచ్ శ్రీశైలంలో చోటుచేసుకున్న ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యలకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నాం. బత్తలపల్లి పోలీసులతో కూడా మాట్లాడాం. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు తెలిసింది. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం. సత్రం నిర్వాహకులతో కూడా మాట్లాడాం, సత్రం రిజిస్టర్, రికార్డులు, సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నాం. – రామాంజినాయక్, ఆత్మకూరు డీఎస్పీ -
స్పెషల్ టెట్తో ప్రయోజనం లేదు
నంద్యాల(న్యూటౌన్): ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్తో ప్రత్యేక ప్రయోజనం లేదని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు భాస్కరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్బాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామపక్కీర్రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ శిక్షణా అర్హతలు, నియామక పక్రియ ద్వారా అర్హత సాధించి నిరంతర బోధన సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను కొత్త నియామకానికి పోటీ పడే అభ్యర్థులతో సమానంగా టెట్ అర్హత ప్రమాణాలతో పరీక్షించే విషయం పునః పరిశీలించాలన్నారు. టెట్లో జనరల్ కేటగిరికి 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరిలకు 40 శాతం అర్హత మార్కులు ఉంటాయన్నారు. 40 శాతానికి పరిమితం చేయాలి... ప్రత్యేక టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించి ఉత్తీర్ణత మార్కులను 40 శాతానికి పరిమితం చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయుల అనుభవాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. వయస్సు, దీర్ఘకాలిక సేవ, పాఠశాలలో ఉన్న బోధన, బాధ్యతలను పరిగణలోకి తీసుకోకుండా సీబీటీ పరీక్ష విధానాన్ని అమలు చేయడం వల్ల ఉపాధ్యాయులపై అదనపు ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఎస్టీయూ నాయకులు వెంకటరామిరెడ్డి, గోపాలకృష్ణ, నాగేంద్రకుమార్, ఎల్లా సుబ్బయ్య, కృష్ణారెడ్డి, ప్రభాకర్, నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు. -
బత్తలపల్లిలో విషాదం
శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి వాసులు శ్రీశైలంలో ఆత్మహత్య చేసుకోవడంతో వారి సొంతూరులో విషాదం అలుముకుంది. సుధాకర్కు ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు ఉన్నారు. పెద్ద అక్క ఆదిలక్ష్మిని తాడిమర్రి మండలం ఏకపాదంపల్లికి చెందిన రాముడుకు ఇచ్చి వివాహం చేశారు. రెండో అక్క మల్లీశ్వరిని ముదిగుబ్బ మండలం ఉప్పలపాడుకు చెందిన వేమయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. సుధాకర్కు ఉన్న రెండు ఐచర్ వాహనాలు సక్రమంగా నడవక పోవడంతో వాటిని తీసేశాడు. ఆ తర్వాత పది ఆటోలు అద్దెకు ఇచ్చి నడిపేవాడు. బత్తలపల్లిలో ఆటో వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్గానూ ఎన్నికయ్యాడు. ఈ క్రమంలో చాలా మంది తెలిసిన వారు, బంధువులు, బ్యాంకుల్లోనూ రుణం తీసుకున్నట్లు తెలిసింది. దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పు చేసి ఉండొచ్చని బంధువులు, స్థానికులు చెబుతున్నారు. అప్పు ఇచ్చిన వారికి కూడా ఐపీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఆటోలు కూడా ఫైనాన్స్ కంపెనీలు స్వాధీనం చేసుకున్నాయి. దీనికితోడు భారంగా నడుస్తున్న కుటుంబంలోకి భర్తలను వదిలేసి ఇద్దరు అక్కలు వచ్చి చేరారు. వారిలో ఒకరికి పక్షవాతం. మల్లేశ్వరి కుమారుడు మణికంఠ మానసిక స్థితి సరిగా లేకపోవడం సమస్యలు వేధించాయి. దీంతో ఈ కుటుంబాన్ని పోషించే భారం సుధాకర్ పై పడింది. దీంతో మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణమై ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. వారు కాల నీలో ఎవరితోనూ సరిగా మాట్లాడేవారు కాదని, ప్రవర్తనలోనూ మార్పు ఉండేదని చెప్పుకుంటున్నారు. అందరూ బంధువులైనా ఎవరితోనూ సరిగా కలివిడిగా ఉండేవారు కాదని అంటున్నారు. శ్రీశైలానికి తరలివెళ్లిన బంధువులు.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం అందగానే సుధాకర్ రక్త సంబంధీకులు, కాలనీవాసులు శ్రీశైలానికి బయల్దేరివెళ్లారు. ఆర్థిక కష్టాలతో అవస్థలు పడిన నేపథ్యంలో వారి మృతదేహాలను బత్తలపల్లికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయగా, మృతదేహాలు దుర్వాసన వస్తుండడంతో అక్కడే ఖననం చేసినట్లు తెలిపారు. వారు శ్రీశైలం వెళ్లేందుకు గాను స్థానికులు కొందరు ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిసింది. దీంతో బస్సు తీసుకొని శ్రీశైలానికి వెళ్లారు. నేను అప్పుడప్పుడు వారితో మాట్లాడుతుంటా. మా చిన్న మరదలు శ్రీదేవికి బాగాలేకపోతే తిరుపతి వద్దనున్న విరూపాక్షపురానికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత వారంతా శ్రీశైలానికి వెళ్లినట్లు చెప్పారు. నేను వస్తా అంటే సుధాకరే వద్దన్నాడు. నాలుగు రోజుల క్రితం ఫోన్ చేస్తే భార్య మాట్లాడింది. అప్పులేమో చాలా చేశారు. ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా బాగానే మాట్లాడింది. నేను రావాలా అంటే.. వద్దు లే.. నీకు ముందే బీపీ, షుగర్ ఉన్నాయి. మాకే బరువు అవుతుంది. నీవు పడిపోతే నీకు ఎవరు చేసేది అంది. తినడానికి ఖర్చులకు వెంపర్లాడుతు న్నామని చెప్పింది. అక్కడికి వరకూ వెళ్లి చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందో.. దేవుడేకి తెలియాలి. – గోగుల రాముడు, ఆదిలక్ష్మీ భర్త, బత్తలపల్లి -
వృద్ధులకు న్యాయ సహాయం అందిస్తాం
నందికొట్కూరు: వృద్ధులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి కబర్ది, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. న్యూ మాడ్యూల్ క్యాంప్లో భాగంగా మంగళవారం పట్టణ సమీపంలోని శ్రీకాళీ ప్రసాద ఆశ్రమంలో వృద్ధులతో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో జిల్లా జడ్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి కబర్ది మాట్లాడుతూ.. 2016 కింద అందుబాటు లో ఉన్న న్యాయ సేవలు, వృద్ధులకు హక్కులు, రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. పిల్లల నుంచి ఆదరణ కరువై, సంరక్షణకు దూరమైన వారు ఆర్డీఓను సంప్రందించి తమ ఫిర్యాదులకు పరిష్కారం పొందవచ్చన్నారు. న్యాయ సేవల హెల్ప్లైన్ నంబరు 15100ను సంప్రందించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్జీలు శోభారాణి, దివ్య, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.శ్రీశైలం డ్యాం నీటి మట్టం 875 అడుగులు శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం నీటిమట్టం మంగళవారం సాయంత్రం సమయానికి 875.20 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 164.7532 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. ఎగువ జూరా ల ప్రాజెక్ట్ నుంచి 11,500 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలంకు వచ్చి చేరుతుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 44,814 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు కేంద్రంలో 15.410 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్కు 31,364 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. ఓపెన్ యూనివర్సిటీలోప్రవేశాలకు దరఖాస్తులుశ్రీశైలంప్రాజెక్ట్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, గ్రూప్ల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.హుస్సేన్బాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విభజిత ఆంధ్రప్రదేశలో 2026–27 విద్యా సంవత్సరంలో మొట్టమొదటి సారిగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, 10+2లో పాసైన విద్యార్ధులు ప్రవేశాలకు అర్హులుగా పేర్కొన్నారు. ఇతర వివరాలకు శ్రీశైలం కో–ఆర్డినేటర్ ఎస్.మహేశ్వరరెడ్డి (9492942337)ని సంద్రించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. నేత్రదానంతో పునర్జన్మ బొమ్మలసత్రం: మరణిస్తూ నేత్రదానం చేయటమంటే తిరిగి పునర్జన్మ పొందినట్లేనని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లాలో నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభం సందర్భంగా మంగళవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చేపట్టిన ర్యాలీలో డీఎంహెచ్ఓ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేత్రదానం వల్ల కలిగే ప్రజయోజనాలనపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆరోగ్యవంతులతో పాటు బీపీ, షుగర్, కంటి అద్దాలు వినియోగించే వారు కూడా నేత్రదానానికి అర్హులన్నారు. హెచ్ఐవీ, క్యాన్సర్, హైపటైటీస్ బీ ఉన్న వారు నేత్రదానం చేయకూడదన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు నాగమణి, శ్రీనివాసులు, యశోదర, పామన్న పాల్గొన్నారు. టీటీడీలో అప్రెంటీస్షిప్ అవకాశాలు డోన్ టౌన్: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఐటీఐ పాసైన విద్యార్థులకు అప్రెంటీస్షిప్ చేయడానికి అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ ఐటీఐ జిల్లా కన్వీనర్, డోన్ ప్రిన్స్పాల్ నాగకేశాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాఫ్ట్మన్ సివిల్లో 98, ఫిట్టర్ 16, టర్నర్ 4, మిషినిస్టు 4, రేడియో, టీవీ 4, ఎలక్ట్రీషీయన్ 23, వైర్మెన్ 21, సీఓపీఏ 20 చొప్పున ఖాళీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 29వ తేదీ లోపల సమీప ప్రభుత్వ ఐటీఐల్లో 10వ తరగతి, ఐటీఐ మార్కుల జాబిత, తదితర ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐల్లో సంప్రదించాలన్నారు. -
అర్హుల ఓటుపదిలంగా ఉండాలి
మహానంది: సర్ 2026 ప్రక్రియలో ప్రతి ఓటరు వివరాలను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారి ఓటు పదిలంగా ఉండేలా చూడాలని జిల్లా ఎలక్ట్రోరోల్ అబ్జర్వర్ పి.ప్రశాంతి ఆదేశించారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ రమాదేవిలతో కలిసి మంగళవారం గ్రామంలో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి పురోగతి, పెండింగ్ అంశాలు, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. మహానందీశ్వరునికి ప్రత్యేక పూజలు: మహానందీశ్వరుని సన్నిధిలో ఎలక్ట్రోరోల్ అబ్జర్వర్ పి.ప్రశాంతి మంగళవారం ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ఆమెకు ఆలయ అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ అధికారి వై.మధు, వేదపండితులు బ్రహ్మశ్రీ రవిశంకర అవధాని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె శ్రీకామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆమెకు స్వామి, అమ్మవార్ల చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం అందించారు. -
ప్రైవేట్ సత్రాల ఇష్టారాజ్యం
● తరచూ ప్రైవేట్ సత్రాల్లో ఆత్మహత్య ఘటనలుశ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలోని ప్రైవేట్ సత్రాలపై దేవస్థాన అధికారులు పర్యవేక్షణ విస్మరించడంతో ప్రైవేట్ సత్రాలు దేవదాయ శాఖ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో పలు ప్రైవేట్ సత్రాల్లో దేవదాయ చట్టానికి విరుద్ధంగా కార్యక్రమాలతో పాటు తరచూ ఆత్మహత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అలాగే క్షేత్రంలో పోలీసుల నిఘా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీశైలం పరిధిలో ప్రస్తుతం సుమారు 70 సత్రాల వరకు ఉంటాయని అధికారుల అంచనా. ఆయా సత్రాలు దేవదాయ ధర్మదాయ శాఖ నిబంధనలు అనుసరించి సత్రానికి వచ్చే ఆదాయం, ఖర్చులు ప్రతి నెల దేవస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సత్రం ఆడిట్ను, నెల వారీ రిజిస్టర్ సైతం దేవస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే దేవస్థాన అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్ సత్రాలపై అజమాయిషీ క్రమక్రమంగా కోల్పోతూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆంగ్ల సంవత్సర వేడుకలు, కేక్ కటింగ్లు, బర్త్డే వేడుకలు, సినిమా పాటలకు డ్యాన్స్లు వేయడం తదితర కార్యక్రమాలు సత్రాల్లో చోటు చేసుకున్నా చర్యలు తీసుకోవడం లేదు. పోలీసుల నిఘా శూన్యం.. శ్రీశైల క్షేత్రంలో ప్రైవేట్ సత్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ, భక్తులకు వసతి గదులు కేటాయించేటప్పుడు నిబంధనలు, ఆధార్, రేషన్కార్డు, పూర్తి వివరాల సేకరణ, గదులు ఒకరోజు మాత్రమే కేటాయింపు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, అగ్నిప్రమాదం జరిగితే బయటికి వెళ్లేందుకు మార్గం, పార్కింగ్, అనుమానిత వ్యక్తులపై నిఘా తదితర నిబంధనలను ప్రైవేట్ సత్ర నిర్వాహకులు పాటిస్తున్నారా.. లేదా అనే విషయాలను తరచూ పోలీసు శాఖ తనిఖీలు నిర్వహిస్తుండాలి. ఆ దిశగా పోలీసు వ్యవస్థ పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన చూస్తే అధికారుల నిర్లక్ష్యం కనిసిస్తుంది. 48 గంటల కంటే ఎక్కువ రోజులు వసతి గది కేటాయించకూడదనే నిబంధన ఉన్నా పట్టించుకోకుండా వడ్డెర సత్రం నిర్వాహకు లు వసతి గది కేటాయించడం వెనుక దేవస్థాన అధికారులు, పోలీసు శాఖ నిర్లక్ష్యం ఉందని తెలుస్తుంది. తరచూ క్షేత్రంలోని పలు సత్రాలపై కార్డెన్సెర్చ్ లాంటి తనిఖీలు నిర్వహిస్తే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు కోరుతున్నారు. -
శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
నంద్యాల(వ్యవసాయం): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని రాయలసీమ జేఏసీ నాయకులు ప్రతాపరెడ్డి, జీవీఎన్ ప్రసాద్, పెద్ది శ్రీనివాసులు అన్నారు. మంగళవారం న్యాయవాదులు కోర్టు ఆవరణం నుంచి ర్యాలీగా వెళ్లి టెక్కె రోడ్డుపై మానవహారంగా నిలిచి శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. 90 రోజుల్లో బెంచ్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి నారా లోకేష్ హామీ ఏమైందని ప్రశ్నించారు. సర్క్యూట్ బెంచ్ ప్రచారంపై న్యాయవాదులు మండిపడ్డారు. హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాయలసీమకు న్యాయ సేవలను త్వరగా అందించాలంటూ, కర్నూలులో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. కార్యక్రమంలో న్యా యవాదులు వివేకానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, మద్దిలేటి, షేక్ రియాజ్, శ్రీదేవి, కృపావతి, సుబ్బరాయుడు, ఆలంఖాద్రి, సుదాంశమౌళిరెడ్డి, రాజేంద్రప్రసాద్, ఓబులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో కుటుంబం ఆత్మహత్య
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీశైలం వడ్డెర సత్రంలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్, ఆదిలక్ష్మి,మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.సత్రంలోని 11వ నంబర్ గదిని తీసుకున్న కుటుంబం.. మూడు రోజులుగా బయటకు రాలేదు. గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు తెరిచి చూడగా ఐదుగురు మృతి చెంది ఉన్నారు. ఫ్యాన్కు ఇద్దరు పురుషులు ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తింంచారు. -
మల్లన్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు నేడు విడుదల
శ్రీశైలం టెంపుల్: సెప్టెంబర్ మాసానికి సంబంధించి స్వామివారి స్పర్శదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం, ఆర్జితసేవాటికెట్లను మంగళవారం విడుదల చేయనున్నట్లు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఈఓ మాట్లాడుతూ భక్తులు సులభంగా ఆయా టికెట్లు పొందేందుకు వీలుగా 90శాతం టికెట్ల ను మనమిత్ర వాట్సప్ ద్వారా పొందే అవకాశం కల్పించామన్నారు. మిగిలిన 10 శాతం టికెట్లను ఏపిటిఎస్ వెబ్సైట్ www.tms.ap.gov.in ద్వారా పొందవచ్చన్నారు. స్వామివారి ఆర్జిత గర్భాలయఅభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, మహామత్యుంజయహోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలైన 14 రకాల ఆర్జితసేవలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా పొందవచ్చన్నారు. ఆన్లైన్ ద్వారా కూడా దర్శనం, ఆర్జితసేవా టికెట్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 27న విద్యార్థులతో పీఎం ముఖాముఖి నంద్యాల (న్యూటౌన్): జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ‘మై భారత్ యువ కనెక్ట్ ప్రొగ్రామ్’లో భాగంగా ఈనెల 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శిశకళ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారన్నారు. పీజీఆర్ఎస్కు 113 వినతులు బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి 113 వినతులు అందినట్లు జిల్లా ఎస్పీ సునీల్షొరాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల్లో అధికంగా ఆస్తి తగాదాలు, నగదు మోసాలు, అత్తింటి వేధింపులు లాంటి కేసులు వస్తున్నాయన్నారు. ఇందులో క్రిమినల్ కేసులుగా పరిగణించే ఫిర్యాదులకు సత్వరమే స్పందించి ఆయా స్టేషన్ అధికారులతో మాట్లాడామన్నారు. పీజీఆర్ఎస్ నుంచి స్టేషన్కు వెళ్లిన ఫిర్యాదును పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీశైలంలో అపచారం ● గర్భగుడిలోకి చెప్పులతో ప్రవేశించిన మహిళ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలో భద్రతా వైఫల్యంతో అపచారం చోటుచేసుకుంది. దేవస్థాన అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ చెప్పులు ధరించి గర్భగుడిలోకి ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండో శ్రావణ శుక్రవారం రోజున ఉచిత క్యూలైన్ ప్రవేశ ద్వారం నుంచి ఓ మహిళ చెప్పులు ధరించి ఆలయంలోకి ప్రవేశించింది. ఎస్కేడీ గేటు వద్ద నుంచి ధ్వజస్తంభం మీదుగా స్వామివారి దర్శనానికి ఆ మహిళ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచిన తరువాత కంటితుడుపు చర్యగా ఉచిత క్యూలైన్ వద్ద ఆ రోజు విధులు నిర్వర్తించిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై వేటు వేశారు. వీరి విధులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం పోరాటం ఉద్ధృతం నంద్యాల (వ్యవసాయం): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం పోరాటం ఉద్ధృతం చేస్తామని రాయలసీమ జేఏసీ నాయకులు సీనియర్ న్యాయవాదులు ప్రతాపరెడ్డి, ఓబుల్ రెడ్డి, చేపురి మద్దిలేటి అన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. కర్నూలులో కూటమి ప్రభుత్వం శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకుండా సర్క్యూట్ బెంచ్, మొబైల్ బెంచ్ అంటూ ప్రచారం చేయడం తగదన్నారు. శాశ్వత హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు న్యాయవాదులు సోమవారం నుంచి శనివారం వరకు విధులకు దూరంగా ఉండాలన్నారు. సమావేశంలో న్యాయవాదులు రామచంద్రారావు, వివేకానంద రెడ్డి, రాంగోపాల్రెడ్డి, సాయిరాం, నూర్ ఆలం ఖాద్రి, కృపావతి, రఘుప్రకాష్, శ్రీనివాసులు, ప్రసాద్, జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులను ప్రారంభించే తీరిక లేని కోట్ల
● బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డోన్: రూ.3కోట్ల వ్యయంతో గత ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా పట్టణ నడిబొడ్డున అత్యాధునిక వసతులతో నిర్మించిన నూత న ఎంపీడీఓ కార్యాలయ భవనాన్ని రెండేళ్లు గడిచినా ప్రారంభించకపోవడంలో ఆంతర్యం ఏమిటని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్రెడ్డిని నిలదీశారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడు తూ ఆదివారం ఎంిపీడీఓ కార్యాలయాన్ని క్యాబినెట్ హోదా కలిగిన జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ప్రారంభిస్తే ఆయనతో పాటు డోన్ ఎంపీపీ రేటి రాజశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్, వైస్ ఎంపీపీ ఎర్రిస్వామి, పార్టీ వలంటీర్ విభాగం జిల్లా అధక్షులు పోస్టు ప్రసాద్ తది తరులపై అక్రమ కేసులు బనాయించి వేధించడం టీడీపీ దుర్మార్గపు రాజకీయానికి నిదర్శనమన్నారు. 2020–23 మే నెల 26న రూ.1.5 కోట్లతో ఎంపీడీఓ భవనాన్ని నిర్మించేందుకు ఆర్థిక మంత్రిగా తాను భూమి పూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే తలమానికంగా భవనాన్ని తీర్చిదిద్దేందుకు జెడ్పీ చైర్మన్ అదనంగా మరో రూ.1.5 కోట్లు జిల్లా పరిషత్ నిధుల నుంచి మంజూరు చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు. రెండేళ్ల నుంచి అభివృద్ధి పనులు జరుగకుండా అడ్డుకోవడ మే కాకుండా నిర్మించిన అనేక భవనాలను రాజకీయ దురుద్ధేశంతో ప్రారంభించకుండా శిథిలావస్థ కు చేరుకునేలా ప్రవర్తిస్తుండాన్ని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేకి తీరిక లేదా నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన విలేజ్ క్లీనిక్, రైతు భరోసా, గ్రామ సచివాలయ, అంగన్వాడీ, పాఠశాలల అదనపు గదులు, క్లబ్ హౌస్, రిజిస్టర్ కార్యాలయ భవనాలు రూపుదిద్దుకున్నాయన్నారు. వీటితో పాటు వెంకటాపురం తుమ్మల చెరువు, వెంగలాంపల్లె చెరువులో టూరిజం స్పాట్లను ప్రారంభించే తీరిక కూడా డోన్ ప్రజా ప్రతినిధికి లేక పోవడం దురదృష్టకరమన్నారు. డోన్ ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించా లని పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీఓలతో కలిసి ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి అనేక సార్లు స్వయ ంగా కలిసి కోరినా ఎమ్మెల్యే కోట్ల వాయిదాలు వేస్తూ అవమానించారన్నారు. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం అయిపోయిన తరువా త భవనాన్ని ప్రారంభించాలనుకోవడం చూస్తే ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారో ఇట్టే తెలిసిపోతుందన్నారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు సకాలంలో సత్వరంగా అందేటట్లు ఎమ్మెల్యే కోట్ల కృషి చేయాలని మాజీ మంత్రి బుగ్గన హితవు పలికారు. జెడ్పీ చైర్మన్తో సహ 14 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు యాక్ట్ 30 అమలులో ఉన్న సమయంలో డోన్లో ఎంపీడీఓ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం చట్టరీత్యా నేరమని, ఈ మేరకు జెడ్పీ చైర్మన్తో సహ 14 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రోటోకాల్కు విరుద్ధంగా ఎంపీడీఓ కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం నేరంగా పరిగణిస్తున్నామన్నా రు. శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో కుట్ర పూరితంగా వ్యవహరించిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రపోతుల పాపిరెడ్డి, ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్, వైస్సార్సీపీ సీనియర్ నేతలు పోస్టు ప్రసాద్, సోమేష్యాదవ్, మల్లెంపల్లె రామచంద్రుడు, మల్లికార్జునరెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి, ఓబులాపురం సుధాకర్యాదవ్, తాడూరు ఎర్రిస్వామి, రామేశ్వరరెడ్డి, పూజారి వంశీకృష్ణ, జాకీర్ హుస్సేన్, లక్ష్ముంపల్లె ఓబులేసు, సయ్యద్ మన్సూర్తో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా పోలీసులు వీరిని మెజిస్ట్ట్ట్రేట్ ఎదుట హాజరు పరిచి రిమాండ్ కోరగా పోలీసుల వాదనను తోసిపుచ్చారు. -
మిన్నంటిన నినాదాలు..
పోలీసులు, ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో రోడ్లపై తిరగాడేందుకు, శాంతియుతంగా ప్రాజెక్టులను చూసేందుకు కూడా స్వేచ్ఛ లేకుండా సీఎం చంద్రబాబునాయు డు పోలీసులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ‘మేము ఏమైనా నక్సల్స్మా.. టెర్రరిస్టులమా.. ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అటకాయించటం సమంజసం కాదు’ అంటూ డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. రైతులపై పోలీసు జులం నశించాలంటూ నినాదాలు చేశారు. రైతులకు సాగునీరివ్వని చంద్రబాబునాయుడు డౌన్ డౌన్.. రైతులకు సాగునీరివ్వకపోవటం సిగ్గు..సిగ్గు.. సాగునీరిచ్చేవరకు పోరాడతాం.. రైతుల ఐక్యత వర్దిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. చివరికి బారికేడ్లు తీసుకొని నడుచుకుంటూ పోతులపాడు వైపు వెళ్లేందుకు నాయకులు యత్నించగా పోలీసులు నిలువరించారు. ‘పోలీసు వ్యవస్థ దిగజారి పనిచేయడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం, పోలీసులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా ఉంది.. అన్ని రోజులు ఒకేలా ఉండవని పోలీసులు గుర్తుంచుకోవాలి’ అంటూ శైలజానాథ్, కాటసాని, శిల్పా హెచ్చరించారు. విలేకరుల సమావేశం అనంతరం వారు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్దకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. అనుమతితో రావాలని నేతలకు డీఎప్పీ సర్దిచెప్పడంతో మధ్యాహ్నం 1.10 గంటలకు వెనుదిరిగారు. -
పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం పరమేశ్వరుడుకి ప్రీతికరమైన రోజు కావడంతో దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు స్వామి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూ లైన్లు నిండి పోయాయి. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి. -
రైతులతో కలసి ఉద్యమిస్తాం
రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటా విడుదల చేయకపోతే రైతులతో కలసి ఉ ద్యమిస్తాం. పోతిరెడ్డిపాడు వద్ద పరిస్థితి చూసి వాస్తవాలను తెలుసుకోవడానికి వస్తే పోలీసులు సహకరించాల్సిందిపోయే అడ్డుకుంటే ఎలా?. గోరుకల్లు చూడటానికి వెళ్లితే అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సార్బీసీ నుంచి 19 టీఎంసీల నీటిని రావాల్సిన పరిస్థితి ఉంది. మన హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఎన్ని ఉన్నాయని తెలుసుకునే హక్కు వైఎస్సార్సీపీ నాయకులకు లేదా..? రాయలసీమ రైతులకు న్యాయం కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. హంద్రీనీవా కాలువ వెంట మోటార్లు వేసుకొని పంటలు పండించుకుంటే పోలీసులు మోటార్లు ఎత్తుకుపోవడం దారుణం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు 85 శాతం పూర్తయితే మోటార్లు కూడా బిగించుకోలేకపోతే ఎలా. శ్రీశైలం డ్యాం నీళ్లు తెలంగాణకు తరలిస్తే చూస్తూ ఊరకోం. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు -
పోలీసు దిగ్బంధంలో పోతిరెడ్డిపాడు..
వైఎస్సార్సీపీ నాయకులు ఎట్టిపరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు వద్దకు వెళ్లకూడదనే కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయనాయక్ అధ్వర్యంలో పోలీసులు పోతిరెడ్డిపాడుకు వెళ్లే దారుల్లో బారికేడ్లతో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకున్నారు. పాములపాడు మీదుగా ఎస్సారెమ్సీ కాల్వ ఎడమగట్టు వెంట పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్దకు చేరుకునేందుకు ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, నందికొట్కూరు పరిశీలకుడు బుడ్డా శేషారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వారి వాహనాల్లో కాల్వ 0.6 కిలో మీటరు వద్దకు చేరుకోగా అక్కడ ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో వారు రైతులతో కాసేపు మాట్లాడి, సమస్యలను తెలుసుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కడప జిల్లా ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డి, నాయకులు మాసీమబాబు, గుండం సూర్య ప్రకాశ్రెడ్డి, సూర్య నారాయణరెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ సాయినాథ్రెడ్డి, షేక్ బాబులాల్, సంయుక్త కార్యదర్శులు గంధం రాఘవరెడ్డి, జెడ్పీటీసీలు పోచా జగదీశ్వరరెడ్డి, పర్వత యుగంధర్రెడ్డి, మండలాల కన్వీనర్లు పుల్యాల నాగిరెడ్డి, లోకేష్రెడ్డి, కృష్ణారెడ్డి, నాగరాజు, స్థానిక నాయకులు నాగార్జునరెడ్డి, నరేష్రెడ్డి, తరుణ్రెడ్డి, గోపాల్రెడ్డి, తిరుమల్లేష్రెడ్డి, మద్దిలేటిరెడ్డి, వెంకటరమణ, చిన్నమల్లయ్య, సుంకన్న, మల్లారెడ్డి, అశోక్రెడ్డి, సురేష్, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
సీమ ప్రాజెక్ట్లు సీఎం శిష్యుడికి తాకట్టు
రాయలసీమ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి తాకట్టు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు ను తెలంగాణకు అమ్మేశారు. చీకటి ఒప్పందం కారణంగానే సీమను ఏడారిగా మార్చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం రోజుకు నాలుగు టీఎంసీలు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపరు. రాయలసీమ కరువుతో అల్లాడిపోతుంటే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించి ప్రాజెక్టులను నింపే అవకాశం ఉన్నా ఎందుకు చోద్యం చూస్తున్నారు. శ్రీశైలం నిండా నీళ్లున్నా ప్రాజెక్ట్లను నింపకపోవడం వెనుక కుట్ర దాగి ఉంది. రాయలసీమ ప్రజలంటే చంద్రబాబుకు చులకన. నికర జాలాలతో సీమ ప్రాజెక్టులను నింపండి. తుంగభద్రలో రావాల్సిన వాటా కాలువలకు విడుదల చేయాలి. వరి, వేరు శనగకాయలు వేసుకోవద్దు అని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పందంగా ఉంది. నీళ్లులేకుండా పండించే పంటలు ఏవైనా ఉంటే రైతులకు చెప్పాలి. – సాకే శైలజనాథ్, రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి -
వైఎస్సార్సీపీ పోతిరెడ్డిపాడు పర్యటన.. నంద్యాలలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలోని పోతులపాడు టర్నింగ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోతిరెడ్డిపాడుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి శైలజానాథ్, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా, సుధీర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..‘సీమకు నీళ్ళు కావాలని పోతిరెడ్డిపాడు చూడటానికి వెళ్తే అడ్డుకోవడం ఏంటి?. ఇది చాలా దారుణం. ఖచ్చితంగా వెళ్లి తీరుతాం’ అని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారనే కారణంగా అధికారులు.. పోతిరెడ్డిపాడు గేటుకు తాళం వేయడం గమనార్హం. అంతేకాకుండా రెగ్యులేటర్ వద్దకు వెళ్ళడానికి అనుమతులు లేవన్న సాకుతో పోతిరెడ్డిపాడు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు. -
డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్
నంద్యాల(న్యూటౌన్): 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జోరందుకుంది. కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఉద్దేశించిన వెబ్ ఆప్షన్ల నమోదు ఈనెల 6 నుంచి మొదలైంది. ఈ నెల 27వ తేది రాత్రితో ఈ గడువు ముగియనుంది. మొదటి విడతలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటికే వివిధ కళాశాలలకు ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వాటిని మార్చుకునేందుకు చివరి అవకాశం ఈ నెల 28వ తేదీ వరకు ఉంది. నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం (ఎస్ఈపీ) అమల్లో భాగంగా డిగ్రీ కోర్సులను సమూల మార్పులతో తీర్చిదిద్దిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆన్లైన్ అడ్మిషనన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) విధానంలోనే 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. వాటిని హెల్ప్ లైన్ కేంద్రాల్లో ఆన్లైన్లోనే పరిశీలన చేస్తున్నారు. తదుపరి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. గత ప్రభుత్వ సంస్కరణల బాటలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం విద్యారంగంలో సమూలమైన మార్పులను తీసుకొచ్చింది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు పారదర్శక విధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ గత రెండేళ్లుగా ఇదే విధానంలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. జిల్లాలోని ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె, నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు 88 ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న విద్యార్థులకు సెప్టెంబర్ 2న కళాశాలల్లో సీట్ల కేటాయింపు జరగనుంది. సెప్టెంబర్ 3న తరగతులు ప్రారంభమవుతాయి. 27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం మార్చుకునేందుకు 28 వరకు తుది అవకాశం సెప్టెంబర్ 2న సీట్ల కేటాయింపు వచ్చేనెల 3నుంచి తరగతులు ప్రారంభం -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 24వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap. gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులు స్వీకరించారు. ఘాటెక్కిన ఉల్లిధర నంద్యాల(న్యూటౌన్): ఉల్లిధరలు ఘాటెక్కాయి. కోయకుండానే కనీళ్లు తెప్పిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో కిలో ఉల్లిపై రూ.20 నుంచి రూ. 25 ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.50 పలుకుతుంది. పెరుగుతున్న ధరను చూసి వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో ఉల్లి వినియోగానికి తగ్గట్టు ఉత్పత్తి లేదు. దీంతో ఇంతర ప్రాంతాల నుంచి వచ్చే సరఫరా పైనే ఆధారపడాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఉల్లి ధరలు కూడా పెరుగుతుండటంతో నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ● ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు కర్నూలు(సెంట్రల్): ఉపాధ్యాయుల, ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే మరో ఉద్యమం తప్పదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు అన్నారు. ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా గౌరవాధ్యక్షులు యస్.ఇస్మాయిల్, పూజారి లక్ష్మయ్య, ఐ.మరియానందం మాట్లాడారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ను రద్దు చేయాలన్నారు. జీతాలకు – ఐ గాట్ కర్మ యోగి యాప్ లకు ముడిపెట్టరాదని సూచించారు. -
వరి నాట్లకు నీళ్లు లేవు
మాకు మూడు ఎకరాల సొంత భూమి ఉంది. మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకున్నాం. నాలుగు ఎకరాల్లో పత్తి, ఒక ఎకరాలో మిర్చి సాగు చేశాం. ఒక ఎకరాలో వరి సాగు చేయడానికి 45 రోజుల క్రితం నారుపోశాం. బోరులో నీరు లేకపోవడంతో వరి నాట్లకు అవకాశం లేకుండా పోయింది. వర్షాలు లేకపోవడం, భూమిలో తేమ ఆరిపోవడంతో పత్తి ఎండిపోతోంది. పత్తి సాగుకు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయాం. కోసిగి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలి. – పి.బషీర్, కామన్దొడ్డి, కోసిగి మండలం -
దుర్మార్గపు పాలనను అంతమొందిద్దాం
మహానంది: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలనను అంతమొందిద్దామని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులు పిలుపునిచ్చారు. బాబు రెండేళ్ల పాలన అంతా దగానే అని, ఏ ఒక్క ఎన్నికల హామీని సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ శ్రేణులపై ఉందని స్పష్టం చేశారు. మహానందిలోని శాలివాహన అన్నసత్రం ప్రాంగణంలో ఆదివారం మహానంది మండల రైతులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వానికి కనికరం లేదని, రైతుల కంట కన్నీరు వస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో శ్రీశైలంలో 90 టీఎంసీలు ఉన్నా పంట పొలాలకు నీళ్లిచ్చామని, ప్రస్తుతం నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇవ్వకపోడం దారుణమన్నారు. వారం రోజుల్లో నీళ్లు విడుదల చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు కులమే మన కులమని, రైతుల కోసం ఎంతటి పోరాటానికై నా వెనుకాడనని అన్నారు. జగన్ మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే చంద్రబాబునాయుడు తెలంగాణ వాళ్లకు సమాచారం ఇచ్చి వారి ద్వారా నేషనల్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ వాళ్లు అన్యాయంగా ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నందుకే చంద్రబాబు అక్కడి నుంచి వచ్చారన్నారు. ఎమ్మెల్యే బుడ్డాకు రైతుల కష్టాలు పట్టవా? రైతుల కష్టాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడకపోవడం బాధాకరమని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మీ గ్రామాలకు వస్తే సాగునీటి విడుదలపై నిలదీయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టుల తరహాలో పోరాడాలని, త్వరలో ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్ల ద్వారా రైతులు, ప్రజలు సంఘటితమై చలో వెలుగోడు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అబద్ధ్దపు హామీలతో అధికారంలోకి.. అధికారం కోసం చంద్రబాబునాయుడు మాయమాటలతో పాటు అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని శిల్పా అన్నారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇలాంటి అనేక హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో బాబుకు ఓటుతో సమాధానం చెబుతారన్నారు. సమావేశంలో మహానంది మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మా మహేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా మధుసూదన్రెడ్డి, ప్రచార కార్యదర్శి ఏవీ కృష్ణారెడ్డి, రైతు విభాగం నాయకులు బాల వెంకటరెడ్డి, కందుల వెంకటసుబ్బారెడ్డి, సాగేశ్వరరెడ్డి, జయనారపురెడ్డి, రఘురామిరెడ్డి, గోపాల్రెడ్డి, అశోక్రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రతాప్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి శివయ్య పాల్గొన్నారు. కూటమి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు మహానందిలో మనం చేసిన పనులకే మళ్లీమళ్లీ ప్రారంభ పూజలు వారం రోజుల్లో రైతులకు నీళ్లు ఇవ్వకపోతే యుద్ధమే ఎమ్మెల్యే బుడ్డా అసెంబ్లీలో మాట్లాడకపోవడం బాధాకరం శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
టీడీపీ కార్యకర్తల వీరంగం
డోన్: రౌడీషీటర్లు, మట్కాబీటర్లను వెంట వేసుకొని టీడీపీ కార్యకర్తలు ఆదివారం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నూతన ఎంపీడీఓ భవనం వద్ద బీభత్సం సృష్టించారు. పట్టణానికి తలమానికంగా రూ.2 కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ భవనాన్ని నిర్మించింది. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించిన కొద్ది గంటలలోపే టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. పాతపేటకు చెందిన 4వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ సుధీష్తో పాటు కటిక రమణ(మట్కాబీటర్), గొల్ల రవి అనే పాత నేరస్తునితో పాటు కొందరు టీడీపీ కార్యకర్తలు పెద్ద బండరాళ్లతో గేటు తాళాన్ని బద్దలు కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకుండా సర్దిచెప్పి పంపించేశారు. కాగా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారని ఎంపీడీఓ వెంకటేశ్వరెడ్డి ఆదివారం రాత్రి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
డోన్ ఎంపీడీఓ నూతన భవనం ప్రారంభం
● జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిని అభినందించిన ఎంపీపీడోన్: నూతన డోన్ మండల ప్రజా పరిషత్ భవనాన్ని ఆదివారం జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించారు. ఈ భవనంలో ఆధునిక వసతులు కల్పించేందుకు రూ.50 లక్షల జిల్లా పరిషత్ నిధులను కేటాయించినందుకు జెడ్పీ చైర్మన్కు ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్కుమార్ కృతజ్ఞత తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఆర్ధిక శాఖమాత్యులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.1.5 కోట్లు వెచ్చించి అన్ని హంగులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. టీడీపీ నేతలతో గత రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ భవనాన్ని ఆదివారం జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులు, వైస్ ఎంపీపీ ఎర్రిస్వామిల సమక్షంలో ఎంపీపీ రాజశేఖర్రెడ్డి తన సీటులో ఆశీనులయ్యారు. ఎంపీటీసీ సభ్యులు సుధాకర్ యాదవ్, సుమిత్రమ్మ, రామలక్ష్మమ్మ, సునీత, జానకిరాముడు, రామలక్ష్మి, ఓబులేసు, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, పార్టీ నాయకులు సోమేష్యాదవ్, మల్లికార్జునరెడ్డి, చిరంజీవి, పోస్టు ప్రసాద్, వేమారెడ్డి, మద్దిలేటి, రాజ్కుమార్, రాజు, మల్యాల శ్రీనివాసరెడ్డి, ఆర్ఈ రాజవర్ధన్, జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు. -
భక్తులతో పోటెత్తిన ఉరుకుంద
కౌతాళం: శావ్రణమాస ఉత్సవాల్లో భాగంగా రెండో సోమవారం ఉరుకుంద ఈరన్నస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. క్షేత్రంలో రెండో, మూడో సోమవారం సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఈ ఏడాది శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలే ఉన్నాయి. రెండో సోమవారం స్వామిని దర్శించుకోవడానికి చాలా మంది ఆదివారమే వచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆధికారులు ప్రత్యేక, శీఘ్ర, అతిశీఘ్ర, ఉచిత, వీఐపీ దర్శన అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేశారు. రాత్రంతా దర్శనాలు ఉంటాయని, రాత్రి 12 గంటల అనంతరం పూజల కోసం అరగంట పాటు దర్శనాలు ఉండబోవని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. చాలా మంది భక్తులు ఆలయంలో ఆరుబయటే సేదతీరుతూ కనిపించారు. -
కూటమి నిర్లక్ష్యంతోనే కరువు
బండిఆత్మకూరు: కూటమి ప్రభుత్వం ఎల్నినో ప్రభావాన్ని బూచిగా చూపుతూ సాగునీరు విడుదల చేయకుండా కరువును తెచ్చిందని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. శ్రీశైల జలాశయం పూర్తి స్థాయిలో నిండినా రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్లకు నీటిని విడుదల చేయక పోవడం వెనుక ఆంతర్యమేమిటో అని ప్రశ్నించారు. శనివా రం ఆయన ఈర్నపాడు, లింగాపురం, పార్నపల్లి గ్రామాల్లో పర్యటించి సాగునీరు అందక ఎండుతున్న పంటలను పరిశీలించారు. నష్టపోతున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈర్న పాడు గ్రామ శివారులో బీటలు వారిన వరి పంటను పరిశీలించి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన పార్నపల్లి గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో రైతులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగంపై చూపుతున్న వివక్షను వివరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో శ్రీశైలం జలాశయం నిండినా తెలంగాణకు నీళ్లు.. రాయలసీమకు కన్నీళ్లే అన్నట్లుగా పరిస్థితి నెలకొందన్నారు. రైతులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్ట్లో దాదాపు 170 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎల్నినోతో ఏం సంబంధమని ప్రశ్నించారు. ఎల్నినో.. ఎల్నినో అని విపరీత ప్రచారం చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని విడుదల చేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో ప్రతిరోజూ నాలుగు టీఎంసీల నీటిని తరలిస్తుంటే కూటమి ప్రభుత్వ కళ్లు మూసుకుందని విమర్శించారు. మండలంలో దాదాపుగా 6 వేల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారని, రైతులు ఇప్పటికే ఎకరాకు రూ. 15 నుంచి 20 వేల వరకు పెట్టుబడి పెట్టి నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారన్నా రు. ప్రభుత్వం, అధికారులు స్పందించి సాగునీరు ఇవ్వకపోతే రైతులకు ఆత్మహత్యే శరణ్యమన్నారు. రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని, ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ఈనెలాఖరులో 500 ట్రాక్టర్ల్లతో రైతులను తరలించి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతు వ్యతిరేకిగా మిగిలిపోతారు.. రైతు కష్టాలను విస్మరిస్తున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చరిత్రలో రైతు వ్యతిరేకిగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో గొడవపడి తెలుగుగంగ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకుంటారేమో అని ఎదు రు చూస్తే నిరాశే మిగిల్చారన్నారు. శిల్పా వెంట ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట రామిరెడ్డి, రామ సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ రమణ, నాయకులు గోపాల్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, బూరుగయ్య, గోపిరెడ్డి వెంకట రెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి, విష్ణు, జగన్ మోహన్ రెడ్డి, శివ లింగం పాల్గొన్నారు. శ్రీశైలం డ్యామ్లో నీరున్నా ఎందుకు విడుదల చేయరు రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
తాగునీటికే ప్రాధాన్యత
కర్నూలు సిటీ: జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతానికి తాగునీటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుబాటులోని నీటిలో కనీసం ఆరుతడి పంటలకు ఏ మేరకు నీరిచ్చేందుకు సాధ్యమవుతుందో పరిశీలిస్తామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కర్నూలు జిల్లా సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్మెన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి, జల వనరుల శాఖ ఎస్ఈ శైలేశ్వర్, ఎల్ఎల్సీ ప్రాజెక్టు చైర్మన్ టిప్పు సుల్తాన్, డీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని.. 22 మండలాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. ముందస్తు అవగాహన కార్యక్రమాలతో ఈ ఏడాది జిల్లాలో పంటల సాగుతో గణనీయమైన మార్పు కనిపిస్తోందన్నారు. తుంగభద్ర దిగువ కాలువకు నీటి లభ్యత అంచనా ప్రకారం 11.955 టీఎంసీల నీటి వాటా వచ్చిందని, ఇందులో ఇప్పటికే 1.5 టీఎంసీల నీరు వినియోగించుకోగా, ఇంకా 10.455 టీఎంసీ కోటా ఉందన్నారు. ఇందులో 4.5 టీఎంసీలు తాగునీటికి, 6 టీఎంసీలు సాగునీటికి, ఇది కూడా సాగులోని ఆరుతడి పంటలకు అందించేందుకు ఇన్చార్జి మంత్రి, జిల్లా కలెక్టర్తో చర్చించి మూడు, నాలుగు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. సమావేశంలో ఆరు అంశాలపై తీర్మానం చేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. హంద్రీనీవా నీటి విషయంలో మొదటి నుంచి జిల్లాకు అన్యాయం జరుగుతోందన్నారు. లద్దగిరి సమీపంలోని స్లూయిస్ నుంచి 150 క్యూసెక్కుల నీరు హంద్రీనదిలోకి విడుదల చేయాలన్నారు. నదిలో నీరు లేక తీర గ్రామాల్లోని బోర్లు ఎండి పోయి తాగునీటికి కోడుమూరు, కల్లూరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గతేడాది 52 టీఎంసీలకుపైగా నీరిచ్చామని చెబుతున్నా ఉలిందకొండ చెరువుకు, తడకనపల్లె చెరువుకు నీళ్లు ఇవ్వలేదన్నారు. టీబీ డ్యాం గేట్ల మార్పుతో గతేడాది ఎల్ఎల్సీ ఆయకట్టుదారులు రబీ సాగు కోల్పోయారని.. ఈ ఏడాది ఎల్ఎల్సీ కా ల్వ నీటిపై ఆశతో సాగు చేసిన ఆరుతడి పంటలకైనా నీళ్లివ్వాలని ఎల్ఎల్సీ ప్రాజెక్టు చైర్మెన్ కోరారు. ఐఏబీకి గైర్హాజరైన మంత్రి, ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలు సాగునీటి సలహా మండలి అధికారిక సమావేశంలో టీడీపీకి చెందిన ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతిని స్టేజిపై కూర్చోబెట్టడం విమర్శలకు తావిస్తోంది. స్టేజీపై ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని ఓ వైపు చివరలో కూర్చోబెట్టి.. టీడీపీ మినహా ఏ అఽధికారిక హోదా లేని వైకుంఠం జ్యోతికి పెద్దపీట వేయడం చూస్తే అధికారులు ఏ స్థాయిలో అధికార పార్టీకి తలొగ్గి పని చేస్తున్నారో అర్థమవుతోంది. ఇకపోతే ఇంతటి కీలక సమావేశానికి జిల్లా మంత్రి టీజీ భరత్, ఎంపీ, కూటమి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చూస్తే జిల్లా రైతాంగంపై వారికున్న ప్రేమ ఏపాటిదో తెలుస్తోంది. తుంగభద్ర డ్యాంలోకి ఇప్పటి వరకు 100 టీఎంసీల నీరు రాగా.. ప్రస్తుతం 94.742 టీఎంసీల నీరు ఉంది. ఈ నీటిలో తాగునీటికి పోగా, మిగిలిన నీటితో ఖరీఫ్లో సాగు చేసిన చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిందే. హంద్రీనీవా కాలువ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన స్లూయిజ్ను పెంచాలి. హంద్రీనదిపై అనుకూలమైన చోట్ల చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మించేందుకు తీర్మానం చేయాలి. నీటి ఎద్దడి నెలకొన్న సమయంలో ఈ రిజర్వాయర్లను హంద్రీనీవా నీటితో నింపుకునేందుకు అవకాశం ఉంటుంది. తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టును చేపట్టేందుకు ఐఏబీలో తీర్మానం చేయాలి. – ఎర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆరుతడి పంటలకు సాగునీటి విడుదలపై పరిశీలన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ నూరల్ ఖమర్ -
రైతులను మోసం చేస్తే సహించేది లేదు
● 24న పోతిరెడ్డిపాడు సందర్శన ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి కల్లూరు: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగునీరు విడు దల చేయకుండా రైతులను మోసం చేస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడు తూ.. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేస్తే పాణ్యం, బనగానపల్లె మండలాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుందన్నారు. భూగర్భ జలాలు సైతం పెరుగుతాయన్నారు. కూటమి ప్రభుత్వం జీఎన్ఎస్ఎస్ ద్వారా అవుకు రిజర్వాయర్కు నీటిని తరలిస్తుండటంతో జిల్లా ప్రజలకు ఉపయోగం ఉండదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించకుండా తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. హంద్రీనీవా నీటితో జిల్లాలోని చెరువులను ముందుగా నింపాలని డిమాండ్ చేశారు. ఎస్సార్బీసీకి నీరు విడుదల చేయించాలి.. ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి వెంటనే గోరుకల్లు నుంచి ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయించాలని కాటసాని కోరారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి గాలేరు – నగరికి ఏ విధంగా నీటిని అందిస్తున్నారో అదే విధంగా ఎస్సార్బీసీకి కూడా నీటిని విడుదల చేస్తే తాగు, సాగు నీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజూ మోటార్ల ద్వారా తరలించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. జిల్లా మంత్రులు తక్షణమే స్పందించి సాగునీటి విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పరిస్థితిని తెలుసుకునేందుకు సోమవారం మాజీ మంత్రి శైలజానాథ్తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులంతా కలిసి వెళ్తున్నామన్నారు. -
వినాయక చవితి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
నంద్యాల(అర్బన్): వచ్చే నెలలో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ సునీల్షోరణ్, డీఆర్ఓ రాము నాయక్తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టరేట్ నుంచి 2,500 మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పర్యావరణహిత వినాయక చవితి నిర్వహణకు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పెద్ద విగ్రహాల నిమజ్జనానికి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని, ఈ మేరకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన ఊరేగింపుపై ప్రత్యేక దృష్టి సారించాల ని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, స్థానిక సమస్యల పరిష్కారం, రాబోయే పండుగలు, కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు కార్యాచరణ రూపొందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో కలిసి కాలుష్యరహిత వినాయక చవితి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వీబీఆర్లో 4.753 టీఎంసీలు వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)లో నీటి నిల్వ 4.753 టీఎంసీలకు చేరింది. శనివారం ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్ నీటిమట్టం 255.32 మీటర్లు (837.66 అడుగులు)గా నమోదైంది. ప్రస్తుతం టీజీపీ లింక్ కాలువ ద్వారా వీబీఆర్కు 2,000 క్యూసెక్కుల నీరు చేరుతోంది. క్యాచ్మెంట్ ప్రాంతం నుంచి ఎలాంటి ప్రవాహం లేదని అధికారులు తెలిపారు. రిజర్వాయర్ నుంచి సగటున 250 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో ఉండగా.. వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాల తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. 1ఎల్, 1ఆర్, టీజీపీ ప్రధాన కాలువలకు ప్రస్తుతం నీటి విడుదల లేదు. మల్యాల నుంచి కేసీకి నీటి పంపింగ్ నిలిపివేత జూపాడుబంగ్లా: మల్యాల ఎత్తిపోతల నుంచి కేసీ కాల్వకు సాగునీటి సరఫరా నిలిపివేశామని కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్యాల ఎత్తిపోతల పథకం ఓ పంపు ద్వారా 338 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం వారం రోజులపాటు కేసీకాల్వకు పంపింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వారం రోజుల్లో మల్యాల నుంచి కేసీ కాల్వకు 0.2 టీఎంసీల నీటిని పంపింగ్ చేసినట్లు తెలిపారు. ఈ నీటిని నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా సమ్మర్స్టోరేజీ ట్యాంకులను నింపినట్లు తెలిపారు. ఏసీబీ అధికారులమని లంచం అడిగితే ఫోన్ చేయండికర్నూలు: ఏసీబీ అధికారులమని బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే టోల్ఫ్రీ నెంబర్ 1064కి కానీ, 9440446178 సెల్ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ సీతారామ రావు తెలిపారు. శనివారం ఎ.క్యాంప్లోని ఏసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయన్నారు. కర్నూలు మున్సిపల్ కార్యాలయంలో ఏఈగా పనిచేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాడని, ఇదే తరహాలో అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించి రూ.2 లక్షలు వారి ఖాతాకు బదిలీ చేయించుకున్న ఘటనపై ఫిర్యాదు వచ్చిందన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాపారులు, ఉద్యోగులు ఇలాంటి బెదిరింపు కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డబ్బులు ఇవ్వకపోతే రైడ్ చేసి జైలుకు పంపుతామని బెదిరిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. విలేకరుల సమావేశంలో సీఐలు కృష్ణయ్య, రాజప్రభాకర్, శ్రీనివాసులు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీ అయ్యే కేసులను గుర్తించాలి
నంద్యాల (వ్యవసాయం): వివిధ పోలీస్ స్టేషన్లలో రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగానే గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలని మూడవ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ అమ్మనరాజ, ఏఎస్పీ సుస్మిత పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం కోర్టు ఆవరణలో మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీసుస్టేషన్లలో కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, చిన్నపాటి వివాదాలకు సంబంధించిన కేసు లు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించి రాజీ అయ్యేలా కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. రాజీ పూర్తిగా స్వచ్ఛందంగా, చట్టబద్ధంగా ఉండేలా చూడాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు అన్నారు. మెగా లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం కావడం మాత్రమే లక్ష్యం కాదని, ప్రతి కేసు ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన న్యాయం జరగడం ప్రధానమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలతో పాటు, లోక్అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. -
మంత్రి నియోజకవర్గంలో ‘ఆట’గాళ్లు!
మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బనగానపల్లె నియోజకవర్గంలోని సంజామల, కొలిమిగుండ్ల మండలాలు పేకాట స్థావరాలుగా వెలుగొందుతున్నాయి. 2024లో సంజామల మండలంలో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో 80 మందిని అరెస్ట్ చేసి రూ.83,520 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2025లో 10 కేసులు నమోదు చేసి 61 మందిని అరెస్ట్ చేసి రూ.63,410 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026లో రెండు కేసులకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేసి రూ.15,550 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొలిమిగుండ్ల మండలంలో రెండేళ్లలో 11 కేసులు నమోదయ్యాయి. కనకాద్రిపల్లి, కల్వటాలలో టీడీపీ నేతలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు.● ఆదోని ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుకు చెందిన జిన్నింగ్మిల్లు ప్రాంతంలో పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆలూరు, ఆదోని నియోజకవర్గాల పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో గ్రామగ్రామాన పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. పేకాట నిర్వాహకులు టీడీపీ నేతలతోపాటు పోలీసులకు వారం వారం మూమూళ్లు ముట్టజెబుతున్నట్లు సమాచారం.● మార్చి 15వ తేదీన ఆస్పరి మండలం చిన్నహోతూరు సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై కర్నూలు స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించి రూ.5.30 లక్షల నగదు, 17 సెల్ఫోన్లు, 8 బైక్లు స్వాధీనం చేసుకొని 18 మందిపై కేసు నమోదు చేశారు. ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 16 మందిపై కూడా స్పెషల్ పార్టీ పోలీసులు కేసులు నమోదు చేశారు.ఉమ్మడి జిల్లాలో నమోదైన కేసులు కొన్ని.. కోసిగిలో 2025 సంవత్సరంలో 12 పేకాట కేసుల్లో 48 మందిని అరెస్టు చేసి రూ.62,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు ఆరు పేకాట కేసులు నమోదు చేసి 18 మంది అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.24,800 స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం మండలం మాధవరం పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో 19 మందిపై కేసులు నమోదు చేసి రూ.14,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026లో రెండు కేసుల్లో 32 మందిని అరెస్టు రూ.1,73,950 స్వాధీనం చేసుకొని ఆరు బైక్లను సీజ్ చేశారు. 2026లో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు రూ.26,700 స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో మందిని అరెస్టు చేసి రూ.28,860 నగదును స్వాఽధీనం చేసుకోగా.. 2026లో మరో 8 మందిపై కేసులు నమోదు చేసి రూ.20 వేలను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణగిరి మండలంలో 2025 సంవత్సరంలో మూడు కేసుల్లో 18 మందిని అరెస్టు చేసి రూ.34,630 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో 16 కేసుల్లో 87 మందిపై కేసు నమోదు చేసి రూ.1,93,935 నగదును స్వాధీనం చేసుకున్నారు. 2026లో ఏడుగురిపై కేసు నమోదు చేసి రూ.17,230 స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా పేకాట స్థావరాలు కర్నూలు నగరంలోని అద్దె భవనాల్లో నిర్వహణ చర్చనీయాంశంగా ఓ మొబైల్ వాహనం అడ్డాగా మారిన మంత్రి బీసీ నియోజకవర్గం ఆటగాళ్లకు ఆహ్వానం పలుకుతున్న కుందూతీరం ప్రత్యేక వాహనాల్లో కర్ణాటకలోని రాయచూరుకు.. పచ్చ నేతల అండతో మితిమీరిన జూదం -
ఉరుకుంద హుండీ ఆదాయం రూ.96 లక్షలు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాసం రెండవ గురువారం భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.96,53,938 వచ్చినట్లు ఆలయ డప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. అలాగే వెండి 13 కేజీల 450 గ్రాములు, బంగారం 6 గ్రాముల 300 మిల్లీగ్రాములు వచ్చినట్లు చెప్పారు. లోన్స్ పేరుతో సైబర్ మోసాలు ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): లోన్లు మంజూరు చేస్తామని నమ్మించి డబ్బులు కాజేస్తున్న సైబర నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే సందేశాలను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. మరిన్ని డబ్బులు చెల్లించాలని కోరడం, లేదంటే ఫోన్ స్విచ్చాఫ్ చేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే లోన్ ఆఫర్లు నమ్మవద్దన్నారు. ఓటీపీ, ఏటీఎం పీన్, సీవీవీ, బ్యాంకు వివరాలు ఎవరకీ చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్కు కాల్ చేయాలన్నారు. శ్రీశైలంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు గురువారం నుంచి శుక్రవారం వరకు విద్యుత్ ఉత్పాదన తాత్కాలికంగా నిలిపివేశారు. ఎడమగట్టు కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. ఎడమగట్టు కేంద్రంలో 20.159 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం నాగార్జున సాగర్కు 40,751 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 8వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి శ్రీశైలానికి 34,803 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 167.8764 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 875.90 అడుగులకు చేరుకుంది. బేతంచెర్లలో బాలుడిపై కుక్కల దాడి బేతంచెర్ల: కుక్కలు దాడిచేయడంతో బేతంచెర్లలోని హనుమాన్నగర్కు చెందిన ఆరేళ్ల బాలుడు సయ్యద్ మహీర్ తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాలకు శుక్రవారం సెలవు కావడంతో ఇంటి సమీపాన ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. బాలుడి ఏడుపు వినిపించడంతో కుటుంబ సభ్యులు, కాలనీవాసులు అప్రమత్తమై కేకలు వేశారు. దీంతో కుక్కలు పారిపోయాయి. శరీర భాగాలతో పాటు చేతి సంకలో తీవ్రంగా గాయపడిన బాలుడిని శేషారెడ్డి సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు 108లో కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత ఏడాది మే 2వ తేదీన ఇదే కాలనీలో నాలుగేళ్ల బాలుడు షేక్ మొహిద్దీన్ కుక్కల దాడిలో మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ వీధి కుక్కలు దాడి చేయడంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని..
ఆస్పరి: ఆస్పరి సమీపంలోని రామతీర్థం క్షేత్రానికి వెళ్లే మలుపు దగ్గర శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆస్పరి సీఐ శ్రీనివాస్నాయక్ తెలిపిన వివరాల మేరకు.. రామతీర్థం క్షేత్రంలో వెలసిన గాయత్రీ మాత ఆలయంలో శుక్రవారం నిర్వహించే వరలక్ష్మి వ్రతం పూజకు పత్తికొండ మండలం దేవనబండ గ్రామానికి చెందిన దామోదరమ్మ (75) వచ్చింది. పూజ ముగిసిన తరువాత స్వగ్రామానికి వెళ్లేందుకు మలుపు దగ్గర రోడ్డు దాటుతుండగా ఆదోని నుంచి ఆస్పరి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడిన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
నిర్లక్ష్యం ‘పెచ్చు’ మీరి.. పైకప్పు భయపెట్టి!
శ్రద్ధగా చదువుకోవాల్సిన విద్యార్థులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మంత్రాలయం మండల కేంద్రం రాఘవేంద్రాపురంలోని ఎంపీపీ పాఠశాలలో 171 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో 6 గదులు ఉండగా 5 గదులను వినియోగిస్తున్నారు. వరండాలో పైపెచ్చులు ఊడిపడుతున్నాయి. అక్కడే భయం గుప్పిట్లో విద్యార్థులు భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. అధికారులు వెంటనే వరండా మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. – మంత్రాలయం రూరల్ -
విద్యుత్ తీగల దొంగ అరెస్ట్
సి.బెళగల్: పొలాల్లో వ్యవసాయ విద్యుత్ బోరు మోటార్లు, తీగలను అపహరిస్తున్న దొంగను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో దొంగను అరెస్ చూపుతూ, కేసు వివరాలను వెల్లడించారు. సి.బెళగల్, గూడూరు మండలాల్లో రైతుల వ్యవసాయ విద్యుత్ బోరు మోటర్లు, తీగలు చోరీకి గురైనట్లు పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు చేపట్టగా.. గుండ్రేవుల గ్రామానికి చెందిన పాలాక్షి రెడ్డి నిందితుడిగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం సి.బెళగల్ మోడల్ స్కూల్ దగ్గర అరెస్ట్ చేసి, రిమాండ్ పంపారు. నిందితుడి నుంచి దాదాపు రూ.1.30 లక్షల విలువ చేసే 600 మీటర్ల కాపర్ వైరు, మూడు విద్యుత్ మోటార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్కానిస్టేబుళ్లు ప్రసాద్, తిమ్మప్ప, క్రిష్ణగౌడ్, కానిస్టేబుళ్లు సత్యరాజు, శ్రీని వాసులు, సుధాకర్, జానకిరాముడును ఎస్ఐ అభినందించారు. గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ ● 82 గొర్రెలు మృత్యువాత తుగ్గలి: గొర్రెల మందపై లారీ దూసుకెళ్లిన ఘటనలో 82 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన గిరిగెట్ల సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..గిరిగెట్ల గ్రామానికి చెందిన గొర్ల పక్కీరప్ప గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం పక్కీరప్ప కుమారులు గొర్రెలు మేపుకుంటూ సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక డాబా వద్ద ఆదోని నుంచి గుత్తికి పశువులు తీసుకెళుతున్న ఆల్విన్ లారీ బ్రేక్ ఫెయిల్ అయి ప్రమాదవ శాత్తూ గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మొత్తం 166 గొర్రెల్లో 82 మృత్యువాత పడగా..మరో 25కు పైగా తీవ్రంగా గాయపడ్డాయి. వాటి విలువ సుమారు రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధిత కాపరి వాపోయాడు. ప్రమాదస్థలాన్ని తుగ్గలి, జొన్నగిరి ఎస్ఐలు నరేష్, మల్లికార్జున పరిశీలించారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తుగ్గలి ఎస్ఐ తెలిపారు. వాల్మీకి నగర్లో పోలీసుల సోదాలు ఆదోని: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలోని వాల్మీకి నగర్ ప్రాంతంలో డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆదోని వన్ టౌన్ సీఐ వెంకటరమణ, టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డితో పాటు టూ టౌన్, త్రీ టౌన్, తాలూకా పోలీసు స్టేషన్ల ఎస్ఐలు, 25 మంది పోలీసులు వాల్మీకి నగర్ ప్రాంతాన్ని చుట్టుముట్టి ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ఆ ప్రాంతంలోని రౌడీషీటర్లు, అనుమానిత జాబితాలో ఉన్న వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో శేఖర్ అనే వ్యక్తి ఇంట్లో 10 లీటర్ల నాటు సారా లభించడంతో పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. శేఖర్పై ఆదోని వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే విధంగా వాల్మీకి నగర్ ప్రాంతంలో సుమారు 25 మోటార్ సైకిళ్లకు తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేని వాటిపై జరిమానాలు విధించారు. కురువళ్లి చెరువు నిండేదెన్నడూ! ఆలూరు రూరల్: ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువులు ఒట్టిపోయాయి. నిండుకుండల్లా ఉండాల్సిన చెరువులు నేడు చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తున్నాయి. ఆలూరు మండలంలోని కురువళ్లి గ్రామ చెరువు 116 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద 3 వందల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. ఈ చెరువు కింద రైతులు వరి, పత్తి తదితరులు పంటలు సాగు చేసేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులో చుక్కనీరు చేరలేదు. దీంతో బోర్ల ఎండిపోయాయని, చెరువు కింద పంట సాగు చేయకుండా పొలాలను బీడుగా వదిలేశామని రైతులు వాపోతున్నారు. -
దిగువ కాల్వకు నీరివ్వాల్సిందే
ఎమ్మిగనూరుటౌన్: తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ)కు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారంతో పాటు తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టులో ఖరీఫ్ సీజన్కు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ఎల్లెల్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పార్టీ నియోజవర్గ పరిశీలకుడు తెర్నెకల్ సురేందర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బీఆర్ బసిరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణం నుంచి ఎల్లెల్సీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వరినారుతో బైఠాయించి సాగునీరు విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఈ మణికంఠకు అందజేశారు. ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. గత రబీ సీజన్లో తుంగభద్ర గేట్ల మరమ్మతుల పేరుతో నీరివ్వకుండా అడ్డుకోవడంతో పంటలను కోల్పోయామన్నారు. ప్రస్తుతం టీబీ డ్యామ్లో నీరున్నా ఆయకట్టుకు నీరివ్వలేమని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. చాలా మంది రైతులు నారుమళ్లు పోసి నీటి విడుదల కోసం నిరీక్షిస్తున్నారన్నారు. రైతులను విస్మరిస్తే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయకట్టు ఎండుతున్నా పట్టించుకోరా? రైతులను విస్మరిస్తే ఆందోళనలు ఉద్ధృతం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి రైతులతో కలసి ఎల్లెల్సీ కార్యాలయం ముట్టడి డ్యామ్లో నీరున్నా ఎందుకు ఇవ్వడం లేదు.. తుంగభద్ర డ్యామ్లో నీటి కోటా ఉన్నా ఖరీఫ్ సాగుకు ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు తెర్నెకల్ సురేందర్రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ఎల్లెల్సీ రైతుల బాధలు పట్టవా అని ధ్వజమెత్తారు. సాగునీటి విడుదల కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు నిఘా పెట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎంపీపీ కేశన్న, సోగనూరు భీమిరెడ్డి, రియాజ్ అహమ్మద్, బుట్టారంగయ్య, వెంకటేశ్వర్రెడ్డి, తిరుమల్రెడ్డి, మల్లికార్జున రెడ్డి, వెంకట్రామిరెడ్డి, మన్సూర్, మాచాని వెంకటేష్, కోటేకల్ లక్ష్మన్న, రంగస్వామి, సునీల్ కుమార్, సావిత్రమ్మ, భాస్కర్, రాముడు నియోజకవర్గంలోని రైతులు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులుశ్రీశైలం టెంపుల్: వరలక్ష్మీవ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీశైలంలోని చంద్రావతి కల్యాణమండపంలో ఉచిత సామూహికవ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతంలో 1800 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. వీరికి కావలసిన పూజా ద్రవ్యాలన్నింటినీ దేవస్థానమే సమకూర్చింది. ప్రతి ఒక్కరికి వేర్వేరుగా కలశాలను నెలకొల్పారు. తొలుత మహాగణపతి పూజ నిర్వహించారు. తరువాత వేదికపై ఆశీనులను చేయించిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపించారు. అనంతరం భక్తులందరిచేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవిని సమంత్రకంగా ఆవాహన చేశారు. శ్రీసూక్త విధానంలో వ్రతకల్ప పూర్వకంగా షోడశోపచారపూజలు జరిపించారు. అనంతరం అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమావిశేషాలను భక్తులకు తెలిపారు. చివరగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు. వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ, చీర, రవికవస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, వక్షప్రసాదంగా తులసి మొక్క, పుస్తక ప్రసాదంగా శ్రీశైలప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు అందజేశారు. వ్రతానంతరం భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు. దర్శనానంతరం అన్నపూర్ణ భవనంలో భక్తులందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. చంద్రావతి కల్యాణమండపంలో ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీనును కూడా ఏర్పాటు చేశారు. కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘నేతకు పుణ్యం.. వ్యాపారికి ఫలం!’పై ఇంటెలిజెన్స్ ఆరా
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో టీడీపీ ముఖ్య నేత అనుచరుడి దందాపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘నేతకు పుణ్యం.. వ్యాపారికి ఫలం!’ కథనంపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీసింది. టీడీపీ ముఖ్య నేత అనుచరుడి పేరు, పార్టీలో తనకు ఉన్న పదవి, ముఖ్య నేత అప్పగించిన బాధ్యతలు ఏంటి.. అని ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆయన దేవస్థానంలో అధికారులను బెదిరించి తన కార్యకర్తలకు ఇప్పించిన ఉద్యోగాలు, ఏజెన్సీలు, ఇంజినీరింగ్ టెండర్లు, తలనీలాలు టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై తన కార్యకర్తలతో చేయించిన దాడి గురించిన పలు విషయాలను ఇంటలిజెనన్స్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తలనీలాల కాంట్రాక్టర్లను రింగ్ చేసి కమిషన్ దండుకున్న విషయాలను సైతం రహస్యంగా విచారణ చేసినట్లు సమాచారం. టీడీపీ ముఖ్య నేత అనుచరుడు దేవస్థానంలో చేస్తున్న దందాపై ఇంటెలిజెన్స్ అధికారులు ఒక నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులతో పాటు పార్టీ అధిష్టానానికి సైతం పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
నీ ఇల్లు బంగారం కానూ..
పిట్ట కొంచెం.. కూత ఘనం. కూతనే కాదు.. దాని నైపుణ్యం ముందు ఇంజినీర్లు సైతం చిన్నబోవాల్సిందే. గిజిగాడు తన గూడు పని తనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గడ్డి పరకలు, పుల్లలు సేకరించి, ఒక్కొక్క పోచతో ఎంతో శ్రద్ధగా అళ్లే గూళ్లు గొప్ప ఆర్కిటెక్చర్లనే మించిపోతాయి. అలాంటి ఒక్క గూడును చూస్తేనే ఆహా అని మురిసిపోతుంటాం. అలాంటివి పదుల సంఖ్యలో ఒకే చోట కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి. క్రిష్టిపాడు సమీపంలో కుందూనది ఒడ్డున చెట్లకు గూళ్లు ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తికి సిద్ధం అవుతున్నాయి. – దొర్నిపాడు -
తెలంగాణ సీఎంతో చంద్రబాబు చీకటి ఒప్పందం!
నంద్యాల: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న చీకటి ఒప్పందం చేసుకున్నారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీరును తెలంగాణ రాష్ట్రానికి మళ్లిస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. నంద్యాల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిల్పా రవి మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతాంగం తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే, సాగునీటి కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని రిజర్వాయర్లు, కాల్వలకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. వెలుగోడు రిజర్వాయర్ సామర్థ్యం 17 టీఎంసీలు కాగా ఇప్పటికి 4 టీఎంసీలు మాత్రమే నీరు ఉన్నాయన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ 12.5 టీఎంసీల సామర్థ్యం కాగా 6 టీఎంసీల నీరే ఉందన్నారు. అవుకు రిజర్వాయర్ 4.5 టీఎంసీల సామర్థ్యం కాగా ఒక టీఎంసీ మాత్రమే ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు వస్తుందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను జైళ్లకు పంపారు! ఎరువులు, పురుగుమందుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. యూరియా కోసం ఆన్న్లైన్ అప్లికేషన్లు పెట్టించడం, పంపిణీలో రాజకీయ రంగులు పులమడం సిగ్గుచేటన్నారు. మద్దతు ధర అడిగిన రైతులపై కేసులు పెట్టి జైళ్లకు పంపిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్మన్, కౌన్సిలర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు వంటి అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు రంగంలో ఉంటారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఏ స్థానం ఏకగ్రీవం కానివ్వమని, ప్రతి స్థానానికి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో నంది రైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, మాజీ మార్కె ట్ యార్డు చైర్మన్ పురుషోత్త్తం రెడ్డి, వైఎస్సార్సీపీ డోన్ నియోజకవర్గం పరిశీలకుడు దేశం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ సెక్రటరీ శంకర్ నాయక్, కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. సాగు, తాగునీరు విడుదల చేయకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తాం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి రాయలసీమకు తీవ్ర ద్రోహం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమను కరువు నుంచి మహానేత కాపాడారని గుర్తుచేశారు. కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి ఈ ప్రాంతానికి తీవ్రద్రోహం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీటిని తోడుకుంటున్నా, ఏపీ ప్రభుత్వంవాటా నీటిని సరిగ్గా వినియోగించుకోలేకపోతోందన్నారు. నంద్యాల మండల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో పంటలు సాగు కావలసి ఉందని, వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణ తాగునీటి అవసరాలు, మిట్నాల చెరువు నీటి ఎద్దడి తీర్చేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలన్నారు. తక్షణమే కాలువలకు నీటిని విడుదల చేయకపోతే, రైతులను సమీకరించి స్వయంగా వెళ్లి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు. -
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం
ఆశలు ఎండిపోయి..వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలను చివరకు జీవాలకు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలో ఈ ఏడాది 38 వేల హెక్టార్లలో పత్తి, కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. 20 వేల హెక్టార్లలో అత్యధికంగా పత్తి సాగు చేశారు. ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి పెట్టి రైతులు పత్తి పంట సాగు చేశారు. ఎకరాకు రూ. 10 వేలు ఖర్చు చేసి కంది పంట సాగు చేశారు. రైతులు సాగు చేసిన పంటలపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపింది. రెండు నెలలుగా వర్షాలు రాకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. – ఆలూరు రూరల్కురుకుంద గ్రామంలో పత్తిపంటను గొర్రెలను వదిలేసిన దృశ్యం బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం చౌడేశ్వరిదేవికి కుంకుమార్చన అభిషేకం తదితర పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి అభిషేకం, మహిళలతో సామూహిక కుంకుమార్చన పూజలు చేపట్టారు. పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పాలక మండలి చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. శ్రీమఠంలో.. మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక పీఠం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పవిత్ర వరలక్ష్మీ పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో పూజలు చేపట్టారు. పూజా మందిరంలో లక్ష్మి పూజ, మూల, జయ, దిగ్విజయ రాముల పూజ నిర్వహించారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ పూజలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే గ్రామ దేవత మంచాలమ్మకు విశేషాలంకరణ చేపట్టి ప్రత్యేక పూజలు కానిచ్చారు. -
వేగంగా మారెమ్మ ఆలయ నిర్మాణం
● పుట్లూరులో రూ. 5 కోట్లతో కోవెల నిర్మాణంకృష్ణగిరి: రాజుల కాలంలో నిర్మించిన దేవాలయాల్లో శిల్పాలు మహా అద్భుతంగా కనిపిస్తాయి. వాటిని పోలిన విధంగా మండలంలోని పుట్లూరు గ్రామంలో మారెమ్మ అమ్మవారికి నూతన దేవాలయాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు పూనుకున్నారు. రెండేళ్లుగా దాదాపు రూ.5 కోట్లతో ఆలయాన్ని అతి సుందరంగా నిర్మిస్తున్నారు. అమ్మవారికి వచ్చిన కానుకలతోపాటు, గ్రామస్తుల చందాలు, దాతల సహాయంతో వేగంగా పనులు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా భాద్రపద శుక్ల చతుర్ధశి మొదలు బహుళ చవితి వరకూ అమ్మవారికి బ్రహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలను తిలకించేందుకు రాయలసీమ జిల్లాతోపాటు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. దేవాలయాన్ని మరో 6 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తిరుపతి నుంచి రాయిని తీసుకొచ్చి అక్కడే శిల్పులు సుందరంగా చెక్కి నిర్మిస్తున్నారని చెప్పారు. -
ఏపీఆర్ఎస్ఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. వి.గిరికుమార్రెడ్డి ప్యానల్ మాత్రమే పోటీకి దిగడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్ష, కార్యదర్శులుగా వి.గిరికుమార్రెడ్డి, ఎం.వెంకటరాజులు ఎంపికయ్యారు. శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ అసోసియేషన్ భవన్లో ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు దివాకరరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా ట్రెజరర్ పునీత్, అబ్జర్వర్గా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమశేఖర్ వ్యవహరించారు. వి.గిరికుమార్రెడ్డి ప్యానల్ అన్ని స్థానాలకు పోటీకి దిగింది. అయితే జిల్లా పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి మాత్రమే జిల్లా అధ్యక్ష స్ధానానికి పోటీ చేశారు. ఆయన తిరిగి తన నామినేషన్ను వెనక్కి తీసుకోవడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
ఉద్యోగంలో చేరకుండానే..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పాణ్యం: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై తమ్మరాజుపల్లె సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, సుమతి దంపతులకు ముగ్గురు కుమారు లు. చివరి కుమారుడు ఎం. అశ్విత్(26) ఉద్యోగం కోసం హైదరాబాద్లో ఉండగా, రెండో కుమారుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ కాకినాడకు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో అశ్విత్కు ఉద్యోగం వచ్చింది. ఆ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకునేందుకు అన్న బైక్ తీసుకుని గురువారం రాత్రి సొంతూరుకు బయలుదేరాడు. మార్గమధ్య లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నంద్యాల జిల్లా తమ్మరాజుపల్లె గ్రామం వద్ద రాజస్థాన్ డాబా వద్ద ప్రమాదవశాత్తు హైవే రైలింగ్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించగా కోలుకోలేక అశ్విత్ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, కేసు నమోదు చేశామన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూసిన యువకుడు తీరా ఉద్యోగంలో చేరే సమయంలో మృతి చెందడం విషాదం. -
ఓర్వకల్లులో ఫైర్ స్టేషన్ స్థల పరిశీలన
కర్నూలు: ఓర్వకల్లులో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఆ శాఖ డీజీ వెంకట రమణ పరిశీలించారు. శుక్రవారం విజయవాడ నుంచి ఆయన కర్నూలు చేరుకోని జిల్లా అధికారులతో కలిసి ఓర్వకల్లు తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ఉన్న 60 సెంట్ల స్థలాన్ని పరిశీలించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఫైర్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రాంతం ఇండిస్ట్రియల్ హబ్గా మారుతున్నందున అందుబాటులో ఫైర్ స్టేషన్ ఉండేందుకు వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని డీజీ వెంకట రమణ జిల్లా అధికారులకు సూచించారు. ఆయన వెంట రీజినల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ బాలరాజు, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ బజారి, నంద్యాల జిల్లా ఫైర్ ఆఫీసర్ శంకర్ ప్రసాద్, తదితరులు ఉన్నారు. విధుల నుంచి సీఎస్ఓ తొలగింపు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాసరావును విధుల నుంచి తొలగిస్తూ శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం సీఐ, దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధ్య ఫోన్ సంభాషణ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ సంభాషణ వివాదంపై ఈఓ అంతర్గత విచారణ చేయించారు. దేవస్థాన నిబంధనలు అతిక్రమించి ఫోన్ ఆడియో లీక్ చేసి దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగించారనే కారణంతో సీఎస్ఓ బి. శ్రీనివాసరావుపై దేవస్థాన ఈఓ వేటు వేశారు. ఇంచార్జీ సీఎస్ఓగా పర్యవేక్షకులు మల్లికార్జునకు బాధ్యతలు అప్పగించారు. పెట్టుబడి మట్టిపాలు నందికొట్కూరు: ఎల్నినో దెబ్బకు తొమ్మిది ఎకరాల మినుము పంటను రైతు ఆండ్రడ్డి వెంకటరెడ్డి శుక్రవారం దున్నేశారు. జూలై నెల మొదటి వారంలో మినుము పంటను రైతు సాగు చేశారు. మూడు ఎకరాలు సొంత భూమి, ఆరు ఎకరాలు భూమిని రూ. 20 వేల చొప్పున కౌలుకు తీసుకొని రైతు సా గు చేశారు. ఒక ఎకరాకు రూ. 26 వేలు ఖర్చు వచ్చిందని, తొమ్మిది ఎకరాలకు వెచ్చించిన పెట్టుబడి రూ.2.34 లక్షలు మట్టిపాలు అయ్యిందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. -
వారానికే ఒట్టిపాయె!
నీరు లేక ఒట్టిపోయిన హంద్రీ నదిగోరంట్ల గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇటీవల ఇరిగేషన్ అధికారులు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 4 రోజుల పాటు హంద్రీనదికి నీటిని విడుదల చేశారు. అయితే హంద్రీనదికి నీటిని వదిలి వారం రోజులు కూడా గడవకముందే నీటి విడుదల నిలిపేశారు. దీంతో గ్రామంలో మంచినీటి సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. నీటి సమస్య పరిష్కరించాలంటూ రెండు నెలల పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే హంద్రీనదికి తూతూ మంత్రంగా నాలుగు రోజులు వదిలి బంద్ చేయడం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని రోజులు హంద్రీనదికి నీటి విడుదల కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. – కోడుమూరు రూరల్ -
ఈవీఎం గోడౌన్కు పటిష్ట భద్రత కల్పించాలి
నంద్యాల: ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24/7 నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు నెల తనిఖీల్లో భాగంగా నంద్యాల మార్కెట్ యార్డ్ టెక్ గోడౌన్లో గురువారం కలెక్టర్ రాజకుమారి భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, సీలింగ్, ఫైర్ సేఫ్టీ తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్లో సంతకం చేశారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథన్, ఎలక్షన్ డీటీ మనోహర్, నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కేసులు లేని గ్రామంగా సత్యనారాయణాపురం
గోస్పాడు: ఎటువంటి కేసులు లేని గ్రామంగా సత్యనారాయణాపురాన్ని గుర్తించినట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం సత్యనారాయణాపురంలో సద్భావన దివస్ ప్రాధాన్యత, మధ్యవర్తిత్వం 3.0 జాతీయ లోక్ అదాలత్పై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ప్రజలకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, వివాదాల నివారణ, వివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం, పరస్పర చర్చలు, రాజీ ద్వారా పరిష్కరించుకోవడం, అవసరమైనప్పుడు న్యాయ సేవలు పొందడం వంటి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామాన్ని కేసులు లేని గ్రామంగా కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా వివాదాలకు దూరంగా, శాంతియుతంగా ఉండేలా గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు. అనంతరం గ్రామ ప్రజలచే సద్భావ ప్రతిజ్ఞను కుల, మత, ప్రాంతీయ వ్యత్యాసాలను పక్కనబెట్టి హింసాత్మక మార్గాలను నిరాకరిస్తూ రాజ్యాంగ బద్ధమైన చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మిత, సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ సుధాకర్రెడ్డి, షహనా, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చీకటి ఒప్పందంతోనే నీటి కష్టాలు
● కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి ● శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి ● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎంతో చేసుకున్న చీకటి ఒప్పందం వల్లే రాయలసీమకు నీటి కష్టాలు ఎదురవుతున్నాయని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. గురువారం శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల రైతులతో కలిసి నంద్యాల పట్టణం పద్మావతినగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శిల్పా సమీక్ష నిర్వహించారు. తాగు, సాగునీరు అందించేందుకు చేపట్టిన కార్యాచరణ ప్రణాళికపై రైతుల సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్ట్లో 857 అడుగుల మేర నీటి నిల్వలు ఉండి, 110 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండుగా ఉన్నప్పటికీ దిగువకు నీరు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి, పశువుల తాగునీటి అవసరాలు తీర్చడానికై నా ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ఎడమ గట్టు నుంచి రోజుకు 4 టీఎంసీల నీటిని తరలిస్తున్నా ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, శ్రీశైలం బ్యాక్ వాటర్ను దిగువ రిజర్వాయర్లకు వెంటనే నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు నీటి సమస్య పొంచి ఉందని, ఈ పరిస్థితిలోనైనా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై వెంటనే దృష్టి సారించాలన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కృషి వల్లే సాధ్యమైందన్నారు. తండ్రి బాటలోనే నడిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతికి ఎంతో కృషి చేశారన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తక్షణమే తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, భాస్కరరెడ్డి, సుజాతమ్మ, మహేశ్వరరెడ్డి, వెంకటరామిరెడ్డి, వెంకటరమణ, సంజీవరెడ్డి, రఘురామిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం రైతు నాయకులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎస్సార్బీసీకి నీటిని విడుదల చేయాలి
బనగానపల్లె రూరల్: అవుకు రిజర్వాయర్కు జీఎన్ఎస్ఎస్ ద్వారా కాకుండా ఎస్సార్బీసీ ద్వారా నీటిని విడుదల చేయాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్వగృహంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో కాటసాని మాట్లాడుతూ.. గోరుకల్లు నుంచి ఎస్సార్బీసీ కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్కు నీటి విడుదల చేస్తే చిన్నచిన్న చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉంటాయన్నారు. అలాగే పాణ్యం, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. జీఎన్ఎస్ఎస్ వరద కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్ను నీటితో నింపడంతో ఈ ప్రాంత రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. అవుకు రిజర్వాయర్ను నింపి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు విక్రయించేందుకే అని విమర్శించారు. హంద్రీనీవా, మల్యాల కాల్వలకు నీరు విడుదల చేస్తున్న అధికారులు ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు అడ్డుకోవడం దారుణమన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ 35,315 క్యూసెక్కులు, ఏపీ 18,792 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారే కానీ.. రైతులకు సాగునీరు అందించలేకపోతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు స్పందించరు? ఎస్సార్బీసీకి నీటి విడుదలపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు మాట్లాడడం లేద ని మాజీ ఎమ్మెల్యే కాటసాని ప్రశ్నించారు. ఈ ప్రాంత రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నా వారి లో చలనం కలగడం లేదన్నారు. రెండేళ్లుగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారన్నారు. ఒక్కొక్క ఎరువు బస్తాపై సుమారు రూ.1,500 వరకు ధర పెంచడం రైతులపై భారం మోపడమేనన్నారు. ధరలను నియంత్రించి, రైతులకు కావాల్సిన ఎరువులను యాప్ ద్వారా కాకుండా పాత విధానంలోనే పంపిణీ చేయాలని కాటసాని కోరారు. రైతుల పక్షాన పోరాటం.. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ ద్వారా నీరు విడుదల చేయకుంటే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. గోరుకల్లు, అవుకు రిజర్వాయర్ల నీటిని రైతుల అవసరాలకు మాత్రమే వినియోగించాలన్నారు. సిమెంట్ పరిశ్రమలకు విక్రయించి లబ్ధిపొందాలనుకోవడం మంచిదికాదన్నారు. ఈ నీటిని దుర్వినియోగం చేస్తే రైతులతో కలిసి అవుకు రిజర్వాయర్ ముట్టడి కార్యక్రమం కూడా చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో అవుకు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్రెడ్డి, గడ్డం బాషా తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలకు మళ్లించేందుకే జీఎన్ఎస్ఎస్ ద్వారా తరలింపు ప్రభుత్వం స్పందించకపోతే అవుకు ప్రాజెక్టును ముట్టడిస్తాం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి -
శ్రీశైలంలో నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతం
శ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీశైల దేవస్థానం శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో 1,500 మంది ముత్తైదువులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మూడవ శుక్రవారం ప్రత్యేకంగా శివసేవకులకు, నాల్గవ శుక్రవారం 750 మంది చెంచు ముత్తైదువులకు, 750 మంది సాధారణ ముత్తైదువులకు సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. వ్రతాన్ని జరిపించుకునే ముత్తైదువులకు అమ్మ వారి శేషవస్త్రంగా చీర, రవిక వస్త్రం, పూలు, గాజులు, లడ్డూప్రసాదం, శ్రీశైలప్రభ, తులసి, ఉసిరి మొదలైన దేవతావృక్షాలను, కై లాస కంకణాలను అందజేస్తామని అన్నారు. సనాతన ధర్మంపై అవగాహన కల్పించి, ధార్మిక చింతనను పెంపొందించుటకు వ్రతాలు నిర్వహిస్తున్నామన్నారు. వీబీఆర్కు నిలిచిన ఇన్ఫ్లో వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)కు కృష్ణా జలాల ఇన్ఫ్లో నిలిచిపోయింది. గురువారం ఉదయం 6 గంటల సమయానికి 4.624 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్లోకి ఎలాంటి నీటి ప్రవాహం లేదని తెలుగు గంగ అధికారులు తెలిపారు. టీజీపీ లింక్ కాలువ నుంచి కూడా ఇన్ఫ్లో నమోదు కాలేదు. రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం సగటున 250 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో ఉంది. ఇందులో వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాలకు తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. 1ఎల్, 1ఆర్, టీజీపీ ప్రధాన కాలువలకు ప్రస్తుతం నీటి విడుదల లేదు. స్పిల్వే ద్వారా కూడా నీటి ప్రవాహం నమోదు కాలేదు. లోకో ఫైలెట్ సమయస్ఫూర్తి ● ప్రాణాలతో బయటపడిన వృద్ధురాలు డోన్ రూరల్: డెమో రైలు లోకో ఫైలెట్ సమయస్ఫూర్తితో ఓ వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. గురువారం సాయంత్రం డోన్ నుంచి కర్నూలుకు గుంతకల్ డెమో రైలు బయలుదేరింది. అయితే స్థానిక రాముల దేవాలయం సమీపంలో రైలు పట్టాలపై మతిస్థిమితం లేని మహిళ (70) పడుకుని ఉండటంతో లోకో ఫైలెట్ దూరం నుంచి గమనించి రైలు నిలిపివేశాడు. స్థానికుల సహాయంతో ఆమెను అక్కడి నుంచి దూరంగా పంపించేశారు. తన వివరాలను కూడా ఆమె సక్రమంగా చెప్పలేని స్థితిలో ఉంది. వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన డెమో లోకో ఫైలెట్ను పలువురు అభినందించారు. స్వల్ప కాలిక పంటలు సాగు చేసుకోవాలి నంద్యాల(అర్బన్): వరి, మిర్చి పంటలకు ప్రత్యామ్నాయంగా స్వల్ప కాలిక పంటలైన ఉలువలు, మినుములు, కొర్ర వంటి పంటలు సాగు చేసుకోవాలని ఆర్ఏఆర్ఎస్ ఇన్చార్జి ఏడీఆర్ కవిత, డీడీఏ గంగాధర్రావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో గురువారం శిక్షణ, సందర్శన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల జిల్లాలో సాగు అవుతున్న పంటలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపడితే రైతులు లాభాలను గడించవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ ఖాద్రి, పీరానాయక్, తదితరులు పాల్గొన్నారు. క్వింటా ఉల్లి రూ.3,749 కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి ధర జోరుమీద ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉల్లిగడ్డలు కేవలం రెండు లాట్లు మాత్రమే వచ్చాయి. నాణ్యత ఒక మోస్తరుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఒక లాట్కు రూ.3,569, మరో లాట్కు రూ.3,749 ధర లభించడం విశేషం. -
బొలెరో బోల్తా.. ఒకరి మృతి
● 13 మందికి గాయాలు శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం దిగువ భాగంలోని మలుపు వద్ద బుధవారం సాయంత్రం బొలెరో వాహనం బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో సోముల నాయక్ (60) చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. 60 ఏళ్ల వయసున్న బిక్యా నాయక్కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ప్రాంతంలోని అచ్చంపేట తాలూకా బుడ్డా తండాకు చెందిన 14 మంది మత్స్యకారులు కూలి పనులకు దోర్నాల వైపు వెళ్లి తిరుగు ప్రయాణంలో అచ్చంపేటకు వెళుతుండగా డ్యాం వద్ద ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం డ్యాం సమీపంలోని మలుపు వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను 108 వాహనంలో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేశారు. జీవాలకు మేతగా మొక్కజొన్న పంట చాగలమర్రి: ఎన్నో ఆశలతో మొక్కజొన్న పంట సాగు చేయగా సరిగా మొలవకపోడం, పైరు ఎదుగుదల లేక పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో కౌలు రైతు బాధను దిగమింగుకొని జీవాలకు మేతగా వదిలేశాడు. మండలంలోని ముత్యాలపాడు గ్రామానికి చెందిన దాదనగాళ్ల చాంద్ బాషా రూ.40 వేలు చెల్లించి రెండెకరాల పొలంను కౌలుకు తీసుకొని రూ.70 వేలు ఖర్చు చేసి మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే వాతావరణ మార్పుల వల్లనో, నకిలీ విత్తనాల వల్లనో పంట సరిగ్గా మొలవలేదు. అలాగే పైరు ఎదుగుదల లేకపోవడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధను దిగమింగుకొని బుధవారం పంటను తొలగించే క్రమంలో మొక్కజొన్న పైరులో జీవాలను మేపడానికి వదిలేశాడు. నష్టాన్ని పూడ్చుకోవటానికి రెండెకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయడానికి సిద్ధమవుతున్నట్లు కౌలు రైతు చాంద్బాషా తెలిపారు. పంట నష్టపోయిన తనను ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. ● విద్యార్థికి తీవ్ర గాయాలుగుత్తి: పట్టణ శివారులోని చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మనోజ్ అనే ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. ఆరో తరగతి విద్యార్థి రిషిద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. నంద్యాల పట్టణంలోని శ్యాం నగర్కు చెందిన మనోజ్ (26) గుత్తి మండలం సేవాఘడ్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. బుధవారం పాఠశాల ముగిసిన తర్వాత ఆరో తరగతి విద్యార్థి రిషిద్తో కలిసి బైక్లో గుత్తికి బయలుదేరారు. మార్గం మధ్యలో చెరువు కట్ట వద్ద గుంతకల్లు డిపో ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన పీడీ మనోజ్ను స్థానికులు 108 అంబులెన్స్లో గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థి రిషిద్ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో మనో జ్ పీడీగా ఎంపికయ్యారు. ఎన్నో ఆశలతో ఉద్యోగంలో చేరిన ఆయన అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ శోకసంద్రంలో నెట్టింది. ఘటనపై సీఐ రామారావు విచారణ చేపట్టారు. ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి బనగానపల్లె రూరల్: పొలంలో ట్రాక్టర్తో సేద్యం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి హైదర్ సాహెబ్గారి ఆరీఫ్ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నందివర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని చెరువుపల్లె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పెద్ద అబ్బాస్ కుమారుడు ఆరీఫ్ గ్రామ సమీపంలోని తమ సొంత పొలంలో పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లాడు. దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న ఆరీఫ్ కిందపడిపోగా.. ట్రాక్టర్ అతనిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొబ్బరికాయల గోడౌన్ పక్కనే పూజా ద్రవ్యాల దుకాణం
● టెండర్ ప్రకటనలో పొరపాటు జరిగింది ● దేవస్థాన రెవెన్యూ విభాగ ఏఈఓ శ్రీనివాసరెడ్డి శ్రీశైలం టెంపుల్: శ్రీశైల ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద ఉన్న కొబ్బరికాయల గోడౌన్ పక్కనే పూజాద్రవ్యములు, ఒత్తులు అమ్ముకునే షాపు ఉంటుందని శ్రీశైల దేవస్థాన రెవెన్యూ విభాగ సహయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘టెండర్ నిబంధనలు భేఖారత్’ అనే శీర్షికతో వార్తా కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన దేవస్థానం అధికారులు ఈ నెల 15వ తేదీన ఇచ్చిన దుకాణాల టెండర్ నోటీసు ప్రకటనలో చిన్నపాటి పొరపాటు జరిగిందని, అందులో దుకాణం నిర్వహించుకునే స్థలం ప్రచురితం కాలేదని, అంతేతప్పా ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ దుకాణం బహిరంగ వేలం, ఇ–టెండర్ నిర్వహిస్తున్నామని, పూర్తి వివరాలను ఇ–టెండర్లో పొందుపర్చామని, అలాగే ఆసక్తి కలిగిన వారు సంప్రదించేందుకు ముగ్గురు అధికారుల ఫోన్ నంబర్లు పొందుపర్చామని పేర్కొన్నారు. దుకాణాలు తొలగించి.. మళ్లీ అదే ప్రదేశంలో కేటాయింపు? శ్రీశైల క్షేత్ర అభివృద్ధి, రథోత్సవం తిలకించేందుకు భక్తులకు అసౌకర్యం లేకుండా రహదారుల విస్తరణ కోసం ప్రధాన ఆలయానికి ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించి లలితాంబా వాణిజ్య సముదాయంలో దుకాణాలు కేటాయించారు. అంతేకాకుండా ఆ ప్రదేశంలో సాలు మండపాలు నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడు అదే ప్రదేశంలో దుకాణాలు కేటాయిస్తే ఎలా అని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా ప్రతి దుకాణంలోనూ నాణ్యమైన నూనె, పూజా ద్రవ్యములు, ఒత్తులు విక్రయించుకుంటున్నామని, గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా షాపు ఏర్పాటు చేస్తే లలితాంబా వాణిజ్య సముదాయంలోని దుకాణాలకు భక్తులు ఎలా వస్తారని వాపోతున్నారు. టెండర్ నోటీసులో పొందుపర్చిన సైజు ప్రకారం గతంలో ప్రధానాలయానికి ఎదురుగా రెండు వైపులా ఉన్నవారికి కూడా దుకాణాలు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కంకర పరిచి వదిలేశారు!
కోడుమూరు రూరల్: కోడుమూరు–వెల్దుర్తి రోడ్డు నిర్మాణం నత్తలతో పోటీ పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం రూ.20 కోట్లతో ఎంతో ఆర్భాటంగా కోడుమూరు నుంచి వెల్దుర్తికి రోడ్డు నిర్మాణ పనులను ఏడాదిన్నర కిందట చేపట్టింది. రోడ్డు నిర్మాణం పూర్తయితే కోడుమూరు నుంచి వెల్దుర్తి, డోన్కు వెళ్లే వాహనదారులతో పాటు, వెంకటగిరి, గోరంట్ల, లద్దగిరి, అనుగొండ, అమడగుంట్ల వంటి సుమారు 10 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అయితే ఐదారు నెలల్లో పూర్తి చేయాల్సిన రోడ్డు నిర్మాణ పనులను ఏడాదిన్నర గడిచినా 50 శాతం మేర కూడా ప్రభుత్వం పూర్తి చేయించలేకపోయింది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ కోడుమూరు నుంచి వెంకటగిరి వరకు రోడ్డుకిరువైపులా కంకర, గ్రావెల్ పరిచి వదిలేయగా, వెంకటగిరి నుంచి గోరంట్ల మధ్య కంకర పరిచి వదిలేయడంతో వాహనదారులంతా చిల్లబండ క్రాస్ రోడ్డు మీదుగా గోరంట్లకు చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగి వెళుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించి తమ ఇబ్బందులను తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఏడాదిన్నరగా సాగుతున్న కోడుమూరు–వెల్దుర్తి రోడ్డు నిర్మాణం ఇబ్బందులు పడుతున్న వాహనదారులు -
సెల్ఫోన్ పేలి యువకుడికి గాయాలు
చాగలమర్రి: జేబులో పెట్టుకున్న సెల్ఫోన్ పేలడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండలంలోని ముత్యాలపాడు గ్రామానికి చెందిన లక్కబోయిన హరి వారం రోజుల క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్లాడు. అక్కడ తాను విధులు నిర్వహిస్తున్న రాణిగంజ్ ప్రాంతంలోని ఎస్ఆర్ఆర్ కార్యాలయానికి వెళ్లే క్రమంలో లిఫ్ట్లో వెళ్తుండగా తాను ధరించిన ప్యాంటు జేబులో సెల్ఫోన్ నుంచి పొగలు వెలువడి కాలిపోతుండటంతో వెంటనే ఫోన్ను బయటకు తీసి పక్కకు విసిరేశాడు. క్షణాల్లోనే సెల్ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. సెల్ఫోన్ కాలుతుండగా అప్రమత్తమై దూరంగా విసిరేయడంతో గాయాలతో బయటపడ్డాడు. అతని ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. సెల్ఫోన్ బ్యాటరీలో ఉండే లిథియం–అయాన్లు అంతర్గతంగా విచ్చిన్నమై వేడి రసాయన చర్యను సృష్టించడం వల్ల పేలుడు సంభవించినట్లు నిపుణులు చెప్పారని బాధితుడు వెల్లడించారు. -
అర్ధరాత్రి అక్రమ రవాణా
● విజిలెన్స్ దాడుల్లో మూడు ఇసుక, రెండు మట్టి టిప్పర్ల పట్టివేతమంత్రాలయం: ఇసుకాసురులు హద్దులు దాటుతున్నారు. అర్ధరాత్రి వేళ ఇసుక దందాను దర్జాగా నడుపుతున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో విజిలెన్స్ అధికారులు దాడులకు దిగారు. ఈ దాడుల్లో 5 టిప్పర్లు పట్టుబడ్డాయి. వివరాలివి.. కౌతాళం మండలం గుడికంబాళి, నదిచాగిలో ఇసుక రీచ్లు ఉన్నాయి. అక్కడి నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఇసుకను తెచ్చుకుంటారు. అయితే కొందరు స్వార్థపరులు రీచ్లపై పడ్డారు. అక్కడి నుంచి అక్రమంగా ఇసుకను గుట్టుగా తరలిస్తున్నారు. మంగళవారం రాత్రి మైనింగ్ విజిలెన్స్ అధికారులు అక్రమ రవాణాపై దాడులు చేపట్టారు. మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడికంబాళి నుంచి ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు. టిప్పర్లకు (ఏపీ 39 డబ్ల్యూక్యూ 6839, ఏపీ 39 డబ్ల్యూపీ 8439, ఏపీ 39 డబ్ల్యూఏ 8752) అనుమతులు లేవని గుర్తించి మాధవరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అలాగే మంత్రాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రెండు మట్టి టిప్పర్లు పట్టేశారు. నందవరం మండలం గంగవరం నుంచి మట్టిని స్థానిక బైపాస్ రోడ్డుకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మిగనూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడి అండదండలతో ఎలాంటి అనుమతుల్లేకుండా మట్టి మాఫియా సాగిస్తున్నారు. పట్టుబడిన రెండు టిప్పర్లు (కేఏ 36 సీ 9316, ఏపీ 39 యూఎం 1187)ను మంత్రాలయం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
ఇవేనా నాణ్యమైన బ్యాగులు..లోకేశ్బాబూ!
పుట్లూరులో 20 రోజులకే చిరిగిన బ్యాగ్లుకృష్ణగిరి: చంద్రబాబు ప్రభుత్వంలో విద్యకు ఎంత మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ బ్యాగ్లను చూస్తే అర్థమవుతోంది. పాఠశాలలు తెరిచిన రెండు నెలలకు బ్యాగ్లు ఇచ్చినా వాటిలో నాణ్యత లేదనే విషయం కేవలం 20 రోజుల్లోనే బయటపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 20 రోజుల కింద స్కూల్ బ్యాగ్లు, షూలు, బెల్ట్ ఇచ్చారు. కొత్త బ్యాగ్లు అప్పుడే చిరిగి పనికి రాకుండా పోయే పరిస్థితి నెలకొంది. మూడేళ్ల కిందట జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగ్లను నేటికీ పిల్లలు వాడుతున్నారని, అలాంటిది చంద్రన్న ఇచ్చిన బ్యాగులు 20 రోజులకే చిరిగిపోవడం చూస్తే ప్రభుత్వ విధానం అర్థమవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. తమ ప్రభుత్వం విద్యార్థులను నాణ్యమైన కిట్లు అందిస్తోందని డప్పాలు చెప్పుకునే విద్యాశాఖ మంత్రి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. బుధవారం అమకతాడు, పుట్లూరు గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇలా చిరిగిన బ్యాగులతో అవస్థలు పడుతూ కనిపించారు. -
అధికారుల ముందే ఆత్మహత్యాయత్నం
● ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న హజామ్ ఖాన్ను పరామర్శించిన కాటసానికల్లూరు/ఓర్వకల్లు: తనకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేక అధికారుల ముందే చిన్న హజామ్ ఖాన్ అనే వ్యక్తి పురుగుల మందు తాగాడు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన ఈయనకు సర్వే నంబర్ 339లో 2.50 ఎకరాల భూమిని కొన్నేళ్ల నుంచి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ భూమిలో 45 సెంట్లు ఆక్రమించుకున్నాడని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. అంతేగాక ఆ భూమికి కొలతలు వేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. మండల సర్యేయర్, గ్రామ సర్వేయర్లు కొలతలు వేసేందుకు పొలం దగ్గరకు వెళ్లారు. అక్కడే అధికారులకు, అజామ్ ఖాన్ మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. అధికారుల ముందే అజామ్ఖాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు, చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా విధులకు ఆటంకం కల్గించిన అజామ్ ఖాన్పై అధికారుల బృందం ఓర్వకల్లు పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి ప్రజలను వేధిస్తున్నారు టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి సామాన్య ప్రజలను వేధిస్తూ అధికార దుర్వినియోగానికి పాలపడుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న హజామ్ ఖాన్ను పరామర్శించి, బాధితుని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ అరకొర భూమితో జీవనం సాగిస్తున్న చిన్న హజామ్ ఖాన్కు రెవెన్యూ అధికారులు వరుసగా నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. అతనికి ఏదైనా జరిగితే ఓర్వకల్లు తహసీల్దార్, సంబంధిత సర్వే అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు పనిచేయాలని, సామాన్య ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. -
హుండీ ఆదాయం రూ.40 లక్షలు
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయలంలో బుధవారం హుండీలోని కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా ఈఓ రామకృష్ణ మాట్లాడుతూ హుండీలో నగదు రూ. 40.93 లక్షలు, 1. 20 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండిని భక్తులు బహూకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 26 నుంచి నేటి వరకు భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించినట్లు పేర్కొన్నారు. డ్రంకెన్డ్రైవ్లో ఇద్దరికి జైలు డోన్ రూరల్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష, ఒకరికి రూ.10 వేలు జరిమానా విధించారు. విజయవాడలోని కుమ్మరిపాలెం వీధికి చెందిన జరకు రవి శేఖర్రెడ్డికి ఏడు రోజుల జైలు శిక్ష, డోన్ పాతపేటకు చెందిన ఎం శ్రీనివాసులుకు మూడు రోజులు జైలు శిక్ష, డోన్ చిగురుమానుపేటకు చెందిన జి అంజికు రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం డోన్ స్పెషల్ జ్యూడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు టౌన్ సీఐ ఇంతీయాజ్ బాషా తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు ,జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): పర్యాటక, మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా టూరిజం అధికారి సునిల్కన్న తెలిపారు. స్థానిక పీజీఆర్ఎస్ హాల్లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో కోర్సులు ఉన్నాయన్నారు. బీఎస్సీ మూడేళ్ల డిగ్రీ కోర్సుకు ఇంటర్ పాస్ అయిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ పాస్ అయిన విద్యార్థులు క్రాప్ట్ కోర్స్ ఇన్ఫుడ్ ప్రొడక్షన్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫుడ్, బేవరేజ్ సర్వీస్ కోర్స్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పై కోర్సులకు వయో పరిమితి లేదని, బాలబాలికలకు లోన్ సదుపాయంతో పాటు వేర్వేరుగా హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు. వివరాలకు 9701343846, 9700440604 నంబర్లను సంప్రదించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 29లోగా కాలేజీకి పంపాలన్నారు. కార్యక్రమంలో శివరామకృష్ణ, భార్గవి పాల్గొన్నారు. క్వింటా ఉల్లి రూ.3,813 కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లిగడ్డలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు క్షేత్రస్థాయికే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 15 రోజులుగా మార్కెట్కి ఉల్లిగడ్డలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో వ్యాపారులు కొనుగోళ్లపై దృష్టి సారించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లిలో 75 శాతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వెళ్తోంది. దీంతో వ్యాపారులు క్షేత్రస్థాయికే వెళ్లి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం కర్నూలు మార్కెట్కు కేవలం ముగ్గురు రైతులు 185 క్వింటాళ్ల ఉల్లి తెచ్చారు. కనిష్ట ధర రూ.3,589, గరిష్ట ధర రూ.3,813 లభించగా.. సగటు ధర రూ.3803 నమోదైంది. వేరుశనగకు కర్నూలు మార్కెట్లో గరిష్టంగా రూ.9,270, ఆదోని మార్కెట్లో రూ.8,891, ఎమ్మిగనూరు మార్కెట్లో రూ.8,304 ప్రకారం ధరలు లభించాయి. ఆదోని మార్కెట్లో పత్తి ధర కాస్త తగ్గింది. మార్కెట్కు 678 క్వింటాళ్ల పత్తి రాగా.. కనిష్ట ధర రూ.4వేలు, గరిష్ట ధర రూ.9,929 లభించగా.. సగటు ధర రూ.9,570 నమోదైంది. కర్నూలు జిల్లాకు 1,078 పశువుల షెడ్లు మంజూరు కర్నూలు(అగ్రికల్చర్): వీబీ జీ రామ్ జీ నిధులతో 1,078 పశువుల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఉపాధి హామీ జాబ్కార్డుతో పాటు గ్రామసభ ఆమోదం తప్పనిసరి చేశారు. 2, 4, 6 పశువులకు షెడ్లు నిర్మించుకోవడానికి 90 శాతం వీబీ జీ రామ్ జీ నిధులు వినియోగిస్తారు. పశుసంవర్ధక శాఖ అధికారులు పాడి పశువులు ఉన్న రైతులను గుర్తించి జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులకు అప్పగిస్తామని జిల్లా పశసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. డ్వామా సాంకేతిక సహాయకులు, ఈసీలు ఎస్టిమేట్లు వేసి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్కు పంపుతారన్నారు. యూనిట్ కాస్ట్లో 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా.. 10 శాతం రైతులు భరించాల్సి ఉందన్నారు. -
జూడాల ఆందోళన ఉద్ధృతం
● కర్నూలులో జూనియర్ వైద్యుల బైక్ ర్యాలీకర్నూలు(హాస్పిటల్): స్టైఫండ్ పెంపునకు జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మె రోజురోజుకు ఉద్ధృతం అవుతోంది. బుధవారం కూడా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సాధారణ ఓపీ, ఐపీ సేవలతో పాటు అత్యవసర, ఐసీయూ వైద్యసేవలను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. 10వ రోజుకు చేరుకున్న ఆందోళన ఫలితంగా ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గుతోంది. మంగళవారం కంటే బుధవారం ఓపీ సంఖ్య మరింత తగ్గి 1500 లోపే నమోదైంది. ఇన్పేషెంట్ల సంఖ్య సైతం 500 పైగా చికిత్స పొందుతున్నారు. వైద్యులు అత్యవసరం, సీరియస్గా ఉన్న రోగులను మాత్రమే ఆసుపత్రిలో చేర్చుకుంటున్నారు. వార్డుల్లో ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిని సైతం కాస్త కోలుకుంటే సమ్మె ముగిశాక రావాలని సూచించి డిశ్చార్జ్ చేస్తున్నారు. కాగా ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజి నుంచి కొండారెడ్డి బురుజు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జూడాల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో వైద్యలందరం రోడ్లపైకి వచ్చి మా ఆవేదనను శాంతియుతంగా వ్యక్తం చేశామన్నారు. ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. -
ఎరువులు ఇవ్వరు.. తెచ్చుకుంటే వదలరు!
ఆళ్లగడ్డ: సమయానికి ఎరువులు ఇవ్వకపోగా ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తే అధికారులతో వేధించడం పరిపాటిగా మారింది. రుద్రవరం చిత్రేనిపల్లె గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. గ్రామంలో అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడి రైతులు పండించే నంద్యాల సోనా రకం బియ్యానికి డిమాండ్ ఉంది. పంట పండించేందుకు ప్రభుత్వం ఎరువుల్లో కనీసం పదిశాతం కూడా సరఫరా చేయలేదు. దీంతో అనేక మంది రైతులు ఏదో విధంగా బస్తాలు సమకూర్చుకుని వాటిని తమ ఇళ్లలో భద్ర పరుచుకున్నారు. ఇది గమనించిన టీడీపీ నాయకులు తమను అడగకుండా ఎలా తెచ్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేయాలని వ్యవసాయాధికారులకు చెబుతున్నారు. టీడీపీ నాయకుల మాటలకు తలొగ్గి రైతుల ఇళ్లపై వ్యవసాయ అధికారులు దాడులు చేస్తున్నారు. ఎరువుల బస్తాలు అక్రమంగా ఉంచారని సీజ్ చేస్తున్నారు. అలాగే జరిమానాలు వేస్తున్నారు. టీడీపీ నాయకులతో రాజీ పడాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారు. పేదోళ్లపై ప్రతాపం పేద రైతులు తమ ఇళ్లలో పది ఎరువుల బస్తాలు నిల్వ చేసుకుంటే ఇవి ఎక్కడివి అని వ్యవసాయాధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ నాయకుల సంబంధించిన గోదాముల్లో వేలకు వేలు బస్తాలు నిల్వ చేసుకున్నా పట్టించుకోవడం లేదు. తాము దాచుకున్నది పొలానికి అవసరమైన ఎరువుల బస్తాలే కదా.. బెదిరింపులు ఎందుకని రైతులు అంటే ఇందులో తమ పాత్ర లేదని, టీడీపీ నాయకుల ప్రమేయమేనని అధికారులు చెబుతున్నారు. కొందరు రైతులు టీడీపీ నేతలతో రాజీ పడి రూ. 50 వేలు ఇచ్చినట్లు సమాచారం. అధికార పార్టీకి మేలు జరిగేలా సామాన్య రైతులు అఽధికారులు వేధించడం మానుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారులు సీజ్ చేసిన ఎరువుల బస్తాలు పేద రైతుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు ఎరువుల బస్తాలు సీజ్ చేస్తూ బెదిరింపులు టీడీపీ నాయకుల మాట వినాలని ఒత్తిళ్లు -
సౌర విద్యుదుత్పత్తికి రుణాలు ఇవ్వండి
● బ్యాంకర్లతో విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ కర్నూలు(అగ్రికల్చర్): ప్రధానమంత్రి సూర్యఘర్ కింద సౌర విద్యుత్ ఉత్పత్తికి బ్యాంకులు విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ కోరారు. బుధవారం కర్నూలులోని విద్యుత్ భవన్లో బ్యాంకు అధికారులు, సౌర విద్యుత్ వెండర్లతో నిర్వహించిన సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్(ఎల్డీఎం)తో కలసి పాల్గొన్నారు. ముందుగా సౌర వెండర్లు మాట్లాడుతూ రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను బ్యాంకర్ల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు గ్రీన్ ఎనర్జీ, సౌర విద్యుత్ వినియోగం ఎంతో కీలకమన్నారు. సౌర వెండర్లు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ఎల్డీఎం మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 10వేల ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన దరఖాస్తులను బ్యాంకులకు పంపామన్నారు. దరఖా స్తుల పరిశీలన, రుణాల మంజూరు, పంపిణీ ప్రక్రియ ను బ్యాంకులు వేగవంతం చేయాలని కోరారు. -
న్యాయవాదులు విధుల బహిష్కరణ
కర్నూలు: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి నిరసనను తెలియజేశారు. సర్క్యూట్ బెంచ్ లేదా మొబైల్ బెంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిరసిస్తూ న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ఈ గందరగోళాన్ని నివృత్తి చేసి ఆలస్యం చేయకుండా కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కోర్టులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలులో జరిగిన నిరసన ప్రదర్శనలో రాయలసీమ అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్, సీనియర్ న్యాయవాది వై.జయరాజుతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రుడు, మహేశ్వర రెడ్డి తదితరులు నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చాలని, లేకపోతే రాయలసీమ ప్రాంతమంతటా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీనియర్ న్యాయవాదులు శివరామయ్య, ఎల్లారెడ్డి, ఏఆర్ఎస్ రెడ్డి, సి.నాగేంద్రనాథ్తో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఫొటో ఓటర్ల జాబితా ప్రచురణకు సన్నద్ధత
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: మున్సిపాలిటీల వారీగా ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, తాగునీటి సరఫరా , పరిశుభ్రతపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. జెడ్పీ సీఈవో సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిని లలితాబాయి, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీలో వార్డులవారీగా ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి సెప్టెంబర్ 3న సంబంధిత కార్యాలయాల్లో ప్రచురించాలన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల పరిశీలన, ప్రచురణ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాపై మందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలన్నారు. -
కేసుల రాజీపై దృష్టి పెట్టండి
కర్నూలు: రాజీపూర్వకంగా కేసుల పరిష్కారంపై న్యాయవాదులు, పోలీసులు సహకరించాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి గణనీయ సంఖ్యలో కేసులను రాజీ ద్వారా పరిష్కరించే అంశంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మంగళవారం నందికొట్కూరు పరిధిలోని పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి దివ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇక ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నిక!
● 31 ఏళ్ల తరువాత నిర్ణయం ● వచ్చే నెల 3 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం కర్నూలు (టౌన్): ఉమ్మడి రాష్ట్రంలో 31 సంవత్సరాల క్రితం కర్నూలు కార్పొరేషన్లో మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిన నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇదే విధానాన్ని మళ్లీ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇద్దరు డిప్యూటీ మేయర్లకు గాను ఒక్కరికే అవకాశం కల్పిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. గతంలో కర్నూలు కార్పొరేషన్లో ఒకే అసెంబ్లీ నియోజకవర్గం, 44 వార్డులు ఉండేవి. మేజర్ గ్రామ పంచాయతీ కల్లూరు 2002లో విలీనం కావడంతో వార్డుల సంఖ్య పెరిగింది. స్టాంటన్ పురం, మామిదాలపాడు, మునగాల పాడు గ్రామాలను 2017లో విలీనం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పందిపాడు, లక్ష్మీపురం, పెద్దపాడు గ్రామాలు విలీనం కావడంతో వార్డుల సంఖ్య 52కు చేరింది. పాణ్యం అర్బన్, కోడుమూరు అర్బన్ ప్రాంతాలు కర్నూలు కార్పొరేషన్లో విలీనం అయ్యాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరోసారి వార్డుల సంఖ్యను 52 నుంచి 68కు పెంచింది. ఇదీ చరిత్ర ● కర్నూలు మున్సిపాల్టీని 1994లో కార్పొరేషన్గా అప్ గ్రేడ్ చేశారు. ● ఎన్నికలు 1995లో నిర్వహించగా ప్రత్యక్ష పద్ధతిన మేయర్గా బంగి అనంతయ్య ఎన్నికయ్యారు. ● వరుసగా ప్రత్యక్ష ఎన్నికల్లో 2000లో ఫిరోజ్ బేగ, 2005లో రఘరామిరెడ్డి ఎన్నికయ్యారు. ● 2010 నుంచి 2020 వరకు రెండు పర్యాయాలు ఎన్నికలు నిర్వహించలేదు. ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2020న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికను పరోక్ష పద్ధతిన ఎన్నుకున్నారు. ● కార్పొరేషన్లో 31 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష పద్ధతిన మేయర్ ఎన్నుకోవాలని నిర్ణయించారు. వచ్చే నెల 3 నాటికి ఓటర్ల జాబితా కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేపట్టింది. ‘సర్’ ప్రక్రియలో అభ్యంతరాలకు సంబంధించి విచారణ తుది దశకు వచ్చింది. వచ్చే నెల 3వ తేదీ నాటికి వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రెండు నుంచి నాలుగు వార్డులకు ఒక అధికారిని నియమించేందుకు జాబితా పంపించాలంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ కమిషనర్లకు లేఖ రాసింది. తాజాగా ప్రభుత్వం మేయర్ల ఎన్నిక విషయంతో పాటు ఒక్కరికే డిప్యూటీ మేయర్కు అవకాశం కల్పించింది. అలాగే బీసీ రిజర్వేషన్లను 33 శాతం అమలు చేస్తామని ప్రకటిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించాయి. ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే పోటీ ఉంటుంది. బరిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఉన్నాయి. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిపై అక్రమ కేసు
కర్నూలు: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్పై కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో అక్రమ కేసు నమోదైంది. ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్టు చేసి కర్నూలు జిల్లా జైలులో ఉంచారు. ఆయనతో ములాఖత్ కావడానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 13న కర్నూలు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం బీసీలను అణగదొక్కుతోందంటూ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కర్నూలు బళ్లారి చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారంటూ నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జి.సుబ్బరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 189(2), 126(2), 287, 125 రెడ్విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా బొమ్మలసత్రం: నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలంటే నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సునీల్ షొరాణ్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని సమావేశ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ లాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నివారించాలని ఆదేశించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా భౌతిక దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నేరాలు జరిగిన నిమిషాల్లో నేరస్తులను గుర్తించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్బాషా, ఏఎస్పీ సుస్మిత, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, రామాంజినాయక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్మృతివనంలో ‘త్రీడీ’ నల్లమల దర్శనం ఆత్మకూరురూరల్: నల్లకాల్వ గ్రామ శివారులోని వైఎస్సార్ స్మృతివనం సందర్శనకు వచ్చే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగించే సౌకర్యం ఒకటి కొత్తగా ప్రారంభించారు. త్రీడీ ఎఫెక్ట్తో ఉండే కళ్లజోడులో నల్లమల అడవిని చిత్రీకరించిన వీడియోలను ఉంచారు. ఈ కళ్లజోడు ధరిస్తే మనం స్వయంగా నల్లమల అడవుల్లో సంచరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇందుకోసం కేవలం రూ.50 మాత్రమే చార్జ్ చేస్తున్నారు. ఈ సౌకర్యాన్ని ఆత్మకూరు అటవీ డివిజన్ డిడి విగ్నేష్ అపావ్ సోమవారం స్వయంగా పరిశీలించారు. ● వైద్య సిబ్బందిపై డీసీహెచ్ఎస్ ఆగ్రహం బేతంచెర్ల: ‘రోగుల బెడ్లు ఇలాగేనా ఉండేది.. మీ ఇంటిని ఇలాగే ఉంచుతారా’ అంటూ వైద్య సిబ్బందిపై డీసీహెచ్ఎస్ డాక్టర్ లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బేతంచెర్లలోని శేషారెడ్డి సీహెచ్సీని మంగళవారం అమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అస్పత్రి అపరిశుభ్రంగా ఉండటం, రోగుల బెడ్లు సరిగ్గా లేకపోవడంతో సిబ్బంది తీరుపై మండిపడ్డారు. క్యాజువాలిటీ, కాన్పుల వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అస్పత్రి పరిసరాలు, వార్డులు, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణుల కోసం స్కానింగ్, ఎక్సేర్ పరీక్షలు ఎక్కడ అందుబాటులో ఉంటాయో అస్పత్రిలో స్పష్టంగా రాసి ఉంచాలని సూచించారు. వైద్యులు వాణి స్వప్నప్రియ, వెంకటేశ్వర్లు, విజయా భాస్కర్ పాల్గొన్నారు. -
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
వెలుగోడు: పట్టణంలోని సిద్ధబావి వీధికి చెందిన పరుచూరి సరస్వతి (50) అనారోగ్య సమస్యలతో విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త బాలకృష్ణ సుమారు 20 ఏళ్ల క్రితం మృతి చెందగా, సరస్వతికి పిల్లలు లేరని బంధువు కటకం ఎల్లా సుబ్బమ్మ సోమవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న సరస్వతికి పది రోజులుగా రక్త విరేచనాలు అవుతున్నాయని, అనారోగ్యంతో తీవ్ర మనస్తాపానికి గురైందని తెలిపారు. ఈ క్రమంలో వెలుగోడులోని రెడ్డిగారి వీధిలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కటకం ఎల్లసుబ్బమ్మ పోలీసులకు వెల్లడించారు. రైతు దుర్మరణం వెల్దుర్తి: మండల పరిధిలోని చెరుకులపాడు గ్రామానికి చెందిన రైతు బోయ రవి (40) సోమవారం ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందాడు. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ రవి తన సొంత పొలంలో బెండకాయ సాగు చేశాడు. పొలంలోని రింగు బావి నుంచి మోటారు సాయంతో సాగునీరందించేవాడు. బావిలో నీరు బాగానే ఉన్నా పైప్ ద్వారా పైకి రాకపోవడంతో మంగళవారం బావిలోని ఫుడ్బాల్కు చెత్త అడ్డుపడి ఉంటుందని భావించాడు. చెత్తను తొలగించేందుకు తాడు సాయంతో రింగుబావిలోకి దిగే ప్రయత్నం చేశాడు. తాడు ఒక్కసారిగా తెగడంతో గోడరాయికి తగిలి బావిలో పడిపోయాడు. అక్కడున్న వారు వెంటనే మరో తాడు సాయంతో బావిలోకి దిగి రవిని పైకి తెచ్చారు. కొన ఊపిరితో ఉన్న రవిని 108 అంబులెన్స్లో స్థానిక సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచి, విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికెన్ బిర్యానీలో నిషేధిత రంగులు కర్నూలు (హాస్పిటల్): నిషేధిత సింథటిక్ రంగులతో చికెన్ బిర్యానీ తయారు చేస్తుండడాన్ని ఆహార భద్రత అధికారులు గుర్తించారు. సోమవారం స్థానిక పాతబస్టాండ్ సమీపంలోని హజ్మండ్ హబ్ అనే బిర్యానీ సెంటర్ను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సతీష్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ తనిఖీ చేశారు. అక్కడి ఫ్రిజ్లో ముందు రోజు తయారు చేసిన చికెన్ ఫ్రై నిల్వ ఉండటాన్ని గమనించి పారబోయించారు. చికెన్ పీసులపై నిషేధిత రంగులు వాడి ఆకర్షణీయంగా తయారు చేసి వినియోగదారులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు సాగర్ అనే ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు దాడులు నిర్వహించారు. బిర్యానీ సెంటర్లో ఆహార పదార్థాలతో పాటు వంట గది సైతం అపరిశుభ్రంగా ఉందని, దీన్ని సరిచేసుకోవాలని బిర్యానీ సెంటర్ వారికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రంగులు కలిపిన చికెన్ పీసులను శ్యాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపారు. టెంకాయ కొట్టేందుకు సుంకం! మంత్రాలయం: ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో వసూళ్ల జాతర కొనసాగుతూనే ఉంది. టెంకాయ కొట్టేందుకు భక్తులు ప్రత్యేకంగా టికెట్లు తీసుకుంటున్నా కొట్టుడుకు మాత్రం మేటీలు సుంకం వసూలు చేస్తున్నారు. సోమవారం లక్ష మందికిపైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. స్వామికి జోడు టెంకాయలు సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. టెంకాయ కొట్టేందుకు ఆలయం రూ.5 టికెట్ పెట్టింది. అయితే ఇవేమీ మేటీలు పట్టించుకోవడం లేదు. భక్తుల నుంచి ముక్కుపిండి టెంకాయకు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. టెంకాయ కొట్టేందుకు డబ్బులు వసూలు చేయరాదని ఆలయ అధికారులు అక్కడే ఫ్లెక్సీలు పెట్టడం గమనార్హం. మేటీలకు ఇదేమీ పట్టడం లేదు. తమ దోపిడీని షరామామూలే అన్నట్లుగా మార్చుకున్నారు. తమ ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తులను దోచుకుంటున్నారు. ఈ వసూళ్లు అధికారుల కళ్లెదుటే సాగిపోతున్నా నోరు మెదపని వైనం. అడగడుగునా వసూళ్లు ఉండటంతో భక్తులు తలలు పట్టుకుంటున్నారు. ఇదేమి దోపిడీ అంటూ విస్తుపోతున్నారు. -
రైతు మెడపై వేలం కత్తి!
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) బకాయిల వసూలుకు రైతుల మెడపై వేలం కత్తి పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే వందలాది మంది రైతుల స్థిరాస్తులను అమ్మకానికి పెట్టేందుకు డీసీసీబీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. రైతన్నా మీ కోసం కార్యక్రమం ద్వారా అధికారిక లెక్కల ప్రకారమే ఉమ్మడి జిల్లాలో 60వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా సహకార కేంద్రబ్యాంకు బకాయిలు చెల్లించలేదనే కారణంతో తనఖా పెట్టిన ఆస్తులను అమ్మకానికి పెట్టడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలను ముమ్మరం చేసింది. మొత్తం 139 మంది రైతుల స్థిరాస్తులను వేలం వేసేందుకు షెడ్యూలు ఖరారు చేయడం, వేలం పాటలో పాల్గొనాలని గ్రామాల్లో దండోర వేయడం, వేలం పాట వేదికలను ప్రకటించడం పట్ల గ్రామాల్లో కలకలం రేగుతోంది. రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉంటే ఈ సమయంలో ఆస్తుల వేలం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది వేలం ద్వారా విక్రయానికి చర్యలు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది నుంచే డీసీసీబీ జప్తులు, ఆస్తుల స్వాధీనం, వేలం ద్వారా విక్రయానికి చర్యలను ముమ్మరం చేసింది. 2014–15 నుంచి 2018–19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో వరుస కరువులు వచ్చాయి. పంటలు పండక రైతులు అల్లాడుతుంటే అప్పట్లో కూడా జప్తుల పర్వాన్ని కొనసాగించారు. తాజాగా ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.10 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు 139 మంది రైతులకు చెందిన స్థిరాస్తులను వేలం ద్వారా విక్రయించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నెల 26 నుంచి వేలం ద్వారా ఆస్తులను విక్రయించేందుకు ఇప్పటికే ఆయా గ్రామాల్లో టాంటాం వేయించడం గమనార్హం. ప్రస్తుతం జిల్లా సహకార కేంద్రబ్యాంకు శాఖల నుంచి దీర్ఘకాలిక రుణాలతో పాటు వివిధ పథకాల కింద పంపిణీ చేసిన రుణాలను రాబట్టుకునేందుకు వేలం అస్త్రాన్ని డీసీసీబీ ప్రయోగించింది. వేలం పాట నిర్వహించేందుకు బ్రాంచీ వారీగా సేల్ ఆఫీసర్ కూడా నియమితులయ్యారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు కృష్ణానగర్ శాఖ పరిధిలోనే 18 మంది రైతులకు చెందిన 95 ఎకరాల రైతుల భూములను వేలం ద్వారా విక్రయించేందుకు షెడ్యూల్ ఖరారైంది. మరో 386 మంది రైతుల ఆస్తులకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు దాఖలయ్యాయి. రూ.280 కోట్లకు చేరుతున్న నిరర్థక ఆస్తులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు నిరర్ధక ఆస్తులు కొండలా పెరగిపోతున్నాయి. 2024 ఏప్రిల్ నెలలో రూ.183 కోట్ల నిరర్ధక ఆస్తులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి నిరర్థక ఆస్తులు రూ.280 కోట్లకు చేరడం గమనార్హం. ఆలూరు, డోన్, ఆదోని, పత్తికొండ, కృష్ణానగర్, కోడుమూరు, కోవెలకుంట్ల, నందికొట్కూరు, వెలుగోడు, ఆత్మకూరు బ్రాంచీల్లో నిరర్థక ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. లాబాల బాట పట్టించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంనష్టాల ఊబిలో చిక్కుకొన్న డీసీసీబీకి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీ చేసే ఏర్పాటు చేసింది. ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచ్చింది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో గణనీయమైన నికర ఆదాయం పొందింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10కోట్లు లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చింది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా వరుసగా రెండేళ్లు అవార్డు కూడా అందుకుంది. నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీననమైన బ్యాంకుగా రికార్డు నమోదు చేసుకోవడం గమనార్హం. వేలంలో ఆస్తుల విక్రయానికి డీసీసీబీ చర్యలు ఈ నెలలోనే వేలంపాట.. గ్రామాల్లో దండోరా -
గాలేరులో పెరుగుతున్న నీటి ప్రవాహం
పాణ్యం: గాలేరు నగరి సుజలస్రవంతి కాల్వలో నీటి ప్రవా హం పెరుగుతోంది. గోరుకల్లు నుంచి బ్యాక్ వాటర్ను తాగునీటి కోసం అవుకు జలాశయానికి తరలిస్తున్నారు. అయితే ఆదివారం గాలేరు గేట్లను తాకిన నీరు సోమవారం వెయ్యి క్యూసెక్కులకు పెరిగింది. బానకచెర్ల నుంచి ప్రస్తుతం ఇన్ఫ్లో 5 వేల క్యూసెక్కులు కాగా గోరుకల్లులో 5.50 టీఎంసీలు నిల్వ ఉండేలా చూస్తూ ఆపై వచ్చిన నీటిని యథావిధిగా గాలేరు కాల్వ ద్వారా అవుకు తరలిస్తున్నారు. అయితే ఎస్సార్బీసీ కాల్వ ద్వారా తరలించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
ఆశ్రిత జనపాల.. అశ్వత్థ బృందలోల
● ఉరుకుంద క్షేత్రంలో పోటెత్తిన భక్తజనం ● వేకువ జామునే దర్శనాల కోసం క్యూ మంత్రాలయం: అశ్వత్థ వృక్షంలో లీనమై ఆశ్రిత జనపాలకుడిగా ఉరుకుంద నరసింహా ఈరన్న స్వామి వర్ధిల్లుతున్నారు. ఇష్టదైవాన్ని కొలిచేందుకు భక్తజనం పోటెత్తుతున్నారు. మొదటి సోమవారం రెండు లక్షల మందికి పైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. ఎంతో పవిత్రంగా స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో క్షేత్రం శోభిల్లింది. దర్శన క్యూలైన్లు, స్నానపు ఘాట్లు, అన్నదాన సత్రం, ప్రసాద, తలనీలాల కౌంటర్లు భక్తులతో కిక్కిరిశాయి. భక్తుల సందడితో క్షేత్ర వీధులు కనువిందు చేశాయి. విశేషంగా ఈరన్న పూజలు వేడుకల్లో భాగంగా ఈరన్న స్వామికి వేకువజామున సుప్రభాత సేవతో పూజోత్సవాలు ప్రారంభమయ్యాయి. పండితులు వేదపఠనం గావిస్తూ నిర్మల్య విసర్జన, జల, విశేష పంచామృతాభిషేకంతోపాటు పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కానిచ్చారు. నైవేద్య సమర్పణ, మహా మంగళహారతులు పట్టి పూజోత్సవాలు చేపట్టారు. పూజలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శనాలకు నిరీక్షణ ఇలవేల్పును కొలిచేందుకు భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వేకువజామున 3 గంటల నుంచే భక్తులు దర్శన క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. రెండు గంటల పాటు క్యూలైన్ల గేట్లు తెరవలేదు. దీంతో నిరీక్షణలో ఉన్న భక్తులు అసహనానికి లోనయ్యారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రాతఃకాలంలోనే దర్శనాలకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే అధికారులు ఉదయం 5 గంటలకు తలుపులు తెరవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కాసేపు గేట్ల వద్ద తోపులాట చోటుచేసుకుంది. భక్తులు స్థానిక ఎల్లెల్సీ కాలువలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనాలకు వెళ్లారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారు. భక్తులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరిపడా శౌచాలయాలు లేకపోవడంతో క్యూ కట్టాల్సి వచ్చింది. కొందరు తాగునీటి ట్యాంకులతోనే స్నానాలు కానిచ్చారు. మరికొందరు ట్యాంకులపైకి ఎగబాకి స్నానాలు చేసిన దృశ్యాలు కనిపించాయి. -
హామీల అమలులో కూటమి విఫలం
నంద్యాల(న్యూటౌన్): ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ సోమ వారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల కాలంలో దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందన్నారు. పెట్రోల్, డీజిల్ నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలన్నారు. నంద్యాల జిల్లాకు రూ.25 వేల కోట్లు ప్రత్యే క ప్యాకేజీ కేటాయించాలని, ఇందుకు జిల్లా నేతలు గళం విప్పాలని కోరారు. కరోనా సందర్భంగా రద్దయిన రైళ్లను వెంటనే పునఃప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జిల్లాలో సీడ్హబ్ను ఏర్పాటు చేయాలని, అలగనూరు రిజర్వాయర్ను వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమ, పవర్గ్రిడ్, సోలార్ పరిశ్రమల్లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్బాబు, రఘురామ్మూర్తి, భార్గవ్, భాస్కర్, రాముడు, నాగరాముడు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మిదేవి, రజిత, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. మోదీ అసమర్థ పాలనతో దేశంలో ఆర్థిక సంక్షోభం సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య -
బైక్పై నుంచి పడి మహిళ మృతి
నందికొట్కూరు: నేషనల్ హైవే – 340సీ లో బైక్పై వెళ్తూ పట్టణ సమీపంలోని డిగ్రీ కళాశాల వద్ద ప్రమాదవశాత్తు కింద పడి కృష్ణవేణి (39) అనే మహిళ మృతి చెందింది. ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎం.చెన్నయ్య తెలిపిన వివరాలు.. కృష్టవేణి దంపతులు నందికొట్కూరు పట్టణంలోని ట్యాంకు ఏరియాలో నివాసం ఉంటున్నారు. మండల పరిధిలోని కోళ్లబావాపురం గ్రామానికి పని నిమిత్తం వెళ్లి బైక్పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కృష్ణవేణి ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స చేస్తుండగానే ఆమె మృతి చెందింది. తల్లి మానవపాటి రాములమ్మ ఫిర్యాదు మేరకు భర్త శివమల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని హెడ్ కానిస్టేబుల్ చెప్పారు. వివాహిత బలవన్మరణం నందికొట్కూరు: పట్టణంలోని వాల్మీకి నగర్కు చెందిన బోయ శివకుమార్ భార్య రమాదేవి (ప్రియ) (20) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మృతి చెందింది. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ మండలం కొన్నేరు గ్రామానికి చెందిన రమాదేవికి నందికొట్కూరుకు చెందిన శివకుమార్తో రెండున్నరేళ్ల క్రితం వివాహం అయ్యింది. దంపతల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని టౌన్ సీఐ అశోక్కుమార్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. మృతురాలికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నారు.ఇదిలాఉండగా తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, చంపేశారనే అనుమానాలు ఉన్నాయని మృతురాలి తండ్రి నాగరాజు బోరున విలపించారు. చర్చి ఫాదర్ దుర్మరణం ● ప్రార్థనలు చేసేందుకు బైక్పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం జూపాడుబంగ్లా: బైక్ను ట్రాక్టర్ ఢీకొనటంతో చర్చి ఫాదర్ మృతి చెందగా అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలుకు చెందిన దాసరి శేషు(55) భాస్కరాపురం గ్రామంలోని ఏబీఎం చర్చి ఫాదర్గా పనిచేస్తున్నారు. ఆదివారం చర్చిలో ప్రార్థనలు నిర్వహించేందుకు ఫాదర్, అతని భార్య జ్యోతి భాస్కరాపురం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని మసీదు సందులోంచి చర్చి వద్దకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన శివచెన్నయ్య కుమారుడు శివాజీ నంబర్ లేని స్వరాజ్ ట్రాక్టర్ను అతివేగంగా నడుపుతూ ఎదురుగా వచ్చిన ఫాదర్ బైక్ను ఢీకొట్టాడు. ప్రమాదంతో కింద పడిపోయిన ఫాదర్ దాసరి శేషుకు తల, ముక్కు, కాలికి తీవ్రగాయాలు కాగా అతని భార్య జ్యోతికి కుడి కాలికు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మధ్యాహ్నం చర్చి ఫాదర్ దాసరి శేషు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. -
ఐటీడీఆర్ పనుల పరిశీలన
డోన్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐటీడీఆర్) పనులను రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ డాక్టర్ సుందర్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్రెడ్డి సోమవారం పరిశీలించారు. డోన్ మండలం కొత్తకోట గ్రామం వద్ద 10 ఎకరాల స్థలంలో రూ.2 కోట్ల వ్యయంతో ఈ సెంటర్ భవనాల పనులను గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం 90 శాతం పూర్తి చేసింది. మిగిలిన 10 శాతం పనుల పురోగతిపై డాక్టర్ సుందర్రెడ్డి ఆర్అండ్బీ అధికారులతో చర్చించారు. పనులు నాణ్యతగా చేపట్టాలన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే ఏటా వందలాది మంది నిరుద్యోగులకు డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వడమే కాక భారీ వాహనాలు నడిపే వారి కొరత దేశంలో తీరుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆర్అండ్బీ డీఈ మదనగోపాల్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కాంత్రి కుమార్ ఉన్నారు. -
ఇబ్బందులు పడుతున్నాం
ఈ ఏడాది ఇంతవరకు గ్రాంటు రాలేదు. ప్రతి పనికి చేతి నుంచి పెట్టుకో వాల్సి వస్తోంది. ఇప్పటికి చేతి నుంచి ఒక్కొ క్కరు రూ.3 వేల దాక పెట్టుకున్నారు. పాఠశాలకు వచ్చేది అంతా నిరుపేదలే. వారికి అన్ని ఉచితంగానే సమకూర్చాలి. నిధులు ఒక్క రూపాయి కూడా రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – రమణయ్య, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాఠశాలలు తెరిచి రెండు నెలలు దాటిపోతోంది. ఇంత వరకు మెయింటెనెన్సు గ్రాంటు రూపాయి కూడా రాలేదు. గత రెండు విద్యా సంవత్సరాల్లో సైతం సగం నిధులు మాత్రమే ఇచ్చారు. అన్ని గ్రాండ్గా నిర్వహించాలని ఆదేశాలు ఇస్తారు వాటి నిర్వహణకు చాలా ఖర్చు అవుతోంది. నిధులు లేకుండా ఎలా నిర్వహించాలి. ఇప్పటికై నా నిధులు వెంటనే విడుదల చేయాలి. – ఐజయ్య, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ -
భూ సేకరణ వేగవంతం చేయండి
డోన్: గుంటూరు – గుంతకల్ రైల్వే డబ్లింగ్, విద్యు ద్దీకరణ పనులకు అవసరమైన భూ సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ డివిజనల్ అధికారి నరసింహులును ఆదేశించారు. సోమవారం ఆమె డోన్ మండలం దొరపల్లె గ్రామం వద్ద భూసేకరణను పరిశీలించారు. గుంతకల్ రైల్వే మార్గంలో 47 కి.మీ మేర సేకరించిన భూముల వివరాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. భూసేకరణలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు, రహదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఆనంద్, డోన్ తహసీల్దార్ రవికుమార్ ఉన్నారు. -
అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): ఉన్నత విద్య అభ్యశించే విద్యార్థినులు అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులకు సంవత్సరానికి రూ.30 వేలు మంజూరవుతుందన్నారు. ఈ స్కాలర్షి ప్ అర్హత పొందాలంటే విద్యార్థిని 10, 12వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, ప్రైవేటు కళాశాలలో అయితే డిగ్రీ, డిప్లమా అభ్యసిస్తూ ఉండాలన్నారు. డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలు తమ పరిధిలో ఉన్న డిగ్రీ, డిప్లమా, ఇంజినీరింగ్ కళాశాలల్లో డిగ్రీకి సమానమైన ఇతర కోర్స్లను అందించే విద్యాసంస్థలకు ఈ స్కాలర్షిప్పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. స్కాలర్షిప్నకు పోర్టల్లోని క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలన్నారు. డ్రంకన్ డ్రైవ్లో ముగ్గురికి జైలు డోన్ రూరల్: డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష పడింది. పట్టణంలోని కొండపేటకు చెందిన బోయ సునీల్, విజయ్ కుమార్కు 8 రోజులు, చాకలి గోపాల్కు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ సోమవారం డోన్ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు టౌన్ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. పీజీఆర్ఎస్కు 112 వినతులు బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారుల నుంచి 112 వినతులు అందాయి. జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు. చట్టపరిధిలో ఉన్న అన్ని సమస్యలను ఆయా స్టేషన్ అధికారులు పరిష్కరించాలని, సమస్యలు తిరిగి పునరావృతమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సివిల్ తగాదాలు ఏవైనా ఉంటే బాధితులకు నచ్చజెప్పి కోర్టును ఆశ్రయించేలా చూడాలన్నారు. ఉత్తమ పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు నంద్యాల(న్యూటౌన్): స్కూల్ ఆఫ్ స్సోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుల కోసం జిల్లాలో ఐదు ఉత్తమ పాఠశాలల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్దన్రెడ్డి సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 29న మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదు ఉత్తమ పాఠశాలలకు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక అవుతాయన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో పాఠశాలలో సాధించిన ప్రదర్శన, అత్యున్నత విజయాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయాలన్నారు. ఈనెల 20వ తేదీన దరఖాస్తులకు చివరి తేదీ అని వివరించారు. -
ప్రోటోకాల్ దర్శనాలు.. ఆన్లైన్లో కష్టాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం ఇటీవల దేవస్థాన వెబ్సైట్లో ప్రోటోకాల్ మాడ్యూల్లో మార్పులు చేసి ఈ నెల 15వ తేదీ నుంచి ఆ మేరకు దర్శనాలకు శ్రీకారం చుట్టారు. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు ప్రోటోకాల్ మాడ్యూల్తో అవస్థలు తప్పడం లేదు. శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనానికి విచ్చేసే వీవీఐపీ, వీఐపీలు, సిఫార్స్ లేఖలతో దర్శనాలకు వచ్చే వారు 48 గంటల ముందు లెటర్ పంపాలని దేవస్థానం సూచించింది. టీటీడీ తరహాలో ఆన్లైన్ ద్వారానే మల్లన్న స్పర్శదర్శనం టికెట్ల లింక్ భక్తుల మొబైల్కు వెళ్లేలా ఏర్పాట్లు చేశామని, భక్తులే నేరుగా వారి మొబైల్ ఫోన్ నుంచి యూపీఐ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసి, టికెట్లను ప్రింట్ తీసుకుని దర్శనానికి రావాలని దేవస్థానం సూచించింది. అయితే ప్రోటోకాల్ మాడ్యూల్ సరిగ్గా పనిచేయకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం 35 వీఐపీ లెటర్లు వస్తే అందులో 30 లేఖలకు పేమెంట్ అవ్వలేదని సమాచారం. అలాగే ఆదివారం 15 లేఖలను అప్లోడ్ చేస్తే అందులో ఒక్కటి మాత్రమే పేమెంట్ కాగా.. మిగిలిన 14 లేఖలకు పేమెంట్ మోడ్ రాలేదని సమాచారం. సోమవారం కూడా పలువురు వీఐపీల నుంచి వచ్చిన సిఫార్స్ లేఖలను వెబ్సైట్లో కాల్ సెంటర్ సిబ్బంది అప్లోడ్ చేసినప్పటికీ భక్తులకు టికెట్ల లింక్ వెళ్లకపోవడం గమనార్హం. లింక్ పోయిన వారికి పేమెంట్ మోడ్ రావడం లేదు. లింక్ పోయి, పేమెంట్మోడ్ వచ్చిన వారికి కూడా టికెట్లలో దర్శన తేదీ, దర్శన సమయం కనిపించడం లేదు. దీంతో వారికి గతంలో మాదిరిగానే కౌంటర్ల వద్దకు పిలిపించుకుని మాన్యువల్ టికెట్లను అందిస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రోటోకాల్ మాడ్యూల్ను సిద్ధం చేసిన తరువాత భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, అలా కాకుండా భక్తులను ఇబ్బంది పెట్టడం తగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాఉంటే గతంలో దేవస్థానానికి ఉచితంగా వెబ్సైట్ చేస్తామని ముందుకొచ్చిన 9 అండ్ 9 సాఫ్ట్వేర్ కంపెనీని తొలగించి.. గతంలో సాఫ్ట్వేర్ను అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడిన ఏపీటీఎస్ టీఎంఎస్ సాఫ్ట్వేర్కు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. పూర్తిగా సిద్ధం కాని ప్రోటోకాల్ మాడ్యూల్ భక్తులకు చేరని టికెట్ల లింక్, వెళ్లినా.. పేమెంట్లో జాప్యం టికెట్లపై కనిపించని దర్శన సమయం -
మార్చురీలో రాబందులు
కర్నూలు(హాస్పిటల్): అనాథ శవాలను రాబందులు పీక్కుతింటాయి. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు అక్కడి వైద్యులు, సిబ్బంది బాధిత కుటుంబసభ్యులను డబ్బు కోసం పీడిస్తున్నారు. చేతిలో పచ్చనోట్లు పడితేనే పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమవుతుంది. అడిగిన మేర డబ్బులు ఇవ్వకపోతే కేసును ఎక్కడ వ్యతిరేకంగా రాస్తారోనని భయపడి డబ్బులు ఇచ్చి పనిచేయించుకుని వెళ్తున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోజూ 18 నుంచి 20 మంది దాకా వివిధ కారణాలతో మరణిస్తుంటారు. ఇందులో నాలుగు నుంచి ఐదు దాకా మెడికో లీగల్ కేసులు ఉంటాయి. ఇలాంటి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది. మరణించినప్పటి నుంచే వసూళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణిస్తే, మృతదేహాన్ని మార్చురీకి తరలించేందుకు కింది స్థాయి సిబ్బందికి మామూళ్లు ఇచ్చుకోవాలి. ఆయా వ్యక్తుల స్థాయిని బట్టి రూ.200 నుంచి రూ.500 వసూలు చేస్తారు. ఆ తర్వాత పోలీసులు పంచనామా రాస్తారు. దీంట్లో కొందరు పోలీసులు వసూళ్లకు పాల్పడుతున్నారు. మృతుడి వివరాలు, జరిగిన ఘటన వంటివన్నీ అందులో పేర్కొంటూ ఒక నివేదిక తయారు చేస్తారు. ఉన్నది ఉన్నట్లు రాస్తే ఒక రేటు, బాధిత కుటుంబీకులకు ఇబ్బంది లేకుండా రాస్తే మరొక రేటు ఉంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసును బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టజెప్పాల్సి వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం పోస్టుమార్టం సామగ్రి తేవాలని సిబ్బంది రూ.1500 నుంచి రూ.2 వేల దాకా వసూలు చేస్తారు. పోస్టుమార్టం జరుగుతుండగానే డాక్టర్లకు ఇవ్వాల్సి ఉంటుందని రూ.3 వేల నుంచి రూ.5 వేల దాకా వసూలు చేస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం జరిగిన పలు పోస్టుమార్టంల విషయంలోనూ ఇదే విధంగా వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు వీడియో, ఆడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మార్చురీలో ఎవరైనా మృతుల కుటుంబీకుల నుంచి డబ్బులు వసూలు చేశారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డాక్టర్ల పేరు చెప్పి కొందరు పోలీసులు వసూలు చేస్తున్నారని తెలిసింది. పోలీసులు వసూలు చేస్తే మేమేమీ చేయలేం. సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. – డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రిన్సిపాల్, కర్నూలు మెడికల్ కాలేజీ డబ్బులివ్వందే పోస్టుమార్టం జరగదు మృతుల కుటుంబీకుల నుంచి బలవంతంగా వసూళ్లు -
మహానేత విగ్రహంపై దుశ్చర్య
● కళ్లకు గంతలు కట్టి.. నల్లరంగు పూసి ● ఆళ్లగడ్డలో హైఅలర్ట్ ఆళ్లగడ్డ: ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వైఎస్సార్ విగ్రహం ముఖానికి గుడ్డ కట్టి, విగ్రహం అంతా నల్లటి రంగు (కందెన) పూసి తమ కుటిల బుద్ధిని బయటపెట్టుకున్న ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి అనంతరం ఈ దుశ్చర్యకు పాల్పడగా సోమవారం తెల్లవారు జామున వాకింగ్కు వచ్చిన స్థానికులు కొందరు ఈ దృశ్యాన్ని చూసి షాక్కు గురయ్యారు. వెంటనే విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చారు. అంతలోనే సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమై తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహానేతను అవమానించడం క్షమించరాని నేరమన్నారు. ఇది విగ్రహంపై జరిగిన దాడికాదని.. కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. విగ్రహానికి నల్లరంగు పూసినంత మాత్రన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత ప్రతిష్ట ఏమాత్రం మసకబారదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఘటన వెనుక రాజకీయ కుట్ర కోణంపై సమగ్ర దర్యాపు జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితుడికి రిమాండ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ విగ్రహం ముఖానికి గుడ్డ కట్టి, నల్ల రంగు పూసిన ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఘటనపై వైఎస్సార్ సీపీ నాయకుడు సుధాకర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనకు పాల్పడింది పట్టణ శివారులోని చింతకుంట గ్రామానికి చెందిన రమణారెడ్డిగా గుర్తించామన్నారు. నంద్యాలోని ఓ హోటల్లో ఉండగా అదుపులోకి తీసుకుని నల్ల రంగు బాటిల్, ఒక సుత్తి, ఉలి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. నిందితుడు వీటిని అమేజాన్లో కొనుగోలు చేసినట్లు వెల్లడైందన్నారు. కేవలం విగ్రహ ధ్వంసమే కాకుండా రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతల కు విఘాతం కలిగించే చర్యగా విచారణలో గుర్తించామన్నారు. విలేకరుల సమావేశంలో ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ నాగరాజారావు పాల్గొన్నారు. -
రూ. 25 లక్షలు దుర్వినియోగం?
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో రూ.25 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలున్నాయి. ఈ బండారం బయట పడుతుందని గతంలో ఇన్చార్జ్ ఈఓగా పని చేసిన ఓ అధికారిణి.. ఆమె స్థానంలో బదిలీపై ఈఓగా వచ్చిన సబియాకు నెల రోజులు గడిచినా పూర్తి బాధ్యతలు అప్పగించడం లేదు. గత నెల జూలై 13వ తేదీన సబియా ఈఓగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆమె డిజిటల్ కీ, లాగిన్ అప్పగించ లేదు. పూర్తి బాధ్యతలు అప్పగించడంలో జాప్యం చేస్తుండటంతో అనుమానాలు రెకెత్తుత్తున్నాయి. ఏప్రిల్ నెల నుంచి వివిధ పన్నుల ద్వారా పంచాయతీకి వచ్చిన ఆదాయాన్ని చలానా కట్టి పంచాయతీ ఖాతాలో జమా చేయకుండా దుర్వినియోగం చేసినట్లు సమాచారం. అక్రమాలు వెలుగు చూడకుండా దాచి పెట్టేందుకు చార్జ్ అప్పగించడం లేదనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సబియా నాలుగు రోజుల క్రితం తనకు పూర్తి స్థాయి చార్జ్ అప్పగించాలని ప్రత్యేక అధికారి తాహెర్ హుస్సేన్కు వినతి పత్రం అందజేశారు. చాగలమర్రి పంచాయతీలో పన్ను వసూలు పక్కదారి ఈఓకు చార్జ్ అప్పగించని ఇన్చార్జ్ అధికారిణి అక్రమాలు వెలుగుచూడకుండా దాచిపెడుతున్న వైనం -
సమాజ మార్పులో జర్నలిస్టుల పాత్ర కీలకం
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యలు, లోపాలు, దాగిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. సోమవారం వెంకటరమణ కాలనీలోని కీర్తన అనాథ శరణాలయంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ నిర్వహించిన 70వ ఆవిర్భావ దినోత్సవానికి కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఏపీయూడబ్ల్యూజే జెండాను సీనియర్ పాత్రికేయులు జీ.చంద్రశేఖర్ ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ పరిధిలో ఉన్నవి తమ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి నగరపాలక సంస్థ తరఫున సాధ్యమైనంత వరకు కృషి చేస్తామన్నారు. అనంతరం అనాథ శరణాలయం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, చిన్నారులకు తినిపించారు. అలాగే పిల్లలకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఇండియా జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్.రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరంట్ల కొండప్ప, సీనియర్ జర్నలిస్ట్ జి.చంద్రశేఖర్, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కే.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి అంజి పాల్గొన్నారు. -
మద్యం మత్తులో మృత్యు క్రీడ
బ్రహ్మంగారిమఠం/డుంబ్రిగుడ: మద్యానికి బానిసలై ఒకడు సోదరుడిని హతమార్చగా... మరొకడు కన్నతండ్రిని, ఇంకొకడు భార్యను హత్య చేశాడు. ఈ ఘటనలు వైఎస్సార్ కడప, అల్లూరి, నంద్యాల జిల్లాల్లో జరిగాయి. వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని తెలుగుగంగ రోడ్డులో ఉంటున్న హైమావతికి ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు వెంకటసుబ్బయ్య (45)కు వివాహమైంది. ఇతడికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిస కావడంతో భార్య పిల్లలు ఇతన్ని వదిలి వెళ్లిపోయారు. చిన్నకుమారుడు సురేష్ కూడా మద్యానికి అలవాటు పడడంతో భార్య, ఇద్దరు పిల్లలు విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు అన్నదమ్ములు తల్లి దగ్గరే ఉంటున్నారు. శనివారం రాత్రి సురేష్ చికెన్ పకోడి తెచ్చుకున్నాడు. శనివారం చికెన్ తేవద్దని అమ్మ నాకు చెబుతూ ఉండేదని, నువ్వు ఎందుకు తెచ్చుకున్నావని వెంకటసుబ్బయ్య మద్యం మత్తులో చికెన్పకోడీ, సురేష్ భార్య గురించి అవహేళనగా మాట్లాడాడు. అది మనసులో పెట్టుకున్న సురేష్ ఆదివారం వెంకటసుబ్బయ్య మద్యం తాగి, భోజనం చేసి మంచంపై నిద్రిస్తుండగా గొడ్డలితో తలపై కొట్టాడు. తల్లితో వాడు చచ్చాడో లేదో చూడుపో అన్నాడు. బయట ఉన్న తల్లి హైమావతి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు సురే‹Ùను పోలీసులు అదుపులోకి తీసుకుని. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కర్రతో భార్యను హతమార్చిన భర్త మరో ఘటనలో అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం కొర్ర పంచాయతీ శెట్టిబంద గ్రామానికి చెందిన గెమ్మెలి కామయ్య మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. శనివారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య గెమ్మెలి కోమలి (40)తో గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరి కోట్లాటకు దారి తీసింది. మత్తులో ఉన్న కామయ్య విచక్షణ కోల్పోయి ఆగ్రహంతో భార్య మెడపై, శరీరంపై కర్రతో బలంగా మోది హత్య చేసి పరారయ్యాడు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.తండ్రిని చంపిన కొడుకు బేతంచెర్ల: కొడుకు దాడి చేయడంతో తండ్రి మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆకుల శివకుమార్(49) తరచూ మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. శనివారం రాత్రి ఫూటుగా మద్యం తాగి ఇంటికి వచి్చ, భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై దాడి చేస్తుండగా కుమారుడు శరత్ కుమార్ అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో క్షణికావేశానికి గురైన శరత్ కుమార్ తండ్రిపై కట్టెతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుని తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. -
పరిహారం అందక..
ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన ఎం.జాకీర్కు సొంత భూమి ఐదు ఎకరాలు ఉండగా... 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. టమాట, పత్తి, కంది వంటి పంటలు సాగు చేయగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో అన్నీ దెబ్బతిన్నాయి. అప్పులు పెరిగిపోవడంతో 2024 అక్టోబరు 26న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యను త్రీమెన్ కమిటీ నిర్ధారించింది. జిల్లా కలెక్టర్ ద్వారా పరిహారం కోసం ప్రతిపాదనలు పంపగా.. వ్యవసాయ శాఖ కమిషనరేట్లో పెండింగ్లో ఉంది. ఈయనకు భార్య సుబాన్బీ, కుమార్తె సాదియా(13), కుమారుడు మస్తాన్వలి(8) ఉన్నారు. పిల్లలను పోషించుకోవడానికి తల్లి పడుతున్న కష్టాలు దయనీయంగా ఉన్నాయి. -
బసవన్నా.. లేచి రంకె వేయన్నా!
కర్నూలు కల్చరల్: బనగానపల్లె మండలంలోని యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ ఆలయ నిర్మాణం అద్భుతం. ఆలయ సందర్శనకు, యాగంటి బసవన్నను చూడడానికి మన రాష్ట్రంలోని భక్తులతో పాటు దేశ, విదేశాల నుంచి సైతం ప్రజలు వస్తుంటారు. సెంట్రల్ ఆర్కియాలజీ పరిధిలో ఆలయం ఉంది. ఆలయంలో ఎలాంటి నిర్మాణ పనులు, మరమ్మతులు చేపట్టాలన్నా, ఆలయ ఆవరణ చుట్టూ 300 మీటర్ల పరధిలో పనులు చేయాలన్నా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతి తప్పని పరిస్థితి. ఇదంతా బాగానే ఉన్నా.. ఇటీవల ఆలయ పరిసర ప్రాంతంలో గదులు, నిత్యాన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్ తదితర పనులు జరగుతున్నాయి. ఆలయ అభివృద్ధిలో భాగంగానే వివిధ రకాలు పనులు చేపట్టామని దేవదాయశాఖ అఽధికారులు చెబుతున్నా ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధి, మంత్రి అండదండలతోనే సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. అధికార బలంతో నిబంధనలను తుంగలో తొక్కి పనులు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. పిటిషన్ వేసిన రైతులు యాగంటి దేవాలయంలో బ్లాస్టింగ్, డ్రిల్లింగ్, ఆలయ నిర్మాణంలో మార్పులు/ రెనోవేషన్ పనులు సంబంధిత అఽధికారుల అనుమతులు లేకుండా చేస్తున్నారని ఆ ప్రాంతానికి చెందిన నలుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా పురాతన ఆలయ నిర్మాణంలో మార్పులు చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ఆలయంలో జరుగుతున్న నిర్మాణ, మార్పుల పనులను పరిశీలించాలని, అవసరమైన అనుమతులు లేకుండా పనులు చేయకుండా చేడాలని, ఏఎమ్ఏఎస్ఆర్ యాక్ట్, ఏపీ ఎండోమెంట్ యాక్ట్ కింద ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవాలని, దీంతో పాటు అదనంగా కేసు తుది నిర్ణయం వచ్చే వరకు గర్భగుడిలో నిర్మాణ పనులు చేయకూడదని, ఆలయం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్లాస్టింగ్, డ్రిల్లింగ్ చేయకూడదని మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఆలయం అధికారులు తాము ఆలయాన్ని ధ్వంసం లేదా బ్లాస్టింగ్ చేయడం లేదని భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కొన్ని మార్పులు మాత్రమే చేశామని కోర్టుకు తెలిపారు. అయితే ఆ పనులకు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు, ఆమోదాలు తీసుకున్నట్లు ఆధారాలు లేవని కోర్టు రికార్డుల్లో ఉంది. అలాగే అప్పటికే పనులన్నీ పూర్తయ్యాయని, ప్రస్తుతం జరగడం లేదని ఆలయం తరుపు అధికారులు తెలిపారు. యాగంటీశ్వరాలయం అభివృద్ధిలో భాగంగానే నిర్మాణ పనులు చేపడుతున్నాం. రెండింటికి మాత్రమే కోర్టు స్టేటస్కో ఉంది. అయినా పరిపాలన, టెక్నికల్ అనుమతులతోనే పనులు చేపట్టాం. త్వరలోనే నిత్యాన్నదానాన్ని ప్రారంభించనున్నాం. అందు కోసం రూ.1.25 కోట్లతో నిత్యాన్నదాన సత్రం నిర్మిస్తున్నాం. భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నాం. – పాండురంగారెడ్డి, ఇన్చార్జ్ ఈఓ, యాగంటీశ్వరాలయం హైకోర్టు స్టేటస్కో ఉన్నప్పటికీ.. రైతుల పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆలయం అధికారుల వాదనను విన్న తరువాత మే 4న ఉన్న పరిస్థితినే (స్టేటస్ కో) తదుపరి విచారణ తేదీ వరకు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి అక్కడ పనులు జరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. హైకోర్టు స్టేటస్ కో, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి నోటీస్లు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు రాత్రిపూట చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. యాగంటీశ్వర ఆలయ ఆవరణలో అడ్డదిడ్డంగా నిర్మాణ పనులు ఆలయం ప్రాశస్త్యం దెబ్బతింటుందని పిటిషన్ వేసిన భక్తులు హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు ఉన్నా నిర్మాణ పనులు రాత్రిళ్లు సైతం కొనసాగుతున్న వైనం స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్న ఆలయ ఈవో -
మల్లన్న సేవలో..
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆదివారం మల్లన్న దర్శనార్థం ఆల యం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. పీఠాధిపతి భక్తులకు అనుగ్రహభాషణ చేశారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల(అర్బన్): స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 17వ తేదీ సోమ వారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నా రు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులు స్వీకరించారు. ఘనంగా బాలవీరాచారి శత జయంతి వేడుకలు ఆళ్లగడ్డ: తెలుగు నేలపై శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పిన ప్రసిద్ధ మహాశిల్పి దివంగత దురుగడ్డ బాలవీరాచారి శత జయంతి వేడుకలు ఆదివారం ఆళ్లగడ్డలో వైభవంగా నిర్వహించారు. స్థానిక శారదా శిల్పకళా మందిరం ఆవరణలో జరిగిన ఈ ఉత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి భారీగా శిల్ప కళాకారులు, కళాభిమానులు హాజరై ఆయనకు నివాళులర్పించారు. శిల్ప కళకు తొలినాళ్లలో ఆయన చేసిన సేవ, కృషిని కొనియాడారు. ఆళ్లగడ్డ పేరును ప్రపంచ శిల్పకళా పటంలో నిలిపిన ఘనత బాలవీరాచారికే దక్కుతుందన్నారు. అనంతరం మహాశిల్పి దురుగడ్డ బాలవీరాచారి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన జీవిత విశేషాలు, శిల్పకళా ప్రస్థానాన్ని వివరిస్తూ తెచ్చిన ఈ పుస్తకం నేటి తరం యువ శిల్పులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు అన్నారు. గాలేరుకు నీటి విడుదల పాణ్యం: గోరుకల్లు జలాశయం నుంచి జీఎన్ఎస్ఎస్ (గాలేరునగరి సుజల స్రవంతి) కాల్వలకు అధికారులు ఆదివారం కాల్వకు నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఈఈ శివప్రసాద్ మాట్లాడుతూ అవుకు జలాశయానికి నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. గోరుకల్లు జలాశయంలో 5.5 టీఎంసీలు నిరునిల్వ ఉండగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి 5 వేల క్యూసెక్కులు వస్తున్నట్లు తెలిపా రు. ఉదయం గేట్లు ఎత్తగా సాయంత్రానికి నీరు గేట్లును తాకినట్లు తెలిపారు. పై నుంచి వచ్చిన నీటిని దిగువకు పంపుతున్నట్లు తెలిపారు. నూర్బాషా విభాగం జిల్లా అధ్యక్షుడిగా దస్తగిరి కొలిమిగుండ్ల: బెలుం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దూదేకుల దస్తగిరి జిల్లా నూర్బాషా(దూదేకుల) విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడులైంది. అనుబంధ విభాగాల కమిటీలో చోటు కల్పించడంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి దస్తగిరి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. -
మొలకెత్తిన మోసం!
దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన అక్కల రవి భూములను కౌలుకు తీసుకొని పత్తి విత్తనోత్పత్తి చేపట్టాడు. పంట పండక మానసికంగా దెబ్బతిని 2024 డిసెంబరులో మృతి చెందాడు. తండ్రి మృతి, కొండలాగా ఉన్న అప్పుల బాధలు భరించలేక అక్కల రవి కుమారుడు కరుణాకర్ 2025 మార్చి 4న పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధలు తండ్రి, కుమారులను బలి తీసుకున్నాయి. ఒకవైపు భర్త, మరోవైపు చేతికి వచ్చిన కుమారుడు మరణించడంతో అక్కల రవి భార్య అక్కల రాణి ఒంటరిగా మిగిలిపోయారు. కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయం కలసిరాక.. అప్పుల తీర్చే మార్గం కనిపించక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీరి కుటుంబాలు వీధిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో 116 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాలను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాని చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవడంలో చేతులెత్తేసింది. రైతు ఆత్మహత్యలపై మండల స్థాయి అధికారులైన సబ్ ఇన్స్పెక్టర్, తహసీల్దారు, వ్యవసాయ అధికారి ధ్రువీకరిస్తూ ప్రాథమిక రిపోర్టులు పంపిస్తారు. దీనిపై త్రీమెన్ కమిటీ విచారణ జరుపాలి. త్రీమెన్ కమిటీలో ఏడీఏ, ఆర్డీవో, డీఎస్పీలు ఉంటారు. త్రీమెన్ కమిటీ సైతం రైతులు ఆత్మహత్యలను ధ్రువీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ ద్వారా నివేదికలు వ్యవసాయ శాఖ కమిషనర్కు పంపుతున్నారు. ఈ నివేదికలన్నీ వ్యవసాయ శాఖ కమిషనర్ దగ్గర మరుగున పడిపోతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2024 జూన్ తర్వాత 116 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే ఒక్క కుటుంబానికి కూడా పరిహారం చెల్లించలేదు. నాటి పరిస్థితులే నేడు ‘వ్యవసాయం ఎందుకు దండగ’ అంటూ ఒకప్పుడు చంద్రబాబు అన్నారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత రావడంతో 2014, 2019, 2024 ఎన్నికల్లో రైతు సంక్షేమం అంటూ కొత్తపల్లవి ఎంచుకున్నారు. అయినా 2014 నుంచి 2019 వరకు 321 రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ పరంపర 2024 జూన్ నుంచి మళ్లీ ఊపందుకుంది. అనావృష్టితో 2024–25లో, అతివృష్టితో 2025–26లో, ఎల్నీనోతో 2026–27లో వ్యవసాయం కలసి రాలేదు. చంద్రబాబు 26 నెలల పాలనలో కర్నూలు జిల్లాలో 64, నంద్యాల జిల్లాలో 52 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత వ్యవసాయం దండగ అనే మాట నిజం అవుతోందని రైతులు పేర్కొంటున్నారు. పెండింగ్లో నివేదికలు కర్నూలు జిల్లాలో 32 మంది రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉండిపోయాయి. మరో 15 మంది రైతు ఆత్మహత్యలకు సంబంధించిన నివేదికలు వ్యవసాయ శాఖ కమిషనరేట్లో పెండింగ్లో ఉండిపోయాయి. మిగిలిన 17 మంది రైతు ఆత్మహత్యలపై విచారణ మండల వ్యవసాయ అధికార, తహసీల్దారు, ఆర్డీవో దగ్గర పెండింగ్లో ఉంది. నంద్యాల జిల్లాలో 37 మంది రైతులకు పరిహారం అందించే నివేదికలు కమిషనరేట్లో పెండింగ్లో ఉండిపోయాయి. ఆర్డీవో దగ్గర ఒకటి, తహసీల్దార్ల దగ్గర 12 పెండింగ్లో ఉన్నాయి. రెండింటికి అర్హత ఉన్నా తిరస్కరించారు. చంద్రబాబుతో సహా మంత్రులు, టీడీపీ నేతల మాటల్లోనే రైతుల సంక్షేమం ఉంటుంది తప్ప చేతల్లో ఉండదనే విమర్శలు వస్తున్నాయి. మృతిచెందిన రైతుల భార్యలకు వితంతువు పింఛన్లు మంజూరు చేయాలని ప్రజా సంఘాల నేతలు సూచిస్తున్నారు. పరిహారం..పరిహాసం! టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు రైతుల ఆత్మహత్యలకు పాల్పడిన కొన్ని కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించారు. మృతిచెందిన రైతుకు చెందిన నామిని, సంబంధిత తహసీల్దారుతో ప్రారంభించిన జాయింట్ ఖాతాలో పరిహారం జమ చేసేవారు. ఇందులో కొంత మొత్తం అప్పులకు చెల్లించాలని చెప్పేవారు. మిగిలిన మొ త్తం వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. జాయింట్ అకౌంటులో ఉండటంతో తహసీలార్లు దయ చూపాల్సి వచ్చేది. అప్పట్లో ఆత్మహత్యలకు పాల్పడిన 180 కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు. వైఎస్సార్సీపీ హయాంలో భరోసాగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. మృతి చెందిన రైతు నామినీ బ్యాంకు ఖాతాకు నేరుగా పూర్తి పరిహారాన్ని జమ చేసింది. త్రీమెన్ కమిటీ రిపోర్టు అందిన నెల రోజుల్లోపే పరిహారం విడుదల అయ్యేది. ఇది రైతు కుటుంబాల్లో ఆత్మస్ధైర్యాన్ని నింపింది. అంతేగాక ఉచిత పంటల బీమా అమలు చేసి ప్రతి ఏటా పరిహారం అందించింది. పంటలకు ధరలు పడిపోయిన పక్షంలో మద్దతు ధరతో కొనుగోలు చేసింది. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. దురదృష్టవశాత్తు బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలకు మూడు నెలల్లోపే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందేది. రుణమాఫీ పేరుతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తూతూమంత్రంగా చేశారు. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకపోయారు. రైతు సంక్షేమం అంటూ 2019 ఎన్నికల్లో ఎన్నో మాటలు చెప్పినప్పటికీ చంద్రబాబును నమ్మలేదు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు సాయం అందిస్తామని 2024 ఎన్నికల్లో ప్రకటించి మోసం చేశారు. కర్నూలు జిల్లాలో పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న, ఉల్లి, మిర్చి, నంద్యాల జిల్లాలో వరి, మినుము, మొక్కజొన్న, పత్తి విత్తనోత్పత్తి, వేరుశనగ తదితర పంటలు దెబ్బతిన్నా పరిహారం ఇవ్వలేదు. అరకొర వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. కనీస మద్దతు ధరతోనైన అమ్ముకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అదీ గాక పంటల బీమా జాడే లేకుండా పోయింది. మోసం మొలకెత్తడం, అప్పులు కొండలా కనిపించడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అక్కల రాణి -
శ్రీగిరిపై శ్రావణమాస రద్దీ
● మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం శ్రీశైలంటెంపుల్: శ్రీగిరిపై శ్రావణమాసోత్సవ రద్దీ నెలకొంది. శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. శ్రావణమాస మొదటి ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. సామాన్య భక్తుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం వీఐపీ బ్రేక్ (స్పర్శ) దర్శనాలు రద్దు చేశారు. కేవలం రాత్రి వేళలలో మాత్రమే స్పర్శదర్శనాలకు అవకాశం కల్పించారు. సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఏర్పాట్లపై దేవస్థాన ఈఓ పరిశీలించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకలలాడాయి. భారీగా ట్రాఫిక్ జామ్ శ్రీశైలం: వరుస సెలవు రోజులు రావడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానిక టోల్గేట్, నంది సర్కిల్, సాక్షి గణపతి, హాటకేశ్వరం, ముఖద్వారం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. కేవలం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి సుమారు గంటపాటు వాహనదారులు నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు ఆత్మకూర్ డీఎస్పీ రామాంజి నాయక్, వన్టౌన్ సీఐ జీవన్ గంగానాథ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. మధ్యాహ్నం తర్వాత ట్రాఫిక్ క్లియర్ కావడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి. -
అప్పుల ఊబిలోకి..
దొర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామానికి చెందిన రాగుల నాగేంద్ర కౌలుకు తీసుకున్న భూముల్లో పత్తి విత్తనోత్పత్తి చేపట్టారు. పంట చేతికి రాక తలకు మించిన అప్పులు చుట్టుముట్టాయి. అప్పుల బాధతో 2024 ఆగస్టు 4న ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డులో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు భార్య లక్ష్మిదేవి, కుమారుడు నాగశేషు, కూతురు యామిని ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడంతో పిల్లల చదువులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులు చొరవ తీసుకొని నాగశేషును పదో తరగతి చదివిస్తున్నారు. రెక్కల కష్టంతో రాగుల లక్ష్మిదేవి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వానికి దయ కలగలేదు. ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. -
క్రికెట్ టోర్నమెంట్ విజేతకు బహుమతులు ప్రదానం
కర్నూలు: జ్యుడీషియల్ ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన నంద్యాల జ్యుడీషియల్ ఎంప్లాయీస్ క్రికెట్ జట్టు సభ్యులు జిల్లా జడ్జి కబర్ధి చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా జ్యుడీషియల్ ఉద్యోగులకు జిల్లాస్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో నంద్యాల జ్యుడీషియల్ టీమ్ కెప్టెన్ జి.మురళికృష్ణ, జట్టు సభ్యులు గిరిధర్, శీత్యా నాయక్, నరేష్, తాజ రాలి, శివ, గోపాల్, పృథ్వీరాజ్, రాహుల్, దేవేంద్ర, ఖలీల్, ప్రశాంత్ తదితరులు శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా జడ్జి చేతుల మీదుగా ప్రథమ బహుమతిని అందుకున్నారు. -
పెళ్లి వద్దని చెప్పడంతో..
పత్తికొండ రూరల్: ‘ఈ ఏడాది పంటలు సరిగా లేవు, పెళ్లి చేసే వయస్సు కూడా కాదు’ అని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు .. పందికోన గ్రామానికి చెందిన సంజప్ప కుమారుడు నరసింహుడు (18) ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. తనకు పెళ్లి చేయాలని కోరగా తల్లిదండ్రులు ఇప్పుడే వద్దనడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబీకులు గుర్తించి కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి జూపాడుబంగ్లా: నేషనల్ హైవే 340సీపై మండ్లెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందా డు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పారుమంచాల గ్రామానికి చెందిన సామేలు(45) ఉదయం ఆటోలో నందికొట్కూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో మండ్లెం గ్రామం నుంచి తర్తూరు అంచెవద్ద హైవే 340సీ రోడ్డును క్రాస్ చేస్తుండగా కర్నూలు వైపు నుంచి వేగంగా వచ్చిన కర్ణాటకకు చెందిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో, కారు ముందు భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఆటో డ్రైవర్ సామేలు కిందపడటంతో అతని తలకు తీవ్ర గాయం కావడంతో 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే లోపు మృతి చెందాడు. కారులో ఉన్న వారు తృటిలో ప్రాణా పాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుని భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు (టౌన్): నరసరావుపేటలో ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించిన 7వ మాస్టర్స్ అంతర్ జిల్లాల అక్వాటిక్ చాంపియన్షిప్ పోటీల్లో కర్నూలు మాస్టర్ స్విమ్మర్లు పతకాలు సాధించారు. మాస్టర్ స్విమ్మర్ గఫూర్మియ్యా 65–69 సంవత్సరాల విభాగంలో 100 మీటర్లు, 200 మీటర్ల ఫ్రీ స్టైల్ అలాగే 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు బట్టర్ ఫ్లై విభాగంలో 5 బంగారు మెడల్స్ సాధించారు. 60 నుంచి 64 సంవత్సరాల వయస్సులో రమణారెడ్డి 400 మీటర్ల ఫ్రీ స్టైయిల్లో బంగారు. 100 మీటర్ల ఫుల్ స్టైల్లో వెండి, 200 మీటర్ల ఫ్రీ స్టైయిల్లో కాంస్యం, 50 మీటర్లు, 100 మీటర్లు బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో కాంస్యం, అలాగే 35 నుంచి 39 సంవత్సరాల విభాగంలో పి.నాగర్జున 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్లో బంగారు, 100 మీటర్లు, 200 మీటర్లు ఫ్రీ స్టైల్లో వెండి, 50 మీటర్లు, 400 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన మాస్టర్స్ స్విమ్మర్లను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, డీఎస్ఏ స్విమ్మింగ్ కోచ్ నటరాజరావు, అసోసియేషన్ అధ్యక్షులు నరసింహా ఆచారి, రామకృష్ణ యాదవ్ అభినందించారు. -
తప్పుడు కేసులకు బెదిరేది లేదు
● వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దూరు సుభాష్ చంద్రబోస్ కర్నూలు (టౌన్): కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు బెదిరేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దూరు సుభాష్ చంద్రబోస్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక సి. క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అధికార మదంతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై , కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం పిరికి పంద చర్య అన్నారు. అక్రమ కేసులతో ప్రజా గళాన్ని అణిచి వేయలేరన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శాశ్వతం కాదని, చట్టాలను గౌరవించి పోలీసులు నిష్పక్ష పాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా ఎటువంటి నిరసనలు చేసినా పోలీసులు కేసు పెట్టడం లేదన్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తే కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. కర్నూలుకు తలమానికమయిన కొండారెడ్డి బురుజు పైకి వందలాది మంది ఉపాధ్యాయులు కూటమి నేతల ఫ్లెక్సీలతో నిరసనలు చేస్తే వారిపైన పోలీసులు ఎందుకు కేసులు పెట్ట లేదని ప్రశ్నించారు. అదే కొండారెడ్డి బురుజు పైకి ఎక్కి ఉంటే తమపై వెంటనే కేసులు పెట్టేవారన్నారు. ప్రజా వ్యతిరేక పాలనలో కక్ష సాదింపులు, వేధింపులు, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అజెండాగా పనిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. మంత్రాలయంలో చోరీ మంత్రాలయం రూరల్: మండల కేంద్రం మంత్రాలయం రామచంద్రనగర్లో ఓ ఇంట్లో దొంగలు పడి అందినకాడికి దోచుకెళ్లారు. హెడ్కానిస్టేబుల్ మురళీధర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. రామచంద్రనగర్లో నివసించే సి. వెంకటేష్కు నెలరోజుల నుంచి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఇంటి వద్ద ఉన్న కుమారుడు అనిల్ సైతం ఈనెల 8న ఇంటికి తాళం వేసి తండ్రి వద్దకెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లో చొరబడి ల్యాప్ట్యాప్ ,ఒన్ప్లస్ టీవీ, 20 తులాల వెండి పట్టీలు, 10,000 నగదు, బంగారు కమ్మలు ఎత్తుకెళ్లారు. ఈనెల 15న ఇంటికి రాగా తాళం చెవి తెరిచి ఉంది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. చోరీ జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఎకై ్సజ్ అధికారులకు రాష్ట్రస్థాయి అవార్డులు
ఎకై ్సజ్ డైరెక్టర్ చేతుల మీదుగా మంగళగిరిలో రాష్ట్రస్థాయి అవార్డులు అందుకుంటున్న జిల్లా అధికారులుకర్నూలు: జిల్లా ఎకై ్సజ్ శాఖలో నవోదయం 2.0 అమలు, ఆదాయ పెంపు, నేర నిరోధం వంటి కార్యక్రమాల్లో ఉత్తమ సేవలందించినందుకు గాను ఆ శాఖ జిల్లా అధికారులకు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరిలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో శనివారం అధికారులు అవార్డులను అందుకున్నారు. కర్నూలు నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ప్రొహిబిషన్ కర్నూలు జిల్లా అధికారి ఎన్.సుధీర్ బాబు మొదటి ప్రాధాన్యత కింద ఆ శాఖ డైరెక్టర్ చామకూరి శ్రీధర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డులు అందుకున్నారు. అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డిలు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అలాగే సీఐలు సువర్ణ లత, చంద్రహాస్, జాన్సైదులు, లలితాదేవి, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కిషోర్కుమార్ తదితరులు కూడా డైరెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. -
ఆకట్టుకున్న శకటాలు
స్వాతంత్య్ర దినోత్సవంలో జిల్లా అభివృద్ధిని ప్రతిబింభించేలా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రగతి శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ, మున్సిపల్ శాఖల శకటాలకు మొదటి బహుమతి లభించింది. రవాణా శాఖ, శ్రీశైలం దేవస్థానం శకటాలకు రెండో బహుమతి, ఉద్యానవన సూక్ష్మ నీటి సాగు శాఖ, శక్తి టీంలకు మూడో బహుమతి వచ్చింది. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు బహుమతులు పంపిణీ చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.నృత్యం చేస్తున్న గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి ఫరూక్ నంద్యాల(అర్బన్): రేనాటి విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నడియాడిన నేలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరి సర్వోత్తమరావును స్మరించుకుంటూ.. పెండేకంటి వెంకటసుబ్బయ్య, బీవీ సుబ్బారెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. గోసాయి వెంకన్న, వడ్డే ఓబన్న, నంద్యాల కాదర్బాద్ నర్సింగరావు, యాళ్లూరి స్వామిరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, గామాగో ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని మంత్రి ఫరూక్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేడుకలకు జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎస్పీ సునిల్షెరాన్, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, డీఆర్ఓ రామునాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ సమన్వయంగా పనిచేసి అభివృద్ధిలో నంద్యాల జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకు అంకితం కావాలన్నారు. తాగునీటి అవసరాలకే శ్రీశైలం నీరు శ్రీశైలం నుంచి వచ్చే నీటిని సాగుకు కాకుండా తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని మంత్రి అన్నారు. జిల్లాలో 293 గ్రామాల్లో రీ సర్వే, 233 గ్రామాలకు సంబంధించి 1.35 లక్షల పాసు పుస్తకాల ముద్రణ పూర్తయిందన్నారు. హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. నంద్యాలలో వైభవంగా పంద్రాగస్టు వేడుకలు జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఫరూక్ హాజరైన కలెక్టర్, జేసీ, ఎస్పీ, ప్రజాప్రతినిధులు -
డోన్ డీఎస్పీ శ్రీనివాసులుకు ఇండియన్ పోలీస్ మెడల్
డోన్: నంద్యాల జిల్లా డోన్ డీఎస్పీ శ్రీనివాసులుకు జాతీయ స్థాయిలో ఇండియన్ పోలీస్ మెడల్(ఐపీఎం)ను కేంద్రం ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలో జరిగిన వేడకల్లో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీనివాసులుకు మెడల్ను ప్రదానం చేశారు. డీఎస్పీ ఐపీఎంకు ఎంపిక కావడంపై ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ సప్తశైల రాజేష్, మాజీ వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, వైఎస్సార్సీపీ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గోరుకల్లులో 4 టీఎంసీల నీరు పాణ్యం: గోరుకల్లు జలాశయంలో 4.02 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి శనివారం ఇన్ఫ్లో 5 వేల క్యూసెక్కులు ఉందని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాగునీటి అవసరాల నిమిత్తం నీరు నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. సాంబగల్లులో చిరుత సంచారం ఆదోని: మండలంలోని సాంబగల్లు గ్రామంలో చిరుత సంచారం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొంతమంది రైతులు ఉదయం పొలాల పనులకు వెళ్లిన సమయంలో చిరుతను చూసి గ్రామంలో తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై అటవీశాఖ బీట్ ఆఫీసర్ సైఫుల్లాను వివరణ కోరగా... ఈ విషయం తమదృష్టికి రాలేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలుడి ప్రాణం తీసిన విద్యుదాఘాతం ఆలూరు రూరల్: విద్యుదాఘాతంతో మల్లికార్జున (12) అనే బాలుడు మృతి చెందాడు. మనేకుర్తి గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బోయ ఈరన్న ఇంటి ముందు ఉన్న మహేంద్ర ఇంట్లో పెళ్లి వేడుకల కోసం ఇనుప పైపులకు విద్యుత్ లైట్లతో డెకరేషన్ చేశారు. బాలుడు మల్లికార్జున షామియానా పైపులను అనుకోవడంతో విద్యుత్ షాకై అక్కడిక్కడే మృతి చెందాడు. ఈరన్న, సరస్వతి దంపతుల మొదటి కుమారు మల్లికార్జున కమ్మరచేడు గ్రామంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గంజాయి మత్తులో పట్టుబడిన యువకులు రీహాబిటేషన్ సెంటర్కు తరలింపు ఎమ్మిగనూరురూరల్: గంజాయి సేవించి పట్టుబడిన యువకులను విశాఖపట్టణంలోని రీహా బిటేషన్ సెంటర్కు పంపినట్లు పట్టణ సీఐ కంబగిరి రాముడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలో గంజాయిని అరికట్టడంతో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఐదుగురు వ్యక్తులను కిట్ ద్వారా పరీక్షించగా గంజాయి తీసుకున్నట్లు నిర్థారణ కావడంతో విశాఖపట్న ంలోని గ్రీన్ వ్యాలూ ఫౌండేసన్ ( రీహాబిటేషన్ సెంటర్) పునరావాస కేంద్రానికి పంపామన్నారు. మీ ప్రాంతాల్లో యువకులు గంజాయి తీసుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. సమాచారం తెలిస్తే టౌన్ సీఐ–91211 01147, టౌన్ ఎస్ఐ–91211 01145 నెంబర్లకు తెలియజేయాన్నారు. హెబ్బటంలో మొసలి కలకలం హొళగుంద: మండల పరిధిలోని హెబ్బటం గ్రామ సమీపంలో మొసలి సంచారం కలకల రేపింది. గ్రామం పక్కన ఉన్న మంచి నీటీ పథకం పరిసరాలో శుక్రవారం మొసలి సంచరించినట్లు గ్రామస్తులు శనివారం తెలిపారు. ఎల్లెల్సీ నుంచి మంచినీటి పథకానికి నీటి సరఫరా జరిగే పంప్ హౌస్ వద్ద మొసలిని కనుగొన్నట్లు చెప్పారు. ఇటీవల కాలువకు నీటి సరఫర జరిగిన సమయంలో కొట్టుకొచ్చిన మొసలి మంచినీటి పథకం వద్ద చేరిఉంటుందని చెబుతున్నారు. ఎవరూ ఆ ప్రాంతంలో తిరగవద్దని, అప్రమత్తంగా ఉండాలని చేస్తున్న హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంబందిత అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. -
ఎల్లెల్సీలో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట
● టీబీ డ్యాంలో నీరున్నా జిల్లా రైతులకు తొలగని కష్టాలు హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) 155 కి.మీ వద్ద ఇసుక బస్తాలతో శుక్రవారం అడ్డుకట్ట వేయడంతో శనివారం హొళగుంద సెక్షన్లో నీటి ప్రవాహం ఆగిపోయింది. ఆంధ్ర కాలువ 250 కి.మీ వద్ద నీటి ప్రవాహం జీరో క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో కాలువలో నీరులేక బోసిపోతుండగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 92 టీఎంసీల మేర నీరుండి కర్ణాటక కోటా కింద 650 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఆంధ్రా వారి నీటిని తీసుకెళితే తమవాటా కూడా ముందుకు వదులుతామని కాలువలో ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసిన సంగతి తెలిసిందే. జిల్లా ఇరిగేషన్ అధికారులు ఇండెంట్ ఇవ్వకపోవడంతో కేవలం కర్ణాటక నీరు మాత్రమే కాలువలో ప్రవహిస్తున్నాయి. కాలువలో ఆంధ్ర కోటా నీరు కూడా చేరితే పూర్తిస్థాయిలో నీరు పారుతూ వరి, ఇతర పంటలను సాగు చేసు కోవచ్చని కర్ణాటక రైతులు భావించారు. తక్కువ నీరు పారుతుండడంతో ఏపీ తీరు ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు చేరుతున్నా తాము పంటల సాగుకు నోచుకోలేక పోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో కాలువలో వచ్చే నీరు కూడా ఆగిపోవడంతో మున్ముందు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందోనని తీవ్ర ఇందోళనకు గురవుతున్నారు. దీనిపై పాలకులు, జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం టీబీ డ్యాంలో 92.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
కళ్లెదుటే నీళ్లున్నా.. కన్నీళ్లే!
● ఎండిపోతున్న పత్తి, కంది ● ఒక తడి ఇవ్వాలంటున్న రైతులు జూపాడుబంగ్లా: కేసీ కాల్వలో నీరు ప్రవహిస్తున్నా పంటలకు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికే మొక్కజొన్న పంటను దున్నేసిన రైతులు పత్తి చేతికొస్తుందని ఆశించారు. మల్యాల ఎత్తిపోతల నుంచి ఓ మోటారు ద్వారా 338 క్యూసెక్కుల నీటిని కేసీ కాల్వకు వదులుతున్నాయి. అయితే పంట కాలువలకు ఇవ్వడం లేదు. తాగునీటి అవసరాల నిమిత్తం మాత్రమే ఇస్తామని అధికారులు పేర్కొంటూ రైతుల ఆశలపై నీళ్లుచల్లారు. కళ్లెదుటే కాల్వలో నీళ్లుపారుతున్నా పంటలను కాపాడుకోలేకపోతున్నామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 25,430 ఎకరాల్లో సాగు కేసీ కాల్వ ఆయకట్టు కింద నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, వెలుగోడు, గడివేముల, బండిఆత్మకూరు మండలాల పరిధిలో 25,430 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, మినుము, సోయాబీన్, కంది తదితర పంటలను సాగుచేశారు. పంటలు సాగుచేసి 50 రోజులు అవుతోంది. ఎదుగుదల లోపించడంతో 15,243 ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబీన్, మినుము పంటలను రైతులు దున్నేవారు. ప్రస్తుతం పత్తి, కంది పంటలు మాత్రమే కొన ఊపిరితో ఉన్నాయి. వాటికి ప్రస్తుతం ఓ తడినీరు ఇస్తే ఎకరాకు కొంత దిగుబడి అయినా వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
బీసీ రిజర్వేషన్ల పేరుతో రెండేళ్లుగా కాలయాపన
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ బీవై రామయ్య కర్నూలు(టౌన్): మాది బీసీల పార్టీ, అన్ని ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు నాయుడు ఇంకెంత కాలం మోసం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కర్నూలు నగర మాజీ మేయర్ బి.వై.రామయ్య ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటిందని, బీసీ రిజర్వేషన్ల పేరుతో రిటైర్డు ముఖ్య కార్యదర్శి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో వేసిన డెడికేషన్ కమిటీ వల్ల కాలయాపన తప్ప ఒరిగిందేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. శనివారం ఆయన స్థానిక మాజీ మేయర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచాయతీ యాక్టు– 176 ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేసి వారిని బ్యాక్వర్డు క్లాస్గా కాకుండా బ్యాక్బోన్గా రాజకీయ పదవుల్లో ప్రత్యేకంగా గుర్తింపునిచ్చారన్నారు. ఓసీలకు కేటాయించిన ప్రాంతాల్లోనూ బీసీలకు సీట్లిచ్చిన ఘనత ఆయనకు మాత్రమే దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తోందన్నారు. శ్రీకాకుళం మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు నుంచి కర్నూలులో అలూరు ఎమ్మెల్యే విరుపాక్షి వరకు అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టించారన్నారు. చంద్రబాబుకు బీసీలంటే పడదన్నారు. చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కలిసికట్టుగా సత్తా చాటుతారని స్పష్టం చేశారు. -
చాలా బాధగా ఉంది
వర్షాల్లేక ఇప్పటికే 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట దున్నేశా. మూడు ఎకరాల్లో పత్తికి సాగునీరు లేదు. కళ్లెదుటే కేసీ కాల్వలో నీరుపారుతున్నా పంట ఎండిపోవడం చాలా బాధగా ఉంది. తడి నీరివ్వాలని ఏఈని అడిగితే పైనున్న సారోళ్లు అనుమతివ్వాలంటున్నారు. – రవికుమార్ యాదవ్, రైతు నాకున్న ఎకరా పొలంలో పత్తిపంటను సాగుచేశాను. పంటసాగుచేసినప్పటి నుంచి వర్షాల్లేక పంట ఎదుగుదలలేక కేవలం రెండు, మూడు అడుగుల ఎత్తుపెరిగి పూత, పిందవచ్చాయి. చివరిదశలో ఉన్న పంటకు నీళ్లుపెట్టుకొని కాపాడుకొందామంటే సారొళ్లు కాల్వలకు నీరివ్వటం లేదు. – రామకృష్ణ, రైతు కేసీ కాల్వకు వదులుతున్న నీరు తాగునీటి అవసరాల నిమిత్తం మాత్రమే. కాల్వ వెంట ఉన్న తూములను అన్నింటినీ పూర్తిగా బంద్చేసి దిగువకు తరలిస్తున్నాం. ఉన్నతాధికారులు అనుతిస్తేనే రైతులు పంటలకు నీటిని పారించుకొనేందుకు అనుమతిస్తాం. – శ్రీనివాసనాయక్, ఏఈ, -
శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీశైలం: వరుస సెలవులు రావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం వెళ్లే రహదారులు రద్దీగా మారాయి. భారీ సంఖ్యలో వాహనాల రాకతో శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం నాడు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 8 కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సాక్షి గణపతి నుంచి సున్నిపెంట వరకు వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోను ఢీకొన్న కారు... ఆటో డ్రైవర్ మృతిజూపాడుబంగ్లా (నంద్యాల జిల్లా): నేషనల్ హైవే 340సీ అధికారుల నిర్లక్ష్యం వల్ల మండ్లెం వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనటంతో ఆటో డ్రైవర్ సామేలు(45) మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకొంది. పోలీసుల వివరాల మేరకు... పారుమంచాల గ్రామానికి చెందిన సామేలు ఉదయం ఆటోలో నందికొట్కూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో మండ్లెం గ్రామం నుంచి తర్తూరు అంచెవద్ద హైవే 340సీ రోడ్డును క్రాస్ చేస్తుండగా కర్నూలు వైపు నుంచి వేగంగా వచ్చిన కర్ణాటకకు చెందిన కేఏ 30ఎం 8878 నెంబర్గల కారు ఢీకొంది.చదవండి: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తప్రమాదంలో ఆటో, కారు ముందు భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఆటో డ్రైవర్ సామేలు కిందపడటంతో అతని తనలకు బలమైన రక్తగాయాలయ్యాయి. అతన్ని చికిత్సనిమిత్తం 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స ప్రారంభించేలోగా అతను మృతిచెందినట్లు తెలిపారు. కారు ముందుభాగం నుజ్జు నుజ్జై రోడ్డుకిందికి దిగిపోయింది. అదృష్టవశాత్తు కారు డ్రైవర్తో పాటు అందులోని వారికి ఎలాంటి గాయాల్లేకుండా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించుకొన్నారు. మృతుని భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రంలో భారీగా ట్రాఫిక్ జామ్సాక్షి గణపతి నుంచి సున్నిపెంట వరకు సుమారు 8 కి.మీ. మేర నిలిచిన వాహనాలువరుస సెలవులతో శ్రీశైలానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీభక్తుల వాహనాలతో రోడ్లపై భారీగా ట్రాఫిక్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు#Srisailam #TrafficJam… pic.twitter.com/omjVYAEj45— Anjaneyulu (@Anjaneyulu_01) August 15, 2026 -
ఉపాధ్యాయులకు ‘ఆన్లైన్’ కష్టాలు
● ప్రతి విషయం ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే ● పని భారం.. ఒత్తిళ్లతో సతమతం నంద్యాల(న్యూటౌన్): చదువులు చెప్పే ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం బోధనేతర పనుల బరువు మోపుతోంది. నానాటికీ ఈ భారం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దీనిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. జిల్లాలో 1,345 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఆరు వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాలకు కొంత దూరం నుంచే తమ మొబైల్ ఫోన్ తీసి ముఖ హాజరు వేసుకుంటున్నారు. తర్వాత ప్రార్ధన అవుతుండగానే విద్యార్థుల మొత్తం సంఖ్యను లెక్కిస్తారు. అనంతరం తరగతులు వారీగా హాజరు నమోదు చేసి వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తారు. తర్వాత మధ్యాహ్న భోజనం, టాయిలెట్ నిర్వహణ తనిఖీ చేసి మొబైల్స్ ద్వారా ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయాల్సి వస్తోంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు ఓ వైపు ఆన్లైన్ పనులు చూసుకుంటూ మరో వైపు రెండు, మూడు తరగతులకు బోధన చేయాల్సి వస్తోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లోనైతే పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోజులో సగం సమయం ఆన్లైన్ పనులకే కేటాయించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఒకే పనిని రెండు సార్లు అధికారులు సూచించిన ప్రతీ పనిని ఉపాధ్యాయులు అటు ఆన్లైన్లో ఇటు ఆఫ్లైన్లో చేయాల్సి వస్తోంది. పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన సమాచారం అంతా రికార్డుల్లో నిక్షిప్త పరచడమే కాకుండా ఆన్లైన్లో కూడా వాటిని క్రమం తప్పకుండా పొందుపరుస్తూ రావాలి. ఒకే పనిని రెండు సార్లు చేయడంతో అధిక సమయం బోధనేతర పనులకే కేటాయించాల్సి వస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు వారాలవుతున్నా చాలా పాఠశాలల్లో ఇప్పటికీ ఒక్క పాఠం కూడా పూర్తికాని పరిస్థితి. మరో పది రోజుల్లో ఎఫ్ఎ–1 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఒక్కో విద్యార్థికి సంబంధించి సుమారు వంద అంశాల వివరాలను యు–డైస్లో అప్డేట్ చేసేందుకు సమయం సరిపోయింది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్కూల్ కిట్లు పంపిణీ తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు ఉపాధ్యాయులు ఎలా చదువు చెబుతున్నారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. టీచర్లతో క్లరికల్ వర్క్ చేయించడంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. బడికి వచ్చినప్పటి నుంచి ముఖ హాజరుతో పాటు విద్యార్థులకు సంబంధించిన ప్రతీ అంశాన్ని యాప్ల్లో నమోదు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి సర్వర్ సమస్య వచ్చిన ప్పుడు గంటల కొద్దీ ఫోన్లు పట్టుకుని తిరగాల్సి వస్తోంది. దీని వల్ల భోధన సక్రమంగా చేయలేకపోతున్నాం. బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇచ్చి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేలా యాప్ల భారం తగ్గించాలి. – శివయ్య, ఏపీటీఎఫ్ సెక్రటరీ, నంద్యాల యాప్లతో బోధన సమయం వృథా అవుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాం. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. హామీలు అమలు చేయాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తప్పించాలి. నిత్యం ఏదో ఒక పని చెప్పడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. – నగరి శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ 1938 సెక్రటరీ, నంద్యాల -
ప్రజలకు ‘డిజిటల్’ షాక్!
ఆలూరు: విద్యుత్ బిల్లులను ప్రజలు ఇక డిజిటల్ విధానంలో చెల్లించాల్సి ఉంది. ఈఆర్వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసర్) కార్యాలయాలు ఇక పనిచేయవు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ చెల్లింపులకు స్మార్ట్ ఫోన్ అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సరిగా లేకున్నా, స్మార్టు ఫోన్ లేకున్నా విద్యుత్ బిల్లు చెల్లించే వీలు పడదు. పల్లెల్లో ఇప్పటికీ చాలామంది కీప్యాడ్ ఫోన్నువినియోగిస్తున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, ఆలూరు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ ఉప రెవెన్యూ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7,38,059 మంది రూ. 49.76 లక్షల మేర విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. నంద్యాల, ఆత్మకూరు, పాణ్యం, కోవెలకుంట్ల బనగానపల్లి, డోన్, విద్యుత్ సబ్డివిజన్లలో ఇదే కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 9,67,500 మంది విద్యుత్ వినియోగదారులు రూ. 58.20 లక్షల చెల్లిస్తున్నారు. ఇక వీరంతా స్మార్ట్ ఫోన్లలో క్యూఆర్కోడ్ ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అలా చేయకలేకపోతే విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. ఈఆర్వో కార్యాలయాల మూత సిబ్బంది కొరత కారుణంగా 2018లో ఈఆర్వో కార్యాలయాల్లో ప్రభుత్వం ఒప్పంద కార్మికులను నియమించింది. వీరికి ఏజేన్సీ నిర్వాహకులు నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వేతనం చెల్లించేవారు. అగ్రిమెంట్లో పని దినాలు ముగిసి పోకుండానే వీరి కడుపు కొట్టి ఈఆర్వోలను తొలగించి కార్యాలయాలను తొలగించాలని జూన్ 15న ఉత్తర్వులు వచ్చాయి. ఈనెల మొదటివారం నుంచి కార్యాలయాలు శాశ్వతంగా మూతపడ్డాయి. ఒప్పంద కార్మికులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్మార్టు ఫోన్లో పేద్వారా విద్యుత్ బిలుల్ల చెల్లింపుపై అవగాహన కల్పిస్తున్నా పల్లెల్లో సమస్యలు వస్తున్నాయి. ఆంగళ్లు, పిండిమిషన్లు నిర్వహిస్తున్న వారు కొంత సమస్యను అధిగమించారు. బోరుబావులకు వాడిన విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక స్మార్ట్ఫోన్ ద్వారానే విద్యుత్ బిల్లుల చెల్లింపు బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేత చిన్న ఫోన్ ఉన్న వారికి తప్పని తిప్పలు -
గొర్రెలను అపహరించిన నిందితుల అరెస్ట్
మహానంది: మండలంలో సుమారు 15 గొర్రెలను ఎత్తుకెళ్లిన వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లాకు చెందిన కాపరులు దివిటె గౌడప్ప, ముత్తప్ప, కర్రెప్పలు తమ జీవాలను మహానంది మండలం గాజులపల్లె రైల్వేస్టేషన్ గ్రామ పొలాల్లో పగలు మేపుకొని రాత్రికి గ్రామ పొలిమేరలో ఉన్న ఖాళీ పొలంలో ఉంచుకునేవారు. అయితే ఈ నెల 9, 10వ తేదీ రాత్రివేళల్లో గొర్రెల కాపర్లు ఏర్పాటు చేసుకున్న కంచెను కట్ చేసి రూ.1.50 లక్షల విలువైన 15 గొర్రెలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఘటనపై గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామానికి చెందిన సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అందులో భాగంగా నంద్యాల మండలం చాపిరేవుల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద కుందూ నదికి వెళ్లే మట్టి దారిలో బేతంచెర్ల మండలం బుగ్గనిపల్లె గ్రామానికి చెందిన రామావత్ ధర్మానాయక్, పాణ్యంకు చెందిన జయంపు మహేష్, తోట కొత్తూరయ్యను అరెస్టు చేసి వారి నుంచి 15 గొర్రెలతో పాటు ఒక స్కార్పియో వాహనం, వైర్ కటర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును చేధించి దొంగలను అరెస్టు చేసిన మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ సునీల్ షెరాణ్, ఏఎస్పీ సుస్మిత అభినందించారు. -
శ్రీ కామేశ్వరీదేవికి విశేష పూజలు
మహానంది: శ్రావణ మొదటి శుక్రవారం సందర్భంగా మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఆలయ అర్చకులు మణికంఠశర్మలు ఉదయం నుంచి అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. అమ్మవారికి 13 పట్టుచీరలతో, అమ్మవారి ఆలయ మండపంలో సుమారు వంద చీరలతో అలంకరించారు. శ్రావణమాసం శుక్రవారం పురస్కరించుకుని యాగశాలలో చండీహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు హైదరాబాద్ వాస్తవ్యులైన వారణాసి రామ్మోహన్రావు దంపతుల ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఆదేశాల మేరకు కేజీబీవీల్లో జిల్లా ప్రొఫెషనల్ మెరిట్ జాబితాలను, ఖాళీల వివరాలను samagrashikshanandyal. blogspot.com వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యర్థులు వివరాలను పరిశీలించుకొని దరఖాస్తులు, ఫిర్యాదులు ఉన్నట్లు అయితే తగిన ఆధారాలతో ఈనెల 16లోగా ఆన్లైన్ ద్వారా గ్రీవెన్స్ నమోదు చేయవచ్చన్నారు. అంతేగాకుండా అభ్యంతరాలను, ఫిర్యాదులను తగిన ఆధారాలతో నంద్యాల సమగ్ర శిక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో సమర్పించాలన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 10 వేల క్యూసెక్కుల నీటి విడుదల జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ మూడు గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటివిడుదలను కొనసాగిస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి వరదనీటి ప్రవాహం నిలిచిపోయినట్లు తెలిపారు. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో డ్యాంలో 878.40అడుగుల వద్ద 179.8995 టీఎంసీల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు వద్ద 877.40 అడుగుల నీటిమట్టం ఉండగా 4,5,6 గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి జీఎన్ఎస్ఎస్కు 8,000 క్యూసెక్కులు, తెలుగుగంగ కాల్వకు 2,000 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. ఓపెన్ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ పెంచాలి నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ఓపెన్ స్కూళ్లలో ఎన్రోల్మెంట్ పెంచాలని ఏపీ సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ నరసింహారావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో జిల్లాలోని కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూళ్లలో విద్యార్థుల శాతం ఎక్కువగా నమోదు చేయాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు డిజిటల్ మాధ్యమాలు, టెస్టు బుక్స్ ద్వారా తగిన తర్ఫీదు ఇవ్వాలన్నారు. వివిధ కారణాలతో చదువు మానేసిన పిల్లలకు, పెద్దలకు సార్వత్రిక విద్యాపీఠం ద్వారా చదువు కొనసాగించడానికి సువర్ణ అవకాశమన్నారు. సమావేశంలో డీఈఓ జనార్దన్రెడ్డి, డిప్యూటీ డీఈఓలు శంకర్ప్రసాద్, సార్వత్రిక విద్యాపీఠం సమన్వయకర్త రఘురామిరెడ్డి, ఎంఈఓలు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
‘రెడ్బుక్’ కుట్రలు.. ఆగని వేధింపులు
ఆళ్లగడ్డ: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్న సామెతను టీడీపీ నాయకులు నిజం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తుండగా గ్రామాల్లో ఆపార్టీ నాయకులు వైఎస్సార్సీపీ ఆస్తులే టార్గెట్గా దాడులు చేస్తున్నారు. తాజాగా యాదవాడ గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. వైఎస్సార్సీపీ నాయకుడు, తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వెంట ఉండేవారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పొల్గొంటారు. ఈ క్రమంలో గురువారం మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు వచ్చిన సందర్భంగా బిజేంద్రారెడ్డితో పాటు కర్నూలుకు వెళ్లారు. అంతకు రెండు రోజుల ముందు డీఎస్సీ అక్రమాలపై జరిగిన ర్యాలీకి సైతం పెద్ద ఎత్తున కార్యకర్తలతో వెళ్లారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ఆయనను ఎలాగైనా నష్ట పరచాలని గురువారం రాత్రి పొలం దగ్గర రూంలో దాచి పెట్టుకున్న 20 మందు బస్తాలను గతి తాళం పగుల గొట్టి ఎత్తుకుపోయారు. శుక్రవారం పొలానికి మందు చల్లుదామని పోతే అక్కడ తాళం పగలగొట్టి ఉండటం కనిపించింది. లోపలకు వెళ్లి చూడగా 28 మందు బస్తాలు కనిపించడం లేదు. మోటార్సైకిల్ పై రోడ్డు మీదకు మోసుకుని అక్కడి నుంచి ఆటోల్లో తరలించినట్లు తెలుస్తోందని నరసింహారెడ్డి తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతిసారీ.. నరసింహారెడ్డి పార్టీ ఆదేశించిన ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోజు ఏదో విధంగా నష్ట పరచడం జరుగుతోంది. గతంలో కూడా పార్టీ ఆదేశించిన కార్యక్రమానికి కార్యకర్తలను తరలించుకు పోవడంతో మరుసటి రోజు పొలం దగ్గర ఉన్న రెండు వరిగడ్డి వాములకు అగ్గి పెట్టి దగ్ధం చేశారు. అంతేకాకుండా పదులసంఖ్యలో మోటర్ వైర్లు, కేబుల్ వైర్లుకట్ చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నాయకుడి పొలంలో టీడీపీ నాయకుల దోపీడీ? రూం తాళం పగులగొట్టి 28 బస్తాల మందు బస్తాలు చోరీ గతంలో గడ్డివాములకు నిప్పు పెట్టిన వైనం -
తపాలా శాఖ పథకాలపై అవగాహన
కర్నూలు: తపాలా శాఖ ద్వారా అందుబాటులో ఉన్న పోస్టల్ సేవింగ్స్, పెట్టుబడి, బీమా పథకాలు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర పథకాల గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించారు. పోస్టల్ శాఖ కర్నూలు డివిజన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక న్యాయ సేవా సదన్లో న్యాయ అవగాహన కార్యక్రమంతో పాటు ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహించారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర అర్హత కలిగిన వర్గాలకు అందించే బీమా సౌకర్యాలు, పాలసీల ప్రత్యేకతలు, కుటుంబానికి కలిగే ఆర్థిక భద్రత, భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆధార్ క్యాంప్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో ఆధార్ నమోదు, నవీకరణ సేవలు ప్రత్యేక ఆధార్ క్యాంప్ ద్వారా అందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా లీలా వెంకటశేషాద్రి పేర్కొన్నారు. కర్నూలు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ జనార్ధన్ రెడ్డి, హెడ్ క్వార్టర్స్లోని న్యాయాధికారులు, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. -
సెల్ఫోన్లో బిల్లు చెల్లించడం రాదు
నేను పెద్దగా చదవలేదు. నా వద్ద స్మార్టు ఫోన్ ఉన్నా కరెంట్ బిల్లు చెల్లించడం రాదు. మాకు రూ. 200 బిల్లు వచ్చింది. కార్యాలయానికి వెళ్తే మూతేశారు. బిల్లు చెల్లించలేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. – గోవిందరాలు, ఆలూరు మేం వాడుది చిన్న ఫోన్. స్మార్టు ఫోన్లో నాకు విద్యుత్ బిల్లు చెల్లించేందుకు రాదు. ఇక్కడ ఆఫీసు ఉంటే బిల్లు కట్టాలని డబ్బులు ఇంటిపక్క వారికి ఇచ్చివేళ్లే వాళ్లం. ఇప్పుడు ఆపరిస్థితి లేదు. – జోగిబాలి పేడయ్య, ఆలూరు గ్రామాల్లో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారందరు వినియోగదారులకు స్మార్టు ఫోన్ద్వారా పేమెంట్లను చెల్లించాలని అవగాహన చేస్తున్నారు. కీప్యాడ్ సెల్ను వాడుతున్న వారు ఇతరులతో బిల్లులను చెల్లించాలి. ఏపీఎస్పీ డీసీఎల్ అధికారులు నిబంధలకు లోబడి పనిచేయాలని. – సంతోష్కుమార్, ఏడీఈ ఆలూరు -
రూ.1కే బీఎస్ఎన్ఎల్ సిమ్కార్డు
కర్నూలు(హాస్పిటల్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అందించే ఫ్రీడమ్ 2.0 ప్లాన్స్ను ఉపయోగించుకోవాలని ఆ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.రాజేశ్వరరావు చెప్పారు. శుక్రవారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.1కే సిమ్కార్డును 24 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు ఒక జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్లు అందిస్తున్నట్లు తెలిపారు. రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లో 47 అదనపు రోజుల వాలిడిటీ, రోజువారీ 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు అందిస్తున్నామన్నారు. ఇది వచ్చే నెల 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. రూ.499లకే ఫైబర్ బేసిక్ ప్లాన్లో భాగంగా 60 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగం, నెలకు 3300 జీబీ వరకు హైస్పీడ్ డేటా, ఉచిత అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉంటాయన్నారు. ఫైబర్ ఫ్రీడమ్ ప్లాన్లో భాగంగా రూ.1,111 (నెలకు) చెల్లిస్తే 200 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్, నెలవారీగా 5వేల జీబీ హైస్పీడ్ డేటా అందిస్తామన్నారు. అలాగే 25కు పైగా ప్రీమియం ఓటీటీ ప్లాట్ఫామ్స్, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ ఇందులో లభిస్తాయన్నారు. గతేడాది పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి 4జీ సేవలను ప్రారంభించామన్నారు. ఈ మేరకు జిల్లాలో దాదాపు 380 టవర్లు, 1,080 బీటీఎస్లతో విస్తరించినట్లు తెలిపారు. కర్నూలు బీఏలో సగటున నెలవారీ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య దాదాపు 2లక్షల నుంచి 3.4 లక్షలకు పెరిగిందని వివరించారు. మారుతున్న మొబైల్ టెక్నాలజీకి అనుగుణంగా ఈ–సిమ్, యూనివర్సల్ సిమ్ సేవలను కూడా అందిస్తున్నామన్నారు. బీఎస్ఎన్ఎల్ ఏజీఎం దేవచంద్ నాయక్, ఏడీఈ మహమ్మద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. -
పంద్రాగస్టుకు సర్వం సిద్ధం
● స్వాతంత్య్ర వేడుకలకు నంద్యాల ముస్తాబు నంద్యాల(అర్బన్): స్వాతంత్య్ర సంబరాలకు జిల్లా కేంద్రమైన నంద్యాల ముస్తాబైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలకు రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు హాజరు కానున్నారు. వీరందరూ కూర్చొని వేడుకలు తిలకించేందుకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో, గ్యాలరీల వద్ద తాగునీరు, అల్పాహారం అందించనున్నారు. మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించనున్నారు. ఏర్పాట్లను కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్షెరాన్ శుక్రవారం పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ మొదలుకొని వేదిక బ్యాక్ డ్రాప్ పోలీసు సాయుధ దళాల మార్చ్ఫాస్ట్, బ్యారికేడింగ్, స్టేజి నిర్మాణం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్ల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ విశ్వనాథ్, డీఆర్ఓ రామునాయక్ తదితరులు ఉన్నారు. -
చెరువులపై పచ్చ గద్దల కన్ను
డోన్: వర్షపు నీటిని ఒడిసిపడదాం.. ప్రతి నీటి చుక్కను పొదుపు చేద్దాం.. నీటిని సంరక్షిద్దాం.. కరువు రక్కసిని తరిమికొడదాం అంటూ టీడీపీ నేతలు చెప్పే మాటలు నీటి మూటలుగా తేలిపోయాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని 36 చెరువులకు హంద్రీ నీవా కాల్వ నీటిని మళ్లించి సశ్యశ్యామలం చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాల పేరుతో చెరువులపై టీడీపీ నాయకుల పెత్తనం అధికం కావడంతో నీటి వినియోగం పట్ల నిర్లక్ష్యం పెరిగిపోయింది. దీంతో చెరువులన్నీ చుక్క నీరు లేక ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. గంపలో రొయ్యలేమయ్యాయి! అంతా శాఖాహారులే మరి గంపలో రొయ్యలేమయ్యాయనే చందంగా నియోజకవర్గంలో చెరువుల పరిస్థితి తయారైంది. కొచ్చెర్వు, జగదుర్తి, యాపదిన్నె గ్రామ చెరువులను చేపల వేట పేరుతో నీటిని కిందకు వదిలి ఖాళీ చేయించారు. చెరువుల్లో నీరు ఎక్కువగా ఉంటే చేపల వేటకు కష్టతరమవుతుంది. అదే నీరు తక్కువగా ఉంటే చేపల వేట సులువుగా సాగించవచ్చు. దీంతో చెరువుల్లో నీరు ఖాళీ చేయించి తద్వారా టీడీపీ నేతలు ఈ ఏడాది చేపలు పట్టే వారి నుంచి వేలాది రూపాయలను అక్రమంగా వసూలు చేసి జేబులు నింపుకున్నారని ఆయా గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో నీటి నిల్వలను కాపాడి సక్రమంగా వినియోగించాల్సిన మైనర్ ఇరిగేషన్ అధికారుల్లో కొందరు మామూళ్ల మత్తులో పడి నీటి వృథాకు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ చెరువుల్లో చేపల పెంపకం తమ పరిధిలో లేదంటూ మత్స్య శాఖ అధికారులు చేతులేత్తేయడంతో అనధికారికంగా ఈ చెరువుల్లో చేపల పెంపకం, విక్రయం లాంటి విషయాల్లో టీడీపీ నాయకుల ఇష్టారాజ్యం పెరిగిపోయింది. సిండికేట్ మాయాజాలం అతి చిన్నదైన ఉడుములపాడు చెరువులో చేపల పెంపకాన్ని రెండేళ్లుగా బహిరంగ వేలం వేస్తున్న మత్స్యశాఖ అధికారులు వెంకటాపురం తుమ్మల చెరువు వేలం పాటను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తూ పచ్చ చొక్కాల నాయకుల జేబులు నింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే ఈ చెరువు తూమును దొంగలెత్తుకెళ్లినా ఇరిగేషన్ అధికారులు తిరిగి తూముకు అడ్డుకట్టు వేయలేకపోయారు. టీడీపీ నాయకులు, మత్స్యశాఖ, మైనర్ ఇరిగేషన్ అధికారుల్లో కొందరు కాసులకు కక్కుర్తి పడి చెరువుల్లో చుక్క నీరు నిల్వ లేకుండా చేపల వేటగాళ్లకు చేయూతనందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం, చెరువుల్లో నీరు లేకపోవడం లాంటి కారణాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయ బోర్లు వృథాగా మారాయి. పశువులకు సైతం తాగు నీరు దొరకని దైన్యస్థితి ఏర్పడింది. మత్స్య శాఖ, మైనర్ ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కు చేపల కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు చెరువులు ఖాళీ జేబులు నింపుకుంటున్న అధికార పార్టీ నాయకులుచెరువు కథ కంచికి.. ఉమ్మడి జిల్లాలో సి.బెళగల్ చెరువు తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగి 501 ఎకరాల విస్తీర్ణం, 0.25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 112 ఏళ్ల చరిత్ర గత వెంకటాపురం తుమ్మల చెరువు కథ కంచికి చేరింది. ఈ చెరువు కింద 2 వేల ఎకరాల ఆయకట్టు, మరో 1500 ఎకరాల నన్ఆయాకట్టు సాగవుతోంది. ఇంతటి ప్రాధాన్యత గల చెరువును నింపేందుకు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అయితే ఈ చెరువు తూమును (గేట్) దొంగలెత్తుకెళ్లడంతో చెరువులో నీరంతా కిందకు వృథాగా పొతోంది. నీరు వృథా అవుతోందని ఆయకట్టు రైతాంగం నెత్తి, నోరు బాదుకున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా మారింది. మైనర్ ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుడడంతో చెరువులో నీరు త్వరలోనే ఖాళీ అయ్యే ప్రమాదం ఏర్పడింది. -
వ్యవసాయ యంత్రం.. లాటరీ తంత్రం!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ప్రారంభమై పొలాల్లో పంటలు ఎండిపోయి.. రెండోసారి విత్తనం వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత యంత్ర పరికరాలు పంపిణీ చేస్తామని ప్రకటిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించి అర్హుల జాబితా ఇన్చార్జ్ మంత్రి టేబుల్పైకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత ఆర్థిక (2025–26) సంవత్సరం చివరిలో వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాలు ‘లాటరీ’ ద్వారా ఇస్తామని ఇవ్వలేదు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో మార్కెట్ కంటే రెట్టింపు ధరలతో యంత్రపరికరాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఇస్తారో, ఇవ్వరో, టీడీపీ కార్యకర్తలకు కట్టబెడతారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంపిణీ మరింత ‘నిమ్మల’ం! ఈ ఆర్థిక సంవత్సరం రైతులకు వ్యక్తిగతంగా హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, విత్తనం గొర్రులు, ట్రాక్టర్లు, రోటావేటర్లు, ట్రాక్టర్ ట్రాలీస్ తదితర వాటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ.9.41 కోట్లతో వ్యక్తిగత వ్యవసాయ యంత్రపరికరాలు పంపిణీ చేసేందుకు ఆన్లైన్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే రూ.89.41 కోట్ల విలువ కలిగిన 7,849 యంత్ర పరికరాల కోసం రైతుల ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేశారు. దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తి అయి నాలుగైదు నెలలు కాగా.. పలు సార్లు షెడ్యూలులో మార్పు చేశారు. రైతుల జాబితాలను జిల్లా వ్యవసాయ యంత్రాంగం ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడుకు పంపారు. రైతుల ఎంపికలో లాటరీ విధానం అమలు చేయకుండా మంత్రికి పంపడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. టీడీపీ కార్యకర్తలకు యంత్ర పరికరాలు అప్పగించేందుకే ఇలా చేశారని తెస్తోంది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి జాబితాలకు ఆమోదం తెలిపిన తర్వాతనే పంపిణీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కస్టమ్స్ హయరింగ్ సెంటర్లు ఏవీ? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేల వారీగా కస్టమ్ హయ్యరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం కూడా 2026–27 నుంచి కస్టమ్ హయ్యరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా లో రూ.13.30 కోట్ల సబ్సిడీతో సీహెచ్సీ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్బీకే స్థాయి లో రూ.10 లక్షలు, సబ్ డివిజన్ స్థాయిలో రూ.30 లక్షలతో సీహెచ్సీలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే దీనిపై అతీగతీ లేకుండా పోయింది. కాగితాలపై ఆదేశాలు ఇవ్వడం. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, తదుపరి ఎలాంటి చర్యలు లేకపోవడం షరా మామూలుగా మారింది. ఖరీఫ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు అందని పరికరాలు ప్రస్తుతం అర్హుల జాబితా జిల్లా ఇన్చార్జ్ మంత్రి టేబుల్పైకి టీడీపీ కార్యకర్తల కోసం కసరత్తు కనిపించని సీహెచ్సీలు! -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
● జిల్లా కలెక్టర్ రాజ కుమారినంద్యాల(అర్బన్): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఉదయం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, ట్రైనీ కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ దేశ అభివృద్ధి కేవలం ఆర్థికంతో కాకుండా ప్రజల సంతోష, ఆరోగ్యం, విద్య వంటి ప్రమాణాలతో కూడి ఉంటుందన్నారు. జిల్లా అధికారులు, సీఆర్ఎస్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పెన్సిల్పై స్వాతంత్య్ర యోధుల సూక్ష్మచిత్రాలు
నంద్యాల(అర్బన్): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ పెన్సిల్పై 40 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను గీసి అబ్బురపరిచారు. భారతమాత ముద్దుబిడ్డలైన సమరయోధులను దీవిస్తున్నట్లుగా భరతమాతతో కలిపి మొత్తం 40 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను పెన్సిల్పై చూపించారు. చిత్రంలో భగత్సింగ్, సుభాష్చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, తదితరుల చిత్రాలను చిత్రించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గోనెగండ్ల: మండల పరిఽధిలోని కున్నూరు గ్రామానికి చెందిన హరిజన ఆదాము (41) ఎస్.లింగందిన్నె క్రాస్ రోడ్డు వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. కున్నూరు గ్రామానికి చెందిన హరిజన ఆదాము, భార్య గిడ్డమ్మకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ పనులతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం ఆదాము సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై కోడుమూరు పట్టాణానికి వెళ్లాడు. తిరిగి రాత్రి కున్నూరు గ్రామానికి బయలు దేరాడు. అయితే ఎస్.లింగందిన్నె క్రాస్ రోడ్డు దగ్గరకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆదాము తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య గిడ్డమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.హంద్రీ నీవా కాల్వలో మృతదేహం లభ్యం పత్తికొండ రూరల్: గుడికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి హంద్రీ నీవా కాల్వలో శవమై తేలాడు. ఘటనపై సీఐ జయన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హాలహర్వి మండలం కామినహాల్ గ్రామానికి చెందిన నాగార్జున (43) పత్తికొండకు చెందిన రమాదేవి అలియాస్ లక్ష్మి దంపతులు. కొద్దిరోజుల కిందట దంపతులు పత్తికొండకు వచ్చారు. ఈ క్రమంలో నాగార్జున రెండు రోజుల క్రితం పత్తికొండ – చిన్నహుల్తి రోడ్డులోని ఈరన్న స్వామిని దర్శించుకుని వస్తానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో భార్య పత్తికొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గోపాల్ ప్లాజా సమీపంలోని హంద్రీ కాలువ గట్టున చెప్పులు, బైక్ పడి ఉండటాన్ని గుర్తించారు. ప్రమాదవశాత్తు హంద్రీ నీవా కాల్వలో జారిపడి ఉండొచ్చని భావిస్తున్నారు. శుక్రవారం మద్దికెర మండలం హంప వద్ద మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష డోన్ రూరల్: డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి 2 రోజులు జైలు శిక్ష విధించారు. మండలంలోని తాటిమాను కొత్తూరు గ్రామానికి చెందిన ఆర్.శేఖర్కు 2 రోజులు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం డోన్ స్పెషల్ జ్యుడీషయల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు రూరల్ సీఐ రాకేష్, ఎస్ఐ మమత తెలిపారు. -
వైఎస్ జగన్ జనంలోకి వస్తే ఎలా ఉంటుందో కర్నూలు పర్యటన చాటింది. పోలీసుల ఆంక్షలు.. అడుగడుగునా అడ్డంకులు.. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు కర్నూలుకు చేరుకోకుండా నిలువరించారు. ఎయిర్పోర్టు దాటి అభిమాన నేత కారులో బయటకు రాగానే ఊళ్లకు ఊళ్లు దారి పొడవునా ఎదురేగి
బళ్లారి చౌరస్తా వద్ద జన ప్రవాహంసాక్షి ప్రతినిధి, కర్నూలు/కర్నూలు సెంట్రల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో మరింత ఊపు తెచ్చింది. అందరిలోనూ రెట్టించిన ఉత్సాహం నింపింది. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడంతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు గురువారం ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడి నుంచి రాక్గార్డెన్, నన్నూరు టోల్ ప్లాజా, టీవీ9 ప్రజానగర్, వెంగన్న బావి, రిజిస్ట్రార్ ఆఫీస్, చెన్నమ్మ సర్కిల్, బళ్లారి చౌరస్తా, బాలాజీ నగర్, సంతోష్ నగర్, పంచలింగాల చెక్పోస్టు మీదుగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జిల్లా జైలుకు చేరుకున్నారు. మొత్తం 38 కిలోమీటర్ల ప్రయాణానికి ఐదు గంటల సమయం పట్టింది. అడుగడుగునా నిర్బంధం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్ జగన్ కలిశారు. అరగంట పాటు విరూపాక్షితో పాటు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలూరు ఎమ్మెల్యేపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అని చూడకుండా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా తనను జైలులో అధికారులు నిలబెట్టి ఫొటోలు తీసి అవమానించారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇంతకింత అనుభవించక తప్పదని హెచ్చరించారు. దాదాపు అరగంట పాటు జగన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అప్పటికే వేలాదిమంది కార్యకర్తలు జైలు వద్దకు తరలివచ్చారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు అడుగడుగునా నిర్బంధం విధించినా జనం వెనుకడుగు వేయలేదు. జై జగన్ నినాదాలతో జిల్లా జైలు ప్రాంతం హోరెత్తింది. జగన్ వెళ్లేవరకు కార్యకర్తల్లో జో ష్ తగ్గలేదు. జెండాలు చేతబూని చిందులు తొక్కారు. పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, మణిగాంధీ, హఫీజ్ ఖాన్, మాజీ మేయర్ బీవై రామయ్య, కర్నూలు నియోజకవర్గ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీఖాన్, ఎస్ఈసీ మెంబర్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మద్దూరు సుభాష్ చంద్రబోస్, తెర్నెకల్ సురేందర్ రెడ్డి, సమన్వయకర్తలు ఆదిమూలపు సతీష్, దారా సుధీర్ పాల్గొన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా.. పోలీసులు అడ్డుకున్నా.. జగనన్న కోసం ప్రజలు సునామీలా తరలి వచ్చారు. జగనన్న జిల్లా పర్యటన విఫలం చేయాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం కలగలేదు. 1300 మంది పోలీసు అధికారులను, పోలీసులను నియమించి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినా ప్రజలు, మహిళలు, యువకులు ఊహించని స్థాయిలో బ్రహ్మరథం పట్టారు. జగనన్న కోసం వచ్చిన జనాలను చూసి చంద్రబాబుకు నిద్ర పట్టదు. ప్రజలు అక్రమ కేసులకు భయపడరన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు జగనన్నను చూసేందుకు తరలివస్తున్న ఉమ్మడి జిల్లాల్లో పార్టీ నేతలు, అభిమానులు, ప్రజలను చెక్పోస్టులు పెట్టి అడ్డుకోవడం దారుణం. ఎంత కట్టడి చేస్తే అంతకు రెట్టింపు ప్రజలు వస్తారని ముందుగానే చెప్పాం. అన్నట్లుగానే అడుగడుగునా అభిమానులు నీరాజనం పలికారు. లక్ష మంది తరలి వచ్చారు. ఆంక్షలతో అభిమానాన్ని నిలువరించలేమని కూటమి ప్రభుత్వానికి తెలిసివచ్చింది. జగనన్న అంటే ఎందుకంత భయం. ప్రభుత్వ తీరు మారాలి. – కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు సైడ్లైట్స్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖద్వారం వద్దకు చేరుకున్న వైఎస్ జగన్తో ఓ మైనార్టీ మహిళ కరచాలనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు పక్కకు తోసేశారు. గమనించిన జగన్ సూచనలతో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్ రెడ్డి ఆమెను అభిమాన నేత వద్దకు తీసుకొచ్చి కరచాలనం చేయించడంతో ఆమె ముఖంలో సంతోషం విరబూసింది. నన్నూరు వద్ద భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఆ తరువాత నన్నూరు టోల్గేట్ దగ్గర వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కిగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి దారా సుధీర్తో పాటు ఆ నియోజకవర్గ పరిశీలకులు బుడ్డా శేషిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేలాది మంది పార్టీ కార్యకర్తలు డప్పులతో స్వాగతం పలికారు. ప్రజానగర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంతిపూలు చల్లుతూ స్వాగతం పలికారు. జగనన్నా మాకు మీరే దిక్కంటూ మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా, ఇతర కేటగిరీల్లో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు ప్రజానగర్ దాటిన తరువాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మరికొంత మంది విద్యార్థులు సార్ మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదని, ఫీజు చెల్లించలేకపోతున్నామని ప్లకార్డులు ప్రదర్శించారు. హ్యాంగౌట్ వద్ద కానిస్టేబుల్ ఉద్యోగాలను 2,500 నుంచి 10 వేలకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతూ కానిస్టేబుల్ అభ్యర్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఆటోనగర్ వద్ద తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసిన ఆనందంతో ఓ రైతు తన టవల్ను అందించగా.. ఆ టవల్తో జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్లా గిరగిరా తిప్పుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. – కర్నూలు సిటీ హైవేలో జన సునామీ! ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చి కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. పార్టీ శ్రేణులతో పాటు రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా తరలివచ్చారు. జై జగన్, సీఎం జగన్, కాబోయే సీఎం జగన్.. అంటూ నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ జెండాలతో చిందులు తొక్కారు. భారీగా వచ్చిన జనంతో కర్నూలు కిక్కిరిసిపోయింది. హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిలో భారీ జన సందోహం మధ్య కాన్వాయ్ ముందుకు వెళ్లడానికి వీలు కాలేదు. దీంతో జిల్లా జైలుకు చేరేందుకు ఐదు గంటల సమయం పట్టింది. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. అన్ని వర్గాల ప్రజల్లో ఉత్సాహం కనిపించింది. జై జగన్ నినాదాలతో మార్మోగిన సీమ ముఖద్వారం మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు ఎగబడ్డ ప్రజలు జనసంద్రంగా మారిన కర్నూలు 38 కిలోమీటర్ల ప్రయాణానికి ఐదు గంటల సమయం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నింపిన మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి పరామర్శ -
బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ పరిశీలన
పాములపాడు: మండలంలోని బనకచర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఉన్నత స్థాయి బృందం గురువారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం ఎక్స్ అఫీషియో అదనపు కార్యదర్శి యోగేష్ పైతాంకర్ నేతృత్వంలో సీఈఓ ఆర్కే రెడ్డి, డైరెక్టర్ శంకర్, అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ సంజీవ్తో కూడిన అధికారుల బృందం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. వారికి క్రాస్ రెగ్యులేటర్ పరిధిలోని గేట్ల పనితీరు, నీటి విడుదల వ్యవస్థ గురించి ఈఈ శంకర్ రెడ్డి, డీఈ నగేష్ వివరించారు. బనకచర్ల నుంచి కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి సుజల స్రవంతి కాలువలకు నీటి విడుదల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. అలాగే అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం తెలుగుగంగ ప్రధాన కాలువ ద్వారా చైన్నె నగర తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్న నీటి సమాచారాన్ని సేకరించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకాలు, అనుసంధాన కాలువల ద్వారా బనకచర్ల రెగ్యులేటర్కు నీటిని చేర్చే మార్గాలు, సాంకేతిక అంశాలు, డిజైన్లను ఇరిగేషన్ పీపీఎం ఈఈ రామకోటయ్య అధికారులతో కలిసి మ్యాప్ల ద్వారా విశ్లేషించారు. కరువు పీడిత రాయలసీమ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను శాశ్వతంగా తీర్చేందుకు ఈ అనుసంధానం ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశంపై అధికారులతో విస్తతంగా చర్చించారు. వారి వెంట ఏఈలు దేవేంద్ర , విశ్వనాధ్, విష్ణువర్ధన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
కర్నూలు జైలులో బాబు సర్కార్ రెడ్బుక్ అరాచకం
సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలు జైలులో కూటమి సర్కార్ రెడ్బుక్ అరాచకానికి తెరలేపింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అవమానించేందుకు కుట్రలు చేసింది. కావాలనే గ్రిల్స్ వెనుక నిలబెట్టి జైలు సిబ్బంది ఫొటోలు తీశారు. అడిగితే పైనుంచి వచ్చిన ఆదేశాలంటూ జైలు సిబ్బంది చెప్పారు. చంద్రబాబు సర్కార్ కుట్రలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబుది శాడిస్ట్ మెంటాలిటీ. నన్ను అవమానించాలని చూశారు. మాజీ సీఎం అని చూడకుండా నన్ను అవమానించాలని చూశారు. ..నన్ను గ్రిల్ వెనుక నిలబెట్టి ఫొటో తీయించారు. అడిగితే పై నుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. బాబు నాటిన తప్పుడు విత్తనాలే రేపు విషవృక్షాలవుతాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘వెన్నుపోటు పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుంది. బీసీ నాయకులపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?. సీదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే. వెన్నుపోటు పార్టీ కుట్ర కేసుగా మార్చింది. మహిళా ఎస్ఐని చంపబోయాడని చింతాడ రవిపై కేసు పెట్టారు. ముస్తఫా, కారుమూరి సునీల్పై కూడా అక్రమ కేసులు కట్టారు. ఇప్పుడేమో విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
అక్రమ కేసులు
● మెగా డీఎస్సీ ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. కొందరికి 41ఏ నోటీసులు జారీచేశారు. సోమవారం మెగా డీఎస్సీ అక్రమాలను ఎత్తిచూపుతూ వైఎస్సార్సీపీ ర్యాలీ నిర్వహించగా ఇందులో పాల్గొన్న నేతలు, కార్యకర్తలపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారు. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించినా పోలీసులు కేసులు నమోదు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● కర్నూలు ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు నగర మాజీ మేయర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై.రామయ్య, పార్టీ నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్తో పాటు 53 మంది నేతలు, కార్యకర్తలపై అదే రోజు సాయంత్రానికి పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరితోపాటు మరికొందరిపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ● ఎమ్మిగనూరు నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ ప్రచారకార్యదర్శి చాంద్ బాషాపైన పోలీసులు కేసు పెట్టారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళుతున్న తనను వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకోవడంతో ఆసుపత్రికి వెళ్లలేకపోయానంటూ ఒక వ్యక్తితో ఫిర్యాదు తీసుకొని పోలీసులు ఈ కేసు నమోదు చేయడం గమనార్హం. దీనిని బట్టి పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే అక్రమ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరు పార్టీ కార్యకర్తలపైనా కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. ● ఆదోని నియోజకవర్గంలో ర్యాలీలో పాల్గొన్న పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు, మాజీ సర్పంచ్ శేషిరెడ్డితోపాటు మరో 50 మందిపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొందరికి ఇప్పటికే 41ఏ నోటీసులు జారీ చేశారు. వీరితోపాటు మరికొందరికి సైతం నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లోనూ పోలీసులు వైఎ్ససార్సీపీ శ్రేణులపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
శ్రీగిరిలో నేటి నుంచి శ్రావణమాసోత్సవాలు
● రద్దీ రోజుల్లో ఆర్జిత అభిషేకాలు నిలుపుదల ● మూడు శుక్రవారాల్లో ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి సెప్టెంబరు 12వ తేదీ వరకు శ్రావణమాసోత్సవాలు జరుగనున్నాయి. శ్రావణమాసంలో ప్రతిరోజు వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి ప్రాతఃకాలపూజలు చేస్తారు. ఉభయదేవాలయాల్లో 4.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆలయ శుద్ధి అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి దర్శనాలు కొనసాగుతాయి. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 21న శ్రావణ రెండో శుక్రవారం, 28న మూడో శుక్రవారం, సెప్టెంబరు 4న నాల్గవ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను దేవస్థానం నిర్వహిస్తుంది. శ్రావణమాసం మొత్తం 19 రోజుల్లో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు పూర్తిగా నిలుపుదల చేశారు. అలాగే ఉదయాస్తమానసేవ, ప్రాతఃకాలసేవ, ప్రదోషకాలసేవ పూర్తిగా నిలుపుదల చేశారు. ధర్మప్రచారంలో భాగంగా శ్రావణమాసంలో గురువారం నుంచి అఖండశివభజనలను నిర్వహించనున్నారు. -
పోలీసుల అదుపులో బైక్ దొంగలు
● 15 బైక్లు స్వాధీనం బండిఆత్మకూరు: తెలంగాణతో పాటు తదితర ప్రాంతాల్లో బైక్లను అపహరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పెబ్బేరు ప్రాంతంలో జరిగిన బైకు చోరీ కేసులో పట్టుబడిన నిందితుడిని సమాచారం మేరకు అక్కడి పోలీసులు బుధవారం లింగాపురం గ్రామం చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు గ్రామానికి చెందిన వల్లెం వెంకటరమణ, భూమా శివారెడ్డిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 15 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మరో బైక్ను రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. -
శ్రీశైలం డ్యాంను సందర్శించిన సీడబ్ల్యుసీ సభ్యుడు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయాన్ని బుధవారం సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యుడు యోగేష్ పైతాంకర్ సందర్శించారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో శ్రీశైలం డ్యాంకు వస్తున్న వరదనీరు, సెల్ఫ్ క్యాచ్మెంట్లో వర్షపాతం, శ్రీశైలం ఆధారిత ప్రాజెక్ట్లకు విడుదల చేస్తున్న వరదనీరు, విద్యుత్ ఉత్పాదన, డ్యాం పటిష్టత, భద్రత వంటి అంశాలపై డ్యాం ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు చీఫ్ ఇంజినీర్ ఓఆర్కే రెడ్డి, డైరెక్టర్ కే శంకర్, అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ సంజీవ్, డ్యాం ఇంజనీర్లు వేణుగోపాల్రెడ్డి, రవికుమార్, తిప్పేస్వామి తదితరులు ఉన్నారు. భక్తిశ్రద్ధలతో శ్రీ చౌడేశ్వరిదేవి జయంత్యుత్సవం బనగానపల్లె రూరల్: శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి జయంత్యుత్సవాన్ని బుధవారం నందవరం గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం చేశారు. చండీహోమం అనంతరం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అధిష్టింపజేశారు. శాస్త్రోక్తంగా పల్లకి సేవ, సహస్త్ర దీపాలంకరణ జరిపారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. జాతీయ ఉపకారవేతన ఫలితాల విడుదల నంద్యాల(న్యూటౌన్): గతేడాది నిర్వహించిన జాతీయ ఉపకారవేతన ఫలితాలు విడుదలైనట్లు నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి ిజనార్దన్ రెడ్డి తెలిపారు. వివరాలు ప్రభుత్వ కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఎంపిక అయిన విద్యార్థులు వెంటనే బ్యాంకు అకౌంట్ తెరిచి, ఆధార్ను లింక్ చేయించి, డీబీటీ ద్వారా డబ్బులు జమయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వివరాలు తనిఖీ చేసుకొని విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships. gov.inలో నమోదు చేసుకొని దరఖాస్తును సబ్మిట్ చేయాలని తెలిపారు. 183 టీఎంసీల నీటినిల్వలు శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో బుధవారం సాయంత్రానికి 183.4198 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. రెండు రోజులుగా జూరాల నుంచి ఇన్ఫ్లో పెరుగుతోంది. బుధవారం జూరాల నుంచి 83,161 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. డ్యామ్ నీటిమట్టం 879.10 అడుగులకు చేరుకుంది. మంగళవారం నుంచి బుధవారం వరకు దిగువ ప్రాజెక్ట్లకు శ్రీశైలం నుంచి 41,118 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో 13.627 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి 26,052 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,016 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మార్కెట్ యార్డులో ఇసుక దందా! బండిఆత్మకూరు: ప్రభుత్వ ఆధీనంలోని బండిఆత్మకూరు మార్కెట్ యార్డును టీడీపీ నాయకులు ఇసుక నిల్వ కేంద్రంగా మార్చుకున్నారు. ప్రజా అవసరాలకు కోసం ఽఉద్దేశించిన ప్రభుత్వ స్థలంలో వేల టన్నుల ఇసుక నిల్వ చేయడానికి అనుమతులు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తతంగం కొన్ని నెలలుగా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
జీఎస్టీ వసూళ్ల లక్ష్య సాధనకు సమన్వయంతో పనిచేయాలి
కర్నూలు(సెంట్రల్): జీఎస్టీ వసూళ్ల సాధన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో వాణిజ్య పన్నుల శఖ ఆధ్వర్యంలో జీఎస్టీ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ మార్గాలను మెరుగుపరచడంతోపాటు పన్ను వసూళ్లలో పారదర్శకతను పెంచాలన్నారు. జీఎస్టీ బకాయిలు, రెవెన్యూ బకాయిల వసూళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. కొనుగోలు పోర్టల్లో వేలం ప్రక్రియకు సంబంధించినఅంశాలను సమవర్ధంతంగా నిర్వహిస్తూ బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. పన్ను డిఫాల్టర్ల పాన్ నంబర్ల ఆధారంగా బ్యాంక్ ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయాలన్నారు. ఫ్రీజ్ చేసిన అనంతరం లీడ్బ్యాంకు మేనజర్తో అధికారులు సమన్వయం చేసుకోవాలని కమర్షియల్ టాక్స్ జేసీ నీరజను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జెడ్ఎం మధసూదన్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాదు, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి బజారి, జెడ్పీ సీఈఓ సుధాకరరెడ్డి, మైనింగ్ డీడీ నాగిని పాల్గొన్నారు. డ్రంకెన్ డ్రైవ్లో నలుగురికి జరిమానా డోన్ రూరల్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురిలో ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ మేరకు డోన్ స్పెషల్ జ్యూడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు రూరల్ సీఐ రాకేష్, ఎస్సై మమత తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల డ్రైవర్లతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదమన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం వెల్దుర్తి: పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హైవే 44పై మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. హైవే పోలీసుల సమాచారం అందుకుని సంఘటనాస్థలికి చేరుకున్న ఎస్ఐ నరేశ్, పోలీసులు విచారించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు గుర్తించారు. మృతుడు కొద్దికాలంగా పట్టణంలో, హైవేపై మానసిక స్థితి సరిగా లేక భిక్షాటన చేస్తూ తిరిగేవాడిగా తెలుసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక సీహెచ్సీ మార్చురీకి తరలించారు. మృతునికి 45 ఏళ్లు పైబడి ఉండొచ్చని, షర్టు, ప్యాంటు వేసుకున్నాడని, గుర్తించిన వారు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. వృద్ధురాలి ఆత్మహత్య బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలోని బేతంచెర్ల రోడ్డులోని కోళ్లఫారం వద్ద నివాసం ఉంటున్న ఎన్. లక్ష్మీదేవి (80) అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీదేవి కొన్ని సంవత్సరాల నుంచి కీళ్ల నొప్పుల వ్యాధి, మూర్చ వ్యాధి సమస్యలతో ఇబ్బందులుపడుతోంది. కుటుంబసభ్యులు పలు వైద్యశాలలో చూపించినా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెంది జీవితంపై విరక్తి చెంది రసాయన పౌడర్ను నీటిలో కలుపుకుని తాగి ఆత్యహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కల్పన తెలిపారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం కర్నూలు: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏపీఎస్పీ రెండో బెటాలియన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వరప్రసాదరెడ్డి కుటుంబానికి సహో ద్యోగులు ఆర్థిక సాయం అందించారు. 2007 బ్యాచ్ గ్రేహౌండ్స్ సిబ్బంది అండగా నిలిచారు. జూలై 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో వరప్రసాద రెడ్డి మృతిచెందారు. సహచరుడు మరణించడంతో విషాదంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 2007 బ్యాచ్ గ్రేహౌండ్స్ యూనిట్ సిబ్బంది అందరూ కలసి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. మొత్తం రూ.1.75 లక్షల ఆర్థిక సాయాన్ని బెటాలియన్ కమాండెంట్ దీపిక పాటిల్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలిచిన తోటి సిబ్బందికి మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత
● వైఎస్సార్సీపీలో చేరిన వంద మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలుచాగలమర్రి: కేవలం రెండు సంవత్సరాల పాలన కాలంలోనే ప్రజావ్యతిరేకతను చంద్రబాబు ప్రభుత్వం మూటగట్టుకుందని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. చాగలమర్రి మండలంలోని గొడిగనూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏడు కుటుంబాలకు చెందిన 100 మంది బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. మాజీ సర్పంచ్ పత్తి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గొడిగనూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పొలికల చిన్న రామిరెడ్డి, పెద్దిరెడ్డి, లింగారెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, కమటం నరసింహారెడ్డితో పాటు వారి కుటుంబాలకు చెందిన సుమారు 100 మందిసభ్యులకు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో శాంతిభద్రతలు లోపించాయన్నారు. పోలీసులపైనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు దిగుతున్నారని, రాష్ట్రంలో హింస పెచ్చరిల్లిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఆగడాలు చెప్పనలవి కావడం లేదన్నారు. గంజాయి విక్రయం విచ్చలవిడిగా చేస్తుండటంతో యువత మత్తులో మహిళలపై ఘోరాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్సార్సీపీదే విజయం అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి.కుమార్రెడ్డి, మండల కార్యదర్శి శేషు రమేష్, ఎంపీటీసీ కె. లక్ష్మీరెడ్డి, పార్టీ నాయకులు నరసింహారెడ్డి, సుధాకర్రెడ్డి, మనోహర్రెడ్డి, మాజీ సర్పంచ్లు రమణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, షరీఫ్, రామకృష్ణారెడ్డి, చిన్న నాయుడు, మండల నాయకులు సుబ్బారాయుడు, అంకాల్రెడ్డి, చాంద్బాషా, పవన్ కుమార్, కదిరి దస్తగిరి పాల్గొన్నారు. -
పులి మరణం కేసులో ఎఫ్ఎస్ఓపై వేటు
● 7గురు ప్రొటెక్షన్ వాచర్ల తొలగింపు ఆత్మకూరు రూరల్: గత ఏడాది సెప్టెంబర్లో ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ఇందిరేశ్వరం సెక్షన్లో ఒక పెద్దపులి ఉచ్చుకు చిక్కుకోగా విషయం తెలిసి కూడా ఎన్టీసీఏ మార్గదర్శకాలు పాటించకుండా రహస్యంగా పులి కళేబరాన్ని దగ్ధం చేసిన ఘటనపై అటవీశాఖ చర్యలు మొదలు పెట్టింది. అప్పటి ఇందిరేశ్వరం ఎఫ్ఎస్ఓ డి.మహబూబ్బాషాను డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అపావ్ బుధవారం సస్పెండ్ చేశారు. అలాగే అందుకు సహకరించిన ఏడుగురు ప్రొటెక్షన్ వాచర్లను విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ పులి ఉచ్చులకు చిక్కుకోవడం ఒక విషాదమైతే.. ఆ విషయాన్ని దాచి పెట్టి సాక్ష్యాలను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమన్నారు. అటవీ శాఖలో మొలచిన కలుపు మొక్కలను పీకివేస్తామని.. తిరిగి నాగార్జునసాగర్–శ్రీశైలం అభయారణ్యంలో ఆత్మకూరు డివిజన్ను దుర్భేద్యంగా నిలబెడతామని ఆశాభావం వెలిబుచ్చారు. -
కోవెలకుంట్లలో చోరీ
కోవెలకుంట్ల: పట్టణంలోని బసిరెడ్డిబావి వీధిలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీనారాయణ ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తలుపులు బద్ధలు కొట్టి అందులో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5.50 లక్షల నగదును అపహరించుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి తిరుమల నుంచి ఇంటికి చేరుకున్న లక్ష్మీనారాయణ బీరువా తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోవెలకుంట్ల సీఐ హనుమంతునాయక్, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. డాగ్సా్వ్క్డ్, క్లూస్టీం రంగ ప్రవేశం చేసి చోరీఘటనపై ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో కోవెలకుంట్ల పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం స్కంద కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి బాబయ్య ఇంట్లో దొంగలు ప్రవేశించి రూ. 3 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ. 5 వేలు నగదు అపహరించుకెళ్లారు. సరిగ్గా వారం రోజులకే మరో చోరీ జరిగి భారీగా బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. -
ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి
● యూఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజుకర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకు ఉద్యోగు లు తీవ్రమైన పని ఒత్తిడి నుంచి బయట పడేందుకు వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) జిల్లా కన్వీనర్ నాగరాజు డిమాండ్ చేశారు. యూఎఫ్బీయూ పిలుపు మేరకు బుధవారం కర్నూలు గాయత్రీ ఎస్టేట్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారపేట శాఖ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ప్రభుత్వరంగ, ప్రయివేటు, గ్రామీణ బ్యాంకులకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. బ్యాంకు యూనియన్లు కొన్నేళ్లుగా చేస్తున్న డిమాండ్ల్లో ఐదు రోజు ల పని విధానం కల్పించాలనేది ప్రధానమైందన్నారు. ఈ డిమాండ్ను దాదాపు రెండేళ్ల క్రితం బ్యాంకు యూనియన్లతో జరిపిన చర్చల్లో ఐబీఏ అంగీకరించిందన్నారు. 2024 మార్చి 8న జరిగిన 12వ వేతన ఒప్పందంలో కూడా ఈ అంశాన్ని అంగీకరించి కేంద్రప్రభుత్వ అనుమతి కోసం ఐబీఏ ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ఇప్పటి వరకు సానుకూల స్పందన రాకపోవడం దారుణమని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో ఏఐబీఈఏ జిల్లా నాయకులు శివకృష్ణ, అజయ్, వాసుదేవరెడ్డి, అన్వర్, ఏఐబీవోసీ నాయ కులు రాజు, చంద్రమోహన్, పుష్పక్కుమార్, ఎన్సీబీఈ నాయకులు విద్యాసాగర్, శ్రీకాంత్, ఏపీజీబీ నాయకులు హనుమంతురెడ్డి, రాఘవేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలను పక్కాగా అమలుచేయాలి
కర్నూలు(అగ్రికల్చర్): కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పకడ్బందీగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎనర్జీ డిపార్టుమెంటు ఓఎస్డీ పీహెచ్ జానకిరామ్ జిల్లా విద్యుత్ అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూలులోని విద్యుత్ భవన్లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ అమలులో పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్యఘర్ యూఎల్ఏ మోడల్ కింద ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ల పనుల్లో పురోగతి పెంచాలన్నారు. జిల్లాకు మంజూరైన 23,077 సోలార్ రూఫ్టాప్ ప్లాంట్లను ఈ నెల చివర్లోగా ఏర్పాటు చేసి గ్రిడ్కు అనుసంధానం చేయడంతో పాటు ఎంఎన్ఆర్ఈ పోర్టల్లో వివరాలను అప్లోడ్ చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఆర్డీఎస్ఎస్ పనులను డిసెంబరు చివరిలోగా పూర్తి చేయాలన్నారు. పీఎం కుసుమ్– అగ్రికల్చర్ ఫీడర్లలో సోలరైజేషన్ పనుల పురోగతిని సమీక్షిస్తూ.. అగ్రిమెంటులోని నిబంధనల ప్రకారం పనులను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్, ఈఈలు రాజశేఖర్, భాస్కరరావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కల్లూరు మండలం ఏ.గోకులపాడులో నిర్మించిన సోలార్ రూఫ్టాప్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. -
బాధితులపైనే కేసు నమోదు
దాడి చేసిన వారిపైన కాకుండా పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాడిలో గాయపడి చేయి విరిగిన ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ విషయం పక్కన పెట్టారు. తలకు చిన్న గాయమైన వ్యక్తికి ఆలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి తీవ్రగాయాలైనట్లు సర్టిఫికెట్ తీసుకున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తమ ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారని ఆయనతో పాటు 34 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగకముందే తీవ్రమైన కేసు నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. -
సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకంగా నిలవాలి
కర్నూలు: ర్యాగింగ్ విద్యార్థి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే అమానుష చర్య అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు న్యాయ విజ్ఞాన వేదిక, వివేకానంద యువ ఫోరం సంయుక్తంగా జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో బుధవారం యువతలో సామాజిక బాధ్యత అనే అంశంపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకంగా నిలవాలి తప్ప ర్యాగింగ్ పేరుతో వేధించడం తగదన్నారు. మాదక ద్రవ్యాల వలలో పడితే యువత భవిష్యత్తు అంధకారం కావడమే కాకుండా వారి కుటుంబానికి, సమాజానికి తీరని నష్టమని హెచ్చరించారు. అన్యాయానికి గురైన వారు, బాధితులు టోల్ఫ్రీ నంబర్ 15100 ద్వారా లేదా దగ్గర్లోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. చివరలో విద్యార్థులచే ర్యాగింగ్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.శ్రీనివాసరావు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఎడమ చేతి వాటం.. అద్భుతం
● ప్రపంచ మేధావుల్లో వారే అధికం ● నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే దొర్నిపాడు: సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. ఎడమ చేతివాటం వారు నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. వారు చేసే పనులు, హావాభావాలు, కదలికలు అన్నీ వాళ్లవైపు తిప్పుకునేలా ఉంటాయి. అందుకే వారిని చూసి నేను లెఫ్ట్ అయ్యింటే బాగుండును.. అని అనుకుంటారు చాలా మంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఆగస్టు 13న ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే నిర్వహిస్తారు. కుడిచేతివాటం కల్గిన వారి కన్నా ఎడమ చేతివాటం వారు ఉన్నత స్థానాల్లో ఉంటారని వారికి తెలివి తేటలు గ్రహించే శక్తితో పాటు మంచి ఆలోచన శక్తి ఉంటుందని అంటారు. వీరికి జ్ఞాపకశక్తి, ఐక్యూ అధికంగా ఉన్నప్పటికీ చిన్నచిన్న విషయాలు వెంటనే మరచిపోవడం వీరికి సహజం. ఎడమ చేతివాటం ఉన్నవాళ్లు లెక్కలను కూడా చాలా వేగంగా చేయగలుతారని పలు పరిశోధనల్లో వెళ్లడైంది. అబ్దుల్ కలాం, ఐన్స్టీన్, న్యూటన్, మేరీక్యూరీ, అరిస్టాటిల్, అలాన్ ట్యూరింగ్ వంటి మేధావులంతా ఎడమచేతి వాటం ఉన్నవాళ్లే. అయితే ఎడమ చేతివాటం కల్గిన టైలర్లు కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే కత్తెర, కుట్టుమిషన్ డిజైనింగ్ పూర్తిగా కుడిచేతివాటం వారికి సరిపోయే విధంగా తయారైఉంటాయి. కంప్యూటర్ మౌస్, డ్రైవింగ్ చేసే వారు ఇలా చాలా మంది ఇబ్బందులకు గురవుతారు.ఒకే స్కూల్లో 13 మంది..దొర్నిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 13 మంది లెఫ్ట్హ్యాండర్స్ ఉన్నారు. వీరంతా చదువు, రైటింగ్, క్రీడల్లో ఎప్పుడు ప్రతిభ చూపుతుంటారు. ఒకే స్కూల్లో ఇంత మంది ఉండటం మాకు గర్వకారణం అని హెచ్ఎం చెన్నకేశ్వరి పేర్కొన్నారు. వారిని ప్రతి పనిలో అందరూ ప్రత్యేకంగా చూస్తుంటారని తెలిపారు.మన ప్రాంతంలో చాలా మంది కుడిచేతితో డబ్బులు ఇవ్వడాన్ని, మంచి పనులు ప్రారంభించడాన్ని సెంటిమెంట్గా పరిగణిస్తారు. అందుకే చిన్నప్పుడే తల్లిదండ్రులు ఎడమ చేతివాటం గమనిస్తే మాన్పించే ప్రయత్నం చేస్తారు. వారికి జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు మనం ఏమి చేయలేం. అందుకే వారిని ఇబ్బందులకు గురిచేయవద్దు. వయస్సు పెరిగేకొద్ది సంప్రాదాయాలు చెబితే వారు అర్థం చేసుకోని పద్ధతులను బట్టి నడుచుకోగలరు. – డాక్టర్ నేగల ఉశేని, పీహెచ్సీ, డబ్ల్యూ కొత్తపల్లె -
మొక్కజొన్న వైపు మొగ్గు
ఎల్నినో ప్రభావంతో జిల్లా రైతులు తక్కువ నీటితో పండించే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో బోర్లు బావులు, సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంట కాల వ్యవధి కేవలం 3 నెలలు కావడంతో రైతులు ఈ పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు. పంటకు 15 రోజులకోసారి నీటి తడులు అందిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 26,364 హెక్టార్లలో మొక్కజొన్న సాగులో ఉంది. దిగుబడి బాగా వస్తే ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ.30 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 59,626 హెక్టార్లలో సాగవగా ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది రైతులు వెనకడుగు వేయాల్సి వస్తోంది. మరింత వర్షాలు కురిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. – నంద్యాల(అర్బన్) -
కన్నీళ్లు దిగమింగి.. పైర్లను దున్నేసి!
తుగ్గలి: ప్రాణంతో సమానంగా చూసుకునే పైరును రైతు కన్నీళ్లు దిగమింగుకొని స్వయంగా ట్రాక్టర్తో దున్నేశాడు. వర్షాభావంతో పంట చేతికందకుండా పోతుందనే ఆవేదనతో ఓ రైతు ఆముదం, కంది పైర్లను ట్రాక్టర్తో దున్నేశారు. తుగ్గలి మండలంలోని ఉప్పర్లపల్లికి చెందిన రైతు సూర్యనారాయణాచారి తనకున్న 1.15 ఎకరాల్లో రెండు నెలల క్రితం ఆముదం, కంది పంటలు సాగు చేశాడు. సేద్యపు ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, కూలీలకు రూ.20 వేలకు పైగా ఖర్చు పెట్టారు. తర్వాత రెండు నెలలు దాటినా సరైన వర్షాలు లేకపోవడంతో పైర్ల ఎదుగూ బొదుగూ లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు వర్షం కురిసినా పంట దిగుబడులు రావనే ఆవేదనతో మంగళవారం ట్రాక్టర్ గుంటెకతో పంటను దున్నేశాడు. మున్ముందు వర్షం వస్తే ప్రత్యామ్నాయ పంట ఏదైనా వేసుకునే అవకాశం ఉంటుందని పంటను దున్నేసినట్లు రైతు వాపోయాడు. -
బంగారు నగలకు గిరాకీ
శ్రావణమాసం ప్రారంభంతో పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలకు మంచి రోజులు కావడంతో కోవెలకుంట్ల, సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, గోస్పాడు మండలాలకు చెందిన మహిళలు బంగారు నగల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉంగరం మొదలుకుని అన్ని రకాల నగల కొనుగోలుకు ఆర్డర్లు ఇస్తున్నారు. తులం బంగారం ధర రూ.1.50 లక్షలకు పైగా పలుకుతున్నప్పటికీ పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి రోజులు కావడంతో బంగారు నగల వ్యాపారం బాగుంటుందని ఆశిస్తున్నాం. – పెండేకంటి సుబ్రమణ్యం, బంగారు నగల వ్యాపారి, కోవెలకుంట్ల -
శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకానికి పూర్ణాహుతి
శ్రీశైలంటెంపుల్: సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో ఐదు రోజుల పాటు శ్రీశైల దేవస్థానంలో నిర్వహించిన వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేక క్రతువులు పూర్ణాహుతితో ముగిశాయి. మంగళవారం స్వామివారి ఆలయంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిరోజు రుష్యశృంగ జపం, వారుణానుక పారాయణలు, వరుణజపం, భాగవత, విరాటపర్వ పారాయణలు, పంచాక్షరి జపం మొదలైనవి జరిపించారు. అలాగే యాగశాల ప్రవేశం, ఏకాదశ రుద్ర రుష్యశృంగ సహిత సహస్ర ఘటార్చన, రుద్రహోమం, చండీపారాయణ, శ్రీచక్రార్చన, నవావరణార్చన విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. చివరి రోజు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శుభ ముహూర్తాల శ్రావణం
కోవెలకుంట్ల: ఈ ఏడాది శ్రావణమాసం గురువారం నుంచి ప్రారంభం కానుండటంతో శుభమూర్తాలు రానున్నాయి. జిల్లాలో పలు జంటలు వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు నడిచి జీవితాన్ని పంచుకునే శుభ గడియలు దగ్గరయ్యాయి. నెల రోజుల తర్వాత తిరిగి ముహూర్తాలకు మంచి రోజులు రావడంతో ఈ నెల 16వ తేదీ నుంచి కల్యాణ వీణలు మోగనున్నాయి. మాంగల్యం తంతునా.. మమజీవనం హేతునా.. కంఠేభద్మామి సుభగే.. త్వంజీవశరశరం.. అంటూ పెళ్లిలో వినిపించే మంత్రాలు మార్మోగనున్నాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పట్టణాలు, పల్లెలు పెళ్లి సందడికి రెడీ అయ్యాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జిల్లాలోని మహానంది, యాగంటి, నయనాలప్ప, అహోబిలం, ఓంకారం, భోగేశ్వరం, శ్రీశైలం, బుగ్గరామేశ్వరం, తదితర పుణ్యక్షేత్రాలతోపాటు వివిధ ప్రాంతాల్లోని కల్యాణ మండపాలు, పంక్షన్హాళ్లలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. పల్లెలు, పట్టణాల్లో సందడి శ్రావణ మాసంలో పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో పల్లెలు, పట్టణాల్లో పెళ్లి సందడి మొదలైంది. నెల రోజుల విరామం తర్వాత మంచి ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. పెళ్లికార్డులు అచ్చువేయించడం, పట్టుచీరలు, వస్త్రాలు, బంగారు నగల కొనుగోలు, తదితర పెళ్లి సామగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లాలోని ఆయా పట్టణాల్లో వస్త్ర, బంగారు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఒక పెళ్లి ఎందరికో ఉపాధి చూపుతోంది. వస్త్ర, బంగారు దుకాణాలతోపాటు పెళ్లి మండపాలు, ట్రావెల్స్, పురోహితులు, ఫోటోలు, వీడియో గ్రాఫర్స్, సాంస్కృతిక కళాకారులు, క్యాటరింగ్, ఎలక్ట్రీషియన్స్, బ్యాండుమేళం, పూలఅంగళ్లు, ఇలా ఎందరికో చేతి నిండా పని దొరుకుతోంది. ఆయా ముహూర్తాల్లో వివిధ కేటగిరీలకు చెందిన వారికి ఉపాధి దొరుకనుండటంతో వారంతా సంబర పడుతున్నారు. రెండు నెలల్లో మంచి ముహూర్తాలుఈ నెల 13వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండగా పరాభవనామ సంవత్సర శ్రావణ మాసం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దాదాపు ఈ రెండు నెలల్లో 20 శుభ ముహూర్తాలు ఉన్నాయి. నెల రోజుల బ్రేక్ తర్వాత తిరిగి శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో పెళ్లిభాజాలు మోగనున్నాయి. ఈ నెలలో 14, 15, 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీల్లో, వచ్చే నెల 3, 4, 5, 8, 10, 13, 14 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని వేద పండితులు చెబుతున్నారు. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం ఆగస్టు, సెప్టెంబర్లో మంచి ముహూర్తాలు కిటకిటలాడుతున్న వస్త్ర, జ్యువెలరీ దుకాణాలు ఒక పెళ్లి.. ఎందరికో ఉపాధి -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
● మృతుడు పశ్చిమబెంగాల్ వాసి ● ఎల్సీ తీసుకోకముందే స్తంభం ఎక్కించడంతో ప్రమాదం జూపాడుబంగ్లా: విద్యుత్ అధికారులు, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కాంట్రాక్టర్, సూపర్వైజర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. మండ్లెం గ్రామంలో ఆర్డీఎస్ఎస్ (రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం) పనులు చేస్తూ విద్యుదాఘాతంతో పశ్చిమబెంగాల్కు చెందిన రాజాషేక్ (28) మంగళవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు, అఽధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్డీఎస్ఎస్ పనులు చేసేందుకు సూపర్వైజర్లు శివ, అఖిల్ అధ్వర్యంలో కార్మికులు ఉదయం 10 గంటల మండ్లెం గ్రామంలోని పుల్లారెడ్డి బంకు వద్దకు చేరుకున్నారు. లైన్మెన్ రాజశేఖర్ ఆర్డీఎస్ఎస్తో పాటు మండ్లెం ఫీడర్ రెండింటికీ ఎల్సీ తీసుకోవాల్సి ఉండగా కేవలం మండ్లెం ఫీడర్కు మాత్రమే 10.20 గంటలకు ఎల్సీ తీసుకున్నట్లు విద్యుత్ సబ్స్టేషన్ రికార్డుల్లో నమోదు చేశారు. ఘటన ప్రాంతం వద్ద సీసీ కెమెరా దృశ్యాల్లో ఉదయం 10.16 గంటలకు విద్యుదాఘాతంతో స్తంభంపై నుంచి రాజాషేక్ కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు నమోదైంది. దీంతో లైన్మెన్ ఎల్సీ తీసుకోకముందే కార్మికుడిని విద్యుత్ స్తంభం ఎక్కించినట్లు తెలుస్తోంది. విద్యుత్షాక్తో స్తంభం పైనుంచి కిందపడిన రాజాషేక్ను అక్కడున్న కార్మికులు హుటాహుటిన నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకొని అధికారులు, కాంట్రాక్టర్లు అక్కడి నుంచి ఎస్కేప్ కావడం గమనార్హం. ఎస్ఐ మల్లికార్జున నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడు రాజాషేక్ పశ్చిమబెంగాల్ రాష్ట్రం, లక్ష్మిపూర్బెల్దాగ్ గ్రామం, వీటీసీ బాగ్బరి, పీఓ మలీహా, మల్దా జిల్లా వాసిగా ఆధార్కార్డు ప్రకారం వివరాలు బహిర్గమయ్యాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తోటి కార్మికులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మృతుడి కుటుంబ సభ్యులెవరూ లేకుండానే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. బాధిత కుంటుంబానికి ఎంతో కొంత ముట్టజెప్పి సమస్యలేకుండా మృతదేహాన్ని పశ్చిమబెంగాల్కు తరలించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. -
ఉత్తమ ఫొటోగ్రాఫర్గా వడ్డె శ్రీనివాసులు
అవార్డుకు ఎంపికై న చిత్రం కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ (ఏపీపీజేఏ) జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫొటో కాంపిటీషన్లో కర్నూలులో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్న వడ్డె శ్రీనివాసులు ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 19న జరిగే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీపీజేఏ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలకు 110 మంది ఫొటోగ్రాఫర్లు 440 ఫొటోలను పంపారు. ఇందులో అచీవ్మెంట్ విభాగంలో శ్రీనివాసులు తీసిన ఫొటోకు అవార్డు దక్కింది. -
కూలీల రైలు బండి!
రైలెక్కుతున్న కూలీలుకోసిగి: రోజు వారీ కూలీలు పని కోసం అన్వేషిస్తూ బతుకు పోరు సాగిస్తున్నారు. ఉదయాన్నే రైలులో బయలుదేరి ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుని రాత్రికి స్వగ్రామానికి చేరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వెళ్లిన చోట పనులు దొరక్కపోతే మధ్యలో మరో రైలు పట్టుకుని కడుపు మాడ్చుకుని ఇంటికి చేరుకోవాల్సిన దుస్థితి. కోసిగి మండలంలోని కోసిగి, నేలకోసిగి, వందగల్లు, డి.బెళగల్, గౌడుగల్లు, జుమ్మాలదిన్నె, భూంపల్లి, గ్రామాలతో పాటు కౌతాళం మండలం కరణి, చిరుతపల్లి గ్రామాల నుంచి దాదాపు 600 నుంచి 700 మంది కూలీలు రోజు ఉదయం 7 గంటలకంతా కోసిగి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. కోసిగి నుంచి తుంగభద్ర, మఠమారి, రాయచూరు, కృష్ణ, సైదాపూర్ వరకు రైలులో ప్రయాణం సాగించి ఆయా ప్రాంతాల్లో పని వెతుక్కుంటారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పత్తి పొలాల్లో కలుపు మొక్కలు ఏరేందుకు వెళుతున్నారు. మగవారితో పాటు మహిళలు కూడా రోజూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎకరం పొలంలో కలుపు తీసేందుకు రూ.2 వేలు చొప్పున ఇస్తున్నట్లు కూలీలు చెబుతున్నారు. మండలంలో వర్షాలు లేక పంటలు అంతంత మాత్రమే ఉన్నాయని, ఇక్కడ పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు పనులకు వెళుతున్నట్లు కూలీలు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న వీబీ జీ రాంజీ పనులు గిట్టుబాటు కావడం లేదని ఆరోపించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
గోనెగండ్ల: మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో బేస్త రమేష్ (20) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గంజిహళ్లికి చెందిన పెద్ద బడేసావ్, ఈశ్వరమ్మకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి రెండెకరాల పొలం ఉంది. నాలుగేళ్ల క్రితం పెద్ద బడేసావ్ మృతిచెందాడు. దీంతో పెద్ద కుమారుడు రమేష్ పొలం పనులు చేస్తున్నాడు. గత నెలలో రూ.1.50 లక్షలు పెట్టి రెండు ఎద్దులను కొనుగోలు చేశాడు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం ఎద్దులను తీసుకొని పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా ఎద్దులు కట్టేసి ఉన్నాయి. రమేష్ సెల్ఫోన్ చెట్టుకింద పడిఉంది. రాత్రంతా గాలించినా అతని ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో మంగళవారం మల్లెల వాగు వంకలో రమేష్ శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న సీఐ చంద్రబాబు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలోని కొందరు రమేష్ను కొట్టి చంపి నీటి గుంతలో పడేశారని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఐ చంద్రబాబు మాట్లాడుతూ.. అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేసుకున్నామని, శవ పరీక్ష నివేదిక ఆధారంగా విచారణ జరుపుతామని వెల్లడించారు. -
ఎమ్మిగనూరులో చోరీ
● 40 తులాలు వెండి, రూ.20 వేలు నగదు అపహరణ ● కుటుంబం తీర్థయాత్రలకు వెళ్లడంతో దొంగల చేతివాటం ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని లక్ష్మీపేటలో రమేష్ అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వివరాలు.. లక్ష్మీపేటకు చెందిన బజ్జిల వ్యాపారి రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి పది రోజుల క్రితం అరుణాచలం, తిరుపతితో పాటు తీర్థయాత్రలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తలుపులకు లాక్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించి ట్రంకు పెట్టెలో ఉంచిన రూ.20 వేల నగదు, 40 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. తీర్థయాత్రల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న రమేష్ కుటుంబ సభ్యులు గేటు తాళం తీసి లోపలికి వెళ్లగా డోర్ లాక్ తీసి ఉండటంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కంబగిరి రాముడు, ఏఎస్ఐ కిష్టప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పట్టణ పోలీసుల తెలిపారు. గడ్డివాముల దగ్ధం ● సుమారు రూ.3 లక్షలు నష్టం దొర్నిపాడు: మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో మంగళవారం గడ్డివాములకు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన మద్దుబైగారి హుసేన్బాషాకు చెందిన మూడు గడ్డివాములు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. వెంటనే ఆళ్లగడ్డ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు కాలిపోయిన గడ్డివాములను పరిశీలించారు. కాడెద్దులు, గేదెలకు నోటికాడి మేత లేకుండా పోయిందని ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయంతో పాటు పశుగ్రాసం అందించాలని బాధితుడు కోరారు. సుమారు రూ.3 లక్షలు వెచ్చించి చొప్ప, వరిగడ్డితో వాములు వేసుకున్నట్లు చెప్పారు. అగ్నిమాపక కేంద్రం అధికారి భీముడునాయక్, ఎల్ఎఫ్ మనోహర్రెడ్డి, సిబ్బంది రమణయ్య, గుర్రప్ప ఉన్నారు. వాటర్ గ్రిడ్ పైప్ లీకేజీ బేతంచెర్ల: ఆర్ కొత్తపల్లె గ్రామ సమీపంలో మంగళవారం గోరుకల్లు వాటర్ గ్రిడ్ మెయిన్ పైపులైన్ పగిలి నీరు వృఽథాగా పోతోంది. బేతంచెర్ల నుంచి డోన్ వైపు వెళ్తున్న ప్రధాన పైపులైను పగిలి నీరు ఎగసిపడుతోంది. వాటర్ గ్రిడ్ అధికారులు స్పందించి పైప్లైన్కు మరమ్మతులు చేపట్టి విలువైన నీరు నేలపాలు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గుణీత్ రెడ్డి గురి తప్పలేదు! వెలుగోడు: రేగడగూడూరు గ్రామానికి చెందిన ఎన్. గుణీత్ రెడ్డి ఆర్చరీలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. జిల్లా క్రీడా సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 10న నిర్వహించిన జిల్లా స్థాయి ఆర్చరీ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించి అమరావతిలో ఎస్ఏఏపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అమరావతి చాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. గుణీత్ రెడ్డి ఇప్పటికే 2026 మార్చిలో ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొని తన ప్రతిభ చాటుకున్నాడు. తాజాగా జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. తండ్రి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గుణీత్ రెడ్డి క్రమశిక్షణతో నిరంతరం శిక్షణ పొందుతున్నాడు. -
వీబీఆర్కు కొనసాగుతున్న ఇన్ఫ్లో
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు టీజీపీ లింక్ చానల్ ద్వారా 4 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్లో నీటిమట్టం 254.01 మీటర్లు (833.33 అడుగులు)గా నమోదైంది. ప్రస్తుతం 3.661 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 264.70 మీటర్లు కాగా, స్థూల సామర్థ్యం 16.95 టీఎంసీలు. ప్రస్తుతం క్యాచ్మెంట్ ప్రాంతం నుంచి ఎలాంటి నీటి ప్రవాహం లేదు. టీజీపీ లింక్ చానల్ ద్వారానే 4 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం 80 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఇందులో వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాల తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన 60 క్యూసెక్కులు ఆవిరీభవనం, సీపేజ్, ఇతర వ్యవస్థ నష్టాల రూపంలో నమోదవుతున్నాయి. ఇక 1ఎల్, 1ఆర్ కాలువలకు, టీజీపీ మెయినన్ కెనాల్కు ప్రస్తుతం నీటి విడుదల లేదు. స్పిల్వే ద్వారా అదనపు నీటి ప్రవాహం కూడా లేదు. -
టీడీపీ అక్రమ కేసులకు భయపడబోం
కల్లూరు: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి తేల్చి చెప్పారు. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలు రానున్నట్లు తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టు నుంచి నేరుగా కర్నూలు జైలుకు చేరుకుని అక్కడ విరూపాక్షిని పరామర్శించనున్నారని తెలిపారు. జగన్ పర్యటన ఏర్పాట్లపై మంగళవారం కల్లూరులోని తన నివాసంలో జిల్లా ముఖ్యనేతలతో కాటసాని సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్సీపీ మహి ళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజ య మనోహరి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వకర్త కోట్ల హర్షవర్దన్రెడ్డి, ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య, నేతలు అహమ్మద్ అలీఖాన్, మాజీ డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, కల్లూరు అర్బన్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై నాయకులకు కాటసాని దిశానిర్దేశం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని కాటసాని ఆరోపించారు. కార్యకర్తను పరామర్శించడానికి వెళ్లిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చివరికి ఎమ్మెల్యేలపై కూడా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ● రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి విమర్శించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయన్నారు. వీటిపై స్పందించని ప్రభుత్వం కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. ● అక్రమ అరెస్టులు, దాడులతో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని పార్టీ మైనార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. జననేత స్ఫూర్తితో ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ● 2029 ఎన్నికల్లో కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య అన్నారు. ● రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజాస్వామ్య పాలన సాగుతుందా? అని.. కోట్ల హర్షవర్దన్రెడ్డి ప్రశ్నించారు. దాడులు, బెదిరింపులకు భయప డేది లేదన్నారు. రేపు కర్నూలుకు వైఎస్ జగన్ రాక వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
వసతి గృహాల నిర్మాణానికి రూ.25 లక్షల విరాళం
మహానంది: మహానందిలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వర సదనం వసతి గృహాల నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారు. మంగళవారం ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ ఎరమల మధు, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకర శర్మ, ముఖ్య అర్చకులు రాజమాణిక్యశర్మ, మణికంఠశర్మ హైదరాబాద్లో పలువురు భక్తులను కలిశారు. హైదరాబాద్కు చెందిన డి.సుబ్రహ్మణ్యం, సంధ్యారాణి దంపతులు సూట్ రూమ్ నిర్మాణానికి రూ. 15 లక్షల చెక్కును వారికి అందించారు. అలాగే కూకట్పల్లిలో ఉంటున్న సన్నిధి సురేష్బాబు, లత దంపతులు రూ. పది లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చి అందులో భాగంగా రూ. 2.50 లక్షలు మొదటి విడతగా చెల్లించారు. గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన దాతలకు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. వసతి గృహాల నిర్మాణానికి దాతలు సహకరిస్తుండటం శుభపరిణామమని ఈఓ అన్నారు. గుండెపోటుతో ఐసీడీఎస్ సూపర్వైజర్ మృతి మహానంది: మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత (45) గుండెపోటుతో మృతి చెందారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన సూపర్వైజర్ కవిత మంగళవారం అంగన్వాడీ టీచర్లకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమానికి స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం సమావేశానికి వెళ్లిన ఆమె పాఠశాలలో ప్రేయర్ అనంతరం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, రిసోర్స్ పర్సన్స్, అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడుతుండగానే రెయిలింగ్పై కుప్ప కూలిపడిపోయింది. వెంటనే ఉపాధ్యాయులు కారులో నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. కవిత మృతి విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ లీలావతి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం రూ. 25 వేలు అందించారు. ఎంఈఓ రామసుబ్బయ్య, ఏపీ ఎన్జీఓల సంఘం జిల్లా నాయకులు హుసేన్రెడ్డి, తదితరులు కవిత మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాకు తెలుసులే.. రోడ్లు ఎక్కడేయాలో! ● సమస్యను విన్నవించిన ప్రజలతో ఎమ్మెల్యే జయసూర్య జూపాడుబంగ్లా: ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి దండాలు పెట్టి ఓట్లు అడిగిన నాయకుడు.. గెలిచిన తర్వాత అదే ప్రజలను చులకనగా మాట్లాడటం చూసి జూపాడుబంగ్లా ప్రజలు ఆశ్చర్యపోయారు. మంగళవారం జూపాడుబంగ్లాలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాసానగర్ కాలనీలో సిమెంటు రోడ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నామని త్వరగా రోడ్లు నిర్మించి పుణ్యం కట్టుకోవాలని కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరారు. అయితే ‘మాకు తెలుసులేవయ్యా...ఎక్కడెక్కడ రోడ్లు లేవో, దెబ్బతిన్నాయో తెలుసు.. కొత్తరోడ్లు వేయించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మంజూరైన వెంటనే నిర్మిస్తామంటూ’ బదిలివ్వటంతో కాలనీవాసులు షాక్కు గురయ్యారు. అలాగే తమ కాలనీలో తాగునీటి ఇక్కట్లు తీర్చి పుణ్యం కట్టుకోండంటూ క్వార్టర్స్ కాలనీవాసులు మొర పెట్టుకున్నారు. ముస్లిం కాలనీలో శిథిలమైన 40 ఏళ్ల క్రితం నాటిని ట్యాంకును పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ చంద్రశేఖర్నాయక్, ఎంపీడీఓ గోపికృష్ణ, ఏఈ లు బషీర్, నాగేంద్రబాబు, ఏఓ కృష్ణారెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
వేరుశనగను మేసిన వారిపై చర్యలు తీసుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు ఉచితంగా విత్తన కాయలను పంపిణీ చేసి వేరుశనగ సాగును ప్రోత్సహించాల్సిన వ్యవసాయ అధికారులు లోపాయికారిగా అమ్ముకోవడం దారుణమని, దీనికి పాల్పడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.జగన్నాథం డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘సబ్సిడీ వేరుశనగలో ‘విశిష్ట’ దోపిడీ’ శీర్షికతో వార్తా కథనం ప్రచరితమైంది. దీనిపై సమగ్రంగా విచారణ జరుపాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కాగా అంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, నాయకులు రాముడు, మహబూబ్బాషా తదితరులు వేరుశనగను దారి మల్లించడంపై జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వచ్చారు. డీఏఓ అందుబాటులో లేకపోవడంతో అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్కు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ.. జిల్లాలోని 16 మండలాలకు వంద శాతం సబ్సిడీపై పంపిణీ చేసేందుకు విశిష్ట రకం వేరుశనగ సరఫరా కాగా 90 శాతం దారిమల్లించి అమ్మేసుకున్నారని వాపోయారు. రైతులకు తీరని అన్యాయం చేసిన వ్యవసాయ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
నష్టం మొలకెత్తి.. కష్టం మట్టిలో కలసి!
కరువు ఉరమడంతో రైతు కష్టం మట్టిలో కలిసిపోతుంది. కోటి ఆశలతో సాగు చేసిన పంటలను కాపాడుకోలేక దున్నేస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఎల్నినో దెబ్బకు వరుణుడు జాడ లేకపోవడంతో పంటలు బెట్టపోవడంతో రైతులు ఆశలు వదులుకుని చెరిపేస్తున్నారు. పెట్టుబడితో పాటు రైతుల రెక్కల కష్టం మట్టిపాలవుతోంది. చాకరాజువేముల గ్రామానికి చెందిన మిన్నల్ల అనే కౌలు రైతు 25 ఎకరాలు మినుము సాగు చేశాడు. ఎకరాకు రూ.10 వేల వరకు పెట్టుబడులు వెచ్చించాడు. కానీ పంట ఎండుముఖం పట్టడంతో ప్రత్యామ్నాయ పంట చేసుకునే క్రమంలో మినుమును ట్రాక్టర్తో దున్నేశాడు – దొర్నిపాడు


