breaking news
Nandyala
-
మయూర వాహనంపై మహానందీశ్వరుడి విహారం
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానందీశ్వరస్వామి దంపతులు ఆదివారం ఉదయం మయూర వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి మహానందీశ్వరస్వామి దంపతులు నంది వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తజనం మధ్య గ్రామోత్సవం కనులపండుగగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పూజల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, రుత్విక్కులు, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మహానందీశ్వరస్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు అందించారు. అలాగే రూ. 15 లక్షల విలువైన సూట్రూమ్ నిర్మాణంలో భాగంగా హైదరాబాద్ నగరానికి చెందిన యలమంచిలి సాంబశివరావు, సుజాత దంపతులు రూ. లక్ష విరాళం అందించారు. -
నేటి నుంచి ‘సహకార’ నిరాకరణ
● నిరవధిక సమ్మె ప్రకటించిన సహకార సంఘాల ఉద్యోగులు ● జిల్లాలోని 99 సహకార సంఘాల్లో నిలిచిపోనున్న అన్ని రకాల సేవలు కర్నూలు(అగ్రికల్చర్): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబరు 6 నుంచి వివిధ రూపాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంలో సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులను పలుసార్లు కలసినప్పటికి ఫలితం కనిపించలేదు. గుంటూరులోని సహకార శాఖ కమిషనరేట్ ఎదుట సుదీర్ఘంగా రిలే దీక్షలు చేపట్టినప్పటికీ పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లోనే నిరవధిక సమ్మె చేపట్టినట్లు ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హరీఫ్ బాషా తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉన్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపుదశకు చేరుతోంది. ఈ సమయంలో రికవరీలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. సంఘాల ఉద్యోగులు సమ్మెబాట పడితే రికవరీలు నిలిచిపోనున్నాయి. రుణాల పంపిణీ ఆగిపోయే ప్రమాదం ఉంది. సహకార సంఘాల ఉద్యోగులు సమ్మె లోకి వెళితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇవీ డిమాండ్లు.. ● జీవో 36 ప్రకారం సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ● వేతన సవరణ కార్యరూపం దాల్చేవరకు మధ్యంతర భృతి ఇవ్వాలి. ● పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి. ● రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించాలి. ● ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాలి. ● బ్యాంకు ద్వారా కాకుండా నేరుగా సంఘాల ద్వారానే రుణాలు పంపిణీ చేయాలి. ● 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. ● కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి డీఎల్ఎస్ఎఫ్ ద్వారా జీతభత్యాలు చెల్లించాలి. -
కేసీ కాల్వకు నీటి పంపింగ్ నిలిపివేత
● ఆందోళనలో రైతులు జూపాడుబంగ్లా: ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి కర్నూలు–కడప కాల్వకు అధికారులు నీటి పంపింగ్ నిలిపి వేశారు. తుంగభద్ర డ్యాం మరమ్మతు పనుల్లో భాగంగా కేసీ కాల్వకు జనవరి 17 నుంచి సుంకేసుల నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. రబీలో సాగు చేసిన పంటలకు సాగునీరివ్వకపోతే పంటలు ఎండి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతుల ఆందోళన చేశారు. దీంతో ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి కేసీ కాల్వకు 5 టీఎంసీల నీటిని సరఫరా చేయటానికి ప్రభుత్వం అనుమతులివ్వటంతో జనవరి 25 నుంచి కేసీ కాల్వకు అధికారులు నీటి పంపింగ్ను ప్రారంభించారు. ఆదివారం నాటికి ఐదు టీఎంసీల నీటి పంపింగ్ పూర్తికావడంతో నిలిపివేశారు. ప్రస్తుతం పంటలు సాగు చేసి రెండు మాసాలు కాగా పూత, పిందె దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాల్వ కు సాగునీటి సరాఫరా నిలిపేస్తే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని రైతులు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చర్య లు తీసుకొని కేసీ కాల్వకు మార్చి నెలాఖరుదాకా సాగునీటిని సరఫరా చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నేడు కలెక్టరేట్లోప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 16 తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖలో డిప్యూటేషన్లు! ● అవసరం లేకపోయినప్పటికీ పైరవీల ద్వారా బదిలీలు కర్నూలు(అగ్రికల్చర్): పెద్ద ఎత్తున పైరవీలు చేసి డిప్యూటేషన్(ఆన్డ్యూటీ)పై బదిలీలు చేయించుకునే సంస్కృతి వ్యవసాయ శాఖలో ఎక్కువగా ఉంటోంది. కర్నూలు మండలం ఎదురూరు ఫామ్కు ఒక ఏఓ, ఒక ఏఈఓ, ఒక ఆఫీసు సబార్డినేటు పోస్టు ఉంది. ఎప్పుడూ లేని విదంగా ఇక్కడ డిప్యూటేషన్పై ఆరు నెలలుగా ఆదనంగా మరో ఏఓ పనిచేస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ డిప్యూటేషన్పై బదిలీ చేశారనే చర్చ జరుగుతోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని భూసార పరీక్ష కేంద్రానికి ఒక ఏవో పోస్టు మాత్రమే ఉంది. అదనంగా మరో ఏఎ డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) దాదాపు నిర్వీర్యమైంది. ఆత్మలో కూడా ఒక ఏఓ డిప్యుటేషన్పై కొనసాగుతున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో టెక్నికల్ ఏవో పోస్టులు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. అయితే ఆన్డ్యూటీపై అదనంగా నలుగురు ఏఓలు పనిచేస్తున్నారు. డీఆర్సీలో ఇద్దరు ఏఓలు ఆన్డ్యూటీపై పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్డ్యూటీపై పనిచేస్తున్న వారందరూ కొనసాగించే విధంగా పైరవీ చేస్తుండగా.. మరికొంత మంది ఏఓలు ఆన్డ్యూటీపై బదిలీల కోసం పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజాస్వామ్య సంఘాలు బలోపేతం కావాలి కర్నూలు(సెంట్రల్): ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక పదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా వేదికను ఇతర జిల్లాలకు విస్తరింపజేయాలని నిర్ణయించారు. ఆదివారం జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో దశాబ్ధి సదస్సును రోజా రమణి అధ్యక్షతన నిర్వహించారు. కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ విశ్వాసాలు వేరైనా ప్రజా వ్యతిరేక విధానాలపై వేదిక స్పందిస్తుందన్నారు. జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత భేషజాలతో పార్టీలు, సంఘాలు విడిపోతున్నాయన్నారు. భిన్న రాజకీయ విశ్వాసాలు కలిగిన సంఘాలు, సంస్థలు పదేళ్లుగా వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. విప్లవ రచయితల సంఘం బాధ్యుడు పాణి మాట్లాడారు. కార్యవర్గ సభ్యుడు రత్నంఏసేపు గతేడాది వేదిక కార్యకలాపాలు, ఆర్థిక నివేదికను సమీక్షించారు. -
పాగా కట్టి.. పెళ్లి కుమారుడై..
లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రారంభమైంది. వివాహాల్లో పెండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. రాత్రి 10 గంటల తర్వాత బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన హస్తినాపురం వాసి ఫృధ్వి సుబ్బారావు స్వామివారికి పాగాలంకరణ చేశారు. ఈ పాగా గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉండే నవ నందులను అనుసంధానం చేస్తూ అలంకరించారు. మొత్తం సుమారు 10 పాగాలు భక్తులు స్వామివారికి సమర్పించారు. పాగాలంకరణ జరుగుతున్నంతసేపు ఆలయంలో ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ మారుమోగింది. -
నిత్యం పర్యవేక్షణ
శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆదివారం వేకువజామున నుంచి ప్రారంభమైన దర్శనాలు నిరంతరాయంగా కొనసాగేందుకు జిల్లా ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షించారు. కలెక్టర్ రాజకుమారి గనియ, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఎస్పీ సునీల్ షెరాన్ నిత్యం ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ దేవస్థానం సిబ్బందికి ఆదేశాలు ఇస్తూ కనిపించారు. క్యూలలో వృద్ధులు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందుతున్నాయా లేదా అని పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ చేరుకొని కలెక్టర్, ఎస్పీ, జేసీ సంయుక్తంగా సీసీ కెమెరాలు ద్వారా పరిస్థితులను తెలుసుకుంటూ వైర్లెస్ సెట్ల ద్వారా అక్కడ అధికారులు, సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తూ కనిపించారు. -
సేవాభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీశైలం: సాధారణ భక్తులతో పాటు శివ స్వాములు తలనీలాలను సమర్పించుకోవడానికి వస్తారని, కళ్యాణకట్టలో విధి నిర్వహణలో ఉన్నవారు సేవాభావంతో వారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. పాతాళగంగ రోడ్డు మార్గంలోని దేవస్థానం కళ్యాణకట్టను శనివారం సాయంత్రం ఆమె సందర్శించారు. గుండు చేయడానికి ఎంత రుసుం చెల్లించారు, అధికంగా ఏమైనా వసూలు చేశారా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అధిక రుసుం చెల్లించలేదని వారు తెలపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. దేవస్థానం సూపరిండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
తెల్లశనగల ధర పతనం
దొర్నిపాడు: కాబూలి(తెల్లశనగల)రకానికి మంచి గిరాకీ ఉందని ఎర్రశనగల(జేజే11)ను తగ్గించి విస్తారంగా సాగుచేశారు. దిగుబడులు వచ్చిన వేళ మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. రెండేళ్ల క్రితం క్వింటా రూ.7వేల నుంచి రూ.9వేల వరకు పలికింది. ప్రస్తుతం క్వింటాకు రూ.5,500 ధర లభిస్తోంది. విత్తనాల సమయంలో క్వింటా రూ.9వేలు వెచ్చించి కొనుగోలు చేసిన రైతులు పండించిన పంటను కల్లాల్లో నిల్వ ఉంచుతున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి సంజీవయ్య కృషి నంద్యాల: అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జయంతిని శనివారం నిర్వహించారు. దామోదరం చిత్రపటానికి డీఆర్ఓతో పాటు కలెక్టరేట్ ఏఓ సుభాకర్ రావు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ... కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో పుట్టిన దామోదరం సంజీవమయ్య కష్టకాలంలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారన్నారు. ముఖ్యమంత్రిగా దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు, వరదరాజస్వామి గుడి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారన్నారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, సఫాయి కర్మచార కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ మాఫియాను అరికట్టాలి కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో పెట్రేగిపోతున్న మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న క్లినిక్ల నుంచి కార్పొరేట్ హాస్పిటళ్ల వరకు..గల్లీ మందుల దుకాణాల నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ల వరకు కమిషన్ల దందా కొనసాగుతుండడంతో పేద ప్రజల నడ్డి విరుగోతోందన్నారు. నామ మాత్రపు సేవలకు కూడా రూ.వేలలో బిల్లులు వేసి మాఫియా సభ్యులు పంచుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్.మునెప్ప, లెనిన్బాబు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శులు మహేష్, శ్రీనివాసరావు, ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీసన్న పాల్గొన్నారు. మహాధర్నాను విజయవంతం చేయండి కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 20వ తేదీన తాడేపల్లిలో నిర్వహిస్తున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శిసి.గురుశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం చాకలి ఐలమ్మ కార్యాలయంలో న్యూసిటీ కార్యదర్శి సి.శేషాద్రి, అధ్యక్షుడు రాముడు, ట్రేజరర్ శ్రీనివాసులు, ఓల్డ్సిటీ కార్యదర్శి జయమ్మతో కలసి ఆయన మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రజకులకు అట్రాసిటీ తరహాలో రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమయ్యారని చెప్పారు. -
పాతాళగంగ వద్ద అప్రమత్తంగా ఉండాలి
శ్రీశైలం: పాతాళగంగ వద్ద విధులు నిర్వహించే పోలీసులు, అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. పాతాళంగంగ మెట్ల మార్గంలో స్నానఘట్టాల వద్దకు చేరుకొని అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి నుంచే పాతాళగంగలో పుణ్యస్నాలాచరించుకోవడానికి వేల సంఖ్యలో శివస్వాములు భక్తులు మెట్ల మార్గం ద్వారా వస్తారని తెలిపారు. విడతల వారీగా భక్తులను స్నానఘట్టాల వద్దకు పంపించాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా మైకుల ద్వారా సూచనలు జారీ చేయాలని సూచించారు. పాతాళగంగలో బోట్ విహారానికి వెళ్లే యాత్రికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా భక్తుల భద్రతపై నిఘానేత్రలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజు 84,000 మంది స్వామివార్లను దర్శించుకున్నారని, వీరిలో 32,543 మంది శివ స్వాములు ఉన్నారని చెప్పారు. క్షేత్ర వ్యాప్తంగా భక్తుల భద్రత దష్టిలో ఉంచుకొని డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. -
పరమేశ్వరుని వరమే!
● ఫృథ్వీ సుబ్బారావు ‘మా కుటుంబ సభ్యులు నాలుగు తరాలుగా మల్లన్న పాగాలంకరణ సేవలో తరిస్తున్నారు. ఇదంతా పరమేశ్వరుని వరమే’ అని ఫృథ్వీ సుబ్బారావు అన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైలం మల్లన్నకు లింగోద్భవకాలంలో జరిగే పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉందని ఆయన చెప్పారు. ‘సాక్షి’తో శనివారం ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లో.. ‘మా ఇంటి పెద్దలు దైవంగా కొలిచే మల్లన్నకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వయంగా నేసిన పాగాను అలంకరించేవారు. మొదట మా ముత్తాతాతయ్య కందస్వామి, ఆ తరువాత మా తాత సుబ్బారావు, మా నాన్న వెంకటేశ్వర్లు పాగాలంకరణ చేశారు. ఇప్పుడు నేను స్వామివారికి పాగాలంకరణ చేస్తున్నాను. మా పూర్వీకుల నుంచి 70ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. భక్తిశ్రద్ధలతో నేస్తాం ‘మాది బాపట్ల జిల్లా చీరాల వద్ద హస్తినాపురం. నా భార్య ఫృథ్వి దుర్గ, చెల్లెలు మల్లీశ్వరి అందరం ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటున్నాం. స్వామివారికి పాగా ఎంతో భక్తి శ్రద్ధలతో నేస్తాం. గతంలో ప్రతిరోజూ ఒక మూర చొప్పున ఏడాది పాటు 365 రోజులు 365 మూరలు నేసేవారు. ప్రస్తుతం కార్తీకమాసం నుంచి పాగా నేతను ప్రారంభించాం. శివరాత్రికి పది రోజుల ముందే 300 మూరలు పూర్తి చేశాం. పాగాలంకరణ సేవ సందర్భంగా దేవస్థానం మాకు అతిథ్యం ఇస్తుంది. కోట్లాది మంది భక్తులు ఇష్టదైవంగా కొలిచే మల్లికార్జున స్వామికి పాగాలంకరణ చేయడం మేం చేసుకున్న అదృష్టం.’ -
శివ శివా.. ఇవేం ఏర్పాట్లు?
శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లను చూసి భక్తులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. లింగాలగట్టులో ప్రణాళిక లేకుండా లో లెవల్, హై లెవల్ ఘాట్ల వద్ద మౌలిక సదుపాయాలను తూతూమంత్రంగా ఏర్పాట్లు చేయడంతో స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు కృష్ణా నది నీటిలో మునిగాయి. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు గత్యంతరం లేక చీరలను అడ్డుగా కట్టి దుస్తులు మార్చుకుంటున్నారు. అరకొరగా ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు కూడా నీటిలో మునిగిపోయాయి.ఈ పరిస్థితులను అక్కడ విధులు నిర్వర్తిస్తున్న జిల్లా పంచాయతీ అధికారిణి కె.లలితాబాయి దృష్టికి భక్తులు తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. -
బందోబస్తు మరింత ‘పది’లం
● ఎస్పీ సునీల్ షెరాన్ శ్రీశైలం: భక్తుల భద్రత కోసం బందోబస్తును మరింత పెంచామని ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. బందోబస్తు చేయాల్సిన ప్రాంతాలను పది సెక్టార్లుగా విభజించామని చెప్పారు. శ్రీశైలంలోని వన్ న్ సర్కిల్ పోలీస్స్టేషన్లో శుక్రవారం నాలుగు జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల నుంచి 1,614 మంది సివిల్ పోలీసులు వచ్చారన్నారు. మొత్తం 11 మంది అదనపు ఎస్పీలు, 24 మంది డీఎస్పీలు, 78 మంది సీఐలు, 132 మంది ఎస్ఐలు, ఏఎస్ఐ/హెచ్ లతో కలిపి 303 మంది పనిచేస్తారన్నారు. వీరు కాకుండా ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బం, మూడు స్పెషల్ పార్టీ బృందా లు పనిచేస్తాయన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని సెక్టార్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులు భక్తులతో గౌరవప్రదంగా మాట్లాడాలని సూచించారు. అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ స్వామి వారి ప్రసాదం అందేలా చూడాలని సూచించారు. -
ఇలా అయితే.. వంద శాతం కష్టమే!
● ఉపాధ్యాయుల తీరుపై డీఈఓ ఆగ్రహం ప్యాపిలి: ఇలా ఉంటే పదోతరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం కష్టమేనని ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖాధికారి జనార్దనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని పీఆర్పల్లి, బూరుగల, సీతమ్మతండా, హుసేనాపురం, ప్యాపిలి జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పీఆర్ పల్లిలో స్టడీ అవర్స్కు 56 మందికి గాను 9 మంది విద్యార్థులు మాత్రమే ఉండటంతో డీఈఓ అసహనం వ్యక్తం చేశారు. ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు ఉపాధ్యాయుడు స్థానంలో సోషల్ స్టడీస్ టీచర్ ఉండటంపై మండిపడ్డారు. జీఎన్ఎస్ఎస్ నుంచి నీటి విడుదల బనగానపల్లె: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు జీఎన్ఎస్ఎస్ ద్వారా సంబంధిత అధికారులు నీటిని గురువారం రాత్రి విడుదల చేశారు. కడప, చిత్తూరు మరి కొన్ని ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి సమస్య తీర్చేందుకు ఈ నీటిని అవుకు రిజర్వాయర్లోకి విడుదల చేశారు. రిజర్వాయర్ నుంచి వైఎస్సార్ జిల్లా గండికోట రిజర్వాయర్కు అక్కడి నుంచి ఇతర రిజర్వాయర్లకు నీరు చేరుతుంది. జీఎన్ఎస్ఎస్ ద్వారా అధికారులు సుమారు 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉత్సవమూర్తులకు విశేష పూజలు రుద్రవరం: పార్వేట ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులు శ్రీ జ్వాలానరసింహ స్వామి, శ్రీ ప్రహ్లాదవరదస్వామి గ్రామగ్రామానా ప్రజల నుంచి విశేష పూజలందుకుంటున్నారు. పార్వేట పల్లకీ శుక్రవారం మండల పరిధిలోని తిప్పారెడ్డిపల్లెకు చేరుకోవడంతో గ్రామపెద్దలు ఎదురేగి వెళ్లి స్వాగతించారు. అనంతరం బోయిలు స్వామి వారి పల్లకీని గ్రామంలోని పలు తెలుపుల మీద కొలువుదీర్చారు. సప్తనదీ జలాలతో అభిషేకం కొత్తపల్లి: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సప్తనది సంగమేశ్వరంలోని ఎగువ పుష్కరఘాట వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. శివలింగానికి సప్తనదీ జలాలతో అభి షేకం చేశారు. కుంకుమార్చన, పుష్పార్చన, మంగళహారతి వంటి విశేష పూజకార్యక్రమాలు జరుపుకున్నారు. ఆలయం వద్ద భక్తులతో సందడి నెలకొంది. వెల్లివిరిసిన సామరస్యం ఆత్మకూరు: మహాశివరాత్రి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని శివాలయంలో పలువురు భక్తులు శివమాల ధరించి నిష్టతో పూజలు నిర్వహిస్తున్నారు. శివస్వాములపై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ పఠాన్వలిఖాన్ ఉదారత చాటారు. సుమారు 200 మంది శివస్వాములకు అవసరమైన అల్పాహారాన్ని తానే స్వయంగా తయారు చేయించారు. కేవలం ఆహారం అందించడమే గాకుండా ప్రతిఒక్క స్వామికి ఎంతో వినమ్రతతో స్వయంగా దగ్గరుండి వడ్డించి సోదరభావాన్ని చాటుకున్నాడు. ప్రశాంతంగా బార్ ఎన్నికలు నంద్యాల(వ్యవసాయం): ఏపీ స్టేట్ బార్ మెంబర్స్ ఎన్నికలు నంద్యాల బార్ అసోసియేషన్లో ప్రశాంతంగా ముగిశాయి. సీనియర్స్, జూనియర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బార్ అసోసియేషన్ పోటీ చేస్తున్న అభ్యర్థి విజయశేఖర్రెడ్డి ఓటును వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ ఆఫీసర్ హుసేన్బాషా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు హరిప్రసాదరెడ్డి, చిన్న సుదాంశమౌళిరెడ్డి, భూపని వెంకటేశ్వర్లు, కృపావతి, వెంకటప్రసాద్, తోట మురళీలు మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ కార్యాలయంలో 446 ఓటర్లు ఉండగా 419 ఓట్లు పోలయ్యాయన్నారు. 95 శాతం పోలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. 27 మంది గైర్హాజరయ్యారన్నారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
తప్పొకరిది.. శిక్షొకరికి!
ఆత్మకూరు రూరల్: నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం(ఎన్ఎస్టీఆర్ ప్రాజెక్ట్ టైగర్) ఫీల్డ్ డైరెక్టర్ బి.విజయకుమార్ను ఉన్నఫళంగా బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పట్టుమని ఐదు నెలలు గడవక మునుపే శుక్రవారం ఆయనను బదిలీ చేస్తూ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. వెంటనే అటవీదళాల ప్రధాన అధికారి పీసీసీఎఫ్ చలపతి ఎదుట రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో గుంటూరు జిల్లా సీఎఫ్ కాశీ విశ్వనాథరాజుకు ఎన్ఎస్టీఆర్ ఎఫ్డీపీటీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. అయితే శ్రీశైలంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనను బలిపెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీశైలంలో ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. జిల్లా అధికార యంత్రాంగంతో పాటు శ్రీశైలం ఆలయ ఈఓ, పాలకవర్గం మీనమేషాలు లెక్కించడంతోనే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు లాఠీచార్జికి దారి తీయడం భక్తుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు అద్దం పట్టింది. తప్పులను సరిదిద్దుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అధికార యంత్రాంగం, తప్పంతా అటవీ శాఖపై నెట్టి చేతులు దులుపుకునేందుకు సిద్ధమైంది. ఎన్ఎస్టీఆర్ ఎఫ్డీపీటీ విజయకుమార్ బదిలీయే ఇందుకు నిదర్శనం. అటవీ మార్గంలో పాదయాత్రకు ఈనెల 8 నుంచి ఏడు రోజుల పాటు మాత్రమే అవకాశం కల్పించడం వల్లే శ్రీశైలంలో భక్తుల రద్దీకి కారణమైందనే కోణంలో ఆయనపై చర్యలు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. పులుల అంచనా కేంద్రం నిర్ణయం జాతీయ ప్రొటోకాల్లో భాగంగా గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది మే నెల వరకు పులుల అంచనా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపించాల్సిన బాధ్యత అటవీ శాఖపైనే ఉంటోంది. అప్పటికీ శివ భక్తుల పాదయాత్రను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి అధికారులు కొంత వెసులుబాటు కల్పించారు. ఫలితంగా రెండు రోజుల ముందు నుంచే వెంకటాపురం నుంచి భక్తుల పాదయాత్ర మొదలైంది. అయితే కేంద్రం పరిధిలోని నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆ శాఖ అధికారిపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం గమనార్హం. శ్రీశైలం ఘటన నేపథ్యంలో స్థానచలనం? వాస్తవంలోకి వెళితే.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల రద్దీని అంచనా వేయడంలో జిల్లా అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ఇదే సమయంలో సామాన్య భక్తులు, శివస్వాములను కాదని ప్రోటోకాల్ దర్శనాలు, వీఐపీల సేవలోనే శ్రీశైలం ఈఓ, పాలక వర్గం తరించడం వల్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. క్యూలైన్లలో, ఎండలో గంటల తరబడి నిల్చోబెట్టిన ఫలితంగా శివస్వాముల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుని గందరగోళ పరిస్థితులకు దారితీసింది. ఈ విషయంలో ఆత్మ విమర్శను పక్కనపెట్టి తప్పంతా అటవీశాఖదే అన్నట్లుగా చర్యలకు ఉపక్రమించడం విమర్శలకు తావిస్తోంది. -
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ !
నల్లమల గిరుల నుంచి నమఃశివాయ పంచాక్షరి మంత్రం ప్రతిధ్వనిస్తోంది. పాతాళ గంగలో భక్తి కెరటం ఎగిసిపడుతోంది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా అంతా శివ మయం. పాదయాత్రగా శివయ్య దండు తరలివస్తోంది. శ్రీగిరిలో అడుగు పెట్టగానే మల్లన్న స్పర్శించాడనే అనుభూతికి లోనవుతున్నారు. శివరాత్రి ఉత్సవాల వేళ శ్రీశైలం భక్తజనసంద్రమైంది. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్నను దర్శించుకునేందుకు క్యూలో బారులుదీరుతున్నారు. మరో వైపు భక్తుల సేవలో దాతలు తరిస్తున్నారు. ఫొటోలు: వడ్డె శ్రీనివాసులు, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు దారులన్నీ శ్రీగిరి వైపు..పుణ్యస్నానాలు చేస్తున్న భక్తురాలు పాతాళగంగలో భక్తుడి ధ్యానంరోప్ వే మార్గంలో.. -
నివురు గప్పిన పేరూరు
రుద్రవరం: ‘అధికారం మాది.. దేవుడి ఉత్సవమైనా మేము చెప్పినట్లు జరగాల్సిందే’నని ఓ టీడీపీ నేత హుకుం జారీ చేయడంతో పేరూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శివరాత్రి ఉత్సవాల్లో దేవుడి పల్లకీ ముందుగా తన ఇంటి వద్ద పూజలందుకున్నాకే గ్రామోత్సవం ప్రారంభించాల్సిందేనని ఏకంగా దేవదాయ శాఖ అధికారులను ఆదేశించాడు. పేరూరు గ్రామంలో ఈశ్వర, చెన్న కేశవ, రామాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆలయంలో శివరాత్రి, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఉత్సవంలో ముందుగా స్వామి అమ్మవార్లను గ్రామంలోని రెడ్డి గారి (బాలనాగిరెడ్డి) ఇంటి వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక ఆనవాయితీ ప్రకారం గ్రామోత్సవం ప్రారంభిస్తారు. అయితే బాబు సర్కారు అధికారంలో ఉండటంతో ఓ టీడీపీ నేత గతేడాది అప్పటి ఈఓ నర్సయ్యను బెదిరించి సంప్రదాయలకు గండి కొట్టాడు. అవతలి వర్గీయులను నమ్మబలికించి ఉత్సవమూర్తుల పల్లకీని తన ఇంటి వద్దకు రప్పించుకున్నాడు. దీంతో గ్రామస్తులు అడ్డుపడ్డారు. అప్పట్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే వివిధ శాఖల అధికారులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఈ సారి కూడా ఉత్సవ మూర్తుల పల్లకీ ముందుగా తన ఇంటి వద్దకు రావాల్సిందేనని టీడీపీ నేత ఆలయ ఈఓ సాయి జయచంద్రారెడ్డిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఈఓ గ్రామస్తులను విచారించిన తర్వాత టీడీపీ నాయకుడు చెప్పేది అంతా విరుద్ధమని తెలుసుకున్నారు. అయితే ఓ వైపు ఉత్సవాలకు సిద్ధం చేస్తూ.. మరో వైపు సమస్యను ఎస్ఐ జయప్పకు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం నిర్వహించే ఉత్సవం నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం -
శ్రీశైలంలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు!
శ్రీశైలం ప్రాజెక్ట్: నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న శ్రీశైలం, ప్రకాశం జిల్లాలోని దోర్నాల వరకు ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ అటవీశాఖ గతంలో ప్రకటించింది. ఈ ప్రాంతంలోకి ప్లాస్టిక్తో తయారు చేసిన ఎలాంటి వస్తువులను అనుమతించకుండా దోర్నాల, లింగాలగట్టు అటవీ శాఖ చెక్పోస్టుల వద్ద తనిఖీ చేస్తారు. ఏదైనా ప్లాస్టిక్ వస్తువు దొరికితే వాహనం సీజ్ చేయడంతో పాటు, జరిమానా విధిస్తారు. శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు గ్రామాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కూల్డ్రింక్లు ఎక్కడా కనిపించకుండా అటవీశాఖ పటిష్ట చర్యలు తీసుకుంది. ముఖ్యంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించాలని శ్రీశైల దేవస్థానం బయో వాటర్ బాటిళ్ల సరఫరాకు గత రెండు సంవత్సరాల క్రితం టెండర్లు పిలిచింది. హైదరాబాద్కు చెందిన ఓ కాంట్రాక్టర్ వీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ప్లాస్టిక్ రహిత కోర్ ఏరియా శ్రీశైలంలోకి మహాశివరాత్రి బ్రహ్సోవాలలో లక్షలాది ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను దేవస్థానం ఆధ్వర్యంలో సిద్ధం చేయడం విమర్శలకు తావిస్తోంది. దేవస్థాన అధికారులు సిద్ధం చేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు -
మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి
కర్నూలు(సెంట్రల్): రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను కల్పించి చట్టబద్ధం చేయాలని జాతీయ రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన జాతీయ కిసాన్ జాగృతి యాత్ర శుక్రవారం కర్నూలుకు చేరుకుంది. ఈ యాత్ర సుమారు 40 రోజులపాటు కొనసాగి కశ్మీర్ చేరుకుంటుంది. ఈ యాత్రలో వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ కిసాన్ నాయకులు జల్దీర్సింగ్ దలేవాలా (పంజాబ్), ఇంద్రజిత్సింగ్ పొన్నెవాలా (రాజస్థాన్), దేవరాజ్కుమార్ (కర్ణాటక), అరుణపటేల్ (మధ్యప్రదేశ్), అభిమన్యు (హర్యానా), సోముఅలక్ (పంజాబ్), పి.రామచంద్రయ్య ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యాత్ర కర్నూలు చేరిన సందర్భంగా ఎస్టీయూ భవన్లో జాగృతి సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కిసాన్ జాగృతి నాయకులు జల్దీర్సింగ్ దలేవాలా, ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. 2019లో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టబద్ధం చేయాలని భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారుసు చేసినా పెడచెవిన పెట్టారన్నారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలలు రైతుల ఉద్యమం చేస్తే అబద్ధపు హామీలు ఇచ్చి విమరమింపజేశారని, అయితే ఆ సమయంలో ఇచ్చిన ప్రధానమైన కనీస మద్దతు ధరకు చట్టబద్ధం కల్పించడంలేదని ఆరోపించారు. 2023 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, రైతులకు ఉచిత విద్యుత్ను సరఫరా చేయాలని, బ్యాంకుల్లో రైతులు తీసుకున్న క్రాప్ లోన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్ళి కె.జగన్నాథం, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వెంకటాపురంలో దొంగల హల్చల్
శిరివెళ్ల: వెంకటాపురంలో దొంగలు రెచ్చిపోయారు. గురువారం అర్ధరాత్రి ఐదు ఇళ్లల్లో చొరబడి దొరికిందంతా దోచుకెళ్లారు. దాదాపు రూ. లక్ష నగదు, రూ. 80 వేలు విలువ చేసే బంగారు కమ్మలు, ముక్కు పుడకలు చోరీకి గురయ్యాయి. ముందుగా శ్రీరామ వెంకటేశ్వర్లు ఇంటిలో దొంగలు చొరబడి బీరువాను బయటకు తెచ్చి ఇంటి సమీపంలోని ఓ దిబ్బ వద్ద పగల గొట్టారు. శబ్ధం విన్న ఇంటి యాజమాని, చుట్టు పక్కల వాళ్లు రాగా దొంగలు పరారయ్యారు. అలాగే రిటైర్డ్ వీఆర్వో అనందయ్య ఇంటిలో బీరువాలోని బంగారు కమ్మలు, ముక్కు పుడకలు అపహరించారు. గుడి నరసింహ ఇంటిలో బీరువాలోని రూ. 80 వేలు నగదును చోరీ చేశారు. వలివేటి శేషగిరి ఇంటిలో ప్రవేశించి రూ. 20 వేల నగదును ఎత్తు కెళ్లారు. అలాగే పొదిలి చిన్న కేశయ్య టీ కొట్టులో తినుబండారాలు తిని, కూల్ డ్రింక్స్ తాగారు. ఈ చోరీలకు పాల్పడిన వారిలో నలుగురు ముఖాలకు ముసుగు వేసుకోగా, ఒకరు ఖర్చీఫ్ కట్టుకుని హిందీలో మాట్లాడుకుంటున్నారని ఇద్దరు మహి ళలు గుర్తించినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ రాము గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. గతంలో గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి గుడిలో స్వామి వారి వెండి ఆభరణాలు దుండగులు అపహరించారు. గ్రామంలో వరుస దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కొలిమిగుండ్ల: తిమ్మనాయినపేట జంక్షన్ సమీపంలోని వేర్హౌస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ రమేష్బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంకిరెడ్డిపల్లెకు చెందిన బండ నాగాంజనేయులు (29) పని నిమిత్తం స్నేహితులతో కలిసి జమ్మలమడుగుకు బైక్పై వెళ్లి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తిమ్మనాయినపేట జంక్షన్ వద్దకు వచ్చే సరికి బైక్లో ఉన్న ఇద్దరు స్నేహితులు టాయ్లెట్ వెళ్లేందుకు కిందకు దిగారు. నాగాంజనేయులు రోడ్డుకు అటు వైపు వెళ్లేందుకు బైక్ను తిప్పుతుండగా జమ్మలమడుగు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
సాధారణ భక్తురాలుగా కలెక్టర్
శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను జిల్లా కలెక్టర్ గనియా రాజకుమారి ఉచిత క్యూలైన్లో సాధారణ భక్తులతో కలిసి దర్శించుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఉచిత దర్శన క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్యసేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లలో భక్తులతో మమేకమై వారి అభిప్రాయాలను, సూచనలను స్వీకరించారు. అనంతరం అమ్మవారి ఆలయం వెనుక భక్తులకు ఉచితంగా అందిస్తున్న లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. లడ్డూ కౌంటర్ వద్ద టోకెన్ విధానం, భక్తుల రద్దీ నియంత్రణ పరిశీలించి పలు సూచనలు చేశారు. అన్నప్రసాద వితరణ భవనానికి వెళ్లి అక్కడి భక్తులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. ఆ తర్వాత మహాశివరాత్రి రోజున నిర్వహించే పాగాలంకరణ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్తో కలిసి పరిశీలించారు. భక్తులతో కలిసి కూర్చ్చొని భోజనం చేస్తున్న కలెక్టర్ రాజకుమారి -
బైక్ అదుపుతప్పి కిందపడి ..
ఎమ్మిగనూరురూరల్: కె.తిమ్మాపురం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. తమ బంధువుల అమ్మాయికి సంబంధం కుదుర్చుకుని సంతోషంగా తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన గిరిపోగు ఎంకప్ప(28) తమ బంధవుల అమ్మాయికి ఎమ్మిగనూరు మండలం టీఎస్ కూళ్లూరు గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. తెర్నేకల్ గ్రామం నుంచి అమ్మాయి కుటుంబ సభ్యులు శుక్రవారం అబ్బాయి ఇంటికి వచ్చారు. పెళ్లి సంబంధం కుదరటంతో అక్కడే భోజనాలు చేసి తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. ఎంకప్ప పల్సర్ బైక్పై వెళ్తుండగా కె.తిమ్మాపురం గ్రామ సమీపంలో మలుపు దగ్గర అదుపుతప్పి కాలువగట్టు ఢీకొట్టాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక వస్తున్న బంధువులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. పాదయాత్రగా శ్రీశైలయానికి చేరుకుంటున్న భక్తులు -
శ్రీశైలంలో మద్యం, సారా పట్టివేత
● నలుగురిపై కేసు నమోదు శ్రీశైలం: స్థానిక కొత్తపేట, మేకలబండ ప్రాంతాల్లో శుక్రవారం ఎకై ్సజ్ పోలీసుల తనిఖీల్లో 85 మద్యం బాటిళ్లు, 34 లీటర్ల నాటు సారా పట్టుబడింది. సీఐ మోహన్రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడులు చేసి మేకల బండకు చెందిన పోతుల సాయి దగ్గర నుంచి 34 లీటర్ల నాటు సారా, అదే ప్రాంతానికి చెందిన నాగరాజు నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంలోని కొత్తపేటలో మంజుల లలిత ఇంటి వద్ద 45 మద్యం సీసాలు, అదే ప్రాంతానికి చెందిన సంపంగి మహేశ్వరి వద్ద నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నలు గురు నిందితులపై దేవదాయ చట్ట ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. ఘాట్ రోడ్డులో నిబంధనలు పాటించాలి ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం మీదుగా ప్రయాణించే వాహనదారులు అటవీ సంరక్షణ నిబంధనలు పాటించాలని సబ్ డీఎఫ్ఓ బబిత శుక్రవారం తెలిపారు. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాల వేల అధిక సంఖ్యలో భక్తులు వాహనాల్లో వెళ్తున్నారని, ఈ మేరకు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు అందజేస్తున్నామన్నారు. అటవీ మార్గంలో 30 కి.మీ వేగానికి మించి వెళ్ల వద్దని, రహదారిపై వన్యప్రాణులు కనిపిస్తే వాహనాలను నిలిపేయాలని సూచించారు. తీవ్రంగా హారన్లు మోగించడం, అడవిలో మల విసర్జనకు వెళ్లడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. అటవీ చట్టాలను అతిక్రమించే డ్రైవర్లకు రూ.500 – రూ.1000 వరకు అపరాధ రుసుం విధిస్తామన్నారు. -
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. ఓం నమఃశివాయ, హరోం హర శంకరా అంటూ భక్తులు స్వామి, అమ్మవార
● శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ● మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు ● అరకొర ఏర్పాట్లతో అవస్థలు పుష్ప పల్లకీలో విహరిస్తున్న ఆది దంపతులుపుష్పపల్లకీలో ఆదిదంపతులు బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం శ్రీ భ్రమరాంబసమేత మల్లికార్జునుడు పుష్పపల్లకీపై దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. క్షేత్ర తూర్పు, దక్షిణ మాడవీధుల్లో జరిగిన పుష్పపల్లకీ గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. పుష్పపల్లకీని వివిధ రకాల సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పల్లకీలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేశారు. ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు ప్రత్యేక పూజా హారతులిచ్చారు. గంగాధర మండపం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం మీదుగా రాజగోపురం వరకు సాగింది. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు, మేళతాళాలు, శంఖానాదాల మధ్య గ్రామోత్సవం నేత్రానందభరితంగా సాగింది. పూజా కార్యక్రమాల్లో శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీశైలం నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు శనివారం సాయంత్రం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ ఉంటుంది. పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
శ్రీశైలంప్రాజెక్ట్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. ఫలితంగా క్షేత్ర పరిధిలో అన్ని ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. పాతాళగంగలోని కృష్ణా నదిలో తెల్లవారు జాము నుండే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దైవదర్శనం కాగానే కొందరు భక్తులు తిరుగు ప్రయాణమవుతుండగా, చాలా మంది మహాశివరాత్రి పర్వదినం వరకు శ్రీశైలంలోనే ఉండిపోతున్నారు. దీంతో శ్రీగిరిలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రతి రోజూ స్వామి అమ్మవార్లను 1.25 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల ప్రధాన వీధి -
ప్చ్.. ఇది చంద్రన్న మందే!
ఇది కూల్డ్రింకేనా! తాగుదామా, వద్దా..బ్రహ్మగుండంలో కోతులెక్కువ. ఏ ద్విచక్ర వాహనం ఆలయ ప్రాంతంలో పార్క్ చేసి వెళ్లినా వాహనాల బ్యాగులు చించి మరీ అందులో ఏమున్నా ఎత్తుకెళ్తుంటాయి. ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న బ్రహ్మగుండంలో వ్యాపారులు అంగళ్లు వేసుకోవడంలో, ఉత్సవ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. గురువారం ఓ కోతికి ఏదో ఓ ద్విచక్ర వాహనం బ్యాగ్లో ఓ నైన్టీ మద్యం బాటిల్ దొరికింది. బాటిల్ తీసుకుని వెళ్లి చెట్టుపై కూర్చుంది. అలవాటైన కూల్ డ్రింక్ అనుకుందేమో బాటిల్ మూత తీసేందుకు విఫల ప్రయత్నం చేసింది. రాకపోవడంతో పళ్లతో కొరికింది. చిన్న ధారలా మద్యం చిమ్మడంతో తాగేందుకు ప్రయత్నించింది. వాసన నచ్చలేదో, లేక నాసిరకం అనుకుందో కానీ విసిరికొట్టి వెళ్లిపోయింది. – వెల్దుర్తిమూత తీసి టేస్ట్ చూద్దాం..ఇది చంద్రన్న మందులా ఉంది.. ప్చ్! -
శ్రీగిరిలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తజనం పోటెత్తుతున్నారు. పాదయాత్రగా నల్లమల మీదుగా భక్తులు శ్రీశైలం చేరుకుని మల్లన్నను కనులారా దర్శించుకుంటున్నారు. వందల కి.మీ నడిచి అలసిపోయిన భక్తకోటి శ్రీగిరిలో అడుగు పెట్టిన వెంటనే
అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవం కోవెలకుంట్ల: 65 ఏళ్ల మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ కామాంధుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. గురువారం కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. 2023 సెప్టెంబర్ 24వ తేదీన సంజామలకు చెందిన ఓ వృద్ధురాలు కోవెలకుంట్ల బస్టాండ్ వద్ద ఊరికి వెళ్లేందుకు వేచి ఉంది. ఇంటి వద్ద వదిలిపెడతానని అదే గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరి మద్యం మత్తులో బైక్పై ఎక్కించుకున్నాడు. స్థానిక గుంజలపాడు రహదారిలో వైపు తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ వృద్ధురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఘటన జరిగిన తర్వాత రాత్రి సమయంలో రైల్వేస్టేషన్ మీదుగా నడుచుకుంటూ వెళుతూ వృద్ధురాలు తీవ్రరక్తస్రావంతో ఓ పెట్రోల్ బంకు సమీపంలో కింద పడిపోయింది. గుర్తించిన పెట్రోల్బంకు నిర్వాహకులు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు వృద్ధురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుౖగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో నిందితుడు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో నంద్యాల మేజిస్ట్రేట్ ఎన్బీడబ్ల్యూ జారీ చేయడంతో కోవెలకుంట్ల సీఐ హనుమంతునాయక్, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నాగన్న, కానిస్టేబుల్ చాంద్బాషా నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్ ఖైదీగా ఉంచి కేసుకు సంబంధించిన సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ మేరకు అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో కర్నూలు న్యాయమూర్తి లక్ష్మిరాజ్యం నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే లా చేసిన సీఐ హనుమంతునాయక్, ఎస్ఐలు మల్లికార్జునరెడ్డి, మౌలానీ, పోలీసు సిబ్బందిని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ అభినందిస్తూ రివార్డుకు ప్రతిపాదించారు. శ్రీగిరికి చేరుకుంటున్న పాదయాత్ర భక్తులురావణ వాహన సేవ పూజలు నిర్వహిస్తున్న అర్చకులుఆలయం .. పుష్పశోభితంఇరుముడితో పూజల్లో పాల్గొన్న మంత్రి ఆనం, కలెక్టర్, ఈఓ, చైర్మన్, ఎమ్మెల్యే తదితరులు శివ శివ శంకరా.. -
జిల్లాలో రెండు మద్యం దుకాణాల ఏర్పాటుకు రీనోటిఫికేషన్
● ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ● 23వ తేదీన లాటరీ ద్వారా లైసెన్స్ జారీ కర్నూలు: జిల్లాలో లైసెన్స్ ఫీజు చెల్లించకుండా ఆగిపోయిన రెండు మద్యం దుకాణాల ఏర్పాటుకు కలెక్టర్ అనుమతితో ఎకై ్సజ్ అధికారి మచ్చ సుధీర్ బాబు రీనోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలోని ఎమ్మిగనూరు రూరల్లో ఒకటి, చిప్పగిరి మండలం యూనిట్లో ఒక దుకాణాలను గతంలో నిర్వహించిన టెండర్లు దక్కించుకున్నవారు లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆదేశం మేరకు వాటి ఏర్పాటుకు గురువారం రీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఈఎస్ సుధీర్ బాబు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 21వ తేదీ సాయంత్రం లోగా ఆయా దుకాణాలకు ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కొక్క దుకాణానికి కనిష్టంగా ఒక దరఖాస్తు వస్తేనే లాటరీ ద్వారా దుకాణాన్ని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను బట్టి ఈ నెల 23వ తేదీన రెండు దుకాణాలకు కలెక్టర్ సమక్షంలో లాటరీ తీసి లైసెన్స్ను జారీ చేయనున్నట్లు ఈఎస్ పేర్కొన్నారు. -
విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి
దొర్నిపాడు: విద్యుదాఘాతంతో ఓ టిప్పర్ డ్రైవర్ మృతి చెందాడు. అర్జునాపురం – నందింపల్లె గ్రా మాల మధ్య రోడ్డు నిర్మా ణ పనులు జరుగుతున్నా యి. బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామానికి చెందిన హరికృష్ణ(25) టిప్పర్లో కంకర అన్లోడ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. లిఫ్ట్ద్వారా టిప్పర్ ట్రాలీ ఎత్తే క్రమంలో పైన ఉన్న కరెంట్ తీగలను గమనించ లేదు. దీంతో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ప్రవళ్లిక ఉన్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి వెల్దుర్తి: జాతీయ రహదారిపై మదార్పురం సమీపంలోని కోళ్ల ఫారం ఆవరణలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డోన్ పట్టణానికి చెందిన అల్లాబకాష్ మదార్పురం వద్ద కోళ్ల ఫారంలో నాటు కోళ్ల పెంపకం చేపట్టాడు. ఇతని మిత్రులు డోన్ పట్టణం సుందర్సింగ్ కాలనీకి చెందిన సురేష్(24), అమ్రేశ్ నాయక్లు బుధవా రం రాత్రి అక్కడికి చేరుకుని మద్యం సేవించారు. మద్యం అయిపోవడంతో సురేష్, నాయక్లు వెల్దుర్తికి వచ్చి మద్యం తీసుకువెళ్లి మళ్లీ తాగారు. వీరిలో అల్లాబకాష్, నాయక్ ఇద్దరు గురువారం ఉదయం 9 గంటల సమయంలో నిద్రలేచారు. ఈ సమయంలో సురేష్లో చలనం లేకపోవడంతో 108కు సమాచారమిచ్చారు. వారు సంఘట నా స్థలికి చేరుకుని సురేష్ అప్పటికే మృతి చెందినట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సీఐ యుగంధర్, ఎస్ఐ నరేశ్ సంఘటనాస్థలి కి చేరుకుని విచారించారు. ఆ సమయంలో అమ్రే శ్ నాయక్ హైవే రోడ్డు దాటే సమయంలో కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు తల్లి ఎల్లవేణమ్మ అనుమానం వ్యక్తం చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించింది. -
పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు
● టెక్నాలజీ సహాయంతో సకాలంలో స్పందన నంద్యాల: భార్యతో గొడవపడి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బయటకు వెళ్లిన వ్యక్తి ఆచూకీని టూటౌన్ పోలీసులు కనుగొని పిల్లలను రక్షించారు. టూటౌన్ ఎస్ఐ సురేష్ తెలిపిన మేర కు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలో బుధవారం గిరినాథ్ సర్కిల్లో నివాసముండే శివకుమార్ ఉదయం కుటుంబ కలహాలతో భార్యతో గొడవపడి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బైక్పై వెళ్లాడు. అనంతరం పిల్లలను స్కూల్ వద్ద నుండి తీసుకొని వచ్చి తన స్కూటీపై ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో హుటాహుటిన పిల్లల తల్లి సుబ్బలక్ష్మి, ఆమె తరఫు బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు శివకుమార్ ఫోన్ను ట్రాక్ చేయగా శివకుమార్ పిల్లలను తీసుకొని గుత్తి రోడ్డులో వెళ్తున్నట్లు చూపించింది. వెంటనే స్పందించిన పోలీసులు పిల్లల తల్లిని, వారి బంధువులతో పాటు వెహికల్లో వెళ్లి శివకుమార్ గుత్తిలో వారి సోదరుని ఇంటికి వెళ్లడంతో అక్కడికి చేరుకొని కుటుంబ సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలని పిల్లలను ఇలా బెదిరించి తీసుకురావడం నేరమని మందలించి పిల్లలను నంద్యాలకు తీసుకొని వచ్చి వారి బంధువులకు అప్పగించారు. పిల్లలను కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఏదైనా చేస్తాడని భయపడిన స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పోలీసులు వెంటనే స్పందించి క్షేమంగా తన పిల్లలను నాకు అప్పగించినందుకు తల్లి సుబ్బలక్ష్మి ఈ సందర్భంగా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జిల్లాలో కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు జరుగుతున్న క్రమంలో వెంటనే పోలీసులు స్పందించి వారిని క్షేమంగా ఇంటికి తీసుకొని రావడంతో టూ టౌన్ పోలీసులను పట్టణ ప్రజలు, అభినందిస్తున్నారు. -
మహానందికి బయలుదేరిన పెళ్లి పెద్ద
నంద్యాల(వ్యవసాయం): మహానంది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శివరాత్రి జరిగే కళ్యాణానికి ఆహ్వానంగా వచ్చిన శ్రీకామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి వారితో పెళ్ళి పెద్ద అయిన శ్రీ గంగా పార్వతీ సమేత బ్రహ్మనందీశ్వరస్వామి గురువారం మహానందికి బయలుదేరారు. ఈ సందర్భంగా బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానంలో ఉత్సవమూర్తులకు ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. పట్టణంలోని కల్పనా సెంటర్లోని శ్రీకాశిరెడ్డినాయన ఆశ్రమం వారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు, మహానంది దేవస్థాన సిబ్బందికి అన్న దానం చేశారు. ఆలయ ఈఓ లక్ష్మీనారాయణ, ఈశ్వరరెడ్డి, శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిలకలూరులో పార్వేట ఉత్సవం
రుద్రవరం: పార్వేట ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని చిలకలూరు గ్రామంలో జ్వాలా నరసింహ స్వామి, ప్రహ్లాద వరద స్వాములకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులంతా తెలుపుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఉత్సవమూర్తులకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా భారీగా ప్రజలు రావడంతో గ్రామంలోని అంతర్గత రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. శనగలో పంట కోత ప్రయోగాలు ఉయ్యాలవాడ: శనగలో పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని హరివరం గ్రామంలో గురువారం పంట కోత ప్రయోగాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీలో 53.801 హెక్టార్లలో రైతులు శనగ పంట సాగు చేశారన్నారు. ప్రస్తుతం కోతలు, నూర్పిడి పనులు కొనసాగుతున్నాయన్నారు. కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ ఏఓలు సుధాకర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏఈఓలు రాణెమ్మ, సునీత, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు. ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి బనగానపల్లె రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్దన్రెడ్డి అన్నారు. కై ప గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్, బనగానపల్లె జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, కొండపేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్స్ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఉత్తమ మార్కులు సాధించాలని సూచించారు. ఎంఈఓలు స్వరూప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కదంతొక్కిన కార్మికులు నంద్యాల(న్యూటౌన్): నాలుగు లేబర్ కోడ్లను, జీరాంజీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కదం తొక్కారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా నంద్యాల మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, సీఐటీయూ కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేసి 200 రోజులు పని కల్పించి రూ. 600 కూలి ఇవ్వాలని కోరారు. వ్యవసాయ ఎరువుల ధరలను తగ్గించాలని, కౌలు రైతులకు వడ్డీలు లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. వామపక్ష ప్రజా సంఘాల నాయకులు తోట మద్దులు, రమేష్ కుమార్, లక్ష్మణ్, గౌస్, మురళీ, సోమన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు. అంబేడ్కర్ గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీ కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 5, 6, 10వ తరగతుల్లో మిగులు సీట్లు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం) ప్రవేశాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ ఎంఈ గీత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని, అర్హులైన అభ్యర్థులు తమ వివరాలను ఆన్లైన్ వెబ్సైట్ https://apbragcet.apcfss.in/లో ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగులు సీట్ల భర్తీ, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుల్లో ఏవైనా సవరణలు ఉంటే డీసీఓ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. -
జైలులో జతకట్టి.. నేరాల బాటపట్టి!
కర్నూలు: హైదరాబాద్లోని మారేడుపల్లి బిజినమైన రఘు, సికింద్రాబాద్ నివాసి టమాటార్ శివసింగ్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ అక్కడి పోలీసులకు చిక్కి చెంచల్గూడ జైలుకు వెళ్లారు. అక్కడ వారి మధ్య పరిచయం పెరిగి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత జట్టుగా ఏర్పడి పలు ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. శివసింగ్ వయస్సు 25 ఏళ్లు కాగా ఇతనిపై 28 ఇంటి దొంగతనాలు, అలాగే రఘు వయస్సు 24 కాగా 15కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసు రికార్డులకెక్కారు. పక్కా ఆధారాలతో వీరిద్దరినీ నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు శివారులోని సంతోష్ నగర్లో నివాసముంటున్న మద్దిలేటి ఇంట్లో గత జనవరి 29న పట్టపగలే దొంగలు పడి అందినకాడికి మూటకట్టుకుని ఉడాయించారు. మద్దిలేటి ఓ ప్రైవేటు ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఆయన విధులకు వెళ్లగా భార్య లక్ష్మీదేవి, కుమార్తె హేమచరిత ఇంటికి తాళం వేసి బస్టాండ్ సమీపంలోని ఓ బ్యాంకుకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలను తస్కరించారు. ఒక గంట సమయంలో తల్లీ కుమార్తె తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం తొలగించి ఉండటం, తలుపులు మూసి ఉండటంతో ఆందోళనతో తలుపులు తీయమని గట్టిగా అరిచారు. అప్పటికే బీరువాలోని సొత్తును దోచుకుని బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరు దుండగులు తలుపులు తీసి అడ్డంగా ఉన్న తల్లీ కూతుళ్లను పక్కకు నెట్టేసి పరారయ్యారు. కాస్త దూరంలో సిద్ధంగా ఉంచుకున్న ద్విచక్ర వాహనంపై దొంగలిద్దరూ పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేరం జరిగిన తీరును పరిశీలించారు. కాలనీలో ఓ చోట సీసీ కెమెరా ఫుటేజీలో దుండగులు చోరీకి ముందు ద్విచక్ర వాహనంపై కాలనీలో సంచరించిన దృశ్యాలను గుర్తించారు. సీఐ విక్రమసింహ, ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు మురళీధర్, లక్ష్మీనారాయణ ప్రత్యేక బృందంగా ఏర్పడి కర్నూలు నుంచి షాద్నగర్ వరకు సీసీ ఫుటేజిలను క్షుణ్ణంగా పరిశీలించారు. తెలంగాణ పోలీసు అధికారులతో సమాచారాన్ని పంచుకుని మారేడుపల్లి బిజినమైన రఘు, సికింద్రాబాద్ నివాసి టమాటార్ శివసింగ్లుగా గుర్తించారు. వారి కదలికలపై నిఘా ఉంచి గురువారం మునగాలపాడు గ్రామ శివారులోని సమ్మర్ స్టోరేజి ట్యాంకు సమీపాన బంజారా హిల్స్ వెంచర్లో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీ ద్వారా కేసు ఛేదింపు ఏడు తులాల బంగారు నగలు, ద్విచక్ర వాహనం స్వాధీనం -
లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి
కర్నూలు: పది సంవత్సరాలకు పైగా పెండింగ్లోని సివిల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి/న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.కబర్ధి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి గురువారం ఆయన స్థానిక జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 14న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టులలో పెండింగ్లోని సివిల్, రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లను చేసి ఎక్కువ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కక్షిదారులు ఈ అవకాశా న్ని వినియోగించుకుని రాజీపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవాలన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. -
మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు
● ఈ ఏడాది 1.50 లక్షల మంది వచ్చే అవకాశం ● జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ శ్రీశైలం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలానికి వచ్చే భక్తుల కోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం వారు మాట్లాడారు. గతేడాది మహాశివరాత్రి పర్వదినాన అత్యధికంగా 1.10 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. ఈ ఏడాది 1.50 లక్షల మంది శివరాత్రి రోజున దర్శనం చేసుకుంటారని అంచనాతో ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు కై లాస ద్వారం నుంచి 26,000 మందికిపైగా భక్తులు కాలినడకన శ్రీశైలం చేరినట్లు చెప్పారు. వారికి వైద్య సేవలతో పాటు ఆహారం, మంచినీరు అందించామన్నారు. స్నాన ఘట్టాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాతాళగంగ వద్ద బోట్లను ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను కూడా నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా బస్సులు, కార్లకు విడివిడిగా పార్కింగ్ ప్రదేశాలను కేటాయించినట్లు చెప్పారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణానికి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో దేవస్థానం చెక్పోస్టుల వద్ద ఫారెస్ట్ చెక్ పోస్ట్లు టోల్ ఫ్రీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఘాట్లో గంటకు 30 కిలోమీటర్ల వేగపరిమితితో వాహనాలు వచ్చేలా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. క్యూలైన్లలో పిల్లలకు మంచినీరు, వద్ధులకు పాలు, బిస్కెట్లు అందజేసే చర్యలు తీసుకున్నామన్నారు. బందోబస్తు పరిశీలన మహాశివరాత్రి పర్వదినానికి రెండు రోజులుగా మాత్రమే వ్యవధి ఉండడంతో సునీల్షెరాన్ భద్రత ఏర్పాట్లపై దృష్టి సారించారు. గురువారం సాయంత్రం క్యూలైన్లలను పరిశీలన చేశారు. క్యూలైన్ల డివైడర్ల ఎత్తును పెంచాల్సిందిగా దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం సిబ్బందికి సూచించారు. అనంతరం లడ్డూ విక్రయ కేంద్రంలో ఉన్న క్యూలు, శివాజీ గోపురం, అమ్మవారి ఆలయ ప్రాంగణం, నాగుల కట్ట ప్రాంతాలను పరిశీలించారు. శివదీక్ష స్వాముల కోసం ఏర్పాటు చేసిన చంద్రావతి కళ్యాణ మండపంలోని కంపార్ట్మెంట్లలో సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
భక్తుల నిలువు దోపిడీ
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. దేవస్థానం సరిపడా సౌకర్యాలు కల్పించడం లేదు. ఫలితంగా భక్తులు ఎక్కడికి వెళ్లినా నిలువు దోపిడీ చేస్తున్నారు. కనీస సౌకర్యమైన మరుగుదొడ్లను ఉచితంగా ఏర్పాటు చేయలేదు. శివదీక్షా శిబిరాల వద్ద గతేడాది రూ.10 వసూలు చేసిన నిర్వాహకులు ఈ ఏడాది రూ.20 తీసుకుంటున్నారు. పాతాళగంగ, నందిసర్కిల్, ప్రధాన ఆలయానికి ఎదురుగా పలువురు రోడ్డుకు అడ్డంగా తోపుడు బండ్లతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి. రోజుకు వెయ్యి మంది కార్మికులతో పనులు చేపట్టకుండా కొంతమందితో తూతూమంత్రంగా సాగిస్తున్నారు. దీంతో క్షేత్ర పరధిలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. టోల్గేట్ సమీపంలో చెప్పులు, సాక్స్లను భక్తులు వదిలి వెళ్తున్నా తొలగించడం లేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం శ్రీశైలంలో వర్తించడంలేదని భక్తులు వాపోతున్నారు. ఘాట్రోడ్డు పేరుతో స్టాండింగ్ ఎక్కించుకోకపోవడం, తక్కువ బస్సులు ఉండడంతో మహిళా భక్తులు అవస్థలు పడుతున్నారు. ముక్కుపిండి వసూలు సాక్షిగణపతి ఆలయం వద్ద, మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద, నందిసర్కిల్ వద్ద భక్తులు టెంకాయ కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడి వారు కొబ్బరికాయ కొడితే రూ.10 ఇవ్వాల్సిందేనని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. క్షేత్రంలోని చాలా హోటళ్లలో ధరల పట్టిక ఏర్పాటు చేయకుండా అధిక రేట్లు తీసుకుంటున్నారు. శివమాలను స్వీకరించిన వారు ఇరుముడి విప్పితే రూ.100 ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు వాపోతున్నారు. టెంకాయ సమర్పిస్తే రూ.10 చెల్లించాల్సిందే ఇరుముడి విప్పితే రూ.100 ఇవ్వాల్సిందే రోడ్డుకు మధ్యలో వ్యాపారాలు -
అక్రమాల్లో ‘ఘను’లు
● యథేచ్ఛగా సుద్ద అక్రమ రవాణా ● పట్టించుకోని అధికారులు సాక్షిటాస్క్పోర్స్: ఎన్వోసీ, రాయల్టీ లేకుండా టీడీపీ నాయకులు సుద్ద అక్రమ మైనింగ్ చేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవుదినాలుగా ఉన్నందున అధికారులు పట్టించుకోరన్న ధైర్యంతో అక్రమ మైనింగ్ పనులు చేస్తున్నారు. బనగానపల్లె మండలంలోని వెంకటాపురం గ్రామం నుంచి చెరువుపల్లెకు వెళ్లే రహదారిలోని చాకలికుంట సమీపంలో సుమారు నెల రోజులుగా సుద్ద అక్రమమైనింగ్ పనులు చేపడుతున్నారు. టిప్పర్ల ద్వారా గని లోపలి నుంచి సుద్దను బయటకు తీసుకొస్తున్నారు. కుప్పలుగా పోసిన సుద్దను రాయల్టీ ఉన్నావారు కొనుగోలు చేసి రవాణా చేస్తున్నారు. అక్రమ మైనింగ్ చేపట్టే వారికి టిప్పర్ ద్వారా ఖర్చులు పోను సుమారు రెండులక్షల వరకు మిగులు ఉంటుందని తెలుస్తోంది. రోజుకు రెండు టిప్పర్ల సుద్దను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వారంలో రెండు రోజులు విక్రయిస్తే సుమారు మూడు లక్షల వరకు ఆదా ఉంటుందని సమాచారం. ఈవిధంగా నెలకు 10–12 లక్షల వరకు మిగులు ఉంటుంది. సుద్ద అక్రమమైనింగ్తో ప్రభుత్వ ఆదాయం కోల్పోతుండగా అక్రమమైనింగ్ చేపట్టేవారు సంపాదన పరులుగా మారుతున్నారు. -
కనుల పండువగా
గ్రామోత్సవంశ్రీశైలంలో అశేష భక్తజనం మధ్య గ్రామోత్సవంశ్రీశైలంటెంపుల్: పరమేశ్వరుడికి అపరభక్తుడైన రావణుడు కై లాసాన్నే పెకిలించి తీసుకెళ్లే క్రమంలో స్వామివారికి వాహనుడయ్యాడు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీశైలంలో రావణవాహన సేవ నిర్వహించారు. ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో రావణవాహనాన్ని సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. ప్రధాన అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. రావణ వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించి, పరివార దేవాలయాల్లో ప్రత్యేక పూజా హారతులు ఇచ్చారు. అనంతరం గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలువీరభద్రస్వామి దేవాలయం వరకు గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. నీలకంఠుడు భ్రమరాంబా సమేతుడై దశకంఠుడి భుజస్కందాలపై ఊరేగాడు. ఉత్సవంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వామిఅమ్మవార్లను కన్నులారా దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర దేవదాయవాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కమిషనర్ కె.రామచంద్రమోహన్ పట్టువస్త్రాలు తీసుకువచ్చారు. రాజగోపురం వద్ద వీరికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. నేడు పుష్పపల్లకీ సేవ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం సాయంత్రం మల్లికార్జున స్వామికి పుష్పపల్లకీ సేవ ఉంటుంది. అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.గ్రామోత్సవంలో రావణ వాహనంపై ఆది దంపతులు -
నేడే ‘బార్’ ఎన్నికలు
● 445 మంది ఓటర్లు ● ఆరు పోలింగ్ బూత్లునంద్యాల(వ్యవసాయం): రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగే ఏపీ స్టేట్ బార్ కౌన్సిలర్ ఎన్నికలకు నంద్యాల బార్ అసోసియేషన్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు పోలింగ్ ఆఫీసర్ హుసేన్బాషా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు హరిప్రసాదరెడ్డి, చిన్న సుదాంశ మౌళిరెడ్డి, వెంకటేశ్వర్లు, తోటా మురుళీ గురువారం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాల బార్ అసోసియేషన్లో న్యాయవాదులు 445 మంది ఓటర్లు ఉన్నారని, అందుకోసం ఆరు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తారన్నారు. ఓటింగ్ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుందన్నారు. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు, ఓటర్ల జాబితా, సీలింగ్ కిట్లు ఏపీ బార్ రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి నంద్యాల బార్ అసోసియేషన్కు చేరుకున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 143 మంది బార్ మెంబర్లుగా పోటీలో ఉన్నట్లు చెప్పారు. ఓటర్లు సీరియల్ నంబర్లను క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలన్నారు. కచ్చితంగా ఐదుగురిని గుర్తించాలని, అంతకన్నా తక్కువ అయితే ఓటు చెల్లదన్నారు. పోలీసుల భద్రత ఉంటుందన్నారు. నంద్యాల జిల్లాలో బార్ అసోసియేషన్ నుంచి ఎం.విజయశేఖర్రెడ్డితో పాటు మరొకరు, ఆళ్లగడ్డ నుంచి ఒకరు, డోన్ నుంచి ఒకరు పోటీలో ఉన్నట్లు చెప్పా రు. జిల్లాలో ఏడు బార్ అసోసియేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటర్లు కచ్చితంగా ఏపీ బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డును తెచ్చుకోవాలన్నారు. -
భక్తులు సంయమనం పాటించాలి
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి కొంత అలస్యమవుతోందని, భక్తులు సంయమనం పాటించా లని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణి యా తెలిపారు. బుధవారం గంగాధర మండపం వద్ద నూతన డోనేషన్ కౌంటర్లో ఎస్పీ సునీల్ షెరాన్తో కలిసి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.భక్తుల సౌకర్యార్థం మల్లన్న స్పర్శ దర్శనం, అలంకార దర్శనం కోసం వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి 1,95,555 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోగా, అందులో 50,504 మంది శివస్వాములు ఉన్నారన్నారు. భక్తుల అనూహ్య రద్దీ కారణంగా చిన్నపాటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. బ్రహ్మోత్సవాలపై అసత్య ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. రుద్రకోడు క్షేత్రానికి శివరాత్రికి బస్సులు లేవు ఆత్మకూరు: ఈ ఏడాది మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రుద్రకోడు క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం లేదని ఆర్టీసీ డిపో మేనేజర్ వినయ్కుమార్ తెలిపారు. పట్టణంలోని ఏపీఎస్ ఆర్టీసీ డిపో ఆవరణలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. ఎస్ఆర్ఎంసీ నుంచి వెలుగోడు రిజర్వాయర్కు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడం వల్ల గాలేరు, రాళ్లవాగులో నీరు అధికంగా నిలిచి ఉందన్నారు. ఇప్పటికే ఫారెస్టు అధికారులతో కలిసి రుద్రకోడు క్షేత్రానికి నల్లకాల్వ నుంచి రెండు వైపులా ఉన్న రహదారులను పరిశీలించామన్నారు. ఈ రహదారుల్లో ఆర్టీసీ బస్సు వెళ్లే అవకాశం లేనందువల్ల ఈ ఏడాది రుద్రకోడుకు బస్సులను రద్దు చేసినట్లు చెప్పారు. వాస్తవానికి ప్రతి ఏడాది ఆత్మకూరు నుంచి పది ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపేవారమన్నారు. -
మన అడవిని మనమే రక్షించుకోవాలి
ఆత్మకూరురూరల్: నల్లమల అడవి అందరిది అని, సంరక్షణ బాధ్యత విషయాన్ని తప్పక గుర్తించాలని నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ అన్నారు. బుధవారం ఆయన ఆత్మకూరు డివిజన్లోని శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివభక్తులను కలసి అటవీ సంరక్షణ గురించి వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలానికి భక్తులు కాలినడకన వెళ్లడం ఒక పురాతన ఆధ్యాత్మిక కార్యక్రమన్నారు. అటవీ చట్టాలను అమలయ్యే సమయంలోనే ఈ పాదయాత్ర మార్గంలో శివరాత్రి, ఉగాది పర్వదినాల్లో భక్తులు వెళ్లేందుకు హక్కు కల్పించారన్నారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అటవీ రక్షణకు చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. అడవుల్లోకి ప్లాస్టిక్ను పకడ్బందీగా నివారించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉందన్నారు. భక్తులు అడవిలో పారవేసే ప్లాస్టిక్ వస్తువులను వన్యప్రాణులు తిని మృత్యువాత పడుతాయన్నారు. కేవలం 30 శాతం సిబ్బందితోనే అటవీ సంరక్షణ చర్యలు చేపడుతున్నామని, ఈ విషయాన్ని భక్తులు గమనించి అటవీ శాఖకు సహకరించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పర్యావరణ పరిరక్షణ విషయాలు చర్చించారు. ఆయన వెంట డీడీ విగ్నేష్ అపావ్, ఎఫ్ఆర్ఓలు ప్రణీతాబాయి, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని డయాగ్నోస్టిక్ సెంటర్లో వ్యాక్సినేషన్ చేశారు. వీరికి మెనింగో కోకల్, సీజనల్ ఇంఫ్లూయెంజా వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి అవసరమైన అన్ని వైద్యచికిత్సలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలను డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, డీఐఓ డాక్టర్ ఉమా అందించారు. మొత్తం 155 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, స్థానిక హజ్ కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఉరుసుకొచ్చి.. చోరీకి స్కెచ్ గీసి!
● బంగారు దుకాణంలో చోరీ దొంగల అరెస్ట్ ● రూ. 40 లక్షల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం బనగానపల్లె: మూడు రోజుల్లోనే బంగారు దుకాణంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బనగానపల్లె పట్టణంలో సంచలమైన చోరీ కేసులో దొంగలను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి అరెస్ట్ చేశారు. అపహరించిన 18 తులాల బంగారు, 8 కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దొంగల వివరాలను బుధవారం డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వివరించారు. బనగానపల్లె పట్టణంలోని పీర్లచావిడి పక్కభాగంలో ఉన్న శ్రీనివాస జ్యువెలర్స్ దుకాణంలో దొంగలు ఈ నెల 7వ తేదీ రాత్రి దాదాపు రూ.40 లక్షల విలువైన బంగా రు, వెండి ఆభరణాలను అపహరించారు. కేసు నమోదు చేసిన సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐలు దుగ్గిరెడ్డి, కల్పన దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ వైపు సీసీ కెమెరాల పరిశీలన, మరో వైపు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల సమాచారాన్ని సేకరించారు. నిందితులంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారీగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం పాణ్యం స్టీల్ ప్లాంట్ వద్ద మహమ్మద్ ఇమ్రాన్, షేక్ మహమ్మద్ ఇబ్రహీం, మహమ్మద్ నజీర్, సయ్యద్ సైదుల్లా, మహమ్మద్ షేక్షాను అరెస్టు చేయగా, తెలంగాణాలోని రాజేంద్రనగర్ పరిధిలో మహిర్ దేవులపల్లిని చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ తన నలుగురు స్నేహితులతో కలసి బొలెరో వాహన యజమాని మహమ్మద్ ఇబ్రహీంతో చేతులు కలిపి చోరీకి పాల్పడ్డారు. చోరీ సమయంలో బొలెరే వాహనం నంబర్లు మార్చుతూ ప్రయాణించినట్లు గుర్తించారు. ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి కొద్ది రోజుల ముందు అవుకు సమీపంలో జరిగినా ఒక ఉరుసులో వీరందరూ పాల్గొన్నారని, ఆ సమయంలో ఈ బంగారు దుకాణంలో చోరీకి పథకం వేసినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐలు దుగ్గిరెడ్డి, కల్పనను డీఎస్పీ అభినందిస్తూ, త్వరలో ఎస్పీ ద్వారా రివార్డులు అందజేస్తామన్నారు. బంగారు దుకాణ యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. -
గొంతెండి.. రోడ్డెక్కి!
● మంచి నీటి సమస్య పరిష్కరించాలని మహిళల ఆందోళన ● కర్నూలు – గుంటూరు రోడ్డుపై నిరసన జూపాడుబంగ్లా: ఆ కాలనీల పక్కనే ఎంపీడీఓ కార్యాలయం. దాదాపు మూడు నెలలుగా కాలనీ ప్రజలకు నీరందడం లేదు. ‘సార్.. సమస్యను పరిష్కరించండి’ అని మొర పెట్టుకున్నా ఎవరూ ఆలకించలేదు. చివరకు గొంతెండిన ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. జూపాడుబంగ్లా పింజరిపేట, బీసీ కాలనీల ప్రజలు బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కర్నూలు – గుంటూరు రహదారిపై బైఠాయించి మంచి నీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన చేశారు. మంచినీటి బోరుకు మోటారు, పైపులైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మూడు నెలల నుంచి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా.. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీటి కోసం పనులు మానుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గ్రామస్తుల ధర్నాతో కేజీ రోడ్డుపై వాహనాల రాకపోకలు అరగంటపాటు స్తంభించా యి. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ సంజీవ వారి వద్దకు చేరుకొని ధర్నా విరమించాలని కోరారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేవరకు కదలమని భీష్మించారు. ఎంపీడీఓ గోపికృష్ణ ధర్నా వద్దకు చేరుకుని వెంటనే ట్యాంకర్తో మంచినీటిని సరఫరా చేయిస్తామని హామీనిచ్చారు. మూడు రోజుల్లో గా సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందో ళన విరించారు. ఆందోళనలో సీపీఐ నాయకులు రమేష్బాబు, మగ్భుల్బాషా, తిరుపతయ్య, పుల్లయ్య, మధు, రాజు, ఉసేనయ్య, నాగమణి, లక్ష్మీదేవి, దేవమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
శిరివెళ్ల: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై నిర్లక్ష్యం వహించిన కోటపాడు సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, శిరివెళ్ల–3వ సేవా కేంద్రం సర్వేయర్, గోవిందపల్లె సిబ్బందికి షోకాజ్ నోటీస్లు జారీ చేసినట్లు ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప బుధవారం తెలిపారు. ఈ నెలాఖరులోగా సర్వే వంద శాతం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రతి నెల పంపిణీవుతున్న సామాజిక పింఛన్ల డబ్బు లు పంపిణీ అనంతరం మిగిలిన డబ్బులను గడువులోగా కోటపాడు సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ చెల్లించడం లేదన్నారు. అతనికి ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. తీరు మారక పోతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయ శాఖ ఉద్యోగాలకు 18న రాత పరీక్ష కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈనెల 18న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్సైట్ www.ecourtskurnoo l.com,https://kurnool.dcourts.gov.inలో పొందుపరిచామన్నారు. ఈనెల 18న ఉదయం 9 గంటలకు కర్నూలు ప్రసూన లా కళాశాలలో రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. హాల్ టిక్కెట్లు రాకపోతే ఈనెల 17న న్యాయ సేవా సదన్ హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని తెలిపారు. ఉద్యోగ నియామక ప్రక్రియ మొత్తం రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, మెరిట్ ఆధారంగా నిర్వహిస్తామన్నారు. కొలిమిగుండ్ల: గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ రైతు పంట పండింది. తిమ్మనాయినపేటకు చెందిన రైతు మాదాసు పెద్ద మునెయ్య రెండు ఎకరాల్లో శనగ సాగు చేయగా ఇటీవలనే పంట కోత కోయించాడు. బుధవారం శనగలు కొను గోలు చేసేందుకు వ్యాపారులు రావడంతో కాట వేయడంతో ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున రెండు ఎకరాలకు 24 క్వింటాళ్లు దిగుబడి రావడంతో సంతోషం వ్యక్తం చేశాడు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం మండలంలో సగటున ఆరేడు క్వింటాళ్ల మించి దిగుబడి వచ్చేది కాదు. తిమ్మనాయినపేటలో రికార్డు స్థాయిలో ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎకరాకు రూ.60 వేల మేర ఆదాయం లభించింది. అయితే గత రెండేళ్లుగా మార్కెట్లో ధర రోజురోజుకు తగ్గిపోతుండంటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధర రూ.5 వేలు మాత్రమే ఉండటంతో ఓ రకంగా రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పెళ్లి పెద్ద బ్రహ్మనందీశ్వరుడికి మహానంద్శీరుడి ఆహ్వానం మహానంది/నంద్యాల(వ్యవసాయం): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే తన కల్యాణానికి పెళ్లిపెద్దగా వ్యవహరించే బ్రహ్మనందీశ్వరస్వామిని ఆహ్వానించుటకు శ్రీ కామే శ్వరి దేవి సహిత మహానందీశ్వరస్వామి బుధవారం సాయంత్రం నంద్యాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక చెరువు కట్ట వద్ద ఆలయ ఈఓ లక్ష్మీనారాయణ, వేదపండితులు పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీగణపతి దేవాలయం విడదిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా మహానంది దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకుడు రవిశంకర అవధాని మాట్లాడుతూ.. మహా నందీశ్వరుడి కల్యాణానికి బ్రహ్మనందీశ్వరస్వామిని పెళ్లి పెద్దగా ఆహ్వానించడం సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. గురువారం పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మహానంది దేవస్థానం ఈఓలు శ్రీనివాసరెడ్డి, లక్ష్మీనారాయణ, మేనేజర్లు, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
కొలిమిగుండ్ల: పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యే దృష్టిసారించి పాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ జనార్దనరెడ్డి తెలిపారు. అవుకు మండలంలోని రామాపురం, కొలిమిగుండ్ల మండలంలోని బెలుం, కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలు, మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాలలను మంగళవారం తనిఖీ చేశారు. జిల్లాలో 27 వేల మంది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోతున్నారని చెప్పారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదవాలని సూచించారు. తుది ఎంపిక జాబితా విడుదల కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యా న్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఫిజిసిస్ట్, ఓటీ అసిస్టెంట్, అనెస్తీషియా టెక్నీషియన్ అభ్యర్థుల తుది ఎంపిక జాబితా ఫేస్–2 విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 జనవరి 29న జారీ చేసిన నియామక నోటిఫికేషన్ 01/2024కు సంబంధించి ఈ పోస్టులను 1:2 రేషియో పద్ధతిన లిస్ట్ తయారైందన్నారు. జాబితా కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్సైట్స్, కర్నూలు మెడికల్ కాలేజి వెబ్సైట్లలో(-h-tt pr://k ur noo .a p.go-v.i n, htt pr:// na nd ya .a p.g-o-v.i n, htt pr://k ur noo med-ica co efe.a-c.i n) అప్లోడ్ చేశామన్నారు. ఎంపికై న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, నకలుతో ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కాలేజీ కార్యాలయంలో వెరిఫికేషన్కు హాజరుకావాలని పేర్కొన్నారు. శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.08 కోట్లు మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠం హుండీ ఆదాయం లెక్కించగా రూ.3,08,37,571 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 21 రోజుల హుండీ కానుకలు లెక్కించారు.అందులో నగదు రూపేణా రూ.2.98, 13,571, నాణేలా రూపంలో రూ.10,24,000 వచ్చినట్లు మేనేజర్ శ్రీనివాసరావు వివరించారు. అలాగే 13 గ్రాముల బంగారం, 1080 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు మేనేజర్–2 వెంటేష్ జోషి, ఏఏఓ మాధవశెట్టి తెలిపారు. -
ఇకపై డ్రోన్ పెట్రోలింగ్
కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఇప్పటివరకు రాత్రి, పగలు ఆయా స్టేషన్ల పరిధిలో క్యూఆర్టీ, బ్లూ కోల్ట్స్ వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా మరో మూడు డ్రోన్ కెమెరాలను జిల్లాకు ఆ శాఖ ఉన్నతాధికారులు కేటాయించడంతో వీటి సేవలను పెట్రోలింగ్కు వినియోగించనున్నారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన మూడు డ్రోన్ కెమెరాలతో పాటు దాతలు రెండు డ్రోన్ కెమెరాలను సమకూర్చారు. తాజాగా ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ (డీజీపీ ఆఫీస్) నుంచి మరో మూడు నూతన డ్రోన్ కెమెరాలను కేటాయించగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా స్మార్ట్ పోలీసింగ్ దిశగా జిల్లా పోలీసు శాఖ ముందడుగు వేస్తోంది. ఉత్సవాలు, పండుగలు, వేడుకలు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీగా ప్రజలు తరలివచ్చే సందర్భాల్లో పోలీసు శాఖకు సాంకేతికత మరింత దోహదపడుతోంది. ఇందులో భాగంగా కొంతకాలంగా డ్రోన్ కెమెరాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని కళాశాలలు, పాఠశాలల వద్ద డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. -
● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పులకించిన భక్తజనం ● నేడు మయూరవాహనంపై స్వామిఅమ్మవార్ల దర్శనం
ఇల కై లాసం.. బ్రహ్మోత్సవ శోభితం శ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీభ్రమరాంబికతో కలసి మల్లికార్జునుడు హంసవాహనంపై దర్శనమివ్వగా స్వామిఅమ్మవార్లను కన్నులారా దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. శ్రీగిరి క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మారుమోగుతోంది. శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు హంసవాహనసేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్దగల అక్కమహాదేవి అలంకార మండపంలో హంసవాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను హంసవాహనంపై అధిష్టింపజేసి ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా హారతులు ఇచ్చారు. మంగళవాయిద్యాలు మార్మోగగా, భక్తుల శివనామస్మరణతో హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం పరివార దేవతామూర్తులకు ప్రత్యేక కర్పూర నీరాజనాలు సమర్పించి గ్రామోత్సవాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ప్రారంభించారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు అక్కడి నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించి ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీశైలంలో నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గోరోజు బుధవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు మయూరవాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం మయూరవాహనంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. అలాగే ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక దేవస్థానం, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీశైలం.. భక్తజనసంద్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భ్రమరాంబాసమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా శ్రీశైలం చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామిఅమ్మవార్లకు జరిగే వాహనసేవలు కన్నులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించి తరిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణమ్మ ప్రత్యేక వాయనం సమర్పిస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. క్షేత్ర పరిధి ఎటుచూసినా భక్తజనంతో నిండిపోయింది. నల్లమల అటవీప్రాంతం నుంచి 40 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ భక్తులు హరోం హరా శంకరా అంటూ మల్లన్న చెంతకు చేరుకుంటున్నారు. సామాన్య భక్తులకు ఆలయ క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్ దారుణం
కల్లూరు: శ్రీశైలంలో దర్శనం కోసం శివభక్తులు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, భక్తులపై పోలీసులతో లాఠీ చార్జీ చేయించడం దారుణమని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. కల్లూరులోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారన్నారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డుమాంసం కొవ్వు, పంది కొవ్వు కలవలేదని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్డీడీబి, ఎన్డీఆర్ఐలు స్పష్టం చేశాయన్నారు. ఈ ల్యాబుల రిపోర్టులను సీబీఐ, సిట్ తన చార్జీషీటులో పొందుపరిచిందన్నారు. అయినా సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు, కోట్లాడి మంది వెంకటేశ్వరస్వామి భక్తులు ఛీదరించుకుంటున్నారన్నారు. తన ఆరోపణలు తప్పని ల్యాబ్ టెస్టుల్లో తేలినప్పటికి ఇప్పటికీ ప్రజలకు సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పలేదన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటే దేవుడు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. నీచ ప్రచారాలు, అబద్ధాలను కట్టిపెట్టి భక్తుల మనోభావాలను టీడీపీ నాయకులు గౌరవించాలన్నారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు గాజుల శ్వేతారెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, సాన శ్రీనివాసులు, నాయకులు ఎ. హనుమంతురెడ్డి, ఎన్. గోపాల్రెడ్డి, శివారెడ్డి, తిరుపాల్, శ్రీనివాసులు, రమణారెడ్డి, శివశంకర్రెడ్డి, సుంకన్న, భీమశంకర్రెడ్డి, సాయి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం.. చరిత్రలో మొదటిసారిగా
సాక్షి,నంద్యాల: శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం జరిగింది. శ్రీశైల ఆలయ చరిత్రలో మొదటిసారిగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని జరిపించలేదు. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు స్వామి అమ్మ వార్లకు నిర్వహించాల్సిన వాహనసేవ, గ్రామోత్సవాన్ని దేవస్థానం అధికారులు రద్దు చేశారు. క్యూలైన్లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. పురవీధుల్లో జరగాల్సిన ఉత్సవాన్ని ఆలయ ప్రాంతానికి పరిమితం చేశారు. గ్రామోత్సవం జరగ కపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భృంగి వాహనాధీశా.. పాహిమాం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో శ్రీగిరి క్షేత్రం ఇల కై లాసాన్ని తలపిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా భృంగి వాహనాన్ని పలు సుగంధ పుష్పాలతో అలంకరించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై ఉంచి అలంకార మండపంలో అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛరణతో ప్రత్యేక పూజా హారతులిచ్చారు. అనంతరం భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు నారికేళాలు సమర్పించారు. పరి వార దేవతామూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటూ ఉత్సవాన్ని ఆలయం వెలుపలకి తోడ్కొనివచ్చారు. కళాకారుల ప్రదర్శనలు కొనసాగుతుండగా.. మరో వైపు భక్తుల శివన్మామస్మరణతో పరమేశ్వరుడి పరమ భక్తుడైన భృంగి పులకించిపోయారు. వేలాది మంది భక్తులు భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల దివ్య మంగళస్వరూపాన్ని దర్శించి దీవెనలిమ్మని వేడుకున్నారు. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన.. ఉత్సవంలో కళాకారుల ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారుల నృత్యాలు, కోలాటాలు, నాదస్వరం, చెక్కభజనలు, రాజభటుల వేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ ఢోల్ థాషా, మహిళా, పురుషుల వీరగాసి కన్నడ జానపద కళా ప్రదర్శనలు అలరించాయి. కాళికా నృత్యం, జాంజ్పథక్, జానపద పగటి వేషాలు, గొరవయ్యలు, డప్పుల నృత్యాలు, బుట్టబొమ్మలు, తప్పె ట చిందు, బీరప్పడోలు, నందికోలసేవ భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీశైలంలో నేడు.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఆలయ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వారిచే శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భృంగివాహనంపై ఆదిదంపతుల విహారం స్వామిఅమ్మవార్లను దర్శించుకుని తరించిన భక్తజనం శ్రీగిరిలో వైభవంగా సాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు హంసవాహన సేవలో స్వామిఅమ్మవార్ల దర్శనం -
వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
నంద్యాల: వెట్టి చాకిరీ రహిత జిల్లాగా నంద్యా లను తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ అన్నారు. సోమవారం వెట్టి చాకిరీ చట్టం 1976 రద్దు చేసి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కలెక్టరేట్లో పోస్టర్లను డీఆర్ఓ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ మాట్లాడుతూ వెట్టి చాకిరీ అనేది ఒక రకమైన బలవంతపు శ్రమ అని, దీనిలో ప్రజలు అప్పు తీర్చడానికి పని చేయవలసి వస్తుందన్నారు. ఇవి ప్రజలను దోపిడీ, పేదరికం, నియంత్రణ అనే వలయాల్లో చిక్కుకునేలా చే స్తుందన్నారు. ఎవరైనా వెట్టి చాకిరీలో చిక్కు కుని ఉన్నారని తెలిస్తే మండల రెవెన్యూ అధికారి, జిల్లా మేజిస్ట్రేట్, కార్మిక శాఖ అధికారికి నివేదించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమామహేశ్వరి, జిల్లా కన్వీనర్ కరీముల్లా, కో కన్వీనర్లు ఫిలిక్స్, అక్బర్ బాషా, న్యాయ సలహాదారులు సయ్యద్ అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. చౌడేశ్వరిదేవికి రూ. 20.90 లక్షల ఆదాయం బనగానపల్లె: నందవరంలో వెలసిన చౌడేశ్వరిదేవి ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా ఆలయానికి రూ.20.90 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతేడాది నవంబర్ 12వ తేదీ నుంచి ఈనెల 8వ తేదీ వరకు భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. ఈ లెక్కింపులో 17 గ్రాముల బంగారు, 560 గ్రాముల వెండి ఆభరణాలు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆల య పర్యవేక్షణాధికారి హరిశ్చంద్రరెడ్డి, ఆలయ చైర్మన్ పీవీ నాగార్జునరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు. ● 50 మందికి పైగా జ్వర పీడితులుకోవెలకుంట్ల: మండలంలోని భీమునిపాడు ఎస్సీ కాలనీని విష జ్వరాలు వణికిస్తున్నాయి. కాలనీలో పారిశుద్ధ్య లోపంతో ఇటీవల కాలంలో విష జ్వరాలు ప్రబలడంతో కాలనీవాసులు మంచం పట్టారు. కాలనీకి చెందిన సామేల్, హరికృష్ణ, ఇంద్రకుమార్, అంజలి, గౌసియా, ఓబులేసు, అకి రాతోపాటు మరో 40 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారు. జ్వర పీడితులు కోవెలకుంట్ల పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకుంటున్నారు. వేసవికాలం ప్రారంభం కావడంతో కాలనీలో మురుగునీరు కారణంగా దోమల స్వైర విహారంతో జ్వరాలు ప్రబలిన ట్లు బాధితులు తెలిపారు. పంచాయతీ అధికారు లు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో జ్వరాలు అధికమయ్యాయని వాపోతున్నారు. ఊరూరా భక్తిపారవశ్యం రుద్రవరం: అహోబిలేశుడి పారువేట ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉత్సవమూర్తులు జ్వాలా నరసింహుడు, లక్ష్మీ నరసింహస్వాములు పల్లకీలో కొలువై మందలూరు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఉత్సవ మూర్తులకు ఘనస్వాగతం పలికారు. భక్తులంతా పెద్దసంఖ్యలో స్వాముల వారిని చూసేందుకు తరలి వచ్చారు. నేటితో ముగియనున్న ప్రాక్టికల్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. గత నెల 27న మొదలైన వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మూడు స్పెల్స్లో నిర్వహించారు. ఈ నెల 1వ తేది నుంచి మొదలైన జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు రెండు స్పెల్స్లో నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన పరీక్షలకు 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలకు 1,566 మందిల్లో 1546 మంది హాజరయ్యారు. మద్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,341 మందిలో 1,321 మంది హాజరయ్యారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు -
ఊరూవాడా.. సుగ్గిబాట
గుంటూరు వలస వెళుతున్న చిర్తనపల్లి గ్రామస్తులుఎమ్మిగనూరుటౌన్/హొళగుంద: ఉపాధి పనులు లేక పోవడంతో ప్రజలు వలస వెళ్తూ గ్రామాలు ఖాళీ అవు తున్నాయి. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాలతో పాటు కోసిగి, కౌతాళం, హొళగుంద మండలాల్లోని గ్రామాల నుంచి ప్రజలు భారీగా దూర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. గుంటూరులో మిరప కోత పనులు ఉండటంతో కుటుంబాలతో సహా వెళ్తు న్నట్లు చిర్తనపల్లి గ్రామస్తులు తెలిపారు. పనులు పూర్తయిన తరువాత తిరిగి స్వగ్రామానికి వస్తామన్నారు. ఖాళీ అయిన ఎస్సీ కాలనీ హొగుంద మండలం నెరణికి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన కూలీలు సోమవారం రాత్రి మూటామల్లె సర్దుకుని వలస వెళ్లారు. గ్రామంలో ఉపాధి పనులు జరగకపోవడం, మెట్ట భూములు, ఇతర వ్యవసాయ పొలాల్లో పనులు లేక పోవడంతో గుంటూరుకు వెళ్తున్నట్లు కూలీలు చెప్పారు. పిల్లాపాపలతో కలిసి వెళ్తున్నామని, గ్రామంలోనే పనులు కల్పించాలని కోరుతున్నారు. -
చంద్రబాబూ.. మతవిశ్వాసాలతో ఆటలొద్దు
● గుంటూరులో స్వాధీనం చేసుకున్న వక్ఫ్ భూములు వెనక్కివ్వండి ● పీజీఆర్ఎస్లో ఎమ్మెల్సీ ఇసాక్బాషా ఫిర్యాదు బొమ్మలసత్రం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మత విశ్వాసాలతో చెలగాటమాడుతున్నారని, ఇది మంచిది కాదని ఎమ్మెల్సీ ఇసాక్బాషా హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా చిన్న కాకాని గ్రామంలో అంజుమాన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన 71 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థకు చెందిన భూములను తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సోమవారం ముస్లిం నాయకులతో కలసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, జిల్లా పార్టీ ఉపాధ్యాక్షులు దాల్మిల్ అమీర్, మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు రసూల్ ఆజాద్, నాయకులు గన్నీకరీమ్, కౌన్సిలర్లు ఆరీఫ్, కలామ్, బాషిద్ తదితరులతో కలసి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. చిన్నకాకానిలో ముస్లిం మత సంస్థ పేద ముస్లింల అవసరార్థం 71.52 ఎకరాల భూమి ఉంచిందన్నారు. అయితే చంద్రబాబు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు పేరుతో ఆభూమిని స్వాధీనం చేసుకోవడం అన్యాయమన్నారు. ఇలాగే ఇతర మతాలకు చెందిన భూములను రాబోయే రోజుల్లో చంద్రబాబు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటారని, అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. మత విశ్వాసాలను దెబ్బ తీస్తూ మత సంస్థలకు చెందిన భూములు స్వాధీనం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ముస్లింలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న టీడీపీ ప్రభుత్వం.. కోర్టు తీర్పులను సైతం ధిక్కరిస్తూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా నియంత్రణ చర్యలు చేపట్టడంలో ప్రతీసారి విఫలమవుతోంది. ఇప్పటికే తిర
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివమాల స్వీకరించి, జ్యోతిర్ముడిని కలిగిన శివస్వాములకు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. సామాన్య భక్తులకు మల్లన్న అలంకార దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లన్న స్పర్శదర్శనం కోసం భారీ సంఖ్యలో జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములు శ్రీగిరి చేరుకున్నారు. సాధారణ భక్తులు సైతం అదే స్థాయిలో మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. అయితే భక్తుల రద్దీని అంచనా వేయలేకపోయిన దేవస్థానం అధికారులు సోమవారం చేతులెత్తేశారు. గంటల తరబడి క్యూలైన్లలోనే.. వీఐపీల సేవలో తరలించిన దేవస్థానం అధికారులు శివస్వాములు, సామాన్య భక్తులను పూర్తిగా విస్మరించినట్లు సోమవారం చోటు చేసుకున్న ఘటనలతో వెల్లడైంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, టాయిలెట్ల సౌకర్యాలు లేక నానా అవస్థలు పడ్డారు. ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద ఎండ వేడిని తట్టుకోలేక భక్తులు చుక్కలు చూడాల్సి వచ్చింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో వైఫల్యం వేలాదిగా తరలివచ్చిన భక్తులు వందల కిలోమీటర్ల దూరం కాలినడక యాత్ర ఇరుముడితో శ్రీశైలం చేరుకున్న స్వాములు దర్శన ఏర్పాట్లలో చేతులెత్తేసిన అధికార యంత్రాంగం గంటల తరబడి క్యూలైన్లలోనే భక్తులు విధిలేక దర్శనం చేసుకోకుండానే తిరుగుముఖం -
బాబు సర్కారుపై ‘శివ’మెత్తిన స్వాములు
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించి మల్లికార్జున స్వామి దివ్య దర్శనం కోసం భక్తులు పరితపిస్తారు. దీనికోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన చంద్రబాబు కూటమి సర్కారు విఫలమైంది. ముందస్తు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో అలక్ష్యం ప్రదర్శించింది. ఫలితంగా సోమవారం బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులను నియంత్రించలేక అధికారులు చేతులెత్తేశారు. భక్తులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు పడిన వృద్ధులు, మహిళలు, చంటిపిల్లలు అల్లాడిపోయారు.శివస్వాములూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంతకూ అధికారులు రద్దీని నియంత్రించలేకపోవడంతో శివస్వాముల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు క్యూలైన్ల తాళాలు పగులగొట్టి, ఆలయంలో బైఠాయించి సీఎం, డిప్యూటీ సీఎం, చైర్మన్, ఈఓ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయినా అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోవడంతో చాలా మంది శివస్వాములు, భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనం చేసుకోకుండానే ఉసూరుమంటూ వెనుతిరిగి వెళ్లారు. ఘాట్ రోడ్లలో స్తంభించిన ట్రాఫిక్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని తెలిసినా ముందస్తు అంచనా వేయడంలో బాబు సర్కారు, దేవస్థానం అధికారులు విఫలమయ్యారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజైన ఆదివారం మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న రద్దీ సాయంత్రం నుంచి పెరిగిపోయింది. భారీ సంఖ్యలో వాహనాల్లో, పాదయాత్రగా భక్తులు పోటెత్తారు. అలాగే ఆదివారం రాత్రి భారీగా తరలివస్తున్న వాహనాలతో ఇరు వైపులా ఘాట్రోడ్లలో, శ్రీశైలంలో ట్రాఫిక్ స్తంభించింది. చేతులెత్తేసిన దేవస్థానంఈ నెల 8 నుంచి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివమాల స్వీకరించి, జ్యోతిర్ముడిని కలిగిన శివస్వాములకు ఈ నెల 8 నుంచి 12 వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. సామాన్య భక్తులకు మల్లన్న అలంకార దర్శనం కల్పిస్తున్నారు. మల్లన్న స్పర్శదర్శనం కోసం భారీ సంఖ్యలో శివస్వాములు శ్రీగిరి చేరుకున్నారు. సాధారణ భక్తులు సైతం అదే స్థాయిలో మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. అయితే అధిక సంఖ్యలో తరలివచ్చిన శివస్వాములకు స్పర్శదర్శనం కల్పించడంలో దేవస్థాన అధికారులు విఫలమయ్యారు. సాధారణ భక్తులను, శివస్వాములను నియంత్రించలేక దేవస్థాన అధికారులు చేతులెత్తేశారు. ఎండలో కాళ్లు కాలుతున్నా.. భక్తుల పడిగాపులుభక్తుల రద్దీని నియంత్రించడంలో విఫలమవడంతో పాటు భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ అలసత్వం ప్రదర్శించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, టాయిలెట్ల సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు నానా అవస్థలు పడ్డారు. ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద ఎండలో రోడ్డుపై భక్తులు బారులు తీరారు. ఎండవేడిమికి మహిళలు, చంటిపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ.200 శీఘ్ర దర్శనం, రూ.500అతిశీఘ్ర దర్శనం క్యూలైన్ల వద్ద వేచిఉన్న భక్తులకు రోడ్డుపై మ్యాట్ కూడా వేయలేదు. ఎండలో కాళ్లు మాడుతున్నా.. భక్తులు అలాగే పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న శివస్వాములు తీవ్ర అసహనానికి గురయ్యారు.ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చి క్యూలైన్లతాళాలను పగులగొట్టి, తాత్కాలిక క్యూలైన్ల ఇనుప మెష్లను తొలగించి, ఇత్తడి క్యూలైన్లను తొలగించే యత్నం చేశారు. ఆలయంలోని మనోహర గుండం వద్ద పెద్ద ఎత్తున శివస్వాములు బైఠాయించారు. సీఎం, డిప్యూటీ సీఎం, దేవస్థాన ఈఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సనాతన ధర్మం అంటూ బీరాలు పలికే సీఎం, డిప్యూటీ సీఎం పాలనలో ఇంత అధ్వానంగా దేవస్థానం వ్యవస్థ ఉండడం మా ఖర్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివస్వాములపై లాఠీ ఎత్తిన ఏఎస్పీశివస్వాములను నియంత్రించేందుకు వచ్చిన నంద్యాల జిల్లా ఏఎస్పీ యుగంధర్రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. శివస్వాముల పై లాఠీ ఎత్తారు. దీంతో భక్తులు ఆగ్రహంచి ఏఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలని ఆలయ రాజగోపురం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. చివరికి ఏఎస్పీ అక్కడి నుంచి నిష్క్రమించడంతో శివస్వాములు శాంతించారు. -
శ్రీశైలంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
శ్రీశైలం: శ్రీశైలంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యాయి. దాంతో దర్శనం కోసం క్యూలైన్స్ , కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. శ్రీశైలం ఆలయం వద్ద శివస్వాములు ఆందోళన కొనసాగుతోంది. ఈవో డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్నారు శివస్వాములు. శివ భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి ఏఎస్పి యుగంధర్ బాబు , జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు..లాఠీ తో బెదిరిస్తూ శివదీక్ష భక్తులను చెదరగొడుతున్న ఏఎస్పి యుగంధర్ బాబు. ఫలితంగా రాజగోపురం నుంచి దర్శనం చేసుకోకుండా వెనుతిరుగుతున్న శివదీక్ష స్వామి భక్తులు. శ్రీశైల ఆలయ చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని శివ స్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివ భక్తులు, శివమాల దారులు పరిస్థితి గందరగోళంగా మారింది.అటవీ ప్రాంతం నుంచి నడక మార్గం ద్వారా శ్రీశైలం(ఫోటో గ్యాలరీ) -
పల్లెదారి..అధోగతి
అధ్వానంగా నిట్రవట్టి గ్రామ రహదారిగుంతలు పడిన గూళ్యం–సిద్ధాపురానికి వెళ్లే రోడ్డు కర్నూలు(అర్బన్): నాగరికతకు చిహ్నాలుగా నిలిచిన రోడ్ల అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం రోడ్లపై పడిన గుంతలను కూడా పూడ్చకపోవడం, ప్యాచ్ వర్కులు చేపట్టకపోవడవంతో గ్రామీణ రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జిల్లాలోని పలు రోడ్లకు నెలన్నర వ్యవధిలో రెండు పర్యాయాలు మంజూరు చేస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఏపీ రూరల్ రోడ్స్ స్ట్రెంగ్తనింగ్ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్ఎస్పీ) కింద జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రోడ్ల పనులను మంజూరు చేస్తూ గత ఏడాది డిసెంబర్ రెండో వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. రూ.60.09 కోట్ల అంచనా వ్యయంతో 111.110 కిలోమీటర్ల మేర రోడ్లను బలోపేతం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంజూరు చేసిన ఈ రోడ్లలో ఒక్క రోడ్డు (కటారుకొండ ఫామిన్ రోడ్ మల్యాల ఆర్ఎస్ నుంచి తెగదొడ్డి జంక్షన్) మాత్రం రూ. 8.23 కోట్లతో 14.960 కిలోమీటర్ల వేయనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన 25 రోడ్లు రూ.50 లక్షల నుంచి రూ.4 కోట్ల లోపు అంచనా వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే ఈ రోడ్లకు సంబంధించి అప్పట్లోనే పాలనా అనుమతులు మంజూరు చేసినా, ఇప్పటి వరకు ఎలాంటి టెండర్లను ఆహ్వానించ లేదు. కాగా, నెలన్నర రోజుల కాలయాపన అనంతరం ఇవే రోడ్ల పనులను రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పేరుతో ప్రభుత్వం ఈ నెల 4న తిరిగి తాజాగా మంజూరు చేస్తూ జీఓఆర్టీ నంబర్: 64ను జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీఓలో కంటే తాజాగా నాలుగు కిలోమీటర్ల మేర రో డ్డును, అంచనా వ్యయాన్ని రూ.2 కోట్లు మాత్రమే పెంచారు. అయితే ఈ పనులను ఏ పద్దు కింద విడుదల చేయనున్న నిధులతో చేపట్టాలనే అంశంపై స్ప ష్టత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాబార్డు రుణం లేదా కేంద్రం ఇచ్చే సాస్కీ (ఎస్ఏఎస్సీఐ – స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) నిధులతో చేపట్టే అవకాశం ఉంటుందని ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సమయం మంజూరు అయిన పనులు కిలోమీటర్లు మొత్తం రూ. (కోట్లలో) 2025 డిసెంబర్ 26 111.110 రూ.60.09 4/02/2026 26 115.244 రూ.62.67 రోడ్లు వేయకుండా ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం నెలన్నర వ్యవధిలో రెండు సార్లు అవే రోడ్లు మంజూరు ఎక్కడా కనిపించని పనులు ప్రజలకు తప్పనితిప్పలు -
సీమ ప్రాజెక్టులపై వివక్ష వద్దు!
నంద్యాల(అర్బన్): రాయలసీమ వ్యవసాయాభివృద్ధికి కీలకమైన ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్ట్ల అభివృద్ధిపై వివక్ష వద్దని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపవద్దని సూచించారు. స్థానిక సమితి కార్యాలయంలో ఆదివారం ఆయన ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 2026–27 బడ్జెట్లో రూ.8వేల కోట్లు కేటాయించాలన్నారు. సీమ సాగునీటి సమస్య ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదని, ఇది రాష్ట్ర వ్యవసాయ భద్రత, తాగునీటి భద్రత, ప్రాంతీయ సమతుల్యత, సమగ్ర అభివృద్ధితో నేరుగా ముడి పడి ఉందని అన్నారు. రాయలసీమ, తెలంగాణ, కోస్తా ప్రాంతాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు పూడికతో నిండిపోక ముందే, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని మార్గం సుగమం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, అసదుల్లా, భాస్కరరెడ్డి, పట్నం రాముడు, సుధాకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తి దేవస్థానం పట్టువస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి మల్లన్న సమేత భ్రమరాంబ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు అందాయి. ఆదివారం శ్రీకాళహస్తి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు సాయిప్రసాద్, ఈఓ బాపిరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల ఆలయ చైర్మన్ రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావు అధికారులు, అర్చకులు, వేదపండితులు శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులకు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు వస్త్ర సమర్పణ చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థాన ప్రధానార్చకులు కరుణాకర్ గురుకుల్, సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్వీ మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. -
గోరుకల్లు..కనిపించని పర్యాటక పరవళ్లు
● పర్యాటక ప్రదేశంగా గుర్తించని చంద్రబాబు ప్రభుత్వం ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూమిని గుర్తించిన అధికారులు పాణ్యం: జల సోయగాలతో అలరించే గోరుకల్లు జలాశయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూమిని సేకరించినా పట్టించుకోవడం లేదు. భారీగా పర్యాటకులు వచ్చి తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని గోరుకల్లు గ్రామస్తులు ఆశించినా ఫలితం లేకుండా పోయింది. గోరుకల్లు జలాశయం వద్ద 86.43ఎకరాల భూమి అందుబాటులో ఉందని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు, యువకులు ఎంతో సంతోషించారు. అప్పట్లోనే గోరుకల్లుతో పాటు పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఐదు ఎకరాల్లో పర్యాటక అభివృద్ధి చేసేందుకు భూమిని కేటాయించారు. అయితే గత ప్రభుత్వంలో మొదలైన ప్రక్రియ ఎన్నికల కారణంగా 2024లో వాయిదా పడింది. పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం గోరుకల్లును సందర్శించేందుకు వచ్చేవారు స్వల్పదూరంలో ఉన్న శ్రీ దుర్గాభోగేశ్వర స్వామి, శ్రీవల్లి సుబ్రమణ్యం స్వామి, శ్రీచౌడేశ్వరి అమ్మవారి ఆలయాలను చూడవచ్చు. నూతన పర్యాటక ప్రాంతాలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వంలో ఇంత వరకు ఎలాంటి సమీక్షలు చేపట్టలేదు. ఫైళ్లు కదలకపోవడంతో గోరుకల్లు గ్రామస్తులు నిరాశ చెందుతున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు గోరుకల్లు వద్ద భూమి ఉందని ప్రతిపాదనలు పంపించాం. వాటికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – శుభకుమార్ ఎస్ఈ -
వైభవంగా స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమద్ అహోబిలం క్షేత్రంలో స్వాతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలు పురస్కరించుకుని ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో నల్లమల పులకించి పోయింది. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవమూర్తులైన పావన లక్ష్మీనృసింహ స్వామిని, సుదర్శనమూర్తులను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. నవకళశాలతో తిరుమంజనం నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలు ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీగిరి చేరుకుంటున్న వేలాది మంది భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఈ బస్సులు కై లాస ద్వారం నుంచి శ్రీశైల క్షేత్రం వరకు వెళ్లనున్నాయి. నందిసర్కిల్ నుంచి గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠ జంక్షన్, మల్లమ్మ కన్నీరు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, రుద్రపార్క్, సిద్దరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేట్ సత్రాల మీదుగా మళ్లీ నందిసర్కిల్ చేరుకుంటాయి. ప్రస్తుతం నాలుగు బస్సులు ఉండగా, 10, 11న ఎనిమిది, 12 నుంచి 16వ తేదీ వరకు రోజుకు 10 బస్సులు భక్తులకు అందుబాటులో ఉంచుతామని దేవస్థాన అధికారులు తెలిపారు. -
పనుల్లో నిర్లక్ష్యం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించి సకాలంలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినా.. పనులు గడువులోగా పూర్తి కాలేదు. ఓ వైపు ఉత్సవాలు ప్రారంభమైనా ఇంకా పనులు కొనసాగు తున్నాయి. దేవస్థానం ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ఉభయ దేవాలయాల్లో పెయింటింగ్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉభయ దేవాలయాల్లో ముగ్గులకు పెయింటింగ్ పనులు సైతం కొనసాగుతున్నాయి. అలాగే శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జర్మన్ షెడ్ల ఇంకా పూర్తి కాలేదు. క్యూలైన్ల ప్రవేశ మార్గాల వద్ద ఇనుప మెష్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంకా ఏర్పాటు చేయలేదు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటికి ఏర్పాట్లు కొనసాగుతుండడంపై..ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
పాదయాత్ర మార్గంలో పోలీసుల తనిఖీలు
ఆత్మకూరు/రూరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలయానికి భక్తులు వెళ్లే పాదయాత్ర మార్గాన్ని ఆదివారం బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. భారీ సంఖ్యలో భక్తులు వెళ్తున్న ఈ మార్గంలో అసాంఘిక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానంతో ఈ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ రెండు రోజుల క్రితం ఈ మార్గా న్ని పరిశీలించి భక్తులకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు ఈ మార్గంలో పహారా కాస్తున్నారు. పాదయాత్ర భక్తులు అటవీ మార్గంలో తీసు కోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 9వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీ దారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో సంప్ర దించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. నేటి నుంచి ‘ఫార్మాటివ్’ పరీక్షలు కర్నూలు సిటీ: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి(సోమవారం)నుంచి నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షలు(ఫార్మాటివ్ అసెస్మెంట్)–4 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు 12వ తేదీ వరకు ఈ పరీక్షలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. వేర్వేరు సమయాల్లో 6, 7, 8, 9 తరగతులకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి 19వ తేదీ వరకు ఫ్రీపైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన విద్యార్థులు 2.70 లక్షల మంది హాజరుకానున్నారు. వణికిస్తున్న చలి కర్నూలు(అగ్రికల్చర్): రాత్రి సమయంలో ప్రజలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి ఏటా ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 21 నుంచి 23 డిగ్రీల వరకు నమోదయ్యేవి. ప్రస్తుతం 19.2 డిగ్రీల వరకే పరిమితం అయ్యాయి. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంటోంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో చలి ప్రభావం కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి ఎండల తీవ్రత పెరుగుతోంది. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. పనుల్లేక వలసబాట కోసిగి: పనుల్లేక ఆర్లబండ గ్రామం నుంచి ఆదివారం 50 కుటుంబాలు వలసబాట పట్టాయి. ఇళ్లకు తాళాలు వేసి లారీలో పిల్లపాపలతో కలిసి గుంటూరుకు వెళ్తున్నట్లు వారు తెలిపారు. గ్రామంలో ఎలాంటి పనులు లేక పోవడంతో వలస వెళ్తున్నామని చెప్పారు. పిల్లలను బడి మానిపించి తమ వెంట తీసుకెళ్తున్నట్లు తెలిపారు. గుంటూరులో నెలన్నర రోజుల పాటు పనులు చేసుకుని తిరిగి స్వగ్రామానికి వస్తామన్నారు. -
నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో ఆదివారం నుంచి 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి. సాయంత్రం ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమర్పిస్తారు. ప్రతిరోజు భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తారు. 15న మహా శివరాత్రి రోజున ప్రబోత్సవం, నందివాహన సేవ, రాత్రి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం చేస్తారు. 16న స్వామి అమ్మవార్లకు రథోత్సవం, తెప్పోత్సవం, 17న పూర్ణాహుతి, ధ్వజావరోహణం, 18న అశ్వ వాహనసేవ, శయనోత్సవం, ఏకాంత సేవను నిర్వహిస్తారు. -
బాధితుల ప్రయోజనాలు కాపాడాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధికర్నూలు: ప్యానల్ న్యాయవాదులు ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ బాధితుల ప్రయోజనాలను కాపాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవా సదన్లో ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు విధులు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్ తదితరులు హాజరయ్యారు. ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు వారి విధులు, విధానాలు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి మాట్లాడుతూ కోర్టు కేసుల నిర్వహణ, నిరుపేదల తరపున ట్రయల్ కోర్టు, ట్రిబ్యునల్స్, హైకోర్టు, సుప్రీం కోర్టుల వరకు కేసులు వాదించడం చేయాలని తెలిపారు. సమిష్టి పరిహారాలు, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించడానికి లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం, సయోధ్య ద్వారా కృషి చేయాలని కోరారు. లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లు సమాజంలోని సామాన్య ప్రజలకు, న్యాయ సేవా సంస్థలకు మధ్య వారధిగా వ్యవహరించాలన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లకు డిప్యూటీ తహసీల్దార్లను కేటాయించాలన్నారు. జిల్లాలోని 55 పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలన్నారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు 15,443 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం పరీక్షలకు 14,424 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలన్నారు. అదనపు ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల సెట్టు నంబర్లు అందిన వెంటనే పోలీసు ఎస్కార్ట్తో పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలు తరలించే ఏర్పాట్లు చేపడతామన్నారు. అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, డీఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఐఓ శంకర్ నాయక్, జిల్లా కార్మిక అధికారి బషీరున్నిసా, ఎస్ఎస్ఎ పీఓ నిత్యానంద రాజు, డీఈసీ సభ్యులు సునీత, సుంకన్న, మద్దిలేటి స్వామి, రమణ, శ్రీకాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీగిరి.. ఓంకార ఝరి
ఇలకై లాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. ఇప్పటికే ఉభయ దేవాలయాలను వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రధాన వీధుల్లో స్వాగత తోరణాలను తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా, క్షేత్ర పరిధిలో ముఖ్యమైన కూడళ్లలో విద్యుత్ వెలుగుల్లో స్వామిఅమ్మవార్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున ఆదివారం శ్రీశైల ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు సమర్పించనున్నారు. – శ్రీశైలం టెంపుల్ -
బీఎస్ఎన్ఎల్ సేవలు ఉపయోగించుకోవాలి
● ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలంకర్నూలు (హాస్పిటల్): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం అన్నారు. కర్నూలు బిజినెస్ ఏరియా సాధిస్తున్న ఫలితాలను సమీక్షించేందుకు శనివారం ఆయన కర్నూలు వచ్చారు. బీఎస్ఎన్ఎల్ భవన్ కార్యాలయంలో ఉద్యోగులు, వ్యాపార భాగ స్వాముల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు బిజినెస్ ఏరియాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి తగిన టెలికాం సౌకర్యాలను బీఎస్ఎన్ఎల్ అందిస్తోందని, పారిశ్రామికవేత్తలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎఫ్టీటీహెచ్ ప్లాన్లో భాగంగా బీఎస్ఎన్ఎల్ స్పార్క్ను ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో కేవలం రూ.399కే 50 ఎంబీపీఎస్ స్పీడ్తో 3300 జీబీ డేటాను, అపరిమితమైన కాల్స్ సౌకర్యాలను సంవత్సరం పాటు అందిస్తుందన్నారు. సంవత్సరం తర్వాత నెలకు రూ.449గా ప్లాన్ మారుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రాంచైజీలు, టీఐపీల సమస్యలను తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గడచిన మూడ త్రైమాసికాలకు మంచి ప్రతిభ చూపిన డివిజన్ ఇంజినీర్లు, బీబీఎంలు, ఫ్రాంచైజీలు, టీఐపీలకు ప్రోత్సా హాక సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్, డీజీఎం కె.రాజేశ్వరరావు, ఐఎఫ్ఏ డి.శ్రీలత, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం -
అతి శుభ్రతా.. ఓ రోగమే!
● కర్నూలు నగరంలోని గణేష్నగర్లో ఉంటు న్న ఓ వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో ఉన్నతాధికారి. ఏ చిన్న పని చేసినా వెంటనే చేతులు కడగటం ఆయన నైజం. ఎంతగా అంటే ఎవ్వరికై నా షేక్హ్యాండ్ ఇచ్చినా సరే వెంటనే దగ్గరున్న పేపర్తో తుడుచుకోవడమో లేక శానిటైజర్తో కడుక్కోవడమో చేస్తుంటారు. ● నంద్యాలకు చెందిన రామేశ్వరమ్మ గృహిణి. ఇంటికి ఎవ్వరైనా వచ్చి వెళ్లారంటే చాలు వారు వెళ్లిన వెంటనే ఇళ్లంతా శుభ్రం చేస్తుంది. ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సైతం తాళం వేశామా లేదా, తలుపులన్నీ మూశామా లేదా, గ్యాస్ బంద్ చేశానా.. లేదా.. అని మళ్లీ మళ్లీ చెక్ చేస్తుంది. బయటకు ఎక్కడికై నా వెళ్లినా సరే ఇంటిపైనే ధ్యాస. ..సమాజంలో ఇలాంటి వారు మీకు కూడా తరచూ కనిపిస్తుంటారు కదూ. ఇదో చాదస్తమనో, అనుమానమనో లేక ఇతర పేర్లేవో పెట్టుకుని సర్దుకుంటారు. కానీ ఇది కూడా ఒక లాంటి మానసి క రోగమని వైద్యులు చెబుతున్నారు. దీనినే వైద్యపరిభాషలో ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ (ఓసీడీ) అంటారు.కర్నూలు(హాస్పిటల్): ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్(ఓసీడీ) వ్యాధి గురించి అవగాహన ఉన్న కుటుంబసభ్యులు మాత్రమే బాధితులను వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్, చికిత్స ఇస్తుంటారు. మిగిలిన వారు జీవితాంతం అలాగే బాధపడుతున్నారు. ఓసీడీ అనేది ఒక భిన్నమైన మానసిక సమస్య. ఇలాంటి వారిని చూసి సమాజంలోని చాలా మంది జాలి చూపడం, ఏహ్యభావంతో చూడటం, విస్సుక్కోవడం చేస్తుంటారు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు తమకు ఒక ఆరోగ్య సమస్య ఉందన్న విషయమూ గుర్తించలేరు. ఒకవేళ గుర్తించినా ఎవరికీ చెప్పుకుంటే ఏమనుకుంటారోనని.. మదనపడుతుంటారు. వారి సమస్యను ఇతరులతో చెప్పుకోలేరు, బయట పడే మార్గం వెతుక్కోలేక నరకం అనుభవిస్తుంటారు. ఓసీడీతో బాధపడేవారి సంఖ్య ఇటీవల కాలంలో అధికమైంది. ఎంతగా అంటే సమాజంలో 3 శాతానికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య కొందరిలో 18 ఏళ్ల నుంచే ప్రారంభం అవుతుంది. మరికొందరిలో సమస్య వచ్చిన ఐదేళ్ల తర్వాత గుర్తించి వైద్యులను కలుస్తుంటారు. ఇటీవల ఈ మానసిక సమస్య గురించి సోషల్ మీడియాలో కథనాలు వస్తుండటంతో అవగాహన పెంచుకుని వైద్యులను కలుస్తున్నారు. ఓసీడీ లక్షణాలు ● ఓసీడీతో బాధపడుతున్న వారికి ఒకే ఆలోచన పదే పదే వస్తుంది. ఈ ఆలోచన వాస్తవానికి దూరంగా ఉన్నా, అర్థంలేని ఆలోచనలను బాధితులు గుర్తించినా, వాటిని నిగ్రహించుకునే శక్తి మాత్రం వారికి ఉండదు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడలేక, అవసరమైన పనులపై శ్రద్ధ చూపలేక వారు నిరంతరం ఆందోళనకు గురవుతుంటారు. ఈ ఆలోచనలనే ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అంటారు. ● అతి శుభ్రతకు వీరు ప్రాధాన్యత ఇస్తారు. చేతులకు మురికి అంటిందేమోనని భయపడుతుంటారు. చేసిన పనినే పదే పదే చేస్తుంటారు. ● అనుమానాలు, భయాలు ఎక్కువగా ఉంటాయి. అతిభయం, అతి క్రమశిక్షణ వీరికి ఉంటుంది. వీరు తమ అజాగ్రత్త కారణంగా ఇతరులకు హాని కలిగిస్తామేమోనని భయపడుతుంటారు. ● తమను ఇతరులతో పోల్చి చూసుకోవడం, ఇతరులను పరీక్షించడం చేస్తుంటారు. సెక్స్వల్ లేదా ఇతర రకాలుగా హాని కలిగిస్తాయనే ఆలోచనలు వచ్చే వారు తమ తప్పుడు ఆలోచనలకు క్షమించాలని దైవాన్ని వేడుకుంటూ ఉంటారు. ● వీరు ఇంట్లో కూడా హానికరమైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని దాచడం, బయట పారేయడం చేస్తుంటారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగానికి ప్రతి రోజూ వంద మంది దాకా వివిధ మానసిక జబ్బులతో చికిత్స కోసం వస్తారు. వారిలో 2 నుంచి 3 శాతం మందిలో ఓసీడీ లక్షణాలు ఉంటాయి. వ్యాధి తీవ్రతను బట్టి మందులు, కౌన్సిలింగ్ ద్వారా నయం చేస్తాం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అటు బాధితులకు, కుటుంబసభ్యులు, కార్యాలయంలో అయితే సహొద్యోగులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. – డాక్టర్ నాగేశ్వరరావు, మానసిక వ్యాధుల విభాగాధిపతి, జీజీహెచ్, కర్నూలుఓసీడీ సమస్యకు కారణాలు పలు కారణాలతో మెదడులో కలిగే రసాయన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. పిల్లల్లో స్ట్రెప్టకోకస్ ఇన్ఫెక్షన్ తర్వాత ఈ వ్యాధి రావచ్చు. తలకు గాయాలు తగిలినప్పుడు, మెనింజైటిస్ వంటి వ్యాధుల తర్వాత ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఒక కుటుంబంలో ఎవరికై నా ఈ వ్యాధి ఉన్నప్పుడు కుటుంబసభ్యులకు ఎవ్వరికై నా ఈ సమస్య వచ్చే అవకాశాలు 33 శాతం ఉంటాయి. అయితే కుటుంబంలో ఒకరికి ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన అందరికీ రావాలని మాత్రం లేదు. ప్రతిదీ శుభ్రంగా ఉండాలనుకుంటున్నారా...! శుభ్రంగా లేకపోతే నచ్చడం లేదా ! ఈ లక్షణాలతో పెరుగుతున్న బాధితులు ఇది కూడా ఒక రోగమేనట వైద్యపరిభాషలో ఓసీడీగా పరిగణన -
9 నుంచి 11 వరకు ఏపీపీఎస్సీ పరీక్షలు
కర్నూలు(సెంట్రల్): అటవీ, ఎండోమెంట్ శాఖల్లోని ఫారెస్టు బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ మెయిన్స్, తండేల్(ఫారెస్టు), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడు–2(ఎండోమెంట్) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ పరీక్షలను ఫిబ్రవరి 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల సమన్వయాధికారి/డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో ఏపీపీఎస్సీ పరీక్షల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీక్షల నిర్వహణకు జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 9,958 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్తోపాటు ఒక ఫొటో ఐడెంటిటీ కార్డుతో వస్తేనే లోపలికి అనుమతిస్తామన్నారు. -
టీడీపీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా
గ్రావెల్ కోసం చేపట్టిన తవ్వకాలతో రూపుమారిన కొండజగనన్న కాలనీలో ఎర్రమట్టిని తవ్వుతున్న పొక్లెయిన్ కల్లూరు: కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో టీడీపీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా రెచ్చిపోతుందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆయన తడకనపల్లెలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను, జగనన్న లేఅవుట్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబర్ 337లో లెవలింగ్ పేరుతో గ్రావెల్ను అక్రమంగా తవ్వేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తన హయాంలో నిరుపేదలకు భూములు పంపిణీ చేశామన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి టీడీపీ నాయకులు కొండ ప్రాంతాన్ని సాగులోకి తీసుకొచ్చే సాకుతో గ్రావెల్ దందా చేస్తున్నారన్నారు. పొలాన్ని సాగులోకి తెచ్చుకోవాలంటే మూడు, నాలుగు అడుగుల లోతులో చదును చేస్తారని, ఇక్కడ 15 అడుగుల లోతు మట్టిని అడ్డంగా తవ్వేస్తున్నారన్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎన్ని క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఇచ్చారు? ఇక్కడ ఎంత లోతు మట్టి తవ్వారో పరిశీలించాలన్నారు. అధికారం ఎప్పుడ్డూ శాశ్వతం కాదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అధికారులందరిపై విచారణ తప్పదన్నారు. తడకనపల్లె, పెద్దటేకూరు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదన్నారు. ట్రిప్పుకు రూ.500 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారని.. నియోజకవర్గంలో పూడిచెర్ల, ఉప్పులపాడు, తడకనపల్లె గ్రామాల్లో అక్రమ గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోందన్నారు. జగనన్న కాలనీలో దురాక్రమణలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి అర్హులైన పేదలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే దుండగలు దురాక్రమణకు పాల్పడుతున్నారని కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడకనపల్లెలోని 86వ సర్వే నెంబర్లో జగనన్న కాలనీ పేరిట లేఅవుట్ వేశామన్నారు. గ్రామానికి చెందిన 80 మందితో పాటు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 52 వార్డుల పేద ప్రజలకు ఇంటి పట్టాలు మంజూరు చేశామన్నారు. అయితే కొందరు దుండగలు జగనన్న కాలనీలో దురాక్రమణ చేస్తున్న విషయం తెలుసుకున్న ఆయన లేఅవుట్ను పరిశీలించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. పేద ప్రజల కోసం కేటాయించిన ప్లాట్లు కబ్జాలకు గురువుతున్నా అధికారులు మౌనం వహించడం తగదన్నారు. 15 అడుగుల లోతు మట్టి తరలింపు పత్తాలేని రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించిన వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని జగనన్న కాలనీ ప్లాట్ల ఆక్రమణపై ఆగ్రహం -
ఓటరు జాబితాలపై ఆదేశాలు ఇచ్చాం
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మార్చి 9వ తేది నాటికి ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడతాం. రెవెన్యూ అధికారుల నుంచి అసెంబ్లీ ఓటరు జాబితాలను తీసుకొని వార్డుల వారీగా విభజించి ఓటరు జాబితాలను రూపొందించాలని క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. కొత్త పంచాయతీలకు సంబంధించి 21 మండలాల నుంచి తమకు అందిన 38 ప్రతిపాదనలను సీపీఆర్కు పంపించాం. కొత్త పంచాయతీల ఏర్పాటు సీపీఆర్ పరిధిలో ఉంటుంది. – జీ భాస్కర్, కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి -
ఆన్లైన్లో మాత్రమే అతిశీఘ్ర దర్శనం టిక్కెట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అతిశీఘ్రదర్శనం టికెట్లు ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంచినట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఈఓ మాట్లాడుతూ భక్తులందరికీ స్వామివారి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లులకు, శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. అతిశీఘ్ర దర్శనం (రుసుము రూ.500) టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంచామన్నారు. ఈ టిక్కెట్టుపై స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. శీఘ్ర దర్శనం టికెట్లు ఆన్లైన్తో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా అందుబాటులో ఉంచామన్నారు. కేసీ కెనాల్కు 1,180 క్యూసెక్కుల నీరు పాములపాడు: ముచ్చుమర్రి , మల్యాల ఎత్తిపోతల పథకాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ 1,180 క్యూసెక్కులు కేసీ కెనాల్కు వస్తోందని ఏఈ శ్రీనివాసనాయక్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి 2 మోటార్ల ద్వారా 500 క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోథల పథకం నుంచి 680 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదలవుతోందన్నారు. ఈ నీటిని మండలంలోని శాంతినిలయం గ్రామ సమీపంలోని లాకీన్స్లా నుంచి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు 34 క్యూసెక్కులు, తూడిచెర్ల సబ్ఛానల్కు 655 క్యూసెక్కుల చొప్పున దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రముఖులకు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు శ్రీశైలంటెంపుల్: మహాక్షేత్రంలో ఆదివారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. శనివారం శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు, పలువురు అధికారులు, అర్చకులు, పండితులు పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ హరీష్కుమార్గుప్తా, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ హరిజవహర్లాల్, కమిషనర్ కె.రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పలువురు ప్రముఖులకు ఆహ్వానపత్రికలు అందజేశారు. వాయిస్ క్లోనింగ్ మోసాలతో జాగ్రత్త కర్నూలు: వాయిస్ క్లోనింగ్ ద్వారా బంధువుల గొంతుతో ఫోన్ చేసి డబ్బులు అడిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు సూచించారు. ఏఐ వాయిస్ క్లోనింగ్కు సంబంధించిన స్కామ్లు ఇటీవల చోటు చేసుకుంటున్నాయని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైతే హెల్ప్లైన్ నంబర్ 1930కు, www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు. -
నల్లమల లోయలో బొలెరో వాహనం బోల్తా
మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడింది. బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన సద్దాం శనివారం బొలేరో వాహనంలో వరి గడ్డి కట్టలతో గిద్దలూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో సర్వనరసింహ స్వామి ఆలయ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి లోయలో పడింది. అదృష్టవశాత్తు సద్దాం ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న రోడ్ సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద ఘటన శిరివెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందని శిరివెళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
పాదయాత్ర భక్తులకు పటిష్ట భద్రత
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ఆత్మకూరు: శ్రీశైలం పాదయాత్ర భక్తులకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపా రు. శివభక్తులు పాదయాత్రగా వెళ్లే వెంకటాపురం – నాగలూటి అటవీ మార్గాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అటవీ మార్గంలో ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్షలాదిగా తరలివచ్చే మల్లన్న భక్తులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాలినడకన వచ్చే భక్తులు మార్గమధ్యలో గత ఏడాది ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశామన్నారు. అటవీ మార్గంలో అస్వస్థకు గురైన భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు పెచ్చెరువు ప్రాంతంలో వైద్యశాల అందుబాటులో ఉందన్నారు. అటవీ మార్గంలో భక్తులు తప్పనిసరిగా అటవీ శాఖ నిబంధనలు పాటించాలన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్, సీఐ మహేశ్వర్రెడ్డి, పాములపాడు ఎస్ఐ తిరుపాల్, ఆత్మకూరు రేంజ్ ఆఫీసర్ ప్రణతిబాయి, డీఆర్వో జాకీర్హుసేన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ ప్రారంభం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఉదయం మనోహర గుండం వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపచేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను రథవీధిలో మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఊరేగింపుగా తీసుకునివెళ్లి శివదీక్షా శిబిరాలలో ఆశీనులను చేయించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారాలతో పూజాదికాలు నిర్వహించారు. అనంతరం హోమాగ్నిని ప్రజ్వలింపజేశారు. తరువాత శివదీక్షాధారులు నమశ్శివాయ పంచాక్షరీ నామస్మరణతో శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమం ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం 18వ తేదీ వరకు దీక్షా విరమణకు అవకాశం కల్పించారు. జనవరి 8న శివమండల దీక్ష, 28న అర్ధమండల దీక్ష విరమణ చేయనున్నార. జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు స్పర్శదర్శనం శివదీక్షను స్వీకరించి, జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు చంద్రవతి కల్యాణ మండపం నుంచి ఆలయ ఉత్తర మాడవీధి ద్వారా ప్రత్యేక దర్శనం క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్ ద్వారా నిర్ణీత వేళలలో మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. ఆదివారం నుంచి ఐదు రోజులు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనం కలిస్తారు. శివదీక్ష భక్తులకు సేవలందించేందుకు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. -
పేద ప్రజల కడుపు కొడితే ఊరుకునేది లేదు
ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములను దుండగులు స్వార్థంతో చదును చేస్తున్నారని కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. సరిహద్దు రాళ్లు పాతిన భూముల్లో ఎవరి సహకారం, అండదండలతో తొలగించారని మండిపడ్డారు. పేద ప్రజల కడుపు కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. టీడీపీ నేతల సహకారంతోనే ఇదంతా సాగుతోందన్నారు. ఇళ్ల స్థలాలను దౌర్జన్యంగా అక్రమించాలని తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. పేద ప్రజల తరపున న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. ఆయన వెంట గ్రామ నాయకులు కె.టైలర్ రాముడు, వేణురెడ్డి, కృష్ణారెడ్డి, విసి స్వాములు, భాస్కర్, శీను, కార్పొరేటర్ నారాయణరెడ్డి, నాయకులు శివశంకర్రెడ్డి, కేశవరెడ్డి, హనుమంతురెడ్డి, శివారెడ్డి, తదితరులు ఉన్నారు. -
రైస్మిల్లో కొండ చిలువలు
బండిఆత్మకూరు: మండల కేంద్రంలోని ఓ పాత రైస్ మిల్లో శనివారం అటవీ అధికారులు రెండు కొండ చిలువలను పట్టుకున్నారు. శనివారం ఉదయం రైస్మిల్ వైపు వెళ్లిన స్థానికులకు రెండు కొండ చిలువలను గమనించి వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు లింగాపురం ఎఫ్బీఓ హైమావతితో అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రత్యేక పరికరాలతో కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. ఒక కొండ చిలువ ఏడు అడుగులు, ఇంకొకటి ఆరు అడుగుల పొడవు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు అధికారులు తెలిపారు. గుండెపోటుతో అసిస్టెంట్ లైన్మన్ మృతి గడివేముల: తిరుపాడు గ్రామంలో అసిస్టెంట్ లైన్మన్గా పనిచేస్తున్న వెంకటరమణ (46) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. ఈ మేరకు విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో స్థానికులు, కుటుంబసభ్యులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గడివేముల ఏఈ ఖలీల్ పాషా, డిప్యూటీ ఎక్యూటివ్ ఇంజినీర్ సుబ్రమణ్యం, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీమన్నారాయణ, కాంట్రాక్టర్ శేషాద్రిగౌడ్, సిబ్బంది శివ, రవి, నరేంద్ర, మండల సిబ్బది, తదితరులు నివాళులర్పించారు.బంగారు దుకాణంలో భారీ చోరీ ● రూ. 40 లక్షల ఆభరణాలు అపహరణ బనగానపల్లె: పట్టణంలోని రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయానికి అతి సమీపంలోని ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగలు అపహరించారు. స్థానిక శ్రీని వాస జ్యువెలర్స్ దుకాణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దుకాణం షెట్టర్ తాళాలు పగులగొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ చోరీలో 18 తులాల బంగారు ఆభరణాలు, ఐదు కేజీల వెండి అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం చోరీ విషయం వెలుగు చూడటంతో ముందుగా ట్రైనీ డీఎస్పీ రాజసింహ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ దుగ్గిరెడ్డి పరిశీలించారు. గ్యాస్ కట్టర్తో షట్టర్ తాళాలను తొలగించినట్లు గుర్తించారు. నంద్యాల నుంచి ఫింగర్ ప్రింట్స్ అధికారులు దుకాణాన్ని పరిశీలించి నిందితుల వేలిముద్రలు సేకరించారు. సాయంత్రం డోన్ డీఎస్పీ శ్రీనివాసులు దుకాణాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. చోరీ కేసును త్వరలో ఛేదిస్తామన్నారు. -
గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలి
● సినీ నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం కర్నూలు సిటీ: విద్యార్థులు గొప్ప లక్ష్యాలను ఎంచుకుని పట్టుదలతో సాధించాలని సినీ నటుడు పద్మశ్రీ డా.బ్రహ్మానందం అన్నారు. శనివారం కర్నూలు నగరంలోఓ ఫంక్షన్ హాలులో రెసోనెన్స్ స్కూల్స్, కాలేజీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందంతో పాటు, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, రాజ్యసభ మాజీ సభ్యులు టీ.జి వెంకటేష్, రెసోనెన్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్, రాగమయూరి విద్యా సంస్థల అధినేత కె.జే రెడ్డిలు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మార్కులు తక్కువ వచ్చాయని, పక్కంటి పిల్లలతో పోల్చీ తిట్టకూడదన్నారు. ఏ విషయాన్నైన ఒత్తిడితో కాకుండా ప్రేమగా చెప్పి ఒప్పించాలన్నారు. అక్కినేని నాగేశ్వరరావుకు చదువు రాకపోయినా సినీరంగంలో ఆయన ఎంతో గొప్పగా రాణించారన్నారు. రాయలసీమ ముఖ్య ద్వారం అయిన కర్నూలులో రెసోనెన్స్ విద్యా సంస్థలు 11 ఎకరాల్లో సువిశాలమైన ప్రాంతంలో సీబీఎస్ఈ సిలబస్ నర్సరీ నుంచి పదవ తరగతి వరకు డే స్కాలర్, రెసి డెన్షియల్ విధానంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రెసోనెన్స్ ఎండీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. హైదరాబాదులో ఏడేళ్లలోనే తిరుగులేని విజయాలను రెసోనెన్స్ విద్యా సంస్థలు సాధించాయన్నారు. అదే ప్రమాణాలతో ఇక్కడ కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. -
కోనేటి రాయుడికి కిరణాభిషేకం
ఉయ్యాలవాడ: ఇంజేడు గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోనేటి రాయుడిని శనివారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. స్వామి వారికి ప్రీతికరమైన రోజైన శనివారం రోజున సూర్య కిరణాలు ఆలయంలోకి చేరి స్వామి వారిని తాకడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని భక్తులు స్వామి వారితో పాటు సూర్య భగవానునికి నమస్కరించుకున్నారు. అలాగే మండల పరిధిలోని ఆర్.జంబులదిన్నె, ఉయ్యాలవాడ, సుద్దమల్ల గ్రామాలలో వెలిసిన అభయాంజనేయస్వామి, శ్రీ లక్ష్మి నరసింహ కంబగిరి స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు అనంతయ్య, లక్ష్మణస్వామి, భాస్కరశర్మ, కమలేష్శర్మలు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
బనగానపల్లె రూరల్: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(యూఎస్ఎఫ్ఐ)లో వెనుకబడిన 107 మంది గ్రామ సచివాలయాల ఉద్యోగులకు షోకాజ్ నోటీసుల ఇచ్చారు. మండలంలో యూఎస్ఎఫ్ఐ సర్వే 50 శాతం కంటే తక్కువ ఉండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీఓ నాగరాజు తెలిపారు. నోటీసులు అందుకున్న వారు సర్వేలో ఎందుకు వెనుకబడ్డారో మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. పంట నమోదులో జిల్లాకు మూడో స్థానం డోన్: రబీకి సంబంధించిన పంట నమోదు కార్యక్రమంలో నంద్యాల జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) వెంకటేశ్వర్లు తెలిపారు. డోన్ పట్టణంలోని ఏడీఏ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో వ్యవసాయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఏడీఏ సునీతమ్మ, ఏఓలు పాల్గొన్నారు. మల్లన్న హుండీ ఆదాయం రూ.3.76కోట్లు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.3,76,22,452 లభించినట్లు దేవస్థానం ట్రస్ట్బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు తెలిపారు. శుక్రవారం శ్రీశైలంలోని చంద్రవతి కల్యాణ మండపంలో చేపట్టిన హుండీల లెక్కింపులో నగదు పాటు కొంత విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు. గత 25 రోజుల్లో భక్తులు ఈ కానుకలను సమర్పించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాలో ఈ లెక్కింపు చేపట్టామన్నారు. లెక్కింపులో డీఈవో ఆర్.రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, శివసేవకులు పాల్గొన్నారు. తెలుగుగంగ ప్రధాన కాలువకు గండి బండిఆత్మకూరు: తెలుగుగంగ ప్రధాన కాలువ కు తొమ్మిదో కిలోమీటరు వద్ద ఎడమ వైపున గండిపడింది. దీంతో లింగాపురం, జీసీ పాలెం మధ్యనున్న మద్దిలేరు వాగుకు నీటి ప్రవాహం పెరిగింది. అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి నీటి ప్రవాహన్ని పూర్తిగా నిలిపి వేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత గండిని మూసివేస్తామని అధికారులు తెలిపారు. కాగా.. గండి పడిన సమయంలో కాలువలో 15 వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. శాస్త్రోక్తంగా పల్లకీసేవ మహానంది: మహానందిలో శుక్రవారం రాత్రి పల్లకీ సేవ కనుల పండువగా సాగింది. కామే శ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి ఉత్సవమూర్తులను పుష్ప మాలలతో ఆలయ పండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. గణపతి పూజ అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి ఆలయ ప్రాకారాల్లో ఉత్సవం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఎస్పీ ఆకస్మిక తనిఖీలు నంద్యాల: పట్టణంలోని వన్టౌన్, ఫింగర్ప్రింట్ కార్యాలయాలను ఎస్పీ సునీల్షెరాన్ శుక్రవారం రాత్రి అకస్మికంగా తనిఖీ చేశారు. తిక్కస్వామి దర్గా ఉరుస సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు, పట్టణ ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
శ్రీశైలం.. ‘మహా’ శోభితం
● రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ● 11 రోజుల పాటు నిర్వహణశ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఆదివారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు 11రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు చేస్తారు. శ్రీభ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు ఉంటాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్టాపన, అంకురార్పణ నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు త్రిశూలపూజ, భేరిపూజ, సకలదేవతాహ్వనపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట అవిష్కరణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఆర్జితసేవల నిలుపుదల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నుంచి 18వ తేదీ వరకు ఉభయ దేవాలయంలో స్వామిఅమ్మవార్లకు జరిగే గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, చండీహోమం, రుద్రహోమం తదితర అన్ని ఆర్జితసేవలను పూర్తిగా నిలుపుదల చేశారు. భక్తులందరికి కేవలం స్వామివారి ఆలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఈ నెల 12వ తేదీ వరకు జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులకు నిర్దిష్టవేళలో మాత్రమే స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు దేవస్థాల తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పిస్తారు. 15న పాగాలంకరణ బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 9న భృంగి, 10న హంస, 11న మయూర, 12న రావణ వాహన సేవ, 13న స్వామిఅమ్మవార్లకు పుష్పపల్లకీసేవ, 14న గజ వాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 15న ప్రభోత్సవం ఉంటుంది. అదే రోజు నందివాహనసేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. స్వామిఅమ్మవార్లకు రథోత్సవం 16న వైభవంగా జరగనుంది. బ్రహ్మోత్సవ యాగాలకు 17న పూర్ణాహుతి చేస్తారు. అశ్వ వాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలు 18న నిర్వహిస్తారు. -
నిర్వహణ కష్టమైంది
కూరగాయలు, నిత్యావసర సరుకులు, గ్యాస్ వినియోగానికి ఒక్కో విద్యార్థికి రోజు రెండు రూపాయాలు మెనూ చార్జీలు అందిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి మార్కెట్లో నిత్యావసరాలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం అందిస్తున్న మెనూ చార్జీలు ఏమాత్రం చాలకపోవడంతో మధ్యాహ్న భోజన పథక నిర్వహణ కష్టంగా మారింది. – వెంకటలక్ష్మి, అంగన్వాడీ వర్క్ర్స్, హెల్పర్స్ అసోసియేషన్ నాయకురాలు, కోవెలకుంట్ల అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథక నిర్వహణకు ప్రభుత్వం అందిస్తున్న మెనూ చార్జీలు ఏమాత్రం సరిపోవడం లేదు. అరకొరగా ఇస్తున్న చార్జీలు నెల నెలా ఇవ్వకపోడంతో అంగన్వాడీలు అప్పులు చేసి చిన్నారులకు భోజనం అందిస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు, గ్యాస్కు ప్రభుత్వం ఇచ్చే రెండు రూపాయాలు ఏ మాత్రం సరిపోవడం లేదు. మార్కెట్ ధరల ప్రకారం మెనూ చార్జీలను పెంచి అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వం అదుకోవాలి. – సుధాకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, కోవెలకుంట్ల -
సీమ ఎత్తిపోతల పూర్తయ్యే వరకు ఉద్యమం
● వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నందికొట్కూరు: రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయ్యే వరకు ఉద్యమం ఆగబోదని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. నందికొట్కూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 80 శాతం పూర్తి చేసిందన్నారు. మిగతా 20 శాతం పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చేతులు కలిపి నిలిపేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం జంతువుల కొవ్వు తిరుమల లడ్డూలో వాడారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పడం దారుణమన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ సిట్ తేల్చి చెప్పినా వీరికి మంచి బుద్ధి రాలేదని విమర్శించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి మరకముందే జోగి రమేష్ ఇంటిపై టీడీపీ నాయకులు పెట్రోల్ బాంబు వేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి వెంట వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మార్కెట్ రాజు, శాతనకోట సర్పంచ్ జనార్దన్గౌడు, పార్టీ జిల్లా కార్యదర్శి ఉపేంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ కార్యదర్శి జబ్బార్, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి మాధురి, జిల్లా ప్రచార కార్యదర్శి కోకిల రమణారెడ్డి, ల్యాబ్ రవి, లడ్డు, సెమీవుల్లా, నాగరాజు తదితరులు ఉన్నారు. -
పద్మావతికే.. ఫలహారం!
శ్రీశైలంటెంపుల్: వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి.. అన్న చందంగా తయారైంది శ్రీశైలంలో పద్మావతి ఏజెన్సీ పరిస్థితి. రాష్ట్రంలో ముఖ్యమైన నాయకుడికి బంధువు సంస్థ అని చెప్పుకుంటూ ఏడు ప్రముఖ ఆలయాల్లో పద్మావతి ఏజెన్సీ శానిటేషన్, హౌస్కీపింగ్ పనులు దక్కించుకుంది. శ్రీశైలంలో కూడా ఆ సంస్థ చేపట్టిన శానిటేషన్, హౌస్కీపింగ్పై భక్తుల్లో 40 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తికి చెందిన ఏజెన్సీ కావడంతో అధికారులు ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ..నిబంధనలకు విరుద్ధగా దేవస్థాన అధికారులు వ్యవహరిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు 11రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణలో శానిటేషన్ అతి ముఖ్యమైనది. శానిటేషన్ పనుల నిర్వహణ కోసం ప్రతి ఏడాది జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టెండర్లు నిర్వహించి, 1000 మందితో 11 రోజుల పాటు శానిటేషన్ పనులు చేపడతారు. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా శ్రీశైలంలో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్న పద్మావతి ఏజెన్సీకే అప్పగించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభు త్వ పెద్దలతో పద్మావతి ఎండీకి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఎవరు నో చెప్పకుండా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల శానిటేషన్ పని విలువ సుమారు రూ.45 లక్షలు వరకు ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జిల్లా పంచాయతీ అధికారుల ద్వారానే టెండర్లు నిర్వహించి శానిటేషన్ పనులు చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం గత నిబంధనలకు భిన్నంగా పద్మావతి ఏజెన్సీకే మల్లన్న ఫలహారం అందేలా ట్రస్ట్బోర్డు, అధికారులు చక్రం తిప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఏటా జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో శానిటేషన్ టెండర్ల నిర్వహణ ఈ ఏడాది టెండర్లు నిర్వహించకుండా పద్మావతి ఏజెన్సీకే అప్పగింత -
పోరాటాలను ఉద్ధృతం చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు నంద్యాల(న్యూటౌన్): కార్మిక హక్కుల రక్షణకు పోరాటాలు ఉద్ధృతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం అధ్యక్షతన ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభల ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నా రు. ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా గఫూర్, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, గౌరవాధ్యక్షుడిగా శాంతిరాముడు, కోశాధికారిగా ఏసురత్నం, చీఫ్ ప్యాట్రన్గా దస్తగిరిరెడ్డి, మలికిరెడ్డి రాజగోపాల్రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఇంతియాజ్ అహమ్మద్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీమెంట్ పేరుతో ఉద్యోగులకు, కార్మిక వర్గానికి పాలకులు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కనీస వేతనాలు లేక చాలీచాలని జీతాలతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్మికుల హక్కుల కోసం లేబర్ కోడ్ల రద్దుకై ఈనెల 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో మహిళలను పని చేయాలని నిర్ణయించడం కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందన్నారు. మహిళా ఉద్యోగుల, మహిళా కార్మికులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్కుమార్, రాజశేఖర్, రామచంద్రుడు, నాగేశ్వరరావు, నరసింహనాయక్, లక్ష్మణ్, బాలవెంకట్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యేవరకు పోరాటం
పోరాట గళం: బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిసాక్షి, నంద్యాల: రాయలసీమకు సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై రైతులు కదం తొక్కారు. సొంత ప్రయోజనాల కోసం సీమకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. కన్నతల్లి లాంటి పుట్టిన ప్రాంతానికి ద్రోహం చేయాల్సిన ఆలోచన ఎలా వచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమ లిఫ్ట్ పథక నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నిలిపి వేయడాన్ని నిరశిస్తూ రైతులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలివచ్చారు. ఉత్సాహంగా.. రాయలసీమకు సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై వైఎస్సార్సీపీ కన్నెర్ర చేసింది. తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుమ్మకై ్క సీమ రైతులకు, ప్రజలకు అన్యాయం చేస్తే అడ్డుకుని తీరతామని ప్రతినబూనింది. చంద్రబాబు చేస్తున్న ప్రజాకంఠక పాలనను వివరించేందుకు చలో పోతిరెడ్డిపాడు సభకు పిలుపునిచ్చింది. ఒక్క పిలుపుతో రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ప్రజలు ఉత్సాహంగా ఉరకలేస్తూ భారీగా తరలివచ్చారు. ట్రాక్టర్లు, ఆటోలు ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా తరలివచ్చారు. తమ ప్రాంతానికి అన్యాయం చేయాలని చూస్తే రాజకీయ సమాధి కడతామని హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే.. పోతిరెడ్డిపాడు సభ ఆరంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమ లిఫ్ట్ పనులను ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. పనులు ప్రారంభించకుంటే రాజకీయంగా సమాధి కడతామని హెచ్చరించారు. చంద్రబాబుకు చేతకాకుంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించి.. సభ ప్రారంభానికి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని సందర్శించారు. అక్కడ ఆగిపోయిన పనులను పరిశీలించి, ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోతులపాడు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ముందుగా దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చివరి వరకు అనుమతి ఇవ్వకుండా తాత్సారం చలో పోతిరెడ్డిపాడు సభను విజయవంతం కాకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకుండా తాత్సారం చేసింది. వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేవలం రెండు గంటల పాటే నిర్వహించాలని నిబంధన విధించారు. కేవలం ఒక రోజు ముందు అనుమతి ఇవ్వడంతో సభకు రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాలేరని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ, ప్రభుత్వ పెద్దలు అవాక్కయ్యేలా సభ సాగింది. ఉదయం నుంచే గ్రేటర్ రాయలసీమ జిల్లాల నుంచి రైతులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. పది వేలకు పైగా వచ్చిన జనం సమయం లేకపోవడంతో కేవలం నాలుగు వేల మంది కూర్చునే సామర్థ్యంతో సభ ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకే కుర్చీలు మొత్తం ఫుల్ అయ్యాయి. సభకు అటు ఇటు దాదాపు ఐదు వేల మంది నిల్చొని తమ అభిమాన నాయకుల ప్రసంగాలను వీక్షించారు. దాదాపు మూడు గంటల పాటు సభ సాగింది. సభ పూర్తయ్యే వరకు ప్రజలు, రైతులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ తమ మద్దతును ప్రకటించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తో పాటు రాయలసీమ లిఫ్ట్ పథకానికి చంద్రబాబు ఎలా దగా చేశారో నేతలు వివరించారు. సీమ అంటేనే చంద్రబాబుకు గిట్టదని.. తన రాజకీయ జీవితంలో ఏనాడూ సీమ అభివృద్ధిని, రైతుల కష్టాలను పట్టించుకున్న పాపానపోలేదని తెలిపారు. సీమ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ తన హయాంలోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్ద పీట వేశారని గణాంకాలతో వివరించారు. వైఎస్సార్ సీపీ నేతల ప్రసంగాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సభ నామమాత్రంగా సాగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు మొదట భావించాయి. కానీ, సభ ప్రారంభమయ్యే సమయానికి వారి అంచనాలు తలకిందులయ్యాయి. సభకు ప్రజలు పోటెత్తారు. సుమారు పది వేల మందికి పైగా జనాలు తరలివచ్చి తమ మద్దతు తెలియజేశారు. దారులన్నీ పోతులపాడు వైపే... చలో పోతిరెడ్డి పాడు కార్యక్రమానికి గ్రేటర్ రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు వాహనాలలో తరలివచ్చారు. ఉదయం 10 గంటలకే ప్రాంతమంతా వాహనాలతో కిక్కిరిసిపోయింది. కర్నూలు – ఆత్మకూరు హైవే నుంచి పోతులపాడు గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో నాయకులు, ప్రజలు హైవే నుంచి నడుచుకుంటూ వచ్చారు. రైతులు పొలం గట్ల వెంబడి అడుగులో అడుగు వేసుకుంటూ సభాస్థలికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ జెండాతో సభకు వచ్చిన అభిమానిపులి కథతో ఆకట్టుకున్న బైరెడ్డి సభలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడిన మాటలు ఆకట్టుకోవడంతో పాటు అందరినీ ఆలోచింపజేశాయి. చిన్నపాటి కథతో చంద్రబాబు నైజాన్ని కళ్లకు కట్టినట్లు తెలిపారు. ఒక వేటగాడు పులితో భయంకరంగా ఫైట్ చేసి చంపేసిన తర్వాత తనకు గాయాలు కావడంతో మందు తెచ్చుకోవడానికి వెళితే.. ఈ లోపు చంద్రబాబు లాంటోడు వచ్చి.. పులి గోళ్లు.. పళ్లు ఎత్తుకెళ్లి .. పులిని నేనే చంపాను అంటూ ఊరంతా టాం... టాం.. వేసుకున్నట్లు... చంద్రబాబు తీరు కూడా అంతేనని చెప్పడంతో సభ మొత్తం ఈలలు, చప్పట్లతో మార్మోగింది. ఫ్లెక్సీల ప్రదర్శన సభకు వచ్చిన యువకులు సీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని వివరించేలా ఫ్లెక్సీలు చేతిలో పట్టుకుని ప్రదర్శించారు. ‘రాయలసీమ ద్రోహి.. తెలంగాణ పక్షపాతి.. చంద్రబాబు డౌన్ .. డౌన్’ అంటూ రాసిన ప్లెక్సీలను ప్రదర్శించడంతో పాటు భారీ ఎత్తున నినాదాలు చేశారు. కదంతొక్కిన రాయలసీమ రైతులు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపాటు తక్కువ సమయం ఉన్నా భారీగా తరలివచ్చిన కర్షకులు రాయలసీమ లిఫ్ట్ పనులను ప్రారంభించాలని వైఎస్సార్సీపీ ముఖ్య నేతల డిమాండ్ లేదంటే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిక -
ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్
● రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం ఆత్మకూరురూరల్: లంచం తీసుకుంటూ ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్బాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ నేరంలో పాలు పంచుకున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ ను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆత్మకూరు పట్టణం కొత్తపేట కు చెందిన నాయబ్ సయ్యద్ సజ్జద్ అలి అనే వ్యక్తి తనకు చెందిన ఖాళీ స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయాలని తలపెట్టాడు. అందుకోసం తన స్థలానికి వేకెంట్ ల్యాండ్ టాక్స్(విఎల్టీ) కట్టి రశీదు తీసుకోవాలని భావించాడు. అందుకోసం పలుమార్లు ఆఫీస్ చుట్టు తిరిగి వేసారి కమిషనర్ రమేష్ బాబుకు అనుకూలమైన సిబ్బంది చెప్పడంతో లంచం లేనిదే పని జరగదని తెలుసుకున్నాడు. అలాగే ఇస్తానని కూడా అంగీకరించడంతో 20 వేల రూపాయలకు బేరం కుదిరింది. ఈ అంశాన్ని సజ్జద్ అలి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి సూచనల మేరకు గురువారం లంచం సొమ్మును మున్సిపల్ కమిషనర్ రూంలోనే ఆయన సమక్షంలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ చేతికి అందించాడు. అదే సమయానికి అక్కడకు చేరుకున్న ఏసీబీ డీఎస్పీ సోమన్న , సీఐ బత్తల కృష్ణయ్య, ఇతర పోలీసులు రెడ్ హ్యాండెడ్గా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబును, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు నంద్యాల (వ్యవసాయం): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా గురువారం తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పండుగ సందర్భంగా బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదన్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం బస్సుల్లో ఫోన్ పే ద్వారా చెల్లింపులు సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందన్నారు. గతేడాది నంద్యాల నుంచి శ్రీశైలానికి 160 బస్సులు ఏర్పాటు చేయగా, ఈ ఏడాది 200 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సులను ఇతర జిల్లాల నుంచి తీసుకొస్తున్నామన్నారు. వీటితో పాటు 80 బస్సులను ఇతర శైవ క్షేత్రలకు నడుపుతున్నట్లు చెప్పారు. బస్సుల మరమ్మతులకు శ్రీశైలం, శిఖరం, దోర్నాల, పాయింట్ ప్రదేశాలలో రిలీఫ్ క్యాంప్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్గమధ్యంలో ఏదైనా బస్సులకు ఇబ్బందులు తలెత్తే వెంటనే మొబైల్ రిలీఫ్ సిబ్బంది వచ్చి వాటి మరమ్మతులు చేస్తారన్నారు. అన్నదానాలు ప్రారంభమైన వెంటనే పాదయాత్రకు అనుమతి ● ఆత్మకూరు డీఎఫ్ఓ విఘ్నేష్ ఆత్మకూరు: నల్లమల అటవీ పరిధిలో అన్నదానాలు ప్రారంభమైన వెంటనే భక్తుల పాదయాత్రకు అనుమతి ఇస్తామని ఆత్మకూరు డీఎఫ్ఓ విఘ్నేష్ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని డీఎఫ్ఓ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. పులుల గణన కారణంగా ఈనెల 8వ తేదీ నుంచి పాదయాత్రకు అనుమతించామన్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాదయాత్రకు 8వ తేదీ కంటే ముందుగానే అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నల్లమల అటవీ పరిధిలోని నాగలూటి, పెచ్చెరువు, భీమునికొలను ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన వెంటనే పాదయాత్రకు అనుమతిస్తామన్నారు. అన్నదానం లేకపోతే పాదయాత్రగా వెళ్లే భక్తులు ఆకలితో ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. శనివారం నుంచి అటవీశాఖ సిబ్బంది ద్వారా భక్తులను సురక్షితంగా శ్రీశైలం క్షేత్రానికి పంపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాగలూటిలో 7 నుంచి అన్నదానం నాగలూటిలో ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తాము అన్ని వంట సామగ్రితో ఉన్నామన్నారు. పాదయాత్ర భక్తులు ఇబ్బందులు నిరంతరం అన్నదానం చేస్తామన్నారు. వెంకటాపురంలో ఈనెల 8వ తేదీ నుంచి అన్నదానం నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్పారు. -
సంకల్పదారులు
సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు (సెంట్రల్): ‘చలో పోతిరెడ్డిపాడు’ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో సభ ఏర్పాట్లకు కృషి చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. రాత్రంతా అక్కడే ఉండి ఏర్పాట్లను బైరెడ్డి పరిశీలించారని, ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పార్టీలో సమన్వయంతో ముందుకు సాగుతామని చెప్పారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ఆత్మకూరులో భోజన వసతిని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. రైతుల ‘సునామీ’ ● భారీగా తరలివచ్చిన రాయలసీమ రైతులు జూపాడుబంగ్లా: ‘చలో పోతిరెడ్డిపాడు’ సభకు రైతులు సునామీలా తరలివచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టుపెట్టి సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని వివరించేందుకు చేపట్టిన సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. సభ విజయవంతం కాకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు పన్నినా ఫలితం లేకుండా పోయింది. సభ నిర్వహణకు కేవలం 18గంటల ముందు మాత్రమే అనుమతులు మంజూరైనా వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంటు బైరెడ్డి సిద్ధ్దార్థరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త దారాసుధీర్ నిర్ణీత సమయానికి సభను ముస్తాబు చేయించారు. అంచనాలను మించిపోయి రాయలసీమ జిల్లాల నుంచి 10 వేల మందికిపైగా రైతులు తరలివచ్చారు. ఉదయం 11.30గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 2.30గంటల వరకు కొనసాగింది. అప్పటిదాకా సభా ప్రాంగణానికి సుదూర ప్రాంతాల్లోని రైతులు తరలివస్తూనే ఉన్నారు. రైతులు, ప్రజలు సభాప్రాంగణం వద్దకు మినహా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, రాయలసీమ ఎత్తిపోతల పథకం చూసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో రైతులు పోలీసుల వైఖరిని తప్పుపడుతూ వెనుదిరిగారు. -
గో సంరక్షణనిధికి విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిధి పథకానికి పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. గురువారం కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన దాత శ్రీరామమూర్తి రూ.1,23,456 విరాళాన్ని పర్యవేక్షకులు టి.హిమబిందుకు అందజేశారు. అలాగే అనంతపురానికి చెందిన బి.రూపేష్సింగ్ రూ.5 లక్షల విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. విరాళాలను అందించిన దాతలను దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలు, జ్ఞాపికలు అందించి సత్కరించారు. 105 ఏళ్ల వృద్ధురాలి మృతి కొత్తపల్లి: ఎం.లింగాపురం గ్రామంలో 105 ఏళ్ల చిమ్మె రత్న మ్మ వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. ఈమె 1921లో జన్మించినట్లు కుటుంబీకులు తెలిపారు. దాదాపు 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం వయస్సు పైబడడంతో గురువారం ఆమె మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఈమెకు నలుగురు కుమారులుగా, ప్రస్తుతం కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 40కిపైగా ఉంది. బైక్ల దొంగ అరెస్ట్ నంద్యాల: బైక్ల చోరీలకు పాల్పడుతున్న దొంగను నంద్యాల వన్టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గత నెల 25వ తేదీన కర్నూలు పట్టణానికి చెందిన నరసప్ప అనే వ్యక్తి బస్టాండ్ బయట బైక్ పార్కింగ్ చేసి బస్సు విచారణ కోసం వెళ్లి వచ్చేలోపు బైక్ కనిపించలేదు. ఈ చోరీపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నంద్యాల పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్వలి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. గురువారం పట్టణంలోని చెరువు కట్ట వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా మహమ్మద్ వలిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అతని వద్ద నుంచి స్కూటీ, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు వలిపై గతంలో కర్నూ లు, ఓర్వకల్లు, ఆత్మకూరు, బేతంచెర్ల, నంద్యాల పోలీసు స్టేషన్ల పరిధిలో 9 కేసులు నమో దు అయ్యాయన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి నంద్యాల కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా రిమాండ్కు ఆదేశించారన్నారు. పురాతన శివాలయం పరిశీలన నందవరం: రాయచోటి గ్రామంలోని పశ్చిమ చోళుల కాలం నాటి చరిత్ర కలిగిన పురాతన శివాలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. గురువారం గ్రామంలోని శివాలయంలో పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామి నాయక్ ఆదేశాల మేరకు టెక్నికల్ అసిస్టెంట్ మహేంద్రనాయుడు, సైట్ ఇంజనీర్ జి.పి శ్రీనివాసులు గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలు సుకున్నారు. అనంతరం ఆలయాన్ని సందర్శించి కొలతలు చేపట్టారు. ఈ సందర్భంగా టెక్నికల్ అసిస్టెంట్ మాట్లాడుతూ.. పురాతన శివాలయ పునరుర్ధణ చర్యలు చేపడుతునట్లు తెలిపారు. -
ప్రతి పేజీ మోసమే!
కర్నూలు(సెంట్రల్): పట్టదారు పాసుపుస్తకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ‘రాజకీయం’ చేస్తోంది. గత ప్రభుత్వంలో జారీ చేసిన పాసు పుస్తకాలను రద్దు చేసి కొత్తగా రాజముద్రతో ఇస్తామని ఊరించింది. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా ఇప్పటికీ అరకొరగానే మంజూరు చేస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నేడు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా వీటిని రైతులకు అందించేందుకు ఎమ్మిగనూరు మండలం కలుగోట్లలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం మూడు విడతల్లో 472 గ్రామాలకు 254 గ్రామాల్లో రీసర్వేను పూర్తి చేసి 1.92,472 మంది రైతులకు జీయో కోఆర్డినేట్స్తో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల ముందు రీసర్వేపై చంద్రబాబుతో పాటు పవన్ కల్యాన్ తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల భూములు లాక్కుంటున్నారని, తాము అధికారంలోకి వస్తే రీసర్వేను నిలుపుదల చేస్తామని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే 2025 జనవరి 20 నుంచి వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు–భూరక్ష పథకం పేరు మార్చి ఏపీ రీసర్వే ప్రాజెక్టు పేరిట రీసర్వే చేపడుతుండటం చూసి రైతులు అవాక్కవుతున్నారు. రెండేళ్ల తరువాత రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలు ఇస్తున్నా జిల్లాకు అరకొరగానే మంజూరయ్యాయి. మొత్తం 1,92,472 మంది రైతుల్లో 84వేల పుస్తకాలు మాత్రమే జిల్లాకు చేరాయి. కొత్త పాసుపుస్తకాల్లో తప్పులే తప్పులు గత ప్రభుత్వం మంజూరు చేసిన జీయో కోఆర్డినేట్స్తో కూడిన పట్టదారు పాసు పుస్తకాలను రద్దు చేసిన చంద్రబాబునాయుడు.. వాటి స్థానంలో రాజముద్రదతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నారు. అయితే వాటిలో వివరాలు సక్రమంగా లేవని రైతులు గగ్గోలు పెడుతున్నారు. విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఎల్పీ నంబర్, పేరు, ఇంటి పేరు, పాసు పుస్తకం నంబరు తదితర వివరాల్లో అచ్చు తప్పులు ఎక్కువగా దొర్లడం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల తరువాత ఇస్తున్నా వాటిలో అన్నీ తప్పులే ఉండటం పట్ల అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ రీసర్వేపై టీడీపీ, జనసేన దుష్ప్రచారం అధికారంలోకి రాగానే తిరిగి రీసర్వేకు శ్రీకారం పాత పుస్తకాలను రద్దుచేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు అరకొరగానే పాసుపుస్తకాలు బ్యాంకు రుణాలు, ఇతర అవసరాలకు రైతుల అవస్థలు నేడు కలుగొట్లలో సీఎం చంద్రబాబు పర్యటన -
పాసు పుస్తకాలు ఎప్పుడిస్తారో
నాకు రెండు ఎకరాల పొలం ఉంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలోనే సర్వే చేశారు. అయితే పాసు పుస్తకం ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. భూ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే రీసర్వేను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరి గత ప్రభుత్వంలో ఎందుకు వ్యతిరేకించారో తెలియడం లేదు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. – తువ్వదొడ్డి ఆనంద్, ముక్కెళ్ల, తుగ్గలి మండలం నా పొలాన్ని గత ప్రభుత్వ హయాంలోనే రీసర్వే చేశారు. జీయో కోఆర్డినేట్స్తో కూడిన పాసుపుస్తకాన్ని ఇచ్చారు. అయితే దానిని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తది మాత్రం ఎప్పుడు ఇస్తారో చెప్పరు. బ్యాంకులో రుణం కోసం వెళ్తే పాసు పుస్తకం అడుగుతున్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం తగదు. – సోమేష్, మూగలదొడ్డి, కోసిగి మండలం -
అహోబిలేశుడికి నీరాజనం
ఆళ్లగడ్డ: అహోబిలేశుని పార్వేట పల్లకీ గురువారం చింతకుంటకు చేరింది. ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లె నుంచి తెల్లవారు జామున ఎంవీనగర్కు చేరుకుంది. అక్కడ ఎంపీడీఓ కార్యాయలయం, డీఎస్పీ, పోలీస్ సర్కిల్ కార్యాలయాల్లో విశేష పూజలు అందుకున్న అనంతరం చింతకుంట గ్రామం చేరుకుంది. గ్రామ పొలిమేరకు చేరుకున్న ఉత్సవమూర్తులకు సంప్రదాయ ప్రకారం వీఆర్వో బారెడ్డి రాజగోపాల్రెడ్డి పెద్ద ఎత్తున గ్రామస్తులతో కలిసి వెళ్లి స్వాగతం పలికారు అనంతరం పల్లకీని భుజాలపై మోస్తూ మొదటి తెలుపుపై కొలువుంచారు. ఉత్సవ మూర్తులు శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరదస్వాములను గ్రామస్తులు బారులు దీరి దర్శించుకున్నారు. గ్రామంలోని పలు తెలుపులపై కొలువుదీరిన ఉత్సవ పల్లకీకి ప్రజలు విశేష పూజలు చేశారు. ఇద్దరు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అరెస్ట్ ● మద్యం మత్తులో బస్సు డ్రైవింగ్ పాణ్యం: మద్యం మత్తులో ఉన్న ఇద్ద రు ప్రైవేటు ట్రావె ల్స్ బస్సు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి 26 మంది ప్రయాణికులతో కావేరి ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. మార్గమధ్య లో గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పాణ్యం సమీపంలో బస్సు డ్రైవర్ రహదారిపై ఉన్న బారికేడ్స్ను ఢీకొని, ర్యాష్ డ్రైవింగ్ చేయడాన్ని ప్రయాణికులు గమనించారు. వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బలపనూరు వద్ద బస్సును నిలిపేశారు. ఇద్దరు డ్రైవర్లను బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్లు గుర్తించారు. ప్రయాణికులను వేరే బస్సుల్లో హైదరాబాద్కు పంపించి కావేరి బస్సును స్టేషన్కు తరలించారు. హైదరాబాద్కు చెందిన డ్రైవ ర్లు ఆంజినేయులు, విశ్వనాథ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. -
రికార్డుల నిర్వహణ ఇలాగేనా?
● డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యనారాయణ ఆగ్రహంకొత్తపల్లి: ఉపాధి హామీ అధికారులపై డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎంపీడీఓ మేరి అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అనుబంధ సంస్థలలో జరిగిన పనులపై 18వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల నిర్వ హణ అంతా అస్తవ్యస్థంగా ఉందన్నారు. చేసిన పను ల ఫొటోలు లేకపోవడంతో ఎక్కడ, ఎప్పుడు పనులు చేశారో తనిఖీ అధికారులు గుర్తించలేకపోయారన్నా రు. రికార్డుల నిర్వహణ పనితీరుపై మండిపడ్డారు. హార్టికల్చర్పై రైతులకు అవగాహన ఎవ్వరూ కల్పించినట్లు లేదన్నారు. తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 2024–25లో రూ.9.90 కోట్లతో జరిగిన 961 పనులపై సామాజిక తనిఖీ చేయగా 1.79 కోట్ల అవకతవకలు జరిగినట్లు గుర్తించారన్నారు. హార్టికల్చర్ కింద రైతుల పొలాల్లో మొక్కలు లేనందున మొక్కలు లేని చోట రీ ప్లాంటేషన్ చేయకపోతే రైతుల నుంచి రూ.96,796 రికవరీ చేయాలని ఆదేశించారు. మిగిలిన వాటిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో ఏపీడీ వెంకటరామిరెడ్డి, అడిషనల్ విజిలెన్స్ అధికారి పరమేశ్వరుడు, సామాజిక తనిఖీ ఎస్ఆర్పీ చంద్రమోహన్, ఏపీఓ విమలమ్మ, పీఆర్ఏఈ మద్దిలేటి పాల్గొన్నారు. -
ఈ టైంలో బాబు-పులి కథ చెప్పాల్సిందే!
సాక్షి, నంద్యాల: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్సీపీ నిర్వహించిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పుకునేవాళ్లు కూడా గత రెండు మూడు రోజులుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. మద్ధతు ఇవ్వమని కోరితే.. టీఎంసీ, క్యూసెక్కులు అంటే ఏంటో చెప్పాలంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. అవే చదువుకుని కుంటే ఏ ఇంజినీర్లు అయ్యి ఉండేవాళ్లు కదా. ఇదంతా కేవలం వాళ్ల రాజకీయ స్వార్థం కోసమే. తెలుగు దేశం వాళ్లు ఒక్క పని చేయరు. చంద్రబాబుకు తెలిసిందల్లా రెండే.. ఒకటి శిలాఫలకం వేయడం, రెండోది పని ఎవరైనా పూర్తి చేశాక వచ్చి తనదే ఆ క్రెడిట్ అని చెప్పుకోవడం.. అందుకే ఇప్పుడు వేటగాడి కథ చెప్పుకోవాలి..ఒక వేటగాడు ఉన్నాడు. భయంకరమైన యుద్ధం చేసి పులిని చంపాడు. ఆ నొప్పులు తట్టుకోలేక మందు కోసమని వెళ్లాడు. ఈలోపు చంద్రబాబు లాంటోడు వచ్చాడు. పులి గోళ్లు, పళ్లు ఎత్తుకెళ్లి.. నేనే చంపాను అంటూ చెప్పుకుని తిరిగాడు. హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) పనులు తానే చేశానని చెప్పుకుంటున్నాడు. కానీ, ఆ పనులు ఎన్టీఆర్ కాలం నాడే మొదలయ్యాయి. పూర్తి చేసింది రాజశేఖర్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి.. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదు అని బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి అన్నారు. లడ్డూ గురించి అడిగితే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. యూరియా కొరత గురించి అడిగితే.. ఆ వాడకం మంచిది కాదు కేన్సర్ వస్తుందటారు. మహిళలకు ఎన్నికల్లో ఇస్తానన్న భృతి గురించి అడిగితే.. నా దగ్గర భద్రంగా ఉంటుందని అంటున్నారు. ఇంక పవన్ కల్యాణ్ తిరిగేది రెండు మూడు నియోజకవర్గాలే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. చంద్రబాబు అండ్ కో పదే పదే అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుతున్నారు అని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ చంద్రబాబు జాగీరు కాదని.. మెడలు వంచైనా సరే సాధించుకుంటామని ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రజా , రైతు సంఘాలు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపాయి. -
ఓటుకు నోటు భయం.. రాయలసీమ లిఫ్ట్ తాకట్టు: సజ్జల
సాక్షి, కర్నూలు జిల్లా: పోతిరెడ్డి పాడు నిరసన ఆరంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. సీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారంటూ మండిపడ్డారు. ఇవాళ చలో పోతిరెడ్డిపాడుకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. సీమ లిఫ్ట్ పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. చలో పోతిరెడ్డిపాడుకు ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.ముందుగా వైఎస్సార్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పలువురు నేతలు పోతిరెడ్డిపాడును సందర్శించారు. అనంతరం పోతిరెడ్డిపాడు దగ్గర నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయలసీమ జిల్లాల నుంచి బహిరంగ సభకు రైతులు తరలివచ్చారు. ఈ సభలో వైఎస్సార్సీపీ సీమ జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ మంత్రులు శైలజానాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి, విశ్వేశ్వరరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు మంగమ్మ శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, కంగాటి శ్రీదేవి, బుట్టా రేణుక పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతలను నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేస్తోంది. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని నినదిస్తోంది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జిస్తోంది. ‘తీరుమారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్’ అంటూ హెచ్చరిస్తోంది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిజాలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు?. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు. తెలంగాణ మాదిరే రాయలసీమకు 800 అడుగుల స్థాయిలోనే శ్రీశైలం నీరు రావాలి. చంద్రబాబుకు ఓటుకు నోటు భయం ఉంది. హైదరాబాద్లో ఆస్తులను కాపాడుకునేందుకు రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే కారణంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దారుణం. రైతులకు సమృద్ధిగా నీరందిస్తేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ ఏనాడో గుర్తించారు. సీమ తాగు సాగు నీటి కష్టాలకు ఏకైక పరిష్కారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే. 80 శాతం పూర్తయిన ప్రాజెక్టును ఆపేయడం మహాపాపం అని చంద్రబాబు గుర్తించాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబుకు రాయలసీమ ప్రయోజనాలు పట్టవు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్కు తాకట్టు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల్లోనే తెలంగాణ తీసుకుంటూ ఉంటే రాయలసీమ ఎందుకు తీసుకోకూడదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఇప్పుడు అర్ధాంతరంగా పనులు నిలిపివేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ సుభిక్షంగా ఉందంటే అది ఒక్క వైఎస్సార్ వలనే.. రాయలసీమ ప్రజలు నిత్యం సుభిక్షంగా ఉండాలని వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకువచ్చారన్నారు. రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపారని సతీష్రెడ్డి మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగలేదు. కరువు సమయంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వైఎస్ జగన్ తెచ్చిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు అపాల్సి వచ్చింది?. రేవంత్ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు సమాధానం చెప్పాలి. జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎంఎస్ఎస్కి పిడికెడు మట్టి తీయలేదు. రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. రాయలసీమ రైతులపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోంది. పోతిరెడ్డిపాడు నిరసన ఆరంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం’’ అని సతీష్రెడ్డి హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏనాడు రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్, హైకోర్టు తరలించుకు పోయారు.శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టాడన్నారు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో చంద్రబాబు మిగిలి పోతారన్నారు. రాయలసీమకు మేలు చేసిన ఏకైక కుటుంబం వైఎస్సార్ మాత్రమే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయాలని వైఎస్ జగన్ శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలి. సీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించాలి. -
చీకటి ఒప్పందం.. ‘సీమ’కు శాపం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులతో నిలిచిన నీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోయారని చెప్పే చిత్రం ఇదీ..జూపాడుబంగ్లా: రాయలసీమ ప్రజలు తమ గర్జనను వినిపించే సమయం ఆసన్నమైంది. సాగునీరు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ‘తాకట్టు’పై శంఖారావం పూరించే మహోన్నత అవకాశం లభించింది. గురువారం పోతులపాడు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ‘సీమ’ అకాంక్ష ప్రదర్శితం కానుంది. అనుమతివ్వకపోయినా కచ్చితంగా ‘చలో పోతిరెడ్డిపాడు’ నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త దారాసుధీర్, ఎమ్మెల్సీ ఇసాక్బాష, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. దీంతో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనుమతులు మంజూరయ్యాయి. వెంటనే పోతులపాడు గ్రామంలోని వెంకటశివారెడ్డి, చిన్నశాంతన్న పొలంలో రైతుశంఖారావం సభ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు ప్రారంభించారు. అడ్డంకులను దాటుకుని.. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవటానికి కారణమైన సీఎం చంద్రబాబు మోసాన్ని రైతులు, ప్రజలకు తెలియజేసేందుకు ఈనెల 5న చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు. అందులో భాగంగా జనవరి 30న పోతులపాడు గ్రామంలో సభ నిర్వహణకు స్థలాన్ని పరిశీలించారు. సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని ఎస్పీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఎస్పీ ఆదేశాలతో 30వ తేదీ సాయంత్రం ఆత్మకూరు డీఎస్పీ రాంమాజనేయనాయక్, నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం స్థలాన్ని పరిశీలించి నివేదికలు సమర్పించారు. దీంతో అక్కడ సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్కు 6 కిలోమీటర్ల పరిధిలో సభ నిర్వహించవద్దని సూచించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన తరిగోపుల క్రాస్రోడ్డు వద్ద రైస్మిల్ సమీపంలో సభ నిర్వహణకు మరోసారి కాటసాని రాంభూపాల్రెడ్డి, బైరెడ్డి సిద్దార్థరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, దారా సుధీర్, శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అయినా సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేయలేదు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బుధవారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో సభ నిర్వహణకు అనుమతులు మంజూరు చేశారు. వెంటనే పోతులపాడులో సభ నిర్వహణ ఏర్పాట్లను ప్రారంభించారు. ఉదయం పదిగంటలకు ప్రారంభమయ్యే సభకు రాయలసీమ జిల్లాల్లోని రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచిన మోటార్లు బిగించని ప్రాంతంనందికొట్కూరు: తల్లిలాంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టడంపై రైతులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్నారు. రాయలసీమ జిల్లాలోని 52 నియోజకవర్గాలకు, నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు తాగు, సాగు నీరు కష్టాలు తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఈ పథకంతో శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు కాల్వలోకి ఎత్తిపోయవచ్చు. రైతులు, ప్రజలకు సాగు, తాగు నీరు కష్టాలు తీరుతాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు సీఎం చంద్రబాబు ఆపేశారని రైతులు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఆంక్షలు విధిస్తూ భారీ బందోబస్తు చలో పోతిరెడ్డిపాడు సభ నిర్వహణకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంతో పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ అధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 80 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించనున్నారు. సభకు వచ్చే వారు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్దనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. సభకు ఎలా వచ్చారో ముగిసిన తర్వాత అలాగే వెళ్లేలా చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చూసేందుకు వెళ్లకుండా భారీ బందోబస్తు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. రైతు శంఖారావం పేరుతో ‘చలో పోతిరెడ్డిపాడు’ పోతులపాడులో ముమ్మరంగా సభ ఏర్పాట్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కాటసాని, సిద్ధార్థరెడ్డి, దారాసుధీర్ రాయలసీమ రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపు -
విధి నిర్వహణలో అప్రమత్తత అవసరం
నంద్యాల: విధి నిర్వహణలో ఏఆర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. జిల్లా సాయుధ పోలీసు బలగాలు ఏర్పాటు చేసిన ‘మొబిలైజేషన్’ ముగింపు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయుధ బలగాలనుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో, చట్ట పరిధిలో జరుగుతున్న మార్పులను గమనించాలన్నారు. శాంతిభద్రతలో కొత్తగా తలెత్తే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎస్కార్ట్, గార్డ్, పికెట్, బందోబస్తు విధులను, మాబ్ కంట్రోల్ను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్లు మల్లికార్జున గుప్త, సూర్య మౌళి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్, సురేష్ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో తొలి మహిళా హెవీ వెహికల్ డ్రైవర్గా లక్ష్మిదేవి నంద్యాల: జిల్లాలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించిన లక్ష్మిదేవిని జిల్లా కలెక్టర్ రాజకుమారి అభినందించారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఆమె సాధించిన విజయాన్ని కలెక్టర్ కొనియాడుతూ, ఇది జిల్లాలోని మహిళలకు గర్వకారణమన్నారు. సాధారణంగా ఆటో నడిపే స్థాయి నుంచి ప్రారంభించి.. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన లక్ష్మిదేవి లారీ, బస్సు వంటి భారీ వాహనాలను నడిపే శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందారన్నారు. ఏ రంగమైనా మహిళలు ముందడుగు వేసినప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు. లక్ష్మిదేవి సాధించిన విజయం ఎంతోమంది మహిళలకు, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఐదు ఆయుష్ కేంద్రాలకు భవనాలు మంజూరు గోస్పాడు: జిల్లాలో ఐదు ఆయుష్ కేంద్రాలకు భవనాలు మంజూరైనట్లు ఏపీఎంఎస్ఐడీసీ ఇన్చార్జి ఈఈ నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన స్థానిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రం నంద్యాల, జిల్లెల్ల, శిరివెళ్ల, దొర్నిపాడు, పాణ్యంలోని ఆయుష్ కేంద్రాలకు భవనాలు మంజూరయ్యాయన్నారు. నంద్యాలలో రూ.50 లక్షలతో, పాణ్యంలో రూ.30 లక్షలు, జిల్లెల్ల, శిరివెళ్ల, దొర్నిపాడులో ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 లక్షలతో నిర్మాణం చేపడతామన్నారు. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయని, మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రత్యేక అధికారిగా ఆజాద్ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్యవేక్షణకు ఉత్సవాల ముఖ్య అధికారిగా ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ను నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం ఆయనకు సిబ్బందిని నియమించారు. వసతి గది, అటెండర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పీఆర్వోను ఆదేశించారు. అలాగే సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా ఆలయ ఏఈవోలు వెంకటేశ్వరరావు, హరిదాసు, సీనియర్ అసిస్టెంట్ కె.శివప్రసాద్ను సీసీగా నియమిస్తూ దేవస్థాన ఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం పర్యటనకు నాలుగు జిల్లాల పోలీసులు కర్నూలు: ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఈనెల 6న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో బందోబస్తుకు నాలుగు జిల్లాల పోలీసులను వినియోగిస్తున్నారు. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి దాదాపు 1,200 మంది పోలీసులను బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు పాల్గొననున్నట్లు చెప్పారు. -
మేల్కోకుంటే సీమ ఎడారే..!
● పోతిరెడ్డిపాడు సభను విజయవంతం చేద్దాం ● రాయలసీమ ద్రోహి చంద్రబాబు ● ‘చలో పోతిరెడ్డిపాడు’ పోస్టర్ ఆవిష్కరించిన కాటసాని రాంభూపాల్రెడ్డి కల్లూరు: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు అడ్డుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీమ ద్రోహిగా నిలిచారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం పోస్టర్లను బుధవారం కాటసాని రాంభూపాల్రెడ్డి నివాసంలో ఆవిష్కరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పునఃప్రారంభించాలని గురువారం పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాయలసీమలో ఎత్తిపోతల పథకం లేకపోతే సీమలోని అన్ని ప్రాంతాలు కరువుతో అల్లాడుతాయన్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులు జరగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ పథకంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సీమ ప్రాంత ప్రయోజనాల కోసం చేపట్టనున్న కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాయలసీమ రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందన్నారు. -
పార్వేట ఉత్సవం.. ‘సర్వా’ శోభితం
ఉయ్యాలవాడ: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పార్వేట ఉత్సవ పల్లకీ బుధవారం ఉయ్యాలవాడ మండలంలోని సర్వాయిపల్లె గ్రామానికి బుధవారం ఉదయం 6 గంటలకు చేరుకుంది. గ్రామస్తులు, అధికారులు ఎదురేగి స్వాగతం పలికారు. ఉత్సవం సర్వాయిపల్లెకే పరిమితం కావడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. గ్రామానికి చెందిన సన్నితి సుబ్రమణ్యం శ్రేష్టి స్వగృహం నుంచి నూతన వస్త్రాలు మేళ తాళాలతో తెలుపు వద్దకు చేరుకుని మొదటి పూజ చేశారు. స్వామి వారి రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆనవాయితీ ప్రకారం ప్రహ్లాదవరద స్వామి, జ్వాలా నరసింహ స్వామికి ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో కోనేటి పుణ్య స్నానాలు చేయించారు. స్వామి వార్లకు క్షీర, పంచామృతాభిషేకం చేశారు. సంక్రాంతి పర్వ దినాన అహోబిలం కొండ దిగి బాచాపురంలో మొదటి పూజ అందుకున్నారు. ఇరవై రోజుల తరువాత ప్రహ్లాద వరద స్వామి, జ్వాలా నరసింహస్వామికి ఏకాంత అభిషేకాలు చేపడతారు. ఏటా ఈ కార్యక్రమాన్ని సర్వాయిపల్లె గ్రామంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు పేర్కొన్నారు. -
మహానందిలో 13 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహానందిలో ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్నట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు, పోస్టర్లు బుధవారం విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 13న ఉత్సవాలను అంకురార్పణ, ధ్వజారోహణంతో ప్రారంభిస్తామన్నారు. 15న మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవకాలంలో మహానందీశ్వర స్వామికి మహారుద్రాభిషేకం నిర్వహిస్తామన్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం చేపడతామన్నారు. 16వ తేదీన ఉదయం అశ్వ వాహనసేవ, రాత్రి పుష్పపల్లకీ సేవ ఉంటుందన్నారు. 17న మహానందీశుని రథోత్సవం, రాత్రి పుష్పశయనోత్సవం పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18న మహాపూర్ణాహుతి, రాత్రి తెప్పోత్సవం ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకర శర్మ, ఏఈఓ ఎరమల మధు తదితరులు పాల్గొన్నారు. -
మార్చి 14న జాతీయ లోక్ అదాలత్
కర్నూలు: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోర్టుల్లోని సివిల్, మోటార్ వెహికల్ ప్రమాదాలు, వివాహ సంబంధమైన కేసులు, భూసేకరణ కేసులు, రాజీ కాదగిన క్రిమినల్, మున్సిపల్ ట్యాక్స్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని కోర్టులలో ఫ్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఉపయో గించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించా రు. ముఖ్యంగా పది సంవత్సరాల పైబడి పెండింగ్లో ఉన్న సివిల్ కేసుల పరిష్కారానికి ఈ ఫ్రీ సిట్టింగ్ లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కల్లూరు, మద్దికెరలో అతి పెద్ద గోదాములు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని కల్లూరు, మద్దికెర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అతి పెద్ద గోదాములు నిర్మించుకునేందుకు సహకార శాఖ చర్యలు చేపట్టింది. వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజీ ప్రాజెక్టు (డబ్ల్యూఎల్జీఎస్పీ) కింద ఒక్కో సంఘం పరిధిలో 2,500 టన్నుల సా మర్థ్యం కలిగిన గోదాములు నిర్మించడానికి జిల్లా సహకార కేంద్రబ్యాంకులోని ఫ్యాక్స్ డెవలప్మెంటు సెల్ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. ఈ గోదాములు నిర్మించాలంటే కనీసం 2 ఎకరాల భూమి అవసరం. మద్దికెర, కల్లూరు సహకార సంఘాలకు ఈ స్థాయిలో భూములు ఉండటంతో డబ్ల్యూఎల్జీఎస్పీ కింద గోదాముల నిర్మాణానికి సహకార శాఖ చర్యలు చేపట్టింది. డబ్ల్యూఎల్జీఎస్పీ 33 శాతం సబ్సిడీ ఇస్తుంది. కలెక్టర్ నుంచి పరిపాలన అనుమతులు తీసుకున్న తర్వాత పనులు మొద లు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
4 నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతివ్వండి
ఆత్మకూరు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి నల్లమల మీదుగా పాదయాత్రగా వెళ్లే భక్తులకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సిద్ధాపురం చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డితో కలసి మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. శ్రీశైలం మహాక్షేత్రానికి గత ఏడాది కంటే ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఉన్నతాధికారుల అనుమతితో పాదయాత్ర భక్తులకు నల్లమల మీదుగా వెళ్లేందుకు అటవీ శాఖ అధికారులు సౌకర్యాలు కల్పిస్తారన్నారు. భక్తులు కూడా అటవీశాఖ అధికారులకు సహ కరించాలన్నారు. ప్రస్తుతం పులుల గణన జరుగుతున్నందున ఇబ్బందులు తలెత్తనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. త్వరలోనే అటవీ శాఖ అనుమతులతో వెంకటాపురం నుంచి దోర్నా ల రహదారి విస్తరణ చేపడుతామన్నారు. 3 కోట్లతో చేపట్టిన సిద్ధాపురం అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ రత్నరాధిక, మైనర్ ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అహోబిలేశుడికి బ్రహ్మరథం
ఆళ్లగడ్డ: పార్వేటగా బయలుదేరిన అహోబిలేశుడికి ఊరూరా భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. ఊరి పొలిమేరకు చేరుకోగానే ఎదురెళ్లి ఘన స్వాగతం పలుకుతున్నారు. నాలుగు రోజులుగా ఆళ్లగడ్డ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి పార్వేట మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. పట్టణంలోని తెలుపులపై కొలువైన ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహిస్తూ మొక్కుబడులు చెల్లించుకున్నారు. చివరి రోజు మంగళవారం ఉదయం పొలిమేర తెలుపుపై కొలువైన ఉత్సవ పల్లకీని సంప్రదాయ ప్రకారం అధికారులు, గ్రామ పెద్దలు వీడ్కోలు పూజలు నిర్వహించి పల్లకీని సాగనంపారు. పార్వేట ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ పల్లకీ మంగళవారం రూరల్ మండలం ఎస్ లింగందిన్నెకు చేరుకుంది. గ్రామ పొలిమేరకు చేరుకున్న పల్లకీకి గ్రామస్తులు స్వాగతం పలికి విశేష పూజలు చేశారు. అనంతరం పల్లకీని భక్తులు తమ భుమాజాలపై మోసుకుంటూ గ్రామంలోకి చేరుకున్నారు. స్వామి రాకతో గ్రామంలో తిరునాల సందడి నెలకొంది. -
మాతృ మరణాల సంఖ్య తగ్గుముఖం
చాగలమర్రి: వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తుండటంతో రాష్ట్రంలో మాతృమరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఏపీ ఎంసీహెచ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన చాగలమర్రి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పీహెచ్సీలో నిర్వహిస్తున్న ఓపి, ఐపి, ఫార్మసీలను పరిశీలించారు. అనంతరం ఆయన వైద్యాధికారిణి అంజలి, సిబ్బందితో పీఎంఎస్ఎంఏ, పీఎంజెఏవై, ఎంసీహెచ్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఆయన వెంట తనిఖీలో ఆరోగ్య విస్తరణాధికారి వెంకటేశ్వర్లు, ఫార్మసిస్ట్ రాజేష్, స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, ఎల్టీ శ్రీనివాసనాయక్, హెల్త్ అసిస్టెంట్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలి నంద్యాల(అర్బన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను త్వరిగతిన పూర్తి చేయాలని ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ వైవీకే షన్ముఖ కుమార్ తెలిపారు. స్థానిక ప్రథమనంది కల్యాణ మండపంలో మండల, డివిజన్, జిల్లా స్థాయి ఎంపీడీఓలు, పీఆర్, ఎన్ఆర్ఈజీఎస్ జిల్లా స్థాయి అధికారులు, ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ పీడీ సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర డైరెక్టర్ షన్ముఖ కుమార్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న క్యాటిల్ షెడ్, హార్టికల్చర్, వివిధ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకం మార్చి తర్వాత వీవీజీ ఆర్ఏఎంజీలోకి మార్పు చెందుతుందని, ఫిబ్ర వరి 28లోగా పనులు పూర్తి చేయాలన్నారు. ఆర్యూలో విద్యార్థుల మధ్య గొడవ కర్నూలు (సెంట్రల్): రాయలసీమ యూనివర్సిటీలో మరోసారి విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. పీజీ విద్యార్థిపై బీటెక్ విద్యార్థులు దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఏడాదిలో విద్యార్థుల మధ్య గొడవలు తారా స్థాయికి చేరడం ఇది నాలుగో సారి. మంగళవా రం రాత్రి 8 గంటల సమయంలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న ఓబులేసు అనే విద్యార్థిపై మూడో సంవత్సరం చదువుతున్న బీటెక్ విద్యార్థులు దాడి చేశారు. ముఖంపై కొట్టడంతో నోటి వెంబడి రక్తం వచ్చింది. దీంతో సమీపంలో ఉన్న విద్యార్థులు కొందరు కలగజేసుకుని దాడిని సద్దుమణిగించారు. అయితే, దాడిచేసిన బీటెక్ విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నట్లు వారు చెబుతున్నారు. వర్సిటీలో తరచూ విద్యార్థులు మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి ఘటనపై విచారణ చేయిస్తామని వైస్ చాన్స్లర్ వి.వెంకటబసవరావు తెలిపారు. వాము వ్యాపారుల సిండికేట్ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము వ్యాపారుల సిండికేట్ కొనసాగుతోంది. మార్కెట్లో వాముకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ సిండికేట్ కారణంగా ధరలు పెరుగకపోగా తగ్గుతుండటం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం మార్కెట్కు వాము 994 క్వింటా ళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.2,011, గరిష్ట ధర రూ.26,800 లభించగా..సగటు ధర రూ.12,6 99 మాత్రమే నమోదైంది. ఈ నెల 2న వాముకు లభించిన గరిష్ట ధర రూ.30,303 ఉండగా.. సగటు ధర మాత్రం రూ.16,099 మాత్రమే. మార్కెట్కు వాము భారీగా వచ్చేలా ఒకటి, రెండు చిన్న లాట్లకు ఎక్కువ ధర కోట్ చేయడం పరిపాటిగా మారింది. ఎంపీపీ వెంకటేశ్వరమ్మ కర్నూలు (సిటీ): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల పీఠాలను దక్కించుకునేందుకు అడ్డదారులను ఎంచుకుంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు కర్నూలు రూరల్ ఎంపీపీగా డి.వెంకటేశ్వరమ్మను యథావిధిగా కొనసాగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ మండలాల ఎంపీపీ, మండల పరిషత్ ఉపాధ్యక్షుల ఖాళీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కర్నూలు రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలి యథాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని మండలాధికారులు జిల్లా అధికారుల ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. దీంతో కర్నూలు రూరల్ ఎంపీపీ ఎన్నిక కోసం ఇచ్చిన నోటిఫికేషన్ నిలిపివేస్తూ ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
ఆందోళన వ్యక్తం చేస్తున్న కుట్టు శిక్షణ పొందిన మహిళలు ఆళ్లగడ్డ: స్వయం ఉపాధి పేరుతో మహిళలను ఊరించారు. ఉచితంగా శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందజేస్తామని ఆశపెట్టారు. పనులు మానుకుని ఎంతో మంది శిక్షణ శిబిరాలకు హాజరయ్యారు. శిక్షణ పూర్తయి ఏడు నెలలు గడిచినా మిషన్ల జాడ లేదు. కనీసం శిక్షణ సర్టిఫికెట్లు అందలేదు. ఆర్భాట ప్రచారం చేసి చివరకు చేతులెత్తేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుంటుందని చెప్పేందుకు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమమే నిదర్శనమే. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సమావేశాల్లో ఊదరగొట్టారు. ‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తాం. ఇందు కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ, ఈబీసీ, కాపు వర్గానికి చెందిన పేద మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా అందజేస్తాం. శిక్షణ తీసుకున్న మహిళలు ఉద్యోగాలు, బ్యాంకు రుణాలు పొందేలా సర్టిఫికెట్ కూడా ఇస్తాం’.. అంటూ నమ్మించి చివరకు మొహం చాటేశారు. గతేడాది ఏప్రిల్లో జిల్లాలో 23 కుట్టు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయగా అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓల పర్యవేక్షణలో 3,024 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. 90 రోజులు శిక్షణ పొందిన మహిళలకు శిక్షణ అనంతరం బేసిక్ మోడల్ కుట్టుమిషన్ ఉచితంగా అందజేయడంతో పాటు శిక్షణ పొందినట్లు సర్టిఫికెట్ కూడా ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ ఆగస్టులో పూర్తయింది. అయితే శిక్షణ పూర్తయి 7 నెలలు కావస్తున్నా నేటికీ కుట్టు మిషన్లు అందించలేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా శిక్షణ పొందిన మహిళలు తమకు కుట్టు మిషన్లు కాదు కదా కనీసం సర్టిఫికెట్లు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ను కలిసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి నెల కావస్తున్నా ఎవరూ స్పందించడం లేదు. నిర్వాహకులకు శఠగోపం ఉచిత శిక్షణలో భాగంగా జిల్లాలో 23 కుట్టు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఒక టీచర్తో పాటు ఒక కంప్యూటర్ ఆపరేటర్ను కూడా నియమించారు. టీచర్ కుట్టు, కటింగ్పై మెలకువలు ట్రైనింగ్ ఇవ్వడానికి, కంప్యూటర్ ఆపరేటర్ అభ్యర్థుల హాజరు తదితర వివరాలు నమోదు చేసుకునేందుకు నియమించారు. అయితే ప్రభుత్వం టీచర్కు నెలకు రూ. 15 వేలు, కంప్యూటర్ ఆపరేటర్కు రూ. 12 వేలు చొప్పున ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వలేదు. అంతే కాకుండా మిషన్లు సమకూర్చి, గదులు బాడుగకు తీసుకుని శిక్షణ ఇచ్చిన కేంద్రాల నిర్వహకులు సైతం బిల్లుల కోసం ఎదురు చూస్తుండటం గమనార్హం. ఉచిత శిక్షణ, మిషన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో బీసీ, ఈబీసీ మహిళలతో పాటు అన్ని వర్గాలకు చెందిన పేద, మద్యతరగతి మహిళలు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాల్లో శిక్షణ తీసుకున్నారు. నిబంధనల మేరకు 360 గంటలు శిక్షణ తీసుకోవాలని నిర్ణయించడంతో రోజుకు నాలుగు గంటల చొప్పున 90 రోజులు శిక్షణ పొందారు. కుట్టు మిషన్ సర్టిఫికెట్తో ఉద్యోగ అవకాశం పొందవచ్చని, బ్యాంకులో రుణాలు పొందవచ్చని చెప్పడంతో మహిళ లు ఎంతో ఉత్సాహంగా సొంత ఖర్చులతో వ్యయ ప్రయాశాలకోర్చి శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయితే 7 నెలలు అయినా కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లు అందలేదు. శిక్షణ ఇచ్చిన శిబిరాల దగ్గరకు వెళితే అక్కడ ఎవరూ లేరు. దీంతో తమ పరిస్థితి ఎవరికి వివరించాలో కూడా అర్థంకాని అయోమయస్థితిలో ఉన్నారు. -
పోలీసు డాగ్ ‘టీనా’ మృతి
కర్నూలు:జిల్లా పోలీసు శాఖలో 9 ఏళ్ల పాటు సేవ లందించిన పోలీస్ డాగ్ టీనా వృద్ధాప్య సమస్యలతో మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఇది ల్యాబ్ బ్రీడ్ జాతికి చెందిన ఫీమేల్ జాగిలం. టీనా మృతదేహానికి దిన్నెదేవరపాడు శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఏఆర్ పోలీసు అధికారులు, డాగ్ స్క్వాడ్ పోలీ సుసిబ్బంది కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందు పాతరలను పసిగట్టడంలో టీనా దిట్ట. వివిధ వీఐపీ బందోబస్తులో, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి బందోబస్తు విధులలో మంచి సేవలు అందించింది. ఎన్నికల విధులు, శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు, వీఐపీ విజిట్స్, మంత్రాలయం, తిరుమల బ్రహ్మోత్సవాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిందని టీనా సేవలను పోలీసు అధికారులు కొనియాడారు.2013లో పది నెలల పాటు తెలంగాణ, మొయినాబాద్ ఐఐటీఏలో కఠోరశిక్షణ పూర్తి చేసుకుని 2014లో జిల్లాకు వచ్చింది. -
చంద్రబాబు ద్రోహంతో సీమ భవిష్యత్ ప్రశ్నార్థకం
పాణ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహంతో రాయలసీమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. సీమలో కరువును తరిమికొట్టేందుకు 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘రాయలసీమ ఎత్తిపోతల’ ప్రాజెక్ట్ను తెలంగాణకు తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈనెల 5వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం పోస్టర్లను మంగళవారం పాణ్యం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్బాషా, పార్టీ నేతలతో కలసి కాటసాని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయంలో 800 అడుగులు నీరు ఉండగానే తెలంగాణ ప్రభు త్వం ప్రాజెక్టులకు నీరు మళ్లించి వాడుకుంటుందన్నారు. అదే తరహాలోనే రాయలసీమకు సాగు, తాగునీటిని అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారన్నారు. దాదాపుగా రూ. 3వేల కోట్లకు పైగా వెచ్చించి 70 శాతం పనులు పూర్తి చేశారన్నారు. ప్రాజెక్టుకు మో టార్లు అమర్చితే ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతలను తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని చెప్పినా ఇంత వరకు చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. బాబు చేసిన ద్రోహం సీమ ప్రజలు గుర్తు పెట్టుకుని బుద్ధి చెబుతారన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ సీమ ప్రజల హక్కు ఐదు ఉమ్మడి జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలను తీర్చే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ సీమ ప్రజల హక్కు అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రాజెక్ట్ను సాధించుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్రెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డితో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీమ ప్రాజెక్ట్లకు ప్రాణం పోశారన్నారు. నాలుగు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే కారణంతోనే పనులు నిలిపేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ను సాధించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి భారీగా తరలివచ్చి ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు సద్దల సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ ఉసేన్బీ, వైస్ ఎంపీపీ పార్వతమ్మ, మండల కన్వీనర్ కరుణాకర్రెడ్డి, రామలక్ష్మయ్య, సుబ్బరాయుడు, శేషారెడ్డి, బాలిరెడ్డి, రామచంద్రుడు, అశోక్రెడ్డి, కృష్ణారెడ్డి, జయచంద్రారెడ్డి, భాస్కర్, చంద్రశేఖర్రెడ్డి, నాగేంద్ర, శ్రీనివాసరెడ్డి, బాలస్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పునఃప్రారంభించాలని ఈనెల 5వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ సభకు పార్టీలకతీతంగా రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్య కర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజ యవంతం చేయాలన్నారు.బహిరంగ సభకు తరలిరండి -
నంద్యాల టూటౌన్ సీఐ ఓవరాక్షన్
నంద్యాల: చికెన్ సెంటర్ల దుకాణ యజమానుల వివాదంలో నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్బాషా తలదూర్చి ఓవరాక్షన్ చేసి బాధితులపై దాడి చేయడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. బాధితురాలు రేణుక తెలిపిన మేరకు.. ఎస్బీఐ కాలనీలో జయరామిరెడ్డి, శివరామిరెడ్డిలకు చెందిన రెండు చికెన్ దుకాణాలు ఉన్నాయి. వీరి మధ్య వ్యాపార విషయంలో ఇటీవల విభేదాలు వచ్చాయి. శివరామిరెడ్డి తమ దుకాణంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, జయరామిరెడ్డి బంధువులు ఇంటి వద్దకు ఆదివారం రాత్రి అడిగేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న సీఐ అస్రార్బాషా గుమిగూడిన ప్రజలను చెదరగొట్టారు. ఈ క్రమంలో బాధితురాలు రేణుకను గొంతు పట్టుకొని షెట్టర్కు ఆనించి దాడి చేశారు. అక్కడే ఉన్న పూల వ్యాపారిని, రేణుక తమ్ముడు హేమేష్రెడ్డిలను రోడ్డుపైనే దాడి చేశారు. అనంతరం వారిని టూటౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. టూటౌన్ పోలీసు స్టేషన్ బయటి నుంచే తనను కొట్టుకుంటూ తీసుకెళ్లారని, స్టేషన్లోకి వెళ్లాక గొంతుపై, మెడపై బూటుకాలుతో తన్నారని హేమేష్రెడ్డి ఆరోపించారు. రోడ్డుపై సీఐ దాడి చేయడం అవమానంగా భావించిన రేణుక స్టేషన్ ఎదుటే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఈ విషయంపై సీఐ అస్రార్బాషాను వివరణ కోరగా.. 30మంది దాకా ఎస్బీఐ కాలనీలో గుమిగూడి ఉన్నారని, వారిలో చాలా మంది తాగి ఉండటంతో ఘర్షణ జరుగుతోందని తెలిసి చెదరగొట్టామన్నారు. తాము, సిబ్బంది ఎవరిపైన దాడి చేయలేదని, ఇరువర్గాలపై చర్యలు తీసుకుంటామన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
● ఎమ్మెల్సీ ఇసాక్బాషాబొమ్మలసత్రం: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, ప్రభుత్వ తీరును ప్రశ్నించి నేతల ఇళ్లపై గూండాలతో దాడులు చేయించడం ఇందుకు నిదర్శమని ఎమ్మెల్సీ ఇసాక్బాషా అన్నారు. తిరుమల లడ్డూపై వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులకు పాల్పడిన నిందితులపై కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మున్సిపల్ చైర్పర్సన్మాబున్నిసా వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి సోమవారం వన్టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఐ డానియల్రాజ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పవిత్రమైన తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలిసిందని కొంత కాలంగా అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ సర్వేలు పరీక్షలు జరిపి ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వులు కలవలేదని నివేదిక ఇవ్వడంతో అధికార పార్టీ నేతల జీర్ణించుకోలేక పోతున్నారు. భక్తులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఇంకా శ్రీవారి ప్రతిష్టను భంగం కలిగించేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం దౌర్భాగ్యమన్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలు తొలగించాలని కోరిన మాజీ మంత్రుల ఇళ్లపై టీడీపీ మూకలతో దాడులు చేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆందోళనలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, ఎమ్మెల్సీ తనయుడు హిరోజ్, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్రెడ్డి, మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు రసూల్ ఆజాద్, సెక్రటరీ దేవనగర్బాషా, జిల్లా ప్రచార కార్యదర్శి అనిల్ అమృతరాజ్, పార్టీ నాయకులు టీవై శివయ్య,కారు రవికుమార్, కలామ్బాషా, వహీద్ పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణా
● కేసు నమోదు చేసిన పోలీసులు పత్తికొండ: పశువులను అక్రమంగా కబేళాకు రవాణా చేస్తున్న కంటైనరును విశ్వహిందూ పరిషత్ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున పత్తికొండ పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎమ్మిగనూర్ నుంచి తమిళనాడుకు పశువులను కంటైనరులో గత కొద్ది రోజుల నుంచిఅక్రమంగా తరలిస్తున్నట్లు హిందూ సంఘాల నాయకులకు సమాచారం వచ్చింది. ఆదివారం రాత్రి నుంచి పత్తికొండ–ఆదోని రహదారిలో విశ్వహిందూ పరిషత్ నాయకులు కాపుకాశారు. అనుమానాస్పదంగా ఉండటంతో ఏపీ 39 టీఎస్ 7800 నంబర్గల కంటైనరు నిలిపి పరిశీలించారు. రెండు వరుస క్రమంలో పశువులను కంటైనర్లో తరలించడం గమనించి డ్రైవర్లును నిలదీశారు. పొంతన లేని సమాధానం రావడంతో అర్బన్ సీఐ జయన్నకు సమాచారం ఇచ్చా రు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం
శ్రీశైలం టెంపుల్: సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని దేవదాయ శాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి అన్నారు. సోమవారం శ్రీశైలంలోని శరణ బసవేశ్వర సత్రంలోని హాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, రోడ్లు, భవనాల వాఖ మంత్రి బీసీ.జనార్దనరెడ్డి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. అలాగే దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ హరిజవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, ట్రస్ట్బోర్డు చైర్మన్ రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, ట్రస్ట్బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ముందుగా దేవస్థాన ఈఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ నెల 8 నుంచి 18వ తేది వరకు నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఈ నెల 8 నుంచి 12వ తేది వరకు నిర్దిష్ట వేళల్లో స్పర్శదర్శనం కల్పిస్తామన్నారు. మంత్రి అనం మాట్లాడుతూ వీఐపీ, వీవీఐపీ, సిఫార్స్ లేఖల దర్శనాలకు ప్రత్యేక స్లాట్ కేటాయించి, నిర్ణయించిన సమయంలోనే దర్శనం కల్పించాలన్నారు. గత ఏడాది తరహాలోనే నాలుగు రోజుల పాటు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో టోల్గేట్ల వద్ద వాహనాలను ఉచితంగా అనుమతించాలని సూచించారు. ● మంచినీటి పైపులైన్లు ధ్వంసం సాక్షి టాస్క్ ఫోర్స్: అధికారంలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన టీడీపీ నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు మంచినీరు అందించే పైపులైన్లు ధ్వంసం చేశారు. దీంతో డోన్ మండంలోని వెంకటాపురం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు కొద్ది నెలల క్రితం మంచినీటి పైపులైను పగులగొట్టాడు. మరొక టీడీపీ నాయకుడు తానేమీ తక్కువ కాదు అన్నట్లు రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలో శివుని మాన్యం వద్ద ఉన్న మంచినీటి బోరు పైపులైను ధ్వసం చేశాడు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అని చెప్పుకుంటూ తిరుగుతున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్రెడ్డి గ్రామంలో మంచినీటి సమస్యలు పట్టవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైనా ప్రజలు తూతూ మంత్రంగా హాజరయ్యారు. మంచినీటి సమస్యపై గ్రామ ప్రజలు సోమవారం డోన్కు వచ్చి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆమె.. గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఎందుకు విజయవంతం చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామ ప్రజలు నిరుత్సాహంతో వెనుదిరిగారు. సమస్యను పరిష్కరించాల్సిన గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకుండి పోవడం ఆశ్చర్యం కల్గిస్తోందని గ్రామస్తులు తెలిపారు. కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధర క్రమంగా తగ్గుతోంది. జిల్లాలోని ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో వేరుశనగ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు అన్ని మార్కెట్ల్లో వేరుశనగ ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం మూడు మార్కెట్ల్లో కూడా ధరలు తగ్గడం గమనార్హం. ఎమ్మిగనూరు మార్కెట్లో గరిష్ట ధర రూ.6,980, ఆదోనిలో రూ.8,900, కర్నూలు మార్కెట్లో రూ.9,790 లభించింది. ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో వేరుశనగ ధర దయనీయంగా ఉండగా.. కర్నూలు మార్కెట్లో కాస్త మెరుగ్గా ఉంది. ఇటీవల క్వింటా వేరుశనగ ధర రూ.15వేల వరకు చేరుకుంది. పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు కర్నూలు(హాస్పిటల్): జాతీయ డీవార్మింగ్ డే సందర్భంగా ఈనెల 17న విద్యార్థులందరికీ నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ అనిల్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రోగ్రామ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్థులకు మాత్రలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా మాతా శిశు మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర అధికారులు డాక్టర్ నాగేంద్ర బాబు, డాక్టర్ మల్లికార్జున, డీపీఎంఓ డాక్టర్ శైలేష్ కుమార్, డెమో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. -
రూ.కోట్లలో ఆదాయం కోల్పోనున్న దేవస్థానం
శ్రీశైల దేవస్థానం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వ్యాపార దుకాణాలకు బహిరంగవేలం నిర్వహిస్తుంది. అయితే కొన్ని సందర్బాలో ప్రజాప్రతినిధుల సిఫార్స్, స్థానిక వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన తరువాత ప్రస్తుతం ఉన్న రెంట్కు 33శాతం పెంచి దుకాణాలు వారికే కేటాయిస్తారు. అలాగే మరికొన్ని సందర్భాలలో 50శాతం, 100శాతం అద్దె పెంచుతూ రెన్యువల్ చసిన సందర్బాలు ఉన్నాయి. అది కూడా దుకాణాల కాలపరిమితి పూర్తికాక ముందే వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఇలా చేస్తారు. ప్రస్తుతం 140దుకాణాల కాలపరిమితి పూర్తయింది. టెండర్లు సైతం నిర్వహించినప్పటికీ వాటిని అదే వ్యాపారులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. ఈ ప్రయత్నంతో దేవస్థానం ప్రతి ఏడాది రూ.కోట్లలో ఆదాయం కోల్పోనుంది. -
చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు దుర్మార్గం
నందికొట్కూరు: సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడటం దుర్మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జూపాడుబంగ్లా మండలం కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించేందుకు ఈ నెల 5వ తేదీన పోతిరెడ్డిపాడు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను సీఎం చంద్రబాబు నాయుడు నిలిపేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బాబు చీకటి ఒప్పందం ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో బట్టబయలు అయ్యిందన్నారు. సూపర్సిక్స్ను అమలు చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరితే అక్రమ కేసులు పెట్టి భయంబ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పాటుపడకుండా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడటం సరికాదన్నారు. సమావేశంలో జూపాడుబంగ్లా జెడ్పీటీసీ సభ్యుడు పోచా జగదీశ్వరరెడ్డి, సర్పంచు నాగార్జునరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు తిరుమలేరెడ్డి, మండ్లం రమణ, నక్క చిన్న మల్లయ్య, దినేష్, సురేష్, కదిరి పుల్ల్యయ, కృష్ణ, యశ్వంత్రెడ్డి, తరుణ్కుమార్రెడ్డి, సామేల్, గోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అసమర్ధతను ప్రశ్నిస్తే అక్రమ కేసులా రాయలసీమ ఎత్తిపోతల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తాం 5న పోతిరెడ్డిపాడు సభను విజయవంతం చేయండి వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి -
ఉపాధి కరువై.. ఊరు వదిలి!
కొత్తపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో రబీ సీజన్లో వ్యవసాయ పనులు అంతంత మాత్రమే ఉండటం, ఉపాధి హామీ పనుల వేతనాలు గిట్టుబాటు కాకపోవడంతో పల్లె ప్రజలు వలస బాటపడుతున్నారు. కొత్తపల్లి మండలంలో మొత్తం 35 వేల జనాభా కాగా సుమారు 10 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 80 శాతం వ్యవసాయంపై అధారపడి జీవనం సాగిస్తున్నాయి. కాగా గత ఖరీఫ్, రబీలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లింది. దీంతో వ్యవసాయ పనులు పెద్దగా లేవు. మరో వైపు గ్రామాల్లోనే ఉపాధి పనులు కల్పిస్తున్నామని వలసలు వివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారుల చెబుతున్నా ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఉపాధి వేతనం అరకొరగా పడటం, అది కూడా 15 రోజులకు ఇస్తుండటంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో మండలంలోని పలు గ్రామాల నుంచి దోర్నాల, కుంట, వినుకొండ, మాచర్ల, గుంటూరు ప్రాంతాల వైపు మిరకాయ కోత పనులకు మూటాముల్లె సర్దుకుని పోతున్నారు. మండలంలోని గుమ్మడాపురం, సింగరాజు పల్లె, వీరాపురం, గువ్వలకుంట్ల, బండినాయిని పాలెం ఇతర గ్రామాల నుంచి సుమారు 1500 కుటుంబాలు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. సింగరాజుపల్లె, గువ్వలకుంట్ల గ్రామం నుంచి ఐదు రోజుల్లోనే దాదాపు 200 మంది వలస వెళ్లారు. వ్యవసాయ కూలీలు బడి పిల్లలతో వలస వెళ్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంటి అవసరాల కోసం పొదుపులో లోన్లు తీసుకున్నాం. ప్రతినెల కంతులు కట్టాలంటే కచ్చితంగా పనులకు పోవాలి. మా ఊర్లో ఉపాధి పనులకు పోతే లోన్లు కట్టడం కష్టం. నేను, నా కోడలు కలిసి నెలకు సుమారు రూ. 15 వేలు పొదుపు కట్టాలి. వలస పోకపోతే ఇబ్బంది అవుతుంది. మేము ప్రతి సంవత్సరం జనవరి వచ్చిందంటే ఇతర ప్రాంతాల్లో పత్తి, మిరపకాయ తెంచేందుకు వలస వెళ్తాం. – చిట్టెమ్మ.. సింగరాజుపల్లి -
శ్రీశైలంలోబ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ పరిశీలించారు. సోమవారం శ్రీశైలంలోని పాతాళగంగ, రోప్వే, పార్కింగ్ ప్రదేశాలు, కోనేరు, స్నానఘట్టాలు, ఆలయ పరిసర ప్రాంతాలు, క్యూలైన్లను స్వయంగా పరిశీలించారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతిభద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రతే ప్రథమంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మహాశివరాత్రి పోస్టర్ల ఆవిష్కరణ బనగానపల్లె: మండలంలోని యాగంటి క్షేత్రంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామిదేవస్థానంలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రికి సంబంధించిన పోస్టర్లను బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. మాజీ సర్పంచ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, ఆలయ చైర్మన్ మౌళీశ్వర రెడ్డి, ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ మాజీ సర్పంచ్ రాజారెడ్డి మాట్లాడుతూ.. శివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు కోరారు. -
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
కర్నూలు(హాస్పిటల్): వైద్యులు అనవసర సిజేరియన్ శస్త్రచికిత్సలను తగ్గించి, సురక్షిత సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనరేట్ అదనపు డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ చెప్పారు. రాష్ట్ర మాతృ ఆరోగ్య ప్రాజెక్టులో భాగంగా అసిస్టెడ్ వైజెనల్ బర్త్ ద్వారా తల్లి–శిశు ఆరోగ్య ఫలితాల మెరుగుదలపై సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఐదో ప్రాంతీయ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో కర్నూలు, అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లా లు, గుంటూరు జీజీహెచ్ నుంచి వచ్చిన సెకండరీ స్థాయి ఆసుపత్రుల్లో పని చేస్తున్న 35 మంది ప్రసూతి వైద్యులు పాల్గొన్నారు. ఫెర్నాండెజ్ హాస్పిటల్కు చెందిన ప్రసూతి వైద్యులు డాక్టర్ పల్లవి చంద్రరావు, డాక్టర్ అనితారెడ్డి ఈ శిక్షణకు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు. అసిస్టెడ్ వైజెనల్ బర్త్కు సంబంధించిన సూచనలు, నిషేదాలు, వర్గీకరణ, ఫోర్సెప్స్, వాక్యూమ్ ప్రసవాలపై సమగ్ర శిక్షణ అందించారు. ఫెర్నాండెజ్ హాస్పిటల్కు చెందిన ఏవీబీ శిక్షణా కార్యక్రమాల ప్రోగ్రామ్ లీడ్ నీనా దొండపాటి ఈ శిక్షణా కార్యక్రమ నిర్వహణను సమన్వయం చేశారు. కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, గైనకాలజీ హెచ్ఓడీ డాక్టర్ సావిత్రి, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ శైలేష్కుమార్, రాష్ట్ర ఎంసీహెచ్ కన్సల్టెంట్ డాక్టర్ నాగేంద్ర పాల్గొన్నారు. -
ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు: కూటమి నేతల అరాచకాలు, టీడీపీ నాయకుల గూండాయిజం ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి హెచ్చరించారు. కల్తీ నెయ్యి అంశంపై సిట్ చార్జిషీట్కు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫొటోలతో తప్పుడు, అపవాదులు కలిగిన పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాటసాని ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణులు సోమవారం నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం కాటసాని మీడియాతో మాట్లాడుతూ లడ్డూ వివాదాన్ని డైవర్షన్ చేయడానికి టీడీపీ గూండాలు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాటిని కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోందన్నారు. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్లపై దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కాటసాని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతారహితంగా ఎలా మాట్లాడతారు? హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారని కాటసాని నిలదీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ప్రజల్లో అశాంతికి కారణమైందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రులు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ప్రజలు, మీడియా ముందు పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గుర్తింపు పొందిన ప్రయోగశాల నివేదికలు, తుది విచారణ ఫలితాలు లేదా చట్టపరమైన ఆధారాలను ప్రజల ముందు ఉంచకుండా ఆధార రహిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే ప్రభుత్వ తప్పుడు విధానాలపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు తెగబడుతున్నారన్నారు. రాజకీయంగా ప్రతిపక్ష నాయకులను మట్టుబెట్టేందుకు కుట్ర జరుగుతుందని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, 2029లో వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. తిరిగి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్లు ఏమి చేస్తున్నాయని నిలదీశారు. ఇలాంటి దౌర్జన్యాలకు వైఎస్సార్సీపీ భయపడదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సుదర్శన్ రెడ్డి, అరుణ, వెంకటేశ్వర్లు, నాయకులు హనుమంతు రెడ్డి, శివశంకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నంద్యాల టూటౌన్ సీఐ ఓవరాక్షన్
నంద్యాల: చికెన్ సెంటర్ల దుకాణ యజమానుల వివాదంలో నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్బాషా తలదూర్చి ఓవరాక్షన్ చేసి బాధితులపై దాడి చేయడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. బాధితురాలు రేణుక తెలిపిన మేరకు.. ఎస్బీఐ కాలనీలో జయరామిరెడ్డి, శివరామిరెడ్డిలకు చెందిన రెండు చికెన్ దుకాణాలు ఉన్నాయి. వీరి మధ్య వ్యాపార విషయంలో ఇటీవల విభేదాలు వచ్చాయి. శివరామిరెడ్డి తమ దుకాణంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, జయరామిరెడ్డి బంధువులు ఇంటి వద్దకు ఆదివారం రాత్రి అడిగేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న సీఐ అస్రార్బాషా గుమిగూడిన ప్రజలను చెదరగొట్టారు. ఈ క్రమంలో బాధితురాలు రేణుకను గొంతు పట్టుకొని షెట్టర్కు ఆనించి దాడి చేశారు. అక్కడే ఉన్న పూల వ్యాపారిని, రేణుక తమ్ముడు హేమేష్రెడ్డిలను రోడ్డుపైనే దాడి చేశారు. అనంతరం వారిని టూటౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. టూటౌన్ పోలీసు స్టేషన్ బయటి నుంచే తనను కొట్టుకుంటూ తీసుకెళ్లారని, స్టేషన్లోకి వెళ్లాక గొంతుపై, మెడపై బూటుకాలుతో తన్నారని హేమేష్రెడ్డి ఆరోపించారు. రోడ్డుపై సీఐ దాడి చేయడం అవమానంగా భావించిన రేణుక స్టేషన్ ఎదుటే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఈ విషయంపై సీఐ అస్రార్బాషాను వివరణ కోరగా.. 30మంది దాకా ఎస్బీఐ కాలనీలో గుమిగూడి ఉన్నారని, వారిలో చాలా మంది తాగి ఉండటంతో ఘర్షణ జరుగుతోందని తెలిసి చెదరగొట్టామన్నారు. తాము, సిబ్బంది ఎవరిపైన దాడి చేయలేదని, ఇరువర్గాలపై చర్యలు తీసుకుంటామన్నారు. చికెన్ సెంటర్ యజమానుల వివాదంలో సీఐ జోక్యం మహిళ, భర్త, తమ్ముడుపై నడిరోడ్డుపై చేయి చేసుకున్న సీఐ అవమాన భారంతో పురుగు మందు తాగి రేణుక ఆత్మహత్యాయత్నం -
పింఛన్ కోసం దివ్యాంగుడి పోరాటం
అతి కష్టంతోనే కర్నూలులోని కలెక్టరేట్కు వస్తున్న ఈయన పేరు పొలుకుంటయ్య. తుగ్గలి మండలం మారెళ్లకు చెందిన ఈయనకు రైల్వే ప్రమాదంలో ఐదేళ్ల క్రితం ఒక కాలు సగానికి తెగిపోయింది. దీంతో కట్టె సాయంతో ఒంటి కాలితోనే నడవాల్సి వస్తోంది. ఏ పని చేయడానికి రాదు. కుటుంబ సభ్యులపైనే ఆధారపడి జీవించాల్సి వస్తోంది. భార్య పిల్లలు కూలి పనికి వెళ్లితే వచ్చే సంపాదనతో బతకాల్సి వస్తోంది. రెండేళ్లుగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా. మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. దారుణమైన స్థితిలో ఉన్న తనకు ఆసరా కల్పించాలని కోరుతూ సోమవారం మరోసారి కలెక్టరేట్కు వచ్చి అధికారులకు అర్జీ ఇచ్చారు. – కర్నూలు(సెంట్రల్) -
సాక్ష్యం నమోదుకు దారేదీ?
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చే భక్తులు తప్పనిసరిగా సాక్షిగణపతిని దర్శించుకోవాలి. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నట్లు కైలాసంలో శివుడికి సాక్ష్యం చెబుతారని భక్తుల నమ్మకం. సాక్షి గణపతి స్వామిని దర్శించుకుంటే శ్రీశైల యాత్ర పూర్తవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో కొలువైన సాక్షి గణపతి స్వామి పుస్తకంలో రాస్తున్నట్లు కొలువై ఉంటారు. శ్రీశైల యాత్రకు విచ్చేసిన భక్తులందరి పేర్లను తన వద్ద ఉన్న పుస్తకంలో నమోదు చేసుకుని.. వీరంతా శివుడి దర్శనం చేసుకున్నారని కై లాసంలో స్యాక్షం చెబుతాడని భక్తుల నమ్మకం. స్వామి దర్శనం భక్తుల మనోభావాలు, అధ్యాత్మికతో ముడిపడిన విషయం. అయితే రద్దీ రోజుల్లో ట్రాపిక్ జామ్ పేరుతో పలువురు భక్తులు గణపతిని దర్శించుకోలేక వెనుతిరిగిపోతున్నారు. ఈ ఆలయం అటవీశాఖ పరిధిలోకి వస్తుందని, అక్కడ పార్కింగ్కు అటవీశాఖ స్థలం కేటాయించలేదు. దీంతో పలువురు భక్తులు గణపతిని దర్శించుకోకుండానే తమ యాత్రను ముగించుకోవాల్సి వస్తుంది. భక్తుల మనోభావాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ఆలయం వద్ద పూర్తిస్థాయిలో పార్కింగ్స్థలం లేకపోవడం, ట్రాఫిక్ సమస్యతో భక్తుల వాహనాలను నిలపకపోవడంతో చాలా వరకు భక్తులు తమ వాహనాలనుంచే ‘స్వామి శ్రీశైలం వచ్చి శివుడిని దర్శించుకుని వెళ్తున్నాం..రాసి పెట్టండి అని’ మనస్సులో తలచుకుని వెళ్తున్నారు. భక్తులు ఆలయానికి వచ్చి కనులారా స్వామిని దర్శించి, మనసారా తన కోర్కెలను చెప్పుకుందామంటే వీలుపడని పరిస్థితి. దీంతో మనస్సులోనే స్మరించుకోవాల్సిన పరిస్థితి. పార్కింగ్ స్థలం లేక భక్తుల అవస్థలు సాక్షి గణపతి ఆలయం వద్ద అక్కడ వాహనాలను నిలిపి గణపతిని దర్శించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసు అధికారులు ఆలయ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేయనీయడం లేదు. దీంతో దూర ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేసుకుని ఆలయానికి రావాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని రోజుల క్రితం అటవీశాఖ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినప్పటికీ ప్రతి నిత్యం వేలాది వాహనాల్లో భక్తులు శ్రీశైల యాత్రకు తరలివస్తుండటంతో ఆ స్థలం సరి పోవడం లేదు. ఈ ఆలయం ఉన్న ప్రదేశం అటవీశాఖ పరిధిలో ఉంది. దీంతో అటవీశాఖ పర్యావరణ–పరిరక్షణ పేరుతో సాక్షిగణపతి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు అనుమతించడం లేదు. ఈ సమస్య గత కొన్ని దశాబ్దాలుగా దేవదాయశాఖ, అటవీశాఖల మద్య జరుగుతునే ఉంది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్లో శ్రీశైలం అతిముఖ్యమైన ప్రదేశమని, ఎన్టీసీఏ గైడ్లెన్స్ ప్రకారం సాక్షిగణపతి ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేసేందుకు అనుమతించలేమని అటవీశాఖ మొండికేస్తుంది. కై లాసంలో ఉన్న శివుడికి సాక్ష్యం చెప్పే గణపతి సాక్ష్యం చెప్పకుండానే వెనుదిరుగుతున్న భక్తులు పార్కింగ్ స్థలం లేక అవస్థలు స్థలం కేటాయించని అటవీశాఖ పట్టించుకోని ప్రభుత్వంభక్తుల మనోభావాలు పట్టవా? జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో కలగలసిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం. ఇల కై లాస మైన శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడంతో భక్తులు ఆధ్యాత్మిక అను భూతి పొందుతారు. అలాగే శివుడిని దర్శించుకున్నట్లు సాక్షిగణపతి స్వామివారిని కూడా దర్శించుకోవడం సంప్రదాయం. అంతేకాకుండా భక్తుల మనోభావాలతో కూడిన విషయం కూడా. అయినప్పటికీ సాక్షిగణపతి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హిందూవాదినని, సనాతనధర్మాన్ని కాపాడుతా.. అని గొప్పలు చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయానా అటవీశాఖ మంత్రి అయినా కూడా భక్తుల మనోభావాలను పట్టించుకోకపోవడంపై పలువురు మండిపడుతున్నారు. అటవీ శాఖ స్థలాన్ని కేటాయిస్తే, దేవదాయశాఖ 1:2 నిష్పత్తిలో భూమి బదలాయింపు చేసే అవకాశం ఉంది. అయినా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పాల ఉత్పత్తిని పెంచేందుకు కృషి
కర్నూలు(అగ్రికల్చర్): పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేయాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ హేమంత్కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఆయన చాంబరులో పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ల 2026 వెటర్నేరియన్ డెయిరీ, క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరం కలసికట్టుగా రైతుల అభ్యున్నతికి కృషి చేద్దామన్నారు. కర్నూలు డివిజన్ డీడీ వసంతలక్ష్మి, జిల్లా అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.నాగరాజు, పశువైద్యుల సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఏడీలు మల్దన్న, ధనుంజయుడు, భవానిశంకర్రెడ్డి, పార్థసారథి, వెంకటసుబ్బయ్య, పశువైద్యులు చెన్నకేశవులు, మనోజ్, మదన్, సతీష్ పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ తప్పనిసరి కర్నూలు(సెంట్రల్): అకాడమిక్ పాస్ పోర్టుగా ఉపయోగపడే అపార్ ఐడీని ప్రతి విద్యార్థి కలిగి ఉండేలా చూడాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య వి.వెకటబసవరావు తెలిపారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ సహకారంతో యూనివర్సిటీ సెనేట్ హాలులో సోమవారం ఒక్క రోజు వర్కుషాపును ఆయ న ప్రారంభించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వం చేపట్టిన వన్ స్టూడెంట్–వన్ ఐడీ కార్యక్రమంలో అపార్ ఐడీ, నేషనల్ అకాడమిక్ డిపాడిటరీల ఏర్పాటు చేసినట్లు వీసీ వివరించారు. ప్రతి ఉన్న త విద్యా సంస్థ ఇందులో భాగస్వామ్యం కావాల ని కోరారు. విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ పరిశీలన మొదలైన అంశాలు సులభతం అవుతాయన్నా రు. సదస్సుకు ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలోని యూనివర్సిటీలు హాజరయ్యా యి. కాగా, డిజిలాకర్, అకడమిక్ బ్యాంకు ఆఫ్ క్రెడిట్స్, నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ, అపార్ ఐడీ మొదలైన అంశాలపై నోడల్ అధికారులు వివరించారు. అపార్ ఐడీ క్రియేషన్లో ఏమైనా సమస్యలు ఉంటే 18008893511కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ సమన్వయ కర్త రవిపాండే, వర్సిటీ రిజిస్ట్రార్ విజయకుమార్నాయుడు పాల్గొన్నారు. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు అదృశ్యం వెల్దుర్తి: పట్టణానికి చెందిన ఇద్దరు మిత్రులైన పదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలు... రాణితోటలో నివాసముంటున్న పాలిష్ కట్టర్ సలీం కుమారుడు హుసేన్బాషా, అలీబాషా కుమారుడు అబ్దుల్ రెహమాన్లు స్థానిక బాలుర హైస్కూల్లో చదువుతున్నారు. శనివారం పాఠశాలకు వెళ్లి ఇంటర్వెల్ సమయంలో ఇద్దరూ బయటకు వెళ్లారు. పాఠశాల నుంచి వెళ్లిన వారు ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబాల వారు గాలింపు చేసినా ఫలితం లేకపోవడంతో సోమవారం స్థానిక పోలీసులను ఆశ్రయించా రు. విద్యార్థులు కనిపించిన వారు 9121101118 కు తెలపాలని ఎస్ఐ నరేశ్ విన్నవించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచిత శిక్షణ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రేషన్కార్డు కలిగిన మహిళలకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్ధ డైరెక్టర్ కే.పుష్పక్ తెలిపారు. టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్న ట్లు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుకు ఈ నెల 4వ తేదీ వరకు అవ కాశం ఉందన్నారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు మహిళలు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నా రు. వివరాలకు 9000710508, 63044 91236 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు 237 మంది గైర్హాజరు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు సోమవారం 237 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 72 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 4,947 మంది విద్యార్థుల్లో 4,781 మంది హాజరై, 166 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 69 కేంద్రాల్లో నిర్వహించిన ప్రాక్టికల్స్కు 3917 మంది విద్యార్థుల్లో.. 3846 మంది హాజరై, 71 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు. -
మంచాలమ్మా.. దీవించమ్మా!
మంత్రాలయం: మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గ్రామ దేవత మంచాలమ్మను ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రంలోని మండ్యాలో తయారు చేయించిన బెల్లం అచ్చులు, చెరకు గడలు, గడ్డితో ఆదివారం అలకరించారు. విశేష పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం మహాద్వారం నుంచి ‘మంచాలమ్మా.. దీవించమ్మా’ అంటూ భక్తులు దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి, మహా మంగళ హారతి చేశారు. బళ్లారి జిల్లా తెక్కల కోటకు చెందిన ఏడు వందల మంది భక్తులు కాలి నడకతో 120 కిలో మీటర్లు దూరం నుంచి రాఘవేంద్ర స్వామి మఠం చేరుకున్నారు. -
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం
నంద్యాల (న్యూటౌన్): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలోని 73 కేంద్రాల్లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షకు 2,237 మంది విద్యార్థులకు గాను 2,133 మంది హాజరు కాగా 104 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,717 మందికి గాను 1688 మంది హాజరు కాగా.. 29 మంది గైర్హాజరయ్యారు. పబ్లిక్ ప్రాక్టికల్స్ పరీక్షలను అన్ని పరీక్ష కేంద్రాల్లో సజావుగా నిర్వహించినట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. సీసీ కెమెరా నిఘాలో పడక్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రంలో పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగాసదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్రోడ్డు, ఫిల్టర్బెడ్, సిద్ధరామప్ప కొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ’ కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడ సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. వినియోగదారులు నంబరుకు 73826 14308 పోన్చేసి సమస్యలను తెలియచేస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సీమ ద్రోహి చంద్రబాబు
నందికొట్కూరు: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు అడ్డుకున్న సీఎం చంద్రబాబు నాయుడు సీమ ద్రోహిగా నిలిచారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పునఃప్రారంభించాలని ఈనెల 5వ తేదీన పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఆదివారం కాటసానితో పాటు పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా తదితరులు పరిశీలించారు. అంతుకు ముందు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాటసాని మాట్లాడారు. ‘రాయలసీమ రైతులను ఆదుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎంతో కృషి చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో 2022లో ప్రారంభించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు 80 శాతంపైగానే పూర్తయ్యాయి. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. గుంటూరులో టీడీపీ శ్రేణులు వివాదాస్పద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసం. ఆ ఫ్లెక్సీని తొలగించాలని కోరిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీ మూకలు దాడి చేయడం పిరికిపంద చర్య. పోతిరెడ్డిపాటు వద్ద ఈ నెల 5న జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ.. సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా తిరుమల లడ్డూలో కల్తీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ఆ ఫ్లెక్సీ కట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా, దానిని తొలగించాలని కోరిన అంబటిపై దాడి చేయడం సిగ్గు చేట న్నారు. సమావేశంలో జెడ్పీటీసీలు సోమల సుధాకర్రెడ్డి, జగదీశ్వరెడ్డి, యుగంధర్రెడ్డి, కౌన్సిలర్లు కృష్ణ, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, ముస్లిం మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ జబ్బార్, పట్టణ అధ్యక్షులు మన్సూర్, నాయకులు శివరామకృష్ణారెడ్డి, పుల్యాల నాగిరెడ్డి, లోకేష్రెడ్డి, తులసిరెడ్డి, రమణ, గోపాల్రెడ్డి, వెంకటేష్, మాధురి పాల్గొన్నారు. రైతు శంఖారావం సభకు తరలిరండి!జూపాడుబంగ్లా: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగించాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న రైతు శంఖారావం సభకు తరలిరావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిషోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషాతో కలసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వారి వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్వరరెడ్డి, అధికార ప్రతినిఽధి నాగార్జునరెడ్డి, మండల కన్వీనర్ తోకల కృష్ణారెడ్డి, తరుణ్కుమార్రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. బాబు పాలనలో రాష్ట్రం అధోగతి డైవర్షన్ రాజకీయాల్లోనే ఫ్లెక్సీ వివాదం 5న పోతిరెడ్డిపాడు సభను విజయవంతం చేయండి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూల్రెడ్డి -
‘సూక్ష్మ’ ఊతం.. సాగుకు దైన్యం
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బడ్జెట్లో సూక్ష్మ పరిశ్రమలకు ఊతం ఇచ్చినా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో మౌలిక వసతుల కల్పనపై స్పష్టత రాలేదు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఎయిర్పోర్టు అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన మేరకు నిధులను సాధించడంలో కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కూటమి పార్టీ నేతలు విఫలమయ్యారని తేటతెల్లం అయ్యింది. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కేంద్ర బడ్జెట్లో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు విరివిగా ప్రోత్సాహకాలు ఇచ్చారు. స్టార్టప్ పరిశ్రమలకు ఇప్పటి వరకు ఇచ్చే రూ.10 కోట్ల రుణాన్ని రూ.20 కోట్ల వరకు పెంచారు. జిల్లాలో ఇవి 1500 ఉన్నాయి. మరోవైపు ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చారు. జిల్లాలో 5 వేలకు పైగా ఎంఎస్ఎంఈలు నడుస్తున్నాయి. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో మౌలిక వసతుల కల్పనపై స్పష్టత లేకపోవడంతో ఎంపీలు వివరణ కోరాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడకు నేరుగా రైలు లేదు కర్నూలు నుంచి రాజధాని అమరావతి(విజయవాడ)కి వెళ్లేందుకు నేరుగా రైలును కేటాయించలేదు. అలాగే 48 ఏళ్లుగా ప్రతిపాదన ఉన్న కర్నూలు–మంత్రాలయం కొత్త రైల్వేలైన్, పంచలింగాల సమీపంలో నిర్మాణంలో ఉన్న రిహబులిటీ వర్కుషాపునకు నిధులు ఇవ్వలేదు. కాచిగూడ – గుంటూరు ఎక్స్ప్రెస్ను విజయవాడ వరకు పొడిగించాలనే డిమాండ్ను పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చైన్నె హైస్పీడు రైళ్లు కర్నూలు మీదుగా వెళ్లే అవకాశం ఉంది. వేతన జీవులకు ఊరట కర్నూలు జిల్లాలో ట్రేజరీ ద్వారా 28,895 మంది, కార్పొరేషన్ల ద్వారా మరో 5 వేల మంది ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు. బడ్జెట్లో ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా పన్ను శ్లాబులను సవరించారు.రూ.12.75 లక్షల వరకు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. దీంతో దాదాపు 20 వేల మందికి పన్ను నుంచి మినహాయింపు కలిగే అవకాశం ఉంది. జిల్లాకో బాలికల హాస్టల్ జిల్లాలో 6,20,658 లక్షల మంది రైతులు ఉన్నారు. ధరలు పతమైన సమయంలో కంది, మినుములను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి, అధికోత్పత్తి వంగడాల సృష్టి కోసం ప్రత్యేక జాతీయ మిషన్ ఏర్పాటు చేస్తామని, పత్తి ఉత్పాదను పెంచేందుకు జాతీయస్థాయిలో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. జిల్లాకో బాలికల హాస్టల్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర విభజన తరువాత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఊతమివ్వని బడ్జెట్ ఇది. ఏపీ, తెలంగాణలకు పెద్దగా ఉపయోగపడని బడ్జెట్ ఇది. విశ్వ విద్యాలయాలకు ఏమాత్రం నిధులు లేవు. కర్నూలు రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. ఇది ప్రాంతీయ అసమానతలకు దారి తీసే అవకాశం. పరిశ్రమలు, వ్యవసాయానికి చేయూతను ఇచ్చారు. ఎయిర్పోర్టు అభివృద్ధికి ఏ మాత్రం నిధులు ఇవ్వలేదు. – మన్సూర్ రెహమాన్, రిటైర్డ్ ఎకనామిక్ప్రొఫెసర్, కర్నూలు కేంద్ర బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీకి గుండుసున్నా నిధులు వచ్చాయి. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ, ఇది సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని బడ్జెట్. ఎన్నికలు ఉన్నా తమిళనాడు, కేరళ, బెంగాల్ రాష్ట్రాల కోసమే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏపీకి ఒక్కప్రాజెక్టకు నిధులు లేవు .– బి.గిడ్డయ్య, జిల్లా కార్యదర్శి, సీపీఐ కేంద్ర బడ్జెట్పై మిశ్రమ స్పందన సూక్ష్మ పరిశ్రమలకు లబ్ధి చేకూరే అవకాశం సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సాధించడంలో వైఫల్యం -
గ్రూప్–1లో నంద్యాల మహిళ జయకేతనం
నంద్యాల(న్యూటౌన్): గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ చూపి నంద్యాల ఎన్జీవో కాలనీకి చెందిన మౌనిక ఎంపిడిఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. బీటెక్ పూర్తయిన తర్వాత ఈమె ఎంబీఏ చదివారు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో ఐదుసార్లు స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకునఆనరు. కొంత కాలం పోస్టల్ శాఖలో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ శాఖలో పనిచేస్తూ ఏపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధం అయ్యారు. పరీక్షలో విజేతగా నిలవడానికి బెంగళూరులో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్గా పనిచేస్తున్న తన భర్త కృష్ణకాంత రెడ్డి, తల్లిదండ్రులు లక్ష్మీమోహన్ రెడ్డి, సౌజన్య కుమారిల ప్రోత్సాహం కారణమని మౌనిక తెలిపారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట
● కలెక్టరేట్లో నూతన ‘రెవెన్యూ క్లినిక్’ సేవా కౌంటర్ల ప్రారంభంనంద్యాల: జిల్లాలో ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలను వేగవంతంగా, సులభంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన రెవెన్యూ క్లినిక్, సేవా కౌంటర్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ప్రారంభించారు. కలెక్టరేట్లోని పీజిఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ల ప్రారంభ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతన షెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ నూతన కౌంటర్ల ద్వారా అర్జీల స్వీకరణ ప్రక్రియ మరింత సరళంగా, పారదర్శకంగా మారుతుందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులు వ్యయ ప్రయాసలు లేకుండా తమ సమస్యలను త్వరగా విన్నవించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ● మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శ్రీశైలం: ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహరీ గోడను కూల్చి వేయడం దారుణమని, బ్రాహ్మణులు అంటే చులకనగా కనిపిస్తున్నారా అని దేవస్థానం అధికారులను వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. విజయవాడ దుర్గ గుడికి సంబంధించిన భూములు మొదలుకొని విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి సంబంధించిన వేలకోట్ల విలువైన భూములను టీడీపీ పందేరం చేస్తోందని విమర్శించారు. కరివేన సత్రం ప్రహరీ గోడ కూల్చివేతను సమాచార లోపం అని దేవస్థానం అధికారులు కప్పిపుచ్చుకోవడం సబబు కాదన్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన ఏసీ చంద్రశేఖర్ రెడ్డిని ఆ స్థానం నుంచి తప్పించడం కాదని, సస్పెండ్ చేయాలన్నారు. సత్రం పరిశీలనకు వచ్చిన తనను పోలీసులు, దేవస్థానం సెక్యూరిటీ గార్డులు అడుగడుగునా అడ్డుకోవడం దారుణం అన్నారు. మూడు రోజుల క్రితం శ్రీశైలం ఎమ్మె ల్యే ప్రధాన పురవీధిలో విలేకరులతో మాట్లాడారని, తాను కాటేజీలో ఉండి ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. శ్రీశైలంలో నేడు శ్రీశైల గిరిప్రదక్షిణ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో మాఘమాస పౌర్ణమి పురస్కరించుకుని ఆదివారం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభవుతుందన్నారు. యాత్రికులు, స్థానికులు ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రమాద రహిత డ్రైవర్లకు అవార్డుల ప్రదానం నంద్యాల (వ్యవసాయం): ప్రమాద రహిత డ్రైవరులకు (యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్) అవార్డులను జిల్లా రవాణాధికారి రజియా సుల్తానా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ఏడు డిపోల్లో 21 మంది డ్రైవర్లు, జిల్లా స్థాయిలో ముగ్గురు.. మొత్తం 24 మంది డ్రైవర్లు అవార్డులు అందుకున్నారన్నారు. అనంతరం జాతీయ రహదారి భద్రతా మాస ఉత్సవాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఎఫ్ఓ శంకర్ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా పాల్గొన్నారు. -
గ్రూప్–1, గ్రూప్–2 విజేతలుగా అక్క, చెల్లెలు
నందికొట్కూరు: గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు అక్క, గ్రూప్–2లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు చెల్లెలు ఎంపికయ్యారు. మిడుతూరు మండలం జలకనూర్ గ్రామానికి చెందిన తొగట ఎల్ల చంద్రుడు, స్వర్ణలలిత దంపతులకు చెందిన ఇద్దరు కుమార్తెలు విజేతలుగా నిలిచారు. పెద్ద కుమార్తె తొగట ప్రియాంక రెండు సార్లు గ్రూప్–1 రాసినా విజయం సాధించలేదు. మూడో సారి రాసి విజయం సాధించారు. చిన్న కుమార్తె తొగట సాహితీ గ్రూప్–2 మొదటి సారి రాసి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. ఒకే కుటుంబంలో గ్రూప్–1, గ్రూప్–2లో విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దండ్రి తొగట ఎల్ల చంద్రుడు వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పని చేసి పదవీ విరమణ పొందారు. తల్లి స్వర్ణలలిత గుంటూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో ఐసీటీసీ కౌన్సెలర్గా పని చేసి మూడు నెలల క్రితం నందికొట్కూరు గవర్నమెంట్ ఆసుపత్రికి బదిలీపై వచ్చారు. తొగట ప్రియాంక, తొగట సాహితీ -
పాప ప్రక్షాళన చేసుకోండి
తిరుపతి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చేశారని, వారు తమ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హితువు పలికారు. కృష్ణగిరి మండలం కర్ల కుంట గ్రామం తిరుమలరాయుడు స్వామి దేవాలయంలో శనివారం ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ఎదుట టెంకాయలు కొట్టారు. భక్తుల మనోభావాలను గాయపరిచిన ‘కూటమి’ నేతలు బహిరంగ క్ష మాపణ చెప్పాలనే పోస్టర్ను అవిష్కరించారు. హిందువుల మనోభావాలను కించపరచిన సీఎంచంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంలు తిరుమలలో ముక్కును నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి
దేవుడి పేరు చెప్పుకుని ప్రజలను మభ్య పెడుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లకు మంచి బుద్ధిని ప్రసాదించు స్వామీ అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి కోరారు. ఆదోని పట్టణంలోని ఇంద్రనగర్లో కొలువై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వెంకటేశ్వరస్వామికి టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అరాచకాలు తారాస్థాయికి చేరాయన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక మహిళను అత్యాచారం చేసి ఐదుసార్లు అబార్షన్ చేయించిన ఘనత ఆ ఎమ్మెల్యేకే చెల్లించిందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. -
ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీయడం ఘోర అపచారం
● మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మంత్రాలయం రూరల్: రాజకీయ స్వార్ధం కోసం తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేశారని, ఇది ఘోర అపచారం అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. రాంపురం గ్రామంలో కార్యకర్తలతో కలసి శ్రీ రామలింగేశ్వర ఆలయం ఎదుట టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ.. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు మహా పాపానికి ఒడిగట్టారన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని, స్వామివారి ప్రసాదాన్నే ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. గతంలో చంద్రబాబు అలిపిరి సంఘటన నుంచి బయటకు వచ్చిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక సభ్యుడు పురుషోత్తంరెడ్డి, జిల్లా కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, హనుమాపురం ఈరన్న, మంత్రాలయం మండల కన్వీనర్ భీమారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
శ్రీవారి లడ్డూను రాజకీయ లబ్ధికి వాడుకోవడం దుర్మార్గం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి చిప్పగిరి: శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ దైవమని, స్వామి ఆలయంలో ప్రసాదంగా భక్తులకు అందించే లడ్డూనూ కూడా రాజకీయ లబ్ధి కోసం సీఎం చంద్రబాబు వాడుకోవడం దుర్మార్గమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో 101 కొబ్బరి కాయలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక్క అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. ఆధారం లేకుండా తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ఎలా అరోపణలు చేస్తారని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటూ గుడి మెట్లను శుభ్రం చేసి నటించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సీబీఐ సిట్ చార్జిషీట్పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బుసినే శ్రీరాములు, వెంకటేష్, సర్వర్ఖాన్, సేనాపతి, జయన్న, మహానంది, నెట్టికంటి తదితరులు పాల్గొన్నారు. -
దేవుడంటే బాబుకు నమ్మకమే లేదు
బొమ్మలసత్రం: తిరుమల పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని నిరాధారమైన ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు దేవుడంటే నమ్మకం లేదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి అన్నారు. పట్టణంలోని గుడిపాటిగడ్డ వీధిలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవితో పాటు ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శిల్పా రవి మాట్లాడుతూ.. తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూప్రసాదాన్ని రాజకీయానికి వాడుకోవడం తగదన్నారు. రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేశం సుదాకర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన కుమార్తె
● డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన ప్రియంవద ఆత్మకూరు: తన తండ్రికి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఓ యువతి అహర్నిశలు శ్రమించారు. ఇటీవల విడుదలైన గ్రూప్–1 పరీక్షల్లో విజేతగా నిలిచి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన పెసల హరిబాబుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థానం సాధించాలని కుమార్తెలకు చెప్పేవారు. గ్రూప్–1 పోస్టు సాధించాలని మూడో కుమార్తె ప్రియంవదను ప్రోత్సహించేవారు. అయితే 2020లో ప్రపంచాన్ని వణికించిన కరోనా హరిబాబును కాటేసింది. దీంతో పెదనాన్న పెసల దామోదరయ్య తన తమ్ముడి కుమార్తె ప్రియంవద చదువు బాధ్యతను తీసుకున్నారు. చిరు వ్యాపారం చేస్తూనే చదువుపై ధైర్యం కోల్పోకుండా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఆత్మకూరులో పదోతరగతి చదివిన ప్రియంవద హైదరాబాద్లో ఇంటర్, డిగ్రీ, ఏంబీఏ పూర్తి చేశారు. సివిల్స్కు కోచింగ్ తీసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. బాధను దిగమింగుకుంటూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగారు. గ్రూప్–1 పరీక్షలో విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. -
దురుద్దేశంతోనే..
ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేక, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేసిందని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూలో వినియోగించిన నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వ నేతల వక్రబుద్ధి మారాలని కోరుతూ శనివారం రుద్రవరం మండలం శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పరిహార పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ నుంచి రుద్రవరం చేరుకున్న ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి గ్రామ శివారు నుంచి దేవాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరి కాయలు కొట్టారు. -
సీమకు ఎత్తిపోతల పఽథకాలతోనే న్యాయం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, చిత్రంలో పార్టీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు కర్నూలు(టౌన్): ‘‘సీమ ప్రజలకు సాగు, తాగునీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు. తెలంగాణతో కుమ్మక్కయ్యాడు. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వెంటనే ప్రారంభించాలి. లేకపోతే రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతాడు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. సీమ ప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గ్రేటర్ రాయలసీమకు చెందిన అన్ని జిల్లాల రైతులు, ప్రజలు కలిసి వచ్చే నెల 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. గురువారం కల్లూరులోని నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతం రాయలసీమలో వర్షపాతం కూడా తక్కువేనన్నారు. ఈ కారణంగా ప్రతి ఏటా వ్యవసాయంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రాయలసీమలో ప్రాజక్టుల పట్ల ఈ ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుందన్నారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రతిపక్ష పార్టీగా రాయలసీమ ప్రాంతంలో వెంటనే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించేంత వరకు ఉద్యమబాట పడుతున్నట్లు స్పష్టం చేశారు. రేవంత్ వ్యాఖ్యాలపై నోరు మెదపరేం? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నాలుగు గోడల మధ్య చంద్రబాబుతో కలిసి రాయలసీమలో లిఫ్ట్ పనులు నిలిపివేసినట్లు ప్రకటించారని మాజీ మంత్రి బుగ్గన గుర్తు చేశారు. సీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసే ఈ వాఖ్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సీమ ప్రాంతంలో లిఫ్ట్ పనులు పూర్తయితే సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలగుతాయన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి లిఫ్ట్ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. కేవలం కక్షతోనే చంద్రబాబు నాయుడు ఈ పనులు నిలిపివేశారన్నారు. సమావేశంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరుపాక్షి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి(శ్రీశైలం), కాటసాని రామిరెడ్డి(బనగానపల్లె), కంగాటి శ్రీదేవి(పత్తికొండ), కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుకా, నందికొట్కూర్ ఇన్చార్జి దారా సుధీర్, ఆదిమూలపు సతీష్(కోడుమూరు), రాజీవ్ రెడ్డి, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి (ఎమ్మిగనూరు), పార్టీ నగర అధ్యక్షులు అహమ్మద్ ఆలీఖాన్ పాల్గొన్నారు. ఆశలను ‘నీరు’గార్చారు మాజీ మంత్రి బుగ్గన, కాటసాని రాంభూపాల్ రెడ్డి వెల్లడి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులు భారీగా రావాలి లేదంటే రాయలసీమ ఎడారిగా మారుతుంది శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీరు చేరకముందే తెలంగాణకు తరలిస్తున్నారురాయలసీమకు న్యాయం జరగాలంటే ఎత్తిపోతల పథకాలతోనే సాధ్యమని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సీమకు అన్యాయమే జరుగుతోందన్నారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు సీమ ప్రజలకు అన్యాయం చేశాడని విమర్శించారు. ఆయన హయాంలో ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించలేదన్నారు. మళ్లీ 2014–19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మరోసారి సీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో సాగునీటి ప్రాజక్టులు, ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకున్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో సీమ ప్రాంత అభివృద్ధికి రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగులకు నీరు చేరక ముందే తరలిస్తున్నారన్నారు. దీన్ని అధిగమించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారన్నారు. 22 టీఎంసీలు సీమకు రావాలని, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయకపోతే కరువుతో సీమ ప్రాంతం అల్లాడుతుందన్నారు. -
15 నిమిషాలకే రిజిస్ట్రేషన్
కర్నూలు (సెంట్రల్): నాట్ బుకింగ్ విధానంతో 15 నిమిషాలకే రిజిస్ట్రేషన్ పత్రిక ముగుస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్ కుమార్ విక్రయదారులకు సూచించారు. గురువారం ఆయన కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు విక్రయదారులకు 15 నిమిషాలకే పూర్తయిన రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేయాలన్నారు. ఆయన వెంట కర్నూలు సబ్ రిజిస్టర్ శ్రీనివాసరావు, కల్లూరు సబ్ రిజిస్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. -
కందిపప్పు.. కరువే!
నంద్యాల(అర్బన్): చౌక దుకాణాలకు సబ్సిడీపై అందించే కందిపప్పు సరఫరాను చంద్రబాబు ప్రభుత్వం 18 నెలలుగా నిలిపివేసింది. దీంతో రేషన్ దుకాణాలకు వెళ్లిన లబ్ధిదారులు కందిపప్పు లేక నిరాశగా తిరిగివస్తున్నారు. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్లో కంది పప్పు కిలో ధర రూ.180 పలికింది. ఈ సమయంలో సబ్సిడీపై ప్రజలకు అందజేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అధిక ధరకు కోట్ చేస్తారన్న భయంతో పూర్తిగా పంపిణీయే వద్దనుకుంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో రూ.120 ఉంది. ధర తగ్గినప్పుడైనా సబ్సిడీపై చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. నిజానికి కంది పప్పు సబ్సిడీపై కిలో రూ.67కు అందించాలి. ఆంటే ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో హోల్సేల్లో కొన్నా కిలో రూ.100కు లభిస్తుంది. అది కొని ప్రజలకు పంపిణీ చేసినా రూ.30కి మించి ప్రభుత్వంపై భారం పడదు. అయినా తగిన చర్యలు తీసుకోవడం లేదంటే ప్రజా సంక్షేమంపై ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా 1,204 రేషన్ దుకాణాలు ఉన్నాయి. సుమారుగా 5.41లక్షల రేషన్ కార్డులున్నాయి. రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి నెలా 531.729 టన్నుల కందిపప్పు అవసరం ఉంది. ప్రతి నెలా 20వ తేదీ లోపు రేషన్ డీలర్లు డీడీలు తీసి, అవసరమైన సరకులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. రేషన్ డీలర్లు డీడీలు తీస్తున్నా.. పౌరసరఫరా శాఖ మాత్రం కంది పప్పుకు సంబంధించిన డీడీలు తీయ్యొద్దంటూ డీలర్లకు ఆదేశిస్తుంది. కేవలం అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సరఫరా చేస్తుంది. బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు కావాలని ప్రజలు రేషన్ షాపు డీలర్లను అడుగుతుంటే తమకే రాలేదన్న సమాధానం వస్తోంది. ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు కందిపప్పు రేషన్ దుకాణాల ద్వారా తీసుకెళ్లలేని పరిస్థితి వచ్చిందంటూ కార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలపై భారం... చౌక దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లకు కందిపప్పు సరఫరా నిలిచి పోవడంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలు పెట్టి కొనాల్సివస్తోంది. జిల్లా వ్యాప్తంగా 7 ఎంఎల్ఎస్ (మండల స్థాయి స్టాక్ పాయింట్లు) పాయింట్ల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ఎంఎల్ఎస్ పాయింట్లో కూడా కిలో కందిపప్పు కూడా లేకపోవడం గమనార్హం. చౌక దుకాణాలకు 18 నెలలుగా నిలిచిపోయిన సరఫరా జిల్లాకు 531.729 టన్నులు అవసరం ఇప్పటి వరకు ఎంఎల్ఎస్ పాయింట్లకు అందని వైనం -
శ్రీగిరిలో సౌకర్యాలు కను‘మరుగు’
● పే అండ్ యూజ్ పద్ధతిలో మరుగుదొడ్లు ● భక్తులకు తొలగని కష్టాలు శ్రీశైలంటెంపుల్: భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో శ్రీశైల దేవస్థాన పాలకమండలి సభ్యులు, అధికారులు విఫలమయ్యారు. భక్తలు మరుగుదొడ్లకు వెళితే రూ.10, స్నానానికి వెళ్తే రూ.20 చెల్లించాల్సి వస్తోంది. శ్రీశైలానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తారు. క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని స్వామి దర్శనానికి వెళ్తారు. వసతి గదులను పొందేందుకు తమ వద్ద ఆర్థిక స్థోమత లేని భక్తులు క్షేత్ర పరిధిలో దేవస్థానం ఏర్పాటు చేసిన టాయిలెట్లు, మరుగుదొడ్లపై ఆధారపడతారు. అయితే క్షేత్ర పరిధిలో ఎక్కడా ఉచిత మరుగుదొడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే! శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ సరిపడా వసతి గదులు లేవు. దీంతో స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు స్నానాధికాలకు సామూహిక టాయిలెట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. శ్రీశైల క్షేత్రంలో శివసదనం, ఔటర్రింగ్రోడ్డు, పార్కింగ్ ప్రదేశాల వద్ద, పుష్కరిణి సమీపంలో, శ్రీశైలం పీహెచ్సీ ఎదురుగా, ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద, అమ్మవారి ఆలయం వెనుక, టూరిస్టు బస్టాండ్ వద్ద, హెచ్పీసీఎల్ పెట్రోల్బంక్ వద్ద ఇలా పలుచోట్ల మొత్తం సుమారు 800టాయిలెట్లు ఉన్నాయి. ఆయా టాయిలెట్లను వినియోగించుకుంటే టాయిలెట్కు రూ.10, స్నానానికి రూ.20వెచ్చించాల్సిందే. క్షేత్ర పరిధిలో ఉన్న 678టాయిలెట్లకు పారిశుద్ధ్య విభాగం ద్వారా దేవస్థానం టెండర్ పిలిచారు. సంవత్సరానికి రూ.24లక్షల చొప్పున దేవస్థానానికి చెల్లించేలా టెండర్లో పొందుపర్చారు. క్యూకాంప్లెక్స్లో భక్తులకు ఉచితంగానే టాయిలెట్లు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఫిబ్రవరి 1 నుంచి అమ్మవారి ఆలయం వెనుక, ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న టాయిలెట్లను ఉచితంగా నిర్వహిస్తాం. క్షేత్ర పరిధి 4 ఎకరాల్లో ఉండడంతో నిర్వహణ పరంగా కష్టతరంగా మారింది. ఈ విషయమై బోర్డులో కూడా చర్చించాం. క్షేత్ర పరిధిలో ఉన్న ప్రైవేట్ టాయిలెట్లలో సైతం ఫిబ్రవరి 1నుంచి యూజర్ చార్జీలు రూ.5 వసూలు చేసేలా చర్యలు చేపడుతున్నాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
స్పర్శ దర్శనానికి నిర్దిష్ట వేళలు
శ్రీశైలం: భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా స్పర్శ దర్శనానికి నిర్దిష్ట వేళలను నిర్ణయిస్తూ సామాన్య భక్తులు అలంకార దర్శనం చేసుకోవడానికి వీలుగా శ్రీశైల దేవస్థానం ట్రస్టు బోర్డు నిర్ణయించింది. గురువారం చైర్మన్ రమేష్నాయుడు అధ్యక్షతన ఈఓ శ్రీనివాసరావు, సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మొత్తం 42 అంశాలు చర్చకు రాగా 39 అంశాలు ఆమోదించారు. రెండింటిని వాయిదా వేయగా, ఒక అంశాన్ని తిరస్క రించారు. సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో స్వామి వారి స్పర్శ దర్శనాన్ని నిర్దిష్ట వేళల్లో ఉదయం, రాత్రి మా త్రమే కల్పించేందుకు నిర్ణయించారు. మిగిలిన సమయమంతా అలంకార దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాల భర్తీకి 2024 జనవరి 29న జారీ చేసిన నోటిఫికేషన్కు సంబంధించి జనరల్ డ్యూటీ అటెండెంట్(21 ఖాళీలను) అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 19, 20వ తేదిల్లో నిర్వహించామన్నారు. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఫేస్–2ను కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్సైట్లు https://kurnool. ap.gov.in, https://nandyal.ap.gov.inతో పాటు https://kurnool medicalcollge.ac.inలో అప్లోడ్ చేశామన్నారు. -
బోగస్ స్లాట్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి
డోన్: బోగస్ ప్లాట్లను ఆన్లైన్లో నమోదు చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పండుతోందని, ఇలా నమోదు చేస్తున్న అజ్ఞాత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డోన్ డీఎస్పీ శ్రీనివాసులుకు జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై డోన్ సబ్రిజిస్ట్రార్ మహబూబ్ బాషా బుధవారం రాత్రి సీఐ ఇంతియాజ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బోగస్ ప్లాట్లపై పత్రికలు, ప్రసార సాధనాల్లో వస్తున్న వార్తలకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రార్ చార్జీలు ప్రభుత్వం పెంచుతుందనే వార్తల నేపథ్యంలో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు బయటి వ్యక్తులు కుమ్మకై ్క రిజిస్ట్రర్ల కోసం కార్యాలయాలకు వచ్చే వ్యక్తులకు రూ.2వేల నుంచి రూ.6వేల వరకు స్లాట్ను విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. నేడు ఉద్యోగుల సమస్యల పరిష్కార కార్యక్రమం నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నేడు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలకు అర్జీలు స్వీకరించి, 15 రోజుల్లోగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర స్థాయి అంశాలను సంబంధిత అధికారులకు వివరిస్తామన్నారు. వార్షిక, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, కార్యాలయాల మౌలిక సదుపాయాలు, మహిళా ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలపై అర్జీలు స్వీకరిస్తామన్నారు. క్రమశిక్షణారాహిత్య కేసులు పెండింగ్లో ఉండటంతో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు నిలిచిపోయిన అర్జీలను కూడా పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పక హాజరు కావాలని ఆదేశించారు. రమణీయం.. పార్వేట మహోత్సవం ఆళ్లగడ్డ: శ్రీ అహోబిలేశుడి పార్వేట ఉత్సవ పల్లకి నాగిరెడ్డిపల్లె నుంచి బుధవారం అర్ధరాత్రి పడకండ్లకు చేరుకుంది. గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి శ్రీ ప్రహ్లాదవరద స్వామి, శ్రీ జ్వాలానరసింహ స్వాములు కొలువైన ఉత్సవ పల్లకీకి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిని గ్రామస్తులు భుజాలపై మోసుకుంటూ తెలుపులపై కొలువుంచుతూ భక్తిని చాటుకున్నారు. ఉత్సవ పల్లకి పడకండ్ల నుంచి శుక్రవారం ఉదయం ఆళ్లగడ్డలో కొలువు దీరనుంది. నాలుగు రోజుల పాటు పట్టణంలో వివిధ తెలుపులపై పూజలు అందుకోనుంది. నంద్యాలలో జిల్లాస్థాయి ఎక్స్పో ఎగ్జిబిషన్ నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని స్థానిక వైఎస్సార్ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్పో ఎగ్జిబిషన్ గురువారం నిర్వహించారు. విద్యార్థుల్లో కెరీర్పై అవగాహన పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి , అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నిత్యానంద రాజులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగ సువర్చల అధ్యక్షత వహించారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజేతలకు డీఈఓ బహుమతులు అందజేశారు. -
శ్రీశైలంలో కరివేన సత్రం ప్రహరీ కూల్చివేత
శ్రీశైలం: ఊరూపేరూ ఎవరికీ తెలియని ప్రైవేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం శ్రీశైలం క్షేత్ర పరిధిలోని కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ప్రహరీని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ దురాగతంపై భక్తులు మండిపడుతున్నారు. వివరాలివీ..రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్న సాకుతో అధికారులు శ్రీశైలంలోని కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ప్రహరీని గురువారం ఉదయం నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు.నిజానికి ఈ స్థలం కేటాయింపునకు సంబంధించి తీర్మానం చేసిన ఫైల్ రాష్ట్ర దేవదాయ కమిషనర్ వద్ద ఉంది. అయితే అక్కడ నుంచి ఉత్తర్వులు రాకుండానే కాంపౌండ్ వాల్ కూల్చివేయడం గమనార్హం. మరోవైపు.. భక్తులు సేదతీరేందుకు ప్రహరీని తొలగించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. కరివేన సత్రానికి 43 సెంట్లు కేటాయించామని.. అయితే, పూర్వపు ఈఓ మౌఖిక ఆదేశాల మేరకు అదనంగా 55 సెంట్లు ఆక్రమించుకుని సత్రం నిర్వాహకులు కాంపౌండ్ వాల్ నిర్మించారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు..ఈ విషయంపై కరివేన సత్రం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ స్పందిస్తూ.. సత్రం కాంపౌండ్ వాల్కు సంబంధించిన స్థలం కేటాయింపుపై కమిషనర్ను అభ్యర్థించామని.. ఇంతలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సహాయ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి గురువారం ప్రహరీని కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై సత్రం కార్యనిర్వాహక సభ్యులు రెండు రోజుల్లో శ్రీశైలం వచ్చి దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ పోతుగంట రమేష్నాయుడుతో చర్చించనున్నట్లు తెలిపారు. -
ఎస్సార్బీసీకి నిలిచిన నీటి సరఫరా
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రెండు ఎకరాల్లో మిరప, మరో ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేశాను. మిరపలో ఇప్పటికే ఎకరాకు లక్షా యాభైవేల రూపా యలు, మొక్కజొన్నలో రూ. 35 వేలు వెచ్చించాను. మరో నాలుగు తడులు నీటిని మళ్లించాల్సి ఉంది. రెండు రోజుల నుంచి కాల్వలకు నీటిని నిలుపుదల చేశారు. – మహేశ్వరరెడ్డి, రైతు అమడాల, కోవెలకుంట్ల మండలం ఎస్సార్బీసీ నీటి ఆధారంగా సొంత పొలంలో 10 ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. నీటి సరఫరా ఆగిపోవడంతో పైర్లు ఎండిపోతున్నాయి. మరో రెండు నెలల నీరు ఇవ్వాలి. – జగదీశ్వరరెడ్డి, రైతు, అమడాల, కోవెలకుంట్ల మండలం కోవెలకుంట్ల: శ్రీశైలం కుడిగట్టు కాల్వలకు రెండు రోజుల నుంచి నీటి సరఫరా ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్చి నెలాఖరు వరకు కాల్వలకు నీటిని సరఫరా చేస్తామన్న అధికారులు రెండు నెలల ముందే అర్ధాంతరంగా నీటిని నిలిపివేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, బనగానపల్లె మండలాల పరిధిలో ఎస్సార్బీసీ 7వ బ్లాక్ నుంచి 13వ బ్లాక్ వరకు మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా రైతులకు సాగు నీరు అందుతోంది. ఆ నీటి ఆధారంగా ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లో మొక్కజొన్న, వరి, మినుము, మిరప, కంది, పెసర, తదితర పంటలు సాగు చేశారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, సాగునీటి మళ్లింపు, తదితరాలకు పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.35 వేలు వెచ్చించారు. మిరప రైతులు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం దిగుబడులు చేతికందే దశలో ఉన్నాయి. ఈ తరుణంలో అధికారులు కాల్వలకు నీటిని బంద్ చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిసరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. పంటలకు మరో నాలుగు తడులు సాగునీరు అందితే తప్ప దిగుబడులు దక్కవని రైతులు వాపోతున్నారు. -
పేదలకు ఉచిత న్యాయ సేవలు
నందికొట్కూరు: న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయవాది ఏర్పాటు చేస్తామని కర్నూలు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. నందికొట్కూరులోని సబ్జైల్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముద్దాయిలతో ముఖాముఖి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అనంతరం ఖైదీలకు ఆరోగ్య, వైద్య పరీక్షలు డాక్టర్ ప్రవీణ్ చేశారు. ఖైదీలను సమస్యలను సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి దివ్య అడిగి తెలుసుకున్నారు. సబ్జైల్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, న్యాయవాది మద్దయ్య పాల్గొన్నారు. 2న బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశం శ్రీశైలం టెంపుల్: క్షేత్రంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఫిబ్రవరి 2న సమన్వయ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమావేశానికి ముగ్గురు మంత్రుల బృందం రానున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అవసరమైన సౌకర్యాలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ హాజరై సమీక్షిస్తారు. అనంతరం క్షేత్ర పరిధిలో పర్యటించి భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు ఆదేశాలు జారీ చేస్తారు. -
సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
నంద్యాల(అర్బన్): గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయ భవనం పైఅంతస్తుకు వెళ్లి కత్తితో ఎడమ చేయి మణికట్టు, గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన నంద్యాల మండలం బిల్లలాపురం సచివాలయ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కురువ పిడుగు చిన్ననాగన్న, మల్లమ్మ కుమారుడు మధుశేఖర్ నెహ్రూనగర్ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పని చేస్తూ ఆర్నెల్ల కిందట నుంచి నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయానికి బదిలీపై వచ్చాడు. బుధవారం విధుల్లో ఉన్న మధుశేఖర్ భోజనం సమయంలో బాత్రూంకు వెళ్లి వస్తానంటూ తోటి సిబ్బందితో చెప్పి సచివాలయ భవనం పైఅంతస్తుకు వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఉద్యోగులు వెళ్లి చూడగా మధుశేఖర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చాకుతో చేతి మణికట్టు, గొంతు కోసుకోవడంతో రక్తసిక్తమైంది. వెంటనే వారు 108కు ఫోన్ చేసి, అనంతరం ఎంపీడీఓకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మధుశేఖర్ను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి్పంచారు. ఆత్మహత్యాయత్నానికి పని ఒత్తిడితో పాటు ఆరి్థక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ ఈశ్వరయ్య తెలిపారు. -
● తప్పుడు కేసులకు భయపడొద్దు ● రైతుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనుడు చంద్రబాబు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం‘తప్పుడు కేసులు, నిర్బంధాలకు ఏ ఒక్క కార్యకర్త భయపడొద్దు.. రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఎం కన్వెన్షన్ హాల్లో డోన్ నియోజకవర్గస్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో కాటసాని మాట్లాడుతూ.. తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడం మానుకోకపోతే టీడీపీ నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను సీఎం చంద్రబాబు ..తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నిలుపుదల చేయడం దుర్మార్గమని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం సీమ రైతుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. అప్పుడు వద్దని.. ఇప్పుడు సర్వేనా..? భూ యాజమాన్య హక్కు రైతులకు కల్పించేందుకు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూ రీసర్వే చేయగా, నానా యాగి చేసి అప్రతిష్టపాలు చేసిన చంద్రబాబునాయుడు నేడు అదే సర్వే ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన పాసు పుస్తకాల్లో మార్పులు ఏమి చేయలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అది కూడా తప్పుల తడకగా ఉందని రైతులకు గుర్తుచేశారు. -
కష్టాలు పగబట్టి.. నష్టాలు మూటగట్టి!
ధర నేల చూపు.. కోవెలకుంట్ల: రెండేళ్ల నుంచి పప్పుశనగ సాగు రైతుల పాలిట ‘శని’గా మారింది. గతేడాది తీవ్ర నష్టాలు చవి చూసిన రైతులు ఈ ఏడాది కోటి ఆశలతో రబీ సీజన్లో మొదటి పంటగా పప్పుశనగ పంట సాగు చేశారు. సాగు ఆరంభం నుంచి రైతులను వరుస కష్టాలు వెంటాడాయి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది 59,881 హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల్లో 53,801 హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ పంట సాగు చేశారు. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్లోని సంజామల మండలంలో 9,435 హెక్టార్లు, కోవెలకుంట్ల మండలంలో 8,124, ఉయ్యాలవాడ మండలంలో 11,268, కొలిమిగుండ్ల మండలంలో4,059, దొర్నిపాడు మండలంలో 3,298, అవుకు మండలంలో 1,772 హెక్టార్లలో సాగైంది. ప్రస్తుతం పైరు చేతికందటంతో ఆయా మండలాల పరిధిలో కోత, నూర్పి డి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఓ వైపు దిగుబడి పోవడం, మరో వైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కష్టాలు అన్నీఇన్నీ కావు. గత ఏడాది అక్టోబర్ రెండవ వారం నుంచి నవంబర్ 15వ తేదీ వరకు శనగ సాగుకు అదును కాగా విత్తన సమయంలో వారం, పది రోజులపాటు ఏకధాటిగా వర్షాలు కురిశాయి. ముందస్తుగా సాగు చేసిన పైరు అధిక వర్షాలతో దెబ్బతిని వివిధ ప్రాంతాల్లో రెండవ సారి విత్తనం వేయాల్సి వచ్చింది. భారీ వర్షాలతో పొలాల్లో తడి ఆరకపోవడంతో పొలాల్లో కలుపుమొక్కలు విపరీతంగా పెరిగాయి. వాటిని తొలగించేందుకు రైతు లు అష్టకష్టాలు పడ్డారు. నవంబర్ రెండవ వారం వరకు విత్తన పనులు కొనసాగాయి. సాగుకు అదును దాటి పోవడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో శనగసాగు తగ్గిపోవడంతో సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. గతే డాది 68వేల హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీ ర్ణం కాగా 79 వేల హెక్టార్లలో అత్యధికంగా సాగైంది. ఈ ఏడాది 53,801 హెక్టార్లకే పరిమితమైంది. ఎండు తెగులతో ఆశలు ఆవిరి వాతావరణం అనుకూలించకపోవడం,తదితర కారణాలతో శనగ పైరును వేరుకుళ్లు (ఎండు తెగులు) ఆశించిన పైరులో మొక్కలు ఎండిపోయి చనిపో యాయి. బైళ్లు, బైళ్లుగా మొక్కలు ఎండిపోవడంతో కొన్ని చోట్ల ఖాళీ పొలం ఏర్పడింది. జిల్లాలో ఫూలేజి(తెల్లశనగ) రకానికి చెందిన పైరుకు ఎక్కువశాతం ఎండు తెగులు ఆశించింది. దీనికి తోడు గత నెలలో పైరు పూత, పిందె దశలో నాలుగైదు పర్యాయాలు పొగమంచు కురియడంతో పూత, పింది రాలిపోయి నష్టం సంభవించింది. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడులు వస్తానుకుంటే ఎండు తెగులు ఆశించిన పైరులో ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడులు, తెగులు ఆశించని పైరులో ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గతేడాది ప్రభుత్వం క్వింటా రూ. 8,750 మద్దతు ధర ప్రకటించగా మార్కెట్లో క్వింటా రూ. 5 వేలు పలకపోవడంతో దిగుబడులు ఇప్పటికీ గోదాములు దాటలేదు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో సాగు చేసిన పప్పుశనగ పైరు కోతకు రావడంతో కోత, నూర్పిడి పనుల్లో నిమగ్నమయ్యారు. నవంబర్ రెండవవారం నుంచి సాగు చేసిన పైరు మరో పది, పదిహేను రోజుల్లో చేతికందనుంది. గోదాముల్లో ఉన్న పాత దిగబడులు క్వింటా రూ. 5 వేలు ధర పలుకుతుండగా కొత్త దిగుబడుల్లో జేజే–11రకం క్వింటా రూ. 5,300, పూలేజి రకం రూ. 5,500 ధర పలుకు తోంది. పెరిగిన పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని ఎర్ర శనగలు రూ. 8 వేలు, తెల్ల శనగలకు రూ. 10 వేలు ధర కల్పిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. రెండేళ్లుగా శనగ పంట కలిసి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో నేర నియంత్రణ
● ఎస్పీ సునీల్ షెరాన్ నంద్యాల: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేర నియంత్రణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నేర నియంత్రణపై ఆయన సమీక్షా నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ క్రైం, శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఎస్పీ ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ల వారీ గా కేసులు తగ్గించుకోవాలని, నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కారించాలన్నారు. తరచూ నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ ఉపయోగించి జిల్లా బహిష్కరణ చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేకుండా విధులు నిర్వహించాలన్నారు. మహిళలు భద్రత కోసం వారు ఎక్కువగా సంచరించే ప్రదేశాలలో ప్రత్యేక దృష్టి ఉంచి పెట్రోలింగ్ పెంచడంతో పాటు నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కాలేజీలు, వసతి గృహాలు, ప్రార్థన ఆలయాలు చర్చి, మసీదు, దేవాలయ పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసు కోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీలు యుగంధర్ బాబు, జావళి ఆల్ఫోన్స్, డీఎస్పీలు ప్రమోద్, రామాంజి నాయక్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
దిగుబడి తగ్గే అవకాశం
ఈ ఏడాది రబీ సీజన్లో నాకున్న సొంత పొలంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో పూలేజి(తెల్ల)రకానికి చెందిన శనగ పంట సాగు చేశాను. ఎకరాకు రూ. 25 వేలు వెచ్చించాను. ఎండు తెగులు ఆశించడంతో దిగుబడులు తగ్గే ఆస్కారముంది. మరో పది రోజుల్లో కోత, నూర్పిడి పనులకు సిద్ధమవుతున్నాను. – లక్ష్మీనారాయణ, రైతు, కలుగొట్ల, కోవెలకుంట్ల మండలం ఐదెకరాల సొంత పొలంలో శనగ పంట సాగు చేయ గా తుపాన్ కారణంగా పైరు దెబ్బతినడంతో కొంతమేర తొలగించాను. పైరు దెబ్బతిన్న స్థానంలో తిరిగి విత్తనం వేశాను. ముందస్తుగా సాగు చేసి దెబ్బతినని పైరులో ఇటీవల కోత, నూర్పిడి పనులు పూర్తి కాగా ఐదు ఎకరాలకు సంబంధించి 15 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. మిగిలిన పైరు కోత దశలో ఉంది. – వెంకటేశ్వర్లు, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం -
టాయ్లెట్లలో నీళ్లు రాకపోతే ఎలా?
● మహానంది గిరిజన ఆశ్రమపాఠశాల సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం మహానంది: విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలో బకెట్లు లేవు.. మగ్గులు లేవు.. నీళ్లు రావడం లేదు.. ఇంత నిర్లక్ష్యమా.. అంటూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల పాఠశాలలో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థి విజయ్కుమార్ తీవ్రంగా గాయపడి కర్నూలులో చికి త్స పొందుతూ కోలుకోలేక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా విద్యాబోధన, వసతి సౌకర్యాలు, సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు పనిచేయక పోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. మరుగుదొడ్లను స్వయంగా పరిశీలించిన ఆమె నీళ్లు రాకపోడం గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. నీళ్లు రాకపోతే విద్యార్థులు ఎలా వినియోగిస్తారంటూ ఆగ్రహించారు. దీనిపై ఇన్చార్జ్ వార్డెన్ హరికృష్ణ.. ట్యాంకులో నీళ్లు అయిపోయినట్లున్నాయ్.. మేడం అనగా అలా ఎలా.. మాట్లాడతారంటూ మండిపడ్డారు. విద్యార్థులు చేతు లు, కాళ్లు శుభ్రం చేసుకునే కుళాయి ట్యాంకు వద్ద పాచిపట్టడంతో కలెక్టర్ వెంట వచ్చిన సిబ్బంది జారిపడబోయాడు. గమనించిన కలెక్టర్.. ఇలా ఉంటే విద్యార్థులె లా ఉండాలని నిలదీశారు. ఇటీవల సస్పెన్షన్కు గురైన ఉపాధ్యాయురాలు నాగమ్మ కలెక్టర్ను కలిసి తమ సమస్యలను విన్నించారు.


