breaking news
Nandyala
-
బ్యాంకుల సమ్మెకు సీఐటీయూ మద్దతు
కర్నూలు(సెంట్రల్): దేశవ్యాప్తంగా జనవరి 27న జరిగే బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు తెలి పారు. శుక్రవారం బ్యాంకు ఉద్యోగులకు సంఘీభావంగా సీఐటీయూ నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలన్న ఉద్యోగుల న్యాయమైన కోరికకు ప్రభుత్వం ఆమోదం తెలపాలన్నారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించడానికి ఇదే సరైన మార్గమన్నారు. మామిడి పంట రక్షణపై అవగాహన అవసరం ● తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతు లు అవగాహన పెంచుకోవాలని తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన సంస్థ సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూలులోని ఉద్యానభవన్తో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న దృష్టా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మామిడి కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కవర్లు తొడగడంతో నాణ్యత పెంపొందుతుందని తెలిపారు. కవర్లు తొడగకపోతే చీడపీడల ప్రభావం వల్ల కాయల్లో నాణ్యత దెబ్బతింటుందని, కాయల్లో నాణ్యతను పెంచుకునేందుకు ఫ్రూట్స్ కవర్లు వినియోగించాలని సూచించారు. నీరు, ఎరువుల యాజమాన్యంపై రైతులు మరింత అవగాహన పెంచుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ... తేనేమంచు పురుగు, గొంగలి, కాండం తొలుచు, తామర పురుగులు, పండు ఈగ తదితర వాటివల్ల మామిడికి నష్టం కలుగుతుందని, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ప్రారంభంలో చీడపీడలను గుర్తిస్తే నివారణ సులభం అవుతుందని పేర్కొన్నారు. కాగా పలువురు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో పూత పిందె రాలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అనుమానాలపై రైతులు తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారులు నరేష్కుమార్రెడ్డి, మదన్మోహన్ గౌడు తదితరులు పాల్గొన్నారు. జగన్ పాదయాత్ర చేస్తానంటే ఎందుకంత గుబులు? కర్నూలు (టౌన్): రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే కూటమి నేతల్లో ఎందుకంత గుబులు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక సి.క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫలమైందని విమర్శించారు. ప్రజలకు లేని పోని ఆశలు కల్పించి సూపర్ సిక్స్ అంటూ ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలోపే ప్రజలు జగనన్న సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటున్నారన్నారు. జగనన్న పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు జగనన్న హయంలో న్యాయం జరిగిందన్నారు. కూటమికి ఓటమి భయం పట్టుకుందన్నారు. రెండవ సారి పాదయాత్రతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టిస్తారన్నారు. -
నామినేషన్ల స్వీకరణ వాయిదా
● శాంతిభద్రతల సమస్య చూపిన పోలీసులునంద్యాల(అర్బన్): విజయ డెయిరీలో ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ శుక్రవారం వాయిదా పడింది. శాంతినగరం సొసైటీ అధ్యక్షురాలు ప్రమీలరాణి, గంగవరం సొసైటీ అధ్యక్షురాలు ఉడతా చంద్రకళ, మునగాల సొసైటీ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, గోరుకల్లు సొసైటీ నుంచి లక్ష్మిదేవిలు నామినేషన్లను దాఖలు చేసేందుకు వచ్చారు. దాదాపు 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అయినా పోలీసులు శాంతి భద్రతల సమస్యలు అంటూ నామినేషన్లను వాయిదా వేయాలని డెయిరీ ఎండీని కోరడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయించుకోకపోతే కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతామన్నారు. శాంతిభద్రల కారణంగా నామినేషన్ల ప్రక్రియ నిలిపి వేయాలని పోలీసులు కోరడంతోనే వాయిదా వేశామని డెయిరీ ఎండీ ప్రదీప్కుమార్ తెలిపారు. మ్యాక్స్ చట్టం ప్రకారం న్యాయ నిపుణులతో చర్చించి వచ్చే నెలలో నామినేషన్ల ఏర్పాట్లను పూర్తి చేస్తామని చెప్పారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
కర్నూలు: వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని, దానివల్ల కోర్టులో కేసులు విచారణకు వెళ్లకుండానే పరిష్కరించుకోవచ్చని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయ భవనంలో ఉమ్మడి జిల్లాల న్యా యవాదులకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమం జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒకటవ అదనపు జిల్లా జడ్జి కమ లాదేవి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహ రినాథ్, లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మధ్యవర్తిత్వం ఎలా నిర్వహించాలనే దానిపై కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులకు ఈనెల 19 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. చైన్నె నుంచి వచ్చిన మధ్యవర్తిత్వ శిక్షణ సిబ్బంది శశిదేవి, రత్నతార తదితరులు న్యాయ మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో పాటు సామాజిక కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బస్సు ప్రమాదంపై ప్రత్యేక బృందం విచారణ
కర్నూలు: కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద అక్టోబర్ 24న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని ప్రభుత్వం నియ మించిన ప్రత్యేక బృందం పరిశీలించింది. బృందం అధ్యక్షుడిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ జనార్ధన్ రెడ్డి, రిటైర్డ్ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవీ ప్రసాదరావు, మరో ఐదుగురు సభ్యుల బృందం శుక్రవారం కర్నూలుకు వచ్చి బస్సు అగ్నిప్రమాద ఘటనపై వివరాలు సేకరించారు. రవాణా, పోలీ సు, అగ్నిమాపక శాఖ, నేషనల్ హైవే అథారిటీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలోని రోడ్డు పరిస్థితి, పరిసరాలు, కాలిపోయిన బస్సును తనిఖీ చేశారు. మరొక స్లీపర్ బస్సును తెప్పించి పరిశీలించారు. కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహానికి ప్రత్యేక బృందం సభ్యులు చేరుకోగానే కలెక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా అధికారులతో ప్రతినిధి బృందం ప్రత్యేక సమావేశం నిర్వహించి అగ్నిప్రమాద ఘటనపై విచారణ జరిపి రిపోర్టు తీసుకున్నారు. రవాణా శాఖ కర్నూలు డిప్యుటీ కమిషనర్ శాంతకుమారి, నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ తరుణ్ కుమార్ (అనంతపురం), జిల్లా ఫైర్ ఆఫీసర్ అవినాష్ జయసింహ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సరస్వతీ నమోస్తుతే!
కొత్తపల్లి: నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కొలనుభారతి క్షేత్రంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు కనులపండువగా నిర్వహించారు. సరస్వతి దేవి పుట్టినరోజును పురస్కరించుకొని వసంత పంచమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ సారి శ్రీశైలం దేవస్థానం కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకున్న తర్వాత మొదటి వేడుకలు కావడం విశేషం. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి తమ చిన్నారులకు అమ్మవారి చెంతన అక్షరాభ్యాసాలు చేయించారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని ‘సరస్వతీ దేవి నమోస్తుతే’’ అంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఉదయం 4 గంటలకు కవాటోద్ఘాటనం, మంగళవాయిద్యాల నడుమ చారుఘోషిణి నదీ పవిత్రజలంతో ఆలయ ప్రవేశం, గణపతి పూజ, అమ్మవారికి విశేష అభిషేకం, షోడశోపచారపూజ అదేవిధంగా పూలమాలలతో విశేష అలంకరణ వేదపండితులు నిర్వహించారు. అనంతరం 5.20 గంటలకు అమ్మవారికి శ్రీశైలం దేవస్థానం తరుఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏఈఓ ఫణిందర ప్రసాద్, ఆలయ చైర్మన్ రామేష్ నాయుడు, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఆర్డీఓ నాగజ్యోతి, సర్పంచు చంద్రశేఖర్ యాదవ్, కొలనుభారతి దేవి ఆలయ చైర్మన్ వెంకటనాయడు వేదపండితుల ఆధ్వర్యంలో ఆలయ సంప్రదాయానుసారంగా అమ్మవారికి పట్టువస్త్రాలు అందించారు. అనంతరం అమ్మవారికి వస్త్రాలంకరణ, కుంకుమార్చన, పుష్పార్యన, బాలభోగనివేదన, మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామి, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, తహసీల్దార్లు ఉమారాణి, చంద్రశేఖర్ నాయక్, గోపాలకృష్ణ, కొత్తపల్లి జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి, మండల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కె.సుధాకర్ రెడ్డి, ఎంపీపీ కుసుమలత, పార్టీ నేతలు జనార్దన్ రెడ్డి, నారాయణరెడ్డి, నందికుంట సర్పంచు నిత్యలక్ష్మీదేవి, ఎంపీటీసీ బాలరాజు, మునిరంగ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాశిరెడ్డి నాయన ఆశ్రమం, శ్రీశైలం దేవస్థానం వారు, శ్రీ వాసవి మాత ఆర్య, వైశ్యఅన్నదాన సత్రాలవారు భోజన వసతి కల్పించారు. వేడుకగా సామూహిక అక్షరాభ్యాసం కొలనుభారతి దేవి ఆలయ సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయ ని, మంచి భవిష్యత్తు ఉంటుందని భక్తుల విశ్వా సం. ఇందులో భాగంగా శుక్రవారం వసంత పంచ మి వేడుకలో 810 మంది చిన్నారులకు శ్రీశైలం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అక్షరాభ్యాసం చేయించారు. కనుల పండువగా వసంత పంచమి వేడుకలు వేడుకగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు -
అతివేగానికి రెండు ప్రాణాలు బలి
● కుక్కను తప్పించబోయి అదుపు తప్పి కారు బోల్తా ● ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలుపెద్దకడబూరు: అతి వేగానికి రెండు ప్రాణాలు బలి అయ్యాయి. ఆదోని – ఎమ్మిగనూరు ప్రధాన రహదారిలో హనుమాపురం గ్రామ బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఏఎస్ఐ శివరాములు వివరాల మేరకు.. ఆదోని పట్టణానికి చెందిన గౌస్మోద్దీన్, గాలిబ్ మున్షి, మహమ్మద్ ఇలియాజ్, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షేక్ షాబీర్బాషాలు పీడీఎస్ రైస్ (రేషన్ బియ్యం) సరఫరా కోసం కారులో ఆదోని నుంచి ఎమ్మిగనూరు మండలం ముగతి గ్రామానికి వెళ్తున్నారు. అయితే షేక్ షాబీర్బాషా కారును అతి వేగంగా, అజాగ్రత్తగా నడుపుతున్న సమయంలో హనుమాపురం గ్రామ బస్టాండ దగ్గర అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయాడు. కారు అతి వేగంతో ఉండగా అదుపు తప్పి ఎడమ వైపు ఉన్న పొలంలోకి దూసుకుపోయింది. అక్కడ ఉన్న చెట్టును ఢీకొని కారు బోల్తాపడింది. పక్కనే రోడ్డుపై వెళ్తున్నవారు కారులో ఉన్నవారిని బయటకు తీశారు. అప్పటికే గాలిబ్మున్షి(61) అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురిని అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. షేక్ షాబీర్బాషా(25) చికిత్స పొందుతూ చనిపోయాడు. మిగిలిన గౌస్మోద్దీన్, మహమ్మద్ ఇలియాజ్ను మెరుగైన చికిత్స నిమిత్తం ఆదోని ప్రైవేటు ఆస్పతికి తరలించారు. గౌస్మోద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
పోర్ట్ఫోలియో జడ్జిని కలసిన న్యాయవాదులు
కర్నూలు: కర్నూలులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పోర్ట్పోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ను శుక్రవారం సాయంత్రం జిల్లా న్యాయవాద సంఘం కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు ఆయన్ను శాలువాతో సత్కరించి పుష్కగుచ్ఛం అందించారు. జిల్లాలోని న్యాయ స్థానాల్లో కావలసిన సదుపాయాలు, పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి స్పెషల్ కోర్టుల ఏర్పాటు తదితర అంశాలపై పోర్ట్ఫోలియో జడ్జికి వినతిపత్రం సమర్పించారు. సీనియర్ న్యాయవాదులు ఎండీవీ జోగయ్య శర్మ, జాయింట్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం, మహిళా న్యాయవాది దీపిక తదితరులు ఉన్నారు. -
కేసీ ఆయకట్టు.. కన్నీటి తడులు!
● ఆందోళనలో మొక్కజొన్న, మినుము, కంది రైతులుపగిడ్యాల: కేసీ కాలువ ఆయకట్టు కింద రబీ సీజన్లో రెండవ పంట సాగు చేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది. కేసీ కాలువకు నీటి సరఫరా నిలిచిపోవడంతో దాదాపు వారం రోజులుగా పొలాలకు నీటి తడులు కట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పైర్లు తురాయి దశలో ఉండగా మినుము, కంది, వేరుశనగ పైర్లు పూత పడుతున్నాయి. కేసీ కాలువ పూర్తిగా ఒట్టిపోవడంతో స్లూయిస్లకు నీరందడం లేదు. తురాయి దశలోని మొక్కజొన్న పైర్లకు నీరు కట్టకపోతే పంట చేతికందని పరిస్థితి నెలకొంది. మండలంలోని నెహ్రూనగర్, పీకే ప్రాగటూరు, పాత, కొత్త ముచ్చుమర్రి, కొత్త ఎల్లాల, బీరవోలు, సంకిరేణిపల్లె, ఆంజనేయనగర్, పగిడ్యాల, కొత్త పాలమర్రి, లక్ష్మాపురం, తూర్పు, పడమర ప్రాతకోట, రైతుపల్లె, ఎం,ఎన్. ఘణపురం, తూర్పు, పడమర వనుములపాడు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీ కాలువకు రెండు పంటలకు సమృద్ధిగా ఏప్రిల్ చివరి వరకు సాగు నీరు సరఫరా చేశారని గర్తుకు తెచ్చుకుంటున్నారు. రబీ సీజన్లో సాగైన పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్ మొదటి వారం వరకు కేసీ కాలువకు నీటి సరఫరాను కొనసాగించాలని రైతాంగం కోరుతున్నారు. మల్యాల ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి లిఫ్ట్ ద్వారా కేసీకి విడుదల చేయాల్సిన నీటిని సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఈ విషయమై కేసీ కెనాల్ నీటిపారుదల శాఖ నంది కొట్కూరు సెక్షన్ ఏఈఈ వీరమ్మ వివరణ కోరగా.. తుంగభద్ర డ్యాం మరమ్మతులు ఉన్నందున 0 నుంచి 120 కి.మీ. వరకు పంటలు సాగు చేయరాదని కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయన్నారు. నీటి విడుదల విషయమై విజయవాడలో నిర్వహించిన సమావేశానికి ఈఈ, డీఈలు వెళ్లారని ఆమె పేర్కొన్నారు. -
యువకుడి ఆత్మహత్య
బొమ్మలసత్రం: నంద్యాల మండలం ఊడుమాల్పురం గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి (23) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఊడుమాల్పురం గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి పట్టణంలో ర్యాపిడో బైక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సురేంద్రరెడ్డికి ఇద్దరు సోదరులు, తల్లిదండ్రులు ఉన్నారు. ఉదయం పని నిమిత్తం పట్టణానికి వచ్చిన సురేంద్రరెడ్డి నూనెపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వచ్చి గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఉన్న సెల్ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్చేసి సమాచారం అందించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. శ్రీశైలం నుంచి 11,676 క్యూసెక్కుల తరలింపు శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు గురువారం నుంచి శుక్రవారం వరకు 11,676 క్యూసెక్కుల నీటిని తరలించారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 2.490 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్కు 4,933 క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 2వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,343 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కర్నూలు: కర్నూలు శివారులోని 44వ జాతీయ రహదారి పక్కన శరీన్ నగర్ వైపు నుంచి వచ్చే సర్వీసు రోడ్డులో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన షేక్ హుసేన్ బాషా (41) శరీన్ నగర్లో నివాసముంటూ అదే కాలనీలోని వైఎస్సార్ విగ్రహం వద్ద గోబీ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్నేహితుడు అబ్దుల్లాతో కలసి పల్సర్ వాహనంపై సూర్య దేవాలయం వైపు నుంచి గుత్తి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్తుండగా హోండా యాక్టివాలో మరో వ్యక్తి వేగంగా వచ్చి పల్సర్ను ఢీకొట్టింది. దీంతో షేక్ హుసేన్ బాషాకు నుదుటిపై బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీస్ హెల్ప్లైన్ నెంబర్ 112కు ఫోన్ చేసి సమాచారమివ్వగా ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. గాయాలకు గురైన అబ్దుల్లాను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు చేయించారు. మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. గాయాలకు గురైన అబ్దుల్లా గౌండా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతుని భార్య పర్వీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వృద్ధురాలి మృతి మద్దికెర: స్థానిక బస్టాండు షెల్టర్లో గుర్తు తెలియని వృద్ధురాలు శుక్రవారం మృతి చెందినట్లు మద్దికెర ఎస్ఐ హరిత తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు దాదాపు 80 ఏళ్ల వృద్ధురాలు గత కొంతకాలంగా గ్రామంలో యాచిస్తూ కడుపునింపుకునేందన్నారు. వృద్ధురాలికి తెలుగు బాష రాదని, కన్నడ మాత్రమే వస్తుందన్నారు. ఎవరైనా అడిగితే తనది హోస్పేట్ అని చెబుతుండేదన్నారు. ఆమె గురించి సమాచారం తెలిసిన వారు మద్దికెర ఎస్ఐ 9121101130కు ఫోన్ చేయాలన్నారు. కూలీల ఆటో బోల్తా ● వృద్ధురాలి మృతి పాణ్యం: వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన కూలీలు రోడ్డు ప్రమాదానికి గురయ్యా రు. వారిలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడి మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలకు.. పాణ్యంకు గ్రామానికి చెందిన 12 కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బలపనూరు సమీపంలో పొలూరు పొలాల్లోకి వెళ్లారు. పనులు ముగించుకుని తిగిరి వసున్న సమయంలో జీఎం కళాశాల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కావడంతో సమీపంలో శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన పాణ్యంకు చెందిన గుడిపాటి పెద్దక్క(61) కోలుకోలేక మృతి చెందింది. రాములమ్మ, రాజేశ్వరి, జ్యోతి, మధారా, షష్మీ, దస్తగిరమ్మతో పాటు మరొకరు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోల్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన ఆటోను స్టేషన్కు తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
డ్రగ్స్ వినియోగంతో భవిష్యత్తు అంధకారం
కర్నూలు: డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు అంధకారమవుతుందని, వాటి జోలికి వెళ్లొద్దని నాల్గవ పట్టణ సీఐ విక్రమ సింహా సూచించారు. ఈగల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ ఎలీషా ఆధ్వర్యంలో శుక్రవారం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సీఐ విక్రమసింహ ముఖ్య అతిథిగా హాజరై మత్తు పదార్థాల వినియోగం వల్ల సంభవించే నష్టాలు, వాటికి అలవాటుపడిన వారు ఎలా బయటపడాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ‘సే నో టు డ్రగ్స్’ అని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి కరపత్రాలను పంపిణీ చేశారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం గానీ, మహిళల భద్రతకు సంబంధించిన సమాచారం గానీ తెలిస్తే డయల్ 100, 112, 1930 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ విక్రమసింహ విద్యార్థులకు సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి 1972కు సమాచారం అందించాలన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులకు ‘చంద్ర’గ్రహణం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి బనగానపల్లె: రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ‘చంద్ర’గ్రహణం పట్టిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి సీమ ఎత్తిపోతల పథకాలకు మరణశాసనం అయ్యిందని ఆరోపించారు. బనగానపల్లె పట్టణంలోని సీఎంఆర్ ఫంక్షన్హాల్లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గస్థాయి వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ పరిశీలకులు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు భూమా కిశోర్రెడ్డి, రాష్ట్ర స్థాయి నాయకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, గుండం సూర్యప్రకాష్రెడ్డి, డాక్టర్ బీవీ వెంకటరమణ, లీగల్ సెల్ న్యాయవాది అబ్దుల్ఖైర్, గుండం నాగేశ్వరరెడ్డి, అత్తార్జాహెద్ అనిల్, అంబటి రవికుమార్రెడ్డి హాజరయ్యారు. త్వరలో పోతిరెడ్డిపాడు వద్ద రైతుల సమావేశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ హక్కులను తెలంగాణాకు సీఎం చంద్రబాబు తాకట్టుపెట్టారని, ఈ విషయంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారన్నారు. తన మీద గౌరవంతోనే రాయలసీమ ఎత్తిపోతల పనులు చంద్రబాబు ఆపివేసినట్లు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్వయంగాప్రకటించారన్నారు. విద్యుత్ పేరుతో శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ ఖాళీ చేస్తున్నా టీడీపీ నేతలు నోరుమెదపడంలేదన్నారు. ఈ సమస్యలపై త్వరలో పోతిరెడ్డిపాడు వద్ద రైతులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. పెద్ద ఎత్తున రైతులు హాజరుకావాలని కోరారు. సీమకు అన్ని విధాలుగా అన్యాయం జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో రాయలసీమకు అన్ని విధాలు గా అన్యాయం జరుగుతోందనప్నారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి వైఎస్సా ర్సీపీ బలోపేతం కావాలన్నారు. ప్రతి కార్యకర్తకు ఐడీ కార్డు ఇస్తామన్నారు. నియోజకవర్గ పరిశీలకులు భూ మా కిశోర్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అరాచకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఐదు అంచల విధానంలో కమిటీల ఏర్పాటు ఐదు అంచల విధానంలో వైఎస్సార్సీపీ కమిటీలను ఏ ర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. కలసికట్టుగా పార్టీని బలోపే తం చేయాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వ చ్చిన తరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలకే పూర్తి హక్కులుంటాయన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో త్వరలో కమిటీల నియామకం పూర్తి చేస్తామన్నారు.రాష్ట్రంలో ఇసుక, మట్టి మాఫియా తమ ప్రభుత్వం భూములను రీ సర్వే చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు విష ప్రచారం చేశారని కాటసాని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మళ్లీ భూములును రీసర్వే చేస్తూ అసత్యప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక, మట్టి మాఫియా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో చికెన్ విక్రయదారుల నుంచి టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వలంటీర్లు ఉండబోరని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ బలోపేతానికి కమిటీల నియామకం అవసరమన్నారు. -
వలసబాటలో విషాదం
ఆత్మకూరు రూరల్: వలసబాటలో విషాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనాన్ని డీసీఎం ఢీకొన్న ఘటనలో తొమ్మిదేళ్ల బాలిక మృత్యువాత పడిన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ శివార్లలో గీతా భవన్ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలివీ.. కర్నూలు జిల్లా కోసిగి మండలం కామన్దొడ్డి గ్రామానికి చెందిన నాగేష్ దంపతులు తమ కుమార్తె కీర్తి(9), మరికొందరితో కలసి గుంటూరులో మిరప తోటల్లో పనులు చేసేందుకు వలస కూలీలుగా వెళ్ళేందుకు ఒక బొలెరో వాహనంలో ప్రయాణమయ్యారు. వాహనం ఆత్మకూరు పట్టణశివార్లలో బైపాస్ రోడ్డుపై వెళుతున్న సమయంలో ఎదురుగా రాంగ్ రూట్లో ఒక డిసిఎం వాహనం వచ్చి నేరుగా వారు ప్రయాణిస్తున్న బొలెరోను ఢీకొంది. దీంతో బొలెరో పైనుంచి కీర్తితో పాటు మరో నలుగురు ఎగిరి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో కీర్తి అక్కడికక్కడే మరణించింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. తమిళనాడుకు చెందిన డిసిఎం డ్రైవర్ ప్రమాద సమయంలో తప్ప తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మకూరు ఎస్ఐ నారాయణ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తొమ్మిదేళ్ల బాలిక మృతి ఉపాధి కరువై వలస పోతుండగా ఘటన తప్పతాగి డ్రైవింగ్ చేసిన డీసీఎం డ్రైవర్ -
తొలిదశలో ప్రయివేట్కు ఐదు టూరిజం హోటళ్లు
కర్నూలు వెంకటరమణ కాలనీలోని హరిత హోటల్కర్నూలు(అగ్రికల్చర్): ప్రయివేట్పై చంద్రబాబు ప్రభుత్వం అవాజ్యమైన ప్రేమ చూపుతోంది. ఇప్పటికే మెడికల్ కాలేజీలు, పోర్టులను పీపీపీ పేరుతో అప్పగించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ హోటళ్లను ప్రయివేట్కు అప్పగిస్తోంది. పీపీపీ పేరుతో విలువైన భూములు ప్రయివేట్ అప్పగిస్తూ త్రీస్టార్ హోటళ్లను నిర్మిస్తోంది. ప్రయివేట్పై విపరీతమైన ప్రేమ చూపుతూ వందలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును చంద్రబాబు సర్కార్ ఫణంగా పెడుతోంది. ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకం పర్యాటకం ప్రయివేట్ పరం అయితే తమ భవితవ్యం ఏమిటని ఉద్యోగుల ఆందోళన అంతా, ఇంతా కాదు. పర్యాటక అభివృద్ధి సంస్థ కర్నూలు డివిజన్లో 200 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగులు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. మిగిలిన 195 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, కన్సల్టెంట్లు, సెక్యూరిటీ, డైలీ వేతనంతో పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి సమస్య లేకపోయినప్పటికీ మిగిలిన ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోంది. 2024 ఎన్నికల సమయంలో ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్ని, ఇన్నీ కావు. చంద్రబాబు మాటలు నమ్మిన ఉద్యోగులు చంద్రబాబును గెలిపించారు. నమ్మితే నేడు మా ఉద్యోగాలకే ఎసరు పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయివేట్ ఆధ్వర్యంలో త్రీస్టార్ హోటళ్లు ఒకవైపు హరిత హోటళ్లను ప్రయివేట్ పరం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు పీపీపీ పేరుతో త్రీస్టార్ హోటళ్లను కూడా నిర్మిస్తోంది. రూ.కోట్ల విలువైన భూములను ప్రయివేట్కు అప్పగిస్తుండటం గమనార్హం. మంత్రాలయంలో పీపీపీ పద్ధతిలో 1.69 ఎకరాల్లో రూ.96.69 కోట్లతో త్రీస్టార్ హోటల్ నిర్మిస్తోంది. ఇందులో 240 గదులు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర లాడ్జి పేరుతో పీపీపీ పరం చేస్తోంది. నిర్మాణపు పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు శ్రీశైలం దేవస్థానంలో పీపీపీ పద్ధతిలోనే త్రీస్టార్ హోటల్ నిర్మిస్తోంది. ఇందుకోసం రూ.కోట్ల విలువైన 2.10 ఎకరాల భూమిని ప్రయివేట్కు అప్పగించింది. శ్రీశైలంలో హిల్టర్–గార్డెన్ ఇన్ పేరుతో త్రీస్టార్ హోటల్ను రూ.83 కోట్లతో నిర్మించనున్నారు. త్వరలో నిర్మాణపు పనులు మొదలు కానున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో యాత్రికుల సదుపాయం కోసం స్టార్ హోటళ్లు నిర్మిస్తే తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. ప్రయివేట్కు ఇవ్వడంతో పర్యాటకుల దోపిడీ తథ్యమనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. త్రీస్టార్ హోటళ్ల నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నప్పటికీ ఇవన్నీ టీడీపీ కార్యకర్తలకే లభిస్తాయనే విమర్శలు ఉన్నాయి. కొండెక్కిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చంద్రబాబు నేతృత్వం ప్రభుత్వం ఏర్పాటై 21 నెలలు అవుతుంది. ఈ సమయంలో పీపీపీ పద్ధతిలో త్రీస్టార్ హోటళ్లు మినహా.. ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో చారిత్రక (హెరిటేజ్) టూరిజం కింద కర్నూలులోని కొండారెడ్డిబురుజు, గోల్గుమ్మజ్, పురావస్తుశాఖ మ్యూజియం, తగ్గలి మండలంలోని ఆశోకుని శిలాశాసనాలు, ఓర్వకల్లు మండలంలోని కేతవరంలోని రాతి చిత్రాలు ఉన్నాయి. ఏకో టూరిజం కింద ఆత్మకూరు ప్రాంతంలోని బైర్లూటి అటవీ ప్రాంతం, మిడుతూరు మండలంలోని బట్టమేక పక్షి కేంద్రం, లీజర్ టూరిజం కింద బెలుం గుహలు, రాక్గార్డెన్స్, వాల్మీకి గుహలు ఉన్నాయి. టెంపుల్ టూరిజం కింద శ్రీశైలం, మహానంది, అహోబిలం, ఉరుకుంద, యాగంటి, మంత్రాలయం, జగన్నాథగట్టు, మద్దిలేటిస్వామి దేవస్థానం, నందవరం చౌడేశ్వరి క్షేత్రం ఉన్నాయి. పర్యాటక రంగానికి జిల్లా పెట్టింది పేరు. మొత్తంగా 42 ప్రాంతాలకు పర్యాటక ప్రాంతాలుగా గుర్తుంపు ఉంది. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లాకు 2023–24లో రూ. 1.25 కోట్ల పర్యాటకులు రావడం జరిగింది. 2024–25, 2025–26లో జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. పర్యాటక అభివృద్ధి సంస్థకు ఆదాయం కూడా పడిపోయింది. రాష్ట్రంలోని 22 హరిత హోటళ్లను ప్రయివేట్కు ఇచ్చేందుకు జీవో వచ్చింది. ఇందులో 4వ క్లస్టర్లో ఆరు హరిత హోటళ్లు ఉండగా.. ఉమ్మడి జిల్లాలో ఐదు ఉన్నాయి. హరిత హోటళ్లను ప్రయివేట్కు ఇవ్వడంతో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఉద్యోగులు, సెక్యూరీటి సిబ్బంది తదితరులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన ఇతర యూనిట్లతో వీరి సేవలను ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంత్రాలయం, శ్రీశైలంల్లో పీపీపీ పద్ధతి కింద త్రీస్టార్ హోటళ్లు నిర్మిస్తోంది. – లక్ష్మీనారాయణ, డివిజినల్ మేనేజర్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, కర్నూలు ప్రదేశం గదులు కర్నూలు వెంకటరమణ కాలనీ 28 ఓర్వకల్లు రాక్గార్డెన్ 20 మహానంది 28 ఆహోబిలం 38 శ్రీశైలం హరిత రిసార్ట్ 100 రెగ్యులర్ ఉద్యోగులు 05 కాంట్రాక్ట్ 88 డిప్యుటేషన్ 01 ఔట్ సోర్సింగ్ 63 కన్సల్టెంట్లు 03 సెక్యూరిటీలు 22 డైలీ వేతనం 18 మొత్తం 200కనిపించని పర్యాటకంచంద్రబాబు ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మొదటి దశలో ప్రయివేట్ టూరిజం హోటళ్లు అప్పగిస్తున్న ప్రభుత్వం రానున్న రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రాంతాలను ప్రయివేట్ పరం చేసే దిశగా కదులుతోంది. మరో మూడేళ్లలో టూరిజం మొత్తం ప్రయవేటు చేతుత్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఉద్యోగుల్లో గుబులు పడుతోంది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించాల్సిన అవసరం ఉండగా.. ప్రయవేటుకు పెద్దపీట దోచుకునేందుకు అవకాశం ఇస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానాలు, ప్రముఖ నగరాల్లో టూరిజం ఆధ్వర్యంలోని హరిత హోటళ్లు పర్యాటకులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇతర ప్రయివేట్ లాడ్జీలతో పోలిస్తే టూరిజం హోటళ్లలో గదులు తక్కువ ధరకు లభిస్తాయి. వీటికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఉమ్మడి జిల్లాలో ఐదు హరిత హోటళ్లను ప్రయివేట్కు ఇచ్చేందుకు 2025 ఆగస్టు 7న జీవో ఎంఎస్ నంబరు 23 జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో కర్నూలు వెంకటరమణ కాలనీలోని హరిత హోటల్, ఓర్వకల్లు రాక్ గార్డెన్, మహానంది, అహోబిలంలలోని హరిత హోటళ్లు, శ్రీశైలంల్లోని హరిత రిసార్ట్ను ప్రయివేట్కు ఇచ్చేందుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రయివేట్కు అప్పగించేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వీటిల్లో 222 ఏసీ, నాన్ ఏసీ, లగ్జరీ గదులు ఉన్నాయి. ప్రయివేట్ సంస్థలు కొన్ని ముందుకు వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో ముందుకు సాగడం లేదు. మరో రెండు, మూడు నెలల్లో టూరిజం ఆధ్వర్యంలోని హరిత హోటళ్లు ప్రయివేట్ చేతుల్లోకి వెళ్లనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ హోటళ్లు ప్రయివేట్ చేతుత్లోకి వెళితే సేవల పేరుతో యాత్రికుల నిలువు దోపిడీ తప్పదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొలిదశలో ఐదు హరిత హోటళ్లు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసిన ఏపీఎస్ పర్యటక అభివృద్ధి సంస్థ మూడు నెలల్లో ప్రయివేట్ చేతుల్లోకి టూరిజం హోటళ్లు మంత్రాలయం, శ్రీశైలంలో పీపీపీ పద్ధతిలో త్రీస్టార్ హోటళ్లు మంత్రాలయంలో కోట్ల విలువైన 1.69 ఎకరాలు శ్రీశైలంలో 2.10 ఎకరాలు ప్రయివేట్ చేతికి 21 నెలల్లో పీపీపీ మినహా అభివృద్ధి శూన్యం ఉమ్మడి జిల్లాకు తగ్గిన పర్యాటకుల తాకిడి -
శ్రీశైలాలయానికి బంగారు తాళిబొట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థానానికి శుక్రవారం కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన చెన్నుపాటి తిరుపతిరావు 78గ్రాములతో తయారు చేయించిన బంగారు తాళిబొట్లను సమర్పించారు. ఆలయ ప్రాంగాణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు బంగారు తాళిబొట్లను పర్యవేక్షకులు జి.రవికుమార్, సిబ్బందికి అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరపున రసీదు, వేదాశీర్వచనంతో స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందించి సత్కరించారు. 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నంద్యాల: భారత ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2011 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్లోని వివిధ శాఖల సిబ్బందితో శుక్రవారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉండాలన్నారు. ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, చేర్పులు–తొలగింపులు, మార్పులు, తప్పుల్లేని ఓటరు జాబితా తయారీ, పోలింగ్ శాతం పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా నాయకులకు రాష్ట్ర కమిటీలో చోటు బొమ్మలసత్రం: జిల్లాకు చెందిన ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాణ్యం నియోజకవర్గానికి చెందిన కాటసాని శివనరసింహారెడ్డికి స్టేట్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా, వైజా అరుణ రెడ్డికి రాష్ట్ర మహిళా విభాగ సెక్రటరీగా స్థానం కల్పించారు. అదే విధంగా నంద్యాల నియోజకవర్గానికి చెందిన పెద్ది శ్రీనివాసులుకు స్టేట్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా, ఆవుల తిమ్మారెడ్డికి స్టేట్ లీగల్ సెల్ అఫీషీయిల్ స్పోక్స్ పర్సన్గా స్థానం కల్పించారు. బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన దండు మధుబాబుకు రాష్ట్ర ఎస్సీసెల్ సెక్రటరీగా, టి.వాయునందగౌడ్కు స్టేట్ బీసీసెల్ జాయింట్ సెక్రటరీగా నియమించారు. -
విజయ డెయిరీని నిర్వీర్యం చేస్తున్నారు: గంగుల బ్రిజేంద్ర రెడ్డి
సాక్షి, నంద్యాల జిల్లా: రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలోనే అతిపెద్ద సహకార సంస్థ అయిన విజయ డెయిరీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆళ్లగడ్డలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డెయిరీ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను, ప్రభుత్వ ఒత్తిళ్లను ఎండగట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే సాకుతో తనను హౌస్ అరెస్ట్ చేయడం, నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు.గతేడాది కూడా ఇదే విధంగా నామినేషన్లకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారని, అఖిలప్రియ అనుచరులు గొడవ చేస్తే పోలీసులు ఎన్నికలు వాయిదా వేయమని లెటర్ ఇస్తున్నారని ఆరోపించారు. జగత్ విఖ్యాత్ రెడ్డి ఒక 'డిఫాల్టర్' అని, ఆయనకు చైర్మన్ అయ్యే కనీస అర్హత లేదని బ్రిజేంద్ర రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ డెయిరీ నడుపుతున్న వ్యక్తి, సహకార డెయిరీకి చైర్మన్ ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు.అభివృద్ధిని చూసి ఓర్వలేకనే: విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యే అయిన నాటి నుంచి తన తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని విజయ డెయిరీకి చైర్మన్ చేయాలని కుట్ర చేస్తోందని విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు పాల వ్యాపారం నిర్వహిస్తున్న తన తమ్ముడిని విజయ డెయిరీకి చైర్మన్ చేయడం మ్యూచువల్ కో ఆపరేటివ్ సొసైటీ నిబంధనలకు పూర్తి విరుద్ధమని చెప్పారు. సొసైటీలో డిఫాల్టర్ గా ఉన్న జగత్ విఖ్యాత్ రెడ్డికి కనీసం కోర్టు మెట్లు తొక్కే అర్హత కూడా లేదని విమర్శించారు.అతడి ప్రలోభాలకు గురైన ముగ్గురు డైరెక్టర్లపై అనర్హత వేటు పడిందని చెప్పారు. చేతిలో అధికారం ఉందనే అహంకారంతో పోలీసులతో బెదిరించి, సీఎంవో నుంచి ఫోన్లు చేయించి పదే పదే ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆళ్లగడ్డలో జగత్ డెయిరీ ప్రారంభించిన నాటి నుంచి నంద్యాల విజయ డెయిరీ సేల్స్ పడిపోయాయని చెప్పారు. గతంలో రూ. 180 కోట్లు ఉన్న డైరీ టర్నోవర్ను తాము రూ. 360 కోట్లకు పెంచామని, రూ. 50 కోట్ల లాభం సాధించామని తెలిపారు.రైతులకు గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రూ. 25 కోట్ల బోనస్ అందించినందుకు తనపై విచారణలు చేయిస్తున్నారా? అని నిలదీశారు. తన 58 ఏళ్ల జీవితంలో ఎన్నడూ లేని విధంగా, ఒకే రోజు తనపై మూడు తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయడం కక్షపూరిత రాజకీయాలకు పరాకాష్ట అని జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 40 వేల మంది రైతులు, 700 మంది ఉద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విజయ డెయిరీని కాపాడుకోవాలని అధికారులను, ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తప్పుడు ఆరోపణలు చేసేవారు దమ్ముంటే వాటిని నిరూపించాలని సవాలు విసిరారు. న్యాయం జరిగే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
వైభవంగా సుజయీంద్రుల ఆరాధన
మంత్రాలయం: నవ మంత్రాలయం నిర్మాత శ్రీ మఠం పూర్వ పీఠాధిపతి సుజయీంద్ర తీర్థుల ఆరాధన వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. శ్రీ మఠంలో సుజయీంద్రుల మూలబృందావనానికి మహా పంచామృతాభిషేకం చేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజోత్సవాలు నిర్వహించారు. బంగారు రథంపై సుజయీంద్రుల చిత్రపటానికి శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మంగళహారతులు చేశారు. అనంతరం బంగారు రథంపై చిత్రపటాన్ని అధిష్టింపజేసి శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య ఉత్సవం నిర్వహించారు. వేడుకల్లో గురుసార్వభౌమ భజన మండలి సభ్యుల కీర్తనలు అలరించాయి. -
ఇటీవల జరిగిన ప్రమాదాలు ఇవీ..
● గతేడాది జూలైలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కరెంట్ స్తంభాన్ని ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. శిరివెళ్ల మండల పరిధిలోని యర్రగుంట్ల వద్ద ఉన్న ఉషోదయ ప్రైవేటు పాఠశాల వద్ద తెల్లవారు జామున చోటుచేటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో 50 మంది యాత్రికులు ఉన్నారు. కరెంట్ వైర్లు బస్సుపై పడకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ● గతేడాది ఆగస్టులో ఆళ్లగడ్డ సమీపంలోని ఆల్ఫా ఇంజినీరింగ్ కాలేజీ వద్ద రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ● ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె గ్రామం మెట్ట సమీపంలో నవంబర్ 22న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ● డిసెంబర్ 12న రాత్రి 11 గంటల సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు స్కూటర్ను ఢీకొంది. ప్రమాదంలో స్కూటర్పై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు. -
ఆర్టీసీ బస్సు నుంచి పొగలు
● ఉలిక్కిపడి బస్సు నుంచి దిగిన ప్రయాణికులు చాగలమర్రి: కర్నూలు నుంచి తిరుపతికి బయలు దేరిన ఆర్టీసీకి చెందిన అల్ట్రా డీలక్ బస్సులో భారీగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. చాగలమర్రి ఆర్టీసీ బస్టాండు వద్ద బస్సును ఆపడంతో క్షేమంగా కిందికి దిగారు. గురువారం తెల్లవారుజామున శిరివెళ్ల మెట్ట వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జరిగిన గంటల వ్యవధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఆపిన డ్రైవర్ వెంటనే ఇంజిన్ను చల్లదనం చేసేందుకు రేడియేటర్లో నీళ్లు పోశారు. బస్సు దగ్ధం కాకుండా చర్యలు తీసుకున్నారు. పాత బస్సుల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరారు. -
రాయలసీమ లిఫ్ట్తో ఎంతో మేలు
● సీఎం చంద్రబాబుకు రైతులు బుద్ధి చెప్పాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి నందికొట్కూరు: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. రాయలసీమలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మకై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు గుణపాఠం చెప్పాలన్నారు. నందికొట్కూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం గురవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచే వైఎస్సార్సీపీని పటిష్టం చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి తండ్రి బాటలోనే జగనన్న రైతులకు అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చారని కాటసాని అన్నారు. రైతు భరోసా కేంద్రాలతో గ్రామంలోనే రైతులకు అన్ని రకాల ఎరువులు అందించారన్నారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటామన్నారు. ● ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ గ్రామస్థాయి కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ● వైఎస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దార సుధీర్ మాట్లాడుతూ.. పక్కనే కృష్ణానది ఉన్నా సాగు, తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా టీడీపీ నేతలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ● కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు బుడ్డా శేషారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, ముస్లిం మైనార్టీ రాష్ట్ర సెల్ కార్యదర్శి జబ్బార్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధురి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి మోమిన్ మన్సూర్, జెడ్పీటీసీ సభ్యుడు సోమల సుధాకర్రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు హరిసర్వోత్తమరెడ్డి, నబీరసూల్, సర్పంచ్లు జనార్దన్ గౌడ్, నాగార్జునరెడ్డి, భాస్కర్, వెంకటేశ్వర్లు, నాయకులు యాట ఓబులేసు, కోకిల రమణారెడ్డి, నాగశేనారెడ్డి, కృష్ణారెడ్డి, పుల్యాల నాగిరెడ్డి, రమేష్ నాయుడు, శివరామకృస్ణారెడ్డి, తిరుమలేష్రెడ్డి, సులోచనమ్మ, సుధాకర్రెడ్డి, అశోక్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, మన్సూర్ పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ ఉద్యోగులకు ఆటవిడుపు
● అట్టహాసంగా ప్రారంభమైన ఎకై ్సజ్ స్పోర్ట్స్ మీట్ ● మూడు రోజుల పాటు కొనసాగనున్న క్రీడలు కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ ఔట్డోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ క్రీడాపోటీలను అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, కర్నూలు డీపీఈఓ సుధీర్ బాబుతో కలసి ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి గురువారం ప్రారంభించారు. జాతీయ రంగుల బెలూన్లను గాలిలోకి ఎగురవేయడం ద్వారా ఎకై ్సజ్ ఉద్యోగుల హర్షధ్వానాల మధ్య మైదానంలో క్రీడలు లాంఛనంగా ప్రారంభించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా వంద మీటర్ల పరుగుపందెం పోటీలు, షాట్పుట్, టెన్నికాయిట్ పోటీలను నిర్వహించారు. అనంతరం క్రికెట్ పోటీలు మూడు మ్యాచ్లు నిర్వహించారు. ఆయా జట్లకు సీఐలు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఏఈఎస్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డి, ఉమ్మడి జిల్లాల సీఐలు, ఎస్ఐలు, క్షేత్రస్థాయి సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. పరుగుపందెంలో విజేతలు ● పురుషులకు నిర్వహించిన 100 మీటర్ల పరుగుపందెంలో పీసీలు బషీర్ బాషా, విజయ్కుమార్, విరుపాక్షి రెడ్డి, షాట్పుట్లో పీసీలు వెంకటేష్ నాయక్, సుభాన్, విరుపాక్షి రెడ్డిలు ప్రథమ, ద్వితియ, తృతీయ స్థానాలు సాధించారు. ● మహిళలకు నిర్వహించిన 100 మీటర్ల పరుగుపందెంలో పీసీలు శ్వేతా రాణి, అర్చన, కల్పన, షాట్పుట్లో కౌశల్య, కల్పన, అర్చనలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ● క్రికెట్ పోటీల్లో సీఐలు రాజేంద్రప్రసాద్, సాయిప్రవీణ్, విజయ్ కుమార్ల జట్లు గెలుపొందాయి. -
కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్
పాణ్యం: జాతీయస్థాయిలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి బుధవారం ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ ఫేజ్–1 ఆన్లైన్ పరీక్షలు రెండో రోజు గురువారం ప్రశాంతంగా కొనసాగాయి. నెరవాడ మెట్ట వద్ద ఉన్న ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం సెషన్కు 178 మందిగాను 170 మంది హాజరు కాగా 8 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 175 మంది గాను 174 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి డోన్ టౌన్: అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని రాయలసీమ రీజియన్ ఫైర్ అధికారి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం డోన్ అగ్నిమాపక కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తూ ప్రమాదాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫైర్ ఇంజన్ పనితీరు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి సామర్థ్య పరీక్ష నిర్వహించారు. ఆయన వెంట డోన్ అగ్నిమాపక కేంద్రం అధికారి రంగస్వామిగౌడ్ ఉన్నారు. కర్నూలు సిటీ: ఎస్టీ, ఎస్సీ పారిశ్రామికవేత్తలు తమ కు రావాల్సిన బకాయిలు చెల్లించాలని అడిగితే అరెస్టు చేశారని, వారిపై ఎందుకంత కక్ష గట్టారని బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ అరుణ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. తమకు రావాల్సిన రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆందోళనకు దిగితే అరెస్టు చేస్తారా? అంటూ ఆయన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అల్కాలీస్ ఫ్యాక్టరీకి రూ.36.68 కోట్లు ఒకేసారి విడుదల చేశారని, అలాగే బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం డబ్బులు ఇచ్చారని, కానీ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా రోడ్డున పడేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు అప్పులు చేసి, ఆస్తులు తాకట్టుపెట్టి పరిశ్రమలు నిర్వహిస్తున్నారన్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. తప్పని పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టారని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేసి, బకాయిలు చెల్లించాలని కోరారు. ఓర్వకల్లు: మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి గురువారం పరామర్శించారు. మండలంలోని హుసేనాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు గుర్రాల చెన్నారెడ్డి ఈ నెల 21వ తేదీన కర్నూలుకు వెళుతూ మార్గంమధ్యలో పూడిచెర్ల మెట్ట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన్ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కాటసాని రాంభూపాల్రెడ్డి ఆసుత్రికి చేరుకొని పరామర్శించారు. -
వసంత పంచమికి సర్వం సిద్ధం
● అమ్మవారికి నేడు శ్రీశైలం దేవస్థానం పట్టు వస్త్రాల సమర్పణ ● చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు కొత్తపల్లి: కొలను భారతీ క్షేత్రంలో శుక్రవారం జరిగే వసంత పంచమి వేడుకలకు సర్వం సిద్ధమైనట్లు ఈఈ నరసింహారెడ్డి, శ్రీశైలం దేవస్థానం ఏఈఓ ఫణిందర్ ప్రసాద్ తెలిపారు. గురువారం వారు క్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానం కొలనుభారతి క్షేత్రాన్ని దత్తత తీసుకున్న తర్వాత మొదటిసారి జరిగే వసంత పంచమి వేడుకలు అన్నారు. ఈ ఏడాది సుమారు 20 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలై న్లు, వాహనాల పార్కింగ్, సేమియానాలు, ఆలయాలకు విద్యుత్ అలంకరణ, ఫ్లవర్ డెకరేషన్ ఏర్పాటు చేశామన్నారు. చిన్నారుల సామూహిక అక్షరాభ్యాసాలు చేసే ప్రదేశాన్ని తీర్చిదిద్దామన్నా రు. అక్షరాభ్యాసాలు చేయించుకున్న చిన్నారుల తల్లిదండ్రులకు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. క్షేత్ర పరిసరాల్లోని సప్తశివాలయాల్లో భక్తులు పూజలు చేసుకునేందుకు వసతులు కల్పించామన్నారు. క్షేత్రంలో కొ లువైన సరస్వతి అమ్మవారికి శుక్రవారం ఉదయం 4 గంటలకు మంగళహారతితో పూజలు ప్రార ంభం చేస్తారన్నారు. 5.25 గంటలకు శ్రీశైలం దేవస్థానం నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలను శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు తదితరులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామన్నా రు. అదేవిధంగా వాహనాల రద్దీని నియంర్రించేందుకు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 70 మంది పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ఆత్మకూరు సీఐ మహేశ్వరరెడ్డి, తహసీల్దార్ ఉమారాణి, ఎస్ఐ జయశేఖర్ ఏర్పాట్ల ను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపడతామన్నారు. -
విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులకు సన్మానం
కర్నూలు(సెంట్రల్): పదవి వివరణ చేసిన సుమారు 200 మంది విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులకు ఘన సన్మానం లభించింది. గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో 2007 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు పదవి విరమణ చేసిన వివిధ క్యాడర్లకు చెందిన ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ విశ్రాంత ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం తగిన సూచనలు ఇవ్వాలన్నారు. ఒక్కసారిగా 200 మందిని సన్మానించేందుకు ఏర్పాట్లు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. అనంతరం 200 మందికి శాలువ కప్పి సన్మానం చేశారు. మధ్యాహ్నం విందు భోజనం ఏర్పాటు చేసి ఉద్యోగుల కుటుంబ సభ్యులను ఆహ్వానించినట్లు ఆ సంఘవం అధ్యక్ష, కార్యదర్శులు పి.అజయ్కుమార్, సయ్యద్ రోషన్అలీ తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి కిష్టన్న, కన్వీనర్ మురారి శంకరయ్య, నాయకులు జయన్న పాల్గొన్నారు. ఆరేళ్ల నరకం.. అరుదైన వైద్యం కర్నూలు(హాస్పిటల్): అరుదైన వ్యాధితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళకు కర్నూలు పెద్దాసుపత్రి వైద్యులు ఊపిరి పోశారు. వివరాలివీ.. అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన తులసి(30) ఆరేళ్లుగా తీవ్రమైన శరీర నొప్పులు, కండరాల బలహీనతతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. చికిత్స కోసం రూ.5లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సన్నిహితుల సలహాతో దివ్యాంగుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. పరీక్షించేందుకు ఆదోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపునకు పంపించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నాగరాజు ఆమె వైద్యపరీక్షల నివేదికలు పరీక్షించారు. పాస్ఫరస్ తగ్గడం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించుకుని, పూర్తిస్థాయి వైద్యపరీక్షలు, చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు గత సంవత్సరం అక్టోబర్ 25న రెఫర్ చేశారు. ఎండోక్రైనాలజి విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాసులు, డాక్టర్ రాధారాణి బృందం ఆమెను పరీక్షించి సమగ్ర వైద్యపరీక్షలు చేయించారు. పీఈటీ స్కాన్లో వెన్నుముక చివర కణితి ఉన్నట్లు గుర్తించారు. దీని కారణంగానే శరీరంలో పాస్ఫరస్ తగ్గుతోందని తెలుసుకున్నారు. అవసరమైన శస్త్రచికిత్స కోసం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. అక్కడ సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ ఎస్.చైతన్యవాణి, డాక్టర్ జి.బీసన్నలు ఆమెను పరీక్షించారు. గత నవంబర్ 10 శస్త్రచికిత్స ద్వారా కణితి తొలగించారు. ఆపరేషన్ జరిగిన 24 గంటల్లోనే ఆమె ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. వారం వ్యవధిలోనే ఆమె స్వయంగా నడవగలిగే స్థాయికి చేరుకుంది. గురువారం ఆమె పరీక్షల కోసం ఆసుపత్రికి రావడంతో విజయవంతమైన చికిత్స గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, వైద్యులు విలేకరులకు వివరించారు. సమావేశంలో సీఎస్ఆర్ఎం డాక్టర్ పద్మజ, ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, అనెస్తెటిస్ట్ డాక్టర్ భారతి, రేడియాలజిస్టు డాక్టర్ ఎస్.వినోద్కుమార్ పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. నందికొట్కూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నీలిషికారి పేట సమీపంలో కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన నడిపెన్న (60)ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన వృద్ధుడిని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమార్తె నందికొట్కూరు రూరల్ సర్కిల్ పోలీసు స్టేషన్ కార్యాలయంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. -
ఆకుపై నేతాజీ
దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ఓ విద్యార్థి రావి ఆకుపై ఆవిష్కరించాడు. ఈ నెల 23న ఆయన జయంతి సందర్భంగా స్థానిక నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి ఎం. ఈరన్న రావి ఆకుపై ఆజాద్ చిత్రాన్ని రూపొందించాడు. ఎంఈఓ–2 శ్రీనివాసులు, పాఠశాల హెచ్ఎం ఫయాజుద్దీన్, డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్.కీర, ఉపాధ్యాయులు అభినందించారు. – ఆదోని సెంట్రల్ -
ఉద్యమానికి సిద్ధంకండి
● ఈనెల 30 నుంచి నిరసన కార్యక్రమాలు ● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు టీకే జనార్దన్ ఎమ్మిగనూరుటౌన్: ఇచ్చిన హామీలు అమలు చేసేలా టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధం కావాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు టికె.జనార్దన్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరు మండలాల ఎస్టీయూ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నేటికి 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. 12వ పీఆర్సీ ఆలస్యమతుండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోకుండా 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో వున్న గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్మెంట్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో నెంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 2024 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన నాలుగు విడతల డీఏలను సత్వరం విడుదల చేయాలని సూచించారు. ఎన్నికల హమీల్లో భాగంగా ఉద్యోగులకు సీపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయ ప్రయోజనకరమైన విధానాన్ని పరిశీలిస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతున్నా దృష్టి సారించలేదన్నారు. సీపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఓపీఎస్ విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల అమలకు దశల వారీగా ఉద్యమాలు చేపట్టనున్నామన్నారు. ఇందు లో భాగంగా ఈనెల 30వ తేదీన తహసీల్దార్లకు వినతి పత్రాలివ్వడం, ఫిబ్రవరి 10వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం, ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్టీయూ నాయకులు బాబయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడివన్న, నాయకులు వెంకటేశ్వర్లు, ప్రసన్నరాజు, నాగరాజు, వెంకట్రాముడు, రామచంద్ర, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీ కిడ్నాప్ కలకలం
● 100కు కాల్ చేసిన కుటుంబ సభ్యులు ● కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసులు ● ఆర్థిక లావాదేవీలే కిడ్నా్ప్నకు కారణం ఎమ్మిగనూరు రూరల్: ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ ఆర్ఎంపీ కిడ్నాప్ ఘటన ఎమ్మిగనూరు పట్టణంలో కలకలం రేపింది. అతని కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఆర్ఎంపీ ఉప్పర కృష్ణకు పెద్దకడబూరు మండలం కంపాడుబాపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ లోకేష్ ఆచారి మధ్య ఆర్థిక లావాదేవిలు ఉన్నాయి. తాను అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదా స్థలం రిజిస్ట్రేషన్ చేయించాలని లోకేష్ ఆచారి ఒత్తిడి తెచ్చాడు. అయితే రూ. 1.50 కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ. 80 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పడంతో కృష్ణ నిరాకరించాడు. దీంతో కిడ్నాప్ చేసి బళ్లారిలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు లోకేష్ ఆచారి కుట్ర పన్నాడు. ఈ మేరకు గురువారం గాంధీనగర్లో శిల్పాప్రైయిడ్లోని ఇంటి గేటు నుంచి బయటకు వస్తున్న కృష్ణను అప్పటికే కాపుకాసిన లోకేష్ఆచారి, కృష్ణమూర్తి ఆచారి, భాస్కర్రెడ్డితో పాటు మరో ఇద్దరు కృష్ణను బలవంతంగా ఆటోలోకి తోసి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే 100కు కాల్ చేయటంతో పట్టణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణ ఎస్ఐ మధుసూదన్రెడ్డి సాంకేతిక పరిజ్ఞానంతో దుండగల జాడను గుర్తించి ఆలూరు మీదుగా బళ్లారి వైపు వెళ్తున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే ఆలూరు పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వటంతో అక్కడ పోలీసులు ఆటోను ఆపి కృష్ణతో పాటు కిడ్నాపర్లను ఆలూరు పోలీసులు అదుపులో తీసుకుని ఎమ్మిగనూరుకు తరలించారు. దాడిలో గాయపడిన కృష్ణను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిడ్నాపర్లపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని టౌన్ ఎస్ఐ తెలిపారు. పోలీసులు స్పందించడంతో తాను ప్రాణాలతో బయట పడ్డాడని ఆర్ఎంపీ కృష్ణ చెబుతున్నారు. -
అటవీ సంరక్షణలో సిబ్బంది కీలకం
● ఆత్మకూరు వన్యప్రాణి డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ ఆపావ్ ఆత్మకూరు: అటవీ సంరక్షణలో ఎఫ్బీవో, ఏపీఓలు, సిబ్బంది కీలకమని ఆత్మకూరు డివిజన్ వన్యప్రాణి డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ ఆపావ్ అన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలో వన్యప్రాణి డివిజన్ కార్యాలయంలో జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్కుమార్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరం నూతన క్యాలెండర్, డైరీలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విఘ్నేష్ ఆపావ్ మాట్లాడుతూ అటవీ సంపద, పెద్ద పులుల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అడవిలో విధులు నిర్వర్తించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనిల్కుమార్ మాట్లాడుతూ.. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బంది విధి నిర్వహణలో తప్పనిసరిగా యూనిఫాం ధరించాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ సయ్యద్పీరా, సెక్రటరీ ఎస్.జెడ్ తాహీర్ అహ్మద్, ఆర్గనైజర్ సెక్రటరీ కావేరి, జాయింట్ సెక్రటరీ తమ్మిశెట్టి కుమార్, ట్రెజరర్ ఆబిదా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎన్సీసీతో క్రమశిక్షణ కర్నూలు (టౌన్): ఎన్సీసీ ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిగత క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతుందని ఎన్సీసీ కర్నూలు గ్రూపు కెప్టెన్ అరుణ్ అన్నారు. గురువారం స్థానిక సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ – ఏ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్సీసీ ద్వారా విద్యార్థులకు ఽధైర్య సాహసాలు అలవడుతాయని, ఎన్సీసీ వైపు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. ఈ సర్టిఫికెట్తో ఉద్యోగ, ఉపాధితో పాటు మెడికల్, ఇంజినీరింగ్ ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు దాసరి సుధీర్, ప్రతాప్ వినయ్, ఇన్స్పెక్టర్లు రవికుమార్, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. యాజమాన్య పద్ధతులతో మామిడిలో అధిక దిగుబడులు డోన్ టౌన్: మామిడి తోటల రైతులు యాజమాన్య పద్ధతులు పాటించి సస్య రక్షణ చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చునని యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఆదినారాయణ, డోన్ ఉద్యానవనశాఖ అధికారిణి కళ్యాణి అన్నారు. గురువారం యు.కొత్తపల్లె గ్రామ రైతు సేవా కేంద్రంలో మామిడి తోట రైతులకు అవగాహన సదస్సును నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం అధిక వర్షాలు, తుపాన్ల కారణంగా బెట్ట ఆలస్యం అయ్యిందని, ఇప్పుడు వస్తు న్న పూతకు మొగ్గలు వచ్చిన వెంటనే నీరు అందించాలని సూచించారు. పూతకు రాని తోట ల్లో అర్క మ్యాంగో స్పెషల్ను 5 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేసుకోవాలన్నారు. కవర్లు ఉపయోగించండి.. పిందె దశలో మామిడి పండ్లకు కవర్లు ఉపయోగించడం ద్వారా మంచి నాణ్యత కల్గిన పంట దిగుబడి సాధించవచ్చుని, ఇవి సబ్సిడీతో రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. కవర్లతో పాటు పండ్లు మార్కెట్కు తరలించడానికి అవసరమయ్యే ట్రేలు కూడా సబ్సిడీపై లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లారీ, కారు ఢీ బండిఆత్మకూరు: పెద్ద దేవళాపురం గ్రామం వద్ద గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ లారీ, కారు ఢీకొని పలువురికి స్వల్ప గాయ్యాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన కొందరు ఆత్మకూరు సమీపంలోని దర్గాను దర్శించుకుని తిరిగి ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో పెద్ద దేవళాపురం గ్రామం వద్దకు రాగానే కారు డ్రైవర్ అజాగ్రతగా నడుపుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం
● కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది ● నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి నంద్యాల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చూపిద్దామని వైఎస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి అన్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు కష్టపడి పనిచేయాలన్నారు. కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో నంద్యాల నియోజకవర్గస్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నంద్యాల పరిశీలకులు భూమా కిశోర్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పీపీనాగిరెడ్డి హాజరయ్యారు. సమావేశంలో శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి మాట్లాడుతూ.. ‘దోచుకో, దాచుకో, పంచుకో’అన్న రీతిన రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 18 నెలల కాలంలోనే రూ.3లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చాక వాటి అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని శిల్పా విమర్శించారు. నంద్యాలలో టీడీపీ నేతలకు డబ్బులు ఇస్తేనే అభివృద్ధి పనులు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు యూరియా పంపిణీలో కూడా రాజకీయాలు అంటగట్టి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. రాజకీయాల పేరు చెప్పుకొని రేషన్ డీలర్, పొదుపు లీడర్లను, అంగన్శాడీ పోస్టులను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారం చేతిలోకి వచ్చాక అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండబోదని, టీడీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు దేశం సుధాకర్ రెడ్డి, పీపీ మధుసూదన్రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సాయినాథ్ రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ జీవీ రమణ, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, నంద్యాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బెక్కెం రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ప్రహ్లాద రెడ్డి, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, డాక్టర్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టీవై శివయ్య, నంద్యాల జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనీల్ అమృతారాజ్, మాజీ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పురుషోత్తమ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గ్రామాల్లో అశాంతి ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ పేరుతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారించి గ్రామాల్లో అశాంతి రాజేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందన్నారు. మహిళా ఎస్ఐపైనే దాడులకు పాల్పడ్డం ఏమిటని ప్రశ్నించారు. నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు భూమా కిశోర్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయ శాఖ మంత్రి ఇలాఖాలో న్యాయమే లేదని, మట్టి , ఇసుక , మద్యం ఇతర పనుల్లో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. -
పెళ్లి పేరుతో మోసం
● పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులతో కలసి యువతి ధర్నా ఆత్మకూరురూరల్: తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి నమ్మించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఒక యువతి తన కుటుంబ సభ్యులతో కలసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు .. ఏబీఎం పాలేనికి చెందిన యువతిని స్వరాజ్ నగర్కు చెందిన యువకుడు దారా రాజ్ కుమార్ ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటాని వాగ్దానం చేయడంతో కుటుంబ సభ్యులతో యువతి తల్లిదండ్రులు మాట్లాడారు. వారు వివాహానికి నిరాకరించడంతో తమకు న్యాయం చేయాలని బుధవారం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. రెండు కుటుంబాల వారు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని తెలిపారు. -
నల్లమలలో విజృంభిస్తున్న ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్
ఆత్మకూరు రూరల్: అడవి పందుల పాలిట మృత్యువుగా చెప్పుకునే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నల్లమలలో తిరిగి విజృంభిస్తోంది. నాగార్జునసాగర్–శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలోని పెద్దనంతాపురం సెక్షన్లో నందుల ఈరన్న, జడలయ్య బేస్ క్యాంప్ పరిధిలో వారం రోజులుగా అడవి పందులు మృత్యువాత పడుతున్నాయి. బైర్లూటి ఎఫ్ఆర్వో కృష్ణ ప్రసాద్ చనిపోయిన కొన్ని అడవి పందులకు పోస్టుమార్టం చేయించి పరీక్షల కోసం సంబంధిత ల్యాబ్కు పంపించారు. ప్రాథమికంగా కనిపించిన లక్షణాలను బట్టి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్తోనే మరణించినట్లు భావిస్తున్నారు. రెండేళ్ల కిందట శ్రీశైలం అటవీ రేంజ్ పరిధిలో అడవి పందులు, ముఖ్యంగా పిల్లలు కుప్పలుతెప్పలుగా మరణించాయి. అప్పట్లో కూడా మరణాలకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవరే కారణమని గుర్తించారు. ఆ సందర్భంగా దీన్ని వైల్డ్ లైఫ్ మెడికల్ ఎమర్జెన్సీగా ప్రభుత్వం గుర్తించింది. నంద్యాలలో పందుల మరణాలు జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలోని ఓ వ్యక్తికి చెందిన పందుల ఫారంలోని 40 పందుల్లో 30 ఇటీవల హఠాత్తుగా మరణించినట్లు తెలుస్తోంది. ఇవి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వల్లే చనిపోయాయా అన్న అనుమానంతో అటవీ అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఆత్మకూరు, వెలుగోడు పట్టణాల పరిధిలోని గ్రామాల్లో పందుల పెంపకందారుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. వైరస్ నల్లమలకు చేరిందిలా.. బైర్లూటి రేంజ్లో అడవి పందులు మరణించిన సంగతి తెలియగానే ఫుట్ పెట్రోలింగ్ను పెంచాం. మరణాల సంఖ్య పెరుగుతుందేమోనన్న విషయాన్ని పరిశీలిస్తున్నాం. ప్రాథమిక అంచనా మేరకు వీటి మరణానికి ఆఫ్రికన్ స్వైన్ ఫీవరే కారణంగా భావిస్తున్నాం. ఇది అడవిలో ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా శానిటేషన్ చేపడుతున్నాం. – విగ్నేష్అపావ్, డిడి, ప్రాజెక్ట్ టైగర్, ఎన్ఎస్టిఆర్ పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్(ఏఎస్ఎఫ్) వైరస్కు కారణం శ్రీశైలం ఆలయ పట్టణానికి ఆనుకుని ఉండే సున్నిపెంట గ్రామంలోని పెంపుడు పందుల ఫారాలేనని గతంలో తేలింది. బెంగళూరు తదితర నగరాల నుంచి పెంపకానికి తీసుకొచ్చిన సీమ పందులలో ఉన్న ఏఎస్ఎఫ్ వైరస్ వారి ఫారాలలో ఉన్న ఊర పందులకు సోకినట్లు తెలుస్తోంది. అవి అడవిలో మేతకు వెళ్లినపుడు అడవిపందులకు వ్యాప్తి చెందినట్లు వన్యప్రాణి వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన పందులు అంతర్గత రక్తస్రావంతో(ఇంటర్నల్ బ్లీడింగ్)కూడిన జ్వరంతో అతి వేగంగా మరణానికి చేరువవుతాయి. ఇది మనుషులకు, ఇతర వన్యప్రాణులకు సంక్రమించదని సమాచారం. ఈ ఫీవర్కు నేరుగా చికిత్స లేకపోయినా, వైరస్ విస్తరించకుండా శానిటేషన్ చేయించడం ఒక్కటే మార్గంగా తెలుస్తోంది. -
నమో.. నారసింహా
ఆళ్లగడ్డ: పార్వేట ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉత్సవమూర్తులు జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదస్వామి యాదవాడ గ్రామంలో కొలువు దీరారు. గ్రామ పొలిమేర తెలుపుపై కొలువైన ఉత్సవమూర్తులకు గ్రామ ప్రజలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు భుజాలపై పల్లకీని మోసుకుంటూ తెలుపులపై కొలువుంచారు. పారువేట ఉత్సవాల్లో భాగంగా 16వ తేదీన కొండదిగిన ఉత్సవ పల్లకి ఆళ్లగడ్డ మండలం పూర్తి చేసుకుని బుధవారం రాత్రికి రుద్రవరం మండలంలోకి ప్రవేశించింది. ఆలమూరు గ్రామంలో తెలుపుపై ఉత్సవ పల్లకీని కొలువుంచి స్వామిని ప్రజలు దర్శించుకున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి శంకర్నాయక్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మూడు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మొత్తం 9,544 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్ ఎగ్జామినర్లకు 22న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తామని చెప్పారు. రేబిస్తో యువకుడు మృతి కర్నూలు(హాస్పిటల్): కుక్కకాటుతో రేబిస్ బారినపడి ఓ యువకుడు మృతి చెందిన ఘ టన నంద్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బనగానపల్లె మండలం జమ్ములదిన్నె గ్రామానికి చెందిన టి.హరిగోపాల్(25) మూడు నెలల క్రితం కుక్కకాటుకు గురయ్యాడు. కుక్క కరిచినా అతను వ్యాక్సిన్ వేసుకోకపోవడంతో ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. కుటుంబసభ్యులు ఈ నెల 19న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. ఆసుపత్రిలోని అంటువ్యాధుల విభాగంలో చికిత్స పొందుతున్న అతను బుధవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మల్టీపర్పస్ గోదాములతో ఆదాయంకర్నూలు(అగ్రికల్చర్):జిల్లాలో నిర్మించిన మల్టీపర్పస్ గోదాములను సద్వినియోగం చేసుకొని ఆదాయం పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కో–ఆపరేటివ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ శ్యామ్కుమార్ తెలిపారు. గోదాములను శాసీ్త్రయంగా వినియోగించుకోవడం ఎలా అనే అంశంపై జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సహకార సంఘాల సీఈఓల కు నిర్వహించిన వర్క్షాపులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్టీపర్పస్ గోదాములు సహకార సంఘాలకు ఆస్తులని, వీటిని చక్కగా వినియోగించుకుంటే సంఘాలను లాభాల బాట పట్టించవచ్చన్నారు. రైతులు పండించిన వివిధ పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. గోదాముల్లో నిల్వ చేసిన ఉత్పత్తుల నాణ్యత దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత సంఘాల సీఈఓలదేనని, శాసీ్త్రయ పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సునీల్కుమార్, జిల్లా సహకార ఆడిట్ అధికారి చెన్నమ్మ పాల్గొన్నారు. -
పూర్తి‘స్థాయీ’లో నీరివ్వాలి
కర్నూలు(అర్బన్): రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉందని, రబీ పంటలకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి కెనాల్ కింద 68 చెరువులను నింపామని ఇరిగేషన్ అధికారులు చెప్పటాన్ని జెడ్పీ చైర్మన్ తప్పుబట్టారు. జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను బుధవారం నిర్వహించారు. ఏడో స్థాయీ సంఘ సమావేశంలో నీటి పారుదల శాఖపై జరిగిన సమీక్షలో హెచ్ఎన్ఎస్ఎస్ కింద ఎన్ని చెరువులను నింపారని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ప్రశ్నించారు. మొత్తం 77 చెరువుల్లో 68 చెరువులను నింపామని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. వెంటనే దేవనకొండ జెడ్పీటీసీ రామక్రిష్ణ మాట్లాడుతూ తన మండలంలోని నల్లచెలిమిల వద్ద ఉన్న రెండు చెరువులకు నేటికి ఒక్క చుక్క నీరు రాలేదని చెప్పారు. దీంతో జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి జోక్యం చేసుకుంటు వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు అధికారులు ప్రయత్నించాలే తప్ప అవాస్తవాలను చెప్పరాదని హితవు పలికారు. ‘అవుకు’ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి హెచ్ఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బీసీ సర్కిల్ –1, 2, గోరుకల్లు రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉందని, ప్రస్తుత రబీ సీజన్లో పూర్తి స్థాయిలో సాగు నీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. అవుకు రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేసుకునేందుకు చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మార్చి 31వ తేదీ వరకు ఆయా కెనాల్స్ ద్వారా నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. టీబీ డ్యాం గేట్ల పనులు జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 10 నుంచి ఎల్ఎల్సీకి నీటిని నిలిపి వేశారని, వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి అవసరాల కోసం ఏప్రిల్ నెలలో ఎల్ఎల్సీకి నీటిని విడుదల చేస్తారని సంబంధిత ఇంజినీరు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుడూ అన్ని కాలువల్లో మార్చి 31వ తేదీ వరకు నీరు విడుదలవుతున్న నేపథ్యంలో వివిధ రకాల అభివృద్ధి పనులను మే నెల నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. రూ. 724.114 కోట్ల అంచనా బడ్జెట్కు ఆమోదం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా పరిషత్, వివిధ అనుబంధ శాఖలపై రూపొందించిన రూ.724.114 కోట్ల అంచనా బడ్జెట్కు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇందులో వ్యయాన్ని రూ.718.773 కోట్లుగా చూపించారు. కేవలం జిల్లా పరిషత్కు సంబంధించి 2026–27కు అంచనా బడ్జెట్ను రూ.15.78 కోట్లుగా ప్రతిపాదించారు. స్టాంప్ డ్యూటీ కింద 2026–27లో రూ.8,18,87,820, తలసరి గ్రాంట్ రూ.4 ప్రకారం రూ.1,15,42,160లు, గనుల శిస్తు కింద రూ.6,22,20,542, జిల్లా పరిషత్కు క్వార్టర్లు, షాపింగ్ కాంప్లెక్సులు, ఇతర భవనాల కింద రాబడులను రూ.22,02,300 వస్తాయని అంచనా బడ్జెట్ను రూపొందించారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, ఆయా స్టాండింగ్ కమిటీల చైర్పర్సన్లు కురువ బుజ్జమ్మ, పీ దివ్యతో పాటు పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, విద్య, వైద్యం తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. అందని పంట నష్ట పరిహారం గత రెండేళ్లుగా వివిధ కారణాలతో తీవ్రంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం నేటికి అందలేదని జెడ్పీటీసీ సభ్యులు సుధాకర్రెడ్డి, సుంకన్న, మహేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఆర్థికనష్టాన్ని చవి చూశారన్నారు. ఒక క్వింటానికి రైతులు రూ.800 వరకు నష్టపోయారన్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యూరియా కూడా అవసరాల మేరకు రైతులకు అందడం లేదని వాపోయారు. ఎన్టీఆర్ వైద్య సేవలో అక్రమాల జోరు జిల్లాలోని మెజారిటీ ప్రైవేటు అసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవను అడ్డుపెట్టుకొని పేద రోగుల నుంచి ముక్కుపిండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కర్నూలు నగరంలోని పలు హాస్పిటల్స్ రోగులు ఆసుపత్రికి వచ్చిన వెంటనే రోగి వెంట వచ్చిన వారి నుంచి తాము ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదని తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రభుత్వం జిల్లాకు రూ.25 కోట్లను విడుదల చేసిందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రైవేటు అసుపత్రులు గండి కొడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ ఎం భాస్కర్రెడ్డి మాట్లాడుతూ ఎక్కడైనా డబ్బులు డిమాండ్ చేస్తే కాల్ సెంటర్ నంబర్: 1800 4254299కు కాల్ చేయాలని ప్రతి హాస్పిటల్లో మూడు చోట్ల ఫ్లెక్సీలు పెట్టామన్నారు. అక్రమ వసూళ్లకు సంబంధించి ప్రతి నెలా ఎన్ని ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దాదాపు 40 నుంచి 45 కాల్స్ వస్తున్నాయని, వీటిని విచారిస్తే దాదాపు 15 నుంచి 20 కాల్స్ వాస్తవని రుజువు అవుతున్నాయని భాస్కర్రెడ్డి సమాధానమిచ్చారు. కర్నూలు నగరంలోని పలు హాస్పిటల్స్కు జరిమానాలు విధించామన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్లో అవినీతి అక్రమాలు పెరిగిపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందన్నారు. -
జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు సిటీ: దేశ వ్యాప్తంగా ఎన్ఐటీ, ఐఐటీల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్–2026 మొదటి విడత పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిబంధనల ప్రకారం పరీక్ష సమయానికి గంటముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతించా రు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించా రు. జేఈఈ మెయి న్స్ పరీక్షలు ఈ నెల 29వ తేది వరకు జరుగనున్నాయి. పరీక్షలకు కె.వి సుబ్బా రెడ్డి కాలేజీలోని ఆయాన్ డిజిటల్లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈ పరీక్షకు 254 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ట్రావెల్స్కు చెందిన బస్సులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ ముగ్గురూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరాణ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కూడా స్పందించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బస్సు క్లీనర్ అప్రమత్తంగా ప్రయాణికులను హెచ్చరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. -
కోటకందుకూరులో పార్వేటోత్సవం
ఆళ్లగడ్డ: పార్వేట మహోత్సవాల్లో భాగంగా గ్రామ గ్రా మానా విశేష పూజలందుకూంటూ తిరుగుతున్న అహోబిలేశుడి ఉత్సవ పల్లకి ఆదివారం కోటకందుకూరు గ్రామంలో కొలువుదీరింది. తెలుపులపై కొలువైన ఉత్సవ మూర్తులు శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరద స్వాములకు గ్రామస్తులు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవపల్లకీని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులకు అర్చకులు సంతానం స్వామి తీర్థప్రసాదాలు అందజేసి ఆశ్వీరచనాలు అందజేశారు. స్వామి రాకతో గ్రామంలో తిరుణాల వాతవరణం నెలకొంది. నేడు మర్రిపల్లిలో... అహోబిలేశుడి ఉత్సవ పల్లకి సోమవారం మర్రిపల్లి చేరుకోనుంది. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కోటకందుకూరులో విశేష పూజలు అందుకున్న ఉత్సవపల్లకి అర్ధరాత్రి అనంతరం కోటకందుకూరు నుంచి బయలుదేరి సోమవారం మర్రిపల్లి చేరుకుటుంది. -
అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టాలి
కర్నూలు: అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టాల ని సుప్రీం కోర్టు తీర్మానించిందని, ఇందులో భాగంగా ఈనెల 23వ తేదీ వరకు మధ్యవర్తిత్వాలను ఎలా అమ లు చేయాలనే విషయమై న్యాయవాదులకు అవగాహ న కల్పిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు కబర్ధి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులకు స్థానిక లీగల్సర్వీ సెస్ అథారిటీ కార్యాలయ భవనంలో సోమవారం మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమాన్ని కబర్ధి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టుతో పాటు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టాలని తీర్మానించిందన్నారు. చైన్నె నుంచి వచ్చిన మధ్యవర్తిత్వ శిక్షణ సిబ్బంది రత్నతార, శశిదేవిల పర్యవేక్షణలో న్యాయవాదులకు శిక్షణ ఇస్తు న్నట్లు చెప్పారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ వివాదాలపరిష్కా రానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమన్నా రు. దీనివల్ల కోర్టులో కేసులు విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించుకోవచ్చన్నారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్, కర్నూలు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు హరినాథ్ చౌదరి, కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం శాపమై.. బీమా దూరమై
● జిల్లాలో 1.77 లక్షల హెక్టార్లలో రబీ పంటలు సాగు ● గడువు ముగుస్తున్నా పత్తాలేని బీమా చెల్లింపు ప్రకటన ● ప్రీమియం చెల్లింపునకు ఇంకా ప్రారంభం కానీ పోర్టల్ ● ఈ నెలాఖరు వరకే గడువు ● ఆందోళనలో రైతులు కోవెలకుంట్ల: రైతులతో చంద్రబాబు సర్కార్ చెలగాటమాడుతోంది. ఓ వైపు ఉచిత పంటల బీమాను అటకెక్కించిన ప్రభుత్వం మరో వైపు రైతులే ప్రీమియం చెల్లిందామనుకున్నా పోర్టల్ను ప్రారంభించకుండా చోద్యం చూస్తోంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీ సీజన్లో 1.77 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో 53,801 హెక్టార్లలో పప్పుశనగ, 11,603 హెక్టార్లలో మినుము, 29,413 హెక్టార్లలో జొన్న, 36,139 హెక్టార్లలో వరి, 1,749 హెకార్టలో వేరుశనగ పంటలు సాగయ్యాయి. గత ఏడాది నుంచి రబీ సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు రైతులే ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద 2025 రబీసీజన్కు సంబంధించి పప్పుశనగ, జొన్న, మినుము, పెసర, వేరుశనగ పంటలకు బీమా వర్తింప చేస్తూ ప్రకటన జారీ చేసింది. వ్తితనం వేసినప్పటి నుంచి పైరు వివిధ దశల్లో తుపాన్లు, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందనుంది. వాతావరణ అంశాల ఆధారంగా సంబంధిత పంట నష్టాన్ని అంచనా వేసి బీమా పరిహారం చెల్లిస్తారు. ఎంపిక చేసిన పంటలను సాగు చేసి నిర్ణీత సమయంలో బీమా చెల్లించి పంటల వివరాలు నమోదు చేసుకున్న కౌలు రైతులతో సహా రైతులందరూ బీమా పథకానికి అర్హులు. గత ఏడాది అక్టోబర్ నెలలో సంభవించిన మోథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా వరి, మిరప, పత్తి, కంది, మినుము, తదితర పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోయారు. దెబ్బతిన్న పంటలపై నష్టపరిహారం అంచనా వేసి వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఇప్పటి వరకు రైతులకు పంట నష్ట పరిహారం అందలేదు. అసలు వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. రబీ బీమా చెల్లింపుపై నీలినీడలు: రబీ సీజన్కు సంబంధించి పంటల బీమా చెల్లించడానికి ఇంత వరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నెల క్రితం ఏఏ పంటకు ఎంతెంత బీమా చెల్లించాలనే ప్రకటన విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రైతులు ఆయా పంటలకు ప్రీమియం ఎప్పుడు చెల్లించాలో చెప్పలేదు. మరో పదిహేను రోజుల్లో ఈ ఏడాది రబీ సీజన్ ముగియనుంది. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన రైతులు బీమా చెల్లింపుకు ఎదురు చూస్తున్నారు. అసలు ఏ కంపెనీ పేరుమీద ప్రీమియం చెల్లించాలో రైతులకు తెలియని పరిస్థితి నెలకొంది. మీ సేవ, రైతుసేవా, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళితే బీమా చెల్లింపుకు సంబంధించి పోర్టల్ ఓపెన్ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. పోర్టల్ ప్రారంభమైతే తప్ప ప్రీమియం చెల్లింపు సాధ్యం కాకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నలకు శాపంగా మారింది. ప్రతి ఏటా అక్టోబర్ నెల రబీ సీజన్ ప్రారంభమవుతుంది. నవంబర్ మొదటి వారంలోనే రైతులు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ ముగిసి జనవరి నెల సగం రోజులు కావస్తున్నా బీమా చెల్లింపుకు ప్రకటన రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని రబీ పంటలకు బీమా పథకాన్ని అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. రైతులను ఆదుకున్న జగన్ సర్కార్: ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన పంటలకు గత ప్రభుత్వమే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించడంతోపాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టం సంభవిస్తే అదే సీజన్లో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకుంది. నంద్యాల జిల్లాలో 2021లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటనష్టం సంభవించగా 89,199 మంది రైతులకు రూ. 123 కోట్లు, 2022లో 49,637 మంది రైతులకు దాదాపు రూ. 85 కోట్లను ఇన్సురెన్స్ రూపంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. 2022లో పంటకోత ప్రయోగం (దిగుబడి ఆధారంగా) 34.9 కోట్ల పరిహారం, వాతావరణ ప్రభావంతో రూ. 50.14 కోట్ల పరిహారం మంజూరైంది. ఈ ఏడాది ఎకరా రూ. 16 వేలు కౌలు చెల్లించి రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని రబీ సీజన్లో పప్పుశనగ పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు రూ. 15 వేలు వెచ్చించాను. ప్రస్తుతం పైరు పూత, పిందె దశలో ఉంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ప్రీమియం చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు అవకాశం కల్పించలేదు. – ప్రతాప్రెడ్డి, రైతు, భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రభుత్వమే పంటల బీమాకు సంబంధించి ప్రీమియం కట్టేది. అతివృష్టి, అనావృష్టి, తదితర ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం జరిగితే అదే సీజన్లో నష్ట పరిహారం చెల్లించేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రబీసీజన్ పంటలకు రైతులే ప్రీమియం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది 60 ఎకరాల్లో పప్పుశనగ, జొన్న పంటలు సాగు చేశాను. ఇప్పటి వరకు పంటల బీమా చెల్లించేందుకు పోర్టల్ ఓపెన్ కావడం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్ట సంభవిస్తే మా పరిస్థితి ఏమిటి. – గోవిందరెడ్డి, రైతు, గుంజలపాడు, కోవెలకుంట్ల మండలం కోవెలకుంట్ల సమీపంలో రబీలో సాగైన పప్పుశనగ జిల్లాకు ఇన్సూరెన్స్ వర్తింపు ఇలా (రూ. కోట్లలో) -
వేమన పద్యాలతో వ్యక్తిత్వ వికాసం
నంద్యాల: యోగి వేమన రచించిన పద్యాలు సమాజానికి నైతిక బోధనను అందించాయని, వాటిని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ హాజరయ్యారు. యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..యోగి వేమన పద్యాలు సామాజిక సమానత్వం, మానవతా విలువలు, నిజాయితీ, కష్టపడి జీవించడం వంటి అంశాలను బలంగా ప్రతిపాదిస్తాయన్నారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్,జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయ క్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. జిల్లా పోలీసు కార్యాలయంలో వేమన చిత్రపటానికి పూలమాల వేసి అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమన తన పద్యాలతో , మానవతా విలువలను చాటిచెప్పారన్నారు. సమాజంలోని మూఢాచారాలను నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తగా వేమన అని గుర్తుచేశారు. సాయుధ బలగాల డీఎస్పి శ్రీనివాసులు, రిజర్వు ఇన్స్పెక్టర్ మంజునాథ్, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
శివయ్యా.. తోవ చూపవయ్యా!
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీగిరి సిద్ధమవుతుంది. ఉత్సవాలకు ముందే ప్రతి ఏటా నల్లమల అటవీప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు శివనామస్మరణ చేసుకుంటూ పాదయాత్రగా శ్రీశైలం వెళ్లేవారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ సుమారు 40 కిలోమీటర్లు నడిచేశా రు. అయితే ఈ ఏడాది అటవీశాఖ పాదయాత్రపై ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే నల్లమల అడవిలో పాదయాత్రకు పలు నిబంధనలతో అనుమతి ఇచ్చింది. దీంతో నల్లమల అటవీప్రాంతంలో భక్తుల శివనామస్మరణ మూగబోనుంది. అటవీశాఖ నుంచి అనుమతి ఇప్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. పది రోజుల ముందు నుంచే పాదయాత్ర శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల ప్రారంభానికి పది రోజుల ముందే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది సామాన్య భక్తులు, శివమాల స్వీకరించిన వారు నల్లమల అటవీప్రాంతం గుండా పాదయాత్ర చేసుకుంటూ శ్రీగిరి చేరుకుంటారు. బ్రహ్మోత్సవాల కంటే ముందుగా భక్తుల పాద యాత్ర ప్రారంభమై మహాశివరాత్రి రోజు వరకు జరుగుతుంది. ప్రతి ఏటా పలువురు భక్తులు కాలినడకన వస్తామని మల్లన్నకు మొక్కుకుని తరలివస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతించారు. వృద్ధులు, మహిళలు సైతం మల్లన్నపై భక్తితో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు పాదయాత్ర చేసుకుంటూ శ్రీగిరి చేరుకుంటారు. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర గోసాయికట్ట వీరాంజనేయస్వామి గుడి, నాగలూటి వీరభద్రస్వామి దేవాలయం, దామెర్లకుంట, పెద్దచెరువు, కత్తులకొండ, సీతమ్మబావి, మఠంబావి, భీమునికొలను, కై లాసద్వారం అక్కడి నుంచి హఠకేశ్వరం, సాక్షిగణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటుంది. మొత్తం నల్లమల అటవీప్రాంతంలో నడవాల్సి ఉంటుంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలలో వృద్ధులు, మహిళలు సైతం బెదరకుండా నడుచుకుంటూ శ్రీగిరి చేరుకుంటారు. అటవీప్రాంతంలో మొత్తం 40 కిలోమీటర్లు పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. సామాన్య భక్తులతో పాటు శివమాల స్వీకరించిన వృద్ధులు, మహిళలు, చిన్నారులు సైతం శ్రీగిరి చేరుకుంటారు. అన్నదానాలు రద్దునల్లమల అటవీప్రాంతంలో పాదయాత్ర భక్తుల సౌకర్యార్థం ప్రతి ఏటా పలువురు అన్నదానం చేస్తారు. నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కై లాసద్వారం వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు ముందు నుంచే అటవీప్రాంతంలో సేవా కార్యక్రమాల పేరుతో అన్నదాన వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది అన్నదాన కార్యక్రమాలకు కూడా కొన్ని రోజులు బ్రేక్ పడనుంది. అనుమతి ఇప్పించడంలో విఫలమైన చంద్రాబాబు ప్రభుత్వం నల్లమల అటవీప్రాంతంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పాదయాత్ర చేయడం భక్తుల మనోభావాలతో ముడిపడిన విషయం. అయితే చంద్రాబాబు ప్రభుత్వం భక్తుల మనోభావాలను సైతం పట్టింకోకుండా వ్యవహరిస్తోంది. అటవీప్రాంతంలో పాదయాత్రకు అటవీశాఖ నుంచి అనుమతి ఇప్పించడంలో విఫలమైంది. లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన విషయమైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. -
చట్ట పరిధిలో న్యాయం చేస్తాం
నంద్యాల: ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తన పొలానికి వెళ్లే దారిని మూసివేయడంతో పంటలు వేయలేకపోయానని, చర్యలు తీసుకోవాలని కొలిమిగుండ్ల మండలం కోట పాడు గ్రామానికి చెందిన మూల వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. తన భర్త ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి తనను, తన పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గోవింద పల్లె గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ అర్జీ ఇచ్చా రు. హైదరాబాద్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.60 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేశారని, చర్యలు తీసుకోవాలని నంద్యాల పట్టణానికి చెందిన శ్రీధర్ రావు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. -
కొనసాగుతున్న నీటి విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో శ్రీశైలం జలాశయంలో 876.80 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద 875.80 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లు మూసివేసి కేవలం ఎన్సీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా మాత్రమే రెండు మాసాల నుంచి నీటిని దిగువకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మూడు జన్రేటర్ల ద్వారా 1.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 2వేల క్యూసెక్కుల నీటిని ఎన్సీఎల్ విద్యుత్ కేంద్రం నుంచి ఎస్సారెమ్సీలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 1,500 క్యూసెక్కులు, కేసీఎస్కేప్ కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. -
అర్హతలేని వారితో వైద్యపరీక్షలు
● స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో దారుణంకర్నూలు(హాస్పిటల్): ల్యాబ్టెక్నీషియన్ ద్వారా చేయాల్సిన వైద్యపరీక్షలు(డయాగ్నోస్టిక్ టెస్ట్) అర్హతలేని జనరల్ డ్యూటీ అటెండర్తో చేయిస్తున్నారు. ఇదేదో ప్రైవేటు ల్యాబ్లో జరుగుతున్న తంతు కాదు. కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఏడాదిన్నరగా ఈ దారుణం కొనసాగుతోంది. ఈ కారణంగా ఏ పరీక్షలు సరైనవో, ఏవి కావో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయడం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే నోటిఫికేషన్ జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఏడాదికి మెరిట్లిస్ట్లు విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయలేదు. దీనికి మెడికల్ కాలేజీ అధికారుల నిర్లక్ష్యమో లేక ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో నిలిపివేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై అభ్యర్థులు పలుమార్లు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో అర్హతలేని వారు చేసే రక్తపరీక్షల వల్ల నివేదికలు తప్పుల తడకగా వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాజాగా కొందరు అభ్యర్థులు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా చేసిన మెసేజ్ వైరల్ అవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తమ ఆవేదన అర్థం చేసుకుని పోస్టులు భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. కాగా ఈ విషయమై కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ వివరణ ఇస్తూ సిబ్బంది కొరతతో ఆలస్యమైందని, మరో వారం రోజుల్లో పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. -
శరవేగంగా వసంత పంచమి ఏర్పాట్లు
కొత్తపల్లి: కొలనుభారతి క్షేత్రంలో ఈనెల 23వ తేదీన నిర్వహిస్తున్న వసంత పంచమికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు తెలిపారు. ఆదివారం శ్రీశైల దేవస్థాన అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయ్కుమార్స్వామి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ నరసింహారెడ్డి, వసంత పంచమి మహోత్సవ ప్రత్యేక అధికారి ఫణిధర ప్రసాద్, డీఈఈ నరసింహారెడ్డి, అధికారులు, వైదిక సిబ్బంది కొలనుభారతి క్షేత్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. వసంత పంచమి రోజున సరస్వతీ అమ్మవారికి జరిపించాల్సిన ఆయా పూజాదికాలు, నివేదనలు, సామూహిక అక్షరాభ్యాసాన నిర్వహణ ఏర్పాట్లు, ఉత్సవం రోజు పుష్పాలంకరణ, మంచినీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, సూచికబోర్డుల ఏర్పాట్లు, శౌచాలయాల ఏర్పాట్లు మొదలైన ఏర్పాట్లపై సూచనలు చేశారు. అనంతరం ఈఈ ఈఈ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. వసంత పంచమి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఆత్మకూరు, నందికొట్కూరు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. -
మూగజీవాలకూ.. మందుల్లేవ్
కర్నూలు(అగ్రికల్చర్): పశువైద్యానికి ఏడాదిగా మందులు సరఫరా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. అత్యవసర వైద్యం అందించే సంచార పశువైద్య కేంద్రాలను నామమాత్రానికి పరిమితం చేసింది. పశువైద్యానికి మందుల్లేవని, వెంటనే సరఫరా చేయాలని పశువైద్యులు కోరుతున్నా.. పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు మందులు సరఫరా చేసిన దాఖలాలే లేవు. పశువైద్య శిబిరాలు నిర్వహించాలంటే అనేక రకాల మందులు అవసరం. కేవలం నట్టల నివారణ మందులు మినహా ఇతరత్రా మందులు లేవు. మందులే లేనపుడు ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులే పేర్కొంటున్నారు. రోజుకొక పంచాయతీ ప్రకారం ఈ నెల 19 నుంచి 31 వరకు పంచాయతీల వారీగా పశువైద్య శిబిరాలు నిర్వహించడానికి పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుంది. కర్నూలు జిల్లాలో 484, నంద్యాల జిల్లాలో 489 పంచాయతీల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించనుంది. పశువైద్య శిబిరాలను పర్యవేక్షించేందుకు పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్లో జాయింట్ డైరెక్టర్ అయిన డాక్టర్ దుర్గాప్రసన్నబాబు ఉమ్మడి జిల్లాకు స్పెషల్ అధికారిగా నియమితులయ్యారు. పశువైద్యశాలలు కర్నూలు జిల్లాలో 66, నంద్యాల జిల్లాలో 74 ఉన్నాయి. ప్రతి వైద్యశాల పరిధిలో రోజు ఒక పంచాయతీ ప్రకారం శిబిరం నిర్వహిస్తారు. సరఫరా కాని మందులు ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహణకు కనీసం యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, లివర్ టానిక్లు, ఆవు లు, గేదెలు ఎదకు రావడానికి అవసరమైన మందులు ఉండాలి. ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గొర్రె లు, మేకలకు పీపీఆర్, హెచ్ఎస్ టీకాలు వేయాల్సి ఉంది. ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ మందులేవి సరఫరా చేయలేదు. వైద్య శిబిరాల్లో గర్భకోశ వ్యాధులకు చికిత్స చేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మందులు మాత్రం సరఫరా కాలేదు. గొర్రెలు, మేకలు, దూడలు, పెద్ద పశువులకు కేవలం నట్టల నివారణ మందులు మాత్రమే సరఫరా అయ్యాయి. నట్టల నివారణ మందులతో పశువైద్య శిబిరాలు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని వెటర్నరీ అసిస్టెంటు సర్జన్స్, అసిస్టెంటు డైరెక్టర్స్ వాపోతున్నారు. తెల్ల జాతి పశువులు 3,56,541 నల్ల జాతి పశువులు 4,20,882 గొర్రెలు 19,85,868 మేకలు 6,10,669 కోళ్లు 12,89,417 నేటి నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు మందులు సరఫరా చేయని చంద్రబాబు ప్రభుత్వం తూతూమంత్రానికే పరిమితమైన సంచార పశువైద్యశాలలు -
కూర‘గాయాలు’
రబీ సీజన్లో కూరగాయల సాధారణసాగు 5,769 హెక్టార్లు ఉంది. అయితే టమాట 115, ఉల్లి 247, పచ్చి మిరిప 200 హెక్టార్లకే పరిమితం అయ్యింది. వంకాయ, బెండకాయ, కాకర, బీర, చెవుల తదితర కూరగాయల పంటల సాగు నామమాత్రమే. సాగు పడిపోవడంతో రానున్న రోజుల్లో కూరగాయలకు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. కూరగాయల సాగుకు 50 శాతం సబ్సిడీపై హైబ్రిడ్ విత్తనాలు ఇచ్చి ప్రోత్సహించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. రబీ సీజన్ సాధారణ సాగులో 30 శాతం కూడా లేకపోవడంతో రానున్న రోజుల్లో కూరగాయల కొరత ఉత్పన్నమయ్యే అవసరం ఉంది. ఉల్లి పంట సాగు చేసిన దృశ్యం -
శ్రీశైలేశునికి పుష్పోత్సవం
● అశ్వవాహనంపై విహరించిన ఆదిదంపతులు ● శ్రీశైలంలో ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అశ్వవాహనాధీశులైన పార్వతీ పరమేశ్వరుడికి ఆలయ ఉత్సవం నిర్వహిస్తున్న దృశ్యంస్వామి అమ్మవార్లకు పుష్పోత్సవ సేవ నిర్వహిస్తున్న పండితులుశ్రీశైలంటెంపుల్: శ్రీశైలంలో పార్వతీ సమేత మల్లికార్జున స్వామివారికి వైభవంగా పుష్పోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్లకు శయనోత్సవం, ఏకాంతసేవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆయా ఉత్సవాలతో శ్రీగిరిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సంక్రాతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సమూర్తులను అశ్వవాహనంపై ఉంచి ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు ప్రత్యేక పూజాది హారతులిచ్చారు. అనంతరం అశ్వవాహనాధీశులైన స్వామి అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో ఆలయ ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో కళాకారుల నృత్యాలు, విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, కోలాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. అశ్వవాహనంపై విహరించిన స్వామి అమ్మవార్లను పలువురు భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పుష్పోత్సవం, శయనోత్సవం సంక్రాంతి పర్వదినం రోజున నూతన వధూవరులైన పార్వతీ, మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా కాగడాలు, ఎర్రగులాబీలు, తెల్లగులాబీలు, పసుపు గులాబీలు, ఎర్రమందారం, తెల్లమందారం, ముద్దమందారం, నందివర్దనం, గరుడవర్దనం, కనకాంబారాలు, సుగంధాలు(లిల్లీపూలు), పసుపు చేమంతి, ఊదాచేమంతి, తెల్లచేమంతి, ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, దేవగన్నేరు, ముద్దగన్నేరు మొదలైన 20 రకాల పుష్పాలు, బిల్వం, మరువం మొదలైన పలు రకాల పత్రాలతో స్వామిఅమ్మవార్లకు విశేషంగా అర్చించారు. అలాగే అరటి, తెల్ల, నల్లద్రాక్ష, దానిమ్మ, కమల, యాపిల్, పైనాపిల్, జామ, ఖర్జూరం మొదలైన 11 రకాల ఫలాలు కూడా నివేదించారు. అనంత రం స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి, శయనోత్సవం నిర్వహించారు. శయనోత్సవం కోసం ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల శయన మందిరాన్ని విశేష పుష్పాలంకరణ చేశారు. ఆయా పూజా కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, దేవస్థాన ధర్మకకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. -
ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య
ఒక్క క్షణం ఆలోచించలేకపోతున్నారు.. సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు.. ఆటుపోట్లకు నిలదొక్కుకోలేకపోతున్నారు.. అనుకున్నది జరక్కపోతే తట్టుకోలేకపోతున్నారు.. అత్తారింట్లో ఇమడలేకపోతున్నారు.. ఆడపడుచుల పోరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. తల్లిదండ్రుల చాటు బిడ్డలుగానే మెలుగుతున్నారు.. తెలిసీతెలియని వయస్సు పెళ్లిళ్లతో నలిగిపోతున్నారు.. కోపం వస్తే అణచుకోలేకపోతున్నారు.. అణకువను అలవర్చుకోలేకపోతున్నారు.. మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు.. సమయస్ఫూర్తితో వ్యవహరించలేకపోతున్నారు.. నలుగురితో చర్చించలేకపోతున్నారు.. క్షణికావేశంలో విచక్షణ కోల్పోతున్నారు.. నూరేళ్ల జీవితాన్ని కాలరాసుకుంటున్నారు.. కంటిపాపలను నిర్దయగా చిదిమేస్తున్నారు.. నంద్యాల: ఆర్థిక, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలతో కొందరు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు. ఏం పాపం చేయని చిన్న పిల్లలకు రంగుల లోకంలో చోటు లేకుండా చేస్తున్నారు. విషమిచ్చి, కాల్వలో తోసేసి చిన్నారులను తమతోపాటు తీసుకెళ్తున్నారు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయాలతో కుటుంబసభ్యులకు రోదనే మిగులుతోంది. నంద్యాల జిల్లాలో కొన్ని రోజులుగా ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 20 రోజుల్లో ఏడుగురు చిన్నారులు మృతి గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లి ఎల్లా లక్ష్మీ(23) గతేడాది డిసెంబర్ 28న మంచాలకట్ట సమీపంలో తన పిల్లలు వైష్ణవి(3), మూడు నెలల చిన్నారి సంగీతను ఎస్సార్బీసీ కాల్వలో తోసి తాను కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడవకముందే ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర(34) ఆర్థిక సమస్యలతో తట్టుకోలేక సురేంద్ర కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి (4), సూర్యగగన్ (1.5)కు పాలలో విషం కలిపి తాపించి తాను చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త వేధింపులు భరించలేక మల్లిక(27) అనే మహిళ శనివారం ఉదయం ఇద్దరు పిల్లలు ఇషాంత్(7), పరిణతి(9నెలలు)కి పురుగుల మందు తాపి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత 20 రోజుల్లో జిల్లాలో వరుసగా జరిగిన ఘటనల్లో అభం శుభం తెలియని ఏడుగురు చిన్నారులు నిండు జీవితాలను కోల్పోయారు. జీవితాలను బలి చేసుకోవద్దు సమస్య చిన్నదే అయినా కొందరు తీవ్రంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాము లేకపోతే పిల్లలకు భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడతూ తమతోపాటు తీసుకెళ్తున్నారు. వారు తీసుకొనే నిర్ణయమే తప్పు అయితే పిల్లలను చంపి మరో తప్పు చేస్తుండటం విస్మయానికి గురి చేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని, తీవ్ర నిర్ణయాలు తీసుకొని జీవితాలను బలి చేసుకోద్దని సూచిస్తున్నారు. -
అరటి తోటల్లో దొంగలు
మహానంది: దొంగలు పంట పొలాల్లోని మోటార్లు, విద్యుత్ తీగలు అ పహరించడం చూ శాం. కానీ దొంగలు రూటు మార్చి రైతు ల కడుపులు కొడుతున్నారు. అరటి తోటలపై దొంగలు కన్నేసి గెలలు కోసుకుపోతున్నారు. మహానంది మండలంలో ప్రధానంగా సాగయ్యే పంటల్లో అరటి ముఖ్యమైనది. ఇటీవల ధరలు తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం అరటి కిలో రూ. 18 నుంచి రూ. 22 వరకు ఉంది. దీంతో కొద్దిగా లాభాలు వస్తాయనుకునే తరుణంలో దొంగలు ఇదే అదనుగా భావించి రైతుల పొలాల్లోని అరటి గెలలను కోసుకెళ్తున్నారు. మహానంది, తిమ్మాపురం సమీపంలోని తెలుగుగంగ పదవ బ్లాక్ పరిధిలో సాగు చేస్తున్న రైతుల పొలాల్లో గెలలు చోరీకి గురవుతున్నాయి. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన యర్రగుంట్ల రమేష్, పగడాల నాగరాజు, అబ్బీపురం వెంకటేశ్వరరెడ్డి, పుట్టుపల్లె సాలన్న, మురళీధర్రెడ్డి, తదితర రైతులకు చెందిన పొలాల్లో దొంగలు అర్ధరాత్రి వేళ వచ్చి చెట్లను విరుస్తూ అరటి గెలలను కోసుకుపోయారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు స్పందించి అరటి పొలాల్లో చోరీలకు పాల్పడినవారిని పట్టుకుని రైతులకు అండగా నిలవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
శ్రీశైలంలో వేదశ్రవణం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ఆయా సేవలన్నీ పరిపూర్ణంగా జరిపించాలనే భావనతో వేదశ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలోని అమ్మ వారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిపారు. అలాగే రుత్విగ్వరణ కార్యక్రమంలో వేదపండితులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదపఠన కార్యక్రమం జరిపించారు. మూడు గంటల పాటు నిరంతరాయంగా వేదపారాయణాలు కొనసాగాయి. దేవస్థాన వేదపండితులతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం, ద్వారక తిరుమల, ఇంద్రకీలాద్రి (విజయవాడ) దేవస్థానాల నుంచి వచ్చిన వేదపండితులతో పాటు తిరుపతి, హైదరాబాద్ నుంచి వచ్చిన పలువురు వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేదపారాయణం చేశారు. దేవస్థానం వేదపండితులతో పాటు కార్యక్రమానికి హాజరైన వేదపండితులందరు కూడా స్వామిఅమ్మవార్ల కై ంకర్యంగా రెండు గంటల పాటు ఘనస్వస్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు డోన్ టౌన్: వెంకటాపురం చెరువు పెద్ద వంక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కౌలుట్ల శనివారం ఉదయం డోన్ నుంచి ఖాళీ బాక్స్ లోడ్తో స్వగ్రామానికి బయలుదేరాడు. అదే సమయంలో గుమ్మకొండ గ్రామానికి చెందిన సుధాకర్ బైకుపై డోన్కు వస్తుండగా ప్రమాదవశాత్తూ ఆటో, బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుధాకర్కు తీవ్ర, కౌలుట్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సుధాకర్ను కర్నూలుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పట్టణ ఎస్ఐ శరత్కుమార్రెడ్డి పరిశీలించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. -
చిన్నారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
నంద్యాల: ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. తల్లి ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాలలో కలకలం రేపింది. నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్బాషా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని లలితానగర్కు చెందిన ఉదయ్కిరణ్, ఎస్బీఐ కాలనీకి చెందిన మల్లికకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఉదయ్కిరణ్ పట్టణంలోని ఫెర్టిలైజర్ షాపు నిర్వహిస్తుండగా మల్లిక (27) గృహిణి. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం మల్లికను భర్త తీవ్రంగా కొట్టడంతో ఆమె కుడిచేతిపై గాయాలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన మల్లిక జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడేందుకు నిర్ణయించుకుంది.ఇంట్లో ఉన్న పురుగు మందును ఇద్దరు పిల్లలకు తాగించి.. తాను ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన మృతురాలి బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి మల్లికను, పిల్లలు ఇషాంత్ (3), పరిణతి(9 నెలలు)ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహంపై గాయాలను గుర్తించడంతో పాటు ఇంట్లో ఉన్న రెండు పురుగు మందు డబ్బాలను సీజ్ చేశారు. భర్త ఉదయ్కిరణ్ పరారీలో ఉన్నాడు. మృతురాలి తమ్ముడు కార్తీక్ ఫిర్యాదు మేరకు భర్త ఉదయ్, ఆడపడుచు, తోటికోడళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
● శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆత్మకూరు: రానున్న మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదామని వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వారితో గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను ఎంపిక చేస్తామన్నారు. పదవులు పొందిన వారు గ్రామ, పట్టణ స్థాయిలో సమర్థవంతంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రానున్న మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో పార్టీ సానుభూతిపరులు, అభిమానులను కలుపుకుంటూ కార్యక్రమాల్లో ముందుకు సాగాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు క్రుటలు పన్నే అవకాశం ఉందని, వాటిని తిప్పి కొట్టాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గం సీనియర్ నాయకుడు శిల్పా భువనేశ్వర్రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా పంపిణీలో ఘర్షణ
● కొత్తపల్లెలో పోలీసుల పికెట్ నంద్యాల(అర్బన్): నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో యూరియా పంపిణీలో ఘర్షణ నెలకొంది. ఇటీవల గ్రామానికి వచ్చిన యూరియా పంపిణీపై టీడీపీ నాయకులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీశారు. రైతులకు ఇవ్వకుండా యూరియా ఎక్కడికి వెళ్తుందంటూ ప్రశ్నించారు. దీంతో వైఎస్సార్సీపీకి కార్యకర్తలను గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దూషించారు. శుక్రవారం టీడీపీ నాయకుడు కుమారుడు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు ప్రతి దాడులు చేసుకునేందుకు ప్రయత్నించడంతో గ్రామంలో వాతావరణం వేడెక్కింది. షయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటను జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. తోపులాట సమస్యాత్మక గ్రామాల్లో ఒకటైన కొత్తపల్లెలో ఏ సంఘటన జరిగినా ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. గత డిసెంబర్లో గ్రామ ఎంపీటీసీ హరినాథరెడ్డిపై కొంత మంది టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ సంఘటన మరువక ముందే యూరియా పంపిణీ, చిన్నచిన్న ఘర్షణలతో ఇరువర్గాలు దాడులకు దిగేందుకు యత్నించారు. గ్రామ సచివాలయానికి వ్యవసాయాధికారులు 100 టన్నుల యూరియా మంజూరు చేశారు. అర్హులైన రైతులకు అందించకుండా యూరియా ఎక్కడికి వెళ్తుదంటూ ప్రశ్నించిన వారిపై బెదిరింపులు, దాడులకు దిగుతుండటంతో విధిలేని పరిస్థితిలో బయట కొనుగోలు చేస్తూ పంట సాగు చేపడుతున్నారు. గత మంగళవారం గ్రామానికి 35 టన్నులు యూరియా సచివాలయానికి వచ్చింది. గ్రామ రైతులకు యూరియా పంపిణీ చేయకపోవడంపై టీడీపీ నాయకులు, అధికారులను వైఎస్సార్సీపీ సానుభూతి పరులైన రైతులు ప్రశ్నించారు. అక్కడ మొదలైన వివాదం శుక్రవారం సాయంత్రం గ్రామ టీడీపీ నాయకుడి కుమారుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వాగ్వాదం మొదలై తోపులాటకు దిగారు. ఈ సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. జరిగిన సంఘటనపై విచారణ చేపడుతున్నామని బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తాలూకా సీఐ ఈశ్వరయ్య తెలిపారు. -
కమనీయం.. కల్యాణోత్సవం
శ్రీశైలంటెంపుల్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం శ్రీశైల మహాక్షేత్రంలో పార్వతీ, పరమేశ్వరులకు లీలాకల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ సంకల్పం తర్వాత మహా గణపతిపూజ, పుణ్యహావచనం జరిపారు. ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి సింహాసనానికి, కంకణాలకు పూజాదికాలు చేశారు. స్వామికి యజ్ఞోపవీతధారణను చేసి మంత్రాలను పటించారు. అమ్మవారికి కంకణధారణ జరిపారు. మహాసంకల్పం తరువాత మంగళకరమైన ఎనిమిది శ్లోకాలు చదివి స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. మాంగల్యపూజ జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవానికి స్థానిక చెంచులు నూతన వస్త్రాలతో పాటు అడవి ఆకులతో అల్లిన అభరణాలను సమర్పించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో నందివాహనంపై అధిష్టింప చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. శాస్త్రోక్తంగా గోపూజ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కనుమ పండుగరోజైన శుక్రవారం శ్రీశైల దేవస్థానంలో శ్రీగోకులంలో, గోసంరక్షణశాల వద్ద శాస్త్రోక్తంగా గోపూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకార మండపంలో రావణవాహనంపై అధిష్టింపజేశారు. ఆలయ ఉత్సవం దేదీప్యమానంగా కొనసాగింది. రావణవాహనంపై స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజల అనంతరం స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి నిర్వహిస్తారు. అడవి ఆకులతో ఆభరణాలు సమర్పించిన చెంచులు కనుమ పండుగ రోజున రావణవాహన సేవ నేడు సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు యాగపూర్ణాహుతి -
నల్లమలలో పాదయాత్ర నిషేధం
ఆత్మకూరురూరల్: శ్రీశైలం వెళ్లేందుకు పాదయాత్ర కోసం కన్నడిగులు శుక్రవారం వెంకటాపురం వద్దకు చేరుకోగా నాగలూటి ఇన్చార్జ్ ఎఫ్ఆర్వో ప్రణతి నేతృత్వంలో ఉన్న అటవీ సిబ్బంది వారిని నిలిపి వేశారు. రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్ళేలా వారిని ఒప్పించారు. ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే అనుమతి బైర్లూటి చెక్ పోస్ట్ వద్ద కర్ణాటక నుంచి వచ్చిన పాదయాత్రికులకు గురువారం ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటి డైరెక్టర్ విగ్నేష్ అపావ్ అవగాహన కల్పించారు. పెద్ద పులుల అంచనా గురించి, అటవీ మార్గం మూసివేత గురించి వివరించారు. కేవలం ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి ఉంటుందని చెప్పారు. అనంతరం పాదయాత్రికులను రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లేందుకు అనుమతించారు. -
విద్యుత్ చార్జీల పెంపుపై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) ఈ నెల 20వ తేదీ నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్సీడీసీఎల్ చైర్మన్, సీఎండి శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై ఈ నెల 20న తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం.. 22, 23వ తేదీల్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, 27న కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామన్నారు. -
బండిఆత్మకూరు రైతు సేవా కేంద్రం వద్ద గత శుక్రవారం కనిపించిన దృశ్యం ఇది. కేవలం 24 టన్నుల యూరియా రావడంతో రైతులు ఉదయం నుంచే క్యూలో నిలబడి అగచాట్లు పడ్డారు. క్యూలో ఉన్న ఒక రైతు స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స కోసం పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించా
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లాకు రావాల్సిన మూడు ర్యాక్ల యూరియాను ఇతర జిల్లాలకు మళ్లించారు. దీంతో కొరత తీవ్రమై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రబీ సీజన్లో నీటిపారుదల కింద వరి, మొక్కజొన్న, మినుము తదితర పంటలు సాగు చేశారు. పైరు ఎదుగుదలకు యూరియా అవసరం ఎంతో ఉంది. ఎలాంటి కొరత లేదని అధికారులు ప్రకటనలు ఇస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఒక బస్తా యూరియా కోసం రైతులు ప్రతి రోజూ పోరాటం చేయాల్సి వస్తోంది. నోరు మెదపని టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలు అదనంగా యూరియా తెప్పించాలి. అలా చేయకపోగా వచ్చిన ఎరువులు దారి మళ్లుతున్నా మౌనంగా ఉండిపోయారు. నంద్యాలకు స్పిక్, కోరమాండల్, క్రిఫ్కో యూరియా ర్యాక్లు వస్తాయని అధికారికంగా సమాచారం వచ్చింది. ఈ ర్యాక్లతో 9,500 టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందనుకున్నారు. అయితే వీటిని ఇతర జిల్లాలకు దారి మళ్లించారు. దీంతో బండిఆత్మకూరు, మహానంది, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో రైతులు ఒక బస్తా యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అసలైన రైతులకు ఇవ్వకుండా.. యూరియా లేకపోతే పంటలే వేయలేని పరిస్థితి ఏర్పడింది. నంద్యాల మార్క్ఫెడ్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు డీసీఎంఎస్లు, పీఏసీఎస్లు, రైతు సేవా కేంద్రాలకు యూ రియా సరఫరా చేస్తున్నారు. ఈ కేంద్రాలను టీడీపీ నేతలు తమ అధీనంలోకి తీసుకొని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలైన వారికి మాత్రమే యూరియా ఇచ్చేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిజమైన రైతులకు వైఎస్సార్సీపీ ముద్ర వేసి ఒక్క బస్తా కూడా ఇవ్వడం లేదు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి 532 యూరియా బస్తాలు వచ్చాయి. వీటిని గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం విమర్శలకు తావిచ్చింది. తీవ్ర కొరత నంద్యాల జిల్లాలో రబీ సాధారణ సాగు 1,75,865 హెక్టార్లు ఉండగా ఇప్పటికే 1,80,312 హెక్టార్లలో సాగైంది. వరి 40,264, మినుము 20569, మొక్కజొన్న 15,442, జొన్న 28,120 హెక్టార్లలో సాగైంది. కలెక్టర్, డీఏవో ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ నుంచి యూరియా బయటికి వెలుతున్నప్పటికీ సామన్య రైతులకు దక్కడం లేదు. అన్నింటా టీడీపీ నేతలే తిష్ట వేసి టోకన్లు ఇవ్వడం సహా మొత్తం వారే చేస్తున్నారు. దీంతో రైతులు ప్రయివేటు దుకాణాల్లో లింక్లతో కొనాల్సి వస్తోంది. మార్క్ఫెడ్, ఆర్ఎస్కేలు, ప్రయివేటు డీలర్లు, కంపెనీ గోదాముల్లో 8,000 టన్నుల యూరియా ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణ రైతులకు యూరియా ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుచెబుతున్నారు. తాము చెప్పిన వారికే ఇవ్వాలని అధికారులను హెచ్చరిస్తున్నారు. బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది, ఆత్మకూరు, నందికొట్కూరు, శిరిశెళ్ల, కోవెలకుంట్ల, అవుకు మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. దోపిడీ చేస్తూ.. కర్నూలు జిల్లాలో రబీ సీజన్లో 75 వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రబీ సీజన్కు 24,580 టన్నుల యూరియా అవసరం ఉంది. అయితే 14 వేల టన్నులు మాత్రమే వచ్చింది. ఇటీవల కర్నూలు ర్యాక్పాయింట్కు కోరమాండల్ కంపెనీకి చెందిన యూరియా 1300 టన్నులు వచ్చింది. ఇందులో 650 టన్నులు మార్క్ఫెడ్కు, 650 టన్నులు ప్రయివేటు డీలర్లకు కేటాయించారు. కర్నూలు, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాలకు కేటాయించారు. యూరియాను ప్రయివేటు డీలర్లు లింక్లు పెట్టి రైతులను దోపిడీ చేస్తున్నారు. ఇతర జిల్లాలకు మళ్లింపు ఒక బస్తా కోసం రైతులకు తప్పని నిరీక్షణ బయోఫర్టిలైజర్ లింకుతో దోపిడీ చేస్తున్న డీలర్లు విక్రయాల్లో టీడీపీ నాయకుల చేతివాటం చంద్రబాబు ప్రభుత్వంలో తొలగని యూరియా కష్టాలు -
ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(టౌన్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా సదన్లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలను జిల్లా కోర్టు వెబ్సైట్ www.ecourts.kurnool.com అలాగే kurnool.dcourts.gov.in లో చూసుకోవచ్చన్నారు. ఈ నెల 27న సాయంత్రం 6 గంటల్లోపు జిల్లా కోర్టు కాంపౌండ్లో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అడ్రస్ పేరుతో రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ దరఖాస్తులు పంపాలని పేర్కొన్నారు. ఎల్లెల్సీకి నీటి సరఫరా బంద్ హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు గురువారం టీబీ బోర్డు అధికారులు నీటి సరఫరాను నిలిపేశారు. దీంతో శుక్రవారం ఆంధ్ర పరిధిలోని హొళగుంద సెక్షన్ దిగువ కాలువలో 70 శాతం మేర నీటి సరఫర తగ్గుముఖం పట్టింది. వీఆర్ఎస్పీ సమీపంలో చిరుత పులులుఆత్మకూరు: వరదరాజస్వామి ప్రాజెక్టు (వీఆర్ఎస్పీ) సమీపంలోని రహదారులపై మూడు చిరుత పులులు ఒకటి వెంట ఒకటి కూర్చుంటూ కలియ తిరుగుతూ కనిపించాయి. ఈ సమయంలో వాహనదారులు సౌండ్ హారన్ వేయడంతో ఒకదాని వెంట ఒకటి అడవిలోకి పరుగులు తీశాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వీఆర్ఎస్పీని చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.వాహనాలను వెనక్కి మళ్లించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీఆర్ఎస్పీ నీటిపారుదల సంఘం అధ్యక్షులు కురుకుంద మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల చిరుతనపులు అధికంగా సంచరిస్తున్నాయని, అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకుని పర్యాటకులు వెళ్లాలన్నారు. చేపల వలలో కొండచిలువ ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని పాములపాడు మండలం ఇస్కాల గ్రామ సమీపంలోని నీటికుంటలో చేపల వలకు భారీ కొండచిలువ చిక్కింది. గురువారం ఇస్కాల సమీపంలోని ఎత్తిపోతల పంప్ హౌస్ వద్దనున్న నీటికుంటలో చేపలకోసం వల వేశారు. ఇందులో ఓ కొండచిలువ చిక్కుకున్నట్లు గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఆ మేరకు యాంటీ పోచింగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువకు ఎలాంటి గాయాలు కాకుండా వలను తొలగించి నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం కొండ చిలువను బైర్లూటి రేంజ్లోని గంగరాజు చెరువులో వదలి పెట్టారు. యాంటీపోచింగ్ స్క్వాడ్లో ఎఫ్బివోలు కృష్ణకాంత్, పీరా తదితరులు ఉన్నారు. -
పాల వ్యాపారి అదృశ్యం
కర్నూలు: కల్లూరు మండలం ఎన్టీఆర్ బిల్డింగ్స్లో నివాసముంటున్న పాల వ్యాపారి బ్రహ్మానంద రెడ్డి (26) అదృశ్యమయ్యాడు. తల్లి లక్ష్మిదేవితో కలసి పంచలింగాల వద్ద డైరీ ఫారం ఏర్పాటు చేసుకుని పాల వ్యాపారం సాగిస్తున్నాడు. పంచలింగాల నుంచి రోజూ కర్నూలుకు పాలు తీసుకుని వచ్చి వ్యాపారం సాగించేవాడు. ఈనెల 12న పాలు తీసుకుని కర్నూలుకు వచ్చాడు. అప్పటి నుంచి కనిపించకపోవడంతో తల్లి లక్ష్మిదేవి ఆయన సోదరుడు బ్రహ్మానందరెడ్డితో కలిసి గాలిస్తుండగా నగర శివారులోని తుంగభద్ర బ్రిడ్జి సమీపంలో కేసీ కెనాల్ హైవే పక్కన అతని బైకు కనిపించడంతో స్వాధీనం చేసుకుని మేనమామ మల్లికార్జున రెడ్డి నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాల వ్యాపారి శ్రీకాంత్ రెడ్డితో డబ్బుల విషయంలో మనస్పర్థలు ఉన్నాయని, అతనిపైనే అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో కేసీ కెనాల్ వెంట పాములపాడు వరకు గస్తీ తిరుగుతున్నారు. మూడు రోజులుగా బ్రహ్మానందరెడ్డి కనిపించకపోవడంతో ఎలాగైనా తన కుమారుడిని వెతికి అప్పగించాలని తల్లి లక్ష్మీదేవి పోలీసులను వేడుకుంటోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తండ్రి కర్మకాండకు వెళ్తూ..
● సంతజూటూరు ప్రభుత్వ పాఠశాల టీచర్ నాగన్న మృతి ● ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా ప్రమాదం ● శోకసంద్రంలో బాధిత కుటుంబం జూపాడుబంగ్లా: తండ్రి కర్మకాండలకు వెళ్తూ కుమారుడు ప్రమాదానికి గురై మృతిచెందాడు. బాధిత కుటుంబంలో విషాదం నింపిన ఈ ఘటన బుధవారం జూపాడుబంగ్లా సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రమైన జూపాడుబంగ్లాకు చెందిన జేమ్స్(చెంచన్న) డిసెంబర్ 31న మృతి చెందాడు. ఈయన కుమారుడైన నాగన్న (50) బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రి కర్మకాండల నిమిత్తం బుధవారం భార్య విజయకుమారితో కలిసి నాగన్న స్వగ్రామమైన జూపాడుబంగ్లాకు బయలుదేరాడు. ఆత్మకూరు ఆర్టీసి బస్టాండులో శ్రీశైలం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సులో ఎక్కారు. మరో ఐదు నిమిషాల్లో బస్సు జూపాడుబంగ్లా బస్టాండుకు చేరుకుంటుంది. నాగన్న దంపతులు దిగేందుకు ముందుగానే సీట్లోంచి లేచి ఫుట్బోర్డుపై నిల్చొన్నారు. కండక్టర్ చంద్రమోహన్ గమనించి అలా నిల్చొ వద్దని ఇరువురిని వారించాడు. అదే సమయంలో హఠాత్తుగా రోడ్డుకు అడ్డంగా గొర్రెలు రావటంతో బస్సు డ్రైవర్ ఆకుల లక్ష్మన్న సడన్ బ్రేక్వేశాడు. ఫుట్బోర్డుపై నిల్చొన్న నాగన్న బస్సు లోంచి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అతని పక్కనే నిలబడిన మృతుని భార్య కూడా పడబోతుండగా కండక్టర్ చె య్యి అడ్డుపెట్టడంతో ప్రమాదం తప్పి ంది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యు లు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని బో రున విలపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ సంజీవ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరుకు తరలించాడు. -
వైభవంగా గోదాదేవి పరిణయం
● అహోబిలంలో శాస్త్రోక్తంగా ముగిసిన ధనుర్మాసోత్సవాలు ఆళ్లగడ్డ: జయజయ నారసింహ నామ సంకీర్తనలు.. వేద పండితుల వేదోక్త మంత్ర పఠనములు.. ఆస్థాన విద్వాంసుల మంగళకర వాయిద్యాల నడుమ శ్రీ అహోబిలేశుడు, గోదాదేవీ పరిణయ వేడుక బుధవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో వైభవంగా జరిగింది. ఈ తంతుతో నెలరోజులు విశేష పూజలు నిర్వహిస్తూ గోదాదేవి అమ్మవారిని రోజుకో అలంకరణ చేస్తూ నిర్వహించిన ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా ముగిశాయి. బుధవారం వేకువ జామునే దిగువ అహోబిలంలో కొలువైన మూలవిరాట్ శాంతమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవర్లాతో పాటు గోదాదేవి అమ్మవార్లను సుప్రభాతసేవతో మేలుకొలిపి ప్రత్యేక ధనుర్మాస, భోగి పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేసిన పెళ్లి మంటపంలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరదస్వాములను గోదాదేవి అమ్మవారికి ఎదురుగా కొలువుంచి వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య నవకలశస్థాపణ, అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి కొలువుంచారు. రాత్రి స్వామి, అమ్మవారిని ఆండాళ్ అమ్మవారి సన్నిధికి తీసుకెళ్లి శ్రీ గోదాదేవి, ప్రహ్లాదవరదుల కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని, గోదాదేవిని పల్లకీల్లో కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు. -
అనారోగ్యంతో సర్పంచ్ మృతి
తుగ్గలి : మండలంలోని రాతన గ్రామ సర్పంచ్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు గూడూరు రాచప్ప (80) అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదారాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికి త్స అనంతరం నాలుగు రోజులకు క్రితం ఇంటికి వచ్చారు. తిరిగి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మొదట ఆదోనికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. అక్కడ కోలుకోలేక తుది శ్వాస విడిచారు. రాచప్ప మాస్టారు 2021లో వైఎస్సార్సీపీ మద్దతుదారుగా సర్పంచ్గా గెలిచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు ఎస్.రామచంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మేధావుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి, మైనార్టీ నాయకులు టీఎండీ హుసేన్, కో ఆప్షన్ సభ్యుడు చాంద్బాషా, ఇన్చార్జ్ సర్పంచ్ అన్వర్బాషా, సీ నియర్ నాయకులు ఉమామహేశ్వరరెడ్డి, బసవరాజు,పంచాయతీ పాలకవర్గం నివాళులర్పించారు. సెల్ఫోన్ అప్పగింత వెల్దుర్తి: తనకు దొరికిన సెల్ఫోన్ను పోగొట్టుకున్న యజమానికి పోలీసుల ద్వారా అప్పగించి ఓ యువకుడు తన నిజాయితీ చాటుకున్నాడు. పట్టణానికి చెందిన కర్రెక్కగారి లక్ష్మీకాంతరెడ్డి రోజులాగే తెల్లవారుజామున వంకగడ్డనున్న తన ఇంటి నుంచి రామళ్లకోట రోడ్డులో జాగింగ్కు వెళ్లాడు. నక్కల తిప్ప దాటిన తర్వాత రహదారి పక్కన సెల్ఫోన్ పడి ఉండటాన్ని చూసి పోలీస్స్టేషన్కు వెళ్లాడు. అదే సమయంలో ఆ సెల్ఫోన్కు ఫోన్ కాల్ రావడం, లిఫ్ట్ చేయగా పోగొట్టుకున్న వ్యక్తి ఫోన్ చేయడాన్ని గుర్తించి పోలీస్స్టేషన్కు పిలిపించారు. ఏఎస్ఐ ఆనందరెడ్డి విచారించి సెల్ఫోన్ను బొమ్మరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణకు అందజేశారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు
● గంజిహళ్లిలో రాయలసీమ జోన్ మైనింగ్ అధికారుల విచారణ గోనెగండ్ల: అధికారుల అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ఎ. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం సాక్షి దినపత్రికలో ‘ఆగని ఇసుక దందా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై వారు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం పోలీసులతో కలిసి వారు గంజిహళ్లి హంద్రీనదిలో ఇసుక తవ్వే ప్రాంతాన్ని పరిశీలించారు. హంద్రీనదిలో ఎక్కడెక్కడ ఇసుక కోసం తవ్వకాలు జరిపారు. రోజుకు ఎన్ని ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారని ఆరా తీశారు. హంద్రీలో ఇసుక తరలిస్తున్న ప్రాంతం గాజులదిన్నె ప్రాజెక్టుకు చెందిన భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అయితే, గంజిహళ్లికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి సొంత భూమి అని ఒక ట్రాక్టర్ ఇసుక రూ.400 చొప్పున అక్రమార్కులకు విక్రయిస్తున్నట్లు మైనింగ్ అధికారులకు తెలియడంతో అతడిని విచారించారు. అనంతనం ఆ అధికారులు మాట్లాడుతూ హంద్రీనదిలో తవ్విన గుంతలను కొలతలు తీసుకున్నామని.. అలాగే శ్రీనివాసులును విచారించిన రిపోర్టును జిల్లా కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. గోనెగండ్ల మండలంలో ఇసుక రీచ్కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అధికారుల అనుమతులు అక్కడ ఇసుక తవ్వకాలు జరపరాదన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మండలంలోని గంజిహళ్లి హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను బుధవారం పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. తర్వాత వాటిని మైనింగ్ అధికారులకు అప్పజెప్పినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. -
ఈత ఆకులే ఆభరణాలుగా
చెంచులే అతిథులుగా..శ్రీశైలంటెంపుల్: నల్లమల అడవిలో నివసించే చెంచులు భ్రమరాంబాదేవిని కూతురుగా, మల్లికార్జునస్వామిని ఇంటి అల్లుడిగా భావిస్తారు. దీంతో బ్రహ్మోత్సవ కల్యాణానికి వారే అతిథులుగా నిలిచి ఈత ఆకులతో ఆభరణాలు తయారుచేసి వాటితో స్వామిఅమ్మవార్లను అలంకరించనున్నారు. మకర సంక్రాంతి రోజే జరిగే ఈ కల్యాణోత్సవానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక గాథ ప్రకారం: ప్రచారంలో ఉన్న స్థానిక గాథలను బట్టి ఒకానొకసారి పార్వతీదేవికి భూలోకా అందాలను తిలకించాలనే కోరిక కలిగింది. దాంతో అమ్మవారు చెంచు యువతి రూపాన్ని పొంది శ్రీశైలం అటవీ ప్రాంతానికి విచ్చేసింది. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్దురాలైన అమ్మవారు కొంతకాలం శ్రీశైలంలోనే ఉండాలని నిర్ణయించుకుంది. అడవిలో ఒకచోట తన నివాసాన్ని ఏర్పరుచుకుని ఉండసాగింది. చెంచు రూపంలో ఉన్న పార్వతీదేవిని స్థానిక చెంచులు ఆదరిస్తూ ఆమెకు సపర్యలు చేయసాగారు. ప్రతిరోజూ ఆమెకు పాలు, తేనే, పలురకాల అడవిపండ్లు, దుంపలు మొదలైనవాటిని అమెకు ఆహారంగా ఇవ్వసాగారు. ఇక సంతానం లేని ఈ ప్రాంతపు చెంచుదొర దంపతులు అమ్మవారినే తమ సొంత బిడ్డగా భావించి పార్వతీదేవిపై ఎంతో ప్రేమను పెంచుకుంటారు. ఇదిలా ఉంటే అమ్మవారు కై లాసాన్ని వీడిరావడంతో కై లాసమంతా బోసిపోయింది. దాంతో పార్వతీదేవిని వెతుకుంటూ పరమేశ్వరుడు శ్రీశైల అడవికి చేరుకుంటాడు. అమ్మవారిని కలుసుకోవడానికి తాను కూడా చెంచు యువకుడి రూపం ధరిస్తాడు. ఇలా ఇద్దరు కలుసుకొని ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుని వివాహానికి సిద్ధపడుతారు. అయితే, తనను కన్నబిడ్డగా చూసుకున్న చెంచుదొర దంపతుల అంగీకారం పొందాలని అమ్మవారు స్వామిని సూచిస్తారు. అతను దొర వద్దకు వెళ్లి అడిగితే వివాహమైతే కుమార్తెను భర్తతో పంపాల్సి ఉంటుందని అంగీకరించడు. ఇలా ఎంతకీ చెంచులు వివాహానికి అంగీకరించక పోవడంతో స్వామి అమ్మవారు ఎవరికి చెప్పకుండా వివాహం చేసుకుంటారు. ఆ పెళ్లి జరిగిన రోజే మకర సంక్రాంతి. తరువాత ఆ వివాహాన్ని తెలుసుకున్న చెంచులు చేసేదేమిలేక మహాశివరాత్రి రోజు అందరి సమక్షంలో స్వామిఅమ్మవారికి మళ్లీ పెళ్లి చేస్తారు. ఈ కథ ఆధారంగా శ్రీశైల సంస్కృతి లో చెంచులకు గల విశిష్టస్థానాన్ని గుర్తించిన దేవస్థానం గత కొన్ని సంవత్సరాల నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవ కల్యాణానికి వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. పార్వతీ, పరమేశ్వరుల కల్యాణానికి అటవీఆకులతో సిద్ధం చేసిన ఆభరణాలు కల్యాణానికి సిద్ధమైన పెళ్లి ఆభరణాలు శ్రీశైలం మేకలబండ చెంచు గూడెంలో నివసిస్తున్న మండ్లి మల్లికార్జున(దేవ చెంచు) స్వామిఅమ్మవార్ల కల్యాణానికి అడవి ఆకులతో ఆభరణాలు సిద్ధం చేశారు. ఈత ఆకులతో అమ్మవారికి మెట్టెలు, గాజులు, మెడలో ధరించేందుకు ఆభరణాలు, బాసికాలు రూపొందించారు. అలాగే స్వామివారికి జంజం, మెడలో ధరించేందుకు ఆభరణం, ఉంగరం, తలంబ్రాలుగా వెదురు బియ్యం ఇలా కల్యాణానికి అవసరమైన అన్ని వస్తువులను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. -
శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
సాక్షి,శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి, భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. మకర సంక్రాంతి సందర్భంగా రాత్రి శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ వేదికపై వేద మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించగా, వేలాది మంది భక్తులు ప్రత్యక్ష సాక్షులయ్యారు.సాయంత్రం బ్రహ్మోత్సవాలలో భాగంగా చెంచు గిరిజనులు మరియు ఐటీడీఏ పీవో శివప్రసాద్ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సంప్రదాయం ఆలయ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తరువాత నందివాహనంపై ఆశీనులైన ఆదిదంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు హర్షధ్వానాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.వాహన పూజల అనంతరం క్షేత్రపురవిధుల్లో గ్రామోత్సవం జరిగింది. స్వామి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి, గ్రామ ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు భజనలు, హారతులు సమర్పించి ఉత్సవాన్ని మరింత వైభవంగా మార్చారు. నాలుగో రోజు ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు, సంక్రాంతి సందర్భంగా శ్రీశైలం ఆలయంలో జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు తమ జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచాయని తెలిపారు. -
రూ.10 వేల కోట్ల ఆస్తిని కొట్టేసే కుట్ర
కల్లూరు: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్పరం చేసి రూ.10వేల కోట్ల ఆస్తిని తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం ఆయన కల్లూరులో ఏర్పాటు చేసిన భోగి మంటల్లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రతులను, పీపీపీ జీవోలను వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ పని చేస్తోందన్నారు. నిరుపేద విద్యార్థుల మెడికల్ కలను సాకారం చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభించారన్నారు. ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చా యన్నారు. మిగిలిన కళాశాలలను పూర్తి చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం దురుద్దేశంతో పీపీపీ పద్ధతిన ప్రయివేటుపరం చేసే దిశగా అడుగులు వేయడం తగదన్నారు. ఈ నిర్ణయాన్ని విరమించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. మెడికల్ కళాశాలలన్నీ అందుబాటులోకి వస్తే లక్షలాది మంది పేదలకు సూపర్ స్పెషాలిటి వైద్య సేవలు అందడంతో పాటు నిరుపేద విద్యార్థులకు వైద్య విద్య అందు బాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేణుక, రాయలసీమ మహిళ విభాగం అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మీకాంతరెడ్డి, సుదర్శన్రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం
నందవరం: మద్యం మత్తులో ఓ టీడీపీ నాయకుడు డ్యూటీ లోని కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించాడు. తాగిన మైకంలో బైక్పై వస్తూ పడిపోగా లేపబోయిన కానిస్టేబుల్పైనే నోరు పారేసుకున్నా డు. నీవెంత, నువ్వు తాగవా అంటూ మానవత్వం చూపిన పాపానికి బూతులు తిట్టాడు. వివరాలివీ.. మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు, నందవరం మండలంలోని నదికై రవాడి గ్రామానికి చెందిన కురవ వీరేష్ తెలంగాణలోని రాజపురంలో పీకల దాకా మద్యం సేవించాడు. ఆ తర్వాత బైక్పై నాగలదిన్నెకు బయలుదేరాడు. సరిహద్దు చెక్ పోస్టు వద్ద బైక్ నుంచి కింద పడిపోగా చెక్పోస్టు విధుల్లోని కానిస్టేబుల్ కె.రాజు మానవత్వంతో అతడిని లేపబోయాడు. ఇంతలోనే టీడీపీ నాయకుడు కొడకల్లారా.. నా ఇసుక ట్రాక్టర్లే ఆపుతారా అంటూ బూతులు మొదలుపెట్టాడు. కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వీరంగం సృష్టించాడు. ఇంతచేసినా ఇప్పటివరకు పోలీసులు అతనిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
ఎల్లెల్సీలో తగ్గిన నీటి ప్రవాహం
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో బుధవారం రెండు అడుగుల వరకు నీటి ప్రవాహం తగ్గింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఎల్లెల్సీకి దాదాపు 1,700 క్యూసెక్కుల నీరు వదులుతుండగా ప్రస్తు తం వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్ర మే విడుదలవుతోంది. రెండు, మూడు రోజుల వరకు ఈ విధంగా నీటిని వదులుతూ పూర్తిగా నిలిపి వేసే సూచనలు కనిపిస్తున్నాయి. జలాశయం గేట్ల ఏర్పాటుకు సంబంధించి రబీలో డ్యాం నుంచి వచ్చే ఎల్లెల్సీతో పాటు ఇతర కాలువలకు నీటిని నిలిపివేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఖరీఫ్లో సాగు చేసిన వరి, ఇతర పంటలు డిసెంబర్ నెలలో చేతికి రావడంతో బోరు బావులున్న కొందరు రైతులు వరినారు వేసుకున్నారు. కాలువకు ఇంకా నీటి సరఫరా జరుగుతుండడంతో ఎల్లెల్సీ నీటితో మడులను తడిపి సిద్ధం చేసుకున్న రైతులు వరి, ఇతర అరుతడి పంటలను సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఎల్లెల్సీ కింద ఒక కారు పంటతో సరి పుచ్చుకోవాల్సి రావడంతో బోరుబావులున్న రైతులు రబీ పంట విషయంలో బెంగపెట్టుకున్నారు. టీబీ డ్యాంలో 1633 అడుగులతో 105.788 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి బుధవారం 1604 అడుగులతో 27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో లేకపోగా.. ఔట్ఫ్లో 3,474 క్యూసెక్కులు ఉంటోంది. పిచ్చికుక్క స్వైర విహారం పాణ్యం: తమ్మరాజుపల్లెలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. రెండు రోజులుగా గ్రామంలో పలువురిపై దాడి చేసి గాయపరిచింది. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. పిచ్చి కుక్క దాడిలో విష్ణు అనే బాలుడికి, మరో మహిళకు, వంట సామగ్రి వ్యాపారం నిమిత్తం వచ్చిన మరో మహిళకు గాయాలైనట్లు సమాచారం. అధికారులు చర్యలు చేపట్టి పిచ్చి కుక్కను తరిమేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నేడు నందివాహనసేవ
సంక్రాంతి రోజు గురువారం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు నందివాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో గంగాపార్వతీ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ● శ్రీగిరిలో వైభవోపేతంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ● నేడు పార్వతీ సమేత మల్లికార్జునుడికి కల్యాణోత్సవంచీకట్లను తరిమేస్తూ.. భోగి భాగ్యాలను ఆహ్వానిస్తూ.. సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణలో భాగంగా శ్రీశైల దేవస్థానం బుధవారం వేకువజామున భోగిమంటలు కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాలపూజలు, మహా మంగళహారతులు పూర్తయిన తరువాత ప్రధాన ఆలయ మహాద్వార ఎదురుగా గంగాధర మండపం వద్ద భోగి మంటలు వేశారు. అర్చకస్వాములు, వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. సంప్రదాయబద్ధంగా పిడకలు, ఎండుగడ్డి, వంట చెరకు వేసి భోగిమంటలు వేశారు. సంక్రాంతి సందర్భంగా వేసే భోగిమంటలకు మన సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ భోగిమంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై, అమంగళాలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది. భోగి పండుగను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐదేళ్ల వయస్సు ఉన్న చిన్నారులకు ఈ భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అర్చకులు, వేదపండితులు సంకల్పాన్ని పఠించి, గణపతిపూజ జరిపారు. అనంతరం షోడశోపచారపూజలు నిర్వహించి రేగిపండ్లను, చిన్న చిన్న చెరకు ముక్కలు, పూలరెక్కలతో కలిపి పిల్లల తలచుట్టూ మూడుసార్లు తిప్పి భోగిపండ్లను పిల్లలపై వేశారు. ఈ భోగిపండ్లు వేయడం వలన పిల్లలకు పీడలు తొలగి, దృష్టిదోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెప్పబడుతుంది. భక్తజనం మధ్య గ్రామోత్సవం -
పేర్లు మార్చిరి.. మూతేసిరి!
రామకృష్ణారెడ్డి: ఓయ్.. సుబ్బాడ్డి.. యాడికి పోతుండావు.. చేతిలో సంచి పట్టుకుంటివి.. బేగిరా .. మనోళ్లు వచ్చున్నారు. అప్పిరెడ్డి: సుబ్బాడ్డి పది రోజులు పాణం బాగ లేక ఆసుపత్రిలో ఉండే.. డీలర్ వద్దకు బియ్యం తెచ్చుకుని పోతుండు. చంద్రబాబు వచ్చాక సిస్టమ్ మార్సా. ఇప్పుడు రేషన్ బియ్యం బండి ఇంటి వద్దకు రాదు. డీలర్ వద్దకు పోయి మనమే తెచ్చుకోవాల. అంతేకాదు రేషన్ షాపులో కంది బ్యాలు, పిండి, చక్కర అన్నీ ఇప్పుడు ఇవ్వరు. జగన్ ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి అన్ని సరుకులు ఇచ్చిరి. ఒక్కొక్క సీఎం ఒక్కో విధంగా పాలన చేచున్నారు. సంజీవరెడ్డి: రేషన్ బండి దేవుడెరుగు... ఆ సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్ చూస్తే ఎంత గప్పుడు ఇప్పుడు ఎంతో తేడా. ఇప్పుడు ఎప్పుడు తెరుస్తారో.. ముచ్చారో తెలియదబ్బీ. ఏదో సచివాలయం ఉందంటే ఉంది. అందులోని ఉద్యోగులు సరిగా లేరు. ఏ పని కావాలన్నా అప్పుడు గ్రామంలోనే అయిపోయేది. ఇప్పుడు నంద్యాలకు వెళ్లాల్సి వచ్చుంది. రైతు భరోసా కేంద్రంలో జగన్ ప్రభుత్వంలో గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు లభించేవి. ఇప్పుడు దాన్లకు పేర్లు మారిచినప్పటి నుంచి ఎప్పుడూ మూస్తనే ఉంటారు. అప్పుడు ఎరువులు మాత్రం ఇస్తున్నారు. వెంకటరెడ్డి: చంద్రబాబు తన హయాంలో ఎన్నడూ ఒక్క మెడికల్ కాలేజీ కట్టలా. జగన్ తెచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ.. గీపీపీ అంటా.. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేలా ఉన్నాడు. కొత్త మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంట కానీ.. ఒక్క రోజు యోగా చేయడానికి రూ.300 కోట్లు మన సీఎం ఖర్చు చేస్తాడు. జగన్ మళ్లీ సీఎంగా అయి ఉంటే ఈ పాటికి రాష్ట్రమల్లా కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యేవి. సుధాకర్రెడ్డి: చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రచారం చేసిఉండ్లా?. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని నిరుద్యోగులకు నెలనెలా రూ.3 వేలు ఇస్తాడనుకుంటే నిరుద్యోగులను మోసం చేశాడు. సాంబిరెడ్డి: నిరుద్యోగులకే కాదబ్బీ. 18 ఏళ్లు దాటిన ఆడోళ్లందరికీ నెలకు రూ.1,500 ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పి మహిళలను సైతం మోసం చేశాడు. ఇప్పుడు ఎక్కడ ఆ మాట చంద్రబాబు చెప్పడం లేదు. నెలనెలా రూ.1,500 వస్తాయని మహిళలు ఎంతో ఆశపడ్డారు. చంద్రబాబు కుర్చి ఎక్కి రెండేళ్లు అవుతున్నా ఆడబిడ్డ నిధి ఇవ్వడం లేదు. చంద్రబాబు మాటలు నమ్మి చాలా మంది మోసపోతిరి. బసివిరెడ్డి: చంద్రబాబు ప్రభుత్వం గురించి చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమీ అమలు కావడం లేదు. ఒక్క పింఛన్ పెంచడం తప్ప. పింఛన్ కూడా 50 ఏళ్లకు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి ఒక్కరికి కూడా కొత్త పింఛన్ ఇవ్వలేదు. పాండురంగాపురంలో.. -
కూలోల్లకు ఇచ్చేదానికి కూడ సరిపోదు..
భాస్కర్రెడ్డి: శివాడ్డి ఎక్కడికి పోయింటివి..ప్యాంటు వేసుకున్నావు..గని కాడికి పోలేదా? శివారెడ్డి: తాడిపత్రికి పోయింటిని..పాలీష్ ప్యాక్టరీ ఓనర్ దగ్గరకు. సంక్రాంతి పండుక్కు లెక్క ఇస్తే కూలోల్లకు ఇద్దామనుకుంటిని..వ్యాపారాలు అప్పుడు మాదిరి లేవు..రాళ్లన్నీ ప్యాక్టరీలోనే ఆనుకున్నాయి.. అని కొంచెం ఇచ్చినాడు. కూలోల్లకు ఇచ్చేదానికి కూడ సరిపోదు. ఇంతకు ముందు గన్లలో రాళ్లు ఉండగానే ముందుగానే అడ్వాన్సు ఇచ్చి తీసుకుబోతండిరి. ఇప్పుడు భంగకపోయి రాళ్లు ఎత్తిచ్చన్నాం. మనకున్నదే గన్లే కాబట్టి. కూలోల్లకు పండక్కన్నా డబ్బులు ఇయ్యక పోతే మల్లా గనికి రారు. ఏట్లైనా వాల్లకు లెక్క ఇయ్యాల్సిందే. కొన్నాల్లుంటే రాల్లు అడిగే వారుండరేమో.. భాస్కర్రెడ్డి: భాగ్యాలూ.. మేకలు బాగున్నాయా.. భాగ్యాలు: బాగనే ఉన్నాయిన్నా..కానీ మన ఊర్లో పసుల ఆసుపత్రి ఉంది కానీ మందులే ఉండవు. డాక్టరు లేడు.. వేరు వాళ్లు ఎప్పుడో ఒక సారి వస్తాడంటా. నేనేం మేకలు తోలుకొని మేతకు కొండకు పోయింటాను. ఆసుపత్రి పడిపోయేలాగా ఉంది. ఇంతకు ముందు గవర్నమెంట్లో పశువులకు మందులు ఎన్ని కావాలన్నా ఇస్తండిరి. ఎదన్న రోగం వచ్చి మేకలు చచ్చిపోతే ఇన్సురెన్స్ కూడా రావడం లేదంటా.. పోయిన ప్రభుత్వంలో పశవులు చచ్చిపోతే ఆఫీసర్లు పోస్టుమార్టం చేసి పైకి పంపించగానే లెక్క పడుతుండేదంట. భాస్కర్రెడ్డి: ఏం మద్దిలేటి.. యాడికి పోయింటివి లేటుగా వస్తివే! మద్దిలేటి: ఒళ్లంతా నొప్పులుంటే ఖాశీం డాక్టర్ కాడికి పోయింటి..సూదేసి రెండు పూట్లకు మాత్రలు ఇచ్చినాడు. జగన్ ఉన్నప్పుడు నెల నెలా 104 బాగా వచ్చుండేది. ఇప్పుడు.. ఎప్పుడు వచ్చుందో తెల్దు. మాత్రలు కూడా అప్పుడు మాదిరాగా మంచివి కావంటున్నారు. రెండు పూట్లకు మాత్రలు ఇచ్చినాడు. తగ్గక పోతే తాడిపత్రి కన్నా పోయి సూపించుకుంటా. పోయిన గవర్నమెంట్లో జగనన్న వైద్య శిబిరం మన ఊర్లో బడి కాడ పెట్టినప్పుడు పోయింటిని డాక్టర్లు మంచి మందులు ఇచ్చినారు. ఇప్పుడు ప్రభుత్వం ఊర్లలో ఒక్క సారి కూడా వైద్య శిబిరం పెట్టనేలేదు. భాస్కర్రెడ్డి: వెంకటనారాయణ నీకు 60 ఏళ్లు ఉండవు? వెంకటనారాయణ: 60 ఏళ్లు పడి సంవత్సరం దాటిందిప్పా. సచివాలయం కాడికి ఆధార్ కార్డు తీసుకొని ఐదార్లు సార్లు పోయినా సచివాలయం వాళ్లు ఇంకా పైనుంచి రాలేదు వచ్చినప్పుడు చెప్పుతామంటున్నారు ఏం చేయాలా. నాలాంటోళ్లు మన ఊర్లు చాలా మంది ఉన్నారంటప్పా. జగన్ ఉన్నప్పుడు ప్రతి వాళ్లకు ఇచ్చినాడు. అప్లికేషన్ పెట్టేదే ఆలస్యం వెంబడే వచ్చండ్లా. ఒక్కో ఊల్లో పించన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తన్నారు. కాళ్లు, చేతులు లేనళ్లకు ఇయ్యలా. అంకిరెడ్డిపల్లెలో.. -
108 .. ముక్కుతూ మూల్గుతూ!
● ఆటో, బైక్ ఢీ.. వ్యక్తికి గాయాలు● గంట సేపైనా రాని 108 వాహనం బండిఆత్మకూరు: మండలంలోని సోమవారం పార్నపల్లిలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే ఆసుపత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేయగా గంట సేపు నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. వెలుగోడు నుంచి నంద్యాల వైపు బైక్పై వెళ్తున్న లక్క కేశవ పార్నపల్లి గ్రామంలోని చర్చి వద్దకు రాగానే నంద్యాల నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కేశవ తలకు గాయమవడంతో పాటు కుడి చేయి, ఎడమ కాలు విరిగింది. దీంతో గ్రామస్తులు 108కి ఫోన్ చేశారు. అయితే గంట సేపైనా వాహనం రాకపోవడంతో క్షతగాత్రుడు నొప్పితో అల్లాడిపోయాడు. ఎట్టకేలకు 108 రావడంతో అతడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. -
ఫిబ్రవరి 18 నుంచి శ్రీ రాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వాముల గురు వైభవోత్సవాలు ఫిబ్రవరి 18 నుంచి 24వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీ మఠం మేనేజర్ యస్కె.శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా శ్రీ రాఘవేంద్రుల గురు వైభవోత్సవ ఆహ్వాన పత్రికను శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనం చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు చేతుల మీదుగా గురువైభవోత్సవ ఆహ్వాన పత్రికను ప్రారంభించారు. మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు మట్లాడుతూ భక్తులు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామి ఆశీర్వాదం పొందాలని కోరారు. ఫిబ్రవరి 19న గురు వైభవోత్సవాల్లో భాగంగా 405వ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తామన్నారు. -
పింఛన్ ఇవ్వాలి.. వంతెన నిర్మించాలి
● పీజీఆర్ఎస్లో అర్జీలు ఇచ్చిన ప్రజలునంద్యాల: తన భర్త అనారోగ్యంతో మృతి చెందాడని, తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన రహమత్ బీ అనే మహిళ అర్జీ ఇచ్చారు. తన 0.50 ఎకరాలు రహదారి నిర్మాణంలో పోతోందని, నష్టపరిహారం ఇవ్వాలని కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేటకు తిరుమలగారి కొండయ్యకు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో శ్మశానవాటిక వెళ్లే దారిలో వాగు ఉండడంతో ఇబ్బందిగా ఉందని, వంతెన నిర్మించాలని మహానంది మండలం గాజులపల్లె గ్రామస్తులు పత్రం అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీఆర్డీఎ పీడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా స్వీకరించిన 328 అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను డీఆర్ఓ డి. రామునాయక్ ఆదేశించారు. -
‘పచ్చ’గడ్డి వేస్తే భగ్గుమంటోంది!
కర్నూలు: టీడీపీలో మంత్రి టీజీ భరత్ వ్యవహార శైలి ఎవరికీ మింగుడు పడటం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో పాటు ఆ పార్టీ నేతలనే పరోక్షంగా బెదిరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా తమ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గం ఇన్చార్జి విష్ణువర్దన్రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చేతులు కలిపినట్లు తమ్ముళ్ల మధ్య చర్చ జరుగుతోంది. కోడుమూరులో ఇటీవల మంత్రి అచ్చెన్నాయడు పాల్గొన్న కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, విష్ణు మధ్య ఉన్న విబేధాలు బహిర్గతమయ్యాయి. అలాగే పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు జన్మదిన వేడుకల సందర్భంగా వెలిసిన బ్యానర్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీని వెనుక మంత్రి టీజీ హస్తం ఉన్నట్లు శ్యాంబాబు లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా కార్యకర్త పడాల సునీల్బాబుపై జరిగిన దాడి పట్ల కూడా విష్ణు తీవ్రంగా స్పందించారు. దాడిలో గాయపడి స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్సపొందుదున్న సునీల్బాబును స్వయంగా వెళ్లి పరామర్శించారు. నెల రోజుల వ్యవధిలోనే జరిగిన వరుస పరిణామాలతో మంత్రి వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు విష్ణు, కేఈలు కలిసి పార్టీ అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసినట్లు వారి అనుచరుల్లో చర్చ జరుగుతోంది. కర్నూలులో మంత్రి అనుచరుల గుండాయిజంపై చంద్రబాబు, లోకేష్లకు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి అనుచరుల గుండాయిజంపై విష్ణు ఫైర్ ‘‘తాజా పరిణామాలు పూర్తిగా నాకు తెలుసు, వాటి పర్యవసానం త్వరలో మీరే చూస్తారు. సునీల్బాబు.. విష్ణువర్దన్రెడ్డి అనుచరుడని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా అతను టీడీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. నాయకుల అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినందుకు దాడి చేశారు. మనపై జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగా మనం కూడా అదే స్థాయిలో స్పందించాలి. ఎవరు అధైర్యపడాల్సిన పనిలేదు’’ అంటూ విష్ణువర్దన్రెడ్డి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. సోమవారం ఆయన తన నివాసంలో ముఖ్య అనుచరులు, కర్నూలు మండల టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే తాను తాపత్రయపడుతున్నానని, ఇటీవల ఆల్కాలీస్ ఫ్యాక్టరీలో గ్యాస్పైప్ లీకేజీ విషయంలో కూడా అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేశాను. అయితే చివరి నిమిషంలో అధిష్టానం సూచన మేరకు విరమించుకున్నట్లు చెప్పారు. వివాదాస్పదమవుతున్న మంత్రి టీజీ భరత్ తీరు జట్టుకడుతున్న రెండు ప్రధాన కుటుంబాలు ఆజ్యం పోసిన సోషల్ మీడియా కార్యకర్తపై దాడి ముఖ్య నేతలు, అనుచరులతో సమావేశమైన విష్ణు అదేస్థాయిలో స్పందిద్దామని భరోసా -
రాష్ట్ర పార్టీ కమిటీలో సూర్యనారాయణరెడ్డికి స్థానం
బొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో పాణ్యం నియోజకవర్గానికి చెందిన సూర్యనారాయణరెడ్డిని రాష్ట్ర సెక్రటరీ(పార్లమెంట్)గా నియమిస్తున్నట్లు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా ఉపాధ్యక్షుడిగా గత కొంత కాలంగా సూర్యనారాయణరెడ్డి కొనసాగుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం రాష్ట్ర కమిటీలో ఆయనకు స్థానం కల్పించింది. కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఏడాది ఖరీఫ్లో పండించిన కందులను నాఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ కర్నూలు బ్రాంచీ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు నాఫెడ్ ఏపీ స్టేట్ హెడ్ వినయ్కుమార్ తెలిపారు. సోమవారం మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దతు ధర రూ.8వేలతో కందులను కొనుగోలు చేస్తామన్నారు. నాణ్యత ప్రమాణాల ఆధారంగా అక్కడే రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కొనుగోలు తేదీ ఇస్తామన్నారు. సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు కర్నూలు(అర్బన్): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లాలోని 91 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 10, 11వ తేదీల్లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ల వారీగా గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అయితే అనేక మంది గ్రామ సచివాలయాల ఉద్యోగులు పాల్గొనలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులపై 24 గంటల్లోగా సచివాలయ ఉద్యోగులు సంజాయిషీ ఇచ్చుకోవాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని సీఈఓ హెచ్చరించారు. సమస్యలను సత్వరం పరిష్కరించాలి కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్ఈ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ఎప్పటికప్పడు సమస్యలను పరిష్కరిస్తే వినియోగదారుల్లో సంతృప్తి రేటు పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవోపేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: శ్రీనరసింహ స్వామి జన్మనక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని సోమవారం మహోత్సవం వైభవంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆండాల్ ఆమ్మవారి దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచారు. అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణచేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు.. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య స్వాతి, సుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో ముగించారు. రాత్రి విశేష పుష్పాలకంరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. -
మోసం చేశారు.. న్యాయం చేయండి
● ఏఎస్పీకి ఫిర్యాదులు అందించిన ప్రజలునంద్యాల: అబద్ధపు మాటలు చెప్పి తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబుకు కొందరు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. బండిఆత్మకూరు మండలం భోజనం గ్రామం పరిధిలో స్థలాన్ని ఇస్తామని రూ.1.50లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేస్తున్నారని, న్యాయం చేయాలని నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన వెంకట నాగేశ్వర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని మోసం చేశారని డోన్ పట్టణానికి చెందిన దేవా సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు. వారసత్వంగా వచ్చిన భూమిలో ఇల్లు కట్టుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కబ్జా చేయాలని చూస్తున్న వారి నుంచి స్థలాన్ని కాపాడాలని నంద్యాలకు చెందిన వెంకటేశ్వర్లు కోరారు. పీజీఆర్ఎస్లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు పేర్కొన్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.3.72కోట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.3,72,50,251 లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహనాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం శ్రీశైలంలోని చంద్రావతి కల్యాణమండపంలో ఉభయ దేవాలయాల్లోని హుండీలలో 21రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. అలాగే బంగారం 158గ్రాముల200మిల్లీగ్రాములు, వెండి 11కేజీల460గ్రాములతో పాటు కొంత విదేశీ కరెన్సీ కూడా లభించిందన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాలో హుండీల లెక్కింపు చేపట్టారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి.రమణ, భరద్వాజశర్మ, డీఈఓ ఆర్.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లుగా అందని పదవీ విరమణ బెనిఫిట్స్
కర్నూలు(అగ్రికల్చర్): పదవీ విరమణ చేసి రెండేళ్లవుతున్నా ఇంతవరకు పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వలేదంటే చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది. సోమవారం కలెక్టరేట్లోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ఈ నెల 22న నిర్వహించే విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సమ్మేళనాన్ని పురస్కరించుకొని చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిడుతూరు తహసీల్దారుగా పని చేసి 2024 జనవరి 31న పదవీ విరమణ పొందిన సిరాజుద్దిన్ ఈ సందర్భంగా తన గోడు వినిపించారు. కర్నూలుకు చెందిన ఈయనకు రెండేళ్లవుతున్నప్పటికీ ఎలాంటి బెనిఫిట్స్ అందలేదు. 2024 జనవరి నెల నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో రెవెన్యూ యంత్రాంగం ఈయన పెన్షన్ ప్రపోజల్స్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. జూన్లో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికారులు విశ్రాంత తహసీల్దారు పెన్షన్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. అయితే కనీసం పెన్షన్ ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం నెలకొంది. నిరంతర పోరాటంతో 9 నెలల క్రితం పెన్షన్ మంజూరైంది. ఇక ఏపీజీఎల్ఐ, ప్రాపిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ, 10 నెలల సెలవు వేతనం ఇప్పటికీ చెల్లించని పరిస్థితి. దాదాపు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పదవీ విరమణ బెనిఫిట్స్ అందాల్సి ఉంది. రెవెన్యూ శాఖలో ఈయన ఒక్కరే కాదు.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పదవీ విరమణ చేసిన ప్రతి ఒక్కరిదీ ఇదే ఆవేదన.బైక్ అదుపు తప్పి.. డోన్ టౌన్: పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఖాజా హుస్సేన్(54) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మృతుడు పట్టణ సమీపంలోని యు. కొత్తపల్లెలో క్లీనిక్ నిర్వహిస్తూ ప్రతి రోజు బైకుపై కొత్తపల్లె గ్రామానికి వెళ్లి వచ్చేవాడు. విధి నిర్వాహణలో భాగంగా బైక్పై వెళుతుండగా వైఎస్, కోట్ల నగర్ కాలనీల మధ్యలో ఉన్న జాతీయ రహదారిపై బైకు అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమ్మిత్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య దస్తగిరమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచాలి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతాన్ని పెంచేందకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి ఆమె వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షరాంద్ర కార్యక్రమానికి సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో నిరక్షరాస్యులుగా ఉన్న 1,61,914 మందిని అక్షరాస్యులుగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. అక్షరాంధ్రలో భాగంగా నిరక్షరాస్యులకు డీఆర్డీఏ, మెప్మా, విద్యా వలంటీర్ల ద్వారా చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, వయోజనవిద్య డీడీ చంద్రశేఖరరెడ్డి, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు, డీఈఓ సుధాకర్, సీపీఓ భారతి, డివిజినల్ పంచాయతీ అధికారి తిమ్మక్క పాల్గొన్నారు. ఫుట్బాల్ విజేత అనంతపురం కర్నూలు (టౌన్): నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్జోన్ స్థాయి మహిళల ఇన్విటేసన్ ఫుట్బాల్ టోర్నమెంటు సోమవారం సాయంత్రం ముగిసింది. ఫైనల్ పోరులో చైన్నె మాసి మహిళల జట్టుపై 1–0 గోల్స్తో అనంతపురం ఆర్డీటీ జట్టు విజేతగా నిలిచి కప్పు కై వసం చేసుకుంది. మూడవ పట్టణ సీఐ శేషయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా శాంతి విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు రూ.20 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. పీడీ శ్రీనివాస రెడ్డి, టోర్నీ ఆర్గనైజేషన్ కార్యదర్శి బ్రహ్మకుమార్ పాల్గొన్నారు. -
బోడబండలో పట్టపగలు భారీ చోరీ
● 15 తులాల బంగారు ఆభరణాలు అపహరణఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని బోడబండ గ్రామంలో పట్టపగలు ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి ఏకంగా 15 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పెద్దనర్సిరెడ్డి అనే వ్యక్తి ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి పొలం పనులకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పొలం పనులు ముగించుకొని వచ్చిన పెద్దనర్సిరెడ్డికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటం, తలుపులు తెరుచుకొని ఉండటంతో లోపలికి వెళ్లి చూశాడు. బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బీరువాలోని 15 తులాల బంగారు చోరీకి గురైందని బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
బేతంచెర్ల: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మండల పరిధిలోని సీతారామాపురం మెట్ట వద్ద 340బీ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని యంబాయి గ్రామానికి చెందిన పరమేశ్వరప్ప(55) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం పై బనగానపల్లె మండలం పసుపుల గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. సీతారామాపురం మెట్ట వద్ద కర్నూలుకు వెళ్తున్న కోవెల కుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పరమేశ్వరప్ప తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తర్వాత మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. బుగ్గరామేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ జడ్జి ఓర్వకల్లు: మండలంలోని కాల్వబుగ్గలో వెలసిన బుగ్గరామేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు జడ్జి ప్రవీణ్కుమార్ దర్శించుకున్నారు. సోమవారం ఆయన కుటుంబ సమేతంగా కాల్వబుగ్గ దేవస్థానానికి రాగా ఆలయ చైర్మన్ కాటినేని నారాయణ, ఈఓ మద్దిలేటి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి బుగ్గరామేశ్వర స్వామిని దర్శించుకోగా ఆలయ అర్చకులు కళ్లె లక్ష్మీనారాయణ శర్మ వారికి ప్రత్యేక అర్చనలు చేసి ఆశీర్వదించారు. -
మాకు పరిహారం ఏదీ?
కర్నూలు(సెంట్రల్): ఉల్లి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన తమకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని దేవనకొండ మండలం గుడిమిరాళ్ల, బేతపల్లి, చెల్లెలి చెలిమల, కొటకోండ, బండపల్లి తదితర గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో రెవెన్యూ, వ్యవసాయాధికారులు టీడీపీ నాయకులకు ఇచ్చి నిజమైన బాధితులకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. తమకు పరిహారం ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ గ్రామాల ఉల్లి రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు వకీలు రంగన్న, ప్రకాస్రెడ్డి, హనుమంతరెడ్డి, సురేంద్రబాబు, మల్లి, భాస్కర్, విజయుడు, వంశీశెట్టి, గోపాల్, సోమలింగ, షేక్ మహ్మద్బాషా, గజ్జెలు శ్రీనివాసులు, బోయ కిష్టన్న, కౌలుట్లయ్య, ఆంజనేయులు, రంగడు మాట్లాడుతూ..తమ గ్రామాల్లో వందల మంది ఉల్లి పండించి ధర లేక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు మార్కెట్లో ప్రభుత్వం ప్రకటించిన రూ.1200 కూడా రాకపోవడంతో పారబోసి వచ్చామని, అయితే ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. నష్టపోయిన రైతులకు కాకుండా మండలంలో టీడీపీ నాయకులకు మాత్రమే అందించారన్నారు. పరిహారం మంజూరులో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.జిల్లా అధికారులు స్పందించి నష్టపోయిన రైతుల కు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. కాగా, ఉల్లి రైతులకు ఏపీ రైతు సంఘం నాయకులు వీరశేఖర్, సూరి మద్దతు తెలిపారు. అనంతరం రైతులు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న పీజీఆర్ఎస్లో తమకు న్యాయం చేయాలని వినతిపత్ర ఇచ్చారు. -
విద్యుత్ ప్రసారాన్ని కనిపెట్టేస్తుంది!
● విద్యుత్ కంచెల నుంచి రక్షణకు అటవీశాఖ వినియోగం ఆత్మకూరురూరల్: అటవీ సమీప గ్రామాల్లోని రైతులు అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు తమ పొలాలకు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తారు. కొన్ని సార్లు ఈ కంచెకు పెద్దపులిలాంటి ముఖ్య సంరక్షిత జంతువులు కూడా బలయ్యే అవకాశముండటంతో వాటిని అధికారులు నిషేధించారు. అయినప్పటికీ నల్లమల అటవీ సమీప గ్రామాల్లోని రైతులు కొందరు గుట్టుగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. గుర్తించి వాటిని తొలగించేందుకు అటవీ సిబ్బంది పొలాల్లో తచ్చాడుతుంటారు. ఈ క్రమంలో వెలుగోడు వెస్ట్ బీట్లో విద్యుత్ కంచె తగిలి లక్షణ నాయక్ అనే ప్రొటెక్షన్ వాచర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యుత్ ప్రసారాన్ని కొద్ది దూరం నుంచే గుర్తించి హెచ్చరించే ( లైవ్ వైర్ డిటెక్టర్) పరికరాన్ని అటవీశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో అటవీ రేంజ్ పరిధిలో ప్రస్తుతం ఇలాంటి పరికరాలను నాలుగు చొప్పున కేటాయించారు. ఈ పరికరాన్ని మధ్యప్రదేశ్కు చెందిన ఒక అటవీ అధికారి తయారు చేసినట్టు తెలిసింది. ఈ పరికరం ద్వారా కరెంటు ప్రవాహమున్న తీగలు కంటికి కనిపించకున్నా కొన్ని అడుగుల ముందే గుర్తించవచ్చు. ఫుట్ పెట్రోలింగ్ చేసే సిబ్బందికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ పరికరాన్ని డీడీ విగ్నేష్ అపావ్ సోమవారం పరిశీలించి, ఆపరికరం పనితీరుపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. -
యాదవులను గుర్తించని చంద్రబాబు ప్రభుత్వం
● అఖిల భారత యాదవ మహాసభ నేతలుకర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం యాదవులను గుర్తించకపోవడం దారుణమని అఖిల భారత యాదవ మహాసభ నేతలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక శకుంతల కళ్యాణ మండపం ఆవరణలో నందికొట్కూ రు, బనగానపల్లె నియోజకవర్గాలకు చెందిన యాదవ సంఘాలు ముద్రించిన 2026 సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహాసభ రాయలసీమ కన్వీనర్ టీ శేషఫణి యాదవ్, నాయకు లు సదానందం యాదవ్, ఓంకార్ యాదవ్, బాల చెన్నయ్య యాదవ్, మల్లికార్జున యాదవ్, దేవశంకర్యాదవ్, రాముడు యాదవ్ తదితరులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి చెందిన కాటమరాజు ముత్తుకూరు గౌడప్ప యాదవ్, గోసాయి వెంగన్నయాదవ్ వంటి మహోన్నత వ్యక్తులు అనేక ఉద్యమాలు చేశారన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర పండుగల జాబితాలో ఒక్క యాదవ రాజుకు కూడా స్థానం కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఇదే వైఖరితో వ్యవహరిస్తే భవిష్యత్తులో యాదవుల శక్తిని ఈ ప్రభుత్వానికి చూపిస్తామన్నారు.యాదవ నేతలు విజయభాస్కర్యాదవ్, శ్రీనివాసులు యాదవ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
దుకాణాలలో చోరీ
ఓర్వకల్లు: రెండు వేర్వేరు దుకాణాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానిక ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో మస్తాన్ కిరాణం దుకాణం, దామోదరం అనే వ్యక్తి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ పక్కన స్టేషనరీ షాపు నడుపుతున్నారు. రోజు మాదిరిగానే శనివారం రాత్రి షాపులకు తాళం వేసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో మస్తాన్ దుకా ణం తాళం పగులగొట్టి రెండు బియ్యం బస్తాలు, రూ.3 వేల నగదు, దామోదరం దుకాణంలో రూ.1300, స్టేషనరీ సామగ్రి అపహరించారు. ఆదివారం ఉదయం చోరీలు వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కర్నూలు(హాస్పిటల్): ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో ఆదివారం ఆక్సిజన్ పైప్లైన్లో లీక్ ఏర్పడింది. ప్రభుత్వ సర్వజన వైద్యశాల నుంచి కంటి ఆసుపత్రికి వెళ్లే ఆక్సిజన్ పైప్లైన్ ప్రధాన ద్వారం సమీపంలో లీక్ కావడంతో సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అప్రమత్తమై మరమ్మతులకు చర్యలు ప్రారంభించారు. ఆక్సిజన్ లీకేజీని అరికట్టేందుకు నిపుణులను పిలిపించారు. మధ్యాహ్నం వరకు శ్రమించి లీకేజీని అరికట్టడంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం కావడం, కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్ అమర్చిన రోగులు ఎవ్వరూ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. -
దారిలోనే దేవుడు కనిపిస్తాడు
కొత్తపల్లి: దేవుడిని దర్శించుకుందామని బయలు దేరిన భక్తులకు దారిలోనే కనిపిస్తాడు. కొలనుభారతి, సంగ మేశ్వరం క్షేత్రాలు ఉన్న రహదారి గుంతలమయంగా మారింది. దూర ప్రాంతాల నుంచి క్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తులు గతులకు రహదారిని చూసి దేవుడా.. అనుకుంటూ వెళ్తున్నారు. వాహదారుల, ప్రయాణికుల ప్రయాణం సజావుగా సాగలంటే రోడ్లు బాగుండాలి. గుంతల్లేని రహదారులే లక్ష్యమంటూ పాలకులు ప్రచారం చేస్తూ కనీసం ప్రధాన రహదారులను కూడా పట్టించుకోవడం లేదు. రోడ్లన్ని అస్తవ్యస్తంగా మారి ప్రయాణికులకు, వాహనదారులకు ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం చేరాలంటే భక్తులు 45 కి.మీలు, ఇదే దారిలో 30 కి.మీలు కొలనుభారతి పుణ్యక్షేత్రం ఉంది. దారంతా గుంతలు, కంకర తేలిన రహదారితో వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈనెల 23వ తేదీన కొలనుభారతి క్షేత్రంలో సరస్వతి దేవి అమ్మ వారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలలోని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వేల సంఖ్యలో భక్తులు వాహనాలు, బస్సులు, ఆటోల్లో చేరుకుంటారు. అలాగే ఆత్మకూరు పట్టణం నుంచి కొత్తపల్లి మండాలని సుమారు 12 గ్రామ పంచాయతీలలోని ప్రజలు ప్రతి నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఉత్సవాలు సమీపిస్తుండటంతో వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.బావాపురం – నందికుంట గ్రామాల మధ్య భయపెడుతున్న గుంతలునందికుంట సమీపంలో రహదారిపై కంకర తేలిన దృశ్యం అధ్వానంగా ఆత్మకూరు – సంగమేశ్వరం రహదారి 45 కి.మీలు నరకయాతన ప్రధాన క్షేత్రాలు ఉన్నా పట్టించుకోని అధికారులు -
కుక్ పోస్టులకు ‘ఉన్నత’ దరఖాస్తులు
● 77 నాన్ టీచింగ్ పోస్టులకు 8,982 దరఖాస్తులుకర్నూలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో కుక్ పోస్టులకు ఉన్నత విద్యావంతులు (పీజీ చదివిన వారు) సైతం పోటీ పడుతున్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామనే టీడీపీ అధినేత హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఒక్క జ్యాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఇటీవల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, ఏపీ మోడల్ స్కూళ్లలో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 77 పోస్టులు ఉంటే 8,982 దరఖాస్తులు వచ్చాయి. కుక్ పోస్టులకు పీజీ చదివిన వారు సైతం దరఖాస్తు చేసుకోవడం నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది. ఉన్నత విద్యావంతులు అధికం జిల్లాలో 26 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాల యాలు, 16 ఏపీ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇందు లో 16 కేజీబీవీల్లో అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్మెన్, స్కావెంజర్, స్వీపర్ పోస్టులు 32 ఉన్నాయి. వొకేషన్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు 3, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు 12, ఏఎన్ఎం 8 పోస్టులు భర్తీ చేయనుండగా..ఈ పోస్టులు జిల్లా స్ధాయిలో భర్తీ చేయనున్నారు. ఏపీ మోడల్ స్కూళ్ల లో నాలుగు వార్డెన్ పోస్టులు, తొమ్మిది పార్ట్టైం టీచర్ పోస్టులు, తొమ్మిది కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్ పోస్టులు మండల స్థాయిలోనే భర్తీ చేయ నున్నారు. కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్ పోస్టులకు ఉన్నత విద్య అభ్యసించిన యువతీ, యువకు లు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. దళారులుగా మారిన టీడీపీ నాయకులు మండల స్థాయిలో భర్తీ చేసే పోస్టులకు భారీగా దరఖాస్తులు రావడంతో టీడీపీ నేతల సిఫారసులు సైతం ఈ పోస్టులకు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యో గుల వద్ద భారీగా డబ్బులు తీసుకుని సిఫారసు లేఖలు తీసుకొచ్చారు. మొత్తం 77 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈ నెల 3న మొదలైన దరఖాస్తు ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. -
యాగంటీశ్వరుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
బనగానపల్లె: పవిత్ర శైవక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామిని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి ప్రవీణ్కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, ఈఓ పాండు రంగారెడ్డి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఆ తరువాత హైకోర్టు న్యాయమూర్తి కుటుంబసభ్యులను సన్మానించి ఉమామహేశ్వరస్వామి చిత్ర పటాన్ని,తీర్థప్రసాదాన్ని అందజేశారు. నాలుగు తులాల బంగారం అప్పగింత ఆదోని అర్బన్: ఆటోలో మరిచిపోయిన నాలుగుతులాల బంగారాన్ని గుర్తించి బాధితురాలికి పోలీసులు అప్పగించారు. వన్టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు..అనంతపురం పట్టణానికి చెందిన విజయలక్ష్మి భర్తతో కలిసి శనివారం ఆదోనికి వచ్చారు. బస్టాండ్లో బస్సు దిగిన తర్వాత ఆటో ఎక్కి పట్టణంలోని అమ్మ ఇంటికి వెళ్లారు. ఆటోలో హ్యాండ్ బ్యాగు మరిచిపోయారు. అందులో రూ.5 లక్షలు విలువచేసే నాలుగు తులాల బంగారం, ఒక ఫోన్ ఉంది. కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ లేదని గుర్తించిన విజయలక్ష్మి వెంటనే వెంటనే వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే బ్యాగ్లో ఉన్న ఫోన్ నంబర్ తీసుకుని లొకేషన్ ద్వారా ఆటో ఎక్కడ ఉందో గుర్తించి సమాచారం అందించారు. డ్రైవర్ విద్యాసాగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్ను బాధిత మహిళకు అందించారు. దీంతో ఆటో డ్రైవర్ విద్యాసాగర్ను సీఐ శాలువా కప్పి సన్మానించారు. వెనుక సీటులో ఉన్న బ్యాగును తాను ముందే చూసి ఉంటే వెంటనే ఇచ్చేవాడినని డ్రైవర్ ఈ సందర్భంగా తెలిపారు. మంత్రాలయం రూరల్ : 1990–91 బ్యాచ్కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ రాఘవేంద్రస్వామి ఆశీస్సులతో గురువుల చేత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చనిపోయిన గురువులు, పూర్వ విద్యార్థులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. గురువులను పూలమాలతో సన్మానించారు. అనంతరం రుచికరమైన వంటకాలతో కలసి కట్టుగా భోజనం చేశారు. కార్యక్రమంలో గురువులు, పూర్వ విద్యార్థులు శంకరయ్య, మాబు, బసప్ప, సరోజ, సూర్యనారయణ, శ్రీకాంత్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
యువ శక్తి.. విజయ కీర్తి
● వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగుతున్న యువత విభిన్న రంగాల్లో ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న వైనం ● నేడు స్వామి వివేకానంద జయంతిదేశ రక్షణలో భాగస్వామి కావాలని.. చిత్రంలో ఉన్నది దూది మనీషా. ఆళ్లగడ్డ మండలం రామతీర్థం గ్రామానికి చెందిన దూది లక్ష్మమ్మ, దూది చిన్నమద్దిలేటి దంపతుల కుమార్తె. రామతీర్థం జెడ్పీహెచ్ఎస్లో పాఠశాల విద్య, నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్వైవీసీపీ కళాశాలలో ఇంటర్ చదివారు. క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. చదువుతో పాటు ఎన్సీసీలో శిక్షణ పొంది దేశ సేవ చేయాలన్న లక్ష్యంతో ఎన్సీసీలో చేశారు. గత ఏడాది మేలో నంద్యాలలో 9 ఆంధ్రా బెటాలియన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్సీసీ శిబిరం–1, 2లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. అనంతపురంలో 6వ ఆంధ్రా పటాలం ఆధ్వర్యంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరం–1లో పాల్గొని బంగారు పతకం సాధించారు. ఆగస్టు 21 నుంచి 30వ తేదీ వరకు అనంతపురంలోనే జరిగిన తల్ సైనిక్ తుది శిబిరంలో కూడా రాణించి బంగారు పతకం అందుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన తల్ సైనిక్ శిబిరంలో పాల్గొని బంగారు పతకాలు సాధించి అభినందనలు అందుకున్నారు. ‘తల్లిదండ్రులు సహకారం, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎన్సీసీ ఆఫీసర్ అనూషల మార్గదర్శనంలో ఎన్సీసీలో రాణించడం ఆనందంగా ఉంది. ఆర్మీలో చేరి దేశ సేవ చేయడమే లక్ష్యం ’ అని దూది మనీషా చెబుతున్నారు. జాతి ఖ్యాతి పతాకను విశ్వ వేదికపై రెపరెపలాడించిన స్వామి వివేకానంద ఎందరికో ఆదర్శం. తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో యువతను చైతన్య పరిచారు. నిరుత్సాహం ..నిస్తేజం.. నిరాశ, నిస్పృహ, మానసిక రుగ్మతలు, అసమానతలు వదలి.. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం, ఆత్మ వికాసం పెంపొందించుకొని ముందుకు పయనించాలన్నదే వివేకానందుని ప్రభోదనల అంతరార్థం. స్వశక్తిపై ఆధారపడి ఇతరులకు సాయపడేలా మనం నేర్చుకున్న విద్య ఉపయోగ పడాలని వివేకానందుడు బోధించారు. సోమవారం స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతీ యువకుల విజయాల మనోగతం ఇలా.. – కర్నూలు కల్చరల్చిత్రంలో ఉన్నది ఎం.డి.నాగరాజు. కృష్ణగిరి మండల కేంద్రానికి చెందిన పార్వతమ్మ, సంజీవయ్యల దగ్గర (జేజీ, జేజినాన్నలు పెంచారు) పెరిగిన ఇతను కృష్ణగిరి ఏపీ మోడల్ స్కూల్లో పాఠశాల విద్య, కళా శాల విద్యను అభ్యసించాడు. క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిధిలో ని కర్నూలు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో బీకాం చివరి చదువుతున్నారు. చదువుతో పాటు ఎన్సీసీలో శిక్షణ పొందితే అన్నిరంగాలో రాణించడంతో పాటు క్రమశిక్షణతో పాటు దేశ భక్తి అలవుడుతుందని ఇందులో చేరినట్లు నాగరాజు చెబుతున్నాడు. గత ఏడాది మేలో కర్నూలు నగరం సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రా బెటాలియన్–1 ఆధ్వర్యంలో జరిగిన ఎన్సీసీ శిబిరంలో పాల్గొని రైఫిల్ షూటింగ్లో మొదటి స్థానంలో నిలిచారు. అనంతరం 6వ ఆంధ్రా బెటాలియన్ వార్షిక శిక్షణ శిబిరంలో కర్నూలు గ్రూప్ తరుఫున పాల్గొని బంగారు పతకం గెలుపొందారు. అనంతపురంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరంలో రజతం, కాకినాడలో ఆంధ్రా బెటాలియన్ –3 ఆధ్వర్యంలో జరిగిన తల్ సైనిక్ శిక్షణ శిబిరంలో 7వ స్థానం, ఆగస్టులో అనంతపురంలో జరిగిన తల్సైనిక్ తుది శిబిరంలో రైఫిల్ షూటింగ్లో 5వ స్థానంలో నిలిచారు. సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరిగిన తల్ సైనిక్ శిబిరంలో కర్నూలు గ్రూప్నకు ప్రాతినిథ్యం వహించి బంగారు పతకం అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉండి రక్షణ విభాగానికి ప్రాతినిథ్యం వహించాలన్నది తన లక్ష్యమని, కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా శాంతి, ఎన్సీసీ ఆఫీసర్ కమ్లినాయక్ ప్రోత్సాహంతోనే ఉన్నతంగా రాణిస్తున్నామని నాగరాజు చెబుతున్నారు. -
ఉల్లి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
● నష్ట పరిహారం జాబితాలో జిల్లా లేకపోవడం విడ్డూరం ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి నంద్యాల(అర్బన్): గత ఖరీఫ్లో ఉల్లి పంట సాగుతో నష్టపోయిన జిల్లా రైతులకు నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో 5,486.8 హెక్టార్లలో గత ఖరీఫ్ కింద రైతులు ఉల్లి సాగు చేశారన్నారు. దాదాపు 47,250 మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడులు వచ్చినట్లు సంబంధిత అధికారులు అంచనా వేశారన్నారు. మరికొంత దిగుబడులు రావాల్సిన సమయంలో వాతావరణం మార్పులతో ఎదుగుదల లేకపోవడం, అదే సమయంలో మార్కెట్లో ధర లేకపోవడంతో పంటను రైతులు పొలాల్లోనే వదిలేశారన్నా రు. ఆ పరిస్థితుల్లో సంబంధిత అధికారు లు నష్టపోయిన రైతు ల వివరాలను ప్రభుత్వానికి నివేదించాల్సి ఉందన్నారు. అధికారులు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ ఏడాది ప్రభుత్వం ఉల్లి రైతులకు మంజూరు చేసిన పంట నష్ట పరిహారంలో నంద్యాల జిల్లా లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే పంట నష్ట పరిహారం అందకుండా పోయిందని చెప్పారు. పంట దిగుబడులు లేకపోవడంతో గత సెప్టెంబర్ మాసంలో ప్రభు త్వం క్వింటా రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం కేవలం 5 శాతం ఉల్లిని మాత్రమే కొనుగోలు చేసి, పంట నష్టపరిహారం కింద హెక్టారుకు రూ.50 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే నంద్యాల జిల్లా ఉల్లి రైతులకు పంట నష్టపరిహార సాయం అందించకపోవడం దారుణమన్నారు. పంట నష్ట పరిహారం పంపిణీలో భాగంగా కడప, కర్నూలు జిల్లా రైతులకు హెక్టార్లకు రూ.50 వేలు (ఎకరాకు రూ.20 వేలు), పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన కూటమి ప్రభుత్వం నంద్యాల, అనంతపురం జిల్లా రైతులను విస్మరించడం దుర్మార్గమన్నారు. నంద్యాల జిల్లా రైతులకు పంట నష్టపరిహారం కింద రూ.28 కోట్లు రావాల్సి ఉందని, ప్రభుత్వం ఏదో కుంటి సాకు చెబుతూ రైతులను మోసం చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. తక్షణమే రెండు జిల్లాల ఉల్లి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసి ఆదుకోవాలన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
కర్నూలు (టౌన్): సంక్రాంతి వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను డీఐజీ, జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కేవల ం సంప్రదాయ క్రీడలు మాత్రమే ఆడాలని సూచించారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో ఎక్కడైనా కోడి పందేలు, పేకాట, జూదం, గుండాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై డయల్ 112, డయల్ 100కు లేదంటే స్థానికంగా పోలీసు స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
గాయపడిన యువకుడి మృతి
ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన చాకలి మహేంద్ర(21), కురువ భరత్ కర్నూలు ఫర్మెన్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. భరత్కు సంబంధించిన కూరగాయలను మార్కెట్లో అమ్ముకునేందుకు శనివారం సాయంత్రం ఆటోలో పంపారు. భరత్ తన మోటారు సైకిల్పై స్నేహితుడు మహేంద్రతో కర్నూలుకు బయలుదేరారు. కూరగాయలు అమ్ముకొని రాత్రి 10 గంటలకు స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న యూటర్న్ వద్ద బైక్ అదుపుకాకపోవడంతో వెనకాల కూర్చున్న మహేంద్ర కింద పడి తలకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స కోసం 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మహేంద్ర మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి మద్దికెర: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందాడు. ఈ ప్రమాదం మద్దికెర– పత్తికొండ రోడ్డులో బురుజుల గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన ట్రాక్టర్ మట్టి తీసుకుని వచ్చే నిమిత్తం పత్తికొండకు వెళ్తూ అదుపుతప్పింది. తగ్గులో ఉన్న పొలాల్లోకి వెళ్లి వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన దొడ్ల బోయకిష్టప్ప (64) అనే వ్యక్తిపై ట్రాలీ పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్లో ఉన్న గుంతకల్లుకు చెందిన శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని 108లో గుంతకల్లుకు తరలించారు. విషయం తెలుసుకున్న మద్దికెర ఎస్ఐ హరిత పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకులకు తప్పిన ప్రమాదం మహానంది: నంద్యాల పట్టణానికి చెందిన కొందరు యువకులు ఆదివారం మహానందికి వచ్చారు. మహానందీశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడిన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. ముగ్గురు యువకులు నంద్యాలకు వెళ్తుండగా పర్యావరణ కేంద్రం దాటిన తర్వాత వారి ముందు ఓ బైక్ వెళ్తుండటంతో తగులుతుందేమోనని సడన్ బ్రేక్ వేశారు. దీంతో బైక్ అదుపు తప్పి కిందపడింది. అదే సమయంలో బస్సు వస్తుండటం, ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. బైకును కాల్చిన దుండగులు మహానంది: గోపవరం గ్రామంలో బైకుకు దుండగులు నిప్పు పెట్టిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం మల్లికార్జున తన ఇంటి ముందు బైకును పెట్టి నిద్రించారు. అయితే, అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు బైకుకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో తాము నిద్రిస్తున్నామని, కాలిన వాసన, మంటలతో కూడిన శబ్ధం రావడంతో బయటికి వచ్చే సరికి బైక్ కాలిపోయిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి మహానంది: ప్రమాదవశాత్తూ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి చెందాడు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విజయ్కుమార్(13) ఈ నెల 6న పాఠశాల ఆవరణలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఇనుప కడ్డీలు గుచ్చుకొని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కర్నూ లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ కోలు కోలేక ఆదివారం ఉదయం మృతి చెందినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. సాంబవరం గ్రామానికి చెందిన ప్రతాప్ దంపతులకు ఇద్దరు సంతానం కాగా పెద్ద కుమారుడు విజయ్కుమార్, మరో కుమార్తె ఉన్నారు. 13 ఏళ్లకే కుమారుడికి నిండు నూరేళ్లు నిండటంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగారు. పాఠశాల ప్రాంగణంలో పర్యవేక్షణ లేక పోవడంతో విద్యార్థుల ప్రాణాలకు భద్రత కరువైందని స్థాని కులు విమర్శిస్తున్నారు. ఐటీడీఏ ఉన్నతాధికారు లు ఇప్పటికైనా స్పందించి పాఠశాలలో కొన్నేళ్లు గా పని చేస్తున్న వారిని మార్చి, కొత్తవారిని నియమించి, విద్యార్థులు క్రమశిక్షణగా మెలిగేలా చూడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నారు. -
రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దర్శనం నిలుపుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి మాత దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీ అధికారి మహమ్మద్ ఆదివారం తెలిపారు. మార్కాపురం జిల్లా నెక్కంటి పరిధిలోని ఇష్టకామేశ్వరి మాత అమ్మవారి ఆలయ పరిసరాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు వాహనాలను నిలుపుదల చేసి దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు గమనించి ఇష్టకామేశ్వరి ఆలయ దర్శనం వాయిదా వేసుకోవాలని సూచించారు. 31న ఎంపీపీపై అవిశ్వాసం జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లా మండల ఎంపీపీ సువర్ణమ్మపై ఈనెల 31వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించారు. ఎంపీటీసీ సభ్యులకు ఆత్మకూరు ఆర్డీఓ నాగ జ్యోతి నోటీసులు జారీ చేశారు. ఈనెల 5వ తేదీన సువర్ణమ్మను ఎంపీపీ పీఠం నుంచి దించేందుకు మండలంలోని ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన సంగతి పాఠకులకు విధితమే. ఈ మేరకు వినతిపత్రాన్ని పరిశీలించి అవిశ్వాస తీర్మానం సభ లో ప్రవేశపెట్టేందుకు ఈనెల 31వ తేదీని ఆర్డీఓ నిర్ణయించారు. 2021 ఏప్రిల్ 8న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా అందులో 9 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందగా తాటిపాడు, పారుమంచాల గ్రామా ల్లో ఇండిపెండెంటు అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థులు ఒక్క ఎంపీటీసీ స్థానంలో కూడా గెలువలేదు. 2024 ఎన్నికల అనంతరం కొంత మంది ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల్లో చేరారు. వారిలో ఆరుగురిని తమవైపు తిప్పుకొని ఎంపీపీ సువర్ణమ్మను పీఠం నుంచి దింపేందుకు యత్నించటం గమనార్హం. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 12వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దర ఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అటవీ శాఖలో డ్రోన్ పైలట్లు ● శిక్షణకు ఆరుగురు అధికారుల ఎంపిక ఆత్మకూరురూరల్: అటవీ సంరక్షణలో డ్రోన్ల వినియోగం కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు అటవీ డివిజన్కు చెందిన ఆరుగురు అధికారులు డ్రోన్ పైలట్లుగా శిక్షణకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆత్మకూరు డివిజన్ ప్రాజెక్ట్ టైగర్ డీడీ విగ్నేష్ అపావ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లోని డ్రోన్ అకాడమిలో శిక్షణ కోసం ఆరుగురు అధికారులను ఎంపిక చేసి పంపామని, వారు డ్రోన్ అకాడమి డైరెక్టర్ వద్ద ఆదివారం రిపోర్ట్ చేశారన్నారు. కెపాసిటి బిల్డింగ్లో భాగంగా డివిజన్కు చెందిన ఎఫ్ఎస్ఓలు మహబూబ్ బాషా, రాజశేఖరరెడ్డి, ఎఫ్బీవోలు పీరా సయ్యద్, ఇస్మాయిల్, రజాక్ సాహెబ్, శ్రీనివాసులు శిక్షణ పొందడం కోసం వెళ్లారని వివరించారు. 57 రోజుకు చేరిన రిలే దీక్షలు ఆదోని టౌన్: ఆదోని జిల్లాను సాధించుకునేంతవరకు ఐక్యంగా పోరాడుదామని జేఏసీ నాయకులు రఘురామయ్య, కుంకనూరు వీరేష్, దస్తగిరి నాయుడు పేర్కొన్నారు. జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 57వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షల్లో ఆదోని జిల్లా జేఏసీ నాయకులు కమతం వెంకటేష్, వై.వెంకోబ, సి.వీరేష్, నరేంద్రయాదవ్, కుమార్, రామలింగయ్య, వెంకటేష్, నరసింహా, మల్లికార్జున, అశోక్ కూర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు వర్షిత
కృష్ణగిరి: స్థానిక కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న గొల్ల వర్షిత జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ చైతన్య స్రవంతి ఆదివారం తెలిపారు. డిసెంబర్ 29న కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి అసోషియేషన్ రగ్బీ పోటీల్లో ప్రతిభ కనపరచడంతో జాతీయస్థాయికి ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 13 నుంచి భువనేశ్వర్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో వర్షిత పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే స్కూల్ గేమ్స్లో కూడా జాతీయస్థాయికి ఈ బాలిక ఎంపిక అయ్యారని, పోటీలు ఈ నెల చివరల్లో జరుగుతాయని చెప్పారు. విద్యార్థిని ఎంపికకు కృషి చేసిన పీఈటీ సుప్రియను ఆమె అభినందించారు. -
సీమ నీటి హక్కులను కాలరాయడం తగదు
నంద్యాల(అర్బన్): శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి పేరుతో రాయలసీమ నీటి హక్కులను కాలరాయడం తగదని రాయలసీమ సాగునీటి సాధన సమితి బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని నిరంతరం దిగువకు వదిలే విధానాన్ని తక్షణమే నిలిపి నాగార్జున సాగర్కు కేటాయించిన నీటితో మాత్రమే విద్యుత్ఉత్పత్తి చేయాలనే నిబంధనను సక్రమంగా అమలు చేయాలన్నారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం సమితి సభ్యులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిగిలిన నీటిని శ్రీశైలంలో నిల్వ ఉంచి రాయలసీమ, దక్షిణ తెలంగాణ అవసరాలకు వినియోగించాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుల్లో పూడిక కారణంగా ఇప్పటికే 90టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, భవిష్యత్తులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా సిద్దేశ్వరం అలుగు నిర్మాణంతో పూడిక నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు కీలకమైన ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని వెంటనే చేపట్టాలన్నారు. సీమ అభివృద్ధిని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులు కుంటల పునరుద్ధరణ అత్యంత కీలకమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక నిధులను సీమలోనే పూర్తిగా వినియోగించాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు ఎర్రం శంకర్రెడ్డి, వెంకటేశ్వరనాయుడు, మహేశ్వరరెడ్డి, సుధాకర్రావు పాల్గొన్నారు. -
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు వేళాయే!
శ్రీశైలంటెంపుల్: మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలకు శ్రీశైల ఆలయం మస్తాబు అయింది. సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నికదీక్షతో ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపేందుకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేషంగా వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఉభయ దేవాలయాల్లో నిర్వహించే పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభంగా సోమవారం ఉదయం 9.15గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. అలాగే మహాగణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనం జరిపిస్తారు. బ్రహ్మోత్సవ నిర్వహణకు అధ్వర్యం వహించే శివపరివార దేవుడైన చండీశ్వరునికి విశేషపూజలు, కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, కలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, పారాయణలు నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అంకురారోపణ, అగ్నిప్రతిష్ఠాపన, ఽ7గంటలకు ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. -
దామోదరం జయంతిని ‘సాధికారత’గా నిర్వహించాలి
కర్నూలు(సెంట్రల్): దేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి ఫిబ్రవరి 14 లేదా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 11వ తేదీని సామాజిక సాధికారత దినంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా మేధావుల వేదిక డిమాండ్ చేసింది. ఆదివారం కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో దామోదరం సంజీవయ్య తొలి దళిత సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర కల్కూర, మాజీ జెడ్పీ చైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి, మానవశక్తి పరిశోధన కేంద్ర వ్యవస్థాపకుడు ఎస్ఏ రెహమాన్, కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం.హర్ష తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దామోదరం సంజీవయ్య ఎన్నో విప్లవాత్మక, సామాజిక మార్పులు తెచ్చారన్నారు. ఆయన అన్ని వర్గాల ప్రజల సాధికారతకు కృషి చేసిన నేపథ్యంలో దామోదరం సంజీవయ్యకు గౌరవంగా సాధికారత బహుమానం ఇవ్వాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించారు. ఈమేరకు సమావేశంలో వక్తలు ఆయన సేవలను కొనియాడి సాధికారత దినోత్సవం కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు. -
నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం
● రూ. 50 లక్షల ఆస్తి నష్టంనంద్యాల: పట్టణంలోని శ్రీనివాస సెంటర్లోని జేబీ ఎలాక్ట్రానిక్స్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలో నుంచి పొగలు, మంటలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో రూ.50 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు కాలిపోయాయి. దుకాణ మేనేజర్ రాజ్పురోహిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పాండురంగస్వామి సేవలో జిల్లా న్యాయమూర్తి
కోవెలకుంట్ల: పట్టణంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత పాండురంగ విఠలేశ్వరస్వామి ని జిల్లా న్యాయమూర్తి అమ్మన రాజ శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు కోవెలకుంట్ల జూనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జ్ జడ్జి ప్రతిమ, సీఐ హనుమంతునాయక్, ఎస్ఐ మల్లికార్జునరెడ్డితో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు, పవనచార్యులు పూర్ణకుంభంతో స్వాగతించారు. జిల్లా జడ్జి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక జూనియర్ సివిల్ కోర్టును సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. కోర్టు రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయవాదులు వాసగిరి సాయికృష్ణమూర్తి, బాలమురళీకృష్ణ, ఆరికట్ల మల్లికార్జునరెడ్డి, తిరుపతయ్య, జీఎల్నరసింహులు తదితరులు పాల్గొన్నారు. హంద్రీనీవా పైపులైన్కు లీకేజీ డోన్: ఓబులాపురం మెట్ట వద్ద హంద్రీనీవా పైపులైన్ లీకేజీతో నీరంతా వృథా అవుతోంది. హంద్రీనీవా నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఓబులాపురం గ్రామస్తులు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చెరువులను హంద్రీనీవా నీటితో నింపే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి విధితమే. శుక్రవారం ఈ విషయంపై మాజీ మంత్రి బుగ్గన స్పందిస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా చెరువులను హంద్రీనీవా నీటితో నింపడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం హడావుడిగా నీటిని నింపే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిసింది. అయితే నీటి సరఫరాలో ఒత్తిడిని తట్టుకోలేక ఓబులాపురం మెట్ట వద్ద పైపులైన్ లీకేజీ నీరు వృథాగా పోతోంది. మంత్రాలయం: భక్తుల జయ జయ ధ్వానాల మధ్య స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలు కొలువై శ్రీమఠం ఆవరణలో విహరించారు. మంత్రాలయ క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దర్శనం చేసుకున్నారు. రాత్రి శ్రీ మఠం ప్రాంగణంలో మంగళ వాయిద్యాల మధ్య ప్రత్యేకంగా అలంకరించిన బంగారు రథంపై ప్రహ్లాద రాయలు కొలువై భక్తులకు దర్శనమిస్తూ విహరించారు. -
యువతిని వేధిస్తున్నాడని చంపేశారు!
పాణ్యం: గడివేముల మండలంలో సంచలనంగా మారిన యువకుడి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన ఓ యువతిని వేధిస్తున్నాడని యువకుడి ని దారుణంగా చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు పాల్పడిన యువతితోపాటు ఓ యువకుడు, ఇద్దరు మైనర్లను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పాణ్యం సర్కిల్ కార్యాలయంలో నంద్యాల ఎస్డీపీఓ మందజావళి విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలను మీడియాకు వివరించారు. మండల కేంద్రం గడివేములకు చెందిన వినోద్కుమార్(19) డీఎంఎల్టీ కోర్సు చేస్తున్నాడు. కాగా రేవనూరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆరు నెలల క్రితం సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైంది. అయితే ఆమెను నిత్యం ఫోన్లో వేధిస్తుండటంతో వినోద్ కుమార్ను హత్య చేయాల ని కుట్ర పన్నింది. ఈ మేరకు తనకు పరిచయం ఉన్న నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర బర్మశాల వద్ద ఉంటున్న తేల్కర్ మణికంఠ సహాయంతో పథకం రూపొందించింది. గత ఏడాది ఆగస్టు 31వ తేదీన నంద్యాలకు చెందిన ఇద్దరు మైనర్లును తోడు తీసుకుని ఆటో లో గడివేములకు వెళ్లారు. వినోద్కుమార్కు ఫోన్ చేసి ఇంటి నుంచి బొల్లవరం రస్తాలోని మద్దిలేరు వాగు వద్దకు రప్పించారు. బైక్పై వచ్చిన వినోద్కుమార్ను జన సంచారం లేని చోటుకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపేశారు. ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లి పాణ్యం మండలం పిన్నాపురం రస్తాలోని గాలేరు నగరి కాల్వలో పడేశారు. ఆ సమీపంలోనే బైక్ను కూడా నీటిలో వేసేశారు. కాగా తమ కుమారుడు కనిపించడం లేదని వినోద్కుమార్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు కేసు ఛేదించి హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్డీపీఓ మందజావళి తెలిపారు. హత్యకు పాల్పడిన తేల్కర్ మణికంఠ, యువతితో పాటు ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశామన్నారు. కేసును ఛేదించిన గడివేముల ఎస్ఐ నాగార్జునరెడ్డి, పోలీసు సిబ్బందిని ఆమె అభినందించారు. నాలుగు నెలల క్రితం యువకుడి హత్య మృతదేహాన్ని గాలేరు నగరిలో పడేసిన వైనం కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు మైనర్లు, యువతి, యువకుడు అరెస్ట్ -
సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పంచాహ్నికదీక్షతో ఏడురోజుల పాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేషంగా వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ దేవాలయాల్లో నిర్వహించే పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలు ● 15వ తేదీన మకర సంక్రాంతి రోజున స్వామిఅమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం ● ఈ నెల 17న ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, సాయంత్రం సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ ● బ్రహ్మోత్సవాల్లో చివరిరోజై 18న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలు స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు.. 12న సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణ, 13న భృంగివాహనసేవ, 14న కై లాసవాహనసేవ, 15న నందివాహనసేవ, బ్రహ్మోత్సవ కల్యాణం, 16న రావణవాహనసేవ, 17న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 18న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్జితసేవల నిలుపుదల.. ఉత్సవాల సందర్భంగా సోమవారం నుంచి 18వ తేదీ వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామికల్యాణం, స్వామిఅమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవ, ఉదయాస్తమానసేవ, ప్రదోషకాలసేవ, ప్రాతఃకాలసేవలు నిలుపుదల చేశారు. శ్రీశైలంలో రేపటి నుంచి ఏడు రోజుల పాటు నిర్వహణ ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజాది క్రతువులు, వాహనసేవలు -
హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని వైనం
ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పలు విషయాల్లో ఇదే విషయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా స్పందన కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు తమ భూమిలోకి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని బాధితులు ఎస్ఐ, సీఐలను వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో పీజీఆర్ఎస్కు వచ్చి ఎస్పీ సునీల్ షొరాణ్కి తమ సమస్యను చెప్పుకున్నా చర్యలు తీసుకోవడం లేదని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. టీడీపీ పాలనలో సామాన్యుడిని బతుకనివ్వరా అంటూ ఆవేదన చెందుతున్నారు. అడంగల్, పాసుపుస్తకం తమ పేరు మీదనే ఉన్నాయని.. మా భూమిలోకి మేం వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నాయకులకు ఏం హక్కుందని ప్రశ్నిస్తున్నారు. రైతుల పొలంలో అక్రమంగా మైనింగ్ చేసిన దృశ్యంసాక్షి, నంద్యాల: అధికారమే అండగా టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. రైతుల భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే ‘అధికారం మాది.. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ దౌర్జన్యానికి దిగుతున్నారు. ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండడంతో అటు వైపు చూసేందుకు అధికారులు భయపడుతున్నారు. అప్పట్లో ప్రణాళిక ఇప్పుడు అమలు అవుకు మండలం సుంకేసుల గ్రామంలోని సర్వే నంబర్ 325–2ఏ1లో ముప్పగాని గోపాలు, ముప్ప గాని రాజుగౌడ్లకు 7.86 ఎకరాల పొలం ఉంది. ఆరుతడి పంటలు వేస్తూ జీవనం సాగించేవారు. ఇద్దరు సోదరుల మధ్య మనస్పర్ధలు రావడంతో రెండేళ్ల పాటు సాగు చేయలేదు. ఇదే అదనుగా భావించి 2016లో టీడీపీ నాయకులు భూమిని కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు. అక్కడే పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి సుంకన్నను రంగంలోకి దించారు. తన భార్య జి.కమలమ్మ పేరు మీద నాపరాయి గనుల కోసం లీజుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు 2019 ఫిబ్రవరిలో లీజు మంజూరు చేస్తూ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) మంజూరు చేశారు. ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం మారడంతో పాటు ఐదేళ్ల పాటు టీడీపీ నాయకులు అటువైపు చూడలేదు. అయితే ఈ మధ్యలో రైతులను తమ భూమిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటూ వచ్చా రు. 2024లో మళ్లీ అధికారంలోకి రావడంతో పాటు, వారికి ఓ మంత్రి అండగా నిలచడంతో టీడీపీ మండల నాయకుడు ఉగ్రసేనారెడ్డి రెచ్చిపోయాడు. భూమిలో అక్రమంగా ప్రవేశించి మైనింగ్ చేపట్టాడు. నాపరాయి గనులను తవ్వుకుంటూ రూ. కోట్లలో సంపాదిస్తున్నాడు. బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో మైనింగ్ కార్యకలాపాలు నిషేధిస్తూ గతే డాది అక్టోబర్లో ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పోలీసులు రక్షణ కల్పించి బాధితులను తమ భూమిలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అవుకులో ఓ మంత్రి అనుచరుడి అరాచకం రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కొంటున్న వైనం అక్రమంగా మైనింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న టీడీపీ నాయకుడు హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ -
పేదల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం
● వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి చల్లా మధుసూదన్రెడ్డిబొమ్మలసత్రం: రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దుపోకడలను నిలదీస్తూ సామాన్య, పేదల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందని రాష్ట్ర సమన్వయ కార్యదర్శి చల్లా మధుసూదన్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్సీపీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు.. గ్రామ స్థాయిలో ముఖ్యమైన కార్యకర్తలను వివిధ కమిటీల ద్వారా ఎంపిక చేసుకోవాలని సూచించారు. వారి ఫొటోలను సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపితే గుర్తింపు కార్డు అందజేస్తామని వివరించారు. ఈ ప్రక్రియను జిల్లాలో నేటి నుంచి 45 రోజుల్లోగా టాస్క్ఫోర్స్ పేరుతో వేగంగా చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు, పట్టణ, నియోజకవర్గ స్థాయి కమిటీల నియామకం చేపట్టి త్వరితగతిన వారికి పార్టీ నుంచి ఒక గుర్తింపు కార్డును అందిస్తామన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలను సమన్వయం చేసుకుంటూ కమిటీల ఏర్పాటు ప్రక్రియను ఎప్పటికప్పుడూ కేంద్ర పార్టీ కార్యాలయానికి సమాచారం అందిస్తామని వివరించారు. రానున్న రోజుల్లో పార్టీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్రకార్యదర్శి దేశం సుధాకర్రెడ్డి, బుడ్డా శేషిరెడ్డి, గుండం సూర్యప్రకాష్రెడ్డి, ఎస్ఈసీ మెంబర్లు పీపీ నాగిరెడ్డి, గోపవరం సాయినాథ్రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు సూర్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మా భూమిలోకి మమ్మల్నే అడుగు పెట్టనివ్వడం లేదు
అడంగల్, పాస్ పుస్తకాల్లో మా పేరు ఉన్నా టీడీపీ నాయకులు బలవంతంగా మా భూమిని ఆక్రమించుకున్నారు. అక్రమంగా మైనింగ్ చేపట్టి కోట్లు ఆర్జిస్తున్నారు. మా భూమిలోకి అడుగు పెట్టాలంటే పెట్టనివ్వకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. న్యాయపరంగా హైకోర్టుకు వెళ్లాం. మైనింగ్ కార్యకలాపాలను ఆపించి మా భూమిలోకి మమ్మల్ను అడుగు పెట్టనివ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా టీడీపీ నాయకులు లెక్కచేయడం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి సమస్య విన్నవించుకున్నా స్పందించడం లేదు. స్థానిక ఎస్ఐ, సీఐ మాట వినడం లేదు. మా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. టీడీపీ ప్రభుత్వంలో సామాన్యులను బతకనివ్వడం లేదు. – రాజాగౌడ్, సుంకేసుల గ్రామం, అవుకు -
నీళ్లు లేవు.. పండుగకు పిలువం!
● పండుగ వేళ భయపెడుతున్న నీటి సమస్య ● బంధుమిత్రులను పండుగకు ఆహ్వానించలేకపోతున్న వైనం ప్యాపిలి: కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాల్సిన ఆ రెండు గ్రామాల ప్రజలు నీటి సమస్యతో భయపడుతున్నారు. పండుగ పూట ఇంటికొచ్చిన వారికి నీటి కష్టాలు చెప్పలేమని, పండుగకు ఎవరినీ పిలుచుకోవడం లేదని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి ముందే నీటి సమస్య తలెత్తి ప్రజలు అవస్థలు పడుతున్నారు. నల్లమేకలపల్లి గ్రామంలో 2 వేల మంది నివసిస్తున్నారు. గ్రామంలో రెండు మంచినీటి బోర్లు ఉండగా ఒక బోరు మాత్రమే సక్రమంగా పని చేస్తోంది. అయితే ఈ బోరు నుంచి గ్రామంలోని ట్యాంకులకు సక్రమంగా నీటి సరఫరా కావడం లేదు. పలువురు తమ తోటలకు, ఇళ్లకు నేరుగా నీళ్లు వచ్చేలా కనెక్షన్లు ఇచ్చు కోవడంతో ట్యాంక్లోకి నీటి సరఫరా జరగడం లేదు. దీంతో నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా గ్రామంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ సంధ్య గ్రామ పంచాయతీ తరపున ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఇదే పంచాయతీ పరిధిలోని డి. రంగాపురం గ్రామంలోనూ పది రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామ పంచాయతీకి సంబంధించిన మోటర్ పని చేయకపోవడంతో నీటి సమస్య తలెత్తిందని గ్రామస్తులు తెలిపారు. మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ శివారు ప్రాంతంలో తోటలకు వెళ్లి ద్విచక్రవాహనాలు, ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకుంటున్నామని తెలిపారు. మరో మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుండటంతో గ్రామస్తులను నీటి సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పండుగకు తమ ఇంటికి వచ్చే బంధువులను సైతం నీటి సమస్య కారణంగా రావొద్దని చెప్పాల్సిన పరి స్థితి నెలకొందని ఓబులమ్మ, ఉషారాణి, సావిత్రి, నాగమ్మ తెలిపారు. అధికారులు స్పందించి బోర్లు, మోటర్లకు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
క్రీడలతో ఉద్యోగులకు మానసిక ఉల్లాసం
కర్నూలు (టౌన్) : క్రీడ ల్లో పాల్గొనడం వల్ల ఉ ద్యోగుల్లో మానసిక ఒత్తి డి తగ్గి ఉల్లాసంగా ఉంటారని నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ అన్నా రు. శనివారం స్థానిక ఎగ్జిబిషన్, కౌన్సిల్ హాల్, ఔట్డోర్ స్టేడియం,ఇండోర్ స్టేడియం లలో మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. పురుష ఉద్యోగులకు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారెమ్స్, చెస్ క్రీడలు, మహిళా ఉద్యోగులకు త్రోబాల్, బ్యా డ్మింటన్, 100 మీటర్ల రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, రంగోలి, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించారు. క్రీడలను ప్రారంభించిన కమిషనర్ మాట్లాడుతూ శని, ఆదివారం రెండు రోజులు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. సంక్రాంతి పండుగ నాడు మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తామన్నారు. డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు,కార్యదర్శి నాగరాజు, ఎస్ ఈ రమణమూర్తి, ఎంఈ మనోహార్ రెడ్డి,ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ పాల్గొన్నారు. -
నల్లమలలో ఎర్రమట్టి తవ్వకాలు!
మహానంది: దర్జాగా ప్రకృతి వనరులు కొల్లగొడుతున్న తెలుగు తమ్ముళ్లపై ప్రజలు కన్నెర్ర చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తుండటంతో అడ్డుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నంద్యాల – గిద్దలూరు రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహానంది, శిరివెళ్ల మండలాల సరిహద్దులోని మహదేవపురం గ్రామ సమీపంలోని పోలేరమ్మ రస్తా ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ నేతలు ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 15 టిప్పర్లు, జేసీబీతో యథేచ్ఛగా తవ్వేస్తుండటంతో మహదేవపురం ప్రజలు అడ్డుకున్నారు. ఎర్రమట్టిని తరలిస్తూ పొలం రస్తాలను ధ్వంసం చేస్తే ఎలా వెళ్లాలంటూ ప్రజలు రోడ్డెక్కారు. అర్ధరాత్రి చలిని సైతం లెక్క చేయకుండా తవ్వకాలను అడ్డుకున్నారు. పొలాలకు, సర్వనరసింహస్వామి ఆలయానికి వెళ్లేందుకు సౌకర్యంగా ఉన్న రస్తా మట్టి అక్రమార్కుల జేసీబీల కారణంతో ధ్వంసమవుతుందన్నారు. ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమకు సంబంధం లేదంటూ దాటవేస్తున్నారని గ్రా మస్తులు ఆరోపించారు. అయితే టిప్పర్లను అడ్డు కునేందుకు వెళ్లిన వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు బౌన్సర్లను పంపుతూ బెదిరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా బేఖాతర్.. పోలేరమ్మ రస్తాలో జరుగుతున్న ఎర్రమట్టి తవ్వకాలపై రెండు వారాల క్రితం ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి(నాని) ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాను కలిసి వినతిపత్రం అందించారు. దీంతో స్పందించిన అధికారులు నామమాత్రంగా దాడులు నిర్వహించి కేవలం రెండు ఎర్రమట్టి టిప్పర్లను మాత్రమే సీజ్ చేసి అధికార భక్తిని చాటుకున్నారు. అనుమతులు ఉంటే అర్ధరాత్రి మట్టి తవ్వకాలు ఎందుకు జరపాలంటూ పలువురు విమర్శిస్తున్నారు. మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతుల్లేవని మండల అధికారులే చెబుతున్నారన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి పూర్వం నుంచి ఉన్న పోలేరమ్మ రస్తాను ధ్వంసం చేయడం తగదన్నారు. అర్ధరాత్రి అడ్డుకున్న మహదేవపురం ప్రజలు -
సాక్షి సినిమాలు
ఎస్వీసీ కాంప్లెక్స్: ది రాజాసాబ్ వి మెగా ఆనంద్ సినీ కాంప్లెక్ : ది రాజాసాబ్ వెంకటేష్ సినీ కాంప్లెక్స్ : ది రాజాసాబ్ శ్రీరామ : బిజినెస్ మేన్ (2012) రాజ్ : ఆంధ్రా కింగ్ తాలూకా భరత్ కాంప్లెక్స్ : ది రాజాసాబ్ విజయ : ది రాజాసాబ్ విక్టరీ : దురంధర్ -
మరి కొద్దిరోజులు ఎల్లెల్సీకి నీటి సరఫరా
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు మరి కొద్ది రోజులు నీటి సరఫరా కొనసాగే అవకాశా లు కనిపిస్తున్నాయి. జలాశయం క్రస్ట్గేట్ల ఏర్పాటులో భాగంగా ఖరీఫ్ పంటకు మాత్రమే నీరిచ్చి రబీ పంట కు నీరివ్వలేమని టీబీ బోర్డు అధికారులు ముందుగా నే ప్రకటించారు. జనవరి 10నుంచి నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. అయితే డ్యాంలో ఇంకా 29 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో కర్ణాటక పరిధిలో ఇంకా సాగులో ఉన్న పంటలకు నీటిని అందించేందుకు మరి కొద్ది రోజులు అంటే ఈనెల 20 వరకు సరఫరా కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలోని 18వ నంబరు గేటును కొత్తగా బిగించారు. మే చివరి నాటికి మొత్తం 33 క్రస్టు గేట్ల ఏర్పాటు పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1605 అడుగులతో 29 టీఎంిసీల నీరు నిల్వ ఉండగ ఇన్ఫ్లో జీరో ఉండి ఔట్ఫ్లో రూపంలో 7,886 క్యూసెక్కుల నీరు వివిధ కాలువలకు వదులుతున్నారు. శనివారం ఆంధ్ర కాలువ ప్రారంభ (హన్వాళ్ సెక్షన్) 250 కి.మీ వద్ద 635 క్యూసెక్కుల నీటి సరఫరా జరిగింది. -
కొండెక్కిన గుడ్లు, చికెన్ ధరలు
● హోల్సేల్లో వంద కోడిగుడ్ల ధర రూ.740 ● కిలో చికెన్ రూ. 260 నుంచి రూ.300 ● రిటైల్గా కోడిగుడ్డు ఒక్కటి రూ.9 పైమాటే గోస్పాడు: ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ కోవలోకే చేరాయి. చికెన్, గుడ్లు. జిల్లాలో దాదాపుగా 2వేల పైగా చికెన్ సెంటర్లు ఉండగా, మరిన్ని కిరాణ కొట్లలో గుడ్లను విక్రయిస్తునారు. జిల్లాలో దాదాపుగా రోజుకు నాలుగు లక్షలకు పైగా గుడ్లు అమ్ముడుపోయేతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పరుగులు పెడుతున్న గుడ్ల ధరలు... మార్కెట్లో గుడ్ల ధర ఎన్నడూ లేనంతగా పరుగులు పెడుతోంది. రెండు నెలల క్రితం నుంచి ప్రారంభమైన ధర నేటికీ ఆగడం లేదు. బహిరంగ మార్కెట్లో ధరలు ఒకలాఉంటే మారుమూల గ్రామాల్లో గుడ్ల ధరలు కొంత అధికంగా ఉంటున్నాయి. నెల క్రితం 30 గుడ్ల ధర రూ.170 నుంచి రూ.180 వరకు (ఒక్క గుడ్డు రూ. 6) ఉండింది. కాగా.. ప్రస్తుతం వంద గుడ్ల ధర రూ.740గా ఉంది. మార్కెట్లో రూ.8 నుంచి రూ.9 వరకు విక్రయిస్తున్నారు. ఇక్కడికి హైదరాబాద్, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల నుంచి కోళ్లు,గుడ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ ధరకు రెక్కలు.. హోల్సేల్ వ్యాపారుల వద్ద కిలో చికెన్ ధర రూ.260 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. గ్రామా ల్లోని వ్యాపారులు రూ.330 వరకు విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో మాంసాహార ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. -
స్టెమీ ఇంజెక్షన్తో గుండెపోటు బాధితులకు రక్షణ
ఎమ్మిగనూరు రూరల్: గుండెపోటు బాధితులకు స్టెమీ ( సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫారాక్షన్ ) ఇంజెక్షన్ పనిచేస్తుందని సూపరింటెండెంట్ డాక్టర్ ఆదినాగేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి గుండెపోటుతో వచ్చిన నాసిర్, భాగ్యమ్మకు స్టెమీ ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడాదు. ఈ సదర్భంగా డాక్టర్ ఆదినాగేష్ మాట్లాడుతూ గుండె పోటు వచ్చిన వారికి అత్యవసరంగా స్టెమీ ఇంజెక్షన్ ఇస్తే కంట్రోల్ చేయవచ్చునని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ. 45 వేలు ఉంటుందని, ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వేస్తున్నామని తెలిపారు. ఆగని ఇసుక దందా గోనెగండ్ల: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. మండలంలో గంజిహళ్లి హంద్రీనది నుంచి రాత్రీ పగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక రూ.3నుంచి రూ.5వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక పథకం ఎక్కడా కనిపించడం లేదు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక దందా జరుగుతుంది. పట్టించుకోవాల్సిన మైనింగ్ అధికారులు కూడా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం మండలంలో 20 గ్రామ పంచాయతీలు, 28 గ్రామాలు ఉన్నాయి. మండలంలో గంజిహళ్లి, హెచ్. కై రవాడి, పుట్టపాశం, వేముగోడు, తిప్పనూరు గ్రామాల మీదుగా వెళ్లే హంద్రీనదిలో మాత్రమే ఇసుక దొరుకుతుంది. ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం హంద్రీనది సమీపంలో బోర్లు వేశారు. ప్రతి రోజు ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూ గర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో రానున్న వేసవి కాలంలో తమకు తాగునీటి సమస్య ఎదురువుతుందని హంద్రీతీర గ్రామా ల ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే గంజిహళ్లి గ్రామం హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక రవాణా విషయం తమ దృష్టికి రాలేద ని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గోనెగండ్ల సీఐ చంద్రబాబు పేర్కొన్నారు. రచనలు మానవీయ కోణాన్ని ఆవిష్కరించాలి కర్నూలు కల్చరల్: రచనలు మానవీయ కోణాన్ని ఆవిష్కరించేలా ఉండాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రముఖ కవి జి.ఉమామహేశ్వర్ రచించిన ‘అహానికి ఆవల’ కథల పుస్తకావిష్కరణ శనివారం మద్దూరు నగర్లోని పింగళి సూరన తెలుగు తోటలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథా రచయిత్రి వి. ప్రతిమ, కథా రచయితలు వెంకట కృష్ణ, మారుతి, డాక్టర్ ఎం. హరికిషన్, డాక్టర్ వి.పోతన్న, ఇనాయతుల్లా, సుభాషణి పాల్గొని మాట్లాడారు. ఉమామహేశ్వర్ రాసిన అహానికి ఆవల కథలు సమాజంలో మార్పును కోరుకుంటాయని, మధ్యతరగతి కుటుంబాల్లో సాగే సున్నితమైన మానవ సంబంధాలు విలువలు ఈ కథల్లో ఉంటాయన్నారు. మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తాయన్నారు. కళ్లముందు కనిపించే జీవితాన్ని కథల్లోకి ఎక్కించే జీవన దృశ్యాల్లాగా మలిచాడన్నారు. కార్యక్రమంలో కవులు, రచయితలు ఎస్డీవీ అజీజ్, వెంకటేష్, డాక్టర్ అవిజ వెంకటేశ్వర రెడ్డి, విరసం నాయకులు పాణి, తెలుగు భాషా వికాస ఉద్యం కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ, ఆవుల చక్రపాణి యాదవ్ పాల్గొన్నారు. -
అట్టహాసంగా జేఎన్టీయూఏ క్రీడాపోటీలు
పాణ్యం: ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం అట్టహాసంగా జేఎన్టీయూఏ క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను జేఎన్టీయూఏ ఉపలకులపతి డాక్టర్ హెచ్ సుదర్శన్రావు, చెర్మన్ శాంతిరాముడు ప్రారంభించారు. 40 కళాశాలల నుంచి సుమారు 2,200 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. రగ్బీ, ఫుట్బాల్, త్రోబాల్, బ్యాట్మింటన్, బాస్కెల్బాల్, వాలీబాల్ తదితర క్రీడలు జరగనున్నాయి. అనంతరం వారు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని చెప్పారు. జేఎన్టీయూఏ క్రీడ మండలి కార్యదర్శి నారాయణరెడ్డి విశ్వవిద్యాలయాలరిధిలో క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. విద్యతో పాటు క్రీడలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెర్మన్ శాంతిరాముడు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయచంద్రప్రసాద్, ఎండీ శివరామ్, డీన్ అశోక్కుమార్, కో–ఆర్డినేటర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం
కర్నూలు (సిటీ): నగర శివారులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఆ స్కూల్ అధినేత కేజే రెడ్డి, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత కేఎన్వీ రాజశేఖర్, సర్వేపల్లి స్కూల్ కరస్పాండెంట్ శేషన్న, శ్రీలక్ష్మి విద్యాసంస్థల కరస్పాండెంట్ దీక్షిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అమలులో ఉన్న విద్యా ప్రణాళిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అమలు చేస్తున్నారన్నారు. ఈ విద్యాబోధన భవిష్యత్తులో విద్యార్థులు రాణించేందుకు చక్కగా దోహదపడుతుందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ జస్మిత్ కౌర్, కోఆర్డినేటర్ గోపిక, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వసంత పంచమికి భారీ ఏర్పాట్లు
కొత్తపల్లి: నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన సరస్వతి క్షేత్రమైన కొలనుభారతిలో ఈనెల 23న వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఆర్డీఓ నాగజ్యోతి కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొలనుభారతి ఆలయం శ్రీశైల దేవస్థానంలో కలిసిన తర్వాత జరుగుతున్న తొలి వసంత పంచమి కావడంతో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా తాగునీరు, క్యూలైన్లు, మహిళలకు ప్రత్యేక గదులు, చిన్నారులకు అక్షరాభ్యాస ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆలయ చైర్మన్ వెంకటనాయుడు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీడీఓ మేరి, తహసీల్దార్ ఉమారాణి పాల్గొన్నారు. -
ఎస్సార్బీసీ ఉద్యోగి ఇంట్లో చోరీ
కోవెలకుంట్ల: పట్టణంలోని బనగానపల్లెకు వెళ్లే రహదారిలోని డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. స్థానిక ఎస్సార్బీసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జయరామిరెడ్డి రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా బెంగుళూరులో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లారు. ఇంటికి తాళం వేయడంతో గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 20 వేలు నగదు అపహరించుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటికొచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకివెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు క్లూస్టీం రంగప్రవేశం చేసి దొంగతనానికి సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. నగదు అపహరణ -
● మాజీ ఐఏఎస్ అధికారి, సీడబ్ల్యూసీ సభ్యులు కొప్పుల రాజు
వైఎస్సార్ హయాంలో ఒక మోడల్గా ఉపాధి హామీ పథకం కర్నూలు(అర్బన్): ఏపీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గొప్పగా అమలు చేసిన చరిత్ర దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనని మాజీ ఐఏఎస్ అధికారి, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. వైఎస్సార్ హయాంలో ఏపీలో ఉపాధి హామీ పథకం ఒక మోడల్గా అమలు చేశారన్నారు. శనివారం కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంజీఎన్ఆర్జీఎస్ను రద్దు చేయరాదనే డిమాండ్పై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బీకేఎంయూ పతాకాన్ని సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు భీమలింగప్ప ఆవిష్కరించారు. కొప్పుల రాజు మాట్లాడుతూ..ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు ఒక కుట్ర దాగి ఉందన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ మాట్లాడుతూ ‘పనైనా చూపండి–తిండైనా పెట్టండి’ అనే నినాదంతో చేసిన పోరాట ఫలితమే ఈ చట్టం అన్నారు. ఈ నెల 14న భోగి మంటల్లో కొత్త పథకం ప్రతులను దగ్ధం చేయాలని, 30న సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని తీర్మానించారు. -
అతిథులు వచ్చారు !
పొడవైన కాళ్లపై భారీ ఆకారంలో ఉండే పెయింటెడ్ స్టార్క్ పక్షులు అతిథులా ఆత్మకూరుకు వచ్చేశాయి. శీతాకాలంలో ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం అతి శీతల ప్రాంతాలైన హిమాలయాల నుంచి అటు రష్యాలోని సైబీరియా నుంచి కూడా దక్షిణ భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వస్తుంటాయి. కల్వకుర్తి – నంద్యాల 167కే హైవే నిర్మాణం పనులు నల్లకాల్వ – బాపనంతాపురం మధ్య జరుగుతున్నాయి. ఆ పనులను పర్యవేక్షించేందుకు వచ్చాయా.. అన్నట్లుగా అక్కడ ఈ పక్షులు కనిపించాయి. – ఆత్మకూరురూరల్ -
అమ్మ కడుపు చల్లన..
ఎమ్మిగనూరురూరల్: ప్రజా చైతన్యం.. వైద్యుల సేవాతత్వం వెరసి ఎమ్మిగనూరు ఏరియా అసుపత్రి ఆదర్శంగా నిలుస్తోంది. ‘తల్లి–బిడ్డల సురక్షితం లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘ఆదర్శ కాన్పుల వార్డు’ అత్యుత్తమ ఫలితాలనిస్తోంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలతోపాటు సి.బెళగల్, ఆస్పరి, దేవనకొండ ప్రాంతాల్లోని మెజార్టీ గ్రా మాల ప్రజలకు ఎమ్మిగనూరు వైద్యశాలలో విస్తృత వైద్యసేవలు అందుతున్నాయి. ప్రారంభంలో 30 పడకల ఆసుపత్రిగా ఉన్న 2002లో కమ్యూనిటీ ఆసుపత్రిగా నూతనంగా నిర్మించి పడకలను పెంచారు. ఆతర్వాత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 12.60 కోట్లతో వంద పడకలకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం నూతనంగా నిర్మాణం చేసిన వంద పడకల ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో సేవలు అందిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రసవాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వైద్య పరి కరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఫిజిషీయన్స్, గైనకాలజిస్టులు, స్టాఫ్ నర్సులను కేటాయించడంతో ఉత్తమ సేవలు అందుతున్నాయి. రికార్డుల్లో మొదటి స్థానం ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది సేవాతత్వం..చురుకుదనం మూలంగా రికార్డుస్థాయిలో కాన్పులు నమోదు అవుతున్నాయి. ముగ్గురు గైనకాలజిస్టులకు అందుబాటులో ఉన్నారు. నెలకు 280 నుంచి 340కి పైగా నార్మల్ డెలివరీలు, సిజేరియన్స్ చేస్తున్నారు. ప్రతిరోజూ గర్భిణులకు స్కానింగ్, రక్తపరీక్షలు, సాధారణ చెకప్లు చేస్తున్నారు. రికార్డుస్థాయిలో కాన్పులు చేపట్టి జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో వరుసగా నాలుగేళ్లుగా మొదటి స్థానం నిలుస్తోంది. అర్దరాత్రైనా..అత్యవసరమైన కాన్పు కోసం వచ్చే గర్భిణులకు మెరుగైన సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. స్కానింగ్ పరీక్షల్లో టాప్.. ప్రభుత్వాసుపత్రిలో ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 9వ తేదీన ఎమ్మిగనూరు, మంత్రాలయం, నందవరం, పెద్దకడబూరు, కోసిగి మండలాల నుంచి వచ్చే గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తారు. సూపరిండెంట్ డాక్టర్ ఆదినాగేష్ పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ డాక్టర్లు సుజితా, ఫాతిమా, హిమబిందులు గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ప్రతి నెల 9వ తేదీ ఒక్కరోజే 490 నుంచి 500 మందికి పైగానే గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేసి టాప్లో నిలుస్తున్నారు. ఎంత సమయం పట్టినా వచ్చిన వారందరికీ స్కానింగ్ పరీక్షలు చేసి పంపుతున్నారు. సంవత్సరం సాధారణ డెలివరీ ీసీజిరియన్ మొత్తం 2022-23 2,778 517 3,295 2023-24 2,642 62 2,704 2024-25 3,419 607 4,026 2025-26 (డిసెంబర్) 1,709 553 2,262 -
రెడ్ బుక్ను ప్రకాశం బ్యారేజ్లో ముంచుతాం
● నంద్యాలలో విద్యార్థి, యువజన సంఘాల నేతల ధర్నానంద్యాల(న్యూటౌన్): ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తే రెడ్బుక్ను ప్రకాశం బ్యారేజీలో ముంచుతామని యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. బొమ్మలసత్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సూర్యప్రతాప్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు నాగరాముడు, వైఎస్సార్సీపీ యువజన నాయకులు చంద్రశేఖర్రెడ్డి, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తే యువజన, ప్రజా సంఘాల నాయకులపై కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి నిరుద్యోగ, విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. కేసులు ఎత్తి వేసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. విద్యార్థి, యువజన ప్రజా సంఘాల నాయకులు ప్రతాప్, ధనుంజయుడు, శశిధర్రెడ్డి, ఎర్రిస్వామి, వైఎస్సార్సీపీ విభాగం నాయకులు మధు, పాములేటి తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ జంట ఘటనపై విచారణ
శిరివెళ్ల: స్థానిక పోలీసు స్టేషన్ వద్ద ఈ నెల 8వ తేదీన జరిగిన సంఘటన పరిణామాలపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన రెండు సామాజిక వర్గాలకు చెందిన ప్రేమ జంట వ్యవహారం ముదిరి దాడులకు దారి తీసింది. రక్షణ కోరి స్టేషన్కు వచ్చిన జంట వ్యవహారాన్ని రాజీ చేసేందుకు కొందరు ప్రయత్నించినా కుదరలేదు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారు భారీ సంఖ్యలో స్టేషన్కు వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జంటను వేర్వేరు పోలీస్ వాహనాల్లో తరలించారు. అయితే అబ్బాయిని తరలించే పోలీస్ వాహనంపై కొంత మంది రాళ్లు రువ్వడంతో పోలీస్లు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై శుక్రవారం జిల్లా అడిషనల్ ఏస్పీ యుగంధర్బాబు స్టేషన్కు చేరకుని సీఐ దస్తగిరిబాబును విచారణ చేశారు. అనంతరం రాళ్లు పడిన వాహనాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ప్రధాన కూడలిలో స్పెషల్ పార్టి పోలీస్లను నియమించారు. పోలీస్ బందోబస్తును అడిషనల్ ఏస్పీ పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండంగా ఘటనలో పోలీస్ వాహనంపై ఎవ్వరు రాళ్లు రువ్వారు, ఎంత మంది ఉన్నారన్న దానిపై పోలీస్లు విచారణను ముమ్మురం చేశారు. కార్యక్రమంలో డీఏస్పీ ప్రమోద్, ఎస్ఐ మధుసూదన్ పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్య వెలుగోడు: పట్టణంలోని గొల్లపేటకు చెందిన గాజా రవి (29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గాజా రవి వెలుగోడులో ఓ పాల డైయిరీ తరఫున డిస్ట్రిబ్యూటర్గా షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 9 గంటలకు దుకాణం నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడి తల్లి గాజా మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
శ్రీశైలంలో పోలీసుల మాక్ డ్రిల్
శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో వచ్చే నెలలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పోలీసుల మాక్ డ్రిల్ చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు విపత్కర పరిస్థితుల్లో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం సాయంత్రం స్థానిక సిద్ధిరామప్ప కాంప్లెక్స్ వద్ద అవగాహన కల్పించారు. రద్దీ సమయంలో తొక్కిసలాట ప్రారంభమైతే ప్రాణాలు ఎలా రక్షించుకోవాలి, ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుని వ్యక్తికి సీపీఆర్ చేసే విధానాన్ని భక్తులకు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఏదైనా భవంతిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా ఎలా బయటపడాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, ఆరోగ్య, ఆర్అండ్బీ, ఏపీఎస్పీడీసీఎల్ తదితర శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎకై ్సజ్ నేరాలపై కమిషనర్ సమీక్ష కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదైన ఎకై ్సజ్ నేరాలపై ఆ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ సమీక్షించారు. శుక్రవారం వారు అనంతపురం పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా ఎకై ్సజ్ నోడల్ కర్నూలు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు తదితరులు కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో వారితో సమావేశమై ఉమ్మడి జిల్లాలో నమోదైన ఎకై ్సజ్ నేరాలపై సమీక్షించినట్లు డీసీ శ్రీదేవి తెలిపారు. నవోదయం 2.0, పొరుగు రాష్ట్రాల మద్యం పూర్తిగా కట్టడికి తీసుకోవలసిన చర్యల సమీక్ష జరిగినట్లు డీసీ తెలిపారు. సామాజిక సేవా దృక్పథంతో పని చేయాలి గోస్పాడు: రక్త కేంద్రాల నిర్వాహకులు సామాజిక సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి డాక్టర్ శారదబాయి అన్నారు. శుక్రవారం స్థానిక బ్లడ్ బ్యాంకులో రక్త కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్త కేంద్రాలు మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలన్నారు. ప్రతి నెల వారి నివేదికలు సకాలంలో ఇవ్వాలని, రక్తదానం శిబిరాలు, రక్తదాతల వివరాలు ఈ– రక్తకోష్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఏపీ సాక్స్ రాష్ట్ర కార్యాలయం డిప్యూటీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలు, సేవాసంస్థలు, యువజన సంఘాల సమన్వయంతో అన్ని ప్రాంతాలలో రక్తదానంపై అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ స్వాతి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రొగ్రాం మేనేజర్ అలీ హైదర్, గణాంక అధికారి దేవి శంకర్ గౌడ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రక్త కేంద్ర కౌన్సిలర్, ప్రైవేట్ రక్త కేంద్రాల వైద్య అధికారులు, సాంకేతిక పర్య వేక్షకులు తదితరులు పాల్గొన్నారు. -
అడవి జంతువులు రావొచ్చు.. అప్రమత్తంగా ఉండాలి
● జీఐఎఫ్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీశైలం: పాతాళగంగ మెట్ల మార్గం పరిసర ప్రాంతాలకు అడవి జంతువులు రావొచ్చునని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ డీడీ విగ్నేష్ అప్పావ్ సూచించారు. శుక్రవారం సాయంత్రం శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల మార్గం పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసితులతో ఆయన సమావేశమయ్యారు. అటవీ ప్రాంతం నుంచి చిరుత పులు నివాసిత ప్రాంతాల్లో ఉన్న కుక్కలను వేటాడడానికి కోసం వస్తాయని తెలిపారు. భవిష్యత్తులో అడవి జంతువులు నివాసిత ప్రాంతాల్లోకి వచ్చి వ్యక్తులపై దాడి చేసే అవకాశం ఉందని, ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో జంతువులకు కలుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. సమావేశంలో శ్రీశైలం సబ్ డీఎఫ్ఓ లలిత కుమారి, దోర్నాల సబ్ డీఎఫ్ఓ నీరజ్, శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ‘టెట్’లో 39.27 శాతం ఉత్తీర్ణత నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో జిల్లాలో 39.27 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా డిసెంబర్ నెల 10 నుంచి 21వ తేదీ నిర్వహించిన పరీక్షలకు 2,48,420 మంది హాజరయ్యారన్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 97,560 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని ఏపీ టెట్ కన్వీ నర్ వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెట్కు 31,886 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు హాజరు కాగా వారిలో 47.82 శాతం(15,239) మంది ఉత్తీర్ణలయ్యారని తెలిపారు. ఫలితాలను 9552300009 వాట్సాప్ నంబరు ద్వారా కూడా తెలుసుకోవచ్చన్నారు. ప్రాణదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్ట్కు శుక్రవారం చిలకలూరిపేటకు చెందిన ఇ.లక్ష్మీ తేజశ్విని రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందించారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ హల్చల్ ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పట్టణంలో రెండురోజులుగా ఒక వ్యక్తి తాను ఫుడ్ ఇన్స్పెక్టర్ను అని శ్యాంపుల్ చెక్ చేయాలంటూ బేకరీలు, స్వీట్ షాపులు, హోటళ్ల వద్ద హల్చల్ చేశాడు. అంతే కాకుండా రెండువేల రూపాయలు ఇవ్వాలని బెదిరించి వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఈయన వ్యవహారం కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో పట్టణంలోని ప్రముఖ స్వీట్షాపు యజమాని నిలదీయడంతో అసలు విషయం తెలిసింది. నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడ నుంచి జారుకున్నాడు. దొర్నిపాడు: పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ జనార్ధన్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని డబ్ల్యూగోవిందిన్నె గ్రామంలోని జెడ్పీ ఉన్నత, ఎంపీపీ స్కూళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికలో భాగంగా రోజూ నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఆరా తీశారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. పరీక్షలకు సంబంధించి ఎదైనా అనుమానం ఉంటే వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. గతేడాది వంద శాతం ఫలితాలు సాధించడంతో ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సారి వందశాతం ఉత్తీర్ణత వచ్చేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్రెడ్డి, హెచ్ఎం దస్తగిరి తదితరుల పాల్గొన్నారు. -
ఇది మోసం కాదా?
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డోన్: అభివృద్ధి చేయకుండా అబద్ధాలు చెప్పడం సీఎం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. ఉడుములపాడు టీడీపీ కళ్యాణ మండపం సమీపంలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండాల చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో రూ. 5కోట్లతో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాల్లో మౌలిక వసతులు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. దీంతో కళ్యాణ మండపాలు రెండేళ్ల కాలం పాటు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయన్నారు. మంజూరైన వాటిని ఎందుకు రద్దుచేశారు? డోన్ నియోజకవర్గానికి అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసినా వాటిని నేటి వరకు ఎందుకు ప్రారంభించలేదని మాజీ మంత్రి బుగ్గన నిలదీశారు. ఎస్సీ బాలుర కోసం ఓబులాపురం వద్ద మంజూరు చేసిన వసతి గృహ నిర్మాణం పనులతో పాటు బేతంచెర్ల పాలిటెక్నిక్ భవన నిర్మాణం పనుల టెండర్లు కూడా టీడీపీ నాయకుల స్వార్థం కోసం రద్దు చేశారన్నారు. రాష్ట్రానికే తలమానికమైన ఐటీడీఆర్ నిర్మాణం పూర్తయితే ఏటా వందలాది మంది నైపుణ్యం గల డ్రైవర్లకు ఉపాధి లభిస్తుందని, దానిని మరుగున పడవేశారన్నారు. జ్యోతిరావ్పూలే ఆశ్రమ పాఠశాలను ఎక్కడా లేనివిధంగా ఆధునిక హంగులతో నిర్మిస్తే అందులో వసతిగృహం, డార్మెంటరీ నిర్మాణం పనులు ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. చెరువులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆధునికీకరణ చేస్తే వాటిని నీటితో నింపలేదన్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని వాల్మీకి గుహలు, నగరవనంతో పాటు చెరువుల్లో బోటు షికారు కేంద్రాలను మంజూరు చేస్తే అవన్నీ శిథిలమయ్యేట్లు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే అండర్పాస్ ఏమైంది? డోన్ పట్టణ నడిబొడ్డున నంద్యాల, కర్నూలు రైల్వేగేట్లు ఉన్నందున కేంద్ర రైల్వేశాఖ మంత్రి చొరవతో తాను రెండు అండర్పాస్ బ్రిడ్జిలను మంజూరు చేయించానన్నారు. అయితే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి వాటి పనులు జరగకుండా ఆపివేశారన్నారు. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టీడీపీ నాయకులకు దమ్ము ఉంటే ఈ అండర్ పాస్ బ్రిడ్జి పనులను చేసి చూపించాలని ఆయన సవాల్ చేశారు. వాటర్గ్రిడ్ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి డోన్ నియోజకవర్గ ప్రజలకు శుద్ధజలాన్ని అందించేందుకు వాటర్గ్రిడ్ పనులను రూ.210 కోట్లతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిందని బుగ్గన గుర్తు చేశారు. పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇందులో ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. రూ.40కోట్లతో వంద పడకల ఆసుపత్రిని నిర్మించి డాక్టర్లను నియమిస్తే నేడు కనీసం ఆసుపత్రిలో ఫర్నిచర్ సౌకర్యం కూడా ఈ ప్రభుత్వం కల్పించలేకపోయిందని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రానికి నాలుగుసార్లు సీఎంగా ప్రాతినిథ్యం వహించానని చెప్పుకుంటున్న చంద్రబాబు అనేకమార్లు అధికారంలోకి రావడానికి ఆకర్షణీయమైన అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి విమర్శించారు. 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని, ఇంటిలో ఉన్న ప్రతి ఆడపిల్లకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబును ప్రజలు నిలదీయాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రచారం చేసి వైఎస్ఆర్సిపి బలోపేతానికి కార్యకర్తలందరూ పనిచేయాలని రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు అన్నారు. ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్కుమార్, జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోసు్ట్రపసాద్, పార్టీ ఉపాధ్యక్షుడు కురుకుందు హరి, పార్టీ మండల అధ్యక్షుడు సోమేష్ యాదవ్, పార్టీ నాయకులు మల్యాల భాస్కర్ రెడ్డి, దినేష్గౌడ్, ఆర్ఈ రాజవర్దన్, మల్యాల శ్రీనివాసరెడ్డి, చంద్ర పాల్గొన్నారు. -
విజయ డెయిరీ అధికారులపై అక్రమ కేసులు తగదు
● డీఐజీని కలసిన నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ నేతలుకర్నూలు: నంద్యాల విజయ డెయిరీ డైరెక్టర్, అధికారులపై అక్రమ కేసులు నమోదు చేయడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా ముఖ్య నేతలు అన్నారు. పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం డీఐజీ కోయ ప్రవీణ్ను కలిశారు. కర్నూలు బి.క్యాంప్లో ఉన్న ఆయన కార్యాలయంలో డీఐజీని కలసి విజయ డెయిరీలో అక్రమ కేసులు, వేధింపులపై సరైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. పాల డెయిరీలో అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్న పరిణామాలపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా కోరగా అందుకు డీఐజీ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. -
సెలవులకు ఊరికెట్టా వెళ్లేది?
పరుగో.. పరుగుసంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యా సంస్థలకు శనివారం నుంచి సెలవులు ప్రకటించడంతో హాస్టళ్లలో ఉండే విద్యార్థులు సొంతూర్లకు బయలుదేరారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం బస్టాండ్కు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే అరకొర సర్వీసులతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ పండుగ వేళ బస్సు సర్వీసుల సంఖ్యను పెంచడటంలో నిర్లక్ష్యం వహించింది. దీంతో విద్యార్థులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వచ్చిన బస్సు ఎక్కేందుకు తోపులాట జరగడంతో మహిళలు, విద్యార్థినులు అవస్థలు పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
గ్రామీణ బ్యాంకుల్లో ప్రైవేటు పెట్టుబడులు వ్యతిరేకించాలి
నంద్యాల(వ్యవసాయం): ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ప్రైవేటు పెట్టుబడులను వ్యతిరేకిస్తూ శుక్రవారం గ్రామీణ బ్యాంక్ రీజనల్ కార్యాలయం ఎదుట బ్యాంకు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు సుజీత్ మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు, సూక్ష్మ వ్యాపారులకు తక్కువ వ్యయంతో రుణాలు అందించే సమగ్ర గ్రామీణాభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకులను మార్చి 2026 చివరి నాటికి ప్రైవేటు పెట్టుబడులకు సంబంధించిన ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేసి సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఒత్తిళ్లకు లోబడి ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా రంగంలో వాటాల విక్రయానికి పాల్పడ్డాయని విమర్శించారు. ఇప్పుడు గ్రామీణాభివృద్ధికి వెన్నుదన్నుగా ఉన్న గ్రామీణ బ్యాంకులు కూడా ప్రైవేటు పెట్టుబడులు పెట్టాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు రవితేజారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యాభివృద్ధి మరింత మెరుగుపడాలి
కర్నూలు కల్చరల్: విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి మరింత మెరుగుపడేలా విద్యా విధానం ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెస ర్ వి.వెంకట బసవరావు అన్నారు. శుక్రవారం వర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఇండియన్ క్యాంపసెస్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని వీసీ ప్రారంభించారు. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రసాద్ మావులూరి మాట్లాడుతూ దేశంలోని వివిధ ఉన్నత విద్యా సంస్థలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యార్థులకు భవిష్యత్లో అవసరమైన నైపుణ్యాలను అందించడానికి తమ యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం విద్యా సంస్థల నుంచి పట్టాలు తీసుకొని బయటకు వస్తున్న విద్యార్థుల్లో 80 శాతం మందికి తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ప్రారిశ్రామిక అవసరాలకు తగినంత మంది యువత దొరకడం లేదన్నారు. దీంతో పాటు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా చాలా మంది విద్యార్థులు వెనుకబడుతున్నారన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్కుమార్ నాయుడు, వ ర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథ రెడ్డి, సీడీసీ డీన్, ఇంజినీరింగ్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపా ల్ ఆచార్య పీవీ సుందరానంద్, అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఐక్యూసీ డైరెక్టర్ ఆచా ర్య ఆర్. భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు నెలల క్రితమే ప్రమీలమ్మ మృతి
● సాక్షి కథనంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ● కడప రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చాగలమర్రి: ముత్యాలపాడు ఎస్సీ కాలనీ 4వ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. సాక్షి కథనంతో అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ‘ప్రమీల ఆచూకీ ఎక్కడ?’ అన్న శీర్షికన ఈ నెల 3వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఐసీడీఎస్ అధికారులు గురువారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఒక రోజులోనే అనుమానాలకు తెరదించారు. అంగన్వాడీ కార్య కర్త ప్రమీల అనారోగ్యంతో సెలవుల్లో వెళ్లి తిరిగి రాలేదు. గత 9 నెలలుగా విధులకు హాజరుకాకపోవడం, ఆమెకు కుటుంబీకులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ అధికారులు నోటీసులు పంపి చేతులు దులుపుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఆచూకీపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అటు ఐసీడీఎస్, ఇటు పోలీసులు అధికారులు రంగంలోకి దిగి చివరకు ప్రమీలమ్మ చనిపోయినట్లు గుర్తించారు. ముందుగా ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు గ్రామానికి చెందిన కొంతమంది ఆమెను చికిత్స కోసం ఆటోలో చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించినట్లు గుర్తించి, ఆ మేరకు విచారణ చేపట్టారు. ఈ విచారణలో మెరుగైన వైద్యం కోసం ఆమె కడప పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రికి వెళ్లిందని తెలుసుకుని హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, అంగన్వాడీ కార్యకర్త చంద్రకళ రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి విచారించారు. అయితే ప్రమీల అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక గతేడాది సెప్టెంబర్ 3వ తేదీన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతదేహాన్ని ఐదు రోజుల పాటు మార్చురీలో ఉంచగా ఎవరూ రాక పోవడంతో మున్సిపాలిటీకి అప్పగించి దహనం చేయించినట్లు తెలిసింది. అంగన్వాడీ కార్యకర్త ప్రమీలమ్మ అనాథగా మృతి చెందడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. -
ఒక్క పాఠశాల మూతపడినా ఒప్పుకోం
● జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డికొలిమిగుండ్ల: సరైన పర్యవేక్షణ లేక కొలిమిగుండ్ల మండలంలో తొమ్మిది పాఠశాలలు విలీనానికి సిద్ధంగా ఉన్నాయని, ఒక్క పాఠశాల మూతపడినా ఒప్పుకునేది లేదని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్ష్యతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు రెండు సమావేశాలకు గైర్హాజర్ కావడంపై జెడ్పీ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య శాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్కు నివేదికలు పంపాలని ఎంపీడీఓ దస్తగిరిబాబును ఆదేశించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి చెందిన మినరల్ వాటర్ గ్రామాలకు కాకుండా అల్ట్రాటెక్ సిమెంట్ ప్యాక్టరీలో ఎందుకు అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వడం లేదు యూరియా ఇవ్వడం లేదని, ఎద్దుకు చికిత్స చేయాలని 1962కు ఆరు సార్లు ఫోన్ చేస్తే ఆంబులెన్స్కు డీజల్ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి గౌరవ వేతనం అందలేదని, వాటిని ప్రభుత్వం వాడుకుంటుందా అని ఎంపీటీసీ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కొలిమిగుండ్లను కరువు మండలంగా ప్రకటించి ఏడాది అయినా రైతులకు రూపాయి సాయం అందలేదని మీర్జాపురం సర్పంచ్ లాయర్ మహేశ్వరెడ్డి విమర్శించారు. -
ఫిబ్రవరి 8 నుంచి ఇరుముడి స్వాములకు స్పర్శదర్శనం
శ్రీశైలం టెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే ప్రతి భక్తుడికి ఆహ్లదకరమైన వాతావరణంలో సౌకర్యవంతమైన స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 8 నుంచి 12వ తేది వరకు ఇరుముడి కలిగిన శివస్వాములకు మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తామని.. 8 నుంచి 18వ తేదీ వరకు సామాన్య భక్తులకు అలంకార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. శుక్రవారం శ్రీశైల దేవస్థానంలోని కమాండ్ కంట్రోల్ రూంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధ్యక్షతన కర్నూలు, నంద్యాల, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లా అన్ని శాఖల అధికారులతో మొదటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే 20శాతం మంది భక్తులు అదనంగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాదయాత్రగా భక్తులను దృష్టిలో ఉంచుకొని అటవీమార్గంలో మెడికల్ క్యాంప్లు, అంబులెన్స్లు, డస్ట్బిన్లు, టాయిలెట్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వరకు రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 7లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. ఈలోగా మరో రెండు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు 3వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో చోటుచేసుకున్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ పటిష్ట చర్యలు చేపడతామన్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఆత్మకూరు డివిజన్ అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నెష్ అప్పావ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 8వ తేది నుంచి అటవీప్రాంతంలో పాదయాత్రకు అనుమతిస్తామన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా బ్రహ్మోత్సవాల్లో 2లీటర్లు, 5లీటర్ల వాటర్ బాటిల్స్ను మాత్రమే అనుమతిస్తామన్నారు. -
నకిలీ జీతాల బిల్లుల కేసులో వైద్యశాఖ ఉద్యోగి అరెస్ట్
ఆళ్లగడ్డ: నకిలీ జీతాల బిల్లులు పెట్టుకుని రూ. కోట్ల ప్రభుత్వ నిధులు కాజేసిన కేసుకు సంబంధించి వైద్యశాఖ ఉద్యోగి ఇంతియాజ్ అలీఖాన్ను గురువారం ఆళ్లగడ్డ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ.. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన ఏజీ ఆడిట్లో 2020 నుంచి 2023 మధ్య కాలంలో అహోబిలం, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నకిలీ జీతాల బిల్లులు సృష్టించి రూ. 1,00,16,901 ఆళ్లగడ్డ సబ్ట్రెజరీ నుంచి అక్రమంగా డ్రా చేసినట్లు తేలింది. ఈ మేరకు నంద్యాల జిల్లా ట్రెజరీ అధికారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అహోబిలం, నరసాపురం ప్రాథమిక వైద్యశాలలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న అలీఖాన్ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. వైద్యాధికారులైన డాక్టర్ నాగదాసయ్య, డాక్టర్ మునిసుధావాణిలకు సంబంధించిన నకిలీ రబ్బరు వేలిముద్రలు, హెచ్పీ ల్యాప్ట్యాప్, మొబైల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 93 నకిలీ బిల్లులు సృష్టించి రూ 1.94 కోట్లు డ్రా చేసి వీటిని తన సోదరి మొహతాబ్ బున్నీసా బేగం ఖాతాకు జమ చేయడం చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ రమణ, ఎస్సై వరప్రసాద్లు ఉన్నారు. -
పులుల అంచనాకు శివభక్తులు సహకరించాలి
ఆత్మకూరు రూరల్: జాతీయ పెద్దపులుల అంచనా కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరుగుతోందని, శ్రీశైల మల్లన్న భక్తులు అటవీశాఖతో సహకరించి తాము సూచించిన తేదీల్లో మాత్రమే అడవిలో పాదయాత్రకు సిద్ధపడాలని డిడి విగ్నేష్ అపావ్ కోరారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం ఎన్టిసిఏ ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. ప్రొటోకాల్ ప్రకారం జరిగే కార్యక్రమం కావడంతో మార్పు చేయడానికి వీలుపడదన్నారు. అందు వల్ల మహాశివరాత్రికి వచ్చే భక్తులు ఫిబ్రవరి 8 నుంచి 15వ తేదీ వరకు మాత్రమే వెంకటాపురం నుంచి నాగలూటి ద్వారా పాదయాత్ర చేసుకోవచ్చన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గురువారం బైర్లూటిలో అన్నదాన నిర్వాహకులతో సమావేశమై తగు సూచనలు చేశామన్నారు. సూచించిన రోజుల్లో పాదయాత్రకు వచ్చే భక్తులు తమ వెంట ప్లాస్టిక్ కవర్లు తీసుకురావద్దన్నారు. అలాగే పొగాకు ఉత్పత్తులు, మద్యం సీసాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. విలేకరుల సమావేశంలో సబ్ డీఎఫ్ఓ బబిత పాల్గొన్నారు. -
ముందస్తు పరీక్షలతో క్యాన్సర్కు చెక్
శిరివెళ్ల: మందస్తు వైద్య పరీక్షలు చేసుకుంటే క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చని అసంక్రమిత వ్యాధుల జిల్లా నోడల్ ఆధికారి డాక్టర్ కాంతారావు అన్నారు. గురువారం వీరారెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు దాటిన వారందరికీ వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పరీక్షలు చేస్తారన్నారు. వ్యాధి నిర్ధారణయితే చికిత్స తీసుకుంటే క్యాన్సర్ను నివారించవచ్చన్నారు. డాక్టర్ ముఖేష్, సీహెచ్ఓ రాంమోహన్రెడ్డి, పీహెచ్ఎన్ సరస్వతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. లీకేజీ సమస్యకు త్వరలో పరిష్కారం అవుకు(కొలిమిగుండ్ల): అవుకు రిజర్వాయర్ రివిట్మెంట్ లీకేజీ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని ఎస్సార్బీసీ సీఈ కబీర్ బాషా పేర్కొన్నారు. రిజర్వాయర్ వద్ద జరుగుతున్న ప్లగ్గింగ్ పనులను గురువారం సీఈ సీడీఓ శివకుమార్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కేధారేశ్వరనాథ్, విజయసారధి, అడ్వైజర్ కృష్ణారావు,ఏ ఈఈ ప్రదీప్, క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండింగ్ ఇంజినీర్లతో పాటు ఎస్సార్బీబీసీ ఎస్ఈ శుభకుమార్తో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్లో లీకేజీ పాయింట్ను ఇప్పటికే గుర్తించామన్నారు. శుక్రవారం నుంచి అండర్వాటర్ కాంక్రీట్ పను లు ప్రారంభమవుతాయని చెప్పారు. పనులు పూర్తి కాగానే రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం నీటిని నింపుతామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో మద్రా స్ ఐఐటీ ప్రొఫెసర్ సుబ్బారావు, డీఈఈలు మల్లి ఖార్జున, సుబ్బారావు, సాయికిరణ్, ఏఈఈలు సుధాకర్, రవీంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఆళ్లగడ్డ: ఒకరినొకరు ఇష్టపడి వెళ్లిపోయి, పోలీసుస్టేషన్ను ఆశ్రయించిన ప్రేమజంటను కాపాడేందుకు పోలీసులు సాహసం చేయాల్సి వచ్చింది. ఈ ఘటన గురువారం మండల కేంద్రమైన శిరువెళ్లలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. శిరివెళ్ల పట్టణానికి చెందిన వేరు వేరు మతాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం యువతి ఇంట్లో చెప్పకుండా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. యువతి కుంటుంబ సభ్యు లు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు యువతి బేతంచర్ల బస్టాండు సమీపంలో ఉన్నట్లు గుర్తించి బుధవా రం రాత్రి నంద్యాలకు తరలించి గురువారం శిరివెళ్ల పోలీస్ స్టేషనకు తీసుకొచ్చారు. ఇరువురి కుటుంబ సభ్యుల ముందు కౌన్సెలింగ్ నిర్వహించగా మేజర్లమైన మేము కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని చెప్పారు. దీంతో పోలీసులు మేము ఏమీ చేయలేమని, వారి ఇష్ట్రపకారం నడుచుకోవాలని సూచించారు. విషయం తెలిసిన యువతి తరపు బంధువులు పెద్ద ఎత్తున స్టేషన్కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు సమయస్ఫూర్తితో యువతిని నంద్యాల హోంకు తరలిస్తామని, మళ్లీ మాట్లాడుదామని చెప్ప వాహనంలో తరలిస్తుండగా రోడ్డు పై అటకాయించారు. గుంపులో నుంచి ఓ ఆకతా యి వాహనంపై రాయి విసరడంతో అందులో ఉన్న ఓ వ్యక్తికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. అ యినా పోలీసులు ప్రేమ జంటను రహస్య ప్రాంతానికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫిబ్రవరి 7న నవోదయ ప్రవేశ పరీక్ష ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల ని ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 7న నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్గా పుట్టిన తేదిన ఉపయోగించి హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 9వ తరగతికి https://cbseitms.nic.in/2025/ nvsix, 11వ తరగతికి https://cbseitms.nic.in/ 2025/nvsxi వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. -
‘దారి’తప్పిన తమ్ముళ్లు!
కర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రహదారుల నిర్వహణపై ఒంటి కాలిపై లేచిన కూటమి నేతలు నేడు రహదారుల నిర్మాణాలు పూర్తికాకుండా ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. నంద్యాల జిల్లాలోని గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లి వరకు రీ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ వర్క్ కింద రూ.3 కోట్ల అంచనాతో 7.95 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు గత ఏడాది జూలై 4న అగ్రిమెంట్ చేసుకున్నారు. నాబార్డు ఆర్ఐఎఫ్డీ–30 నిధులతో చేపట్టిన పనులను ఈ ఏడాది జూన్ 3 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి రోడ్లకు ఇరువైపులా జంగిల్ను క్లియరెన్స్ చేయించి, డబ్ల్యూఎంఎం పనులు కూడా పూర్తి చేశారు. దాదాపు 70 శాతం మేర పూర్తయిన పనులకు అనుగుణంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఎంబుక్ రికార్డు చేయాల్సి ఉంది. అయితే, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో సంబంధిత పీఆర్ ఇంజనీర్లు ఈ రోడ్డు పనులను నేటి వరకు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఎంబుక్ రికార్డు చేసిన అనంతరం క్వాలిటీ కంట్రోల్ అధికారులు చేసిన పనులపై క్వాలిటీని చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డబ్ల్యూఎంఎం రోడ్డుపై బీటీ వేయాల్సి ఉంది. కాగా, పీఆర్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రాంట్ల కింద చేపట్టిన పనులకు సంబంధించిన నివేదికల్లో ఈ రోడ్డు పనులు దాదాపు 70 శాతం పూర్తయినా జంగిల్ క్లియరెన్స్ మాత్రమే చేసినట్లు నమోదు చేయడం చూస్తే అధికార పార్టీ ఒత్తిళ్లు ఏస్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. 15 కి.మీలు తగ్గనున్న దూరం ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే మండల కేంద్రమైన గోస్పాడు నుంచి తిరుపతి జాతీయ రహదారికి వెళ్లేందుకు 15 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లికి 8 కిలోమీటర్లు, కామినేనిపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని గోవిందపల్లి మీదుగా కర్నూలు – తి రుపతి జాతీయ రహదారికి చేరుకోవచ్చు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ప్రస్తుతం గోస్పాడు నుంచి నంద్యాల మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాల్సి వస్తోంది. ఎంబుక్ రికార్డు చేయకుండా అధికారులపై ఒత్తిళ్లు గోస్పాడు నుంచి జిల్లెల్ల మీదుగా కామినేనిపల్లి వరకు రోడ్డు నిర్మించేందుకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లను తొలగించి ( జంగిల్ క్లియరెన్స్ ) డబ్ల్యూఎంఎం పనులు పూర్తి చేశారు. అయితే స్థానిక తెలుగుదేశం నేతలు జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా ఇంజనీరింగ్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనులకు అనుగుణంగా ఎంబుక్ రికార్డు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఎంబుక్ రికార్డు చేయకపోవడం, క్యూసీ చెక్ చేయకపోవడం వల్ల డబ్ల్యూఎంఎం రోడ్డుపై బీటీ వేయలేని పరిస్థితి ఏర్పడింది. 7.95 కిలోమీటర్ల మేర డబ్ల్యూఎంఎం వేసి వదలేయడంతో ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎంబుక్ రికార్డు చేయకపోవడంపై కాంట్రాక్టర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. గోస్పాడు–కామినేనిపల్లి రోడ్డుకు రాజకీయ గ్రహణం -
ఎత్తిపోతల పూర్తి చేస్తావా?
రేవంత్ మాటలకు కట్టుబడతావా, జూపాడుబంగ్లా: ఇప్పటికే రాయలసీమ ద్రోహిగా మారిన చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడతవా, రాయలసీమ ఎత్తిపోతలను పూర్తి చేస్తావా అని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. గురువారం ఆయన ఏపీ రైతుసంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య, కేసీకాల్వ రైతు సంఘం అధ్యక్షుడు చంద్రమౌళీశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, వైఎస్సార్ కడప జిల్లా కార్యవర్గ సభ్యుడు గాలిచంద్ర, అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యుడు మహేష్ తదితరులతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ పక్కనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వార్థరాజకీయాల కోసం నీటి వివాదాలు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు ఎడాపెడా నీటిని వాడుకుంటున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. శ్రీశైలం డ్యాంకు వరదలు వచ్చే కేవలం 30రోజుల్లోనే రాయలసీమ వాటా 110టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే తప్పనిసరిగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించాలన్నారు. రోజుకు 3టీఎంసీల చొప్పున రాయలసీమప్రాంత నీటివాటాను ఎత్తిపోతల ద్వారా సద్వినియోగం చేసుకొనేలా నాటి సీఎం జగన్మోహన్రెడ్డి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ చేపట్టారన్నారు. చంద్రబాబు, రేవంత్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ రాయలసీమ లిఫ్టుకు ఎగనామం పెట్టి ఇక్కడి ప్రజల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే అడ్డుకుంటామన్నారు. సాగునీటి నిపుణలు రాయలసీమ లిఫ్టు ప్రయోజనకరమని పేర్కొంటుంటే చంద్రబాబు అవసరంలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నీటిప్రాజెక్టులపై ఏమాత్రం అవగాహనలేని నిమ్మలరామనాయుడు రాయలసీమ లిఫ్టు అవసరం లేదని చెప్పడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తిచేయాలని, లేకపోతే అన్ని పార్టీలు, వామపక్షపార్టీలు, రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ఏప్రిల్ 1 నుంచి ‘విబి–జి రామ్ జి’
నంద్యాల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం విబి–జి రామ్ జి (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్) కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 20 పాయింట్ ఫార్ములా అమలుపై జిల్లా స్థాయి సమీక్ష గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ‘విబి–జి రామ్’ జి విధానంలో లేబర్, మెటీరియల్, పరిపాలనా వ్యయాలను కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో భరిస్తుందన్నారు. ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 125 రోజుల వరకు పెంచారన్నారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధికి వివిధ దశల్లో మంజూరైన నిధులను మార్చి 31 నాటికి పూర్తిగా వినియోగించాలన్నారు. సమగ్ర శిక్ష ద్వారా జిల్లాలో 1.39 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ఎస్సీ, బీసీ కాలనీల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద బ్యాంకర్లు లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ, డీఆర్ఓ రాము నాయక్, సీపీఓ ఓబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి దుర్మరణం
బేతంచెర్ల: ఆర్.కొత్తపల్లె గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు మృతి చెందాడు. ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాల మేరకు.. దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన నరేష్ ఆచారి (39) బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలోని మహా సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికునిగా పదేళ్లుగా పని చేస్తూ బనగానపల్లెలో నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో సొంతూరులో పొలం పని చూసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఆర్ కొత్తపల్లె – ఆర్ఎస్ రంగాపురం గ్రామాల మధ్య రహదారి పక్కన్న నిలిపిన ట్రాక్టర్ ట్రాలీని ప్రమాదవశాత్తూ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరేష్ ఆచారిని వాహనదారులు బేతంచెర్ల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య జ్యోతితో పాటు కుమార్తె కోమలి, కుమారుడు అఖిరానందన్ ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపాలు గురువారం తెలిపారు. తల్లిదండ్రులు మందలించారని.. గోనెగండ్ల: పని చేయకుండా ఖాళీగా ఉంటే ఎట్లా అని..తల్లిదండ్రులు మందలించడంతో కుమారు డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్లకు చెందిన ఎరుకల రంగముని, దేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరు స్టీల్ సామాన్లు వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు సతీష్కు వివాహమైంది. చిన్న కుమారుడు వీరేంద్ర (19) ఎటువంటి పనిచేయకుండా ఖాళీగా తిరుగుతు న్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వీరేంద్ర స్నేహితులతో కలిసి మద్యం సేవించి రాత్రి ఇంటికి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. సమీపంలో ఉన్న సోదరుడి ఇంటికెళ్లి అందరూ నిద్రిస్తుండగా ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడి అన్న సతీష్ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు గోనెగండ్ల: అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేయాలని పోలీసులను, రెవెన్యూ అధికారులను రాయలసీమ జోనల్ మైనింగ్ ఏడీ వెంకటేశ్వర్లు(ఏడీ విజిలెన్స్), జిల్లా రాయల్టీ ఇన్స్స్పెక్టర్ శివ పార్వతి ఆదేశించారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘హంద్రీలో ఇసుక తోడేళ్లు’ అనే శీర్షికన ప్రచురితమైన ఈ కథనానికి మైనింగ్ అధికారులు స్పందించారు. తిప్పనూరు, వేముగోడు, పుట్టపాశం గ్రామాల సమీపంలోని హంద్రీనదులను పరిశీలించారు. హంద్రీనదిలో తవ్విన గుంతలు, ఇసుకను పరిశీలించారు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి బనగానపల్లె రూరల్: నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని పలుకూరు గ్రామ సమీపంలో తోడేళ్ల గుట్ట వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ భూపాలుడు వివరాల మేరకు.. బేతంచర్ల పట్టణంలోని హనుమాన్నగర్కు చెందిన నాగరాజు కుమారుడు లక్ష్మన్న(26) పలుకూరు గ్రామంలో జరుగు మైనింగ్ గనుల్లో కూలిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో పలుకూరు అడ్డ రోడ్డు నుంచి గని వద్దకు నడుచుకుంటూ బయల్దేరాడు. అయితే వెనుక వైపు నుంచి పలుకూరు వైపు వేగంగావెళ్తున్న టాక్టర్ లక్ష్మన్న ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు ఎస్ఐ భూపాలుడు తెలిపారు. మృతుడి అన్న అమర్నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తలసీమియా రక్తమార్పిడి కేంద్రం ఏర్పాటు కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆవరణలో గురువారం తలసీమియా బాధితులకు రక్తమార్పిడి కేంద్రం ప్రారంభమైంది. రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ తలసీమియా వ్యాధిగ్రస్తులు నిరంతరం రక్తమార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి నెలా వంద మందికి పైగా తలసీమియా బాధితులకు రక్తాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ తీసుకున్న రక్తాన్ని ప్రభుత్వ, ఇతర ఆసుపత్రుల్లో ఎక్కి ంచేవారన్నా రు. ఇప్పుడు ఇబ్బంది లేకుండా రెడ్క్రాస్ సొసైటీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలోనే రక్తం ఎక్కించే ఏర్పాటు చేశామన్నారు. -
వామ్మో చిరుత
రోడ్డు పక్కన ఉన్న చిరుత కొలిమిగుండ్ల: కోర్నపల్లె సమీపంలోని గుండం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని ఆదానీ సిమెంట్ మైనింగ్ పరిసరాల వద్ద గురువారం తెల్లవారు జామున చిరుత కనిపించింది. సిమెంట్ ఫ్యాక్టరీలో ముగ్గురు ఉద్యోగులు డ్యూటీ ముగించుకొని కారులో తిమ్మనాయినిపేటకు వెళ్తున్న సమయంలో మైనింగ్ పరిసరాల్లోకి చేరుకొనే సరికి రోడ్డును క్రాస్ చేయడా న్ని గమనించారు. కారు లైటింగ్కు కొద్ది సేపు చిరుత ఆగడంతో అందులో ఉన్న సిబ్బంది సెల్ఫోన్లో ఫొటోలు తీశారు. దెయ్యాల చెరువు వైపు చిరుత వెళ్లిపోవడాన్ని గమనించారు. చిరుత సంచారం విషయం తెలియడంతో అబ్దులాపురం, కోర్నపల్లె గ్రామాల రైతులు భయాందోళన చెందుతున్నారు. పొలాల వద్దకు రైతులు ఒంటరిగా వెళ్లరాదని ఫ్యాక్టరీ సిబ్బంది సూచించారు. మరో వైపు అనంతపురం జిల్లా తాడిపత్రి అటవీ శాఖ అధికారులు పులి సంచరించిన ప్రదేశాన్ని తిలకించి పాద ముద్రలు సేకరించారు. దాదాపు ఏడు నెలల క్రితం తిమ్మనాయినిపేట సమీపంలో చిరుత దారిన పోయే వాహనదారులకు కనిపించింది. ఇప్పుడు కోర్నపల్లె కనిపించిన చిరుత రెండు ఒక్కటే ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మందుల గుట్టురట్టు
క్యూఆర్ కోడ్తో కర్నూలు(హాస్పిటల్): ప్రస్తుతం మందుల మాయాజాలం నడుస్తోంది. ఏది అసలో, ఏది నకిలీ మందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏది మంచి మందో, ఏది సరైనది కాదో అర్థంకాని స్థితిలో మార్కెట్ ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం క్యూ ఆర్ కోడ్ను తీసుకొచ్చింది. ప్రతి ఔషధంపై దాని మందుల తాలూకు వివరాలు ఉండేలా దానిని రూపొందించింది. ఈ మేరకు ఇకపై తయారయ్యే మందులపై తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,800 రిటైల్ మెడికల్షాపులు, వెయ్యి దాకా హోల్సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ప్రస్తుతం ఫార్మారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులు, పోటీ కారణంగా అనేక రకాల నకిలీ మందులు అచ్చు బ్రాండెడ్ మందుల రూపంలో పుట్టుకొస్తున్నాయి. దీనికితోడు ఊరు, పేరు లేని మందుల కంపెనీలు తయారు చేసే మందులూ మార్కెట్లో కొల్లలుగా ఉన్నాయి. లాభాలు అధికంగా ఉండటంతో అధిక శాతం వైద్యులు వారికి తక్కువ ధరకు లభించే ఎక్కువ లాభాలను ఇచ్చే ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మందులను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఏ మందులో ఎంత మోతాదులో మందు ఉంది, అసలు మందు ఉందా లేదా, ఏది నకిలీ, ఏది అసలు తెలుసుకోవాలంటే కష్టంగా మారిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో క్యూ ఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు. ఇటీవల కాలంలో అధికంగా విక్రయాలు జరిగే బీపీ, షుగర్, యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, విటమిన్, అలర్జీ, దగ్గు, జలుబు, జ్వరం తదితర వ్యాధులను తగ్గించే మందులపై ఆయా కంపెనీలు క్యూ ఆర్ కోడ్ను ముద్రించి విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం బహుళజాతి కంపెనీలు మాత్రమే వీటికి ప్రాధాన్యత ఇస్తుండగా త్వరలో ఇతర కంపెనీలు కూడా క్యూఆర్ కోడ్ను ముద్రించనున్నాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత గడువులోగా దేశంలోని అన్ని ఫార్మాకంపెనీలు అవి తయారు చేసే మందులపై తప్పనిసరిగా క్యూ ఆర్ కోడ్ను ముద్రించి వివరాలు నమోదు చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత చేకూరింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూ ఆర్ కోడ్ విధానం వల్ల ఆయా మందుల వివరాలు అందులో తెలుస్తాయి. ఏ ఔషధం దేనికి పనిచేస్తుంది, అది ఎక్కడ తయారైంది, ఆ ప్రాంతం వివరాలు ఉంటాయి. ఔషధంలో మందు ఎంత మోతాదులో ఉంది, ఎలా వినియోగించాలో తెలుస్తుంది. ఇది రోగి ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. – హరిహరతేజ, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు -
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
డోన్/ప్యాపిలి: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ యువనేత బుగ్గన అర్జున్ అమర్నాథ్రెడ్డి గురువారం డోన్, ప్యాపిలి ప్రాంతాల్లోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లను పంపిణీ చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు అందజేసిన కానుకలను బుగ్గన ఆదేశాల మేరకు విద్యార్థులకు అందజేశారు. డోన్లోని జ్యోతిరావ్పూలే ఆశ్రమ పాఠశాల, ఐటీఐ, బాలికల వసతి గృహాలతో పాటు ప్యాపిలిలోని కేజీబీవీ విద్యార్థులకు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్, వైఎస్ చర్మన్ జాకీర్ హుసేన్, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ రాజ్కుమార్, పార్టీ నాయకులు శ్రీరాములు, మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, బొర్రా మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు
కర్నూలు: ప్రేమ పేరుతో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఇ.రాజేంద్రబాబు గురువారం తీర్పు చెప్పారు. 2020 సంవత్సరంలో నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో ఎన్హెచ్–40 రోడ్డు పక్కన హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుటుంబంతో పాణ్యంలో నివాసముంటున్న పఠాన్ రహంతుల్లా పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వారింట్లోని ఓ మైనర్ బాలిక(16)తో చనువుగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఒంటరిగా ఉన్న సమయంలో మైనర్ బాలికను శారీరకంగా దగ్గరయ్యాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని, త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 2020 నవంబర్ 2న తనకు గర్భం వచ్చిందని బాలిక చెప్పగా తన మోటర్ సైకిల్పై బాలికను నెల్లూరుకు తీసుకెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత మీ ఇంట్లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని పాణ్యంకు పిలిచుకువచ్చి హోటల్ ముందు బాలికను దించి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని మైనర్ బాలిక తల్లితో కలసి పాణ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పఠాన్ రహంతుల్లాపై కిడ్నాప్, అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా కేసు విచారించిన న్యాయస్థానం నిందితుడిపై మోపిన అభియోగాలు నిరూపణ కాగా 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. క్వింటా పత్తి రూ. 8,149 ఆదోని అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో గురువారం పత్తి ధర రూ.39కి పెరిగింది. క్వింటాకు సీసీఐ గిట్టుబాటు ధర రూ.8110 ఉండగా మార్కెట్లో రూ.8149 పలికింది. అమ్మకానికి 2,097 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.8,149, మధ్య ధర రూ.7,469, కనిష్ట ధర రూ.4,279గా నమోదయ్యింది. -
జంట హత్యల కేసులో 12 మంది నిందితుల అరెస్ట్
ఎమ్మిగనూరు రూరల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కందనాతి గ్రామంలో ఈ నెల 5న జరిగిన బోయ పరమేష్, బోయ వెంకటేష్ జంట హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ ఎన్. భార్గవి మర్రివాడ వెల్లడించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ ఆదే శాల మేరకు.. రూరల్ సీఐ ఎస్. చిరంజీవి, రూరల్ ఎస్ఐ కె.శ్రీనివాసులు, హెచ్సీలు విక్టర్బాబు, బీరప్ప, కృష్ణ, చంద్ర, కానిస్టేబుళ్లు వెంకటాపురం తిప్పన్న, ఫయాజ్, సర్వేశ్వరరెడ్డి, అశోక్కుమార్, మల్లయ్య, జి. తిప్పన్న బృందంగా ఏర్పడి హత్య కేసులో నిందితుల గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం వెంకటగిరి గ్రామ శివారు లోని ఇటుకల బట్టీ వద్ద నిందితులు ఉన్నారని సమాచారంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. జంట హత్యల కేసులో 20 మంది నిందితులు ఉండగా 12 మందిని అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి హత్యలకు ఉపయోగించిన మారణాయుధాలు, రెండు బైక్లు, టాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల్లో బిక్కి సీతారాముడు, బిక్కి రాముడు, బిక్కి వెంకటేష్, బిక్కి కేశవ, బిక్కి దుబ్బ నరసింహుడు, బిక్క. శంకరన్న, బిక్కి శ్రీహరి, బిక్కి విష్ణువర్దన్, బిక్కి హరిబాబు, బిక్కి అశోక్, బోయ బిక్కి మల్లేష్, బిక్కి అంజినప్ప ఉన్నారన్నారు. మరో ఎనిమిది పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. వీధి కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ హత్యల దాకా వచ్చిందన్నారు. రెండేళ్ల క్రితం బోయ బిక్కి తునకల రవి, బోయ బిక్కి తునకల నరసింహులను బోయ గోవిందు కుటుంబీలు దాడి చేసి చంపేశారన్నారు. హతుల కుమారులు కక్ష పెంచుకుని బోయ గోవిందు కుటుంబంపై ఈనెల 5వ తేదీ దాడి చేయడంతో గోవిందు సోదరులు పరమేష్, వెంకటేష్ హత్యకు గురయ్యారు. గోవిందు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నిందితుల అరెస్ట్లో ప్రతిభ చూపిన సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
అభివృద్ధికి మారుపేరు ఎస్వీ సుబ్బారెడ్డి
పత్తికొండ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం పత్తికొండ పట్టణంలో పులికొండ గ్రామానికి చెందిన ఎస్వీ అభిమానులు ఎస్వీ సుబ్బారెడ్డి 95 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగాగా 95 కేజీల కేక్తో ఎస్వీ కుటుంబం అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ దంపతులు నివాసానికి ఊరేగింపుగా చేరుకున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, విజయ మనోహరి దంపతులు తదితరులు ఎస్వీ సుబ్బారెడ్డితో కేక్ కట్ చేయించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు ఎస్వీ సుబ్బారెడ్డిని పూలమాల, శాలువా తో సత్కరించి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభిమానాన్ని చాటుకున్నారు. -
కాటసాని శివ దీక్ష స్వీకరణ
బనగానపల్లె: పవిత్ర శైవక్షేత్రమైన యాగంటి క్షేత్రంలో గురువారం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి శివదీక్ష స్వీకరించారు. కాటసాని ఈ దీక్ష స్వీకరించడం 35వ సారి కావడం విశేషం. శివదీక్ష సందర్భంగా కాటసానితో పాటు ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ, కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి ఆలయంలోని ఉమామహేశ్వరులను దర్శించుకున్నారు. నందీశ్వరుడికి కూడా పూజలు నిర్వహించారు. కాటసాని రాంభూపాల్రెడ్డితో పాటు సుమారు 200 మంది శివదీక్ష స్వీకరించారు. కార్యక్రమంలో ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ ఉపాధ్యక్షులు దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రిన్సిపాల్, పీఈటీ మాకొద్దు
గోస్పాడు: గోస్పాడు మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ ఖాజాహుసేన్, పీఈటీ గీతావాణిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థినులతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, విద్యార్థులను గ్రూపులుగా విభజించి విబేధాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు. పాఠశాలలో వారు పనిచేస్తే తాము పాఠశాలకు రాలేమని ముక్తకంఠంతో నినాదాలు చేశారు. పాఠశాలలో వారితో కాకుండా ఇతర ఉపాధ్యాయులతో మాట్లాడినా ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ప్రిన్సిపాల్ను చుట్టుముట్టడంతో ఉద్రిక్తతత నెలకొంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి పాఠశాలలో రాలేదని ఇప్పుడెందుకు వస్తుందని నిలదీశారు. సమాచారం అందుకున్న ఎంఈఓలు అబ్దుల్ కరీం, ఎస్ఐ సుధాకర్రెడ్డి పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. పీఈటీ గీతావాణి సెలవులో వెళ్లారని ఎంఈఓ తెలిపారు. డీఈఓ విచారణ: మోడల్ స్కూల్లో విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న డీఈవో జనార్దన్రెడ్డి గురువారం పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడారు. నివేదిక తయారు చేసి పంపాలని ఎంఈఓను ఆదేశించారు. -
టీడీపీ నాయకుడి హల్చల్
● బిహార్ కూలీలపై దౌర్జన్యం ● అనుచరులతో కలిసి ట్రాక్టర్లు, బైక్, డీజల్ డ్రమ్ములు ధ్వంసం సంజామల: పార్టీ అధికారంలో ఉందని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అమాయకులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.తాజాగా బతుకుదేరువు కోసం వచ్చిన బిహార్ కూలీలపట్ల సంజామల మండలం పేరుసోముల గ్రామ టీడీపీ నాయకుడు సురేష్రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. అనుచరులతో కలిసివారి ట్రాక్టర్స్, బైక్,డీజల్ డ్రమ్ములను ధ్వంసం చేశాడు. స్థానికుల సమాచారం మేరకు.. పేరుసోముల గ్రామ శివారు పెద్దమ్మ గుడి వద్ద టర్నింగ్లో టవర్ వర్క్ పనుల నిమిత్త వచ్చిన బిహార్ కూలీలు నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో టీడీపీ నాయకుడు సురేష్రెడ్డి కోవెలకుంట్ల నుంచి వస్తున్నాడు. పేరుసోముల పెద్దమ్మ గుడి వద్ద రోడ్డుపై ట్రాక్టర్ అడ్డుగా ఉందని బిహార్ కూలీలతో దురుసుగా వ్యవహరిస్తూ వాగ్వాదం దిగాడు. వారు ప్రతిఘటించడంతో గ్రామానికి వెళ్లి అనుచరులను వెంటేసుకుని కూలీల నివాసం దగ్గరికి వచ్చాడు. టీడీపీ కార్యకర్తలు కొట్టాడానికి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బిహార్ కూలీలు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఇళ్ల వద్ద ట్రాక్టర్స్, బైక్, డీజల్ డ్రమ్ములు ఉండటంతో వాటిని ధ్వంసం చేసి హల్చల్ చేశారు. కూలీలపై దాడి విద్యుత్ టవర్ కాంట్రాక్టర్ ను బయపెట్టడానికా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
హత్యకోణంలో విచారణ
గడివేముల: మండల కేంద్రమైన గడివేముల గ్రామానికి చెందిన ఓ యువకుడి అదృశ్యం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. వినోద్ (21) గత ఏడాది ఆగస్టు 31 వ తేదీన నంద్యాలలో స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో తండ్రి రాజు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో అదృశ్యం కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగుచూశాయి. వినోద్ బైక్ను బొల్లవరం రస్తాలోని ఎస్సార్బీసీ బ్రిడ్జి నుంచి కిందకు పడేసినట్లు అనుమానితులు చెప్పడంతో బుధవారం అక్కడికి వెళ్లి పరిశీలించగా బైకు కనిపించింది. దీంతో ఈ కేసును పోలీసులు హత్యకోణంలో విచారిస్తున్నారు. -
నియమ నిష్టలు
శ్రీగిరి శివస్వాముల పాదయాత్ర (ఫైల్)శివదీక్ష చేపట్టే భక్తులు నియమ నిష్టలను పాటించాలి. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందిన తరువాత గురుస్వామి ద్వారా దీక్షను స్వీకరిస్తారు. రుద్రాక్షమాలను ధరించి, భస్మంతో అలంకరించుకుని, గోధుమరంగు దుస్తులను ధరిస్తారు. రోజు సూర్యోదయం పూర్వం, సంధ్యాసమయాన చల్లనీటి స్నానం ఆచరిస్తారు. శవ దర్శనం జరిగినప్పుడు కూడా స్నానం ఆచరించాలి. అనంతరం శివయ్య దర్శనం, పూజాదికాలు నిర్వహించాలి. ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం పాటిస్తారు. కటిక నేలపైనే నిద్రిస్తారు. ధూమపానం, మద్యపానం, మాంసాహారాలకు దూరంగా ఉంటారు. కోపతాపాలకు దూరంగా ఉండి ఎవరినీ విమర్శించకుండా, నిరాడంబంరంగా జీవిస్తారు. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ నిత్యం శివపంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ, ఎదుటి వారిని శివ నామంతో పలకరిస్తారు. వెల్లిపాయ, గోంగూర, ఉల్లిపాయ లేని ఆహారాన్ని స్వీకరిస్తారు. -
హోం వర్క్ చేయలేదని విద్యార్థిపై టీచర్ దాడి
బేతంచెర్ల: హోంవర్క్ చేయలేదని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. గోరుమానుకొండ ఏపీ రెసిడెన్సియల్ గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. డోన్ మండల ఉడుములపాడు గ్రామానికి చెందిన కుల్లాయి కొడుకు హర్షవర్ధన్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 3వ తేదీన విద్యార్థి హోం వర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు బెత్తంతో తలపై కొట్టడంతో రక్త గాయమైంది. మనస్థాపానికి గురైన ఆ విద్యార్థి 4వ తేదీన ఉదయం ఎవరికీ చెప్పకుండా పాఠశాల నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆందోళనకు గురైన వారు ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అదే రోజు రాత్రి కుమారుడు ఇంటికి రావడంతో టీచర్ తలపై కొట్టిన విషయం తెలిసింది. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బుధవారం డోన్ ఆర్డీఓ నరసింహులును కలిసి ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. -
● కేసీ కెనాల్లో దూకిన యువరైతు
అప్పుల బాధతో.. పాములపాడు: పంటలకు ధర లేక.. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ యువరైతు మనస్థాపం చెంది కేసీ కెనాల్లో దూకాడు. ఈనెల 6వ తేది రాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని జూటూరు గ్రామ పంచాయతీ మజరా కోల్స్ ఆనందాపురం గ్రామానికి చెందిన యువరైతు వంశీ(21) తండ్రి చంద్రపాల్, తల్లి నాగమ్మతో కలిసి వ్యవసాయం చేసేవాడు. రెండేళ్ల నుంచి వ్యవసాయం కలిసి రావడం లేదు.దీనికితోడు 6 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న, మినుము పండిస్తే సరైన ధర లభించలేదు. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో చేసిన అప్పులపై ఇంట్లో కుటుంబసభ్యులతో మదనపడ్డాడు. తర్వాత ఇంటికి గొళ్లెం పెట్టి పరుగెత్తుకుంటూ సమీపంలోని కేసీ కెనాల్లో దూకాడు. ఈత కూడా రాకపోవడంతో క్షణాల్లో మునిగిపోయాడు. రాత్రి కావడంతో ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తిరుపాలు సిబ్బందితో పాటు, బంధువులు కేసీ కెనాల్ వెంట గాలింపు చేపట్టారు. చంద్రబాబువి చీకటి ఒప్పందాలు జూపాడుబంగ్లా: సీఎం చంద్రబాబునాయుడు చీక టి ఒప్పందాలు చేసుకుంటారని, అందులో భాగ మే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నిలిపివేత అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రమేష్బాబు విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు నేడు సీపీఐ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఈశ్వ రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, రైతుసంఘం గౌరవ అధ్యక్షుడు రామచంద్ర య్య తదితరులు రానున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన జూపాడుబంగ్లాలో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆగడంతో ఈ ప్రాంతంలోని రైతాంగం, ప్రజలకు సాగు, తాగునీటి సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కౌతాళం: మండ లంలోని ఎరి గేరి గ్రామంలో బంగారమ్మ దేవరకు వెళ్లి వస్తుండగా ఆటో ఢీకొని తల్లి కొడుకు దుర్మరణం చెందారు. తుంగభద్ర దిగువ కాలువ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎరిగేరి గ్రామంలో బుధవారం బంగారమ్మ దేవర జరుగుతుంది. కౌతాళం గ్రామానికి చెందిన రాము..భార్య మహదేవి, కుమారుడు నాగిరెడ్డి, మనవడు అభిరాంతో కలిసి ఆ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. దేవర ముగించుకుని సాయంత్రం ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. కౌతాళం నుంచి ఎరిగేరి వైపు ఎదురు వస్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్లి బలంగా ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే మహదేవి(48), నాగిరెడ్డి (28) మృతి చెందారు. మహదేవి చేతిలో ఉన్న మనవడు అభిరాంకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ అశోక్కుమార్ సంఘ టనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగిరెడ్డి భార్య శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నాగిరెడ్డికి భార్య శాంతితో పాటు ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు.


