breaking news
Nandyala
-
సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం
పగిడ్యాల: ప్రజలకు జవాబుదారీగా విధులు నిర్వహించాల్సిన సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా కార్యాలయానికి తాళాలు వేయకుండా వెళ్లిన ఉదంతం సోమవారం నెహ్రూనగర్ సచివాలయం 2లో చోటుచేసుకుంది. దాదాపు 13 శాఖలకు సంబంధించిన ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నా వారి మధ్య సమన్వయం లేకపోవడంతో కార్యాలయానికి తాళం వేయకుండా ఇళ్లకు వెళ్లిపోయారు. సచివాలయంలో విలువైన కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలు, బీరువాలు, రికార్డులు ఉన్నప్పటికీ తమవి కాదన్నట్లు వెళ్లిపోవడం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. తాళం వేయలేని సంగతిని గుర్తించిన గ్రామస్తులు వీఆర్ఏకు సమాచారం అందించడం కార్యాలయానికి వేరే తాళం వేశారు. ఈ విషయమై ఎంపీడీఓ నాగేంద్రకుమార్ను అడుగగా.. విషయం తన దృష్టికి వచ్చిందని నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మెమోలు జారీ చేస్తామని వెల్లడించారు. -
ట్రాక్టర్ను తగులబెట్టిన దుండగులు
సి.బెళగల్: పెట్రోల్ పోసి ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టినట్లు బాధితులు తెలిపారు. కె.సింగవరం గ్రామానికి చెందిన తెలుగు రంగన్న ట్రాక్టర్తో గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం పనిముగించు కుని తెలుగు రంగన్న కుమారుడు మహేష్.. ట్రాక్టర్ను ఈశ్వరామాలయం వెనుక ప్రాంతంలో వదిలి ఇంటికి వెళ్లాడు. రాత్రి 10:30 గంటల సమయంలో ట్రాక్టర్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. తెలుగు రంగన్న కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేయగా అప్పటికే ట్రాక్టర్ ఇంజిన్ కాలిపోయింది. బాధిత రైతు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం వేధింపులు బండి ఆత్మకూరు: అదనపు కట్నం కోసం మహిళను వేధించిన భర్త, అత్తపై సోమవారం కేసు నమోదు చేశామని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. లింగాపురం గ్రామానికి చెందిన షేక్ మాబున్నికి 16 ఏళ్ల క్రితం కల్లూరుకు చెందిన అన్వర్తో వివాహమైంది. కాగా తరచూ అదనపు కట్నం కోసం మాబున్నిని భర్త, అత్త షేక్ బీబీ అదనపు కట్నం వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య నంద్యాల(అర్బన్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శిరివెళ్ల మండలం కామినేనిపల్లె గ్రామానికి చెందిన కుమ్మరి నరసింహులు(37) కుటుంబ కలహాలతో చాబోలు గ్రామానికి చేరుకుని పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను స్థానికులు గమనించి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళతో కొన్నేళ్ల క్రితం అతనికి వివాహమైంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్వింటా వేరుశనగ రూ.8,000 కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ ధరలు కొంతమేర పెరిగాయి. మార్కెట్కు వేరుశనగ 125 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.3,806, గరిష్ట ధర రూ.8 వేలు లభించగా... సగటు ధర రూ.7,419 నమోదైంది. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ కనిష్ట ధర రూ.3,149, గరిష్ట ధర రూ.6,970 లభించగా... సగటు ధర రూ.6,490 నమోదైంది. ఒకే జిల్లాలో మార్కెట్కు మార్కెట్కు మధ్య ధరల్లో భారీ వ్యత్యాసం కనిపించింది. -
ట్రాక్టర్ బోల్తా.. మహిళ దుర్మరణం
కృష్ణగిరి: ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. కోయిలకొండ గ్రామానికి చెందిన కొందరు కూలీలు ట్రాక్టర్లో దేవనకొండ మండలం పీ. కోటకొండ వద్ద వేరుశనగ నూర్పిడి మిషన్ పనులకు సోమవారం ఉదయం బయలుదేరారు. మార్గమధ్యంలో కంబాలపాడు గ్రామం దాటిన వెంటనే రామలక్ష్మమ్మ బావి సమీపంలో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి గుంతలో బోల్తా పడింది. దీంతో ట్రాలీలో ఉన్న వారంతా ట్రాలీ కింద చిక్కుకపోయారు. ట్రాలీలో వెనుక భాగంలో కొంత గ్యాప్ ఉండటంతో దాని ద్వారా అంతటా బయటపడ్డారు. ప్రమాదంలో గ్రామానికి చెందిన మండ్ల సరస్వతి(45) మృతి చెందారు. మరో వ్యక్తి రవికి గాయాలయ్యాయి. రహదారి వెంట వెళ్లే వారు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. సరస్వతికి భర్త మండ్ల బాలమద్ది, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
పెచ్చులూడిన పాఠశాల పైకప్పు
కోసిగి: మండల పరిధిలోని కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడిపోయింది. సోమవారం ఉదయం హెచ్ఎం ఈశ్వరయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాఠశాల గది తెరిచి చూసే సరికి తరగతి గది పెచ్చులూడి పోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పిందని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 615 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల తరగతి గదులు తడిచి పోయాయి. 7వ తరగతి గదిలో పై కప్పు సిమెంట్ పెంచులూడి తరగతి గది అంతటా చిందరబందరంగా పడి ఉంది. తరగతి గదులకు మరమ్మతులు చేయించి ప్రాణాపాయం జరుగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరారు. -
ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి
కర్నూలు(అర్బన్): భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని సోమవారం స్థానిక జిల్లా పరిషత్లోని పీఆర్ ఎస్ఈ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయం ముందున్న విశ్వేశ్వరయ్య విగ్రహానికి ఇంజినీర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఆర్ రిటైర్డు ఎస్ఈ కె.సుబ్రమణ్యం, కర్నూలు, ఆదోని ఈఈలు మహేశ్వరరెడ్డి, టీసీ వెంకటేష్, డీఈఈలు బండారు శ్రీనివాసులు, రమేష్కుమార్రెడ్డి, కర్రెన్న, నాగిరెడ్డి, ధనిబాబు, భాస్కర్, రంగస్వామి, పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు వి.రవీంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్.సతీష్కుమార్, డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముక్తార్బాషా, ఆర్సీ ప్రకాష్, డీఏఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోక్షగుండం మైసూర్ సంస్థానం దివానుగా ప్రజలకు చేసిన సేవలకు గుర్తుగా బ్రిటీష్ ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదును ఇచ్చి సత్కరించారన్నారు. 1955లో భారత ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఇచ్చి గౌరవించిందన్నారు. మైసూలోని కృష్ణరాజ సాగర్కు ఆయన చీఫ్ ఇంజనీరుగా పనిచేశారని గుర్తు చేశారు. అనంతరం విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న డీఈఈలు రమేష్కుమార్రెడ్డి, రంగస్వామి, ఏఈఈలు ఆర్ సతీష్కుమార్, ఆర్ పార్థసారథి, ఏఈ మాలిక్లను ఘనంగా సన్మానించారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులా?
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కేసులు నమోదు చేయడం దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను గౌరవించాలి. కక్ష పూరితంగా వ్యవహరించడం పద్ధతి కాదు. రాజ్యాంగం విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం పత్రికల గొంతు నొక్కడం సమంజసం కాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై కూటమి ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలి. విలేకరుల సమావేశంలో ఓ నాయకుడు మాట్లాడిన అంశాలను పత్రికలో ప్రచురిస్తే ఎడిటర్పై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు మానుకొని కేసులను ఉపసంహరించుకోవాలి. – బుట్టారేణుక, కర్నూలు మాజీ ఎంపీ -
పాముకాటుతో యువ రైతు మృతి
ఆలూరు రూరల్: పాము కాటుతో యువ రైతు రవి మృతిచెందాడు. ఈ విషాద ఘటన ఆలూరు మండలం అరికెర గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవి (32) గ్రామ సమీపంలో రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. సోమవారం పొలంలో కూలీలు తీసిన పత్తి దిగుబడులను ట్రాక్టర్లో వేస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. గమనించిన బంధువులు చికిత్స నిమిత్తం ట్రాక్టర్లో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. రవికి భార్య లత ( ప్రస్తుతం 9 నెలల గర్భవతి), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబీకులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. పరామర్శించిన ఎమ్మెల్యే విరూపాక్షి పాముకాటుతో రవి మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ట్యాబ్ల చోరీ నిందితుల అరెస్ట్
నంద్యాల: పట్టణంలోని కేఎన్ఎం హైస్కూల్ సమీపంలోని డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ట్యాబ్లు చోరీకి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్ తెలిపారు. సోమవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డిప్యూటీ డీఈఓ కార్యాలయంలోని 90 ట్యాబ్లు, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుల్స్, రెండు స్పైక్ గార్డ్స్లు ఇటీవల చోరీకి గురయ్యాయి. ఏపీ సమగ్ర శిక్షణ అధికారి దస్తగిరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. పట్టణంలోని చాంద్బాడ వీధికి చెందిన షేక్ హుసేన్వలి, ఒక మైనర్ బాలుడు ఈ చోరీకి పాల్పడ్డారని, వీరిని సోమవారం భీమవరం రోడ్డులోని ఈద్గా సమీపంలోని అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి అపహరణకు గురైన రూ.6.93 లక్షలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచామన్నారు. సమావేశంలో వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి సర్కార్
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సర్కార్ ప్రతికా స్వేచ్ఛను సైతం హరించి వేస్తున్నారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రానికి స్థానం లేకుండా పోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తే పత్రికలు, ఎడిటర్లపై కేసులకు సైతం వెనుకాడటం లేదు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక మీడియాపై దాడికి తెగబడుతోంది. ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపినందుకు ఇటీవల కాలంలో సాక్షి ఎడిటర్తోపాటు మరి కొందరిపై తాడేపల్లి పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బనగానపల్లె -
కుళ్లి.. రైతుకు కన్నీరే మిగిలి!
‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు’ అని పెద్దలు అంటూ ఉంటారు. ఉల్లిపాయలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఈ నానుడి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెద్దల మాటలను, రైతుల కష్టాన్ని పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఉల్లిగడ్డలు వృథాగా ఉండి కుళ్లిపోతున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, ప్రకృతి వైపరీత్యాలను ఎదిరించి, అహోరాత్రులు శ్రమించిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. వేల రూపాయలు ఖర్చు చేసి కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చినా గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేసే వారు కరువయ్యారు. దీంతో ఉల్లి సంచులను వదిలేసి వెళ్లారు. కర్నూలు మార్కెట్లో ఎక్కడ చూసినా ఉల్లి దిగుబడులే కనిపిస్తూ పాలన వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
మొరాయిస్తున్న పోతిరెడ్డిపాడు గేటు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ 4వ గేటు రెండు రోజులుగా మొరాయిస్తోంది. హెడ్రెగ్యులేటర్కు పదిగేట్లు ఉండగా అందులో 1వ గేటు రోప్ తెగిపోవటంతో దానికి మరమ్మతులు నిర్వహించకుండా దాన్ని ఆపరేట్ చేయటం లేదు. మిగిలిన తొమ్మిదిగేట్లల్లో ప్రస్తుతం 2, 4, 5, 6, 7 గేట్లను మాత్రమే ఆపరేట్చేస్తూ ఎస్సారెమ్సీకి నీటిని విడుదల చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పోతిరెడ్డిపాడు నుంచి నీటిసరఫరాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 వేల క్యూసెక్కులకు తగ్గించారు. ఈ క్రమంలో 2, 5, 6, 7 గేట్లను కిందికి దించగా అవి కిందికి దిగాయి. 4వ గేటును కిందికి దించేందుకు యత్నించగా కిందికి దిగకుండా రెండు అడుగుల ఎత్తులో మొరాయించింది. దాన్ని కిందికి దింపేందుకు పోతిరెడ్డిపాడు పర్యవేక్షణాధికారులు ఎన్సీఎల్ సిబ్బంది సహకారంతో రెండు రోజుల నుంచి గేటుకు జాకీలను అమర్చి వెల్డింగ్ చేయటం ద్వారా కిందికి దించేందుకు యత్నిస్తున్నా ఫలించలేదు. ఈ విషయమై పోతిరెడ్డిపాడు ఏఈ విష్ణువర్ధన్రెడ్డిని వివరణ అడగ్గా గేటు కిందికి దిగకపోయినా ఎలాంటి ఇబ్బందుల్లేవన్నారు. ప్రస్తుతం 4వ గేటు ద్వారానే 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిసరఫరా పెంచాలన్నప్పుడు గేటును పైకి ఎత్తి నీటి విడుదలను పెంచటం జరుగుతుందని తెలిపారు. -
న్యాయ సహాయానికి డయల్ 15100
కర్నూలు(హాస్పిటల్): ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే 15100 అనే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే వెంటనే న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి తెలిపారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో ఉన్న దిశ వన్ స్టాప్ సెంటర్, మహిళా ప్రాంగణం(శక్తి సదన్)ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. కార్యాలయాలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి వాటిని సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచనలు చేశారు. లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అందరూ అర్హులని తెలిపారు. వన్స్టాప్ సెంటర్లో ప్రభుత్వం ద్వారా అందజేసే బాధితుల పరిహారానికి సంబంధించి రికార్డులు పరిశీలించి వాటిని త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. -
సర్వేలతో ఇబ్బందులు పడుతున్నాం
సచివాలయాల్లో ఉద్యోగులుగా పని చేసేందుకు మాకు ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే ప్రస్తుతం వలంటీర్లు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సర్వేను తామే చేయాల్సి వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నాం. మనమిత్ర ఇంటింటికి కార్యక్రమం చేయాల్సి వస్తుండటంతో సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉంది. ఈ కార్యక్రమం గురించి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – పరమేష్, పంచాయతీ కార్యదర్శి, ఎస్.నాగులవరం సచివాలయాల్లో ఎంతో మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి, అధికారులకు ఎన్నో మార్లు విన్నవించాం. గ్రామాల్లో సర్వేలు చేసి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలంటూ సెలవులు, పండుగ దినాలు, ఆదివారాల్లో కూడా విధులు నిర్వహించాల్సి వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నాం. ఒత్తిడి లేని పనులు కల్పించి సచివాలయాల్లో ప్రజలకు అందించే సేవలు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అందేలా చూడాలి. – సంతోష్రెడ్డి, ఏఎస్ఈ సంఘం జిల్లా అధ్యక్షుడు -
యు. కొత్తపల్లె విలేజ్ క్లినిక్కు జాతీయస్థాయి గుర్తింపు
డోన్: మెరుగైన వైద్యసేవలు అందించిన యు.కొత్తపల్లె ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి (విలేజ్ క్లినిక్) కేంద్ర ప్రభుత్వం నుంచి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఆరోగ్య కేంద్రానికి నేషనల్ హెల్త్ సిస్టం రీసోర్స్ సెంటర్గా గుర్తింపు పొందిందని గ్రామ సర్పంచ్ వై.విద్య తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎస్ఆర్సీ ప్రత్యేక బృందం గతంలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీచేసిందన్నారు. 91.35 శాతం ఆసుపత్రి సిబ్బంది రోగులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పిస్తున్నారని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారన్నారు. ఏఎన్ఎం సుజాత, ఆశావర్కర్ రంగలక్ష్మి కృషితో యు.కొత్తపల్లె గ్రామానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించినట్లు సర్పంచ్ తెలిపారు. -
సచివాలయ ఉద్యోగులమా.. సర్వే సిబ్బందిమా?
డిమాండ్లు ఇవి? ● ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేలు ఇతర పనుల నుంచి విముక్తి కల్పించాలి. ● గ్రామ వార్డు సచివాలయం మాతృ శాఖలకు అప్పగించాలి. ● ఒత్తిడితో కూడిన విధుల నుంచి విముక్తి కల్పించాలి. ● కార్యాలయ పని వేళలు పాటించకుండా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడం, సెలవులు, పండుగలు, ఆదివారాలలో బలవంతపు విధులు చేయించడం తగదు. ● నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. ● ఆరేళ్ల పాటు ఓ కేడర్లో సర్వే చేసిన వారికి ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇక్రిమెంటు మంజూరు చేయాలి. ● ప్రస్తుతం అమలు అవుతున్న రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్కు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు మార్పు చేయాలి. ● అన్ని విభాగాల వారీగా ప్రమోషన్ చానల్స్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా సీనియార్టీ జాబితా విడుదల చేయాలి. ● గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు స్టేషన్ సీనియార్టీ ఆధారంగా పారదర్శక బదిలీలు జరిగే ప్రత్యేక విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలి. గోస్పాడు: కూటమి ప్రభుత్వ తీరుతో ఆదర్శమైన సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రోజుకో సర్వేల భారంతో సతమతమవుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడితో నిర్వేదానికి గురవుతున్నారు. సర్వేలను వ్యతిరేకిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదు రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులందరూ సమైక్యంగా ఆయా మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎంపీడీఓలకు వినతి పత్రాలను అందజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రోజుకో కొత్త సర్వేలంటూ సచివాలయ సిబ్బందిపై పని ఒత్తిడి పెంచింది. జిల్లాలోని 29 మండలాల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 413 గ్రామ, 103 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. రూ.164.31 కోట్లు నిధులతో సచివాలయాల భవనాలు నిర్మించింది. ప్రస్తుతం 516 సచివాలయాల్లో 4,400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో అప్పట్లో 8,842 మంది వలంటీర్లతో ఇంటింటికీ సేవలు అందించారు. అయితే వలంటీర్లందరికీ ఎన్నికల ముందు రూ.10 వేలు ఇచ్చి పని చేయిస్తామని కూటమి నేతలు ఊరించారు. 15 నెలల కూటమి పాలన పూర్తయిన కూడా వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో గతంలో వలంటీర్లు చేసే పని కూడా ప్రస్తుతం సచివాలయ సిబ్బందితో ఇంటింటికి తిరిగేలా సర్వేలు చేయిస్తుండటంతో వారు విసుగు చెందుతున్నారు. ఉద్యోగులుగా తాము ఎలా పని చేయాలని, ఒత్తిడి తగ్గించాలంటూ ఇప్పటికే పలుమార్లు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. సెలవు దినాలు, పండుగలు, సైతం ఏమాత్రం వదలకుండా బలవంతంగా సర్వేలు చేయిస్తుండటంతో ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో వారంతా ఆందోళన బాట పడుతుందన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో ఉద్యోగుల ఐక్యవేదిక తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గతంలో గడపగడపకు సేవలు స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 2019 అక్టోబర్ 2 తేదీ గాంధీ జయంతి రోజున మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. అందులో భాగంగా సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. వాటికోసం ఊరూరా శాశ్వత ప్రభుత్వ భవనాలు నిర్మించి ప్రజల ముంగిటకే పాలనను తీసుకెళ్లారు. ఒక్కో సచివాలయం పరిధిలో పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్ ,అగ్రికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఉద్యాన శాఖ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, తదితర పోస్టులను నియమించారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి ప్రభుత్వ పాలనను కొత్త పుంతలు తొక్కించారు. గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలు నేరుగా గడప వద్దకే చేర్చారు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇంటింటికి తిరిగి సర్వేలు చేయలేమని ఇప్పటికే పలుసార్లు అధికారులను వేడుకుంటున్నా వారికి ఏమాత్రం ఉపశమనం కలిగించడం లేదు. ప్రభుత్వ ఆశయం విజన్ 2047 సాకారం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సర్వే చేసే సమయంలో తీవ్ర అవమానానికి గురి కావాల్సి వస్తుందని, దీంతో ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని, విద్యార్హతల ఆధారంగా విధులు అప్పగించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం మనమిత్ర, కౌసల్యం, పీ4, రైస్కార్డుల పంపిణీ, వాహన డేటా, ఆధార్ సీడింగ్, చైల్డ్ విత్ ఆధార్, బర్త్ సర్టిఫికెట్ల వంటి వాటి కోసం ఇంటింటికి తిరిగి సర్వేలు చేయాల్సి ఉందని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, క్యాడర్ మార్పు, ప్రమోషన్లు, పారదర్శక బదిలీలు వంటి వాటిని చేపట్టాలని కోరుతున్నా వాటిని తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు చేస్తున్నారు. -
అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి
● జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను అధికారులు నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమంలో డీఆరోతో పాటు డీఆర్డీఏ పీడీ, తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లా డుతూ.. పీజీఆర్ఎస్లో ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై తహసీల్దారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ లీలావతి, డీఈఓ జనార్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి శరన్నవరాత్రోత్సవాలు ● ఈ ఏడాది మూలమూర్తి శ్రీ కామేశ్వరీదేవికి అలంకార పూజలు మహానంది: మహానంది క్షేత్రంలో ఈనెల 22వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక కల్యాణ మండపంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజువారి అలంకారాలతో పాటు గ్రామోత్సవం ఉంటుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తొలిసారి మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి మూలమూర్తికి నిత్యం ఒక అలంకారం చేస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లు వెలిసిన ఆలయం కావడంతో వచ్చే నెల 2వ తేదీన అమ్మవారు శివకామేశ్వరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో వేదపండితు లు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధా న అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, ఉప ప్రధాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీడీఓలకు నేడు, రేపు శిక్షణ కర్నూలు(అర్బన్): మండల, గ్రామ పంచాయతీల్లో ‘సొంత ఆదాయ వనరులు’ అనే అంశంపై ఈ నెల 16, 17వ తేదీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 53 మండలాలకు చెందిన ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలకు రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ, డీపీఆర్సీ ప్రిన్సిపాల్ జీ నాసరరెడ్డి తెలిపారు. ఏపీఎస్ఐఆర్డీ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణలో సొంత ఆదా య వనరుల సృష్టి, సొంత ఆదాయంలో పన్ను వనరులు, పన్నుల వసూళ్లలో ఎదురయ్యే సవాళ్లపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఎట్టకేలకు డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్టు విడుదల ● మిగిలిపోనున్న 88 పోస్టులు కర్నూలు సిటీ: నిరుద్యోగ అభ్యర్థులను ఊరించిన డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్టు ఎట్టకేలకు సోమవారం విడుదలైంది. డీఎస్సీ ప్రకటన జారీ చేసినప్పటి నుంచి అనేక వివాదాలు, ఆందోళనల మధ్య ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్యలో 2,645, ఆశ్రమ పాఠశాలల్లో 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అయితే సర్టిఫికెట్ల పరిశీలనలో 2,590 పోస్టులకు మాత్రమే అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను ఇవ్వనున్నట్లు ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలో 88 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో భర్తీకి నోచుకోవడం లేదు. ఉద్యోగాలకు ఎంపికై న వారందరూ గత నెలలో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్న సెంటర్లకు 18వ తేదీ ఉదయం 7 గంటలకు రిపోర్టు చేసుకోవాలని, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అభ్యర్థులతో పాటు ఒకరు సహాయకులుగా విజయవాడకు బయలుదేరి వెళ్లాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ప్రకటన జారీ చేశారు. -
నమ్మించి ముంచడమే బాబు నైజం
ప్యాపిలి: నమ్మించి రైతులను నట్టేట ముంచడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన గ్రామ పంచాయతీ సర్కిల్ నుంచి టమాట మార్కెట్కు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలసి ర్యాలీగా వచ్చారు. అనంతరం స్థానిక మార్కెట్లో వంగాల భరత్కుమార్ రెడ్డి టమాట రైతుల కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఏదైనా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేసిందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల ఎరువులు నేరుగా రైతులకు అందించామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. టమాట, ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతకాని తనం వల్లనే యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారని విమర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం వాటిల్లిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఆ పథకాన్నే అటకెక్కించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వ ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఉల్లి, టమాట పంటలను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతుల నడ్డి విరుస్తున్న వ్యాపారులు.. ఓ వైపు ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా చోద్యం చూస్తుంటే మరోవైపు ప్యాపిలి మార్కెట్లోని వ్యాపారులు రైతుల నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు. పలువురు రైతులతో ఆయన స్వయంగా మాట్లాడి మార్కెట్లో జరుగుతున్న వ్యాపారుల దోపిడీ గురించి తెలుసుకుని విస్తుపోయారు. అత్యంత వ్యయప్రయాసలతో టమాట పంటను మార్కెట్కు తీసుకువస్తే వ్యాపారులు పది బాక్సులకు గాను ఎనిమిది బాక్సులకు మాత్రమే ధర చెల్లిస్తున్నారని తెలిపారు. డబ్బు చెల్లించే సమయంలో వంద రూపాయలకు పది రూపాయలు చొప్పున తగ్గించి ఇస్తున్నాని తెలిపారు. ఇది కాకుండా కమీషన్ అదనంగా తీసుకుంటున్నారని వాపోయారు. దీంతో పంట విక్రయించిన తర్వాత ఇంటికి ఖాళీ చేతులతో వెల్తున్నామని రైతులు తెలిపారు. రైతుల పట్ల వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరును వంగాల భరత్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. వ్యాపారుల తీరును పర్యవేక్షించి రైతులకు న్యాయం చేయాల్సిన అధికారులు మొద్దు నిద్రవీడాలని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు వినయ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ప్యాపిలి, బేతంచెర్ల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు కృష్ణమూర్తి, తిరుమలేశ్వర్ రెడ్డి, నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, బొర్రా మల్లికార్జునరెడ్డి, గడ్డం భువనేశ్వర్ రెడ్డి, మస్తాన్ ఖాన్, బోరెడ్డి రాము, బోరెడ్డి కృష్ణారెడ్డి, పాల శ్రీను, బోరెడ్డి రఘు, విఘ్నేశ్వర్ రెడ్డి, ఎద్దుల న్న, ప్రేమసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ రెడ్డి -
జగనన్న సంకల్పానికి సాక్ష్యాలు
గోస్పాడు: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో నిర్మించిన మెడికల్ కళాశాలలు జగనన్న సంకల్పానికి సాక్ష్యాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అన్నారు. ఇటీవల హోమంత్రి అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ.. వాస్తవాలను ప్రజలు, కూటమి నేతలకు చూపేందుకు సోమవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాగణంలో కళాశాల ఎదురుగా మీడియా సమావేశం నిర్వహించి వాస్తవాలను వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. దశల వారీగా పూర్తి చేసి రెండేళ్ల క్రితం నంద్యాల మెడికల్ కళాశాలతో సహా మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజ యనగరంలో అట్టహాసంగా ప్రారంభించామన్నా రు. నంద్యాల మెడికల్ కళాశాల చంద్రబాబు అమరావతిలా గ్రాఫిక్స్ కాదు అని, హోం మంత్రి అనితకు వాస్తవాలు కనిపించవా.. అని విమర్శించారు. ఈ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం 3వ సారి అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించి పూర్తి కావస్తుందన్నారు. కళాశాల అనుమతులకు తమతో పాటు మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నాటి జిల్లా కలెక్టర్ ఎంతో ప్రయత్నించారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు మెడికల్ కళాశాల అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేశారని, అయినా అనేక సార్లు కోర్టుల వెంట తిరిగి మెడికల్ కళాశాలను సాధించామన్నారు. ఈ కళాశాలలో ప్రస్తుతం 450 మంది చదువుతున్నారన్నారు. కళాశాలకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థి మహేష్ ప్రతిభ చాటి యూనివర్సిటీ టాపర్గా నిలిచారన్నారు. ఎన్ఎంసీ అనుమతులతో ప్రారంభించిన కళాశాలకు సంబంధించి ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలను నేటికీ కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దారుణమన్నారు. పీపీపీ విధానం అంతా లోపభూయిష్టమని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్న అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీపీ మధు సూధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. నంద్యాల మెడికల్ కళాశాల చంద్రబాబు అమరావతిలా గ్రాఫిక్స్ కాదు వాస్తవాలు హోంమంత్రికి కనిపించవా? పీపీపీ విధానం అంతా లోపభూయిష్టం మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్ర కిశోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా -
ఆస్తి లాక్కునేందుకు ఇంటి నుంచి గెంటేశారు
● ఎస్పీని ఆశ్రయించిన మహిళ నంద్యాల: 15 నెల క్రితం తన భర్త చనిపోయాడని, ఆయన పేరుపై ఉన్న ఆస్తిని తన మరిది, అత్త, ఆడపడుచు లాక్కునేందుకు తనను ఇంటి నుంచి గెంటేశారని పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన కవితి జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్కు ఫిర్యాదు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోని, తన భర్త ఆస్తి తనకు దక్కేలా న్యాయం చేయాలని కోరారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు వంటి 105 సమస్యలు వచ్చాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు. -
కార్తీక శుద్ధ ఏకాదశిన కోటి దీపోత్సవం
● శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావుశ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో నవంబరు 1న కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబరు 22 నుంచి నవంబరు 21వ తేదీ వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తుండటంతో సోమవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శ నం, ఆలయ వేళలు, స్వామిఅమ్మవార్ల ఆర్జితసేవలు, క్యూలైన్ల నిర్వహణ, రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్ద్యం, వాహనాల పార్కింగ్, కార్తీక సోమవారాలు, మొదటి శుక్రవారం కృష్ణమ్మకు హారతి, శుద్ధ ఏకాదశిరోజున కోటి దీపోత్సవం, లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీకపౌర్ణమి సందర్బంగా జ్వాలాతోరణం, పుణ్యనదీహారతి ఏర్పాట్లు, కార్తీకమాసంలో ఆకాశదీపం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మొదలైన అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్తీకమాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాలను ఆదేశించారు. ఆయా ఏర్పాట్లన్నీ అక్టోబరు 15వ తేదీ లోగా పూర్తి చేయాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ మాసంలో సిబ్బందికి విధుల వేళల మార్చుతామన్నారు. కార్తీకమాసమంతా మల్లన్న గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నామని, కార్తీకమాస శని, ఆది, సోమవారాల్లో, పౌర్ణమి మొదలైన పర్వదినాల్లో 15 రోజుల పాటు సామూహిక అభిషేకాలు కూడా పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు వివరించారు. -
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. అదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూ లైన్లు నిండి పోయాయి. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి. నేడు టమాట రైతులతో ముఖాముఖి ప్యాపిలి: టమాట రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ రైతు విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ రెడ్డి సోమవారం ప్యాపిలి టమాట్ మార్కెట్ను సందర్శించనున్నారు. గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు భరత్రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు, నాయకులు మధ్యాహ్నం 2 గంటలకు టమాట మార్కెట్కు చేరుకుని రైతులతో ముఖాముఖి కానున్నారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 15న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఉద యం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ముగిసిన పెథాలజీ వైద్యుల రాష్ట్ర సదస్సు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో మూడు రోజులుగా కొనసాగుతున్న పెథాలజి వైద్యుల రాష్ట్ర సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మెడికల్ కాలేజీల నుంచి 612 మంది వైద్యులు హాజరైనట్లు ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ బాలీశ్వరి తెలిపారు. వీరిలో 50 మందికి పైగా ప్రొఫెసర్లు, 75 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 150 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 140 మంది పీజీ వైద్యులు ఉన్నారన్నారు. మూడు రోజుల సదస్సుతో సరికొత్త వైద్య విధానాలను సీనియర్ వైద్యులు వివరించారని పేర్కొన్నారు. -
టీడీపీ నాయకులు ‘ఉపాధి’ సిబ్బందితో కుమ్మకై ్క గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కొల్లగొట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో 80 శాతం నిధులు స్వాహా చేసి 20 శాతం మాత్రమే ఖర్చు చేశారు. ఇంత స్థాయిలో అక్రమాలు జరిగినా సామాజిక బృందాలు బయటకు తీయలేకపోయాయి. ఓపెన్ ఫోరం నిర్వహ
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోకూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2024–25లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లేబర్ కాంపోనెంట్ కింద ఉమ్మడి జిల్లాలో రూ.675 కోట్లు ఖర్చు చేశారు. ‘ఉపాధి’ సిబ్బందితో కూటమి పార్టీల నేతలు కుమ్మకై ్క నిధులను కొల్లగొట్టారని విమర్శలు వచ్చాయి. ఇందుకు గ్రామస్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను తప్పించి కూటమి పార్టీలు తమ కార్యకర్తలను నియమించుకున్నారు. ఏపీవోలు, సాంకేతిక సహాయకులు, ఈసీలు తదితరులందరినీ తమకు అనుకూలమైన వారిని నియమించుకున్నారు. ‘ఉపాధి’ నిధుల్లో జరిగిన అక్రమాలను సామాజిక తనిఖీ బృందాలు వెలికి తీయాల్సి ఉంది. అయితే ఆ బృందాలు అక్రమాలే లేవంటూ క్లీన్చీట్ ఇస్తుండటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. సర్వత్రా ఆశ్చర్యం! కర్నూలు జిల్లాలో 2024–25లో లేబర్ కాంపోనెంటు కింద రూ.276 కోట్లు, మెటీరియల్ కాంపోనెంటు కింద రూ.105 కోట్లు, నంద్యాల జిల్లాలో కాంపోనెంటు కింద రూ.205, మెటీరియల్ కాంపోనెంటు కింద రూ.89 కోట్లు ఖర్చు చేశారు. ఉపాధి సిబ్బంది, కూటమి పార్టీల నేతలు కుమ్మకై ్క నిధులు కొల్లగొట్టినప్పటికీ సామాజిక తనిఖీ బృందాలకు ఇవేమీ కనిపించలేదు. ఒక్క శాతం కూడా దుర్వినియోగం లేని విధంగా ఉపాధి పనులు జరుగుతున్నట్లు సోషల్ ఆడిట్ టీమ్లు లెక్కలు చెబుతుండటం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ‘ఉపాధి’ పనులు ఇంత సవ్యంగా జరుగుతున్నాయా అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. నిధుల స్వాహా ఇలా.. సి.బెళగల్, ఎమ్మిగనూరు, గూడూరు, ఆస్పరి మండలాల్లో సోషల్ ఆడిట్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఓపెన్ ఫోరం కూడా నిర్వహించారు. ఇప్పటి వరకు సోషల్ ఆడిట్ జరిగిన నాలుగు మండలాల్లో నిధులు చాలా తక్కువగా దుర్వినియోగం అయ్యిందని తేల్చారు. లేబర్ కాంపోనెంట్ నిధులు 60 శాతం పక్కదారి పట్టినా బృంద సభ్యులు లేదని చెబుతున్నారు. చాలా చోట్ల కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేసి నిధులు స్వాహా చేశారు. పది మంది పనిచేస్తే ఒకే ఫొటో 10 మస్టర్లకుపైగా వేసి నిధులు స్వాహా చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో దొంగ మస్టర్లతో నిధులు స్వాహా చేసినట్లు విమర్శలు ఉన్నాయి. మెటీరియల్ కాంపోనెంటు కింద చేపట్టే పనుల్లో అక్రమాలదే పై చేయి. అయినా సామాజిక తనిఖీ బృందాలు వెలికి తీస్తున్న అవినీతి, అక్రమాలు చాలా స్వల్పంగా ఉంది. తనిఖీలు నామమాత్రం కర్నూలు జిల్లాలో రెండు, నంద్యాల జిల్లాలో రెండు సోషల్ ఆడిట్ టీమ్లు పనిచేస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేసిన తొలినాళ్లలో సామాజిక తనిఖీలంటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. నేడు సామాజిక తనిఖీలు నామమాత్రం అయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ ఆడిట్లో పారదర్శకత కనిపించడం లేదని అధికారులే పేర్కొంటున్నారు. ఓపెన్ఫోరంలో చూపిన నామమాత్రపు అక్రమాలు కూడా మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నాయి. రికవరీ రూ.2 లక్షలు, రూ.3 లక్షల వరకు మాత్రమే ఉంటోంది. సామాజిక తనిఖీ బృంద సభ్యులు కొందరు అక్రమాలు చేసిన ‘ఉపాధి’ సిబ్బంది, టీడీపీ నేతలతో కుమ్మకై ్క చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శలు ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అన్నీ అక్రమాలే ‘ఉపాధి’కి 2024–25లో ఉమ్మడి జిల్లాలో రూ.675 కోట్ల ఖర్చు కూటమి పార్టీల నేతలు కుమ్మకై ్క నిధులను కొల్లగొట్టిన వైనం ఒకే ఫొటో 10 నుంచి 15 మస్టర్లు వేసి నిధుల స్వాహా ౖపైపెనే సామాజిక బృందాల తనిఖీలు వంద శాతం పనులు పారదర్శకం అంటూ నివేదిక -
అన్యాయం జరిగితే నిర్భయంగా ఫిర్యాదు చేయండి
● శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ● నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సునీల్ షేరాన్ నంద్యాల: అన్యాయం జరిగితే ప్రజలు పోలీసు స్టేషన్లో నిర్భయంగా ఫిర్యాదు చేసేలా వాతావరణం కల్పిస్తానని జిల్లా నూతన ఎస్పీ సునీల్ షేరాన్ అన్నారు. విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా పని చేస్తున్న ఆయన నంద్యాల జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చారు. ఈ మేరకు ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తూ బదిలీ అయిన ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా నుంచి ఆదివారం సునీల్ షేరాన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు, నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావళి ఆల్ఫోన్స్, సాయుధ బలగాల అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు డీఎస్పీలు ప్రమోద్, రామాంజినాయక్లతో పాటు సీఐలు, ఎస్ఐలు ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసి బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెంచేలా సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటామ న్నారు. జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంతో పాటు ప్రజల శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
విద్యుత్ ఉద్యోగుల ఉద్యమ బాట
● నేటి నుంచి ఆందోళన కార్యక్రమాలు ● జేఏసీగా మారిన 23 సంఘాలుకర్నూలు(అగ్రికల్చర్): తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టనున్నారు. ఈ నెల 15 నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను ఏపీ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) సిద్ధం చేసింది. జేఏసీలో 1104, 327, డిప్లొమా ఇంజినీర్స్, బీసీ, ఓసీ, బహుజన ఉద్యోగ సంఘాలు మొత్తంగా 23 ఉన్నాయి. ఈ నెల 15 నుంచి చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై జేఏసీ ప్రతినిధులు ఈ నెల 6న విద్యుత్ శాఖ ఎస్ఈ ఉమాపతికి నోటీసు ఇచ్చారు. ప్రధాన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయినందున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆదివారం జేఏసీ నేతలు విలేకరులకు తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లు ఇవీ.. ● నగదు రహిత వైద్యం అందించాలి. ● 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్య చేరిన ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలి. ● దళారీ వ్యవస్థను రద్దు చేసి కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలి. ● మొత్తం 13 రకాల డిమాండ్లను పరిష్కరించాల్సి ఉంది. వీటిలో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఆరు డిమాండ్లు ఉన్నాయి. నిరసనలు ఇలా.. ● ఈ నెల 15,16 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారు. ● 17, 18 తేదీల్లో భోజన విరామ సమయాల్లో ఆందోళనలు చేపడతారు. ● 19, 20 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తారు. ● 22న ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు మెమొరాండం సమర్పిస్తామని జేఏసీ నేతలు సతీష్కుమార్, లక్ష్మీకాంతరెడ్డి, రామరాజు, రమణమూర్తి, సయ్యద్బాషా తెలిపారు. -
సమాచార శాఖ డీఐపీఆర్ఓగా మల్లికార్జునయ్య
నంద్యాల: జిల్లా డీఐపీఆర్ఓగా మల్లికార్జునయ్యను నియమిస్తూ సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్స్శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తు తం ఇక్కడ పని చేస్తున్న పురుషోత్తంను సత్యసాయి జిల్లాకు బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డీఐపీఆర్ఓ)గా జె.మల్లికార్జునయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో డీపీఆర్ఓగా విధులు నిర్వహిస్తూ కర్నూలు సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందానన్నారు. దీంతో పాటు నంద్యాల డీఐపీఆర్ఓగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి సలహాలు, సూచనలు పాటిస్తూ అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా విస్తృతం చేస్తామన్నారు. కుమారుడిని హత్య చేసిన తండ్రి అరెస్ట్ దేవనకొండ: కుమారుడిని నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసిన తండ్రి నరేష్ను అరెస్టు చేసినట్లు సీఐ వంశీనాథ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. నిందితుడిని పత్తికొండ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచినట్లు చెప్పారు. దేవనకొండకు చెందిన చాకలి నరేష్, శ్రావణికి ఎనిమిది నెలల కుమారుడు సాగర్ ఉన్నాడు. నిత్యం భార్యతో గొడవ పెట్టుకునే నరేష్.. దేవనకొండలో గత రెండు రోజుల క్రితం కుమారుడిని నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసిన విషయం తెలిసిందే. -
ఆరుతడి.. సాగు తడబడి..!
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రెండు ఎకరాల్లో మొక్కజొన్న, మూడు ఎకరాల్లో జొన్న, ఒకటిన్నర ఎకరాల్లో మిరప సాగు చేశాను. గత ఏడాది మిరప సాగుతో తీవ్ర నష్టం రావడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గించి ఆరుతడి పంట అయిన జొన్న సాగు చేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 10 వేల వరకు వెచ్చించాను. – కుళాయప్ప, రైతు, అమడాల, కోవెలకుంట్ల మండలం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఏడు ఎకరాల్లో పెసర పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర రూపంలో ఎకరాక రూ. 6 వేలు వెచ్చించాను. పంట చేతికందే తరుణంలో గత నెలలో కురిసిన భారీ వర్షాలతకు తెగుళ్లు ఆశించి పైరు పూర్తిగా దె బ్బతినడంతో తొలగించాను. పెసరతోపాటు ఐదు ఎకరాల్లో కంది, మరో పది ఎకరాల్లో వరి సాగు చేశాను. – వెంకటేశ్వరరెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం కోవెలకుంట్ల: రెండేళ్లుగా జిల్లా రైతులకు ఆరుతడి పంటల సాగు కలసి రావడం లేదు. గతంలో సాధారణ విస్తీర్ణం మించి సాగయ్యేది. గత ఖరీఫ్ నుంచి ఆరుతడి పంటల సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. మరో పదిహేను రోజుల్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగియనుంది. సీజన్ మొదట్లో వర్షాభావం, విత్తనం వేసేనాటికి అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జిల్లాలో ఆరుతడి పంటల సాగు చతికిలబడింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్లో 2,10,913 హెక్టార్లలో వివిధ పంటల సాగు సాధారణ విస్తీర్ణంగా కాగా ఆయా మండలాల్లో ఇప్పటి వరకు 1,91, 300 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేయగలిగారు. ఇందులో 88,205 హెక్టార్లలో ఆరుతడి పంటలు సాగు కావాల్సి ఉండగా 65 వేల హెక్టార్లలో మాత్రమే సాగు అయ్యాయి. గత నెల 15 నాటికే ప్రధాన ఆరుతడి పంటలైన వేరుశనగ, పత్తి, పెసర, సోయాబీన్, పొద్దుతిరుగుడు, తదితర పంటల సాగుకు అదును ముగిసింది. ఎర్రరేగడి నేలల్లో మాత్రం కంది, ఆముదం, అలసంద, తదితర పంటలు సాగు చేసుకునే ఆస్కారం ఉంది. భారీగా తగ్గిన పత్తి, వేరుశనగ విస్తీర్ణం.. ప్రధాన ఆరుతడి పంటలుగా పేరుగాంచిన పత్తి, వేరుశనగ సాగు విస్తీర్ణం ఈ ఏడాది జిల్లాలో భారీగా తగ్గింది. ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభభమైన నాటి నుంచే ఈ పంటలు సాగు చేసేవారు. ఈ ఏడాది సీజన్కు ముందు మే నెలలో విస్తారంగా వర్షాలు కురిసినా జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో సాగు కనిష్ట స్థాయికి పడిపోయింది. కూటమి ప్రభుత్వం సకాలంలో వేరుశనగ విత్తనాలను రైతులకు సరఫరా చేయకపోవడంతో సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 11,943 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా 7,331 హెక్టార్లలో సాగు చేయగలిగారు. అలాగే 18,827 హెక్టార్లలో ముంగారి, హైబ్రీడ్, డబుల్ఫోర్, క్రాసింగ్, తదితర పత్తి రకాల సాగు చేయాల్సి ఉండగా సాగు కేవలం 5,419 హెక్టార్లలకు మాత్రమే పడిపోయింది. మినుము సాధారణ విస్తీర్ణాన్ని మించి సాగు అయినా పంట కోత, నూర్పిడి సమయంలో కురిసిన భారీ వర్షాలతో పంట దెబ్బతిని రైతులకు నష్టం వాటిల్లింది. ఆముదం, పెసర, పొద్దుతిరుగుడు, తదితర పంటల సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. సీజన్ మధ్యలో దెబ్బతీసిన భారీ వర్షాలు సాధారణంగా ఖరీఫ్లో జూన్, జూలై నెలల్లో వేరుశనగ, కంది, మినుము, సోయాబీన్, పత్తి, తదితర పంటల సాగు చేసేందుకు సరైన అదును. జూన్, జులై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఆగస్టు 15 లోపు ఆయా పంటలు సాగు చేసుకోవచ్చుకుంటే ఆగస్టు నెలలో భారీ వర్షాలు రైతులను వెంటాడాయి. ఆ నెలలో వరుసగా కురిసిన వర్షాలతో పంటల సాగుకు ఆటంకం కలిగింది. పొలాల్లో తేమ ఆరకపోవడం, సాగుకు గడువు ముగియడంతో ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఖరీఫ్ చివరి పంటగా జొన్న సాగుకు సరైన అదును కాగా నాలుగు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జొన్న సాగు ముందుకు సాగడం లేదు. సెప్టెంబర్ నెలలో సైతం వర్షాలు వెంటాడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాధారణ సాగైన పత్తి 18,827 5,419 వేరుశనగ 11,943 7,331 జొన్న 872 104 పొద్దుతిరుగుడు 389 35 పెసర 279 40 కొర్ర 1,855 1,202 కంది 36,243 34,112 మినుము 9,700 10,484 ఆముదం 2,921 1,882 సోయాబీన్ 4,176 4,600 ఖరీఫ్లో ఆరుతడి పంటల సాగు అంతంత మాత్రమే ఈ ఏడాది భారీగా తగ్గిన పత్తి సాగు విస్తీర్ణం జిల్లాలో 5,419 హెక్టార్లకే పరిమితం పడిపోయిన వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు పంటల సాగు పంట చేతికందే తరుణంలో మినుము రైతుకు నష్టం -
వెండి రథంపై దివ్య తేజం
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం రాత్రి వెండి రథయాత్ర రమణీయంగా సాగింది. వెండి రథంపై ప్రహ్లాద రాయులను అధిష్టింపజేసి భక్త జనం మధ్య ఊరేగింపు చేపట్టారు. శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థమై ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శనం చేసుకొని అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనాన్ని దర్శించుకున్నారు. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాద కౌంటర్ల ముందు భక్తుల రద్దీ కనిపించింది. -
మహిళలపై పెరిగిపోయిన హింస
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై హింస పెరిగింది. మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. మద్యం తాగే వారు ఎక్కువ కావడంతో మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడి పోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సామాన్యులు అల్లాడి పోతున్నారు. అయితే అర్ధరాత్రి వరకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయించడం చాలా దారుణం. ఆదాయం గురించి తప్ప ప్రజారోగ్యం గురించి పాలకులు పట్టించుకోకపోవడం విచారకరం. –శశికళారెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు, నంద్యాల రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చింది. దీంతో మద్యం తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ శివారు ప్రాంతాల్లో శ్రామికులు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో మద్యం తాగుతున్నారు. డబ్బులు లేక, నిత్యావసరాలు కొనుగోలు చేయలేక పేదల ఇళ్లల్లో వృద్ధులు, పిల్లలు పస్తులుండాల్సి వస్తోంది. పిల్లల ఆకలి బాధలు చూడలేక కొందరు మహిళలు కూలీ పనులకు వెళ్తున్నారు. మద్యం విక్రయాలు తగ్గించకుండా అర్ధరాత్రి వరకు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వడం దారుణం. – సుశీలమ్మ, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు, నంద్యాల● -
జాతీయ లోక్ అదాలత్లో 8,122 కేసుల పరిష్కారం
కర్నూలు: జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8,122 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ లోక్ అదాలత్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన 60 మంది రైతుల వారసులకు రూ.83,96,374 నష్టపరిహారాన్ని జిల్లా జడ్జి చేతుల మీదుగా ఇప్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 20 బెంచీలను ఏర్పాటు చేసి 8,122 కేసులను పరిష్కరించామన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి కమలా దేవి, 6వ అదనపు జిల్లా జడ్జి వాసు, సీబీఐ కోర్టు జిల్లా జడ్జి శోభారాణి, కర్నూలు బార్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనరసింహా రెడ్డి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మల్లేశ్వరి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, జూనియర్ సివిల్ జడ్జి కిరణ్కుమార్, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్య నాయుడు, న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జిల్లా నూతన ఎస్పీగా సునీల్ షెరాన్
నంద్యాల: జిల్లా నూతన ఎస్పీగా సునీల్ షెరాన్ను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్ షెరాన్ 2019 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఈయన విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా పని చేస్తున్నారు. ప్రస్తుత జిల్లా ఎస్పీగా పని చేస్తున్న అధిరాజ్సింగ్రాణాకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. 2024 జూలై నెలలో నంద్యాల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాణా 14 నెలలు పాటు ఇక్కడ పని చేశారు. పెన్షనర్ల సంఘం ఎన్నికలకు 36 నామినేషన్లు నంద్యాల(అర్బన్): జిల్లా పెన్షనర్ల సంఘం కార్యవర్గంలోని 17 పదవులకు శనివారం 36 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి పెద్దన్న గౌడ్ తెలిపారు. స్థానిక సంఘం భవనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నామినేషన్ల ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్, అసోసియేట్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ట్రెజరర్ పదవులతో పాటు ఆరుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు జాయింట్ సెక్రటరీల పదవులకు 36 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 26న ఎన్నికల నిర్వహణను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి ప్రభాకర్, సహాయకులు కిట్టప్ప, తదితరులు పాల్గొన్నారు. అతిసార వ్యాధితో వ్యక్తి మృతి రుద్రవరం: కొండమాయపల్లెకు చెందిన గుర్రప్ప (36)అనే వ్యక్తి శనివారం అతిసార వ్యాధితో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రప్ప శుక్రవారం అతిసారం బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు రుద్రవరం, ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. గుర్రప్ప గత 15 ఏళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోయి దగ్గరి బంధువుల ఉంటూ పశువులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదని గ్రామస్తులు తెలిపారు. ఉల్లి గడ్డలతో నిండిపోయిన మార్కెట్ కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లిగడ్డలతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ నిండిపోయింది. మార్కెట్లోని అన్ని షెడ్లు, కమీషన్ ఏజెంటు దుకాణాల ఎదుట ఉల్లి సంచులే కనిపిస్తున్నాయి. రైతులు శనివారం సరుకును తీసుకురాలేదు. ఇది వరకే మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లి మార్కెట్ యార్డులో పేరుకపోయింది. మరోవైపు వ్యాపారులు కొనకుండా వదిలేసిన లాట్లు వందలాదిగా ఉండిపోయాయి. దీనిని మార్క్ఫెడ్ కొనాల్సి ఉంది. సోమవారం ఉదయం లోపు ఖాళీ అయితేనే రైతులు తెచ్చిన ఉల్లిని అమ్మకానికి పెట్టే అవకాశం ఉంది. కుళ్లిపోయిన ఉల్లిగడ్డలు గుట్టలుగా ఉండిపోవడం, మార్కెట్ యార్డులో పారిశుద్ధ్యలోపం ఎక్కువ కావడంతో దుర్వాసన వస్తోంది. -
కూలీల జాతర!
ఒకరు.. ఇద్దరు కాదు.. వందలాది మంది కూలీలు..పొగాకు నారుమడుల్లో పనిచేస్తూ శనివారం కనిపించారు. కర్నూలు మండల పరిధిలోని దిగువపాడు, గార్గేయపురం, పడిదెంపాడు, ఇ.తాండ్రపాడు తదితర గ్రామాల్లో పొగాకు నారు తీస్తున్నారు. అలాగే నాట్లు వేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున కూలీలు పొలాలకు వచ్చి జాతరను తలపించారు. గార్గేయపురం సమీపంలోని ఒక పొలంలో ఈ దృశ్యం కనిపించింది. ఒక ఎకరాలో పొగాకు నాటు వేయలంటే 7,500 మొక్కలు అవసరం. ఎకరా పొగాకు నారును రూ.5,000 నుంచి రూ.6,000 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు. – కర్నూలు(రూరల్) -
టమాట ధర నేలచూపు!
● 25 కేజీల బాక్స్ ధర రూ.150పత్తికొండ: ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా పత్తికొండ వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో టమాట సాగవుతోంది. ఈ ఏడాది 6,400 హెక్టార్లులో సాగు చేశారు. రాష్ట్రంలో మదనపల్లి మార్కెట్ టమాట విక్రయాల్లో మొదటి స్థానం కాగా.. పత్తికొండ మార్కెట్ రెండో స్థానంలో ఉంటుంది. ఇలాంటి చోట టమాట రైతు గిట్టుబాటు ధర కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది. దాదాపు 2,500 హెక్టార్లులో టమోట పంటలో ఇప్పుడే కోతలు మొదలయ్యాయి. అక్టోబర్ నుంచి జనవరి వరకు నిత్యం దాదాపు 20 లారీలకు పైగా టమోటలను రైతులు మార్కెట్కు తీసుకొస్తారు. అరంభంలో ప్రతి ఏడాది 2 నుంచి 3నెలల వరకు మంచి ధర పలుకుతుంది. అయితే ఈఏడాది కేవలం 15 రోజులు మాత్రమే ఓ మోస్తరు ధర పలికింది. పంట మంచి దిగుబడితో ఇప్పుడిప్పుడే కోతలకు వస్తుంది. ఇలాంటి తరుణంలో టమోట ధర నెలచూపులు చూస్తుండటంతో అన్నదాత కష్టం బూడిదిలో పోసిన పన్నీరవుతోంది. ఇక్కడ పండించిన టమాటకు తమిళనాడు, పాండిచ్చేరి, హైదారాబాద్, వరంగల్ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంటుంది. ధరలు అశాజనకంగా లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ ఇంకెప్పుడు? వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పత్తికొండ–గుంతకల్ రహదారిలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలం కేటాయించడంతో పాటు నిధులు కూడా మంజూరు చేశారు. పనులు ప్రారంభించిన కొన్ని నెలలకే అధికార మార్పిడి జరగడంతో కూటమి ప్రభుత్వం పనులను ఎక్కడికక్కడ నిలిపేసింది. రైతుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కొద్ది రోజుల తర్వాత పత్తికొండ మండలం కనకదిన్నె వద్ద ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ ఖరీఫ్కే పనులు పూర్తి చేసి ప్రాసెసింగ్ యూనిట్ను అందుబాటులోకి తెస్తామన్నారు. అయితే పనులు పునాదుల దశలోనే ఉండిపోగా.. రైతుల కష్టాలు తీవ్రమయ్యాయి. -
రంకేసిన ఒంగోలు గిత్త!
నంద్యాల(అర్బన్): నడకలో దర్పం.. రాజసం.. ఉత్తమమైన బల ప్రదర్శన.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఒంగోలు ఎద్దులు ఖండాంతరాలు దాటి ఖ్యాతిని సాధించాయి. ఈ వృషభ సంతతి వృద్ధికి నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రం విశేష కృషి చేస్తోంది. ఒంగోలు జాతి వీర్యోత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితులు లేకపోగా.. నంద్యాల ఎఫ్ఎస్బీ (ప్రాజెన్ సెమన్ బ్యాంక్)లో ఒంగోలు జాతి వీర్యోత్పత్తి ఆశాజనకంగా ఉంది. ఇక్కడి అనుభవజ్ఞులైన వైద్య బృందం ఉంది. ఒంగోలు ఎద్దుల నుంచి సేకరించిన డోసులో ఒక్కోదాంట్లో 0.25 ఎంఎల్కు 20 మిలియన్ శుక్రకణాలు ఉంటేనే నిల్వ చేస్తున్నారు. నిల్వ సమయంలోనూ మైనస్ 196 డిగ్రీల నైట్రోజన్ని కచ్చితమైన సమయానుసారం ఉంచుతున్నారు. దీంతో పాటు పశువుల పాకలు, దాణా, టీకాల విషయంలో రాజీ లేకుండా ఉంటుండటంతో చక్కని ఫలితాలు రాబడుతున్నారు. ఆధునిక సాంకేతికత నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రం ద్వారా పలు పశుజాతుల నుంచి 15.60 లక్షల డోసుల్ని సేకరిస్తున్నారు. నెలకు సగటున 1.30 లక్షల డోసులను సేకరిస్తున్నారు. దీనికోసం ఫ్రాన్స్కు చెందిన అధునాతన విదేశీ పరికరాల్ని వాడుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో 14 లక్షల డోసుల వీర్య నాళికలు భవిష్యత్ అవసరాలకు నిల్వ ఉంచారు. ఈ మధ్య కాలంలో పశు గణాభివృద్ధిలో విప్లవాత్మక మార్పుగా చెప్పుకుంటున్న ఎస్ఎస్ఎస్(సెక్స్ సోర్టెడ్ సెమన్) ద్వారా కేవలం పెయ్య దూడలు జన్మించే విధానాన్ని ఈ కేంద్రం సైతం అందిపుచ్చుకుంది. దీనికోసం ఉత్తరాఖండ్, పూణె నుంచి 12వేల ఈ రకం డోసుల్ని తీసుకొస్తున్నారు. ఇక్కడి సిబ్బంది. పనితీరును విజయవాడ వీబీఆర్ (వెటర్నరీ బయలాజికల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్) ఆరు నెలలకొకసారి, ఎస్ఆర్డీడీఎల్ అధికారులు సంవత్సరానికొకసారి వచ్చి తనిఖీలు చేస్తారు. అత్యుత్తమ పనితీరుతో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ నుంచి నంద్యాల ఎఫ్ఎస్బీ రెండుసార్లు ఏ గ్రేడ్ సాధించింది. రూ.9.36 కోట్లతో పలు అభివృద్ధి పనులు నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రంలో పలు మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పశువుకి విడిగా షెడ్లు, సిబ్బంది గదులు, అధునాతన సాంకేతిక పరికరాల కొనుగోలు తదితరాలకు వీటిని వెచ్చించనున్నారు. రూ.9.36 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో శ్రేష్టమైన జాతుల పశు ఉత్పత్తికి ఘనీకృత వీర్య కేంద్రం విశేష కృషి చేస్తోంది. ఒంగోలు జాతికి సంబంధించిన వీర్యోత్పత్తి మా కేంద్రంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఆశాజనకంగా లేదు. కాలానుగుణంగా పశు వైద్యంలో వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకుంటూ రైతులకు నాణ్యమైన సేవలందిస్తాం. – డాక్టర్ రమణమూర్తి, సహాయ సంచాలకులు, ఘనీకృత వీర్య కేంద్రం, నంద్యాల సేవలు ఇలా... నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రం 1976లో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పశుగణాభివృవృద్ధి సంస్థ పర్యవేక్షణలో పనిచేసే మూడు ఉప కేంద్రాల్లో ఇదొకటి. అంటు వ్యాధులు లేని, మేలుజాతి పశువుల నుంచి కృత్రిమ పద్ధతుల్లో సేకరించిన నాణ్యమైన వీర్యాన్ని రైతులకందివ్వటం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. కేంద్రం నుంచి ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాలకు నిల్వ చేసిన వీర్య నాళికల్ని పంపుతున్నారు. ఒంగోలు, ముర్ర, పుంగనూరు, మల్పాడ గిత్త, గిర్, షాహివాల్ జాతుల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పలు జాతులకు చెందిన 81 ఆబోతులు, ఎడ్లను సంరక్షిస్తున్నారు. రైతుల డిమాండ్కు అనుగుణంగా దేశీయ జాతులకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. ‘రాజసానికి’ ఊపిరి పోస్తున్న నంద్యాల ఎఫ్ఎసీబీ కేంద్రం ఆధునిక సాంకేతికతతో ఒంగోలు ఎడ్ల కృత్రిమ వీర్యోత్పత్తి సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ నుంచి రెండుసార్లు ఏ గ్రేడ్ రూ.9.36 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పన పనులు -
నల్లమలలో వజ్రాన్వేషణ
నీటి గలగలలు.. తళుక్కుమనే ఆశలు.. ఒకరు కాదు ఇద్దరు కాదు వేల మంది వజ్రాల కోసం నల్లమల అడవిలోని ఒక వంకలో అన్వేషణ సాగిస్తున్నారు. మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని సర్వనరసింహస్వామి ఆలయం సమీపం వద్ద ఈ దృశ్యం కనిపిస్తోంది. అన్వేషకులకు ఎక్కువగా చెకుముకి రాయి తరహాలో తెల్లగా ఉండే చిన్న చిన్న రాళ్లు దొరుకుతున్నాయి. వజ్రాలు దొరుకుతాయనే నమ్మకంతో ఆంజనేయపురంలోని ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో కొంతమంది, మరికొంత మంది ఇదే గ్రామంలో ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అదృష్టం వరించిన వారికి సుమారు రూ. లక్షకు పైగా విలువ చేసే వజ్రాలు దొరికినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల చీరాల నుంచి వచ్చిన ఓ మహిళకు రూ.1.50లక్షల విలువైన వజ్రం దొరికింది. ఇక్కడికి ప్రకాశం, గుంటూరు, విజయవాడ, బాపట్ల తదితర జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. – మహానందిఒక వ్యక్తికి దొరికిన రాయి -
ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు
నంద్యాల(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం ప్రభావంతో జిల్లా తడిచిముద్దయ్యింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. కొలిమిగుండ్ల మండలంలో అత్యధికంగా 128.4 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వంకలు, వాగులు పొంగి పొర్లాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. అవుకు మండలంలో 67.2, ప్యాపిలి 66.2, ఆళ్లగడ్డలో 60.4, నంద్యాల అర్బన్ 59.8, బండిఆత్మకూరు 56.2, నంద్యాల రూరల్ 55.2, చాగలమర్రి 52.2, కోవెలకుంట్ల 50.0, గోస్పా డు 43.6, ఉయ్యాలవాడ 32.4, బనగానపల్లె, సంజామల 30.0, పాణ్యం 25.2, శ్రీశైలం 20.2, దొర్నిపాడు 19.2, రుద్రవరం 17.6, బేతంచెర్ల 17.2, మహానంది 15.2, గడివేముల 13.2, శిరివెళ్ల 9.8, వెలుగోడు 9.4, పాములపాడు 5.2 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. వర్షం వరి రైతులకు మేలు చేకూర్చేదిగా ఉండగా మొక్కజొన్న, మినుము రైతులకు నష్టాన్ని మిగిల్చింది. ● ఉయ్యాలవాడ మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మిరప, పత్తి, మినుము, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. కోవెలకుంట్ల, జమ్మలమడుగు ఆర్అండ్బీ ప్రధాన రహదారిలో అల్లూరు, గుళ్లదుర్తి గ్రామాల మధ్య భారీ వృక్షాలు నేలకూలాయి. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. ● కోవెలకుంట్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాలుజలయమయ్యాయి. ● అవుకు సమీపంలోని కొండమీది గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ● కొత్తపల్లి మండలంలో భారీ వర్షానికి విద్యుత్స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. ● ఆత్మకూరు పట్టణంలో భవనాశి, సుద్దవాగు ఉప్పొంగి ప్రవహించాయి. ● ఆళ్లగడ్డలో భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రైతులకు టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసి వాన నీటిలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. సంజామల మండలం పేరుసోముల, రామిరెడ్డిపల్లె గ్రామాల్లో కంది, ఉల్లి, మినుము పంటలు నీట మునిగి రైతులు భారీగా నష్టపోయారు. ● కొలిమిగుండ్ల మీదుగా వెళ్లే నెల్లూరు–ముంబై హైవేపై భారీ వర్షం కారణంగా తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కల్వటాల గ్రామం వద్ద ఎరవ్రాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అటు తిమ్మనాయినిపేట, ఇటు కొలిమిగుండ్ల వరకు వాహనాలు 6 కి.మీమేర నిలిచిపోయాయి. జమ్మలమడుగు, తాడిపత్రికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి కూలిన మట్టి మిద్దె ప్యాపిలి: మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. మండలంలో 66.5 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా పలు పాత మిద్దెలు కారడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మండల పరిధిలోని కలచట్ల గ్రామంలో అంబా చంద్రశేఖర్కు చెందిన మట్టి మిద్దె కూలింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
కస్తూర్బా విద్యార్థులకు విష జ్వరాలు
కొలిమిగుండ్ల: స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థినులు విష జ్వరాల బారిన పడటంతో ఇంటి బాట పడుతున్నారు. నాలుగు రోజుల నుంచి జ్వరాలు రావడంతో పాఠశాల సిబ్బంది మందులు ఇస్తుండేవారు. జ్వరాలు తగ్గుముఖం పట్టకపోవడంతో దాదాపు 20 మంది విద్యార్థినులను ఇళ్లకు పంపారు. సమాచారం అందుకున్న తల్లితండ్రులు పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. జ్వరంతో పాటు జలుబు, చేతులకు దద్దులు వస్తున్నట్లు విద్యార్థుల తల్లితండ్రులు తెలిపారు. ప్రస్తుతం విష జ్వరాలు ప్రమాదకరంగా మారడంతో ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయించుకున్నారు. పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు. -
ప్రతి రోగికి అభా ఐడీ తప్పనిసరి
గోస్పాడు: చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే రోగికి అభా ఐడీ తప్పని సరిగా నమోదు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. నంద్యాల మెడికల్ కళాశాలలో గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనర్ కోటిరెడ్డి, ప్రాజెక్టు కోఆర్డినేటర్లు మెడికల్ ఆఫీస ర్లు, స్టాఫ్నర్సులు, ఫార్మసిస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆయూష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఆరోగ్య మిత్ర కార్యక్రమాలపై వివరించారు. ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వచ్చే ప్రతి రోగికి ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు తప్పనిసరి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు కర్నూలు (టౌన్): వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు లభించింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమిస్తూ గురువారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులుగా నేషా శ్రీనివాసులు, మహిళా విభాగం.. దూదేకుల హుస్సేనమ్మ, రైతు విభాగం.. బెక్కమ్ వెంకట రామసుబ్బా రెడ్డి, ఎస్సీ సెల్.. వై. నాగేశ్వరరావు, ఎస్టీ సెల్.. సురా రామచంద్రుడు, క్రిస్టియన్ మైనార్టీ సెల్.. డాక్టర్ ఎంఎస్సీ. మనోజ్, గ్రీవెన్స్ సెల్.. ముక్కమల్ల్ల వివేకానందరెడ్డి, వీవర్స్ విభాగం.. అవ్వారి ఎల్లా సుబ్బరాయుడు, వైఎస్సార్టీయూసీ.. షేక్ అల్లాబకాష్, లీగల్ సెల్.. ఎంఎస్ఎన్వీ. ప్రతాప్ రెడ్డి, బూత్ కమిటీ విభాగం.. హరినాథ్ రెడ్డి, పంచాయతీ రాజ్ విభాగం.. ఏసం రామసుబ్బారెడ్డి, ఆర్టీఐ విభాగం.. ఎంఆర్ కృష్ణారెడ్డి, వాణిజ్య విభాగం.. ఎస్. మనోహర్ రెడ్డి, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా ఎర్వా దివాకర్ రెడ్డిని పార్టీ నియమించింది. రేపు జాతీయ లోక్ అదాలత్ కర్నూలు(టౌన్): జాతీయ లోక్ అదాలత్ను ఈనెల 13న కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని న్యాయ స్థానాల్లో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో 5 బెంచీలు, ఇతర మండలాల్లో 15 బెంచీలు ఏర్పాటవుతాయన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్ను వినియోగించుకుని తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కేఎంసీలో పెరిగిన మెడిసిన్ పీజీ సీట్లు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలోని జనరల్ మెడిసిన్ విభాగానికి అదనంగా తొమ్మిది పీజీ సీట్లు పెరిగాయి. ప్రస్తుతం 20 పీజీ సీట్లు ఉండగా, అదనంగా 9 సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతిచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ తెలిపారు. పెరిగిన సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తాయని, ఈ సీట్ల కోసం ప్రత్యేకంగా జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శ్రీరాములును ఢిల్లీకి పంపి ప్రక్రియ పూర్తి చేయించామన్నారు. ప్లాస్టిక్ సర్జరీ, క్యాన్సర్ మొదలైన విభాగాల్లో అదనపు పీజీ సీట్ల కోసం ప్రతిపాదనలు పంపించామని, వచ్చే విద్యాసంవత్సరం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. శ్రీగిరిలో 5వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వర్షకాలం ముగిసేలోగా 5 వేల మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు రూపొందించామని శ్రీశైల ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరుకు చెందిన ఎన్డీఆర్ గ్రూపు చైర్మన్ ఎన్.ఆదికేశవులురెడ్డి శ్రీశైల దేవస్థానానికి 2 వేల బిల్వం మొక్కలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు గురువారం శ్రీగిరిలోని భ్రామరీ పుష్పవనంలో బిల్వం మొక్కలను దేవస్థాన ఈఓ నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రం మొత్తంలో 30 శాతం దేవతా మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. బిల్వం, కదంబం, రుద్రాక్ష, తెల్లమద్ది, ఉసిరి, రావి, మేడి, వేప మొదలైన వృక్షాలను నాటేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. -
బాబ్బాబు.. రండి!
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీలు కారులో నుంచి దిగుతున్న నర్సాపురం ఎంపీటీసీ సభ్యుడు కిరణ్ రుద్రవరం: మండల సర్వ సభ్య సమావేశం అంటే మినీ శాసనసభ లాంటిది. ఎంపీటీసీ సభ్యులు తమ గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు మంచి అవకాశం. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారుల తీరును ఎండగట్టేందుకు సరైన వేదిక. అలాంటి మండల మీట్ మొక్కుబడి సమావేశంగా మారిపోతుంది. ఏదో వచ్చామా.. సంతకాలు చేశామా.. వెళ్లామా అన్నట్లుగా సభ్యు లు, అధికారులు వ్యవహరిస్తున్నారు. గురువారం రుద్రవరం మండల మీట్కు సభ్యులు ఎవరూ రాకపోవడంతో అధికారులే వారి ఇళ్ల వద్దకు వెళ్లి వాహనాల్లో పిలుచుకొచ్చి మమ అనిపించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ మబ్బు బాలస్వామి అధ్యక్షతన ఇన్చార్జి ఎంపీడీఓ సుబ్రమణ్యం గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉదయం 10.30 ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం రూ.12.30 గంటలకు మొదలైంది. అయితే తమకు 20 నెలలు గా వేతనాలు అందడం లేదని, తాము చెప్పిన సమస్యలు పరిష్కారం కావడం లేదని, పెట్రోల్ ఖర్చులు దండగా అని ఎంపీటీసీ సభ్యులు ఎవరూ రాలేదు. సమావేశం నిర్వహించేందుకు సరిపడ సభ్యుల కోరం లేక పోవడంతో అధికారుల్లో దడ మొదలైంది. అప్పటి నుంచి ఎంపీటీసీలందరికీ ఫోన్లు చేస్తూ సమయం లేదు త్వరగా రండి అంటూ బతిమిలాడారు. 14 మంది ఎంపీటీసీల్లో కనీసం ఐదుగురినైనా రప్పించాలని ప్రయత్నాలు చేశారు. ఎవరూ స్పందించక పోవడంతో మండల పరిషత్ అధికారులు ఏకంగా కారు తీసుకోని ఇతర గ్రామాల్లోని ఎంపీటీసీ సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని బతిమిలాడి తీసుకురావడంతో 12.30 గంటలకు సమావేశాన్ని ప్రారంభించారు. 20 శాఖలకు సంబంధించిన అధికారులు కేవలం అరగంట లోపే తమ నివేదికలు చదివి వినిపించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో భూ రీసర్వే డిప్యూటీ తహసీల్దారు మహమ్మద్ రఫి, ఎంఈఓ లక్ష్మీదేవి, ఏఈలు కమాల్, సుబ్రమణ్యం, పశు వైద్యాధికారి మనోరంజన్ ప్రతాప్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు ఉన్నారు. మండల మీట్కు హాజరు కాని ఎంపీటీసీ సభ్యులు ఇళ్లకు వెళ్లి కారులో తీసుకొచ్చిన అధికారులు అర గంటలో మమ అనిపించిన వైనం -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నాం. వర్షా కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దోమల వల్ల విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉంది. సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. ముందు జాగ్రత్త గా దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ప్రాథమిక కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తున్నాం. ఏదైనా సమస్య వస్తే, జ్వరాలు తగ్గని వారికి జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నాం. వ్యాధి నివారణ అనేది మనం తీసుకొనే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. పరిసరాల్లో మురికినీరు లేకుండా చూసుకోవాలి. – డాక్టర్ చంద్రశేఖర్రావు, జిల్లా మలేరియా అధికారి, నంద్యాల ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ ఓపీకి ప్రతిరోజూ 300 నుంచి 400 మంది రోగులు వస్తున్నారు. అందులో సగానికి పైగా జ్వరపీడితులే ఉంటున్నారు. ఎక్కువశాతం జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, జ్వరంతో బాధపడుతున్న వారే ఉన్నారు. సీజనల్గా వచ్చే వైరల్ ఫీవర్లే ఉంటున్నాయి. జ్వరతీవ్రత 102 నుంచి 104 ఫారిన్హీట్ వరకు ఉంటోంది. అవసరమైన వారికి వైద్యనిర్ధారణ పరీక్షలు చేయించి మందులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇందులో రోజూ 10 నుంచి 15 మంది అడ్మిషన్ చేస్తున్నాం. కొందరికి మలేరియా లక్షణాలు కనిపిస్తుండటంతో అందుకు సంబంధించిన వైద్యం అందిస్తున్నాం. –డాక్టర్ కె.సోమప్ప, అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, జీజీహెచ్, కర్నూలు -
ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు దిట్ట
కల్లూరు: ప్రజలను మభ్యపెట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. గురువారం కాటసాని స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలన్నీ అమలు చేయకుండానే అధికారంలోకి వచ్చాక 15 నెలల్లోనే హామీలన్నీ మొత్తం అమలు చేశామని అనంతపురం జిల్లాలో సభలో చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. అధికారంలోకి వచ్చాక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని సభలో ఊదరగొట్టారన్నారు. అయితే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి పథకాల ఊసే లేదన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అందరికీ అందలేదన్నారు. ఉచిత బస్సు పథకం కేవలం కొన్ని బస్సులకే పరిమితం చేశారన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో పేదలందరికీ నాణ్యమైన చదువులు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి పనులు మొదలు పెట్టామన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఆనాడు మేధావులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అయితే ఆ మెడికల్ కళాశాలలపై చంద్రబాబు కుట్ర పన్నుతున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతో పనులన్నీ ఆపి ఏకంగా పది మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. రైతుల పరిస్థితిపై చర్చకు సిద్ధమా..గత వైఎస్సార్సీపీ పాలన, ప్రస్తుత 15 నెలల కూటమి ప్రభుత్వ పానలలో రైతుల పరిస్థితులపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కాటసాని సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ పాలనలో రైతులు ఏనాడు రోడ్లపైకి రాలేదన్నారు. కేవలం 15 నెలల పాలన కాలంలో రైతుల పరిస్థితి ఎలాగుందో రాష్ట్రంలోని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వైఎస్సార్సీపీ అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ఆర్డీవోలకు వినతి పత్రమిచ్చామన్నారు. రైతుల కోసం పోరాటం చేయడం తప్పా? అన్ని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీలో పాల్గొనకుండా నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రైతుల అభ్యున్నతి కోసం ధరల స్థిరీకరణ తీసుకువచ్చి వారికి అండగా నిలిచామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు చిట్టెమ్మ, లక్ష్మీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, నాయకులు అక్కిమి హనుమంతురెడ్డి, కేవీ రమణారెడ్డి, సుంకన్న, శివారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. జగనన్న హయాంలో రైతులు ఏనాడూ రోడ్డెక్కలేదు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దారుణం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
బడి పక్కనే మందు దుకాణం
పగిడ్యాల: గత ప్రభుత్వంలో మద్యం షాపులు ఎక్కడో ఉండేవి. ఈ ప్రభుత్వంలో గుడి,బడి అనే తేడా లేదు. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు కనిపిస్తున్నాయి. కిరాణం, కూల్డ్రింక్షాపుల్లో కూడా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఆదాయం కోసం సామాజిక బాధ్యతను కూటమి సర్కారు విస్మరించడంతో ఊరూరా మద్యం ఏరులై పారుతోంది. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పగిడ్యాల మండలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు ఏకంగా ఆలయాలు, పాఠశాలల వద్దే మద్యం అమ్ముతున్నారు. దాడులు చేయాల్సిన ఎకై ్సజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిండటంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. -
సారా తయారీ మానుకున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి
● నేర సమీక్షా సమావేశంలో ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్కర్నూలు: సారా తయారీ, రవాణా విక్రయాలు మానుకున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూడాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో ఆమె నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. నాటుసారాను సమూలంగా నిర్మూలించడానికి ప్రవేశపెట్టిన నవోదయం 2పై ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా సమీక్షించారు. ఇప్పటికే సారా రహిత గ్రామాలుగా ప్రకటించిన గ్రామాల్లో తిరిగి సారా తయారీ కాకుండా నిఘా ఉంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రెండో విడత బార్లకు దరఖాస్తులు వచ్చేలా చూడండి... నూతన మద్యం బార్ పాలసీలో భాగంగా ఉమ్మడి జిల్లాలో మొదటి రౌండ్లో అనుమతి పొందిన 37 బార్లకు సంబంధించిన వారి చేత రిటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్ కట్టించి బార్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొదటి విడతలో దరఖాస్తులు రాకుండా మిగిలిపోయిన 9 బార్లకు రీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 14వ తేదీ లోపు వాటికి అప్లికేషన్లు వచ్చే విధంగా గట్టిగా కృషి చేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి రాకుండా నిరంతరం తనిఖీలు, దాడులు కొనసాగించాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులు (ఈఎస్) మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడుతో పాటు అన్ని స్టేషన్ల ఇన్స్పెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. -
27 నుంచి బన్ని ఉత్సవాలు
● ముహూర్తం ఖరారు చేసిన పురోహితులు ● అక్టోబర్ 2న మాళ మల్లేశ్వరాస్వామి కల్యాణోత్సవం హొళగుంద: దసరా పండుగ వచ్చిందంటే ఠక్కున గుర్తుకు వచ్చేది దేవరగట్టు శ్రీమాళమల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవం. రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న ఈ ఉత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు బుధవారం నెరణికి గ్రామంలో పురోహితులు ముహూర్తం ఖరారు చేశారు. ఉత్సవాల ఆహ్వాన ప్రతిని ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి, హొళగుంద ఎస్ఐ దిలీప్కుమార్తో కలిసి ఉత్సవ నిర్వాహకులైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు, ఆలయ పూజారులు విడుదల చేశారు. త్వరలోనే కరపత్రాలను ముద్రించి అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు. బన్ని ఉత్సవాల నిర్వహణ ఇలా .. ● ఈనెల 27వ తేదీ శనివారం దేవరగట్టులో మాత మాళమ్మ మల్లేశ్వరునికి కంకణధారణం, నిశ్చితార్థం. ● అక్టోబర్ 2వ తేది గురువారం విజయదశమి రోజున కల్యాణోత్సవం, బన్ని ఉత్సవం, జైత్రయాత్ర. ● 3వ తేది శుక్రవారం భవిష్యవాణి (దైవవాణి) ● 4న శనివారం సాయంత్రం స్వామి వారి రథోత్సవం ● 5న ఆదివారం గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, సాయంత్రం దేవదాసీల క్రీడోత్సవం. ● 6న సోమవారం మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
సొంత ఆదాయ వనరులతో గ్రామాల అభివృద్ధి
కర్నూలు(అర్బన్): గ్రామాల్లో సొంత ఆదాయ వనరులను నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకుంటే గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకోవచ్చని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్లోని డీపీఆర్సీ భవనంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు ‘ సొంత ఆదాయ వనరులు ’ అనే అంశంపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలు కర్నూలు, నంద్యాల జిల్లాలకు వేర్వేరుగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీపీఓ భాస్కర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులైన పన్నులు, పన్నేతరములు, ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆదాయ వనరుల సమీకరణకు సంబంధించి ఉన్న చట్టాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. పంచాయతీల్లో ఖాళీ స్థలాలు ఉంటే వాటిని ఉపయోగంలోకి తీసుకురావడం ద్వారా ఆయా గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు వి.జేమ్స్ కృపావరం, వి.ప్రభాకర్, అస్రఫ్బాషా, పి.జగన్నాథం, డీకే దస్తగిరిబాషా తదితరులు పాల్గొన్నారు. -
క్వింటా ఉల్లి రూ.200
● ఒక్క రైతుకూ జమకాని మద్దతు ధర ‘వ్యత్యాసం’ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా ఉల్లిగడ్డలకు లభిస్తున్న ధర రూ.200 మాత్రమే. ఈ ధరతో అమ్ముకుంటే రైతు పెట్టిన పెట్టుబడి వ్యయంలో 10 శాతం కూడా దక్కని పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం మద్దతు ధర రూ.1200 ప్రకటించింది. వ్యాపారులు క్వింటాకు ఇస్తున్న ధర రూ.200 ఉండగా.. వ్యత్యాసం మొత్తం ప్రభుత్వం ఇస్తుందా అనే విషయమై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 1 నుంచి 3 వరకు మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లిగడ్డలన్నింటినీ మద్దతు ధరతో మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ఇందుకు సంబందించి ఇప్పుడిప్పుడే రైతుల ఖాతాలకు జమ అవుతున్నాయి. 6వ తేదీ నుంచి వ్యాపారులు కొనగా.. మిగిలిపోయిన ఉల్లిని మార్క్ఫెడ్ కొంటోంది. వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఒక దశలో క్వింటా రూ.100 ప్రకారం కూడా కొన్నారు. తర్వాతి నుంచి క్వింటా రూ.200 కనిష్ట ధరతో కొంటున్నారు. మద్దతు ధరలో వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలకు విడుదల చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి వ్యాపారులతో ప్రతి రోజు రెండు విడతలుగా ఈ–నామ్ ద్వారా కొనిపిస్తున్నారు. మద్దతు ధరలో వ్యత్యాసం ఉన్న మొత్తం ఇంతవరకు ఒక్క రైతుకూ విడుదల కాకపోవడం గమనార్హం. నాడు గరిష్టంగా ఇచ్చిన మద్దతు రూ.300 మాత్రమే.. 2016, 2017లో నాటి టీడీపీ ప్రభుత్వం మద్దతు ధర రూ.700 ప్రకటించింది. ఈ ధర కంటే తక్కువ అమ్ముకున్న రైతులకు గరిష్టంగా రూ.300 ఇస్తామని అప్పట్లో ప్రకటించింది. అప్పట్లో రూ.300 లోపు ధరతో అమ్ముకున్న రైతులకు నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపారు. ఈ సారి క్వింటా రూ.100, రూ.200 ధరతో ఉల్లి అమ్ముకున్న రైతులు అనేక మంది ఉన్నారు. వీరికి బ్యాలెన్స్ అమౌంట్ను మార్క్ఫెడ్ ఇస్తుందా అనేది రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతవరకు ఒక్కరికి కూడా బ్యాలెన్స్ మొత్తం పడకపోవడం పట్ల రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లి -
ఆకాశ వీధిలో ఆర్భాటం చేసి.. పాతాళంలో వదిలేసి!
● ట్రయల్ రన్కే పరిమితమైన సీ ప్లేన్ ● విజయవాడ టూ శ్రీశైలానికి ప్రయాణమంటూ సీఎం గొప్పలు ● పది నెలలు గడుస్తున్నా సిద్ధం కాని డీపీఆర్ ● ఇరిగేషన్, అటవీశాఖల అనుమతులపై అనుమానం..?శ్రీశైలంటెంపుల్: ‘దట్టమైన నల్లమల అటవీ మధ్యలో ప్రవహించే కృష్ణమ్మ పరవళ్లపై ప్లేన్లో ప్రయాణించి మధురానుభూతి పొందే అవకాశం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా విజయవాడ నుంచి శ్రీశైలానికి తక్కువ సమయంలో వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఏపీని టూరిజం హబ్గా మారుస్తాం’ అంటూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీశైలంలో సీ ప్లేన్ ట్రయరల్ రన్ వేళ అన్న మాటలు. ఇక సీన్ కట్ చేస్తే.. సీప్లేన్ ట్రయల్రన్ చేపట్టి ఇప్పటికి పది నెలలు గడుస్తోంది. ఇంకా సర్వేలు, సమీక్షలకే అధికారులు పరిమితమయ్యారు. ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాకపోవడంతో సీప్లేన్ ప్రయాణం మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది. సీఎం ప్రచార ఆర్భాటానికే సీప్లేన్ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చి ట్రయల్రన్ చేసి వదిలేశారని, ఆచరణ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మల్లన్న భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం టూరిజం అభివృద్ధిలో భాగంగా శ్రీశైలానికి గతేడాది నవంబరు 9న సీప్లేన్ ట్రయల్రన్ చేపట్టారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్నాయుడు, టూరిజం శాఖ మంత్రి దుర్గేశ్ తదితరులు విజయవాడ పున్నమి ఘాట్ నుంచి సీప్లేన్లో శ్రీశైలం పాతాళగంగకు చేరుకున్నారు. సీప్లేన్ ప్రారంభమైతే విజయవాడ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగ ళూర్ తదితర రాష్ట్రాల నుంచి సైతం సీప్లేన్ నడిపేందుకు అవకాశం ఉందని అప్పట్లో పాలకులు, పర్యాటక అధికారులు ప్రకటించారు. భక్తులు, పర్యాటకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వారాంతపు సెలవులు ఉంటే ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా సీప్లేన్ ద్వారా త్వరగా వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని త్వరగా వెళ్లే అవకాశం ఉండేదని భావించారు. అయితే పది నెలలుగా గడుస్తున్నా ట్రయల్ రన్కు పరిమితం కావడంతో కూటమి ప్రభుత్వానికి ప్రారంభంలో హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం సర్వ సాధారణమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇరిగేషన్, అటవీశాఖ అనుమతులు లభించేనా..? సీప్లేన్ నిర్వహించే ప్రదేశంలో శ్రీశైలం పూర్తిగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఇది పూర్తిగా వన్యప్రాణులు, చిరుతలు, పెద్దపులులు అవాసానికి అనువైన ప్రదేశం. ఇక్కడ సీప్లేన్ సేవలు నిర్వహించాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అలాగే సీప్లేన్ టేక్ ఆఫ్, ల్యాండింగ్కు డ్యామ్ పరిధిలో ఉండటంతో ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతి కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అలాగే ఏవియేషన్, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. కూటమి ప్రభుత్వం విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన అనుమతులు అన్ని తీసుకుని సేవలను అందుబాటులోకి తేవాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. సర్వేలు, సమీక్షలకే పరిమితంవిజయవాడ నుంచి శ్రీశైలానికి వచ్చే సీప్లేన్ ప్రయాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐడీసీ) అధికారులు డిటేల్డ్ ప్రాజెక్టు రిపొర్టు తయారు చేస్తున్నారు. శ్రీశైలంతో పాటు అరకు, లంబసింగి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, గండికోట, నర్సాపూర్, తిరుపతి, ప్రకాశం బ్యారేజ్ మొత్తం 10 ప్రదేశాలలో టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి నాలుగు నెలల క్రితం ఓ ప్రైవేట్ కన్పల్టెన్సీకి నియమించారు. వారు మే నెల నుంచి డీపీఆర్ తయారు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఏపీఐడీసీ అధికారులు వారానికి ఒకసారి సర్వేలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. డీపీఆర్లో సీప్లేన్ ల్యాండ్ అయ్యే ప్రదేశం, సీప్లేన్ టేక్ఆఫ్, టేక్ ఆన్కు నీటిలో సుమారు 1.16 కిలోమీటర్ల పోడవు, 120 మీటర్ల వెడల్పు ఉండే ప్రదేశం, పర్యాటకులు సీప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీల ఏర్పాటు, టికెట్టు ధరలు, ఎన్ని ప్లేన్ సర్వీసులను తిప్పాలి, రోజుకు ఎన్ని ట్రిప్పులు, సీప్లేన్ ల్యాండింగ్ వద్ద పర్యాటకులకు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, టికెట్టు కౌంటర్, సిబ్బంది తదితర పూర్తి వివరాలను డీపీఆర్లో పొందుపరుచనున్నారు. వచ్చే జనవరి నాటికి డీపీఆర్ పూర్తి చేయాలని కన్సల్టెన్సీకి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. -
కాలేజీ ఫీజు కట్టకుండా.. జల్సాలకు ఖర్చు పెట్టి!
● తల్లిదండ్రులకు తెలియడంతో మనస్తాపం ● గూడ్సు కింద పడి బీటెక్ విద్యార్థి బలవన్మరణంజూపాడుబంగ్లా: కుమారుడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడన్న ఆ తల్లిదండ్రుల కల చివరకు విషాదాంతమైంది. చెడు సావాసాలతో చెడు వ్యసనాలు తోడై ఆ యువకుడి ప్రాణాలను బలి తీసుకున్నాయి. కళాశాల ఫీజు జల్సాలకు ఖర్చు పెట్టిన బీటెక్ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్తూరు గ్రామానికి చెందిన రమేష్రెడ్డి, ఉషారాణి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు జగదీశ్వరరెడ్డి (20) తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం విద్య అభ్యసిస్తున్నాడు. రెండేళ్లపాటు బాగా చదువుకున్న యువకుడు తృతీయ ఏడాదిలోకి వచ్చే సరికి చెడు వ్యవసనాలు అలవర్చుకున్నాడు. కాగా ప్రతి నెల రమేష్రెడ్డి తిరుపతికి వెళ్లి కుమారుడి బాగోగులు చూసుకునేవారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండటంతో పదిరోజుల క్రితం ఇంటికి వచ్చిన కొడుకుతో ఫీజు ఇచ్చి పంపించాడు. అయితే ఫీజు కట్టలేదని కళాశాల నుంచి ఫోన్ రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన తిరుపతికి వెళ్లి కుమారుడిని విచారించారు. ఫీజు డబ్బులు ఖర్చు అయ్యాయని చెప్పినా.. వారు కుమారుడిని ఏమనకుండా త్వరలో ఫీజు చెల్లిద్దామని నచ్చజెప్పారు. తమతో పాటు ఊరికి రావాలని చెప్పగా.. ‘పని ఉంది మీరు వెళ్లండి నేను వెనుకాలే వస్తా’ అంటూ చెప్పడంతో వారు మంగళవారం గ్రామానికి చేరుకున్నారు. కాగా కుమారుడు ఇంకా రాకపోవడంతో ఆందోళన చెందుతుండగా తమ కుమారుడు ఇక లేడని సమాచారం అందింది. బుధవారం తెల్లవారుజామున నంద్యాల రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
మంత్రి కక్ష సాధింపు చర్యలు తగవు
● శిల్పా సేవా సమితి సేవలు అడ్డుకునే కుట్ర ● నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డిబొమ్మలసత్రం: నియోజకవర్గంలో పేదలకు సేవలు అందిస్తున్న శిల్పా సేవా సమితిపై మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకి షోర్రెడ్డి విమర్శించారు. శిల్పా మహిళా బ్యాంక్ ద్వారా 138 మందికి రూ. 21.84 లక్షల రుణాలు మంజూరు కాగా బుధవారం స్థానిక శిల్పాసేవాసమితి కార్యాలయంలో ఆయన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కొన్నేళ్లుగా శిల్పా సేవాసమితి ద్వారా శిల్పా మినరల్ వాటర్, శిల్పా సూపర్ మార్కెట్, శిల్పా మహిళా బ్యాంక్, శిల్పా స్కిల్ డెవలప్మెంట్లాంటి.. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈసేవా కార్యక్రమాలు అధికారంలో ఉన్నా.. లేకున్నా తాము కొనసాగిస్తూనే వచ్చామన్నారు. ప్రస్తుతం నంద్యాల ఎమ్యెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగుతున్న ఎన్ఎండీ ఫరూక్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ శిల్పా సేవాసమితి చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోవాలనుకోవడం తగదన్నారు. సేవా కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలలో అన్ని రకాల సేవలు ఖాళీ చేయించాలనే దుర్ద్దేశంతో తమపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. ప్రథమ నందీశ్వరస్వామి దేవాలయ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో పేదలకు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు చేసుకునేందుకు శిల్పా సేవా సమితి ద్వారా ఫంక్షన్ హాల్ నిర్మించామన్నారు. అయితే ఇది జీర్జించుకోలేని కూటమి నేతలు కల్యాణ మండపాన్ని అడ్డుకున్నారన్నారు. సేవా కార్యక్రమాలను కూటమి నేతలు అడ్డుకుంటే తమకు ఎలాంటి నష్టం జరగదని పేద ప్రజలు నష్టపోతారన్నారు. శిల్పా మినరల్ వాటర్ప్లాంట్లు దాదాపు 40కి పైగా ఉన్నాయని వాటిని ఖాళీ చేస్తే ప్రజలకు తాగేందుకు తీవ్ర ఇబ్బంది నెలకొంటుందని వివరించారు. తమ సేవా కార్యక్రమాలను అడ్డుకునే కూటమి నేతలే సొంత ఖర్చుతో కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ సరిలీలా తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి అవకాశాలకు ప్రణాళికలు రూపొందించండి
నంద్యాల: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ (జిల్లా నైపుణ్యాభివృద్ధి) కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఆసక్తి ఉన్న రంగా ల్లో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశా లు కల్పించే దిశగా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే కోర్సులను గుర్తించి శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లాలోని పెద్ద పెద్ద పరిశ్రమలను సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులను తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ ిపీడీ శ్రీధర్ రెడ్డి, జీఎం ఇండస్ట్రియల్. ఐటీడీ ఏఏపిఓ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ సీడ్ ఆప్ సిబ్బంది పాల్గొన్నారు. -
సర్.. నా భార్య శశిరేఖ కనిపించడం లేదు..!
నంద్యాల జిల్లా: మండల పరిదిలోని కానాల గ్రామానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైంది. సంజామల ఎస్ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు..కానాల గ్రామానికి చెందిన సోము భాస్కర్రెడ్డి కుమార్తె సోము శశిరేఖకు నంద్యాలకు చెందిన శ్రీహరి రెడ్డితో 2023 సంవత్సరంలో వివాహమైంది. భార్యాభర్తల వ్యక్తిగత గొడవల కారణంగా సోము శశిరేఖ పెళ్లి అయిన కొన్ని నెలలకే తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత వారి నుంచి కూడా బయటకు వెళ్లిపోయింది. అయితే, తన భార్య కనిపించడం లేదని శ్రీహరి రెడ్డి మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అడుగడుగునా ఆంక్షలు
అన్నదాత పోరు విజయవంతం అవుతుందని భయపడిన కూటమి నేతలు పోలీసులతో అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని రైతులు తిప్పికొట్టారు. 30 యాక్ట్ అమలు చేసి ర్యాలీలను అడ్డుకోవాలని చూసింది. డోన్లో అధిక వాహనాలతో వెళ్లరాదని, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించరాదని పోలీసులు షరతులు విధించారు. కేవలం 20 మందికి మాత్రమే ఆర్టీఓకు వినతి ప్రతం ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభు త్వం అన్నదాత పోరు ఆందోళనను అణిచివేసేందుకు ఎన్ని ఆంక్షలు విధించినా అన్నదాతలు కదలివచ్చారు. డోన్, బనగానపల్లె ప్రాంతాల నుంచి భారీగా రైతులు తరలివచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని పోలీసులు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం గమనార్హం. వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’లో గర్జించిన రైతులు -
ఉల్లి కొనుగోళ్లు అంతంతే!
మార్కెట్కు 14,325 క్వింటాళ్లు ● వ్యాపారులు కొనింది 6,749 క్వింటాళ్లు మాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి అమ్మకాల కోసం రైతులు వ్యాపారులు లేదా మార్క్ఫెడ్ అధికారుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. మంగళవారం మార్కెట్ యార్డుకు 14,325 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. రెండు విడతలుగా వ్యాపారులతో ఈ–నామ్లో టెండ ర్లు వేయించినప్పటికీ 6,749 క్వింటాళ్లు మా త్రమే కొనుగోలు చేశారు. క్వింటాకు కనిష్టంగా రూ200, గరిష్టంగా రూ.1139 ధర పలికి ంది. రూ.1000 పైన ధర కేవలం నాలుగైదు లాట్లకు మాత్రమే లభించగా.. మిగిలిన లాట్లకు రూ.600–రూ.700 మాత్రమే ధర లభించింది. రైతులు తెచ్చిన ఉల్లిలో 7,576 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్లోనే ఉండిపోవడం గమనార్హం. ఈ సరుకు మార్క్ఫెడ్ కొంటుందా లేదా అనే విషయమై సాయంత్రం 7 గంటల వరకు స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్బాషా, జేసీ నవ్య, ఎస్పీ విక్రాంత్పాటిల్ సాయంత్రం మార్కె ట్ యార్డుకు చేరుకున్నారు. ఉల్లిగడ్డల నాణ్యతను పరిశీలించారు. ఎట్టకేలకు మిగిలిపోయిన ఉల్లిగడ్డలను కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్కు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ వెంట మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు, డీడీ లావణ్య, ఏడీఎం నారాయణ మూర్తి, సెక్రటరీ జయలక్ష్మి తదితరులు ఉ న్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వం రూ.1200 మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో ఉల్లిగడ్డలు రీసైక్లింగ్ జరుగుతున్నాయేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పరిశీలనకు జిల్లా యంత్రాంగం ఐదుగురు ఉద్యాన అధికారులతో ప్రత్యేక టీమ్ ఏర్పా టు చేసింది. ఇకపోతే బుధవారం మార్కెట్లో ఉల్లిగడ్డలను అమ్మకానికి పెట్టేందుకు మంగళవారం సాయంత్రం నుంచి ట్రాక్టర్లు వస్తున్నాయి. అయితే లోపల ఖాళీ లేకపోవడంతో వచ్చిన వాహనాలన్నిటినీ బయటనే నిలిపేయంతో ట్రాఫిక్ స్తంభించింది. -
నేటి నుంచి బేతంచెర్లలో ఆగనున్న ‘కొండవీడు’
బేతంచెర్ల: మచిలీపట్నం – యశ్వంతపూర్ మధ్య నడిచే కొండవీడు ఎక్స్ప్రెస్ బుధవారం నుంచి బేతంచెర్ల రైల్వే స్టేషన్లో ఆగనుంది. కరోనా సమయంలో తీసేసిన స్టాపేజ్ను పునురుద్ధరించారు. మచిలీపట్నం నుంచి యశ్వంత్పూర్కు వెళ్లే రైలు (17211) బేతంచెర్లలో బుధవారం రాత్రి 12.34 గంటలకు ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో అదే రైలు (యశ్వంత్పూర్ – మచిలీపట్నం 17212) 11వ తేదీ నుంచి రాత్రి 9.19 గంటలకు ఆగుతుంది. బేతంచెర్లలో స్టాపేజ్ పునురుద్ధరించంతో విజయవాడ – బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులు సౌకర్యవంతంగా ఉండనుంది. ఇందుకు కృషి చేసిన ఎంపీ బైరెడ్డి శబరికి బేతంచెర్ల ప్రజలు, ప్రజా సంఘాలు వ్యాపార, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు కృత్ఞతలు తెలిపారు. శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 208.2841 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 883.70 అడుగులకు చేరుకుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు జలాశయానికి 1,30,011 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. రేడియల్ క్రస్ట్గేట్లను మూసివేసినప్పటికీ జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 1,61,680 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 55,355 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి అనంతరం 69,901 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 32,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,824 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపో తలకు 1,600 క్యూసెక్కుల నీటిని వదిలారు. తనయుడి బ్రహ్మోత్సవాలకు తండ్రి తరఫున పట్టువస్త్రాలు మహానంది: కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మహానంది దేవస్థానం తరపున మంగళవారం పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ మేరకు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు, వేదపండితులు కాణిపాకం క్షేత్రానికి చేరుకుని సంప్రదాయ బద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. గత కొన్నేళ్లుగా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పట్టు వస్త్రాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది. పట్టువస్త్రాలను సమర్పించిన మహానంది ఈఓ, పండితులు, అర్చకులు, సిబ్బందిని కాణిపాకం ఆలయ అధికారులు, పండితులు సన్మానించి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించారు. ఎయిడ్స్ నివారణకు కృషి చేయాలి గోస్పాడు: ఎయిడ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఏపీఎస్ఏసీఎస్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ) తరపున, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు, విద్యాశాఖ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, 108, ఎన్జీఓస్ సహకారంతో ఎయిడ్స్ నివారణ అవగాహన కార్యక్రమంలో భాగంగా యూత్ ఫెస్ట్ 2025 మరథాన్ 5 కి.మీ రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎయిడ్స్ పట్ల యువత అప్రమ త్తంగా ఉండాలన్నారు. సమాజంలో యువత భా గస్వామి అయి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెడ్రన్లో పురుషుల విభాగంలో విజయరాజు మొదటి బహుమతి సాధించగా సురేష్నాయుడు రెండో బహుమతి, మహిళల విభాగంలో అనూష మొదటి బహుమతి, ప్రసన్న రెండో బహుమతి, ట్రాన్స్జెండర్లో శ్రీలేఖ మొదటి బహుమతి, వినీత్గౌడ రెండో బహుమతి సాధించగా బహుమతులు అందజేశారు. -
ఉన్నది ఒకటే జిందగీ!
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదో ఒక చోట వ్యక్తులు ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు చేస్తూనే ఉన్నారు. బలవంతంగా తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రతి నెలా 30 నుంచి 40 మంది దాకా బలవంతంగా తనువు చాలిస్తున్నారు. ఇందులో పలువురు వివిధ కారణాలతో క్షణికావేశంతో ఆయువు తీసుకుంటున్నారు. మిగిలిన వారు ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్, మానసిక సమస్యలు, ఆర్థిక కారణాలు, కుటుంబ సమస్యలు ఉంటున్నాయి. ఇలాంటి వారికి సమయానికి చెప్పే వారు లేకపోవడమే కారణం. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, చిన్నకుటుంబాలు ఏర్పడటం, వారికి ఏ చిన్న సమస్య వచ్చినా సర్ది చెప్పేవారు లేకపోవడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, పిల్లలకు మంచి విషయాలు చెప్పేవారు లేకపోవడం, సోషల్ మీడియా, సినిమాలు, టీవీ సీరియళ్లు మొదలైన అంశాలు ఆత్మహత్యలు పెరిగేందుకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆత్మహత్యతో మరణించే వారిలో ఎక్కువ మంది మానసిక ఆరోగ్య సమస్యలైన డిప్రెషన్, మత్తు–మద్యం వినియోగ రుగ్మత ఉన్న వారు, సైకోసిస్, పర్సనాలిటి డిసార్డర్స్ ఉన్నవారు ఉన్నారు. వీరితో పాటు ఆర్థిక సంక్షోభం, సంబంధాల వైఫల్యాలు, అవమానం, సన్నిహిత కుటుంబ సభ్యుడి మరణం, తీవ్రమైన అనారోగ్యం ఇవన్నీ ఆత్మహత్య దోరణిని పెంచుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.ఆత్మహత్యలు వద్దు..బతికి సాధిద్దాంచాలావరకు ఆత్మహత్యలు మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పరీక్షల్లో ఫెయిల్ కావడం, సంక్షోభాలు, జబ్బు నయం కాదనే భయంతోనే జరుగుతుంటాయి. కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టినా తట్టుకోలేరు. ఆత్మహత్య ఆలోచన వచ్చిన వారు టెలిమానస్ 144169 అనే టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే వారు అలాంటి వారికి కౌన్సిలింగ్ చేసి ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనల నుంచి దూరం చేస్తారు.–డాక్టర్ ఎం. శివశంకర్రెడ్డి, మానసిక వైద్యులు, కర్నూలుఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో 90 శాతం క్షణికావేశంతో చేసుకునేవే ఉంటున్నాయి. కారణాలేవైనా ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారి పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉంటే చాలు నిరోధించవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారి మానసిక సమస్యలు తెలుసుకుని, వారిలో ఆత్మహత్యకు సిద్ధమైన వారు ఉంటే అలాంటి వారిని ముందే గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించి అవసరమైన మందులు అందిస్తున్నాము.–డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, మానసిక వైద్యవిభాగాధిపతి, జీజీహెచ్, కర్నూలు -
ప్రయాణికులకు విజ్ఞప్తి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటన ప్రయాణికులకు శాపంగా మారింది. సీఎం పర్యటనకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు కేటాయించారు. అన్ని రకాల సర్వీసులు కలుపుకొని మొత్తం 410 ఉండగా ఇందులో 280కు పైగా బస్సులు సీఎం టూర్కు వేశారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచే వివిధ రూట్లకు ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నంద్యాల, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, కర్నూలు, తాడిపత్రి, తదితర ప్రధాన రూట్లకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సులు లేకపోవడంతో మహిళలు , చిన్నపిల్లలు, వృద్ధులు, విద్యార్థులు గంటల తరబడి వేచి ఉన్నారు. చివరకు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే సీఎం పర్యటన సందర్భంగా బుధవారం రాత్రి వరకు వివిధ రూట్లలో బస్సు సర్వీసులు రద్దు చేశామని.. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఏకంగా అధికారులు కోవెలకుంట్ల బస్టాండ్లో నోటీస్బోర్డు అతికించడం గమనార్హం. – సాక్షి నెట్ వర్క్ -
పనిమనిషే హంతకురాలు
● శివలీల హత్య కేసును ఛేదించిన పోలీసులు ● సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తింపు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ కర్నూలు : వృద్ధురాలు కాటసాని శివలీలను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న సొత్తులను తస్కరించిన నిందితురాలిని సీసీ కెమెరాలు పట్టించాయి. గణేష్ నగర్ పక్కనున్న (కల్లూరు అర్బన్ 19వ వార్డు) సాయి వైభవ నగర్లో నివాసముంటున్న శివలీల (75) ఈనెల 1వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. మూడో పట్టణ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారం రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శివలీలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను తస్కరించి పరారయ్యారు. ఈ మేరకు అల్లుడు చంద్రశేఖర్రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా శివలీల ఇంట్లో పనిమనిషిగా ఉన్న కురువ వరలక్ష్మి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా గుర్తించారు. కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామంలో ఆమె అక్క ఇంట్లో తలదాచుకుని ఉన్నట్లు ఫోన్కాల్ డేటా ఆధారంగా నిర్ధారించుకుని అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకుని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎదుట హాజరుపరిచారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శేషయ్య, చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయతో కలసి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు. హత్య చేసి తాపీగా గోడ దూకి... ప్యాపిలి మండలం గోపాల నగరం (గోపాల పురం) గ్రామానికి చెందిన వరలక్ష్మి ఉపాధి నిమిత్తం వలస వచ్చి కర్నూలులో నివాసముంటున్నారు. రెండు నెలల క్రితం కాటసాని శివలీల ఇంట్లో పనిమనిషిగా చేరింది. హత్యకు రెండు రోజుల ముందు పని మానేసింది. ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లి స్థిరపడాలని పథకం పన్నింది. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీన స్వగ్రామం గోపాలపురంలో వరలక్ష్మి వితంతు పెన్షన్ తీసుకుని అక్కడి నుంచి డోన్ మీదుగా కర్నూలు వచ్చి గుత్తి పెట్రోల్ బంకు దగ్గర బస్సు దిగి అక్కడినుంచి ఆటోలో రైతుబజార్ మీదుగా శివలీల ఇంటి వద్దకు చేరుకుంది. ముఖానికి స్కార్ప్(బట్ట) కట్టుకుని శివలీల ఇంట్లోకి ప్రవేశించి మళ్లీ పనికి వస్తానమ్మా.. అంటూ మాటల్లో పెట్టి సమీపంలో ఉన్న రోకలి బండతో తలపై కొట్టింది. దీంతో ఆమె రక్తపు మడుగులో పడిపోగా మెడలో ఉన్న 6 తులాల బంగారు గొలుసు, 5 తులాల గాజులు, బెడ్ రూమ్లో ఉన్న రెండు బ్యాగులను తీసుకుని బయటకు వచ్చి ఇంటి వెనుక బాత్రూమ్ పక్కనుంచి కాంపౌండ్ వాల్ దూకి పారిపోయింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా నిందితురాలు పనిమనిషి అయిన కురువ వరలక్ష్మినే అని తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బంగారు నగల కోసమే హత్య చేసినట్లు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి బంగారు నగలు, 6 చెక్బుక్లు, 7 బ్యాంకు పాస్ బుక్కులు, నేరానికి ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కేసును ఛేదించిన దర్యాప్తు అధికారులతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. -
పండ్లతోటల అభివృద్ధిపై దృష్టి సారించండి
● సాంకేతిక సహాయకులకు డ్వామా పీడీ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పండ్లతోటల తోటల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య జాతీయ ఉపాధి హామీ పథకానికి చెందిన సాంకేతిక సహాయకులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో పత్తికొండ, ఆదోని, ఆలూరు క్లస్టర్ల పరిధిలోని సాంకేతిక సహాయ సహాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పీడీ మండలాల వారీగా పండ్లతోటల టార్గెట్ ఎంత.. ఇప్పటి వరకు సాధించిన ప్రగతి తదితర వాటిపై సమీక్షించారు. వివిధ మండలాల్లో పురోగతి తక్కువగా ఉండటంతో సంబంధిత టీఏలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ఏడాది 4500 ఎకరాల్లో ఉపాధి నిధులతో వందశాతం సబ్సిడీతో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 4220 ఎకరాలకు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఈ నెల చివరిలోపు లక్ష్యం మేరకు ప్లాంటేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఫాంపాండ్స్ తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో ఏపీడీలు లక్ష్మన్న, క్రిష్ణమోహన్, ప్లాంటేషన్ మేనేజర్ నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
● కష్టమంతా జీవాలకు మేత!
గోనెగండ్ల: ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లిపంటకు ధర లేకపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు చేతికి వచ్చిన పంటను పొలాల్లోనే వదులుతున్నారు. మండల కేంద్రం గోనెగండ్లకు చెందిన చాకలి బ్రహ్మయ్య అనే రైతు ఎన్నో ఆశలతో 2.50 ఎకరాల్లో ఉల్లి సాగుచేశాడు. రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంట చేతికి వచ్చేసరికి క్వింటం ధర రూ.500 నుంచి రూ.600 పలుకుతుంది. ఈ ధరకు కూలీల ఖర్చు కూడా రాదని భావించి పంట కోయకుండా మంగళవారం గొర్రెలకు మేతగా వదిలాడు. తమ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. -
అమ్మానాన్నలు దూరమై..
ఆస్పరి: తండ్రి హత్యకు గుర య్యాడు..తల్లి జైలుకెళ్లింది. అభం శుభం తెలియని పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇంటికి వచ్చిపోయే వారిని ఆ పిల్ల లు తదేకంగా చూస్తూ ఉన్నారు. మండలంలోని తొగలుగల్లు గ్రామంలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక దృశ్యం అందరినీ కలచివేస్తోంది. ఈనెల 3వ తేదీన తొగలుగల్లు గ్రామానికి చెందిన అహోబిలం (33) అనే వ్యక్తిని తోడుగా ఉండాల్సిన భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే, మృతుడికి 7ఏళ్ల కుమారుడు భరత్ గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. 5 ఏళ్ల వర్షిణి అనే కుమార్తె అంగన్వాడీ కేంద్రంలో చదువుతుంది. తండ్రిని హత్య చేసిన కేసులో తల్లి గంగావతి జైలుకెళ్లింది. కన్నతల్లిదండ్రులు దూరమై దిక్కులు చూస్తున్న పిల్లల భవిష్యతును తలుచుకొని నాయనమ్మ హనుమంతమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఇసుక దోపిడీని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా ఆదోని అర్బన్: తన నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దోపిడీని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలో ఇసుక తోలే టిప్పర్ల ఓనర్లు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ఇసుక దోపిడీని ఆపాలని ఇదివరకే సబ్కలెక్టర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశానన్నారు. -
పేదల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలి
కర్నూలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత ఉన్న పేదవారికి చేరవేసి ప్రయోజనం కల్పించే దిశగా ఎన్జీఓలు (స్వచ్ఛంద సంఘాలు) పనిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు న్యాయ సేవా సదన్లో ఉమ్మడి జిల్లా ఎన్జీఓలకు సెన్సిటైజేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎడ్యుకేషన్, చైల్డ్ వెల్ఫేర్, డిజబిలిటీ, పోలీసు శాఖలకు సంబంధించిన అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు, చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు, అక్రమ రవాణా బాధితులు, ట్రాన్జెండర్స్, గిరిజనులు, అసంఘటిత కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేసే ఎన్జీఓలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సెన్సిటైజేషన్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసినట్లు లీలా వెంకటశేషాద్రి తెలిపారు. పేదలు, ప్రభుత్వ శాఖల మధ్య అనుసంధానకర్తలుగా ఎన్జీవోలు ఉండాలని కోరారు. సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ రయీస్ ఫాతిమా మాట్లాడుతూ తమ శాఖ ద్వారా సీనియర్ సిటిజన్లకు, ట్రాన్స్జెండర్లకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ మాట్లాడుతూ పేద పిల్లలను గుర్తించి, స్కూళ్లలో చేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాల మండల విద్యాశాఖ అధికారులు కర్నూలు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారదా, స్వచ్ఛంద సంఘాల నిర్వాహకులు సుధారాణి, డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, బచ్చన్ బచావో ఆందోళన్ మౌనిక, నారాయణ, రామాంజినేయులు, విజయ, సుబ్బరాయుడు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
భార్యను హత్య చేసిన భర్త
నంద్యాల: కుటుంబ కలహాలతో భార్యను భర్తే గొంతు కోసి చంపాడు. ఈ దారుణ ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్బాషా తెలిపిన మేరకు వివరాలు.. సాయినాథ్శర్మ, శిరీష దంపతులు పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు గత కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కూతురు శ్రీహిత స్థానికంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే, భార్య శిరీష (45) బయట అప్పులు చేయడం..ఈ కారణంతో రుణదాతలు తరచుగా ఇంటికి వస్తున్నారు. దీంతో ఆగ్రహించిన సాయినాథ్శర్మ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో కత్తితో భార్య గొంతు కోసి హత్య చేశారు. ఈమేరకు కుమార్తె శ్రీహిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
దివ్యాంగుల కడుపుకొట్టొద్దు
నంద్యాల(న్యూటౌన్): దివ్యాంగుల వైకల్య శాతం తగ్గించి కడుపుకొట్టొద్దు అని డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్వలి, వికలాంగుల ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు మరియదాసులు అన్నారు. కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల వైకల్య శాతం తగ్గించి పింఛన్లు తీసేయడాన్ని నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పుట్టుకతోనే దివ్యాంగులైన వారికి వయస్సు రీత్యా వైకల్య శాతం మరింత పెరుగుతుందన్నారు. 2009 నుంచి 2019 వరకు ప్రభుత్వం సదరన్ సర్టిఫికెట్లు మంజూరు చేసి స్లాబ్ సిస్టమ్ను ఏర్పాటు చేసిందన్నారు. రీ వెరిఫికేషన్లో కొందరు వైద్యులకు అవగాహన లేకపోవడంతో ఎంతో మంది పింఛన్ కోల్పోయే ప్రమాదం ఏర్పండిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాలు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు, రాజ్యాంగం కల్పించిన మౌలిక వసతులు, విద్యా, వైద్యం, ఉపాధి, రక్షణ తదితరరంగాల్లో అవకాశాలను పొందలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జేసీ విష్ణుచరణ్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం మహిళా అధ్యక్షురాలు శివనాగమ్మ, అధ్యక్షులు అబ్దుల్, సభ్యులు ఖాదర్బాషా, గోపాల్, ఎల్లయ్య, సత్తార్బాషా, లింగమ్మ, ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైల ఆలయంలో సంప్రోక్షణ
శ్రీశైలం టెంపుల్: చంద్రగ్రహణం పూర్తవడంతో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు శ్రీశైల ఆలయ ఉభయ దేవాలయాల ప్రధాన ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి చేశారు. అనంతరం అర్చకులు, వేదపండితులు సంప్రోక్షణ నిర్వహించారు. 7.30 గంటల నుంచి భక్తులను స్వామి వారి దర్శనాలకు అనుమతించారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు మధ్యాహ్నం 2.15 గంటల నుంచి స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా పీపీ మధుబొమ్మలసత్రం: ప్రొద్దు టూరు, డోన్ నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్య దర్శిగా పీపీ మధుసూదన్రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలానికి చెందిన పీపీ నాగిరెడ్డి సోదరుని కుమారుడు పీపీ మధుసూదన్రెడ్డి పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో ఆయనకు ప్రొద్దుటూరు, డోన్ నియోజకవర్గాలకు సంబంధించి రీజినల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుల సహాయకారిడిగా వ్యవహరించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.నాణ్యమైన విద్యుత్ అందించాలినంద్యాల(అర్బన్): వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్రావు అన్నారు. ఎక్కడైనా విద్యుత్ సమస్య ఏర్పడితే అందుకు లైన్ ఇన్స్పెక్టర్లదే బాధ్యత అన్నారు. ఆ తర్వాత సంబంధిత ఏఈ బాధ్యునిగా చేర్చుతామన్నారు. ఈ విషయంలో ఎక్కడ రాజీ పడేదే లేదన్నారు. నంద్యాలలోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జిల్లా స్థాయి విద్యుత్ అధికారులు, సిబ్బందితో విద్యుత్ వినియోగంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యల పరిష్కారం, వినియోగదారులకు సిబ్బంది అందుబాటులో ఉండటంపై నిర్వహించిన సర్వేలో జిల్లాకు 68 శాతం మంది మాత్రమే ఆమోదం తెలిపారన్నారు. దీనిని 90 శాతానికి పెంచేలా చూడాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటులో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఎస్ఈ సుధాకర్కుమార్, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరు, డోన్ ఈఈలతో పాటు ఏడీలు, ఏఈలు, లైన్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.హిజ్రాలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనంద్యాల(అర్బన్): స్వయం ఉపాధి, నైపుణ్యం అభివృద్ధి రాణించేందుకు హిజ్రాలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు రయిన్ ఫాతిమా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ సెంచరీ, సాఫ్ట్వేర్ సెల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ఇంటర్మీడియెట్ లెవెల్ కోర్స్ల్లో ఆప్టిట్యూట్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ పబ్లిక్ స్పీకింగ్, ప్రాక్టిస్ టెస్టులు ఉంటాయన్నారు. డిగ్రీ లెవెల్ కోర్స్ల్లో అడ్వాన్స్ అప్టిట్యూడ్, న్యూస్ పేపర్ అనాలసిస్ట్, కంప్యూటర్ ప్రావీణ్యాలు ఉంటాయన్నారు. జిల్లాలోని హిజ్రాలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 08518–277864ను సంప్రదించాలన్నారు. -
ఎన్ని ఎకరాలు ఉన్నా మూడు బస్తాలే
ఎకరా ఉన్న రైతుకు బస్తా, ఐదెకరాల లోపు ఉన్న రైతులకు మూడు బస్తాలు..అంత కంటే ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక రైతుకు 3 బస్తాలకు మించి యూరియా ఇవ్వకూడదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు చాలా చోట్ల రైతుకు 10 నుంచి 20 యూరియా బస్తాల చొప్పున పంపిణీ చేసుకున్నారు. రైతు సేవా కేంద్రాల వద్దకు వాహనం రాకుండానే మధ్యలోనే టీడీపీ నాయకులు వాటిని పంచుకున్న సంఘటన గోస్పాడు మండలం పసురపాడులో చోటు చేసుకుంది. అధికారులు దగ్గరుండి రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా పంపిణీ చేయాల్సి ఉంది. కాగా టీడీపీ నాయకులు తమ వారికి అయితే ఒకే అంటూ అధికారులకు చెబుతూ వారి కార్యకర్తలు, అనుచరులకే యూరియా బస్తాలు పంపిణీ చేయించుకుంటుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అనుచరులకు 20 బస్తాల వరకు దక్కినట్లు తెలుస్తోంది. -
పోలీసుల పహారాలో..
జిల్లాలో రైతులు అధికంగా వరిపంట సాగు చేస్తారు. ఈ ఖరీఫ్ సీజన్లో 58,251 హెక్టార్లలో వరిపంట సాగు చేశారు. పంట ఎదిగి చేతికి రావాలంటే రైతులు అధికంగా యూరియా వాడతారు. గత ప్రభుత్వంలో యూరియా కోసం ఎప్పుడూ రైతులు రోడ్డెక్కలేదు. గ్రామంలోనే యూరియా దొరికేది. ప్రస్తుతం ఒక్క యూరియా బస్తా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పాసు పుస్తకాలు పట్టుకొని క్యూలైన్లలో నిలబడుతున్నా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా ఆదిలోనే అందించకపోతే పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. రైతులు రోజుల తరబడి యూరియా కోసం వేచి చూడాల్సి వస్తోంది. టీడీపీకి చెందిన వారికి అయితే ఎన్ని బస్తాలు అయినా ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రైవేటు డీలర్ల వద్దకు యూరియా కోసం వెళితే కాంప్లెక్స్ ఎరువులు కొనాలని బలవంతం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
● ఎస్పీని ఆశ్రయించిన బాధితుడునంద్యాల: హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సంఘ తమిళ, సుల్తాన్ ఖాన్ అనే వ్యక్తులు రూ. 6 లక్షలు తీసుకుని మోసం చేశారని, డబ్బు తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని శిరివెళ్ల గ్రామానికి చెందిన డక్క నడిపి చింతలన్న జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అలాగే నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన షేక్ ఖాజా అనే వ్యక్తి రూ.3.30 లక్షలు తీసుకొని ఇవ్వడం లేదని, అడిగితే దుర్భాషలాడుతూ చంపుతానని బెదిరిస్తున్నాడని వృద్ధురాలు అదే గ్రామానికి చెన్నమ్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యా దులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, గడువులోగా పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు వంటి వినతులు 128 వచ్చాయని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. -
ముస్లింలకు కూటమి వెన్నుపోటు
ర్యాలీ నిర్వహిస్తున్న మైనార్టీ నేతలు, మత పెద్దలు, జేసీ విష్ణుచరణ్కు వినతి పత్రం అందిస్తున్న ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మైనార్టీ నేతలుబొమ్మలసత్రం: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచిందని ఎమ్మెల్సీ ఇసాక్బాషా విమర్శించారు. ఇమామ్, మౌజాన్లకు కూటమి ప్రభుత్వం గత 11 నెలలుగా గౌరవవేతనం చెల్లించని నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్కు సోమవారం వినతిపత్రం అందించారు. స్థానిక ఉదయానంద హోటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు. జేసీకి వినతి పత్రం అందించిన అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలకు చేసిందేమి లేదన్నారు. పరమపవిత్రంగా భావించి ఇమామ్, మౌజాన్ల గౌరవ వేతనాలు కూడా ప్రభుత్వం ఇంత వరకూ చెల్లించిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల సమయంలో ఒక్కో మసీదుకు నిర్వాహణకు రూ. 5 వేలు ఇస్తామని, ఖబరస్తాన్, ఈద్గాలు నిర్మిస్తామని, విజయవాడలో హజ్ హౌస్కు స్థలం కేటాయిస్తామని.. ఇలా ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసేలేదన్నారు. షాదీఖానాకు దుల్హాన్ పథకం కింద రూ. 1 లక్ష ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారన్నారు. మైనార్టీలు మిమ్మల్ని నమ్మి ఓటేసిన పాపానికి కూటమి నట్టేట ముంచిందన్నారు. ఈ మోసానికి మైనార్టీలు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారని వివరించారు. గుంటూరులో ఒక మసీదుకు చెందిన 213 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమిని కూటమి ప్రభుత్వం కాజేయాలని చూసిందని,. అక్కడ ముస్లింలు తిరగబడటంతో వెనక్కి తగ్గిందన్నారు. కూటమి మెడలు వంచైనా సరే ఇమామ్, మౌజాన్ల గౌరవవేతనాలు అందేలా పోరాడతామన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సముచిత స్థానం ...గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం మైనార్టీలకు పలు సంక్షేమ పథకాలతో పాటు, ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం చెల్లించి సముచిత స్థానం కల్పించారని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా అన్నారు. ప్రార్థనా మందిరాల్లో సేవలందించే మత పెద్దలకు అందించే గౌరవ వేతనంలో కూటమి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించటం బాధాకరమన్నారు. మైనార్టీలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా నెరవేర్చాలని లేదంటే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్సీపీ మైనార్టీ అధ్యక్షులు షబ్బీర్ హుస్సేన్, స్టేట్ మైనార్టీ సెక్రటరీ యూనుస్ బాషా, స్టేట్ జనరల్ సెక్రెటరీ అంజద్ అలీ, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్ ,జిల్లా మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు రసూల్ ఆజాద్, మాజీ రాష్ట్ర మైనార్టీ సలహాదారు హబీబుల్లా, కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, కలామ్, సమ్మద్, బాసిద్, జిల్లా నాయకులు దేవనగర్ బాషా, గన్నీ కరీమ్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
రైతులను వెంటాడుతున్న యూరియా కష్టాలు
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం.. టీడీపీ నేతల బ్లాక్ దందా వెరసి.. జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. విస్తారంగా వర్షాలు పడటంతో వరి, మొక్కజొన్న, మినుము, సోయాచిక్కుడు, మిరప, బెండ, తదితర పంటలు సాగు అయ్యాయి. పంటలకు పైపాటుగా యూరియా వేసుకోవాలని అటు వ్యవసాయాధికారులు, ఇటు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో వైపు వరినాట్లు పూర్తయి 40 రోజులు గడిచాయి. ఈ పరిస్థితుల్లో యూరియా కోసం అన్నదాత పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. డీఏపీ, కాంప్లెక్స్ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. అడపా దడపా ఆర్ఎస్కే, సహకార సొసైటీలకు వస్తున్న యూరియా ఒకటి, రెండు ప్యాకెట్లతో సరిపెడుతుండటంతో ఏ మూలకు సరిపోక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది సరాసరి ఖరీఫ్ సాగు లక్ష్యం 2.01 లక్షల హెక్టార్లు కాగా ఇంత వరకు 1.91 లక్షలు హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుయ్యాయి. కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్బీసీ కాల్వలతో పాటు కుందూ పరీవాహక ప్రాంతాల్లో వరి ప్రధాన పంటగా ఉంది. ఈ ఏడాది 58,251 హెక్టార్లలో వరి సాగు అయ్యింది. ప్రస్తుతం 40 నుంచి 50 రోజుల మధ్య పంట ఉంది. 50 రోజులకు ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇప్పటి వరకు మూడు బస్తాల యూరియా వేయాల్సి ఉంది. జిల్లాలో రైతులకు 44,778 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు ఇప్పటి వరకు జిల్లాకు 26,500 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది.బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్న కూటమి నాయకులు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులను గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేవారు. రైతులకు అవసరమైన ఎరువులను రైతు భరోసా కేంద్రాల్లోని కియోస్క్ మిషన్లో నమోదు చేసుకొని వెంటనే యూరియా తీసుకునేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో బస్తాలను టీడీపీ నాయకులు రైతులకు దొరకకుండా బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ధర ప్రకారం యూరియా బస్తా రూ.266.50 కాగా బ్లాక్ మార్కెట్లో రూ.400 నుంచి 500 వరకు అమ్ముతున్నారు. కూటమి నాయకులే బ్లాక్ మార్కెట్ సృష్టిస్తూ రైతులకు తీవ్రంగా యూరియా కొరత సృష్టిస్తున్నారు. అధికారులు మాత్రం యూరియా కొరత లేదని చెబుతున్నప్పుడు మళ్లీ రైతులు క్యూలైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు నెలకొంటుందో అధికారులే సమాధానం చెప్పాలి.ప్రభుత్వం ఎకరాకు ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తోంది. అది కూడా ఇవ్వడానికి రైతులను అధికారులు క్యూలైన్లలో రోజుల తరబడి నిలబెడుతున్నారు. క్యూలైన్లో నిలుచుంటున్నా దొరకని పరిస్థితి. టీడీపీ నాయకులు చెప్పిన వారికే ఎన్ని కావాలంటే అన్ని బస్తాలు దక్కుతున్నాయి. నిజమైన రైతులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి నెలకొంది.– మధుబాబుగౌడ్, రైతు, కానాల గ్రామం, నంద్యాల(మం)నేను ఐదు ఎకరాల్లో ఆగస్టు మాసంలో వరిపైరు సాగు చేశా. ఒక్క ఎకరాకు మూడు బస్తాల యూరియా వేయాల్సి ఉండగా అధికారులు ఒక బస్తా మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన 9 బస్తాల యూరియాను ప్రైవేటుగా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. రాబోయే కాలంలో మరింత యూరియా అవసరం ఉంది. ఆర్ఎస్కేల ద్వారా అందే పరిస్థితి కనిపించడం లేదు.– సర్వేశ్వరరెడ్డి, గడివేముల, ఆర్లగడ్డ గ్రామంరైతులు భారీగా తరలిరావాలివైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9వ తేదీన జిల్లాలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నంద్యాల, డోన్, ఆత్మకూరు సబ్ డివిజన్ కేంద్రాల్లో రైతులు, వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి వినతి పత్రం అందజేస్తాం. ఎరువులను పక్కదోవ పట్టిస్తూ బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. మంగళవారం ఉదయం బొమ్మలసత్రంని వీ మార్ట్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ ప్రారంభమవుతోంది. ఈ ర్యాలీలో పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి రైతులు భారీగా తరలిరావాలి.– కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, నంద్యాలవైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నేడు నిరసన..జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రైతులకు సరిపడ ఎరువులు అందజేయాలని కోరుతూ ఈనెల 9వ తేదీన మంగళవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు, డోన్ సబ్ డివిజన్లలో ఆర్డీఓ కార్యాలయాల వరకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయంలోని ఆర్డీఓలకు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేయనున్నారు. -
అ‘పూర్వ’సమ్మేళనం
కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆదోని సెంట్రల్: పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 52 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. 1973–1974 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులతు ఆదివారం పాఠశాలలో సమావేశమై అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇక్కడ చదువుకుని ఉరువకొండ మాజీ ఎమ్మెల్యేగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న వై.శివరామిరెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా ఉందని సీపీఎం నాయకులు రామాంజనేయులు, రెహమాన్ తెలిపారు. అనంతరం తమకు చదువు చెప్పిన గురువులు దస్తగిరి, శ్రీనివాసరావు, నాగరాజుతోపాటు ప్రస్తుత పాఠశాల హెచ్ఎం ఫయాజుద్దీన్ను సన్మానించారు. -
ఫిజియోథెరపీ...అంతా హ్యాపీ!
డాక్టర్ ఆపరేషన్ చేసినా...ఆ తర్వాత మళ్లీ సాధారణ జీవితం గడపాలంటే మాత్రం ఫిజియోథెరపీ కొంత కాలం చేయించుకోకతప్పదు. పలు రకాల రుగ్మతలు, నొప్పులు, ఇబ్బందుల నుంచి ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని జబ్బులకు ఫిజియోథెరపీ కేంద్రాలకు వెళ్లి అక్కడి పరికరాలతో చికిత్స చేయించుకోవాల్సి రాగా, మరికొన్ని అక్కడి వైద్యుల సలహాతో ఇంటి వద్దే వ్యాయామాలు చేసుకునే అవకాశం ఉంటుంది. వారు చెప్పిన ప్రకారం ప్రతిరోజూ ఆచరిస్తే సమస్య పరిష్కారమవుతుంది. నేడు వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ప్రత్యేక కథనం.కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రస్తుతం 1200 మందికి పైగా ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ ఉచితంగా ఫిజియోథెరపీ చికిత్స అందిస్తున్నారు. ఇక్కడికి అవసరమైన పరికరాలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమకూర్చడంతో దాదాపుగా అన్ని సమస్యలకు ఇక్కడ చికిత్స లభిస్తోంది. ఇక్కడికి ఆర్థోపెడిక్, న్యూరాలజి, న్యూరోసర్జరీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, కార్డియాలజి తదితర విభాగాల నుంచి రోగులు ఫిజియోథెరపీ చికిత్స కోసం వస్తుంటారు. ఈ కేంద్రానికి రాలేని, బెడ్పైనే ఉన్న రోగులకు మాత్రమే ఫిజియోథెరపిస్టులే వెళ్లి చికిత్స అందిస్తుంటారు. ఇందులో టెన్స్, ఇంటర్ ఫెరిన్షియల్ థెరపి, అల్ట్రాసోనిక్ థెరపి, ఎలక్ట్రికల్ స్టిమిలేటర్, షార్ట్రేవ్ డయాటర్మి, సీపీఎం డివైస్, లేజర్, ట్రెడ్మిల్, బైసైకిల్ అర్బోమీటర్, క్వార్ర్డిసెట్స్ టేబుల్, పారలల్ బార్, షోల్డర్ వీల్, స్విస్ బాల్స్తో పాటు పలు వ్యాయామ పరికరాలున్నాయి. కర్నూలుతో పాటు నంద్యాల జిల్లా ఆసుపత్రిలో, ఆదోని ఏరియా ఆసుపత్రిలో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఫిజియోథెరపిస్టులు రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ఫిజియోథెరపీతో అందే వైద్యం ఫిజియోథెరపీ చికిత్సలో భాగంగా 8 అంకైపె నడవడం, రెండు సరళ రేఖల మధ్య నడిపించి చికిత్స చేస్తారు. దీనివల్ల కీళ్లు బిగుతుగా మారకుండా కదలిక య థావిధిగా ఉండేలా కండరాలు బిగుతుగా మారకుండా, క్షీణించకుండా, రక్తప్రసరణ యథావిధిగా జరిగేలా ఉంటాయి. మంచంపై ఒకే స్థితిలో పడు కోకుండా అత్యధిక ఒత్తిడి కలిగిన ప్రాంతాలపై పుండ్లు/అల్సర్లు పెరగకుండా ఉండేందుకు పొజిషన్ చేంజింగ్, బెడ్ రోలింగ్ ఎక్సర్సైజ్లు చేయిస్తారు. ఇవే గాక వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్లు, న్యూరో డెవలప్మెంట్ ట్రైనింగ్, కో ఆర్డినేషన్ ఎక్సర్సైజ్లు, చేతి కి సంబంధించిన ఎక్సర్సైజ్లను ఫిజియోథెరపిస్ట్లు అందిస్తున్నారు. శరీర కదలికలు సాధారణ స్థితికిఏదైనా కారణం, ప్రమాదం వల్ల గాయం, వైకల్యం ఏర్పడితే శరీర భాగాల కదలిక ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి వారి శరీర భాగాల కదలికను సాధారణస్థితికి తెచ్చేందుకు ఫిజియోథెరపీ వైద్యం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పక్షవాతం, మెడనొప్పి, నడుమునొప్పి, మోకాళ్లనొప్పి, భుజంనొప్పి, వెన్ను సమస్యలు శస్త్రచికిత్సకు ముందు తర్వాత వాటి పనితీరును పునరుద్ధరించడానికి రిహాబిలిటేషన్ ఉపయోగపడుతుంది. నరాల బలహీనతలు, పనిచేసే చోట వచ్చే సమస్యలను అధిగమించేందుకు ఫిజియోథెరపీ ఎంతగానో దోహదపడుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం పలు వ్యాధులకు మెరుగైన వైద్యం ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత థెరపీ చికిత్స ప్రైవేటులో పెరిగిన వైద్యులు నేడు వరల్డ్ ఫిజియోథెరపీ డే నొప్పుల నుంచి ఎంతో ఉపశమనం ఫిజియోథెరపి వైద్యం ద్వారా దీర్ఘకాలిక సమస్యలైన స్పాండిలైటిస్, ఫ్రోజెన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో తదితర ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇటీవల కాలంలో యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫోన్లు, కంప్యూటర్లు వాడకంతో భుజాలు, మెడ, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఫిజియోథెరపీ వైద్యం ద్వారా ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా ఉపశమనం కలిగిస్తున్నారు. గర్భిణులు తెలిసి తెలియకుండా వాడే కొన్ని మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వారికి జన్మించే పిల్లలు జన్యులోపంతో బాధపడుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి అనే దానిపై ఫిజియోథెరపిస్ట్ వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఫిజియోథెరపీ ద్వారా తల్లి కడుపులో పెరిగే బిడ్డతో మొదలు వయోవృద్ధుల వరకు ఎన్నో జబ్బులను తగ్గించవచ్చు. -
అత్యవసర వైద్యానికి ‘డ్రోన్’ హారన్!
కర్నూలు (సిటీ): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్(ట్రిపుల్ ఐటీ డీఎం) సాంకేతిక విద్య, పరిశోధనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలో ప్రముఖ ట్రిబుల్ ఐటీగా గుర్తింపు పొందింది. సరికొత్త ఆవిష్కరణలతో దూసుకెళ్తోంది. డ్రోన్ టెక్నాలజీతో దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు ట్రిపుల్ఐటీడీఎంలో నూతన ఆవిష్కరణచేశారు. ఇన్క్యుబేట్ అయిన ట్రిగుణ్ రోటోటిక్స్ సిస్టమ్ ప్రైవేటు లిమిటెడ్ స్టార్టప్ కింద డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ అనే సరికొత్త వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ రూపకల్పనలో ట్రిపుల్ఐటీ ఈసీఈ ఆచార్యులు డాక్టర్ కృష్ణ నాయక్, డాక్టర్ ఎం. రవికుమార్(మెకానికల్ ఇంజినీరింగ్), రాయలసీమ యూనివర్సిటీకి చెందిన ఖాసిఫా అంజుమ్ కీలక పాత్ర పోషించారు. అనువుకాని స్థలంలో అత్యవసరమైన సమయంలో ఈ విధానంతో సులువుగా వైద్యసేవలు అందించవచ్చు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులను చికిత్స కోసం తరలించే సమయంలో రోడ్లలో డ్రోన్ ద్వారా హారన్ కొడుతూ ట్రాఫిక్ క్లియర్ చేయవచ్చు. డ్రోన్లను ఉపయోగించి రోగుల ఆరోగ్యాన్ని డాక్టర్ పర్యవేక్షించేందుకు చక్కగా ఉపయోపడుతుంది ఈ వ్యవస్థ. ఇది మందులు, వైద్య పరికరాలను సుదూర ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి, కొండల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు మందులు, అత్యవసరమైన సమయంలో రక్తం వంటివి పంపించడానికి ఉపయోగించబడుతుంది. ఈ వ్యవస్థలను భారతదేశంలోనే మొట్టమొదటిసారి కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎం ఆచార్యులు రూపొందించారు. ఈ వ్యవస్థ సుదూర గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సేవలను అందించడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. దీని పని తీరుపై ప్రస్తుతం డెమో ఇచ్చారు. ఉపయోగాలు ఇవీ.. డ్రోన్ను పూర్తిగా ఆటో మేటిక్, మాన్యువల్ క్యాంట్రోల్ మోడ్లో నడపవచ్చు. డాక్టర్ ఆసుపత్రి నుంచే అంబులెన్స్లోని రోగి స్థితిని పర్యవేక్షణ చేసి, సూచనలతో అంబులెన్స్ ఆపరేటర్ రోగికి ఫస్ట్ ఎయిడ్ అందించగలరు. రోగిని సరైన ఆసుపత్రికి తక్షణ తరలింపుకు ఈ వ్యవస్థ సాయం చేస్తుంది. సుదూర ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు మందులు, రక్తం వంటి ముఖ్యమైన వైద్య సామాగ్రిని డ్రోన్ల ద్వారా వేగంగా చేర్చవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, సహాయాన్ని అందించడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చు. వైద్య లాజిస్టిక్ను సమర్థవంతంగా నిర్వహించడానికి డ్రోన్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ అవసరం. డ్రోన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరమైన సేవలు అందించేందుకు, అంతరాయం కలుగుతుందని ప్రజలకు తెలియజేసేందుకు డప్పు కొట్టేందుకు సైతం చక్కగా ఉపయోగపడుతుంది. కర్నూలు ట్రిపుల్ఐటీడీఎం రూపొందించిన సరికొత్త వ్యవస్థ డ్రోన్ ఆధారిత హెల్త్ కేర్ మానిటరింగ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం తయారు దేశంలోనే మొదటిసారి వినూత్న వ్యవస్థను ఆవిష్కరించిన ట్రిపుల్ఐటీ ప్రొఫెసర్లు అత్యవసరమైన సమయంలో ఉపయోగంగా సరికొత్త వ్యవస్థ -
టీడీపీ నాయకులు బేస్ మట్టాలు కూల్చివేస్తున్నారు
డోన్ టౌన్: ఇళ్లు నిర్మించుకుంటున్న క్రమంలో టీడీపీ నాయకులు ఇళ్ల బేస్మట్టాలను కూల్చేసి ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పట్టణ సమీపంలోని మార్కెట్యార్డు ఎదురుగా ఉన్న కోట్ల హరిసర్వోత్తమరెడ్డి కాలనీలో ఉన్న 510 సర్వే నంబరులో 2007లో అప్పటి ప్రభుత్వం 120 మంది పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసింది. కొందరు ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా మరికొందరు ఆర్థిక స్తోమత లేకపోవడంతో బేస్మట్టం వరకు నిర్మించుకుని మధ్యలో నిలిపేసుకున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు టీడీపీ నాయకులు వాటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితులు రమిజాబీ, మహబూబ్సాహెబ్, బాబులాల్, సుధాకర్ తదితర బాధితులు ఆదివారం ఆరోపించారు. కబ్జాదారులు తమ అర్ధరాత్రి ఇళ్ల వద్దకు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
ఫిజియోథెరపిస్ట్ సూచనలు పాటించాలి
కొన్ని రకాల ఆపరేషన్ల అనంతరం ఫిజియోథెరపీ కీలకం అవుతుంది. ఆపరేషన్ తర్వాత వ్యాయామం లేకపోతే కండరాల్లో ఫైబ్రోసిస్ అభివృద్ధి చెంది వంకర్లు పోతాయి. ఎక్కువరోజులు మంచంపై ఉంటే కాళ్లలో రక్తం గడ్డకట్టి ఎంబాలిజం వచ్చి గుండె, మెదడుకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆపరేషన్తో పాటు రోగి సాధ్యమైనంత తొందరగా మామూలు స్థితికి రావాలంటే ఫిజియోథెరపీ చాలా ప్రధానం. ఇటీవల కాలంలో బైపాస్ సర్జరీ చేయించుకున్న వారికి కూడా ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగులకు ఫిజియోథెరపీ ఒక భాగం చేశారు. ఈ నేపథ్యంలో ఫిజియోథెరపిస్ట్ అందించే సూచనలు పాటించాల్సి ఉంటుంది. –డాక్టర్ హనీఫ్, ఫిజియోథెరపిస్ట్, కర్నూలు ప్రస్తుత కాలంలో మనుషుల్లో శారీరక చురుకుదనం తక్కువై పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. యువత నుంచి వృద్ధుల వరకు చాలా మంది భుజం, మెడ, మోకాలు నొప్పి వంటి సమస్యలతో వస్తున్నారు. కండరాల బలహీనతలతో కూడిన నొప్పులను కేవలం మందులతో తాత్కాలికంగా తగ్గించవచ్చు గానీ మళ్లీ మళ్లీ రాకుండా ఉండాలంటే ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. నొప్పి ఉన్న ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి అవసరమైన శారీరక వ్యాయామాలతో పాటు సహాయక చికిత్సను సైతం అందిస్తారు. దీంతో పాటు ప్రతిరోజూ క్రమం తప్పక వ్యాయామం, నడక చేయాలి. –డాక్టర్ అర్షద్ అయూబ్, ఫిజియోథెరపిస్ట్, కర్నూలు -
విష జ్వరాలపై కదిలిన యంత్రాంగం
కోవెలకుంట్ల: విష జ్వరాలపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్థానిక మేజర్ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం లోపించి దోమల కారణంగా ప్రజలు విష జ్వరాలు బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని ‘డెంగీ లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దార్ పవనకుమార్రెడ్డి సోమవారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చేరుకుని చికిత్ప పొందుతున్న జ్వరపీడితులను పరామర్శించారు. సీహెచ్సీ ఇన్చార్జ్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగీ లక్షణాలతోపాటు వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్న మహిళలు, చిన్నారులకు సకాలంలో వైద్య సేవలందిస్తున్నట్లు తహసీల్దార్కు డాక్టర్ వివరించారు. మాయలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పట్టణ శివారులోని స్వామినగర్ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పీహెచ్సీ డాక్టర్ రాబర్ట్ కెన్నెడి జ్వరాలతో బాధపడుతున్న 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మేజర్ పంచాయతీ ఈఓ ప్రకాష్నాయుడు ఆధ్వర్యంలో స్వామినగర్, ఎల్ఎం కాంపౌండ్, గాంధీనగర్, పూసలవీధి, తదితర ప్రాంతాల్లో దోమలు నివారణకు క్రిమి సంహారక మందు పిచికారీ చేయించారు. -
నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ
బొమ్మలసత్రం: జిల్లాలో ఉన్న ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చే గౌరవవేతనాల బకాయిలు వెంటనే చెల్లించాలని వైఎస్సార్సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ ఇసాక్బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇమామ్, మౌజన్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం 11 నెలలుగా నిలిపేయడం తగదన్నారు. ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం విడుదల చేయాలనే డిమాండ్తో సోమవారం ఉదయం నంద్యాలలో ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. ఉదయానంద హోటల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. -
బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలి
కర్నూలు(అర్బన్): బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోలూరు సతీష్, ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్రావు, జిల్లా నాయకులు దుర్గం బాలాజీ కోరారు. వారు ఆదివారం మాట్లాడుతూ.. బ్రాహ్మణులు సాంప్రదాయ వృత్తులు, అర్చకత్వం ఆధారంగా జీవనం సాగిస్తున్నప్పటికీ, ఆధునికత ఆన్లైన్ సేవల విస్తరణతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బ్రాహ్మణులకు విద్య, ఉపాధి అవకాశాల్లో తగిన మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ బోర్డు ద్వారా కొంత మేర చర్యలు తీసుకున్నా, అవి పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలన్నారు. -
రేపు రైతుల కోసం అన్నదాత పోరు
బొమ్మలసత్రం: యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న అన్నదాత పోరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి నివాసంలో నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియాను అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతన్నలకు ఏ కష్టం రాకుండా అండగా నిలిచారన్నారు. అన్నదాతల సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే అన్నదాత పోరుతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరరు ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, మాజీ ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణమోహన్, సాదిక్బాషా, చంద్రశేఖర్రావు, జిల్లా ప్రదాన కార్యదర్శి సోమశేఖర్రెడ్డి, మున్సిపల్ వింగ్ అధ్యక్షులు టైలర్ శివయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కారువరికుమార్, లీగల్సెల్ అధ్యక్షులు ప్రతాప్రెడ్డి, జిల్లా సెక్రటరీ హరి, నాయకులు జాకీర్ హుస్సేన్, సుబ్బరాయుడు, సాయిరామ్రెడ్డి, అశోక్రెడ్డి, సుధాకర్, రత్నబాబు చౌదరి పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల ఉద్యమ బాట
● వలంటీర్ల బాధ్యతలను అప్పగించడంపై ఆందోళన ● ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు కర్నూలు(అర్బన్): గ్రామ/ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిభారాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. సర్వేల పేరుతో తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు శాంతియుత నిరసన కార్యాక్రమాలకు సచివాలయ ఉద్యోగులు శ్రీకారం చుట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నింటినీ పారదర్శకంగా ప్రజల ముంగిటికే చేర్చిన వలంటీరు వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే గతంలో వలంటీర్లు నిర్వహించిన బాధ్యతలను ప్రస్తుతం గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులతో చేయించేందుకు నిర్ణయం తీసుకుంది. మనమిత్ర – వాట్సాప్ ఈ గవర్నెన్స్ పేరుతో ఇంటింటికి వెళ్లి యాప్లో ఉన్న పౌర సేవలను ఇళ్ల యజమానులకు వివరించి వారిని భాగస్వామ్యులను చేయాలనే చర్యలను చేపట్టింది. ఇందుకు గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వినియోగించుకునేందుకు ఆదేశాలను జారీ చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమించి క్లస్టర్గా విభజించి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు నాలుగైదు క్లస్టర్ల బాధ్యతలను ఒక సచివాలయ ఉద్యోగికి కేటాయించి సమాచార సేకరణ, ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. మనమిత్ర వాట్సాప్ లోని మొత్తం 709 సర్వీసుల్లో ప్రతి ఉద్యోగి ఒక్క సర్వీస్ అయినా ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ‘ మనమిత్ర ’ సర్వే వల్ల తమ ఆత్మగౌరవం దెబ్బ తింటుందని సచివాలయ ఉద్యోగులు ఉద్యమ బావుటా ఎగుర వేసేందుకు సిద్దం అయ్యారు. సచివాలయ ఉద్యోగులు చేస్తున్న సర్వేలు .. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్గా తమ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న విధులతో పాటు అనేక రకాల సర్వేలను ఇళ్ల వద్దకు వెళ్లి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కౌశలం, బయోమెట్రిక్ అప్డేషన్, సిటిజన్ ఈకేవైసీ, పాపులేషన్ మేనేజ్మెంట్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, చైల్డ్ ఆధార్, ఫ్యామిటీ డీటైల్స్, మోబైల్ నెంబర్ అప్డేట్, ఫ్యామిలీ మైగ్రేషన్, అదర్ డిపార్టుమెంట్ ఈకేవైసీ, ఆధార్ సీడింగ్ ఫర్ వాహనమిత్ర, నాన్ ఏపీ రెసిడెంట్ తదితర సర్వేలను ఇంటింటికి తిరిగి చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సర్వేను కూడా ఖచ్చితంగా చేయించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఉద్యమ బాట పడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి బలవంతంగా సర్వీసులను నమోదు చేయాలనే ఆదేశాల వల్ల ఉద్యోగులు అనేక రూపాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల తమ ఆత్మ గౌరవం దెబ్బతినే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తప్పని పరిస్థితుల్లో విధులు బహిస్కరించేందుకు కూడా వెనుకాడమని వారు హెచ్చరిస్తున్నారు. ఉద్యమానికి శ్రీకారం సచివాలయ ఉద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలోనే ఉద్యోగులు ఈ నెల 6వ తేదినే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని ఉద్యోగులు ముందుగా నల్లబాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అలాగే తమ పరిధిలోని ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు ఇచ్చారు. తమ ఆవేదన పట్ల ప్రభుత్వం స్పందించకపోతే ఏపీవీడబ్ల్యూఎస్ఈ జేఏసీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. -
మహానంది ఆలయం మూసివేత
మహానంది: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మహానంది ఆలయ తలుపులు మూసేశారు. ముందుగా వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బింబ సంరక్షణార్థం దర్భకూర్చలు, దర్భ పవిత్రములు సమర్పించి ఆలయ తలుపులు మూశారు. ఏఈఓ ఎరమల మధు ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశింకరశర్మ, ముఖ్య అర్చకులు పూజలు చేపట్టారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య పాల్గొన్నారు. సోమవారం ఉదయం తలుపులు తీసి సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను దర్శన భాగ్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు. -
ఉల్లి ధర మరింత పతనం
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి ధర మరింత పతనం కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నెల 5న రాత్రి కర్నూలు మార్కెట్కు 16,589 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. 6వ తేదీన వ్యాపారులు 7,756 క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. మిగిలిన 8,842 క్వింటాళ్ల ఉల్లిని ఆదివారం వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. కిలో రూపాయి చొప్పున ధర లభించడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇళ్లకు వెనుదిరిగారు. ఎకరా ఉల్లి సాగుకు రూ.లక్షకు పైగా పెట్టుబడి ఖర్చు వస్తోంది. ఎకరాకు కనిష్టంగా 30 క్వింటాళ్లు, గరిష్టంగా 80 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. క్వింటాలుకు రూ.100 ధర లభిస్తుండటంతో రైతులు ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారు. వ్యాపారులు ఈ నామ్ ద్వారా 7,263 క్వింటాళ్లు కొన్నారు. కనిష్ట ధర రూ.100, గరిష్ట ధర రూ.619 మాత్రమే. ఉల్లిలో నాణ్యత బాగుంది. రెండు, మూడు రోజులుగా వర్షాలు లేవు. ఎండల తీవ్రత కూడా పెరిగింది. నాణ్యత బాగానే ఉన్నప్పటికీ క్వింటాలు ఉల్లికి రూ.100 ధర ఇవ్వడం కర్నూలు మార్కెట్ యార్డులో కలకలం రేపింది. 1,579 క్వింటాళ్ల ఉల్లిని వ్యాపారులు కొనకుండా చేతులెత్తేశారు. వ్యాపారులు కొనని ఉల్లిని మార్క్ఫెడ్ రూ.1,200 ధరతో కొనుగోలు చేసింది. రైతు ఆత్మహత్యాయత్నాలను బోగస్ అంటారా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు పడిపోయాయి. పెట్టుబడిలో కనీసం 20 శాతం కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన రైతులు వెంకటనాయుడు, కృష్ణ ఉల్లి సాగు చేసి నష్టాలు మూటగట్టుకున్నారు. అప్పుల బాధలు తట్టుకోలేక పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిని సాక్షాత్తూ ప్రభుత్వమే బోగస్గా పేర్కొనడంపై రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. బయట కిలో ఉల్లి రూ.20 నుంచి రూ.25 ప్రకారం విక్రయిస్తున్నారు. మార్కెట్ యార్డులో మాత్రం రైతులు తెచ్చిన ఉల్లి కిలో రూపాయి ప్రకారం కొంటున్నారు. ఇంత అధ్వాన్నంగా ధరలు లభిస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూన్నాళ్ల ముచ్చట రూ.1,200 మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్లు చేస్తామని ప్రభుత్వం చేసిన హడావుడి మూడు రోజులకే ముగిసింది. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రో జు లు మార్కెట్కు ఉల్లి గడ్డలు తక్కువగా వచ్చాయి. ఈ రోజుల్లో వచ్చిన ఉల్లి మొత్తాన్ని మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ఈనెల 6న మార్కెట్కు ఉల్లిగడ్డలు పోటెత్తడ ంతో కొనుగోలులో ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో మద్దతు కొనుగోలు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. కిలోకు లభించిన ధర ఒక్క రూపాయి మాత్రమే! కన్నీరు మున్నీరవుతున్న రైతులు ఉల్లి రైతుల ఆత్మహత్యాయత్నాలను బోగస్ అనడంపై నిరసన -
ప్రశాంతంగా అటవీశాఖ పరీక్షలు
కర్నూలు(సెంట్రల్): అటవీశాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు 33 కేంద్రాల్లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 89.75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 12,919 మంది అభ్యర్థులకుగాను 10,820 మంది హాజరుకాగా 2,099 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించిన సెక్షన్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్టు కోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేయగా 81.20 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 2,255 మంది అభ్యర్థులకుగాను 1,831మంది హాజరు కాగా 424 మంది గైర్హాజరయ్యారు. కాగా, ఉదయం శంకరాస్ డిగ్రీ కాలేజీలో జరిగిన స్క్రీనింగ్ టెస్టును ఏపీపీఎస్సీ జిల్లా కోఆర్డినేటర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పరిశీలించి ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు సూచనలు ఇచ్చారు. -
జాగ్రత్తలు తప్పనిసరి
వైరల్ జ్వరానికి సంబంధించిన వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులువుగా సోకే ప్రమాదం ఉంది. హైగ్రేడ్ జ్వరం, తల, గొంతు, కీళ్లు, కండరాల, కడుపు నొప్పితో పాటు జలుబు చేసి ముక్కు కారడం వైరల్ జ్వరానికి ముఖ్య లక్షణాలు. ప్రాథమిక దశలోనే వ్యాధి లక్షణాలను గుర్తించి సకాలంలో రక్తపరీక్షల ద్వారా రోగనిర్ధారణ చేసి సరైన చికిత్స అందించాలి. – డాక్టర్ రమ్యశిల్ప, గైనకాలజిస్ట్, వంద పడకల ప్రభుత్వాసుపత్రి, డోన్ -
నేడు శ్రీశైల ఆలయం మూసివేత
● చంద్ర గ్రహణం కారణంగా ఉభయ దేవాలయాలు మూసివేతశ్రీశైలంటెంపుల్: చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సోమవారం వేకువజామున 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఈఓ మాట్లాడుతూ చంద్రగ్రహణం ఆదివారం రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై రాత్రి 1.26 గంటలకు ముగుస్తుందన్నారు. చంద్రగ్రహ ణం కారణంగా ఆదివారం మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనం, అన్ని ఆర్జీతసేవలు, పరోక్షసేవలు, స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం పూర్తిగా నిలుపుదల చేయబడుతుందన్నారు. ఆ రోజున భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని అన్నారు. అలాగే సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధారా పంచధారా, శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేయడం జరుగుతుందని అన్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ జరిపించిన తరువాత శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు చేపడుతారన్నారు. అనంతరం 7.30 గంటలకు స్వామి అమ్మవార్లకు మహా మంగళహారతులు నిర్వహించిన తర్వాత ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. భక్తులు ఆయా సమయ వేళల మార్పులను గమనించి దేవస్థానానికి సహకరించాలని దేవస్థాన ఈఓ పేర్కొన్నారు.శ్రీశైల ఆలయం -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై పోలీసుల జులుం
● స్టేషన్కు పిలిపించి చితకబాదిన సీఐ ● పోలీసు స్టేషన్ ఎదుట కుటుంబీకుల ఆందోళన ఆత్మకూరు: చిన్న కేసు విషయలో రాజీ అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తను స్టేషన్కు పిలిచి సీఐ చితిక బాదిన ఘటన ఆత్మకూరు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడు, అతని కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు పట్టణానికి చెందిన మాసుంబాషా అనే వ్యక్తి మన్సూర్కు రూ.10 వేలు బదులిచ్చాడు. రెండు రోజుల్లో ఇస్తానని పది నెలలు గడిచినా ఇవ్వకపోవడంతో శుక్రవారం రాత్రి వారి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో అక్కడే వున్న వైఎస్సార్సీపీ కార్యకర్త, వైఎస్సార్సీపీ వార్డు కౌన్సిలర్ కలిముల్లా కుమారుడు ఖాదర్బాషా వారికి సర్ది చెబుతుండగా తోపులాట జరిగింది. దీంతో మన్సూర్, ఖాదర్బాషా తనపై దాడి చేశారని మాసుంబాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఖాదర్బాషాను పోలీసులు స్టేషన్కు పిలిపించారు. సీఐ రాము అతడి నుంచి ఘర్షణ వివరాలు తెలుసుకుంటూ చితకబాదినట్లు తెలుస్తోంది. తాను వైఎస్సార్సీపీ కార్యకర్త, మాజీ ఎమ్మెల్యే శిల్పా మనిషి కావడంతోనే సీఐ కొట్టాడని తాను కుటుంబీలకు చెప్పాడు. ఇది అన్యాయమంటూ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదన చెందాడు. దీంతో అతని తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ వార్డు కౌన్సిలర్ సభ్యులు కలిముల్లా, షఫీవున్లు, కుటుంబీకులు, పార్టీ శ్రేణులతో కలసి పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడితే సర్ది చెప్పిన వ్యక్తిపై ఎలా దాడి చేస్తారని మండిపడ్డారు. సీఐ రాముపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్కుమార్రెడ్డి అక్కడికి చేరుకుని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వెల్లడిస్తామని ఆందోళన విరమించాలని కోరడంతో వారు శాంతించారు. నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా ఆత్మకూరు పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ వార్డు కౌన్సిలర్ కలిముల్లా కుమారుడు ఖాదర్బాషాపై జరిగిన దాడిపై ఆదివారం కూడా ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి తెలిపారు. పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు. సీఐ రాము తమ పార్టీ కార్యకర్తను చితకబాదడం అన్యాయమన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళ చేస్తామన్నారు. -
పోలీసు శాఖకు నూతన ‘హంటర్’
కర్నూలు: కేసుల ఛేదన, నేరస్తులను గుర్తించడంలో జిల్లా పోలీసు శాఖ మరింత బలోపేతమయ్యేందుకు ప్రభుత్వం నూతన జాగిలాన్ని పంపింది. మంగళగిరి పోలీస్ హెడ్ క్వాటర్స్ ఆరో బెటాలియన్లో పది నెలల పాటు పేలుడు పదార్థాలపై ఈ కొత్త డాగ్ హంటర్ శిక్షణ పొంది శనివారం జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుంది. ఇప్పటివరకు పోలీసు శాఖలో 8 జాగిలాలు ఉండగా హంటర్ రాకతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇది బెల్జియం మలనాయిస్ జాతికి చెందినది. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నూతన జాగిలాన్ని పరిశీలించారు. వాటి సంరక్షణపై డాగ్ స్క్వాడ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేసుల ఛేదనలో జాగిలాలు కీలకపాత్ర పోషిస్తున్నందున వాటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ జావెద్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి ఏఆర్ కానిస్టేబుల్ రాజు, డాగ్ హ్యాండ్లర్ ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బొలెరో విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శ్రీశైలం శాఖ మహేంద్ర బొలెరో వాహనాన్ని విరాళంగా సమర్పించింది. శనివారం గంగాధర మండపం వద్ద వాహనం, సంబంధిత పత్రాలను బ్యాంకు చైర్మన్ పీవీకే ప్రమోద్కుమార్రెడ్డి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావుకి అందజేశారు. ముందుగా అర్చకులు వాహన పూజలు నిర్వహించారు. సుమారు రూ.11.50 లక్షలతో కొనుగోలు చేసిన ఈ వాహనాన్ని దేవస్థానానికి అందజేసినట్లు ఏపీజీబీ చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ పీవీ రమణ, శ్రీశైలం బ్రాంచ్ మేనేజర్ కె.సుబ్రమణ్యం సిబ్బంది పాల్గొన్నారు. జీఎన్ఎం కోర్సులకు నోటిఫికేషన్ కర్నూలు(హాస్పిటల్): జీఎన్ఎం(జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. కోర్సులో చేరాల్సిన వారు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, సీట్ల లభ్యత వంటి వివరాలు నోటిఫికేషన్లో ఉంటాయన్నారు. దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రిలోని కార్యాలయంలో స్వీకరిస్తారన్నారు. పీఆర్లో ఐదుగురు డీడీఓలకు పోస్టింగ్స్ కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖలో ఎంపీడీఓలుగా విధులు నిర్వహిస్తున్న పలువురికి ఇటీవల పదోన్నతులు కల్పించారు. జిల్లాలోని గూడూరు ఎంపీడీఓ అశ్వినీకుమార్ను ప్రకాశం జిల్లా డ్వామా డీవీఓగా, ఓర్వకల్ ఎంపీడీఓ ఎం.శ్రీనివాసులును నంద్యాల జిల్లా డ్వామా ఏపీఓ (అకౌంట్స్)గా పోస్టింగ్ ఇచ్చారు. అలాగే అనంతపురం జిల్లా గోరంట్లలో విధులు నిర్వహిస్తున్న పి.నరేంద్రకుమార్ను నంద్యాల డ్వామా ఏపీడీగా, విడపనకల్లో విధులు నిర్వహిస్తున్న షకీలాబేగంను డ్వామా డీవీఓగా, గాండ్లపెంటలో విధులు నిర్వహిస్తున్న బి.వెంకటరాముడును ఆత్మకూరు డ్వామా ఏపీడీగా పోస్టింగ్ ఇచ్చారు. -
రక్త పరీక్షలు చేయించుకోవాలి
ఏటా ఆగస్టు నుంచి మూడు నెలల పాటు వాతావరణంలో వచ్చే అనూహ్య మార్పులు వైరల్ ఇన్ఫెక్షన్కు ప్రధాన కారణం. డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్, చికెన్ గున్యాల నిర్ధారణ కోసం రోగికి రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. సకాలంలో ప్రభుత్వాసుపత్రిలో వైద్యులను సంప్రదించి వైద్య చికిత్స అందిస్తే వైరల్ ఫీవర్ను తగ్గించవచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – డాక్టర్ మాధవ కృష్ణ, చిన్నపిల్లల వైద్యులు, అసోసియేట్ ప్రొఫెసర్, నంద్యాల జిల్లా ఆసుపత్రి -
అన్నదానానికి బయోమెట్రిక్
● నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో కొత్త నిబంధన బనగానపల్లె రూరల్: నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణలోని నిత్యాన్నదాన సంస్థలో భక్తులు భోజనం చేయాలంటే ఇక నుంచి వేలి ముద్ర తప్పనిసరిగా వేయాల్సిందే. అమ్మవారి దర్శనం కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి అమ్మవారి భక్తులు నిత్యం అధిక సంఖ్యలో వస్తుంటారు. వారి సౌకర్యార్థం ప్రతి రోజు నిత్యాన్నదాన సంస్థలో మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సుమారు 150 – 200 మంది భక్తులు భోజనం చేస్తారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయ అధికారులు అన్నదాన సంస్థలో భోజనం చేయాల్సిన భక్తులు వేలిముద్ర తప్పనిసరి చేశారు. అయితే వేలిముద్ర వేసేందుకు ఒక క్యూలో, ఆ తర్వాత భోజనం కోసం మరో క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో చాలా ఆలయాల్లో అన్నదానం కొనసాగుతున్నా ఎక్కడ బయోమెట్రిక్ విధానం లేదు. భక్తుల విరాళంతో నిర్వహించే ఉచిత అన్నదానాకి బయోమెట్రిక్ విధానం ఎందుకని భక్తులు పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంపై ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరంగా అన్నదాన కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి బయోమెట్రిక్ విధానం అములులోకి తీసుకొచ్చామన్నారు. కాగా ఈ విషయంలో అధికారులు పునరాలోచన చేయాలని భక్తులు కోరుతున్నారు. -
ఖాళీ కడుపుతో చదువుకునేదెట్టా!
● మధ్యాహ్న భోజన ఏజెన్సీనైనా మార్చండి.. టీసీలైనా ఇవ్వండి ● కొమ్మూరు కొట్టాల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల మొర బేతంచెర్ల: మధ్యాహ్న భోజనం అరకొరగా పెడుతున్న బడిలో తమ పిల్లలు చదువుకోలేరని, టీసీలు ఇస్తే ఏదైనా బడిలో చేర్పిస్తామని కొమ్మూరు కొట్టాల ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మొర పెట్టుకుంటున్నారు. ఏజెన్సీని మార్చాలని మొరపెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ శనివారం వారు ఎంఈఓ సోమశేఖర్కు వినతి పత్రం అందజేశారు. భోజన ఏజెన్సీకి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు సూచించిన వారిని కాకుండా అధికార పార్టీ నాయకులు తమకు నచ్చిన వారిని ఎక్కించుకొని రాజకీయం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించకుండా గతంలో ఉన్న నాగలక్ష్మమ్మను తొలగించి ఆమె స్థానంలో కొమ్ము మహాలక్ష్మికి ఏజెన్సీని కట్టబెట్టారన్నారు. ఆ ఏజెన్సీ వాళ్లు విద్యార్థులకు సరిగా అన్నం పెట్టకపోవడంతో అర్ధాకలితో చదువుకోలేక ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఐదుగురు మాత్రమే బడికెళ్తున్నారు. దాదాపు రెండు నెలలుగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లకున్నా పట్టించుకునేవారు లేరు. జిల్లా కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేసినప్పటికీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో సమస్య పరిష్కారం కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజనం నిర్వహణపై ఓ వర్గం పెత్తనం చెలాయిస్తోందని, అయితే ఆ వర్గం పిల్లలను మాత్రం ఈ బడికి పంపడం లేదనే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారి మాట వినకపోతే కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఈ విషయంపై ఎంఈఓ సోమశేఖర్ను వివరణ కోరగా అందరూ కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే.. టీసీల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్న భోజనం అరకొరగా పెడుతున్నారని పిల్లలు ఇంటికి వచ్చి చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం చూడటానికి తల్లిదండ్రులను పాఠశాల వద్దకు రానీయడం లేదు. మేము వెళ్లి చూడాలంటే పోలీసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మా పిల్లలను ఏవిధంగా స్కూలుకు పంపించాలి. 30 మంది పిల్లలకు టీసీలు ఇస్తే వేరే పాఠశాలలో చేర్పించుకుంటాం. – మద్దిలేటి మా పిల్లలకు మధ్యాహ్న భోజనం సక్రమంగా పెట్టడం లేదని ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనికి తోడు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. మెజార్టీగా ఉన్న తల్లిదండ్రుల విన్నపాన్ని పట్టించుకోవడం లేదు. మా పిల్లలు సక్రమంగా పాఠశాలకు వెళ్లడం లేదు. జిల్లా అధికారులు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలి. – మదన గోపాలు, విద్యార్థి తండ్రి -
రైతుకు వి‘పత్తి’
● వైరస్ సోకి ఎండిపోతున్న పత్తి పొలాలు ● లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంట ● పూర్తిగా తగ్గనున్న దిగుబడి ● పెట్టుబడులు కూడా రాని దుస్థితి కృష్ణగిరి: కొన్ని రోజులు వర్షాలు లేకపోవడం.. ఉన్నట్టుండి వానలు భారీగా పడటంతో పత్తి పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైరస్ సోకి ఎర్రగా మారాయి. లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినింది. దిగుబడిి పూర్తిగా తగ్గి పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 4.22 లక్షల హెక్టార్లు ఉండగా.. అత్యధికంగా 2,19,636 హెక్టార్లలో పత్తి సాగైంది. పంటంతా ఎర్రగా మారి.. గతేడాది వేరుశనగ సాగు చేయగా దిగుబడులు అంతంత మాత్రంగా వచ్చాయి. దీంతో ఈ యేడాది రైతులు అధికంగా పత్తి వైపు మొగ్గు చూపారు. మే నెల చివరల్లో కురిసిన వర్షాలకు చాలా మంది విత్తనం వేశారు. అలాగే జూన్ నెలలో కూడా లక్షల ఎకారాల్లో పత్తి సాగు చేశారు. ఆశించిన మేర వర్షాలు పడటంతో పంట ఏపుగా వచ్చి కాయలు వచ్చాయి. అయితే జూలై నెలంతా బెట్ట రావడంతో పంట ఎండుపోయే దుస్థితికి వచ్చింది. ఈ సమయంలో ఆగస్టు నెలలో ఒక్కసారిగా భారీ వర్షాలు రావడంతో ఏపుగా వచ్చినట్లు వచ్చిన పత్తి పంటకు వైరస్ సోకింది. పంటంతా కళ్లేదుటే ఎర్రగా మారింది. పెట్టుబడి మట్టిపాలు ఇంటికి తెల్లబంగారం(పత్తి) వస్తుందని ఆశించిన రైతులకు కన్నీరే మిగిలింది. అధిక వర్షాలతో జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పత్తి దెబ్బతినడంతో కోట్ల రూపాయల పెట్టుబడి మట్టిపాలైంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, సేద్యపు తదితర వాటి కింద ఎకరాకు రూ. 40వేల వరకు ఖర్చు చేశారు. ఎర్ర, నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పత్తి పంట కాయ దశకు వచ్చే సమయానికి వైరస్ సోకింది. పంట ఎర్రగా మారి ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా అందని స్థితిలో ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కూడా ఇదే తెగులు రావడంతో కనీస దిగుబడి కూడా అందలేదని, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి అదుకోవాలని కోరుతున్నారు. గతేడాది పొగాకు సాగు చేశాం. మంచి దిగుబడి వచ్చినా మద్దతు ధర లేక చాలా నష్టపోయా. ఈ ఏడాది నాకున్న ఎనిమిది ఎకరాల్లో పత్తి సాగుచేశా. కాయదశకు వచ్చే సరికి వర్షాలు అధికంగా రావడంతో తేమ అధికమై పంటకు వైరస్ సోకి ఎర్రగా మారింది. ఎకరాకు రూ. 40వేల ప్రకారం రూ.3 లక్షల పెట్టుబడులు పెట్టా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి. –బజారి, పత్తి రైతు, ఎస్హెచ్ ఎర్రగుడి నాకున్న 15 ఎకరాల్లో పత్తి సాగుచేశా. పంట వస్తే అప్పులు కట్టుకోవచ్చని ఆశ పడ్డాను. భారీ వర్షాలతో 8 ఎకరాల పొలానికి వైరస్ వచ్చి పంట ఎర్రగా మారడం ప్రారంభించింది. దీని నివారణకు మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. చెట్టుకు ఉన్న నాలుగైదు కాయలు మాత్రమే చేతికి వచ్చేలా కనపడుతోంది. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. పత్తి రైతును ప్రభు త్వం ఆదుకోవాలి. –నాగేశ్వరరావు, పత్తి రైతు, రామకృష్ణాపురం వరుసగా 15రోజులు వర్షాలు వచ్చి అధిక తేమ పొలంలో ఉండటంతో పత్తిని వైరస్ అశించింది. ఇది బాక్టీరియల్ బ్లైట్. దీనిని కోణీయ ఆకు మచ్చ తెగులు అని కూడా పిలుస్తారు. వైరస్ సోకిన పత్తి చెట్ల అవశేషాలను నాశనం చేస్తే దీన్ని నివారించవచ్చు. ఆమ్ల–డిలింట్ చేసిన విత్తనాలు వాడి, సరైన నీటిపారుదల పద్ధతులు నిర్వహిస్తే ఈ వైరస్ రాదు. – మహేంద్ర, ఏఓ, కృష్ణగిరి -
రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి ● మరో ముగ్గురికి గాయాలు
శిరివెళ్ల: ఆళ్లగడ్డ– నంద్యాల జాతీయ రహదారిపై గోవిందపల్లె– కాండ్ల పల్లె మధ్య కార్తికేయ గోడౌన్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐచర్ వాహన క్లీనర్ మృతి చెందాడు. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో సడన్గా నిలపడంతో అదే సమయంలో వెనుక వస్తున్న ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఢీ కొనింది. ఈ ప్రమాదంలో ఐచర్ వాహనంలో ఉన్న క్లీనర్ మహానంది మండలం బొల్లారానికి చెందిన కురువ కుమార్ పీటర్ (42)తీవ్రంగా గాయపడి ఇరుక్కపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన బాలాంజనేయులు, రాజోలి మల్లి, మహమ్మద్ బాషాలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తంగా నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇరువురు సంతానం ఉన్నారు. మృతుని భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ చిన్న పీరయ్య కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నారు. -
వైభవంగా అనంత చతుర్థి వేడుకలు
మంత్రాలయం : ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో అనంత చతుర్దశి వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో పూజా మందిరంలో విశేషంగా పూజలు చేపట్టారు. స్వర్ణ మండపంలో అనంత పద్మనాభ స్వామిని కొలువుంచి వేద ఘోష శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేకాది పుష్పార్చనలతో ఎంతో శోభాయమానంగా వేడుక చేపట్టారు. అలాగే శుక్ర, ఆది వారాలు సెలవులు కలిసిరావడంతో శ్రీమఠంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. తుంగాతీరం, మధ్వకారిడార్, అన్నపూర్ణ భోజనశాలతో భక్తుల కోలాహలం నెలకొంది. -
ఆందోళన బాటలో 104 ఉద్యోగులు
కర్నూలు (హాస్పిటల్): సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేయనున్నట్లు 104 అంబులెన్స్ ఉద్యోగులు చెప్పారు. ఈ మేరకు శనివారం సాయంత్రం డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన యాజమాన్యం భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ వారు గతం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వేతనాలను తగ్గించిందన్నారు. దీనిపై వివరణ అడుగగా మూడు నెలల నుంచి సరైన సమాధానం ఇవ్వడం లేదని, యాజమాన్యాన్ని కలవనివ్వటం లేదన్నారు. తమ సమస్యలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు అనేక వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదన్నారు. దీంతో 9వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే మరింత ఉధృతం చేస్తామన్నారు. తగ్గించిన జీతాలు బకాయిలతో సహా ఇవ్వాలని, ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని, పూర్వ సంస్థ బకాయిలను చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఔట్ సోర్సింగ్ జీతాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో డీఎంహెచ్ఓకు వినతిపత్రం అందజేశామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో 104 ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కళ్యాణి, ఇలియాస్, హాసన్, షరీఫ్, మంజుల, వినోద్, మల్లికార్జున, మధు, అజం ఉన్నారు. -
కళ్లలో కారం చల్లి.. కత్తులతో దాడి చేసి
మహానంది: అధికార పార్టీ నేతల అక్రమాలు, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తపై గుర్తుతెలియని దుండగులు కళ్లలో కారం పొడి చల్లి కత్తులతో దాడి చేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బుసిగారి నాగరాజు తమ్ముడు సురేష్పై నలుగురు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన నంద్యాల మండలం అయ్యలూరిమెట్ట వద్ద గురువారం రాత్రి జరిగింది. బాధితుల వివరాల మేరకు.. అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్ గురువారం రాత్రి ఆర్ఎంపీ వద్ద వైద్యం పొంది ఇంటికి వస్తుండగా అయ్యలూరిమెట్ట సమీపంలోని చెరువు, గోదాం ప్రాంతంలో నలుగురు అటకాయించారు. కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. అక్కడున్నవారు గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యారు. సురేష్ ను స్థానికులు 108లో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడి విషయమై ఎస్ఐ గంగయ్యయాదవ్ను వివరణ కోరగా బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే దౌర్జన్యాలు: శిల్పా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారని, ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ఇప్పటికే నాలుగు హత్యలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేష్ ను ఆస్పత్రిలో పరామర్శించిన శిల్పా.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని, లేదంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్వగ్రామంలోనే ఓ యువకుడిపైన, వైశ్యులతో పాటు మరికొందరిపైనా దాడి చేశారన్నారు. గ్రామాల్లో పదిమంది టీడీపీ నాయకులు ఉంటే తలా ఒక బెల్ట్షాప్, మంత్రులకు శాఖల తరహాలో టీడీపీ నాయకులకు దోపిడీ శాఖలు కేటాయించారని ఆరోపించారు. అందరినీ గుర్తుపెట్టుకుంటామని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఎమ్మెల్యే దాడి చేసినా సీఎం, డిప్యూటీ సీఎం స్పందించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. -
ముమ్మరంగా సంతకాల సేకరణ
కర్నూలు(అర్బన్): కర్నూలు జిల్లాకు స్వర్గీయ దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమం ముమ్మరంగా సాగుతోందని జిల్లా సాధన సమితి గౌరవాధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మిలాద్ ఉన్ నబీ పర్వదినంతో పాటు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ జరుగుతున్న నేపథ్యంలో రాజ్విహార్, జిల్లా పరిషత్ ప్రాంగణంలో ముస్లింలు, వివిధ రాజకీయ, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాధన సమితి ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వై.జయరాజ్ ఉద్యమానికి మద్దతు తెలియజేశారు. -
మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.ప్రసూన హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆమె నగరంలోని రెండు బీసీ కళాశాల బాలికల వసతి గృహాలు, ఒక ప్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వసతి గృహాల్లోని పరిసరాలను పరిశీలించి మరింత శుభ్రంగా ఉంచుకోవాలని వసతి గృహ సంక్షేమ అధికారులను ఆదేశించా రు. అలాగే వంట గది, స్టోర్ రూమ్ను తనిఖీ చేసి విద్యార్థుల కోసం వండిన వంటకాలను పరిశీలించా రు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని పలు హాస్టళ్లలో మెనూ సక్రమంగా పాటించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. తాను చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఎక్కడైనా విద్యార్థుల నుంచి ఫి ర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. ఈ నేపథ్యంలో నే ఆయా వసతి గృహాల్లోని విద్యార్థినులతో హాస్టళ్లలో అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. -
ఆరు గ్రామాల్లోనే పంపిణీ..
బండి ఆత్మకూరు: మండలంలో 20 గ్రామపంచాయతీలో 27 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. యూరియా కోసం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాశారు. అయితే మండలానికి ప్రభుత్వం 156 టన్నుల యూరియా మాత్రమే కేటాయించగా అది కూడా కేవలం బండిఆత్మకూరు, సంత జూటూరు, ఎరగ్రుంట్ల, పెద్దదేవలాపురం, భోజనం, సింగవరం రైతు భరోసా కేంద్రాలకు మాత్రమే సరఫరా చేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజుల నుంచి ఎదురుచూస్తున్నప్పటికీ ఒక బస్తా కూడా ఇవ్వక పోతే ఎలా అంటూ మండిపడ్డారు. బండిఆత్మకూరులో రైతులు గుమికూడటంతో పోలీసులు వచ్చి రంగ ప్రవేశం చేసి టోకెన్లు ఇచ్చి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. -
13 నుంచి ఎద్దుల బలప్రదర్శన పోటీలు
గోనెగండ్ల: స్థానికంగా వెలసిన చింతలాముని, నల్లారెడ్డి స్వాముల వారి దశమి ఉత్సవాల సందర్భంగా గోనెగండ్ల ట్రాక్టర్స్ యూనియన్ సహకారంతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రాక్టర్స్ యూనియన్ నాయకులు ఉసేన్, శివన్న, నూర తెలిపారు. శుక్రవారం స్థానిక హైస్కూల్ ఆవరణలో పోటీల కరపత్రాలను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ దశమి సందర్భంగా ఈనెల 13 నుంచి 15 తేదీ వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13న నాలుగు పళ్ల విభాగం 14న ఆరు పళ్ల సైజు, 15న న్యూ కేటగిరి ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు తెలిపారు. వివరాలకు సెల్ 9949151807, 8522014358, 9394959515 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రహంతుల్లా, గోపాల్, వెంకటేష్, మాబు, భాస్కర్ పాల్గొన్నారు. -
పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు
జూపాడుబంగ్లా: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 30 వేల నుంచి 32 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,16,422 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో 883.60 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ 2, 4, 5, 6,7 గేట్ల అడుగు మేర ఎత్తి 32 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 13 వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ (జీఎన్ఎస్ఎస్) కాల్వకు 13 వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 6వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. ‘ఫారెస్ట్’ పోస్టుల భర్తీకి రేపు స్క్రీనింగ్ టెస్ట్ కర్నూలు (సెంట్రల్): ఫారెస్ట్ శాఖలోని అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ను నిర్వహిస్తున్నట్లు డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించే అటవీ శాఖ పరీక్షల నిర్వహణపై వివి ధ శాఖల అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా పరీక్షల కోసం జిల్లా లో 33 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన పరీక్షను 3 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, లేదంటే ఏదైనా గుర్తింపు కార్డులను హాల్టిక్కెట్తో పాటు తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని 15 నిమిషాలకు ముందుగానే సూచించారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరన్నారు. 632 బస్తాల ఎరువులు సీజ్ గడివేముల: మండల కేంద్రం గడివేములలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఎరువులు దుకాణాలపై దాడులు చేసి 632 ఎరువుల బస్తాల్ సీజ్ చేశారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడటంతో విజిలెన్స్ సీఐ పవన్ కుమార్, డీసీటీఓ వెంకటరమణ తదితరులు మూడు దుకాణాల్లో తనిఖీలు చేశారు. ధనలక్ష్మీ ఎరువుల దుకాణంలో యూరియా బస్తా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించి 266 బస్తాలు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అదే విధంగా వెంకటేశ్వర ట్రేడర్స్లో 20.20.0.13 బస్తాలు 220, దుర్గ భవాని దుకాణీలో 146 బస్తాలు సీజ్ చేశామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొందరు వ్యాపారులు యూరియాను నిల్వ ఉంచి అధిక ధరలకు అమ్మే ప్రయ త్నాలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. వ్యాపారులు కృత్రిమ కొరత సష్టించి యూరియా అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఆ వైపు పడవెళ్లిపోతుంది..
తెలంగాణ రాష్ట్రం పర్యాటక అభివృద్ధిలో భాగంగా పడవ ప్రయాణం కూడా అందుబాటులోకి తెచ్చింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం బోటు షికార్ను ఎప్పుడో ప్రారంభించింది. అంతేకాకుండా సోమశిల నుంచి పాతాళగంగకు కృష్ణానదిపై బోటులో ప్రయాణిస్తూ నల్లమల అందాలను ఆస్వాదించవచ్చు. అక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేసి పర్యాటకులు బస చేసే అవకాశం కల్పించింది. ఈ గట్టున సంగమేశ్వరం కూడా ఇందుకు అనువుగా ఉన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో హడావుడి చేసి చేతులెత్తేసింది. సంగమేశ్వర క్షేత్రానికి సమీపంలోనే రాష్ట్రంలోనే ఏకై క సరస్వతి అమ్మవారు కొలువైన క్షేత్రం కొలను భారతి. ఈ రెండు కేంద్రాలను శ్రీశైలం నుంచి పర్యాటకులు కృష్ణానది మీదుగా ప్రయాణించి దర్శించుకునే అవకాశం ఉంది. ఆ దిశగా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ఆలోచన చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
పర్యాటకం అభివృద్ధికి మార్గాలెన్నో..
శ్రీశైలం, సున్నిపెంట ప్రాంతాల్లో కోకోల్లలుగా హిల్ వ్యూ ప్రదేశాలు ఉన్నాయి. ఏపీ టూరిజం శాఖ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దైవ దర్శనానికి వచ్చిన పర్యాటకులు రెండు, మూడు రోజులు ఇక్కడే బస చేసి పర్యాటక ప్రాంతాలను తిలకించడంతో టూరిజం అభివృద్ధితో పాటు పాటు స్థానిక యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడతాయి. ● శ్రీశైలానికి 17 కిలోమీటర్ల దూరంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి భక్తులు అధికసంఖ్యలో అసక్తి చూపుతారు. పూర్తిగా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో టూరిజం శాఖ ఆ దిశగా ఆలోచనలు చేసి ఇష్టకామేశ్వరి జంగిల్ సఫారీ ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం నెక్కంటి జంగిల్ సఫారీ పేరుతో ఇష్టకామేశ్వరి దర్శనానికి ప్రైవేట్ జీపుల ద్వారా భక్తులను అనుమతిస్తున్నారు. అలాగే అటవీశాఖ అధికారులు ఓపెన్టాప్ జీపులను ఏర్పాటు చేసి అడవిలో సంచరించే జంతువులను పర్యాటకులు వీక్షించేలా ఏర్పాట్లు చేయవచ్చు. ● తెలంగాణ ప్రాంతంలోని అమ్రాబాద్ వద్ద ఉన్న అక్టోపస్ వ్యూ పాయింట్ మాదిరిగా శ్రీశైలం సమీప నల్లమల అడవుల్లో ఏర్పాటు చేయవచ్చు. అడవుల్లో పర్యాటకులు ఒకరోజు విడిది చేసేలా టూరిజం శాఖ రిసార్ట్స్ నిర్మించవచ్చు. కాగా ఈ ప్రాంతం టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో అనుమతులకు పాలకులు కృషి చేయాల్సి ఉంది. ● నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని సున్నిపెంట బయోడైవర్శిటీ ల్యాబ్, ఎకలాజికల్ పార్క్ అలాగే పర్యావరణ విజ్ఞాన కేంద్రం మూడింటిని కలుపుతూ ఎకో టూరిజంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తెస్తే పర్యాటకులు మరింత పెరిగే అవకాశం ఉంది. -
ఎక్కువ చదివారని ఉద్యోగం ఇవ్వడం లేదు
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మేం ఫార్మా–డి కోర్సును పూర్తి చేశాం. ఎంబీబీఎస్తో సమానంగా సబ్జెక్టులు చదివి, ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేసి పట్టా తీసుకుని బయటకు వచ్చాం. ఇప్పుడు మాకు ఉద్యోగం ఇచ్చేవారే కరువయ్యారు. బి.ఫార్మాసీ అర్హతతో ఉన్న ఉద్యోగాలకు వెళితే మీరు చాలా ఎక్కువ చదివారని, ఈ ఉద్యోగం మీకివ్వలేమని చెబుతున్నారు. మాలాంటి వారి సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. – డాక్టర్ ఎస్. లక్ష్మీకాంత్, ప్రెసిడెంట్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఏపీ -
విలువలతో కూడిన విద్యనందించాలి
● మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయులు విద్యార్థుల కు విలువలతో కూడిన విద్యను అందించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం–2025 కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, డీఈఓ జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నా రు. ముందుగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి చక్కగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే విధంగా వారిని తీర్చిదిద్దాలన్నారు. బాలరాజు మాస్టార్ ఎప్పటికీ మరిచిపోను.. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావా లన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ చూపాలనాన్నారు. మొదటి పోస్టింగ్ విజయనగరం జిల్లాలో చేసినప్పుడు ఆఫీస్ ముందు ఒక పెద్ద హోర్డింగ్ పెట్టి అందులో విద్యాభివృద్ధికి సంబంధించిన మంచి మంచి సూక్తులు రాయించడం జరిగిందని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మారుమూల గ్రామంలో 35 ఇల్లు ఉన్న ఒక పల్లె నుంచి వచ్చి ఈరోజు కలెక్టరుగా అందరి ముందు మాట్లాడుతున్నాను అంటే తల్లిదండ్రులు వారు పెంచిన విధానం వారు నేర్పిన విలువలు నాకు అక్షరాభ్యాసం చేసిన బాలరాజు మాస్టారే కారణమన్నారు. అన్నపూర్ణ లెక్కల టీచర్కి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మానం... జిల్లా వ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమా రి సత్కరించి, జ్ఞాపికా ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డిప్యూటీ డీఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిని సన్మానిస్తున్న మంత్రి, కలెక్టర్ తదితరులు -
డాక్టర్.. ఉద్యోగాల్లేవ్!
● నిష్ప్రయోజనంగా మారిన ఫార్మా–డి కోర్సు ● ఉమ్మడి జిల్లాలో 1400 మందికి పైగా నిరుద్యోగులు కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఆఫ్ ఫార్మసి (ఫార్మా–డి) కోర్సును పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కోర్సును 2008లో అప్పటి యుపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కోర్సు చేసిన వారికి డాక్టర్తో సమానంగా హోదా లభిస్తుందని చెప్పడంతో అప్పట్లో విద్యార్థులు చాలా మంది ఆసక్తి చూపించారు. కర్నూలు జిల్లాలో రెండు, నంద్యాల జిల్లాలో రెండు ఫార్మసి కాలేజీల్లో ఒక్కో దాంట్లో 30 సీట్ల చొప్పున కోర్సును ప్రారంభించారు. అప్పట్లో ఎంబీబీఎస్లో సీటు రాని వారు డెంటల్ లేదా ఫార్మా–డి కోర్సును ఎంచుకునేవారు. కొత్త పోస్టులు లేవు ఎంబీబీఎస్తో సమానంగా ఈ కోర్సు ఆరు సంవత్సరాలు(5 ప్లస్ 1 సంవత్సరం ఆసుపత్రిలో ఇంటర్నిషిప్) చదవాల్సి ఉంది. క్లినికల్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ డాక్టోరల్ ప్రోగ్రామ్, హ్యూమన్ అనాటమి అండ్ ఫిజియాలజీ, ఫార్మకాలజి మొదలైన వాటితో పాఠ్యాంశాలు బోధించారు. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఆధారంగా రోగులకు హేతుబద్ధమైన డ్రగ్ థెరపిని అందించేందుకు డ్రగ్ జ్ఞానాన్ని వర్తింపజేసేందుకు సహాయపడుతుంది. క్లినికల్ ఫార్మాసిస్ట్ల పాత్ర అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా గుర్తించారు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ కోర్సును ఆమోదించింది. ఒక విధంగా చెప్పాలంటే పేరు ముందు డాక్టర్ అని రాసుకోవచ్చని అప్పట్లో విద్యార్థులను ఊరించారు. ఈ కోర్సు చదివిన వారికి ఫార్మా కంపెనీల్లో రీసెర్చ్ విభాగంలో ఉద్యోగంలో చేరవచ్చని చెప్పారు. అయితే వీరిని ఉపయోగించేందుకు కొత్త పోస్టులు సృష్టించలేదు. -
చెల్లని చెక్కులా మారిన ఫార్మా–డి పట్టా
కళాశాలల్లో ఆరేళ్ల పాటు ఎంబీబీఎస్తో సమానంగా చదివిన ఫార్మ్–డి విద్యార్థులు పట్టా చేతిలో తీసుకుని బయటకు వస్తే వారికి ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తోంది. ఈ పట్టాతో ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు. ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా వీరి కోసం పోస్టులను సృష్టించలేదు. ప్రైవేటుకు వెళితే మీ కంటే బి.ఫార్మసి వారిని తీసుకుంటే మేలని, వారి కంటే మీది ఉన్నతమైన అర్హత అవుతుందని, మీ లాంటి వారితో పనిచేయించుకోవడం కష్టమని దెప్పి పొడిచారు..ఇంకా పొడుస్తున్నారు. 2013 తర్వాత పట్టా తీసుకుని ఇప్పటి వరకు 1400 మంది దాకా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫార్మ్–డి నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలిసి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. -
హెలిటూరిజం మళ్లీ వచ్చేనా..
శ్రీశైల మహాక్షేత్ర ఖ్యాతి విశ్వవ్యాప్తంగా విస్తరించడంతో వివిధ దేశాల నుంచి భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి భక్తుల సౌకర్యార్థం దేవస్థానం, ఏవియేషన్ సంయుక్తంగా హెలి టూరిజం ఏర్పాటు చేసింది. 2016, ఆగస్టు 28న హెలి టూరిజంను అప్పటి దేవస్థాన ఈఓ నారాయణ భరత్గుప్తా ప్రారంభించారు. సమ్మిట్ ఏవియేషన్ సంస్థ ద్వారా హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సర్వీసును నడిపింది. అలాగే లోకల్గా భక్తులు, స్థానికుల సౌకర్యార్థం జాయ్ ట్రిప్ను సైతం ఏర్పాటు చేసింది. హెలి టూరిజానికి భక్తుల నుంచి ఆదరణ ఉన్నప్పటికీ అర్దాంతరంగా నిలిపివేశారు. యాత్రికులతో శ్రీశైలం చేరుకున్న హెలికాప్టర్ (ఫైల్) -
సురవరం స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు
● సురవరం సుధాకర్రెడ్డికి నివాళి అర్పించిన వివిధ రాజకీయ పార్టీల నేతలు కర్నూలు(అర్బన్): పేద ప్రజల కోసం జరిగిన అనేక ఉద్యమాలకు సురవరం సుధాకర్రెడ్డి నాయకత్వం వహించారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా ఉద్యమాలు చేపడతామని వక్తలు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను సీపీఐ జిల్లా అధ్యక్షులు కే గిడ్డయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముందుగా సురవరం సుధాకర్రెడ్డి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మాట్లాడుతూ రెండు సార్లు ఎంపీగా విజయం సాధించినా సురవరం నిరాడంబరమైన జీవితాన్ని గడిపారన్నారు. ధనిక కుటుంబంలో జన్మించిన సురవరం పేదల పక్షాన నిలిచిన వామపక్ష యోధుడని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ కొనియాడారు. నేటి తరానికి సురవరం ఎంతో ఆదర్శమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో విద్యార్థి దశ నుంచే సురవరం సుధాకర్రెడ్డి ఉద్యమ బాట పట్టారన్నారు. అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పీ రామచంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలోని మొలగవెళ్లి గ్రామంలో జరిగిన భూపోరాటంలో 1100 ఎకరాలను పేదలకు పంపిణీ చేయించడంలో సురవరం కీలక పాత్ర పోషించారన్నారు. సీనియర్ నాయకులు సూర్యనారాయణరెడ్డి, కే రామాంజనేయులు, ఎస్ మునెప్ప, పీ రామక్రిష్ణారెడ్డి, నాగన్న, సీపీఐ ఎంఎల్ నాయకులు సుంకన్న, బస్తిపాడు రామక్రిష్ణారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, రవిగువేరా తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్వీ మోహన్రెడ్డి -
రైతుల ఉసురుకు కూటమి కొట్టుకుపోతుంది!
● టీడీపీ నాయకులకే యూరియా ● ఈ కష్టాలు రైతులకు ఎప్పుడూ రాలేదుబొమ్మలసత్రం: రైతుల ఉసురు పోసుకుని కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కొట్టుకుపోతుందని ఎమ్మెల్సీ ఇషాక్బాషా విమర్శించారు. నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ పనులు చేసుకోనివ్వకుండా కూటమి ప్రభుత్వం యూరియా కోసం రోడ్డెక్కేలా చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తే రైతులపై కేసులు పెట్టి కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్రానికి అరకొరగా వచ్చిన యూరియాను సీఎం చంద్రబాబు ఇచ్చిన దోచుకో.. దాచుకో.. పిలుపు మేరకూ టీడీపీ నాయకులు యూరియాను దోచుకోవడం, బ్లాక్ మార్కెట్కు తరలించడం జరుగతుందన్నారు. సెప్టెంబర్ నెలలో 1.55 లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి అవసరం కాగా 94 వేల టన్నులు మాత్రమే పంపిణీ జరిగిందన్నారు. తక్కువ నిల్వలను కూడా కావాల్సిన వారికి ఇచ్చుకుంటున్నారని విమర్శించారు. మినుములు ప్రభుత్వం రూ.8 వేలు గిట్టుబాటు ధర కల్పిస్తుందని చెబుతున్నా రూ. 4 వేలు మాత్రమే లభిస్తుందన్నారు. రైతుల సమస్యల పరిష్కరించాలని వైఎస్సార్సీపీ పిలుపు మేరకూ జిల్లా కలెక్టర్కు ఈనెల 9న వినతి పత్రం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో పుష్కలంగా యూరియా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులకు యూరియా పుష్కలంగా లభించేదని పీఏసీఎస్ మాజీ ప్రెసిడెంట్ రామసుబ్బారెడ్డి గుర్తుచేశారు. కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులు సాగునీటి, ఎరువుల కోసం రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యూరియా సరఫరాలో విఫలమైన చంద్రబాబు.. యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మార్కెట్యార్డు చైర్మన్లు పురుషోత్తంరెడ్డి, విజయశేఖర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సెక్రెటరీ సోమశేఖర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు బసవేశ్వరరెడ్డి, కౌన్సిలర్ ఆరిఫ్నాయక్, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. -
రక్త పరీక్షలు చేయించండి
జూపాడుబంగ్లా: జ్వరాల బారిన పడిన వారికి రక్త పరీక్షలు చేయించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన జూపాడుబంగ్లా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మౌలిక వసతులను గురించి డాక్టర్ గంగాధర్ను అడిగి తెలుసుకున్నారు. విషజ్వరాలు వ్యాపించకుండా నిరంతరం ఆశ, ఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించాలన్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని ఆయన హెచ్చరించారు. అనంతరం సమీపంలోని కస్తూర్బా పాఠశాలను పరిశీలించి అందులోని విద్యార్థుల ఆరోగ్యస్థితిగతులపై ఆరా తీశారు. ఎవ్వరికై నా జ్వరం, వాంతులు, విరేచనాలు, దగ్గు, జలుబు, జ్వరం, డెంగూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపించినట్లయితే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈయన వెంట హెల్త్సూపర్వైజర్లు విజయలక్ష్మమ్మ, రాముడు, ల్యాబ్అసిస్టెంటు చెంచన్న, వైద్యసిబ్బంది ఉన్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కోడుమూరు రూరల్: ఆర్టీసీ బస్సు గేర్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శుక్రవారం మండల ంలోని వెంకటగిరి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. కోడుమూరు నుంచి వెల్దుర్తికి 21 మంది ప్రయాణికులతో డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం బయలుదేరింది. అయితే వెంకటగిరి గ్రామం దాటిన తర్వాత అనుగొండ రోడ్డులో బస్సుకు సంబంధించిన గేర్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదం నుంచి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరు క్షేమంగా బయటపడ్డారు. 13న నర్సెస్ అసోసియేషన్ సమావేశం కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం ఈ నెల 13వ తేదిన నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు ఎం. లీలావతి చెప్పారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యదర్శి సి.బంగారి, ట్రెజరర్ కె.లక్ష్మీనరసమ్మలతో కలిసి ఆమె మాట్లాడారు. ఈ సర్వసభ్య సమావేశం ఆసుపత్రిలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. సమావేశానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.రాధమ్మ, జనరల్ సెక్రటరి ఎస్. కోటమ్మ హాజరవుతారన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోని సభ్యులందరూ తప్పకుండా సమావేశానికి హాజరుకావాలని కోరారు. ‘పల్లెకు పోదాం’ను విజయవంతం చేయండి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నేటి (శనివారం) నుంచి ‘పల్లెకు పోదాం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్బాషా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 79 మంది ప్రత్యేకాధికారులను నియమించినట్లు చెప్పారు. శుక్రవారం ఆయన మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పల్లెలను బాగు చేయాలన్న ఉద్దేశంతో పల్లెకు పోదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రతి మండలంలో 3 గ్రామాలు చొప్పున 79 గ్రామాలను ఎంపిక చేశామని, ఇందుకోసం 79 మంది అధికారులను నియమించినట్లు చెప్పారు. వారు ఏ గ్రామాలకు వెళ్లాలనే విషయాన్ని వారికి తెలిపినట్లు చెప్పా రు. వీరంతా శనివారం ఉదయం 9 గంటలకు నిర్ధేశించిన గ్రామానికి చేరుకొని పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, హాస్పిటళ్లు, హాస్టల్ తదితర ప్రభుత్వ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలన చేస్తారు. తాగునీటి సరఫరా, వైద్య సేవలు, ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యం కార్యక్రమాలను పరిశీలిస్తారన్నా రు. నిర్దేశించిన గ్రామాలకు తహసీల్దార్, ఎంపీడీఓ, ఈఓఆర్డీ తమ బృందాలతో స్పెషల్ ఆఫీసర్ వెంట వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా సహృదయంతో నిర్వహించాలన్నారు. స్వచ్ఛాంధ్ర అ వార్డులకు సంబంధించి ఆయా శాఖలు సమాచారాన్ని 9లోపు పంపాలన్నారు. జెడ్పీ సీ ఈఓ నాసరరెడ్డి, డీపీఓ భాస్కర్ పాల్గొన్నారు. -
అదృశ్యమైన మహిళ శవమై తేలి..
● అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు పాములపాడు/కర్నూలు(రూరల్): ఐదు రోజుల క్రితం అదృశ్యమైన కర్నూలు మండలం పూడూరు గ్రామానికి చెందిన మైథిలీ (24) శుక్రవారం బానకచెర్ల గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ పవర్హౌస్ వద్ద శవమై కనిపించింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. రెండేళ్ల క్రితం మైథిలీకి వివాహం కాగా.. ఏడాది క్రితం భర్తతో విడిపోయి పుట్టింటికి చేరింది. కర్నూలు నగరంలో ఓ కర్రీ పాయింట్లో రొట్టెలు చేస్తూ జీవనం సాగిస్తోంది. అక్కడే ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. కాగా గత నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో పూడూరు గ్రామంలో కేసీ కెనాల్ వద్ద దుస్తులు ఉతికేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె సోదరి భారతి కేసీ కెనాల్ వద్దకు వెళ్లి చూడా మైథిలీ కనిపించ లేదు. అక్కడ మెట్ల వద్ద కేవలం ఒక డబ్బా మాత్రమే కనిపించింది. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మద్యం సేవించి అటుగా వెళ్లినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా మైథిలీ మొబైల్ అదృశ్యమైన రెండు రోజులకు ఒక వ్యక్తికి ఆమె ఫోన్ దొరకగా మరో వ్యక్తి ద్వారా కుటుంబ సభ్యులకు పంపించారు. మొబైల్లో సిమ్ కార్డు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 1వ తేదీన మైథిలీ తండ్రి బోరెల్లి ఫిర్యాదు మేరకు కర్నూలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం బానకచెర్ల గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ పవర్హౌస్ వద్ద శవమై కనిపించింది. మృతదేహం బాగా ఉబ్బిపోయి గుర్తు పట్టని విధంగా మారడంతో ఆమె ధరించిన దస్తులను బట్టి కుటుంబీకులు మైథిలీగా గుర్తించారు. సమాచారం అందుకున్న కర్నూలు తాలుకా పోలీసు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గ్రామానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. -
ఓటీపీ జాప్యం.. అంతా గందరగోళం
వెలుగోడు: ఓటీపీ ద్వారా యూరియా పంపిణీ చేపట్టడంతో రైతులు గందరగోళానికి గురయ్యారు. గంటల తరబడి లైన్లో నిలబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతుల భూమి డాక్యుమెంట్స్ ఆధార్ లింక్, సెల్ నెంబర్ లింక్ లేకపోవడంతో ఓటీపీ మరింత ఆలస్యం అవుతుంది. మరికొందరి రైతులకు భూమి పత్రాలు ఆన్లైన్లో లేకపోవడం వల్ల ఓటీపీ రావడం లేదు. ఇలాంటి రైతులకు యూరియా ఇవ్వడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీ ఆలస్యమవుతుండటంతో వ్యవసాయ శాఖ అధికారులు టోకన్లు జారీ చేసి ఒక్కో పాస్బుక్కు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు.కౌలు రైతులకు, సెల్ నెంబర్ లింక్ లేనివారికి, డాక్యుమెంట్స్ సరిగా లేని రైతులకు మాత్రం యూరియా దక్కేలా లేదు. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
యాళ్లూరులో క్యూలో ఉన్న రైతులుగోస్పాడు: యాళ్లూరు గ్రామంలో రైతు సేవాకేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. శుక్రవారం మండలంలోని యాళ్లూరు గ్రామంలో అధికారుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. యాళ్లూరుకు 532 యూరియా బ్యాగ్లు (24 టన్నులు) మంజూరైంది. ఎకరాకు ఒక బస్తా చొప్పున మూడు బస్తాల వరకు మాత్రమే పరిమితం చేశారు. పది ఎకరాలు ఉన్నా మూడు బస్తాలే పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. జిల్లాకు యూరియా చేరింది.. శుక్రవారం పంపిణీ చేస్తామని అధికారుల ప్రకటనతో రైతులు ఆర్ఎస్కే, సహకార కేంద్రాల వద్ద ఉదయం నుంచి పడిగాపులు కాశారు. అయితే అరకొర కేటాయింపులతో కొన్ని చోట్ల ఒకటి, రెండు బస్తాలతో సరిపెట్టారు. పలు చోట్ల సాయంత్రం పొద్దు పోయిన తర్వాత పంపిణీ చేయాల్సి వచ్చింది. ఇంకెన్నాళ్లు యూరియా కష్టాలు అంటూ కూటమి ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. రైతులంటే ఇంత అలుసా.. పుష్కలంగా ఎరువులు ఉన్నాయంటూనే అరకొరగా ఇస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోతిరెడ్డిపాడును పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్
జూపాడుబంగ్లా/పాములపాడు: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థలను కృష్ణా రివర్ మేనేజ్మెంటు బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ బీపీ పాండే, కమిటీ మెంబర్ కేకే జాన్గిడ్ పరిశీలించారు. పోతిరెడ్డిపాడు కొత్త, పాత హెడ్రెగ్యులేటర్లను జలవనరులశాఖ నంద్యాల జిల్లా ఎస్ఈ ప్రతాప్ చూపించారు. పాత హెడ్రెగ్యులేటర్ శిథిలమైనందున కొత్త దాని ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. మొత్తం 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకొనే అవకాశం ఉన్నా ప్రస్తుతం 30 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటిని బానకచర్ల నీటినియంత్రణ సముదాయం నుంచి తెలుగుగంగ, కేసీ ఎస్కేప్, గాలేరునగరి సుజలశ్రవంతి కాల్వలకు సరఫరా చేస్తామని కమిటీ ఛైర్మన్, మెంబర్కు తెలిపా రు. ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడు నుంచి 130టీఎంసీల నీటిని విడుదల చేశారమని వివరించారు. ఏపీ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలో లేవు కేఆర్ఎంబీ చైర్మన్గా బీపీ పాండే కొత్తగా బాధ్యతలు చేపట్టినందున ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు ఎస్ఈ ప్రతాప్ విలేకరులకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించలేదని, ఏపీలోని ప్రాజెక్టులు కూడా కేఆర్ఎంబీ పరిధిలో లేవన్నారు. పర్యవేక్షణలో భాగంగా వారు ప్రాజెక్టులను పరిశీలించి నీటివిడుదల వివరాలను తెలుసుకొంటున్నట్లు తెలి పారు. కేఆర్ఎంబీ ఆదేశాలను లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రం ఎడాపెడా విద్యుత్ను ఎందుకు ఉత్పత్తిచేస్తోందని విలేకరులు ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా కాకుండా తెలంగాణ రాష్ట్రం 2,500 క్యూసెక్కుల కన్నా ఎక్కువ నీటిని వినియోగించుకొనే అవకావం లేదని పేర్కొన్నారు. వీరి వెంట తెలంగాణ కేఆర్ఎంబీ ఏడీఈ పవన్, ఏఈ రాజశేఖర్, పోతిరెడ్డిపాడు పర్యవేక్షణ ఈఈ నాగేంద్రకుమార్, డీఈలు సుబ్రమణ్యంరెడ్డి, నగేష్, రఘురాంరెడ్డి, జేఈలు విష్ణువర్ధన్రెడ్డి, తిమ్మారెడ్డి, దేవేంద్ర ఉన్నారు. -
శ్మశానం పేరిట కుంట పూడ్చి.. చేతులు కలిపి ఆక్రమింగేసి!
● నీటి కుంటను కబ్జా చేసిన టీడీపీ నేతలు ● అనుమానం రాకుండా ప్రజలను మభ్యపెట్టి ఆక్రమణ ● చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు రుద్రవరం: కూటమి ప్రభుత్వంలో వాగులు, వంక లు, చెరువులు, కుంటలకు భద్రత లేకుండా పోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు టీడీపీ నేతలు గద్దల్లా వాలుతున్నారు.అధికారుల అండదండలతో దర్జాగా కబ్జా చేసి సొంతం చేసుకుంటున్నారు. గ్రామ అవసరాల నిమిత్తం పూర్వం నుంచి ఉంటున్న నీటి కుంటను పూడ్చేసి పొలముగా మార్చినా అడిగే నాథుడే లేడు. టీడీపీ నేతలు ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మండలంలోని ఢీ.కొట్టాల నుంచి శ్రీరంగాపురం వేళ్లే దారి పక్కనే 226 సర్వే నంబరులో 7.50 ఎకరాల్లో ఓ కుంట ఉండేది. వర్షాకాలం నిండు కుండను తలపిస్తూ కళకలాడుతూ ఉండేది. ఆ కుంటలో నీరు నిల్వ ఉండటంతో పశువులు దాహం తీర్చుకునేందుకు, చుట్టు పక్కల ఉన్న వ్యవసాయ బోరు మోటర్లు రీచార్జ్ అయ్యేందుకు ఉపయోగ పడేది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆ కుంటను ఆక్రమించేందుకు ఢీ.కొట్టాలతో పాటు శ్రీరంగాపురం, ఎల్లావత్తుల గ్రామాల అధికార పార్టీకి చెందిన ఐదుగురు నాయకులు వేసిన పథకం పారింది. ఓ ఉన్నతాధికారికి ముడుపులు? నీటి కుంటను పూడ్చి పొలముగా మార్చడంలో ఓ ఉన్నతాధికారికి ముడుపులు అందాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నాయకుల ఆక్రమణలకు వంత పాడేందుకు లక్షల్లో తీసుకున్నారనే చర్చ జరు గుతోంది. గ్రామంలో కుంటను పూడ్చుతున్నారని గ్రా మస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడానికి ముడుపులే కారణమని తె లుస్తోంది. నీటికుంట ఆక్రమణపై ఆ గ్రామ వీఆర్వోను వివరణ కోరగా.. రెవెన్యూ రికార్డుల ప్రకారం అక్కడ కుంట ఉందన్నారు. ప్రస్తుతం అక్కడ ఆ కుంట ఆనవాళ్లు లేవని, కొంత స్థలంలో మట్టి తోలి చదును చేశారని, మిగిలినది అంతా పొలాలు అయ్యాయని చెబుతున్నారు. డీకొట్టాల వద్ద కుంటలో కొద్ది స్థలంలో మట్టి తోలిన దృశ్యం వరి సాగుకు మాగాణిగా మారిన కుంట -
‘శోభా’యమానం
కర్నూలు కల్చరల్: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుని నిమజ్జనోత్సవం గురువారం కర్నూలు నగరంలో కనుల పండువగా సాగింది. ఓల్డ్సిటీలోని రాంబొట్ల ఆలయం వద్ద నిమజ్జన శోభాయాత్ర పూజను జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ప్రారంభించారు. వేలాది భక్తుల హర్షధ్వానాల మధ్య శోభాయాత్ర ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా నగరం నడి మధ్యలో కేసీ కెనాల్లో విఘ్నేశ్వరునికి ఘనంగా వీడ్కోలు పలికారు. కేసీ కెనాల్కు ఇరువైపుల పది ఘాట్లలో ఏడు క్రేన్లు, స్టాంటన్ పురం మమతా నగర్ వద్ద ఘాట్లో ఒక క్రేన్తో, సంతోషనగర్ హైవే తుంగ భద్రా నది బ్రిడ్జి వద్ద నిమజ్జనం వైభవంగా నిర్వహించారు. వినాయక ఘాట్లో జ్యోతి ప్రజ్వలన, ధ్వజారోహణ, భరతమాత పూజ, వినాయక పూజలు చేసి కలెక్టరేట్ పరిపాలనా విగ్రహం, నగర పాలకం సంస్థ ఆధ్వర్యంలోని వినాయక విగ్రహాలతో నిమజ్జనం మొదలైంది. ఆర్ఎస్ఎస్ ప్రాంత సహ కార్యవాహక ఎం.శ్రీనివాసరెడ్డి ముఖ్య వక్తగా హాజరై సందేశమిచ్చారు. ప్రజలను సమైక్యం చేసేందుకే 1893లో బాల గంగాధర్ తిలక్ గణేష్ సామూహిక ఉత్సవాలను ప్రారంభించారన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా నిలుస్తున్నాయన్నారు. కొందరు సనాతన ధర్మాన్ని అంతం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారని.. అయితే అది అంత సులువు కాదన్నారు. నేటి తరానికి సనాతన ధర్మ, సంస్కృతి సంప్రదాయాలు తెలియజెప్పేందుకు వినాయక చవితి ఉత్సవాలు దోహదం చేస్తున్నాయన్నారు. సుమారు 1,700 విగ్రహాలు 2వేల మంది పోలీస్ల బందోబస్తు, 2వేల మంది స్వచ్ఛంద సేవకుల నడుమ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగింది. సంప్రదాయబద్ధంగా శోభాయాత్ర ఓల్డ్సిటీ కుమ్మరి వీధిలోని రాంబొట్ల ఆలయం వద్ద మొదటి విగ్రహానికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. అక్కడ వినాయక లడ్డూ ప్రసాదానికి వేలం నిర్వహించగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఐదో ఏడాది రూ.6,01,000లకు దక్కించుకున్నారు. శోభా యాత్ర సంప్రదాయ బద్ధంగా మేళతాళాలు, డ్రమ్ములు, కోలాటాలు, కర్రల విన్యాసాలు, చెక్క భజనల నడుమ సాగింది. స్వామి వివేకానంద సంస్కృత పాఠశాల, కేశవ మెమోరియల్ పాఠశాల విద్యార్థుల ఘోష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్నూలు నగరంలో ఆధ్యాత్మిక పరవళ్లు రాంబొట్ల దేవాలయం వద్ద తొలిపూజ వందలాది విగ్రహాలతో పండుగ వాతావరణం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కేసీ కెనాల్లో కనుల పండువగా నిమజ్జనం గట్టి పోలీసు బందోబస్తు మధ్య వీడ్కోలు అడుగడుగునా స్వచ్ఛంద సంస్థల సేవలు -
ఎదురు చూస్తున్నాం
గత ఏడాది సొంతపొలం ఎనిమిది ఎకరాలతోపాటు ఎకరా రూ. 18 వేలు కౌలు చెల్లించి మరో 12 ఎకరాల పొలాన్ని తీసుకుని శనగ పంట సాగు చేశాను. వాతావరణం అనుకూలించక దిగుబడులు తగ్గిపోయాయి. తెల్లశనగలో ఎకరాకు 5 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. దిగుబడులు చేతికందేనాటికి మార్కెట్లో క్వింటా రూ. 6,500 ధర ఉండటంతో ఈ ధరకు అమ్ముకోలేక పంట ఉత్పత్తులను ఎనిమిది నెలల నుంచి గోదాములో భఽద్రపరుచుకుని గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నాను. – అబ్రహం, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం -
ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిల్లల సంరక్షణ
కర్నూలు: ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిల్లల సంరక్షణ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీల వెంకట శేషాద్రి సూచించారు. జిల్లా న్యాయ సేవా సదన్లో పిల్లల కోసం స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం–2024పై బుధవారం వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని పిల్లల సంరక్షణ, రక్షణ బాధ్యత సంబంధిత ప్రభుత్వ శాఖలు తీసుకోవాలన్నారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం దక్కేలా చూడాలన్నారు. లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. దివ్యాంగులైన పిల్లలను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నట్లు రిసోర్స్ పర్సన్, కర్నూలు డిజేబులిటీ డిపార్టుమెంట్ అసిస్టెంట్ డైరక్టర్ రైస్ ఫాతిమా చెప్పారు. నంద్యాల అడిషఙనల్ డీఎంహెచ్ఓ శారదాబాయి మాట్లాడుతూ.. అవసరమైన పిల్లలకు చికిత్సలు, ఉచితంగా మందులు అందిస్తున్నట్లు చెప్పారు. బడికి వెళ్లని పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయ తెలిపారు. సమస్యలు ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి ఫోన్ చేయవచ్చన్నారు. -
రైతు సంక్షేమానికి ‘చంద్ర’గ్రహణం
● ఈనెల 9న అన్నదాతలతో ఆందోళనలు, నిరసనలు ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డికర్నూలు (టౌన్): రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ‘చంద్ర’గ్రహణం పట్టిందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. రైతుల గురించి ఏనాడైనా చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించిందా అని ప్రశ్నించారు. కల్లూరు లోని తన స్వగృహంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ఏడాదిన్నరలోపే కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు కేంద్రంతో కలుసుకొని రూ. 26 వేలు ఇస్తామని మొదటి సంవత్సరం ఎగ్గొటారన్నారు. ఇప్పుడు కేవలం రూ. 5 వేలు ఇచ్చారన్నారు. ఇది మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. యూరియా కోసం రైతుల పడిగాపులు యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోందని కాటసాని అన్నారు. రెండు నెలలైనా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడం దారుణమన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదన్నారు. తెలుగుదేశం నేతలే ఉద్దేశపూర్వకంగా యూరియాను బ్లాక్లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పొగాకు, మామిడి, మిర్చి, టమాటా, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర అందలేదన్నారు. రైతుల గోడు వినకుండా మద్యం, ఇసుక, మైనింగ్లలో టీడీపీ నేతలు బీజీగా ఉన్నారన్నారు. 9న ఆర్డీనో కార్యాలయాల వద్ద నిరసన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడలేదని కాటసాని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందాయన్నారు. ధరల స్థిరీకరణ పేరుతో జగనన్న రూ. 3 వేల కోట్లు నిధి కేటాయించారని, ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏడాది రైతులను ఆదుకున్నారన్నారు. రైతులను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు వచ్చాయన్నారు. ఈనెల 9న జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాతలతో కలసి నిరసన తెలపుతామన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. సమావేశంలో నగర పాలక డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కార్పొరేటర్ నారాయణ రెడ్డి, శివారెడ్డి, పాటిల్ హనుమంతరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక ‘పరిమళాలు’
● మల్లన్న పూలతో అగరుబత్తీలు శ్రీశైలం టెంపుల్: తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారికి అలంకరించే, ఆర్జిత సేవలకు వినియోగించే పూలను, తులసితో అగరుబత్తీలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆ స్ఫూర్తిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కొనసాగిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో కొలువుదీరిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు అలంకరించే, ఆర్జితసేవల్లో వినియోగించే పూలను, బిల్వపత్రాలను ఒకప్పుడు వ్యర్థంగా పడేసేవారు. ప్రస్తుతం వీటిని అగర్బత్తీలుగా మార్చడంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. స్వామివారి నిత్యకై ంకర్యానికి వినియోగించిన పూలు అగర్బత్తీలుగా.. గోశాల నుంచి వచ్చే వ్యర్థాలను ఆవుపేడ, గో పంచకం దూప్స్టిక్స్గా భక్తులను పరవశింపజేస్తున్నాయి. నేత్రదానంతో అంధత్వ నివారణ గోస్పాడు: నేత్రదానంతో అంధత్వ నివారణ సాధ్యమవుతుందని జిల్లా అంధత్వ నివారణ సంఘం కంటి వైద్యాధికారి డాక్టర్ కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గోస్పాడు మండలంలోని యాళ్లూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా అంధత్వ నివారణ సంఘం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ జనాభాలో 15శాతం మంది ప్రజలు అంధత్వంతో బాధపడుతున్నారన్నారు. మనిషి మరణించిన తర్వాత 4 నుంచి 6 గంటల్లోగా నేత్రదానం చేయవచ్చన్నారు. నేత్రదాయం చేయదలిచిన వారు 1919, 104, 108 వైద్య ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు భారతి, కిరణ్, మూర్తి, క్రిష్టకిశోర్ గుప్త, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు సీఐలకు పదోన్నతి కర్నూలు(టౌన్): కర్నూలు రేంజ్ పరిధిలో ఇరువురు సీఐలకు పదోన్నతి లభించింది. ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ సీఐగా పనిచేస్తున్న బీవీ మధుసూదన్ రావు, అలాగే మరో సీఐ బి.వి.శ్రీనివాసులుకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. -
నలుగురు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు
నంద్యాల(న్యూటౌన్): రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు నంద్యాల జిల్లాకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని పాములపాడు మండలంలోని కొత్త బానకచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం షేక్ మగ్బుల్బాషా, నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు పి.వెంకటసుబ్బయ్య, పాణ్యం మండలం బలపనూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుడు శేషఫణి, చాగలమర్రి మండలం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మయ్యలు రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు. మ్యాథ్స్ ఉపాధ్యాయుడు.. నంద్యాల టెక్కె మున్సిపల్ హైస్కూల్లో పి.వెంకటసుబ్బయ్య 1991 నుంచి 1998 వరకు మ్యాథ్స్ ఉపాధ్యాయుడిగా పని చేశారు. అనంతరం 1998 నుంచి 2016 వరకు నంద్యాల పట్టణంలోని కేఎన్ఎం మున్సిపల్ హైస్కూల్లో 18 సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. అలాగే టెక్కె మున్సిపల్ హైస్కూల్లో 2016 నుంచి 2025 వరకు పని చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్కు బదిలీ అయి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన సొంత గ్రామం కోవెలకుంట్ల మండలం బీజనవేముల కాగా తల్లిదండ్రులు సుబ్బరామయ్య, సిద్దమ్మలు. తెలుగు పండిట్.. చాగలమర్రి: స్థానిక జిల్లా పరిషత్ (ఓరియంటల్) బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ (స్కూల్ అసిస్టేంట్)గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మయ్య రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఎంపికయ్యారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో గురువారం హాజరు కావల్సిందిగా తనకు సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. ఈ అవార్డును ఈ నెల 5వ తేదీన విజయవాడలో అందుకోనున్నట్లు చెప్పారు. ప్రధానోపాధ్యాయుడు..పాములపాడు: కొత్తబానకచెర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న షేక్ మగ్బుల్ బాషా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను 1996 డిసెంబర్ 12న ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరానన్నారు. రాష్ట్ర అవార్డు తన బాధ్యతను పెంచిందన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
● రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి ● మరో కుమారుడి పరిస్థితి విషమం ప్యాపిలి: బొలేరో వాహనం మృత్యువులా దూసుకొచ్చింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో తండ్రి విజయుడు (45), తనయుడు లక్ష్మీప్రసాద్ (25) మృతి చెందారు. మరో కుమారుడు రవి(10) పరిస్థ్థితి విషమంగా మారింది. ఈ దుర్ఘటన ప్యాపిలి మండలం పెద్దపొదిళ్ల సమీపంలో పెద్దమ్మ గుడి వద్ద బుధవారం చోటుచేసుకుంది. చిన్నపొదిళ్ల గ్రామానికి చెందిన విజయుడు, లక్ష్మిదేవి దంపతులతో పాటు వారి కుమారులు లక్ష్మీప్రసాద్, రవి ద్విచక్రవాహనాలపై ప్యాపిలి నుంచి లక్ష్మిదేవి సొంతూరు రంగాపురం వెళ్లేందుకు బయలుదేరారు. పెద్దమ్మ గుడి వద్దకు రాగానే వర్షం కురుస్తుండటంతో రోడ్డు పక్కన ద్విచక్రవాహనాలు ఆపుకుని ఉన్నారు. ఇదే సమయంలో ప్యాపిలి వైపు నుంచి వచ్చిన బొలేరో వాహనం ద్విచక్రవాహనాలపైకి దూసుకువచ్చింది. ప్రమాదంలో లక్ష్మీప్రసాద్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవి, లక్ష్మీప్రసాద్, రవిలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కర్నూలులో చికిత్స పొందుతున్న విజయుడు కోలుకోలేక మృతి చెందాడు. పదేళ్ల వయస్సు ఉన్న రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. విజయుడు వ్యవసాయకూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. లక్ష్మీప్రసాద్ ప్యాపిలిలో ఓ దుకాణంలో గుమాస్తాగా పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఈ యువకుడి పెళ్లి కాలేదు. తండ్రీకుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో చిన్నపొదిళ్ల గ్రామంలో విషాదం అలముకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్యాపిలి పోలీసులు తెలిపారు. విజయుడు, లక్ష్మీప్రసాద్ (ఫైల్) -
మరికొందరికి జీవితాన్నిస్తూ!
మట్టిలో కలిసిపోతూ రక్తదానం, నేత్రదానంతో పాటు బ్రెయిన్డెడ్ అయిన వారి నుంచి అవయవాలను సేకరించి ఇతరులకు అమర్చేందుకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ద్వారా అవసరమైన క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇప్పటికే 30వేల మందితో అంగీకార పత్రాలు తీసుకున్నా ము. జిల్లాలో లక్ష మందితో అంగీకార పత్రాలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. యూరప్ దేశా ల్లో మాదిరిగా ఇక్కడ కూడా బ్రెయిన్డెడ్ అయిన వారికి ప్రత్యేక ఐసీయూ ఉంటే బాగుంటుంది. –డాక్టర్ కేజీ. గోవిందరెడ్డి, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్, కర్నూలు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి మాత్రమే అవయవాలను సేకరించి ఇతరులకు అమరుస్తారు. కిడ్నీలైతే బ్రెయిన్ డెడ్ అయిన వారి(కెడావర్),జీవించి ఉన్న వ్యక్తుల(లై వ్) నుంచి ఒక కిడ్నీని సేకరించి అవసరమైన వారికి అమరుస్తారు. ఇలా కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న వారు కొంత కాలం పాటు ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడితే జీవితాంతం హాయిగా జీవించవచ్చు. –డాక్టర్ అబ్దుల్ సమద్, యురాలజిస్టు, కర్నూలు నేను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మేల్ స్టాఫ్నర్సుగా విధులు నిర్వహిస్తూ 2023లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కో ఆర్డినేటర్గా శిక్షణ పొందాను. ఇప్పటి వ రకు ఐదుగురికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లో అవయవాలు ఇచ్చేలా వారి కుటుంబాలను కౌన్సిలింగ్ చేసి ఒప్పించాము. ఒక బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి ద్వారా సేకరించిన అవయవాలతో 8 మంది జీవితాలలో వెలుగు నింపవచ్చు. –టి.సంపత్, మేల్ స్టాఫ్నర్సు, జీజీహెచ్, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): అవయవదానమంటే ఇప్పటి కీ చాలా మందిలో అపోహలున్నాయి. మన అవ యవాలను బతికున్నప్పుడే సేకరించి ఇతరులకు అమరుస్తారని కొందరు, మరణించాక అవయవాలను తీస్తే వచ్చే జన్మలో సంబంధిత అవయవాలు లేకుండా జన్మిస్తారన్న మూఢనమ్మకంతో మరికొందరు అవయవదానానికి ముందుకు రావడం లేదు. ఇలాంటిి అపోహలను ఒకవైపు జీవనదాన్ ట్రస్ట్, మరోవైపు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలు తమ వంతుగా అవగాహన కల్పిస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల కాలంలో అవయవదానం చేయడానికి చాలా కుటుంబాలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు దాతలు ముందుకు వచ్చి తమ శరీర భాగాలను మరణానంతరం దానం చేసేందుకు అంగీకార పత్రాలు ఇస్తున్నారు. మరికొందరు వివిధ ప్రమాదాలు, అనారోగ్యాల సందర్భంగా బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబ సభ్యుల అనుమతితో వారి అవయవాలను సేకరిస్తున్నారు. మరికొందరు రక్తసంబంధీకుల కోసం వారి అవయవాలను దానం చేస్తున్నారు. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కర్నూలు కిమ్స్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్లకు అవయవాల సేకరణ, మార్పిడిలకు అనుమతి లభించింది. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల్లో అవయవదాన, మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రామాంజనేయులు, ఎస్తేరిరాణి, మల్లికార్జున, ఈరన్న, గిరిధర్లకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇటీవల చేసిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. మంగళవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఐదుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. కిడ్నీతో పాటు గుండె, ఊపిరితిత్తుల మార్పిడికి సైతం అనుమతి వచ్చిందన్నారు. త్వరలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా అవగాహన ఎవరైనా ఓ వ్యక్తి మరణించినా అతని గుండె స్పందిస్తుంది. ఊపిరితిత్తులు శ్వాసిస్తుంటాయి. నేత్రాలు వీక్షిస్తుంటాయి. మూత్రపిండాలు మరొకరిలో రక్తశుద్ధి చేస్తూనే ఉంటాయి. మరణించిన వ్యక్తి మన మధ్య లేకపోయినా అతని శరీరంలోని అవయవాలు మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తున్నాయి. మట్టిలో కలిసిపోతూ అవయవదానంతో మరొకరి జీవితాన్ని నిలుపుతుండటంతో ప్రస్తుతం అన్ని దానాల్లో కన్నా అవయవదానం గొప్పదిగా నిలిచింది. అవయవదాన అవగాహన పై ప్రత్యేక కథనం. అవయవదానాలనుప్రోత్సహించేందుకు ప్రభు త్వం ఆధ్వర్యంలో జీవన్దాన్ ట్రస్ట్ పనిచేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తుల సమాచారాన్ని ఈ ట్రస్ట్కు అందిస్తే వారు అవయవాలను సేకరించి అవసరం ఉన్న రోగులకు అమరుస్తారు. అయితే ఎవ్వరికై నా అవయవాలు కావాల్సి వస్తే ముందుగా ఈ ట్రస్ట్లో పేరు నమోదు చేసుకోవాలి. ప్రాధాన్యత క్రమాన్ని బట్టి సేకరించిన అవయవాలను నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన వారికి అమరుస్తారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ జీవన్దాన్ ట్రస్ట్ ప్రతినిధులను ఏర్పాటు చేశారు. వీరు ఎవరైనా బ్రెయిన్డెడ్ అయితే వారి కుటుంబ సభ్యులను అవయవదానానికి ఒప్పిస్తారు. కానీ ఇప్పటికీ చాలా మందికి బతికున్నప్పుడు అవయవాలను సేకరిస్తారనే అపోహ ఉంది. ఇది తప్పు. జీవించిఉన్నప్పుడు అవయవాలు తీయరు. -
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచండి
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకునేందుకు, నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. మంగళవారం మద్దూరునగర్లోని ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో భూమి సారవంతమవుతుందన్నారు. ఫలితంగా దిగుబడులు నాణ్యతతో ఉంటాయన్నారు. విచ్చిలవిడిగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతిని, పంటలకు చీడపీడల బెడద పెరుగుతోందన్నారు. నేలను సారవంతం చేసేందుకు ఘన, ద్రవ జీవామృతంతో పాటు నవధాన్యాలు సాగు చేయాలని సూచించారు. ప్రధాన పంటల్లో అంతరపంటలు సాగు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో విశేషంగా రాణిస్తున్న 12 మందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురీ, సీనియర్ కన్సల్టెంట్ రాజేశ్వర్, జిల్లా కన్సల్టెంట్ లక్ష్మయ్య, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సంజీప్కుమార్ పాల్గొన్నారు. -
గ్రేడింగ్ పేరుతో రైతుకు అన్యాయం
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లికి మద్దతు ధర కల్పిస్తున్నామంటూనే గ్రేడింగ్ పేరుతో ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోంది. ఓ రైతు మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 95 ప్యాకెట్ల ఉల్లి తెచ్చాడు. ఉల్లిలో నాణ్యత లేదని నాలుగు సార్లు గ్రేడింగ్ చేయించి 35 ప్యాకెట్లు పక్కన పోశారు. మిగతా 60 ప్యాకెట్లకు మాత్రమే మద్దతు ధర రూ.1,200 చొప్పున మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. ఇష్టారాజ్యంగా గ్రేడింగ్ చేయిస్తుండటం వల్ల మద్దతు ధర కల్పించినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. ఉల్లిలో నాణ్యత ఉండాల్సిందేనని, అయితే ఒకసారి గ్రేడింగ్ చేయిస్తే సరిపోతుందని, మూడు, నాలుగు సార్లు గ్రేడింగ్ చేయిస్తుండటం సరికాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్క్ఫెడ్ మద్దతు ధరతో ఉల్లి కొనుగోలు చేయాలంటే ముందుగా ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులు నాణ్యతను ధ్రువీకరించాలి. నాణ్యత లేకపోతే గ్రేడింగ్ చేయించాలి. అయితే ఎక్కువ సార్లు గ్రేడింగ్ చేయించడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. -
ఏడి‘పింఛన్’
● ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ ఉత్తిదే ● సచివాలయాల వద్ద లబ్ధిదారుల పడిగాపులు కోవెలకుంట్ల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లు అందజేస్తున్నామని గొప్పలు చెబుతోంది. కొన్నిచోట్ల ఆచరణలో అమలు చేయకపోవడంతో లబ్ధిదారులు పింఛన్ల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. కోవెలకుంట్ల మేజర్ పంచాయతీలో సెప్టెంబర్ నెల పింఛన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు రెండవ రోజు మంగళవారం అవస్థలు పడాల్సి వచ్చింది. కొందరు సిబ్బంది తొలిరోజున ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో రోజంతా ఎదురు చూసిన లబ్ధిదారులు.. మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు చేరుకుని పడిగాపులు కాశారు. ఉదయం 10 గంటల తర్వాత సిబ్బంది గ్రామ సచివాలయంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడంతో అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు. -
లక్ష్యం దిశగా అడుగులేయాలి
● అంతర్జాతీయ క్రికెటర్ అంజలి శర్వాణి ఆదోని సెంట్రల్: ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తే విజయం సొంతమవుతుందని అంతర్జాతీయ క్రికెటర్ అంజలి శర్వాణి సూచించారు. ఆరెకల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అంజలి శర్వాణి మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి గురువుల శిక్షణతో పాటు తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలన్నారు. క్రీడల పేరుతో చదువును నిర్లక్ష్యం చేయరాదన్నారు. అనంతరం అంజలి శర్వాణిని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమములో వ్యాయామ ఉపాధ్యాయుడు మహేంద్ర పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి డోన్ టౌన్: పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం–3పై గుర్తుతెలియని వ్యక్తి (36)మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ బిందుమాధవి మంగళవారం తెలిపారు. కొద్ది రోజులుగా రైల్వే స్టేషన్ చుట్టు పక్కల తిరిగుతండేవాడని, అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని ఎస్ఐ తెలిపారు. మృతుదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. యూరియా స్వాధీనం హాలహర్వి: ఆస్పరి నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా ఆటోలో తరలుతున్న యూరియాను క్షేత్రగుడి చెక్పోస్టు వద్ద మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి రశీదులు లేకపోవడంతో డ్రైవర్ను విచారిస్తున్నారు. -
దైవదర్శనానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..
● ఆటో బోల్తా పడి మహిళ దుర్మరణం ● మరో ముగ్గురికి గాయాలు మద్దికెర: దైవదర్శనానికి వెళ్తున్న ఓ మహిళ ఆటో బోల్తా పడిన ఘటనలో తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మద్దికెరకు చెందిన లలితమ్మ(55)తోపాటు పలువురు అరుణాచలం దేవస్థానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మంగళవారం మద్దికెర నుంచి గుంతకల్లు రైల్వే స్టేషన్కు రెండు ఆటోల్లో బయలుదేరారు. రైల్వే స్టేషన్ సమీపంలోని మలుపు వద్ద ఓ ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు మహిళలు గాయపడడంతో చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. లలితమ్మ కోలుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి భర్త శ్రీనివాసులు, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. -
ఎరువుల దుకాణాల తనిఖీ
ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని సాయిరాం సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో మంగళవారం మండల వ్యవసాయాధికారి మదిరెపల్లి శివశంకర్, పట్టణ ఎస్ఐ మధుసూదన్రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఎరువుల అమ్మకాలు, రికార్డులు, పురుగు మందులను పరిశీలించారు. మాట్లాడుతూ దుకాణంలోని రికార్డులను, స్టాక్ను పరిశీలించగా ‘ఓ’ ఫామ్ ఇన్క్లూడ్ చేయకుండా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి రూ.6,83,303 విలువ చేసే 13.129 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలు నిలిపేశారు. డీలర్లు ఓ ఫామ్ ఇంక్లూడ్ చేయకుండా రసాయన, పురుగు మందుల ఎరువుల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఓ శివశంకర్ హెచ్చరించారు. కోడుమూరులో.. కోడుమూరు రూరల్: స్థానిక ఎరువుల దుకాణాలపై ఎస్ఐ ఎర్రిస్వామి తన సిబ్బందితో మంగళవారం దాడులు నిర్వహించారు. ఎరువుల దుకాణాల్లోని స్టాక్, సేల్స్ రికార్డులతోపాటు గోదాముల్లోని ఎరువుల నిల్వలను పరిశీలించారు. యూరియా, ఇతర ఎరువులను బ్లాక్ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణదారుల రికార్డులను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా రికార్డులను స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ ఏజెన్సీలు, దుకాణదారులు తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఎరువుల దుకాణాల్లో పోలీసుల సోదాలు ఏమిటని వాపోయారు. -
రూ.6.39 లక్షల ఎరువుల సీజ్
మంత్రాలయం/కర్నూలు: అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువుల గుట్టు రట్టయ్యింది. విజిలెన్స్ దాడుల్లో రూ.6,39,800 విలువైన ఎరువులు సీజ్ చేసి, ఒక ఒక దుకాణంపై 6ఎ కేసు నమోదు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని, మంత్రాలయం, ప్యాపిలి ప్రాంతాల్లో మంగళవారం విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మంత్రాలయం మండలం కాచాపురం గ్రామంలోని శ్రీరామ్ ట్రేడర్స్, గురురాజ ట్రేడర్స్లో అక్రమంగా 300 బస్తాల యూరియా, 400 బస్తాల 20:20:0:13 రకం ఎరువులను నిల్వ చేశారు. మంగళవారం రాత్రి విజిలెన్స్ ఎస్ఐ వెంకట ప్రసాద్, డీసీటీఓ వెంకటరమణ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. రూ.79,800 విలువ జేసే యూరియా, రూ.5.60 విలువైన 20:20:0:13 ఎరువులను గుర్తించి సీజ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఓ వైపు యూరియా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే హోల్సేల్ డీలర్ ఇంత మొత్తంలో యూరియాను నిల్వ ఉంచడం గమనార్హం. దాడుల్లో స్థానిక సీఐ రామాంజులు, మాధవరం ఎస్ఐ విజయ్కుమార్, వ్యవసాయాధికారి గణేష్, ఎంపీఈఓ బసవ పాల్గొన్నారు. -
సుగంధం అరటిపై పరిశోధనలు
మహానంది: మహానంది పుణ్యక్షేత్రం ఎంత ప్రసి ద్ధో ఇక్కడ సాగు అయ్యే అరటి పంటకు కూడా అంతటి పేరు ఉంది. అందులో భాగంగా మహానంది సమీపంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ హేమాద్రి, డాక్టర్ దీప్తిలు మహానంది సుగంధం రకం పంటపై పరిశోధనలు చేస్తున్నారు. ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మంగళవారం మహానంది ఆలయానికి చేరుకొని వేదపండితులు రవిశంకర అవధాని, తదితరులను కలిసి ఇక్కడ పండే అరటికి మహానంది ఆలయానికి ఏదైనా అవినాభావ సంబంధం ఉందా అన్న కోణంలో ఆరా తీశారు. కాగా మహానంది మండలంలో సాగు అయ్యే సుగంధం అరటి రకం పూర్వం నల్లమల అడవిలోనే ఉండేదని, అక్కడి నుంచే పంట పుట్టిందని పెద్దల అభిప్రాయం. పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసి సుగంధం అరటికి జియో ట్యాగింగ్ వచ్చేందుకు ప్రయత్నిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పంటకు సంబంధి ఏదైనా సమాచారం ఉంటే మహానంది ఉద్యాన పరిశోధనా స్థానాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు ఉర్దూ వర్సిటీ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్ : డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీలో గత ఏప్రిల్ నెలలో జరిగిన పీజీ రెండు, నాలుగో సెమిస్టర్ ఫలితాలను మంగళవారం ఇన్చార్జ్ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ పీఎస్ షావలి ఖాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.లోకనాథ్ విడుదల చేశారు. ఎంఏ ఉర్దూ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనా మిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ బా టనీ, ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ, ఇండస్ట్రియ ల్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ https:// ahuuk. ac. in/ నుంచి పొందగలరని తెలిపారు. ఫలితాల విడుదలకు కృషి చేసిన ఎగ్జామినేషన్ విభాగం సిబ్బందిని వారు అభినందించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.మహబూబ్ బాషా, ఎగ్జామినేషన్ విభాగం సైన్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.నబియా సుల్తానా, ఆర్ట్స్ కో–ఆర్డినేటర్ డాక్టర్ బి.వెంకటప్ప, సిబ్బంది బి.మురళి, మరియా ఖాతున్ పాల్గొన్నారు. . 4, 5 తేదీల్లో కర్నూలు మార్కెట్ యార్డుకు సెలవు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 4, 5 తేదీల్లో సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. ఈనెల 4వ తేదీ వినాయక నిమజ్జనం, 5వ తేదీన మిలాద్–ఉన్–నబి ఉన్నందున మార్కెట్ యార్డుకు సెలవు ఉంటుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా రోజుల్లో మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డలతో సహా ఎలాంటి పంటలను కొనుగోలు చేయడం జరగదన్నారు. 7న జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయండి కర్నూలు(అర్బన్): ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నియామకాలకు స్క్రీనింగ్ పరీక్ష నేపథ్యంలో ఈ నెల 7న ఆయా పరీక్ష కేంద్రాల పరిసరాల్లోని జీరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసి వేయాలని ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయా పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 19న పోస్టల్ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ కర్నూలు(అర్బన్): తపాల శాఖ కార్యాలయాల్లో ప్రజలకు అందించే సేవలకు సంబంధించిన ఫిర్యాదులను ఈ నెల 19న స్వీకరిస్తామని కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్దన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టు ద్వారా ఫిర్యాదులను పంపే వారు కవర్పై డాక్ అదాలత్ అని పెద్ద అక్షరాలతో రాసి ఈ నెల 15వ తేది లేదా అంతకు ముందే తమకు చేరేలా పంపాలన్నారు. -
ప్రతిభకు పురస్కారాలు
నంద్యాల: చిన్నటేకూరు అంబేడ్కర్ అకాడమీలో చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఇద్దరు జిల్లా విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా రూ.లక్ష చొప్పున నగదు పురస్కారం, మెమోంటో అందజేశారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎల్కే తండాకు చెందిన నికేష్నాయక్, కొత్తపల్లి మండలం నందికుంట గ్రామానికి చెందిన ప్రణయ్లు చిన్నటేకూరు అంబేడ్కర్ అకాడమీలో చదువుకొని ఎంబీబీఎస్ సీట్లు సాధించడం అభినందించదగ్గ విషయమన్నారు. గ్రామీణ విద్యార్థులు మరింతగా రాణించేందుకు ఈ విజయాలు ప్రేరణ ఇస్తాయన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి, చిన్నటేకూరు అకాడమీ ప్రిన్సిపాల్ వేణుగోపాల్, అకాడమీ ఇన్చార్జ్ ఉమామహేశ్వరప్ప, మాజీ చైర్మన్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
యూరియా సరఫరాలో కూటమి సర్కారు విఫలం
ఆళ్లగడ్డ: రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూటమి సర్కారు పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ధ్వజమెత్తారు. యూరియా కొరతపై రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం వారు అహోబిలం గ్రామంలో పర్యటించారు. అక్కడ రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులతో సమావేశమై మాట్లాడారు. కూటమి సర్కారుకు రైతుల సంక్షేమం పట్టదన్నారు. కనీసం పంటలకు అవసరమైన ఎరువులు కూడా అందించడం లేదన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇచ్చామని కేంద్రమంటుంటే.. రాలేదని రాష్ట్ర ప్రభుత్వం బుకాయిస్తుందన్నారు. వచ్చిన యూరియా ఎక్కడకు పోయిందో కూటమి సర్కారు చెప్పాలన్నారు. అవసరం మేరకు యూరియా అందిస్తే రైతులు రోడ్లమీదకు ఎందుకు వస్తారని సర్కారును నిలదీశారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ఐదు సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చేశామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. పార్టీ ఆదేశాల మేరకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై ఈ నెల 6వ తేదీ నంద్యాల ఆర్డీవోను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, పార్టీ మండల కన్వీనర్ కశెట్టి నాగేశ్వర్రావు తదితరులున్నారు గంగుల బిజేంద్రారెడ్డి ధ్వజం -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
గోస్పాడు: పీహెచ్సీల పరిధిల్లో సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా వైద్యులు తగు చర్యలు తీసు కోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని సర్వజన ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్ సమావేశ భవనంలో జిల్లా మలేరియా నివారణ అధికారి చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు రోగాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందన్నారు. మలేరియా, డెంగీ, చికున్గున్యా వంటి వ్యాధుల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.అలాగే వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కాంతరావునాయక్ పాల్గొన్నారు. -
శ్రీశైల దేవస్థానం భద్రతపై ప్రత్యేక దృష్టి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆ దేవస్థాన నూతన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్నారు. దేవస్థాన సీఎస్ఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం దేవస్థానంలోని భయ దేవాలయాల్లో క్యూలైన్లను, కంపార్ట్మెంట్లను పరిశీలించారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. అక్కడ సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. అలాగే టోల్గేట్ వద్ద వాహనాల తనిఖీలను పరిశీలించి పలు సూచనలు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది రోల్కాల్ను పరిశీలించి భక్తులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. అనంతరం మీడియాతో సీఎస్ఓ మాట్లాడుతూ అందరి సహకారంతో క్షేత్ర భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్ అధికారి హోదాలో పనిచేసి పదవీ విరమణ చేసినట్లు తెలిపారు. -
రాజన్నా..నిను మరువం
బొమ్మలసత్రం: సంక్షేమ పాలనతో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్ దివికేగి 16 ఏళ్లు గడిచాయి. నేటికి ఆయనను, ఆయన పాలనను స్మరించుకుంటున్నారు. మా మది నిండా నీవే రాజన్నా అంటూ అభిమానం చాటుకుంటున్నారు. మంగళవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఊరూరా ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి నీవే మాకు ఆదర్శమంటూ నినదించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన మహానీయుడు వైఎస్సార్ అని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులో డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు తరలివచ్చి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చిరస్మరణీయుడని, తండ్రి బాటలోనే తనయుడు వైఎస్ జగన్ నడుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కర్నూలు డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి, ఉమ్మడి జిల్లాల జోనల్ ఇన్చార్జ్ శ్వేతారెడ్డి, నేతలు సుదర్శన్రెడ్డి, భీమేశ్వరరెడ్డి, లక్ష్మీరెడ్డి , కార్పొరేటర్లు, వైఎస్సార్ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. ● నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిషోర్రెడ్డి స్వగృహంలో నిర్వహించిన వై ఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, ఇసాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, ఏపీఎస్పీడీసీఎల్ మాజీ డైరెక్టర్లు మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని శ్రీనివాస సెంటర్, సాయిబాబానగర్, చామకాల్వ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు భారీ పూల మాలలు వేసి జోహార్ రాజన్నా అంటూ నినదించారు. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందించి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చారన్నారు. మాజీ ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యాన్ని పేదల దరికి చేర్చిన గొప్ప నాయకుడు వైఎస్సార్ అని గుర్తు చేశారు. ● బనగానపల్లెలోని నియోజకవర్గ పరిధిలోని కొలిమిగుండ్ల మండలంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. నాయకులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బనగానపల్లెలో పార్టీ మండలాధ్యక్షుడు జనార్ధన్రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి మహానేత పాలనను స్మరించుకున్నారు. కోవెలకుంట్ల పట్టణంలో ఏపీఎన్జీవో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గువ్వల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్కు నివాళులర్పించారు. ● ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్డు కూడలి లోని వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్యెల్యే గంగుల బిజేంద్రనాథ్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాఘవేంద్రారెడ్డి, నాయకులు సుధాకర్రెడ్డి, నరసింహారెడ్డి, అభిమానులు పాల్గొన్నారు. ● నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దారా సుధీర్ ఆధ్వర్యంలో మహానేతకు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ మరణాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జగదీశ్వరరరెడ్డి, మాజీ మార్కెట్యార్డు చైర్మన్ శివరామకృష్ణారెడ్డి, సర్పంచ్ జనార్ధన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ● కల్లూరు మండలం పెద్దటేకూర్లో వైఎస్సార్సీపీ నాయకుడు హనుమంతురెడ్డి ఆధ్వర ్యంలో ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి హాజరయ్యారు. అందరివాడు వైఎస్సార్ పాణ్యం:దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అందరివాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం కల్లూరు మండల పరిధిలోని శరీన్నగర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాటమీద నిలబడే వ్యక్తిత్వం వైఎస్సార్ సొంతమన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. రాయలసీమకు తలమానికమైన గోరుకల్లు జలాశయంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. 1.92లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు గాలేరునగరి ద్వారా చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలకు తాగునీరు అందిస్తున్న ఘనత ఆయనదేనన్నారు. రైతు భరోసాతో పాటు ఉచిత విద్యుత్ను అందించి అన్నదాతకు అండగా నిలిచారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్బుక్తో వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తోందన్నారు. 1979లోనే ఇలాంటి బుక్లను ఎన్నో చూశామని, భయపడే ప్రసక్తే లేదన్నారు. అన్నింటికీ స్వస్తి పలికి ప్రజల కోసమే జీవిస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులకు అన్నివిధాల అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. -
కర్నూలు సర్కిల్ ఎస్ఈకి అదనపు బాధ్యతలు
కర్నూలు సిటీ: జల వనరుల శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్గా పని చేస్తున్న బి.బాల చంద్రారెడ్డికి శ్రీశైలం డ్యాం నిర్వహణ పర్యవేక్షక ఇంజనీర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం డ్యాం నిర్వహణ పర్యవేక్షక ఇంజనీర్ పోస్టు రెండున్నర నెలలుగా ఖాళీగా ఉంది. జూన్ నెలలో అక్కడ పర్యవేక్షక ఇంజనీర్గా పని చేస్తున్న పి.శ్రీరామచంద్రమూర్తి పదోన్నతిపై కడప ప్రాజెక్ట్స్ సీఈగా వెళ్లారు. అప్పటి నుంచి ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ గత నెల 31న పదవీ విరమణ పొందారు. దీంతో ఆ స్థానంలో బి.బాల చంద్రారెడ్డికి అదన పు బాధ్యతలు అప్పగించారు. -
రూ. 50 కోట్లతో పాణ్యం రైల్వేస్టేషన్
పాణ్యం: పాత దాన్ని తొలగించి రూ. 50కోట్ల పైగా నిధులతో నూతనంగా పాణ్యం రైల్వే స్టేషన్ను నిర్మించారు. సోమవారం ప్రత్యేక రైలులో సీఆర్ఎస్ మాధవి ఇక్కడికి వచ్చి నూతన రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. స్టేషన్లో ఉన్న సిగ్నల్ సిస్టిమ్, స్టేషన్ విస్తీర్ణం, నూతంగా చేపట్టిన పనులు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఇది వరకే పాణ్యం– బేతంచెర్ల వరకు డబుల్ ట్రాక్ పనులు పూర్తి చేయగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న పాణ్యం–నంద్యాల మధ్య పనులు పూర్తి కావడంతో ప్రత్యేక ట్రాలీలో సీఆర్ఎస్ మాధవి పరిశీలించి, వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉండగా పాణ్యం రైల్వే స్టేషన్లో ఔరంగబాద్–గుంటూరు రైలును ఆగేలా చూడాలని సీఆర్ఎస్ మాధవికి ప్రజలు వినతి పత్రం అందించారు. త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. గుంటూరు డీఆర్ఎం సుదేష్ణషేన్, గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, రైల్వే టెక్నికల్ ఇంజినీర్లు, రైల్వే ఇంజనీర్లు అధికారులు పాల్గొన్నారు. ప్రారంభించిన సీఆర్ఎస్ మాధవి నంద్యాల–పాణ్యం మధ్య డబుల్ ట్రాక్కు గ్రీన్ సిగ్నల్ -
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
కర్నూలు(టౌన్): అఽధికారం కోసం అబద్దాలు చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పిలుపు నిచ్చారు. సోమవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా జోనల్ సదస్సు పార్టీ జిల్లా అధ్యక్షురాలు శశికళ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహిళల పక్షపాతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే మహిళా వ్యతిరేకి చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి ఏడాదిన్నర గడిచినా ఒక్కటీ అమలు చేయలేకపోయాడన్నారు. సూపర్ సిక్స్ హామీలన్నీ సూపర్ ఫెయిల్యూర్ అన్నారు. దేశంలోనే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఏడాదిన్నర కాలంలోనే రూ.2 లక్షల కోట్లు అప్పు చేశాడన్నారు. జగనన్న వల్లే మహిళా సాధికారత సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ఆయననే ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామన్నారు. రాష్ట్రంలో 24 శాతం మద్యం అమ్మకాలు పెరగడంతోనే మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయన్నారు. ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయమనోహరి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. జైళ్లకు పంపిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. జగనన్న కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామని, మహిళలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తామన్నారు. ● ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అబద్దాలు, మోసాలు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హమీలు అమలు చేయడం లేదని తెలిసే జగనన్న ఆదేశాల మేరకు బాబు ష్యూరీటీ – మోసం గ్యారెంటీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అందోళనలు చేపట్టామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి అరకొరగా ఒకటి, రెండు పథకాలు అమలు చేసిందన్నారు. జగనన్న హయంలో మహిళలు బంగారం కొనుగోలు చేస్తే, ఈ ప్రభుత్వంలో బంగారాన్ని అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయన్నారు. శాంతి భద్రతలు క్షీణించినా హోంమంత్రి అని చోద్యం చూస్తుండటం శోచనీయమన్నారు. ● మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం జగనన్న ఎంతో కృషి చేశారన్నారు. రాజకీయంగా 50 శాతం పదవులు మహిళలకు కేటాయించారన్నారు. ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా, ఓట్లు వేయకుండా పులివెందులలో టీడీపీ అరాచకాలు చేసి గెలుపోందడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ సింగిల్గానే వస్తాడని, చంద్రబాబుకు ఇతర పార్టీలు ఉంటే తప్ప ఎన్నికల్లో గెలవలేడన్నారు. ● వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం కన్నా అంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసిందన్నారు. ఏడాదిలోనే టీడీపీ, జనసేన, బీజెపీ నేతల కుమ్ములాటలు పెరిగిపోయాయన్నారు. జనసేన నేతల అవినీతికి అడ్డు లేకుండా పోయిందన్నారు. నిత్యం మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నా అధికార పార్టీ నేతల ఆగడాలు హోంమంత్రికి కనిపించవా అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళా రెడ్డి, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, రీజినల్ అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, స్టాండింగ్ కమిటీ సభ్యులు మునెమ్మ, రేణుకా, కల్లా నాగవేణి రెడ్డి, భారతి, మంగమ్మతో పాటు నంద్యాల జిల్లా అధ్యక్షులు ఆర్.సుజాతమ్మ కడప జిల్లా అధ్యక్షురాలు తెలుగుపల్లి వెంకట సుబ్బమ్మ, అనంతపురం జిల్లా అధ్యక్షురాలు బి.శ్రీదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవేణి, సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు సి.నాగమణి, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి చంద్రబాబు మోసాలు వివరించాలని పిలుపు మహిళా సాధికారత జగనన్నతోనే సాధ్యం మహిళా జోనల్ సదస్సులో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి -
ఇకపై అర్జీదారుల వాయిస్ రికార్డు
● వినతులు గడువులోగా పరిష్కరించండి ● జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా డోన్: రానున్న రోజుల్లో వివిధ సమస్యలపై వినతులు ఇచ్చే అర్జీదారుల వాయిస్ కూడా వారి సమ్మతితో రికార్డు చేసి భద్రపరచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వెల్లడించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ నరసింహులు అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడు తూ.. పరిష్కార వేదికకు తమ సమస్యలు చెప్పుకు నేందుకు వచ్చిన ప్రజల పట్ల సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ వినతులు పరి ష్కరించాలన్నారు. ఆళ్లగడ్డ, బండిఆత్మకూరు, కొత్తపల్లి, పగిడ్యాల, ఉయ్యాలవాడ మండలాల్లో అర్జీదారుల నుంచి సమస్యలు పదేపదే పునరావృతమవుతున్నందువల్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం కౌసలం అనే యాప్ ద్వారా పదవ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థుల వివరాలను నమోదు చేస్తామన్నారు. ఈ యాప్ ద్వారా రానున్న రోజుల్లో 5 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వినతుల్లో కొన్ని.. ● ప్యాపిలి మండలం పీఆర్పల్లె గ్రామానికి చెందిన వడ్డె వెంకట్రాముడు తనకు పీఎం కిసాన్ వర్తించలేదని ఫిర్యాదు చేయగా, డోన్ పట్టణానికి చెందిన పెద్దసుబ్బయ్య అన్ని అర్హతలు ఉన్నా తనకు రేషన్కార్డు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు. ● స్థానిక పేరంటాలమ్మ గుడి వద్ద నిరుపేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల్లో ప్రభుత్వం పక్కాగృహాలు మంజూరు చేయాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ● పట్టణంలోని 503 సర్వే నంబర్లో నిరుపేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ● మోడల్స్కూల్ వెనుకభాగంలో ఉన్న సర్వే నంబర్ 284లో 4.10 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి వుంటే ఇటీవల ఆన్లైన్లో ప్రైవేటు వ్యక్తు ల పేర్లు నమోదు చేశారని, విచారించి చర్యలు తీసుకోవాలి జర్నలిస్టు నాగరాజు కోరారు. ● భూ సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు రూ.లక్ష లంచం డిమాండ్ చేస్తున్నారని ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన వెంకటయ్య అనే రైతు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ● 503 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమి తమ సొంతమని వెంకటరంగారెడ్డి, పోతుగడ్డ రామాంజనేయులు అనే వ్యక్తులు 1994లో రెండు సెంట్ల చొప్పున తమకు విక్రయించి మోసగించారని మాజీ సైనిక ఉద్యోగి మురళీ నాయుడు, చిల్లా వెంకట సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. -
గుండె గుడిలో వైఎస్సార్
ప్రజల అవసరాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా పాలన అందించిన మహానేత వైఎస్సార్. ప్రభుత్వాలు మారినప్పటికీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు నేటికీ అమలులో ఉన్నాయి. ప్రజలు తమ గుండెలో వైఎస్సార్కు గుడికట్టుకున్నారు. నల్లకాల్వలో ఏర్పాటు చేసిన స్మృతి వనానికి పోటెత్తుతున్నారు. ‘రాజన్నా.. నిన్ను మేం మరువలేం’ అంటున్నారు. నేడు(మంగళవారం) మహానేత వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. – కర్నూలు(అగ్రికల్చర్)/ఆలూరు/ కోవెలకుంట్ల/ఆత్మకూరు/నందికొట్కూరు/కృష్ణగిరిదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనా కాలన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు. ముఖ్యమంత్రిగా 2004లో ప్రమాణ స్వీకరం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొదటి సంతకం చేసి రైతులకు భరోసా ఇచ్చారు. ఆ కాలంలోనే ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారు. ఆరోగ్య శ్రీ పేరుతో సామాన్యులకు కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యం అందుబాటులోకి తెచ్చారు. జలయజ్ఞం చేపట్టి రైతులకు సాగునీటి సదుపాయం కల్పించారు. పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ ప్రాణం పోశారు. వైఎస్సార్ హయాంలోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో కార్యరూపం దాల్చింది. ఈ పథకాన్ని నాటి ప్రధాని మన్మోహన్సింగ్తో కలసి ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లిలో శ్రీకారం చుట్టారు. ‘ఉపాధి’ నిధులతో డ్రైల్యాండ్ హార్టికల్చర్ కింద పండ్లతోటల సాగును ప్రోత్సహించారు. అప్పట్లోనే 8000 ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి చేశారు. జిల్లాలో భూమిలేని నిరుపేదలకు ఆరు విడుతలగా 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పంపిణీ చేశారు. సూక్ష్మసేద్యం అమలుకు ప్రత్యేకంగా ఏపీఎంఐపీని ఏర్పాటు చేశారు. ఫీజు రీయింబర్స్మెంటుతో ఉమ్మడి జిల్లాలో 2000 మంది ఉన్నత స్థానాలు పొందారు. వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయి. ప్రజల జీవితాల్లో వెలుగులు ఉమ్మడి కర్నూలు జిల్లా కరువు, కాటకాలకు నెలవుగా ఉండేది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 2023 ఏప్రిల్ 9న పాదయాత్రకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. మొత్తం 1460 కిలో మీటర్లు నడచి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లారా చూశారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రానికి 2004లో ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టడంతోనే రైతులు, ఇతర అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు పరుచుకున్నాయి. ఐదున్నర ఏళ్లలో ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్ 29 సార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘జల’సిరులు ● జలయజ్ఞంలో భాగంగా రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్ను రూ. 70కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్లో వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. 2010 నాటికి పనులన్నీ పూర్తి కావడంతో 4టీఎంసీల నీళ్లు నింపుతూ వచ్చారు. రైతులు కాల్వల ద్వారా రెండు కార్లు పంటలు పండించుకుంటున్నారు. రిజర్వాయర్ ఏర్పాటుతో నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో 42,509 లక్షల ఎకరాలకు సాగు నీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందుతోంది. ● నిత్యం కరువుతో అల్లాడుతున్న పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీ–నీవా కాలువ ఏర్పాటు చేసి కృష్ణాజలాలతో సస్యశామలం చేశారు. కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లను ఏర్పాటు చేసి 80వేల ఎకరాలకు సాగు నీరు అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. దేవనకొండ, తుగ్గలి, కృష్ణగిరి, డోన్ మండలంలోని 50 గ్రామాలకు, డోన్పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా రూ. 55కోట్లతో తాగునీరు అందించారు. ● నందికొట్కూరు నియోజకవర్గంలో మల్యాల, ముచ్చుమర్రి, నాగటూరు ఫేస్–1, ఫేస్–2, తాటిపాడు, ఇస్కాల, చెల్లిమిల, లింగాల, శివపురం, సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాలను వైఎస్సార్ మంజూరు చేశారు. దీంతో మొట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి. ● పోత్తిరెడ్డిపాడు నుంచి 12 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే గతంలో తరలించేవారు. వైఎస్సార్ పాలనలో పోతిరెడ్డిపాడును వెడల్పు చేసి 40 వేల క్యూసెక్కల నీటిని తరలించి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించారు. సరిగ్గా 16 ఏళ్ల క్రితం.. 2009 సెప్టెంబర్ 2వ తేదీన చిత్తూరు జిల్లా అనుపల్లి గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అప్పటి సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బెల్ 420 హెలికాప్టర్లో బయలు దేరారు. కొంత సమయం తర్వాత హెలికాప్టర్ కనిపించకపోవడంతో ఆందోళన మొదలైంది. అప్పటి ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా అనుపల్లికి చేరకపోవడంతో రాష్ట్ర ప్రజలందరిలో నరాలు తెగే ఉత్కంఠ ప్రారంభమైంది. హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమలలోని నల్లకాల్వ సమీపంలో ఉన్న పావురాలగుట్టలో వైఎస్సార్ మృతి చెందినట్లు సెప్టెంబర్ 3న వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రజలు తమ ఆరాధ్య నేతను గుండెల్లో దాచుకున్నారు. మహానేతను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో చూసుకుంటున్నారు. కర్నూలు టౌన్: దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల ఆరాధ్య నేత అని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం కర్నూలులోని ఎస్బీఐ సర్కిల్ వద్ద మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పిస్తామన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, పార్టీ నాయకులు పాల్గొంటారన్నారు. తన పాలనా కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన హృదయ నేతగా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. మహానేత వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం పాణ్యం అర్బన్ పరిధిలోని కల్లూరు షరీన్ నగర్లో వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహానేతను మరచిపోలేని రాష్ట్ర ప్రజలు ఆరోగ్యశ్రీ పథకంతో పేదల గుండెలకు భరోసా ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు జలయజ్ఞంతో సాగులోకి వచ్చిన బీడు భూములు నేడు మహానేత వర్ధంతి -
ట్రిబుల్ ఐటీలో ‘ఇస్రో’ ప్రదర్శన
● ప్రారంభించిన ఆర్యూ వీసీ ● ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు కర్నూలు సిటీ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(ట్రిబుల్ ఐటీడీఎం)లో ‘ఇస్రో స్పేస్ ఆన్ వీల్స్’ అనే పేరుతో సోమవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ను రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వెంకట బసవ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయాన్–3 విజయంతో ప్రపంచంలోని దేశాలన్నీ భారతదేశం వైపు చూశాయన్నారు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని ప్రజలకు విద్యార్థులకు తెలియజేసేందుకు స్పేస్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ట్రిబుల్ ఐటీడీఎంలో ఏర్పాటు చేశామని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, అవగహన పెరుగుతుందన్నారు. అంతరిక్షం గురించి తెలియజేసేందుకు ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు. రూ.10 కోట్ల ఖర్చు ఇస్రో ప్రత్యేకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో 50 ఏళ్ల నుంచి ఇస్రో సాధించిన విజయాల నుంచి చంద్రయాన్ వరకు సాధించిన విజయాల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. జిల్లాలోని 33 స్కూల్స్, కాలేజీలకు చెందిన 2 వేల మంది విద్యార్థులు ఈ ప్రదర్శనకు ఉపయోగపడనుంది. బస్సుల్లోని రాకెట్ల నమూనాలు, చంద్రయాన్ల గురించి ట్రిబుల్ఐటీ విద్యార్థులు, ఇస్రో ప్రతినిధులు వివరించారు. స్కూల్, కాలేజీల విద్యార్థులు ఎంతో ఆసక్తితో రాకెట్లను స్వయంగా చూసి అడిగి తెలుసుకున్నారు. నేడు(మంగళవారం)ఇస్రో బస్సు కేవీఆర్ మహిళ డిగ్రీ కాలేజీలో ప్రదర్శన ఉన్నట్లు ఇస్రో ప్రతినిధులు తెలిపారు. ట్రిబుల్ ఐటీ రిజిస్ట్రార్ రాజ్కుమార్, ఆర్యూ రిజిస్ట్రార్ బి.విజయ్కుమార్, ఆచార్యులు డీన్స్ నరేష్, సత్యబాబు, ఆర్డినేటర్ డా.వినయ్ తీవారీ, ఇస్రో రిటెర్డ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నంద్యాల ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
గోస్పాడు: నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేసినట్లు సూపరింటెండెంట్ మల్లేశ్వరి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నంద్యాల పట్టణానికి చెందిన 30 ఏళ్ల మీనా జోషి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉంటుండటంతో చికిత్స కోసం కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు. ఈమేరకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ప్రసూతి, గైనకాలజీ విభాగంలో మహిళకు వైద్య పరీక్షల అనంతరం అండాశంలో భారీ గడ్డ (25ఇంటు28సెం.మీ) సుమారుగా 5 కిలోలు ఉన్నట్లు వైద్యలు గుర్తించారు. వైద్య పరీక్షల అనంతరం గత నెల 20వ తేదీన గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ పద్మజ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీనారాయణమ్మ, డాక్టర్ సుధారాణి, అనస్తీషియా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స చేసి అండాశంలో భారీ గడ్డను తొలగించారు. అనంతరం ఆమె సురక్షితంగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశామని సూపరింటెండెంట్ తెలిపారు. -
శివయ్యా.. నీవే దిక్కు!
పెద్దసత్రంలో నిరసన తెలుపుతున్న మహిళలుపెద్దసత్రంలో నివాసగృహాలుశ్రీశైలంటెంపుల్: మల్లన్న చెంత నివాసముంటున్న దేవస్థాన కాంట్రాక్ట్ బేసిక్, ఔట్ సోర్సింగ్, శానిటేషన్ సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులకు గూడు కరువై రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దేవస్థానం పరిధిలోని పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనం భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా భవనాల తొలగింపునకు దేవస్థానం చర్యలు చేపట్టింది. దీంతో అందులో నివాసముంటున్న వారిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా పంపిస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం శ్రీశైల ఆలయ సిబ్బంది వసతి గృహాల కోసం దేవస్థానం పెద్దసత్రం, శివసదనం, పొన్నూరు సత్రాల పేరుతో గృహ సముదాయాలను నిర్మించింది. ఈ మూడింటిలో 223 నివాసాలు ఉన్నాయి. కాలక్రమేణ దేవస్థాన అధికారులు, సిబ్బందికి మరొక గృహ సముదాయాలను నిర్మించడం, ఆయా వసతి గృహాలకు ఉద్యోగులు తరలివెళ్లారు. దీంతో పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనంలో దేవస్థాన కాంట్రాక్ట్ బేసిక్, ఔట్ సోర్సింగ్, శానిటేషన్ సిబ్బంది, మరికొంత మంది ప్రైవేట్ వ్యక్తులు నివాసం ఉంటున్నారు. అయితే ఆయా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని నివాసితులు అడపాదడపా మరమ్మతులు చేయించుకుని అలాగే నివసిస్తున్నారు. ఈ భవనాల నిర్ధిష్ట ఆయుర్థాయ కాలపరిమితి (బిల్డింగ్ లైఫ్ స్పాన్) ముగింపు దశకు చేరుకుందని రహదారులు–భవనాలు (ఆర్అండ్బీ), పంచాయతీరాజ్ శాఖల సాంకేతిక నిపుణులు పరిశీలించి, దేవస్థానానికి నివేదిక సమర్పించారు. నివాసితుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భవనాలలో నివాసితులను ఖాళీ చేయించి, భవనాలను తొలగించాలని దేవస్థానం నిర్ణయించింది. నివాసితులకు నోటీసులు.. పెద్దసత్రం, పొన్నూరు సత్రం, శివసదనంలో నివసిస్తున్న దేవస్థాన ఉద్యోగులకు, ఇతర నివాసితులకు దేవస్థానం నోటీసులు జారీ చేస్తుంది. నోటీసులు అందిన ఒక నెలలో వారి నివాసాలను ఖాళీ చేయాలని లిఖితపూర్వకమైన నోటీసులు ఇస్తున్నారు. ఈ విషయమై నివాసితులందరు కూడా దేవస్థానానికి సహకరించాలని తెలియజేస్తున్నారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను పెద్దసత్రం నివాసితులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు, ముగ్గురికి నోటీసులు ఇచ్చిన అధికారులు నిరసనతో వెనుదిరిగి వెళ్లారు. పెద్దసత్రం, శివసదనం, పోన్నూరు సత్రంలో గృహాలు ఎప్పుడో 60 ఏళ్ల క్రితం నిర్మించినవి. తక్షణమే ఖాళీ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆయా గృహ సముదాయంలో ఉన్న దేవస్థానం ఉద్యోగులకు ప్రత్యామ్నాయం చూపేందుకు ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో కమిటీ వేశాం. వారిని ఖాళీ చేస్తే వారికి మంచిగా ఏమి చేయాలో కమిటీ నిర్ణయిస్తుంది. ఆయా గృహా సముదాయాల్లో ప్రైవేట్ వ్యక్తులు సైతం ఉన్నారు. అందరికి నోటీసులు ఇచ్చి, అందరిని ఖాళీ చేయిస్తాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీశైలంలో శిథిలావస్థకు చేరిన పలు గృహా సముదాయాలు పెద్దసత్రం, శివసదనం, పొన్నూరు సత్రాల్లో సుమారు 223 గృహాలు గృహాలను ఖాళీ చేయాలని సూచించిన సాంకేతిక నిపుణులు నివాసితులకు దేవస్థానం నోటీసులు ప్రత్యామ్నాయం చూపాలంటున్న బాధితులు -
ప్రచారానికి వాడుకుని వదిలేశారు: సుగాలి ప్రీతి తల్లి పార్వతి
నంద్యాల (అర్బన్): హత్యాచారానికి గురైన తన కుమార్తె సుగాలి ప్రీతి అంశాన్ని జనసేనాని పవన్కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకుని ఇప్పుడు గాలికి వదిలేశారని ఆమె తల్లి పార్వతి విమర్శించారు. నంద్యాలలో సోమవారం గిరిజన సంఘాలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఈ కేసును గాలికి వదిలేశారన్నారు. న్యాయం చేయాలంటూ అమరావతికి వెళితే జన సైనికులు, వీర మహిళలతో అవమానాలకు గురి చేస్తున్నారని.. ఎమ్మెల్యేలు, మంత్రులు వెటకారం మాటలతో ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.లోకేశ్ రెడ్బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలన్నారు. గవర్నర్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానన్నారు. ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య శంకర్నాయక్ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం పవన్కళ్యాణ్కు అటవాటుగా మారిందని, ప్రీతి తల్లి పార్వతి వీల్చైర్ యాత్రకు అన్ని గిరిజన ప్రజా సంఘాలు, సమాఖ్యల సంపూర్ణ మద్దతు కూడగడతామన్నారు. కార్యక్రమంలో జీపీఎస్ అధ్యక్షుడు రాజునాయక్, ఉపాధ్యక్షుడు రాంబాలాజీనాయక్, మాలమహానాడు అధ్యక్షుడు సాంబశివుడు, బిలావత్ శంకర్నాయక్, విక్రం సింహనాయక్ పాల్గొన్నారు. -
నేత్రదానం పుణ్యకార్యక్రమం
నేత్రదానం చేయడం పుణ్యకార్యక్రమంతో సమానం. ప్రపంచంలో 4 నుంచి 6 శాతం మంది కార్నియా జబ్బుతో బాధపడుతున్నారు. ఇందులో 0.36శాతం భారతీయులే ఉన్నారు. దీనిని ఈ ఏడాది చివరి నాటికి 0.25శాతానికి తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం. దేశంలో ఏటా 47,676 మంది నుంచి కార్నియా సేకరిస్తున్నారు. వాటిలో 29,057 వినియోగిస్తున్నారు. మిగిలినవి వివిధ కారణాల వల్ల నిరుపయోగమవుతున్నాయి. నేత్రదానం సమయంలో మొత్తం కన్ను గాకుండా నల్లగుడ్డు (కార్నియా) మాత్రమే తీస్తారు. దాని స్థానంలో కృత్రిమ కళ్లను మరణించిన వారికి అవయవలోపం కనిపించదు. దాతలు ఇచ్చిన నేత్రాలను విక్రయించడం, కొనడం జరగదు. ఇతరులకు ఉచితంగా అమరుస్తారు. – డాక్టర్ పి. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి, కర్నూలు -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
● డీజే శబ్దానికి కూలిన మట్టిమిద్దె ● తప్పిన ప్రాణపాయం కోవెలకుంట్ల: మేజర్ గ్రామ పంచాయతీ కోవెలకుంట్లలో వినాయక నిమజ్జనంలో ఆదివారం అపశ్రుతి చోటు చేసుకుంది. పట్టణంలోని ఆయా కాలనీల్లో కొలువుంచిన గణనాథులను పట్టణ శివారులోని కుందూనదిలో నిమజ్జనం చేసేందుకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు డీజే, డ్రమ్స్ మధ్య ఊరేగింపు నిర్వహించారు. సంతమార్కెట్ సమీపంలో ఊరేగింపు వెళుతున్న సమయంలో డీజే శబ్దానికి బుగ్గరపు లక్ష్మయ్యకు చెందిన పాత ఇల్లు కూలింది. ఇంటి ముందు వారపాకతో పాటు మరో గది నేలకూలింది. ఆ సమయంలో లక్ష్మయ్యతోపాటు ఆయన భార్య వెంకటరత్నమ్మ లోపలి గదిలో ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లు నేలకూలడంతో స్థానికులు హుటాహుటినా ఇంట్లోకి ప్రవేశించి వృద్ధ దంపతులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వృద్ధ దంపతులు -
మీరూ కోర్టుకు వెళ్లండి
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికి రావడంతో వ్యవసాయ శాఖలో ప్రతిష్టంబన నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో రీ కౌన్సెలింగ్ అనివార్యమైంది. ఈనేపథ్యంలో కోర్టుకు వెళ్లిన వారు మినహా మిగిలిన వీఏఏలు ఇప్పటికే కొత్త స్థానాల్లో చేరిపోయారు. బదిలీల్లో చాలా మంది వీఏఏలు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చుకొని కీలకమైన స్థానాలు దక్కించుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరు డబ్బు ఎలా సంపాదించుకోవాలనే విషయంపైనే దృష్టి సారిస్తూ.. విధి నిర్వహణ గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. రీ కౌన్సెలింగ్ విషయమై వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయని పరిస్థితి. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు వీఏఏల బదిలీలు అనివార్యమైతే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. వీఏఏల బదిలీల వ్యవహారంలో జిల్లా పరువు గంగలో కలవడం పట్ల వ్యవసాయ శాఖపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరోసారి విమర్శలకు తావు లేకుండా జేసీకి వీఏఏల బదిలీల బాధ్యత అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే మండల వ్యవసాయాధికారులుగా నియమితులైన వారిలో 90 శాతం మంది కూటమి పార్టీల నేతలకు ముడుపులు ఇచ్చుకొనే వచ్చారనే చర్చ ఉంది. కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు ముడుపులు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఖర్చు పెట్టుకొని స్థానాలు పొందిన వారందరూ ఇప్పుడు ఆ మొత్తాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితి పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుకు సాగని ఈ–క్రాప్ బుకింగ్ ఖరీఫ్ సీజన్ మరో 40 రోజుల్లో ముగియనున్నా ఈ–క్రాప్ బుకింగ్ ముందుకు సాగని పరిస్థితి. ఇప్పటి వరకు జిల్లాలో 3.38 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. మామూలుగా అయితే ఇప్పటికే 50–60 శాతం వరకు ఈ–క్రాప్ బుకింగ్ పూర్తి కావాల్సి ఉంది. అయితే 3.6 శాతం మాత్రమే చేయడం గమనార్హం. సగం మండలాల్లో ఈ–క్రాప్ బుకింగ్ ఊసే కరువైంది. బదిలీలు మళ్లీ మొదటికి రావడంతో పోస్టింగ్ ఎక్కడికి పడుతుందోనన్న ఆందోళన వీఏఏల్లో వ్యక్తమవుతోంది. అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్ తీసుకునేదెవరు? అన్నదాత సుఖీభవ కింద వేలాది మందికి అన్ని అర్హతలున్నా సాయం అందలేదు. బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ లింక్ కాని ఖాతాలు వేలల్లో ఉన్నాయి. ఈ లిస్ట్లను గ్రామ రైతు సేవా కేంద్రాలకు పంపారు. వివరాలు రైతులకు చెప్పేందుకు వీఏఏలు అందుబాటులో లేని పరిస్ధితి ఏర్పడింది. ఇదే సమయంలో రైతుల నుంచి అన్నదాత సుఖీభవకు సంబంధించి గ్రీవెన్స్ తీసుకునే వారు కరువయ్యారు. తీసుకున్న గ్రీవెన్స్ను పరిశీలించి పరిష్కరించే దిక్కు లేకుండా పోయింది. నిర్వీర్యమైన రైతు సేవా కేంద్రాలు అన్నదాతలకు విశేష సేవలందించిన రైతుభరోసా కేంద్రాలు నేడు ఉండీ లేనట్లుగా తయారయ్యాయి. గతంలో 877 రైతు భరోసా కేంద్రాలు ఉండగా.. కూటమి ప్రభుత్వం 689కి తగ్గించింది. రేషనలైజేషన్ పేరిట 188 రైతు సేవా కేంద్రాలను మూసివేసింది. ఎట్టకేలకు బదిలీల ప్రక్రియ పూర్తయి పాలన గాడిన పడుతోందని భావిస్తున్న తరుణంలో హైకోర్టు వీఏఏల బదిలీలను రద్దు చేసింది. మళ్లీ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడంతో వ్యవసాయ శాఖలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ సారి పత్తి, కంది తదితర పంటలు సాగు చేశాం. గతంలో ఆగస్టు 15లోపే ఈ–క్రాప్లో పంటలను నమోదు చేసేవాళ్లు. ఈ సారి ఆగస్టు నెల గడుస్తున్నా ఆ ఊసే కరువైంది. ఇక్కడ పనిచేసే గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ను బదిలీ చేశారు. ఆ స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు. 2023–24 వరకు రైతులకు అన్ని రకాల సేవలు ఆర్బీకే ద్వారా అందాయి. ఇప్పుడు ఎలాంటి సేవలు అందించడం లేదు. ఈ–క్రాప్ నమోదు చేస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి. – ఉమేష్, జి.హొసల్లి, ఆదోని మండలం కోర్టుకు వెళ్లిన 40 మంది కోసం అందరినీ బదిలీ చేయాలా.. మీరూ కోర్టుకు వెల్లండి.. అని కొంతమంది అధికారులు వీఏఏలను రెచ్చగొడుతున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు రీకౌన్సెలింగ్ అనివార్యం కావడంతో ముడుపులు, సిఫారసులతో అనుకూలమైన స్థానాలు దక్కించుకున్న వీఏఏలు తమ పరిస్థితి ఏంటని నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు 100 మందికిపైగా వీఏఏలు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ముడుపులు ఇచ్చుకొని స్థానాలు పొందారు. ఒక వీఏఏ కోరుకున్న స్థానం కోసం రూ.2 లక్షలు ముడుపులు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. స్థానాలు మారితే ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 40 మంది కోసం అందరినీ బదిలీ చేయడం ఏంటి, మీరు కూడా కోర్టుకు వెళ్లండని రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది. రేషనలైజేషన్ వల్ల నంద్యాల నుంచి 40 మంది వీఏఏలు కర్నూలు జిల్లాకు రావడం తప్పనిసరి. కోర్టుకు వెళ్లిన 40 మందికి వేరే పోస్టింగ్ ఇచ్చినా.. మరో 40 మంది పశ్చిమ ప్రాంతంలోని సరిహద్దు మండలాలకు వెళ్లడం తప్పనిసరి. విధి నిర్వహణలో అంటీముట్టనట్లుగా వీఏఏలు -
సర్టిఫికెట్లు రీ వెరిఫికేషన్
కర్నూలు(హాస్పిటల్): డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న దివ్యాంగ అభ్యర్థుల సర్టిఫికెట్లను శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రీ వెరిఫికేషన్ చేశారు. రీ వెరిఫికేషన్కు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఈఎన్టీ విభాగానికి 13 దరఖాస్తులు రాగా అందులో ఐదుగురు గైర్హాజరయ్యారు. అనంతపురం నుంచి ఆరుగురు హాజరు కాగా, కర్నూలు జిల్లా నుంచి 20 మందిలో ఇద్దరు గైర్హాజరయ్యారు. అలాగే ఆర్థోపెడిక్ విభాగంలో కర్నూలు జిల్లా నుంచి 28 మంది హాజరయ్యారు. సైకియాట్రి విభాగంలో కర్నూలు నుంచి ఒకరు, అనంతపురం జిల్లా నుంచి నలుగురు హాజరయ్యారు. కంటి ఆసుపత్రిలోనూ పలువురు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్లో భాగంగా వైద్యులు పరీక్షించారు. ఈ ప్రక్రియను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. -
కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలం
ఆలూరు: కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలమైందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుబ శశికళ విమర్శించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సును ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు కర్నూలు ఎస్వీ కాన్వెన్షన్ హాల్లో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం కార్యకర్తల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి అన్ని నియోజకవర్గాల నుంచి మహిళా ప్రజా ప్రతినిధులు, పార్టీ పదవులు పొందిన వారు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.