నంద్యాలలో 22, 23న స్పోర్ట్స్ మీట్
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025–2026 (ఐపీఎస్జీఎం) ఈనెల 22, 23 తేదీల్లో నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం వాల్పోస్టర్లను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. స్పోర్ట్స్ మీట్లో కర్నూలు నంద్యాల జిల్లాల నుంచి 7 ప్రభుత్వ, 5 ప్రైవేట్ పాలిటెక్నిక్స్ నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారన్నారు. వివరాల కోసం మార్గరెట్ (9390405721), నాగరాజు (9885037114) సంప్రదించాలన్నారు.


