breaking news
Nagarkurnool
-
కల్లుగప్పించి నిఘా!
కబోదిలా ఎకై ్సజ్ శాఖ నటన –8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారుల వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఆల్ఫ్రాజోలం వంటి ప్రమాదకర మత్తు పదార్థాల రవాణా, తయారీపై నిఘా కట్టుదిట్టం చేశామని గొప్పలు చెప్పుకొంటున్న వారు.. తమ కళ్ల ముందే జరుగుతున్న కల్తీ కల్లు విక్రయాలను మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈత, తాటి చెట్ల ఆనవాళ్లే లేకుండా మందుకల్లు పారిస్తున్న మాఫియాకు ముకుతాడు వేయాల్సింది పోయి.. కేవలం మూలాలు తొలగిస్తున్నామంటూ చేతులు దులుపుకొంటున్నారు. నెలనెలా అందుతున్న మామూళ్ల మత్తుతో ఈ దందాకు అడ్డుకట్ట వేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న కృత్రిమ కల్లు విక్రయాలు.. నాశనమవుతున్న పేద కూలీలు, కార్మికుల బతుకులపై ‘సాక్షి’ కథనం.. అనధికారిక దుకాణాలు.. కృత్రిమ కల్లు నిబంధనల ప్రకారం తాటి, ఈత, ఖర్జూర వనాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన కల్లు విక్రయించాలి. కానీ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలో 75 శాతం వరకు మందు కల్లు విక్రయాలే జరుగుతున్నాయి. అంతేకాదు అన్ని జిల్లాల్లోనూ అధికారికంగా లైసెన్స్ కలిగిన కల్లు దుకాణాలకు మించి 50 శాతం మేర అనధికారికంగా నడుస్తున్నాయి. ● గద్వాల పట్టణ పరిధిలో ఒక డిపో ఉంది. దీని పరిధిలో అధికారికంగా ఎనిమిది దుకాణాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం సదరు డిపోలో తయారు చేసిన కల్లును ఆయా షాపులకు మాత్రమే సరఫరా చేయాలి. ప్రస్తుతం ఆ డిపో అంశం కోర్టులో పెండింగ్లో ఉండగా.. కల్లు తయారీ నిలిచిపోయింది. కానీ అనధికారికంగా దాని పరిధితో పాటు చుట్టుపక్కల మండలాల్లోని సుమారు 17 గ్రామాల్లో దుకాణాలు ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమ్యామ్యాలతో ఎర.. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన కల్లు డిపోల నిర్వాహకులు తమ అక్రమ వ్యాపారానికి అడ్డుతగలకుండా ఆమ్యామ్యాలు ఎర వేస్తున్నారు. డిపోకు సమకూరిన ఆదాయంలో ప్రాంతాన్ని బట్టి గీత వృత్తి, సొసైటీ దారులకు 40 నుంచి 50 శాతం, పోలీసులకు 3 నుంచి 5 శాతం, ఎకై ్సజ్ శాఖకు 10 శాతం, రాజకీయ నేతలకు 10 శాతం చొప్పున నెలనెలా వాటాలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. దీంతో కళ్ల ఎదుటే దందా జరుగుతున్నా.. ఎకై ్సజ్ శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలా తయారు చేస్తున్నారంటే.. 100 కేసులు అంటే 2,400 సీసాల కల్లు తయారీకి 2 వేల నుంచి 2,500 లీటర్ల సామర్థ్యమున్న పెద్ద డ్రమ్ములో నీరు పడుతున్నారు. ఇందులో పులుపు, తీపి కోసం కిలో చొప్పున నిమ్మ ఉప్పు/చక్కెర.. తెలుపు రంగు కోసం సిల్వర్ (వైట్).. నురుగుకు పావు కిలో చొప్పున శాక్రిన్, అర కిలో డ్రైఈస్ట్ వేస్తున్నారు. ఆ తర్వాత మత్తు గొలిపేందుకు తగినంత మోతాదులో నిషేధిత ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్)లో ఏదో ఒక దాన్ని ఉపయోగిస్తున్నారు. అధిక శాతం మేర ఆల్ఫ్రాజోలం కలిపి కలబెడుతున్నారు. ఆ తర్వాత ఒక్కో సీసాను ఆయా ప్రాంతాల్లో రూ.10 నుంచి రూ.25కి విక్రయిస్తున్నారు. కళ్ల ఎదుటే కల్తీ కల్లు విక్రయిస్తున్నా మౌనం మత్తు పదార్థాల రవాణా, తయారీ కట్టడికే పరిమితం మామూళ్లే కారణమని అధికారులపై విమర్శలు అనారోగ్య సమస్యలతో కూలీల బతుకులు ఛిద్రం ఆల్కహాలిక్ విత్డ్రాయల్ సిండ్రోమ్తో సతమతం -
ఇక సర్వసభ్య సమావేశాలు
● ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకపోయినా నిర్వహణ ● పత్యేకాధికారి నేతృత్వంలో సర్పంచులు, కార్యదర్శలు, డివిజన్ అధికారులతో కొనసాగింపు ● ప్రతి 45 రోజులకోసారి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ● గ్రామాల అభివృద్ధితోపాటుసమస్యల పరిష్కారానికి చర్యలు ● రేపు తేదీలు ఖరారు చేయనున్న జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చాయి.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 20 మండలాల్లో మండల సర్వసభ సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో సమావేశాలు చేపట్టే విధానం, తేదీల ఖరారు కోసం గురువారం జిల్లాకేంద్రంలో సమావేశం నిర్వహిస్తున్నాం. మండల ప్రత్యేకాధికారులతోపాటు సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశంలో చర్చించి.. తేదీలు ఖరారు చేస్తాం. – దేవసహాయం, అదనపు కలెక్టర్, ఇన్చార్జి జెడ్పీసీఈఓ మంచి పరిణామం.. ప్రభుత్వం మండల సర్వసభ్య సమావేశాలు 45రోజులకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. దీనివల్ల గ్రామంలోని సమస్యలు అధికారులందరికీ ఒకచోట చెప్పుకొనే అవకాశం లభిస్తుంది. గతంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం సమావేశాలు సమస్యలకు పరిష్కారం చూపే విధించగా పకడ్బందీగా నిర్వహించాలి. – ఆంజనేయులు, సర్పంచ్, జీడిపల్లి నాగర్కర్నూల్: ఇక నుంచి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు జరగనున్నాయి. ప్రతి 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల సర్పంచులు, కార్యదర్శులతోపాటు సంబంధిత మండల అధికారులు సమావేశాల్లో పాల్గొని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు గురువారం జిల్లా పరిషత్ సీఈఓ అధ్యక్షతన జిల్లాకేంద్రంలో ఎంపీడీఓలతో సమావేశాలు నిర్వహించి.. ఆయా మండల సర్వసభ్య సమావేశాల తేదీల ఖరారు, నిర్వహించే విధానంపై చర్చించనున్నారు. ఎన్నికల ఆలస్యంతో.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఉన్న సమయంలో మండల సర్వసభ్య సమావేశాలు మూడు నెలలకు ఒకసారి నిర్వహించేవారు. రెండేళ్ల కిందట వారికాలపరిమితి ముగియడంతో ఆ సమావేశాలు లేకుండాపోయా యి. వాటికి సంబంధించి ఎన్నికలు నిర్వహించడంలోనూ ఆలస్యమవుతుండటం వల్ల గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో పట్టింపు లేకు ండాపోయింది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యు లు లేకపోయినా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో.. మండల, జెడ్పీ పాలకవర్గాలు ఉన్న సమయంలో సర్వసభ్య సమావేశాలు మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా నిర్వహించేవారు. వీటికి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతోపాటు డివిజన్ స్థాయిలో అన్ని శాఖల అధికారులు హాజరయ్యేవారు. ఈ క్రమంలో సమావేశాలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అధికారుల పనితీరుపై నిలదీసేవారు. కానీ, 2024 జూన్ 24న గత పరిషత్ పాలకవర్గం ముగిసింది. అప్పటి నుంచి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు లేకుండా పోయాయి. ఇటీవల మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఉత్తర్వులు జారీ చేసింది. మండల ప్రజా పరిషత్ ప్రత్యేకాధికారులు బాధ్యత వహించాలని పంచాయతీ రాజ్ కమిషనర్, కలెక్టర్లు ఈ ఆదేశాలను ఆయా జిల్లాలో వెంటనే అమలు చేయాలని చీఫ్ సెక్రెటరీ సంజయ్ జాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల వద్దనే.. సర్వసభ్య సమావేశాలు లేకపోవడంతో సమస్యల పరిష్కారానికి ఆయా గ్రామాల నాయకులు ఎమ్మెల్యేల వద్ద విన్నవించుకొని అధికారులకు చెప్పించి పరిష్కంచేవారు. సర్పంచులు వచ్చిన తర్వాత వారు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకొని తీర్చుకుంటున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న సర్పంచులు ఎవరి వద్దకు వెళ్లి వారి గ్రామాల సమస్యలు విన్నవించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
● నల్లమలలోని మద్దిమడుగుక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం ● రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అమ్రాబాద్/ మన్ననూర్: ఆదివాసీలు, గిరిజనులు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన అమ్రాబాద్, పదర మండలాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు చేశారు. అనంతరం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పక్కనే ఉన్న గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ మహరాజ్ విగ్రహ ఏర్పాటు స్థలాన్ని మంత్రి పరిశీలించి మాట్లాడారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన మద్దిమడుగు ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, ఆలయ సమీపంలో సంతు సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టేందుకు వచ్చినట్లు చెప్పారు. రూ.100 కోట్లతో సంతు సేవాలాల్ మహరాజ్ విగ్రహ ఏర్పాటుతోపాటు అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మొదటి విడతగా రూ.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. అటవీ సంరక్షణ చట్టం నిబంధనల మేరకు అటవీశాఖ అడ్డంకులు లేని ప్రతి చెంచు పెంట, గిరిజన తండాలకు రోడ్లు వేయిస్తామన్నారు. పదర నుంచి మద్దిమడుగు వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును రెండు వరుసలుగా విస్తరణ కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మద్దిమడుగు సమీపంలోని కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని, ఇందుకోసం ఎమ్మెల్యే వంశీకృష్ణ కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి మద్దిమడుగు వచ్చి హరిత హోటల్తోపాటు సంతు సేవాలాల్ విగ్రహం ఏర్పాటు పనులను ప్రారంభిస్తారని చెప్పారు. మద్దిమడుగు వరకు మంత్రి సహకారంతో ఏడాదిలోగా డబుల్ రోడ్డు పూర్తి చేస్తానన్నారు. భవన నిర్మాణానికి శంకుస్థాపన మన్ననూర్లో రూ.9.30 కోట్లతో నిర్మించనున్న పీటీజీ పాఠశాల భవనానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. పాఠశాల ప్లే గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అంతకు ముందు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి.. డార్మెంటరీ, కిచెన్, భోజనాలు, తాగునీటి సౌకర్యం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన వర్గాలకు చెందిన విద్యా వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, జెడ్పీసీఈఓ గోపాల్నాయక్, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రజిత, వైస్ చైర్మన్ వెంకటయ్య, ఆర్సీఓ కల్యాణి, ఆర్డీఓ యాదగిరి, మద్దిమడుగు ఆలయ ఈఓ రంగారావు, సర్పంచ్ మంజుల, ఉప సర్పంచ్ రమణగౌడ్, ఎంపీడీఓ రామన్న, ప్రిన్సిపల్ సాయిబాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
30 నుంచి 40 శాతం వరకు బాధితులే..
మందు కల్లుతో అనర్థాలు చాలా ఉన్నాయి. మోతాదు మించి మత్తు కల్పితే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి వస్తున్న పేద రోగుల్లో దాదాపు 30 నుంచి 40 శాతం మంది ఆల్కహాలిక్ విత్డ్రాయల్ సిండ్రోమ్తో బాధపడుతున్న వారే. – డాక్టర్ బాలశ్రీనివాస్, ఫిజీషియన్, జీజీహెచ్, మహబూబ్నగర్ తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్దమొత్తంలో ఈత వనాలు పెంచుతున్నాం. మందు కల్లు తయారీపై నిఘా పెట్టాం. తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ నిషేధిత ఆల్ఫ్రాజోలం ఇతరత్రా మత్తు పదార్థాలు కలిపితే కఠిన చర్యలు తప్పవు. – విజయ్భాస్కర్రెడ్డి, ఎకై ్సజ్ శాఖ డీసీ, మహబూబ్నగర్ ● -
భూముల రీసర్వేలో వేగం పెంచాలి
తిమ్మాజిపేట: భూముల రీసర్వేలో మరింత వేగం పెంచాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య అన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన మండలంలోని మరికల్ గ్రామంలో భూముల రీసర్వే ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునేందుకు మంగళవారం అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, సర్వేయర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పైలెట్ ప్రాజెక్టులో ప్రభుత్వం ఎంపిక చేసిన మరికల్ గ్రామంలో భూముల సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేస్తే మీ మండలంలో మరో గ్రామం ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. రీసర్వేకు సంబంధించిన పురోగతి ఏ మేరకు రీసర్వే చేస్తున్నారు.. ఇంకా జరగాల్సిన రీ సర్వే వివరాలను మండల సర్వేయర్ సాయిబాబను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలోని చెరువులు, కుంటల సర్వే కొనసాగుతుందని, సర్వేయర్ల కొరత కారణంగా కొంత ఆలస్యమవుతుందని చెప్పారు. లైసెన్సుడ్ సర్వేయర్లు తమకు పారితోషికం రావడం లేదని సర్వేకు దూరంగా ఉంటున్నారని అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మరో ఇద్దరు సర్వేయర్లను కేటాయించాలని కోరగా.. లైసెన్సుడ్ సర్వేయర్ల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అర్చన, జిల్లా సర్వేయర్ గిరిధర్, తహసీల్దార్ జయంతి, ఎంఆర్ఐ అ నురాధ, జీపీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎం కొల్లాపూర్: కొల్లాపూర్ ఆర్టీసీ డిపో పరిధిలోని బస్సుల రవాణా అంశాలపై సమస్యలు, సలహాలు తెలిపేందుకు బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆర్టీసీ ప్రయాణికులు సెల్ నం.94937 33602కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. మద్దిమడుగు ఆలయ హుండీ లెక్కింపు అమ్రాబాద్: పదర మండలంలోని పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం హుండీని మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకవర్గం సమక్షంలో లెక్కించారు. మొత్తం హుండీ ఆదాయం రూ.59,38,103 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నగదు కానుకలతోపాటు మిశ్రమ వెండి 2.600 కిలోలు వచ్చిందన్నారు. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈఓ రంగారావు, అధికారులు పరందామరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి, నాగరాజు, అర్చకులు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం
కోడేరు: శాసీ్త్రయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ హేమంత కేశవ్ పటేల్ అన్నారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వీసీ ద్వారా నిర్వహించగా కలెక్టర్ స్థానిక రైతులతో కలిసి రైతువేదికలో పాల్గొని మాట్లాడారు. రైతులకు సరైన సమయంలో సరైన సాంకేతిక సలహాలు అందించడం వల్ల వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురావొచ్చన్నారు. రైతులు సంప్రదాయ సాగు విధానాలతోపాటు శాసీ్త్రయ పద్ధతులు అవలంభిస్తే ఉత్పాదకత పెరగడంతోపాటు సాగు వ్యయాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పలు వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలానికి చెందిన రైతులు వీరారెడ్డి, లోకేశ్వర్, బాలరాజులను శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు అనుసరిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నందుకు అభినందించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూల్, మహాత్మజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల, ఇందిరమ్మ ఇళ్లు, స్థానిక పీహెచ్సీని తనిఖీ చేశారు. సర్ డిజిటలైజేషన్ పూర్తిచేయండి.. మండలంలోని పస్పులలో చేపట్టిన సర్ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి ఓటరు వివరాలను పూర్తిస్థాయిలో ధ్రువీకరించి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా రూపొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వలస వెళ్లిన ఓటర్ల వివరాలను సేకరించాలని అవసరమైతే కుటుంబ సభ్యుల సమాచారం తీసుకోవాలని సూచించారు. డిజిటలైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయరాదని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీపీఎం కృష్ణ, అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, తహసీల్దార్ జమీల్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఆర్ఐ సురేందర్, సర్పంచ్లు సుల్తానమ్మ, మహేశ్వర్రెడ్డి, ఏపీఎం గౌస్, వ్యవసాయాధికారి నాగజ్యోతి, శిరీష, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి ఓపెన్ యూనివర్శిటీ కోర్సులు
అమ్రాబాద్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యునివర్శిటీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని ప్రిన్సిపాల్, అంబేడ్కర్ యూనివర్శిటీ కోఆర్డినేటర్ గోపాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఓపెన్ యూనివర్శిటీ అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఓపెన్ డిగ్రీ బీకాం, బీఏ, బీఎస్సీ గ్రూపులు ఉన్నాయని తెలిపారు. ప్రవేశాలకు వచ్చేనెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కన్నారు. విద్యార్థులు ఆధార్కార్డు, పదో తరగతి, ఇంటర్ మెమో, కులము, ఆదాయం సర్టిఫికెట్లు, ఫొటోతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఓపెన్ యూనివర్శిటీ స్టడిసెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
క్రీడలతో ఆరోగ్యకరమైన జీవనశైలి
ఎర్రవల్లి: క్రీడలతో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని కమాండెంట్ జయరాజు అన్నారు. స్థానిక పదో బెటాలియన్లో సోమవారం వార్షిక స్పోర్ట్స్ మీట్–2027లో భాగంగా పలు క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో కలిగే శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పోలీస్ జీవితానికి అత్యంత అవసరమన్నారు. అదే విధంగా సిబ్బందికి క్రమశిక్షణ, సమన్వయం ఉంటుందన్నారు. మూడు రోజులపాటు జరిగే క్రీడా పోటీల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. క్రీడలతో స్నేహభావం పెరుగుతుందన్నారు. స్పోర్ట్స్ మీట్లో భాగంగా 100, 400 మీటర్ల పరుగుపందెం, 4.400 రిలే, లాంగ్ జంప్, హైజంప్, షాట్పుట్, జావెలిన్ త్రో, 5కే రన్, క్రికెట్ వంటి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పార్థసారధిరెడ్డి, పాణి వెంకటరమణ, ఆర్ఐలు రాజు, ఆర్పీ సింగ్, నరసింహరాజు, శ్రీనివాసులు, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
నకిలీ డొంక కదిలేనా?
జిల్లాలో 593 బస్తాల నకిలీ డీఏపీ స్వాధీనం ● మరో 38 ఖాళీ సంచుల గుర్తింపు ● ఇంకా 3వేలకు పైగా బస్తాలు విక్రయించినట్లు అనుమానాలు ● పోలీసుల విచారణతో బయటికి చెప్పేందుకు జంకుతున్న రైతులు రూ. 50లక్షలకు పైగా టోకరా.. నివేదిక రాలేదు.. నకిలీ డీఏపీ బస్తాల నుంచి సేకరించిన ముడిసరుకును పరీక్షల కోసం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపాం. ఇంకా నివేదిక రాలేదు. వాస్తవానికి ఆ ఎరువులు పూర్తిగా నకిలీవి. వాటితో రైతుకు ఏమాత్రం ఉపయోగం లేదు. రైతులు ఇలా నమ్మి కొనుగోలు చేయొద్దు. ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయాలి. – చంద్రశేఖర్, డీఏఓ -
పోలీసు గ్రీవెన్స్కు 12 ఫిర్యాదులు
కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పలు గ్రామాల నుంచి 12మంది రాగా.. ఎస్పీ స్వయంగా వారి సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. 8 భూ తగాదాలపై, 4 తగు న్యాయం కోసం ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు కందనూలు: జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కవిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026లో పదో తరగతి ఉత్తీర్ణులై 450 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు పదో తరగతి మెమో, బోనపైడ్, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు 90594 43450 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. 6 నుంచి పాదయాత్ర నాగర్కర్నూల్ రూరల్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 6నుంచి 14వ తేదీ వరకు సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా, దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని ఆరోపించారు. యువతను మతం, కులం పేరుతో రెచ్చగొడుతూ, నిరుద్యోగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని పాదయాత్ర ద్వారా తెలియజేస్తామని తెలిపారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్, రవీందర్, కేశవులుగౌడ్, నర్సింహ, శ్రీనివాసులు, ఖాజా, శివుడు, లక్ష్మీపతి, కిరణ్కుమార్, మల్లయ్య, పరుశరాములు, మధుగౌడ్ ఉన్నారు. -
సీజేపీ ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగుతాం
చిన్నంబావి: ఇటీవల ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనత పార్టీ (సీజేపీ) ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మలిదశ ఉద్యమానికి శ్రీకారం చూడతామని.. ఈసారి కచ్చితంగా న్యాయం జరిగే వరకు పొరాడుతామని, అవసరమైతే ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీశైలం నిర్వాసితులు వివరించారు. సోమవారం మండలంలోని పెద్దమారూర్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. తరాలు మారినా నిర్వాసితుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా.. సమస్యను ఎన్నికల హామీగానే తీసుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చిన మరుక్షణం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి తమకు న్యాయం చేస్తామని చెప్పడం తప్ప చేతల్లో కనిపించడం లేదని, మంత్రి 30 ఏళ్లు అధికారంలో ఉన్నా తమకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దామోదర్రెడ్డి, దాగోజి గోవిందు, షబ్బీర్, సోమ భాస్కర్, బాలయ్య, మైనుద్దీన్, మహబూబ్పాషా, జహంగీర్పాషా, రంగస్వామి, కొండన్న, రాఘవేంద్ర శెట్టి, కాంతయ్య, గూడెం బాలస్వామి, పెద్దమారూర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మా భూమిలోకి రానిస్తలేరు..
నా భర్త పేరు అంకూర్ భీమ్రాజ్. మాకు ఊర్కొండ మండలం మాధారం శివారులోని సర్వేనం. 376/30లో ఐదెకరాల గైరాన్ భూమిని 1980లో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూమిలో 36 గుంటల పొలాన్ని కట్ చేసి.. 1994లో 4.04 ఎకరాల పొలాన్ని పట్టాదారు పాస్బుక్లో నమోదు చేశారు. అప్పటి నుంచి పొలాన్ని సాగుచేస్తున్నాం. 2025లో నాభర్త గుండెపోటుతో మరణించారు. నాటి నుంచి కొందరు వ్యక్తులు మేము సాగుచేస్తున్న భూమి వద్దకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మేము స్థానిక తహసీల్దార్ వద్దకు వెళ్తే.. ఆయన కూడా బయటి వారికి సపోర్టుగా మాట్లాడుతున్నారు. మాకు న్యాయం చేయాలి. – అంకూర్ అన్నపూర్ణ, మాధారం, ఊర్కొండ మండలం -
హే.. కృష్ణా!
గద్వాల: కృష్ణా బేసిన్లో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాలకు ఎగువ నుంచి వరద తాకిడి ఎట్టకేలకు మొదలైంది. కృష్ణమ్మ పరవళ్లను చూసిన అన్నదాతల్లో రేకెత్తిన ఆశలు.. ఎక్కువసేపు నిలవలేదు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నిరాశగా మారాయి. ఎగువ ప్రాంతంలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి తగ్గింది. ఆదివారం రాత్రి 33వేల క్యూసెక్కుల వరద రాగా.. సోమవారానికి 27వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో వచ్చిన వరద నీటిని జూరాల జలాశయం ఎఫ్ఆర్ఎల్ 3,018 మీటర్ల వరకు నింపి.. తాగునీటి అవసరాలకు వినియోగించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరద జలాలతో వానాకాలంలో పంటలు సాగుచేసుకోవచ్చని ఆశపడిన రైతన్నలకు నిరాశే ఎదురైంది. అగమ్యగోచరంగా ఆయకట్టు సాగు.. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎల్నిన్ ప్రభావంతో వరుణుడు మోహం చాటేశాడు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సరైనా వర్షాలు లేక పంట పొలాలు బీడుపడ్డాయి. జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో కూడా అదే పరిస్థితి నెలకొంది. గతేడాది మే నెలలోనే వరద జలాలు జూరాలకు చేరగా.. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వర్షాకాలంలో జూరాల జలాశయం అడుగంటిందంటే.. పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని 69వేల ఎకరాలు, కుడి కాల్వ పరిధిలోని 37,400 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఆరుతడి పంటల వైపు.. రాష్ట్రంలో తలెత్తిన ఎల్నినో పరిస్థితులను గుర్తించిన అధికారులు.. వానాకాలంలో తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలు సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలైన మినుములు, పెసలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. అయితే జూరాల ఆయకట్టులో చాలా వరకు వరిసాగు తప్ప.. ఇతర పంటలను సాగుచేయడానికి రైతులు మొగ్గు చూపడం లేదు. 80వేల ఎకరాల్లో నారుమళ్లు.. ఏటా వానాకాలంలో జూరాల ఆయకట్టు రైతులు వరిసాగు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఏర్పడ్డాయి. అయితే రైతులు మాత్రం వరుణ దేవుడు కరుణించకపోతాడా అన్న భరోసాతో యథావిధిగానే వరిపంట సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఎడమ, కుడి కాల్వల పరిధిలో సుమారు 80వేల ఎకరాలకు పైగా నారుమళ్లు పోసుకున్నారు. అయితే మూడు రోజులుగా జూరాలకు వరద వచ్చి చేరుతుండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే రెండు రోజులకే వరద తగ్గిపోవడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే జూరాలకు తగ్గిన వరద వరద జలాల్లో తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ప్రశ్నార్థకంగా 1.9లక్షల ఆయకట్టు సాగు ఆందోళనలో అన్నదాతలు -
ప్రజావాణికి అర్జీల వెల్లువ
కందనూలు: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఉదయం నుంచి క్యూ కట్టారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. మొత్తం 54 అర్జీలు అందగా.. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మాత్రమే కాదని.. ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపే బాధ్యతాయుతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. అధికారులు ప్రతి ఫి ర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా నిర్లక్ష్యానికి గురికాకుండా సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిన్నయ్య, దేవసహాయం, డీఆర్వో పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
● రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ● బ్రహ్మగిరిలో పల్లె దవాఖానా ప్రారంభం అచ్చంపేట/వంగూరు: ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. సోమవారం అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరిలో ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన పల్లె దవాఖానా ప్రారంభించారు. అనంతరం మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లమల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండటం కోసమే ప్రభుత్వం పల్లె దవాఖానాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా మహిళల ఆర్థికాబివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. రూ. 10లక్షలతో చేపట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణం పూర్తయితే సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉంటుందని అన్నారు. అంతకు ముందు వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని సీఎం రేవంత్రెడ్డి ఇంటికి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, రైతు కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.కృష్ణ, సర్పంచ్ మల్లేష్, ఉపసర్పంచ్ మొయిజ్, అభిలాష్, డా.తారాసింగ్, అంతటి మల్లేష్, చింతల రాజ్గోపాల్, లోక్యానాయక్ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జిల్లా అథ్లెట్ల ఎంపికలు
కల్వకుర్తి రూరల్: కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అండర్–18 జిల్లా అథ్లెట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. త్వరలో హనుమకొండలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం నిర్వహించిన ఎంపిక పోటీల్లో 100 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు మాట్లాడుతూ.. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర చాంపియన్షిప్కు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం ప్రతిభకనబరిచిన క్రీడాకారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అంజయ్య, సురేందర్, ప్రసాద్, నిరంజనమ్మ, నారాయణ, తురాబ్, భీమయ్య, జ్యోతి, భారతి పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వంపై యువత విజయం : సీపీఎం
అమరచింత: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే యత్నంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై యువత విజయం హర్షనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎస్ భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై దేశ రాజధానిలో యువత చేసిన ఆందోళన చివరకు విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దారితీసిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కేవలం మొదటి అడుగు మాత్రమేనని.. ఇప్పుడు ఎన్టీఏను రద్దు చేయాలని కోరారు. విద్యార్థి వ్యతిరేక, వాణిజ్యపరమైన, మతతత్వ ధోరణి కలిగిన ఎన్ఈపీ –2020 కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోరాట మార్గంలో అన్నిరకాల బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొని దృఢంగా నిలిచిన విద్యార్థి సంఘాలకు అభినందనలు తెలిపారు. క్రీడలు, కళలు, సినిమా, సంస్కృతి తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడం సంతోషకరమన్నారు. ఐక్య పోరాటాలు విజయాన్ని సాధిస్తాయని చెప్పడానికి ఇదో ఉదహారణ అన్నారు. డిమాండ్లన్నీ నెరవేరే వరకు యువత ధృడంగా ఉంటూ పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లాకార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యులు జబ్బార్, సీనియర్ నాయకులు మహమూద్, మండల కార్యదర్శి జీఎస్ గోపి, వెంకటేష్, అజయ్, రాఘవేంద్ర పాల్గొన్నారు. -
ఫోన్లో వివరాలు చెబుతున్నారు..
ఓటరు మ్యాపింగ్లో స్థానికంగా లేని వారి ఓట్లు తీయాల్సి వస్తుందని అనుకున్నాం. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చిన తర్వాత గ్రామం విడిచి వెళ్లిన వారు, ఉద్యోగ నిమిత్తం వెళ్లిన వారు ఫోన్లు చేసి వివరాలు చెబుతున్నారు. కొందరు స్వయంగా గ్రామానికి వచ్చి ఫారాలు నింపి ఇస్తున్నారు. – ఆప్పోజు పద్మ, బీఎల్ఓ, ఉప్పునుంతల పుట్టిన ఊర్లో ఉండాలని.. నేను ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వస్తుంటాం. అక్కడ ఓటు వద్దని.. ఇక్కడే ఉంచుకున్నా. ఏ ఎన్నిక వచ్చినా స్వంత ఊరుకు వచ్చి ఓటు వేయడం ఇష్టం. అందుకోసం ఎన్యూమరేషన్ ఫారం నింపి వెళ్లాను. మా ఓటు మా ఊరిలో ఉంటేనే ఆనందం. – కట్టా జనార్దన్రెడ్డి, ఉప్పునుంతల అర్హులందరికీ ఓటు హక్కు.. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా బీఎల్ఓలు చొరవ చూపాలి. ఆగస్టు 3వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేపట్టి, పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టాక 10న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తాం. ఆపై అభ్యంతరాలు స్వీకరించి.. పరిశీలన అనంతరం 12న తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. డిజిటలైజేషన్ వందశాతం పూర్తయ్యేలా రాజకీయ పార్టీల నాయకుల సహకరించాలి. – హేమంత కేశవ పాటిల్, కలెక్టర్ -
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
గద్వాల: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం మొదలైంది. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు వదలడంతో కృష్ణమ్మ పరవళ్లు ఆదివారం జూరాలకు చేరాయి. ఈ క్రమంలో ఎగువ నుంచి 18,300 క్యూసెక్కుల కొత్త నీరు వచ్చింది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.356 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.310 మీటర్ల 5.653 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్నినో ప్రభావంతో వరిపంట సాగుపై ఆశలు వదులుకున్న రైతులు కృష్ణానదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్కార్డులు ఎప్పుడిస్తారు? మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉద్యోగులు, పెన్షనర్లకు అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల నుంచి 1.5 శాతం వేతనంలో కోత విధిస్తూ హెల్త్కార్డులు జారీ చేయకపోవడం తగదని ఎస్జీపీఏటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు అన్నారు. ఆదివారం స్థానిక టీఎన్జీఓల భవనంలో నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఎస్జీపీఏటీ) కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించకుండా జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇంతవరకు ప్రైవేట్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకోకుండా, హెల్త్కార్డులు జారీ చేయకుండా కాలం గడుపుతోందని ఆరోపించారు. అంతేగాక వైద్యం తమకు తాముగా చేయించుకుంటే రీయింబర్స్మెంట్ ఆపేస్తామనడం సరికాదన్నారు. రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైద్యసేవలు అందక, పెన్షన్ బకాయిలు రాక వంద మందికిపైగా మృతిచెందినా ప్రభుత్వానికి కనికరం లేదని విమర్శించారు. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, బాలస్వామి, వెంకటస్వామి, సురేష్, అంజిలయ్య పాల్గొన్నారు. -
30న ఎల్నినోపై గ్రామసభలు : కలెక్టర్
నాగర్కర్నూల్: ఎల్నినో ప్రభావం కారణంగా జిల్లాలో వర్షపాతం తగ్గిన నేపథ్యంలో గ్రామీణ ప్రజలు, రైతులను అప్రమత్తం చేయడం, ముందస్తు చర్యలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ నెల 30న అన్ని జీపీల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు స్పష్టమైన సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామసభల్లో రైతులు, గ్రామస్తులకు ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ‘పసరంటిన కొడవలి’ పుస్తకావిష్కరణ కందనూలు: జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక సాహిత్య వేదిక ఆధ్వర్యంలో రచయిత వనపట్ల సుబ్బయ్య రచించిన పసరంటిన కొడవలి పుస్తకాన్ని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మల జీవిత చరిత్ర, తల్లుల శ్రామిక బహుజన తత్వాన్ని అక్షరాల రూపంలో తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. మానవ సంబంధాలను పెంపొందించుకుని, వివక్ష లేని సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రొ.కోటేశ్వర్రావు, వహిద్ఖాన్, వనపట్ల సర్పంచ్ వాసుదేవుడు, కోట్ల నిరంజన్రెడ్డి, కొండకింది మన్యపురెడ్డి, కవులు తగుళ్ల గోపాల్, ఎదిరెపల్లి కాశన్న పాల్గొన్నారు. పక్కాగా ఆరోగ్య సర్వే కందనూలు: ఆరోగ్య సర్వేలో భాగంగా వైద్యసిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి.. ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.భరత్కుమార్రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు, ఈశ్వర్ కాలనీల్లో ఆరోగ్య సర్వేను ఆయన పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంట్లో 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు చేయాలన్నారు. అదే విధంగా టీబీ, పక్షవాతం, క్యాన్సర్తో బాధపడుతున్న వారి వివరాలతో పాటు గర్బిణుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి కందనూలు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవనంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను భర్తీ చేయడంతో పాటు జూనియర్ లెక్చరర్ల పోస్టులకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్ పీఆర్సీ, డీఏ బకాయిలను విడుదల చేయడంతో పాటు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించాలని, ఉపాధ్యాయ పోస్టులను భరీ చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సతీష్, సత్యనారాయణ, కరుణాకర్రెడ్డి, మల్లయ్య ఉన్నారు. నేడు హుండీ లెక్కింపు అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లోని హుండీని సోమవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. -
సొంతూరులోనే ఓటేస్తాం!
పల్లెల్లోనే ఓటరు నమోదుకు మొగ్గు ● స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాలు అప్పగిస్తున్న జనం ● సర్ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు చెక్ ● ఓటరు జాబితా నుంచి తొలగింపు దిశగా చర్యలు పట్టణాల్లో మందకొడిగా.. సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ గ్రామాల్లో జోరుగా.. పట్టణాల్లో మందకొడిగా సాగుతోంది. కొందరు ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అధికారులు పాట్లు పడుతున్నారు. ఓటర్లకు స్వయం ఫోన్చేసి అడుగుతున్నా అప్పుడు, ఇప్పుడు అని అంటున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వేగంగా సాగుతోంది. గ్రామాల్లో బీఎల్ఓలు ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తుండగా.. సూపర్వైజర్లు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఉన్నత విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో ఎక్కువ మంది పుట్టిన ఊరిలో ఓటు ఉంచుకునేందుకు మక్కువ చూపుతున్నారు. స్వయంగా స్వగ్రామానికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్ఓలకు అందిస్తున్నారు. అసలైన ఓటర్లు 75 – 85 శాతమే.. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో అసలైన ఓటర్లు 75నుంచి 85శాతం మాత్రమే మిగలనున్నారు. మిగతా ఓటర్లు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మరికొందరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నట్లు లెక్కలు తేలుతున్నాయి. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్ఓలకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలన్నింటిని వందశాతం డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఇందులో అసలైన ఓటర్లను గుర్తిస్తూనే.. మిగిలిన వారిని నాలుగు కేటగిరీల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. బీఎల్ఓల విచారణలో ఓటరు మరణించినట్లు తేలితే మృతుల కేటగిరీలో నమోదు చేయాలి. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతే పర్మినెంట్గా షిఫ్ట్ అయినట్లు గుర్తించాలి. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటరుగా నమోదైతే సదరు ఓటరు ఎంపిక చేసుకున్న చోట జాబితాలో ఉంచి.. రెండో దాని డూప్లికెట్గా పేర్కొన్నాలి. ఫారాలు తీసుకోని వారు, తిరిగి ఇవ్వని వారి పేర్లను ఇతర కేటగిరీలో చేరుస్తున్నారు. ఇలా నమోదైన వారి పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లా మొత్తం ఓటర్లు డిజిటలైజేషన్ శాతం అన్కలెక్టబుల్ మహబూబ్నగర్ 7,32,488 5,93,167 86.12 55,743 నాగర్కర్నూల్ 7,31,632 5,80,793 79.38 56,482 వనపర్తి 2,75,570 2,18,488 79.29 16,515 జోగుళాంబ గద్వాల 5,03,859 4,19,973 83.32 43,961 నారాయణపేట 4,95,574 3,93,911 79.49 45,959 మొత్తం 27,39,123 22,06,332 80.54 2,18,660 ఉమ్మడి జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇలా.. -
బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు
కొల్లాపూర్: ఎవరైనా 18 ఏళ్లు దాటని అమ్మాయిలకు వివాహాలు చేసినా, వారికి తప్పుడు ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి చెక్కులు ఇప్పించేందుకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. కొల్లాపూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన తర్వాతే అమ్మాయిలకు వివాహాలు జరిపించాలని సూచించారు. తక్కువ వయసులో వివాహం చేయడంతో కలిగే ఆరోగ్యపరమైన సమస్యలను వారికి వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్ మాధవి తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
తాడూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కార్మికులు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం తాడూరులో ఏఐటీయూసీ జిల్లా 3వ మహాసభలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు, హక్కుల సాధన కోసం కార్మికులు సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపి.. కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పరుశరాములు, కిరణ్కుమార్, జైపాల్రెడ్డి, ఫయాజ్, శివశంకర్, సత్యం పాల్గొన్నారు. -
‘గోకారం’ నిర్వాసితుల గోడు పట్టదా?
చారకొండ: గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించి.. తమ గ్రామాలను ముంపు నుంచి మినహాయించాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 237వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ గోడును అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించినా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాసితులు ప్రకాశ్, పర్వతాలు, నాగయ్య నాయక్, శ్రీరాం, పెద్దయ్య, గోపి, సంజీవ, ఎల్లమ్మ పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు పోరాటం కొల్లాపూర్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు ఎంప్లాయిస్ యూనియన్ పోరాడుతోందని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు. ఆదివారం కొల్లాపూర్లో నిర్వహించిన ఎంప్లాయిస్ యూనియన్ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల మెనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం సరైంది కాదన్నారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. త్వరలో జరగబోయే ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఆయన సమక్షంలో టీఎంయూ, టీజేఎంయూ సంఘాలకు చెందిన 70 మంది ఎంప్లాయిస్ యూనియన్లో చేరారు. సమావేశంలో యూనియన్ డిపో కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్గా సిబ్బది నర్సింహారావు, అధ్యక్షుడిగా ఎం.కృష్ణ, కార్యదర్శిగా సీహెచ్ మద్దిలేటి, కోశాధికారిగా సాయిఈశ్వర్, ప్రచార కార్యదర్శులుగా నిస్సార్పాష, రామకృష్ణ, నిరంజన్, ముఖ్య సలహాదారులుగా రామయ్యయాదవ్, జీఎం కృష్ణను ఎన్నుకున్నట్లు తెలిపారు. -
తలలు పట్టుకుంటున్న బీఎల్ఓలు..
క్షేత్రస్థాయిలో బీఎల్ఓలకు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి స్థాయిలో అందక డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయలేకపోతున్నారు. ఓవైపు నిర్ణీత గడువులోగా డిజిటలైషన్ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం.. మరోవైపు టెక్నికల్ అధికారులుగా నియమించిన వారి నుంచి పూర్తి సహకారం అందకపోవడంతో బీఎల్ఓలు తలలు పట్టుకుంటున్నారు. ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేసుకున్న వారు సైతం ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయాల్సి ఉండగా.. చాలా మంది ఇవ్వడం లేదని బీఎల్ఓలు పేర్కొంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారం డిజిటలైషన్ ప్రక్రియ పూర్తి చేస్తుండగా.. సాంకేతిక సమస్యతో ‘నో మ్యాపింగ్’ అని వస్తుండటంతో మరోసారి సరిచేయాల్సి రావడం తలనొప్పిగా మారింది. ఇంకా ఓటర్ల నుంచి 10 నుంచి 15శాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందాల్సి ఉందని చెబుతున్నారు. -
కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల వల్లే.. పాలమూరులో సాగు, తాగునీటి ఇబ్బందులు
మక్తల్/ కృష్ణా: కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న జలదోపిడిని అరికట్టకపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ బృందంతో కలిసి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా వారు కృష్ణానదిపై ఉన్న గూగల్ ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో దిగువకు వచ్చే నీరు తగ్గిపోతుందని, ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురుస్తున్నందున తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచే చర్యలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే జూరాలలో పూడిక పేరుకుపోవడంతో 11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ప్రాజెక్టు నిర్మిస్తే.. కేవలం 6 నుంచి 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నామన్నారు. ఈ విషయం గ్రహించే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి, ఎక్కడికక్కడ నీటిని నిల్వలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మక్తల్ ఎమ్మెల్యేగా చిట్టెం నర్సిరెడ్డి ఉన్న సమయంలో నియోజకవర్గంలో కృష్ణా, భీమానదులపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారని, ప్రస్తుతం నదిలో నీళ్లులేక అవి మూతపడ్డాయన్నారు. మాజీమంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ -
పర్యవేక్షణ గాలికి..!
20 మండలాల్లో ఒక్క రెగ్యులర్ ఎంఈఓ మాత్రమే ● జీహెచ్ఎంలకు ఇన్చార్జి బాధ్యతలు ● పాఠశాలల నిర్వహణ, విద్యాపరమైన వ్యవహారాలతో పని ఒత్తిడి ● గాడితప్పుతున్న విద్యావ్యవస్థ ●దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న ఎంఈఓ పోస్టుల భర్తీ అంశాన్ని విద్యాశాఖ పట్టించుకోకపోవడం విచారకరం. జీహెచ్ఎంలకు అదనపు బాధ్యతలతో పని ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఎంఈఓల నియామకాన్ని చేపట్టి విద్యావ్యవస్థను పటిష్టం చేయాలి. – మల్లిఖార్జున్, తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో పర్యవేక్షణ తగ్గి విద్యాప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయులపై పని ఒత్తిడి పెరిగి పూర్తి పర్యవేక్షణ చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చొరవ చూపి ఎంఈఓలను నియమించాలి. – మధుసూదన్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇన్చార్జి ఎంఈఓలు ఉండటంతో ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ లోపించింది. నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవడానికి వారికి పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం రెగ్యులర్ ఎంఈఓలను నియమించాలి. – బంగారుబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెగ్యులర్ ఎంఈఓల నియామకంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. నిబంధనల ప్రకారం నడుచుకుంటాం. ప్రభుత్వ పాఠశాాలలపై పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాం. అందరి సమన్వయంతో బడుల బలోపేతానికి కృషి చేస్తాం. – రమేశ్కుమార్, డీఈఓ కందనూలు: సర్కారు పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మండల విద్యాశాఖ అధికారి పోస్టులను ఇన్చార్జీలతో నెట్టుకొస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, విద్యాపరమైన వ్యవహారాల పర్యవేక్షణ నానాటికీ కొరవడుతోంది. జిల్లావ్యాప్తంగా ఒక మండలంలో తప్ప.. మిగతా అన్ని మండలాల్లో ప్రధానోపాధ్యాయులే అదనపు బాధ్యతలతో ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో విద్యావ్యవస్థ గాడితప్పుతుందోన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా ఇన్చార్జీలే.. జిల్లాలో 20 మండలాలు ఉండగా.. ప్రాథమిక పాఠశాలలు 495, ప్రాథమికోన్నత 124, ఉన్నత పాఠశాలలు 130 ఉన్నాయి. ఒక కల్వకుర్తి మండలంలో మాత్రమే శంకర్నాయక్ రెగ్యులర్ ఎంఈఓ ఉండగా.. మిగతా 19 మండలాల్లో జీహెచ్ఎంలు ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఎమ్మార్సీలో ఎంఈఓతో పాటు ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, అటెండర్తో పాటు రాత్రి కాపలాదారు ఒకరు ఉండాలి. కానీ ప్రస్తుతం కేవలం ఒక్క విద్యాధికారి మాత్రమే అన్ని తానై పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు అత్యవసర పని నిమిత్తం ఎంఈఓ కార్యాలయానికి వెళ్తే.. అక్కడ వారు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. తనిఖీలు.. చర్యలు శూన్యం ప్రైవేటు విద్యాసంస్థలు ప్రమాణాలు పాటిస్తున్నాయా.. లేదా అని చూడాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉంది. అయితే జిల్లాలో కేవలం ప్రభుత్వ బడుల పర్యవేక్షణకు పరిమితమవుతూ.. ప్రైవేటు పాఠశాలల తనిఖీలను గాలికి వదిలేస్తున్నారు. నిబంధనల మేరకు యాజమాన్యాలు బోధనకు సంబంధించి విద్యార్హతల వివరాలు యూడైస్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే చాలా వరకు అనర్హులతో పాఠశాలలను నిర్వహిస్తున్నారు. బోధనా ప్రమాణాలు పాటించని ప్రైవేటు పాఠశాలల్లో అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో విద్యాధికారులు, ఉపాధ్యాయుల పనితీరు సరిగ్గా ఉండకపోవడంతో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవల కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షకు మండల విద్యాధికారులు కిందిస్థాయి ఉద్యోగులు, స్కూల్ అసిస్టెంట్లను పంపించడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఓ ఎంఈఓపై సస్పెన్షన్ వేటు వేశారు. అదే విధంగా కల్వకుర్తి పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విధులకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేశారు. ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయుల పనితీరుపై సైతం కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఆ ప్రాంత ఉపాధ్యాయుల డిప్యూటేషన్ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ఉపాధ్యాయులు సక్రమంగా బడికి వెళ్లడం లేదనే ఫిర్యాదులు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ రంగంలోకి దిగి.. తరచుగా పాఠశాలల తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖలో మార్పు వస్తుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. -
తొలి ఏకాదశి వైభవం
పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయంలో వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు జిల్లావ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి.. ఆలయాల్లో విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలోని ఉమామహేశ్వర క్షేత్రం, లొద్ది మల్లయ్య క్షేత్రాలతో పాటు సోమశిల సోమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. సోమశిలలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామి దర్శనానికి క్యూ కట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకొని భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. 9లో.. -
సౌర విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం
నాగర్కర్నూల్/కందనూలు: సోలార్ ఇంధన వినియోగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రోత్సహిస్తూ.. గ్రీన్ ఎనర్జీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో గ్రీన్ ఎనర్జీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ అందించడంతో పాటు వ్యవసాయ పంపుసెట్లను కూడా దశలవారీగా సోలార్ విద్యుత్తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. తద్వారా రైతులపై విద్యుత్ భారం తగ్గడమే కాకుండా.. నిరంతర విద్యుత్ సరఫరాకు కూడా అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో విజయవంతంగా అమలవుతున్న సోలార్ విద్యుత్ నమూనాను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాగా, తూడుకుర్తిలో 2 కేడబ్ల్యూ ఆర్టీఎస్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని.. సోలార్ ఎనర్జీ ఏర్పాటుకు 639 ఇళ్లను గుర్తించి, ఇప్పటికే 78 ఇళ్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించడం జరిగిందని అధికారులు వివరించారు. అలాగే కొండారెడ్డిపల్లిలో 2 కేడబ్ల్యూ ఆర్టీఎస్ ప్లాంట్, 101 ఇళ్లకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. సమావేశంలో విద్యుత్శాఖ అధికారి మోహన్రెడ్డి, డీఈ శ్రీనివాస్ ఉన్నారు. జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనను కృషి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. క్షయ నివారణకు ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు, చికిత్స విధానంపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైతే అక్కడికక్కడే శాంపిల్స్ సేకరించాలని ఆదేశించారు. తద్వారా వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, బాధితులకు సత్వర చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుందన్నారు. వ్యాధి నిర్ధారణలో జాప్యం జరగకుండా ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించాలని తెలిపారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార సహాయం, ఉచిత మందులు, వైద్య పరీక్షలు, ఇతర సంక్షేమ పథకాలపై ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని మండల వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డా.కృష్ణ ఉన్నారు. -
ఫీజు బకాయిలపై నిర్లక్ష్యం తగదు
కందనూలు: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఫీజు బకాయి.. బీజేపీ లడాయి అంశంపై ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 40లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ. 15వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఫీజులను సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక, ఉన్నత విద్య చదువుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల బకాయి.. విద్యార్థుల లడాయి పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దన్నోజు నరేశ్చారి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహ, కార్యదర్శి తిరుమల్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మ ఉన్నారు. కృష్ణా మండలంలోని గుడేబల్లూరు వద్ద కృష్ణానదిలో పారుతున్న వరద నీరు -
అడ్మిషన్లు ‘ఓపెన్’
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ పరిస్థితులతో చదువు మధ్యలో ఆపేసిన వారికి దిక్సూచిగా నిలుస్తోంది ఓపెన్ స్కూల్ సొసైటీ. ఒకవైపు సొంత పనులు లేదా ఉద్యోగాలు చేసుకుంటూనే.. మరోవైపు పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసేలా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సుల ద్వారా వచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్ విద్యతో సమానమైన గుర్తింపు కలిగి ఉంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా విద్యార్థుల సౌకర్యార్థం 104 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపిక చేసిన మండలాల్లో.. ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానాన్ని 2008–09 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట కేవలం ఎస్సెస్సీ చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా.. 2011 నుంచి ఇంటర్ చదివే వారికి కూడా అవకాశం కల్పించారు. అయితే ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మండలాల్లో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు (అధ్యయన కేంద్రాలు) ఏర్పాటు చేశారు. ఇలా ఉమ్మడి పాలమూరులో మొత్తం 104 స్టడీ సెంటర్లలో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. వారంలో మొత్తం వారికి అవసరం ఉన్న పనులు చేసుకుంటూ ఆదివారం స్టడీ సెంటర్లలో నిర్వహించే తరగతులకు హాజరుకావాల్సి ఉంది. నారాయణపేట, గద్వాల, నాగర్కర్నూల్ వంటి కొన్ని అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల్లో వీటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులతో మధ్యలో ఆపేసిన వారికి సదావకాశం ఇతరత్రా పనులు చేసుకుంటూనే చదివేందుకు అవకాశం సర్టిఫికెట్కు రెగ్యులర్ కోర్సులతో సమాన ప్రాధాన్యం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలంటున్న అధికారులు డిస్టెన్స్ విధానంలో ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ చదవాలనుకునే విద్యార్థుల కోసం ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది. ఆసక్తి గల విద్యార్థులు సూచించిన ఫీజులను చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టును.. తమకు అనుకూలమైన సమయంలో చదువుకునేందుకు అవకాశం ఉంది. ఆది, రెండో శనివారాల్లో తరగతులు నిర్వహిస్తాం. – శివయ్య, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఆన్లైన్ విధానంలో WWW.TELANGA NAOPENSCHOOL.ORG వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్సెస్సీలో జనరల్ వారికి రూ.1,400, మహిళలు ఇతర రిజర్వేషన్ వారు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు రిజిస్ట్రేషన్కు రూ.150 సాధారణంగా చెల్లించాలి. ఇంటర్లో పురుషులు జనరల్ వారు రూ.1,500, మిగతా వారికి రూ.1,200తోపాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులు చెల్లించిన రశీదు, అడ్మిషన్ ఫాం భర్తీ చేసి స్టడీ సెంటర్లో అందజేయాలి. చెల్లించిన ఫీజులోనే పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో స్టడీ సెంటర్లు.. గతేడాది ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తీర్ణత పొందినవారు ఇలా.. ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ చదివిన వారికి రెగ్యులర్ కోర్సులకు సమానంగా సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్తో అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సెస్సీ బోధన అంశాలను మూడు గ్రూపులుగా విభజించి బోధిస్తారు. గ్రూప్–ఏలో భాషలు, గ్రూప్–బీలో ప్రధాన అంశాలు, గ్రూప్–సీలో వృత్తి విద్యకు సంబంధించిన కోర్సులు ఉంటాయి. మొదటి రెండింటిని కలిపి కనీసం రెండు సబ్జెక్టుల చొప్పున ఐదింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, ఒరియా భాషల్లో కొనసాగిస్తారు. ఇంటర్లో గ్రూప్–ఏలో భాషలు, బీలో ఆప్షనల్స్, సీలో వృత్తి విద్యా కోర్సులు ఉండగా.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషలు అందుబాటులో ఉన్నాయి. గ్రూప్–ఏలో ఇంగ్లిష్తోపాటు నచ్చిన ఏదో ఒక భాషను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బీ, సీలో నచ్చిన ఆప్షనల్స్, వృత్తి విద్య కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. -
నేడు డయల్ యువర్ డీఎం
కందనూలు: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్ డిపో పరిధిలోని ప్రయాణికులు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఫోన్ నంబర్ 99592 26288 ను సంప్రదించి రవాణా సమస్యలు తెలియజేయడంతోపాటు ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని ఆయన కోరారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం నాగర్కర్నూల్ రూరల్: మండలంలోని పెద్దముద్దునూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాలను చిన్నజీయర్ స్వామి ఎమ్మెల్యే రాజేష్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యారంగంలో మౌళిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, కౌన్సిలర్లు, మండల అధ్యక్షుడు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అచ్చంపేట రూరల్: పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటు పడుతోందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. విద్యాసంస్థల బంద్ ప్రశాంతం కందనూలు: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని ఆ సంఘం నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో విద్యార్థులను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయ కులు తారాసింగ్, వంశీ, శివప్రసాద్, అరుణ్, రామకృష్ణ, కురుమయ్య పాల్గొన్నారు. 8, 9 తేదీల్లో సాహిత్య సదస్సు స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణ సాహితీ దిగ్గజం ఆచార్య పాకాల యశోదారెడ్డి జయంతిని పురస్కరించుకొని నగరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో వచ్చే నెల 8, 9 తేదీల్లో సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్లు మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆచార్య పాకాల యశోదారెడ్డి సమగ్ర సాహిత్యం అనే అంశంపై రెండురోజులపాటు సాహిత్య సదస్సు ఉంటుందన్నారు. ఆచార్య పాకాల యశోదారెడ్డి సమగ్ర సాహిత్యంపై పరిశోధనలు సమర్పించాలనుకున్న సాహితీవేత్తలు, పరిశోధకులు తమ పేర్లను నమోదు చేసుకొని పత్రాలను ముందస్తుగా సంస్థకు పంపించాలని కోరారు. -
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
కందనూలు: రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ వ్యవసాయాధికారులకు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్నినో, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై ప్రభావం, భూగర్భ జలాల లభ్యత, నీటి సంరక్షణ చర్యలు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావాన్ని తేలికగా తీసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వర్షాభావానికి గురయ్యే మండలాలు, గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అధిక నీరు అవసరమయ్యే వరి వంటి పంటలకు బదులుగా పత్తి, కందులు, మినుములు, పెసలు, ఉలవలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఇతర చిరుధాన్యాలు, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, నాణ్యమైన విత్తనాలు, పంటల బీమా, మార్కెటింగ్ అవకాశాలు, కనీస మద్దతు ధరలపై గ్రామస్థాయిలో విసృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో నీటి వృథాను అరికట్టేందుకు ‘జల ప్రతిజ్ఞ’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు దేవ సహాయం, చెన్నయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్లో వేగం పెంచాలి
కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి/కోడేరు: సర్పై బీఎల్ఓలు, బీఎల్ఏలు సీరియస్గా వ్యవహరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శుక్రవారం ఆయన కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరులోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సర్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీఓలు, బీఎల్ఓలు, బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. మండలాల వారీగా ఇప్పటివరకు జరిగిన ఓటర్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వివరాలను మంత్రి తెలుసుకున్నారు. నిరక్షరాస్యులైన ఓటర్లు చాలా మంది ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపలేదనే విషయం తన దృష్టికి వచ్చిందని, వారి ఇళ్ల వద్దకు బీఎల్ఓలు, బీఎల్ఏలు వెళ్లి వారికి అవసరమైన సహయం అందించాలని సూచించారు. బూత్ల వారీగా ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీనివాసులు, జమీల్, కాంగ్రెస్ పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు సత్యం, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్రావు, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రుడికి చేయూత కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మండలంలోని నార్లాపూర్కు చెందిన కావలి మల్లేష్ ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆ సమయంలో కొల్లాపూర్ పర్యటనను ముగించుకొని అటుగా వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గమనించి తన ఎస్కాట్ వాహనంలో క్షతగాత్రుడిని ఎక్కించి వెంటనే కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. కొల్లాపూర్లో ప్రథమ చికిత్స చేసిన తర్వాత వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. -
కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
అమ్రాబాద్: కేసుల నమోదు, పరిష్కారంలో పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండొద్దని ఎస్పీ సంగ్రామ్సింగ్ జిపాటిల్ ఆదేశించారు. అమ్రాబాద్ పోలీస్స్టేషన్ను శుక్రవారం డీఎస్పీ పల్లె శ్రీనివాసులు తో కలిసి ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఎస్పీకి గౌరవ వందనం చేశారు. అనంతరం ఎస్పీ పోలీస్స్టేషన్ పరిసరాలు తిరిగి పరిశీలించారు. కేసుల నమోదు, క్రైమ్ రికార్డులు పరిశీలించిన అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ, సిబ్బందికి సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ క్రైమ్రేట్ తగ్గించాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ చంద్రయ్య, ఎస్ఐ హన్మంత్రెడ్డి ఉన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలి
నాగర్కర్నూల్ రూరల్: రాష్ట్రంలో విద్యాశాఖకు వెంటనే పూర్తిస్థాయి మంత్రిని నియమించడంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఐఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రేమ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేని పరిస్థితి నెలకొందని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల భవనాలు అనేకచోట్ల శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అత్యవసరంగా మరమ్మతు చేసి అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మించి అన్ని మౌళిక వసతులు కల్పించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఫణి, అర్జున్, చరణ్, యశ్వంత్, అనిల్, రవీందర్, ప్రవీణ్, లక్ష్మణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలు సాగు చేయాలి
పాన్గల్: ఎల్నినో నేపథ్యంలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని డీఆర్డీఓ ఉమాదేవి, ఏడీఏ తిప్పేస్వామి రైతులకు సూచించారు. గురువారం మండలంలోని శాగాపూర్, శాగాపూర్తండాలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఏడీఏ, మల్లాయిపల్లిలో డీఆర్డీఓ పాల్గొని మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. తక్కువ నీరు అవసరమయ్యే కంది, మినుము, జొన్న వంటి పంటలతో పాటు అంతర పంటలుగా కంది–మినుము, ఆముదం–మినుముతో పాటు టమాటా, బెండకాయ, చిక్కుడు వంటి కూరగాయాల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగం, మల్చింగ్, వర్షపు నీటి సంరక్షణ, సూక్ష్మ సాగునీటి పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం ఎల్నినో ప్రభావంపై ముద్రించిన కరపత్రాలను రైతులతో కలిసి అధికారులు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో అసిస్టెంట్ జల శాస్త్రజ్ఞుడు ఉమేష్, తహసీల్దార్ కార్తీక్రావు, ఎంపీడీఓ గోవిందరావు, ఏఈఓలు, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
రైతులతో రాజకీయం చేయడం తగదు
నాగర్కర్నూల్: నకిలీ డీఏపీ సూత్రదారులపై పీడియాక్ట్ నమోదు చేయాలని, రైతుల జీవితాలతో రాజకీయం చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందా.. లేక వారి అనుచరుల హస్తం ఉందా అనేది పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వలన వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా తెచ్చిన కరువని దుయ్యబట్టారు. మొక్కజొన్న కొనుగోలులోనూ గన్నీ బ్యాగుల ట్రాన్స్పోర్టు డబ్బులు, బిజినేపల్లిలో రైతులను ముంచిన దళారులు, నకిలీ డీఏపీ సూత్రదారులపై చర్యలు తీసుకోకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. తెలంగాణకు రావాల్సిన 34 శాతం నీటి వాటాలో కేవలం 22 శాతమే వినియోగించడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రాష్ట్ర నీటి హక్కులు కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. సమావేశంలో నాయకులు శ్రీశైలం, హన్మంతురావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్జీఎఫ్ సందడి
● పాఠశాల, కళాశాల స్థాయిలో క్రీడలు ● తెలంగాణ స్కూల్గేమ్స్ షెడ్యూల్ విడుదల ● వచ్చేనెల మొదటి వారం నుంచి నాలుగు దశల్లో పోటీల నిర్వహణ మహబూబ్నగర్ క్రీడలు: పాఠశాల, కళాశాలల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అండర్ 14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా మండలస్థాయి నుంచి మొదలుకొని జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో క్రీడాపోటీలను నిర్వహిస్తారు. ఎంతో మంది పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఎస్జీఎఫ్ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదిగి తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు విద్యార్థులకు ఒక వేదికలా ఉపయోగపడుతున్నాయి. ● ప్రతి ఏడాది పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభం అనంతరం జిల్లాలోని పీఈటీలతో సమావేశం నిర్వహించి, ఎస్జీఎఫ్ పోటీల ఎంపికలపై నిర్ణయం తీసుకుంటారు. ఆగస్టు నుంచి ఈ ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని ఎస్జీఎఫ్ క్రీడా పోటీలకు 2026–27 సంవత్సరానికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ క్రీడా షెడ్యూల్ను ఇటీవల విడుదల చేశారు. నాలుగు దశల్లో ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు జరగనున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబర్ నాలుగో వారం వరకు నాలుగు దశల్లో ఎస్జీఎఫ్ క్రీడలు జరగనున్నాయి. మండల, జిల్లా, ఉమ్మడి జిల్లా (జోనల్), రాష్ట్రస్థాయిల్లో ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు జరగనున్నాయి. జిల్లాల ఎంపిక పోటీలను నిర్వహించుకొని పాత ఉమ్మడి జిల్లా జట్టుగా ఏర్పడి రాష్ట్ర పోటీలకు హాజరుకానున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా షెడ్యూల్ విడుదలకావడంతో ఇక క్రీడల సందడి నెలకొనుంది. ఈవెంట్ క్రీడలు నిర్వహించే సమయం మండలస్థాయిలో టోర్నీలు ఆగస్టు మొదటి, రెండో వారం జోనల్ టోర్నీ కమ్ సెలక్షన్స్(అంతర్ మండలాలు) ఆగస్టు మూడో వారం ఉమ్మడి (జోన్) జిల్లాస్థాయి టోర్నీకమ్ సెలక్షన్స్ సెప్టెంబర్ రెండో వారం రాష్ట్రస్థాయి పోటీలు (పది ఉమ్మడి జిల్లాలస్థాయి) సెప్టెంబర్ నాలుగో వారం ఎస్జీఎఫ్ వివరాలు.. పకడ్బందీగా నిర్వహిస్తాం... ఈ ఏడాది అండర్–14, అండర్–17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలను వ్యాయా మ ఉపాధ్యాయుల సహకారంతో పకడ్బందీగా నిర్వహిస్తాం. డీఈఓ ఆదేశాల మేరకు త్వరలో జిల్లాలోని పీడీ, పీఈటీలతో సమావేశం నిర్వహిస్తాం. గత ఏడాది వనపర్తి జిల్లాలో నాలుగు ఎస్జీఎఫ్ హాకీ టోర్నీలు నిర్వహించాం. ఈ ఏడాది కూడా జిల్లాకే ఏమైనా రాష్ట్రస్థాయి టోర్నీలు కేటాయిస్తే విజయంతంగా నిర్వహిస్తాం. – బి.కుమార్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి, వనపర్తి -
చేయూతపై ఆశలు..
దాదాపు నాలుగేళ్ల తర్వాత రానున్న కొత్త పింఛన్లు నాగర్కర్నూల్: ఎన్నో ఏళ్ల నుంచి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వివిధ కేటగిరిల లబ్ధిదారుల కల ఎట్టకేలకు ఫలించనుంది. గత నాలుగేళ్లుగా అప్పుడు.. ఇప్పుడు అంటూ కాలయాపన చేసిన పాలక ప్రభుత్వాలు వచ్చే పంద్రాగస్టుకు పంపిణీ చేసేలా కసరత్తు ప్రారంభించాయి. కొత్త పింఛన్లు ఇవ్వకుండా లబ్ధిదారులు ఎవరైనా చనిపోతే వారి స్థానంలో అర్హులైన భర్త లేక భార్యకు రెండున్నరేళ్ల నుంచి ఇస్తూ వస్తున్నారు. దీంతో అర్హులైన కొత్తవారు నిత్యం పంచాయతీ కార్యాలయాలు, మండల పరిషత్ల చుట్టూ పింఛన్ల కోసం ప్రదక్షిణలు చేసేవారు. ఎమ్మెల్యేలు, నాయకులు కలిసిన చోటల్లా దండాలు పెట్టేవారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం కనికరించి.. ఆగస్టు 15న కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై బ్యాంకు ఖాతాలోనే.. జిల్లావ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 1,02,976 మం ది చేయూత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. నెలవారిగా రూ.24.83 కోట్ల మేర నిధులు వారికి అందజేస్తున్నారు. దివ్యాంగులకు రూ.4,016 చొప్పన పింఛను ఇస్తుండగా.. ఇతరులకు రూ.2,016 ఇస్తున్నారు. వీరికి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నారు. అయితే ఇక నుంచి పింఛన్లు బ్యాంకు ఖాతాల ద్వారానే అందజేయాల ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే పోస్టా ఫీసుల్లో తీసుకునే వా రికి సైతం బ్యాంకుల ద్వారా ఇచ్చే విధంగా ఖాతాలు తెరిపించారు. ఇక నుంచి పింఛను లబ్ధిదారుల అందరూ బ్యాంకుల ద్వారానే పెన్షన్ పొందాల్సి ఉంటుంది. వారందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్యాంకుకు వెళ్లి ఎఫ్ఆర్ఎస్ ద్వారా అప్డేట్ చేయించుకోవాలనే నిబంధన ఉంది. అయితే 2022 ఆగస్టు 31 నుంచి ఈ పథకం ద్వారా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. దీంతో అర్హులైన లబ్ధిదారులు పింఛన్లు ఇస్తామని ప్రకటన వెలువడగానే ఆనందపడుతున్నారు. దివ్యాంగులు 12,014 అనర్హులవి ఏరివేత.. ఇటీవల ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ (లైవ్ అథెంటికేషన్) ప్రక్రియ నిర్వహించింది. మంత్ర యాప్ ద్వారా లబ్ధిదారుడి ఫొటో క్యాప్చర్ చేసి వివరాలు నమోదు చేశారు. ఆ ప్రక్రియ ఈ నెల 5వ తేదీతో ముగిసింది. జిల్లాలో ఉన్న పింఛన్ల లబ్ధిదారుల్లో దాదాపు 2,373 మంది చనిపోయినట్లు గుర్తించారు. మరో 1,860 మంది అందుబాటులోకి రాలేదని తేలింది. మొత్తంగా దాదాపు 4,233పైగా పాత లబ్ధిదారుల పింఛన్లు రద్దయ్యే అవకాశం ఉంది. ఆదేశాలు రాలేదు.. కొత్త పింఛన్ల పంపిణీపై ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సూచనలు వస్తే వెంటనే నిబంధనల ప్రకారం కొత్త పింఛన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. – చిన్న ఓబులేషు, డీఆర్డీఓ ఏ పని చేసుకోలేను.. నాకిప్పుడు 66 సంవత్సరాలు. గత మూడు సంవత్సరాల నుంచి పింఛన్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు చేతకాక పోవడంతో ఏ పని చేసుకోవడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా. ప్రభుత్వం త్వరగా పింఛన్ ఇచ్చేలా చూడాలి. – బాలయ్య, జూపల్లి, చారకొండ మండలం వచ్చే పంద్రాగస్టుకు పంపిణీ చేసేలా ప్రభుత్వం కసరత్తు ఆనందంలో అర్హులైన లబ్ధిదారులు కొత్తగా మరో 50 వేల మందికిపైనే అవకాశం జిల్లాలో ఇప్పటికే 1,02,976 మంది లబ్ధిదారులు బీడీ 23 కల్లుగీత 688 -
నేరాల కట్టడిలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
కందనూలు: నేరాల కట్టడిలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకం అని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పోలీసుస్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే రాజేశ్రెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అన్నారు. నేరాల నియంత్రణ, నేరస్తులను త్వరితగతిన గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమైనదని, పట్టణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి మంజూరు చేసిన నిధులతో మెగా కంపెపీ, వ్యాపారులు ఇచ్చిన విరాళాలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా నిఘా వ్యవస్థను జిల్లావ్యాప్తంగా మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా బిజినేపల్లిలో 32, కుమ్మెరలో 6, నాగర్కర్నూల్ పట్టణంలో 25, తిమ్మాజిపేటలో 17 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సీఐ కార్యాలయం తనిఖీ వార్షిక తనిఖీలో భాగంగా ఎస్పీ నాగర్కర్నూల్ సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే బాధితులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని, వారు ఇచ్చే ప్రతి ఫిర్యాదును వేగంగా స్పందించి పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అలాగే పట్టణంలోని రౌడీషీటర్ల వివరాలు తెలుసుకుని.. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. ఎలాంటి కేసులు పెండింగ్లో ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
సర్కారు బడుల్లో ‘లిప్’
అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతున్నాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆంగ్లంలోనే కాకుండా మాతృభాష తెలుగులోనూ తడబడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో గణితంలోనూ పిల్లలు వెనకబడుతున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక విద్య బలోపేతం కోసం విద్యాశాఖ ఉన్నత పాఠశాలల్లో లిప్ (లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమం అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల పిల్లలకు ఈ విద్యాసంవత్సరం నుంచి అభ్యసన నైపుణ్యాలు పెంపొందించడం కోసం అమలు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే జిల్లాలో ఉపాధ్యాయ నిపుణులతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నమూనా పరీక్షల్లో తడబాటు అభ్యసన సామర్థ్యాల్లో పిల్లలు తడబడుతున్నారు. తరగతికి తగినట్లుగా నేర్చకోవడం లేదని స్పష్టమైంది. తెలుగు, ఆంగ్లంతోపాటు కూడికలు, తీసివేతలు కూడా చేయడం లేదని తేలింది. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 7 నుంచి 11 వరకు బేస్లైన్ పరీక్షలు ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసి లోపాలను గుర్తిస్తారు. తర్వాత ప్రత్యేక విద్యాబోధన ద్వారా మెరుగైన అభ్యసన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటారు. బేస్లైన్, ఎండ్లైన్ పరీక్షల ఫలితాలను పోల్చి విద్యార్థుల పురోగతిని విశ్లేషిస్తారు. దీని ఆధారంగా వెనకబడిన విద్యార్థులకు విద్యాసాయం అందిస్తారు. ఈ ఫలితాలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో ఈ నెల 31లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బేస్లైన్ పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను అప్లోడ్ చేయడంపై తెలంగాణ ఎస్సీఈఆర్టీ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. విద్యార్థులకు వర్క్బుక్స్.. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్)లో భాగంగా 6, 7, 8, 9వ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల వర్క్బుక్స్ అందజేస్తారు. ప్రతిరోజు ప్రత్యేకంగా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా మల్టీలెవల్ విద్యాబోధన చేస్తారు. నిరంతర మూల్యంకనం ఉంటుంది. చదువు, నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక రీడింగ్ సెషన్లు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు కాలానుగుణంగా ప్రణాళికలు, లక్ష్య నిర్ధారణ, విద్యార్థుల పురోగతి సమీక్ష, వర్క్బుక్ ఆధారిత బోధనపై దృష్టిసారించనున్నారు. లిప్పై బేస్లైన్ పరీక్షలు నిర్వహించాలని హెచ్ఎంలు, ఉపాధ్యాయులను ఇప్పటికే ఆదేశించారు. ఎస్సీఈఆర్టీ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యసన సామర్థ్యాల పెంపునకు విద్యాశాఖ కసరత్తు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు బేస్లైన్ పరీక్షలు వెనకబడిన సబ్జెక్టుల్లో నాణ్యతతో కూడిన విద్యాబోధన ఉపాధ్యాయులకు ప్రారంభమైన శిక్షణ తరగతులు అమలు చేస్తున్నాం.. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపే లక్ష్యంగా లిప్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులపై పోకస్ ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే బేస్లైన్ పరీక్షలు నిర్వహించాం. విద్యార్థులు భాషా ప్రావీణ్యం సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలి. ఫలితాలను గడువులోగా తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. – రమేష్కుమార్, డీఈఓ నవంబర్ 20 నుంచి.. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 30 వరకు విద్యార్థులకు మిడ్లైడ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. డిసెంబరు 10న ఫలితాలు విడుదల చేస్తారు. ఎండ్లైన్ పరీక్షలు 2027 మార్చి 7 నుంచి 27 వరకు నిర్వహిస్తారు. మార్చి 31న ఫలితాలు ప్రకటించి ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల పురోగతిని నిరంతరం పరిశీలించి అవసరమైన విద్యాసాయాన్ని అందించనున్నారు. -
దరఖాస్తు చేసుకోండి
కందనూలు: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రమేశ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు htt p://bre.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల దరఖాస్తు ఫారం, ఎన్ఆర్ (రెండు కాపీలు), ఎస్బీఐ కలెక్ట్ ఫీజు రశీదు కాపీలను సంబంధిత పాఠశాల హెచ్ఎం ధ్రువీకరించి.. సెప్టెంబర్ 1వ తేదీలోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు తమ కుల, ఆదాయ ధ్రువపత్రాలను జతచేయాలని.. ఎన్ఎంఎంఎస్ పరీక్షను డిసెంబర్ 1న నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు. క్రీడలతో మానసిక, శారీరక వికాసం కందనూలు: క్రీడలు మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదపడతాయని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. బిజినేపల్లి మండలం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం రాష్ట్రస్థాయి అండర్–14, 17, 19 ఖోఖో జట్ల ఎంపికలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. తద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడి.. భవిష్యత్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి పునాదిగా నిలుస్తాయన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీసర్కిల్లో గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాకింగ్ వంటి పోస్టులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి విష్ణునందన్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్లో వచ్చే నెల14లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో శిక్షణ పొందిన వారు అనర్హులని, మరింత సమాచారం కోసం 74167 31371 నంబర్ను సంప్రదించాలని కోరారు. సమాజం సేవలో పీయూ ముందుంటుంది మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సమాజ సేవలో పీయూ ముందుంటుందని వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ధర్మాపూర్లో పీయూఎంఎస్డబ్ల్యూ విభాగం, ఎస్వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త వహించేందుకు పీయూ తనవంతుగా సేవలు అందిస్తుందన్నారు. ఎక్కడికో వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోకుండా గ్రామానికి వచ్చిన వైద్యులతో పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవాలని కోరారు. ఎంఎస్డబ్ల్యూ విద్యార్థులు పుస్తక వి/్ఞానంతోపాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని, కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, సర్పంచ్ రాజుగౌడ్, డాక్టర్లు పవన్కుమార్, సింధు, మణికంఠరాజు, ఆప్రీన్, విజయ, అంజని, మనోహర్, అధ్యాపకుడు గాలెన్న తదితరులు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 131ని జారీ చేసింది. వందశాతం ఎల్ఆర్ఎస్ పూర్తి చేయడంతో పాటు మున్సిపల్ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ కొనసాగుతోంది. తక్కువ ఫీజుతో యజమానులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలి. చివరి దాక వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి లబ్దిదారుల వివరాలు సేకరిస్తున్నాం. – మురళి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట ● -
విద్యార్థుల భవిష్యత్తో కేంద్రం చెలగాటం
అచ్చంపేట రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతోందని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ధ్వజమెత్తారు. నీట్లో జరిగిన అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడం.. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేట అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట్ నిర్వహణలో జరిగిన అక్రమాలు బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులతో లాఠీచార్జి చేయించడం.. అక్రమ అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్రం.. వారిపై నిర్బంధ చర్యలకు దిగడం అత్యంత దురదృష్టకరమన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను విరమించి.. విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
లింగసానిపల్లిలో నకిలీ ఎరువుల కలకలం
కల్వకుర్తి రూరల్: ఇటీవల ఉమ్మడి జిల్లాలో నకిలీ ఎరువుల విక్రయ వ్యవహారం కలకలం రేపిన విషయం విదితమే. తాజాగా కల్వకుర్తి మండలం లింగసానిపల్లిలో నకిలీ ఎరువులు లభించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మార్కెట్లో డీఏపీకి అధికంగా డిమాండ్ ఉండటంతో పాటు కొందరు రైతులకు నకిలీ ఎరువును అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. లింగసానిపల్లిలో నకిలీ డీఏపీ బస్తాలు ఉన్నాయని నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం మండల వ్యవసాయశాఖ అధికారి సురేశ్ గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రైతులు రాములు, జంగయ్య ఇళ్లలో ఎలాంటి బిల్లులు లేకుండా ఉన్న 45 డీఏపీ బస్తాలను గుర్తించి.. పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే నెల రోజుల క్రితం గ్రామానికి డీసీఎంలో తీసుకొచ్చిన డీఏపీని నలుగురు రైతులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇద్దరు రైతులు నకిలీ డీఏపీని వినియోగించగా.. మరో ఇద్దరు ఇళ్లలో నిల్వ చేసుకున్నట్లు ఏఓ తెలిపారు. నికిలీ ఎరువుల వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తామని పేర్కొన్నారు. -
మరో 8 రోజులే..
రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు సమీపిస్తున్న గడువు అచ్చంపేట మున్సిపల్ కార్యాలయం అచ్చంపేట: అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్–2020 స్కీం కింద ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంబంధిత ప్లాట్ల యజమానులు గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసి.. రాయితీ పొందాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. 2020లో చేసిన దరఖాస్తుదారుల్లో చాలా మంది ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. మరికొందరు ప్లాట్లను విక్రయించారు. రెండు విడతల్లో ప్రభుత్వం రాయితీ ప్రకటిస్తే.. అంతంత మాత్రంగానే ముందుకొచ్చారు. జిల్లాలో మున్సిపాలిటీలకు దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా ఫీజు చెల్లింపులు మాత్రం అంతంత మాత్రమే. ఇందుకు మున్సిపల్ అధికారుల అలసత్వం కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాట్ల క్షేత్రస్థాయి పరిశీలనను నిర్లక్ష్యం చేస్తుండటంతో పాటు ఫీజు చెల్లించిన వారికి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతోనే ఈ ప్రక్రియ ఆశాజనకంగా సాగడం లేదు. అప్పట్లో చాలా మందికి ఎల్ఆర్ఎస్ చేసుకునే విధానం తెలియకపోవంతో దరఖాస్తు చేసుకోని ప్లాట్లు కూడా జిల్లాలో చాలా వరకు ఉన్నాయి. వీటికి కూడా అవకాశం కల్పిస్తే, ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరతుంని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇంటి నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేఽశంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అమలుచేసింది. 25శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మున్సిపాలిటీలు వెనకబడ్డాయి. విస్తృత ప్రచారం చేపట్టకపోవడం వల్ల చాలా మంది రాయితీపై ఫీజు చెల్లించేందుకు ముందుకు రాలేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో కేవలం బ్యానర్ల ద్వారా కొద్దిరోజులు ప్రచారం చేసి వదిలేసినట్లు ప్రచారం సాగుతోంది. ఫలితంగా గడువు ముగిసే సమయానికి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సమకూరే అవకాశం కనిపించడం లేదు. గడువు ముగిసిన తర్వాత రాయితీ వర్తించకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ ప్రకియ పూర్తిచేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్థికంగా లబ్ధిపొందాలని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 31తో ముగియనున్న రాయితీ అవకాశం ఇంకా చాలా మంది ముందుకు రాకపోవడంతో పెండింగ్లోనే.. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన మూడు దశల్లో చేపడుతున్నారు. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులు సంయుక్తంగా ప్లాట్లను పరిశీలించి.. నిబంధనల మేరకు క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మొదటి దశలో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాల్సి ఉంది. అనంతరం రెండో దశ మరోసారి వివరాలను ధ్రువీకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. చివరి దశలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే మున్సిపల్ కమిషనర్ తుది ప్రొసీడింగ్ జారీ చేస్తున్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
కందనూలు: ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.కృష్ణ హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఆస్పత్రుల్లో అందించే సేవలకు ధరల పట్టికను తప్పనిసరిగా నోటీసు బోర్డులో ఏర్పాటు చేయాలని తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట ప్రో గ్రాం అధికారి కె.రవికుమార్, మాస్ మీడియా అధికారి రాజగోపాలాచారి ఉన్నారు. ఉల్లి @ రూ.3,200 దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్లో జరిగిన వేలంలో ఉల్లి ధరలు గత వారం ధరలే పలికాయి. బుధవారం ఉదయం పది గంటలకు జరిగిన వేలంలో క్వింటాల్కు గరిష్టంగా రూ.3,200, కనిష్టంగా రూ.2,400 గా నమోదయ్యాయి. సన్నటి పేడు ఉల్లి గరిష్టంగా రూ.2,200, కనిష్టంగా రూ.1,800 పలికింది. ముసురు వానలు కురుస్తుండడంతో మార్కెట్కు ఉల్లి అమ్మకానికి తక్కువగా వచ్చింది. -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
పెద్దకొత్తపల్లి: ఆయిల్పాం సాగుతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి వెంకటేశం సూచించారు. పెద్దకొత్తపల్లిలోని ఆయిల్పాం కొనుగోలు కేంద్రంలో సేకరించిన గెలలను బుధవారం ఆయన పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు తోటల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ముఖ్యంగా తక్కువ నీటితో పండించే ఉద్యాన తోటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్పాం సాగుచేసిన నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై.. 30 ఏళ్ల వరకు రైతుకు స్థిరమైన ఆదాయం ఉంటుందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 110 టన్నుల గెలలను పెద్దకొత్తపల్లిలోని కేంద్రం వద్ద సేకరించినట్లు పేర్కొన్నారు. టన్నుకు రూ. 23,783 ధర పలుకుతుందని.. సేకరించిన గెలలకు 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని సహించం
కందనూలు: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ఆస్పత్రిలో వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం, అలసత్వానికి తావివ్వొద్దన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో రాజీ పడేది లేదని.. ఆస్పత్రిలో ప్రతి విభాగం సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర తదితరులు ఉన్నారు. -
వీడని మరమ్మత్తు
ఎంజీకేఎల్ఐలో ఐదేళ్ల క్రితం పాడైన పంపు మోటార్లు కొల్లాపూర్: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు– రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్ఐ) పథకం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 మోటార్ల ద్వారా ఏటా కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి.. కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ సాగు, తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం గల ఎత్తిపోతల పథకం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఐదేళ్ల క్రితం పాడైన రెండు మోటార్లు నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారు లు కాలయాపన చేస్తుండటంతో.. మిగతా మూడు మోటార్లతోనే నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో వాటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదీ పరిస్థితి.. కేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు పంప్హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి.. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న చెరువులను నింపుతున్నారు. ఎల్లూరు పంప్హౌజ్లో నీటి ఎత్తిపోతల కోసం 5 మోటార్లను ఏర్పాటుచేశారు. వీటిలో రెండు మోటార్లు పాడయ్యాయి. ఐదేళ్ల క్రితం పంప్హౌజ్లోకి నీరు చేరుకోవడంతో ఒక మోటార్, రెండున్నర ఏళ్ల క్రితం మరో మోటార్ దెబ్బతింది. వీటికి మరమ్మతు చేపట్టడంలో ఆలస్యం అవుతుండటంతో మూడు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. వివిధ రకాల కారణాలతో సమస్య పరిష్కరించని అధికారులు ఎల్లూరు పంప్హౌజ్లో మూడు పంపులతోనే ఎత్తిపోతలు దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టుపై తీవ్రభారం తాజాగా వరదలు వచ్చే సీజన్ కావడంతో ఈసారి అదే పరిస్థితి పూర్తిగా నిలిపివేస్తేనే.. ప్రాజెక్టులో మోటార్ల మరమ్మతుకు పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ స్కీం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండటంతో రెగ్యులర్గా నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. దీంతో మోటార్ల మరమ్మతుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మోటార్లకు మరమ్మతు చేయాలంటే నీటి ఎత్తిపోతలు కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే.. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నిలిపివేసేందుకు వీలు ఏర్పడుతుంది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా ప్రారంభమయ్యే వరకు మోటార్లకు మరమ్మతు చేపట్టడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. -
25న లక్ష్మీచెన్నకేశవుడికి లక్ష పుష్పార్చన
జడ్చర్ల టౌన్: మండలంలోని గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామికి ఆషాఢ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం లక్ష పుష్పార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వేడుక కొనసాగుతుందన్నారు. అనంతరం 4 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన ఉంటుందన్నారు. తెల్లవారుజామన సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే వేడుక 6.30 గంటలకు పంచామృతాభిషేకం, 9గంటలకు పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, సాయంత్రం 5 గంటలకు ప్రదోశ పూజ, రాత్రి 9 గంటలకు శయనోత్సవం జరిపించి మరుసటి రోజు ఆదివారం 7 గంటలకు స్వామికి సహస్రనామార్చన, 8 గంటలకు మహానివేదన చేస్తామన్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. -
ఉద్యాన పంటలతో అధిక లాభాలు
కల్వకుర్తి రూరల్: ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి వెంకటేశం అన్నారు. మంగళవారం కల్వకుర్తి మండలం ముకురాల, లింగసానిపల్లి గ్రామాలతో పాటు ఊర్కొండ మండలంలో సాగుచేసిన ఉద్యాన పంటలను ఆయన పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. ఈసారి ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో పండించే కూరగాయలు, ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కరువు పరిస్థితులను తట్టుకునే జామ, ఉసిరి, దానిమ్మ, మామిడి తోటలతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. తోటలకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరందించాలని.. సేంద్రియ, ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా నేలల్లో తేమ సంరక్షణ చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట ఉద్యానశాఖ అధికారి మహేశ్వరి, విస్తరణాధికారి శివలీల ఉన్నారు. -
ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరాలి
అచ్చంపేట రూరల్: వీబీ–జీ రామ్జీ పథకంతో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీబీ–జీ రామ్జీపై అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పథకం అమలులో పారదర్శకత, నాణ్యత, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. సమావేశంలో ఆయా మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. -
చిగురించిన ఆయిల్ ఆశలు
నర్వ: దేశంలో నూనెగింజల ఉత్పత్తి తగ్గటం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం కారణంగా ప్రతిఏటా రూ.70 వేల కోట్ల ఆయిల్ను దిగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో డిమాండ్ మేర నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రారంభంలో ఆసక్తి చూపని రైతులు తదనంతరం ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో ముందుకు వస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం మార్కెట్లో టన్ను ఆయిల్పాం ధర రూ.24 వేల వరకు పలుకుతుండడంతో సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. మొదట్లో పైలెట్ ప్రాజెక్టుగా నారాయణపేట జిల్లాలో 2020–21 ఏడాది ప్రారంభంలో 430 ఎకరాలు మాత్రమే ఆయిల్పాం సాగు ప్రారంభించిన అధికారులు 2021లో జిల్లాకు 4.60 లక్షల మొక్కలు దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి 2025 వరకు ఉమ్మడి జిల్లాలో 33,999 ఎకరాల్లో విస్తరించగా.. నారాయణపేట జిల్లాలోనే 7 వేల ఎకరాల్లో ఆయిల్పాంను రైతులు సాగు చేస్తున్నారు. అయితే జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు గెలలను తరలిస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. గతేడాది జిల్లాలో ఆయిల్ఫెడ్ కార్పొరేషన్కు చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి రూ.300 కోట్లతో ఆయిల్పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించగా.. మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు కోసం స్థలం సేకరణలో భాగంగా దాదాపు 40 ఎకరాలు కేటాయింపు కొలిక్కివచ్చింది. కోస్గి, మక్తల్లో ఏర్పాటు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి సైతం సీఎం రేవంత్రెడ్డిని కోరడంతో ఆయిల్పాం రైతులకు ఆశలు రెట్టింపయ్యాయి. నారాయణపేట 6,907 వనపర్తి 6,400 30 కి.మీ., ఒకటి చొప్పున.. పంట కోత మొదలైనప్పటి నుంచి కొనుగోలు వరకు అయ్యే రవాణా ఖర్చులను ఆయిల్ఫెడ్ కార్పొరేషనే చెల్లిస్తోంది. ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున జిల్లాలో మక్తల్, మరికల్, మాగనూర్, కృష్ణా, నారాయణపేట, కోస్గి, మద్దూరు ప్రాంతాల్లో గెలల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగువిస్తీర్ణం ఇలా (ఎకరాలు).. ‘పేట’ జిల్లాలో మూడు చోట్ల పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు చిత్తనూర్ వద్ద ఆయిల్పాం నర్సరీ, పరిశ్రమకు భూమి కేటాయింపు స్థానికంగా విక్రయించుకుంటేనే రైతులకు ప్రయోజనం ఇన్నాళ్లు ఫ్యాక్టరీ లేకపోవడంతో గెలల విక్రయానికి అవస్థలు నాగర్కర్నూల్ 7,692 జోగుళాంబ గద్వాల 7,700 మహబూబ్నగర్ 5,300 -
బైక్ను ఓవర్టెక్ చేయబోయి..
● ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు ● డ్రైవర్ దుర్మరణం ● 14 మంది ప్రయాణికులకు గాయాలు ● ఎన్హెచ్–167పై ఘటన తాడూరు: ముందు వెళ్తున్న బైక్ను అతివేగంతో ఓవర్టెక్ చేయబోయిన స్కార్పియో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో స్కార్పియో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 14 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన తాడూరు మండలం గుంతకోడూరు గ్రామ శివారులోని 167వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఆమనగల్ మండలం కోనాపూర్కు చెందిన శరత్గౌడ్ (28) స్కార్పియో కారులో నాగర్కర్నూల్ వైపు బయలుదేరాడు. గుంతకోడూరు సమీపంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓవర్టెక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సును ఢీకొట్టాడు. ప్రమాదంలో స్కార్పియో వాహనం నుజ్జునుజ్జయి.. డ్రైవర్ శరత్గౌడ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ద్విచక్ర వాహనదారుడు కోట శ్రీనివాస్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి డిపో మేనేజర్ శాలిని, తాడూరు ఏఎస్ఐ బాలునాయక్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఈ–కేవైసీ 77.26 శాతమే!
రేషన్ లబ్ధిదారులకు 31వ తేదీ వరకు గడువు ● జిల్లాలో 6,94,740మంది ఈ–కేవైసీ పూర్తి ● మరో 2,04,445 మంది ఫిజికల్గా రేషన్ దుకాణానికి వెళ్లాల్సిందే.. ● త్వరలో స్మార్ట్కార్డులు అందజేత కల్వకుర్తి: బోగస్ రేషన్కార్డుల ఏరివేతతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం ఈ–కేవైసీ ప్రక్రియ చేపట్టింది. ప్రారంభంలో వేగంగా కొనసాగిన ఈ ప్రక్రియ.. కొన్నాళ్ల తర్వాత అధికారులపై ఒత్తిడి తగ్గించడంతో నిర్లక్ష్యం నెలకొంది. దీంతో ఎంతోమంది లబ్ధిదారుల ఈ–కేవైసీ ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో ఇప్పటివరకు 77.26 శాతం మాత్రమే ఈ–కేవైసీ పూర్తయింది. తద్వారా చాలా బోగస్ కార్డులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మరణించి వారి పేర్లను రేషన్ కార్డుల్లో నుంచి తొలగించారు. పూర్తిస్థాయిలో ఈ ప్రక్రియ చేపడితే మరిన్ని బోగస్ కార్డులు, మరణించిన వారి సంఖ్య తేలనుంది. మిగిలిన లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీ వరకు రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ–కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం గడువు విధించింది. ముందుంజలో కల్వకుర్తి.. జిల్లాలో కల్వకుర్తి మండలం రేషన్ ఈ–కేవైసీలో మందంజలో ఉంది. మండలంలో 66,140 యూనిట్లు ఉండగా.. 52,400 మంది ఈ–కేవైసీ పూర్తయింది. ఇంకా 13,740 మంది మిగిలారు. రెండో స్థానంలో నాగర్కర్నూల్ మండలం ఉంది. ఇక్కడ 77,326 యూనిట్లకు గాను 59,378 మంది ఈ–కేవైసీ నమోదు చేసుకున్నారు. కొల్లాపూర్ మండలంలో 61,264 యూనిట్లకు గాను 46,613, అచ్చంపేట మండలంలో 66,147 యూనిట్లకు గాను 49,679 యూనిట్ల ఈ–కేవైసీ పూర్తయింది. ఇక స్మార్ట్ కార్డులే.. జిల్లాకు రేషన్ స్మార్ట్ కార్డులు వచ్చాయి. లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అయితే ప్రింట్ పేపర్ కాకుండా, ఓటరు కార్డు తరహాలో రేషన్ స్మార్ట్ కార్డు ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కార్డుపై క్యూర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యులు, సంబంధిత రేషన్ దుకాణం వివరాలు వస్తాయి.కార్డు స్థితి వంటి సమాచారం తెలిసిపోతుంది. భవిష్యత్లో సంక్షేమ పథకాలకు సైతం అనుసంధానం చేసే అవకాశం ఉంది. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కల్వకుర్తి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, జాతీయ రహదారులపై భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా చేయడం, సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థవంతంగా అమలు తదితర అంశాలపై మంగళవారం రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జిల్లాలో కచ్చితంగా అమలు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలోని జాతీయ రహదారుల పరిస్థితి, ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలు, రహదారుల పక్కనున్న దాబాలు, హోటళ్ల అనుమతులు, భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, అంబులెన్స్ సౌకర్యాలు తదితర అంశాలపై జిల్లా అధికారులతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సమగ్రంగా సమీక్షించి.. అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ప్రతినెలా జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశమై, క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని.. ప్రతి పౌరుడు విధిగా రోడ్డు నిబంధనలను పాటించి, సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చెన్నయ్య, ఆర్టీఓ ఇమ్రాన్ అహ్మద్ తదితరులు ఉన్నారు. -
గీత కార్మికులకు రక్షణగా కాటమయ్య కిట్లు
చారకొండ: గీత కార్మికుల రక్షణకు కాటమయ్య కిట్లు ఎంతో దోహదపడుతాయని జిల్లా ఎకై ్సజ్శాఖ అధికా రి వేణుగోపాల్రెడ్డి అన్నారు. చారకొండ మండల కేంద్రంతోపాటు గోకారం, తుర్కలపల్లి గ్రామాల్లో మంగళవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే చారకొండలో కాటమయ్య కిట్ల పంపిణీ పూర్తయిందన్నారు. త్వరలోనే గోకారం, తుర్కలపల్లి గ్రామాల్లో గీత కార్మికులకు కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కిట్ల వినియోగం, ప్రమాదాల నుంచి ఏ విధంగా రక్షించుకోవాలనే అంశాలపై డెమో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి ఇందిర, ఎకై ్సజ్ సీఐ వెంకట్రెడ్డి, శిక్షకులు ప్రశాంత్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
ఓటుహక్కు కాపాడే బాధ్యత బీఎల్ఓలదే
వెల్దండ: సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల ఓటు హక్కును కాపాడే బాధ్యత బీఎల్ఓలదేనని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం వెల్దండలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఓలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఓటర్ల ఇంటింటికి వెళ్లి పూర్తి వివరాలను నమోదుచేసి ఓటును కాపాడాలన్నారు. ప్రజల అభ్యంతరాలు, ఫిర్యాదులపై సకాలంలో స్పందించాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, నాగులునాయక్, విజయ్గౌడు, నిరంజన్, శ్రీనివాస్రెడ్డి, హనుమంతు నాయక్, అశోక్, అంజి మాస్టర్, కొండల్, శక్రునాయక్ ఉన్నారు. అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక బస్సు కందనూలు: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అరుణాచల పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న సాయంత్రం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి.. 28న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనాల అనంతరం అరుణాచలం చేరుకుంటుందన్నారు. 29న పౌర్ణమి గిరిప్రదక్షిణ అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమై 30వ తేదీన నాగర్కర్నూల్కు చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ. 3,600, పిల్లలకు రూ. 2,400 చార్జీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కొల్లాపూర్ నుంచి గోవాకు ప్రత్యేక బస్సు కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి గోవాకు ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి బస్సు సేవలు ప్రారంభమవుతాయని.. ఒక్కో ప్రయాణికుడికి రాను పోను చార్జీ రూ. 3వేలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 26న సాయంత్రం 6 గంటలకు కొల్లాపూర్ నుంచి బస్సు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం గోవాకు చేరుకుంటుందన్నారు. 28న సాయంత్రం 6 గంటలకు బస్సు తిరుగు ప్రయాణమై మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కొల్లాపూర్కు చేరుకుంటుందని తెలిపారు. బస్సు టికెట్లు బుక్ చేసుకునేందుకు స్థానిక బస్టాండ్లో సంప్రదించాలని డీఎం సూచించారు. -
అక్రమంగా పట్టా చేసుకున్నారు..
తిమ్మాజిపేట మండలంలోని ఇప్పలపల్లి గ్రామ శివారు సర్వేనం.235/5లో 11 గుంటల భూమి, 235/18/అ1/2లో 11 గుంటలు మొత్తం 22 గుంటల భూమిపై నాగర్కర్నూల్ సివిల్ కోర్టు ద్వారా పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ మాకు అనుకూలంగా వచ్చింది. కానీ, గతంలో అక్రమంగా పట్టా చేసుకున్నవారు మాపై దౌర్జన్యం చేసి అదే పొలంలో మేము వేసిన జొన్న పంటను ధ్వంసం చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి. – శ్రీనివాసులు, ఇప్పలపల్లి, తిమ్మాజిపేట మండలం -
నేడు డయల్ యువర్ డీఎం
అచ్చంపేట రూరల్: ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నామని, ప్రయాణికులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డిపో కార్యాలయంలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ సందేహాలు, సూచనలను సెల్ నం.99592 26291కు కాల్ చేయాలని కోరారు. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు అమ్రాబాద్: అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు మంగళవారం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్ 2, ఇంగ్లిష్ 1, హిస్టరీ 1, ఎకనామిక్స్ 1, పొలిటికల్ సైన్స్ 1, జువాలజీ 1, కంప్యూటర్ సైన్స్ 1, తెలుగు 1, బాటనీ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా సబ్జెక్ట్లలో పీజీలో 55 శాతం, (ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) ఉన్నవారు అర్హులని, సెట్, నెట్, స్లేట్, పీహెచ్డి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు మంగళవారం సాయంత్రం వరకు ధ్రువపత్రాలను కళాశాలలో అందజేయాలని సూచించారు. డిగ్రీ కళాశాలలో.. బల్మూర్: మండలంలోని కొండనాగుల ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 9 అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రవి ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్ 2, తెలుగు, ఇంగ్లిష్, బీఎఫ్ఎస్ఐ, కంప్యూటర్ సైన్స్– అప్లికేషన్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులకు ఒక్కొక్క పోస్టు చొప్పున మొత్తం 9 పోస్టులు ఉన్నాయని, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను బుధవారం కళాశాలలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి గు రువారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాగర్కర్నూల్లో ఉంటాయని, అభ్యర్థులు తమ అసలు విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. -
పొలాలు కోతలకు గురవుతున్నాయి..
శాయిన్పేట చెరువు నీళ్లు, కేఎల్ఐ కాల్వ నీళ్లు పోవడానికి పురాతన కాలం నుంచి ఫిడెల్ కాల్వ ద్వారా నీళ్లు వెళ్తున్నాయి. ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు ఫిడెల్ కాల్వను పూడ్చివేయడంతో చెరువు, కేఎల్ఐ కాల్వ నీరు మా పొలాల్లోకి వచ్చి పూర్తిగా కోతకు గురై వ్యవసాయం చేసుకోవడానికి పనికిరాకుండా మారుతున్నాయి. అధికారులు స్పందించి ఫిడెల్ కాల్వను పునరుద్ధరించి.. కాల్వను పూడ్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. – తిరుపతయ్య, బాబు, మల్లయ్య, అంబట్పల్లి గ్రామం, లింగాల మండలం -
నత్తకే నడక
కొల్లాపూర్ నుంచి కృష్ణానది వరకు సా..గుతున్న ఎన్హెచ్–167కే పనులు ● రెవెన్యూ శాఖ పరిధిలోని భూ సేకరణలోనే తీవ్రజాప్యం ● ఏడాది క్రితమే రైతులకు నోటీసుల అందజేత ● పరిహారం చెల్లించకపోవడంతో పూర్తికాని ప్రక్రియ ● మరోవైపు అటవీ భూములకు అనుమతి క్లియర్ కొల్లాపూర్: జిల్లాలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు.. తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి–167కే పనులు ముందుకు సాగడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, భూ సేకరణలో ఆలస్యం వంటి కారణాలతో పనులు నత్తకు నడక నేర్పిస్తున్నాయి. ఐదు ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్న ఈ రహదారిలో 1, 4, 5 ప్యాకేజీల పనులు ముమ్మరంగా జరుగుతుండగా.. 2, 3 ప్యాకేజీల పనులకు సంబంధించి ఇప్పటి వరకు టెండర్లే నిర్వహించలేదు. రెండేళ్ల వ్యవధిలో ఈ రహదారి నిర్మాణం పూర్తవుతుందని జాతీయ రహదారుల సంస్థ ప్రకటించింది. పనులను అధికారికంగా ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికావడం లేదు. -
‘సర్’ను గడువులోగా పూర్తిచేయాలి
కందనూలు: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిని పరిశీలించిన ఆయన, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి చేపడుతున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఓటరుకు ఈ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించాలని, ఆగస్టు 3లోగా ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించని వారి వివరాలు ఓటర్ల జాబితాలో నమోదు కాకపోవచ్చనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా నమోదు ప్రక్రియకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు డిజిటలైజేషన్ ప్రక్రియలో తప్పనిసరిగా నమోదయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే అనర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగకుండా చూడడంతోపాటు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటరు నమోదు (డూప్లికేట్ నమోదు) జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందేలా ఎన్నికల సంఘం నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ అర్చన, తహసీల్దార్ మునీరుద్దీన్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి 12.30 దాటిన తర్వాతే..
ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రికి చెందిన ఓ అధికారిక రీచ్తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కృష్ణా పరివాహకంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి కూటమి నేతల సహకారంతో ఆయా ప్రాంతాల నుంచి అక్రమార్కులు ఇసుక వాహనాలను కర్నూలు మీదుగా జాతీయ రహదారి మార్గంలో గద్వాల జిల్లా పుల్లూరు టోల్ప్లాజా గుండా సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రాత్రివేళల్లో నిత్యం 50 నుంచి 60 వరకు బెంజ్ వాహనాల్లో ఇసుక రవాణా కొనసాగుతుండగా.. ఇందులో అధికంగా 16 టైర్ల లారీల్లోనే తరలిస్తున్నారు. ఏపీలో ఉచిత ఇసుక నేపథ్యంలో అక్కడ ఒక లారీ లేదా బెంజ్ లోడ్కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. చౌకగా లభిస్తుండడంతో ఇసుక మాఫియా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి దూరాన్ని బట్టి టన్నుకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా 16 టైర్ల బెంజ్ ఇసుక (47 టన్నులు.. అయితే పరిమితి మించి అదనంగా 25 నుంచి 30 టన్నుల వరకు వేస్తారు)ను కనిష్టంగా రూ.84 వేలు, గరిష్టంగా రూ.లక్ష వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. రాష్ట్ర సరిహద్దు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం టైరోడ్డు సమీపంలోని ఓ ఆశ్రమం వద్ద కృష్ణానది పరివాహకంలో గతేడాది ఇసుక మాఫియా ఆధ్వర్యంలో నదిలో సుమారు ఆరు కి.మీ.ల మేర మట్టి రోడ్డు వేశారు. ప్రస్తుతం దీన్ని వదిలేసిన ఇసుకాసురులు వాసునగర్ వద్ద రెండు, ముడుమాల్ వద్ద ఒకటి మొత్తంగా మూడు చోట్ల నదికి అడ్డంగా మట్టి రోడ్లు వేసి దందా కొనసాగిస్తున్నారు. వరద వచ్చినప్పడు నీరు సజావుగా వెళ్లేలా సిమెంట్ పైపులతో తూములు ఏర్పాటు చేశారు. నది ప్రవహిస్తున్న క్రమంలో తప్పితే మిగతా రోజుల్లో ఆయా ప్రాంతాల్లో జేసీబీ, హిటాచీలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పగలు నది నుంచి ఇసుకను తోడి సమీప పొలాల్లో డంప్ చేయడం.. రాత్రి 8 గంటల తర్వాత ఆయా ప్రాంతాల నుంచి కర్ణాటకకు చెందిన 12 చక్రాల బెంజ్ వాహనాల్లో యాద్గిరి, సైదాపూర్, గుల్బర్గా వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో బెంజ్ ఇసుకను దూరాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక దందాతో వేసిన పంటకు నీరందించే పైపులైన్లు దెబ్బతింటున్నాయని రైతులు ప్రశ్నించగా.. వారిపై మాఫియా దాడులకు పూనుకుంటోంది. మూడుమాల్కు చెందిన ఓ రైతుపై 8 నెలల క్రితం దాడులకు తెగబడింది. దీంతోపాటు ప్రశ్నించిన పలువురిని బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. దీనిపై కృష్ణా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. అడ్డొస్తే చంపేస్తామని దందా నిర్వాహకులు బెదిరించడంతో ఓ పార్టీకి చెందిన వ్యక్తి ఈ విషయాన్ని నారాయణపేట జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన కరువైందని తెలుస్తోంది. ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక రవాణాలో ఆటంకాలు కలగకుండా మాఫియా జాగ్రత్తలు తీసుకుంటోంది. అర్ధరాత్రి పోలీసుల గస్తీ, వాహనాల రద్దీ నామమాత్రమే కావడంతో 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఇసుక లోడ్ వాహనాలను పుల్లూరు టోల్ప్లాజా దాటిస్తోంది. వాహనాలు బయలుదేరే పది నిమిషాల ముందు ఓ ఎస్కార్ట్ కారు వెళ్లి ఆయా ప్రాంతాల్లో పోలీసుల పహారాపై ముందస్తు సమాచారమిచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్హెచ్ వెంట పోలీస్స్టేషన్లు ఉన్నా.. ఇసుకాసురులు తమ పని కానిచ్చేస్తున్నారు. మక్తల్ నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో కర్ణాటక బార్డర్లో కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి పలువురు ఇసుకదందా నిర్వహిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కృష్ణా మండలంలో గతంలో ఇసుక అక్రమాల్లో చక్రం తిప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన ఓ వ్యక్తి, ఓ బంధువు, మరికొందరు అనుచరుల ద్వారా ఇసుక లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక రవాణా అటు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కర్నూలుకు చెందిన ఓ నేత, తెలంగాణలోని అలంపూర్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అయిన ముఖ్యనేత కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
ప్రాజెక్టుల సాధనకు సమష్టిగా కృషి
● అసంపూర్తి పనులు పూర్తిచేస్తే బీడు భూములు సస్యశ్యామలం ● విస్తృత స్థాయి రౌండ్టేబుల్సమావేశంలో వక్తల పిలుపు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లాలోని బీడు భూముల సాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేసిందని, ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లుగా హంగామా చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తే బీడు భూములను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ పాలమూరు వలసల జిల్లా, వెనకబడిన ప్రాంతంగా ఉండేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కనీసం రూ.30 వేల కోట్లు కావాలన్నారు. నిజాలను నిర్భయంగా చెప్పాలని, నిజాయితీగా మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జేఏసీ నాయకులకు సూచించారు. కృష్ణానది నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కలిసి చర్చలు జరిపితేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ జిల్లా ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాటం చేద్దామని అన్నారు. జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు ఉండగా ఇప్పుడు 6, 7 టీఎంసీల నీరు కూడా లేదని, పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు సాయిబాబా, షేక్ ఫరూఖ్ హుస్సేన్, బెక్కెం జనార్దన్, వీరబ్రహ్మచారి, జగపతిరావు, ప్రవీణ్కుమార్, రమేష్రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
డూప్లికేటుగాళ్ల ఆగడాలు!
గుర్తింపు పొందిన దుకాణాల్లో కొనుగోలు చేయాలి.. పీఏసీఎస్లు, రైతు ఆగ్రో సేవాకేంద్రాలు, హాకా సెంటర్లు, ఫర్టిలైజర్ దుకాణాల్లో మాత్రమే ఎరువులు, విత్తనాలు అధికారికంగా సరఫరా చేస్తారు. ఈ–పాస్ యంత్రం సాయంతో పంపిణీ ఉంటుంది. అనధికారిక ఎరువులు, విత్తనాలను రైతులు విశ్వసించొద్దు. అపరిచితుల వద్ద ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయొద్దు. చిన్నంబావిలో పట్టుబడిన డీఏపీ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించాం. నివేదికలు వచ్చాక వివరాలు వెల్లడిస్తాం. అక్రమ విక్రయాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి వనపర్తి: నకిలీ ఎరువులు, విత్తనాల కట్టడికి వ్యవసాయ, పోలీసు శాఖలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కులు కొత్తదారులు వెదుక్కుంటున్నారు. మొన్న సూర్యాపేట.. నిన్న హైదరాబాద్.. నేడు వనపర్తి జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కాగా.. ఫర్టిలైజర్ డీలర్లే అక్రమ దందాకు సూత్రదారులని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందాకు బీజం పడినట్లు అఽధికారులు భావిస్తున్నారు. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకొని అక్రమార్జనే లక్ష్యంగా ఈ దందాకు తెర తీశారు. – జిల్లాలోని చిన్నంబావి మండలంలో ఏటా వర్షాకాలంలో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తారు. ఓ కంపెనీకి చెందిన డీఏపీ వాడితే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు మొక్కజొన్న విత్తేందుకు సిద్ధం చేసుకున్నారు. డీఏపీ కొరత తలెత్తడంతో వెల్టూరుకు చెందిన ఓ వ్యక్తిని ఆశ్రయించారు. ఆయన రైతులకేదో మేలు చేసినట్లుగా తనకు పరిచయం ఉన్న పెబ్బేరు మండలం గుమ్మడంకు చెందిన ఒక డీలర్, గద్వాలకు చెందిన వంశీధర్రెడ్డి అనే మరో డీలర్లతో సంప్రదింపులు జరిపారు. గద్వాల డీలర్ హైదరాబాద్ ఆటోనగర్ నుంచి గద్వాలకు చెందిన డీసీఎంలో 200 బస్తాల అదె కంపెనీకి చెందిన డీఏపీని వెల్టూరుకు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. రైతులు వీరన్నగౌడ్ 60 బస్తాలు, ప్రవీణ్కు 20 బస్తాలు దించుకున్నారు. మార్కెట్లో కొరత కారణంగా ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1,350 ఉండగా రూ.1,550కి విక్రయించేందుకు ప్రయత్నించారు. ధర ఎక్కువగా ఉంది.. నాణ్యత ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆయా రైతులు వ్యవసాయశాఖ అఽధికారులను అడిగే ప్రయత్నం చేశారు. తమకు తెలియకుండా మండలానికి డీఏపీ రావడం ఏమిటని ఏఓ డాకేశ్వర్గౌడ్ వెల్టూరుకు వెళ్లి చూడగా అక్కడ గద్వాలకు చెందిన డీసీఎం డ్రైవర్ పరశురాముడు డీఏపీ విక్రయిస్తూ కనిపించాడు. వే బిల్స్, ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపించాలని ప్రశ్నించగా.. గద్వాలకు చెందిన వంశీధర్రెడ్డి సూచన మేరకు హైదరాబాద్లో లోడ్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినట్లు వివరించారు. ఏఓ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి 120 బస్తాల డీఏపీతో పాటు డీసీఎంను పోలీస్స్టేషన్కు తరలించారు. ఏఓ ఫిర్యాదు మేరకు ఛీటింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పట్టుబడిన డీఏపీ నకిలీదా, అసలుదా పరీక్షించేందుకు ల్యాబ్కు పంపించనున్నట్లు అధికారులు చెప్పారు. రైతులు డీఏపీ నాణ్యత కోసం చేసిన ప్రయత్నం ఓ పెద్ద అక్రమార్కుల ముఠా గుట్టును రట్టుచేసినట్లు అయింది. మంత్రి ఇలాఖాలో నకిలీ డీఏపీ విక్రయాలు? కొరతను ఆసరాగా చేసుకొని అక్రమార్జనే ధ్యేయంగా.. స్థానికులను మచ్చిక చేసుకొని ఇద్దరు డీలర్ల రహస్య దందా నాణ్యతన పరిశీలనకు అధికారులను పిలవడంతో విషయం వెలుగులోకి.. విచారణతోనే మరిన్ని విషయాలు వెలుగులోకి.. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం, మండలంలో నకిలీ ఎరువుల విక్రయాల గుట్టురట్టు కావడంపై ఆయన సీరియస్గా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదవుతున్న నకిలీ డీఏపీ ఘటనలపై ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో విచారణ జరిపితే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
బలోపేతం దిశగా బడులు
● అప్పాయపల్లి ప్రాథమికోన్నతపాఠశాలలో పెరిగిన విద్యార్థుల సంఖ్య ● బడిబాటతో సత్ఫలితాలు దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మదన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, కెమిస్ట్రీ, జువాలజీ, డెయిరీ సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బోధించేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై, కనీసం 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) సాధించిన వారు అర్హులని తెలిపారు. నెట్, సెట్, పీహెచ్డీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 21న మధ్యాహ్నం 12 గంటలలోగా నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి నాగర్కర్నూల్ రూరల్/అచ్చంపేట రూరల్: ఆర్టీసీ ఉద్యోగుల సంపూర్ణ ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్కర్నూల్, అచ్చంపేట ఆర్టీసీ డిపోల వద్ద ఉద్యోగులతో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విలీనం కంటే ముందున్న సమస్యలను ఎలా పరిష్కరించబడాలనే విషయంలో విలీన కమిటీ అధ్యయనం చేయాలన్నారు. కార్మికుల సమష్టి పోరాటం మూలంగా 11శాతం వేతన సవరణ జరిగిందన్నారు. కార్మిక వర్గానికి లాభం జరగాలంటే సంపూర్ణ ఉద్యోగ భద్రత, పని భారం, వేధింపులు లేని ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పించబడాలన్నారు. సమావేశాల్లో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, రీజనల్ కార్యదర్శి వెంకటయ్య, నంది వెంకటేశ్, బాషా, అర్జున్, వర్దనమ్మ, చింతలయ్య, కృష్ణ, చెన్నకేశవులు, గోపాల్, విజయ్, ఆంజనేయులు, డానియిల్, శ్రీను, రాములు ఉన్నారు. – వివరాలు 9లో.. -
పౌల్ట్రీ ఫాంపై ఈగల్ బృందం దాడులు
● రూ.20 లక్షల విలువచేసే 1.150 కిలోల ఆల్ఫాజోలం సీజ్ ● ఆల్ఫాజోలం డాన్తోపాటు మరో ముగ్గురి అరెస్టు మహబూబ్నగర్ క్రైం: గతంలో ఆల్ఫాజోలం తయారు చేసి పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు.. అయినా అతనిలో మార్పు రాకపోగా.. మళ్లీ అదే పద్ధతిని ఎంచుకొని ఆల్ఫాజోలం తయారు చేస్తూ.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని తుంకినీపూర్ గ్రామానికి చెందిన ఎం.జయప్రకాష్గౌడ్, అదే గ్రామానికి చెందిన బాల ఆంజనేయులు ఇద్దరూ కలిసి అన్నాసాగర్ గ్రామ శివారులో బోయ నర్సింహులు అనే వ్యక్తి దగ్గర నెల రోజుల కిందట లక్ష్మీనర్సింహ పౌల్ట్రీ ఫాంను అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత పౌల్ట్రీ ఫాంలో రూ.40 లక్షల విలువ చేసే మిషన్ ఏర్పాటు చేసి.. ఆల్ఫాజోలం తయారు చేయడానికి రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్ సమకూర్చారు. అనంతరం వికారాబాద్కు చెందిన కృష్ణయ్యగౌడ్తో కలిసి జయప్రకాష్గౌడ్ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ ఈగల్ పోలీస్ బృందం ఆదివారం మధ్యాహ్నం ఆకస్మిక దాడులు చేసి.. రూ.20.30 లక్షల విలువ చేసే 1.150 కిలోల ఆల్ఫాజోలంతోపాటు మరో రూ.20 లక్షల విలువ చేసే మెటీరియల్ను సీజ్ చేశారు. అలాగే ఆల్ఫాజోలం సూత్రధారి జయప్రకాష్గౌడ్తోపాటు కృష్ణయ్యగౌడ్, బాలాంజనేయులు, నర్సింహులును సైతం ఈగల్ ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించింది. బీటెక్ చదివి.. తుంకినీపూర్కు చెందిన జయప్రకాష్గౌడ్ బీటెక్ చదువు మధ్యలో వదిలేశాడు. మొదట్లో వీఆర్ఐగా కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైస్కూల్ ఏర్పాటు చేసి దాదాపు తొమ్మిదేళ్లు నడిపాడు. ఇదే సమయంలో ఓ వ్యక్తితో ఆల్ఫాజోలం తయారు చేసే ఫార్ములాను నేర్చుకున్నాడు. ఆ తర్వాత స్వయంగా అతను నిర్వహిస్తున్న పాఠశాలను అడ్డాగా చేసుకొని ఆల్ఫాజోలం తయారు చేయడం మొదలుపెట్టాడు. పాఠశాలలో అయితే ఎవరికి అనుమానం రాదని భావించి అక్కడే రెండు గదుల్లో ఈ దందా సాగించాడు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ 13న ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అతని నుంచి 8 కిలోల ఆల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన జయప్రకాష్గౌడ్ మళ్లీ ఈ ఏడాది మార్చి 16న జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి మకాం మార్చాడు. -
పుంజుకున్న ‘సర్’..
● జిల్లాలో 71.62శాతం డిజిటలైజేషన్ పూర్తి ● ఇప్పటివరకు 5,24,015 ఎన్యూమరేషన్ ఫారాల నమోదు ● గ్రామాల్లోనే ఓటుకు మొగ్గు.. పట్టణాల్లో తగ్గనున్న ఓట్లు అచ్చంపేట: సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జిల్లాలో వేగం పుంజుకుంది. ఆదివారం నాటికి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 71.62 శాతం పూర్తయింది. ఇప్పటికే బీఎల్ఓలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయగా.. ఓటర్లు తమ వివరాలు నింపి తిరిగి అందజేస్తున్నారు. అయితే కొందరు ఓటర్లు అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో వారి సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశారు. జల్లాలో మొత్తం 7,31,632 మంది ఓటర్ల నుంచి అందిన ఎన్యూమరేషన్ ఫారాల్లో ఇప్పటి వరకు 5,24,015 ఫారాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ ప్రక్రియలో 2002 ఓటరు జాబితాను లింక్ చేశారు. అప్పటి ఓటరు జాబితాలో పేరులేని వారు 24ఏళ్ల క్రితం నాటి తల్లిదండ్రుల వివరాలను, అసెంబ్లీ నియోజకవర్గం పేరు, బూత్ నంబరు, సీరియల్ నంబర్లను ఓటర్లే వెతుకోవాల్సి వస్తోంది. పెళ్లికి ముందే ఓటు హక్కు పొంది.. ఆ తర్వాత ఇంటిపేరు మార్చుకున్న మహిళల పరిస్థితి సైతం ఇబ్బందిగా మారింది. అక్షరం తేడా ఉన్నా.. బీఎల్ఓలతో పనిలేకుండా స్వయంగా ఓటర్లు ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయితే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న వారు ఆన్లైన్లో నమోదుకు యత్నించినప్పటికీ.. ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డుల్లో ఆక్షరం తేడా ఉన్నా పూర్తిచేసిన దరఖాస్తు తిరస్కరణకు గురవుతోంది. బీఎల్ఓలను సంప్రదించాలని సూచిస్తోంది. నాయకుల తర్జన భర్జన.. రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులకు ఇటు మున్సిపాలిటీలు, అటు సొంతూళ్లలో ఓటు ఉంది. వారు ఓటు హక్కు ఎక్కడ ఉంచుకోవాలని తర్జనభర్జన పడుతున్నారు. అలాగే చాలా మంది అధికారులకు సొంతూరితో పాటు వారు పనిచేసిన చోట ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఏదో ఒక చోట ఉంచుకోవాల్సి ఉండటంతో వారు సొంతూరిలోనే నమోదు చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రక్రియ వేగవంతం.. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్త యింది. డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి ఇంటికీ బూత్ లెవల్ ఆఫీసర్లు వెళ్లి వివరాలు సేకరించి.. 2002 ఓటరు జాబితా ప్రకారం వివరాలు నమోదు చేయాలి. ఓటర్ల కు ఓటు ప్రాధాన్యతను తెలియజేయాలి. వే గంగా ప్రక్రియను పూర్తిచేయాలి. ఇందుకు రా జకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి. – యాదగిరి, ఆర్డీఓ, అచ్చంపేట -
సీజనల్పై అప్రమత్తం..
వ్యాధుల నివారణకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు కందనూలు: సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వానాకాలంలో ప్రబలే టైఫాయిడ్, అతిసారం, మలేరియా, డెంగీ, చికున్గున్యా తదితర వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. గతేడాది జిల్లాలోని ఏ ప్రాంతంలో ఏ వ్యాధులు ఎక్కువగా నమోదయ్యాయి.. ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించింది. ఇప్పటికే వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులకు అవసరమైన పరీక్షలు చేయడంతో పాటు వ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. పరిశుభ్రత పాటించాలి.. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన చర్యలు చేపట్టాం. ఈ నెల 6 నుంచి ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాం. వ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇళ్ల చుట్టూ మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. – డా.కృష్ణ, డీఎంహెచ్ఓ రోజూ 50 ఇళ్ల సర్వే.. జిల్లావ్యాప్తంగా 560 సర్వే బృందాలను ఏర్పాటుచేశారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్ల భాగస్వామ్యంతో ఒక్కో బృందం రోజుకు 50 ఇళ్లను సర్వే చేయాలని నిర్దేశించారు. ఇప్పటికే సర్వే బృందాలు 1,16,140 గృహాల్లో 3,22,999 మంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వీరిలో దాదాపు 606 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి.. వివరాలను నమోదు చేసుకున్నారు. వారికి అవసరమైన మందులు అందజేస్తూ.. జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటే పీహెచ్సీలకు తరలిస్తున్నారు. మలేరియా, డెంగీ, చికున్గున్యా పరీక్షలు చేసి ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఈ ప్రక్రియను హెల్త్ సూపర్వైజర్లు పర్యవేక్షిస్తుండగా.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వారీగా వైద్యాధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇలా.. జిల్లాలోని 20 మండలాల్లో 461 గ్రామ పంచాయతీలు ఉండగా.. 27 పీహెచ్సీలు, 1 అర్బన్ పీహెచ్సీ, 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు జిల్లా జనరల్ ఆస్పత్రి ఉన్నాయి. జిల్లా ఆస్పత్రికి రోజు దాదాపు 2వేల మంది వివిధ ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు బారినపడిన వారు 30 నుంచి 50 మందికి పైగా ఓపీ వస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. జ్వర పీడితుల రక్త నమూనాలను సేకరించి.. జిల్లా కేంద్రంలోని టీ హబ్కు పంపిస్తున్నారు. పరీక్ష ఫలితాల ఆధారంగా వ్యాధిని నిర్ధారించి, ప్రతి ఆరోగ్యకేంద్రంలో వైద్యం అందిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధులు నిర్ధారణ అయితే వెంటనే డాక్టర్లు అప్రమత్తమై.. వారికి అవసరమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొనసాగుతున్న ఇంటింటా ఫీవర్ సర్వే జిల్లావ్యాప్తంగా 560 బృందాల ఏర్పాటు ఇప్పటివరకు 1,16,140 గృహాలసర్వే పూర్తి ఐదేళ్లలో నమోదైన కేసులు ఇలా.. -
రేపు ఎల్నినోపై సమీక్ష
కందనూలు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై ఈ నెల 20న జిల్లా ఇన్చార్జి మంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేకాధికారులు, ఉన్నతాధికారులతో వీసీ నిర్వహించి.. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, 20న నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష సమావేశాల నిర్వహణను సమగ్రంగా వివరించారు. వర్షాభావ పరిస్థితులు, తాగునీటి వనరుల లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వలు, వ్యవసాయ, ఉద్యాన పంటల ప్రస్తుత పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు అవకాశాలు, భూగర్భ జలాల స్థితి, విద్యుత్ సరఫరా, పశువులకు మేత, తాగునీటి ఏర్పాట్లు, నీటి సంరక్షణ చర్యలు, ఇతర శాఖల వారీగా చేపట్టిన చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించి.. అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. అధికారులు తమ శాఖలకు సంబంధించిన తాజా గణాంకాలు, క్షేత్రస్థాయి సమాచారం, చేపట్టిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో సమావేశానికి హాజరు కావాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అరుణారెడ్డి పాల్గొన్నారు. -
బిందుసేద్యంపై దృష్టి సారించాలి
తాడూరు: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు బిందుసేద్యంపై దృష్టిసారించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎం.వెంకటేశం సూచించారు. శనివారం తాడూరు మండలం మేడిపూర్, బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామాల్లో రైతులు మల్చింగ్ విధానంతో సాగుచేసిన అయిల్పామ్, కూరగాయల తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బిందుసేద్యం పరికరాలను 80శాతం వరకు రాయితీలు ఇస్తోందన్నారు. మల్చింగ్ విధానంలో ఎకరాకు రూ. 20వేల వరకు సబ్సిడీ అందుతుందని తెలిపారు. రైతులు నీటి సంరక్షణ పద్ధతులు పాటించి.. కూరగాయలు, ఆయిల్పామ్ తోటలను సంరక్షించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఉద్యానశాఖ డివిజన్ అధికారి జగన్, విస్తరణాధికారి దేవేందర్, యూనిక్ అధికారి శివ భార్గవ్, కుర్మయ్య ఉన్నారు. సమష్టి కృషితోనే అభివృద్ధి కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుష్రో షా ఖాన్ సూచించారు. శనివారం కొల్లాపూర్ డిపోలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు విభాగాలను పరిశీలించారు. డిపో ఆదాయ, వ్యయాలు, నిర్వహణ అంశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డిపో ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ కృష్ణమూర్తి, డీఎం మల్లేశం పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు అచ్చంపేట: ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ జి.వెంకటరమణ హెచ్చరించారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని న్యూమాస్టర్ మైండ్స్ జూనియర్ కళాశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు పుస్తకాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి.. పుస్తకాలు నిల్వ ఉంచిన గదిని అధికారికంగా సీజ్ చేశారు. ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని.. కళాశాల ప్రాంగణంలో ఎలాంటి పుస్తకాల విక్రయాలు జరపరాదని.. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయరాదని ఆదేశించారు. భవిష్యత్లో ఇలాంటి ఉల్లంఘన పునరావృతమైతే చట్టపరమైన చర్యలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్లకు ఓటుహక్కు కల్పించాలని పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సర్పంచ్ల సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వివిధ కమిటీల పేరుతో ఇతరులను అధ్యక్షులుగా నియమించడం తగదన్నారు. జాయింట్ చెక్పవర్ను రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన ఎన్ఆర్జీసీ నిధులను ఆయా గ్రామాలకే కేటాయించాలన్నారు. సర్పంచ్ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని, కలెక్టర్ వెంటనే గ్రీన్ చానల్ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే విజన్–2047, వికసిత్ భారత్ వంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రాజశేఖర్, వనపర్తి జిల్లా కన్వీనర్ శేఖర్గౌడ్, నాగర్కర్నూల్ జిల్లా నాయకురాలు వీరోజు సుప్రియ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ.. మకిలీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కరువు మేఘాలు కమ్ముకుని.. వానాకాలం సాగుపై ఇప్పటికే సందిగ్ధత కొనసాగుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతాంగంలో నిరాశ వ్యక్తమవుతోంది. దీనికి తోడు నకిలీ ఎరువులు కలకలం సృష్టిస్తుండడంతో వారికి కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఇటీవల కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నకిలీ డీఏపీ విక్రయాలు వెలుగుచూడగా.. తాజాగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో పట్టుబడ్డాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెలుగులోకి ఇలా.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామానికి గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తక్కువ ధరకు డీఏపీ ఎరువు ఇస్తామని తొలుత ఓ ఇద్దరు రైతులకు ఆశ చూపారు. వారి సహకారంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మొత్తంగా ఎనిమిది మంది రైతులకు 156 బస్తాలు విక్రయించి వెళ్లిపోయారు. ఒక్కో బస్తాకు ఒక్కొక్కరి వద్ద ఒక్కో రకంగా రూ.1,300 నుంచి రూ.1,500 తీసుకున్నారు. వారు వెళ్లిన కొన్ని గంటలకు ఈ సమాచరం వెలుగులోకి రాగా పలువురు రైతులు నకిలీవనే అనుమానంతో ఏఈఓకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం కలెక్టర్, ఎస్పీ జిల్లా వ్యవసాయాధికారి దృష్టికి రాగా.. వారు వెంటనే గ్రామానికి చేరుకుని విచారించారు. 116 బస్తాల డీఏపీతో పాటు రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకున్నారు. వారి విచారణలో అవి నకిలీ ఎరువు బస్తాలని తేలినట్లు సమాచారం. దీంతో శాంపిళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి పాలమూరులోనకిలీ డీఏపీ కలకలం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వెలుగులోకి.. మహదేవునిపేటలో 117 ఎరువుల బస్తాలు స్వాధీనం రైతులు వినియోగించిన 39 ఖాళీ సంచులు సైతం.. కర్ణాటక నుంచి వచ్చి విక్రయించినట్లు అనుమానాలు గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ విక్రయాలు -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని.. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం జెడ్పీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామాభివృద్ధిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణాలు, రహదారులు, పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి అనేక రంగాల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామస్తులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఏదైనా సాంకేతిక, పరిపాలనా లేదా ఇతర సమస్యలు ఎదురైతే వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో గోపాల్నాయక్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం.. కందనూలు: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని.. ఎంజీకేఎల్ఐ పరిధిలోని ఆయకట్టుకు ప్రస్తుతం సాగునీటిని విడుదల చేయడం సాధ్యం కాదని కలెక్టర్ స్పష్టంచేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంజీకేఎల్ ద్వారా సుమారు 4.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రణాళిక రూపొందించబడిందని తెలిపారు. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీశైలం జలాశయానికి గణనీయమైన వరద ప్రవాహాలు రాకపోవడంతో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో స్థూల నీటినిల్వ 41.45 టీఎంసీలు ఉన్నప్పటికీ.. అందులో 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ అని, వాస్తవంగా వినియోగించదగిన జీవ జల నిల్వ కేవలం 11.45 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ఇదిలా ఉంటే, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కోసం ప్రతి సంవత్సరం 7.12 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగిందని.. ఇప్పటికే జూన్ 1 నుంచి జూలై 18 వరకు 1.363 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని ఎల్లూరు, గుడిపల్లిగట్టు, జొన్నలబొగుడ, సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో కేవలం 2.23 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉందని.. ఈ పరిస్థితుల్లో సాగునీటిని విడుదలచేస్తే భవిష్యత్లో తాగునీటి అవసరాలు కూడా సంక్షోభంలో పడే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగం ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలని ఆయన సూచించారు. -
‘సర్’ను సమర్థంగా పూర్తిచేస్తే నగదు పురస్కారం
● ఓటర్ల గుర్తింపులో బాధ్యతగా వ్యవహరించాలి ● బీఎల్వోలు, బీఎల్ఏల సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్గల్/వీపనగండ్ల: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను నిర్దేశితా గడువులోగా అత్యంత సమర్థవంతంగా పూర్తిచేసిన బీఎల్వోలు, బీఏల్ఏలకు నగదు బహుమతులు అందజేస్తామని.. ప్రథమ బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు చెల్లించనున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం పాన్గల్, వీపనగండ్ల రైతువేధికల్లో బీఎల్వోలు, బీఎల్ఏలతో నిర్వహించిన సమీక్షలో మంత్రితో పాటు నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జ్ సిద్ధేశ్వర్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పాల్గొన్నారు. గ్రామాల వారీగా సర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు సజావుగా జరగాలని.. ఓటు చోరీ జరగొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తూ పశ్చిమబెంగాల్, బిహార్లో ఓట్ల చోరీ జరిగిందని.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ యావత్ దేశానికి తన తెలియపర్చారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరును ఆన్లైన్లో నమోదు చేసేందుకు బీఎల్వోలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. నిరక్షరాస్యులు, వలస వెళ్లిన వారి వివరాలు సేకరించి వారి పేర్లను కూడా ఓటరు జాబితాలో ఉండేవిధంగా చూడాలని, అందుకు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, బీఎల్వోలకు అవసరమయ్యే సహకారం అందివ్వాలని సూచించారు. మనిషికి ఓటు లేకపోతే మనగడకు అంతరాయం కలుగొచ్చని.. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సర్ ప్రక్రియ పార్లమెంట్ ఇన్చార్జ్ సిద్దేశ్వర్ సూచించారు. బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంగా పనిచేస్తూ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి కోరారు. తక్కువ సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ త్వరితగతిన పూర్తి చేసేలా దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో కాంగ్రెస్పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, సాయిచరణ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, వీపనగండ్ల తహసీల్దార్ ఎండీ ఖాజామైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ అవసరాలు తీరేలా..
● కొత్తగా 39 నిర్మాణాలు ● ప్రారంభోత్సవానికి 3 సిద్ధం ● ప్రస్తుతం అందుబాటులో 107 సబ్స్టేషన్లు కల్వకుర్తి: జిల్లాలో గృహ, వ్యవసాయ, చిన్న, పెద్ద పరిశ్రమల నిర్వహణలో భాగంగా రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆయా రంగాలకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి సబ్స్టేషన్ల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ట్రాన్స్కో పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 107 ఉన్నాయి. వీటికి అదనంగా మరో 39 సబ్స్టేషన్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇవేగాక 132/33, 220/132 సబ్స్టేషన్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటోంది. రూ.130 కోట్లతో నిర్మాణాలు.. జిల్లాలో రూ.130 కోట్లతో కొత్తగా 39 సబ్స్టేషన్లు మంజూరయ్యాయి. ఒక్కో సబ్స్టేషన్ నిర్మాణానికి రూ. 3కోట్ల నుంచి రూ. 3.50కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో మూడు మాత్రం 10 ఏళ్ల కిందట మంజూరైనా నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. వెల్దండ మండలంలోని పోతేపల్లి, కొల్లాపూర్ నియోజకవర్గంలోని మంచాలకట్ట, పెంట్లవెల్లి గ్రామాల్లో మంజూరైన సబ్స్టేషన్లు నిర్మాణం ప్రారంభించగా.. వివిధ కారణాలతో నిర్లక్ష్యం చూపారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయిస్తున్నారు. నెల రోజుల్లో పనలు పూర్తి చేసి ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇవే కాక జిల్లాలోని వివిధ మండలాల్లో 36 సబ్స్టేషన్లు మంజూరు కాగా.. కొన్ని టెండర్ దశలో, మరికొన్ని వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరికల్ వద్ద చేపట్టిన 220/132 విద్యుత్ సబ్స్టేషన్ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇది ప్రారంభమైతే జిల్లాలోని లట్టుపల్లి, మంగనూరుతో పాటు వనపర్తి, జడ్చర్ల ప్రాంతాల్లోని పలు గ్రామాలకు విద్యుత్ సమస్య తీరుతుంది. ప్రస్తుతం లట్టుపల్లి, మంగనూరు ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు విద్యుత్ సమస్యతో సతమతమవుతున్నారు. మరో 220/33 సబ్స్టేషన్ను అమ్రాబాద్కు మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. వంగూరు మండలం పోల్కంపల్లి వద్ద 132/33 సబ్స్టేషన్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. విద్యుత్ సబ్స్టేషన్తో వెల్దండ, చారకొండ మండలాలతో పాటు రెండు రెవెన్యూ డివిజన్లో విద్యుత్ సమస్య చాలా వరకు తీర్చవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోతేపల్లిలో నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ -
ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలి
కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు చేరుకున్న వెంటనే విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, తరగతుల నిర్వహణ, బోధన విధానాన్ని పరిశీలించారు. ఈ సమయంలో పాఠశాలలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. ప్రధానోపాధ్యాయుడు శంకర్తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానస విధులకు గైర్హాజరైనట్లు కలెక్టర్ గుర్తించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ముగ్గురు ఉపాధ్యాయులు ఒకేసారి విధులకు హాజరుకాకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. విధులకు హాజరైన ఉపాధ్యాయులు సరస్వతి, రజితలను కలెక్టర్ వివిధ అంశాలపై ప్రశ్నించారు. అనంతరం ఫోన్లో డీఈ ఓ రమేష్కుమార్తో మాట్లాడుతూ.. విధులకు గైర్హాజరైన ప్రధానోపాధ్యాయుడు శంకర్తో పాటు ఉపాధ్యాయులు లావణ్య, మానసను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. పాఠశాలల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు ఎంఈఓ శంకర్నాయక్కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈఓ వెల్లడించారు. డ్రై డేను బాధ్యతగా నిర్వర్తించాలి డ్రై డేను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో కళాశాల విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులకు 102 సేవలను వినియోగించాలి గర్భిణులను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో 102 సేవలను వినియోగించాలని ఆశా కార్యకర్తలను కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. అక్కడే ఉన్న గర్భిణులతో కలెక్టర్ మాట్లాడగా.. వారు వైద్య పరీక్షల కోసం బస్సులో ఆస్పత్రికి వచ్చినట్లు తెలపడంతో ఆశా కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 102 అంబులెన్స్ సేవలను ఎందుకు వినియోగించలేదని ఆరా తీశారు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు పట్టణంలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పట్టణంలోని మిషన్ భగీరథ 60 ఎంఎల్డీ తాగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. -
తక్కువ ధర ఆశ చూపి మోసం!
● 111 నకిలీ డీఏపీ బస్తాల పట్టివేత ● రైతులకు దళారుల టోకరా.. పొలంలో చల్లిన తర్వాత తెలిసిన నకిలీ బాగోతం ● వ్యవసాయాధికారులకు సమాచారం.. ఆకస్మిక తనిఖీ, బస్తాల స్వాధీనం ● పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ – కల్వకుర్తి ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్ మన్ననూర్: స్థానిక పీవీటీజీ పాఠశాల/కళాశాలలోని వసతి గృహంలో వారం రోజుల క్రితం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన సంగతి విధితమే. ఈ సందర్భంగా అధికారుల తాత్కాలిక విచారణలో భాగంగా అందుకు బాధ్యులుగా భావించిన ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అందజేసినట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఈ క్రమంలో సస్పెన్షన్కు గురైన వారి స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికగా నియామకాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పూర్తి విచారణ వరకు ఈ ఉత్తర్వులు ఆచరణలో ఉంటాయని, అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
వెట్రన్కు రెండో పంపు సిద్ధం
కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్టు దగ్గర రెండో పంపునకు సంబంధించిన సాంకేతిక సమస్యలు అధిగమించి వెట్రన్కు సిద్ధం చేశామని ప్రాజెక్టు ఈఈ లోకిలాల్ అన్నారు. శుక్రవారం ఆయన రెండో పంపు వెట్రన్పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రెండో పంపు ట్రయల్ రన్తోపాటు టెస్టు రన్ కూడా చేయడం జరిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో వెట్రన్ నిర్వహించి నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేస్తామన్నారు. రెండో పంపు వెట్రన్ తర్వాత వారంలో రోజుల అనంతరం మూడో పంపును సైతం సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. తద్వారా మొదటి లిఫ్టులో పూర్తయిన నాలుగు పంపుల నుంచి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు. -
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందనూలు: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ మల్లురవి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే పౌరహక్కుల రక్షణ చట్టం, అట్రాసిటీ నివారణ చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే విచారణ దశలో ఉన్న బాధితులకు నిబంధనల మేరకు నష్టపరిహారం అందించాలని చెప్పారు. విజిలెన్స్, మానిటరింగ్కు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ పౌర హక్కుల పరిరక్షణ చట్టం–1955, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం–1989 ప్రకారం నమోదయ్యే ప్రతి కేసును జిల్లాస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం, పునరావాసం, ఇతర సంక్షేమ సదుపాయాలు సకాలంలో అందేలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ కమిటీకి సమగ్ర నివేదిక సమర్పించిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, అత్యాచారాలు, వివక్షకు సంబంధించిన కేసుల పరిష్కారానికి పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి కేసును సున్నితంగా, పారదర్శకంగా విచారిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో కేసులు నమోదైన వెంటనే త్వరితగతిన దర్యాప్తు ప్రారంభించి వీలైనంత త్వర గా పూర్తి చేయాలని సూచించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల భద్రత విషయంలో రాజీ పడకూదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణారెడ్డి పాల్గొన్నారు. -
రూ.4.60 లక్షలు ఖర్చు పెట్టా
20 ఎకరాల్లో 45 రోజుల కిందట పత్తి విత్తనాలు విత్తాను. 150 పత్తి పాకెట్ల కోసం రూ.1.50 లక్షలు, దుక్కి దున్నడానికి ట్రాక్టరుకు రూ.లక్ష, కోళ్ల ఎరువుకు రూ.90 వేలు, ఎరువులకు రూ.65 వేలు, కూలీలకు రూ.50 వేలు మొత్తం కలిపి రూ.4.60 లక్షలు ఖర్చుపెట్టాను. ఇప్పుడేమో వర్షాలు లేక పత్తి మొలకలు వాడుపడుతున్నాయి. వర్షాలు కురిస్తేనే పంట చేతికి వస్తుంది. లేకపోతే తీవ్రంగా నష్టపోతా. – సల్వాది కురుమూర్తి, రైతు, నడిగడ్డ నాలుగు ఎకరాల్లో పత్తిపంట వేశాను. మొలకెత్తినా వర్షాలు లేక ఎదుగుదల లేకపోగా వాడుపడుతున్నాయి. స్ప్రింక్లర్లతో నీటి తడులు అందిస్తున్నా అంతగా పంట లేదు. వర్షాలు కురిస్తేనే దిగుబడి వస్తుంది. లేకపోతే చాలా నష్టపోతాం. పంట వల్ల లాభం వచ్చి అప్పు తీర్చుతాయని ఆశపడుతాం. పంట పండకపోతే అప్పు పెరిగి మరో ఏడాదిపాటు రైతు కోలుకోలేడు. – శ్రీనివాసులు, రైతు, తిమ్మాయిపల్లి ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ పంచాయతీల వద్ద కరపత్రాలు సైతం అతికిస్తున్నాం. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేనందున నీరు తక్కువ తీసుకునే పంటలు సాగు చేసుకోవాలి. మినుములు, కంది, ఉలువలు, అలసంద, పొద్దుతిరుగుడు, ఆముదం వంటివి ఉత్తమం. కాల్వ నీటిపై ఆధారపడే రైతులకు ఆగస్టు 15 వరకు రాాకపోవచ్చు. కాబట్టి వరి సాగు చేయడం మానుకోవాలి. కంది, మొక్క జొన్న, మినుములు, నువ్వులు సాగు చేయడంతోపాటు నీరు అందుబాటులో ఉంటే కూరగాయలు వేసుకోవాలి. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి ● -
జననాల్లో మహబూబ్నగర్ టాప్..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో సీఆర్ఎస్–24 నివేదిక ప్రకారం మొత్తంగా 86,288 జననాలు, 19,605 మరణాలు, 198 శిశు మరణాలు, 369 మృత శిశు (నిర్జీవ పుట్టుక) జననాలు నమోదయ్యాయి. లింగ నిష్పత్తి ప్రకారం పరిశీలిస్తే ఐదు జిల్లాల్లోనూ మహిళా జననాల వాటా 45.7 శాతం నుంచి 48.0 శాతం మధ్య ఉండగా, పురుష జననాల వాటా 52 నుంచి 54 శాతం మధ్య నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలో మగశిశు జననాల శాతం అత్యధికంగా 54.30 శాతంగా నమోదైంది. మొత్తంగా ఆడపిల్లల జననాల శాతం 2022తో పోలిస్తే 0.68 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. మగ, ఆడ శిశువుల వారీగా జనన గణాంకాలు.. -
జగన్నాథుడి రథ వైభవం
స్టేషన్ మహబూబ్నగర్: పాలమూరు నగరంలో గురువారం శ్రీజగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ముందుగా ఉత్సవ మూర్తులకు హారతి, పూజలు చేశారు. భక్తుల జై జగన్నాథ, హరే రామ్... హరేకృష్ణ నామస్మరణతో పాలమూరు పట్టణంలో భక్తిభావం ఉట్టిపడింది. శ్రీజగన్నాథ రథయాత్ర దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులు రెండు వైపుల నిలుచొని రథాన్ని లాగారు. మెట్టుగడ్డ పిల్లలమర్రి చౌరస్తా నుంచి ప్రారంభమైన రథయాత్ర న్యూటౌన్, ఆర్టీసీ బస్టాండ్, అశోక్టాకీస్ చౌరస్తా, వన్టౌన్ పోలీస్ స్టేషన్, రాంమందిర్ చౌరస్తా, అశోక్టాకీస్ చౌరస్తా, క్లాక్టవర్ నుంచి తిరిగి బస్టాండ్ మీదుగా మల్లికార్జున్ చౌరస్తా నుంచి టీటీడీ కల్యాణ మండపం వరకు చేరింది. రథయాత్రలో ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని దేవతామూర్తులకు హారతి, ప్రత్యేకపూజలు చేసి రథాన్ని లాగారు. -
సర్కారు మూత‘బడి’!
అచ్చంపేట: తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్ ఉంటుందనేది నానుడి. గుడిలేని ఊరు ఉన్నా పర్వాలేదు కానీ.. బడి లేని గ్రామం ఉండకూడదని అంటారు పెద్దలు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ బడుల సంఖ్య పెరగాల్సి ఉండగా.. విద్యార్థులు లేరనే సాకుతో చాలా గ్రామాల్లో మూసేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 67 బడులు మూతపడగా.. అదే బాటలో మరో 122 పాఠశాలలు సైతం కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా 495 ప్రాథమిక, 124 ప్రాథమికోన్నత, 130 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా.. 25,102 మంది బాలురు, 22,285 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నారు. ప్రతి ఏటా బడిబాట కార్యక్రమంతో పదిశాతం విద్యార్థులను అదనంగా సర్కారు బడుల్లో చేర్పించాల్సి ఉంది. అయితే అదనంగా విద్యార్థులను చేర్పించడం పక్కన పెడితే.. ఉన్న విద్యార్థులు తగ్గిపోయి పాఠశాలలు మూతపడుతున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరం 816 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 2025–26 విద్యా సంవత్సరానికి వచ్చే సరికి 749 మిగిలాయి. జిల్లావ్యాప్తంగా 67 ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థులు రావడం లేదని మూసేశారు. మరో 122 పాఠశాలల్లో 10 మందిలోపు విద్యార్థులు ఉన్నారు. అంటే వాటిని కూడా మూసేసే పరిస్థితి దాపురించింది. మరో 119 బడుల్లో సైతం 20 మందిలోపు విద్యార్థులు ఉన్నారు. వాటిలో కూడా విద్యార్థులు లేరనే నెపంతో మూసివేయరాదని.. ఒక్కో పాఠశాలలో 10శాతం విద్యార్థుల సంఖ్య(ఎన్రోల్మెంట్) చేయాలని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు ఆదేశించారు. 20 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు 534 ఉండగా.. మొత్తం 3,202 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నల్లమలలోనే అత్యధికంగా.. జిల్లాలో అత్యధికంగా నల్లమలలోనే పాఠశాలలు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 67 స్కూల్స్ జీరో ఎన్రోల్మెంట్ ఉండగా.. ఒక అచ్చంపేట మండలంలోనే 18 ఉన్నాయి. మండలంలో మొత్తం 52 ప్రాథమిక, 14 ప్రాథమికోన్నత, 6 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 18 బడుల్లో జీరో ఎన్రోల్మెంట్తో మూతపడ్డాయి. దుబ్బుతండా, లింగనోనిపల్లి, దర్శన్గడ్డ, దేశ్యాతండా, ఒంకమూతితండా, ధన్యాలతండా, మర్లపాడుతండా, డొక్కుతండా పాఠశాలల్లో విద్యార్థులు లేని కారణంగా మూసివేసి.. 8మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై ఇతర పాఠశాలకు పంపించారు. చీన్యాతండా, కేశ్యాతండా, నక్కర్లపెంట, పద్మారం తండా, కొర్రతండా, లింగోటం తండా, చౌటపల్లి తండా, శంకరయ్యగుట్ట తండా, మైలకుంట తండా, బాల్యతండా పాఠశాలలు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు లేక మూతపడ్డాయి. ఈ ఏడాది తగ్గిన విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26లో 75,347 మంది విద్యార్థులు ఉండగా.. ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు 69,370 మంది విద్యార్థులు మాత్రమే నమోదయ్యారు. అంటే గతేడాది కంటే 5,977 మంది విద్యార్థులు తగ్గారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే బడీడు పిల్లలను గుర్తించి, పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఆశించిన స్థాయిలో విద్యార్థులను చేర్పించడంలో ఉపాధ్యాయులు వెనకబడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే బాటలో మరో 122 బడులు బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంలో విఫలం నానాటికీ సన్నగిల్లుతున్న సర్కారు విద్య ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటుచేశారు. జిల్లాలో గతేడాది 21 ప్రీ ప్రైమరీ బడులను ఏర్పాటుచేయగా.. ఈ ఏడాది ఏకంగా 77 పాఠశాలలను ఏర్పాటుచేశారు. దీంతో వాటి సంఖ్య 98కి చేరింది. ప్రీ ప్రైమరీ తరగతులతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని అధికారులు భావిస్తున్నారు. -
వర్షాల కోసం తీరొక్క మొక్కులు
విద్యార్థినులతో సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తదితరులు కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వరుణుడి జాడే లేకుండాపోయింది. అప్పుడప్పుడు అరకొరగా కురిసిన వర్షాలకు రైతులు సాగుచేసిన పంటలు ఎండుమఖం పడుతున్నాయి. వ్యయ, ప్రయాసలకోర్చి సాగుచేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు వర్షాల కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తూ.. తీరొక్క మొక్కులు మొక్కుకుంటున్నారు. బుధవారం పెంట్లవెల్లి మండలం గోపులాపురం శివాలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. పరమశివుడిని జలదిగ్బంధనం చేశారు. పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండ తండాలో మహిళలు కప్పల కావడి నిర్వహించారు. కప్పల కావడితో వాడవాడ తిరుగుతూ వానమ్మా.. వానమ్మ ఒక్కసారన్నా వచ్చి పోవమ్మా అంటూ పాటలు పాడారు. -
త్వరలోనే నాలుగు పంపుల ద్వారా నీటి విడుదల
● ‘పాలమూరు’ ప్రాజెక్టు సలహాదారు పెంటారెడ్డి కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి మొదటి లిస్టు ద్వారా నెల వ్యవధిలో పూర్తయిన నాలుగు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి అన్నారు. మంగళవారం పంపుల విధివిధాలపై ఉన్నతాధికారులతో కంట్రోల్ బోర్డులో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడేళ్ల క్రితం ప్రారంభించిన మొదటి పంపులో చాలా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరిష్కరించేందుకు దాదాపు 10 రోజుల సమయం పట్టిందన్నారు. అన్నిరకాల సాంకేతిక సమస్యలను అధిగమించి మంగళవారం దాదాపు గంటపాటు నీటిని రిజర్వాయర్లోకి విడుదల చేశామన్నారు. బుధవారం నుంచి రెండో పంపు డ్రైరన్ ప్రారంభిస్తామని, వారం రోజుల్లో రెండో పంపు నుంచి నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. మోటార్లలో తలెత్తుతున్న చిన్నపాటి సమస్యలు పరిష్కరిస్తూ.. నాలుగు పంపుల నుంచి నెల వ్యవధిలో రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తామన్నారు. కృష్ణానదికి నీళ్లు వచ్చే వరకు నాలుగు పంపులు సిద్ధం చేస్తామన్నారు. అలాగే ప్యాకేజీ–3లో ఉన్న పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. ఏదుల, వట్టెం, కర్వెనలో ఉన్న పంపులను సైతం సిద్ధం చేసి.. అన్ని రిజర్వాయర్లకు త్వరలో నీటిని తరలించాలని సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్ఈ రవీందర్, ఈఈ లోకిలాల్, డీఈ ప్రవీణ్ తదితరులున్నారు. -
అవగాహనతోనే ఎయిడ్స్ నిర్మూలన
కందనూలు: ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.కృష్ణ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్యసిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలతో పాటు చెంచుపెంటల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి.. హెచ్ఐవీ స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా వలస కార్మికులు, లారీ డ్రైవర్లు, ఇతర కార్మికులకు హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు చేసి.. వ్యాధిగ్రస్తులను గుర్తించాలని తెలిపారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డా.రఫీక్, డా.రవికుమార్, జిల్లా దిశ మేనేజర్ రమేశ్కుమార్, డీడీఎం సాయికుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతివ్వాలి అచ్చంపేట: ఈ నెల 25న తొలి ఏకాదశి సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలోని లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతించాలని భజరంగ్దళ్ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లమల ప్రాంత ప్రజలతో పాటు ఆదివాసీ చెంచుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు లొద్ది మల్లయ్య ఆలయం ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి సందర్భంగా చెంచు పూజారుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నా రు. ఈ ఏడాది కూడా అటవీశాఖ అనుమతులు ఇచ్చి.. భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో భజరంగ్దళ్ డివిజన్ కన్వీనర్ సీతారాల శివచంద్ర, చందులాల్ చౌహాన్, శివాజీ, నరేశ్, చందర్, అజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం తెలకపల్లి/మన్ననూర్: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక పద్ధతిన ఆంగ్ల మాధ్యమం బోధనకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్ అధికారిణి విద్యులత, జిల్లా సమన్వయ అధికారిణి ఏఆర్ లక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు, బాలుర పాఠశాల/కళాశాలల్లో పలు ఖాళీలు ఉన్నాయని.. విద్యార్హతలతో పాటు టెట్ ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజనల్ ధ్రువపత్రాలతో ఈ నెల 17న తెలకపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించే డెమోకు హాజరు కావాలని వారు సూచించారు. పూర్తి వివరాలకు 80191 89182 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. కరువు ప్రాంతంగా ప్రకటించాలి నాగర్కర్నూల్ రూరల్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణను కరువుపీడిత ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో వర్షపాతం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వం వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించి.. అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు ఆనంద్జీ, కేశవులుగౌడ్, కృష్ణాజీ, బాలపీర్, రామస్వామి, గాలెన్న ఉన్నారు. -
ఘాటెక్కిన ఉల్లి ధర
దేవరకద్ర: ఉల్లి ధర వినియోగదారునికి చుక్కలు చూపిస్తుండగా.. రైతులకు కాసుల పంట పండుతోంది. ఈసారి సీజన్లో నమోదైన ధరలతో పోల్చితే దాదాపు వందశాతం పెరిగింది. ఈ ఏడాది ఉల్లి సీజన్లో జనవరి నుంచి మే వరకు 5 నెలలపాటు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు పలికింది. జూన్లో రూ.2,000 నుంచి రూ.2,400 వరకు, జూలై రెండో బుధవారం ఏకంగా రూ.2,500 నుంచి రూ.3,300 వరకు ఉల్లి ధరలు నమోదయ్యాయి. సీజన్లో అమ్ముకున్న రైతుల కన్నా ప్రస్తుతం అమ్ముకుంటున్న రైతులు వందశాతం లాభాలు పొందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి దిగుబడులు లేకపోవడంతో యాసంగిలో పండించిన ఉల్లిని నిల్వ చేసిన రైతులు ఇప్పుడు మార్కెట్కు తీసుకువస్తుండగా అధిక ధరలు పలుకుతున్నాయి. ఉల్లి అమ్మకాలకు ప్రసిద్ధి.. ఉమ్మడి జిల్లాలోనే ఉల్లి క్రయ విక్రయాలకు దేవరకద్ర మార్కెట్ ప్రసిద్ధిగా మారింది. ప్రతి బుధవారం ఇక్కడి మార్కెట్లో కేవలం ఉల్లిపాయలు మాత్రమే బహిరంగ వేలం వేసి ధరలు నిర్ణయిస్తారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు దేవరకద్ర మార్కెట్కు ఉల్లిని అమ్మకానికి తెస్తారు. ప్రధానంగా నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి దేవరకద్ర మార్కెట్కు ఉల్లి అమ్మకానికి వస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలోని పలు గ్రామాల రైతులు పండించిన ఉల్లి అంతా దేవరకద్ర మార్కెట్కే అమ్మకానికి తెస్తారు. ఏడాదిలో వచ్చే 56 బుధవారాలు ఉల్లి వ్యాపారంతోనే మార్కెట్ సందడిగా ఉంటుంది. అన్నదాతల ఆనందం.. ఉల్లి ధరలు పెరగడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. నిల్వ చేసుకున్నందుకు ఫలితం దక్కిందని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో అమ్మిన ఉల్లికి వచ్చిన ధరలతో పోల్చితే ప్రస్తుతం రెండు, మూడింతల ధరలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. బుధవారం దేవరకద్ర మార్కెట్లో జరిగిన వేలంలో క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.3,300, కనిష్టంగా రూ.2,500 వరకు ధరలు నమోదయ్యాయి. సన్నటి ఉల్లి గరిష్టంగా రూ.2,200, కనిష్టంగా రూ.1,600 వరకు పలికింది. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,700, కనిష్టంగా రూ.1,300 చొప్పున, సన్నటి ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.800 వరకు విక్రయించారు. చిల్లర వ్యాపారులు కిలో ఉల్లి ఏకంగా రూ.30–40 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నిల్వ చేసుకున్న రైతుకు లాభాల పంట క్వింటా గరిష్టంగా రూ.3,300,కనిష్టంగా రూ.2,500 క్రమంగా పెరుగుతున్న ధరలతో వినియోగదారుల ఆందోళన -
విద్య.. నీరు.. పారిశ్రామికం
ఇవే మా మొదటి ప్రాధాన్యం: సీఎం రేవంత్రెడ్డి –8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/వనపర్తి: ‘నేను పాలమూరు బిడ్డను. అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా, ఆదర్శ జిల్లాగా చేయాలనేదే నా ప్రయత్నం. గతంలో ఈ జిల్లాను ఎవరెవరో దత్తత తీసుకున్నారనే చర్చలు జరిగేవి. ఈ రోజు మనమే ఇతర జిల్లాలను ద్తతత తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది పాలమూరు జిల్లాకు గర్వకారణం. ఈ జిల్లాలో మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇండస్ట్రియల్ పాలసీలు అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కాలేజీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఏటీసీ సెంటర్లను తీసుకొచ్చాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్లో బుధవారం ఆయన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం కొత్తకోటలో రూ.1.77 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. త్వరలో శుభవార్త చెబుతాం.. ‘సాగురంగం అభివృద్ధి సాధించాలంటే జిల్లాలో కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కోయిల్సాగర్, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్ పూర్తి చేసుకోవాలి. ఆయా పథకాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నాం. పీఆర్ఎల్ఐకి సంబంధించిన 90 టీఎంసీలు సాధించడానికి కేంద్రం, ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి సంపూర్ణమైన అనుమతులు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో రైతులకు శుభవార్త చెబుతాం. డిండి ప్రాజెక్ట్కు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపులు కోసం కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ జిల్లాను సస్యశ్యాలం చేస్తాం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం తీసుకొస్తాం. నిరుద్యోగులకు ఉపాధి, అవకాశాలు కల్పిస్తాం. ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగాలు పోయి లక్షల మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. వైట్ కాలర్ జాబులు పోతున్నాయి. అయితే బ్లూ కలర్ జాబులు తెచ్చేందుకు మా ప్రభుత్వం పనిచేస్తోంది. బ్లూ కలర్ జాబులు కావాలంటే ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలి. ఈ దిశగా పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుత విద్యతో స్పోర్ట్స్ నూతన విధానం అమలు చేసి చదువులో వెనకబడిన వారు క్రీడల్లో రాణించి ఉన్నత జీవితాన్ని కొనసాగించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలోని మాణిక్యాలను వెలికితీయాలి. విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి. మీ భవిష్యత్కు నాదీ హామీ. క్రీడల్లో రాణించే వారిని ఉన్నతస్థాయిలో నిలిపే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఏడాదికి రూ.30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం.’ అని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీలు డీకే అరుణ, మల్లురవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణ, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, గద్వాల సరిత, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం విద్యార్థులు మైదానాల్లోనూ పోటీ పడాలి ఆదర్శ జిల్లాగా పాలమూరును మారుస్తామని హామీ కొత్తకోటలో బాలికల నూతన పాఠశాల భవనం ప్రారంభోత్సవం -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
కందనూలు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్రశాఖ పిలుపుమేరకు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 6 డీఏలు మంజూరు చేసి బకాయిలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలని, కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, 2003 తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, పదో తరగతి ఇన్విజిలేషన్ పారితోషికాన్ని 40 శాతం పెంచాలని, ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్లో 40 శాతం కటాఫ్ మార్కులు అర్హతగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి శేఖర్, నాయకులు నాగరాజు, రాజశేఖర్రావు, సురేష్, మల్లేష్, సురేఖరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతే గ్రామీణాభివృద్ధికి పునాది
కందనూలు/ తాడూరు: సమాజంలో మహిళల ఆర్థి సాధికారతే గ్రామీణాభివృద్ధికి బలమైన పునాది అని రాష్ట్ర మైనార్టీ సంక్షమే శాఖ కార్యదర్శి, జిల్లా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక ప్రత్యేకాధికారి షఫియుల్లా అన్నారు. మంగళవారం ఆయన తాడూరు మండలంలోని ఐతోలు గ్రామంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, గ్రామ నర్సరీ, మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ కేంద్రం, మహిళా సంఘాల స్నేహ గ్రూపుల కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు. ఈ సందర్భంగా షఫియుల్లా మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి లబ్ధిదారు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. అలాగే అర్హులైన పత్రి కుటుంబానికి ఈ పథకం అందేలా జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పిన, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వంటి అంశాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలోని అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. -
గడువులోగా కష్టమే.. సర్
ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వకపోతే ఓటు లేనట్టే మా ఓటు ఊళ్లోనే ఉంచుకుంటాం.. ఇక్కడ అక్కర్లేదు.. అంటూ పట్టణాల్లో స్థిరపడిన వారు బీఎల్ఓలకు స్పష్టం చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఏదో ఒకచోట మాత్రమే ఓటుహక్కు కలిగి ఉండాల్సి ఉండటంతో చాలామంది సొంతూళ్లనే ఎంచుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు సైతం సర్ ఫారాలు నింపేందుకు గ్రామాల బాట పట్టారు. ఎన్నికల సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయమని కూడా అడిగే వారే ఉండరని, ఊళ్లో అయితే మమల్ని వెతుక్కుంటూ వస్తారని అభిప్రాయపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లు పల్లెలోనే ఉండాలంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజాప్రతినిధులు, నాయకులే ఇప్పిస్తారని, పట్టణాల్లో అయితే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు. పట్టణంలో అన్నీ ఉన్నా ఓటు మాత్రం ఊళ్లోనే ఉండాలని పేర్కొంటున్నారు. అచ్చంపేట: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలు నింపి బీఎల్ఓలకు అందజేస్తేనే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు ఉంటుంది. లేదంటే ఓటరు లిస్టులో మీ పేరు కనిపించదు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫాం–6 ద్వారా ఆగస్టు, సెప్టెంబర్లో మళ్లీ ఓటుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడా చూసినా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. సర్లో భాగంగా ఇంటింటికి వెళ్లి వందశాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసినట్లు ఎన్నికల అధికారులకు పంపించిన నివేదిక పేర్కొంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. బీఎల్ఓలు ఇప్పటి వరకు 60 శాతం కూడా ఎన్యూమరేషన్ పత్రాలు సంబంధిత ఓటర్లకు అందజేయలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది ఎక్కువగా పట్టణాల్లో వినిపిస్తోంది. ఇల్లు మారిన ఓటర్లు చాలామంది పాత ఇళ్లకు చెందిన బీఎల్ఓల వద్దకు వెళ్లి పత్రాలు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అలాగే కొన్ని కుటుంబాల్లో కొందరికే పత్రాలు అందాయి. ప్రతి ఇంటికి మూడు సార్లు తిరిగి పత్రాలు ఇస్తారనే నిబంధనలు బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో సాధ్యం కావడం లేదు. ఒక్కో బూత్కు సుమారు 800 నుంచి 1,200 మంది ఓటర్లు ఉన్నారు. ఇంటింటికి ఇవ్వడంతోపాటు తిరిగి తీసుకుంటున్న పత్రాలు డిజిటలైజేషన్ చేయడంలో చిక్కులు ఎదురవుతున్నాయి. దీనికితోడు సర్వర్ పనిచేయకపోవడం వంటి సమస్యలతో బీఎల్ఓలు సతమతమవుతున్నారు. ఎక్కువ సమయం ఇక్కడే వృథా అవుతున్నట్లు వారు వాపోతున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా గతనెల 25న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రారంభం కాగా.. ఈ నెల 24 వరకు పూర్తి చేయాల్సి ఉంది. కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉండటంతో గడువులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. పల్లెల్లోనే ఓటు పదిలం.. ఈ నెల 24 వరకు ఫారాలు ఇవ్వాలని ఆదేశం ఎస్ఐఆర్కు 10 రోజుల సమయం జిల్లాలో చాలామందికి చేరని పత్రాలు సర్వర్ డౌన్తో సతమతమవుతున్న బీఎల్ఓలు -
సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలి
కందనూలు: సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మిస్సింగ్ కేసుల దర్యాప్తును అత్యంత ప్రాధాన్యతతో చేపట్టి.. అదృశ్యమైన వారి ఆచూకీ త్వరితగతిన గుర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యానికి తావులేకుండా గడువులోగా దర్యాప్తు పూర్తిచేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. గ్రేవ్, నాన్– గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలని పేర్కొన్నారు. క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్, సిస్టమ్స్ డేటాను తప్పనిసరిగా నవీకరించాలని, మ్యానువల్ రికార్డులు, సీసీటీఏఎస్ నమోదు మధ్య ఉన్న వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు సకాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, ఫేక్ నంబర్ ప్లేట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు సాయి వెంకట్రెడ్డి, శ్రీనివాస్, బుర్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. యూనిఫాంలు సకాలంలో అందించాలి కందనూలు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు నాణ్యతతో కుట్టి.. సమయానికి అందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఉయ్యాలవాడలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి యూనిఫాంల కుట్టు పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, కుట్టు విధానం, ఫినిషింగ్, బటన్లు, కాలర్లు, సైజులు తదితర అంశాల్లో ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కుట్టు పనులు పూర్తిచేసి.. వచ్చేనెల 15లోగా విద్యార్థులకు అందించాలని చెప్పారు. ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో వివిద కళాశాలల్లో బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్ డీ, ఇంట్రిగేటెడ్ బీఈడీ పరీక్ష ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు. బ్యాక్లాగ్ బీ ఫార్మసీ సెమిస్టర్–1లో 44.59, సెమిస్టర్–3లో 61.62, సెమిస్టర్–5లో 51.67, సెమిస్టర్–7లో 68.50, రెగ్యులర్ సెమిస్టర్–8లో 90.66 శాతం ఉత్తీర్ణతను సాధించారు. ఎం ఫార్మసీలో బ్యాక్లాగ్ సెమిస్టర్–1లో 66.67, సెమిస్టర్–3లో 75.00, రెగ్యులర్ 4వ సెమిస్టర్లో 94 శాతం ఉత్తీర్ణను నమోదు చేశారు. ఫార్మ్డీలో సెమిస్టర్–3లో 68, సెమిస్టర్–4లో 89 శాతం, 5వ సెమిస్టర్లో 86.67, 6వ సెమిస్టర్లో 95 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. ఇంటిగ్రేటెడ్ బీఏడ్లో 7వ సెమిస్టర్లో 84శాతం ఉత్తీర్ణతను సాధించినట్లు కంట్రోలర్ ప్రవీణ పేర్కొన్నారు. -
నేడు ఉమ్మడి పాలమూరుకు సీఎం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. మొదట పాలమూరు సమీపంలోని దివిటిపల్లిలో ఉన్న అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను, అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను మహబూబ్నగర్, వనపర్తి కలెక్టర్లు ఖుష్బూగుప్తా, ఆదర్శ్ సురభి వేర్వేరుగా వెల్లడించారు. సీఎం పర్యటించనున్న ప్రదేశాలను మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్, భద్రత ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో వేదిక (డయాస్), సీటింగ్, రాకపోకలు, ఇతర మౌలిక సదుపాయాలపై మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులతో సమీక్షించారు.ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్, వైద్య బృందాల ఏర్పాటు, అగ్నిమాపక సిబ్బంది మొహరింపుపై పోలీస్, రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి, అతిథుల స్వాగతం నుంచి వీడ్కోలు వరకు ప్రోటోకాల్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, చిన్న లోటు కూడా ఉండకూడదు అని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎస్పీ డి.జానకి, ఆర్డీఓ నవీన్, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు. కొత్తకోటలో సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ పాఠశాలను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో పాటు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునితారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్కుమార్, సీఎం సెక్యూరిటీ ఇన్చార్జ్ శ్రీధర్ తదితరులు పరిశీలించి.. అన్నిఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటన షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి 1.15 గంటలకు దివిటిపల్లికి చేరుకుంటారు. 1.20 నుంచి 2.20 గంటల వరకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్లో కొత్తగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవం, ప్లాంట్ పర్యటన, ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి 2.45 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ప్రజా రంజక పాలనే ధ్యేయం
● రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం ● ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాజోళి/ మల్దకల్: రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన వడ్డేపల్లి మండలం జూలకల్లో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం చేశారు. అలాగే పచ్చర్ల, మేడికొండ గ్రామాల్లో నెలకొల్పిన 33/ 11కేవీ సబ్స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. మల్దకల్ మండలంలోని కుర్తిరావులచెర్వు గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవంతోపాటు, గట్టు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అంతకు ముందు శాంతిగనర్లో ఏర్పాటు చేసన హెలీప్యాడ్ వద్ద డిప్యూటీ సీఎంకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజయుడు, జి.మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం డీడీలు చెల్లించిన రైతులందరికీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసి అందజేస్తున్నామన్నారు. అలాగే పేద ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, 1.6 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా మహిళలను కోటీశ్వరులను చేయ డమే లక్ష్యమన్నారు. అనంతరం ఎంపీ మల్లు రవికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి కేకు కట్ చేశారు. -
పీజీఐ–డీలో సత్తా
ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిన నాగర్కర్నూల్ కల్వకుర్తి టౌన్: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ ) 2025–26 నివేదికలో ఉమ్మడి పాలమూరులో నాగర్కర్నూల్ జిల్లా మరోసారి ప్రత్యేకత చాటుకుంది. పాఠశాల విద్యా ప్రమాణాలను 6 కీలక అంశాలపై విశ్లేషించి రూపొందించిన నివేదికలో మొత్తం 600 మార్కులకు గాను 333 మార్కులు సాధించి.. ప్రచేష్ట–1 గ్రేడ్ దక్కించుకుంది. అలాగే ఉమ్మడి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు బార్డర్ మార్కులతో ప్రచేష్ట–1లో నిలవగా.. మహబూబ్నగర్ మాత్రం ప్రచేష్ట–2కే పరిమితమైంది. ఒకే విధమైన ప్రమాణాలతో.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను ఒకే విధమైన ప్రమాణాలతో అంచనా వేయడానికి కేంద్ర విద్యాశాఖ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ (పీజీఐ–డీ)ను ప్రవేశపెట్టింది. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడంతోపాటు ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దేందుకు ఈ సూచికను రూపొందించారు. ప్రతి జిల్లాకు 600 మార్కుల స్కోరు కేటాయించి వివిధ ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. ఆరు అంశాలే కీలకం.. జిల్లాల పనితీరులో అభ్యసన ఫలితాలు, తరగతి గది బోధన, మౌలిక వసతులు– విద్యార్థుల హక్కులు, పాఠశాల భద్రత– విద్యార్థుల సంక్షేమం, డిజిటల్ లెర్నింగ్, పాలన– నిర్వహణ అనే ఆరు ప్రధాన విభాగాల్లో పరిశీలిస్తారు. ప్రతి విభాగానికి నిర్దిష్ట సూచికలు ఉండగా.. వాటి ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అధికారిక గణాంకాలే.. పాఠశాల విద్యకు సంబంధించిన సమాచారం జిల్లా, రాష్ట్రస్థాయిల్లోని యూడైస్ ప్లస్, ఎన్ఏఎస్, పీఎం పోషణ్, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ తదితర అధికారిక డేటాబేస్ల నుంచి సేకరిస్తారు. రాష్ట్రాలు నివేదించిన అధికారిక సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ పరిశీలించి తుది స్కోర్లు ప్రకటిస్తుంది. అందువల్ల ఈ గ్రేడింగ్ పూర్తిగా ప్రభుత్వ అధికారిక గణాంకాల ఆధారంగానే ఉంటుంది. ప్రమాణాల మెరుగుకు.. ఈ సూచిక ద్వారా ఏ జిల్లా ఏ రంగంలో వెనకబడి ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు ఒక జిల్లాకు అభ్యసన ఫలితాల్లో మంచి మార్కులు వచ్చినా, డిజిటల్ లెర్నింగ్ లేదా మౌలిక వసతుల్లో తక్కువ స్కోరు వస్తే.. ఆయా రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జిల్లాల మధ్య పోటీ పెరిగి విద్యా ప్రమాణాలు మెరుగుపడటానికి ఇది దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన నివేదికలో నాగర్కర్నూల్ ఉమ్మడి పాలమూరులో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ.. డిజిటల్ లెర్నింగ్, పాఠశాల భద్రత, మౌలిక వసతుల విభాగాల్లో స్కోరు పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తే ‘ప్రచేష్ట–1’ నుంచి ‘ఉత్తమ్’ గ్రేడ్ సాధించే అవకాశం ఉంది. బార్డర్ మార్కులతో ‘ప్రచేష్ట–1’ గ్రేడ్ సాధించిన పేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు ‘ప్రచేష్ట–2’కే పరిమితమైన మహబూబ్నగర్ బోధన, అభ్యసన ఫలితాలు, పాలనలో మెరుగైన పనితీరు మౌలిక వసతులు, డిజిటల్ లెర్నింగ్లో మెరుగుదల అవసరం -
హైవే కష్టాలు.. ఇంకెన్నాళ్లు?
ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్–44పై అండర్ బ్రిడ్జి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం ●అడ్డాకుల/రాజాపూర్: ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్–44పై ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కొన్నాళ్ల నుంచి హైవేపై అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు సాగుతుండటమే ఇందుకు కారణమవుతోంది. బ్రిడ్జి నిర్మాణం జరిగే చోట పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయడం లేదు. దీంతో పనులు నెలల తరబడిగా సాగుతుండటంతో ప్రతిరోజు ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు ఎన్హెచ్–44 సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే చోట బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అక్కడ అండర్ బ్రిడ్జిల నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, భూత్పూర్ మండలం శేర్పల్లి, మూసాపేట మండలం పోల్కంపల్లి స్టేజీ, జానంపేట, వేముల స్టేజీ, వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజీ, కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద అండర్ బ్రిడ్జిల పనులు చేపడుతున్నారు. ఇందులో బాలానగర్, రాజాపూర్, వేముల స్టేజీ వద్ద సుమారు ఏడాదిన్నర కిందట పనులు మొదలయ్యాయి. కాగా.. హైవేపై పనులు జరిగే చోట తీసుకోవాల్సిన కనీస రక్షణ చర్యలను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. రోడ్డు పనులు జరిగే చోట అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలు పాటించడం లేదు. పనులు జరిగే ప్రదేశాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సర్వీస్ రోడ్లు సక్రమంగా కనిపించడం లేదు. దీంతో వాహనాలు వరుస క్రమంలో ఢీకొంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బాలానగర్, రాజాపూర్ వద్ద ప్రతిరోజు అరగంట, గంటపాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ అండర్ బ్రిడ్జిల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూసాపేట మండలం వేముల స్టేజీ వద్ద ఏడాదిన్నర కిందట పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికితోడు ఇక్కడ సర్వీస్ రోడ్లను అరకొరగా చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పోలీస్స్టేషన్ వైపు ఒక సర్వీస్ రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై వాహనాలు వెళ్తే దుమ్ముతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అలాగే హనుమాన్ విగ్రహం వద్ద కూడా సర్వీస్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. పోల్కంపల్లి స్టేజీ, వెల్టూరు స్టేజీల వద్ద సర్వీస్ రోడ్ల పనులే చేయిస్తున్నారు. ఇక్కడ వాహనాలు ప్రధాన రోడ్డుపైనే వెళ్తున్నాయి. కనిమెట్ట వద్ద సర్వీస్ రోడ్లు పూర్తి కాగా అండర్ బ్రిడ్జి పనులు సాగుతున్నాయి. వాహనాలు సర్వీస్ రోడ్లపైనే వెళ్తున్నాయి. భూత్పూర్ మండలం శేర్పల్లి(బీ) వద్ద కర్నూలు వైపు సర్వీస్ రోడ్డు పూర్తికాగా.. వాహనాలు దానిపైనే వెళ్తున్నాయి. హైదరాబాద్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు పూర్తి కాలేదు. అండర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. బాలానగర్, రాజాపూర్ వద్ద నిత్యం ట్రాఫిక్ కష్టాలు వేముల స్టేజీ వద్ద నెలల తరబడిగా సాగుతున్న పనులు హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు నరకప్రాయంగా ప్రయాణం గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని వాహనదారుల అవస్థలు -
ఫిర్యాదులను పెండింగ్లో పెట్టొద్దు
● సత్వర పరిష్కారానికి కృషిచేయాలి ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచన ● ప్రజావాణి కార్యక్రమానికి 71 వినతులు కందనూలు: ప్రజావాణిలో అందించే ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో 71 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఒక్కో శాఖలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల సంఖ్యను పరిశీలించి.. ఆలస్యానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఎలాంటి జాప్యానికి తావు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతి గృహాలపై సమీక్ష ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఒక్కో శాఖ అధికారి తప్పనిసరిగా ఒక వసతి గృహాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. భవనాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, సిబ్బంది కొరత, భద్రత వంటి అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని చెప్పారు. సమీక్ష సందర్భంగా ఇటీవల వివిధ వసతి గృహాలను పరిశీలించిన అధికారులు తమ నివేదికలను కలెక్టర్కు అందజేశారు. అమ్రాబాద్ ఎస్సీ బాలుర వసతి గృహంలో తాగునీటి సౌకర్యం సక్రమంగా లేదని, విద్యార్థుల కమిటీ ఇంకా ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. ఊర్కొండ వసతి గృహంలో గతంలో 33 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం కేవలం 8 మంది మాత్రమే చేరారని, దీనికి ప్రహరీ లేకపోవడం, పారిశుద్ధ్య లోపం, పాముల బెడద వంటి సమస్యలు ప్రధాన కారణాలు అని అధికారులు వివరించారు. ఈ నివేదికలను పరిశీలించిన కలెక్టర్ క్షేత్రస్థా యి తనిఖీల ద్వారా సమస్యలను గుర్తించడమే కాకుండా వాటికి శాశ్వత పరిష్కార మార్గాలను కూ డా రూపొందించవచ్చన్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యకు అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యమని, అధికారులు నిరంత రం పర్యవేక్షణ కొనసాగించి సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాం..
బాలానగర్లో ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాం. వారంలో రెండుమూడు రోజులు మా సొంత గ్రామం ఎన్మన్గండ్లకు వచ్చి వెళ్తుంటాను. బాలానగర్ వచ్చిందంటే చాలు ట్రాఫిక్లో చిక్కుకొని సమయం అంతా వృథా అవుతోంది. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేయాలి. – శేఖర్రెడ్డి, వాహనదారు బ్రిడ్జి పనులు మొదలైనప్పటి నుంచి విపరీతమైన దుమ్ము షాపులోకి వస్తుంది. దీంతో నిత్యం దుమ్మును క్లీన్ చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో. ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ సమస్యలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. – అనూష, బాలానగర్ -
జిల్లా పరిధిలో ఇలా..
●యూనిఫాంలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. వస్త్రం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. వస్త్రం వచ్చిన వెంటనే కొలతలు తీసుకొని కుట్టడానికి ఇస్తాం. ఆ తర్వాత విద్యార్థులకు అందజేస్తాం. – రమేష్కుమార్, డీఈఓ మా పాఠశాలలో యూనిఫాంలు ఇవ్వకపోవడంతో సివిల్ డ్రెస్తోనే వస్తున్నా. పై నుంచి ఇంకా డ్రెస్సులు రాలేదని చె బుతున్నారు. కొంతమంది విద్యార్థులు పాత యూనిఫాంలతో, మరికొంత మంది సివిల్ డ్రెస్లో వస్తున్నారు. – యుగేంధర్, 10వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నాగర్కర్నూల్ గతేడాది ఇచ్చిన యూనిఫాం చిరిగిపోయింది. ఈ ఏడాదికి సంబంధించిన డ్రెస్సులు ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని సారోళ్లను అడిగితే మాకు తెలియదు అని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి యూనిఫాంలు త్వరగా ఇస్తే బాగుంటుంది. – రమేష్, 7వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నాగర్కర్నూల్ కందనూలు: పాఠశాలల పునఃప్రారంభమైన మొదటి రోజు నుంచే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతోపాటు యూనిఫాంలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు ఏమాత్రం ఫలించలేకపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటి వరకు నెల రోజులు గడిచినా విద్యార్థులకు యూనిఫాంలు అందలేదు. ప్రతిఏటా మాదిరిగానే ఈసారి కూడా దుస్తులు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు సంఘాలకు వస్త్రమే చేరలేదు. దీంతో జిల్లాలోని చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాత యూనిఫాంలు, సివిల్ దుస్తులతోనే హాజరవుతున్నారు. డిజైన్లో మార్పులు.. ఈ విద్యా సంవత్సరం నుంచి యూనిఫాంల రంగు, డిజైన్లో ప్రభుత్వం మార్పులు చేసింది. బాలికలకు లాంగ్ ఫ్రాక్, షర్ట్, స్కర్ట్, బాలురకు నీలం రంగు చొక్కా, లేత నీలం రంగు నిక్కర్ లేదా ప్యాంటు తరగతుల వారిగా అందించనుంది. కొత్త డిజైన్ ఖరారైన క్లాత్ సరఫరా లేకపోవడంతో అవి విద్యార్థులకు ఎప్పుడు అందుతాయనే దానిపై స్పష్టత లేకుండాపోయింది. ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు మాత్రమే వస్తుంటారు. అలాంటి సమయంలో విద్యార్థులకు సరైన సివిల్ డ్రెస్సులు లేక పలువురు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలు తెరిచిన రోజునే రావాల్సిన యూనిఫాం ఇప్పటి వరకు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. యూనిఫాంల విషయంలో అధికారులు సైతం అలసత్వం ప్రదర్శించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా త్వరగా యూనిఫాంలు సరఫరా చేయా లని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికీ జిల్లాకు చేరని వస్త్రం.. డ్రెస్సులు కుట్టేదెప్పుడో? కొత్త దుస్తుల పంపిణీపై చలనం లేని యంత్రాంగం పాత దుస్తులతోనే సరిపెట్టుకుంటున్న విద్యార్థులు మరో రెండు నెలల వరకు ఇదే పరిస్థితి -
రేపు ఉద్యోగమేళా
కందనూలు: జిల్లాలోని యువతీ, యువకులకు ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రాఘవేంద్రసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయ బయో ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో 50 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నామన్నారు. ఆసక్తి గల 30 ఏళ్లలోపు నిరుద్యోగులు బుధవారం ఉదయం 10.30 గంటలకు చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 76669 74704, 98854 62005లను సంప్రదించాలని కోరారు. నేడు స్పాట్ అడ్మిషన్లు కోడేరు: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మిగిలిన సీట్లకు 6వ తరగతి నుంచి 12 వరకు మంగళవారం స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాఘవేంద్రశర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు హాస్టల్ సీట్లు ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఐటీడీఏ పీఓగా ఆర్డీఓ యాదగిరి మన్ననూర్: సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా (పీఓ) డిప్యూటీ కలెక్టర్, అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి సోమవారం బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా ఈ స్థానంలో కలెక్టర్ బాధ్యులుగా ఉండేవారు. తాజాగా ఆర్డీఓకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పీఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ నిబంధనల ప్రకారం నిర్వహణ కొనసాగించడంతోపాటు ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం తనవంతుగా కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఏఓ జాఫర్ హుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలతోనే దేశ భవిష్యత్ కందనూలు: ఆరోగ్యవంతమైన పిల్లలతోనే దేశ భవిష్యత్ నిర్మాణం సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ అరుణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సంలో ఆమె పాల్గొని చిన్నారులకు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలతో పిల్లలలో నులిపురుగులను నిర్మూలించి, పిల్లల ఆరోగ్యానికి భరోసా కల్పించవచ్చన్నారు. పిల్లల్లో నులి పురుగుల సంక్రమణ వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, మానసిక, శారీరక ఎదుగుదల లోపం, కడుపు నొప్పి, తరచుగా అనారోగ్యానికి గురవడం వంటివి జరుగుతాయన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారు చదువులో మెరుగ్గా రాణిస్తారన్నారు. కాబట్టి జిల్లాలో 1–19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని సూచించారు. డీఎంహెచ్ఓ కృష్ణ మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలతో ఎలాంటి దుష్ప్రబావాలు ఉండవని, తల్లిదండ్రులు తమ పిల్లలకు నిస్సందేహంగా మాత్రలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి సురేష్బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ భరత్కుమార్రెడ్డి, పాఠశాల జీహెచ్ఎం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొడుకులు అన్నం పెడ్తలేరు..
నాకు మగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. నా భర్త పేరు మీద 22 ఎకరాల పొలం ఉంది. 21 ఎకరాలు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం. నా భర్త చనిపోయాడు. కొన్నేళ్ల నుంచి కూలీ పని చేసుకొని వచ్చిన డబ్బులతో బతికిన. ఇప్పుడు చేతకావడం లేదు. నా ముగ్గురు కొడుకులు అన్నం పెడ్తలేరు. ప్రస్తుతం నేను మా గ్రామంలోని వేరే వాళ్ల పాత ఇంట్లో ఉంటున్నా. కలెక్టర్ సారు నాకు న్యాయం చేయాలి. – మందుల సాయమ్మ, పల్కపల్లి గ్రామం, అచ్చంపేట మండలం ● -
డీఈఓను సస్పెండ్ చేయాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తూ.. ప్రైవేట్కు కొమ్ముకాస్తున్న డీఈఓ రమేష్కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకుల మాట్లాడుతూ జిల్లాలో విద్యాశాఖ పరిపాలన పూర్తిగా గాడితప్పిందని, ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతోపాటు కేజీబీవీల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడంలో డీఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2024లో జిల్లాకేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలపై ఎంఈఓ, డీఈఓలకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. అచ్చంపేటలోని ఓ పాఠశాలపై బాలల హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా, కమిషన్ విచారణ చేయాలని డీఈఓను ఆదేశించినా పట్టించుకోలేదని ఆరోపించారు. పలు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విక్రయాలపై సమాచారం అందించినా ‘అమ్ముకోవచ్చు’ అనే సమాధానం ఇవ్వడం విచారకరమన్నారు. తమ సమస్యలను వివరించేందుకు డీఈఓను కలవడానికి వెళ్లిన సిబ్బందితో మాట్లాడేందుకు కూడా నిరాకరిస్తూ, ‘ఏమైనా ఉంటే ఇన్వార్డులో ఇచ్చి వెళ్లండి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై వచ్చిన అన్ని ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. -
రైతుభరోసా @ రూ.375.99కోట్లు
మండలం మొత్తం అందాల్సిన సాయం భరోసా జమ అయిన నిధులు రైతులు (రూ.కోట్లలో) అందిన రైతులు (రూ.కోట్లలో) అచ్చంపేట 20,097 26.45 18,300 23.21 అమ్రాబాద్ 9,381 12.54 8,851 11.66 బల్మూర్ 18,022 23.19 16,196 20.62 లింగాల 13,670 19.64 12,198 18.96 పదర 6,622 10.27 6,278 9.63 ఉప్పునుంతల 18,986 27.62 17,427 23.43 వంగూరు 18,882 29.11 16,467 23,27 చారకొండ 9,910 13.51 8,767 11.27 కల్వకుర్తి 23,410 33.61 19,475 26.27 ఊర్కొండ 12,593 18.51 10,943 14.83 వెల్దండ 20,545 26.02 17,000 20.70 కోడేరు 14,836 16.49 12,992 14.61 కొల్లాపూర్ 17,273 17.99 15,279 16.05 పెద్దకొత్తపల్లి 25,180 27.07 22,184 24.09 పెంట్లవెల్లి 5,742 6.81 5,219 5.90 బిజినేపల్లి 27,082 27.56 23,938 24.15 నాగర్కరూ్న్ల్ 23,005 26.30 19,878 22.82 తాడూరు 18,366 25.61 15,848 21.42 తెలకపల్లి 21,298 29.07 18,703 25.49 తిమ్మాజిపేట 8,704 23.51 16,114 19.52 అచ్చంపేట: వానాకాలం పంటల సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయం నిధులు విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుభరోసా పథకంతో జిల్లావ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నాటికి 3,02,057 మంది రైతులకు రూ. 375.99కోట్ల మేర పెట్టుబడి సాయం అందింది. పదెకరాల భూమి కలిగి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. రైతులకు ఆర్థికఊరట.. రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడంతో జిల్లా రైతులకు గణనీయమైన ఆర్థిక ఊరట లభించింది. వానాకాలం సాగు పనులు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలుకు ఈ సాయాన్ని వినియోగించుకుంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల రైతులకు వానాకాలం సాగు పెట్టుబడి సాయం సకాలంలో అందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 3,43,604 మంది రైతులు.. జిల్లాలో మొత్తం 3,43,604 మంది రైతులు ఉండగా.. రూ. 440.87కోట్ల నిధులు జమ కావాల్సి ఉంది. అయితే జిల్లాలో 3,22,486 మంది రైతులకు సంబంఽధించి బ్యాంకు ఖాతాల వివరాలు ఆప్డేట్ చేసి ఉన్నాయి. వీరి ఖాతాలో రూ. 427.78కోట్ల జమ కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3,02,057 మంది రైతుల ఖాతాల్లో రూ. 375.99కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. మండలాల వారీగా విడుదలైన రైతుభరోసా నిధులు ఇలా.. పదెకరాల వరకు పెట్టుబడి సాయం జమ జిల్లాలో 3,02,057మంది రైతులకు లబ్ధి వానాకాలం సాగులో అన్నదాతల నిమగ్నం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి.. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సాగుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం కింద దశల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 10 ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమయ్యాయి. రైతులు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకోవాలి. ఏమైనా సాంకేతిక సమస్యలు, ఇతర సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. కొత్త పట్టదారు పాస్పుస్తకాలు పొందిన రైతులు సైతం ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని పొందవచ్చు. – చంద్రశేఖర్, డీఏఓ -
బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుదాం
వంగూరు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించి.. నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఏర్పడిందని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వెంకటేశ్ అన్నారు. వంగూరులో ఆదివారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు వారు హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కార్పొరేట్ పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ.. కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి.. నేడు యువత జీవితాల్లో మట్టికొడుతున్నారని వారు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలను కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాసులు, దేశ్యానాయక్, ఆంజనేయులు పాల్గొన్నారు. -
నాలుగు మోటార్లు బిగింపు
ప్రాజెక్టులో మొదటి లిఫ్టు ఎల్లూరు పంపుహౌజ్లో మొదట 145 మెగావాట్ల సామర్థ్యం గల 9 పంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత దాన్ని 8కి కుదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు మోటార్లు బిగించగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 2 మోటార్లను బిగించింది. తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు, పాలమూరు ప్రాజెక్టు ద్వారా సాగునీటి ఎత్తిపోతలకు కేఆర్ఎంబీ అనుమతి ఇవ్వకపోవడం వంటి కారణాలతో మిగిలిన మోటార్ల ఏర్పాటు పెండింగ్లో పడింది. దీంతో ఇప్పటికే ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లతోనే ప్రాజెక్టును రన్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. -
ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలి
వెల్దండ: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సరిపడా తాగునీటిని సరఫరా చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వానాకాలం మొదలైనప్పటికీ పలు గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చేపట్టాలని అన్నారు. యూరియా బుకింగ్ యాప్తో రైతులు అవస్థలు పడుతున్నారని.. ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, శేఖర్ ముదిరాజ్, హన్మంత్, సాజ్యనాయక్, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. -
వెట్రన్కు అడుగులు
‘పాలమూరు’లోని మొదటి పంపును పరీక్షించిన అధికారులు ● నేడు ఎల్లూరు పంపుహౌజ్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు ● నాలుగు మోటార్లతో నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు ● సీఎం ఆదేశాలతో వేగం పుంజుకున్న పనులు ● మరోవైపు.. ఇంకా అసంపూర్తిగానే కాల్వలు కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్హౌజ్లో నీటి ఎత్తిపోతలకు అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆదివారం రాత్రి మొదటి పంప్హౌజ్ను పరిశీలించి సోమవారం వెట్రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 2023 సెప్టెంబర్ 3న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ అధికారులు మొదటి పంపు డ్రైరన్ చేపట్టగా.. పంపు మోటార్ పరీక్ష విజయవంతం కావడంతో అదే నెల 16న అధికారికంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు ను ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటలపాటు మొదటి పంపు ద్వారా 250 క్యూసెక్కుల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. కొన్నిరోజుల తర్వాత మరోసారి ఎత్తిపోతలు చేపట్టి, మొత్తం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. తర్వాత వేర్వేరు కారణాలతో నీటి ఎత్తిపోతలు ఆగిపోగా.. మళ్లీ ఇన్నాళ్లకు నీటి పంపింగ్కు చర్యలు మొదలయ్యాయి. ఒక్కో మోటార్ సామర్థ్యం 145 మెగావాట్లు ఇప్పటి వరకు ఏర్పాటు చేసినవి 4 పాలమూరు పంప్హౌజ్లో ఏర్పాటు చేయాల్సిన మోటార్లు 8నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు ఒక మోటార్ ద్వారా రోజూ ఎత్తిపోసే నీళ్లు 3,000 క్యూసెక్కులు రాజకీయ దుమారం.. గత మే, జూన్ నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పనుల గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. పాలమూరు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆ పార్టీకి చెందిన మాజీమంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ప్రాజెక్టును సందర్శించి.. బీఆర్ఎస్ వల్లే ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోయిందని ప్రత్యారోపణలు చేశారు. బీఆర్ఎస్కు రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఏకంగా సీఎం రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గత జూన్ 4, 5 తేదీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలోనే వచ్చే డిసెంబర్ కల్లా ప్రాజెక్టును పూర్తి చేసి.. 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేలా అనుమతులు తీసుకువస్తామని ప్రకటించారు. తాజాగా సీఎం ఆదేశాలతో.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశానుసారం పాలమూరు ప్రాజెక్టు పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఈ నెలలోనే కచ్చితంగా ఎల్లూరు పంపుహౌజ్లోని నాలుగు మోటార్ల ద్వారా ఎత్తిపోతలు చేపట్టాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. సోమవారం చేపట్టే వెట్రన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగితే మొదటి పంపు ద్వారా నీటి ఎత్తిపోతలు జరుగుతాయి. మిగతా మూడు మోటార్లకు వెంటనే డ్రైరన్ పూర్తిచేసేలా అధికారులు కృషిచేస్తున్నారు. ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టి నార్లాపూర్ రిజర్వాయర్ను నింపుతామని, కాల్వల తవ్వకాలు పూర్తయిన వెంటనే నీటిని ఏదులకు.. అక్కడి నుంచి వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు తరలిస్తామని అధికారులు తెలిపారు. అసంపూర్తి పనులతో.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టు ప్రారంభమైనప్పటికీ అసంపూర్తి పనుల కారణంగా నీటి ఎత్తిపోతలు జరగలేదు. ఎల్లూరు పంప్హౌజ్ అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా పనులు సుదీర్ఘకాలం కొనసాగి.. ఇటీవలే పూర్తయ్యాయి. అలాగే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రధాన కాల్వ తవ్వకాలు 2 కి.మీ., మేర కుడికిళ్ల, తిర్నాంపల్లి గ్రామాల సమీపంలో ఆగిపోయాయి. ఈ కాల్వ తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసినా.. పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా నార్లాపూర్ రిజర్వాయర్ను నింపినా ఏదులకు తరలించేందుకు మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
ప్రకృతి సంపద పరిరక్షణే లక్ష్యం
కొల్లాపూర్ రూరల్: ప్రకృతి సంపదకు ఎలాంటి హాని కలగకుండా పర్యాటకాభివృద్ధి చేపట్టాలని.. అటవీ సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని అమ్రాబాద్ టైగర్ రిజర్వు నూతన ఫీల్డ్ డైరెక్టర్ ఎస్వీ ప్రసాద్ అటవీశాఖ అధికారులకు సూచించారు. ఆదివారం కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని సోమశిల ఎకో పార్కును పరిశీలించారు. కృష్ణానది అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వరాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొల్లాపూర్లో అటవీశాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ, పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. అడవులను కొట్టకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రేంజర్ వాణికుమారిని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూ టీ రేంజ్ అధికారులు కాశన్న, ముజీబ్ ఘోరీ, బయన్న, నీలేష్ మతీన్, దినేష్ ఉన్నారు. -
రాజకీయాల్లో హుందాతనం కరువైంది
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వనపర్తి రూరల్: నేటి రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఉండాల్సిన హుందాతనం కనబడటం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మూడురోజులుగా జరిగిన ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ ముఖఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకున్న హోదాను మరిచి ఇష్టానుసారంగా తిట్టుకోవడం, అసభ్యంగా విమర్శించుకోవడంతో రాజకీయ విలువలు పూర్తిగా దిగజారే ప్రమాదం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని జల విధానంపై రాజకీయ విధానాలు కాదని.. జల నిపుణుల విధానం కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటి స్థలం కేటాయించాలని కొన్నిరోజులుగా సీపీఐ పెద్దఎత్తున ఉద్యమిస్తుందని గుర్తు చేశారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ తదితర పట్టణాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి కూలుస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా అవసరాలు, వారి సమస్యలపై దృష్టి సారించకుండా మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాముడి పేరుతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేడు ఆ దేవుడి సొమ్మును చోరీ చేసిన దొంగలను పట్టుకునే విషయంలో ప్రధాని నోరు విప్పడం లేదని విమర్శించారు. ఒక్కరోజు కూడా అధికారంలో లేకున్నా వందేళ్లు ఒక రాజకీయ పార్టీ సజీవంగా ఉండటం అద్భుతమని.. ఏనాటికై నా దేశంలో అంతిమ విజయం కమ్యూనిస్టులదేనని స్పష్టం చేశారు. సమానత్వంతో కూడిన సమాజాన్ని సృష్టించే ప్రయాణంలో కూడా చివరి విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బలమైన రాజకీయ పార్టీగా తీర్చిదిద్దాలని అన్ని జిల్లాల సమితి సభ్యులు, మండల కార్యదర్శులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు ఎన్ఎండీ ఫయాజ్, ఆంజనేయులు, విజయరాములు, బాలకిషన్, నర్సింహ, నాయకులు కేశవులుగౌడ్, వార్ల వెంకటయ్య, నర్సింహ, పట్టణ కార్యదర్శి రమేష్, గోపాలకృష్ణ, శ్రీరాములు ,మహేష్, మోషా, ఎండీ కుతుబ్, సీఎస్ శెట్టి, లక్ష్మీనారాయణ, గోపాల్, ఈర్ల చంద్రమౌళి పాల్గొన్నారు. -
రేపు అప్రెంటిస్షిప్ మేళా
కందనూలు: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాలలో ఈ నెల 14న వృత్తివిద్య కోర్సుల అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు డీఐఈఓ వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94929 92047 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. జిల్లాకు మల్టీపర్పస్ ఆడిటోరియం మంజూరు కందనూలు: జిల్లాకేంద్రంలో అత్యాధునిక మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణానికి రూ. 3కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర సమావేశాలకు సరైన వేదిక లేక ప్రజలు, అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి.. మల్టీపర్పస్ ఆడిటోరియం మంజూరు చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మల్టీపర్పస్ ఆడిటోరియం అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలు, అధికారులు, సాంస్కృతిక కళాకారులకు చక్కటి వేదిక లభిస్తుందన్నారు. తమ అవసరాన్ని గుర్తించి నిధులు మంజూరుచేసిన మంత్రి జూపల్లికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రేపు కళాశాలల బంద్ కందనూలు: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్చేస్తూ ఈ నెల 14వ ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్ చేపడుతున్నట్లు జిల్లా కన్వీనర్ శాంతన్ తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు రూ. 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో లక్షలాది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల పేరుతో ఒత్తిడి తీసుకొస్తున్నాయని.. పరీక్షలకు అనుమతించకపోవడం, సర్టిఫికెట్లు నిలిపివేయడం వంటి ఘటనలకు పాల్పడుతున్నాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని.. విద్యార్థుల భవిష్యత్ను ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమని అన్నారు. ఈ నేపథ్యంలోనే 14న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి శివ, జీవన్, విష్ణు, శివ ఉన్నారు. నేడు మంత్రుల పర్యటన జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాలో సోమవారం ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఈ మేరకు రూ.1,775.51 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, మరమ్మతు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ఫేజ్–1 కింద చేపట్టనున్న నాలుగు ప్యాకేజీల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్లో రూ.573 కోట్లతో మహబూబ్నగర్–1 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని గద్వాల– రాయచూర్ రహదారిపై రూ.339.39 కోట్లతో మహబూబ్నగర్–2 ప్యాకేజీ పనులకు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం వనపర్తిలోని జడ్చర్ల రోడ్డులో రూ.359.09 కోట్లతో వనపర్తి–2 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎల్లూరు వద్ద కొల్లాపూర్– మొలచింతలపల్లి మార్గంలో రూ.504.03 కోట్లతో వనపర్తి–1 ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. – వివరాలు 9లో.. బీటీరోడ్లు పూర్తయ్యేనా? ఏడాదిగా నత్తనడకన సాగుతున్న పనులు నిర్మాణాల పూర్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు -
రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
వనపర్తిటౌన్: మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే 4వ తెలంగాణ రాష్ట్రస్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ మీట్కుగాను సోమవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14 పోటీలకు 18.07.2012–17.07.2014 మధ్య జన్మించిన బాలబాలికలు, అండర్–16 పోటీలకు 18.07.2010–17.07.2012 మధ్య జన్మించిన వారు, అండర్–18 పోటీలకు 18.07.2008–17.07.2010 మధ్య జన్మించిన వారు, అండర్–20 పోటీలకు 18.07.2006 – 17.07.2008 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. అండర్–14లో 600 మీటర్లు, ట్రయోత్లోన్–ఏ,బీ,సీ, అండర్–16లో వెయ్యి, 2 వేల మీటర్లు, అండర్–18లో 800, 1,500, 3 వేల మీటర్లు, అండర్–20లో 800, 1,500, 5 వేలు, 10 వేల మీటర్లు, ఉమెన్ ఆండ్ మెన్ కేటగిరీలో 800, 1,500, 3 వేలు (ఉమెన్), 5 వేల మీటర్లు (మెన్ ), 10 వేల మీటర్ల పరుగు పందెం పోటీలు ఉంటాయని వివరించారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకు స్థానిక స్టేడియం గ్రౌండ్లో రిపోర్ట్ చేయాలని.. పూర్తి వివరాలకు సెల్నంబర్ 94413 53375 సంప్రదించాలని సూచించారు. -
ప్రగతి పోర్టల్లో విద్యాశాఖ వివరాలు
కందనూలు: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రగతి పోర్టల్లో జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం వివరాలను నిర్దేశిత విధానంలో నమోదు చేసి ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో విద్యాశాఖపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద జిల్లాలో కొనసాగుతున్న పాఠశాల భవనాల నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ వసతులు, ప్రహరీలు, మరమ్మతు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. చేపట్టిన ప్రతి పనిని నిర్దేశించిన కాలపట్టిక ప్రకారం పూర్తి చేయాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ప్రగతి పోర్టల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి పంపే సమాచారం కచ్చితంగా, పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని స్పష్టం చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, ఆహార నిల్వ విధానం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని డీఈఓ రమేష్కుమార్ను ఆదేశించారు. సమావేశంలో విద్యా శాఖ అధికారులు వెంకటయ్య, నూరుద్దీన్, వెంకటేశ్వరశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ కోసం కుటుంబ నియంత్రణ పాటిద్దాం
కందనూలు: సుస్థిరమైన భవిష్యత్ కోసం కుటుంబ నియంత్రణ పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని బాలుర జెడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, పునరుత్పత్తి, మాతాశిశు ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, యువత సాధికారతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా పెరుగుదల వలన సహజ వనరులపై ఒత్తిడి పెరిగి.. ఆహారం, నీరు, నివాస స్థలాలు, విద్య, వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, నిరుద్యోగం, పేదరికం పెరగడంతోపాటు పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం అధునాతన శాశ్వత, తాత్కాలిక కుటుంబం నియంత్రణ పద్ధతులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దంపతులు ప్రతి బిడ్డకు కనీసం మూడేళ్ల గ్యాప్ తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రవికుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ భరత్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెచ్పీవీ తప్పనిసరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా తప్పనిసరి వాడాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంజేపీ బాలికల గురుకులంలో విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14–15 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో రక్షణ ఇస్తుందని, వీటితో పలు రకాల ఆరోగ్య రుగ్మతలు దూరం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో డీఐఓ సురేష్బాబు, రాజగోపాలాచారి పాల్గొన్నారు. -
మొలకలు వస్తలేవు..
నేను ఈసారి నాలుగు ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటినాను. ఏదో ప్రభావంతో వర్షాలు రావడం లేదని అందరూ చెబుతున్నారు. దీంతో ఇప్పటికే నాటిన పత్తి విత్తనాలను కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా. ఎంతైనా వర్షాలు కురిస్తేనే అంతా బాగుంటుంది. – చంద్రయ్య, తిమ్మాయిపల్లి, చారకొండ ఎల్నినో ప్రభావంతో ఈసారి లోటు వర్షపాతం నమోదవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రైతులు తక్కువ వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కంది, మినుము, ఉలవలు, అలసంద, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి పంటలు సాగు చేసుకోవాలి. కాల్వ నీటిపై ఆధారపడే రైతులు వరినాట్లు, నర్సరీలు వేయడం మానుకోవాలి. ఆగస్టు 15 వరకు కాల్వ నీరు అందుబాటులో ఉండదు. ఎల్నినోపై రైతులను చైతన్యపరచడంతోపాటు సాగు చేసే పంటలపై గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తున్నాం. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి ● -
అగ్నివీరులు..!
దేశ రక్షణకు యువత ముందడుగు ● 2025– 26లో వనపర్తి జిల్లా నుంచి 17 మంది ఎంపిక ● యువతలో ఆసక్తిరేపుతున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ల ఉచిత శిక్షణ ● 2027 నోటిఫికేషన్ కోసం మరో 15 మందికి తర్ఫీదు ● ఆర్మీలో ఏఐపీటీగా పనిచేసిన అనుభవంతో మెరుగైన శిక్షణకు అవకాశం సుమారు 18 ఏళ్లు సైన్యంలో పనిచేసిన మాజీ సైనికుడు పి.మహేష్ తనవంతుగా దేశరక్షణ కోసం యువతను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ‘జై జవాన్.. జై కిసాన్.. ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్’ సెంటర్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి.. కలెక్టర్ ఆదర్శ్ సురభితో యువతకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు అనుమతి పొందారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధాన భవనం వెనక భాగంలో యువతకు ఫిజికల్ ఎడ్యుకేషన్పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈయన ఆర్మీలో ఏఐపీటీగా నాలుగేళ్ల అనుభవం ఉండటంతో ఒక సైనికుడికి కావాల్సిన ఫిట్నెస్ యువతలో కలిగేలా శిక్షణ ఇస్తూ.. అగ్నివీర్ విభాగానికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గత బ్యాచ్లో తన శిష్యులు ఏడుగురు ఉద్యోగం సాధించగా.. మరో మాజీ సైనికుడు గబ్బర్సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న మరో తొమ్మిది మందిని ఇప్పటికే అగ్నివీర్కు పంపించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి మరో 15 మందికి ఫిజికల్ ఎడ్యుకేషన్పై శిక్షణ ఇస్తున్నారు. అప్పటి కలెక్టర్ స్ఫూర్తితో.. 2006లో నేను ఆర్మీలో చేరే ముందు అప్పటి ఉమ్మడి పాలమూరు కలెక్టర్ ఉషారాణి ఆర్మీ శిక్షణ కోసం ఉచిత వసతి కల్పించి ప్రోత్సహించారు. చాలామంది మాజీ సైనికులు మమ్మల్ని భారత సైన్యంలోకి పంపించేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్, రాత పరీక్షపై అవగాహన కల్పించారు. వారి స్ఫూర్తితో తాము జిల్లాలోని యువతను అగ్నివీర్ విభాగంలోకి పంపించేందుకు కృషిచేస్తున్నాం. తొలిసారే అనుకున్న మేరకు అగ్నివీరులను తయారు చేశాం. రెండో బ్యాచ్ను సిద్ధం చేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. సాధ్యమైనంత కాలం ఈ ఉచిత ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ కొనసాగిస్తాం. – మహేష్, మాజీ సైనికుడు, జై జవాన్, జై కిసాన్ ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వాహకులు, వనపర్తి సంస్థను ఏర్పాటు చేసి.. -
జీవిత లక్ష్య సాధనకు విధ్యే మార్గం
కల్వకుర్తి టౌన్: విద్యార్థులు డిగ్రీతోనే తమ ప్రయాణం ముగిసిందని భావించకుండా.. నిరంతరం కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మహబూబ్ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యతోపాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, వ్యక్తిత్వ వికాసం కూడా ఎంతో అవసరమన్నారు. కళాశాలలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, అధ్యాపకుల ఆశయాలను నెరవేర్చేలా కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు విద్యాభ్యాసంతోపాటు సామాజిక విలువలను అలవర్చుకోవాలని, ఉన్నత స్థానాలకు చేరుకుని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీతో పనిచేసే యువతకు భవిష్యత్లో ఎన్నో అవకాశాలు ఉంటాయని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమవుతుందని డీఎస్పీ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. అనంతరం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
పట్టుదలతో చేరాను..
మా గ్రామం ఆర్మీ జవాన్లకు పుట్టినిల్లు లాంటిది. మండలంలోనే అతిచిన్నదైన మా గ్రామంలో సుమారు 38 మంది యువకులు భారత సైన్యంలో పని చేస్తున్నారు. అలాంటి దేశభక్తులు ఉన్న గ్రామంలో పుట్టిన నేను కూడా భారత సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకోవాలనే పట్టుదలతో అగ్నివీర్లో స్థానం దక్కించుకున్నాను. – మొహిలా అలీ, కొన్నూరు గ్రామం, మదనాపురం శిక్షణ ఉపయోగపడింది.. గతంలో పలుమార్లు సైన్యంలోకి వెళ్లాలని నోటిఫికేషన్ వచ్చినప్పుడు దరఖాస్తు చేసు కుని వెళ్లాను. కానీ, ఫలితం దక్కలేదు. మాజీ సైనికులు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వారితో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అగ్నివీర్లో చోటుదక్కింది. ఆర్మీలో ఫిజికల్ ట్రైనర్గా పనిచేసిన వారు కావడంతో వారిచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది. – రాఘవేంద్ర, ద్వారకానగర్, మదనాపురం ● -
ఉమామహేశ్వరంలో హైకోర్టు జడ్జి పూజలు
అచ్చంపేట రూరల్: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో శనివారం హైకోర్టు జడ్జి శరత్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయం వద్ద ఆయన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో గణపతి పూజ, కుంకుమార్చన, స్వామివారి అభిషేక కార్యక్రమాలు జరిపించారు. కార్యక్రమంలో జడ్జి కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శనేశ్వరుడికి అభిషేకాలు కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు తిలతైలాభిషేకాలు జరిపించినట్లు అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. పూజారి మాట్లాడుతూ ఈ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తి మేరకు పూజించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచ్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. సింహవాహనంపై వెంకన్న ఊరేగింపు స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం పాలమూరుశాఖ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం శివాలయంలో సుప్రభాతసేవ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సుప్రభాత సేవ, అర్చనలు, వేదపారాయణం, సుబ్రహ్మణ్య నవగ్రహ మూలమంత్ర అనుష్టానాలు నిర్వహించారు. సాయంత్రం తిరుపతికి చెందిన కళాకారులచే భరతనృత్యం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సింహవాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు.వనపర్తి: సాయుధ దళాల్లో యువశక్తిని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పేరుతో సైనిక నియామక పథకం రూపొందించింది. ఈ విభాగంలో చేరిన వారిలో 75 శాతం మంది సైనికులను నాలుగేళ్లకు ఇంటికి పంపిస్తారు. అందుకు తగిన ఆర్థిక భరోసా కల్పిస్తూ.. మిగతా 25 శాతం మంది సైనికులకు అర్హత పరీక్షల ఆధారంగా పదోన్నతలు కల్పించి దేశ రక్షణకు ఉపయోగించుకుంటారు. వనపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సైనికులు మొదట్లో వేర్వేరుగా.. కొద్దిరోజుల నుంచి కలిసి యువతకు శిక్షణ ఇస్తూ అగ్నివీరులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశరక్షణ వ్యవస్థలో అత్యంత ఆధునికతతో నిర్వహించే అగ్నివీర్ (అగ్నిపథ్)లోకి పంపించేందుకు ఫిజికల్, రాత పరీక్షలపై ఉచిత శిక్షణ ఇస్తూ.. యువతను ప్రోత్సహిస్తుండటం.. అందుకు దేశభక్తి గల యువకులు ఆసక్తి చూపిస్తుండటంతో అనుకున్న మేరకు ఫలితాలనిచ్చాయి. ఈ క్రమంలోనే 2025– 26లో జారీ చేసిన నోటిఫికేషన్లో జిల్లాకు చెందిన మాజీ సైనికులు పి.మహేష్, గబ్బర్సింగ్ ట్రైనింగ్ ఇచ్చిన 16 మందితో పాటు పెద్దమందడి ముందరితండాకు చెందిన మరో యువకుడు ఎంపికయ్యారు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చే వీరు ఒక్కొక్కరు వందమంది యువకులను దేశ రక్షణ కోసం తయారు చేసేలా ప్రస్తుత మాజీ సైనికులు శిక్షణ ఇస్తూ చైతన్యం చేస్తున్నారు. -
నేరాల నియంత్రణే లక్ష్యం : ఎస్పీ
కోడేరు: శాంతిభద్రల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ పనిచేస్తోందని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. శుక్రవారం కోడేరు పోలీస్స్టేషన్లో ఆయన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదులపై వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి కేసులో పారదర్శక విచారణ జరిపి.. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. అదే విధంగా స్థానిక రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్ఐ వేణుగోపాల్కు సూచించారు. గ్రామస్థాయిలో విధులు నిర్వహించే విలేజ్ పోలీసు ఆఫీసర్లు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారంలో తమవంతు పాత్ర పోషించాలని తెలిపారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, సీఐ శంకర్నాయక్ ఉన్నారు. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
● ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలి ● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కందనూలు: గ్రామాల సమగ్రాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని.. స్వంత ఆర్థిక వనరులను పెంపొందించుకొని గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ–2026) రూపకల్పనపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణతో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి లక్ష్యాలను గ్రామస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలంటే గ్రామ పంచాయతీలు బలోపేతం కావడం అత్యంత అవసరమన్నారు. ప్రతి జీపీలో శాశ్వత ప్రయోజనం కలిగించే అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, సవరణలు ఈ నెల 24వ తేదీలోగా పూర్తయ్యేలా కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. గ్రామ పాలనకు సర్పంచులే కేంద్ర బిందువని అన్నారు. ప్రతి గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరి రక్షణ, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, యువత అభ్యున్నతి, వ్యవసాయాభివృద్ధి వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, డీఏఓ చంద్రశేఖర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి వెంకటేశం, మిషన్ భగీరథ ఈఈ శ్రీదేవి ఉన్నారు. ● సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్తో కలిసి వీసీ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్షించారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యాపింగ్ చేసిన డేటా ఆధారంగా ఎన్యూమరేషన్ ఫారాలను సరిచూసుకొని ఈ నెల 24వ తేదీలోగా డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఏ ఒక్క అర్హులైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకుండా.. అనర్హులు జాబితాలోకి చేరకుండా క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ అరుణరెడ్డి, ఆర్డీఓలు అర్చన, బన్సీలాల్, యాదగిరి ఉన్నారు. -
జూరాల.. వెలవెల
●ఏం తోచడం లేదు.. నెట్టెంపాడు కాల్వ పరిధిలో నాకు రెండెకరాల పొలం ఉంది. ఈసారి వరిసాగు కోసం నారుమళ్లు వేసుకున్నా. వర్షా లు లేక డ్యాంకు నీరు రాలే దని అధికారులు ఆరుతడి పంటలు వేసుకోమంటున్నారు. మా పొలాలు ఆరుతడి పంటలకు అనుకూలంగా ఉండవు. ఏం చేయాలో తోచడం లేదు. – సాయన్న, రైతు, ధరూరు ఆరుతడి పంటలు వేసుకోవాలి.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలి. వరిపంట వేసుకుని ఇబ్బందులు పడొద్దు. కాల నుగుణంగా పంటలు సాగుచేసుకుంటే రైతులు నష్టపోకుండా ఉంటారు. – వీరప్ప డీఏఓ, సంజీవ్ప్రసాద్ ఇరిగేషన్శాఖ డీఈ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ తప్పింది. గతేడాది ఇదే సమయానికి కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడిన జూరాల.. నేడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొని వెలవెలబోతోంది. వర్షాకాలం మొదలై నెలరోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగితే జూరాల జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గి.. డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్, వ్యవసాయశాఖల అధికారులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. 10లక్షల ఎకరాల ఆయకట్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులు నిర్మించారు. మొత్తం 10లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రతి ఏటా వానాకాలంలో సుమారు 7లక్షల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఆందోళనలో ఆయకట్టుదారులు.. జూరాల ఎడమ, కుడి కాల్వల పరిధిలో మొత్తం 1.09 లక్షలు, నెట్టెంపాడు కింద 1.56 లక్షలు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ పరిధిలో సుమారు 5లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు వరద వచ్చి చేరకపోవడంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా వానాకాలంలో ఈ సమయానికి దాదాపు 50శాతం మేర వరినాట్లు పూర్తయ్యేవి. కాని ఇప్పుడు నారుమళ్లు ముదిరిపోతున్నాయి. కరిగెట్లు చేసుకుని సిద్ధం చేసుకున్న పొలాలు సైతం నీరులేక నెర్రలుబారుతున్నాయి. ప్రియర్శిని జూరాల ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం జలకళ తప్పిన జలాశయం వర్షాకాలం మొదలైనా కనిపించని వరద గతేడాది మే చివరినాటికే జూరాలలో జలకళ గడ్డు పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టులు గడ్డు పరిస్థితి.. జూరాల ప్రాజెక్టుకు గతేడాది మే చివరినాటికే వరద వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలో ప్రాజెక్టు 40 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అదే విధంగా ఎగువ, దిగువ విద్యుత్ హైడల్ ప్రాజెక్టుల ద్వారా విద్యుదుత్పత్తి నిరాటకంగా కొనసాగింది. కానీ నేడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎగువనున్న కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు సైతం పూర్తిగా నిండలేదు. ఫలితంగా జూరాలకు వరద ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో.. లేదో కూడా తెలియని గడ్డు పరిస్థితి నెలకొంది. జలాశయంలో 5.52 టీఎంసీలు.. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.290 మీటర్ల మేర ఉంది. 9.567 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం కేవలం 5.523 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా కేవలం 1.916 టీఎంసీల వరకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. పైగా 30 ఏళ్లుగా జలాశయం పూడిక తీయకపోవడంతో సుమారు రెండున్నర టీఎంసీల బురద పేరుకుపోయింది. ఈ లెక్కన జలాశయంలో ఉన్న నీరు దాదాపుగా డెడ్ స్టోరేజీకి చేరిందని చెప్పవచ్చు. -
బకాయిలు చెల్లించాల్సిందే
2022–23 యాసంగి సీఎంఆర్పై ప్రభుత్వం అల్టిమేటం! 1,61,009 మె.ట. ధాన్యం కేటాయింపు.. జిల్లావ్యాప్తంగా 72 రైస్మిల్లులు, 11 పారాబాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. 2022–23 యాసంగి సీజన్లో పండిన వరిధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకున్నాయి. దాదాపు 1,61,009 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు అప్పగించింది. వీటిని సీఎంఆర్ రూపంలో ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. వీటిలో కొందరు రైస్మిల్లర్లు 18,960 మెట్రిక్ టన్నులను మరాడించి ప్రభుత్వానికి బియ్యం అప్పగించారు. 22,047 మెట్రిక్ టన్నుల ధాన్యానికి వేలం వేశారు. ఇంకా దాదాపు 1,11,395 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉంది. ఆ ధాన్యం విలువను ప్రభుత్వం రూ. 250కోట్లుగా లెక్కించింది. వచ్చేనెల 8తో గడువు ముగింపు బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం విధించిన 90రోజుల గడువు వచ్చేనెల ఆగస్టు 8తో ముగుస్తుంది. ఇటీవల జిల్లాకేంద్రంలో విజిలెన్స్ డీఎస్పీ నేతృత్వంలో మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో గడవులోగా బకాయి ఉన్న 79 రైస్మిల్లర్లు రూ. 250కోట్లు చెల్లించాలని.. లేనిచో మిల్లులపై ఉన్న బకాయికి 25శాతం అదనంగా చెల్లించడంతో పాటు 12శాతం వడ్డీ సైతం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మిల్లర్లలో ఆందోళన మొదలైంది. సమస్య పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించారు. కల్వకుర్తి: 2022– 23 యాసంగి సీజన్లో ప్రభుత్వం నుంచి రైస్మిల్లర్లు తీసుకున్న వరిధాన్యం పంచాయితీ తెగడం లేదు. మిల్లర్లు బకాయిపడిన సీఎంఆర్ మొత్తం అందించాలని.. లేదా తీసుకున్న ధాన్యం తిరిగివ్వాలని.. అదీ కుదరకపోతే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు గత మే 8న 90 రోజుల నిర్దిష్ట గడువు విధించింది. అప్పటిలోగా బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం మిల్లర్లు బకాయి సీఎంఆర్కు బదులు డబ్బులను చెల్లించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు అప్పట్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని అందించారని.. బియ్యం సక్రమంగా రావని.. క్వింటా రేటు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం తీసుకున్న రైస్మిల్లులు 83 ఉండగా.. మూడు మిల్లుల యాజమాన్యం కొంత ధాన్యం చెల్లించడంతో పాటు డబ్బులు చెల్లించి, క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందారు. మిగతా 79 మిల్లులపై రూ. 250కోట్ల బకాయి ఉంది. కొన్ని మిల్లులకు రూ. 10లక్షలలోపు ఉండగా.. మరికొన్నింటికి రూ.కోటి నుంచి రూ. 7కోట్ల వరకు బకాయి ఉన్నాయి. ఇక కొన్ని పారాబాయిల్డ్ మిల్లులు రూ. 13కోట్ల నుంచి రూ. 23.54 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఎనిమిది మిల్లులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాజయ్య తెలిపారు. మరో నాలుగు మిల్లులపై సైతం కేసులు చేయాల్సి ఉందన్నారు. 36 మిల్లులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రైస్మిల్లర్లకు నోటీసులు మొత్తం రూ. 250కోట్లు చెల్లించాలని ఆదేశం వచ్చేనెల 8వరకు గడువు 8 మిల్లులపై కేసులు.. -
మత్స్యకారుల అభ్యున్నతికి కృషి
కొల్లాపూర్ రూరల్: మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ మండలంలోని సింగోటంలో పర్యటించిన ఆయన మత్స్యకారులు ఆరాధ్యదైవం గంగమ్మ తల్లి గుడి నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. శ్రీవారి సముద్రం చెరువు పరిసరాల్లో గుడి నిర్మించేందుకు స్థలాన్ని చూశారు. త్వరలో గంగమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని, సింగోటం గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమిడిశెట్టి వెంకటస్వామి, నాయకులు రామచంద్రారెడ్డి, రామస్వామి తదితర నాయకులు పాల్గోన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
మన్ననూర్: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం రాష్ట్ర గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ రాజబాబుతో కలిసి మన్ననూర్ పీవీటీజీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగదులు, వాటర్ట్యాంకు, డార్మెంటరీ, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు. పాఠశాల నిర్వహణలో మార్పు రావాలని.. లేనిచో కఠిన చర్యలు ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు. వారి వెంట ప్రిన్సిపల్ పద్మావతి, సర్పంచ్ మంజుల, రాజారాం, ఉపసర్పంచ్ రమణగౌడ్ ఉన్నారు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
కందనూలు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్, బిజినేపల్లి, తాడూరు, తెలకపల్లి, తిమ్మాజిపేట మండలాలకు చెందిన 241 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలతో లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో రమణారావు, తీగల సునేంద్ర పాల్గొన్నారు. మహిళల భద్రతషీటీం బాధ్యత కల్వకుర్తి టౌన్: మహిళల భద్రత షీ టీం బాధ్యత అని జిల్లా షీ టీం ఇన్చార్జి విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో మహిళా చట్టాలు, మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం తమ ఆటపాటలతో వివిధ సామాజిక అంశాలను వివరించారు. సీసీఎస్ సీఐ శంకర్, కల్వకుర్తి సీఐ భీమ్ కుమార్, ఎస్ఐ కురుమూర్తి పాల్గొన్నారు. పీజీ సెంటర్లోసమస్యలు పరిష్కరిస్తాం కొల్లాపూర్ రూరల్: పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కొల్లాపూర్ పీజీ సెంటర్లో నెలకొన్న సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని పాలమూరు యూనివర్సిటీ వీసీ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రిజిస్ట్రార్ రమేష్బాబుతో కలిసి ఆయన కొల్లాపూర్ పీజీ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సెంటర్లో నెలకొన్న సమస్యల గురించి ఆరా తీశారు. అనంతరం బాలికల, బాలుర వసతి గృహలను, వసతులు, భోజనం పరిశీలించారు. ప్రొఫెసర్లతో కొంతసేపు సమస్యల గురించి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుడూ విద్యార్థులు క్రమం తప్పకుండా క్లాసులకు రావాలని, హాజరు శాతం తక్కువైతే చర్యలు ఉంటాయన్నారు. ఇటీవల సెంటర్లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియస్పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైభవంగా వార్షికబ్రహ్మోత్సవాలు స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం పాలమూరు శాఖ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు శనివారం ఉదయం వేద పారాయణాలు, మూలమంత్ర అనుష్టానాలు, స్వామివారి మూలమూర్తికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం తిరుపతి నుంచి వచ్చిన కళాకారులు వాద్య సంగీత కచేరీ నిర్వహించారు. హంస వాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. గోవిందనామంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యాన్ని చాటింది. బ్రహ్మోత్సవాల్లో శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
వనపర్తి రూరల్: అంతరాలు లేని సమాజ స్థాపనే కమ్యూనిస్టుల లక్ష్యమని, అందుకు ప్రజలను చైతన్యం చేసి పోరాడాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్హాల్లో సీపీఐ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యుల మూడు రోజుల శిక్షణ తరగతుల ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు యుద్ధకాంక్షతో నరమేధాన్ని సృష్టిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ రామ మందిరంతో పేరుతో అధికారంలోకి వచ్చి, అదే రామ మందిరంలో దొంగలు పడి రూ.కోట్లు కొల్లగొడుతున్నా.. ప్రధాని మోదీ నేటికీ పెదవి ఇప్పకపోవడం సరైందికాదన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యం పెరిగిందని, అర్హులెవరికీ ఇళ్లు కేటాయించిన దాఖలాలు లేవని ఆరోపించారు. కార్యక్రమంలో విజయరాములు, బాలకిషన్, ఆంజనేయులు పాల్గొన్నారు. -
సరికొత్తగా పత్తి సాగు
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ ● రైతులకు ప్రోత్సాహకం కోసం ఉచితంగా విత్తనాల పంపిణీ ● జిల్లాలో 6,130 హెక్టార్లలో సాగుకు 72 వేల పాకెట్లు అందజేత ● పథకం అమలు కోసం రూ.9.46 కోట్లు కేటాయింపు కల్వకుర్తి: పత్తి పంట దిగుబడిని పెంచి రైతుకు మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం తీసుకవచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ పథకం అమలు చేస్తున్నారు. 2026 నుంచి 2031 వరకు ఐదేళ్లపాటు పథకాన్ని అమలు చేసి రైతుల్లో సాగు విధానంలో సరికొత్త పద్ధతులపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలున్నా యి. ప్రస్తుత సాగు విధానంతో ఎకరాకు 6– 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి వస్తుంది. కొత్త సాగు విధానాలతో మొక్కల పెంపకం అధికంగా చేస్తే దిగుబడి అధికమవడంతోపాటు రెండో పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. దీంతో అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వ్యవసాయాధికారులు అభిప్రాయపడుతున్నారు. మరో నాలుగేళ్లపాటు.. జిల్లాలో ఈ ఏడాది పథకం అమలు కోసం రూ.9.46 కోట్లు కేటాయించారు. ఈ విధంగా మరో నాలుగేళ్లపాటు (2031 వరకు) పథకాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని కొల్లాపూర్ డివిజన్ మినహాయించి మిగతా 16 మండలాల్లో 6,130 హెక్టార్లలో ఈ పథకం ద్వారా రైతులకు ఉచితంగా పత్తి పాకెట్లు అందించి కొత్త పద్ధతుల్లో సాగు చేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం 72 వేల పత్తి పాకెట్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఏఈఓలు రైతు వేదికల్లో రైతులకు పత్తి పాకెట్లు దాదాపుగా అందజేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైతులు పత్తి సాగు విధానం వల్ల కేవలం ఎకరానికి 6–7 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వస్తుందని అంచనా. విత్తు విత్తే విధానం వల్ల కేవలం హెక్టారుకు 15– 20 వేల మొక్కలు మాత్రమే వస్తాయి. దీంతో దిగుబడి తక్కువ రావడంతోపాటు మూడు, నాలుగు పర్యాయాలు పంటను తీస్తారు. ఫలితంగా దిగుబడి తక్కువతోపాటు రెండో పాటు వేరుశనగ, మొక్క జొన్న ఇతరత్రా పంటలు వేసుకోవడానికి ఆలస్యమవుతుంది. అధిక సాంధ్రత పద్ధతి (హెచ్డీపీఎస్)లో 90:15 సెం.మి., విధానంలో విత్తనాలు విత్తాలి. ఇందుకు ఎకరానికి ఆరుపాకెట్లు అవసరమవుతాయి. హెక్టారుకు దాదాపు 74 వేల మొక్కలు పెరుగుతాయి. క్లోజర్ స్పేసింగ్ (సిఎస్) పద్ధతిలో 90:30 సెం.మి., నాలుగు పాకెట్ల విత్తనాలు సరిపోతాయి. హెక్టారుకు 37 వేల మొక్కలు వస్తాయి. మొక్కలు అధికంగా ఉండటం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. ఎకరానికి 12–14 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా. ఈ కొత్త విధానం వల్ల ఒకేసారి పత్తి దిగుబడి వస్తుంది. పంట తీయడానికి సులువుగా ఉండటంతోపాటు పంటకాలం ఒకేసారి ముగిసిపోతుంది. దీంతో రైతులు సకాలంలో రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
బాలలపై లైంగిక వేధింపులు అరికట్టాలి : ఎస్పీ
కందనూలు: బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విద్యాశాఖ, షీటీం, భరోసా, చైల్డ్ అండ్ వెల్ఫేర్, లేబర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టాలని సురక్షిత బాల్యాన్ని సమాజానికి అందించాలని పేర్కొన్నారు. అనంతరం మిషన్ వాత్సల్య పథకం వాల్పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీసీఎస్ఐ శంకర్, డీసీఆర్బీ ఎస్ఐ రమేష్, భరోసా ఎస్ఐ రజిత తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ఎంపిక పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పూర్ణిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు htt ps://navodaya.gov.in వెబ్సైట్లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న ఆయా జిల్లాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి కందనూలు: ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నిర్వహించే వామపక్షాల బంద్ను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి తారాసింగ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బందు వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికి వదిలేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తుందని, స్వయంగా సీఎం ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ప్రారంభోత్సవాలకు వెళ్లడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి శివప్రసాద్, హేమంత్, మధు, శివ తదితరులు పాల్గొన్నారు. 14న అప్రెంటిస్షిప్ మేళా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సు (2024, 2025, 2026 విద్యా సంవత్సరం)లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 14న అప్రెంటిస్షిప్ మేళా ఉంటుందని మేళా కో–కన్వీనర్ ఎం.జంగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జరిగే ఈ మేళాలో హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వివిధ ప్రైవేటు కంపెనీలు, ఆస్పత్రులు, సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ పదోతరగతి, ఇంటర్ మెమోలు, ఆధార్ కార్డు జిరాక్స్లతో పాటు పాస్పోర్టు సైజ్ ఫొటోలను తీసుకురావాలని, ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలమూరు వెంకన్నబ్రహ్మోత్సవాలు ప్రారంభం స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం శ్రీకంచికామకోటి పీఠం పాలమూరుశాఖ 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతిపూజ, గోపూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరుణ పూజ, గోపూజ, కంకణధారణ, యాగశాల ప్రవేశం, గరుడ ధ్వజారోహణం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం వేదపారాయణం, పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారికి శేషవాహన సేవ నిర్వహించారు. శివాలయంలో నంది వాహన సేవ, నీరాజనం, మంత్రపుష్సాలు, చతుర్వేద స్వస్తీ పూజలు చేశారు. ప్రతి రోజు వివిధ సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ తెలిపారు. -
రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు
కొల్లాపూర్ రూరల్: రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన మండలంలోని సోమశిలలో కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి గ్రామాలకు చెందిన రైతుల భూ సమస్యపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్తో కలిసి ఫారెస్టు, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రైతుల సమక్షంలోనే ఒక్కో సమస్యను పరిశీలిస్తూ.. అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో గ్రామానికి చెందిన రైతులను విడివిడిగా పిలిపించి వారి సమస్యలను మంత్రి స్వయంగా ఆలకించారు. ప్రతి కేసు ప్రస్తుతం ఏ దశలో ఉందో.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని అటవీ శాఖ నిబంధనలతో, మరికొన్ని రెవెన్యూ రికార్డుల్లో లోపాలతో, ఇంకొన్ని ప్రాంతాల్లో సర్వే నంబర్ల వివాదాల వల్ల రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు హక్కులు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతు భూమి రైతుకు జీవనాధారం అని, అలాంటి భూములకు సంబంధించిన వివాదాలు ఏళ్ల తరబడి కొనసాగడం వల్ల రైతులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కాబట్టి వారిని కార్యాలయాల చుట్టూ తిరిగించుకోకుండా అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించేలా చూడాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతు రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్బుక్లు, పాత పట్టాలు, సర్వే నంబర్లు, హద్దులు, సరిహద్దుల వివరాలు అందుబాటులో ఉన్న ఇతర రికార్డులను సంబంధిత ఆర్డీఓ కార్యాలయానికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రేవంత్చంద్ర, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల పరుగులు
పాలమూరులో వనపర్తి– జడ్చర్ల ప్రధాన రహదారిలో బుద్దారం నుంచి మరికల్ వరకు 33 కి.మీ., రోడ్డును 10 మీటర్లుగా విస్తరించి ఆధునికీకరించనున్నారు. వనపర్తి– బుద్దారం 11.60 కి.మీ., రోడ్డు స్టెతన్ చేయనున్నారు. మంగనూర్ నుంచి తెలకపల్లి వరకు 45.50 కి.మీ రోడ్డును ఆధునికీకరించేందుకు టెండర్లు ఆహ్వానించారు. బల్మూర్– నాగర్కర్నూల్ (పీడబ్ల్యూడీ) 13 కి.మీ., రోడ్డును రెండు వరుసలుగా విస్తరిస్తారు. అచ్చంపేట– రాకొండ రహదారిలో ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్, మామిళ్లపల్లి, రాకొండ వరకు 28.40 కి.మీ మేర రెండు వరుసలుగా నిర్మిస్తారు. అమ్రాబాద్– మద్దిమడుగు రహదారిలో పదర, వంకేశ్వరం, చిట్లంకుంట, ఉడిమిళ్ల, ఇప్పలపల్లి వరకు 34.20 కి.మీ., సింగిల్ రోడ్డును రెండు వరుసలుగా విస్తరిస్తారు. పెంట్లవెల్లి ఎక్స్రోడ్డు నుంచి వనపర్తి మార్గంలో కొండూరు, తూంకుంట మీదుగా వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ వరకు 0 నుంచి 3 కి.మీ., మేర రెండు వరుసలుగా విస్తరణ, 3 నుంచి 28.16 కి.మీ వరకు డబుల్ లైన్ తారు పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. చిన్నంబావి– చెల్లెపాడు 14.20 కి.మీ., రోడ్డును ఆధునికీకరించనున్నారు. కొల్లాపూర్– వనపర్తి మధ్య కేతేపల్లి నుంచి వీపనగండ్ల వరకు 11.10 కి.మీ., సింగిల్ రోడ్డును డబుల్గా విస్తరించనున్నారు. వనపర్తి– ఆత్మకూర్ రహదారిలో పరిధిలో 0 నుంచి 8 కి.మీ., దేవరకద్ర నియోజకవర్గంలో 8 నుంచి 27 కి.మీ., రోడ్డును బీటీగా మారుస్తారు. మక్తల్ నియోజకవర్గ పరిధిలో వనపర్తి– ఆత్మకూర్ రోడ్డులోని 27.కి.మీ నుంచి 31 కి.మీ., వరకు, ఆత్మకూర్– మర్రికల్ రోడ్డు 13.40 కి.మీ., విస్తరిస్తారు. అలంపూర్– అయిజ, ఎరిగేర 57 కి.మీ, గద్వాల– ఎర్రవల్లి 9 కి.మీ., బలిగెర– మాచర్ల 5 కి.మీ., గద్వాల– రాయచూర్ 22 కి.మీ., గట్టు– మాచర్ల 5 కి.మీ., 6 ప్రధాన రహదారులను హ్యామ్ పద్ధతిలో విస్తరించనున్నారు. మహబూబ్నగర్– నవాబ్పేట 18.30 కి.మీ., జడ్చర్ల– మాచారం 20 కి.మీ., మరికల్– మినాస్పూర్ (ధన్వాడ, లింగంపల్లి మీదుగా) 37.68 కి.మీ., మక్తల్– నారాయణపేట (ఊట్కూర్ మీదుగా) 25.68 కి.మీ., రాజాపూర్– తిర్మలాపూర్ 10 కి.మీ., మహబూబ్నగర్– మంగనూర్, వేపూర్ జెడ్పీ రోడ్డు– కొమిరెడ్డిపల్లి (షేక్పల్లి, కురుమూర్తి టెంపుల్ రోడ్డు), గుడిబండ– తిర్మలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్కొండ (మల్కాపూర్, మణికొండ మీదుగా), జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్త మొల్గర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థను గణనీయంగా మెరుగుపరిచి.. ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయని ఆశిస్తున్నారు. అచ్చంపేట: ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా.. మౌలిక సదుపాయాలు కావాలన్నా.. పెట్టుబడులు రావాలన్నా.. మెరుగైన రోడ్డు, రవాణా సదుపాయాలు ఉండాలి. ఈ మేరకు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో రహదారులను విస్తరించడంతోపాటు మరమ్మతు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల టెండర్లకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా హ్యామ్ విధానం ద్వారా రహదారులను అభివృద్ధి చేయనుంది. దీంతో జిల్లాలో ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్ల ముఖచిత్రం మారబోతోంది. ఇందులో భాగంగా మొదటి దశలో మహబూబ్నగర్ ఆర్అండ్బీ సర్కిల్లో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలోని 26 రోడ్ల నిర్మాణానికి సంబంధించి 2 ప్యాకేజీల్లో మొత్తం 378.04 కి.మీ., మేర రోడ్లను నిర్మించనున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.912.67 కోట్లు మంజూరు చేస్తూ టెండర్లు ఆహ్వానించింది. అలాగే వనపర్తి సర్కిల్లో వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో మొదటి దశలో 18 రహదారులను 2 ప్యాకేజీల కింద ఎంపిక చేసిన మొత్తం 319.4 కి.మీ., మేర నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.697.77 కోట్లు కేటాయించారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి కాగా చివరి దశలో ఉంది. 2028 నాటికి నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను చేపట్టింది. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం ప్రభుత్వం ముందుగా భరిస్తోంది. మిగిలిన 60 శాతం నిధులు కాంట్రాక్టర్లు బ్యాంకు ద్వారా రుణం పొంది రోడ్లను నిర్మిస్తారు. బిల్లులకు ఇబ్బందులు లేకుండా ఆర్బీఐతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టర్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లిస్తుంది. ఈ విధానం ప్రకారం కాంట్రాక్టర్ నిర్మించిన రహదారులను 15 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుంది. హ్యామ్ రోడ్లలో ఉమ్మడి జిల్లాకు పెద్దపీట నాలుగు ప్యాకేజీల కింద 697.44 కి.మీ., మేర ఆధునికీకరణ రూ.1,610.44 కోట్లతో 44 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రణాళిక ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం మారనున్న గ్రామీణ ప్రాంత రహదారుల ముఖచిత్రం -
నేడు చేనేత సహకార సంఘాల ఎన్నికలు
అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. శుక్రవారం ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు వెల్లడించారు. అమరచింత సహకార సంఘంలో 760 ఓట్లు ఉండగా.. మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 250 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు 14 మంది సిబ్బందిని కేటాయించారు. అదేవిధంగా కొత్తకోట చేనేత సహకార సంఘంలో 78 మంది ఓట్లు ఉండగా.. ఒకే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రొసీడింగ్ అధికారితో పాటు నలుగురు సిబ్బందిని నియమించారు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల దూరం వరకు దుకాణాలు తెరవకుండా ముందస్తు సమాచారం ఇచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కోరినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. సాయంత్రం ఫలితాలు వెల్లడించి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక ఉంటుందని రిటర్నింగ్ అధికారి వివరించారు. -
విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి..!
కొల్లాపూర్ (నాగర్ కర్నూలు జిల్లా): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే సమాజం తలదించుకునే పనిచేశాడు. స్వలింగ సంపర్కానికి బానిసై కళాశాలలోని విద్యార్థులను టార్గెట్ చేసుకున్నాడు. ఆర్థికంగా, చదువులో వెనుకబడిన అబ్బాయిలపై నిఘా ఉంచి వారిని తన పైశాచికత్వానికి వాడుకొని సమాజానికి తలవంపులు తెచ్చేలా చేశాడు కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్. మంగళవారం రాత్రి ఆధారాలతో సహా అతడి విశృంఖలత్వం వెలుగులోకి వచ్చింది అయినా.. అతడిని విధుల నుంచి తప్పించే విషయంలో పాలమూరు యూనివర్సిటీ అధికారులు మీనమేషాలు లెక్కపెట్టడం విచారకరం. A shocking incident came to light where a principal of the PG College in Kollapur town of Nagarkurnool district, in Telangana, allegedly attempted to sexually assault a student who had come to collect his transfer certificate, and in the process, the student bit the man’s… pic.twitter.com/B8i7ZnEUdb— Hate Detector 🔍 (@HateDetectors) July 9, 2026ఇదీ విషయం.. కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్గా విధుల నిర్వహిస్తున్న మార్క్ పోలోనియస్ సిబ్బందితో పాటు విద్యార్థులపై కూడా ఎప్పుడూ కఠిన వైఖరితో ఉండేవాడు. అవివాహితుడైన ఆయన పట్టణంలోని బండాయిగుట్ట సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. జగిత్యాలకు చెందిన ఓ విద్యార్థిని లోబర్చుకొని గతంలో రెండు పర్యాయాలు అతడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. 2025లో పీజీ పూర్తి చేసుకున్న సదరు విద్యార్థి టీసీ, ఇతర సర్టిఫికెట్ల కోసం రెండు రోజుల క్రితం మళ్లీ కళాశాలకు వచ్చాడు. తనతో గడిపితేనే సర్టిఫికెట్లు ఇస్తానని బెదిరించడంతో.. గత్యంతరం లేక సదరు విద్యార్థి ప్రిన్సిపల్ రూముకు మంగళవారం రాత్రి 7 గంటలకు వెళ్లి వచ్చాడు. రాత్రి 10 గంటలకు మళ్లీ రావాలని చెప్పడంతో ప్రిన్సిపాల్ లైంగిక హింసను తట్టుకోలేక ఆ విద్యార్థి తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని పీజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులతో చెప్పుకొని రోదించాడు. ప్రిన్సిపల్ అఘాయిత్యాలను బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ రూమ్ వద్దకు వెళ్లారు. జగిత్యాల విద్యార్థి రూములోకి వెళ్లిన వెంటనే అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఆ విద్యార్థి ప్రిన్సిపల్ ప్రైవేటు పార్ట్ని నోటితో కొరికి గట్టిగా కేకలు వేశాడు. తన మిత్రులను లోపలికి రావాలని పిలిచాడు. ఈ ఘటనతో భయపడిన ప్రిన్సిపల్ తన గదిలోని బాత్రూంలో దాక్కొని గడియపెట్టుకున్నాడు. అప్పటికే ప్రిన్సిపల్ కీచక పర్వాన్ని ఫోన్లో రికార్డు చేసి దాన్ని తీసుకొని విద్యార్థులు నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసుల అదుపులో ప్రిన్సిపల్ లైంగిక దాడి ఘటన తర్వాత ఇంటినుంచి పరారైన ప్రిన్సిపల్ మార్క్పోలోనియస్ కొల్లాపూర్లోని బొంగరాలమిట్ట ప్రాంతంలో గల ఓ ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకొని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. రిజిస్ట్రార్ ప్రకటనపై విస్మయం విద్యార్థిపై లైంగిక దాడి, ప్రజా సంఘాల నాయకుల ఆందోళనతో పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ రమేష్ బాబు, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి కొల్లాపూర్ పీజీ సెంటర్ వద్దకు బుధవారం ఉదయం చేరుకున్నారు. ఆందోళన చేపట్టిన వారితో మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. లైంగికదాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, విచారణ అనంతరం చర్యలు చేపడతామన్నారు. రిజిస్ట్రార్ ప్రకటనపై విద్యార్థులు విస్మయం వ్యక్తం చేశారు. బాధ్యత గల ప్రిన్సిపల్ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన కనీసం సస్పెండ్ కూడా చేయకుండా, విచారణ పేరుతో కాలయాపన చేయడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘పవర్’ పాలి‘ట్రిక్స్’..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జోగుళాంబ గద్వాల జిల్లా విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో బదిలీల లొల్లి తారస్థాయికి చేరింది. సూపరింటెండెంట్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్ అయ్యే ఒక్క రోజు ముందు జిల్లా స్థాయిలో చేసిన బదిలీలు వివాదాస్పదంగా మారాయి. విద్యుత్ సంస్థలో బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ.. ఏకపక్షంగా చేపట్టారని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు ఎస్ఈ సీటు ఆరు రోజులుగా ఖాళీగా ఉండడం.. కనీసం ఇన్చార్జిగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. గద్వాల సర్కిల్ సూపరిండెంట్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి జూన్ 30వ తేదీన హైదరాబాద్కు బదిలీ కాగా.. ఈ నెల ఒకటో తేదీన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. అయితే ఎస్ఈ బదిలీ ఉత్తర్వుల కంటే కంటే ఒక రోజు ముందే డిస్పాచ్లతో ఇద్దరు జేఏఓలు, ఒక లైన్మన్, ఒక ఆర్టీజన్కు బదిలీ చేసినట్లు.. ఈ నెల 2వ తేదీన విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఆర్టీజన్ ఫీల్డ్లో పని చేయాల్సి ఉంటుంది. కానీ సిస్టం వర్క్ వస్తదనే కారణంతో ఎస్ఈ కార్యాలయంలో చేస్తున్నారు. తాజాగా మళ్లీ స్టోర్ రూమ్కు బదిలీ కావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. 3 రోజులుగా ఆందోళనలు.. ఎస్ఈ బదిలీ అయిన తర్వాత పాత తేదీలతో తనకు అనుకూలంగా ఉన్న కిందిస్థాయి సిబ్బందిని ఏకపక్షంగా వ్యహరించి బదిలీ చేయడం అక్రమమంటూ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. గద్వాల సర్కిల్లో అక్రమ బదిలీలను నిలిపివేయాలంటూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయం వద్ద ఉద్యోగులు మూడు రోజులుగా పోరు కొనసాగిస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్కు వెళ్లారు. అయితే సీఎం మీటింగ్ ఉందంటూ దాటేస్తూ సీఈ కలవలేదని సమాచారం. 6 రోజులుగా కుర్చీ ఖాళీ.. గత నెల 30న గద్వాల ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి బదిలీపై వెళ్లారు. అయన స్థానంలో వేణుగోపాల్ పదోన్నతిపై ఇక్కడికి రావాల్సి ఉంది. కానీ ఆయన జాయిన్ కాలేదు. ఈ క్రమంలో సీఈ ఇన్చార్జిగా వ్యవహరించడం ఆనవాయితీ. లేదంటే కనీసం అక్కడున్న డీఈకి తాత్కాలికంగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకూ ఎవ్వరికీ బాధ్యతలు అప్పగించకపోవడం.. ఆరు రోజులుగా ఎస్ఈ కుర్చీ ఖాళీగా ఉండడం.. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేస్తుండడంతో పలు సమస్యలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. గద్వాల విద్యుత్ శాఖలో హైటెన్షన్ ఇటీవల సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి బదిలీ ఒక్కరోజు ముందు తేదీతో జిల్లాస్థాయిలో నలుగురికి ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా వివక్షతో వ్యవహరించారని ఉద్యోగ సంఘాల ఆగ్రహం ఆ సీనియర్ అధికారే కారణమా? గద్వాల సర్కిల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న బదిలీలకు సర్కిల్లోని అకౌంట్ సెక్షన్లో ఉన్న ఓ సీనియర్ అధికారి కారణమనే చర్చ విద్యుత్ ఉద్యోగుల్లో జరుగుతోంది. గతంలో గద్వాల డివిజన్ కార్యాలయంలో ఉన్న ఓ అధికారిణి సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని ఆ డివిజన్ డీఈ ఫిర్యాదు చేస్తే.. సదరు సీనియర్ అధికారి తన పలుకుబడితో ఎస్ఈ ద్వారా తన సెక్షన్కు బదిలీ చేయించారనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా వివాదంగా మారిన బదిలీల్లో ఆ సీనియర్ అధికారి హస్తమే ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ 1,860 మంది ఎవరు?
అందుబాటులో లేని చేయూత పింఛన్ లబ్ధిదారులు పింఛన్ లబ్ధిదారులు కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేయూత సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ (లైవ్ ఆథెంటికేషన్) ప్రక్రియ రెండు రోజుల క్రితం పూర్తయింది. బోగస్ పింఛన్ల ఏరివేత, మరణించిన వారిని గుర్తించేందుకు చేపట్టిన ఈ ప్రక్రియలో బయటపడిన వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో లబ్ధిదారుల ఆచూకీ లభించకపోవడం.. మరికొందరు మరణించినా పింఛన్ సొమ్ము పొందుతున్నట్లు తేలింది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1,02,976 మంది చేయూత పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 58,700 మంది పోస్టాఫీస్, పంచాయతీ కార్యదర్శుల ద్వారా పింఛన్ సొమ్ము పొందుతుండగా.. 44,276 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతోంది. వేల సంఖ్యలో బోగస్..? జిల్లాలో చేయూత పింఛన్ లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ లెక్కల ప్రకారం 2,373 మంది మరణించినట్లు గుర్తించారు. మరో 1,860 మంది లబ్ధిదారుల ఆచూకీ అధికారులకు లభించలేదు. వారి ఇళ్లకు సిబ్బంది వెళ్లినప్పటికీ అందుబాటులో లేరని తెలిసింది. ఇంతకాలం పింఛన్లు పొందుతున్న వారి ఆచూకీ అధికారులకు సైతం లభించకపోవడం గమనార్హం. మరో 45 మంది లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ పూర్తి కాలేదు. వివిధ కారణాలతో నమోదు కాకపోవడంతో మరోసారి వారిని సంప్రదించి.. ప్రక్రియ పూర్తి చేయనున్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు.మండలాల్లో మరణించిన వారు 1,690 ఇంకా లభించని వారు 667కొత్త అర్హులకు మార్గం.. ముఖ గుర్తింపు ప్రక్రియ పూర్తికావడంతో అనర్హుల పేర్ల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఖాళీ అయ్యే పింఛన్ల స్థానంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న అర్హులైన వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు చేయూత పింఛన్లు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో పూర్తయిన లైవ్ అథెంటికేషన్ 2,373 మంది మృతిచెందినట్లు గుర్తింపు మరో 45మంది ప్రత్యక్ష ధ్రువీకరణ కాని వైనం ఏళ్లుగా డేటా నవీకరణలో జాప్యం గుర్తింపునకు వస్తే కొనసాగిస్తాం.. జిల్లాలో ఇంకా 1,860 మంది లైవ్ అథెంటికేషన్కు సంబంధించి ఆచూకీ లభించడం లేదు. లబ్ధిదారులు సంబంధిత గ్రామం, మున్సిపాలిటీలో అధికారులను సంప్రదిస్తే ప్రత్యక్ష ధ్రువీకరణ పూర్తిచేసి.. చేయూతలో కొనసాగిస్తారు. లేదంటే పింఛన్ నిలిచిపోతుంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించి.. వారి తదు పరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – రాజేశ్వరి, అడిషనల్ డీఆర్డీఓ -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
కల్వకుర్తి టౌన్/ఉప్పునుంతల: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని డీఈఓ రమేశ్కుమార్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి పాఠశాల నిర్వహణ, కల్పిస్తున్న సౌకర్యాలు, హాస్టల్ నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలుచేయాలని కేజీబీవీ సిబ్బందికి సూచించారు. వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని తెలిపారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఉప్పునుంతల మండలం తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆయన టై, బెల్టులను పంపిణీ చేశారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. డీఈఓ వెంట ఎంఈఓలు శంకర్ నాయ క్, శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ అలివేలమ్మ, కేజీబీవీ ఎస్ఓ రమాదేవి, హెచ్ఎం రామస్వామి ఉన్నారు. -
నేడు జిల్లాలో మంత్రుల పర్యటన
కల్వకుర్తి/కందనూలు: జిల్లాలో బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎకై ్సజ్, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. మొదట తిమ్మాజిపేటలోని ఆర్టీసీ బస్టాండ్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం జిల్లాకేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయ నూతన భవనం, కొత్తబస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. నాగర్కర్నూల్–వనపర్తి మధ్య నూతన బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు. సాయంత్రం కొల్లాపూర్కు చేరుకుని బస్టాండ్లో క్రూ రెస్ట్రూమ్ల నిర్మాణం, పెంట్లవెల్లి బస్టాండ్ ప్రాంగణంలో సీసీ, నూతన మరుగుదొడ్లు తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. -
ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం తగదు
కొల్లాపూర్: ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ అన్నారు. మంగళవారం ఆయన కొల్లాపూర్లో విలేకర్లతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి రెవెన్యూ శివారు పరిధిలోని పోడుభూముల సమస్యను మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. సురభి రాజవంశస్థులకు చెందిన భూములపై సీలింగ్ యాక్టును అమలుచేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోడుభూములు సాగుచేస్తున్న గిరిజనులందరికీ పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించిందని.. ఇప్పుడు వాటిని భర్తీచేయకుండా కేవలం 5వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ప్రకటించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సీఎంతో పాటు మంత్రులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, పట్టణ కార్యదర్శి యూసూఫ్, జంగం శివుడు, రామకృష్ణ, రాజు తదితరులు ఉన్నారు. -
ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు!
ఆత్మకూర్: వానాకాలం ప్రారంభమై నెల గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు పడిన దాఖలాలు లేవు. ఫలితంగా చెరువులు, కుంటల్లో నీటిమట్టం క్రమంగా తగ్గిపోతోంది. భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు ఏకంగా 2 టీఎంసీలకు పడిపోగా.. రామన్పాడు రిజర్వాయర్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. వర్షాలు పడకపోతే తాగునీటి ముప్పు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవిలో తాగునీటి ఇబ్బందులు రానీయకుండా మిషన్ భగీరథ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. కానీ ప్రస్తుతం ఎండల తీవ్రత, గాలుల వేగానికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మంది అవసరాలు తీర్చేందుకు నిత్యం మిషన్ భగీరథ పథకం ద్వార 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీలకు 27.6 ఎంఎల్డీ (మిలియన్ లీటర్లు ఫర్ డే), గ్రామాలకు 48.435 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్పైనే తాగునీటి పథకాలు కొనసాగుతున్నాయి. జూలైలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యమ్నాయంగా మార్గాలను చూసుకుంటూ బోర్లు, చేతిపంపులు, ట్యాంకర్లను సిద్ధం చేశామని అధికారులు పేర్కొంటున్నారు. తాగునీటి పథకాలకు సరఫరా ఇలా.. 2 టీఎంసీలకు పడిపోయినజూరాల నిల్వలు రామన్పాడులోనూ అదే పరిస్థితి చెరువులు, కుంటల్లో తగ్గిన నీటిమట్టం నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటి సరఫరా -
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి
అమ్రాబాద్: మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి.. సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తిచేయాలని హౌసింగ్ పీడీ గోపాల్నాయక్ సూచించారు. మంగళవారం అమ్రాబాద్ మండల కేంద్రంతో పాటు మాధవానిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షలో పీడీ మాట్లాడారు. దశల వారీగా ఇళ్ల నిర్మాణాలకు సకాలంలో బిల్లులు అందుతున్నాయని.. లబ్ధిదారులు గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకునేలా చూడాలన్నారు. అదే విధంగా రెండో విడత ఇళ్ల మంజూరుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. సమావేశంలో డీఈ హరినాయక్, ఎంపీడీఓ రామన్న, ఏఈ కృష్ణ ఉన్నారు. నూనె గింజల సాగుతో అధిక లాభాలు మన్ననూర్: నూనె గింజల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డా.సురేశ్ అన్నారు. జాతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మన్ననూర్ రైతువేదికలో నూనె గింజల పంటలపై ఆదివాసీ గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ మండలంలో రైతులు సాగుచేస్తున్న పంటలు, ఆశిస్తున్న లాభాలు తదితర వివరాలను తెలుసుకున్న శాస్త్రవేత్తలు.. కుసుమలు, ఆముదాలు, పొద్దుతిరుగుడు, నూగు లు, వేరుశనగ తదితర పంటల సాగుతో రైతు లకు కలిగే ప్రయోజనాలను వివరించారు. వాణిజ్య పంటలకు ఏమాత్రం తీసిపోకుండా నూనె గింజల సాగుతో లాభాలు వస్తాయని తెలిపారు. నూనె గింజల సాగుకు అవసరమైన విత్తనాలను సంస్థ తరఫున అందిస్తామని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ మహేశ్రెడ్డి, సర్పంచ్ మంజుల, రాజారాం, ఎంఏ రహీం, రమణ గౌడ్, హన్మంత్రెడ్డి, ఏఈఓ దేవి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మన్ననూర్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) మన్ననూర్లోని ఐటీఐ, ఏటీసీల్లో శిక్షణ కోసం 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోపా, డ్రాప్ట్మెన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటర్ మెకానిక్ ట్రేడ్లతో పాటు ఏటీసీలోని పలు కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 85004 61013 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. -
కల్తీపై కంట్రోల్ ఏదీ?
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో కలుషిత ఆహారంతో అనారోగ్యాలకు గురవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, పెళ్లి వేడుకల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫుడ్ పాయిజన్తో అధికంగా చిన్నారులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు కలుషితమైన ఆహారం తీసుకున్న రెండు గంటల్లో అస్వస్థతకు గురవుతారు. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా చల్లబడిన వాతావరణం బ్యాక్టీరియా ఎదుగుదలకు అనుకూలంగా ఉండి.. వ్యాధులు విస్తరిస్తాయి. ఈ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్లు, పాఠశాలలు, వసతి గృహాల్లో వంటగదులు శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన ఆహార భద్రతా అధికారులు సరిపడా లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇదే అదునుగా హోటళ్లు, రెస్టారెంట్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నిల్వ చేసిన పదార్థాలకు మసాలాలు దట్టించి వినియోగదారులకు అంటగడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ ఫుడ్ ఇన్స్పెక్టర్లను పర్యవేక్షిస్తారు. అయితే మహబూబ్నగర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీలతకు నాగర్కర్నూల్ జిల్లా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ రెండు కూడా పెద్ద జిల్లాలు కావడంతో నమూనాల సేకరణ, తనిఖీలు చేయడం కష్టసాధ్యంగా మారింది. దీనికితోడు సీఎం పర్యటనలు, ఉన్నతాధికారులు, కలెక్టర్ సమావేశాలు అంటూ కొన్నిరోజులు గడిచిపోతున్నాయి. గద్వాల జిల్లాకు రెగ్యులర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఉండగా ఆయనకు అదనంగా వనపర్తి జిల్లా బాధ్యతలు అప్పగించారు. అలాగే నారాయణపేట రెగ్యులర్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా మౌనిక వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆహార భద్రత అధికారులు సరిపడా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇటీవల జరిగిన కలుషిత ఆహార ఘటనలో శాంపిల్స్ సేకరించాం. ఇందులో సోరకాయతో తయారు చేసిన స్వీట్ 5– 6 గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ తర్వాత స్వీట్లో లోపల ఫంగస్, బ్యాక్టీరియా వస్తుంది. దీనివల్ల తిన్నవారికి వాంతులు, విరేచనాలు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆహారం వండిన తర్వాత 6–8 గంటల వరకు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సమయం ఉంటే టాక్సిల్స్ ఏర్పడుతాయి. కలుషిత ఆహారంపై గత నెల 18న అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చాం. ఇటీవల తనిఖీలు పెంచడంతోపాటు శాంపిల్స్ సేకరిస్తున్నాం. కలుషిత ఆహారంపై కూడా అవగాహన కార్యక్రమాలు పెంచుతాం. – శ్రీలత, ఫుడ్ ఇన్స్పెక్టర్, మహబూబ్నగర్ పాలమూరులో కలవరపెడుతున్న కలుషిత ఆహార ఘటనలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు అత్యధికంగా నిల్వ చేసిన పదార్థాలతోనే వినియోగదారులకు వడ్డింపు ఉమ్మడి జిల్లాకు ముగ్గురే ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కనిపించని తనిఖీలు మున్సిపాలిటీల్లో శానిటరీ విభాగాలదీ అదే తీరు -
సంక్షేమ వసతిగృహాలపై పటిష్ట పర్యవేక్షణ
కందనూలు: జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు నాణ్యతగా అమలవుతున్నాయా.. లేదా అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లావ్యాప్తంగా 28 బీసీ సంక్షేమశాఖ వసతిగృహాల్లో వివిధ శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతి అధికారి తనకు కేటాయించిన వసతిగృహాన్ని పరిశీలించడంతో పాటు విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వసతిగృహాల్లోని పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులు, సిబ్బంది హాజరు తదితర అంశాలపై సమగ్ర నివేదికలను ఆన్లైన్ ద్వారా కలెక్టర్కు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. సంక్షేమ వసతిగృహాలు పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్కు బలమైన పునాది వంటివని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి సౌకర్యం పూర్తిస్థాయిలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని.. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని.. విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, రాత్రి భోజనం, పాలు, గుడ్లు, పండ్లు తదితర పోషకాహార పదార్థాలు నిర్ణీత ప్రమాణాల ప్రకారం అందుతున్నాయా లేదా అనేది ప్రత్యేకంగా పరిశీలించాలని తెలిపారు. అదే విధంగా వసతిగృహాల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్ల పరిశుభ్రత, స్నానాల గదులు, పడకలు, పరుపులు, ఫ్యాన్లు, లైట్లు, వంటశాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్యసేవలు, విద్యార్థుల హాజరు, వార్డెన్లు, ఇతర సిబ్బంది విధి నిర్వహణ వంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తనిఖీల్లో అధికారులు సమర్పించిన నివేదికల్లో గుర్తించిన లోటుపాట్లపై వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత సంక్షేమ వసతిగృహాల వార్డెన్లు, బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారిణి ఇందిరను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దేవసహాయం, అరుణారెడ్డి, డీఆర్వో పాండు తదితరులు ఉన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను జాతీయస్థాయిలో గుర్తించి, సత్కరించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేశ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ నెల 10వ తేదీలోగా http://nationalaward sotŠreacherr. education.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 90101 92288 నంబర్ను సంప్రదించాలని ఆయన తెలిపారు. అక్రమాలపై విచారణ జరపాలి కందనూలు: మొక్కజొన్న కొనుగోళ్లలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై అంబేడ్కర్ సాక్షిగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతును రాజును చేస్తామని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, అక్కడి నుంచి కలెక్టరేట్కు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి శ్రీశైలం, ప్రదీప్, మాధవరెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. పెంపుడు జంతువులతో అప్రమత్తంగా ఉండాలి కందనూలు: పెంపుడు జంతువులతో ప్రబలే వ్యాధుల బారినపడకుండా పెంపకందారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డా.కృష్ణ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయ ప్రాంగణంలో పెంపుడు కుక్కలకు యాంటీ రాబిస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుక్కలు, పిల్లులు, కోతులు తదితర జంతువులు కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే సబ్బు నీటితో శుభ్రంగా కడిగి, సమీపంలోని ఆరోగ్యకేంద్రంలో యాంటీ రాబిస్ టీకా వేయించుకోవాలని సూచించారు. జంతువుల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాబిస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, కోవిడ్ 19, ఆంత్రాక్స్, లెప్టో స్ప్రేరోసిస్ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ముందుజాగ్రత్త పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.జ్ఞానేశ్వర్, ప్రోగ్రాం అధికారి డా.కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు అన్ని వసతులు తిమ్మాజిపేట: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు మహబూబ్నగర్ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ అన్నారు. సోమవారం తిమ్మాజిపేట బస్టాండ్ను ఆయన పరిశీలించారు. నాగర్కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య, స్థానిక దాతల సహకారంతో ఇటీవల బస్టాండ్ను పునరుద్ధరించగా.. బస్టాండ్ ప్రాంగణం, పరిసరాల్లో సీసీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి రూ. 39లక్షలు మంజూరు చేయించారు. ఈ నెల 8న జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా సీసీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించగా.. ఆర్ఎం బస్టాండ్ను సందర్శించి పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర టెలికాం బోర్డు సభ్యుడు శ్రీనివాస్ బహదూర్, లక్ష్మీనారాయణ, కంట్రోలర్ తిరుపతయ్యగౌడ్, రాములు ఉన్నారు. -
నివృత్తి చేస్తున్నాం..
సర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపుగా పూర్తికావొచ్చింది. వాటిని పూరించడంపై బీఎల్ఓలు, రెవెన్యూ అధికారులు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్లకు కలిగే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. డబుల్ ఓట్లు కలిగిన వారు ఒకే దగ్గర ఉండేలా చూసుకోవాలి. బీఎల్ఓలు ఫారాలు తీసుకునేందుకు ఇంటికి వెళ్లి సేకరించి, ఫారాలను నింపుతున్నారు. విద్యావంతులు, రాజకీయ పార్టీల బూత్స్థాయి ఏజెంట్లు సహకరించినట్లయితే ఓటరు జాబితా ఆన్లైన్ చేయడం సులభతరం అవుతుంది. ప్రతి దరఖాస్తును క్షేత్రస్తాయిలో జాగ్రత్తగా పరిశీలించి.. పొరపాట్లకు తావులేకుండా చూస్తున్నాం. – యాదగిరి, ఆర్డీఓ, అచ్చంపేట -
భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి
● రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దు ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కల్వకుర్తి/కొల్లాపూర్: భూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్తో కలిసి రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో భూ సమస్యలపై సమీక్షించారు. జిల్లాలో భూ భారతి దరఖాస్తులు, అటవీ సమస్యల పరిష్కారం, వనమహోత్సవంపై చర్చించారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని.. కొల్లాపూర్ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయ లోపంతో సమస్యలు పెండింగ్లో ఉండొద్దని సూచించారు. అంతకుముందు కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై ఆర్డీఓ భన్సీలాల్, తహసీల్దార్లతో చర్చించారు. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఫైళ్లను ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పంపుతున్నారు తప్ప.. ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వ అవసరాలకు భూసేకరణ చేపట్టడంలో జరుగుతున్న జాప్యంపై అసహనం వెలిబుచ్చారు. రైతులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరైంది కాదన్నారు. అనంతరం పలు రికార్డులను ఆయన అధికారుల సమక్షంలోనే పరిశీలించారు. పోడు భూములు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, లావునీ పట్టాలు, హార్టికల్చర్ కళాశాల, పర్యాటక భవనాల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ, మొదలైన 16 అంశాలపై సమీక్షలో చర్చించారు. కాగా, మంత్రి జూపల్లి కృష్ణారావు అటవీ భూములకు పట్టాలు ఇప్పిస్తున్నారని ప్రచారం జరగడంతో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్దసంఖ్యలో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు. తమకు పట్టాలు ఇప్పించాలని వారు మంత్రికి విన్నవించారు. దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా కొల్లాపూర్లో ఆయన విగ్రహానికి మంత్రి జూపల్లి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గానికి చెందిన జగ్జీవన్రామ్ దేశ ఉపప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కాలినడకే శరణ్యం!
అచ్చంపేట: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచు పెంటల రహదారులు అధ్వానంగా మారాయి. వర్షాలకు దారులన్నీ పలుచోట్ల కోతకు గురవడంతో రాకపోకలకు చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రావడం కూడా కష్టంగా మారింది. రహదారి సౌకర్యం సరిగ్గా లేదంటూ గతంలో ఓ చెంచు మహిళ మృతదేహాన్ని ఫర్హాబాద్ చౌరస్తా వద్ద వదిలివెళ్లిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. చెంచు పెంటలకు ఏళ్ల తరబడి రోడ్లతో పాటు అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. అటవీ, గిరిజన సంక్షేమశాఖల మధ్య సమన్వయ లోపం చెంచులకు శాపంగా మారుతోంది. ప్రతిపాదనలు బుట్టదాఖలు.. గిరిజన సంక్షేమశాఖ ఏడాదిన్నర క్రితం అమ్రాబాద్, లింగాల మండలాల్లోని చెంచుపెంటలకు మట్టిరోడ్ల నిర్మాణానికి రూ. 2కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అమ్రాబాద్ మండలం మల్లాపూర్పెంట, లింగాల మండలంలోని మల్లాపూర్, పుల్లాయిపల్లి, ఆగర్లపెంట, అప్పాపూర్, రాంపూర్, భౌరాపూర్, మేడిమల్కల, ఈర్లపెంట, సంగిడిగుండాలకు, వ్యూ ఫాయింట్, ఫర్హాబాద్ చౌరస్తా నుంచి రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదించారు. నేటికీ అనుమతులు రాకపోవడంతో చెంచులు అద్వానపు రహదారులపై అవస్థల ప్రయాణం కొనసాగిస్తున్నారు. నిత్యం కష్టాలే.. మన్ననూర్ నుంచి ఈర్లపెంటకు వెళ్లాలంటే 30 కి.మీ. కాలినడక తప్ప మరో మార్గం లేదు. అప్పాపూర్ వరకు మాత్రమే వాహనాలు ఇబ్బందులు పడుతూ వెళ్తాయి. అక్కడి నుంచి ఇతర చెంచు పెంటలకు వెళ్లడానికి ఎలాంటి సౌకర్యం లేదు. అటవీ ప్రాంతంలో కాలినడకే శరణ్యంగా మారడంతో చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెంచుపెంటలకు అద్వానపు దారులు రోడ్ల నిర్మాణాలకు అటవీశాఖ మోకాలడ్డు ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితం రాళ్లు, రప్పలపైనే రాకపోకలు సాగిస్తున్న గిరిపుత్రులు నెరవేరని ప్రభుత్వ లక్ష్యం.. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 2004లో పలు రహదారులు నిర్మించేందుకు రూ.కోట్లు మంజూరైనా అటవీశాఖ నిబంధనలతో ముందడుగు పడలేదు. అచ్చంపేట మండలం ఘనపూర్ నుంచి పదర మండలం చిట్లంకుంట వరకు 9 కి.మీ రోడ్డు నిర్మాణానికి అప్పట్లో రూ. 90లక్షలు మంజూరు కాగా.. గుత్తేదారు 4 కి.మీ. రహదారి నిర్మించి, అటవీ ప్రాంతంలో ఉన్న 5 కి.మీ. అనుమతులు లేవని వదిలేశారు. ఫర్హాబాద్ చౌరస్తా నుంచి అప్పాపూర్కు 25 కి.మీ. భూగర్భ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 2007లో రూ.1.50 కోట్లు మంజూరు కాగా.. అటవీశాఖ అభ్యంతరాలతో నిలిచిపోయింది. కొల్లాపూర్ మండలం అమరగిరి వరకు బీటీ రహదారి పనులకు గతేడాది నిధులు మంజూరయ్యాయి. సగం మాత్రమే పనులుచేసి వదిలేశారు. -
నాడు వైభవం.. నేడు నిర్లక్ష్యం..
జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్థ్యమున్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. మంచాలకట్ట వద్ద కృష్ణానదీ తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయంలో దేవతామూర్తులు నిత్య దూపదీపాలకు నోచుకోవడం లేదు. అమరగిరి సమీపంలో కృష్ణా తీరంలోనే మునులు ప్రతిష్ఠించిన మల్లయ్యస్వామి గుడి పరిస్థితి కూడా ఇంతే. పెద్దకొత్తపల్లి మండలం దేవల్తిర్మలాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో తిరుపతిగా ఒకప్పుడు పేరుండేది. క్రమంగా ఆ గుడి ప్రాభవం కోల్పోతోంది. పెంట్లవెల్లిలోని శివాలయం, చిన్నంబావి మండలం బెక్కెం సమీపంలోని సూర్యదేవాలయం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ శివాలయం, నందీశ్వరాలయం, బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్లోని ఆలయాలకు సరైన ఆదరణ లభించడం లేదు. జిల్లాలో పురాతన విగ్రహాలు, శిలాశాసనాలకు రక్షణ కరువు కొల్లాపూర్: జిల్లాలోని పలు దేవాలయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. భవిష్యత్ తరాలకు చరిత్రను తెలియజెప్పే శాసనాలను సైతం ఈ ప్రాంతంలో గుర్తించారు. కానీ వాటిని పూర్తిస్థాయిలో పరిరక్షించడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. చారిత్రక ఆలయాలు, పురాతన దేవతామూర్తుల విగ్రహాలు, శిలాశాసనాల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వివిధ కారణాలతో నిమ్మకునీరెత్తినట్లు ఉంటోంది. ప్రాభవం కోల్పోతున్న జటప్రోల్.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోల్ సమీపంలో కృష్ణానదీ తీరాన కొన్ని శతాబ్దాల క్రితం సురభి రాజవంశస్థులు అద్భుతమైన శిల్పకళతో మధనగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించారు. రాజుల పాలనలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం నెల రోజులపాటు ఆలయం వద్ద జాతర సాగేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆలయం నీటిలో మునిగిపోయింది. తర్వాతి కాలంలో ఆలయాన్ని జటప్రోల్లో పునర్నిర్మించారు. కొన్నేళ్లపాటు పూజలు యధాతథంగా సాగాయి. కాలక్రమంలో ఈ ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయింది. కొన్నేళ్లుగా ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నా.. సరైన ప్రచారం లేకపోవడంతో తగిన గుర్తింపు లభించడం లేదు. జటప్రోల్లోనే ఉన్న అగస్తేశ్వర ఆలయం, 19 మూకగుడుల నిర్వహణను సైతం ఎవరూ పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా నిరాధరణకు గురవుతున్న వైనం చారిత్రక ఆలయాల సంరక్షణ సైతం పట్టని యంత్రాంగం టూరిజం సర్క్యూట్ నిధులు మంజూరై ఏడాదైనా కానరాని పురోగతి -
ప్రైవేటుకు గడ్డుకాలమే
●ఆశించిన స్థాయిలో లేదు.. ప్రభుత్వం డిగ్రీలో వివిధ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మూడు దశల్లో పూర్తి అయ్యింది. అయినా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు. ఈ క్రమంలో ఎప్ సెట్ వంటి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిస్తే మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ విద్యార్థులు ఎంపిక చేసుకుంటేనే.. పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని తెలుస్తుంది. ప్రభుత్వం త్వరలో మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్కు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ అవుతాయి. కౌన్సెలింగ్లో విద్యార్థులు ఏ కళాశాల ఎంపిక చేసుకుంటే అందులో సీటు వస్తుంది. – చంద్రకిరణ్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్, ఆడిట్సెల్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అయితే ఎప్పుడూ లేనంతగా అడ్మిషన్లు చాలా తక్కువ కావడం ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు దశల్లో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియలో ఎక్కువ మొత్తంలో సీట్లను ప్రభుత్వ, అటానమస్ డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం కేటాయించింది. దీంతో చాలా ప్రైవేట్ కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత మూడేళ్లుగా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న కళాశాలలు.. ఇప్పుడు సీట్ల భర్తీ కూడా అంతంత మాత్రంగా ఉండడంతో యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో నిర్వహించాల్సిన ప్రక్రియ పూర్తి అయ్యింది. అయినా ప్రైవేటు కళాశాలల్లో గతం కంటే చాలా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో ప్రత్యేక కౌన్సిలింగ్ ప్రభుత్వం నిర్వహిస్తుందా.. లేదా.. అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. యూజీలో మొత్తం 65 కళాశాలలు ఉండగా వీటిలో 28,860 సీట్లు భర్తీకి ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహిస్తే 8,561 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏటా రూ.10 కోట్లు.. యూనివర్సిటీకి పీజీతోపాటు యూజీ విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో కళాశాలల్లో సీట్లు పొందితేనే ఆదాయం సమకూరుతుంది. ఉన్న సీట్లలో ప్రతిఏటా తగ్గుదల రావడంతో యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ కళాశాలలు మూతబడుతున్నాయి. యూనివర్సిటీకి ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా అప్లియేషన్, ఇతర పరీక్షలు, సప్లిమెంటరీ ఇలా అనేక రకాల ఫీజులు సమకూరుతాయి. ఒకవేళ ప్రైవేట్ కళాశాలలు మూతబడితే యూనివర్సిటీకి సమకూరే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదిలా ఉంటే యూనివర్సిటీ పరిధిలో 4 అటానమస్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. ఇప్పటికే 3,049 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ కళాశాలల్లో విద్యార్థులు చేరినా ఆయా ఫీజులు మొత్తం వాటికి మాత్రమే చెందగా.. యూనివర్సిటీకి అరకొర ఆదాయం వస్తుంది. మొత్తంగా అటానమస్ కళాశాలలు పెరగడం, ప్రైవేటు కళాశాలలు తగ్గడంతో యూనివర్సిటీ ప్రతిఏటా రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాలమూరు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో పూర్తయిన చేరికలు ఇప్పటి వరకు సగమైనా పూర్తికాని సీట్ల భర్తీ పీయూ పరిధిలో మొత్తం 28,860 సీట్లకు 8,561 మాత్రమే.. కళాశాలలు మూతబడితే యూనివర్సిటీ ఆదాయానికి గండి 38 ప్రైవేటు కళాశాలల్లో.. పీయూ పరిధిలో మొత్తం ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలు 38 ఉంటే వాటిలో 13,580 సీట్ల సామర్థ్యంలో వివిధ కోర్సులను యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా వీటిలో కేవలం భర్తీ అయ్యింది 2,394 సీట్లు (17.64 శాతం) మాత్రమే. నాలుగు అటానమస్ కళాశాలలో 5,040 సీట్లు ఉండగా రిపోర్టు చేసిన విద్యార్థులు 3,049 (60.50 శాతం) మంది. వీటితోపాటు 22 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 10,200 సీట్లు ఉండగా 3,090 మంది (30.29 శాతం) రిపోర్టు చేశారు. ఇలా తక్కువ ఉన్న అటానమస్ కళాశాలల్లో కూడా 3 వేలకు పైగా సీట్లు భర్తీ అయితే.. ఏకంగా 38 కళాశాలలు ఉన్న ప్రైవేటులో మాత్రం తక్కువ సీట్లు కావడంతో చాలా కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.


