breaking news
Nagarkurnool
-
ముహూర్తం నేడే..
నాగర్కర్నూల్పురాల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు ● ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు ● వడ్డేపల్లితో కలిపి కాంగ్రెస్కు మొత్తంగా 12 చోట్ల స్పష్టమైన ఆధిక్యం ● మహబూబ్నగర్, దేవరకద్ర కూడా వారి ఖాతాలోనే.. ● గద్వాలలో సైతం హస్తానికే అవకాశం ● నారాయణపేటలో బీజేపీకే మొగ్గుచూపుతున్న పరిస్థితులు ● అయిజతోపాటు అలంపూర్లో బీఆర్ఎస్కు లైన్క్లియర్ ● అమరచింతలో బీఆర్ఎస్, బీజేపీ కూటమికే.. వాతావరణం ఉదయం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం వేడిగా, సాయంత్రం ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం పెరుగుతుంది. సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు ఎన్నికలు జరిగిన ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఆయా పురపాలికల్లో సోమవారం నిర్వహించే కొత్త పాలక మండళ్ల సమావేశానికి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ఎన్నికై న కార్పొరేటర్లు/కౌన్సిలర్లతో ప్రత్యేకాధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం 12.30 గంటలకు పరోక్ష పద్ధతిలో మహబూబ్నగర్ బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్.. మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్పర్సన్, డిప్యూటీ చైర్మన్/డిప్యూటీ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. భూత్పూర్, కొత్తకోట, వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, మక్తల్, కోస్గి, మద్దూర్తో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. వడ్డేపల్లిలో ఏఐఎఫ్బీ మ్యాజిక్ ఫిగర్ను సాధించగా.. గెలుపొందిన ఎనిమిది మంది చేయి అందుకున్నారు. మ్యాజిక్ ఫిగర్కు ఒకటి, రెండు అడుగుల దూరంలో ఉన్న దేవరకద్ర మున్సిపాలిటీ, మహబూబ్నగర్ కార్పొరేషన్లో పీఠం హస్తానికి దక్కడం ఖాయమైంది. ఇప్పటివరకు మొత్తంగా 14 పురపాలికల్లో ఆ పార్టీ పాగా వేయనుంది. -
పాలమూరుపై పీఠ‘ముడి’!
క్యాంప్ నుంచి హైదరాబాద్కు బయలుదేరే ముందు నియోజకవర్గ ముఖ్యనేత మాట్లాడుతూ పార్టీ అధిష్టానం చేతుల్లోకి వెళ్లిందని.. తన చేతిలో ఏమీ లేదని.. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో ఆ ముఖ్యనేత వర్గంలో నిరాశ అలుముకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు డిప్యూటీ చైర్మన్గా 11వ డివిజన్ నుంచి గెలుపొందిన ఎం.సురేందర్రెడ్డి ఖాయమై నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా.. ఈ పదవిని మైనార్టీ ముస్లిం వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ హైదరాబాద్కు మారగా కాగా.. సోమవారం ప్రమాణ స్వీకార సమయంలోనే మేయర్ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యతను సాధించింది. మ్యాజిక్ ఫిగర్కు కేవలం రెండడుగుల దూరంలో ఉన్నా.. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో హస్తానికి పీఠం దక్కేది ఖాయమైంది. మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. తొలి పదవిని ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఈ పదవిపై 49వ డివిజన్ నుంచి గెలుపొందిన ప్రసన్న ఆనంద్ గౌడ్తో పాటు ఎన్పీ వెంకటేష్ కూతురు ఎన్పీ నేహా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ భార్య స్వప్న ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న నేహా, స్వప్న ఓటమి పాలు కావడంతో ప్రసన్నకే పదవి దక్కనుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులతో నేతలు చీరాల, విజయవాడ క్యాంప్నకు తరలివెళ్లారు. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు ఆదివారం క్యాంప్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు పాలమూరులో హీట్ తెప్పించాయి. ఆదివారం అలజడి.. క్యాంప్లో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థులతో మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్ పదవికి ఎవరైతే బాగుంటుంది.. మీరు ఎవరిని కోరుకుంటున్నారంటూ కార్పొరేటర్లుగా గెలుపొందిన వారిని ఒక్కొక్కరిని గదిలోకి పిలిపించుకుని అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో ముఖ్యనేతతో పాటు ఆయన వర్గం కాంగ్రెస్ నాయకుడైన మైనార్టీవర్గానికి చెందిన సిరాజ్ఖాద్రీ భార్య 39వ డివిజన్లో గెలుపొందిన హజీరాబేగం పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. అభిప్రాయ సేకరణ అనంతరం అందరూ ఆ మైనార్టీ నాయకుడి భార్యనే ప్రతిపాదించారంటూ రాష్ట్రస్థాయిలో పెద్ద నేతకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం ఒయటకు పొక్కడంతో క్యాంప్లో అలజడి చెలరేగినట్లు సమాచారం. ముందు రోజే ప్రతిపాదన.. చీలిన నేతలు సిరాజ్ఖాద్రీ భార్యకు మేయర్ పదవి అంశాన్ని జిల్లాలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించే ఓ నాయకుడు, ఓ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మైనార్టీ నేత వద్ద నియోజకవర్గ ముఖ్యనేత, ఆయన వర్గం శనివారమే ప్రస్తావించినట్లు సమాచారం. ఇరువురు నాయకుల మధ్య సంభాషణ కొనసాగుతుండగానే ఒకానొక దశలో మేయర్ పదవికి 40వ డివిజన్ నుంచి తొలిసారిగా కార్పొరేటర్గా ఎన్నికై న సీబీ పూజిత పేరు సైతం వచ్చినట్లు వినికిడి. ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చిన వారు.. తొలి కార్పొరేషన్లో పట్టు ఉన్న వ్యక్తికే పదవి ఇస్తే బాగుంటుందని.. అనుభవం చాలా ముఖ్యమని.. తొలిసారే కార్పొరేటర్గా గెలిచిన వారికి ఇవ్వడం సరికాదని వారించినట్లు తెలిసింది. అయినా ముఖ్యనేత వర్గం పట్టు వీడకపోవడంతో అదే రోజు రాత్రి మహబూబ్నగర్కు పయనమైనట్లు సమాచారం. హైదరాబాద్, ఢిల్లీ టు మంత్రులు మేయర్ పదవిపై చోటుచేసుకున్న రాజకీయాలు పార్టీ నేతల మధ్య చీలికకు కారణం కాగా.. తొలుత హైదరాబాద్లోని ఆ పార్టీకి చెందిన ఇద్దరు పెద్దల వద్దకు చేరినట్లు తెలిసింది. ఆ తర్వాత ఢిల్లీకి చేరగా.. సమష్టి నిర్ణయంతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు మేయర్ పదవి ఎంపిక బాధ్యతను ఉమ్మడి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సంహికు అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆదివారం సాయంత్రం చీరాల క్యాంప్ నుంచి కార్పొరేటర్లతో కలిసి నేతలు హైదరాబాద్కు బయల్దేరారు. అదేవిధంగా అర్ధంతరంగా క్యాంప్ నుంచి తిరిగి మహబూబ్నగర్కు చేరుకున్న నేతలు సైతం పట్నం బాట పట్టారు. సోమవారం ప్రమాణ స్వీకార సమయం వరకు వీరందరూ మహబూబ్నగర్కు చేరుకోనున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్.. రంగంలోకి కీలక నేతలు మేయర్ పీఠంపై క్యాంప్లో చోటుచేసుకున్న రాజకీయాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నగరంలో ఆయా సామాజిక వర్గాల మధ్య చాటింగ్ల యుద్ధం కొనసాగింది. పలు సంఘాల నేతలు ముఖ్యనేత, ఆయన వర్గం తీరును దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఈ లొల్లి హైదరాబాద్, ఢిల్లీలోని పార్టీ పెద్దల వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో కొందరు కీలక నేతలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. నియోజకవర్గ నేత, ఆయన వర్గం ప్రతిపాదన? విభేదించిన పలువురు నాయకులు.. పార్టీలో చీలిక నగరంలో వైరల్గా మారిన క్యాంప్ రాజకీయాలు రంగంలోకి ‘పెద్ద’ నేతలు.. మంత్రులకు బాధ్యతలు ప్రమాణ స్వీకార సమయంలోనే తేలనున్న మేయర్ అభ్యర్థిత్వం -
పట్టాభిషేకానికి సిద్ధం
మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ● నాగర్కర్నూల్ పుర చైర్మన్గా సునేంద్ర పేరు ఖరారు ● కల్వకుర్తి చైర్పర్సన్గా రత్నమాల.. వైస్చైర్మన్ విషయంలో అధికార పార్టీలో వర్గపోరు ● కొల్లాపూర్ చైర్పర్సన్ ఎన్నికపై వీడని ఉత్కంఠ సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నాగర్కర్నూల్తో పాటు కల్వకుర్తి, కొల్లాపూర్ బల్దియాల్లో చైర్మన్ ఎన్నికతో పాటు కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాలను సోమవారం నిర్వహించనున్నారు. చైర్మన్ ఎన్నికకు ఆర్డీఓలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనుండగా.. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లాలోని మూడు మున్సిపల్ చైర్మన్ పీఠాలను హస్తం పార్టీనే దక్కించుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంపులకు తరలిన కాంగ్రెస్ అభ్యర్థులు.. అక్కడి నుంచి నేరుగా చైర్మన్ ఎన్నిక సమావేశానికి హాజరుకానున్నారు. కల్వకుర్తిలో వైస్చైర్మన్ కోసం పంచాయితీ.. కల్వకుర్తి బల్దియాల్లో చైర్మన్ పదవిని ముందుగానే ఖరారు చేసినప్పటికీ.. వైస్ చైర్మన్ విషయంలో నేతల మధ్య పంచాయితీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల మధ్య నెలకొన్న వర్గపోరు బయటపడుతోంది. మొదటి నుంచి వైస్చైర్మన్ రేసులో షానవాజ్ పేరు వినిపించింది. ఈ విషయంపై చివరి క్షణంలో పార్టీలో పంచాయితీ నెలకొంది. చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కాగా.. చైర్మన్ పదవి బీసీ వర్గానికి కేటాయించారు. ఈ క్రమంలో వైస్చైర్మన్ పదవిని ఓసీలకు కేటాయించాలని పార్టీలోని మరో వర్గం పట్టుపడుతోంది. వైస్చైర్మన్ కోసం షానవాజ్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రమాకాంత్రెడ్డి తల్లి పసుల లలిత పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్కు మించి స్థానాలు లభించాయి. నాగర్కర్నూల్లో మొత్తం 24 స్థానాలకు గాను 18 స్థానాలు, కొల్లాపూర్లో 19 స్థానాలకు గాను 16, కల్వకుర్తిలో మొత్తం 22 స్థానాలకుగాను 13 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. చైర్మన్ ఎన్నికలకు అవసరమైన బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టిపెట్టింది. కల్వకుర్తిలో 8వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా గెలుపొందిన కోడెల లలిత యాదవ్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్లో చేరారు. జిల్లాలోని కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్పర్సన్గా రత్నమాల పేరును ఇప్పటికే ప్రకటించారు. కొల్లాపూర్తో పాటు నాగర్కర్నూల్ పురపాలిక చైర్మన్లు ఎవరనే దానిపై ఇప్పటికీ సస్పెన్స్ నెలకొంది. సోమవారం చైర్మన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిల్ సమావేశంలోనే వారి పేర్లను ప్రకటించనున్నారు. నాగర్కర్నూల్లో చైర్మన్గా తీగల సునేంద్ర, వైస్చైర్మన్గా బాదం రమేశ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొల్లాపూర్లో చైర్మన్ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రధానంగా వంగ అనూష రాజశేఖర్గౌడ్, శ్రీదేవి గౌతమ్గౌడ్, మేకల రమ్యకుమారి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి చైర్మన్గా అవకాశం దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. వైస్ చైర్మన్ పదవికి సైతం ఇక్కడ తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. కొల్లాపూర్లో 14వ వార్డు నుంచి గెలిచిన నరసింహారావుతో పాటు రహీమ్పాషా వైస్చైర్మన్ కోసం ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్లుగా అదృష్టం ఎవరికి వరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
సాంకేతిక అభివృద్ధికి సైన్సే కారణం
అచ్చంపేట రూరల్: ప్రస్తుత సమాజంలో మానవ మనుగడ, ప్రగతికి సైన్సే మూలమని.. సైన్స్ లేనిది జీవితం లేదని ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జాతీయ కార్యదర్శి ఆశా మిశ్రా అన్నారు. పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం దాసరి నరేందర్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర 5వ వార్షిక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాసీ్త్రయ ఆలోచనా విధానంతోనే సాంకేతికత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్పొరేట్ శక్తులు సాంకేతికతను వినియోగించుకుంటూ పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యలు చేపడుతూ.. మానవ మనుగడకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి తెస్తున్నాయని ఆరోపించారు. జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. మేధావుల జ్ఞానాన్ని ప్రజలకు పంచి చైతన్యవంతం చేసేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుతం పర్యావరణానికి, ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్లాస్టిక్ వినియోగం అధికమైందన్నారు. ఫలితంగా కష్టపడి సంపాదించిన సొమ్ములో 20శాతం వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారని అన్నారు. సామాజిక బాధ్యత కలిగిన వలంటీర్లు కనుమరుగవుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని కోరారు. మూఢ నమ్మకాల నిర్మూలన కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు బీఎన్ రెడ్డి, రామచంద్రయ్య, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, రామకృష్ణ, బలరాం, గోపా ల్, దశరథం బాబురావు, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ట్విస్ట్లపై ట్విస్ట్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులో హంగ్ ఏర్పడిన పురపాలికల్లో క్యాంప్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొత్తంగా ఐదు మున్సిపాలిటీల్లో సంకీర్ణ పరిస్థితులు తలెత్తగా.. మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్న రెండింటిలో పాగా వేసేదెవరనే దానిపై స్పష్టత వచ్చింది. స్వతంత్ర అభ్యర్థి చేయి అందుకోవడంతో దేవరకద్రలో కాంగ్రెస్, ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే విజయుడు ఓటు వేయనుండడంతో అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనుంది. మిగిలిన నారాయణపేట, గద్వాల, అమరచింతలో విభిన్న పరిస్థితులు నెలకొనగా.. అటు, ఇటు జంపింగ్లు, క్యాంప్లు, గడియగడియకూ మారుతున్న రాజకీయ పరిణామాలు, ట్విస్ట్లపై ట్విస్ట్లు హీటెక్కిస్తున్నాయి. నారాయణపేటలో కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలవకుండా చేస్తే బీజేపీ విజయం సాధించడం ఖాయం. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తే పీఠం అధిరోహించడం నల్లేరు మీద నడకనే. అదేవిధంగా గద్వాలలో కాంగ్రెస్కు పీఠం దక్కకుండా, ఎమ్మెల్యే చేతికి చిక్కకుండా ఉండాలంటే బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో గద్వాలలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తే నారాయణపేటలో తమకు మద్దతు ఇవ్వాలనే షరతుతో బీజేపీ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగిన పక్షంలో అటు గద్వాల, ఇటు నారాయణపేటలో పుర పీఠాలు కాంగ్రెస్కు దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హంగ్.. ‘జంగ్’ ! నారాయణపేట, గద్వాలలో హైడ్రామా ఒకరికొకరు చేదోడువాదోడుగా బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రాయబారాలు -
ఎక్స్ అఫీషియో.. ప్రభావమెంత?
గద్వాల: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్స్ అఫీషియో ఓట్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా..? అయితే ఒకసారి ఇటువైపు చూడండి. ఉమ్మడి పాలమూరులోని గద్వాల, నారాయణపేట, అమరచింత, అలంపూర్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఆయా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. సంపూర్ణ మెజారీటి లేకపోతే.. మున్సిపాలిటీలో ప్రజల ఓట్లతో గెలుపొందిన కౌన్సిలర్లు తమ వర్గానికి చెందిన ఒకరిని చైర్మన్ లేదా చైర్పర్సన్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే సంపూర్ణ మెజార్టీ లేనప్పుడు ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్అఫీషియో ఓటు కీలకంగా మారుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, రాజ్యాంగబద్ధ కమిటీకి చైర్మన్ ఇలా ఎవరైనా సరే వారి మున్సిపాలిటీ పరిధిలో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకునే వీలుంటుంది. దీనినే ఎక్స్ అఫీషియో ఓట్లుగా పరిగణిస్తారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. తెలంగాణ మున్సిపల్ యాక్ట్–19 ఆర్టికల్ 243–ఆర్ రిట్ పిటిషన్ నంబర్ 20262/2021 ప్రకారం రాష్ట్ర హైకోర్టు ఎక్స్ అఫీషియో ఓట్లపై కీలక తీర్పునిచ్చింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో లోక్సభ ఎంపీ, రాష్ట్ర శాసన సభ్యులు వారి నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా మున్సిపాలిటీ ఏరియాలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర ఎమ్మెల్సీలు ఆయా మున్సిపాలిటీల్లో అప్పటికే ఓటరుగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అలా ఉన్న మున్సిపాలిటీలో మాత్రమే ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. రాజ్యాంగబద్ధ కమిటీలో చైర్మన్లుగా ఉన్నవారు అంతకు పూర్వమే వారి మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. అలా ఉన్న మున్సిపాలిటీ ఏరియాలో ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోచ్చు. ఎన్నికల సంఘం నూతన నిబంధనలతో తప్పని ఇబ్బందులు దీని ఆధారంగానే సుప్రీంను ఆశ్రయించనున్న బీఆర్ఎస్? -
పాక్షిక శనిత్రయోదశి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి శనివారం పాక్షిక శనిత్రయోదశిని పురస్కరించుకొని తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనిగ్రహ దోష నివారణకు భక్తుల చేత భక్తిశ్రద్ధలతో పూజలు చేయించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచు సుగుణమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
చెల్లని ఓట్లతో చిక్కులు..
ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో ఓట్ల తిరస్కరణ సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల పెద్దసంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అతి తక్కువ మెజార్టీతో పరాభావం పొందిన అభ్యర్థులు తమ ఓటమిలో చెల్లని ఓట్లు కూడా కారణంగా ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. అలాగే చాలాచోట్ల అభ్యర్థుల కన్నా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవికంగానే అభ్యర్థులు ఎవరూ నచ్చక నోటాకు ఓటేశారా, లేక గుర్తులపై అయోమయంతో నోటాపై ఓటు ముద్ర వేశారా? అన్న దానిపై అభ్యర్థులు చర్చించుకున్నారు. గుర్తులు తెలియక తికమక.. ఈవీఎం ద్వారా నిర్వహించే ఎన్నికల్లో ఓట్ల తిరస్కరణకు అవకాశం ఉండదు. ఈవీఎం బ్యాలెట్పై నోటాకు మాత్రమే ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. బ్యాలెట్పై సరైన గుర్తును ఎంచుకుని అదే గుర్తుపై ఓటు వేయడంలో చాలామంది ఓటర్లు పొరపాట్లు చేశారు. అయోమయంలో రెండు గుర్తులపై ముద్ర వేయడం, గుర్తులపై బొటనవేలితో ముద్ర వేయడం, బ్యాలెట్ పేపర్పై ఓటు వేయకుండా ఖాళీగా బాక్స్లో వేయడం కనిపించింది. అలాగే బ్యాలెట్ పేపర్లో ఒక గుర్తుపై వేసిన ఇంక్ ముద్ర మరో గుర్తుపై పడకుండా ఉండేందుకు పేపర్ను నిలువుగా మడత పెట్టాల్సి ఉంటుంది. కానీ కొందరు నిలువుగా కాక అడ్డంగా మడిచి బ్యాలెట్ వేయడంతో ఇంకు ముద్ర మరో గుర్తుపై కూడా పడి చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. తక్కువ మెజార్టీతో పోటాపోటీగా ఉన్న వార్డుల్లో చెల్లని ఓట్ల ప్రభావంతో అభ్యర్థులు ఆవేదనకు లోనయ్యారు. పోలైనవి...1012, చెల్లనివి 216 మహబూబ్నగర్ కార్పొరేషన్కు మొదటిసారిగా జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకంగా నిలువనున్నాయి. ఈ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లలో 58వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 59 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1012 ఓట్లు పోలవ్వగా.. అందులో 216 ఓట్లు చెల్లనివి నమోదు కావడం గమనార్హం. ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరనేది దీన్ని బట్టి తెలుస్తోంది. అత్యధికంగా 10, 25వ డివిజన్లలో 16 చొప్పున చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. పైగా వీరంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. అలాంటి పోలింగ్ సిబ్బంది ఓటు వేసే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండటం చర్చనీయాంశమైంది. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాలలో చెల్లని ఓట్లతో పాటు నోటాకు అధికంగా ఓట్లు వీటి ప్రభావంతో అభ్యర్థుల భవితవ్యం తలకిందులు అయినట్టుగా అంచనాలు పొరపాట్లు, తప్పిదాలతోనే అధికంగా చెల్లని ఓట్లు మహబూబ్నగర్లో పోస్టల్ బ్యాలెట్లోనూ చెల్లని ఓట్లు -
ప్రతి చిన్నారికి వ్యాక్సిన్
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సురేష్బాబు అన్నారు. శనివారం మండలంలోని మల్కాపూర్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు యూవిన్ పోర్టల్ నందు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయానికి అన్ని టీకాలు వేయించడం అత్యంత అవసరమన్నారు. జిల్లాలో ప్రతి అర్హులైన చిన్నారికి డ్యూ లిస్ట్ ప్రకారం టీకాలు అందేలా చూడాలని, ఒక్కరిని కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రికార్డు నిర్వహణ పారదర్శకంగా ఉండాలని, ఆన్లైన్ నమోదులోనూ కచ్చితత్వం పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఏపీఓ చారి, వీసీసీఎం దివ్య తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి కందనూలు: ఏజెన్సీ విధానాన్ని రద్దుచేసి నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రస్తుతం అమలుపరుస్తున్న ఏజెన్సీ విధానాన్ని రద్దుపరిచి.. నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలన్నారు. పీఆర్సీలోని స్లాబ్ విధానాన్ని రద్దుపరిచి, క్యాడర్ బేసిక్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులను భర్తీ చేస్తూ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుభాష్, జిల్లా అధ్యక్షుడు రామచందర్జీ, కార్యదర్శి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. పల్లీ @ రూ.9,700 కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.9,700, కనిష్టంగా రూ. 6,512, సరాసరిగా రూ.9,467 ధర లభించింది. కాగా.. మార్కెట్ యార్డుకు 89 మంది రైతు లు 725 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి తీసుకువచ్చారని కార్యదర్శి శివరాజు తెలిపారు. -
చైర్మన్గిరి..!
నీ మీద నాకు మనసాయెనే జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సంఖ్యను కాంగ్రెస్ సాధించింది. ఎక్స్ అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే మూడుచోట్ల చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోనుంది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. ఇందుకు ఆదివారం మధ్యాహ్నం వరకు సమయం ఉండగా.. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కల్వకుర్తి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యేలు సైతం ఆదివారం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జిల్లా లోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు అత్యధిక స్థానాలు వచ్చినా ముందు జాగ్రత్త చర్యగా పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. వారంతా సోమ వారం ఉదయం నేరుగా మున్సిపాలిటీల చైర్మ న్ ఎన్నిక సమావేశానికే హాజరుకానున్నారు. సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాలను కై వసం చేసుకుంది. అయితే చైర్మన్ పదవి కోసం ఆ పార్టీలో గెలిచిన కౌన్సిలర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సోమవారం మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సమావేశాలు నిర్వహించనుండగా.. ఎవరికి చైర్మన్ పదవి వరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇప్పటికే చైర్మన్గా రత్నమాల పేరు ప్రకటించగా.. నాగర్కర్నూల్తోపాటు కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్ పేరును ఖరారు చేయలేదు. ఎన్నికల్లో మూడుచోట్ల కాంగ్రెస్కు ఆధిక్యం వచ్చినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాగర్కర్నూల్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీ నేతలు క్యాంపులకు తరలించారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో చైర్మన్గా ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికలకు ముందు నుంచే ప్రధానంగా చైర్మన్ కోసం తీగల సునేంద్రతోపాటు పొడుగు శ్రీను ఆశిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నుంచి చైర్మన్ ఆశించిన పొడుగు శ్రీను అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీంతో సునేంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు వైస్చైర్మన్ రేసులో బాదం రమేశ్ ఉన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో చైర్మన్గా మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్ సతీమణి రత్నమాల పేరును ఖరారు చేశారు. ఇక్కడ వైస్చైర్మన్ పదవిని షానవాజ్ ఆశిస్తున్నారు. అయితే వైస్ చైర్మన్ కోసం కాంగ్రెస్లోని మరో వర్గం సైతం పట్టుబడుతుండటంతో చివరికి ఎవరి నిర్ణయం నెరవేరుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పుర ప్రథమ పదవి కోసం హస్తం పార్టీలో పోటాపోటీ కొల్లాపూర్లో గెలిచిన వారంతా ఆశావహులే నాగర్కర్నూల్లోనూ పేరును ప్రకటించని నేతలు కల్వకుర్తి చైర్పర్సన్గా రత్నమాల ఖరారు వైస్చైర్మన్ కోసమూ కౌన్సిలర్ల మధ్య తీవ్రమైన పోటీ -
జీఎమ్మార్.. స్టార్ ‘లీడర్’
● దేవరకద్రలోని 3 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ గెలుపు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి (జీఎమ్మార్) స్టార్ లీడర్గా పేరు సాధించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దేవరకద్ర, భూత్పూర్, కొత్తకోట మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగగా.. అన్ని పీఠాలను కాంగ్రెస్ కై వసం చేసుకోనుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంతర్గత ఒప్పందం చేసుకుని ఈ మున్సిపాల్టీలను హస్తానికి చేజిక్కకుండా రాజకీయాలు నడిపాయి. ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు కలిసి ప్రచారం చేపట్టాయి. అయినా భూత్పూర్, కొత్తకోటలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్నా.. ఎక్స్ అఫీషియో ఓటుతో ఆ పార్టీకే పీఠం దక్కనుండడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్శ్రేణులు ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు సంబరాల్లో మునిగారు. ● 16 స్థానాల్లోనూ హస్తం అభ్యర్థుల గెలుపు ● సీఎం ఇలాకా కావడంతో హాట్టాపిక్ ● గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు దక్కిన పీఠం ● ప్రతీకారం తీర్చుకున్నారంటున్న రేవంత్ అభిమానులు -
విజేత.. ఆశా కార్యకర్త
కొత్తకోట పురపాలికలో 5వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆశా కార్యకర్త ముంత మంజుల విజయం సాధించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన పోరులో 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడం.. భర్త బీఆర్ఎస్ కార్యకర్త కావడంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. – కొత్తకోట రూరల్ -
23 ఏళ్లకే కౌన్సిల్లోకి...
వరుసగా ఐదోసారి నెగ్గి.. స్థానిక పురపాలికలోని ఆరో వార్డు నుంచి 23 ఏళ్ల పుట్టా రేణుక కాంగ్రెస్పార్టీ నుంచి పోటీచేసి గెలుపొంది కౌన్సిల్లో అడుగు పెడుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం, అనుకూలమైన రిజర్వేషన్ రావటంతో ఎన్నికల బరిలో నిలిచానని.. వార్డు ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వార్డు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. – కల్వకుర్తి టౌన్ -
నాడు కానిస్టేబుల్.. నేడు కార్పొరేటర్
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ పాతపాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థి టి.రమేష్బాబు ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈయన ఓటమి చవిచూడగా.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గతంలో తనను ఓడించిన అభ్యర్థిపైనే 417 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం. దీంతో పాతపాలమూరులో రమేష్బాబు విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. – మహబూబ్నగర్ రూరల్ -
‘హంగు’..ఆర్భాటాలు!
ఉమ్మడి పాలమూరులో పుర ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా హంగ్ ఏర్పడిన ఆరు పురపాలికల్లో గంటగంటకూ సమీకరణలు మారుతున్నాయి. గద్వాల, నారాయణపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా.. బీజేపీ 11, కాంగ్రెస్ ఏడు, బీఆర్ఎస్ రెండు, ఎంఐఎం రెండు, ఏఐఎఫ్బీ ఒకటి, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. ఏఐఎఫ్బీ అభ్యర్ధి కాంగ్రెస్ రెబల్, స్వతంత్ర బీజేపీ రెబల్ కాగా.. వారు ఆయా పార్టీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ విధంగా జరిగిన పక్షంలో బీజేపీకి 12, కాంగ్రెస్ ఫిగర్ ఎనిమిదికి చేరనుంది. అయితే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ● గద్వాలలో మొత్తం 37 వార్డులు ఉండగా.. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్కు 11, బీజేపీకి ఏడు, స్వతంత్రులు ఇద్దరు, ఎంఐఎం అభ్యర్థి ఒకరు గెలుపొందారు. గెలిచిన ఇద్దరు స్వతంత్రులు, ఒక ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ తమవైపునకు తిప్పుకున్నట్లు తెలిసింది. ఈ లెక్కన వారి బలం 19 కాగా మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మంతనాలు కొనసాగుతున్నాయి. తమ అభ్యర్థులను ఎవరికి వారు క్యాంప్లకు తరలించిన ముఖ్యులు చెరో రెండున్నరేళ్లు మున్సిపల్ పీఠాన్ని పంచుకునేలా పావులు కదుపుతున్నారు. బండ్ల కృష్ణమోహన్రెడ్డిని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ విప్ జారీ చేసే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లతో దేవరకద్రలో కాంగ్రెస్, అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనున్నాయి. ● అమరచింతలో 10 వార్డులు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు చొప్పున, సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించింది. ఫలితాలకు ముందే బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు క్యాంప్నకు వెళ్లగా.. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన వాహనంలో క్యాంప్కు తరలించారు. ఇరు పార్టీల నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. చెరి రెండున్నరేళ్లు చైర్మన్ గిరిని పంచుకునేలా ఒక అవగాహనకు రానున్నట్లు చర్చ జరుగుతోంది. దాదాపుగా అంతటా క్యాంప్ రాజ‘కీ’యాలు గద్వాలలో హైడ్రామా.. బేరసారాలు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం -
‘సింహ’గర్జన..!
● నాడు కొల్లాపూర్, అయిజలో.. నేడు వడ్డేపల్లి మున్సిపాలిటీలో.. గత పుర పాలక ఎన్నికల్లో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయకేతనం ఎగురవేసింది. కొల్లాపూర్కు చెందిన మంత్రి జూపల్లి అప్పుడు బీఆర్ఎస్లో ఉండగా అప్పటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో పొసగని పరిస్థితి ఉండేది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులు ఉండగా.. తన వర్గానికి చెందిన వారిని ఏఐఎఫ్బీ నుంచి బరిలో నిలిపారు.. 11 స్థానాల్లో వారే గెలుపొందారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో తిరుమల్రెడ్డి తన వర్గాన్ని ఏఐఎఫ్బీ నుంచి బరిలో దించారు. 20 వార్డులు ఉండగా.. 10 స్థానాల్లో వారే విజయం సాధించారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్బీ పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించింది. మొత్తం పది వార్డులు ఉండగా.. ఎనిమిది స్థానాల్లో గెలుపొందారు. -
చేతిపురం..!
11 మున్సిపాలిటీల్లో ‘హస్తం’ హవా ఉమ్మడి పాలమూరులో గ్రామపంచాయతీ పోరులో పైచేయి సాధించిన కాంగ్రెస్ పురపాలిక ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ కార్పొరేషన్తోపాటు మరో 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఐదు పురపాలికల్లో (గద్వాల, నారాయణపేట, అమరచింత, దేవరకద్ర, అలంపూర్) హంగ్ ఏర్పడింది. 11 చోట్ల ‘హస్తం’ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. మహబూబ్నగర్ కార్పొరేషన్, దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంలో ఉండగా.. ఈ పీఠాలనూ కై వసం చేసుకోనుంది. గత పురపాలక ఎన్నికల్లో ఎనిమిదింటిలో పూర్తి ఆధిక్యతను కనబర్చిన బీఆర్ఎస్కు ఈ సారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క అయిజలోనే గెలుపొందింది. బీజేపీ బోణీ కూడా చేయలేక చేతులెత్తేసింది. నారాయణపేటలో ఆధిక్యతను కనబర్చినా.. మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ.. ఉమ్మడి పాలమూరులో ఎన్నికలు జరిగిన మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. 18 పురపాలికల్లో 316 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 30 డివిజన్లు, 179 వార్డుల్లో విజయం సాధించి పైచేయిగా నిలిచింది. అదేవిధంగా బీఆర్ఎస్ 15 డివిజన్లు, 75 వార్డులు.. బీజేపీ ఏడు డివిజన్లు, 38 వార్డుల్లో గెలుపొంది ఆ తర్వాత స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఏఐఎఫ్బీ తొమ్మిది, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు తొమ్మిది, సీపీఎంకు చెందిన ఇద్దరు గెలుపొందారు. మక్తల్లోని ఆరో వార్డులో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు ఐదింటిలో హంగ్ బోల్తాపడ్డ కారు.. ఒక్క అయిజలోనే మెజార్టీ తారుమారైన బీజేపీ అంచనాలు ‘పేట’లో ఆధిక్యత.. అయినా ఊగిసలాట దేవరకద్రలో రెబల్ చేరికతో హస్తానికి లైన్క్లియర్ అలంపూర్లో బీఆర్ఎస్కు అవకాశం గద్వాలలో ఎమ్మెల్యే బండ్లకు షాకిచ్చిన ఫలితాలు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోబూచులాట -
77.96%
2020లో‘పుర’ ఎన్నికల్లో 0.52 శాతం తగ్గిన పోలింగ్ 78.48%2026లోసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గత పురపాలక ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి పాలమూరులో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట.. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర, మద్దూర్ మినహాయించి మిగిలిన 17 మున్సిపాలిటీల్లో 2020లో మొత్తంగా 78.48 శాతం పోలింగ్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అవే పురపాలికల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో 77.96 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ లెక్కన పోలింగ్ 0.52 శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ.. ఎలా అంటే.. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన మహబూబ్నగర్లో గత ఎన్నికల్లో 67.17 శాతం మంది ఓటేశారు. ఈ ఎన్నికల్లో 67.73 శాతం పోలింగ్ నమోదు కాగా.. స్వల్పంగా 0.56 శాతం పెరిగింది. అదేవిధంగా వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో 0.75, పెబ్బేరులో 0.60, అమరచింతలో 2.89, జోగులాంబ జిల్లాలోని గద్వాలలో 0.47, అలంపూర్లో 1.15, వడ్డేపల్లిలో 0.02 శాతం పోలింగ్ పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలో ఈ సారి అత్యధికంగా 4.04 శాతం పోలింగ్ తగ్గింది. అదేవిధంగా నారాయణపేటలో 0.75, కోస్గిలో 0.24, నాగర్కర్నూల్ జిల్లాలోని నాగర్కర్నూల్లో 2.91, కల్వకుర్తిలో 0.04, కొల్లాపూర్లో 1.32, జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో 2.37, మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్లో 1.54, వనపర్తి జిల్లాలోని వనపర్తిలో 1.45, ఆత్మకూరులో 0.53 శాతం మేర పడిపోయింది. 10 మున్సిపాలిటీల్లో తగ్గుదల.. మరో ఏడింటిలో పెరుగుదల అత్యధికంగా మక్తల్లో 4.04 శాతం మేర పడిపోయిన ఓటింగ్ అమరచింతలో 2.89 శాతం మేర పైకి.. -
మన్యంకొండ హుండీ ఆదాయం రూ.37.64 లక్షలు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.37,64,907 ఆదాయం వచ్చింది. ఇటీవలి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు సాయంత్రం 7 గంటలకు సాగింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, ఇన్స్పెక్టర్ వీణ, ఐడీబీఐ మేనేజర్ మల్లిఖార్జున్, సత్యసాయి సమితి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
కందనూలు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం ఆయన ఉయ్యాలవాడలోని నైస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి శిక్షణ తరగతులను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని, వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు క్రమబద్ధంగా చేపట్టాలని సూచించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకల్లా సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. అనంతరం పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరవాలన్నారు. చెల్లిన ఓట్లను మాత్రమే సంబంధిత అభ్యర్థి గుర్తు ఉన్న బాక్సుల్లో వేయాలని, చెల్లని ఓట్లను గుర్తించి ప్రకటించే పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు లోబడి, పారదర్శకంగా సాగాలన్నారు. ఓట్ల లెక్కింపు మొత్తం ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మూడంచెల భద్రత కల్పించడం, స్ట్రాంగ్రూంల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులు వారి ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దేవసహాయం, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, ఆర్డీఓ సురేష్బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, తహసీల్దార్ తబితారాణి తదితరులున్నారు. -
నల్లమలలో ఆక్వా కల్చర్ సెంటర్
అచ్చంపేట: నల్లమలలో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం అచ్చంపేట మండలం చంద్రసాగర్ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి కార్యక్రమం, ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.4 కోట్లతో అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే చేపపిల్లలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖకు రూ.3 వేల కోట్లతో బడ్జెట్ రూపొందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో పదేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లతో 88 కోట్ల చేపపిల్లలు కొనుగోలు చేసి 26 వేల చెరువుల్లో వదిలినట్లు వెల్లడించారు. అంచెలంచెలుగా రాష్ట్రంలో చేపపిల్లల కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ముదిరాజ్లకు చెరువులపై పూర్తి హక్కులు కల్పించేందుకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చెప్పారు. రాష్ట్రంలో పండుగ సాయన్న విగ్రహాల ఏర్పాటు, ముదిరాజ్ భవనాలను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తామన్నారు. అచ్చంపేట ముదిరాజ్ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రం సామర్థ్యాన్ని 30 లీటర్లకు పెంచుతామన్నారు. ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చేందుకు పోరాటం చేస్తామన్నారు. తనను అణగదొక్కే ప్రయత్నాలు ఎన్ని జరిగినా జంకలేదని.. మక్తల్లో చోటుచేసుకున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా రాజకీయ రంగుపులిమేలా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామన్నారు. అంతకు ముందు రూ.18.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. చంద్రసాగర్కు రెండు కాల్వలు చంద్రసాగర్ ప్రాజెక్టుకు ఉమామహేశ్వరం రిజర్వాయర్, పెనిమిళ్ల రెండు కాల్వల ద్వారా నీరు పారుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 365 రోజులు నీరు నిల్వ ఉంటుందని, ఇక్కడి నుంచి అమ్రాబాద్కు సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కాల్వల పనులు వారం రోజుల్లో మొదలవుతాయని, 13 ఎకరాల్లో ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేయడం వల్ల నీటి సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ యాదగిరి, గ్రంథాయల చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివానులు, అంతటి మల్లేష్, తహసీల్దార్ సైదులు, మత్స్య శాఖ ఏడీ నర్సింగ్రావు, వెటర్నరీ ఏడీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రూ.50 కోట్లతో వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకు చర్యలు అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
బాలికలు సృజనాత్మకతతో ఆలోచించాలి : డీఈఓ
కందనూలు: పోటీ ప్రపంచంలో బాలికలు కేవలం పుస్తక జ్ఞానంతో మాత్రమే కాకుండా సృజనాత్మకత, సమయస్ఫూర్తి, వివేకంతో కూడిన ఆలోచనలను అలవర్చుకుని ముందుకు సాగాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. గురువారం నాగర్కర్నూల్ మండలంలోని నాగనూల్ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థినులకు నిర్వహించిన ఫేర్వెల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితానికి తొలిమెట్టు వంటివని చెప్పారు. పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా.. అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. ప్రతి బాలిక తనలోని ప్రతిభను గుర్తించి, సృజనాత్మకతను పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. మహిళా విద్య సమాజాభివృద్ధికి చాలా కీలకమని పేర్కొన్నారు. చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న కేంద్రం నాగర్కర్నూల్ రూరల్: దేశంలో ఉన్న పదిమంది పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టాలు మార్చి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. గురువారం దేశవ్యాప్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను పట్టణంలోని కార్మిక సంఘాలు విజయవంతంగా కొనసాగించారు. ఈ సందర్భంగా గాంధీ పార్కు వద్ద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాసులు, శివశంకర్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, వీబీజీ రాంజీ జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం వేతనం అమలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ పీఎఫ్ తదితర సౌకర్యాలు వెంటనే కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పర్వతాలు, జిల్లా సహాయ కార్యదర్శి రామయ్య, నాయకులు రవీందర్, శంకర్గౌడ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, జయమ్మ, వరలక్ష్మి, కవిత, జస్వంత్, అలివేలమ్మ, బాలీశ్వర్, కుర్మయ్య, చింతలయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
పురం.. ఎవరి పరం
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల తీర్పు శుక్రవారం వెలువడనుంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 65 వార్డులకు ఎన్నికలు 243 మంది బరిలో నిలిచారు. వీరికి సంబంధించి శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్లకు సంబంధించిన కౌంటింగ్ను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోనే ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా మొత్తం మూడు రౌండ్లలో కౌంటింగ్ పూర్తిచేయనున్నారు. దీంతో మధ్యాహ్నం వరకే పార్టీల వారీగా వచ్చే స్థానాలపై స్పష్టత రానుంది. మొత్తంగా జిల్లాలోని మూడు పురపాలికలు ఎవరిపరం కానున్నాయో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మూడు రౌండ్లు.. 8 టేబుళ్లు నాగర్కర్నూల్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ను ఉయ్యాలవాడలోని పుల్లారెడ్డి తోటలో ఉన్న నైస్ పాఠశాలలో చేపట్టనున్నారు. కల్వకుర్తిలో మహబూబ్నగర్ రోడ్డులోని భ్రమరాంబ మల్లికార్జున ఎడ్యుకేషన్ సొసైటీలో, కొల్లాపూర్ మున్సిపాలిటీ కౌంటింగ్ను పీజీ కళాశాల సెంటర్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను సిద్ధం చేయడంతోపాటు కౌంటింగ్పై సిబ్బందికి శిక్షణ సైతం ఇచ్చారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ మొత్తం మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్లో 8 టేబుళ్లలో పోలింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో టేబుల్పై మూడు వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ముందుగా పోస్టల్ బ్యాలెట్.. తర్వాత వార్డుల వారీగా మొదటి, రెండు, మూడో రౌండ్లలో అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తా రు. తొలి రెండు గంటల్లోనే మొదటి, రెండు రౌండ్ల ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి మొత్తం పోలింగ్ ప్రక్రియలో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 16న చైర్మన్ ఎన్నిక.. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన అనంతరం సోమవారం మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. పరోక్ష విధానంలో వార్డు సభ్యులు చైర్మన్ను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సంబంధిత ఆర్డీఓలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా పరిస్థితిని బట్టి గెలిచిన అభ్యర్థులతో క్యాంపులు నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. చెంచుల పండుగ.. నల్లమలలోని భౌరాపూర్ భ్రమరాంబ అమ్మవారి ఉత్సవాలు శనివారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. –IIలో uపటిష్ట బందోబస్తు ఏర్పాటు కల్వకుర్తి టౌన్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులెవరూ ర్యాలీలు, విజయ యాత్రలు నిర్వహించరాదని, ప్రజలను గుమిగూడే విధంగా చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులందరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం నేటి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం 65 వార్డుల్లో.. 243 మంది పోటీ మధ్యాహ్నం వరకే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం గెలుపుపై ఎవరి ధీమా వారిదే -
వడివడిగా.. మల్లన్న సన్నిధికి
అచ్చంపేట: హరహర మహాదేవ శంభో శంకర.. ఓం నమఃశివాయ.. శివాయ నమ ఓం.. అంటూ శ్రీశైలం జాతీయ రహదారి భక్తుల శివనామస్మరణతో మార్మోగుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా శ్రీశైలం తరలివెళ్తున్నారు. రవాణా సౌకర్యాలు ఉన్నా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శివనామ సంకీర్తనలు చేసుకుంటూ వేలాది మంది భక్తులు నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా కొండలు, గుట్టలు, బండరాళ్లను, ముళ్లకంపలను అడ్డు తొలగించుకుంటూ శ్రీశైలం చేరుకుంటున్నారు. ఈ ప్రయాణం శరీరానికి ఎంతో బాధ కలిగించినప్పటికీ మనస్సు మాత్రం ఆధ్యాత్మికానందంతో పులకిస్తుందని, అది ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుందని శివస్వాములు పేర్కొంటున్నారు. వందల కి.మీ.ల దూరం నుంచి ఎండను సైతం లెక్క చేయకుండా మదిలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణతో కై లాస ద్వారం చేరుకుంటున్నారు. గతంలో ఈఓగా పనిచేసిన శంకరరెడ్డి శివదీక్షను 1996లో ప్రారంభించి విశేష ప్రాధాన్యతను పెంపొందించేలా కృషి చేశారు. కాళ్ల నొప్పులు, పాదాలు పగలడం, బొబ్బలెక్కడం ఇవేవి లెక్కలోకి తీసుకోకుండా శ్రీశైలేశుని దర్శనం కోసం బారులు తీరుతున్నారు. భక్తిని మించిన మరే శక్తిలేదని శివదీక్షాస్వాములు స్పష్టం చేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న శివస్వాములు రాత్రివేళ మూడు, నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతూ.. అర్ధరాత్రి 2 గంటల తర్వాత తిరిగి నడక సాగిస్తున్నారు. రాత్రివేళ చలి, పగలు ఎండల్లో శివమాలధారుల పాదయాత్ర అభయారణ్యంలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణం నల్లమల దారిపొడవునా యాత్రికులకు దాతల చేయూత -
తీర్పు రిజర్వ్..
● 19 పురపాలికల్లో మొత్తంగా 75 శాతం పోలింగ్ ● గద్వాల జిల్లాలో అత్యధికం.. మహబూబ్నగర్లో అత్యల్పం ● అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు ● రేపు ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాల వెల్లడి ప్రశాంతంగా ముగిసిన మున్సి‘పోల్స్’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరులో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఐదు జిల్లాల పరిధిలోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో మొత్తం 373 డివిజన్లు/వార్డు స్థానాలకు బుధవారం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ.. 11 గంటల తర్వాతే ఓటర్ల రాక ఊపందుకుంది. నిర్దేశిత సమయం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తంగా 75 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో రిజర్వ్ కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. 14న మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్పర్సన్, వైస్ చైర్లన్లు.. కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత 16న పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. బద్ధకించిన కార్పొరేషన్ ఓటర్లు.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అత్యధికంగా 78.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యల్పంగా 67.73 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో నగర ఓటర్లు ఓటెత్తుతారని అందరూ భావించారు. ఇందుకు విరుద్ధంగా అత్యల్పంగా పోలింగ్ నమోదు కావడంతో ఈ ప్రభావం ఎవరిపై పడుతోందని రాజకీయ పార్టీల నేతలు డివిజన్ల వారీగా లెక్కల్లో మునిగారు. నాగర్కర్నూల్ 77.64 శాతంతో రెండు, వనపర్తి 75.56 శాతంతో మూడు, నారాయణపేట 74.04 శాతంతో నాలుగో స్థానంలో నిలిచాయి. మొత్తం ఓట్లు 6,12,827.. పోలైంది 4,53,090 మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్తోపాటు 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మిగిలిన పురపాలికలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్, అలంపూర్లో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. మక్తల్ ఆరోవార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. మొత్తంగా 59 డివిజన్లు, 314 వార్డుల్లో జరిగిన పోలింగ్లో 6,12,827 మంది ఓటర్లకు గాను 4,53,090 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ మహిళల వెనుకంజ.. ఉమ్మడి జిల్లాలోని పోలింగ్ జరిగిన పురపాలికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా.. ఓటు హక్కు వినియోగంలో వారే వెనుకబడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తగా.. పుర పోరుకు వచ్చేసరికి అతివలు ఓటుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్గనర్, నాగర్కర్నూల్ జిల్లాలో సరాసరిగా పురుషులు, మహిళల ఓటింగ్ శాతం సమానంగా ఉండగా.. మిగతా జిల్లాల్లో ఒక్క శాతానికి పైగానే తేడా ఉంది.మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే మహబూబ్నగర్, దేవరకద్ర, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు, గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి, నారాయణపేట, మక్తల్, మద్దూర్, కొల్లాపూర్లో మహళలు ఓటుకు దూరంగా ఉన్నారు. భూత్పూర్, కోస్గి, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో మాత్రమే అతివల ఓటింగ్ శాతం పురుషుల కంటే కొంత మేర మెరుగ్గా ఉంది. 35 మందిలో 16 మంది.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎన్నికలు జరిగిన పుర పాలికల్లో ఇతరులు ఓట్లరు 35 మంది ఉన్నారు. వీరిలో 16 మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అర్ధరాత్రి మారిన పరిణామాలతో.. ఉమ్మడి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారినట్లు తెలుస్తోంది. పురపాలికల్లో డివిజన్లు/వార్డుల వారీగా పలువురు అభ్యర్థులు ఓటుకొక రేటు చొప్పున వెదజల్లినట్లు సమాచారం. పార్టీల వారీగా ఫండ్ రాగా.. ఒక్కో వార్డులో ఆయా అభ్యర్థులు ఒక్క ఓటుకు రూ.5 వేల చొప్పున పంచినట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పటివరకు గెలుపు అంచనాల్లో మునిగిన అభ్యర్థులు తెల్లారేసరికి పరిస్థితులు మారడంతో నోరెళ్లబెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానం మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్, మక్తల్, వనపర్తి తదితర మున్సిపాలిటీల్లో అధికార, విపక్ష పార్టీల నేతలు రాత్రికిరాత్రే చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతుండగా.. పలువురు అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. -
పురవిప్పిన ఓటరు
● జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 77.64 శాతం ఓటింగ్ నమోదు ● ఉదయం 7 గంటల నుంచే బారులుదీరిన ఓటర్లు ● కల్వకుర్తిలో అత్యధికంగా 80.80, నాగర్కర్నూల్ లో అత్యల్పంగా 73.98 శాతం పోలింగ్ సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో పట్టణ ఓటరు పురివిప్పారు. ఎన్నికలు జరిగిన మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 77.64 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో అత్యధికంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో 80.80 శాతం ఓటింగ్ జరగగా.. కొల్లాపూర్లో 80.10 శాతం, నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో అత్యల్పంగా 73.98 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఉదయం నుంచే కేంద్రాలకు ఓటర్ల రాక ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు పోలింగ్ కాస్త మందకొడిగా కొనసాగగా, ఆ తర్వాత పుంజుకుంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65 వార్డులకు సంబంధించి 131 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ జిల్లాకేంద్రంలోని పలు పోలింగ్కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. జిల్లాకేంద్రంలో తగ్గిన పోలింగ్ శాతం.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా, నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఇక్కడ మొత్తం 35,378 మంది ఓటర్లకు గానూ 26,171 మంది మాత్రమే ఓటు వేశారు. ఉదయం 9 గంటలకల్లా మిగతా మున్సిపాలిటీల కన్నా ఎక్కువగా పోలింగ్ జరగ్గా, సాయంత్రానికి ఓటింగ్ శాతం తగ్గింది. కల్వకుర్తిలో అత్యధికంగా 80.80 శాతం నమోదైంది. మొత్తం 26,023 మంది ఓటర్లకు గానూ 21,027 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొల్లాపూర్లో మొత్తం 19,356 మంది ఓటర్లకు 15,505 మంది ఓటింగ్లో పాల్గొనగా 80.10 శాతం నమోదైంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. పోలింగ్ ముగిసే 5 గంటల సమయానికి పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటుహక్కు కల్పించారు. కల్వకుర్తి, నాగర్కర్నూల్లోని పలు వార్డుల్లో సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ కొనసాగింది. 243 మంది అభ్యర్థులు.. పోలింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి ఆయా మున్సిపాలిటీల్లోని స్ట్రాంగ్ రూం వద్దకు తరలించారు. బ్యాలెట్ బాక్సుల్లో జిల్లాలోని 65 వార్డుల్లో బరిలో ఉన్న 243 మంది అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపర్చారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి. దొంగ ఓటర్ల హల్చల్.. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొద్దిసేపు వివాదం చోటుచేసుకుంది. మైనర్లతో ఓట్లు వేయిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలింగ్ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కా ర్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సైతం పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. -
వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించిన కలెక్టర్
కందనూలు: జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నుంచి జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లోని 131 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. అనంతరం జిల్లాకేంద్రం మున్సిపాలిటీలోని 15వ వార్డు క్రిస్టియన్కాలనీ, 14వ వార్డు సంత బజార్లో పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లతో మాట్లాడి.. వారికి అందుతున్న సౌకర్యాలు, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలని ఏజెంట్లకు సూచించారు. జిల్లాకేంద్రంలోని 14వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ బదావత్ సంతోష్ -
మహదేవప్ప కుటుంబానికి పరామర్శ
మక్తల్/మాగనూర్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కుటుంబాన్ని బుధవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరామర్శించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప అధికార పార్టీ నాయకుల వేధింపుల నెపంతో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6వ వార్డులో ఈ రోజు పండుగ వాతావరణం ఉండాల్సిన సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. కొంతకాలంగా మక్తల్ నుంచి మొదలుపెడితే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిల్చున్న మహిళా అభ్యర్థుల భర్తలను, యువకులను బెదిరించి పోలీస్టేషన్కు పిలిపించి కేసులు నమోదు చేయిస్తున్నారని, భూ రికార్డుల్లో మార్పులు, మధ్య తరగతి కుటుంబాల్లో రేషన్ కార్డులను తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. ఇతర పా ర్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విత్డ్రా చేసుకుంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ విధంగా జరగడం, అందరిని బెదిరించడం చాలా దురదృష్టకరం అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరిరోజు ర్యాలీలో కూడా పాల్గొని ఎంపీ డీకే అరుణతో గెలుపునకు చేరువలో ఉన్నానని చెప్పిన మహదేవప్ప అకాల మృతిచెందడం బాధాకరమన్నారు. కుటుంబానికి పార్టీపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేసిన కేంద్ర మంత్రి -
ప్రజలు నిర్భయంగా ఓటేయాలి : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ తెలిపారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యలవాడ వద్ద పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంతంగా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల పరిధిలో 65 వార్డులకు గాను 131 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఇందులో 62 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్కు సంబంధించి 828 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 3 ఎఫ్ఎస్టీ బృందాలు, 3 ఎస్ఎస్టీ బృందాలు చురుకుగా పనిచేస్తాయన్నారు. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూటర్ సెంటర్, కౌంటింగ్ హాల్ను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులున్నారు. వైద్య సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అమలుపరుస్తున్న మాతాశిశు సంరక్షణ, టీకాకరణ, అసంక్రమిత వ్యాధులు, క్షయ, కుష్టు తదితర కార్యక్రమాలపై వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రజలకు సేవలు అందేలా చూడాలన్నారు. ఏఎన్ఎంలు, పర్యవేక్షణ సిబ్బంది, వైద్యాధికారులు ప్రతిఒక్కరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని సూచించారు. జిల్లాలో భ్రూణ హత్యలు నివారించేందుకు స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు భరత్కుమార్రెడ్డి, తారాసింగ్, భీమానాయక్, ప్రోగ్రాం అధికారులు లక్ష్మణ్, సురేష్కుమార్, ప్రదీప్, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. -
భూముల రీ సర్వేతో రైతులకు మేలు
లింగాల: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూభారతి చట్టం రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని అంబట్పల్లిలో భూభారతి పథకంలో భాగంగా భూముల రీ సర్వేపై గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సులో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోనే భూముల రీ సర్వే కోసం అంబట్పల్లిని పైలెట్ ప్రాజెక్ట్గా ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. పార్టీలకతీతంగా సర్వే జరుగుతుందని, ఈ రీసర్వే వల్ల ప్రతి ఇంచు భూమి గుర్తించడం జరుగుతుందన్నారు. సర్వే ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని చెప్పారు. భూములకు పక్కా సరిహద్దులు ఏర్పాటు చేయడం ద్వారా రైతుల మధ్య వివాదాలు తగ్గుతాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. అంబట్పల్లిలో త్వరలో బ్యాంకు శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంబట్పల్లి శివారులో 915 సర్వే నంబర్లు ఉండగా 6,492 ఎకరాల పట్టా భూములు, మరో 788 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. డీజీపీ, రోవర్స్ పరికరాల ద్వారా భూముల సర్వే చేయడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలోని నాలుగు మండలాల్లో 4 గ్రామాలను పైలెట్ ప్రాజెక్ట్గా గుర్తించి పనులు చేపట్టినట్లు చెప్పారు. గ్రామ సరిహద్దు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, రహదారులు, కాల్వలు, పట్టా భూములు సైతం రీ సర్వే చేస్తారన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 150 మంది లైసెన్సు సర్వేయర్లు ఉన్నారని, మరో 100 మంది సర్వేయర్లు రానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సర్వేయర్ నాగేందర్, తహసీల్దార్ వెంకటేష్, సర్పంచ్ శ్రీవాణి, ఉప సర్పంచ్ మల్లేష్, మండల సర్వేయర్ రాంబాబు, సింగిల్ విండో మాజీ చైర్మన్ హన్మంత్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
కొల్లాపూర్: మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పోలింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన కొల్లాపూర్లో ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాల ని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద లైటింగ్, టాయిలెట్లు, తాగునీరు, భోజన ఏర్పాట్లు ఉండాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సరిచూసుకోవాలని అధికారులకు సూచించారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ స్థలం పరిశీలన పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం నుంచి ఏపీలోని సంగమేశ్వరం ప్రాంతాల మధ్య కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జి స్థలాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించారు. వంతెన నిర్మాణానికి సంభందించిన అంశాలు, భూసేకరణ అంశాల గురించి రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు. వంతెన నిర్మిస్తే నంద్యాల, తిరుపతి వెళ్లే వారికి 90 కి.మీ., మేరకు దూరభారం తగ్గుతుందని, బ్రిడ్జి నిర్మాణం వల్ల కృష్ణానది పరిసర ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని వివరించారు. వంతెన నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు ఆయన జటప్రోల్ గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించారు. పనులను నాణ్యతగా చేపట్టాలని కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులకు సూచించారు. పనుల పురోగతిని రెగ్యులర్గా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ భన్సీలాల్ ఉన్నారు. -
నాగర్కర్నూల్
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలుప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ● అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణ ● మైక్రో అబ్జర్వర్ల ద్వారా నిశిత పరిశీలన ● జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 202616న చైర్మన్ ఎన్నిక.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఈ నెల 16న చైర్మన్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. పరోక్ష ఎన్నిక విధానంలో వార్డు సభ్యులు చైర్మన్ను ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. ఆర్డీఓ అధికారులు ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నట్టు చెప్పారు. మూడు రౌండ్లలో కౌంటింగ్.. ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని స్ట్రాంగ్రూం వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ఉయ్యాలవాడలోని నైస్ పాఠశాలలో, కల్వకుర్తిలో మహబూబ్నగర్ రోడ్డులోని భ్రమరాంబ మల్లికార్జున ఎడ్యుకేషన్ సొసైటీ, కొల్లాపూర్ మున్సిపాలిటీ కౌంటింగ్ను పీజీ కళాశాల సెంటర్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడుతామన్నారు. అదేరోజున ఫలితాల వెల్లడితోపాటు గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామన్నారు. సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనుండగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేశామన్నారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి మహబూబ్నగర్ రీజియన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. –IIలో u -
పోలింగ్ డే
నేడే పురపాలిక ఎన్నికల సమరం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ /సాక్షి, నాగర్కర్నూల్: పురపాలిక పోరుకు వేళయింది. పది రోజుల నుంచి తలపడిన అభ్యర్థులను ఓటర్లు ఆశీర్వదించే తరుణం ఆసన్నమైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నిర్ణీత సమయంలో లోగా పోలింగ్ కేంద్రంలో వేచి ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మరో 18 మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ చేపట్టారు. ఇందుకోసం అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సిబ్బంది మంగళవారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో 1,573 మంది అభ్యర్థులు.. ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉండగా.. అచ్చంపేట, జడ్చర్ల పురపాలికల్లో ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన వాటిలో మొత్తం 376 వార్డులు, డివిజన్లు ఉండగా.. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 58వ వార్డులో కాంగ్రెస్కు చెందిన రమాదేవి, అలంపూర్ మున్సిపాలిటీలోని పదో వార్డు కౌన్సిలర్గా విక్రం (బీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 374 వార్డుల్లో 1,573 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మక్తల్లోని 6వ వార్డులో బీజేపీకి చెందిన మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలుచోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ తీవ్రత పెరిగింది. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా అలంపూర్లో 36 మంది పోటీ చేస్తున్నారు. దేవరకద్ర, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో 40 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్లలో రాజకీయ పార్టీల గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులను ముద్రించారు. ఎన్నికల సమయంలో తప్పుల సవరణకు అవకాశం లేకపోవడంతో ముందు జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్లను వివిధ దశల్లో అధికారులు నిశితంగా పరిశీలించారు. ● ఉమ్మడి జిల్లాలో 376 వార్డుల్లో 6,18,516 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,03,793 మంది, మహిళలు 3,14,688 మంది, ఇతరులు 35 మంది ఉన్నారు. వీరి కోసం 971 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బహుముఖ వ్యూహంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఎన్నికలకు ముందు రోజు వరకు అభ్యర్థులు ప్రలోభాల పర్వాన్ని కొనసాగించారు. ఒకరి కన్నా మరొకరు పోటీపడుతూ అంచనాకు మించి ఖర్చు చేశారు. వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించారు. ఓటుకు రూ. 2 వేల నుంచి 4 వేల వరకు వెచ్చిస్తూ డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లింపులు పూర్తిచేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీతో అభ్యర్థులు యథేచ్చగా ప్రలోభాలకు పాల్పడినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణ.. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్న అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహణ చేపట్టారు. పోలింగ్ కేంద్రాల నుంచే వెబ్కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఓటింగ్ను పర్యవేక్షించనున్నారు. ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్కేంద్రాన్ని ఏర్పాటుచేయగా, ఒక్కో కేంద్రంలో ఒక బ్యాలెట్బాక్సును ఏర్పాటుచేశారు. ఒక్కో పోలింగ్కేంద్రంలో కనీసం ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది విధుల్లో పాలుపంచుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం వెంటనే బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని స్ట్రాంగ్రూం వద్దకు తరలించనున్నారు. ఈనెల 11 మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ మహబూబ్నగర్ 58వ డివిజన్,అలంపూర్ 10వ వార్డు ఏకగ్రీవం బీజేపీ అభ్యర్థి మృతితో మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా మిగిలిన 373 వార్డులు/ డివిజన్లలో 1,570 మంది అభ్యర్థులు బరిలో.. పోలింగ్కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా నిశిత పరిశీలన -
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సహకరించండి
కల్వకుర్తి టౌన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, మద్దతుదారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలకు పాల్పడకుండా పోలీసులకు, ఎన్నికల సిబ్బందికి సహకరించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని 7, 16, 17, 18 వార్డుల్లో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు ఎవరైనా కోడ్ను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులు కోడ్ ముగిసే వరకు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియాపై నిరంతరం నిఘా ఉంచామని, ఫేస్బుక్, వాట్సప్, ట్విటర్ మొదలైన వాటిలో విద్వేషపూరిత లేదా ప్రజలను రెచ్చగొట్టే, తప్పుదోవ పట్టించే విధంగా పోస్టులు చేయరాదన్నారు. జిల్లాలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు చేపట్టాలన్నారు. ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణా అయ్యే అవకాశం ఉంటుందని, వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఎస్పీ వెంట మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఏఈ షబ్బీర్, డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ నాగరాజు, ఎస్ఐలు మాధవరెడ్డి, వీరబాబు, రాజశేఖర్ తదితరులున్నారు. -
భూ సేకరణ గ్రామసభ బహిష్కరణ
బల్మూర్: జిల్లాలోని బల్మూర్ సమీపంలో నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ బండ్ (కట్ట) నిర్మాణం కోసం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన అభిప్రాయసేకరణ గ్రామసభను రైతులు తీవ్ర నిరసనల మధ్య బహిష్కరించారు. బల్మూర్ శివారులోని 16 సర్వే నంబర్లలో 46 మందికి చెందిన 52.07 ఎకరాల లావణి పట్టా భూముల్లో బండ్ (కట్ట) నిర్మాణం కోసం భూమి అవసరమైనందున్న 10(ఏ) యాక్ట్ ప్రకారం భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సోమవారం గ్రామసభ నిర్వహించారు. ముందుగా ఆర్ఐ సీతారాం భూ నిర్వాసితుల పేర్లు చదివి వినిపించగా.. స్పందించిన రైతులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గ్రామసభ పెట్టడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన అనుమతులు పొందకుండానే ప్రాజెక్టు పనులు ప్రారంభించి రైతులను విడగొట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితిల్లో రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెగేసి చెబుతూ.. సర్పంచ్ శిరీషతోపాటు రైతులు అధికారుల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 2,200 ఎకరాల భూములను రైతులు ప్రాజెక్టులో కోల్పోతుండగా కేవలం 52.07 ఎకరాల్లో లావణి పట్టాలు కలిగిన నిర్వాసిత రైతులు 46 మంది పేర్లతో అధికారులు అభిప్రాయ సేకరణ కోసం గ్రామసభ పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సేకరణ అభిప్రాయ సేకరణ కోసం అధికారులు నిర్వహించిన గ్రామసభలో రైతుల నుంచి ఆందోళనలు జరుగుతాయని ముందస్తు సమాచారంతో అచ్చంపేట సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజేందర్, వెంకటేష్గౌడ్, వెంకట్రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు తమ డిమాండ్లను శాంతియుతంగా అధికారులకు తెలపాలని సూచించారు. దీంతో రైతులు పోలీసులతో తమ గొంతు నొక్కిస్తూ.. కేసులు పెట్టి భయభ్రంతులు గురిచేస్తున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతులు గ్రామసభను బహిష్కరించి వెళ్లడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాట్లాడుతున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి గ్రామసభ రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న నిర్వాసిత రైతులు తమ మధ్య చీలిక తీసుకురావొద్దని ఆగ్రహం ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయాలని వినతి బల్మూర్లో భారీగా పోలీసు బందోబస్తు రిజర్వాయర్కు సరైన అనుమతులు లేకపోవడంతో తాము జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించామని రైతులు రఘుమారెడ్డి, సుందర్రెడ్డి, ఇంద్రారెడ్డి, తిరుపతయ్య తెలిపారు. దీనిపై రిజర్వాయర్కు అవసరమైన అనుమతులు లేనిదే పనులు చేపట్టవద్దని ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండురోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం రిజర్వాయర్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్జీటీ ఉత్తర్వుల ప్రతులు, వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. దినిని ఉన్నతాధికారులకు నివేధించడంతో పాటు గ్రామసభలో రైతులు వ్యక్త పరిచిన ఆంశాలను తెలుపనున్నట్లు అధికారులు తెలిపారు. -
నాగర్కర్నూల్
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ప్రచారం ముగిసె.. రేపు ప్రత్యేక సెలవు కందనూలు: మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని బుధవారం పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందన్నారు. అలాగే ఆయా మున్సిపాలిటీల పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యాజమాన్యాలకు ఆదేశించారు. పోలింగ్ నిర్వహణకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు మంగళవారం సైతం సెలవు ప్రకటించగా ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే విద్యా సంస్థలకు గురు, శుక్రవారాలు లోకల్ హాలిడే వర్తిస్తుందని చెప్పారు. కొనసాగుతున్న నిరసన దీక్షలు చారకొండ: మండలంలోని గోకారం జలాశయంలో ముంపు గ్రామాలను మినహాయించాలని కోరుతూ చేపడుతున్న దీక్షలు 70 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఎర్రవల్లి, ఎర్రవల్లితండా నిర్వాసితులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం దీక్షలో కూర్చున్న నిర్వాసితులు మాట్లాడుతూ ప్రభుత్వంగా ఇలాగే మొండిగా వ్యవహరిస్తే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి లింగాల: జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. సోమవారం మండలంలోని అంబట్పల్లి చెంచు కాలనీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని సీహెచ్సీలు, పీహెచ్సీల ద్వారా వైద్య సేవలను మెరుగుపరచడమే కాకుండా.. తరుచుగా చెంచు పెంటలు, ఇతర మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అంబట్పల్లిలో ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యులు 150 మందిని పరీక్షించి.. 70 మందికి షుగర్, బీపీ తదితర పరీక్షలు జరపగా.. 12 మందికి టీబీ ఉన్నట్లు గుర్తించారు. వైద్య శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. జిల్లా అదనపు వైద్యా ధికారి సురేష్బాబు, వైద్యులు శరత్, జయచంద్రప్రసాద్, గైనకాలజిస్టు శిరీష, సబ్ యూనిట్ అధికారి బిక్లాల్, సూపర్వైజర్ లక్ష్మమ్మ, హెచ్ఏ రామచందర్, మల్లేష్, ఏఎన్ఎంలు, ఆశాలు, ఐటీడీఏ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.ప్రలోభాలు ఎగసె మున్సిపల్ ఎన్నికల్లో ముగిసిన ప్రచార పర్వం సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. గత పదిరోజులుగా పాటలు, ప్రసంగాలతో ప్రచారాన్ని హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. పెద్దసంఖ్యలో జనం, డీజే చప్పుళ్లు, మంది మార్బలంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా.. సోమవారం సాయంత్రం 5 గంటల కల్లా పట్టణాల్లో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. బుధవారమే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. సోమవారం సాయంత్రానికి ప్రచారం పర్వం ముగియగా.. అభ్యర్థులు పెద్దఎత్తున ప్రలోభాలకు తెరలేపారు. ప్రచారంలో పై‘చేయి’.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. అధికార కాంగ్రెస్ ప్రచార పర్వంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ర్యాలీలతోపాటు ప్రచారంలో పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరిస్తూ బలప్రదర్శన నిర్వహించింది. మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఆయన తనయుడు అరుణ్ కొల్లాపూర్ మున్సిపాలిటీకే పరిమితమై పూర్తిస్థాయిలో సమయం కేటాయించారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి ఇద్దరూ అన్ని వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కోఆర్డినేటర్గా ఉన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితోపాటు పీసీబీ మెంబర్ బాలాజీసింగ్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఖర్చులో ఎక్కడా తగ్గట్లే.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు స్వతంత్రులు ఖర్చులో ఏమాత్రం వెనకాడటం లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు మద్యం, డబ్బుతో పెద్దఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివసించే వలస ఓటర్లను ఓటింగ్కు రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున చెల్లించడంతోపాటు ప్రయాణ ఖర్చులను ముందుగానే ముట్టజెప్పుతున్నారు. పలువురు అభ్యర్థులు తమ అనుచరుల ద్వారా ఫోన్పే, గూగుల్పే ద్వారా నేరుగా ఓటర్ల ఖాతాలకు వేయిస్తున్నారు. కందనూలు: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేందుకు గాను ర్యాండమైజేషన్ పూర్తిచేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు గాను అవసరమైన సిబ్బందితోపాటు అదనంగా 20 శాతం సిబ్బందిని రిజర్వ్లో ఉంచామన్నారు. అలాగే బుధవారం పోలింగ్ ప్రక్రియకు అవసరమైన పీఓలు, ఏపీఓలు, ఓపీఓలను మూడో విడత ర్యాండమైజేషన్ ద్వారా నేరుగా ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వర్తించేలా శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికలను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి రమేష్కుమార్, ఈడీఎం నరేష్ పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ బదావత్ సంతోష్, ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్ దేవసహాయం తదితరులు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అభ్యర్థులు ఒకరికి మించి మరొకరు అన్నట్టుగా పోటీపడుతున్నారు. ఇప్పటికే మద్యం, నోటు, మాంసం రూపంలో పెద్దఎత్తున ప్రలోభాలు కొనసాగుతుండగా ఎన్నికలకు ముందు రోజు భారీస్థాయిలో డబ్బు పంపిణీకి సన్నాహాలు పూర్తయ్యాయి. రిజర్వ్డ్, జనరల్ వార్డు తేడా లేకుండా ఎక్కడ చూసినా ఒక్కో అభ్యర్థి కనీసం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వెచ్చించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పలుచోట్ల ఒక్కో ఓటుకు కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్నచోట, చైర్మన్ ఆశావహులుగా ఉన్న వార్డుల్లో ఖర్చు మరింత పెరుగనుంది. పెద్దఎత్తున మద్యం, డబ్బుల పంపిణీకి ప్రయత్నాలు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్న అభ్యర్థులు, నాయకులు గంపగుత్తగా ఓట్లు పొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న వైనం రేపే పుర సమరం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ పట్టణాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు జరిగే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. కాబట్టి పట్టణాల్లో ఎవరూ కూడా బహిరంగంగా ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని సూచించారు. అలాగే సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం పోలింగ్ ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పురస్కరించుకుని శుక్రవారం సైతం మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని, కౌంటింగ్ ముగిసే వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. -
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదాం
కొల్లాపూర్/ కల్వకుర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటుదామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను బలపర్చిన స్వతంత్ర అభ్యర్థులు 11 మంది గెలిచి మెజార్టీ స్థానాలు దక్కించుకున్నారన్నారు. ఇప్పుడు కూడా మళ్లీ బీఆర్ఎస్ బోల్తా పడుతుందన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మౌళిక సదుపాయాల కల్పన, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుపర్చడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో వైఫల్యాలు ఉన్నాయని విమర్శించారు. ● కల్వకుర్తిలో చివరిరోజు నిర్వహించిన ర్యాలీలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీక అని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి బంగారు భవిష్యత్ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఓటర్లను కోరారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజలకిచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన కల్వకుర్తి, ఆమనగల్ మున్సిపాలిటీలకు దాదాపు రూ.150 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. ప్రజల అవసరాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మున్ముందు పకడ్బందీ ప్రణాళికలతో రెండు పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. -
ఏం చేద్దాం..ఎలా గెలుద్దాం!
నగర డివిజన్లలో అభ్యర్థుల గెలుపు వ్యూహాలు పాలమూరు: మరికొన్ని గంటల్లో కార్పొరేషన్/మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడును పెంచుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ అభ్యర్థులను గెలిపించేందుకు కార్నర్ మీటింగ్లు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. చాలావార్డుల్లో త్రిముఖ, కొన్నింటిలో చతుర్ముక పోరు ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు, కొన్నివార్డుల్లో ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, రెబల్స్ బరిలో ఉన్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, దేవరకద్ర, భూత్పూర్లలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఇటీవల జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా నిర్వహించిన సభ ద్వారా కమలంలో ఒక జోష్ వచ్చింది. దీనికితోడు స్థానిక ఎంపీ డీకే అరుణ అభ్యర్థుల గెలుపు బాధ్యత తన భుజాలపై వేసుకొని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట, అమరచింత, ఆత్మకూరు, కోస్గి, నారాయణపేట, మద్దూరులో ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నగరంలో రోజుకు మూడు నాలుగు డివిజన్లలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం సాగిస్తున్నాడు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట పురపాలికల్లో ప్రతి రోజూ ప్రచారంలో పాల్గొంటున్నారు. నగరంలో ఎంఐఎం కూడా ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 9న షాషాబ్గుట్ట చౌరస్తాలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. శనివారం రాత్రి మదీనా మజీద్ చౌరస్తాలో ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభ జరిగింది. నాగర్కర్నూల్లో మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ధీటుగానే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సైతం వ్యూహాలు పన్నుతున్నారు. బీజేపీ కూడా పోటీలో ఉండడంతో దాదాపు అన్ని వార్డుల్లో త్రిముఖ పోరు కొనసాగుతోంది. వనపర్తి జిల్లాలో ఐదు పురపాలికలున్నాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి తమ అనుచరులను గెలిపించుకునేందుకు వనపర్తి, పెబ్బేరులో ప్రతిరోజూ ఓటర్లను కలుస్తున్నారు. 50 మంది ఓటర్లకో ఇన్చార్జిగా నియమించి బాధ్యతల అప్పగింత ప్రత్యేక సమావేశాలు.. రహస్య మంతనాలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేటితో ముగియనున్న ప్రచారం బరిలో ఉన్న అభ్యర్థులు కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, మైనార్టీలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. మీకేం కావాలో చెప్పండి నేను కౌన్సిలర్గా గెలవగానే ఎమ్మెల్యేతో మాట్లాడి మీ పనులన్నీ చేసి పెడుతానంటూ హామీలు గుప్పిస్తున్నారు. రేషన్కార్డులిప్పిస్తాం.. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తాం..గుడి కట్టిస్తాం.. రోడ్లు వేయిస్తాం.. కమ్యూనిటీ భనాలు నిర్మిస్తాం.. అంటూ అభ్యర్థులు ఓటర్లకు హామీలిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు సైతం తామేమి తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. డబ్బుల పంపిణీ కోసం కొంతమంది ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ప్రత్యర్థి ఎంత ఇస్తున్నాడనేది గుర్తించి అందుకు అదనంగా మరింత ఇచ్చే విధంగా కొందరు వ్యూహరచన చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లు చేస్తూ ఓటు వేయడానికి రమ్మని అభ్యర్థిస్తున్నారు. మొత్తంగా గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పోల్ మేనేజ్మెంట్ను చేపడుతున్నారు. -
మాటలు కాదు.. చేతల్లో చూపాలి
● విజన్ ఉన్న నాయకులనే ఎన్నుకోవాలి ● అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి ● డ్రెయినేజీ, పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి ● సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి ● ‘సాక్షి’ చర్చావేదికలో కందనూలువాసుల మనోగతం బస్టాండ్ విస్తరించాలి.. జిల్లాకేంద్రంలో సుమారు 30 ఏళ్ల కిందటి బస్డాండ్ భవనమే ఇప్పటికీ కొనసాగుతోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా బస్టాండ్ విస్తరణ చేపట్టాలి. చినుకు పడితే చాలు పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. టెలిఫోన్ ఎక్స్ఛేంజీతోపాటు పలుచోట్ల రోడ్లపైనే నీరు నిలుస్తోంది. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలి. – తిరుపతయ్య, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ప్రలోభాలకు లొంగకూడదు.. ఎన్నికల్లో హామీలకే పరిమితమయ్యే వారు కాకుండా చేతల్లో పనులు చేసి చూపగలిగే వారినే ఎన్నుకోవాలి. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను పట్టించుకునేవారు కావాలి. కేవలం ఎన్నికల సమయంలో నోటు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగకూడదు. అభివృద్ధి చేసే నాయకులనే ఎన్నుకోవాలి. – వెంకటస్వామి, రిటైర్డ్ ఉద్యోగి రోడ్ల నిర్మాణం చేపట్టాలి.. పట్టణంలో ప్రధానంగా సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంది. శివారు గ్రామాలతోపాటు చాలా వార్డుల్లో సీసీరోడ్లు, డ్రెయినేజీలు లేవు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించినా మురుగు బయటకు పంపేందుకు పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకాలేదు. ప్రధాన సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలి. – పడిగె తిరుపతయ్య, నాగర్కర్నూల్ డంపింగ్ యార్డు సమస్య జిల్లాకేంద్రంలో ప్రధానంగా డంపింగ్యార్డుతోపాటు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించాలి. పట్టణం నుంచి మురుగు బయటకు వెళ్లే మార్గం లేక కేసరిసముద్రం చెరువులో కలుస్తోంది. నాలాలు ఆక్రమణకు గురికావడంతో వర్షపు నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరుతోంది. చందాయిపల్లి శివారులో రైతులకు చెందిన భూముల్లో చెత్త డంపింగ్ యార్డు నిర్వహిస్తున్నారు. – వావిలాల రాజశేఖరశర్మ, నాగర్కర్నూల్ ఇళ్లలోకి వర్షపు నీరు.. వర్షం పడితే జిల్లాకేంద్రంలో రాంనగర్కాలనీతోపాటు ఇళ్లలోకే నీరంతా చేరుతోంది. డ్రెయినేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంది. బస్టాండ్, ప్రధాన చౌరస్తాల వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి. ఎన్నికల్లో సరైన వ్యక్తులనే నాయకులుగా ఎన్నుకోవాలి. సేవాభావం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలి. – లక్ష్మణ్నాయక్, టీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బస్టాండ్ ఎదుటే దుర్గంధం జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఎదుటే తీవ్రమైన పారిశుద్ధ్య సమస్య నెలకొంది. బస్టాండ్ చుట్టూ బహిరంగ మూత్రవిసర్జన చేయడంతో దుర్గంధం వస్తుంది. టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా లేదు. పెరిగిన ట్రాఫిక్, జనాభాకు అనుగుణంగా బస్టాండ్ సరిపోవడం లేదు. మహిళలు, ప్రయాణికులకు సరైన షెల్టర్ సౌకర్యం కల్పించాలి. – లక్ష్మణస్వామి, నాగర్కర్నూల్ సాక్షి, నాగర్కర్నూల్/ కందనూలు/ నాగర్కర్నూల్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే వారినే ఎన్నుకోవాలని పలువురు ఓటర్లు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ మైదానంలో ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో పట్టణ సమస్యలపై నిర్వహించిన చర్చావేదిక కార్యక్రమంలో హాజరై మాట్లాడారు. నాగర్కర్నూల్ పట్టణంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే నాయకులనే ఎన్నుకుంటామని తెలిపారు. మాటల్లో కాదు.. చేతల్లో పనులను చూపే నాయకులను ఎన్నుకోవాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం, డ్రెయినేజీల సమస్యలను తీర్చడంతోపాటు కోతులు, కుక్కల బెడదకు సైతం పరిష్కారం చూపాలని కోరారు. లో ఓల్టేజీ సమస్య.. జిల్లాకేంద్రంలో పలుకాలనీల్లో విద్యుత్ లో ఓల్టేజీతో తరచుగా సమస్య నెలకొంది. ఇళ్లలోని టీవీలు, ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవుతున్నాయి. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉన్నా నీటి సరఫరా ఉండటం లేదు. సీసీరోడ్లు, డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలి. సమస్యలకు పరిష్కారం చూపేవారిని ఎన్నుకోవాలి. – గుడిపల్లి నిరంజన్, టీచర్ సమస్యలపై దృష్టిపెట్టాలి.. ఓటరు జాబితాలో ఇష్టానుసారంగా పేర్ల మార్పులు జరిగాయి. ఒకవార్డు ఓటర్లను మరో వార్డులో చేర్చారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలి. చెత్త సేకరణ నిత్యం కొనసాగాలి. కొన్నిచోట్ల రెండు, మూడు రోజులకు ఒకసారి చెత్త సేకరణ జరుగుతోంది. డంపింగ్ యార్డు నిర్వహణ సక్రమంగా చేపట్టాలి. – మురళీధర్రావు, వ్యాపారి రోడ్లన్నీ గుంతలమయం.. జిల్లాకేంద్రంలోని బీసీకాలనీలో రోడ్లన్నీ గుంతలుగా మారాయి. వర్షం వస్తే చాలు అడుగు వేసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు సీసీరోడ్లు నిర్మించలేదు. డ్రెయినేజీలు ఏర్పాటుకాలేదు. పరిస్థితి అధ్వానంగా ఉంది. రోడ్లు, డ్రెయినేజీలతోపాటు అభివృద్ధి చేసే నాయకులనే ఎన్నుకోవాలి. – బ్రహ్మచారి, వ్యాపారి కుక్కల బెడద నివారించాలి.. జిల్లాకేంద్రంలో కుక్కలు, పందుల బెడద ఎక్కువగా ఉంది. కన్యకాపరమేశ్వరి ఆలయ సమీపంలోనే చెత్త డంపింగ్ యార్డు ఉండటంతో సమస్య ఉంది. అక్కడి నుంచి తరలించాలి. చెత్త సేకరణ సక్రమంగా ఉండేలా చూడాలి. బాధ్యత గల వారినే నాయకులుగా ఎన్నుకోవాలి. – నర్సింహ, వ్యాపారి మినీ స్టేడియం నిర్మించాలి.. జిల్లాకేంద్రంలో ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి. క్రీడల ప్రోత్సాహానికి వసతులు మెరుగుపర్చాలి. రోడ్ల మీదే చెత్తవేయడంతో పారిశుద్ధ్యం సక్రమంగా లేదు. పదవుల కోసం పాకులాడే వారిని కాకుండా ప్రజల కోసం పోరాటం చేసేవారినే ఎన్నుకోవాలి. – సాయిబాబు, లెక్చరర్ ప్రజాసేవే ముఖ్యం.. పట్టణంలో ఏళ్లుగా నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలి. ఈ రోజుల్లో డబ్బులు లేని వారు నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల్లో ఆస్తులు ముఖ్యం కాదు.. సేవాభావం, నిబద్ధత ఉన్న వారినే ఎ న్నుకోవాలి. ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అభివృద్ధిపై అంకితభావం ఉన్నవారినే గెలిపించాలి. – పచ్చిపాల సుబ్బయ్య, టీచర్ -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
కొల్లాపూర్: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్లోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేపట్టి.. వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఇంకా రెండున్నరేళ్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పనులు నిరాటంకంగా చేసుకోవచ్చన్నారు. ప్రజలు వృథా ఖర్చులు తగ్గించుకోవాలని, ఆడంబరాలకు పోయి అప్పుల పాలు కావొద్దని హితవు పలికారు. పిల్లల కోసం రూ.లక్షలు ఖర్చుచేసి ప్రైవేటు విద్యాలయాల్లో చేర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లోనే పిల్లలను చదివించాలని సూచించారు. వైద్యసేవలు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పొందాలని చెప్పారు. మోటార్ సైకిళ్లను విరివిగా వినియోగించడం వల్ల వాతావరణం కాలుష్యం అవుతుందని, ప్రతిఒక్కరూ సైకిల్ వాడకాన్ని పెంచి.. కాలుష్యాన్ని నివారించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఆయన సైకిల్ తొక్కుతూ ఎన్నికల ప్రచారం చేశారు. -
సా..గుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ
● రైతులకు అవగాహన లేకపోవడమే అసలు కారణం ● సాంకేతిక సమస్యలతోనూ తప్పని ఇబ్బందులు అచ్చంపేట: దేశాభివృద్ధిలో అన్నదాతల ప్రాముఖ్యత గుర్తించడం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో భాగంగా ఆధార్ తరహాలోనే పదకొండు అంకెలతో కూడిన యూనిక్ ఫార్మర్ ఐడీ కేటాయిస్తున్నారు. అయితే జిల్లాలో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. గతేడాది మే 5న ప్రారంభమైన ఇంత వరకు రైతుల వివరాల నమోదు 40 శాతం దాటలేదు. జిల్లాలోని 20 మండలాల్లో 3,35,013 మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారు. ఇందులో పీఎం కిసాన్ రైతులు 1,60,375 మంది ఉండగా.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న 87,339 మందికి ఐడీ క్రియేట్ అయ్యింది. పీఎం కిసాన్ వంటి ఇతర కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో క్లస్టర్ల వారీగా ఏఈఓలు రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులకు అవగాహన కల్పించకపోవడంతోనే ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సమీపంలో ఉన్న ఏఈఓలు, మీసేవా కేంద్రాల వద్దకు వెళ్తుండగా.. వారికి అనేక రకాల సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో ఓటీపీ సమయానికి రాకపోవడం, రైతులతో ఫోన్లు లేకపోవడం, ఉన్నా ఆధార్ లింకు కాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాగే ఒకే రైతుకు రెండుచోట్ల భూమి ఉండటం, భూమి ఉన్నవారు స్థానికంగా లేకపోవడం, మరణించిన వారి పేరుమీద భూమి ఉండటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ వివరాల నమోదుకు ప్రస్తుతం తుది గడువు లేదని, వచ్చే పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాల్లోకి జమ చేసే ముందు గడువు పెట్టే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ క్లస్టర్లు 143 మొత్తం భూమి 7,59,793 ఎకరాలు మొత్తం రైతులు 3,35,013 ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకున్నవారు 87,339 ఫార్మర్ రిజిస్ట్రేషన్కు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యల ఎదరువుతున్నాయి. కొందరు రైతుల ఆధార్ నంబరు ఎంట్రీ చేస్తే సరైన వివరాలు రావడం లేదు. మరికొందరు స్థానికంగా లేకపోవడం సమస్యగా మారింది. మరో నెలరోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. – యశ్వంత్రావు, జిల్లా వ్యవసాయధికారి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డు, పట్టా పాసుపుస్తకం జిరాక్స్, ఆధార్ లింకు అయిన మొబైల్ నంబరుతో స్థానిక ఏఈఓలను సంప్రదించాలి. అలాగే మీసేవా కేంద్రాల్లో సైతం రూ.30 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకసారి ఐడీ పూర్తయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చు. పీఎం కిసాన్ సాయం పొందేందుకు ఐడీ తప్పనిసరి చేశారు. ఒకే ఐడీ ఉండడం ద్వారా లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఆర్థికసాయం అందజేస్తారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన రాయితీలు, రుణాలు, పథకాలు త్వరగా అందుతాయి. భవిష్యత్లో అమలు చేసే పథకాల ప్రయోజనాలు స్పష్టమైన గుర్తింపుతో పక్కదారి పట్టే అవకాశం ఉండదు. -
నిబంధనలు పక్కాగా పాటించాలి
కందనూలు: ఎన్నికల నిబంధనలను పక్కాగా పాటిస్తూ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సజావుగా చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలలో ఈ నెల 13న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీఓలు, ఏపీఓలు, ఇతర అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపులో పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపు విధానం, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై మాస్టర్ ట్రైనర్ గోపాల్నాయక్ శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సిబ్బంది అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 6 గంటలకల్లా సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొని.. టేబుళ్ల వద్ద పోటీ చేస్తున్న అభ్యర్థుల పార్టీల గుర్తుల ప్రకారం బాక్సులు సిద్ధం చేసుకోవాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. అనంతరం పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఓపెన్ చేయాలని సూచించారు. చెల్లని ఓట్లను గుర్తించి ప్రకటించే పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. శిక్షణ తరగతుల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్ పాల్గొన్నారు. -
లోపల పొత్తులు.. బయటకు కత్తులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, వైరుధ్యాలకు సంబంధం లేకుండా చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా అంతర్గతంగా ఒప్పందాలు కుదిరిపోతున్నాయి. బాహాటంగా పొత్తు మాట లేకుండా వార్డుల్లోనే మీకిది.. మాకది అన్న చందంగా పార్టీల అభ్యర్థులు సర్దుబాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య అంతర్గత పొత్తులు, సర్దుబాట్లు ముమ్మరంగా చోటుచేసుకుంటున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు ఇతర పార్టీల అభ్యర్థులతోనూ గుట్టుగా సంప్రదింపులు జరుపుతుండటం చైర్మన్ పీఠాల కోసం పార్టీల పోటీ తీవ్రతకు అద్దం పడుతోంది. సర్దుబాట్లతో కలసిన పార్టీలు.. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్తో సంప్రదింపులు జరిపింది. అయితే చివరి నిమిషంలో ఏ పార్టీతోనూ పొత్తు పొసగలేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరికి వారు సొంతంగానే అభ్యర్థులను పోటీలో నిలిపాయి. చైర్మన్ పీఠమే లక్ష్యంగా ఈ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అంతర్గత సర్దుబాట్లు కొనసాగినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థుల గెలుపునకు అవకాశం ఉన్నచోట సహకరించడం, ఫలితంగా చైర్మన్ ఎన్నికల్లో మద్దతును పొందేలా ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది. ఈ తరహా అంతర్గత సర్దుబాట్లు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయోనని కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వనపర్తి, అమరచింతలో బహిరంగంగానే పొత్తు.. వనపర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఒప్పందంలో భాగంగా సీపీఎం పార్టీకి రెండు వార్డులను సైతం కేటాయించింది. అమరచింత మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ పది వార్డుల్లో సీపీఎం పార్టీకి మూడు వార్డులు దక్కాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో సీపీఎం పార్టీ ఒకచోట బీఆర్ఎస్, మరోచోట కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం గమనార్హం. చక్రం తిప్పేందుకు బహుముఖ వ్యూహం.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఈసారి మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు ఇతర పార్టీల అభ్యర్థులతో సైతం వేగంగా సంప్రదింపులు జరుపుతుండటం చర్చనీయాంశమవుతోంది. ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ఇతర పార్టీల్లోని అభ్యర్థులతో సైతం టచ్లోకి వెళుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడ పలువార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సరు ్దబాట్లు కొనసాగుతుండటం, చివరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. భూత్పూర్ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గద్వాలలో చైర్మన్ కోసం పోటీతీవ్రం.. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు చైర్మన్ పదవులే లక్ష్యంగా అంతర్గత సర్దుబాట్లు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న ప్రధాన పార్టీలు పార్టీలతో నిమిత్తం లేకుండా వార్డుల్లో అభ్యర్థుల సర్దుబాట్లు గద్వాల మున్సిపాలిటీలో ఈసారి చైర్మన్ స్థానం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ సైతం అంతర్గత పోరుతో ఇరువర్గాలుగా చీలిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్లోని ఓ వర్గం బీఆర్ఎస్ అభ్యర్థులతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చైర్మన్ పీఠం కోసం తీవ్రమైన పోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్లోనూ ఆపార్టీ కీలకనేత ఈ ఎన్నికల సందర్భంగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశం ఆసక్తి రేపుతోంది. -
సరైన సమయానికి టీకాలు ఇవ్వాలి
బిజినేపల్లి/ తిమ్మాజిపేట: ప్రతి చిన్నారికి సరైన సమయానికి టీకాలు ఇవ్వాలని, డ్యూలిస్ట్ ఉన్న చిన్నారులకు తక్షణమే టీకాలు అందించి పూర్తిచేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సురేష్బాబు అన్నారు. శనివారం ఆయన స్థానిక పీహెచ్సీని సందర్శించి.. టీకా రికార్డులు, నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న రొటీన్ టీకా సేవల అమలు తీరు, లబ్ధిదారుల వివరాల నమోదు, పెండింగ్ డ్యూ కేసులు, గుర్తింపు తదితర అంశాలను సమీక్షించారు. టీకా రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ నమోదులో నిర్లక్ష్యం చేయరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ చారి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ దివ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిమ్మాజిజేట మండలంలోని గుమ్మకొండ ఆరోగ్య ఉపకేంద్రం, తిమ్మాజిపేటలోని పీహెచ్సీని సందర్శించి వ్యాక్సిన్ రికార్డులు, డ్యూలిస్టు జాబితాను పరిశీలించారు. ఆయన వెంట ఏపీఓ చారి, జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, డాక్టర్ ఇస్మాయిల్ తదితరులున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 82 మంది గైర్హాజరు కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శనివారం 33 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 2,000 మంది విద్యార్థులకు గాను 1,918 మంది హాజరుకాగా.. 82 మంది గైర్హాజరయ్యారు. ప్రాక్టికల్స్ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ అర్హత పరీక్ష కందనూలు/ బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశాల కోసం 1,520 విద్యార్థులకు గాను 1,067 విద్యార్థులు హాజరు కాగా.. 11వ తరగతి కోసం 3,072 మంది విద్యార్థులకు గాను 2,353 మంది పరీక్షకు హాజరయ్యారని నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. -
ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి
లింగాల: ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచుతూ వారికి జీవనోపాధి కల్పించాలని అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి అన్నారు. శనివారం ఆమె మండలంలోని లింగాల, జీల్గుపల్లిలో పర్యటించి.. ఉపాధి పథకంలో చేపట్టిన వివిధ పనులను పరిశీలించారు. వ్యవసాయ పనులు ముగుస్తున్న ఈ సమయంలో కూలీలకు పనులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పనులు కల్పించాలని చెప్పారు. పనుల్లో పారదర్శకత ఉండాలని, నిబంధనల మేరకు పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి పంచాయతీ పరిధిలోని నర్సరీలలో మొక్కల పెంపకం చేపట్టాలని, నర్సరీల పెంపకంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు. ఇప్పటికే నాటిన మొక్కల చుట్టూ కంచెలను ఏర్పాటు చేసి కాపాడాలని కోరారు. అలాగే ఉపాధి పథకంలో చేపట్టిన కోళ్ల పెంపకం, నర్సరీలు, మొక్కల చుట్టూ కంచె ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీఓ ఇమాంఅలీ, టీఏలు శివకుమార్, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
మిగిలింది 2 రోజులే..
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా.. అంతకు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ప్రచారానికి తక్కువ సమయమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాన పార్టీల ప్రచారంలో వేగం.. ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో వేగం పెంచాయి. ఉదయం నుంచే ప్రచార రథాలు, మైక్లతో హోరెత్తిస్తున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ప్రత్యేక పాటలతో రోజంతా ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీ వార్డుల్లో కలియదిరుగుతున్నారు. వారితోపాటు సతీమణులు, కుటుంబసభ్యులు సైతం ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అరుణ్ కొల్లాపూర్ మున్సిపాలిటీలో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తీరిక లేకుండా ప్రచారంలోనే నిమగ్నమవుతున్నారు. తమకు కలిసివచ్చే అంశాలపై దృష్టిపెడుతూ ఓట్ల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సైతం తమకు పట్టున్న ప్రాంతాలపై ఫోకస్ను మరింత పెంచింది. అభ్యర్థులతోపాటు నేతలు ఉదయం నుంచి సాయంత్రం వ రకు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తూ రాత్రివేళల్లోనూ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బలప్రదర్శనపై ఫోకస్.. ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన పార్టీలు ఎన్నికల ప్రచారంలో క్రమంగా వేగం పెంచుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు బల ప్రదర్శనపై దృష్టిపెట్టాయి. ఎక్కువ మంది మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో ప్రజలను తమ వెంట ప్రచారంలో తిప్పుకొనేందుకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రచార ర్యాలీల్లో బల ప్రదర్శన చూపించడం ద్వారా తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. వలస ఓట్ల కోసం గాలింపు.. ఉమ్మడి జిల్లాలో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం అన్ని పార్టీల గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్లను గుర్తించడంతోపాటు వారి నివాస స్థలాలు, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. వారందరినీ పోలింగ్ రోజున స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి బాధ్యతలు, బాగోగులను సంబంధిత వార్డుల్లో ఇన్చార్జిలకు అప్పగిస్తున్నారు. వలస ఓటర్లకు సంబంధించి వారి ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున ముట్టజెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఓటర్ల కన్నా ముందస్తుగానే వలస ఓటర్లకు సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ప్రచార జోరు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ బలప్రదర్శనతో హోరెత్తిస్తున్న పార్టీలు మున్సిపల్ పోలింగ్కు మూడు రోజుల ముందే పట్టణాల్లో ఓట్ల కోసం ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటికే వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిత్యం ప్రచారంలో పాల్గొంటున్న వారితోపాటు వార్లుల్లో ఇంటింటికి మద్యం బాటిల్ పంపిణీ సైతం ఇప్పటికే మొదలైంది. కుల, మహిళా సంఘాల్లోని సభ్యుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తాయిళాలు ప్రకటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుండటంతో ప్రలోభాల పర్వం మరింత ఊపందుకోనుంది. -
హడలెత్తిస్తున్న పెద్ద పులి
మన్ననూర్: నల్లమలలోని అమ్రాబాద్ మండలం అటవీ సరిహద్దులో పెద్ద పులి హడలెత్తిస్తోంది. ప్రతినిత్యం వ్యవసాయ పొలాల సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా మండలంలోని జంగంరెడ్డిపల్లి, తెలుగుపల్లి, కల్ములోనిపల్లి, మాచారం, మన్ననూర్ గ్రామాల రైతులు ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న, వేరుశనగ, మినుములు, ఆముదాలు వంటి పంటలు సాగు చేశారు. ఈ పంట పొలాలు మొత్తంగా అటవీ ప్రాంతానికి సరిహద్దుగా ఉండటంతో తరుచుగా వన్యప్రాణులు జింకలు, అడవి పందులు దాడులు చేస్తాయనే ఉద్దేశంతో రాత్రి సమయంలో కాపలా వెళ్తారు. ప్రస్తుతం ఈ గ్రామాల పరిసర వ్యవసాయ పొలాల సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇదే అదునుగా వన్యప్రాణులు పంట పొలాలపై గుంపులు గుంపులుగా దాడులు చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. 20 ఎకరాల్లో పంటలు.. మండలంలోని జంగంరెడ్డిపల్లి గ్రామ రైతులు ఎల్లస్వామి, కమలేశ్వర్, వజ్రమ్మ, అర్జునయ్య తదితరులు సుమారు 20 ఎకరాల్లో మొక్కజొన్న, వేరుశనగ పంటలను అడవి పందులు నాశనం చేశాయని రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది రైతుల పొలాల వద్దకు వెళ్లి పంటల నష్టాన్ని అంచనా వేశారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు గ్రామాల సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ● శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారిపై కుంచోనిమూల సమీప అడవిలోనూ ప్రయాణికులకు పెద్దపులి తారస పడింది. ముఖ్యంగా సమీప గ్రామాల ప్రజలు ద్విచక్రవాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు స్పందించి గ్రామాల సమీపంలోని చిట్టడవిలో సంచరిస్తున్న పెద్దపులిని అభయారణ్యంలోకి పంపించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అమ్రాబాద్ అటవీ సరిహద్దుప్రాంతంలో తరుచూ సంచారం పంట పొలాలకు వెళ్లేందుకు జంకుతున్న అన్నదాతలు కాపలా వెళ్లకపోతే జింకలు, అడవి పందులు నాశనం చేస్తాయని ఆందోళన బెడద తప్పించాలని అటవీ అధికారులకు వేడుకోలు -
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి
నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఉయ్యాలవాడ మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న నైస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసే ప్రతి టేబుల్ వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రతి అభ్యర్థికి ఒక ఏజెంట్ చొప్పున ఐడీ కార్డులు జారీ చేయాలన్నారు. స్ట్రాంగ్ రూంలతోపాటు కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. 10న జరగనున్న పోలింగ్కు అవసరమైన సామగ్రి పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిని ఆదేశించారు. అంతకు ముందు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. బ్యాలెట్ పేపర్ల తనిఖీ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అలాగే రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్యాలెట్ పేపర్ల తనిఖీని పరిశీలించి, బ్యాలెట్ పేపర్లలోని వివరాలు ఫారం–7లో ఉన్న విధంగా ఉన్నాయో లేదో కచ్చితంగా నిర్ధారించుకోవాలని చెప్పారు. ఎలాంటి తప్పులు, సందేహాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. అభ్యర్థులందరికీ కౌంటింగ్ నోటీసులు తప్పనిసరిగా జారీ చేసి, ప్రతి ఒక్కరికీ సమాచారం అందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భూ సేకరణ వేగవంతం చేయండి జిల్లాలో జాతీయ రహదారి–167కే కొల్లాపూర్, నాగర్కర్నూల్ పరిధిలో ఉన్న భూ సేకరణలో పురోగతి, పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో జాతీయ రహదారి, రెవెన్యూ శాఖల అధికారులతో భూ సేకరణ, నిర్మాణ పురోగతి పనులపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. భూ సేకరణ పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. రెవెన్యూ జాతీయ రహదారి నిర్మాణ పనుల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులతో మాట్లాడి వారి ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశీఇటికాల భూసేకరణ నోటిఫికేషన్లు, పరిహారం, అవార్డుల ఖరారు వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో భూ సేకరణ అధికారి సత్యనారాయణ, డీఈ రమేష్బాబు, ఆర్డీఓలు సురేష్, బన్సీలాల్, జనార్దన్రెడ్డి, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేయాలి
కందనూలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి పర్యవేక్షణ బృందాలతో డీఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెల రోజులుగా తొమ్మిది పర్యవేక్షణ బృందాలు జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని పాఠశాలలో పరిశీలించిన అంశాలను తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి.. రికార్డుల నిర్వహణ, ఎఫ్ఎల్ఎన్ పరీక్ష విధివిధానాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పదో తరగతి విద్యార్థులకు సంబంధించి పబ్లిక్ పరీక్షలకు ఏ విధంగా తరగతులు జరుగుతున్నాయనే అంశాలను ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి విద్యాప్రమాణాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ కిరణ్కుమార్, హెచ్ఎంలు వెంకటయ్య, నరహరి, బాలీశ్వర్, నాగరాజు, తనిఖీ బృందాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దుప్పిని చంపేసింది..
అప్పులు చేసి సాగు చేసిన పంట అడవి పందుల దాడిలో ధ్వంసమైంది. నిత్యం పంట పొలానికి రాత్రి సమయంలో కాపలా వెళ్లేవాళ్లం. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుంది. వారం రోజుల క్రితం మా పొలం పక్కనే పెద్దపులి ఒక దుప్పిని చంపేసింది. అటవీశాఖ అధికారులు పంట నష్టపరిహారం అందించడంతోపాటు పెద్దపులిని దట్టమైన అడవిలోకి పంపించేలా చర్యలు తీసుకోవాలి. – నల్లపోతుల అర్జునయ్య, రైతు, జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్ మండలం పులి కదలికలు వాస్తవమే.. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో పెద్ద పులుల సంఖ్య పెరిగింది. దీంతో ఒక్కో పులి ఒక ఏరియా అడవిలో సంచరించడం మామూలే. ప్రతాపరుద్రుని కోట పరిసర ప్రాంత అడవిలో పెద్ద పులి కదలికలు ఉన్నాయనే మాట వాస్తవమే. గతంలో వాటి సంరక్షణ కోసం సాసర్లలో నీరు కూడా పోశాం. రైతులు, ప్రయాణికులు రాత్రి సమయంలో అటవీ సరిహద్దు ప్రాంతంలో రాకపోకలు చేయడం క్షేమం కాదు. మా బాధ్యతగా ప్రజలు, రైతుల రక్షణ కోసం సహాయక చర్యలు చేపడుతాం. – వీరేష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మన్ననూర్ ● -
రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
దోమలపెంట: టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు కేంద్రం సీఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఈ (సివిల్) రవీంద్రకుమార్, ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణతో కలిసి సీఈ కేక్ కట్ చేసి ఇంజినీర్లు, ఉద్యోగులకు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూగర్భ కేంద్రంలో మొదటి యూనిట్ ద్వారా 2001– 02 నుంచి విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున సిద్ధం చేస్తూ మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లతో 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మించారని పేర్కొన్నారు. 2020లో కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగో యూనిట్ మరమ్మతుకు గురవగా.. ప్రస్తుతం 5 యూనిట్ల ద్వార ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జెన్కో యాజమాన్యం భూగర్భ కేంద్రంకు 1,500 మి.యూనిట్లు టార్గెట్ నిర్దేశించగా.. 492 టీఎంసీల నీటిని వినియోగించి.. 2,544.22 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం మార్చి 31 కాగా.. ఇంకా 50 రోజులు గడువు ఉందన్నారు. ఇంజినీర్లు, సిబ్బంది అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. -
మేలురకం గ్రాసంతో పాల ఉత్పత్తుల పెంపు
ఉప్పునుంతల: పశువులు, గేదెలకు కృత్రిమ గర్భధారణతో ఆడ దూడలు పొందడం ద్వారా పాడి పశువుల సంఖ్య పెంపొందుతుందని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మర్రిపల్లిలో జిల్లా పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి శాఖ మహబూబ్నగర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పాడి పశువుల గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని స్థానిక సర్పంచు భూపాల్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి మాట్లాడుతూ పాడి రైతులు పశువులకు రోగాలకు రాకుండా ముందస్తుగానే టీకాలు వేయించాలని, పాల ఉత్పత్తులు పెంచడానికి మేలురకం పశుగ్రాసం పెంచాలని, దాణా, మినరల్ మిక్చర్ వాడాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ప్రవీణ్కుమార్, వైద్యులు బుచ్చమ్మ, అనిల్, ఉప సర్పంచు కొండల్, పశువైద్య సిబ్బంది శ్రీను, హబీబ్, మిరాజ్, గోపాలమిత్ర సూపర్వైజర్ మురళీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ బోధనతో మెరుగైన ఫలితాలు
కందనూలు: డిజిటల్ బోధనతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీపై పీఎంశ్రీ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ టూల్స్ గూగుల్ షీట్స్, వలూమి సాఫ్ట్వేర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 27 పీఎంశ్రీ పాఠశాలల్లో ఐసీటీ, ఏఐ ద్వారా విద్యాబోధన చేయాలన్నారు. ల్యాప్టాప్లు, ట్యాబ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఎంశ్రీ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే డీఈఓ కార్యాలయంలో సమాచార హక్కుచట్టంపై ఎంఈఓలు, కార్యాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి ఎండీ షర్ఫుద్దీన్, రీసోర్స్ క్లస్టర్లు కృష్ణమోహన్, జహీర్, జంగయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లమలకు విశేష ప్రాముఖ్యత
అచ్చంపేట: నల్లమల అటవీ ప్రాంతానికి విశేష ప్రాముఖ్యత ఉందని, ప్రధానంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో జీవిస్తున్న చెంచు గిరిజనుల జీవన విధానం అడవితో విడదీయరాని బంధం ముడిపడి ఉందని ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతికుమారి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట గిరిజన సంక్షేమ శాఖ శిక్షణ కేంద్రంలో గ్రూప్–1 అధికారులకు 2 బ్యాచ్లుగా మూడు రోజులుగా నిర్వహించిన నల్లమల అటవీ ప్రాంత ట్రెక్కింగ్, స్టడీ టూర్ శిక్షణ తరగతుల చివరిరోజు గురువారం నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో సందర్శించిన వివిధ ప్రదేశాల వివరాలు, అక్కడ పొందిన అనుభూతులను శిక్షణ పొందుతున్న గ్రూప్–1 అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చెంచు గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూనే వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన శిక్షణ తరగతులలో అధికారులు ఆసక్తితో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి శిక్షణ ద్వారా పరిపాలనా వ్యవస్థను నేరుగా అవగాహన చేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకొని సమర్థవంతమైన నిర్ణ యాలు తీసుకునేందుకు ఈ తరహా శిక్షణ భవిష్యత్ పాలనకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను అనుగుణంగా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు బాధ్యతాయుతంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, పొందిన అనుభవాన్ని తమ విధి నిర్వహణలో అమలు చే యాలని సూచించారు. జిల్లా యంత్రాంగం మూడురోజులుగా గ్రూప్–1 అధికారుల శిక్షణ విజయవంతం చేసేందుకు ఎంతో కృషిచేయడం జరిగిందని కలెక్టర్ బదావత్ సంతోష్ వివరించారు. అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం ట్రెక్కింగ్కు శిక్షణ అధికారులతో కలిసి శాంతికుమారి వెళ్లారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి తదితరులు పాల్గొన్నారు. చెంచుల ఆచారాలు, సంప్రదాయాలు గౌరవించాలి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ స్టడీ టూర్ పాలనకు మార్గదర్శకం కావాలి ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతికుమారి -
ఇంటర్ ప్రాక్టికల్స్కు 53 మంది గైర్హాజరు
కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్కు 53 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. గురువారం జిల్లావ్యాప్తంగా మొత్తం 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 1,833 మంది విద్యార్థులకు గాను 1,783 మంది హాజరయ్యారు. ప్రాక్టికల్స్ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ పేర్కొన్నారు. నవోదయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశాల కోసం శనివారం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్రావు అన్నారు. గురువారం నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షల కోసం కేంద్రాల సూపరింటెండెంట్లు, కేంద్రస్థాయి పరిశీలకులకు నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ పి.భాస్కర్కుమార్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్రావు మాట్లాడుతూ 9వ తరగతిలో 6, 11వ తరగతిలో 13 ఖాళీలకు గాను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,592 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం నిర్వహించే పరీక్షకు మొత్తం 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. విద్యుత్ సమస్యల గుర్తింపునకే పల్లెబాట పాన్గల్: గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకే పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో ఏడీ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండలంలోని అన్నారం గ్రామంలో ట్రాన్స్కో ఏఈ చందన్కుమార్రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. బీసీకాలనీలో మూడో విద్యుత్ తీగ ఏర్పాటు, ఎస్సీకాలనీలో రేషన్ దుకాణం వెనుక ఉన్న విద్యుత్ స్తంభాలకు తీగల బిగింపు, ధర్మరాజుగడ్డలో ఇళ్ల నడుమ ఉన్న విద్యుత్ తీగల తొలగింపు, బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో విద్యుత్ లైన్లు, పాత స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, వ్యవసాయ బోరుబావులకు డీడీలు చెల్లించిన రైతులకు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలనే సమస్యలను సర్పంచ్ వహీద్ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
సులభంగా వాహన రిజిస్ట్రేషన్
అచ్చంపేట: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై ఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి వేచి చూడాల్సిన పనిలేదు. తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) లాగే.. శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చే బాధ్యతలను ప్రభుత్వం షోరూం డీలర్లకు అప్పగించింది. ఇందుకోసం రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేయగా.. జిల్లావ్యాప్తంగా ఈ నూతన ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. ద్విచక్రవాహనాలు, కార్లకు మాత్రమే షోరూంల్లో శాశ్వత రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఆర్టీఏ కార్యాలయాల్లోనే చేయించుకోవాలి. ప్రభుత్వ నిర్ణయంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సేవలందించే ఆవకాశం ఉంటుంది. అయితే ఇటీవలే ప్రభుత్వం రోడ్డు భద్రత పేరుతో ప్రత్యేక సెస్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, కార్లకు రూ.5 వేలకుపైగా చెల్లించాలి. వాహన కొనుగోలు సమయంలోనే సెస్ చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఇలా.. కొత్త వాహనం తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లడం కోసం చాలామంది వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్ చేయించుకునే కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. షోరూంలో వినియోగదారులు వాహనం కొన్న వెంటనే టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్)నంబర్ నమోదు చేస్తారు. తర్వాత షోరూం వారే రవాణా శాఖ వాహన్ పోర్టల్ టీఆర్ సంఖ్య, ధర (ఇన్వాయిస్) ఛాసిస్ నంబరు, వాహనం ఫొటో, బీమా పత్రం, అడ్రస్ ప్రూఫ్, వినియోగదారుడి ఫొటో, దరఖాస్తుదారుడి వివరాలు అప్లోడ్ చేస్తారు. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల హార్డు కాపీని షోరూం ప్రతినిధులు రవాణా శాఖ కార్యాలయానికి పంపిస్తారు. వాటి పరిశీలన అనంతరం అధికారులు వాహన నంబర్ను కేటాయిస్తారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ) జనరేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన విషయం సంక్షిప్త సమాచారం (ఎస్ఎంఎస్) రూపంలో వాహనదారుడు, షోరూంలకు చేరుతుంది. సంబంధిత ఆర్సీ కార్డును లైసెన్స్డ్ డీలర్ ద్వారా షోరూంకు స్పీడ్ పోస్టు ద్వారా చేరుతుంది. అక్కడి నుంచి వాహనదారులు ఈ కార్డు తీసుకుంటారు. ఫ్యాన్సీ నంబర్కు.. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనానికి కోరుకున్న లేదా ఫ్యాన్సీ నంబర్ కావాలంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్తోపాటు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనపు రుసుం చెల్లిస్తే కావాల్సిన సంఖ్యను రవాణా శాఖ అధికారులు కేటాయిస్తారు. ఇందుకోసం కొంత సమయం పట్టనుండగా.. అప్పటి వరకు ఆగాల్సి వస్తుంది. జిల్లాలో 24 షోరూంలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో వివిధ కంపెనీలకు సంబంధించిన ద్విచక్రవాహన షోరూంలు 20, కార్ల షోరూంలు 4 ఉన్నాయి. నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, బిజినేపల్లి పరిధిలో రోజుకు 10 నుంచి 20 ద్విచక్రవాహనాలు, 2 నుంచి 4 వరకు కార్లు, ఇతర వాహనాలు అమ్ముడవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాహనానికి సంబంధించి అన్ని లావాదేవీలు షోరూం డీలరు ముందే వసూలు చేసేవారు. వాహనానికి సంబంధించి తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రం మాత్రమే ఇచ్చేవారు. ఆ పత్రాలు తీసుకుని రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇందుకోసం రవాణా ఖర్చులు, సమయం వృథా అయ్యేది. ముఖ్యంగా మధ్యవర్తుల ప్రమేయం మరీ ఎక్కువగా ఉండేది. ఇకపై ఆ సమస్య తీరనుంది. ఇకపై డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్లు, ద్విచక్రవాహనాలకు మాత్రమే అవకాశం వినియోగదారులకు డబ్బు, సమయం ఆదా ఆర్టీఏ అధికారులకు తగ్గనున్న పనిభారం తప్పనున్న మధ్యవర్తుల బెడద ప్రక్రియ ప్రారంభమైంది షోరూంలలో నూతన వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల 24 నుంచే ప్రారంభమైంది. టీఆర్ సంఖ్య వచ్చిన సాయంత్రానికే వాహన రిజిస్ట్రేషన్ నంబర్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సేవలు అందుతాయి. తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన అన్ని పత్రాలను ఆన్లైన్లో సాఫ్ట్వేర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. మా కార్యాలయంలో అన్ని పత్రాలు పరిశీలించి ఆమోదం తెలుపుతాం. –చిన్నబాలు, జిల్లా రవాణా అధికారి -
మిగిలింది 5 రోజులే..
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా ఎన్నికల ప్రచారానికి మాత్రం ఇంకా ఐదు రోజులే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఉన్న తక్కువ టైంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబల్స్ పోరుతో ఆందోళన.. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండటంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా మహబూబ్నగర్, గద్వాల మున్సిపాలిటీల్లో రెబల్స్ పోరు అఽధికంగా ఉండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అత్యధికంగా 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, గద్వాల మున్సిపాలిటీలో 160 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో అత్యధికులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారే రెబల్స్గా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో సొంత పార్టీలోనే ఇద్దరు అభ్యర్థుల పోటీతో ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు. మహిళా ఓట్లకు గాలం.. మున్సిపల్ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న మహిళల ఓట్లను పొందేందుకు మహిళా సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా మహిళల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. వార్డుల వారీగా మహి ళా సంఘాల బాధ్యులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నాయి. ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షే.. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే సొంత పార్టీలోనే అభ్యర్థులు రెబల్స్గా పోటీ చేయడంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికే పార్టీలో ఏళ్లుగా కొనసాగిన సీనియర్ నాయకులు టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేశారు. మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. బీజేపీ సైతం మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. అర్బన్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని ఆ పార్టీ భావిస్తోంది. పట్టణ వీధుల్లో హోరెత్తిస్తున్నప్రధాన పార్టీలు వార్డులవారీగా పార్టీ ఇన్చార్జిలకు బాధ్యతలు అభ్యర్థుల ఖర్చులకు ప్రత్యేక నేతల నియామకం గద్వాల, పాలమూరులో రెబల్స్ పోరుతో ఆందోళన -
క్షయ నిర్మూలన దిశగా..
● జిల్లాలో వ్యాధి నియంత్రణకు చర్యలు ● గ్రామాల్లోనే అదునాతన యంత్రాలతో స్క్రీనింగ్ ● వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ అనుమానితులకు పరీక్షలు.. క్షయవ్యాధి నివారణ కోసం జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి చేయడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో వైద్య సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అదే విధంగా క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిబిరాలను నిర్వహిస్తున్నాం. అనుమానితులకు పరీక్షలు నిర్వహించి.. లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందిస్తున్నాం. – డా.రవికుమార్, డీఎంహెచ్ఓ పోషకాహార లోపం లేకుండా.. జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార లోపం లేకుండా ఎస్బీఐ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న భవిష్య భారత్ సంస్థ ద్వారా పోషకాహార కిట్లు అందజేస్తున్నాం. క్షయ వ్యాధిగ్రస్తులకు తమవంతు సహకారం అందిస్తూ.. వ్యాధి నివారణకు కృషి చేస్తున్నాం. – సజ్జద్ అలీ, భవిష్య భారత్ సంస్థ జిల్లా మేనేజర్ నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో క్షయవ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వ్యాధిగ్రస్తులు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల తీవ్రత పెరిగిపోవడంతో పాటు ఇతరులకు సంక్రమిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా క్షయ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించి.. వారికి సకాలంలో చికిత్స అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులను అందజేయడంతో పాటు పోషకాహార లోపం ఉండకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘నిక్షయ మిత్ర’ కార్యక్రమం ద్వారా పోషకాహార కిట్లు అందజేస్తోంది. ముమ్మరంగా అవగాహన.. క్షయవ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యసిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి.. అనుమానితులను గుర్తించడంతో పాటు అత్యాధునిక యంత్రాలతో పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారితో పాటు దీర్ఘకాలంగా సిగరేట్, మద్యం తాగే వారి కుటుంబసభ్యులు, ఎయిడ్స్ బాధితులకు స్క్రీనింగ్ నిర్వహించి.. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి తెమడ పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో 734 మంది వ్యాధిగ్రస్తులు.. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో 734 మంది క్షయ వ్యాధిగ్రస్తులను అధికారులు గుర్తించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్య సిబ్బంది పర్యవేక్షించడంతో పాటు అవసరమైన మందులు అందిస్తూ.. వ్యాధి నివారణకు కృషి చేస్తున్నారు. అదే విధంగా వివరాలను నిక్షయ్ పోర్టల్లో నమో దు చేస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి అపోలో, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ పరిధిలోని వ్యాధిగ్రస్తులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న భవిష్య భారత్ సంస్థ ద్వారా పోషకాహార కిట్లు అందిస్తున్నారు. పోషకా హార కిట్లలో బియ్యం, కందిపప్పు, పల్లీలు, బెల్లం, ప్రోటీన్ పౌడర్ తదితర బలమైన ఆహార పదార్థాలు ఉంటాయి. జిల్లాలో క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని.. వ్యాది లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. -
కమలంలో కొత్త జోష్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/పాలమూరు: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ముందు కమల దళపతి రాకతో బీజేపీ శ్రేణుల్లో నూతన జోష్ వచ్చింది. మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనం కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగంతో కమల దళంలో ఉత్తేజాన్ని నింపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో ఉండే బూత్ స్థాయి కార్యకర్తలు, వివిధ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, ఎన్నికల్లో పోటీ కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతిసి.. ఒక వర్గాన్ని సంతృప్తి పర్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుటిల రాజకీయాలను గమనించాలన్నారు. తెలంగాణలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ‘తెలంగాణలో ఎన్నికల ముందు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహిళలనే కాదు.. రైతులను, బడుగు, బలహీన వర్గాలు, ఓబీసీలనూ మోసం చేసింది. రైతు భరోసా కింద రూ.15 వేలు, రుణమాఫీ, భూమి లేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి దగా చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఆదివాసీలు ఇలా అన్ని వర్గాల వారిని నమ్మించి నట్టేట ముంచింది. మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పినా.. ఇంత వరకు ఇవ్వడం లేదు. కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసానికి పాల్పడింది. పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అవలంబించి ప్రజాగ్రహానికి గురైంది. తెలంగాణలో అన్ని వర్గాలకూ న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. మోదీకి తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు మంజూరు చేసినా.. ఇక్కడి కాంగ్రెస్ నేతలు కావాలని విమర్శిస్తున్నారు. రైల్వేరంగంలో హై స్పీడ్ కారిడార్, హైదరాబాద్–పుణె, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చైన్నె రోడ్డు కారిడార్ మంజూరు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో తెలంగాణకు రూ.5,450 కోట్లు కేటాయించాం. యువ నాయకత్వం బీజేపీకి అండగా నిలుస్తోంది. బీజేపీ, మోదీ నాయకత్వాన్ని కోరుకుంటూ ప్రతి నగరం నుంచి ఎన్నికల కోసం పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోరాటం అధికారం కోసమో, కుర్చీ కోసం కాదు. తెలంగాణ గౌరవం కోసం. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలాన్ని గెలిపించుకోవాలి.’ అని నితిన్ నబిన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆశిష్ షెలాన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, గౌతమ్రావు, నాయకులు పోతుగంటి రాములు, గువ్వల బాలరాజు, ఆచారి, భరత్, చికోటి ప్రవీణ్, కట్టా సుధాకర్రెడ్డి, నాగురావు నామాజీ, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. పాలమూరు గడ్డ.. బీజేపీకి అడ్డా: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ పార్టీకి అడ్డాగా నిలువబోతోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో తెలంగాణ పోరుయాత్రను సైతం పాలమూరులోని మక్తల్ నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇక్కడకు వచ్చారన్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో ఏళ్లుగా చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకుంటూనే ఉన్నామని చెప్పారు. మక్తల్, ఆమనగల్ చైర్మన్ స్థానాలను గతంలోనే దక్కించుకున్నామన్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా తాము పాలమూరులో ఎంపీ సీటును గెలిచామని చెప్పారు. ఎవరితో పొత్తులు, అండ లేకుండానే ఒంటరిగా విజయాలను సాధించగలిగామని.. రానున్న రోజుల్లో పాలమూరు బీజేపీకి అడ్డాగా మారబోతుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పాలమూరు గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలను నెరవేర్చలేక పోయారని విమర్శించారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, దళిత, బీసీ వర్గాలకు ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాలంలోనూ పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇరుపార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు. పాలమూరుకు ఇప్పటికీ అన్యాయమే: రాంచందర్రావు ఇక్కడి నుంచి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయినా పాలమూరు జిల్లాకు అన్యాయమే జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. రెండేళ్లలో సీఎం ఇక్కడి ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఆలయాలను ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో హోంమంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నా లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. కేంద్ర నిధులతో మున్సిపాలిటీల అభివృద్ధి బాధ్యత బీజేపీ తీసుకుంటుందని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల శంఖారావం మోగించిన బీజేపీ భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేసిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా తెలంగాణ గౌరవం కోసమే బీజేపీ పోరాటం రాష్ట్ర భవిష్యత్ కోసం మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించండి -
ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం మొత్తం 33 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 3,144 మంది విద్యార్థులకు గాను 3,006 మంది హాజరయ్యారు. ప్రాక్టికల్స్ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అండగా నిలవాలి నాగర్కర్నూల్ క్రైం: క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధి క్యాన్సర్ అని అన్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న వారికి మద్దతుగా ఉండటంతో పాటు మానసిక ధైర్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని.. తద్వారా సరైన వైద్యం అందించి వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.రవికుమార్, ఆర్ఎంఓ డా.రవిశంకర్, గైనకాలజిస్ట్ డా.సుప్రియ, డా.అతిథి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.భరత్కుమార్ రెడ్డి, పాలియేటివ్ కేర్ మెడికల్ ఆఫీసర్ డా.మౌనిక తదితరులు పాల్గొన్నారు. అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం కందనూలు: వివక్ష, అసమానతలు లేని సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ కార్యాలయంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యాయ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏఓ జగదీశ్, సిబ్బంది పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి కందనూలు: ఎస్సీ, స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు శిక్షణకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులకు మార్చి 1న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న వారికి 5 నెలల ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి, స్టడీ మెటీరియల్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. సెమీస్కు పాలమూరు మహిళల జట్టు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో జరుగుతున్న సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 టోర్నమెంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహిళా జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకొని సెమీఫైనల్కు చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్లో జిల్లా జట్టు 10 వికెట్ల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 90 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. మహబూబ్నగర్ బౌలర్లు అనిత, మేఘన చెరో రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మహబూబ్నగర్ 10.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని పూర్తి చేసింది. జట్టులో అక్షర రాథోడ్ (46 నాటౌట్), ఆర్యాని (25 నాటౌట్)గా నిలిచారు.ఈనెల 6వ తేదీన మహబూబ్నగర్ జట్టు సెమీఫైనల్లో ఖమ్మం జట్టుతో తలపడనుంది. -
బరిలో నిలిచేదెవరో..
పోరు నుంచి వైదొలిగేందుకు కొందరు ససేమిరా ● రెబల్స్ పోరు తప్పించేందుకు నేతల ప్రయత్నాలు ● నామినేషన్ల ఉపసంహకరణకు నేడే ఆఖరు ● సాయంత్రం 3 గంటల వరకే బీఫారాల స్వీకరణ ● చివరి నిమిషంలోనే చేతికి ఇచ్చేలా వ్యూహరచన సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకే గడువు మిగిలి ఉంది. సాయంత్రం 3 గంటలలోగా అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహకరణకు అవకాశం ఇవ్వనుండగా.. ఈ క్రమంలో ఎంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహకరించుకుంటారో.. తుది పోరులో ఎంత మంది ఉంటారో అన్నది సాయంత్రానికి తేలనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఒకరికి మించి నామినేషన్లు దాఖలు చేసిన చోట అభ్యర్థులను బుజ్జగించేందుకు ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ బీఫారాలను సమర్పించేందుకు సైతం మంగళవారమే ఆఖరు కాగా.. పలుచోట్ల ఇప్పటి వరకు అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వలేదు. దీంతో పార్టీ బీఫారాల విషయంలో చివరి వరకు ఉత్కంఠ తప్పడం లేదు. ముఖ్యనేతల మల్లగుల్లాలు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో పలుచోట్ల అభ్యర్థులు ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పార్టీ తరపున బీఫారం ఎవరికి ఇవ్వాలన్న దానిపై పార్టీల ముఖ్యనేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్లో అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెబెల్స్ పోరుతో పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ముగ్గురు, కొల్లాపూర్లో ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది నామినేషన్లను ఉపసంహకరించుకున్నారు. ఇందులో బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులున్నారు. నామినేషన్ల ఉపసంహకరణకు మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు గడువు ఉండటంతో నేతల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
మంచాలకట్టను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
పెంట్లవెల్లి: కృష్ణానది తీరంలోని మంచాలకట్ట గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా, పర్యాటకులకు కనువిందు చేసే విధంగా ఉన్న ఈ గ్రామాన్ని నిత్యం పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ మేరకు సోమవారం మంత్రి గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనుల నిమిత్తం రూ.1.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో కృష్ణానది తీరాన కాటేజీలు ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ అధికారులకు ఫోన్లో సూచించారు. అలాగే గ్రామాన్ని సందర్శించి ప్రతిపాదనలు రూ పొందించాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామానికి నూతనంగా 17 ఇళ్లను మంజూరు చేశారు. గ్రామంలో ఎవరూ పూరి గుడిసెలో నివశించవద్దని, కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని చెప్పారు. అనంతరం మంచాలకట్ట గ్రామంలో గతకొద్ది రోజుల క్రితం మరణించిన రాగుల వెంకటస్వామి, రాగుల మశమ్మల కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివయ్య, నిరంజన్, బాలరాజు, గోవింద్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్/బల్మూర్: కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ ఉపాధి హామీ చట్టా న్ని వీబీజీ రామ్జీగా పేరు మార్చి రద్దు చేసే కుట్ర చేస్తోందని, పాత చట్టాన్ని కొనసాగించే వరకు ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. సోమవారం అచ్చంపేట మండలంలోని బుడ్డతండా, బల్మూరు మండలం చెంచుగూడెం గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ ఉపాధి కూలీల డబ్బులు కుదించాలని, దేవుడి పేరుతో గ్రా మీణ ప్రాంత కూలీల కడుపు కొట్టాలని చూస్తున్నార ని ఆరోపించారు. గాంధీ పథకం పేరు మార్చేశారని, మొన్నటి వరకు గ్రామసభలు నిర్వహించి పనులు చేపట్టేవారని.. ఇప్పుడు ప్రధాని చేయాలనుకునే పనులను మాత్రమే పథకంలో ఉంచాలని నిర్ణయించారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులను వారే నిర్ణయించుకోవాలని, ప్రధాని నిర్ణయాలకు ఆమోదం తెలపవద్దని సూచించారు. కూలీలు, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని అందుకు తాము మద్దతుగా ఉంటామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడండి ఈ పోరులో కూలీలు, ప్రజలకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ -
యాప్లోనే యూరియా
అచ్చంపేట: ఫెర్టిలైజన్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా విక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. సాగుతూ.. ఆగిన యూరియా బుకింగ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నెల 31 నుంచి పక్కాగా అమలవుతుండటంతో బక్ చేసుకోకుండా ఎరువుల దుకాణానికి వెళ్లితే ఎరువులు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలికారు. ఎరువుల డీలర్లు, సహకార సంఘాల సీఈఓలు తమ స్టాక్ రిజిస్టర్లు, ఐఎఫ్ఎస్సీ ఐడీలను తీసుకుని రైతు వేదికల వద్దకు రావాలని రెండు రోజుల క్రితం వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నిల్వలకు సంబంధించి సమాచారం పూర్తిస్థాయిలో తెప్పించుకుని గురువారం ఉదయం నుంచే యాప్ ద్వారా విక్రయాలు ప్రారంభించారు. దీంతో యాప్ నమోదు ప్రక్రియ మొదలైంది. ఒకసారి బుక్ చేసిన తర్వాత రోజు అర్ధరాత్రి వరకు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి కొనుగోలు చేశాకా రెండో విడత 15 రోజుల తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాలి. సాంకేతిక సమస్యలతో.. రెండు నెలల క్రితం యాసంగి సీజన్ మొదట్లోనే యూరియా పంపిణీకి ప్రభుత్వం యాప్ తీసుకొచ్చినా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సక్రమంగా పనిచేయలేదు. అధికారులు గ్రామాలకు వచ్చి రైతులకు కూపన్లు రాసిచ్చి సహకార సంఘాల ద్వారా సరఫరా చేశారు. క్యూలైన్ల బాధతప్పి సులభంగా యూరియా లభించింది. విడతల వారీగా సరఫరా.. రైతులు ఒకేసారి కాకుండా విడతల వారీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఎకరాల భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో, 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులు మూడు విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక యాప్తోనే బుకింగ్కు అవకాశం యాసంగిలోనే అమలులోకి వచ్చిన విధానం రైతులు ముందుగా బుక్ చేసుకోవాలి -
ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం
కందనూలు: జిల్లావ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జిల్లాలోని 33 కేంద్రాల్లో పరీక్ష జరగగా.. 3,148 మంది విద్యార్థులకు గాను 3,001 మంది హాజరవగా.. 147 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కల్వకుర్తి టౌన్: పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీపాద శార్వాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థికి పీజీలో 55 శాతం మార్కులతోపాటు పీహెచ్డీ, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను బుధవారంలోగా కళాశాలలో అందజేయాలని సూచించారు. ఆకట్టుకున్న ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ కందనూలు: పనోరమ ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్–2026లో భాగంగా ‘ది ఎలిమెంట్ ఆఫ్ ఎర్త్’ అనే థీమ్తో జూమ్ వేదికగా నిర్వహించిన ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఆకట్టుకుంది. శూన్యం, బిగ్ బ్యాంగ్ పుస్తక రచనలతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ప్రైవేటు టీచింగ్ ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్కుమార్ రైటర్స్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొనసాగిన కార్యక్రమంలో ఇండియా ప్రతినిధిగా పాల్గొని కవితాగానం చేశారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ అరుణ్ ‘అవని.. ప్రేమ కిరణాల కవనమై..!’ శీర్షికతో చదివిన కవిత ద్వారా గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితో విశ్వమంతా ప్రేమ మయమై, యుద్ధాలు లేని ప్రపంచంలో పర్యావరణ హితమై అందరూ సుఖశాంతులతో జీవించాలని, ప్లాస్టిక్ వినియోగ రహిత అవనిపై పచ్చని చెట్ల చిరునవ్వుల వెలుగుల మధ్య పుడమిపై పున్నమి వెన్నెల పూయాలని, లౌకిక తాత్విక స్ఫూర్తితో వసుదైక కుటుంబమై మనమంతా మెలగాలని.. తన అక్షరాలతో ప్రపంచానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ ఇరానీడౌరా కవడియా, సమన్వయకర్త రామకృష్ణ, రామ్మోహన్రావు, లక్ష్మీనారాయణ్ కొల్లి, వినోద్ కుత్తుం, మిరప మహేష్, సుధా మురళి, శ్రీ వశిష్ట సోమేపల్లి, మందారపు హైమావతి ప్రతినిధులుగా పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొనడంపై వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థులు, మిత్రులు సోషల్ మీడియా వేదికగా అరుణ్కు అభినందనలు తెలిపారు. -
విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : డీఈఓ
అమ్రాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. రాబోయే పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ముందుకెళ్లాలని సూచించారు. సోమవారం ఆయన పదర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతోపాటు మండలంలోని వంకేశ్వరం, ఉన్నత, ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ బుచ్చిబాబుతో కలిసి త నిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యా సంబంధమైన కా ర్యక్రమాలు, చదువులో విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి సామర్థ్యాలను పరీక్షించారు. వంకేశ్వరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు హరీష్కుమార్కు షోకా జ్ నోటీసులు అందాయి. డీఈఓ తనిఖీ సమయంలో ఉపాధ్యాయుడు విధుల్లో లేకపోవడంతో డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ బుచ్చిబాబు షోకాజ్ నోటీసులు అందజేశారు. అనంతరం డీఈఓ మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. -
అభయారణ్యంలో శిక్షణ అధికారుల ట్రెక్కింగ్
మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం, అటవీ లోతట్టు ప్రాంతంలోని సలేశ్వరం, అక్కమదేవి గృహలు ప్రదేశాల్లో గ్రూప్–1 శిక్షణ అధికారులు స్టడీ టూర్లో భాగంగా సోమవారం ట్రెక్కింగ్ చేశారు. ఈ ప్రాంతానికి శిక్షణ కోసం వచ్చిన 280 మంది శిక్షణ అధికారులు రెండు గ్రూప్లుగా విడిపోయారు. ఈ క్రమంలో సుమారు 140 మంది అధికారులు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సహకారంతో అభయారణ్యంలోని సలేశ్వరం, అక్కమ్మదేవి గుహలకు ట్రెక్కింగ్ చేశారు. అక్క డి ప్రదేశాల ప్రాధాన్యత, విశిష్టత తదితర వివరాలను అధికారులకు వివరించారు. సోమవారం నుంచి గురువారం వరకు మూడు రోజులపాటు జరిగే స్టడీ టూర్లో ప్రతినిత్యం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని అటవీశాఖ రేంజ్ అధికారి వీరేష్ తెలిపారు. మార్గమధ్యలో రాంపూర్ చెంచు పెంటలోని చెంచుల నివాసాలను అధికారులు పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
చారకొండ: ద్విచక్రవాహనం, డీసీఎం ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘట న ఆదివారం మండలంలో ని తిమ్మాయిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్కుమార్, మహేష్, (22) పాతకుల బన్ని (21) ముగ్గురు బైక్పై ఆదివారం మండలంలోని సారగట్ల మైసమ్మ వద్దకు వెళ్లి దైవ దర్శనం అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. ఇదే సమయంలో కల్వకుర్తి నుంచి దేవరకొండ వైపు వస్తున్న డీసీఎం బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై వెనకాల ఉన్న మహేష్, బన్ని అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న రాజ్కుమార్కు చెయ్యి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన యువకులు మహేష్ వంగూరు మండలం డిండి చింతపల్లి , బన్నిది తెల్కపల్లి మండలం గౌరారం గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. గాయాలైన రాజ్కుమార్ను అంబులెన్స్లో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘ప్రజల దృష్టి మళ్లించేలా కాంగ్రెస్ డ్రామాలు’
● మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగర్కర్నూల్ రూరల్: కాంగ్రెస్ చేస్తున్న కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసుల పేరుతో సీఎం రేవంత్రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నోటీసులు అందించి, విచారణకు రావాలని పిలవడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆదివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి, వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణను దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టిన కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత తప్పదని ఆయన హితువు పలికారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం కమీషన్లని, ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేటీఆర్, హరీశ్రావు, సంతోష్రావును వేధిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు పని చేయకుండా కేసుల చుట్టూ తిరిగేలా చేయాలనే రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
13 వరకు ‘ప్రజావాణి’ రద్దు
నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నెల 13 వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోమవారం ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రజలు కలెక్టరేట్కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ గడువు ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని, జిల్లా ప్రజలందరూ గమనించి సహకరించాలని కోరారు. గిరిజన భాషా, సంస్కృతిని కాపాడుకోవాలి కొల్లాపూర్ రూరల్: గిరిజన జాతుల భాషా, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలని గిరిజన ఆదివాసి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగానాయక్ అన్నారు. ఆదివారం మండంలోని సోమశిలలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలల్లో గెలుపొందిన గిరిజన సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మన తండాలో మన రాజ్యం’ రావాలని నినాదంతో ఎంతో మంది పోరాటాలు చేశారని, వారి త్యాగాల వల్ల గ్రామ పంచాయతీలు ఏర్పాటు అయ్యాయన్నారు. నియోజకవర్గంలో 22 మంది సర్పంచ్లు, 16 మంది ఉపసర్పంచ్లు గెలుపొందారన్నారు. మంత్రి జూపల్లి సహకారంతో తండాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు హనుమంతునాయక్ పాల్గొన్నారు. వేరుశనగ ధర రూ.10,607 కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం రైతులు పెద్ద ఎత్తున వేరుశనగ పంటను అమ్మకానికి తెచ్చారు. అత్యధికంగా క్వింటాల్కు రూ.10,607, కనిష్టంగా రూ.8,565, సరాసరి రూ.9,469కు వ్యాపారులు కొనుగోలు చేశారు. 168 మంది రైతులు 4,862 బస్తాలలో 1,458 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి తెచ్చారని మార్కెట్ కార్యదర్శి శివరాజ్ తెలిపారు. దివ్యాంగుల పెళ్లికి రూ.2 లక్షలు గద్వాల: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా దివ్యాంగులు వివాహం చేసుకుంటే రూ.2లక్షల నగదు ఇవ్వనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే వారి పేరిట రూ.2 లక్షలు ప్రభుత్వం అందిస్తుందని, ఈ పథకం జనవరి 17, 2026 నుంచి అమలులోకి వచ్చిందన్నారు. అర్హులైన వారు www. epass.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ప్రయోగ పరీక్షలకు సిద్ధం
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం ● ప్రత్యేక నిధులు కేటాయింపు ● సీసీ కెమెరాల మధ్య పర్యవేక్షణ ● జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాల్లో నిర్వహణ కందనూలు: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్ పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఇందులో ప్రైవేటు 19, ప్రభుత్వ 16, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ మొత్తం 54 కళాశాలల్లో 9,861 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. ఇందులో ఒకేషనల్ విద్యార్థులు 4,704 మంది కాగా.. జనరల్ విద్యార్థులు 5,157 మంది పరీక్ష రాయనున్నారు. రూ.50వేలు.. ప్రాక్టికల్ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. విద్యార్థులతో ప్రయోగాలు చేయించేందుకు అవసరమైన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేశారు. జిల్లాలో ప్రభుత్వ, కస్తూర్బా, మోడల్ కళాశాలలు కలిపి మొత్తం 27 కళాశాలున్నాయి. ప్రతి కళాశాలకు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.13.50 లక్షలు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ ఖాతాలోకి జమ చేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారుల పర్యవేక్షణలో కలెక్టర్ అనుమతితో కళాశాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రైవేట్ కళాశాలలకు సెల్ఫ్ సెంటర్ ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం తమ సొంత కళాశాలల్లో ప్రాక్టికల్స్ పరీక్షలు రాసే అవకాశం లేదు. ఇంటర్ అధికారులు నిర్ధేశించిన కళాశాలలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రైవేటు కళాశాలలు మాత్రం సెల్ఫ్ సెంటర్లలోనేపరీక్షలు రాసుకునే అవకాశం కల్పించారు. ప్రైవేటు కళాశాలలు ర్యాంకులే పరమావధిగా ప్రాక్టికల్స్లో అవకతవకలకు పాల్పడుతున్నాయని ప్రతి ఏడాది ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సారి ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ప్రతి ల్యాబ్లో నాలుగు మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటికి వాయిస్, వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఈ కెమెరాలు నేరుగాఇంటర్బోర్డు కమిషనర్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. -
ఏర్పాట్లు చేస్తున్నాం..
ఇంటర్ ప్రాక్టికల్స్ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు 33 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చి బోర్డు కమాండ్ కంట్రోల్ రూం సర్వర్కు అనుసంధానం చేశాం. ప్రాక్టికల్స్ పరికరాలు కొనుగోలు చేయడానికి ఒక్కో కళాశాలకు రూ. 50 వేలు మంజూరయ్యాయి. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించాం. – వెంకటరమణ, డీఐఈఓ, నాగర్కర్నూల్ ఇబ్బందులు లేకుండా.. ప్రయోగ పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రాక్టికల్స్కు అవసరమైన ల్యాబ్ పరికరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. – రాజేశ్వర్, కెమిస్ట్రీ అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల నాగర్కర్నూల్ ● -
మరోసారి భంగపాటే..
కేంద్ర బడ్టెట్లో జిల్లా ప్రజలకు మరోసారి భంగపాటు మిగిల్చింది. పేద, మధ్య తరగతి ప్రజలకు కేటాయింపులు ఇవ్వలేదు. ఏకలవ్య స్కూల్, కేంద్రీయ విద్యాలయం ఒక్కటి కూడా లేదు. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ విస్మరించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న మాచర్ల–గద్వాల రైల్వేలైన్ ఊసే ఎత్తలేదు. రైతులు, యువతకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు లేవు. జిల్లాకే కాదు తెలంగాణకు సంబంధించి చెప్పుకోదన్న నిధుల కేటాయింపు జరగలేదు. విభజన హామీలను గాలికొదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా వాటిని పరిగణలోకి తీసుకోలేదు. బడ్టెట్ పేదలకు నిరాశే మిగిలింది. – డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, అచ్చంపేట వికసిత్ భారత్ లక్ష్యం.. దేశాన్ని 2047కల్లా వికసిత్ భారత్గా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉంది. కేంద్రంలో ఉన్న సుస్థిత ప్రభుత్వ అభివృద్ధి కొనసాగేలా ఉంది. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ, రైతుల ఆదాయం పెరిగేలా పంటలను ప్రోత్సహించనున్నారు. పశుపోషణ, మత్స్యకారులకు ఆదాయం పెంచేందుకు చర్యలున్నాయి. హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైల్వే ద్వారా ఇక్కడి ప్రాంతానికి ప్రయోజనం ఉంటుంది. – నరేందర్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నాగర్కర్నూల్ సంపన్నులకు మేలు చేసేలా.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సంపన్నులు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేదిగా ఉంది. ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు ఒరిగేదేమి లేదు. అదే విధంగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం, పంట దిగుబడికి మద్దతు ధరకు ఎలాంటి భరోసా దొరకలేదు. వెంటనే బడ్జెట్ను సవరించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలి. జిల్లాలో రైలు మార్గాలు నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, వేగంగా పనులు పూర్తి చేయాలి. – వర్ధన్ పర్వతాలు, సీపీఎం జిల్లా కార్యదర్శి ● -
సామాన్యులకు వ్యతిరేకం..
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. రాష్ట్రంతోపాటు వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేవు. విభజన సమయంలో హామీ ఇచ్చిన విధంగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో ప్రస్తావన కూడా లేదు. ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులు పెంచలేదు. నిరుద్యోగులు, నిత్యావసర ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు కనిపించలేదు. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ రాష్ట్రంపై నిర్లక్ష్యం.. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రా న్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదు. పర్యాటకరంగ అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకోలేదు. పేదలు, మధ్యతరగతి వర్గాలపై దృష్టిపెట్టలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు రైల్వేతోపాటు జాతీయ రహదారుల ప్రస్తావన లేదు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి ● -
4న పాలమూరుకు నితిన్ నబీన్
● ఎంవీఎస్ కళాశాలలో కార్యకర్తలసమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ● ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ డీకే అరుణ పాలమూరు: ఫిబ్రవరి 4వ తేదీన మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి జిల్లా బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా హాజరవుతున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. శనివారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానాన్ని బీజేపీ నేతలతో కలిసి ఎంపీ పరిశీలించారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు అది కూడా పాలమూరు జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు, బూత్ కమిటీల సభ్యులు, బూత్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, అన్ని రకాల మోర్చా అధ్యక్షులు ఇతర కార్యవర్గం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరు కావాలన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే విధంగా ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకోవాలని, ఈ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుంటుందని యువత అధికంగా కమలం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాబోతుందన్నారు. ఆమె వెంట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సొంత ఆలోచనలు అమలు చేయకుండా.. సమన్వయంతో, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పనిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో పీఓలు, ఏపీఓలు, ఓపీలకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత, క్రమశిక్షణ పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్లో ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ఈ నెల 8న రెండో విడత శిక్షణ తరగతులు ఆయా మున్సిపాలిటీల పరిధిలో నిర్వహిస్తామని, అదేరోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల అధికారులు 10న మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్కు సకాలంలో చేరుకొని సామగ్రిని సరిచూసుకోవాలన్నారు. 11న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి.. సాయంత్రం 5 గంటల వరకు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. -
ఈసారైనా.. పట్టాలెక్కేనా?!
ప్రతిసారి పాలమూరుకు దక్కని కేటాయింపులు ● ఏళ్లుగా పెండింగ్లోనే గద్వాల–మాచర్ల రైల్వేలైన్ ● ఇంకా ప్రారంభం కాని మహబూబ్నగర్– డోన్ రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుదీకరణ ● నేటి కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల ఆశలు మహబూబ్నగర్– డోన్ రైల్వే లైన్ డబ్లింగ్తోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం మూడేళ్ల కింద కేంద్రం రూ.60 కోట్లు కేటాయించింది. అయితే ఈ మేరకు పనులు పూర్తికాలేదు. మేడ్చల్– ముద్ఖేడ్, మహబూబ్నగర్– డోన్ సెక్షన్ల మధ్య విద్యుద్దీకరణ కోసం మొత్తం రూ.122.81 కోట్లు అవసరమని అంచనా వేసినా, ఇందుకు అవసరమైన నిధులు కేటాయించలేదు. ఈ మార్గంలో రైల్వే లైన్ డబ్లింగ్తోపాటు బైపాస్ లైన్, విద్యుద్దీకరణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించాల్సి ఉంది. సాక్షి, నాగర్కర్నూల్: కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈసారైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేటాయింపులు దక్కాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్లకు ఈసారి బడ్జెట్లో నిధులు మంజూరవుతాయన్న ఆశలు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుపర్చడంతోపాటు కొత్త రైల్వేలైన్లకు నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే ప్రతిసారి కొత్త రైల్వేలైన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం.. సర్వేలకే పరిమితం చేస్తుండటం నిరాశ కలిగిస్తోంది. కానీ, ఈసారి బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు దక్కుతాయన్న ఆశలు నెలకొన్నాయి. 30 ఏళ్ల నుంచి ప్రతిపాదనలకే.. కృష్ణా– వికారాబాద్– గద్వాల– డోర్నకల్ కొత్త రైల్వే లైన్ నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలోని కృష్ణా నుంచి వికారాబాద్ వరకు 87 కి.మీ., మేర రైల్వే లైన్ కోసం 30 ఏళ్ల కిందట ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకు ఐదుసార్లు సర్వే పూర్తిచేసినా పనులు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు మంజూరుకావడం లేదు. ● గద్వాల– డోర్నకల్ లైన్కు 20 ఏళ్ల కిందట రూ.190 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడుసార్లు సర్వే పనులు పూర్తిచేసినా.. బడ్జెట్లో మాత్రం కేటాయింపులు దక్కడం లేదు. ● కొత్తగా అచ్చంపేట– మహబూబ్నగర్– తాండూరు మార్గంలో సుమారు 180 కి.మీ., కొత్త రైల్వేలైన్ కోసం రూ.360 కోట్లతో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే నిధులు కేటాయించకపోవడంతో ఆ ఆమోదం ప్రతిపాదనలకే పరిమితమైంది. ● గద్వాల– వనపర్తి– నాగర్కర్నూల్– గుంటూరులోని మాచర్ల వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏళ్లుగా కేంద్ర బడ్జెట్లో ఈ ఊసే కనిపించడం లేదు. వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. పెద్ద సంఖ్యలో స్థానికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉపాధి కోసం ఎలాంటి పరిశ్రమలు లేక ఇక్కడి నుంచి పనికోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధి కోసం అవసరమైన నిధులతోపాటు కొత్త జిల్లాలకు నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాల్సి ఉంది. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలనను అధికారులు పూర్తిచేశారు. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో 65 వార్డులకు గాను మొత్తం 402 నామినేషన్లు రాగా.. ఎన్నికల అధికారులు అన్నింటికీ ఆమోదం తెలిపారు. దాఖలైన నామినేషన్లలో ఏవీ తిరస్కరణకు గురికాలేదు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 142 మంది అభ్యర్థులకు గాను మొత్తం 151 నామినేషన్లు, కల్వకుర్తి మున్సిపాలిటీలో 103 మంది అభ్యర్థులకు గాను 106 నామినేషన్లు, కొల్లాపూర్ మున్సిపాలిటీలో 93 మంది అభ్యర్థులకు గాను దాఖలైన 145 నామినేషన్లను పరిశీలించి ఆమోదించారు. పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ఏర్పాట్లు కల్వకుర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి పకడ్బందీగా ఎక్కడ ఎలాంటి తప్పులకు తావివ్వకుండా చేపట్టాలని జిల్లా జనరల్ అబ్జర్వర్ రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం కల్వకుర్తిలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను ఆమె స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రిటర్నింగ్ అధికారులు పూర్తిగా నామినేషన్లను పరిశీలించి ఎలాంటి తప్పిదాలు లేని వాటిని పరిశీలించి తుది జాబితాను ప్రకటించాలని సూచించారు. అనంతరం డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ ఏర్పాటు చేసే బీఈడీ కళాశాలను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల విధులకు వచ్చే అధికారులకు వీలుగా రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూం, ఎన్నికల అనంతరం కౌంటింగ్ చేపట్టే హాల్ పరిసరాలను పరిశీలించారు. విధులకు వచ్చే అధికారులు, సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్కు సూచించారు. అదేవిధంగా ఎక్కడ ఎలాంటి లోపాలకు తావివ్వకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేలా అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఎంపీడీఓ వెంకట్రాములు, మున్సిపల్ ఏఈ షబ్బీర్ తదితరులున్నారు. -
కృష్ణాతీరంలో ఆలయాల అభివృద్ధి కృషి
పెంట్లవెల్లి: కృష్ణానది తీరంలో వెలసిన పురాతన ఆలయాల అభివృద్ధి కృషిచేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని జటప్రోల్ గ్రామంలో సురభి రాజవంశస్తులు ప్రతిష్టించిన శ్రీమదనగోపాలస్వామి ఆలయాన్ని ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ బెంగళూరుకు చెందిన రాజాతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే పేరు పొందేవిధంగా ఈ ఆలయాలను తీర్చిదిద్దుతానని చెప్పారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మారుస్తామన్నారు. జటప్రోల్ గ్రామానికి ఉన్న చరిత్ర ఎంతో గొప్పదని, ఒకవైపు పురాతనమైన ఆలయాలు, రాజాగారి కోటలు, చరిత్ర కలిగిన దర్గాలు, సురభి రాజవంశస్తులు పాలించిన సంస్థానం ఈ జటప్రోల్ గ్రామం అన్నారు. కార్యక్రమంలో గోవింద్గౌడ్, భీంరెడ్డి, నాగిరెడ్డి, నరేష్, కుర్మయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
65 వార్డులు.. 521 నామినేషన్లు
ముగిసిన నామినేషన్ల దాఖలు పర్వం ● అత్యధికంగా నాగర్కర్నూల్లో 224.. అత్యల్పంగా కొల్లాపూర్లో 145 ● చివరిరోజు పోటెత్తిన అభ్యర్థులు ● బీఫారాలపై వీడని ఉత్కంఠ సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం ఆఖరు రోజున నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు పోటెత్తారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో 65 వార్డులకు గాను మొత్తం 521 నామినేషన్లు రాగా.. చివరి రోజున 312 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 224, కల్వకుర్తిలో 152, కొల్లాపూర్ మున్సిపాలిటీలో 145 నామినేషన్లు వచ్చాయి. మొత్తం నామినేషన్లలో కాంగ్రెస్ తరపున 148, బీఆర్ఎస్ 131, బీజేపీ 71, ఇతర పార్టీలు 18, ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి 70 నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసినా పార్టీల అభ్యర్థిత్వంపై స్పష్టత కరువైంది. ఇప్పటి వరకు పార్టీల బీఫారాలు ఇవ్వకపోవడంతో ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో పలుచోట్ల ఇద్దరు చొప్పున నామినేషన్లు వేశారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని ఆరో వార్డులో కాంగ్రెస్ తరపున తైలి శ్రీనివాసులుతోపాటు మరో అభ్యర్థి శ్రీను సైతం నామినేషన్ వేశారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నామినేషన్లు వేయడంతో చివరకు బీఫారం ఎవరికి దక్కుతుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్లో పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కాకపోయినా ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో రిజర్వ్డ్ స్థానాలతోపాటు పలుచోట్ల ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి వర్గీయులు, ఎంపీ మల్లు రవి వర్గీయులు టికెట్ల కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కాకున్నా ఎవరి వారు నామినేషన్లు సైతం దాఖలు చేశారు. బీఫారం ఇచ్చే క్రమంలో గ్రూప్ రాజకీయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. టికెట్టు దక్కకపోతే రెబల్గానైనా బరిలో ఉండేందుకు కసరత్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టికెట్టు దక్కని వారిని బుజ్జగించి నామినేషన్ ఉపసంహరింపజేయడం ముఖ్య నేతలకు ఇబ్బందికరంగా ఉండనుంది. జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిర్వహించనుండగా, ఈసారి మిగతా మున్సిపాలిటీలకు భిన్నంగా కల్వకుర్తిలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండనుంది. నాగర్కర్నూల్, కొల్లాపూర్లో బీజేపీ నుంచి నామమాత్రపు పోటీ ఉండగా, కల్వకుర్తిలో మాత్రం బీజేపీ తరపున అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున 71, బీఆర్ఎస్ 59 నామినేషన్లు రాగా, బీజేపీ నుంచి 8 మాత్రమే నామినేషన్లు వచ్చాయి. కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 32, బీజేపీ 24 నామినేషన్లు వచ్చాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 50, బీఆర్ఎస్ 40, బీజేపీ తరపున 39 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉండటం, ఇప్పటి వరకు పార్టీల అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులకు నచ్చజెప్పేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే నామినేషన్లను దాఖలు చేయగా ఉపసంహకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ బీఫారం ఇచ్చాక పెద్దఎత్తున అసమ్మతి చెలరేగకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా ఫిబ్రవరి 2 వరకు బీఫారాలు అందించిన అభ్యర్థులకు పార్టీ గుర్తులను కేటాయిస్తారు. మిగతా వారికి ఇండిపెండెంట్ గుర్తులు కేటాయించనున్నారు. పార్టీ నుంచి బీఫారాలు దక్కకపోయినా ఇండిపెండెంట్గా సైతం బరిలో ఉండేందుకు ఎక్కువ మంది సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకే పార్టీకి చెందినవారు పోటీలో ఉంటే ఓట్ల చీలకతో ముప్పు వస్తుందని పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో నామినేషన్ వేస్తున్న ఓ అభ్యర్థి మున్సిపాలిటీ చివరిరోజు మొత్తం వచ్చినవి నాగర్కర్నూల్ 139 224 కల్వకుర్తి 81 152 కొల్లాపూర్ 92 145 -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
కల్వకుర్తి టౌన్: గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఎవరో అని చెబితే నిర్వాహకులు, వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆధునిక యుగంలో కూడా అమ్మాయిలపై వివక్ష వలన కొందరు స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుని అబార్షన్లు చేయించుకోవడం వలన జిల్లాలో వెయ్యి మంది అబ్బాయిలకు 894 అమ్మాయిలకు జన్మనిస్తున్నారని, దీని వలన లింగ నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం అమ్మాయిలు, అబ్బాయిలతో సమానంగా పోటీపడుతూ అన్ని రంగాలలో రాణిస్తున్నారని, అమ్మాయిలపై వివక్ష తగదన్నారు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో నిర్వహిస్తున్న పరీక్షలు, రికార్డులు, ఫాం–ఎఫ్లను ఆయన తనిఖీ చేశారు. లింగ నిర్ధారణ నిషేధ చట్టం బోర్డులను తప్పనిసరిగా స్కానింగ్ సెంటర్లో ప్రదర్శించాలని వైద్యులకు సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, ప్రోత్సహించిన వారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే లాబోరేటరీ పరీక్షల రేట్ల పట్టికను బయట ప్రదర్శించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్, ఉప జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి తదితరులున్నారు. -
జలాశయం సామర్థ్యం తగ్గించే దాకా ఆందోళన
చారకొండ: డిండి– నార్లాపూర్ నిర్మాణంలో భాగంగా మండలంలోని గోకారం శివారులో చేపడుతున్న జలాశయం సామర్థ్యం తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిర్వాసితులు అన్నారు. ఎర్రవల్లిలో నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాటికి 60 రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి.. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ముంపునకు కాకుండా చూడాలన్నారు. ఇదే డిమాండ్తో ఇటీవల పంచాయతీ ఎన్నికలు బహిష్కరించి.. వివిధ రకాలుగా నిరసనలు తెలిపినా.. ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేపడుతామని హెచ్చరించారు. రిలే దీక్షల్లో కూర్చున్న నిర్వాసితులు -
షికారుతో పాలిట్రిక్స్!
గద్వాలలో కీలక రాజకీయ పరిణామాలు ● బండ్ల, సరిత వర్గ పోరులో మారిన పుర ఎన్నికల ముఖచిత్రం ● కాంగ్రెస్లో టికెట్ల నిరాకరణతో సరిత వర్గీయుల నారాజ్ ● బీఆర్ఎస్ నుంచి పలు వార్డుల్లో పోటీకి రంగం సిద్ధం ● మరికొందరు స్వతంత్రంగా బరిలోకి.. ● నామినేషన్ల చివరి రోజు బహిర్గతం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఆధిపత్య, వర్గ రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఉమ్మడి పాలమూరులోని గద్వాల జిల్లాలో మరోసారి కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పుర ఎన్నికల వేళ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య చోటుచేసుకున్న టికెట్ల లొల్లి కాంగ్రెస్లో చిచ్చు రాజుకోగా.. పట్ణణంలో పోరు ముఖచిత్రాన్ని మార్చేసింది. నామినేషన్ల ఘట్టం చివరి రోజు శుక్రవారం అనూహ్యంగా తారుమారు పాలి‘ట్రిక్స్’తెరపైకి రాగా.. ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా మారింది. బీఫాంలు ఎవరికో.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య లొల్లి కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు కాంగ్రెస్లో చేరినా.. వారి మధ్య అగాధం పెరుగుతూనే వచ్చింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సైతం ఇరు వర్గాలు పోటీ పడినప్పటికీ.. పార్టీ గుర్తుపై జరిగేటివి కాకపోవడంతో ఎవరు గెలిచినా కాంగ్రెస్ మద్దతుదారులుగా ముద్రపడ్డారు. కానీ మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగేటివి కావడంతో ప్రస్తుతం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు కొందరు సరిత వర్గీయులు ఇటు కాంగ్రెస్తోపాటు అటు బీఆర్ఎస్ తరఫున కూడా నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో బీఫాంలు ఎవరికి దక్కుతాయి.. ముఖ్య నేతలు సయోధ్యకు చొరవ తీసుకుంటారా అనేది చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగిందంటే.. గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. పురపాలికలకు ఎన్నికల కసరత్తు జరుగుతున్న క్రమంలో తన వర్గానికి 20 కేటాయించాలని సరిత అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహబూబ్నగర్లో పర్యటించిన క్రమంలో కూడా ఆమె ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇందుకు ససేమిరా అంటూ నిరాకరించినట్లు సమాచారం. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో కౌన్సిలర్, పుర పీఠం ఎలా దక్కించుకోవాలో తనకు తెలుసని.. ఆ వర్గానికి ఒక్క టికెట్ కేటాయించినా మీ ఇష్టమని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో 20 నుంచి 12.. ఆ తర్వాత పది టికెట్లయినా కేటాయించాలనే ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. చివరకు తన వర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులకు టికెట్లు ఖరారు చేయాలని కోరగా.. తనకు వారు నేరుగా ఫోన్ చేస్తే కేటాయిస్తానని చెప్పినట్లు వినికిడి. ఇందులో ఒకరు ఫోన్ చేయగా.. ఆయనకు టికెట్ ఖరారు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థులతో నామినేషన్లు వేయించగా.. ఈ కార్యక్రమానికి సరిత, ఆమె వర్గీయులు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్తో టచ్లోకి.. ఆ వెంటనే.. టికెట్ల నిరాకరణతో నారాజ్లో ఉన్న సరిత వర్గీయులు నామినేషన్ల చివరి రోజు కీలక అడుగులు వేశారు. దాదాపు 15 వరకు వార్డుల్లో ఆమె మద్దతుదారులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున కాకుండా కొందరు స్వతంత్రంగా, మరికొందరు బీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. మూడు, నాలుగు రోజుల క్రితమే పలువురు బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వెళ్లడం.. వారి అంగీకారంతోనే పలు వార్డులకు వారు ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు నామినేషన్ల అనంతరం కారెక్కేందుకు వారు రంగం సిద్ధం చేసుకోవడం ముందస్తు స్కెచ్లో భాగమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారిని కట్టడి చేయలేక సరిత చేతులెత్తేసిందా.. ఎమ్మెల్యేను ఢీ కొట్టేందుకే తన వ్యూహంలో భాగంగా వారిని ఆ పార్టీలోకి పంపించిందా అనే దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. -
కాసుల గలగల..
● జోరుగా ఆస్తి, కుళాయి పాత బకాయిలు వసూలు ● అభ్యర్థితోపాటు ప్రతిపాదకుల పన్నులన్నీ క్లియర్ కల్వకుర్తి టౌన్: ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీలకు చాలావరకు పేరుకుపోయిన పాత బకాయిలు వసూలయ్యాయి. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులతోపాటు ప్రతిపాదకుల ట్యాక్స్లు క్లియర్ చేస్తుండటంతో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరింది. ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులలో చాలావరకు కలెక్షన్లు వసూలు అయ్యాయి. ప్రతి ఏడాది మార్చి నెలలో ఎంతో పకడ్బందీగా చేపట్టి కలెక్షన్లను మున్సిపల్ అధికారులు రాబడతారు. కానీ, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు బయట తిరగకుండానే.. ప్రజలే కార్యాలయానికి వచ్చి ట్యాక్స్లు కట్టేందుకు క్యూలైన్లలో నిల్చుని మరీ చెల్లించారు. రెండు, మూడేళ్లవి సైతం.. మున్సిపాలిటీలలో చాలా వరకు రెండు, మూడేళ్లకు సంబంధించిన పన్నులు పేరుకుపోయాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులతోపాటు ప్రతిపాదకులవి సైతం పాత బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా కుళాయి పన్నులు ఆన్లైన్ చేయడంతో ప్రజలంతా కుళాయి బిల్లులకు రావడం లేదని, తర్వాత చూద్దామని ప్రజలు వదిలేశారు. ఇప్పుడు అది అంతా ఆన్లైన్ కావడంతో అందరికి ఓవరాల్గా సుమారు రూ.3– 5 వేల మధ్యలో ఆయా మున్సిపాలిటీలలో నల్లాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో వచ్చాయి. అందరూ ట్యాక్స్లు క్లియర్ చేశాక నోడ్యూ కోసం వెళితే అక్కడి అధికారులు నల్లా బిల్లులు సైతం క్లియర్ చేయాలని చెప్పడంతో విషయం వారికి అవగతమైంది. ఇలా జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో కలిసి సుమారు ఆస్తి పన్ను రూ.50 లక్షలు, నల్లా పన్ను రూ.12 లక్షలు వసూలు అయ్యాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి తనకు సంబంధించిన సుమారు రూ.16 లక్షలు పన్నులు చెల్లించాడని అధికారులు తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆస్తి, నల్లా పన్నులు బాగానే వసూలయ్యాయి. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చాలామంది పన్నులు ఏకకాలంలో కట్టేశారు. అభ్యర్థితోపాటు ప్రతిపాదకుడి ట్యాక్స్లు క్లియర్ ఉండాలనే నిబంధనతో మందుకు వచ్చారు. పన్నులు చెల్లించిన తర్వాత వార్డు ఆఫీసర్లు వారికి నోడ్యూ సర్టిఫికెట్లను ట్యాక్స్లకు సంబంధించి జారీచేశారు. – మహమూద్ షేక్, మున్సిపల్ కమిషనర్, కల్వకుర్తి ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలకు సమకూరిన ఆదాయం -
వ్యాక్సినేషన్ నిర్వహణలో అలసత్వం వహించొద్దు
నాగర్కర్నూల్ క్రైం/తెలకపల్లి: జిల్లాలో మాతా శిశువులకు అందించే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, నిల్వల నిర్వహణలో అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని డీఎంహెచ్ఓ డా.రవికుమార్ అన్నారు. గురువారం జిల్లా వ్యాక్సిన్ స్టోర్ను సందర్శించి.. టీకాల నిల్వలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. టీకాల కొరత రాకుండా ముందస్తుగానే ఇండెంట్లు పంపాలని, అత్యవసర నిల్వలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు వంద శాతం వ్యాక్సినేషన్ దిశగా ముందుకు సాగాలన్నారు. డీఎంహెచ్ఓ వెంట జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ సురేశ్కుమార్, కళ్యాణ్ పాల్గొన్నారు. ● తెలకపల్లి మండలం ఆలేరులోని ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్, పెద్దూరు ఆరోగ్యకేంద్రాన్ని డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసంక్రమిక వ్యాధుల స్క్రీనింగ్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యసిబ్బందికి డీఎంహెచ్ఓ సూచించారు. -
యూరియా కోసం పడిగాపులు
పెద్దకొత్తపల్లి: యూరియా కష్టాలు రైతులకు తీరడం లేదు. పంటలకు అవసరమైన యూరియా కోసం పొద్దస్తమానం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. గురువారం కొత్తపేట సింగిల్విండో పరిధిలోని రైతులు తెల్లవారుజామునే యూరియా కోసం పీఏసీఎస్ వద్దకు చేరుకొని పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్ను క్యూలైన్లో ఉంచి అధికారుల కోసం గంటల తరబడి ఎదురుచూశారు. తీరా అధికారులు, సిబ్బంది వచ్చాక మొదటి వరుసలో ఉన్న రైతులకు మాత్రమే యూరియా లభించింది. మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. మండలంలోని రైతులు వరితో పాటు మొక్కజొన్న పంటను అధికంగా సాగుచేశారు. రెండు పంటలకు ఒకేసారి యూరియా అవసరం ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటి వరకు వచ్చిన యూరియాను అవసరం ఉన్న రైతులతో పాటు అవసరం లేని వారు కూడా తీసుకెళ్తుండటంతో కొరత నెలకొంటోంది. ఇకపై యూరియా యాప్లో బుకింగ్ చేసుకునే రైతులకే యూరియా అందించనున్నట్లు ఏఓ శిరీష తెలిపారు. -
నేడే ఆఖరు
● రెండో రోజు నామినేషన్లకు పోటెత్తిన అభ్యర్థులు ● గురువారం ఒక్కరోజే 177 దాఖలు సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో రెండో రోజు గురువారం 177 నామినేషన్లు దాఖలయ్యాయి. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు 209 నామినేషన్లు వచ్చాయి. వీటిలో కాంగ్రెస్ తరఫున 68, బీఆర్ఎస్ నుంచి 75, బీజేపీ నుంచి 27, ఇతర పార్టీల నుంచి 5, ఇండిపెండెంట్ అభ్యర్థులు 31 నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లతో పోటెత్తనున్నారు. బీఫారాలపై వీడని ఉత్కంఠ.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు గడువు సమీపించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు ఇప్పటివరకు బీఫారాలు దక్కలేదు. పార్టీ టికెట్పై స్పష్టత లేకపోయినా ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి ఒక్కో వార్డులో ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు సమర్పించారు. మున్సిపల్ నామినేషన్లకు చివరి రోజైన శుక్రవారం పార్టీల అభ్యర్థిత్వాలు ఖరారు కానున్నాయి. పార్టీ బీఫారాలు చేతికందే వరకు అభ్యర్థులకు ఉత్కంఠ కొనసాగనుంది. భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేయండి -
ఎట్లైనా పోరుబాట..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలక ఎన్నికలకు సంబంధించి డివిజన్లు/వార్డుల వారీగా కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. బీఫాంలు ఎవరికి ఇస్తారనేది తేలలేదు. నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. ప్రధానంగా అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లోనూ అనిశ్చితి నెలకొంది. టికెట్పై మీమాంస కొనసాగుతుండగా.. పలువురు ఆశావహులు ప్లాన్–ఏ లేదంటే ప్లాన్–బీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఏదేమైనా బరిలో నిలిచే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరమైతే పార్టీ మార్పు లేదంటే స్వతంత్రంగానైనా రంగంలోకి దిగేలా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు పలు మున్సిపాలిటీల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ వైపు చూపులు.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లో టికెట్ ఖరారు కాని పక్షంలో పలువురు పార్టీ మారి.. బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు ఎక్కువ శాతం స్వతంత్రంగా పోటీలో ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీఆర్ఎస్కు చెందిన వారు మాత్రం బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి డీకే అరుణ గెలుపొందగా.. అప్పుడు నగర పరిధిలో ఆ పార్టీకి ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్ ఎన్నికలను కమలం నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే 43 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే 17 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిలువరించేందుకేనా.. అధికార కాంగ్రెస్లో భారీగా ఆశావహులు ఉండడం ఆ పార్టీ ముఖ్య నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని.. ఇది పాత కాంగ్రెస్ కాదు, కొత్త కాంగ్రెస్.. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. జీపీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచినప్పటికీ.. బీఆర్ఎస్ సత్తా చాటింది. కొన్ని చోట్ల తక్కువ ఓట్లతోనే ఇతర అభ్యర్థులు గెలుపొందారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రెబల్స్ను నిలువరించేందుకు ఆయన ఆ విధంగా హెచ్చరికలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పలు మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పొత్తులకు తెరలేపాయి. మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, వనపర్తి జిల్లాలోని అమరచింతతో పాటు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఈ తరహా రాజకీయాలు నడుస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర పురపాలికలో గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరి.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరుదామనుకున్నా అడ్డుకోవడంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఓ నాయకుడు తన భార్యను చైర్మన్గా చేయాలనే లక్ష్యంతో పావులు కదిపినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచేలా స్కెచ్ వేయడంతో పాటు బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ నారాయణపేటలో ఎంఐఎం, అమరచింతలో కాంగ్రెస్, సీపీఎంతో పొత్తు పెట్టుకునేలా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండగా.. ఇదే రోజు ప్రధాన పార్టీలు డివిజన్లు/వార్డుల వారీగా తమ తమ కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించనున్నాయి. కొన్ని ఉదాహరణలు.. కాంగ్రెస్కు సంబంధించి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా అన్ని డివిజన్లలో కార్పొరేటర్ కోసం ఇద్దరికి మించి పోటీపడుతున్నారు. ఒకటో డివిజన్లో 19 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ డివిజన్లో ఇప్పటివరకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో డివిజన్కు ముగ్గురు నామినేషన్లు వేశారు. 39వ డివిజన్లో ముఖ్య నాయకులు ఇద్దరు నామినేషన్లు వేయడం పోటాపోటీకి నిదర్శనంగా నిలుస్తోంది. కార్పొరేషన్లోని 52వ డివిజన్కు సంబంధించి బీఆర్ఎస్ నాయకుడైన మాజీ కౌన్సిలర్ ఒకరు పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిత్వం ఖరారు చేయకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన బీజేపీ వైపు అడుగుల వేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో ఆ డివిజన్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆయన చేరిక ఖాయమని తెలుస్తోంది. భారీగా ఆశావహులతో అనిశ్చితి.. తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో కార్పొరేటర్ పదవుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఆశావహులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ పదవులకు పోటీ చేయాలని అనుకుంటున్న అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ రెండు పర్యాయాలు, బీఆర్ఎస్ ఒకసారి దరఖాస్తులు ఆహ్వానించింది. కాంగ్రెలో తొలుత 376, ఆ తర్వాత 292 దరఖాస్తులు రాగా.. బీఆర్ఎస్లో 440 మంది వరకు అర్జీ పెట్టుకున్నారు. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులతో ఆయా పార్టీల్లో అభ్యర్ధిత్వాల ఖరారుపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని పలు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో రెబల్స్ ప్రభావం లేకుండా పార్టీల ముఖ్యులు ఆయా వ్యక్తులతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో అభ్యర్థుల ఫైనల్ జాబితా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. -
అటవీ సంరక్షణకు సహకరించాలి
లింగాల: నల్లమల అటవీ ప్రాంతం, వన్యప్రాణుల సంరక్షణకు అందరూ సహకరించాలని డీఆర్ఓ జయదేవ్ కోరారు. గురువారం మండలంలోని చెన్నంపల్లి, పద్మన్నపల్లి గ్రామాల్లో అడవుల రక్షణ, వన్యప్రాణులను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో అడవికి నిప్పు పెడితే విలువైన సంపదతో పాటు అటవీ ఫలసాయాన్ని కోల్పోతామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అడవిలో నిప్పు పెట్టొద్దని సూచించారు. అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులులు తరచుగా కొర్లకుంట, ఈర్లచెర్వు, మైసమ్మ చెర్వు ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని.. పశువులు, గొర్రెలకాపరులు అడవిలోకి వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు ఖాదర్పాషా, శివాజీ, బెస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే
తిమ్మాజిపేట/బిజినేపల్లి: జిల్లాలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వేకు చర్యలు తీసుకుంటున్నామని.. రెవెన్యూ రికార్డుల్లో నమోదైన ఉన్న రైతులు మోకాపై ఉండాలని అడిషనల్ కలెక్టర్ అమరేందర్ సూచించారు. గురువారం తిమ్మాజిపేట మండలం మరికల్, బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామాల్లో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వేపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో ప్రభుత్వం డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకు జిల్లాలోని నాలుగు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు వివరించారు. భూముల రికార్డులు ఆన్లైన్లో ఉండటంతో పాటు రైతులు మోకాపై ఉండాలన్నారు. భూముల సర్వేతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. భవిష్యత్లో మొబైల్లోనే మ్యాప్ల ద్వారా తాము ఎంచుకున్న భూముల సర్వే నంబర్, రైతు వివరాలు తెలుసుకోవచ్చన్నారు. భూముల సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్లు జయంతి, మున్నీరుద్దీన్, జిల్లా సర్వే అధికారి గిరిధర్, డీఐ సుదర్శన్ ఎంఆర్ఐ రవిచంద్ర, సర్పంచ్ రమాదేవి, ఉపసర్పంచ్ వెంకటయ్య, సర్వేయర్ సాయిబాబా పాల్గొన్నారు. -
యూరియా కోసం వేచి చూడాల్సిన పనిలేదు..
నాగర్కర్నూల్: జిల్లాలోని కొల్లాపూర్, నాగర్కర్నూల్ పరిధిలో 167–కే జాతీయ రహదారి భూ సేకరణ ప్రక్రియలో పురోగతిని, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ వీసీ హాల్లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్తో కలిసి నేషనల్ హైవే, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో భూ సేకరణ ప్రక్రియలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చివరి దశలో ఉన్న భూ సేకరణ ప్రక్రియలో జాప్యం చేయకుండా మానవీయ కోణంలో రైతులకు లాభాలు వివరించి.. త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ నోటిఫికేషన్లు, పరిహారం, అవార్డుల ఖరారు వంటి అంశాలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. సమావేశంలో ఆదిత్యధర్ త్రివేది, ఆర్డీఓలు, సురేశ్, భన్సీలాల్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ నారాయణ పాల్గొన్నారు. అచ్చంపేట: రైతులు యూరియా కోసం వేచి చూడాల్సిన పనిలేదని.. యాప్లో బుక్ చేసుకుంటే యూరియా లభిస్తోందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అచ్చంపేటలోని హాకా రైతు సేవాకేంద్రం, యూరియా విక్రయ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కడా రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. తద్వారా వ్యవసాయం చేసే నిజమైన రైతుకు యూరియా లభిస్తుందన్నారు. జిల్లాలోని ఏ దుకాణం నుంచి అయినా యూరియా బుక్ చేసుకొని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. రైతులు యూరియా తీసుకునే సమయంలో తప్పనిసరిగా బుకింగ్ ఐడీని డీలర్కు చూపించాలన్నారు. యాప్లో బుక్ చేసిన బస్తాల సంఖ్య ఆధారంగా మాత్రమే డీలర్లు యూరియా అందించాలని ఆదేశించారు. యూరియా పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ మరింత పెంచాలని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు విక్రయించాలని స్పష్టంచేశారు. రైతుల అవసరం మేరకు సరిపడా యూరియా అందుబాటులో ఉండాలన్నారు. డీఏఓ యశ్వంత్రావు, డివిజనల్ అధికారి చంద్రశేఖర్, ఏఓ కృష్ణయ్య ఉన్నారు. -
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
● ఈసీ నిబంధనలు అందరూ పాటించాలి ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్కర్నూల్/నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమవంతు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్ పత్రాల్లో పార్టీ పేరు విధిగా రాయాలని.. పార్టీ తరఫున బీఫాం అందజేసే వ్యక్తి పేరుతో రాష్ట్ర పార్టీ నుంచి అందించే ధ్రువపత్రాన్ని ఈ నెల 30వ తేదీలోగా అందజేయాలని సూచించారు. ప్రతి అభ్యర్థి రూ. లక్ష వరకు మాత్రమే ఎన్నికల్లో ఖర్చు చేయాలని.. ఇందుకు కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహి ంచేందుకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు, అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డేవిడ్ రాజు, బీఆర్ఎస్ తరఫున శ్రీశైలం, నర్సి ంహ, బీజేపీ నుంచి సుధాకర్రెడ్డి, రాజేందర్రెడ్డి, బీ ఎస్పీ నుంచి రామకష్ణ, వైఎస్సార్ పార్టీ నుంచి ఎండీ హుస్సేన్, టీడీపీ నుంచి బాలకృష్ణ పాల్గొన్నారు. -
పురం పిరం..!
పురపాలికల్లో ఇదే రాజ‘కీ’యం ● ఆర్థిక స్థోమత ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ● కౌన్సిలర్/కార్పొరేటర్ నుంచి చైర్మన్/మేయర్ వరకూ.. ● ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు.. అన్ని పార్టీలదీ ఇదే దారి ● కర్ణాటక సరిహద్దు జిల్లాలోని ఓ మున్సిపాలిటీకి భలే గిరాకీ ● చైర్మన్ గిరికి పలికిన ధర సుమారు రూ.5 కోట్లు? ● ఎన్హెచ్పై ఉన్న మరో దాంట్లో ఆర్థిక బలమే పరమావధిగా.. -
బ్యాలెట్తోనే మున్సి‘పోల్స్’
● వార్డుకు రెండు చొప్పున బాక్సులు ● బ్యాలెట్ ముద్రణకు రంగం సిద్ధం అచ్చంపేట: మున్సిపల్ ఎన్నికలను మరోసారి బ్యాలెట్ పేపర్తోనే నిర్వహించనున్నారు. 2014లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో పోలింగ్ నిర్వహించగా.. 2020లో ఈవీఎంలను మార్చి బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా బ్యాలెట్తోనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఉన్న వార్డుల ప్రకారం బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడంతో పాటు బ్యాలెట్ పేపర్ ముద్రణను అధికార యంత్రాంగం పూర్తిచేస్తోంది. నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే బ్యాలెట్ పేపర్ల ముద్రణ సుమారు ఐదు రోజుల్లోనే పూర్తి చేయనున్నారు. చిక్కులు తప్పవు.. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్లో ఓటు ముద్ర సరిగ్గా పడకపోవడం కొంత చిక్కులకు దారి తీస్తుంది. అదే విధంగా బ్యాలెట్ పేపర్ను మడతపెట్టే క్రమంలో రెండు వైపులా పడటం మరో సమస్యగా మారనుంది. నిరక్షరాస్యులు ఓటు వేయడంలో గందరగోళానికి గురై కొన్ని సందర్భాల్లో బ్యాలెట్పై ఏదో ఒకచోట ఓటు ముద్ర వేయడం అభ్యర్థుల తలరాతను తలకిందులు చేసే అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా చెల్లని ఓట్ల విషయంలో వివాదాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులను తిరస్కరించడానికి అవకాశం ఇచ్చే నోటాకు అవకాశం లేకుండా పోతుంది. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్తో నిర్వహించడానికి నిర్ణయం జరిగిన క్రమంలో చెల్లని ఓట్ల విషయంలో కౌంటింగ్ సిబ్బంది జాగ్రత్తగా ఉండ్సాలిందే. -
తొలిరోజు 32 నామినేషన్లు
● కాంగ్రెస్ తరఫున 13, బీఆర్ఎస్ 10, బీజేపీ నుంచి 5 దాఖలు ● నేడు, రేపు ఊపందుకోనున్న నామినేషన్ల పర్వం సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 32 నామినేషన్లు దాఖలయ్యాయి. నాగర్కర్నూల్లో 11, కల్వకుర్తిలో 14, కొల్లాపూర్లో 7 నామినేషన్లు వచ్చాయి. మొదటి రోజు కాంగ్రెస్ తరఫున 13, బీఆర్ఎస్ 10, బీజేపీ 5, బహుజన్ముఫ్తి పార్టీ నుంచి ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు ఈ నెల 30 వరకే గడువు ఉంది. గురు, శుక్రవారాల్లో నామినేషన్ల కోసం అభ్యర్థులు పోటెత్తనున్నారు. ముహూర్తాన్ని దృష్టిలో ఉంచుకొని గురువారం ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. -
పంట మార్పిడితో అధిక లాభాలు
బిజినేపల్లి: పంటల మార్పిడి విధానంతో అధిక లాభాలు ఉంటాయని.. రైతులు ఒకే రకమైన పంటను కాకుండా లాభదాయక పంటల సాగుపై దృష్టిసారించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కిసాన్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్లో పప్పుదినుసులు, నూనెగింజల పంటలకు అధిక డిమాండ్ ఉందన్నారు. యాసంగి సీజన్లో పంట మార్పిడి విధానం పాటించడంతో పాటు పప్పుదినుసులు, నూనెగింజల పంటలు సాగుచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి, అన్నివిధాలా అండగా నిలుస్తోందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద రైతులకు పలు రకాల యంత్రాలు, స్ప్రింక్లర్లు, బిందుసేద్యం పరికరాలతో పాటు విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందిస్తోందన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే అన్నిరకాల సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డితో కలిసి రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
నాగర్కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దుచేసి.. కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్జీ బిల్లుతో పాటు జాతీయ విత్తన బిల్లును వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మిక, కర్షక హక్కుల సాధన కోసం నిర్వహించే సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు ఆర్.శ్రీనివాసులు మారెడు శివశంకర్, పోదిల రామయ్య, శ్రీనివాసులు, గోర్ల సత్యం, సిద్దేశ్, విజయ్ ఉన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం చారకొండ: మండలంలోని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజల సమస్యపై ప్రభుత్వం స్పందించి ముంపు నుంచి మినహాయించే వరకు పోరాడతామని నిర్వాసితులు పేర్కొన్నారు. ఎర్రవల్లి లో నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 58 రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రా మాలను ముంపు నుంచి కాపాడాలని రిలే దీక్షలు చేపట్టిన ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. నేడు లక్ష తులసి అర్చన బిజినేపల్లి: మండలంలోని వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం లక్ష తులసి అర్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీవీ శేషారెడ్డి దంపతుల కై ంకర్యంలో స్వామివారికి లక్ష తులసి అర్చన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. వెంకటేశ.. నమోస్తుతే... మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం సమీపంలోని కోటకదిరలో ఉన్న ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్ ఇంటి నుంచి స్వామి ఉత్సవమూర్తిని మన్యంకొండ గుట్టపైకి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోలాటాలు, భజనలతో కోటకదిర గ్రామం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. ముందుగా స్వామివారిని వివిధ బంగారు ఆభరణాలతో అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారికి గరుడవాహన సేవ నిర్వహించారు. గురువారం స్వామివారికి హంస వాహనసేవ నిర్వహించనున్నారు. -
వలస పక్షుల సందడి
బిజినేపల్లి మండలం గంగారం రిజర్వు ఫారెస్ట్లో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి నీటి పక్షులు కర్ణంకుంట సోలార్ ట్యాంకు వద్దకు చేరుకోగా.. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ సిబ్బంది హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీతో కలిసి నీటిపక్షుల గణన చేపట్టారు. ఈ గణనలో అరుదైన ఓపెన్బిల్ కొంగ, పెయింటెడ్ కొంగ, గ్రే హెరాన్, రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్, ఎగ్రెట్, పర్పుల్ హెరాన్ జాతి పక్షులను గుర్తించారు. – బిజినేపల్లి ఎల్లో వాట్లెడ్ లాపింగ్ లిటిల్ గ్రేబ్ రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్ స్పాట్ బిల్డ్ -
ఆశావహుల సందడి..
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం.. ఆ వెంటనే నామినేషన్ల పర్వం మొదలు కావడంతో మున్సిపల్ కార్యాలయాలు, క్లస్టర్ కేంద్రాల వద్ద సందడి కొనసాగుతోంది. ఓవైపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తుండగా.. మరోవైపు ఆశావహులు మున్సిపల్ కార్యాలయాల్లో గుమిగూడుతున్నారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు అవసరమైన నో డ్యూ సర్టిఫికెట్లు పొందేందుకు ఇంటి టాక్స్, నల్లాబిల్లులు, పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నారు. అభ్యర్థులతో పాటు ప్రతిపాదకులకు సైతం నో డ్యూ సర్టిఫికెట్ అవసరం కావడంతో మున్సిపల్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. -
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిణి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. వీసీ అనంతరం ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, అదనపు కలెక్టర్ దేవసహాయం, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో 65 వార్డులు, 131 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా సజావుగా చేపట్టాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తేవాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి శిక్షకుల ద్వారా అవసరమైన శిక్షణతోపాటు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. సిబ్బంది రాండమైజేషన్ పూర్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 131 మంది పోలింగ్ కేంద్రాలకు ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 65 వార్డులకు గాను ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 159 మంది సిబ్బందితోపాటు అదనంగా 20 శాతం రిజర్వ్ సిబ్బంది, 629 మంది సహాయ ప్రిసైడింగ్ ఎన్నికల అధికారులు, పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేష న్ ద్వారా కేటాయించామన్నారు. స్థానికత, ప్రస్తు తం విధులు నిర్వర్తిస్తున్న అంశాలు తదితరాలను పరిగణలోకి తీసుకుని సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఈఓ రమేష్కుమార్, డిప్యూటీ సీఈఓ గోపాల్నాయక్, వెంకటేశ్వర్లుశెట్టి, ఈడీఎం నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబ్నగర్లోని జడ్చర్ల, నాగర్కర్నూల్లోని అచ్చంపేట పురపాలికల పాలక వర్గాల పదవీ కాలం మే నెలలో ముగియనుంది. ఇవి పోనూ మిగిలిన 19 (ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలు) వాటిలో ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ కార్పొరేషన్గా ఆవిర్భవించింది. ఇదే జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న దేవరకద్ర, నారాయణపేట జిల్లాలో మద్దూర్ మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. ఈ మూడు పురపాలికల్లోనూ తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. -
సీలింగ్ భూమిపై జడ్జితో విచారణ జరపాలి
కొల్లాపూర్: మండలంలోని ఎల్లూరు శివారులో సర్కారీ సీలింగ్ భూమిని అక్రమంగా పట్టా భూమిగా మార్చి.. దానిని కార్పొరేట్ సంస్థలకు విక్రయించిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. మంగళవారం ఆయన కొల్లాపూర్లో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఫయాజ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎల్లూరు శివారులోని సర్వే నంబర్లు 359, 363, 364, 365లో సర్కారీ సీలింగ్ భూమి ఉండగా.. వాటిని గతంలోనే దళితులకు కేటాయించారన్నారు. రైతులు సాగు చేయకపోవడంలో ఆ భూములు అడవిగా మారాయన్నారు. కొన్నేళ్ల క్రితం ఆ భూములను సురభి రాజవంశ వారసులు తమ పేరిట పట్టా భూములుగా రికార్డుల్లో ఎక్కించుకున్నారని, ఇటీవలే ఆ భూమిలో పెరిగిన భారీ వృక్షాలను కూల్చేసి కార్పొరేట్ సంస్థలకు వినియోగించారన్నారు. దీనిపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ శక్తులకు విక్రయించిన భూమిని దళితులకు అప్పగించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయ కులు కుర్మయ్య, ఎండీ యూసుఫ్, శివకృష్ణ, వెంకటస్వామి, కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. -
3 మున్సిపాలిటీలు.. 23 క్లస్టర్లు
● నామినేషన్ల స్వీకరణకు వీలుగా క్లస్టర్లు, హెల్ప్డెస్క్ల ఏర్పాటు కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో జిల్లాలోని ప్రవర్తనా నియామవళి (ఎన్నికల కోడ్) అమలులోకి వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. బుధవారం నుంచి జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ అధికారులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే వార్డుల వారీగా వచ్చిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రత్యేక బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇందులో ఏ వార్డులకు ఏ కేంద్రం (గది)లో నామినేషన్లను స్వీకరిస్తారో రూట్మ్యాప్లను రూపొందించారు. అభ్యర్థులకు నామినేషన్ పత్రాలతోపాటు ఎలాంటి పత్రాలను జతపరచాలి అనే విషయాలను రిటర్నింగ్ అధికారులు సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఒక క్లస్టర్లో మూడు వార్డులకు.. జిల్లాలోని కల్వకుర్తి, నాగర్కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లోని వార్డులకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మూడు మున్సిపాలిటీల్లో కలిపి 65 వార్డులు ఉండగా.. 23 క్లస్టర్లను ఏర్పాటు చేసి.. ఒక్కో క్లస్టర్లో మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. 23 మంది రిటర్నింగ్ అధికారులతోపాటు వారికి సహాయకులుగా మరో ముగ్గురు ఒక్కో క్లస్టర్లో విధులు నిర్వర్తించున్నారు. వీరికి అదనంగా మరో ఒక్కో మున్సిపాలిటీకి మరో ఇద్దరు రిటర్నింగ్ అధికారులు, సహాయక అధికారులను రిజర్వులో ఉంచారు. వార్డు ఆఫీసర్లకు శిక్షణ.. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థుల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. అభ్యర్థు లు నామినేషన్ నింపే సమయంలో, ఏవైనా పత్రా లను తక్కువగా ఉంటే వాటిని జతపరచటం, నా మినేషన్ పత్రంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు అన్ని వివరాలను హెల్ప్డెస్క్ అధికారులు అందించనున్నారు. దీనిపై వార్డు ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. -
ముగిసిన పాలెం శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. వారం రోజులపాటు కొనసాగిన ఉత్సవాల్లో ఆలయ అర్చక బృందం స్వామివారికి నిత్యారాధన, హోమం, పూర్ణాహుతి, బలిహరణం, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ధ్వజ అవరోహణం, పుష్పయాగం, పురవీధుల్లో శేషవాహనసేవ చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి భక్తులు హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. 57 రోజులకు చేరిన నిరసన దీక్షలు చారకొండ: మండలంలోని గోకారం జలాశయంలో ముంపు గ్రామాలను మినహాయించి, ఆర్అండ్ఆర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఎర్రవల్లి గ్రామంలో చేపట్టిన నిరసన దీక్షలు 57 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం దీక్షలో కూర్చున్న నిర్వాసితులు మాట్లాడుతూ సుమారు రెండు నెలలుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దారుణమన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సీఎంను ఒప్పించి ముంపు గ్రామాల మినహాయింపు, ఆర్అండ్ఆర్ నోటిఫికేషన్ రద్దు జీఓ జారీ చేసేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షయ నిర్ధారణ శిబిరాలను వినియోగించుకోండి కందనూలు: జిల్లాలో నిర్వహిస్తున్న క్షయ నిర్ధారణ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. మంగళవారం ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నాగర్కర్నూల్ మండలంలోని పుల్జాల, మల్కాపూర్ గ్రామాల్లో నిర్వహించిన క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాలను ఆయన సందర్శించి మాట్లాడారు. క్షయవ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. క్షయవ్యాధికి ఉచితంగా మందులతోపాటు పోషకాహార కిట్ అందజేస్తున్నామని, దీనివల్ల క్షయవ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చన్నారు. వ్యాధి సోకే అవకాశం గల మధుమేహ వ్యాధిగ్రస్తులు, ధూమపానం, మ ద్యపానం చేసేవారు, వయోవృద్ధులు, బరువు తక్కువ ఉన్నవారు, గతంలో క్షయ వ్యాధికి చికిత్స తీసుకుని కోలుకున్న వారు, క్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు, తదితరులు శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కళాజాతా బృందం ద్వారా గ్రామంలో క్షయ లక్షణాలు, వ్యాప్తి, నివారణ, చికిత్స, పోషకాహారం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ సబ్జెక్ట్ అలీ, ఎంఎల్హెచ్పీ ప్రీతి, ఎస్టీఎస్ శ్రీను, అమన్, ఏఎన్ఎం వనజ పాల్గొన్నారు. అండర్–16 జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ ఈనెల 30 నుంచి సంగారెడ్డిలో హెచ్సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. -
దేశాభివృద్ధికి పాటుపడాలి
కొల్లాపూర్: స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాణకర్తల త్యాగాలు, విశేష కృషి ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తిని కొనసాగిస్తూ.. వారి అడుగుజాడల్లో నడిచినప్పుడే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడుతూ ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు క్రీడా పరికరాల పంపిణీ అచ్చంపేట రూరల్: దాతలు అందించిన క్రీడా పరికరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఎఫ్ఓ రేవంత్చంద్ర అన్నారు. సోమవారం అచ్చంపేటలోని మల్లికార్జున చెంచు ఆవాస కేంద్రంలో విద్యనభ్యశిస్తున్న చెంచు విద్యార్థుల కోసం అమెరికా బుల్ డాగ్స్ నుంచి పంపించగా క్రీడా పరికరాలను డీఎఫ్ఓ అందించారు. గతంలో న్యాయార్క్లో ఉంటున్న తాడూరువాసి జనుంపల్లి ప్రసన్న ఆవాసాన్ని సందర్శించి చెంచు విద్యార్థులతో ముచ్చటించారు. క్రీడా పరికరాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.90 వేల విలువైన క్రీడా పరికరాలను చెంచు విద్యార్థుల కోసం పంపించగా వాడుకలోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఆవాస అధ్యక్షుడు జానకిరాములు, జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్రెడ్డి, సాగర్కుమార్, వీరబ్రహ్మ, దామోదర్శెట్టి, రామస్వామి పాల్గొన్నారు. నేడు అండర్–16 క్రికెట్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్కార్డు, ఎస్ఎస్సీ మెమో, జననఽ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, రెండు ఫొటోలతో మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎంపికయ్యే ఉమ్మడి జిల్లా జట్టు ఈనెల 30 నుంచి సంగారెడ్డిలో ప్రారంభమయ్యే హెచ్సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో పాల్గొంటుందని ఆయన తెలిపారు. -
వందశాతం.. సాధ్యమేనా?
● మున్సిపాలిటీల్లో మందకొడిగా ఆస్తిపన్ను వసూళ్లు ● గడువులోగా లక్ష్యం చేరికపై అనుమానాలునాగర్కర్నూల్: మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయమే ఆధారం. అయితే జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పన్నుల వసూలు మందకొడిగా కొనసాగుతుండటంతో వాటి అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. కాగా.. ఇప్పటి వరకు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 20.22 కోట్లు పన్నుల రూపంలో రావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.7.57 కోట్లు మాత్రమే సిబ్బంది వసూలు చేయడం జరిగింది. అయితే మార్చి 31 వరకు ఈ గడువు ఉండటంతో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో కమిషనర్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయగా వందశాతం లక్ష్యం ఎలా చేరుకుంటారో వేచిచూడాలి. ఎక్కడెక్కడ ఎంతెంత.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కల్వకుర్తి మినహా మిగతా మూడు మున్సిపాలిటీల్లో మాత్రం పన్నులు కొంత మెరుగ్గానే వసూలు అవుతున్నాయి. అచ్చంపేటలో రూ.4.02 కోట్ల పన్నులు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1.87 కోట్లు (46 శాతం) వసూలు చేయడం జరిగింది. అలాగే కొల్లాపూర్లో రూ.1.30 కోట్లకు గాను రూ.56 లక్షలు (43 శాతం) వసూలు చేశారు. నాగర్కర్నూల్లో రూ.6.97 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.2.98 కోట్లు (42 శాతం) వసూలయ్యాయి. కల్వకుర్తిలో రూ.7.93 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ.2.16 కోట్లు (27.29 శాతం) మాత్రమే వసూలు చేశారు. కాగా.. నాలుగు మున్సిపాలిటీల్లో మార్చి 31 నాటికి వందశాతం పన్నులు వసూలు చేయాలన్న లక్ష్యం ఉండటంతో అధికారులు ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వందశాతం పన్నుల వసూలు సాధ్యమవుతుందో.. లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఈ సమయానికి పన్నుల వసూలుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మరో రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంది. పన్ను లక్ష్యం రూ.20.22 కోట్లు ఇప్పటి వరకు వసూలైంది రూ.7.57 కోట్లు మొత్తం శాతం 37.43 చివరి గడువు మార్చి 31 -
ఉత్తమ సేవలకు పురస్కారం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లాకేంద్రంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రశంసా పత్రాలు అందజేశారు. – కందనూలుదేవసహాయం, జెడ్పీసీఈఓ చంద్రశేఖర్, కలెక్టరేట్ ఏఓ ఫిరంగి, డీటీడీఓ చిన్నఓబులేషు, డీఆర్డీఓ శ్రీరాములు, డీపీఓగోపాల్నాయక్, డిప్యూటీ సీఈఓ రమేష్, రైటర్, డీఎస్పీ సీహెచ్ రాజు, ఏఓ, అగ్రికల్చర్ గీతాంజలి, ప్రిన్సిపాల్ తబితారాణి, తహసీల్దార్ తిరుమల్, భద్రతా సిబ్బంది శ్రీను, ఐపీఆర్ ఫొటోగ్రాఫర్ వెంకటయ్య, డీపీఆర్ఓ సిబ్బంది -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కందనూలు: గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ మైదానంలో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చారకొండ విశ్వశాంతి ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసిన జానపద నృత్యానికి ప్రథమ బహుమతి, పెంట్లవెల్లి కేజీబీవీ విద్యార్థుల దేశభక్తి నృత్యానికి ద్వితీయ, బల్మూరు కేజీబీవీ విద్యార్థుల కోయ నృత్యానికి తృతీయ, పాలెం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల నృత్యానికి తృతీయ బహుమతి లభించాయి. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన శకటాలు, స్టాళ్లను పరిశీలించారు. -
భక్తుల ఇంటికే బంగారం..
● ఆర్టీసీ వినూత్న కార్యక్రమం ● రూ.299తో బుకింగ్ చేసుకుంటే చాలు.. ● ప్రసాదంతో పాటు దేవతల ఫొటో, పసుపు, కుంకుమ ● వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇటు ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు అటూ ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా పార్సింగ్, కొరియర్ సేవలు అందజేస్తోంది. దీంతో టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గతంలో రాఖీ పండుగ సందర్భంగా దూరంగా ఉన్న సోదరీ మణులు రాఖీలను తమ సోదరులకు పంపించేలా కొరియర్ సేవలు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందజేశారు. ● ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం ప్రసాదాన్ని భక్తుల ఇంటివద్దకే అందజేసేలా టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ తగిన ఏర్పాట్లు చేస్తోంది. మేడారం సమ్మక్క–సారక్క జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వెళుతుంటారు. అయితే జాతరకు వెళ్లలేని భక్తులకు అమ్మవార్ల ప్రసాదాలను అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.299తో బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే ప్రసాదాన్ని అందజేస్తారు. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయనున్నారు. రీజియన్లోని పది డిపోల పరిధిలోని లాజిస్టిక్ కేంద్రాల్లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమ్యాయి. భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్సైట్ లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. వచ్చేనెల 5వ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ మేడారం ప్రసాదానానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. -
భక్తులు సద్వినియోగం చేసుకోవాలి
సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేడారం వెళ్లలేని భక్తులకు ఇంటివద్దకే అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా అందజేస్తున్నాం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమీప ఆరీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.299 చెల్లించి బుకింగ్ చేసుకోవాలి. దేవాదాయశాఖ సహకారంతో మేడారం బంగారం ప్రసాదంతో పాటు దేవతల ఫొటో పసుపు, కుంకుమ భక్తుల ఇంటివద్దకే వెళ్లి అందజేస్తాం. – సంతోష్కుమార్, ఆర్టీసీ ఆర్ఎం, మహబూబ్నగర్ ● -
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
నాగర్కర్నూల్ క్రైం: సమాజంలో బాలికల పట్ల లింగ వివక్ష చూపకుండా వారిని బాలురతో సమానంగా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బాలికలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థి దశ అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైనదని, సరైన మార్గంలో నడిచి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని సబ్జైలును సదర్శించి ఖైదీలతో మాట్లాడి వారికి కల్పిస్తున్న వసతుల గురించి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని వారికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరపున ప్రభుత్వ న్యాయవాదిని నియమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ గుణశేఖరనాయుడు, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ భవానిబాయి తదితరులు పాల్గొన్నారు. -
ముంపు నిర్వాసితుల గోడు పట్టదా?
చారకొండ: గోకారం జలాశయంలో ముంపు గ్రామాలను మినహాయించాలని 54 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు అన్నారు. డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని గోకారం రిజర్వాయర్ నిర్మాణ సామర్థ్యం తగ్గించాలని ఎర్రవల్లిలో చేపట్టిన దీక్షలు శనివారం 54వ రోజు కొనసాగాయి. ఇదిలా ఉండగా ఎర్రవల్లి, ఎర్రవల్లితండాలను ముంపు నుంచి మినహాయించాలని శనివారం జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్తో కలిసి ఎంపీ మల్లురవిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి దృష్టికి ఎంపీ మల్లురవి గోకారం జలాశయంలో ముంపునకు గురవుతున్న గ్రామాల సమస్యను తీసుకెళ్లడంతో గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ముంపు గ్రామాలను మినహాయింపు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువాలని వారు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాంబయ్యగౌడ్, నిర్వాసితులు ప్రకాష్, పెద్దయ్యగౌడ్, నాగయ్య, గోపినాయక్, లాలునాయక్, శ్రీరాములు, వెంకటయ్యనాయక్ పాల్గొన్నారు. -
ముమ్మరంగా వన్యప్రాణుల గణన
మన్ననూర్/ లింగాల: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేటర్ (ఎన్టీసీ) న్యూఢిల్లీ ఆదేశాల మేరకు అటవీ శాఖ చేపట్టిన వన్యప్రాణుల గణన ముమ్మరంగా కొనసాగుతుంది. 2,611 చ.కి.మీ., పరిధిలో విస్తరించి ఉన్న అభయారణ్యంలో ఆరు రోజుల పాటు సర్వే నిర్వహించనున్నారు. అన్నిరకాల వన్యప్రాణుల లెక్క తేల్చనున్న ఈ గణనలో అటవీశాఖ సిబ్బందితోపాటు డెహ్రాడూన్ నేషనల్ ఆఫ్ ఇండియా, కన్జర్వేటర్ అథారిటీతోపాటు 133 మంది వన్యప్రాణి ప్రేమికులు, వలంటీర్లు పాల్గొంటున్నారు. ఈ గణన శాకాహారం, మాంసాహార జంతువులు నేరుగా చూసినవి పాదముద్రలు, మలం, చెట్లకు అంటుకుని ఉన్న వెంట్రుకలు తదితరాలను రెండు విభాగాలుగా సేకరించి సర్వే నిర్వహిస్తారు. గతంలో అభయారణ్యంలో అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను కూడా ఆధారం చేసుకుంటున్నారు. సేకరించిన సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే శాకాహార జంతువుల గణన పూర్తి కాగా మాంసాహార జంతువుల గణన జరుగుతుందని పేర్కొన్నారు. శనివారం చేపట్టిన సర్వేలో పెద్దపులి, చిరుతపులి, ఎలుగుబంటి, రేసు కుక్కలు, అడవి పిల్లి వంటి వన్యప్రాణుల ఉనికిని గమనించామని లింగాల ఎఫ్ఆర్ఓ ఈశ్వర్ తెలిపారు. -
పేదలకు మెరుగైన వైద్యసేవలు
వెల్దండ: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన ఆస్పత్రిలోని ఓపీ నమోదు విభాగం, ల్యాబోరేటరీ, ఇన్ పేషెంట్ తదితర విభాగాలను పరిశీలించారు. సిబ్బంది హాజరు వివరాలు, రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందిస్తున్న వైద్య సేవల అమలు తీరుపై ఆరాతీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవసరమైన నూతనంగా నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు. భవనాన్ని పూర్తిచేసి త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని డీఎంహెచ్ఓ రవికుమార్ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అధికారులకు సూచించారు. సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ యాదమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవికుమార్, తహసీల్దార్ కార్తీక్కుమార్, వైద్యులు సింధు, చంద్రసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు తీపి కబురు
● గ్రూపు సభ్యులకు వడ్డీలేని రుణాలు ● పుర ఎన్నికల నేపథ్యంలో ఆగమేఘాల మీద పంపిణీ జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీలకు సంబంధించి రూ.కోట్ల మేర వీఎల్ఆర్ నిధులు మంజూరయ్యాయి. వీటిని మహిళా గ్రూపు సభ్యులకు పంపిణీ చేశాం. ఈ రుణాలను గ్రూపు సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కొల్లాపూర్లో 10 వేల చీరలు సైతం పంపిణీ చేశాం. – శ్వేత, మెప్మా డీఎంసీ అచ్చంపేట: మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా అచ్చంపేట మినహా మూడు మున్సిపాలిటీల పరిధిలో రెండేళ్లకు సంబంధించిన వడ్డీలేని రుణాలను (వీఎల్ఆర్)ను మంజూరు చేసింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో మొత్తం 1,881 గ్రూపులు ఉన్నాయి. వీటికి మూడేళ్లుగా వీఎల్ఆర్ రుణాలు అందలేదు. ఫలితంగా గ్రూపు సభ్యులు ఇబ్బందుల పాలయ్యారు. ప్రస్తుతం మూడు మున్సిపాలిటీలకు వీఎల్ఆర్ రుణాలు పంపిణీ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ శరవేగంగా ప్రారంభం కావడంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద వీఎల్ఆర్ నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు 2023–24, 2024– 25కు సంబంధించి జిల్లాకు రూ.1,23,95,378 మేర నిధులు విడుదలయ్యాయి. ఇటీవల నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రుల చేతులమీదుగా మంజూరుకు సంబంధించిన చెక్కులు మహిళలకు అందజేశారు. ఈ నెల 19న నాగర్కర్నూల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. అదేరోజు కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కొల్లాపూర్లో ఈ నెల 22న ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెక్కులు పంపిణీ చేశారు. అలాగే చీరలను సైతం అందజేశారు. కొల్లాపూర్లో 10వేల చీరలను మహిళలకు పంపిణీ చేయగా.. నాగర్కర్నూల్, కల్వకుర్తి ఇంకా మంజూరు కాలేదు. స్టాక్ వచ్చిన తర్వాత చీరలు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో మహిళా సంఘాలకు వీఎల్ఆర్ నిధులు ఇలా.. మున్సిపాలిటీ వడ్డీ తీసుకున్న వచ్చిన నిధులు ఎస్హెచ్జీలు (రూ.కోట్లలో) నాగర్కర్నూల్ 245 70,80,324 కల్వకుర్తి 267 1,05,99,143 కొల్లాపూర్ 153 47,15,912 -
నల్లమలలో అలజడి
కలకలం రేపిన మవోయిస్టుల అరెస్టు సాక్షి, నాగర్కర్నూల్: దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమాలు, తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లిన నల్లమల మరోసారి ఉలిక్కిపడింది. నల్లమలకే చెందిన ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులతోపాటు ఇద్దరు మావోయిస్టు కీలక నేతలను అచ్చంపేటలో అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. నల్లమలలో సుమారు 20 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు తెరమరుగు పడుతూ రాగా.. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి సృష్టించింది. ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దు, దండకారణ్యంలో కేంద్ర బలగాల ముమ్మర కూంబింగ్, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో అక్కడి నుంచి మావోయిస్టులు ఆశ్రయం కోసం నల్లమల ప్రాంతానికి చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఆశ్రయం కోసమే వచ్చారా.. లేక ఈ ప్రాంతంలో మావోయిస్టు పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేస్తున్నారా.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిశిత పరిశీలన.. మావోయిస్టు పార్టీలో కీలక నేతలకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు అన్నిరకాలుగా మద్దతుగా నిలుస్తున్నట్టుగా నల్లమల ప్రాంతానికి చెందిన వ్యక్తులపై పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే పౌరహక్కుల నేతలు, మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల నేతలపై పోలీసులు నిఘా ఉంచి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లమల ప్రాంతంలోని పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎడ్ల అంబయ్య ఇప్పటికే పలుమార్లు చత్తీస్ఘడ్ వెళ్లి మావోయిస్టులతో సంప్రదింపులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆయన తెలంగాణ ప్రజాఫ్రంట్ కో కన్వీనర్గా పనిచేస్తున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన జక్క బాలయ్య పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానికంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. అలాగే లింగాల మండలం క్యాంపురాయవరం గ్రామానికి చెందిన మన్శెట్టి యాదయ్య గతంలో మావోయిస్టుగా పనిచేసి పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ గ్రామంలో ఉంటున్నాడు. నల్లమల ప్రాంతానికే చెందిన ఈ ముగ్గురు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరులో.. రెండు దశాబ్దాల కిందట నల్లమల దళం కేంద్రంగా ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా సాగింది. అనేక మెరుపుదాడులు, ఎన్కౌంటర్లు, పరస్పర దాడులకు ఉమ్మడి జిల్లా సాక్ష్యంగా నిలిచింది. నాగర్కర్నూల్ జిల్లా సోమశిల సమీపంలో 1993 నవంబర్ 13న పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై మావోయిస్టులు దాడి చేయడంతో ఏకంగా ఎస్పీ పరదేశినాయుడితో పాటు ఇద్దరు ఎస్ఐలు, ఆరుగురు పోలీసులు మరణించారు. అలాగే 2005 ఆగస్టు 15న ధన్వాడలో అప్పటి ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం తీవ్రస్థాయిలో కొనసాగింది. తాజాగా మావోయిస్టుల అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ అలజడి రేగింది. ఉమ్మడి జిల్లాలో మళ్లీ మవోయిస్టు పార్టీ పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. అచ్చంపేటలో కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడు సాలోమాన్తో పాటుమరో ముగ్గురు స్థానికులు అదుపులోకి.. ఆశ్రయం కోసం వచ్చారా.. పునరుజ్జీవం చేసేందుకా? ఉమ్మడి జిల్లాలో బలోపేతానికియత్నించినట్లు పోలీసుల వెల్లడి -
జిల్లావాసులకు అవార్డులు
సాక్షి, నాగర్కర్నూల్: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘం అవార్డులను అందజేయనుంది. ఈ మేరకు జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు అవార్డును అందుకోనున్నారు. బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు కింద జిల్లాలోని పెంట్లవెల్లి మండల ఏఈఆర్ఓ, అచ్చంపేటకు చెందిన బీఎల్ఓ సురేంద్రనాథ్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా అవార్డులు అందుకోనున్నారు. ప్రజా ప్రభుత్వంలో యువతకు పెద్దపీట అచ్చంపేట రూరల్: కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే వంశీకృష్ణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి అన్నారు. శనివారం అచ్చంపేటలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ డివిజన్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ నాయకులు వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో యూత్ కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు 50 శాతం సీట్లను అచ్చంపేట నియోజకవర్గంలో ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. యువతకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నామన్నారు. గ్రామ, మండల స్థాయిలో యూత్ కాంగ్రెస్ కమిటీలను వేసి బలోపేతం చేయాలని సూచించారు. -
వెట్టి చాకిరి నుంచి విముక్తి..
● మహారాష్ట్రలో పనిచేస్తున్న 26 మందిని నాగర్కర్నూల్ జిల్లాకు తరలింపు సాక్షి, నాగర్కర్నూల్: బతుకుదెరువు కోసం వలసజీవిగా మహారాష్ట్రకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అక్కడి అధికారులు విముక్తి కల్పించారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన 26 మంది మహారాష్ట్రలోని పర్బాణీ జిల్లాలో రోడ్డు నిర్మాణం కోసం కూలీలుగా పనిచేస్తున్నారు. అతి తక్కువ జీతంతో రోజంతా పనిచేయించుకుంటూ, ఇక్కట్లకు గురిచేస్తుండటంతో స్థానిక అధికారులకు ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టిన అధికారులు బాండెడ్ లేబర్గా గుర్తించి శనివారం నాగర్కర్నూల్ జిల్లాకు తరలించారు. నాగర్కర్నూల్, తెలకపల్లి, బిజినేపల్లి, కోడేరు, అచ్చంపేట మండలాలకు చెందిన మొత్తం 26 మందిని నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, ఫౌండేషన్ ఫర్ సస్టైనేబుల్ డెవలప్మెంట్(ఎఫ్ఎస్డీ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వారి స్వస్థలాలకు తరలించారు. రోజుకు 200 మాత్రమే కూలీ ఇస్తూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయించారని, అనారోగ్యం బారిన పడినా తమను పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. -
పెరగనున్న మెడికల్ కళాశాల సీట్లు
పాలమూరు: తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పాలమూరులోనే ఏర్పాటు చేశారు. 2016లో 150 ఎంబీబీఎస్ సీట్లతో మొదలైన కళాశాల ప్రస్తుతం 175 సీట్లతో కొనసాగుతోంది. పదేళ్ల కాలంలో నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు కోర్సు పూర్తి చేసుకొని బయటకు వెళ్లాయి. ఒక్కో బ్యాచ్లో 150 విద్యార్థుల చొప్పున 600 మంది విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. అలాగే కళాశాలలో 34 పీజీ సీట్లు ఉండటం విశేషం. తాజాగా మరో 25 సీట్లు పెంచడానికి శనివారం పాలమూరు మెడికల్ కళాశాలను, జనరల్ ఆస్పత్రిని ఎన్ఎంసీ(జాతీయ మెడికల్ కౌన్సిల్) బృందం సభ్యులు డాక్టర్ మల్లిఖార్జున్, డాక్టర్ అనిల్ బాబు సందర్శించారు. ఉదయం వారు మెడికల్ కళాశాలకు వెళ్లి స్థానికంగా బోధకుల సంఖ్య, పరిపాలన సిబ్బంది, తరగతి గదులు, ఇతర వసతులపై ఆరా తీశారు. అక్కడి నుంచి జనరల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో రోజు వారీగా వచ్చే ఓపీ రోగులు, ఐపీ రోగుల సంఖ్య, క్యాజువాలిటీ, అన్ని రకాల ఆపరేషన్ థియేటర్స్, వార్డులు, ఐసీయూ, మాతా శిశు విభాగం ఇలా ప్రతి వార్డును సందర్శించి స్థానికంగా ఉన్న వసతులపై నివేదిక తయారు చేశారు. ఎన్ఎంసీ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్ల పెంపు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఎంసీ పర్యటన పూర్తయిన నేపథ్యంలో పాలమూరు మెడికల్ కళాశాల అధికారులు ఈ నెల 28 వరకు 200 ఎంబీబీఎస్ సీట్లు ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఎంసీ ఈ ప్రతిపాదనలు పరిశీలించి మరోసారి పర్యటిస్తారా? లేదా ఆన్లైన్లో అనుమతులు మంజూరు చేస్తారా? అనేది ఈ నెల చివరి నాటికి తెలుస్తుంది. ఎన్ఎంసీ బృందం వెంట కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా ఇతర వైద్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. 2016లో 150 సీట్లతో ప్రారంభం ఇప్పటి వరకు నాలుగు ఎంబీబీఎస్ బ్యాచ్లు పూర్తి తాజాగా 25 సీట్ల కేటాయింపు కోసంఎన్ఎంసీ బృందం పర్యటన -
అచ్చంపేటలో మోస్ట్ వాంటెడ్..
ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో కీలకంగా పనిచేస్తున్న దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు, కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా ఉన్న మీసాల సాలోమాన్తోపాటు ఆయన భార్య సన్బట్టిని పోలీసులు అచ్చంపేటలో అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సాలోమాన్ 32 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. కేంద్ర మిలటరీ కమిటీ సభ్యుడిగా అగ్రనేతలు తిప్పరి తిరుపతి, దేవ్జీ, హిడ్మా వంటి వారితో పనిచేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సంచరిస్తూ అక్కడి మావోయిస్టు దళాలకు గెరిల్లా యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన భార్య సైతం దండకారణ్యం డీవీసీఎం కేడర్, పీఎల్జీ బెటాలియన్ సభ్యురాలిగా కీలకంగా పనిచేస్తున్నారు. ఈ దంపతులు దండకారణ్యాన్ని వదిలి నల్లమల ప్రాంతానికి చేరుకోవడం.. ఈ క్రమంలోనే అరెస్ట్ కావడం స్థానికంగా అలజడి సృష్టించింది. -
9 మంది మావోయిస్టుల లొంగుబాటు
గోదావరిఖని/బెల్లంపల్లి/నాగర్కర్నూల్: మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు దళసభ్యులు, మిలీషియా మెంబర్స్ శనివారం పోలీసుల వద్ద లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ టెక్నికల్ టీమ్ సభ్యురాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన బాలక్క అలియాస్ జాడి పుష్ప కూడా ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంబర్ కిశోర్ ఝా వివరాలు వెల్లడించారు. మొత్తం 8 మంది లొంగిపోగా అందులో ముగ్గురు దళసభ్యులు, మిగతావారు మిలీషియా సభ్యులు ఉన్నారన్నారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా పునరావాస పథకం వర్తింపజేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ వంటి విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేసినవారు ఉన్నారని, వీరు ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సీఐలు రాజేంద్రప్రసాద్, భీమేశ్, ఆర్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు వీరే.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాల గ్రామానికి చెందిన ధర్మాజీ శ్రీకాంత్, దళసభ్యుడిగా పనిచేసిన ముడియం జోగ, ముడియం మంగు, పొడియం కాములు, మహిళా సభ్యురాలు కుంజం లక్కె, మోదం భీమ, కుంజం ఉంగా, ముడికం సుక్రం. వీరిలో శ్రీకాంత్ మినహా మిగిలిన వాళ్లందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందినవారు. అజ్ఞాతం వీడిన మావోయిస్టు పుష్ప మావోయిస్టు పార్టీ టెక్నికల్ టీమ్ సభ్యురాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు బాలక్క అలియాస్ జాడి పుష్ప అజ్ఞాతం వీడింది. శుక్రవారం ఛత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ పోలీసుల వద్ద ఆమె ఆయుధంతో సహా లొంగిపోయింది. ఆమె ఫొటో లు, వీడియో చూసిన తల్లి ఆవుల మల్లమ్మ, సోదరుడు గంగయ్య ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆమె భర్త జాడి వెంకటి అలియాస్ బిమల్ గత ఏడాది సెపె్టంబర్ 12న ఎదురుకాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. అచ్చంపేటలో ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్ మావోయిస్టు పార్టీ కేంద్ర మిల్ట్రీ కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు మీసాల సలోమాన్ అలియాస్ సంతోష్ తో పాటు ఆయన భార్య సన్బట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపే టలో ఇద్దరు మావోయిస్టులతో పాటు మరో ము గ్గురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ వివరాలను ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ అచ్చంపేటలో మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ని పలనాడు జిల్లా బొల్లంపల్లి మండలం పామిడిపాడుకు చెందిన మీసాల సలోమాన్ అలియాస్ సంతోష్ అలియాస్ నాగరాజు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా, మిలిటరీ ఇన్స్ట్రక్టర్గా, టీం కమాండర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య సన్బట్టి మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ దండకారణ్యంలో డీవీసీఎం కేడర్లో పనిచేస్తున్నా రు. వీరితో పాటు తెలంగాణ ప్రజాఫ్రంట్ కో కన్వీనర్, అమ్రాబాద్ మండలం వంకేశ్వరం గ్రామా నికి చెందిన ఎడ్ల అంబయ్యను అదుపులోకి తీసుకున్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చెందిన జక్క బాలయ్య, లింగాల మండలం క్యాంపు రాయవరానికి చెందిన మాజీ మావోయిస్టు మన్శెట్టి యాదయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. -
లీడర్ల ‘లడాయి’..!
దూకుడు పాలి‘ట్రిక్స్’ (కేరాఫ్) నడిగడ్డ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంతో పాటు పాలమూరులో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు గద్వాల, అలంపూర్ పెట్టింది పేరు. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నది మధ్య నడిగడ్డ (జోగుళాంబ గద్వాల)గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఒకవైపు ఏపీ, మరోవైపు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గాలు రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఆధిపత్యమే హద్దుగా అసమాన రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఈ జిల్లాలో ఆ ఒరవడి ఇప్పటికీ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని విపక్ష నేతల మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి మధ్య ప్రొటోకాల్ చిచ్చు రాజకీయ రగడకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పలువురు లీడర్ల లడాయి, వారి వ్యవహార శైలి హాట్టాపిక్గా మారింది. గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గ పోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య యుద్ధం కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఆయా వర్గాల మధ్య పోటాపోటీ నడిచింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇరువర్గాలు కసరత్తు మొదలుపెట్టాయి. మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉండగా.. తమకు 16 వార్డులు కేటాయించాలని ఓ వర్గం వారు పార్టీ ముఖ్య నేతలకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని.. లేకుంటే మీ ఇష్టమంటూ మరో వర్గ నేత సమాధానమిచ్చినట్లు సమాచారం. స్వపక్షంలో విపక్షంలా ముదిరిన పంచాయితీ కీలక నేతలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ లొల్లి రాష్ట్ర పెద్దల వద్దకు చేరినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ‘ఆధిపత్య’మే హద్దుగా అసమాన రాజకీయాలు అటు అధికార, ప్రతిపక్షాలు.. ఇటు స్వపక్షంలోనే విపక్షం నాగర్కర్నూల్ ఎంపీ, అలంపూర్ఎమ్మెల్యే మధ్య రగడతో మళ్లీ తెరపైకి.. హాట్టాపిక్గా ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతల వ్యవహార శైలి -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
నాగర్కర్నూల్ క్రైం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషిచేస్తానని ఎమ్మెల్యే రాజేష్రెడ్డి అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 650 పడకల జనరల్ ఆస్పత్రికి శుక్రవారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మాత్రమే వేస్తున్నారని పనులు జరగడం లేదని అసత్యప్రచారాలు చేయడం తగదన్నారు. జిల్లా కేంద్రానికి అవసరమైన 650 పడకల ఆస్పత్రి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించామని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 10 ఎకరాలలో రూ.235 కోట్లతో 650 పడకల ఆస్పత్రిని 24 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 650 పడకల ఆస్పత్రిని నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
కొల్లాపూర్: పట్టణంలోని పలు వార్డుల్లో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించి స్థానికులతో మాట్లాడారు. వార్డుల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వారికి వివరించారు. 7వ వార్డులోని శ్రీకృష్ణనగర్కాలనీలో యాదవ సంఘం నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. శ్రీకృష్ణ మందిరం అభివృద్ధి కోసం రూ.60 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సోమశిల గండికి వెళ్లే రోడ్డును పరిశీలించి, దాన్ని నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
సకాలంలో ఫిర్యాదు చేస్తే..
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు సకాలంలో పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే పోయిన నగదు రికవరీ చేయడంతోపాటు ఫ్రీజ్ చేస్తున్నాం. మూడేళ్లుగా నాగర్కర్నూల్ పోలీస్స్టేషన్లో సైబర్ వారియర్గా విధులు నిర్వహిస్తున్నాను. డయల్ నం.1930తోపాటు సాధారణ పద్ధతుల్లో 467 ఫిర్యాదులు రావడంతో 54 కేసులు నమోదు చేశారు. బాధితులకు సంబందించి రూ.15.23 లక్షల మేర నగదు రికవరీ చేశాం. ఇటీవల రాష్ట్రస్థాయిలో సైబర్ వారియర్స్కు అందించిన రివార్డుతోపా టు నగదు పురస్కారాన్ని అందుకున్నాను. – హన్మంతు, కానిస్టేబుల్, నాగర్కర్నూల్ గత రెండేళ్లుగా అచ్చంపేట పోలిస్స్టేషన్లో సైబర్ వారియర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పటి వరకు బాధితుల నుంచి 90 ఫిర్యాదులు రాగా.. 15 కేసుల్లో రూ.5 లక్షల మేర రికవరీ చేయించి బాధితులకు అందజేశాం. ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇటీవల రాష్ట్రస్థాయిలో సైబర్ వారియర్స్కు అందించిన రివార్డును అందుకున్నాను. – లక్ష్మీపతి, కానిస్టేబుల్, అచ్చంపేట ● -
బాధితులకు అండగా..
● సైబర్ నేరాలు అరికట్టేందుకు పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ● 22 పోలీస్స్టేషన్ల పరిధిలో 22 మంది వారియర్స్ ఏర్పాటు ● జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ● ప్రజలను చైతన్యం చేసేందుకు తమవంతుగా కృషి ● అత్యుత్తమ ప్రతిభచూపిన ఇద్దరికి రాష్ట్రస్థాయిలో రివార్డులు నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చదువురాని అమాయకులతోపాటు చదువుకున్న వారు సైతం అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల బారినపడి తమ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. మరికొందరేమో తమ వ్యక్తిగత డేటాను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండటంతో సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో సైబర్ నేరగాళ్ల బారిన పడి ఎంతోమంది మోసపోతుండటంతో నిత్యం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఎస్పీ కృషి చేస్తున్నారు. టెక్నాలజీతో ఆధారాలు సేకరించి.. సైబర్ నేరగాళ్ల బారిన పడిన వారికి ఆసరాగా ఉండేందుకు, పోయిన నగదును తిరిగి బాధితులకు అందజేసేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో 22 మంది సిబ్బందిని ఎంపిక చేసి సైబర్ వారియర్స్ ఏర్పాటు చేశారు. వీరికి సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు సైబర్ వారియర్స్కు ప్రత్యేక సెల్ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసింది. సైబర్ కేసుల్లో పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి నేరస్తులను గుర్తించడంతోపాటు సైబర్ నేరగాళ్లకు శిక్షపడేలా చూస్తున్నారు. రెండేళ్లలో సైబర్ నేరాలు ఇలా.. జిల్లా పరిధిలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలోని పోలీస్స్టేషన్లలో సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. బాధితులు సత్వరమే పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే సైబర్ వారియర్స్ బాధితుల నగదు పోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 2024 సంవత్సరంలో 104 కేసుల్లో 12 కేసులను పోలీసులు ఛేదించగలిగారు. ఇందులో రూ.3.24 కోట్ల నగదు పోగొట్టుకుంటే రూ.10.68 లక్షల నగదు రికవరీ చేశారు. ఇక 2025లో 142 కేసుల్లో 17 కేసులను పోలీసులను ఛేదించారు. ఇందులో రూ.2.29 కోట్ల నగదును బాధితులు పోగొట్టుకుంటే రూ.20.78 లక్షల సొత్తును రికవరీ చేశారు. గతేడాది పోలీసుశాఖ ఆధ్వర్యంలో 943 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్లు వచ్చినప్పుడు స్పందించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. మారుతున్న కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త, కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకున్నప్పుడే మోసపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరంతరం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వారికి అండగా నిలిచేందుకు 22 పోలీస్స్టేషన్లలో శిక్షణ పొందిన సైబర్ వారియర్స్ ద్వారా సేవలు అందిస్తున్నాం. – సంగ్రామ్సింగ్ జి పాటిల్, ఎస్పీ -
భ్రూణ హత్యల నివారణకు పటిష్ట చర్యలు
నాగర్కర్నూల్: జిల్లాలో భ్రూణ హత్యలు, మహిళల గర్భాశయ క్యాన్సర్, మాతాశిశు మరణాలను నివారించడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీఎంహెచ్ఓ రవినాయక్, వైద్యులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఇతర వైద్య సిబ్బందితో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెయ్యి మంది బాలురకు 892 మంది బాలికల నిష్పత్తి మాత్రమే ఉందని, ఇంకా ముఖ్యంగా చారకొండ, లింగాల మండలాల్లో మరింత తక్కువగా ఉందన్నారు. అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల నుంచి ప్రజలు ఎక్కువగా కర్నూలుకు వెళ్లి అబార్షన్లు చేయిస్తున్నారనే సమాచారం ఉందని అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యశాఖను ఆదేశించారు. అలాగే జిల్లాలో గతేడాది 8 మాత, 58 శిశు మరణాలు నమోదయ్యాయని, ఈసారి ఏ మరణం సంభవించకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిరక్ష్యం కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయనే భావన ప్రజల్లో ఉండదని, ఇకపై ఇవి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో 14– 15 ఏళ్లలోపు ఉన్న 10 వేల మంది బాలికలకు తప్పనిసరిగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆరోగ్య విషయాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులు అందుబాటులో ఉంటూ సరైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అనంతరం భ్రూణహత్యలపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించేలా గోడపత్రికలు విడుదల చేశారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్ఓ తారాసింగ్, ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ తదితరులు పాల్గొన్నారు. పీఎంశ్రీ నిధులు వినియోగించుకోండి పీఎంశ్రీ పాఠశాలలకు మంజూరైన నిధులను వందశాతం వినియోగించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో డీఈఓ రమేష్కుమార్తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపికై న 27 పీఎంశ్రీ పాఠశాలలకు రూ.1.82 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, వాటిని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ట్రెజరీ అధికారి అబ్దుల్ రషీద్, సెక్టోరియల్ అధికారులు, పీఎంశ్రీ పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
నాగర్కర్నూల్ క్రైం: వాహనదారులు రోడు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణాలు చేయాలని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో వాహన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ వాహనదారులు రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్తోపాటు సీట్బెల్టు ధరించాలని సూచించారు. అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలు రోడ్డున పడతాయన్న విషయం గుర్తించుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఏఎంవీఐ అనూప్రెడ్డి, ఎంటీఓ రాఘవరావు, డీసీఆర్బీ సీఐ ఉపేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
వేరుశనగకు రికార్డు ధర
● బాదేపల్లి, కల్వకుర్తి మార్కెట్లో క్వింటా రూ.10వేలకు పైనే.. ● ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర జడ్చర్ల/కల్వకుర్తి రూరల్/దేవరకద్ర: ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా క్వింటా వేరుశనగ రూ.10 వేలు దాటింది. శుక్రవారం బాదేపల్లితో పాటు కల్వకుర్తి మార్కెట్లో ఈ ధరలు పలకడం విశేషం. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం క్వింటా కు రూ.411 పెరిగింది. మార్కెట్కు 1,679 క్వింటాళ్ల విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ.10,280, కనిష్టంగా రూ.7,560 ధరలు లభించాయి. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.7,263గా ఉంది. గతేడాది కనీసం మద్దతు ధర కూడా లేదని, త్వరలోనే క్వింటా ధర రూ.11 వేలు పలకవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,752, కనిష్టంగా రూ.2,649, కందులు గరిష్టంగా రూ.7,801, కనిష్టంగా రూ.5,766, మొక్కజొన్న రూ.1,921 ధరలు పలికాయి. కల్వకుర్తి మార్కెట్లో వేరుశనగా గరిష్టంగా రూ.10,200, కనిష్టంగా రూ.9,369 ధర లభించింది. కందులు క్వింటాల్కు రూ.7,009 ధరకు కొనుగోలు చేసినట్లు మార్కెట్ కార్యదర్శి శివరాజ్ తెలిపారు. -
జోగుళాంబ గద్వాల : 9 పల్లెలు
జిల్లాలో మొత్తం 261 గ్రామాలు ఉన్నాయి. ఒక డిపో ఉండగా.. 252 పల్లెలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. తొమ్మిది గ్రామాలకు మాత్రం బస్సు సర్వీసులు నడుస్తలేవు. 2025– 26లో బస్సు సౌకర్యం కల్పించాలని ఏడు గ్రామాలకు చెందిన ప్రజలు అర్జీలు పెట్టుకోగా.. తుంకుంట (అయిజ), మల్లెందొడ్డి (మల్దకల్)కి మాత్రమే సర్వీస్లు నడిపిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బంది పడుతున్న గ్రామాలు.. రాయపురం (గట్టు), తుమ్మిళ్ల (రాజోళి), కుర్వపల్లి, పరాముల (గద్వాల), మైలగడ్డ (ధరూర్), ఇటిక్యాలపాడు (మానవపాడు). -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్కర్నూల్: జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. మూడు మున్సిపాలిటీల్లోని 65 వార్డుల్లో ఎన్నికల నిర్వహణ కోసం 131 పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్రాల వివరాలను టీ–పోల్ యాప్లో నమోదు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా 158 బ్యాలెట్ బాక్స్లతో పాటు అదనంగా 20 శాతం బ్యాలెట్ బాక్స్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. బ్యాలెట్ పేపర్ సిద్ధం చేయడంతో పాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులను పూర్తి చేశామన్నారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమై ఉన్నామని ఎన్నికల కమిషనర్కు కలెక్టర్ వివరించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలను నియమించనున్నట్లు తెలిపారు. ఓటు చైతన్యం కోసం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. కాగా, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ దేవసహాయం, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. బీమాతో ఆర్థిక భరోసా : ఎస్పీ నాగర్కర్నూల్ క్రైం: పోలీసు సిబ్బంది తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని.. అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. పెద్దకొత్తపల్లి పోలీస్స్టేషన్ హోంగార్డు వెంకటస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. అతడి కుటుంబ సభ్యులకు మంజూరైన రూ. 38లక్షల చెక్కును గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, ఏఓ కృష్ణయ్య, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ అనిల్కుమార్, ఆర్ఐ రాఘవరావు పాల్గొన్నారు. ● జిల్లాలోని ఊర్కొండ, కల్వకుర్తి పోలీస్స్టేషన్ల్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్కానిస్టేబుళ్లు ప్రభాకర్రెడ్డి వెంకటయ్య ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. వీరిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, స్టార్లు అందజేశారు. -
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● కొల్లాపూర్లో మహిళాశక్తి భవన నిర్మాణం ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో గురువారం కొల్లాపూర్లోని రాజబంగ్లా వద్ద ఇందిరా మహిళాశక్తి సంబరాలు నిర్వహించగా.. మంత్రి జూపల్లి, కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరయ్యారు. మున్సిపాలిటీలోని 153 మహిళా సంఘాలకు రూ. 47.15కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. మహిళా సంఘాలతో సోలార్ ప్లాంట్లు, పెట్రోల్బంకులు ఏర్పాటు చేయించడంతో పాటు ఇతర వ్యాపార రంగాల్లో ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కొల్లాపూర్లో ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని విద్యుత్శాఖ కార్యాలయం వద్ద నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ భవనాన్ని కొన్నేళ్లుగా మున్సిపల్ కార్యాలయంగా వినియోగిస్తుండగా.. ఇటీవల సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించి గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు. గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అదే విధంగా స్థానిక రైతువేదిక వద్ద రైతులకు సబ్సిడీపై మంజూరైన రోటవేటర్లు, స్ప్రే పంపులను మంత్రి జూపల్లి పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంత్రావు, ఆర్డీఓ భన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
నిత్యం ‘నడక’యాతన..
ఆటోలే దిక్కు.. తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామం నుంచి తెలకపల్లిలోని పాఠశాలకు వెళ్లే విద్యార్థులు 15 మంది వరకు ఉన్నారు. గౌరారం నుంచి 2 కి.మీ. దూరంలో ఉన్న గౌరారం గేటు మేయిన్ రోడ్డు వరకు కాలినడకన చేరుకొని.. అక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేయాల్సి వస్తోంది. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ ఆటోలో కూర్చుని ప్రయాణిస్తున్నది తెలకపల్లి మండలంలోని పర్వతాపూర్కు చెందిన విద్యార్థులు. గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు నిత్యం ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సమయానికి పాఠశాలకు చేరుకునేందుకు ఇలా వాహనం సామర్థ్యానికి మించి కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. బస్సు సౌకర్యం కల్పిస్తే ఇబ్బందులు తొలగుతాయని విద్యార్థులు చెబుతున్నారు. -
ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం
సిబ్బందికి అభినందనలు.. సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులు నడిపాం. రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు నడిపి ప్రయాణికులకు సేవలు అందించాం. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడంలో తోడ్పడిన డ్రైవర్లు, కండక్టర్లతోపాటు సిబ్బందికి అభినందనలు. ముఖ్యంగా రద్దీ రోజుల్లో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయాణికులు ఎంతో సహకరించారు. ఆర్టీసీ బస్సులను ఆశ్రయించిన ప్రయాణికులకు కృతజ్ఞతలు. – సంతోష్కుమార్, ఆర్ఎం, మహబూబ్నగర్ స్టేషన్ మహబూబ్నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులను నడిపింది. మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి పది డిపోలకు 430 బస్సులు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 20 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులు నడిపారు. ముఖ్యంగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని స్వస్థలాలకు వెళ్లడానికి అధికంగా బస్సులు తిప్పారు. వీటిలో సెలవులు ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. అత్యధికంగా 109 శాతం.. మహాలక్ష్మి పథకం కింద ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణంలో జీరో టికెట్ ఉన్నప్పటికీ అందులో వారు తిరిగిన రూట్ ఆధారంగా టికెట్ చార్జీ కూడా పొందుపరిచారు. సాధారణ, మహిళల ఆదాయాన్ని కలుపుకొని సంక్రాంతి పండుగ రోజులకు సంబంధించి ఈ నెల 9 నుంచి 20 వరకు (14, 15, 16 తేదీలు మినహా) మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో అదనపు బస్సు సర్వీసులు నడపగా రూ.22,69,54,338 కోట్ల ఆదాయం వచ్చింది. 9 నుంచి 20 వరకు రీజియన్లోని బస్సులు 34,47,623 కిలోమీటర్లు తిరిగాయి. మహాలక్ష్మి పథకం ప్యాసింజర్లు, టికెట్ చార్జీ ప్రయాణికులతో కలిపి 39,20,918 మంది బస్సుల్లో ప్రయాణించారు. ఆక్యుపెన్షి రేషియాలో మహబూబ్నగర్ రీజియన్ రాష్ట్రంలో అత్యధికంగా 109 శాతం సాధించి అగ్రస్థానంలో నిలవడం విశేషం. డిపో కిలోమీటర్లు ఆదాయం ప్రయాణికులు మహబూబ్నగర్ 5,40,780 3,38,01,857 5,14,321 వనపర్తి 4,57,678 3,09,42,056 5,33,909 గద్వాల 4,06,181 2,46,20,151 4,95,360 అచ్చంపేట 3,34,898 2,44,05,169 3,39,395 కల్వకుర్తి 3,65,956 2,38,98,638 4,23,531 నారాయణపేట 3,66,405 2,37,08,913 3,66,638 షాద్నగర్ 3,18,770 2,24,55,052 4,09,820 నాగర్కర్నూల్ 3,17,478 2,09,87,807 4,39,589 కొల్లాపూర్ 2,71,300 1,81,41,848 3,05,620 కోస్గి 68,177 39,92,947 92,735 డిపోల వారీగా ఆదాయం (రూ.లలో), ఇతర వివరాలు పండుగ రద్దీతో రీజియన్కు మెరుగైన రాబడి ఈ నెల 9 నుంచి 20 వరకు రూ.22 కోట్లు ఆర్జన 34 లక్షల కి.మీ. ప్రయాణం, 39 లక్షల ప్రయాణికుల వినియోగం ఓఆర్లో రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ అగ్రస్థానం -
ఎగ‘బడి’ పోవాలె..!
● ఫీట్లు.. పాట్లు ●ఉమ్మడి జిల్లాలో బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అగచాట్లు మా ఊరికి బస్సు లేదు.. నేను నాగర్కర్నూల్లోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాను. మా ఊరికి బస్సు లేక అందరం ఇబ్బందులు పడుతున్నాం. మా నాన్న రోజూ బైక్పై ఎక్కించుకుని స్కూల్లో దింపాల్సి వస్తోంది. ఒక్కోసారి 4 కి.మీ. దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం. బస్సు సౌకర్యం కల్పిస్తే విద్యార్థులందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. – చైతన్యగౌడ్, పదో తరగతి, చర్లతిర్మలాపూర్, నాగర్కర్నూల్ మండలం సర్దుబాటు చేస్తున్నాం.. డిపోలోని బస్సులను వీలైన గ్రామాలకు పంపే లా రూట్లను సర్దుబాటు చేస్తున్నాం. మేడారం జాతరకు కొన్ని బస్సులు పంపడం వల్ల గ్రామాల్లో సమస్య నెలకొంది. ప్రత్యామ్నాయంగా బస్సు లను కేటాయిస్తున్నాం. విద్యార్థులకు బస్సులు లేక ఇబ్బందులు ఉన్నచోట మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – యాదయ్య, ఆర్టీసీ డీఎం, నాగర్కర్నూల్ ఏయే గ్రామాలు.. టంకర, కిష్టారం (హన్వాడ), కొత్తపల్లి (మిడ్జిల్), రామచంద్రపూర్ (మహబూబ్నగర్ రూరల్) నో బస్.. నో సర్వీస్ మహబూబ్నగర్ : 4 పల్లెలకు.. జిల్లాలో 423 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధి 45 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. నాలుగు గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టంకర మినహాయించి మూడు గ్రామాలకు చెందిన వారు బస్సులు నడపాలని విజ్ఞప్తులు చేసినా.. అమలు కాలేదు. -
భక్తిశ్రద్ధలతో వార్షిక బ్రహ్మోత్సవాలు
అలంపూర్: శ్రీజోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం మూడో రోజు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు, త్రిశతి అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించారు. అదేవిధంగా విశేష అర్చనలు, చండీహోమాలు, పవమాన సూక్త పారాయణ, పవమాన సూక్త హోమాలు, ఆవాహిత దేవతా హోమాలు, మండప ఆరాధన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు తదితర పూజలు చేశారు. మరో రెండు రోజుల పాటు వార్షిక బ్రహ్మో త్సవాలు కొనసాగుతాయని ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. ఈ నెల 23వ తేదీ ఉత్సవాల చివరి రోజు బ్రహోత్సవాల్లో భక్తులకు అమ్మవారు నిజరూప దర్శనం కలుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. -
‘పుర’ కమిషనర్ బదిలీ
కొల్లాపూర్: స్థానిక మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్రావు బదిలీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్రావు భూత్పూరు మున్సిపాలిటీకి బదిలీ కాగా.. ఆయన స్థానంలో తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి కొల్లాపూర్కు బదిలీపై వస్తున్నారు. నర్సరీల నిర్వహణలో అలసత్వం వద్దు ఉప్పునుంతల: వనమహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన నర్సరీల నిర్వహణలో అలసత్వం వహించొద్దని డీఆర్డీఓ చిన్న ఓబులేషు అన్నారు. బుధవారం మండలంలోని దేవదారికుంట తండాలో నర్సరీ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. నర్సరీ పనులు త్వరగా పూర్తిచేసి.. విత్తనాలు నాటాలని సూచించారు. అదే విధంగా రోడ్ల వెంట నాటిన మొక్కలకు పాదులు చేసి క్రమం తప్పకుండా నీటిని అందించాలన్నారు. అన్ని గ్రామాల్లో కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని ఈజీఎస్ ఏపీఓ పర్వతాలుకు సూచించారు. డీఆర్డీఓ వెంట టీఏ సింగోటం, పంచాయతీ కార్యదర్శి చందర్, స్థానిక నాయకుడు రతన్సింగ్ ఉన్నారు. అందుబాటులో 1,220 టన్నుల యూరియా కందనూలు: జిల్లాలో ప్రస్తుతం 1,220 టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలలో మరో 3,369 టన్నుల యూరియా జిల్లాకు కేటాయించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొక్కజొన్న సాగుకు సంబంధించి యూరియా పంపిణీ దాదాపుగా పూర్తయిందన్నారు. వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో యూరియా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రణాళికా బద్ధంగా యూరియా పంపిణీ చేయాలని సూచించారు. డీలర్లు యూరియా పంపిణీలో నిబంధనలు పాటించాలన్నారు. మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలి కొల్లాపూర్: జిల్లాలో ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు కోరారు. ఈ మేరకు బుధవారం కొల్లాపూర్లో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లెక్చరర్ల సంఽఘం జిల్లా జనరల్ సెక్రెటరీ రవికుమార్, ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూరగౌని శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్నగర్లో ఇంటర్ మూల్యాంకనం చేసేందుకు జిల్లాలోని అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోనే మూల్యాంకన కేంద్రం ఏర్పాటుచేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో దశరథం, శ్రీనివాసరావు, కురుమూర్తి పాల్గొన్నారు. వేరుశనగకు రికార్డుస్థాయి ధర కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం 664 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. రికార్డు స్థాయిలో ధర లభించింది. కొన్ని రోజులుగా రూ. 9వేల ధర పలికిన వేరుశనగ.. రూ.400 వరకు ధర పెరిగింది. క్వింటాకు గరిష్టంగా రూ. 9,600, కనిష్టంగా రూ. 8,150, సరాసరి రూ. 9,270 ధరలు లభించాయి. అదే విధంగా కందులకు రూ. 6,909 ధర పలికింది. మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టినట్లు కార్యదర్శి శివరాజ్ తెలిపారు. -
పట్టణాల్లో సందడి..
మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన పార్టీల ఫోకస్ సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే పట్టణాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఎన్నికలకు కీల కమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఖరారైన రిజర్వేషన్లకు అనుగుణంగా ఆశావహు లు పావులు కదుపుతున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా అచ్చంపేట మున్సిపాలిటీ పాలకవర్గ పదవీకాలం మరో నాలుగు నెలల పాటు మిగిలి ఉంది. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ చైర్మన్ స్థానం బీసీ మహిళకు కేటాయించగా, కల్వకుర్తి చైర్మన్ స్థానం జనరల్ మహిళకు, కొల్లాపూర్ చైర్మన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. రిజర్వేషన్ కలసివచ్చిన నేతలు మున్సిపాలిటీల చైర్మన్, వార్డు స్థానాలకు పోటీచేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. మున్సిపోల్స్పై ప్రధాన పార్టీల దృష్టి.. మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ స్థానంతో పాటు వార్డు స్థానాలకు పోటీచేసేందుకు ఆశావహుల జాబితా పదుల సంఖ్యలో కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుని చైర్మన్ స్థానాలను దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించి పట్టునిలుపుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. బీజేపీ సైతం అర్బన్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తాము ప్రభావితం చేసేలా స్థానాలను సొంతం చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులుగా గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. కొల్లాపూర్ కాంగ్రెస్లో పోటీ తీవ్రం.. జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో పదిమంది వరకు ఉండటం గమనార్హం. దాదాపు పోటీ చేస్తున్న వారందరూ చైర్మన్ పదవిని ఆశిస్తుండటంతో ఎన్నికల వేళ ఆ పార్టీలో ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ పదవి కోసం మాజీ చైర్మన్ మేకల రమ్య, మాజీ కౌన్సిలర్లు శ్రీదేవి గౌతమ్గౌడ్, పిన్నంచెట్టి జ్యోతి, వంగ అనూష రాజశేఖర్, మాజీ వైస్ చైర్మన్ మహమ్ముదా బేగం, మాజీ కౌన్సిలర్లు బరిగెల శ్రీలక్ష్మి, మేకల శిరీష, గుండ్రాతి శిల్పగౌడ్ ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్లో చైర్మన్ పదవి కోసం పెద్దసంఖ్యలో ఆశావహుల నుంచి పోటీ ఉండటంతో ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దలు ఏ విధంగా సర్దుబాటుచేస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ల్లో పెరుగుతున్న ఆశావహులు అందరి దృష్టి చైర్మన్ పదవిపైనే రిజర్వేషన్ల ఖరారుతో ప్రయత్నాలు ముమ్మరం -
వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపాలి
కందనూలు: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్జేడీ సోమిరెడ్డి సూచించారు. బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ రమేశ్కుమార్తో కలిసి విద్యాశాఖ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేసేలా సెక్టోరియల్ అధికారులు, మండల విద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను తరచుగా తనిఖీలు చేసి విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. విద్యాప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. పీఎంశ్రీ నిధులను వందశాతం వినియోగించిన పెద్దకొత్తపల్లి కేజీబీవీ ప్రత్యేకాధికారిని ఆర్జేడీ అభినందించారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సమగ్రశిక్ష గణాంక అధికారి మధుసూదన్రెడ్డి, సెక్టోరియల్ అధికారులు షర్ఫుద్దీన్, నూరుద్దీన్, వెంకటయ్య, శోభారాణి, కార్యాలయ పర్యవేక్షకులు నాగేందర్, సుజాత, వెంకటేశ్వర్లు శెట్టి ఉన్నారు. -
రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి
● ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగావ్యవహరించాలి ● కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్కర్నూల్: ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన ర్యాలీని ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ పాటిల్, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. పోలీసు సిబ్బంది, విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి గంటకు సగటున 55 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. ప్రమాదాలు రోజువారీ జీవితంలో సాధారణంగా మారిపోతున్నాయని.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక స్పృహతో కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడిపితే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. ● ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ పాటిల్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యపు డ్రైవింగ్తో తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే సమయంలోనే డ్రైవింగ్ నైపుణ్యాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు. ● ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం ఎంత ముఖ్యమో, డ్రైవింగ్లో జాగ్రత్త కూడా అంతే ముఖ్యమన్నారు. తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టి సమాజంలో మార్పునకు దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతికశాఖ కళాకారులు రోడ్డు భద్రతపై పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీటీఓ బాలు, డీఎస్పీ శ్రీనివాస్, డీఎంహెచ్ఓ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరిదో పైచేయి..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సి‘పోల్స్’కు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడం.. ఎన్నికలకు రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి పాలమూరులోని నగర, పట్టణాల్లో రాజకీయ సందడి ఊపందుకుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనుండడంతో నాలుగైదు రోజుల్లోపే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు డివిజన్లు,వార్డుల పరిధిలో కార్పొరేటర్లు,కౌన్సిలర్ల ఆశావహులు యువతను వెంటేసుకుని విందులకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు మేయర్, చైర్మన్, చైర్పర్సన్ పదవుల కోసం అధికార పార్టీ కాంగ్రెస్లో పలువురి మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో గ్రూప్ రాజకీయాలు మరోసారి తెరపైకి రాగా.. నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. కాంగి‘రేసు’లో పురపాలక పీఠాల లొల్లి మేయర్/చైర్మన్ గిరి కోసం ఆశావహుల తీవ్ర ఒత్తిళ్లు కార్పొరేటర్/కౌన్సిలర్ పదవులకు సైతం.. వర్గాల వారీగా చీలిన ఎమ్మెల్యేలు, డీసీసీ, కీలక నేతలు తమ అనుచరులకు దక్కేలా ఎవరికి వారు పావులు రసవత్తరంగా మారిన గ్రూప్ రాజకీయాలు -
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
మన్ననూర్: వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం ఆయన మన్ననూర్లోని గిరిజన ఆశ్రమ పాఠశాల/ వసతి గృహం పరిసరాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం తరపున కల్పించే సౌకర్యాలు, ప్రతిరోజు అందించే పౌష్టికాహారం నాణ్యతతోపాటు మెనూ సక్రమంగా పాటిస్తున్నారా అనే విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదులు, వసతి గృహం స్టోర్ రూం, భోజనశాల, పడక గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం (ఫిల్టర్ వాటర్ ప్లాంట్)లను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించాలని, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్లను పరిశీలించి హెచ్ఎం, హెచ్డబ్ల్యూఓ తిరుపతమ్మకు సూచనలు చేశారు. అధికారులతో సమీక్ష ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గవర్నర్ కోటా నుంచి విడుదలైన నిధులతో అటవీ లోతట్టు ప్రాంతాల్లోని చెంచుపెంటల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెంచుపెంటల్లో తాగునీటి సమస్య రాకుండా మంచినీటి బావులు, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యాలయం, ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ, సంక్షేమ, జీవీవీకే పాఠశాలల నిర్వాహణ తదితర అంశాల గురించి చర్చించారు. మద్దిమడుగులో స్థల పరిశీలన అమ్రాబాద్: పదర మండలం మద్దిమడుగు పబ్బతి శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శేషవస్త్రాలు అందజేశారు. అనంతరం ఆలయ సమీపంలో ఏర్పాటు చేయనున్న సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ స్థాపనకు స్థలాన్ని పరిశీలించారు. -
వైభవంగా శేషవాహన సేవ
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం గ్రామంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం రాత్రి స్వామివారికి శేషవాహన సేవ నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపి శేషవాహనంపై ఊరేగించారు. భక్తుల సమక్షంలో సమీపంలో ఉన్న రత్నగిరి అమ్మవారి గుట్ట వరకు స్వామివారి శేషవాహన సేవ కొనసాగింది. అంతకు ముందు స్వామి వారికి దీక్షాహవనం, మూలమంత్ర హవనం, తీర్థావళి, బలిహరణం, పూర్ణాహుతి, వసంతోత్సవం, సాయంత్రం స్వామివారి గర్భగుడిలో డోలోత్సవం, చప్పరపు సేవ నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు సంపత్కుమార్శర్మ, భక్తులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కల్వకుర్తి: నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విద్యుత్, హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎంత వరకు వచ్చింది.. బిల్లుల పెండింగ్ తదితర వివరాలపై ఆరా తీశారు. వెంటనే బిల్లులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. పనుల పూర్తికి వెంటనే నివేదిక ఇవ్వాలని కరెంటు సమస్య లేకుండా చేసేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. -
యూరియా వాడకం డబుల్
జిల్లాలో మోతాదుకు మించి వినియోగిస్తున్న రైతులు ● ఎకరానికి నాలుగు బస్తాలకుపైనే పిచికారీ ● యాప్ ద్వారా బుకింగ్ విధానంతోనైనా అడ్డుకట్ట పడేనా..? అచ్చంపేట: జిల్లా రైతాంగం మోతాదుకు మించి యూరియా వాడుతోంది. వరి ఏపుగా రావడం లేదని చెప్పి కొందరు ఎకరానికి నాలుగు బస్తాల దాకా వాడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం అంచనాలు తారుమారై కొరత ఏర్పడుతోంది. మరోవైపు రైతులకు యూరియా వాడకంపై అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సీజన్ నుంచి సొసైటీల ద్వారా కార్డుల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నా.. రైతుల్లో మార్పు రావడం లేదు. యాప్తోనైనా సమస్య తీరుతుందో లేదో వేచిచూడాల్సి ఉంది. వాడాల్సింది రెండు బస్తాలే.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది వానాకాలం సీజన్లో 5,95,117.64 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 1,79,303 ఎకరాల్లో వరి సాగు చేశారు. అలాగే ప్రస్తుత యాసంగి సీజన్లో ఇప్పటి వరకు 2,52,425 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 47,464 ఎకరాల్లో వరి, 99,407 ఎకరాల్లో మొక్కజొన్న, 95,848 ఎకరాల్లో వేరుశనగ, 8,718 ఎకరాల్లో మినుములు, 677 ఎకరాల్లో జొన్న, 311 ఎకరాల్లో ఆముదం సాగైంది. అయితే జిల్లా పరిస్థితులు, భూముల తీరును బట్టి ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా వాడితే సరిపోతుంది. అది కూడా రెండు లేదా మూడు విడతల్లో పంటకు పిచికారి చేయాల్సి ఉంటుంది. మొదట నాటు వేసిన 15 రోజులకు ఎకరాకు ఒక బస్తా, తిరిగి 45 రోజులకు చివర పొట్ట దశలో ఒకసారి, తర్వాత 15 రోజులకు మరోసారి అందించాలి. లేదంటే 45 రోజులకు ఒకేసారి బస్తా యూరియా పిచికారి చేసినా సరిపోతుంది. ఈ లెక్కన యూరియాను పంటకు అందిస్తే నత్రజని సకాలంలో సమృద్ధిగా అంది పంట దిగుబడి పెంపునకు తోడ్పడుతుంది. యాప్ బుకింగ్ ద్వారా.. జిల్లాలో రైతులు మోతాదుకు మించి యూరియా వాడడంతో అధికారుల అంచనాలు తారుమారు అవుతున్నాయి. ఈ పరిస్థితుల వల్లే వానాకాలం సీజన్లో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ యాప్ ద్వారా యూరియా బుకింగ్ విధానం తీసుకువచ్చింది. దీని ప్రకారం ఎకరానికి 2 బస్తాల చొప్పున యూరియా పాస్ పుస్తకాలున్న రైతులకే ఇస్తున్నారు. అధికంగా యూరియా వాడే రైతులు ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా పొంది.. తిరిగి పీఏసీఎస్ల వద్ద మళ్లీ తీసుకుంటున్నారు. ఇలా అధిక బస్తాలను పొంది వరి పంటకు అందిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న యూప్ బుకింగ్ విధానం విజయవంతమైతే విచ్చలవిడిగా యూరియా వాడకానికి చెక్ పెట్టినట్లు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అచ్చంపేట శివారులో సాగు చేసిన వేరుశనగ పంట మొదట్లోనే ఇష్టానుసారంగా.. వరి త్వరగా పచ్చబడి.. ఏపుగా పెరగాలని కొందరు రైతులు నాటుకు ముందే ఎకరానికి ఆర బస్తా వరకు యూరియా చల్లుతున్నారు. తదనంతరం 15 రోజులకు రెండు బస్తాల లెక్కన వేస్తున్నారు. అయితే చలికాలంలో వరి అంతగా పెరగదు. అగ్గి తెగులుకూ అవకాశం ఉంటుంది. జింక్ లోపం తల్తెతుతోంది. కానీ, రైతులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నివారణ చర్యలు తీసుకోకుండానే వరి పైరు పెరగడం లేదనే ఉద్దేశంతో యూరియాను మోతాదుకు మించి వాడుతుంటారు. రెండో దఫాలోనూ ఇదే విధంగా ఎకరానికి రెండు బస్తాల వరకు వినియోగిస్తున్నారు. సూచనలు పాటించాలి.. జిల్లాలో యూరియా కొరత లేదు. వరి పంటకు మోతాదుకు మించి యూరియా వాడొద్దు. ఇలా వాడితే రైతులే నష్టపోతారు. రానున్న రోజుల్లో భూమి సారం కోల్పోతుంది. పంటలకు చీడపీడలు ఆశించి దిగుబడి తగ్గుతుంది. పెట్టుబడులు సైతం పెరుగుతాయి. కాబట్టి రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన మేరకు మాత్రమే యూరియా వాడాలి. – యశ్వంత్రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
పకడ్బందీగా వన్యప్రాణుల గణన
లింగాల/ దోమలపెంట: లింగాల రేంజ్ పరిధిలో ఎఫ్ఆర్ఓ ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) కార్యక్రమంలో భాగంగా మంగళవారం మొదటిరోజు నల్లమల ప్రాంతంలో పులులు, ఇతర వన్యప్రాణుల లెక్కింపును అటవీ శాఖ బృందం ప్రారంభించింది. అప్పాయపల్లి ఏరియాలో 2 కిలోమీటర్ల మేరకు కాలినడకన వెళ్లిన గణన బృందం క్రాన్సెక్ట్ లైన్కు ఉదయం 6 గంటలకు చేరుకొని వన్యప్రాణుల పాదముద్రలు సేకరించారు. ఈ సందర్భంగా చుక్కల దుప్పులు, మనుబోతులు, కొండముచ్చులు, నీలిగాయలు, అడవి పందులు, కొండ గొర్రెలు, నెమళ్లు, అడవి కోళ్లు తదితర వాటిని గమనించినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. అనంతరం పద్మన్నపల్లి, లింగాల, ధారారం బీట్లలో డీఆర్ఓ జయదేవ్, బీట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో శాకాహార జంతువుల గణన చేపట్టారు. అలాగే దోమలపెంట పరిధిలో సర్పంచ్ మల్లేష్, ఉపసర్పంచ్ మోయిజుద్దీన్, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున సమక్షంలో గణన ప్రారంభించినట్లు ఎఫ్ఆర్ఓ గురుప్రసాద్ తెలిపారు. -
కాలయాపన చేయొద్దు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాలలకు కావాల్సిన నిధులు సమకూర్చి త్వరగా భవనాలు నిర్మించాలి. కాలయాపన చేయకుండా.. మిగతా నియోజకవర్గాల్లో కూడా త్వరగా పనులు ప్రారంభించాలి. – బంగారుబాబు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (18ఎన్జికెఎల్72) 18 నెలల్లో పూర్తిచేస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు జరుగుతున్నాయి. 18 నెలల్లో పూర్తిచేసి.. 2027 విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో ప్రస్తుతం జటప్రోల్ దగ్గర పనులు కొనసాగుతున్నాయి. మిగతా నియోజకవర్గాల్లోనూ త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. – రామచందర్, ఈఈ, ఈడబ్ల్యూఐడీసీ ● -
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి
నాగర్కర్నూల్ రూరల్: కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, రాంజీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, జాతీయ విత్తన బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రామిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని గాంధీ పార్కు వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రామిక సంఘాల నాయకులు ఆర్.శ్రీనివాసులు, నర్సింహ, ఎం.శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసే నాలుగు లేబర్ కోడ్సు తీసుకువచ్చి.. కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేకుండా పెట్టుబడిదారులకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు, ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ, రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు ఆంజనేయులు, నర్సింహ, శ్రీనివాసులు, దేశ్యనాయక్, పర్వతాలు, రామయ్య, శివవర్మ, బాలస్వామి, పార్వతమ్మ, మాసమ్మ, జయమ్మ, లక్ష్మి, శిరీష తదితరులు పాల్గొన్నారు. -
అధునాతన హంగులు.. అంతర్జాతీయ ప్రమాణాలు
● సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ● జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటుకు శంకుస్థాపన ● రూ.200 కోట్లతో భవనాల నిర్మాణాలు, ఇతర వసతుల కల్పన ● జటప్రోల్లో 20 ఎకరాల విస్తీర్ణంలో చకచకా పనులు ● పేద విద్యార్థులకు వరంగా మారనున్న పాఠశాలలు కందనూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమా ణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఈ పాఠశాలలు నిర్మిస్తోంది. అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, డిజిటల్ క్లాసులు, స్మార్ట్ బోర్డులు, విశాలమైన మైదానాలు, విభిన్న రకాల ప్లే గ్రౌండ్స్తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా జిల్లాలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన సైతం చేశారు. జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంతో పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్య అందనుంది. అన్నిరకాల వసతులు.. యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు అధునాతన, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ క్యాంపస్లో అధునాతన తరగతి గదులు, డార్మెంటరీలు, ల్యాబొరేటరీలు, కంప్యూటర్ ల్యాబ్, సుమారు 5 వేల పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేస్తారు. ఒకేసారి 900 మంది కూర్చొని భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ నిర్మాణం, ప్రతి డార్మెంటరీలో పది బెడ్లు, రెండు బాత్రూంలు ఉంటాయి. హాస్పిటల్, ఆడిటోరియం, గ్రీన్ క్యాంపస్, సోలార్, విండ్ ఎనర్జీ సౌకర్యాలు కల్పిస్తారు. కేవలం విద్యాబోధనే కాకుండా ఒత్తిడి నియంత్రణ కోసం స్పోర్ట్స్, కల్చరల్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం విశాలమైన క్రికెట్ మైదానం, ఫుట్బాల్, బాస్కెట్బాల్, ఇండోర్, అవుట్ డోర్ గ్రౌండ్స్, జిమ్, మినీ యాంపీ థియేటర్ తదితర సౌకర్యాలు ఉండనున్నాయి. ఐదో తరగతి నుంచి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే గొడుగు కింద నాణ్యమైన విద్య పొందేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇంగ్లిష్ మీడియంలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన ఉంటుంది. ఈ పాఠశాలలో సుమారు 2,500 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంది. పాఠశాలలో కనీసం 120 మంది టీచర్లు పనిచేస్తారు. డిజిటల్ క్లాస్లతోపాటు స్మార్ట్ బోర్డుల ద్వారా విద్యాబోధన ఉంటుంది. అధునాతన పాఠశాల భవనాలు, హాస్టళ్లు, క్వార్టర్స్ సౌకర్యాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. స్థానిక పరిస్థితులు, వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా భవనాల డిజైనింగ్, నిర్మాణం చేపట్టనున్నారు. మొట్టమొదట జటప్రోల్లో.. పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రభుత్వ విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెబుతోంది. విడతల వారీగా నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తుండగా.. జిల్లాలో తొలిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోల్లో స్కూల్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం గ్రామంలో 20 ఎకరాల భూమి కేటాయించగా.. రూ.200 కోట్ల వ్యయంతో సువిశాల భవనాలు, హాస్టళ్లు, మైదానాలు తదితర వసతులు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో స్థల సేకరణ జరగగా.. నాగర్కర్నూల్ నియోజకవర్గం తూడుకుర్తి, అచ్చంపేట నియోజకవర్గం రాయిచేడు, కొల్లాపూర్ నియోజకవర్గం జటప్రోల్ ఉన్నాయి. ఇందులో ఒక జటప్రోల్లో మాత్రమే ప్రస్తుతం పాఠశాల నిర్మాణానికి పనులు చకచకా జరుగుతున్నాయి. -
చదువుతోనే సమాజంలో మార్పు
నాగర్కర్నూల్: చదువుకుంటేనే సమాజంలో మార్పు వస్తుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వైద్య. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం ఆయన ఎంపీ మల్లు రవి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, అచ్చంపేట, నాగర్కర్నూల్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డితో కలిసితో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అలాగే నాగర్కర్నూల్ పట్టణంలోని 245 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.7.80 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. అనంతరం జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్ప న, ఉపాధ్యాయుల నియామకం, ఆధునిక సాంకేతికత విద్య తదితరవి అమలు చేస్తున్నామన్నారు. విద్యతోనే భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేయగలమని, అదే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. అలాగే ప్రతి పేద వాడి ఆరోగ్యాన్ని కాపాడటమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నామని, అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో 109 ట్రామా కేంద్రాలు నిర్మించామని, వృద్ధ తల్లిదండ్రుల కోసం 37 ప్రణామ్ కేంద్రాలు స్థాపించామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక వైద్య పరిక రాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. విద్యార్థులకు సూచనలు మంత్రి దామోదర రాజనర్సింహ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు.. ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై మంత్రి సూచనలు చేశారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయం సాధ్యమని పేర్కొన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి మాట్లాడుతూ నాగర్కర్నూల్ జిల్లాను విద్యా హబ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేక విద్యాసంస్థలను నెలకొల్పుందన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు. విద్య, వైద్యానికే మా ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లాకేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన


