ఎవరిదో పైచేయి..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సి‘పోల్స్’కు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడం.. ఎన్నికలకు రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి పాలమూరులోని నగర, పట్టణాల్లో రాజకీయ సందడి ఊపందుకుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనుండడంతో నాలుగైదు రోజుల్లోపే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు డివిజన్లు,వార్డుల పరిధిలో కార్పొరేటర్లు,కౌన్సిలర్ల ఆశావహులు యువతను వెంటేసుకుని విందులకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు మేయర్, చైర్మన్, చైర్పర్సన్ పదవుల కోసం అధికార పార్టీ కాంగ్రెస్లో పలువురి మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ క్రమంలో పార్టీలో గ్రూప్ రాజకీయాలు మరోసారి తెరపైకి రాగా.. నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
కాంగి‘రేసు’లో పురపాలక పీఠాల లొల్లి
మేయర్/చైర్మన్ గిరి కోసం ఆశావహుల తీవ్ర ఒత్తిళ్లు
కార్పొరేటర్/కౌన్సిలర్ పదవులకు సైతం..
వర్గాల వారీగా చీలిన ఎమ్మెల్యేలు, డీసీసీ, కీలక నేతలు
తమ అనుచరులకు దక్కేలా ఎవరికి వారు పావులు
రసవత్తరంగా మారిన గ్రూప్ రాజకీయాలు
ఎవరిదో పైచేయి..!


