breaking news
Kurnool
-
శ్రీగిరి మల్లయ్య యుగే యుగే!
● శ్రీశైలానికి పోటెత్తిన కన్నడ భక్తులు ● నేటితో ముగియనున్న స్పర్శదర్శనం ‘హే..మల్లయ్య...హే.. శ్రీగిరి మల్లయ్య యుగే యుగే’.. అంటూ కన్నడ భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు. కంబి(పల్లకీ)లు మోసుకుంటూ పాదయాత్రగా తరలివస్తున్నారు. పల్లకీల ముందు తప్పెట దరువులకు రంగులు చల్లుకుంటూ, చిందులు వేస్తూ మల్లన్నను కీర్తిస్తున్నారు. కన్నడ భక్తుల నృత్యాలతో శ్రీగిరి క్షేత్రం మరింత ఉత్సవ శోభను సంతరించుకుంది. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని తరలివస్తున్న కన్నడ భక్తులతో శనివారం శ్రీగిరి క్షేత్రం జనసంద్రంగా మారింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వేలాది మంది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైల క్షేత్రం కన్నడ భక్తజన సంద్రంగా మారింది. మల్లన్న స్పర్శదర్శనం నేటితో (ఆదివారం) ముగియడంతో కన్నడ భక్తులు అధికసంఖ్యలో శ్రీగిరి చేరుకుంటున్నారు. వేలాది మంది భక్తులు నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్నారు. వృద్దులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం పాదయాత్ర చేసుకుంటూ తరలివస్తున్నారు. – శ్రీశైలం టెంపుల్ కంబి(పల్లకీ)ని మోసుకుంటూ.. -
జిల్లాలో ముగిసిన సెంట్రల్ టీం పర్యటన
కర్నూలు (అగ్రికల్చర్): జిల్లాలో 2025–26 సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులను నలుగురు సభ్యులు కలిగిన సెంట్రల్ టీం తనిఖీలు చేపట్టింది. ఈనెల 9 నుంచి 14వ తేదీ వరకు ఢిల్లీలోని గ్రామీణాభివృద్ధి శాఖ ఆడిట్ విభాగం ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. వెల్దుర్తి, మద్దికెర, దేవనకొండ, కర్నూలు, తుగ్గలి మండలాల్లో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించి కూలీలతో చర్చించారు. ఉపాధి నిధులతో చేపట్టిన పండ్ల తోటలను కూడా పరిశీలించారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల షెడ్ల పురోగతిని అధ్యయనం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వీబీజీ రామ్జీ చట్టంపై నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూడా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ముగిసిన అనంతరం కలెక్టరేట్లోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ మాధవీలతతో సమావేశమయ్యారు. తమ పర్యటనకు అన్ని విధాలా సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తాము చేపట్టిన తనిఖీలపై నివేదిక ఇస్తామని ప్రకటించారు. కాగా ఆదివారం నుంచి సెంట్రల్ టీమ్ ప్రతినిధులు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. -
ఆత్మవిశ్వాసమే ఆయుధం
కర్నూలు (టౌన్): ప్రత్యేక అవసరాలు కలిగిన మహిళలు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా విద్య, ఉపాధి రంగాల్లో రాణించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని సమావేశ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన డెఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఎంపవర్మెంట్ ఆఫ్ డెఫ్ ఉమెన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి మహిళా సమాన అవకాశాలతో ముందుకు రావాలన్నారు. సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకొని రాణించాలన్నారు. మహిళలు తమ హక్కులు తెలుసుకొని సమాజంలో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. డెఫ్ సంస్థలు సత్యవాణి, సయ్యద్ గౌస్ పాషా, సుబాల్ బాషా, తేజస్విని, ధరణీకుమారి, లక్ష్మీ, షేక్ రిజ్వానా బేగమ్, తేజేశ్వరి, సౌజన్య, సుబ్బమ్మ, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన డెఫ్ ఉమెన్ ఆర్గనైజేషన్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. నెలాఖరు వరకే ఎస్సార్బీసీకి నీటి విడుదల పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ఎస్సార్బీసీ ఆయకట్టుకు ఈ నెలాఖరు వరకు నీటి విడుదల ఉంటుందని ఈఈ కిష్టన్న తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎస్సార్బీసీ ఆయకట్టు కింద పంటలు సాగు చేసిన రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రసుత్తం గోరుకుల్ల జలాశయంలో 5.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఎక్కడా నీటిని వృథా చేయరాదన్నారు. ఈనెల చివరి నాటికి గోరుకల్లు వద్ద నీటిని నిలిపివేస్తామన్నారు. ఈ విషయాన్ని ఆయా బ్లాక్ కింద సాగు చేసుకునే రైతులు క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సమాచారం అందిస్తామన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ఎమ్మిగనూరుసెంట్రల్: బనవాసి గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రజిత తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఎంపీసీలో 60 సీట్లు, బైపీసీలో 40 సీట్లు, ఎంపీసీలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, కళాశాల వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యుత్ బిల్లుల నకిలీ సందేశాలను నమ్మొద్దు కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. మీ విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిస్తూ మరిన్ని వివరాలకు ఈ నెంబర్ను సంప్రదించాలని కొందరు వినియోగదారులకు సందేశాలు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీఎస్పీడీసీఎల్ అధికారిక మార్గాల ద్వారా మాత్రమే తెలియజేస్తుందన్నారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై టోల్ఫ్రీ నెం.1912 లేదా 1800 425 155333కు కాల్ చేయవచ్చని, లేదా 91333 31912 నెంబరుకు చాట్ చేయవచ్చని సూచించారు. యువకుడు ఆత్మహత్య బనగానపల్లె: పట్టణంలోని తెలుగుపేటలో ఓ యువకుడు ఆత్యహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు పది నెలల క్రితం వడ్డే చెంచయ్య తన కుమారుడు వడ్డె హేమంత్కుమార్ (19) కోసం ఫైనాన్స్ ద్వారా బైక్ కొనుగోలు చేశాడు. అయితే ఫైనాన్స్ కంతులు చెల్లించడంలో జాప్యం జరగడంతో ఫైనాన్స్ సిబ్బంది బైక్ను తీసుకెళ్లారు. ఈ విషయంలో తండ్రి, కుమారుడు తరచూ ఘర్షణ పడుతూ వచ్చారు. దీంతో మనస్తాపం చెందిన హేమంత్కుమార్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి కొత్తపల్లి: ఓ గిరిజన వృద్ధుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామ పంచాయతీలోని మజారా గ్రామమైన చదరంపెంట గూడెం వాసి అయిన నిమ్మల పెద్ద అంకన్న అనే గిరిజన వృద్ధుడు సాయంత్రం స్నానం చేసి దుస్తువులు శుభ్రం చేసుకునేందుకు గూడెంకు పక్కనే ఉన్న గొరిసెల కాల్వకు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తున్న సమయంలో అటవీలోంచి ఓ ఎలుగుబండి అకస్మాత్తుగా వచ్చి దాడి చేసింది. ఈ దాడిలో అంకన్న కుడి, ఎడమ చేతులు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఎలుగుబంటి బారి నుంచి అంకన్న బయటపడి గూడెం చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అంకన్నకు అటవీశాఖ నుంచి ఆర్థిక సహాయం అందించాలని గిరిజనులు కోరుతున్నారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
నంద్యాల: పట్టణ శివారులో కర్నూలు బైపాస్ రహదారిలో కుందూనది వంతెన కింద శనివారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నంద్యాల త్రీటౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం కుందూనది బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు పట్టణంలోని నూనెపల్లెలోని మంచినీళ్ల బావి వీధికి చెందిన పెయింటర్ హారిఫ్ (38)గా గుర్తించారు. మృతుడికి భార్య హమీద, కొడుకు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి తనతో ఘర్షణ జరిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని మృతుడు భార్య చెబుతుండగా.. తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని, ఎవరో వ్యక్తులు దాడి చేసి చంపేశారని మృతుడి సోదరి ఆరోపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించామని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
జై మల్లన్న.. జైజై భ్రమరాంబ!
● ఆడపడుచు దర్శనానికి తరలివస్తున్న కన్నడిగులు ● నల్లమల మీదుగా శ్రీగిరి వైపు అడుగులు ఆత్మకూరు: శ్రీశైలం మహాక్షేత్రంలో వెలిసిన శ్రీభ్రమరాంబదేవి కన్నడిగులకు ఆడపడుచుగా కొలువుదీరి ఉందని భక్తుల విశ్వాసం. ఉగాది ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా సంప్రదాయం కొనసాగుతోంది. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం శివభక్తురాలైన భ్రమరాంబ కర్ణాటక ప్రాంతానికి చెందినవారని స్వప్నంలో సాక్షాత్కరించిన పరమేశ్వరుడ్ని వరించారు. శివుడు ఓ భ్రమరాన్ని (తుమ్మెదను) చూపించి, అది నిలిచిన చోటుకు వస్తే తానే వరిస్తానని స్వప్నంలో చెప్పడంతో అమ్మవారు భ్రమరాన్ని అనుసరించారు. ఆ తుమ్మెద శ్రీశైలం వద్ద ఆగింది. అక్కడికి వృద్ధ రూపంలో ఉన్న పరమేశ్వరుడు వచ్చి.. స్వప్నంలో కనిపించింది తానేనని చెప్పడంతో అమ్మవారు వివాహమాడారు. అందుకే శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. కన్నడిగురాలైన భ్రమరాంబదేవిని మల్లికార్జున స్వామి వరించడంతో కన్నడిగులు అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి ఏటా శ్రీశైలానికి సారె తెస్తారు. వందల కి.మీ. దూరం నుంచి శ్రీశైలం మహాక్షేత్రానికి కన్నడ సంప్రదాయరీతిలో మిరియాలపట్టు, ముత్తైదు సౌభాగ్యాలతో కావాల్సిన గాజులు, పసుపు, కుంకుమలు, నూతన పట్టుచీరలు, రవికెలు, కొత్త చాటతో అమ్మవారికి చీర, సారె మహిళల నెత్తిపై పెట్టుకుని తమ ఆడపడుచు శ్రీభ్రమరాంబదేవి సమర్పిస్తారు. అమ్మవారికి మొక్కులు తీర్చి తమ కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకుంటారు. వందల కి.మీ పాదయాత్రగా.. ఉత్సవాలకు దాదాపు 20 రోజుల ముందుగానే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. బళ్లారి, రాయచూరు, గుల్బర్గా, సోలాపూర్, బెంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి వందల కి.మీ నడుస్తూ శ్రీశైలం మహాక్షేత్రానికి పాదయాత్రగా వస్తున్నారు. ఆత్మకూరు సమీపంలో వెంకటాపురం నుంచి నల్లమల మీదుగా అటవీ మార్గంలో రాత్రి సైతం టార్చ్లైట్ల వెలుతురులో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. నాగలూటి వద్ద వీరభద్రుడికి మొక్కులు చెల్లించి మెట్ల మార్గంలో నడక మొదలు పెడుతున్నారు. నాగలూటి వద్ద మహారాష్ట్ర బృందం చేపట్టిన అన్నదానంతో ఆకలి తీర్చుకుని శ్రీగిరి వైపు అడుగులు వేస్తున్నారు. కై లాస ద్వారం చేరుకుని వడివడిగా శ్రీగి చేరి భ్రమరాంబకు జై.. మల్లన్నకు జై అంటూ నినదిస్తున్నారు. -
ఎలక్ట్రీషియన్ మృతి
ఎమ్మిగనూరురూరల్: గువ్వలదొడ్డి గ్రామంలో ఎలక్ట్రీషి యన్ దుర్గాప్రసాద్ (28) అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివరాలు.. గ్రామా నికి చెందిన మునిస్వామి, పద్మావతిల కుమారుడు దుర్గాప్రసాద్(28) ఎలక్ట్రీషియన్ పని చేస్తూ ఆరేళ్ల క్రితం రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన బేగంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ గౌతంనంద్ (2) అనే బాలుడు ఉన్నాడు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో ఐదు నెలలుగా బేగం పుట్టినిల్లు రాళ్లదొడ్డికి వెళ్లిపోయింది. భార్య పుట్టినింటికి వెళ్లినప్పటి నుంచి దుర్గాప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 12వ తేదీ ఇంట్లో గదిలో గడియ వేసుకుని నిద్రించి శుక్రవారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. త లుపులు బద్దలకొట్టి చూడగా మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టుం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
లోక్ అదాలత్లో 41వేల కేసులు పరిష్కారం
కర్నూలు: జాతీయ లోక్ అదాలత్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 40,921 కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆధ్వర్యంలో శనివారం రెండు జిల్లాల్లో 25 బెంచ్లను ఏర్పాటు చేసి 689 సివిల్ కేసులు, 40,232 క్రిమినల్ కేసులను పరిష్కరించినట్లు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఇందులో 186 మోటార్ యాక్సిడెంట్ కేసులలో రూ.12,83,49,000 బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, 6వ అదనపు జిల్లా జడ్జి వాసు, 7వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనరసింహారెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజినమ్మ, జూనియర్ సివిల్ జడ్జిలు కిరణ్ కుమార్, అనూష, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్య నాయుడు పాల్గొన్నారు. రైతు త్యాగం మరువరానిది తమ వ్యవసాయ భూములను ప్రాజెక్టు నీటి మునకకు అప్పజెప్పి రైతులు చేసిన త్యాగం మరువరానిదని, వారికి ప్రభుత్వం చెల్లించే సొమ్ము ఎంత ఇచ్చినా తక్కువేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన 190 మంది రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని అందించేందుకు గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి దాదాపు రూ.81 లక్షల పరిహారం చెక్కుల ద్వారా అందించారు. ఈసారి ఆదోని, ఎమ్మిగనూరు కోర్టుల్లో పదేళ్ల నాటి పెండింగ్ కేసుల పరిష్కారమయ్యాయని తెలిపారు. -
వివాదాలకు ‘బలి’అవుతూ!
కర్నూలు: కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్ కొంతకాలంగా వివాదాలకు అడ్డాగా మారింది. వరుస పరిణామాలతో స్టేషన్ ఎస్హెచ్ఓకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. అక్రమ కేసుల నమోదు, దర్యాప్తు పేరుతో వేధింపులు, స్టేషన్కు వెళ్లిన బాధితుల పట్ల దురుసు ప్రవర్తన తదితర ఘటనలతో బాధితులు స్టేషన్ ఎదుట ఆందోళన చేసే పరిస్థితులు తలెత్తాయి. స్టేషన్లో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం తల పట్టుకునేంతగా వివాదమయ్యాయి. ఏపీ రాజధాని అమరావతి వరకు ఫిర్యాదులు వెళ్లాయి. కొందరు న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కడం గమనార్హం. గంజాయి కేసు విషయంలో పోలీస్స్టేషన్కు వెళ్లిన న్యాయవాది పవన్ కుమార్ను సీఐ విక్రమసింహ దూషించడమే కాక బౌతికంగా దాడి చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. సీఐ విక్రమసింహపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మధ్యవర్తుల ద్వారా న్యాయవాది పవన్కుమార్తో సీఐ విక్రమసింహ రాజీ కుదుర్చుకున్నారు. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి నిర్బంధం తెలంగాణ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు కె.వెంకటరామిరెడ్డి (కేవీఆర్)పై ఫిబ్రవరి 22న నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. 41ఏ నోటీసు ఇచ్చి విచారణ నిమిత్తం మార్చి 10న కేవీఆర్ను స్టేషన్కు పిలిపించి చంద్రబాబు నాయుడుపైనే కథనాలు చేస్తావా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అభాసుపాలు చేస్తావా అంటూ నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. కేవీఆర్ కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేవీఆర్ను కర్నూలు అర్బన్ తహసీల్దార్ ఎదుట హాజరుపరచి విడుదల చేశారు. ఈ వివాదం హైకోర్టు వరకు వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఐ మధ్యవర్తి ద్వారా కేవీఆర్తో రాజీ సంప్రదింపులు చేశారు. శాంతి కోసం పొట్టేలు బలి వరుస ఘటనల నేపథ్యంలో స్టేషన్కు దరిద్రం పట్టింది.. శాంతి చేయాలి.. ఏ కేసు దర్యాప్తు ప్రారంభించినా సమస్యలు ఎదురవుతున్నాయని ఎస్హెచ్ఓకు సిబ్బంది సూచించినట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించేందుకు పొట్టేలును పోలీస్స్టేషన్కు బలిచ్చి రక్తతర్పణ చేశారు. ప్రధాన గేటు వద్ద పొట్టేలును బలిచ్చి ఓ రెస్టారెంట్లో వంటలు చేయించి స్టేషన్ సిబ్బంది విందు చేసుకున్నారు. ఈ అంశం సిబ్బందిలో హాట్టాపిక్గా మారింది. వాస్తు దోషం పట్టిందంటూ పోలీసులే స్వయంగా స్టేషన్కు పొట్టేలును బలివ్వడం చర్చనీయాంశమైంది. స్టేషన్ ఎస్హెచ్ఓ పనితీరుపై విమర్శల వెల్లువ పరిస్థితులు అనుకూలించేందుకు శాంతి పేరుతో స్టేషన్కు పొట్టేలు బలి రక్త తర్పణం చేసి విందు చేసుకున్న సిబ్బంది పోలీసు శాఖలో హాట్ టాపిక్గా మారిన ఘటన ముడుపుల విషయంలో క్రైం పార్టీ పోలీసులపై వివాదం ఇదే పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న క్రైం పార్టీ పోలీసుల అవినీతిపై ఏకంగా ఏపీ డీజీపీకి ఫిర్యాదులు చేరి వివాదాస్పదమయ్యాయి. కర్నూలు కొత్తబస్టాండ్లో రెండు బంగారు చోరీ కేసులు చోటు చేసుకున్నాయి. వీటి విచారణ కోసం క్రైం పార్టీ పోలీసులు హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మామూళ్లు దండుకుని వదిలేశారు. ఈ ఘటన కూడా వివాదాస్పదంగా మారడమే కాక తెలంగాణలో క్రైం పార్టీ పోలీసులపై కేసు నమోదైంది. దీంతో వారిని వీఆర్కు పంపారు. ఆ తర్వాత వేర్వేరు చోట్లకు బదిలీ చేశారు. అలాగే ఇదే స్టేషన్లో సీఐ మధుసూదన్గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవి ద్వారా రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి జైలుపాలయ్యారు. -
రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి క్షేత్రం కన్నడ భక్తులమయమైంది. ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపె దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అన్ని విభాగాల అధికారులతో పలుమార్లు సమావేశాన్ని నిర్వహించారు. ఉగాది మహోత్సవాలు సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, శివ సంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ తదితర పూజలు నిర్వహిస్తారు. అలాగే భ్రమరాంబాదేవి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం, అంకురార్పణ, అగ్రిప్రతిష్ఠాపన, నిత్యహవనములు జరిపిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారం, స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో 18న వీరాచార విన్యాసాలు గగుర్పాటు కలిగిస్తాయి. 19న ఉగాది రోజు పంచాంగ శ్రవణం, రథోత్సవం, అమ్మవారికి రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారం చేపట్టనున్నారు. 20వ తేదీన పూర్ణాహుతి, అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. ఆరోజు భ్రమరాంబాదేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. కన్నడ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారం, స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. మొత్తం 37,331 మంది విద్యార్థుల కోసం 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ వరకు జరగనున్నాయన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి డిపార్టుమెంటల్ అధికారులు, చీఫ్ సూపరిటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించి తగిన శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలపై సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచినట్లు చెప్పారు. సెల్ఫోన్లు నిషేధం పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేసేలా చర్యలు తీసకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఓఆర్ఎస్, మంచినీరు, మందులతో కూడిన ఉచిత వైద్య శిబిరాలను అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. ఇందుకోసం విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను చూపితే చాలని సూచించారు. ప్రశ్నపత్రాలను 34 పోలీసు స్టేషన్లలో భద్రపరిచామన్నారు. వీటిని ప్రతి రోజు ఉదయం 8 నుంచి 8.30గంటల మధ్య కేంద్రాలను చేరుస్తామన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్ల సెల్ఫోన్లు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. విద్యార్థులు విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి వీలు లేదని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ సుధాకర్ పాల్గొన్నారు. నేడు అక్షరాంధ్ర అభ్యాసకులకు పరీక్షలు అక్షరాంధ్ర కార్యక్రమంలో విద్యను అభ్యసించిన వారికి ఆదివారం పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1,62,235 మంది పరీక్షలు రాసేందుకు అనువుగా మొత్తం 1368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇన్విజిలేటర్లుగా పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లను నిమించినట్లు చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్లో వయోజన విద్యా శాఖ డెప్యూటీ డైరక్టర్ చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు, ఐసీడీఎస్ పీడీ విజయ పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు హాల్టిక్కెట్ చూపితే విద్యార్థులకు ఉచిత ప్రయాణం విలేకరుల సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఏ సిరి -
వామ్మో.. కమీషన్ ఏజెంట్లు
● వాము రైతులను దగా చేస్తున్న వైనం ● అనధికార కాటాదారులతో తూకాలు ● లైసెన్స్ల రద్దుకు నోటీసుల జారీ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము రైతులను దగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కమీషన్ ఏజెంట్లపై అధికారులు నిఘా పెట్టారు. మార్కెట్లో 38ఏ, 38బి, 28, 11ఏ, 11బి, 1, 40 షాపుల కమీషన్ ఏజెంట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీరినే మార్కెట్లో వాము దొంగలుగా పేర్కొంటున్నారు. వీరు వాము పండించే ప్రాంతాలకు వెళ్లి రైతులకు మాయమాటలు చెప్పి తమ దుకాణాలకు వచ్చే విధంగా చేసుకుంటున్నారు. మార్కెట్కు దాదాపు 2000 క్వింటాళ్లు వస్తుండగా.. వీరికే అత్యధికంగా వస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో పండించిన వాము మార్కెట్కు ఎక్కువగా వస్తోంది. ఈ నెల 12వ తేదీ కర్ణాటకకు చెందిన ఓ రైతును అవినీతి ఆరోపణలు ఉన్న ఓ కమీషన్ ఏజెంటు తూకంలో దగా చేయడంపై మార్కెట్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా తూకాలు ఆలస్యం చేయడం, రైతుల కన్నుగప్పి దగా చేయడం సర్వసాధారణమైంది. కాటాకు సీలు తొలగించి అక్రమాలకు పాల్పడిన కమీషన్ ఏజెంటు మళ్లీ అదే తరహాలో సీలు తొలగించి వాము స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తాజాగా శుక్రవారం కృష్ణవేణి ట్రేడర్స్ కమిషన్ ఏజెంటు దుకాణంలో కాటాకు సీలు తొలగించి తూకాలు వేస్తున్నట్లు అధికారులు గుర్తించి కాటాను స్వాధీనం చేసుకున్నా రు. లైసెన్స్ రద్దుకు నోటీసులు జారీ చేశారు. మరో వైపు శ్యాంపుల్స్ రూపంలో రైతుల నుంచి బలవంతంగా వాము తీసుకుంటున్న ఇద్దరు కాటాదారులకు లైసెన్స్ల రద్దు కోసం నోటీసులు జారీ చేశారు. అనేక ఆరోపణలు ఉన్న కమీషన్ ఏజెంట్లకే వాము ఎక్కువగా వస్తున్నందున లైసెన్స్ కలిగిన కాటాదారులే తూకాలు వేయాలని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. రాత్రి పొద్దుపోయే వరకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
కాన్పు డబ్బులు వచ్చాయని..!
హొళగుంద: ‘మీకు మొదటి కాన్పు కింద రూ.6 వేలు వచ్చాయి’ అని సైబర్ నేరగాడు ఆశ పెట్టి బాధితుడి నుంచి రూ. 19 వేలు కాజేశాడు. ఈ సంఘటన శుక్రవారం హొళగుందలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ముల్లా షాకీర్ అనే యువకుడికి శుక్రవారం సాయంత్రం 917289982513 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామంటూ ‘ప్రభుత్వం మీకు మొదటి కాన్పు కింద రూ.6 వేలు అందిస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ పే నంబరు తదితర వివరాలు ఇవ్వాలి.’ అంటూ నమ్మబలికాడు. సైబర్ నేరాలపై అంతగా అవగాహన లేని షాకీర్ రూ.6 వేలు వస్తాయి అనే అశతో వివరాలన్నీ ఇచ్చేశాడు. అయితే జీరో అకౌంట్ అని రూ.6 వేలు పడాలంటే మరో బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలని నమ్మబలికాడు. ఆన్లైన్లోనే ఖాతా తెరుస్తానని చెప్పి ఫినో పేమెంట్స్ బ్యాంక్ పేరిట కొత్త ఖాతా తెరిచి ఖాతాలో ముందుగా రూ.10 వే లు, ఆ తర్వాత రూ.5 వేలు, రూ.4 వేలు చొప్పున నగదు వేసుకోండని చెప్పాడు. అమాయకుడైన షాకీర్ తన అకౌంట్లోనే ఉంటాయి కదా అని సదరు కేటుగాడు మాటలు నమ్మించి ఫోన్ పే నంబరుకు పది నిమిషాల్లో ఆ మొత్తం నగదు వేశాడు. విషయాన్ని తెలిసిన వాళ్ల దగ్గర చెప్పడంతో వారు వెంటనే ఫోన్ చేసిన వ్యక్తికి తిరిగి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సైబర్ నేరగాళ్ల పనేనంటూ బాధితుడు హొళగుంద పోలీసులను ఆశ్రయించాడు. -
వ్యక్తి ఆత్మహత్య
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర ప్ప తెలిపిన వివరాల మేరకు.. మహానంది మండలం గాజులపల్లెకు చెందిన బోయ శ్రీకాంత్ (37), ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మౌనికకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల నుంచి శ్రీకాంత్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకున్నా నయం కాలేదు.గురువారం రాత్రి నొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుర్తించి, ఉరిని తప్పించి వెంటనే శ్రీకాంత్ను బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యురాలు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. బైక్ను ఢీకొన్న కర్ణాటక బస్సు ● వ్యక్తికి తీవ్ర గాయాలు ఆత్మకూరురూరల్: ఆత్మకూరు – కర్నూలు రహదారిలో కరివేన గ్రామం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పాములపాడు మండలం భానుముక్కల గ్రామానికి చెందిన బాలీశ్వరయ్య అనే వ్యక్తి బైక్పై కరివేనకు వస్తూ సర్వీస్ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్తుండగా శ్రీశైలం నుంచి రాయచూరు వెళ్తున్న కర్ణాటక బస్సు వేగంగా ఢీకొంది. బాలీశ్వరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలుకు తరలించారు. ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పది మంది భక్తులకు గాయాలు శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని దేవస్థానం టోల్గేట్ వద్ద శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో కన్నడికులకు చెందిన బొలెరో వాహ నం అదుపుతప్పి భక్తుల పైకి దూసుకెళ్లింది. వన్టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి, దేవస్థానం సీఎస్ఓ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. శుక్రవారం ఉద యం కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లా పొట్లగిరి గ్రామానికి చెందిన కర్ణాటక వాసులు బొలెరో వాహనంలో దేవస్థానం టోల్గేట్ చేరుకున్నారు. వాహన డ్రైవర్ వేగంగా నడపడం వల్ల అదుపు తప్పి భక్తుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దేవస్థానం వైద్యశాలకు 108లో తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. కోళ్లకు విషం డోన్ రూరల్: మండల పరిధిలో కొచ్చెర్వు గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందికి రైతు రామకృష్ణ తన పొలంలో కోళ్లను పోషిస్తున్నాడు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు ఆహారంలో విషం కలిపి వాటికి పెట్టడంతో 24 కోళ్లు మృత్యువాత పడ్డాయి. బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. -
టీడీపీ ఆగడాలకు అడ్డేది
● యాదవాడలో వైఎస్సార్పీపీ నాయకుడి మోటార్, పైపులైన్ల ధ్వంసం విద్యుత్ మోటార్ పైపులను ధ్వంసం చేసిన దృశ్యం, ఓవర్హెడ్ ట్యాంక్ సంబంధించి విద్యుత్ తీగలను కట్చేసిన దృశ్యం ఆళ్లగడ్డ: చంద్రబాబు పాలనలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డేలేకుండా పోతుంది. వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారు. శుక్రవారం మండలంలోని యాదవాడ గ్రామంలో గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు నరసింహారెడ్డికి చెందిన పొలం మోటార్, పైపులైన్లను ధ్వంసం చేశారు. ముందుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ప్రభుత్వ మోటార్ను నరసింహారెడ్డి వాడుకుంటున్నాడని అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు వచ్చిన మండల, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బోరు ప్రభుత్వానిది కాదని తేల్చారు. దీంతో నాయకులు అక్కసుతో పొలానికి నీరు వెళ్లేందుకు వీలు లేకుండా పైపులను ధ్వంసం చేసి పైశాచిక అనందం పొందుతున్నారు. అలాగే నరసింహారెడ్డి భార్య బొల్లపు సరస్వతీ గ్రామ సర్పంచ్ కావడంతో గ్రామానికి నీటిసరఫరా చేసి ఓహెచ్ఆర్ వద్ద విద్యుత్ తీగలను కట్ చేశారు. దీంతో గ్రామస్తులకు తాగునీటి సరఫరా కాక ఇబ్బందులు పడ్డారు. -
స్వయం ఉపాధిలో రాణించాలి
ఎమ్మిగనూరుటౌన్: మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తూ కుటుంబానికి ఆర్ధిక భరోసాగా నిలవాలని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టారేణుక అన్నారు. శుక్రవారం పట్టణంలోని వెంకటాపురం కాలనీ వద్ద బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గార్మెట్ యూనిట్ కేంద్రాన్ని ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అదేవిధంగా సోమప్ప సర్కిల్లో చలివేంద్రాన్ని ప్రారంభించి, కోతుల బావి ఆంజినేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోనెగండ్ల రోడ్డులోని శ్రీఅంబా భవాని ఆలయంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదానంలో భాగంగా భక్తులకు వడ్డించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నజీర్అహమ్మద్, వైఎస్సార్సీపీ నాయకులు కామర్తి నాగేషప్ప, కంఠ, శివప్రసాద్, మధుబాబు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. వర్సిటీల అభివృద్ధికి కృషి కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆర్యూ వీసీ వి.వెంకట బసవరావు అన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి.వెంకటప్ప వర్సిటీల పర్యటనల్లో భాగంగా శుక్రవారం ఆర్యూను సందర్శించారు. ఆ వర్సిటీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీల్లో గిరిజనులకు అందుతున్న ఫలాలను పరిశీలించేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నట్లు చెప్పారు. వీసీ మాట్లాడుతూ.. వర్సిటీల్లో అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్లు డాక్టర్ బి.విజయ్కుమార్ నాయుడు, డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. వర్సిటీలో కొందరు ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపచేయడం లేదని, వేతనాల్లో తేడాలు ఉన్నాయని తదితర విషయాలను వెంకటప్ప దృష్టికి తెచ్చారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయనను వర్సిటీ అధికారులు సన్మానించారు. వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ నరసింహులు, అకడమిక్ అఫైర్స్ డీన్ సీవీ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీగిరిలో కన్నడ భక్తుల సందడి
● ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలు ● భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టిన దేవస్ధానం ● 15వ తేదీ వరకు మల్లన్న స్పర్శ దర్శనం శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహా క్షేత్రంలో కన్నడ భక్తుల సందడి నెలకొంది. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని ముందుగానే అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుంటున్నారు. కన్నడ భక్తులు శ్రీశైల భ్రమరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా, మల్లికార్జున స్వామి వారిని తమ అల్లుడిగా భావిస్తారు. తమ ఇంటి ఆడపడుచు అయిన భ్రమరాంబా దేవిని కను లారా దర్శించి, చీర, సారే సమర్పించేందుకు కన్నడిగులు వేలాది మంది తరలివస్తున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి శ్రీశైలం మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో తరలి వస్తు న్న భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. తమ ఇంటి ఆడపడుచు ఆశీస్సుల కోసం కన్నడ భక్తులు పరితపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం పాదయాత్ర చేస్తూ తమ ఆడపడుచు చెంతకు చేరుకుంటున్నారు. శ్రీశైల భ్రమరాంబ దేవి కోసం ఇంటి నుంచే చీర, సారెను తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. దర్శ నం అనంతరం శ్రీశైలం నుంచి ఆడపడుచుల కోసం పలు వస్తువులు సైతం కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్తున్నారు. స్పర్శ దర్శనం కోసం తరలివస్తూ.. కన్నడ భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనానికి అనుమతించా రు. విడతల వారీగా నిర్దిష్ట వేళలలో పది రోజులపా టు కనడ భక్తులు మల్లన్నను స్పర్శ దర్శనం చేసుకునేందుకు దేవస్ధానం అధికారులు ఏర్పాట్లు చేశా రు. దీంతో మల్లన్న స్పర్శ దర్శనం కోసం ఉత్సవాల కంటే ముందుగానే భారీగా కనడ భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. మల్లన్న స్పర్శ దర్శనం చేసుకుని, తమ జన్మ ధన్యమైందని కన్నడ భక్తులు పరితపిస్తున్నా రు. దేవస్థానం కల్పించిన మల్లన్న స్పర్శ దర్శనంపై కన్నడ భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని పాదయాత్రగా వేలాది మంది కన్నడ భక్తులు తరలివస్తున్నారు. వెంకటాపురం నుంచి నల్లమల అడవు ల్లో పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలం చేరుకుంటున్నారు. వృద్ధులు, చంటిపిల్లలు, మహిళలు సైతం ఎండను కూడా లెక్క చేయకుండా అడవుల్లో పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. పలువురు భక్తులు కాళ్లకు కర్రలు కట్టుకుని నడుచుకుంటూ వస్త్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అలా గే శివ స్వరూపంగా భావించే పల్లకీని మోసుకుంటూ పాదయాత్రగా వస్తున్నారు. కొందరు యువకులు డప్పు వాయిద్యాలతో చిందులు వేసుకుంటూ భక్తి, శ్రద్ధలతో తరలివస్తున్నారు. క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఉచిత, రూ.500, రూ.200 టికెట్ల ప్రవేశ ద్వారాల నుంచి మల్లన్న దర్శనానికి బారులుదీరారు. కన్నడ భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు రద్దీగా మారాయి. భక్తుల శివనామస్మరణ మారుమోగుతుంది. -
ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్
కర్నూలు: ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై కర్నూలులో ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్టేషన్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ప్రొజెక్షర్ ద్వారా ఆటోడ్రైవర్లకు చూపించి అవగాహన కల్పించారు. వేగంగా వాహనం నడపటం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటివి చేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సీఐ సూచించారు. మద్యం సేవించి వాహ నం నడపరాదని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు. -
47 ఏళ్లుగా కన్నడిగుల సేవలో..
పాములపాడు: స్థానిక శ్రీ శివ బ్రహ్మ మల్లికార్జున స్వా మి ఆశ్రమంలో 47 సంవత్సరాలుగా కన్నడ పాదయాత్రికులకు అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు శేషన్న గౌడు మాట్లాడుతూ.. భక్తులు, దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. జూటూరు గ్రామం జగనన్న కాలనీలో గ్రామానికి చెందిన కుళాయప్ప సొంతంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో సర్పంచు నాయిని సావిత్రమ్మ, మధుసూదన్రావు, భజన చౌడయ్య, మన్నె పుల్లయ్య, రామకృష్ణ, శ్రీని వాసులు, మల్లికార్జున శివ, నాగరాజు, భజన బృంద సభ్యులు పాల్గొన్నారు. ఏడు పదుల వయస్సులో.. పాములపాడు: అతని వయస్సు 70 ఏళ్లు.. వందల కి.మీ పాదయాత్రగా శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ వయస్సులో కూడా హుషారుగా ఓం నమః శ్శివాయ అంటూ నడక సాగిస్తున్న వృద్ధుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన శివపుత్ర అనే వృద్ధుడు పాదాలకు స్వతహాగా తయారు చేసుకున్న బట్ట పాదరక్షకులతో వడివడిగా నడక సాగిస్తున్నారు. ఇప్పటికి సుమారు 10 రోజులుగా 300 కిలోమీటర్లకు పైగా నడిచారు. మధ్యాహ్న వేళ సేద తీరుతూ ఉదయం, సాయంత్రం వేళల్లో నడక సాగిస్తున్నట్లు తెలిపారు. స్వామిపై ఉన్న భక్తితో వెళ్తున్నానని, ఆయనే తన దరికి క్షేమంగా చేర్చుకుంటాడని తెలిపారు. శ్రీశైలం చేరుకున్న తెలంగాణ గవర్నర్ శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా శ్రీశైలం చేరుకున్నారు. శుక్రవారం రాత్రి శ్రీశైలం చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు భ్రమరాంబా అతిథిగృహం వద్ద శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, పలువురు అధికారులు పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. రాత్రి కి భ్రమరాంబా అతిథి గృహంలో బస చేస్తారు. శనివారం ఉదయం 6 గంటలకు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని దేవస్థానం అధికారులు తెలిపారు. -
అన్నదాతా సుఖీభవా!
● 20 ఏళ్లుగా నాగలూటి వద్ద అన్నదాన క్రతువు ● మల్లన్న భక్తుల ఆకలి తీర్చుతున్న మహారాష్ట్ర బృందం ఆత్మకూరురూరల్: దాహమేస్తే నీరు కూడా దొరకని నల్లమల ప్రాంతం. అలాంటి చోట పది రోజుల పాటు వేల మంది భక్తులకు నిత్యాన్నదానం చేయడం అంటే ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నదే. దాతల సహకారంతో దాదాపు 20 ఏళ్లుగా నాగలూటి ఆలయం వద్ద మహారాష్ట్ర బృందం అన్నదాన యజ్ఞం నిర్వహిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల నుంచి మొదలు యావత్తు ఉత్తర కర్ణాటక జిల్లాల నుంచి కన్నడిగులు, మహారాష్ట్రీయులు వందల కి.మీ. పాదయాత్రగా నల్లమల మీదుగా శ్రీశైలం చేరుకుంటారు. వీరి కోసం మహారాష్ట్ర బృందం అడవిలో మెట్ల పాదం వద్ద వెలసిన నాగలూటి వీరభద్ర స్వామి సమీపంలో 20 ఏళ్లుగా అన్నదాన శిబిరాన్ని నిర్వహిస్తోంది. కొల్లాపూర్ జిల్లాలోని ఇచ్చలకరంజికి చెందిన శ్రీశైల మల్లికార్జున మల్టీపర్పస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన శిబిరం నిర్వహిస్తున్నారు. పది రోజులపాటు 24 గంటలు నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ పది రోజుల్లో సుమారు 7 లక్షల మంది కన్నడిగులు ఈ అన్నదాన శిబిరాన్ని సందర్శించనున్నట్లు అంచనాలున్నాయి. రోజుకు 50 వేల చపాతీలు తయారీ అన్నదాన శిబిరంలో రోజుకు 50 వేల చపాతీలు తయారు చేసే ఆటోమేటిక్ మిషన్ను ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చారు. పిండి తడిపి, ముద్దలు చేసి ఆపై చపాతీలుగా రుద్ది, పెన్నంపై కాల్చే వరకు అంతా ఆటోమేటిక్గా మిషన్పై తయారవుతుంటాయి. అంతే కాక కూరగాయలు తరిగే మిషన్ వంటి ఎన్నో ఆధునిక వంట ఇంటి సామగ్రిని ఇక్కడ వినియోగిస్తున్నారు. నాగలూటి వీరభద్రేశ్వరుడి సేవలో భాగంగా మా ట్రస్ట్ అన్నదాసోహ మహా కార్యం నిర్వహిస్తోంది. ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో ఈ యజ్ఞం సాగుతోంది. సుమారు 200 మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రవాణా తదితరాలు కూడా దాతల సహకారంతో సాగుతోంది. ఉచితంగా వైద్య శిబిరం కూడా నడిపిస్తున్నాం. – ఎంఎస్ పాటిల్, అన్నదాన శిబిరం ట్రస్ట్ అధ్యక్షులు -
‘పెద్ద’ కష్టం.. ‘పైసా’చికం!
పేరుకు పెద్దాసుపత్రి. చుట్టుపక్క జిల్లాలకూ పెద్దదిక్కు. వందలాది మంది ఉద్యోగులు.. వేలాది మంది రోగులు. కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్నా.. కనీస పర్యవేక్షణ లోపించింది. కళ్లెదుటే రోగులు ఇబ్బందులు పడుతున్నా.. ఏ ఒక్కరిలోనూ మానవత్వం కనిపించని పరిస్థితి. ఇక్కడ జరిగేదంతా మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో రోగులు, సహాయకులకు నిత్య నరకం తప్పడం లేదు. రోగులకు ఎలాంటి అవసరమొచ్చినా, సహాయకులే దగ్గరుండి చూసుకోవాల్సిన దుస్థితి. రక్త పరీక్షలు, స్కానింగ్లు.. ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే స్ట్రెచ్చర్ను కుటుంబ సభ్యులే తోసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితులు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి సిబ్బంది ఓ చేయి వేయాలంటే ఆ చేతిని తడిపితేనే స్ట్రెచ్చర్ కదులుతుంది. ఈ ‘పైసా’చికం ఆసుపత్రి అధికారులకు తెలియనిది కాదు, అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం రోగులకు శాపంగా మారుతోంది. – డి.హుస్సేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
జిల్లా అంతటా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
కర్నూలు: మద్యం సేవించి వాహనాలు నడపటం వల్లే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసు శాఖ జిల్లా అంతటా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతం చేసింది. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. జనవరి నుంచి మార్చి 12వ తేదీ వరకు రెండున్నర నెలల్లో 1,666 మంది మద్యం సేవించి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని ఎస్పీ సూచించారు. -
సీసీఆర్ కార్డులు ఇచ్చి ఏం లాభం?
మాకు ఎలాంటి భూములు లేవు. రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాం. 2025–26 సంవత్సరానికి సంబంధించి 3.75 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాం. ఇందులో పత్తి సాగు చేసి అధిక వర్షాల నష్టాలు మూట కట్టుకున్నాం. కౌలు భూమికి రైతు అంగీకారంతో ప్రభుత్వం సీసీఆర్ కార్డు కూడా జారీ చేసింది. కార్డుతో సహా ఆధార్, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో అన్నదాత సుఖీభవ కింద సాయం కోసం రైతు సేవా కేంద్రంలో సమర్పించాం. అన్నదాత సుఖీభవ సాయం దక్కలేదు. ఉపయోగం లేని సీసీఆర్ కార్డులు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదు. – ఉప్పరి లక్ష్మన్న, తులసాపురం, కర్నూలు మండలం -
బాధాకరం
మేం 2023లో పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం రాతనలో 4.80 ఎకరాల భూములు కొనుగోలు చేశాం. అదే ఏడాది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. వెబ్ల్యాండ్తో పాటు రెవెన్యూ రికార్డుల్లో కూడా మా పేరుమీదనే భూమి ఉంది. 2025 జూలై నెలలోనే రాతనలో గ్రామ వ్యవసాయ సహాయకుడిని కలసి పాసుపుస్తకం తదితర అన్ని వివరాలు ఇచ్చాం. అయితే అన్నదాత సుఖీభవ సాయం దక్కలేదు. నిజమైన రైతులకు సాయం దక్కకపోవడం బాధాకరం. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. కనీసం అన్నదాత సుఖీభవ కింద చేయూత కూడా దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. – తెలుగు వెంకటస్వామి, జి.సింగవరం, కర్నూలు మండలం అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నా మూడు విడతలుగా ఆర్థిక సాయం అందలేదు. నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందింది. చంద్రబాబు ప్రభుత్వంలో నాకు ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడ లేదు. ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. – బడేసాహెబ్ రైతు, డీ కోటకొండ గ్రామం, ఆస్పరి మండలం అప్పులు పెరిగాయి నాకు సొంత భూమి లేదు. ఐదేళ్లుగా రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. రెండేళ్లుగా ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు. అన్నదాత సుఖీభవ అని పేర్లు పెట్టారు. ఎలాంటి ఫలితం లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి అని అడిగితే అధికారులు వస్తుంది... వస్తుంది అంటారు. ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. – రాజశేఖర్, కౌలు రైతు, పచ్చారపల్లి గ్రామం, హాలహర్వి మండలం నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఎన్నికల ముందు రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక పాత పథకం కింద వచ్చే డబ్బులు కూడా ఆగిపోయాయి. ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సకాలంలో డబ్బులు పడేవి. విత్తనాలు, ఎరువులు కొనుక్కునేవాళ్లం. ఇప్పుడు రెండేళ్లు అవుతున్నా ఒక్క రూపాయి కూడా వేయకపోవడం దారుణం. – మారెప్ప, రైతు, నిట్రవట్టి, హాలహర్వి మండలం -
మంత్రి భరత్ అనుచరుల అరాచకం
కర్నూలు: మంత్రి టీజీ భరత్ అనుచరుల అరాచకాలు కర్నూలులో శృతిమించాయి. మద్యం మత్తులో మహిళా పోలీసు అధికారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాక అడ్డొచ్చిన ఆర్ఎస్ఐపై తిరగబడి వీరంగం సృష్టించిన ఘటన వెలుగుచూసింది. మంత్రి టీజీ భరత్ ముఖ్య అనుచరులు భీమిశెట్టి మనోజ్ కుమార్, వంశీ, సాయి ఈ నెల 11న రాత్రి టానిక్ వైన్స్లో బీర్లు కొని.. అక్కడి ఐదు రోడ్ల కూడలిలో రోడ్డుపైనే తాగి బాటిళ్లను పగలగొడుతుండగా అదే దారిలో స్కూటీపై వెళ్తున్న మహిళా ఎస్ఐ వారించారు. దీంతో వారు ఆమెపై దురుసుగా ప్రవర్తించారు.మద్యం మత్తులో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా అదే సమయంలో ఆర్ఎస్ఐ రమేష్ విధి నిర్వహణలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని ఆర్ఎస్ఐ వారిని దండించడంతో ఆయనపై తిరగబడి దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఆర్ఎస్ఐ వెంటనే క్యూఆర్టీ, బ్లూ కోల్ట్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న మంత్రి అనుచరులు ముగ్గురునీ అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి తమదైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు.ఇందులో ఒకరు ఎంఎస్ఎంఈ స్టేట్ డైరెక్టర్మద్యం మత్తులో మహిళా ఎస్ఐ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మంత్రి అనుచరుడు భీమిశెట్టి మనోజ్ కుమార్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) స్టేట్ డైరెక్టర్గా ఉన్నారు. ఇతను గతంలో టీడీపీ తరపున 44వ వార్డు కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మంత్రి అండతో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నాడు. ఉద్యోగులకు పోస్టింగులు, బదిలీల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు మనోజ్పై మంత్రికి గతంలో ఫిర్యాదులు కూడా అందాయి.నాలుగు నెలల క్రితం ఓ మహిళా అధికారికి కర్నూలు డీఎంహెచ్వో పోస్టింగ్ ఇప్పిస్తానని చెప్పి రూ.6 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇతనితోపాటు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మరొకరు వైన్ షాపు నిర్వాహకులు, సాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ముగ్గురు కూడా మంత్రికి అత్యంత సన్నిహితులు కావడంతో కనీసం కేసు కూడా నమోదు చేయకుండా వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పెంపుడు శునకంతో యువకుడి శ్రీశైలం యాత్ర
శ్రీశైలం: పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్న కన్నడిగుల్లో ఒక్కొక్కరిది ఒక్కో మొక్కు. అలా వెళ్తున్న వారిలో ఈ ఓ యువకుడు ప్రత్యేకం. ఆ శునకానికి ఒక కాషాయ వ్రస్తాన్ని చుట్టి ఒక పవిత్ర భావం కలిగేలా ప్రయాణిస్తున్నాడు. కర్ణాటకలోని రాయచూరు పట్టణానికి చెందిన వ్యోమకేశ్ అనే యువకుడి తల్లి ఇటీవల తీవ్రమైన అనారోగ్యానికి గురైయ్యింది. అదే సమయంలో బెంగతో తమ ఇంటి పెంపుడు శునకం కూడా అస్వస్థత పాలైంది. దీంతో ఆవేదన చెందిన వ్యోమకేశ్ తన తల్లి, పెంపుడు శునకం ఆరోగ్యం కుదుట పడితే శ్రీశైల మల్లికార్జునుని పాదయాత్రతో వెళ్లి దర్శించుకుంటానని మొక్కుకున్నాడు. అంతే కాక తన శునకాన్ని కూడా భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం ఇవ్వాలని భావించాడు. అందుకే ఇలా పాదయాత్రా ప్రారంభించాడు. గురువారం ఆత్మకూరు పట్టణం మీదుగా వెళ్తూ ఇలా శునకంతో కనిపించాడు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ దంపతుల దుర్మరణం
కర్నూలు జిల్లా: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ.. సొంతిల్లు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్న దంపతులను మృత్యువు మింగేసింది. కర్ణాటక సరిహద్దు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరిని మింగేసింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పట్టణంలోని తిరుమలనగర్ కాలనీకి చెందిన కార్పొరేషన్ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి అమరేష్ సుమతి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు అనురాగ్(31), బళ్లారికి చెందిన ఐశ్యర్య కూడా ఒక్కగానొక్క కుమార్తె. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. అనురాగ్ భార్యతో కలసి తల్లిదండ్రులను చూసేందుకు రెండు రోజుల క్రితం ఆదోనికి చేరుకున్నారు. బెంగళూరుకు తిరిగివెళ్తూ బళ్లారిలో ఉన్న ఐశ్యర్య తల్లిదండ్రులను పలకరించి వెళ్లాలనుకున్నారు. ఈ మేరకు ఇద్దరు బుధవారం సాయంత్రం కారులో వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రం మోకా సమీపంలో శివపుర గ్రామశివారులో కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలపాలైన అనురాగ్ను వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. కాగా మార్గమధ్యలో అనురాగ్ మృతి చెందాడు. బళ్లారిలో పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాలను ఆదోనికి తరలించారు. గురువారం ఆదోని లో అంత్యక్రియలు పూర్తి చేశారు. తిరుమలనగర్లో విషాదం అలుముకుంది. -
‘కౌలు’కోలేని మోసం!
కర్నూలు(అగ్రికల్చర్): అన్నదాత సుఖీభవతో అర్హులకు న్యాయం చేయడంలో చంద్రబాబు సర్కార్ చేతులెత్తేసింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇది వరకు రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలు, పీఎం కిసాన్ కింద రూ.4వేల ప్రకారం రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదలయ్యాయి. రెండు విడతల్లో పట్టా భూములు కలిగిన రైతులకు అన్యాయం జరిగింది. అన్నదాత సుఖీభవ నుంచి కౌలుదారులను పక్కన పెట్టారు. మూడవ విడతలో న్యాయం జరుగుతుందని అధికారులు కౌలుదారులను నమ్మించారు. అయితే ఇప్పుడు కూడా కౌలుదారులతో పాటు అర్హులైన పట్టా రైతులకు నిరాశే మిగిలింది. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు ఈ నెల 13న రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నాయి. కౌలుదారులను నట్టేట ముంచిన చంద్రబాబు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీసీఆర్సీ పత్రాలు పొందిన సాగుదారులకు అన్నివిధాల న్యాయం చేసింది. పెట్టుబడి సాయంగా రూ.13,500 రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కౌలుదారులతో పాటు ఆర్వోఎఫ్ఆర్ రైతులు, దేవదాయ భూములు అనుభవిస్తున్న వారికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసి పూర్తి మొత్తాన్ని చెల్లించి అండగా నిలిచింది. ఇలా 28,600 మంది సాగుదారులకు వైఎస్ఆర్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయాన్ని కౌలుదారులకు ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తోంది. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 25వేల సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం కాగా 24,793 మంది సాగుదారులకు కార్డులు జారీ అయ్యాయి. అయితే అన్నదాత సుఖీభవ కింద ఒక్క కౌలుదారుకు కూడా పెట్టుబడి సాయం అందించలేకపోవడం గమనార్హం. 21,841 మందికి అన్నదాత సుఖీభవ ఎగనామం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023–24లో వైఎస్ఆర్ రైతుభరోసా కింద 2,94,598 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. చంద్రబాబు ప్రభుత్వం 2,72,757 మంది రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ అమలు చేస్తోంది. వైఎసార్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు సర్కార్ 21,841 మంది రైతులకు తీరని అన్యాయం చేసింది. కౌలుదారులతో పాటు భూ యజమానులకు అన్యాయం జిల్లాలో 2025–26లో 24,793 సీసీఆర్సీ కార్డులు జారీ ఒక్క కౌలుదారుకూ అందని సాయం చుక్కల భూముల పేరిట అర్హులకు ఎగనామం -
సీసీఆర్సీ కార్డు ఉన్నా ఫలితం లేదు
మాకు సొంతంగా సెంటు భూము లేదు. దేవాలయ భూమిని కౌలుకు సాగు చేసుకుంటున్నాం. 2025–26 సంవత్సరానికి 5.90 ఎకరాలకు సీసీఆర్సీ కార్డును ప్రభు త్వం జారీ చేసింది. అన్నదాత సుఖీభవ కింద సాయం దక్కుతుందని ఆశించాం. మొదటి, రెండవ విడతల్లో రాలేదు. మూడవ విడత లో కౌలుదారులకు న్యాయం జరుగుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి కలగనప్పుడు ఇక సీసీఆర్సీ కార్డులు ఎందుకు జారీ చేస్తున్నట్లు. – జంగం జంబులింగయ్య, ఆర్.కొంతలపాడు, కర్నూలు మండలం -
జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేద్దాం
కర్నూలు: ఈనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో వీలైనన్ని కేసులను పరిష్కరించి విజయవంతం చేద్దామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆధ్వర్యంలో 17 బెంచీలతో కేసుల పరిష్కారం చేయాలని నిర్ణయించామన్నారు. లోక్అదాలత్లో పరిష్కా రం జరిగిన కేసుల్లో అప్పీల్ సమస్య ఉండదని, లోక్ అదాలత్ ఉత్తర్వు తుది ఆదేశాలన్నారు. కక్షిదారులు తమ అపరిష్కృత కేసులను జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలన్నారు. కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ సహాయకులు, టైపిస్టు పోస్టులను కారుణ్య నియామకాల కింద అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించారు. గురువారం స్థానిక జెడ్పీ చైర్మన్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో మొత్తం ఎనిమిది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కోరుకున్న ప్రదేశాలకు పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా కార్యాలయాల్లో ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉంటూ మృతి చెందితే కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించడం జరుగుతోందన్నారు. జూనియర్ అసిస్టెంట్లు: ఎ.వినయ్రాజు(పీఆర్ఐ సబ్ డివిజన్, నంద్యాల), టి. రంగస్వామి(జెడ్పీహెచ్ఎస్, రామళ్లకోట), పి.శ్రీచందన(జెడ్పీహెచ్ఎస్, హుసేనాపురం), వై.వైష్ణవి(జెడ్పీహెచ్ఎస్, కోవెలకుంట్ల), హెచ్.అశ్వథ్బాషా(జెడ్పీహెచ్ఎస్ దీబగుంట్ల). టైపిస్టులు: బి.జ్ఞాన సందీప్(ఎంపీపీ, వెల్దుర్తి), ఎం.అజయ్ డానియల్ ప్రకాష్(ఎంపీపీ, మంత్రాలయం), ఎల్.ఫాతిమాబేగం(పీఆర్ క్యూసీ పీఆర్ సబ్ డివిజన్, కర్నూలు). -
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
కర్నూలు (టౌన్): వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలులోని ఎస్బీఐ సర్కిల్లో ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. అనంతరం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ఆటోమేషన్’తో ఇంటి నుంచే డ్రిప్ నిర్వహణ కర్నూలు(అగ్రికల్చర్): బిందు సేద్యం పొందిన రైతులకు సబ్సిడీపై ఆటోమేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సన్న, చిన్నకారు రైతులకు 55 శాతం, పెద్ద రైతులకు 45 శాతం సబ్సిడీతో ఆటోమేషన్ సదుపాయం కల్పిస్తామన్నారు. జిల్లాలో మొదటిసారి క్రిష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలో ఆటోమేషన్ యూనిట్ను అమర్చే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఆటోమేషన్ పనితీరు, ప్రోగ్రామింగ్పై రైతులకు శిక్షణనిచ్చారు. కొత్త టెక్నాలజీ ద్వారా ఇంట్లో నుంచే చరవాణి ద్వారా ఆపరేట్ చేయవచ్చని ఏపీఎంఐపీ పీడీ తెలిపారు. ఇందువల్ల రైతులకు సమయం ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అదనపు పీడీ ఫిరోజ్ఖాన్, జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి, డ్రిప్ కంపెనీల ప్రతినిధులు, ఎంఐ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం నంద్యాల(వ్యవసాయం): వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. బుధవారం పట్టణంలోని స్పెషల్ సబ్ జైలును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం జైల్లోని పరిసరాలను పరిశీలించి ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సుపై అవగాహన కల్పించారు. -
యుద్ధ భయంతో నష్టాలు
వేసవిలో గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ సమయంలో ధరలు ఉంటేనే రాణించగలం. ఉన్నట్టుండి యుద్ధం రావడంతో తమిళనాడులోని నమ్మకల్ జోన్ నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ గుడ్లు పెద్ద ఎత్తున డంప్ అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోకి కూడా గుడ్ల సరఫరా పెరిగింది. ఫలితంగా ఇక్కడ ఉత్పత్తి అయిన గుడ్లకు ధర తగ్గిపోతోంది. యుద్ధానికి ముందుకు 100 గుడ్ల ధర రూ.600 ఉండగా.. నేడు రూ.420 మించని పరిస్థితి. దళారీలకు ధరలను పూర్తిగా తగ్గించేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టాలు మూటకట్టుకుంటున్నాం. – వెంకటేష్, గుడ్ల ఉత్పత్తి రైతు, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం -
ఆరోగ్యకర అలవాట్లు అలవర్చుకోవాలి
కర్నూలు(హాస్పిటల్): కిడ్నీ వ్యాధులు రాకుండా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజ్విహార్ సెంటర్ వరకు కొనసాగి తిరిగి ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వరకు సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అధునాతన చికిత్సలు, డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలు లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. నెఫ్రాలజీ హెచ్ఓడీ డాక్టర్ అనంత్, డాక్టర్లు పీఎల్.వెంకట పక్కిరెడ్డి, శ్రీధరశర్మ తదితరులు పాల్గొన్నారు. -
బియ్యంపై యుద్ధ ప్రభావం
గల్ఫ్ దేశాల్లో కర్నూలు సోనా బియ్యానికి డిమాండ్ అధికం. కర్నూలు సోనా బియ్యం గల్ఫ్ దేశాలతో పాటు యురోపియన్ కంట్రీస్కు కూడా ఎగుమతి అవుతోంది. యుద్ధం కారణంగా బియ్యం ఎగుమతులు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు సోనా ప్రధాన ఆహార పంట. విదేశాలకు ఎగుమతులు ఉండటం వల్ల కర్నూలు సోనా బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు బియ్యం ధరల్లో మార్పులు లేకపోయినప్పటికీ యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలపై ప్రభావం పడే ప్రమాదం ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. -
హోటళ్లపై సివిల్ సప్లై అధికారుల దాడులు
● 110 డొమెస్టిక్, 30 కమర్షియల్ సిలిండర్లు స్వాధీనంఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని హోటల్స్, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లపై బుధవారం జిల్లా సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు చేశారు. ఐదు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న 110 డొమెస్టిక్ సిలిండర్లు, 30 కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లై అఽధికారి ఎం. రాజారఘువీర్ మాట్లాడుతూ అయిల్ కంపెనీల్లు కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి వాడుకుంటున్నట్లు సమాచారం రావటంతో డాదులు చేశామన్నారు. మొత్తం 90 హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లపై దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇంటి అవసరాల కోసం తీసుకున్న సిలిండర్లను అనధికారికంగా హోటళ్లకు వాడుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా చేస్తూ ఎవరైనా పట్టుబడితే చర్యలుంటాయన్నారు. వినియోగదారులు గ్యాస్ సిలిండర్లను పొదుపుగా ఉపయోగించుకోవాలని, సింగిల్ సిలిండర్ ఉన్నవారు బుకింగ్ 21 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారికి బుకింగ్కు 31 రోజులకు చేసుకోవాలన్నారు. కాగా సిలిండర్లను సీజ్ చేసి యజమానులపై 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఏఎస్వో వెంకటరాజు, డిప్యూటీ తహసీల్దార్లు రుద్రగౌడ్, షహనీషా, నవీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్రెడ్డి, వెంకటేశ్వర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. -
టమాటా ధర పతనం
దేవనకొండ: టమాటా ధర పతనం కావడంతో రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. కిలో టమాటా బహిరంగ మార్కెట్లో రూ.20 ఉండగా, రైతుల దగ్గర మాత్రం వ్యాపారులు కేవలం కిలో రూ.2కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కనీసం తెంపిన కూలీ ఖర్చులు కూడా రాక రైతులు టమాటాను తెంచకుండానే పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి టమాటా రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్యాస్ కొరత ఆసరాగా సైబర్ మోసాలు: ఎస్పీ కర్నూలు: ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.. వెంటనే బుకింగ్ చేసుకోండి.. అంటూ తప్పుడు సందేశాలు పంపిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, మెసేజ్లు, నకిలీ లింకుల ద్వారా గ్యాస్ సబ్సిడీ, గ్యాస్ బుకింగ్, ప్రత్యేక డిస్కౌంట్ల పేరుతో మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్కు అధికారిక గ్యాస్ ఏజెన్సీ యాప్లు లేదా అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే సైబర్ క్రైం హెల్ప్లైన్ నెంబర్ 1930కు ఫోన్ చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం పరిశీలన కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంలోని డాక్టర్స్ కాలనీ యుపీహెచ్సీలో నిర్వహిస్తున్న హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం డీఐఓ డాక్టర్ ఉమ పరిశీలించారు. వ్యాక్సిన్ స్టాక్ స్టేటస్ను తెలుసుకున్నారు. అక్కడి నుంచి అరోరా నగర్ సచివాలయం సందర్శించి రెగ్యులర్ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఇంటింటి సర్వే చేసి, 14 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లలను గుర్తించి యుపీహెచ్సీలలో వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. ఆమె వెంట హెచ్ఈఈఓ బాబా ఫకృద్దీన్, సిబ్బంది ఉన్నారు. 1.75 లక్షల హెక్టార్లలో రబీ పంటల సాగు కర్నూలు(అగ్రికల్చర్): 2025–26 రబీ సీజన్కు సంబంధించి పంటల నమోదు ప్రక్రియ ముగిసింది. రైతు సేవా కేంద్రాల వారీగా పంటల నమోదు వివరాలను రైతులకు అందుబాటులో ఉంచారు. రైతులు ఈ వివరాలను పరిశీలించి పంటల నమోదుపై అభ్యంతరాలు ఉంటే ఆర్ఎస్కేల్లో రాత పూర్వకంగా చెప్పవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలకు గురువారం ఒక్క రోజే అవకాశం ఉందన్నారు. ఈ నెల 15 వరకు పంటల నమోదుపై సోషల్ ఆడిట్ కొనసాగుతుందన్నారు. పంటల నమోదుకు ఈ–కేవైసీ తప్పనిసరి అని, బయోమెట్రిక్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. రబీలో సాధారణ సాగు 1.07 లక్షల హెక్టార్లు ఉండగా.. 1,75,711 హెక్టార్లలో పంటలు సాగయ్యాయన్నారు. -
గ్లకోమా పట్ల అప్రమత్తంగా ఉండాలి
కర్నూలు(హాస్పిటల్): గ్లకోమా పట్ల అప్రమత్తతతో చూపును కాపాడుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. బుధవారం ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకుని ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి నుంచి రాజ్విహార్ వరకు నిర్వహించిన వాక్థాన్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ గ్లకోమా వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 40 ఏళ్లు పైబడిన వారు, కుటుంబంలో గ్లకోమా చరిత్ర ఉన్న వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి, ఆసుపత్రి హెచ్ఓడీ డాక్టర్ యుగంధర్రెడ్డి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిణి డాక్టర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రజాస్వామ్య వేదిక
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధికి ఒక ప్రణాళికాబద్ధమైన ప్రజాస్వామ్య వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవపూజ ధనుంజయ ఆచారి, ఎన్ శాంతికుమార్ అన్నారు. మంగళవారం స్థానిక బీసీ భవన్లో విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన విశ్వ బ్రాహ్మణ, కుల వృత్తి సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముందుగా బ్రహ్మశ్రీ గానాల రామమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ, కానిపాకం వినాయక స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ రాజ్యలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ కులంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులను గుర్తించలేని స్థితి ఉందన్నారు. 2024 ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే హామీలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో నాయకులు గిడ్డయ్య ఆచారి, రమేష్ ఆచారి, తిమ్మయ్య ఆచారి, బ్రహ్మయ్య ఆచారి, ప్రణదీప్ ఆచారి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టౌన్ప్లానింగ్లో ఏసీబీ తనిఖీలు
కర్నూలు(టౌన్): కర్నూలు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్), ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్) పథకాలకు అనుమతి ఇవ్వడంతో కర్నూలు నగరంలో వేల సంఖ్యలో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఆన్లైన్లో క్లియర్ చేసేందుకు టౌన్ప్లానింగ్ అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులు, చైన్మెన్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్) బాండ్ల జారీ, భవన నిర్మాణాల అనుమతులు, నిర్మాణాల్లో అదనపు అంతస్థుల ఫిర్యాదుల్లో అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మార్కెట్ వాల్యులో అవకతవకలకు పాల్పడి టీడీఆర్ బాండ్లు చేసినట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, శ్రీనివాస్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ప్లానింగ్ విభాగంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఇటీవల టౌన్ ప్లానింగ్లో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అప్రూవల్స్ అనుమతులు, టీడీఆర్ల జారీలపై దృష్టి సారించి రికార్డులను పరిశీలించినట్లు స్పష్టం చేశారు. ఈ సోదాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించారు. మొత్తం ఈ విభాగంలో 15 మంది ఉద్యోగులను విచారించినట్లు పేర్కొన్నారు. ఏసీబీ ఎస్ఐ సుబ్బరాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా మూడు గంటల పాటు ఏసీబీ అధికారులు కార్యాలయంలో తిష్ట వేసి రికార్డులను పరిశీలించారు. సోదాల్లో ఉద్యోగుల నుంచి రూ.లక్ష వరకు నగదు లభించినట్లు సమాచారం. -
భక్తుల సేవలో..
నందికొట్కూరు: శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు కాలినడకన వెళ్తున్న భక్తులకు వివిధ వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు మార్గ మధ్యంలో తమ వంతు సేవలు అందిస్తున్నారు. నందికొట్కూరు పట్టణ సమీపంలో జమ్మిచెట్టు వద్ద ఇన్ట్యాచ్ నంద్యాల చాప్టర్ కన్వీనర్ శివకుమార్రెడ్డి, మన ఊరు– మనగుడి మన బాధ్యత అధ్యక్షుడు రఘువీర్ ఆధ్వర్యంలో పోలూరు జీవన్జ్యోతి ఓకేషనల్ జూనియర్ కళాశాల సిస్టర్ స్వరూపరాణి, విద్యార్థులు కేరళ తరహాలో ఆయిల్ మసాజ్ చేస్తున్నారు. అలాగే పట్టణ శివారులో కొందరు అన్నదానం, మరికొందరు మజ్జిగ, కలింగరపండ్లు, మంచినీళ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. భ్రమరాంబాదేవికి కొబ్బరికాయల సమర్పణ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి మంగళవారం కొబ్బరికాయలు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి, పసుపు, కుంకుమలతో వాటికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు ఈ సంవత్సరం ఏప్రిల్ 7న మంగళవారం కుంభోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలైనవి సమర్పించి కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. ఈ కొబ్బరికాయల సమర్పణలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. -
భక్తి పూర్వక అడుగులు
శివయ్య పిలుస్తున్నాడు.. శ్రీశైలానికి కాలినడకన వెళ్తున్న భక్తులుఇల కై లాసమైన శ్రీగిరి వైపు కన్నడిగుల భక్తి పూర్వక అడుగులు పడుతున్నాయి. వందల కి.మీ దూరం.. మండే ఎండలతో సెగలు కక్కే రోడ్లపై పాదయాత్రగా శివయ్య భక్తులు తరలి వస్తున్నారు. కొందరు భుజాన బసవన్న కావడీలు.. మరి కొందరు నెత్తిన మల్లన్న అపురూప ప్రతిమలు.. కాషాయ పతాకాలు చేతపట్టి.. కాళ్లకు ఎత్తైన కర్రలు కట్టుకుని నడక సాగిస్తున్నారు. దారి పొడవునా శివయ్య చిత్ర దుస్తులు ధరించిన భక్తులు భజనలు చేసుకుంటూ.. మల్లన్న పాటలు పాడుకుంటూ నల్లమల వైపు వెళ్తున్నారు. కర్ణాటక ప్రాంత భక్తులు శ్రీశైలంలో జరిగే ఉగాది ఉత్సవాలకు భారీగా పాదయాత్రగా తరలివెళ్తున్నారు. కర్నూలు – ఆత్మకూరు రహదారి వెంట కన్నడిగులు వరుస కట్టి వడివడిగా అడుగులు వేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుహనుమాన్ జెండా పట్టుకొని..శివయ్యపై భక్తితో... -
మహిళ దుర్మరణం
కర్నూలు (సిటీ): కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో పంచలింగాలకు చెందిన ఓ మహిళ దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి స్పల్పగాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఉండవల్లి సమీపంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎంపీ బస్తిపాటి నాగరాజు చిన్న కుమారుడు నాగరాజు వివాహం ఇటీవలే జరిగింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి మండలం కంచిపాడులో జమ్ములమ్మ దర్శనం నిమిత్తం స్వగ్రామం పంచలింగాల నుంచి కారులో బయలుదేరారు. ఉండవల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై బైక్ అడ్డుగా వచ్చింది. దానిని తప్పించబోగా అదుపు తప్పి కారు చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో మనెమ్మ (60) అనే మహిళ మృతిచెందగా మద్దిలేటి, నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు ఎంపీకి స్వయాన చిన్నమ్మ. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఎంపీ ప్రమాద విషయం తెలుసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. -
అంతర్రాష్ట్ర దొంగలకు రెండేళ్లు జైలు శిక్ష
కృష్ణగిరి/కర్నూలు(టౌన్): చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలకు జైలుశిక్షపడింది. వెల్దుర్తి సీఐ యుగంధర్, కృష్ణగిరి ఎస్ఐ జి. కృష్ణమూర్తి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బిజ్నోపూర్ జిల్లాకు చెందిన మహమ్మద్ షహీద్, సుహేబ్లు పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. తర్వాత చెడు వ్యసనాలకు అలవాటు పడిన వీరు సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీ మార్గాన్ని ఎంచుకున్నారు. సికింద్రాబాద్లో స్థిరపడి వెండి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే రాజస్థాన్ను చెందిన ప్రవీణ్ ఆర్ రావల్ వ్యాపార నిమిత్తం గతేడాది అక్టోబర్ 26న హైదరాబాద్ నుంచి రూ. 25 లక్షల నగదుతో బస్సులో గుత్తికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో అమకతాడు టోల్ప్లాజా వద్ద డబ్బు సంచిని చూసుకుంటే కనిపించలేదు. వెంటనే సమీపంలోని కృష్ణగిరి పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరుసటి రోజు (అక్టోబర్ 27న) కర్నూలు శివారులోని దిన్నెదేవరపాడు గ్రామ సమీపంలో ఉన్న వెంగనబావి దగ్గర అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చోరీని అంగీకరించడంతో రిమాండ్కు పంపారు. మంగళవారం ఆ ఇద్దరు దొంగలకు డోన్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. జ్యోతి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ముద్దాయిలకు శిక్ష పడడంలో కీలకంగా వ్యవహరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కర్రావు, పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. -
రక్షకుడు..వీరభద్రుడు!
ఇల కై లాసంగా పిలువబడే శ్రీశైలంలో ఏటా ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ వెలసిన భ్రమరాంబా దేవిని తమ ఆడబిడ్డగా భావించి దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే, వీరు తమ ఆడబిడ్డ కంటే ముందే నాగలూటి వీరభద్రస్వామిని దర్శించుకుని తొలిమొక్కు చెల్లించుకుంటారు. ఎందుకిలా అంటే వీరభద్ర స్వామిని తమ రక్షకుడిగా కొలుస్తామని చెబుతారు. నేటికీ ఈ ఆచారం కొనసాగుతుండటం విశేషం. ఆత్మకూరు: మూడు దశాబాల క్రితం శ్రీశైలానికి సరైన రవాణా మార్గం ఉండేది కాదు. శ్రీశైలేశుడిని దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన వెళ్లేవారు. ఎండావాన, కొండాకోన, రాళ్లురప్ప అని చూడకుండా శివనామస్మరణ చేస్తూ నల్లమల అడవి గుండా శ్రీగిరికి చేరుకునేవారు. అయితే, ఈక్రమంలో తమకు మార్గమధ్యంలో ఎలాంటి అవరోధం కలగకుండా సురక్షితంగా క్షేత్రానికి చేర్చాలని నల్లమల కొండ అంచున ఉన్న నాగలూటిలో వీరభద్రస్వామిని దర్శించుకుని ముందుకు సాగుతారు. ఇలా చేస్తే తమ ప్రయాణం సాఫీగా సాగుతుందని వారి నమ్మకం. కాలినడకన వెళ్లే భక్తులు నేటికీ ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉగాది మహోత్సవాల సందర్భంగా తొలిమొక్కు చెల్లించుకునే వారితో వీరభద్రస్వామి ఆలయం కిటకిటలాడుతోంది. ఈ స్వామిని కర్ణాటక, మహారాష్ట్ర భక్తులే కాకుండా కాలినడకన వెళ్లే ప్రతి ఒక్కరు శరభ, శరభ, భద్ర..భద్ర అంటూ స్మరించుకుంటూ దట్టమైన నల్లమల అడవి గుండా ఇల కై లాసానికి చేరుకుంటున్నారు. నాగలూటి వీరభద్రస్వామిపై భక్తుల నమ్మకం మల్లన్న కంటే ముందే తొలి పూజ నేటికి కొనసాగిస్తున్న కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు మా ఆడపడుచు శ్రీ భ్రమరాంబాను దర్శించుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే వీరభద్రస్వామిని స్మరించుకుని తొలి అడుగు వేస్తాం. నాగలూటిని చేరుకోగానే స్వామిని కనులారా దర్శించి మొక్కులు చెల్లిస్తాం. రవాణా మార్గాలు లేని కాలంలో మా పెద్దలు ఈ ఆచారాన్ని కొనసాగించారు. స్వామిని మేము రక్షకుడిగా భావిస్తాం. – శ్రీమత్గారి గౌర, ముద్దాపూర్, బాగలకోటె జిల్లా, కర్ణాటక రాష్ట్రం మా ఇంటి ఇలవేల్పు శ్రీ వీరభద్రస్వామి. యేటా కర్ణాటక రాష్ట్రం నుంచి బయలుదేరి నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రానికి చేరుకుంటాం. ఇంటి నుంచి తెచ్చుకున్న టెంకాయలు, పూజా సామగ్రిని స్వామికి సమర్పిస్తాం. అనుక్షణం మమ్మల్ని కాపాడి శ్రీశైలం మల్లన్న దర్శనం చేసేలా చూడాలని కోరుకుంటాం. తొలి పూజ చేయకుండా శ్రీశైలానికి వెళ్లం. ఇది మా పెద్దల నుంచి వస్తున్న సంప్రదాయం. – గుండయ్య, బళ్లారి పట్టణం, కర్ణాటక రాష్ట్రం -
మల్లన్నను దర్శించుకున్న సీబీఐ డైరెక్టర్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను సీబీఐ డైరెక్టర్(న్యూ ఢిల్లీ) ప్రవీణ్ సూద్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మంగళవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్సూద్ దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ, అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామిఆమ్మవార్ల శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాన్ని, జ్ఞాపికను అందించి సత్కరించారు. రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్ కర్నూలు(సెంట్రల్): రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్ డౌన్ కావడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సర్వర్ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ క్రమంలో ఓటీపీలు సమయానికి రాకపోవడంతో వినియోగదారులు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు స్లాట్బుకింగ్ సమయం మించిపోతే ఇబ్బందులు పడతామని క్రయ, విక్రయదారులు తీవ్ర ఆందోళన చెందారు. ఉమ్మడి జిల్లాలోని 24 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ నెమ్మదించినట్లు తెలుస్తోంది. చింతకాయల కోసం వెళ్లి రైతు మృతి శిరివెళ్ల: చింతకాయల కోసం వెళ్లిన ఓ రైతు కింద పడి మృతి చెందాడు. మంగళవారం యర్రగుంట్లలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. యర్రగుంట్లకు చెందిన శిరిగిరి ప్రతాపరెడ్డి ( 35 ) చింతకాయల కోసం స్థానిక దర్గా వద్ద ఉన్న చింత చెట్టు వద్దకువెళ్లాడు. చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడిని చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. భర్త మరణ వార్త విన్న భార్య రాజేశ్వరి సోమ్మసిల్లి పడిపోయింది. కుటుంబాన్నికి పెద్ద దిక్కయిన రైతు మృతితో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. గోనెగండ్ల : మండలంలోని అలువాల గ్రామంలో భీరప్ప స్వామి దేవర ఉత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భీరప్ప స్వా మికి భక్తులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటి నుంచి గురువు బసవరాజు, పూజారి మల్లయ్య, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పటం ఎక్కే కార్యక్రమం నిర్వహించారు. కురువ కులస్తులు వివాహం చేసుకోవాలంటే గుడి కట్ట సభ్యులకు పటం ఎక్కే కార్యక్రమం తప్పనిసరి కావడంతో కార్యక్రమానికి ప్రత్యేకత సంతరించుకుంది. ఉత్సవాలను తిలకించడానికి వివిధ గ్రామాల కురువ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకలను తిలకించారు. దేవర ఉత్స వాల సందర్భంగా నిర్వహించిన గొరవయ్యల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎమ్మిగనూరులో పాలిసెట్ పరీక్షా కేంద్రాలు ఎమ్మిగనూరురూరల్: ఎమ్మిగనూరు పట్టణంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆదోని పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ చిన్నపురెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో పాలిసెట్ ఎంట్రెన్స్ ఆదోని పట్టణంలో ఒక్కటే నిర్వహించేవారని చెప్పారు. విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2026 నుంచి పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షా కేంద్రాలను ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడుపై పరీక్షా కేంద్రాలను ఎంచుకోవచ్చునన్నారు. -
వెలవెలబోతున్న ఆప్కో
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 43 చేనేత సహకార సంఘాలు ఉండగా.. నేడు ఏడు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో కూడా ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం మినహా మిగిలిన వాటి పనితీరు అంతంతమాత్రమే. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఆ సంఘమే మార్కెటింగ్ చేసుకుంటోంది. మిగిలిన సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాల మార్కెటింగ్కు ఆప్కోనే ఆధారం. రెండేళ్లుగా జిల్లాలోని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే సంఘాలు యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికలకు ప్రభుత్వం ఆసక్తి చూపని పరిస్థితి. రెండేళ్లుగా మంగళగిరిలోని ఆప్కో గోదాము నుంచి కొత్త సరుకు రాకపోవడంతో కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఆప్కో గోదాము మూతపడింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, శ్రీశైలంలలో ఆప్కో షోరూములు ఉన్నాయి. కొత్త సరుకు రాకపోగా ఉన్నది పాతబడిపోయింది. పాత సరుకు కొనేందుకు వినియోగదారులు ముందుకు రాకపోవడంతో మూటకట్టి మంగళగిరి గోదాముకు పంపుతున్నారు. -
రిజిస్ట్రేషన్లలో సందేహాలను తీర్చండి
● స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి విన్నవించిన క్రెడాయ్కర్నూలు(సెంట్రల్): ప్లాట్లు, ఇళ్లు, స్థలాల కొనుగోలు సమయంలో సబ్ రిజిస్ట్రార్లు వ్యక్తం చేసే చిన్న చిన్న సందేహాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతోందని, వాటికి సరైన పరిష్కారం చూపాలని క్రెడాయ్ చైర్మన్ గోరంట్ల కోరారు. మంగళవారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్కుమార్, జిల్లా రిజిస్ట్రార్ బజారిని వారి కార్యాలయాల్లో క్రెడాయ్ ప్రతినిధులు కలసి సందేహాల నివృత్తి కోసం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్లు, సబ్ డివిజన్లపై వ్యక్తమవుతున్న సందేహాలతో కొనుగోలు దారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈసీలు రావడానికి ఎక్కువ సమయం పడుతోందని, దరఖాస్తు చేసిన వెంటనే ఇచ్చేలా చూడాలని కోరారు. ఈసీల్లోని చిన్న చిన్న తప్పులు వెంటనే సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేఅవుట్ విధానంలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు జే.సురేష్కుమార్రెడ్డి, పి.గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. -
43 చేనేత సహకార సంఘాల్లో మిగిలింది ఏడు
● కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆప్కో షోరూము మూత ● చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తెరుచుకోని రెండు షోరూములు ● చేనేత వస్త్రాల ఉత్పత్తి లేక అంధకారంలో ఆప్కో ● ఉగాది ముంగిట వెలవెలబోతున్న ఆప్కో షోరూములు ● రెండేళ్లుగా కొత్త స్టాక్ సరఫరాలో చేతులెత్తేసిన వైనం ● కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మూతపడిన ఆప్కో గోదాము ● ఐదు నెలలుగా వేతనాలు అందక సిబ్బంది ఇక్కట్లు ● చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణలోనూ వైఫల్యంకర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆప్కో పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆప్కో దివాళా దిశగా పయనిస్తోంది. ఏడాదికొకటి చొప్పున ఆప్కో షోరూములు మూతపడుతున్నాయి. చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రోత్సాహం కరువైంది. చేనేత సహకార సంఘాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేసే ఆప్కోలో చీకటి రాజ్యమేలుతోంది. దసరా, ఉగాది హిందువులకు అతి పెద్ద పండగలు. ఈ సారి ఉగాదితో పాటే రంజాన్ కలసి వచ్చింది. అయితే ఆప్కో షోరూములు మాత్రం వెలవెలబోతున్నాయి. హుందాతనానికి, మన్నికకు చేనేత వస్త్రాలు పెట్టింది పేరు. వ్యవసాయ రంగం తర్వాత చేనేతకు అంతటి ప్రాధాన్యత ఉంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేడు చేనేత, ఆప్కో మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేత వస్త్రాల మార్కెటింగ్కు అనేక చర్యలు చేపట్టింది. కొత్త షోరూములను ఏర్పాటు చేయడంతో పాటు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించింది. ప్రత్యేక స్కీమ్ల ద్వారా ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంది. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల వ్యాపారం పెంచేందుకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం విశేషం. ప్రతి నెలా ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొని షోరూములకు సరఫరా చేయడం జరిగింది. పండుగలకు నెల రోజుల ముందే కొత్త డిజైన్లతో ఆప్కో షోరూములు కళకళలాడేవి. అయితే ప్రస్తుతం రెండేళ్లుగా ఇటు చేనేత, అటు ఆప్కోలో నిస్తేజం నెలకొంది. మూతపడుతున్న షోరూమ్లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆప్కో షోరూములు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే కర్నూలు పాత బస్టాండులోని శ్రీనివాస క్లాత్ మార్కెట్లో ఉన్న ఆప్కో షోరూము మూత పడింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలే ఆప్కోపై ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయించినట్లు సమాచారం. తాజాగా కలెక్టరేట్ ప్రాంగణంలోని చేనేత బజారులో ఉన్న ఆప్కో షోరూము మూతపడటం ఆందోళన కలిగించే విషయం. కలెక్టరేట్కు నిత్యం వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. కలెక్టరేట్ ప్రాంగణంలో 35 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇంతటి కీలకమైన ప్రాంతంలోని ఆప్కో షోరూము మూతపడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. -
రైతులకు విరివిగా రుణాలివ్వాలి
కర్నూలు(సెంట్రల్): అన్నదాతలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని జేసీ బ్యాంకర్లతో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర ప్రాధాన్యత రంగాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలన్నారు. కౌలు రైతులకు కూడా నిబంధనల మేరకు రుణాలు ఇవ్వాలని, పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. జిల్లా ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించాలన్నారు. మార్చి 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న డిజిటల్ పేమెంట్స్ అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం ఆర్బీఐ రూపొందించిన డిజిటల్ లావాదేవీల పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎల్డీఎం రామచంద్రరావు, ఆర్బీఐ లీడ్ బ్యాంకు ఆఫీసర్ రామకృష్ణ, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, కెనరా బ్యాంకు డివిజినల్ మేనేజర్ గౌతమ్, సీబీఆర్ ఎస్ఈటీఐ డైరెక్టర్ పుష్పకుమార్, జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మి పాల్గొన్నారు. -
క్వింటా వేరుశనగ రూ.8,550
ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్వింటా వేరుశనగ ధర గరిష్టంగా రూ.8,550 పలికింది. 3,075 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు మార్కెట్లో విక్రయానికి తెచ్చినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర క్వింటా రూ.3,891, మధ్యస్థ ధర రూ.7,780 పలికిందన్నారు. ● ఆముదాలు 8 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,611, మధ్యస్థ ధర క్వింటా రూ.5,763, గరిష్ట ధర రూ.5,774 నమోదైందన్నారు. ● కందులు 8క్వింటాళ్లు విక్రయానికి రాగా క్వింటా కనిష్ట ధర రూ.4,212, మద్యస్థ ధర రూ.6,420, గరిష్ట ధర రూ.7,011.. మినుములు 8 క్వింటాళ్లు విక్రయానికి రాగా క్వింటా రూ.6,670 గరిష్ట ధర పలికిందన్నారు. -
మహిళా సాధికారతకు దోహదపడాలి
కర్నూలు(అర్బన్): మహిళల పనుల్లో పురుషుల భాగస్వామ్యాన్ని పెంచి మహిళా సాధికారతకు దోహదపడాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో రోజు ఒక్కో వినూత్న కార్యక్రమాన్ని తమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 10వ రోజు మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో మెన్ కుకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పురుషులు వంట వండటం వినూత్నంగా, ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో డీసీపీఓ టి.శారద, సీనియర్ సహాయకులు సురేష్రెడ్డి, సతీష్, ఈఓ రాజేశ్వరి, డీసీ బాలు, వన్స్టాప్ సెంటర్ మేరీ స్వర్ణలత, జూనియర్ సహాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
నగరపాలక ప్రత్యేకాధికారిగా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి
కర్నూలు(టౌన్): కర్నూలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి నియమితులయ్యారు. ఈనెల 17న కర్నూలు నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం కలెక్టర్ను నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ జీవో 284 జారీ చేశారు. అలాగే కర్నూలు కార్పొరేషన్లో కమిషనర్గా పనిచేస్తున్న పి.విశ్వనాథ్ను ప్రభుత్వం నందికొట్కూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆర్ఐఓ జి.లాలెప్ప తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పరీక్షలు నిర్వహించగా 20,731 మంది విద్యార్థుల్లో 20,205 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఈ నెల 17న ఫస్ట్ ఇయర్, 18వ తేదీకి సెకండియర్ పరీక్షలు ముగియనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మూల్యాంకనం ప్రారంభమైంది. ప్రస్తుతం సంస్కృతం సబ్జెక్టు మూల్యాంకనం కొనసాగుతోంది. 20వ తేదీ తరువాత ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభం కానున్నట్లు ఇంట ర్మీడియెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. భక్తుల క్షేమమే ప్రధాన లక్ష్యం కర్నూలు(టౌన్): భక్తుల క్షేమమే ప్రధాన లక్ష్యమ ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపా రు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కర్నూలు జిల్లా మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తుల వాహనాలు ఓవర్లోడ్తో ప్రయాణించకూడదన్నారు. అలాగే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు. వాహనాల్లో వంట గ్యాస్ సిలిండర్లు రవాణా చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రయాణ సమయంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తినా, లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినా వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని తెలిపారు. 14న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి నోట్ ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో షెడ్యూల్ ప్రకారం గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య మరియు వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పను లు – ఆర్థిక ప్రణాళిక అంశాలపై సమీక్ష కొనసాగుతుందన్నారు. సమావేశాలకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సంబంధిత స్థాయీ సంఘాల సభ్యులు, అధికారులు తమ కు కేటాయించిన సమయానికి తప్పక హాజరు కావాలని సీఈఓ కోరారు. మైనారిటీ బాలికల గురుకులంలో ప్రవేశాలు కర్నూలు(అర్బన్): పంచలింగాల గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో 80 సీట్లు, 6వ తరగతిలో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశానికి అర్హులైన మైనారిటీ బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ భారతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ నెల 31లోగా https://aprs.apcfss.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. వివరాలకు 8712625070 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
శ్రీశైలం ఘాట్లో త్రుటిలో తప్పిన ప్రమాదం
శ్రీశైలం: సున్నిపెంట – శ్రీశైలం ఘాట్ మార్గంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రహదారిలో మలుపు వద్ద భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బందితో అక్కడికి చేరుకుని చెట్టును తొలగించే వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చేశారు. ఘాటు మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ వారు వాహన చోదకులకు సూచించారు. కర్నూలు(సెంట్రల్): తాను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, డోన్, నంద్యాల ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్ హనుమదాసు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తాను రూ.3 కోట్లతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి పనులకు సంబంధించిన పనులు చేశానని, అయితే ఇంత వరకు ఒక్క రూపాయి బిల్లు చెల్లించలేదన్నారు. అప్పుల తెచ్చి పనులు చేయించానని, ప్రభుత్వం చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పులపాలయ్యాయని, వెంటనే చెల్లించకపోతే ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పాము కల్లూరు: స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం పాము కలకలం రేపింది. కార్యాలయంలో పని చేసి సిబ్బంది బైక్లోకి పాము దూరింది. గుర్తించిన స్థానికులు, కార్యాలయం సిబ్బంది చాలా సేపు దానిని బయటకు రప్పించడానికి ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పాములు పట్టే వ్యక్తి వచ్చి బయటకు తీశారు. దీంతో కార్యాలయ సిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పాముకాటుతో వ్యక్తి మృతి కొత్తపల్లి: పాముకాటుకు గురై చికిత్స పొందుతూ కోలుకోలేక ఎర్రమఠం గ్రామానికి చెందిన టేకులనాగరాజు(50)అనే వ్యక్తి మృతి చెందాడు. మొక్కజొన్న పంటనుకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లి ఫిబ్రవరి 28న ఈయన పాముకాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి టేకుల పెద్ద పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రవీంద్రబాబు తెలిపారు. కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా డిమాండ్ చేశారు. సోమవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ కోసం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా హామీని అమలు చేయకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. మరోవైపు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడంతోపాటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయని నేపథ్యంలో ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. లేకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
హంస వాహనంపై రంగనాథస్వామి
మద్దికెర: పెరవలి గ్రామంలో శ్రీరంగనాథస్వామి సోమవారం హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుంచి ఊరేగింపుగా స్థానిక బావి వద్దకు తీసుకెళ్లి వసంతోత్సవం జరిపారు. ఈ సందర్భంగా యువకులు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పూజలు నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై కొలువుంచారు. దేవాలయ ఆవరణలో పల్లకీ సేవ చేశారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. ఆలయ ఈఓ రెబ్బావీరయ్య, ఆలయ చైర్మన్ రవికుమార్, సభ్యులు రామయ్య, నరసింహులు, రంగస్వామి, భక్తులు పాల్గొన్నారు. -
ఘనంగా శివపార్వతులకు పల్లకీ సేవ
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలోని శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారికి పల్లకీ సేవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో ఏకశిలా రూపంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వరస్వామికి అభిషేకం, అర్చన తదితర ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు పల్లకీ సేవా కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి తదితర భక్తులు ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు. హాస్టల్ లైబ్రరీకి పుస్తకాల వితరణ కర్నూలు (అర్బన్): నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల నెం.1 వసతి గృహంలోని లైబ్రరీకి పంచాయతీరాజ్ డీఈఈ, ఏపీఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు పి.మల్లికార్జున, నీట్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చినట్లు వసతి గృహ సంక్షేమాధికారిణి బి.బెన్నమ్మ తెలిపారు. సోమవారం స్థానిక హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులుగా కూడా ఆయన పేద, మధ్య తరగతి విద్యార్థుల విద్యకు సంబంధించి పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారని తెలిపారు. దాతల నుంచి కళాశాల విద్యార్థినులకు అవసరమైన పుస్తకాలను సేకరించి హాస్టల్ లైబ్రరీలో నిక్షిప్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ లైబ్రరీని హాస్టల్లోని విద్యార్థినులందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని బెన్నమ్మ తెలిపారు. -
అగ్నిపూలు విరబూసి.. అందాలు వికసించి!
శిశిర రుతువు రాకతో మరో వసంతానికి స్వాగతం పలుకుతూ ఆకుల వలువలను నేలరాల్చి నిలుచున్న వృక్షాలు నల్లమలలో పసిపిల్లలను తలపిస్తుంటాయి. అలాంటి చెట్ల సమూహంలో మోదుగ చెట్లు మరింత విశిష్టంగా కనిపిస్తాయి. ఆకులన్నీ రాలిన మోదుగ చెట్లు ఆకుల స్థానంలో ఎర్రటి మొగ్గలు పూస్తాయి. అవి విచ్చుకుని అడవి తల్లికి కొత్త అందాలను అద్దుతాయి. అందుకే వీటిని అగ్ని పూలు అని, మంకెన పూలు అని పిలుస్తూ కవితలు రాస్తుంటారు. ఆంగ్లంలో ఈ పూలను ఫ్లేమ్ ఆఫ్ది ఫారెస్ట్గా పిలుస్తారు. జనవరి చివరి వారం నుంచి మోదుగ పూలు పూస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. నల్లమల వ్యాప్తంగా మోదుగ పూలు విస్తారంగా కనపడుతున్నాయి. తొలకరి పలకరించే వేల మోదుగ మోడులు చిగురులు తొడుగుతాయి. – ఆత్మకూరు రూరల్ -
హెల్త్ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలి
కర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్(సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి సంధ్యారాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, జిల్లా ప్రధాన కార్యదర్శులు పీఎస్. రాధాకృష్ణ, ఎండీ అంజిబాబు, శ్రామిక మహిళా రాష్ట్ర నాయకులు పి.నిర్మల డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద హెల్త్ సెక్రటరీలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాప్ల పనిభారం తగ్గించాలని, ప్రమోషన్లు కల్పించాలని, జీవో నెం.124ను అమలు చేయాలని కోరారు. మదర్ డిపార్ట్మెంట్ అయిన మెడికల్ అండ్ హెల్త్కు హెల్త్ సెక్రటరీలను బదలాయించాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో హెల్త్ సెక్రటరీలకు ఇంక్రిమెంట్ అమలు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పీ–4 సర్వే, మున్సిపల్ తదితర సర్వేలపై సర్వే పేరుతో సతమతమవుతున్నారని, వారిని మారుమూల గ్రామాలకు రాత్రి 10 గంటల వరకు తిప్పుతున్నారని మండిపడ్డారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఏఓ అరుణకు వారు వినతి పత్రం సమర్పించారు. సీఐటీయూ న్యూసిటీ కమిటీ అధ్యక్షులు వై.నాగేష్, హెల్త్ సెక్రటరి యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, నంద్యాల జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరమ్మ, మాధవి, శంషాద్, సుజాత, రాధాబాయి, నాగమణి, రజని, వరలక్ష్మిదేవి పాల్గొన్నారు. -
ఆస్తి కోసం భర్త వేధిస్తున్నాడు.. న్యాయం చేయండి
● ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదుకర్నూలు: ‘మేమిద్దరం పదేళ్లుగా దూరంగా ఉంటున్నాం... నా పేరు మీద గూడూరులో ఉన్న ప్రైవేటు స్కూల్ను భర్త రమేష్ ఆక్రమించుకోవాలని నా సంతకాలు ఫోర్జరీ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పిల్లలను కూడా పట్టించుకోకుండా ఆస్తి, చెక్బౌన్స్ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నాడు’ అని కర్నూలుకు చెందిన రాధిక ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలులోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ శివశంకర్, తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● విద్యాంజలి పథకం కింద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్కు చెందిన సుజాత ఠాకూర్ రూ.40 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేసిందని కర్నూలు బీక్యాంప్కు చెందిన అహ్మదున్నీసా ఫిర్యాదు చేశారు. ● బెంగళూరులోని డెలాయిట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పామిడికి చెందిన చింతల సోమశేఖర్ రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని ఆదోని పట్టణానికి చెందిన నరేంద్రకుమార్ ఫిర్యాదు చేశారు. ● పెద్ద కుమారుడు తన బాగోగులు పట్టించుకోకుండా ఆరోగ్యపరిస్థితి బాగలేకపోయినప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సి.బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చెందిన యశోదమ్మ ఫిర్యాదు చేశారు. ● భర్త గుండెపోటుతో మృతిచెందారని, ఆయన పేరు మీద వచ్చిన జీవిత బీమా (ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆస్పరి మండలానికి చెందిన సుగుణమ్మ ఫిర్యాదు చేశారు. -
ఆర్యూ విద్యార్థుల భిక్షాటన
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ, పీడీఎస్యూ, ఆర్పీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, ఆర్పీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఏఐఎస్ఏఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్కుమార్ మాట్లాడుతూ.. వర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఖజానాకు కన్నం వేస్తున్న రిజిస్ట్రార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలన్నారు. రిజిస్ట్రార్పై పలుమార్లు వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసినా విచారణకు స్పందించకపోవడం, తొలగించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. వర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు హరిష్, రాజు, ఏఐఎస్ఏ నాయకులు రాము, ఆర్పీఎస్ నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
కదలని ఆర్టీసీ బస్సు
కదలని ఆర్టీసీ బస్సును డ్రైవర్లు, కండక్టర్లు నెట్టుతున్న ఈ దృశ్యం సోమవారం కోసిగి ఆర్టీసీ బస్టాండ్లో కనిపించింది. కోసిగి నుంచి ఆదోనికి వెళ్లేందుకు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఎక్కి కూర్చున్నారు. అయితే బస్సు ఎంతసేపటికీ స్టార్ట్ కాకపోవడంతో కండక్టర్, మరో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు వెనుక నుంచి తోయాల్సి వచ్చింది. ఇలాంటి బస్సులు కొన్ని సందర్భాల్లో మార్గమధ్యలో కూడా నిలిచి పోతున్నాయని, కండీషన్లో ఉండేవి నడపాలని ప్రయాణికులు కోరారు. – కోసిగి -
ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయాలి
● జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కర్నూలు (సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను కచ్చితంగా తనిఖీ చేయాలని ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓలను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, హౌసింగ్, రెవెన్యూ తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మధ్యాహ్నం విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, రుచి ఏ విధంగా ఉందనే విషయాలను తనిఖీ చేయాలన్నారు. హౌసింగ్కి సంబంధించి ఆప్షన్–3 కింద కాంట్రాక్టర్లు నిర్మించిన ఇళ్లలో 2,522 ఇళ్లలో నిర్మాణ లోపాలను గుర్తించారన్నారు. ఇప్పటివరకు 1,521 ఇళ్ల నిర్మాణాల లోపాలను సరిచేయడం జరిగిందని, మిగిలిన 1001 వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉగాది నాటికి పూర్తి చేయాల్సిన ఇళ్ల నిర్మాణాలలో పురోగతి లేకపోవడంపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ క్లినిక్కి సంబంధించి పరిష్కరించాల్సిన సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అందులో ప్రధానంగా వర్గీకరణ మార్పు (క్లాసిఫికేషన్ ఛేంజ్), నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ లిస్ట్) అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇనామ్ భూములకు సంబంధించి వాటివి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు. మ్యూటేషన్కి సంబంధించి వచ్చిన అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, డీఈఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గర్భాశయ క్యాన్సర్కు ‘హెచ్పీవీ’ చెక్
కర్నూలు(హాస్పిటల్): గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు చెక్పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 14 ఏళ్లు నిండి బాలికలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉండే క్యాన్సర్ వైద్యు ల వద్దకు వద్దకు ప్రతిరోజూ 150 నుంచి 200 మంది వరకు కొత్తగా క్యాన్సర్ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ఆయా క్యాన్సర్ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 30 నుంచి 40 మందికి కీమోథెరపి, 50 మంది దాకా రేడియోథెరపీ చేస్తున్నారు. క్యాన్సర్ ఆసుపత్రుల్లో నిత్యం 500 మందికి పైగా ఇన్పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇందులో మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులు 20 శాతం మంది ఉన్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇకపై మహిళలకు ఈ క్యాన్సర్ రాకుండా చేసేందుకు కేంద్ర ప్ర భుత్వం ముందస్తుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా 14 ఏళ్లు నిండి బాలికలకు వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే బాలికలు 19,704 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ వేసేందుకు రంగం సిద్ధం చేశారు. నేటి నుంచి వ్యాక్సినేషన్ జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రాణాంతక సర్వైకల్ క్యాన్సర్ను నివారించేందుకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్పీవీ) వ్యాక్సిన్ను వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ(మంగళవారం) ఈ వ్యాక్సినేషన్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. కర్నూలులో ఎ.క్యాంపులోని మెరిడియన్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ తెలిపారు. 14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్టే(14వ పుట్టినరోజు జరుపుకుని 15వ పుట్టినరోజుకు ముందున్న) బాలికందరికీ ఈ వ్యాక్సిన్ వేస్తామన్నారు. గార్డిసిల్–4 వ్యాక్సిన్ను 0.5ఎంఎల్ మోతాదులో ఎడమ చేతికి వేస్తారని తెలిపారు. వయస్సు నిర్ధారణ కోసం ఆధార్కార్డు, తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. టీకా వేయించుకునే వారు యువిన్ పోర్టల్ లేదా స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. టీకా వేయించుకోవడానికి వచ్చే వారు తప్పనిసరిగా ఆహారం తిని రావాలని చెప్పారు. టీకా వేసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు ఆరోగ్య కేంద్రంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని వివరించారు. అందుబాటులో వ్యాక్సిన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా క్యాన్సర్ బాధితుల్లో 20 శాతం మందికి ఇదే సమస్య జిల్లాలో 14 ఏళ్లు నిండిన బాలికలు 19,704 అందుబాటులో 13,177 వ్యాక్సిన్లు -
వలసల నివారణకు చిన్న తరహా పరిశ్రమలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికర్నూలు (సెంట్రల్): వలసల నివారణకు చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో నీతి అయోగ్ నిర్వహించిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రామ్కు సంబంధించి ప్రాంతీయ ఉత్తమ పద్ధతుల సెమినార్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెమినార్లో ‘గ్రీన్ ఆనియన్ టాప్ లీవ్స్ డీహైడ్రేషన్ యూనిట్’ అనే అంశంపై ప్రెజంటేషన్ ఇచ్చారు. చిప్పగిరి, మద్దికెర, హొళగుంద మండలాల్లో చాలా మంది జీవనోపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. హొళగుంద మండలంలో ఉల్లిపాయకు సంబంధించి గ్రీన్ టాప్ లీవ్స్ డీహైడ్రేషన్ యూనిట్ చిన్నతరహా పరిశ్రమ స్థాపించామన్నారు. ఈ యూనిట్ వ్యవస్థాపకునితో పాటు ఆరుగురికి ప్రత్యేక ఉపాధిని, వంద మందికి పైగా రైతులకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఈ యూనిట్ స్థాపన ఖర్చు దాదాపు రూ.7.4 లక్షలు కాగా యూనిట్ నుంచి నెలకు స్థూల రాబడికి సంబంధించి రూ.2,88,750, నిర్వహణ ఖర్చు నెలకు రూ.2,10,000 నికర లాభం నెలకు రూ.78,750 ఉంటుందన్నారు. ఈ రకమైన యూనిట్లను జిల్లాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. -
అన్నదాన యజ్ఞానికి అంతా సిద్ధం
● సరంజామాతో తరలివచ్చిన మహారాష్ట్ర బృందంఆత్మకూరురూరల్: ఏ చిన్న వస్తువు కావాలన్నా రోడ్డు పాయింట్కు రావాలంటే ఆరేడు కి.మీ అడవిలో నడవాల్సిందే.. అలాంటి చోట 16 ఏళ్లుగా ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్లే కన్నడ పాదయాత్రికుల కోసం అన్నదానం కొనసాగించడం అంటే ఒక యజ్ఞంతో సమానమే. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచ్చలకరంజికి చెందిన శ్రీశైల మల్లికార్జున మల్టీపర్పస్ ట్రస్ట్కు చెందిన వలంటీర్లు అన్ని సంబారాలతో సోమవారం నల్లమలకు చేరుకున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ నాగలూటిలో ఉన్న వీరభద్రాలయం వద్ద వారు ఏటా ఉగాది ఉత్సవాల సందర్భంగా 10 రోజుల పాటు 24 గంటలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్రస్ట్ అధ్యక్షులు మాలగొండ్ల పాటిల్, కార్యదర్శి పాండుతో పాటు 200 మంది స్వచ్ఛంద సేవకులు ఈ అన్నదాన క్రతువులో పాల్గొనేందుకు వచ్చారు. ఈ ఏడాది భక్తుల కోసం చపాతీలు కూడా అందివ్వనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇందుకోసం రోజుకు 50 వేల చపాతీలు తయారు చేసే మిషన్ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఐదు భారీ లారీల్లో కావలసిన కిరాణ సరుకు కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. -
హామీలు విస్మరించి.. విమర్శలతో ముగించి!
● బాబు పర్యటన అలా ముగిసింది..డోన్: మండల పరిధిలోని కొత్తబురుజు గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు ‘రైతన్నా మీ కోసం’లో భాగంగా చేపట్టిన పర్యటన ఆద్యంతం రాజకీయ విమర్శలు, ఆరోపణలకే పరిమితమైంది. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇచ్చానని పేర్కొంటూనే రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంటుందనేది మాత్రం చంద్రబాబు చెప్పలేకపోయారు. నిత్యం కరువు కాటకాలతో అల్లాడిపోయే డోన్ నియోజకవర్గ ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం కోసం తీసుకుంటున్న ప్రణాళికా బద్ధమైన చర్యలను చెప్పడంలో కూడా విఫలమయ్యారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం, గత ప్రభుత్వం వ్యవస్థల్లో విధ్వంసం సృష్టించిందని ప్రజలను నమ్మించే ప్రయత్నమే తప్పితే ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటిలో నెరవేర్చిన వాటి సంఖ్యను చెప్పకపోవడం గమనార్హం. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేయడం, జంతు చర్మాలతో చేసిన చెప్పులతో వేంకటేశ్వర స్వామి దర్శనానికి చంద్రబాబు వెళ్లడాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తుచేసుకున్నారు. టైటిల్ డీడ్ యాక్ట్ను రద్దుచేస్తానని, భూ రీసర్వేను ఆపివేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అదేవిధానాన్ని కొనసాగించడాన్ని కూడా రైతులు గుర్తుచేసుకుంటున్నారు. హామీలు తూచ్! సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ను తిరిగి కర్నూలు జిల్లాలో విలీనం చేయాలని, అవుకు రిజర్వాయర్ నుంచి ప్యాపిలి మండలం కొండ మీది పల్లెలకు సాగునీరు అందజేయాలని, నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల వద్ద భూగర్భ జలాల పెంపునకు అధిక నిధులు విడుదల చేయాలని కోరినా సీఎం చంద్రబాబు స్పందించలేదు. అన్నీ పరిశీలిస్తామని ముక్తసరిగా చెప్పి దాటవేయడం గమనార్హం. జలదుర్గం మండల కేంద్రం ఏర్పాటు అంశాన్ని ఎత్తకపోవడం ప్రజల్లో చర్చకు తావిచ్చింది. బీసీ సర్పంచ్కు అవమానం సభ ప్రారంభమై అరగంట గడిచినా స్థానిక గ్రామ సర్పంచ్ అయిన బీసీ మహిళ ప్రమీలను వేదికపైకి పిలవకపోవడం పట్ల రైతుల్లో ఆగ్రహం కనిపించింది. ఉడుములపాడు సర్పంచ్ ఉప్పరి రాధమ్మ భర్త సర్పంచ్ లేకుండా గ్రామసభ ఎలా జరుపుతారంటూ కేకలు వేస్తూ సర్పంచ్ను పిలవండి అంటూ గట్టిగా అరిచారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తమ తప్పు తెలుసుకొని సర్పంచ్ ప్రమీలను వేదికపైకి ఆహ్వానించారు. -
13న పీఎం కిసాన్ సాయం విడుదల
కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ 22వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న విడుదల చేయనుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6వేల ప్రకారం ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా విడుదల చేస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా రూ.4వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేసిందని, ఈ ఏడాదికి సంబంధించి మూడవ విడత సా యం ఈ నెల 13న విడుదలవుతుందని డీఏవో సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా సమీపంలో ని వ్యవసాయ కార్యాలయం, గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించారు. మల్లన్న సేవలో.. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబోట్ల భరద్వాజశర్మ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో భారతీ మహాస్వామి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. తరువాత గురువందన కార్యక్రమం జరిపారు. అనంతరం మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేశారు. -
కదల్లేను.. పింఛన్ ఇచ్చి ఆదుకోండి!
● జేసీకి విన్నవించిన దివ్యాంగురాలుకర్నూలు(సెంట్రల్): పక్షపాతం వచ్చి కాళ్లు, చేతులను కదపలేని స్థితిలో ఉన్నానని, పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ను ఆదోని మండలం సదాపురానికి చెందిన బి.నర్సమ్మ అనే మహిళ వేడుకున్నారు. రెండేళ్లుగా పింఛన్ మంజూరు కాకపోవడంతో అద్దె కారులో ఆమెను సోమవారం కుటుంబ సభ్యులు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తీసుకొచ్చారు. అయితే ఆమె దుస్థితిని చూసిన జాయింట్ కలెక్టర్ కారు దగ్గరకే వెళ్లి అర్జీ తీసుకున్నారు. కాగా, ప్రజల ఫిర్యాదులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పరిష్కరించాలని జేసీ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సరైన ఎండార్స్మెంట్ ఇస్తేనే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని, లేదంటే మళ్లీ అర్జీల రూపంలో వస్తూనే ఉంటాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్పీడీ చిరంజీవి పాల్గొన్నారు. -
ఘనంగా సుయతీంద్రతీర్థుల ఉత్తరారాధన
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు ఉత్తరాధన వేడుకలు సోమవారం వైభవంగా సాగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించారు. ముందుగా వేద పఠనంతో సుయతీంద్ర తీర్థుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం చేశారు. అనంతరం అలంకరణలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠానికి చెందిన నలుగురు విద్యార్థులు సుబుధేంద్రతీర్థుల సన్నిధిలో రుగ్వేద సంహిత మంగళాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. వేద పాఠశాల విద్యార్థులను ఫల మంత్రాక్షితలతో శ్రీమఠం పీఠాధిపతి ఆశీర్వదించారు. -
విద్యాలయంలో ఉన్మాది విలయం
● కత్తి, రాడ్తో హాస్టల్లో 9వ తరగతి విద్యార్థి దాడులు ● సమ్మతగేరి విద్యార్థి మృతి, 8 మందికి తీవ్రగాయాలు సాక్షి, బళ్లారి/ హొళగుంద: అక్షరాలు నేర్పే చదువుల తల్లి ఒడిలో రక్తపాతం సంభవించింది. రోజూ మాదిరిగానే భోజనం చేసి నిద్రిస్తున్న సహచర విద్యార్థులపై మరో విద్యార్థి రాక్షసునిలా మారి దాడికి తెగబడ్డాడు. బళ్లారి శివార్లలోని గురుకుల స్కూల్ ఇంటర్నేషనల్ అనే ఓ ప్రైవేటు స్కూలు హాస్టల్లో 9వ తరగతి విద్యార్థి శనివారం రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్యలో ఉన్మాదిగా కత్తి, రాడ్డులో సహచర విద్యార్థులపై దాడి చేశాడు. కర్నూలు జిల్లా హొళగుంద మండల పరిధిలోని సమ్మతగేరి గ్రామానికి చెందిన హేమంత్ (15) అనే 9వ తరగతి విద్యార్థిని బెడ్డు మీదే పొడిచి, రాడ్డుతో కొట్టి చంపాడు. మోక్షిత్, హేమంత్, వినయ్, విష్ణు, భానుప్రసాద్, మనోజ్ అనే విద్యార్థులు, శశికళ అనే విద్యార్థినికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఆకస్మికంగా జరిగిన ఈ ఘోరంతో హాస్టల్ రక్తసిక్తమైంది. టీచర్ బ్లెస్సీ, ఓ హాస్టల్ ఉద్యోగి కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను స్థానిక బిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి, న్యాయవాది బి.లక్ష్మీకాంత్ దంపతులు, బంధువులు, మిగతా విద్యార్థుల బంధువులు పరుగు పరుగున వచ్చారు. ఆదివారం ఉదయం బిమ్స్ ఆస్పత్రి పోస్టుమార్టం వద్ద విషాదం నెలకొంది. బాధితుల తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరి కన్నీరుమున్నీరుగా విలపించారు. బళ్లారి జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్, డీఎస్పీ, సీఐలు తదితరులు బందోబస్తు కల్పించారు. చంపే అవసరం ఏముంది? విద్యార్థి తండ్రి లక్ష్మీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో తన కుమారుడు హత్యకు గురయ్యాడన్నారు. భరత్ అనే విద్యార్థి దాడి కత్తితో పొడిచి చంపాడని విలపించారు. తన కుమారునికి ఎలాంటి గొడవ పడే మనస్తత్వం కాదని, అందరితో కలిసిమెలిసి ఉంటాడని, రాడ్, చాకుతో దాడి చేయాల్సిన అవసరం ఏముందో అర్థం కావడం లేదన్నారు. తమ కుమారుడుని హత్య చేసిన విద్యార్థిని కఠినంగా శిక్షించాలని తల్లి, బంధువులు డిమాండ్ చేశారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత విద్యార్థి మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకెళ్తూ ఎంత ఘోరం జరిగిపోయిందని రోదించారు. -
‘ఇంటి’ గుట్టు బట్టబయలు!
ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇవ్వడం... నమ్మి ఓట్లు వేసిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం టీడీపీ నేతలకు అలవాటైపోయింది. గత ఎన్నికల సమయంలో డోన్ పాతబస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రేషన్కార్డు, ఆధార్కార్డులతో ప్రమేయం లేకుండా ప్రతి కుటుంబానికి ఒకటిన్నర సెంటు చొప్పున ఇంటిస్థలం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డోన్ నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతున్న అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఓటమే ధ్యేయంగా ఈ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా డోన్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. పైగా జగనన్న కాలనీల్లో సౌకర్యాల కల్పనకు నయాపైసా ఖర్చు చేయలేదు. టీడీపీ నేతల ‘ఇంటి’ గుట్టు బట్టబయలు కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం పాలన అంటూ నిట్చూర్చుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు ఎంతో మేలు జరిగిందని, అప్పట్లో మంజూరైన ఇళ్లు, ఇంటి స్థలాలు, ఏర్పాటైన కాలనీలను గుర్తు చేసుకుంటున్నారు. 80 వేల కుటుంబాలకు కుచ్చుటోపీ డోన్ నియోజకవర్గంలో డోన్, బేతంచెర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్యాపిలి మేజర్ గ్రామ పంచాయతీ ఉంది. నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 80 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇంటింటికి ఒకటిన్నర సెంటు ఇస్తామని తెలుగుదేశం పార్టీ పేరుతో ఆ పార్టీ నేతల ఫొటోలను ముద్రించి కార్డులు ఇంటింటికీ పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఈ కార్డులను పట్టించుకోవడం లేదు. ప్రజలు వీటిని టీడీపీ నేతలకు చూపిస్తే వాటిని తీసుకుని చెత్తబుట్టల్లో వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ కార్డులు ఎవరికీ కనిపించకుండా దహనం చేస్తున్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి 80 వేల కుటుంబాలకు టీడీపీ నేతలు కుచ్చుటోపీ పెట్టారని ప్రజలు మండిపడుతున్నారు. వైఎస్సార్ హయాంలో డోన్ నియోజకవర్గంలో ఏడు వేల పక్కాగృహాలను మంజూరు చేశారు. పలు కాలనీల ఏర్పాటుకు ఉదారంగా నిధులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో 10వేల పక్కాగృహాలను మంజూరు చేసి జగనన్న కాలనీల ఏర్పాటు చేశారు. ఇప్పుడు పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. – కీర్తి, బేతంచెర్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అర్హులైన ఒక్క నిరుపేద కుటుంబానికి అంగుళ స్థలం కూడా ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో అలవి కాని వాగ్దానాలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించక తప్పదు. – వరలక్ష్మి, ఏనుగుమర్రి, ప్యాపిలి మండలం. ఒకటిన్నర సెంటు ఇస్తామని టీడీపీ నేతల హామీ అధికారంలోకి వచ్చాక గజం స్థలం కూడా ఇవ్వని వైనం అన్నీ అబద్ధాలు చెప్పారని ప్రజల ఆగ్రహం -
మహిళా హామీలు గాలికొదిలేశారు
● చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు మొండిచేయి ● రెండేళ్లు గడుస్తున్నా ఆడబిడ్డ నిధి లేదు ● వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు కర్నూలు (టౌన్): ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేశారని వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు విమర్శించారు. ఆదివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి సతీమణి కాటసాని ఉమా మహేశ్వరమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయ మనోహరి తదితరులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు. జగనన్న మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి అండగా నిలిచారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వం కన్నా రెండింతలు సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రతి సమావేశంలో చెప్పి ఇప్పుడు మొహం చాటేశారన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నిండిన మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తామని చెప్పి రెండేళ్లు పూర్తయిందన్నారు. కనీసం బడ్జెట్లో ఆ ఊసే లేదన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అరకొరగా ఇస్తున్నారని, బస్సుల్లేని ఉచిత బస్సు పథకంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుకా, జిల్లా మాజీ అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, మహిళా కార్పొరేటర్లు మునెమ్మ, పల్లవి, అరుణ, ఆర్షియా ఫర్హీన్, చిట్టెమ్మ, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మంగమ్మ, పార్టీ విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు. -
కల్లూరు సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
కర్నూలు(సెంట్రల్): కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్కుమార్ ఆదివారం ఉత్వర్వులు ఇచ్చారు. కల్లూరు గ్రామ సర్వే నంబర్ 645ఏ వక్ఫ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడంతో జిల్లా రిజిస్ట్రార్ బజారితో విచారణ జరిపించినట్లు చెప్పారు. ఆయన నివేదిక మేరకు ప్రవీణ్కుమార్ను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. తదుపరి పూర్తి నివేదికను కోరినట్లు ఆయన వివరించారు. జిల్లాలో ఎవరైనా రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, కల్లూరు ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్గా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఈశ్వర్ను నియమించినట్లు డీఐజీ తెలిపారు. సోమవారం నుంచి ఆయన బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. లోన్ యాప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): లోన్ యాప్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమానాస్పద లోన్ యాప్లను డౌన్ లోడ్ చేయవద్దని సూచించారు. లోన్ యాప్లు డౌన్లోడ్ చేసిన తరువాత మొబైల్లో ఉన్న కాంటాక్టులు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారం వంటి వివరాలను యాక్సెస్ చేసి తరువాత వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. లోన్ యాప్ మోసాలకు గురైన వారు 1930కు కాల్ చేయాలని, లేదంటే స్థానికంగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కర్నూలు(అగ్రికల్చర్): మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, నిధుల వినియోగంపై తనిఖీ చేసేందుకు జిల్లాలో కేంద్రబృందం పర్యటించనుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వివిధ మండలాల్లో ఉపాధి పనుల తనిఖీ, నిధుల వినియోగం తదితర వాటిని పరిశీలించనుంది. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్కీమ్ కింద జిల్లా చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేక ఆడిట్ చేసేందుకు ఈ టీమ్ జిల్లాకు వస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి చెందిన స్పెషల్ ఆడిట్ టీమ్ జిల్లాలో మూడు రోజులు పర్యటిస్తుందని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవీలత తెలిపారు. టీమ్ లీడర్గా డిల్లీ స్పెషల్ ఆడిట్ విభాగానికి చెందిన సీనియర్ ఆడిట్ అధికారి(ఏవో) వినిత చౌదరి వ్యవహరించనున్నారు. టీమ్లో ఆడిట్ అధికారులు నీరజ్కుమార్ యాదవ్, కిరణ్మలి సభ్యులుగా ఉంటారు. అప్పటికప్పుడు మండలాలను ఎంపిక చేసుకొని తనిఖీలకు వెళ్లే అవకాశం ఉంది. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ కర్నూలు: నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర, చెడు నడత, సమస్మాత్మక వ్యక్తులను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లు తరచు సమస్యలు సృష్టించే వ్యక్తులను గుర్తించి స్టేషన్లకు పిలిపించి ఎస్హెచ్ఓలు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. తరచు గొడవల్లో తలదూర్చే వారిని తీవ్రంగా హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా పోలీస్ చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. -
మంజూరైన పనులు రద్దు
ఓబులాపురం వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.32 కోట్లతో నిర్మించతలపెట్టిన అంబేడ్కర్ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల టెండర్ను టీడీపీ నేతలు రద్దు చేయించారు. అలాగే ప్యాపిలి శివారులో 100 ఎకరాల విస్తీర్ణంలో మంజూరైన ఇంటిగ్రెటెడ్ మార్కెట్ పనులను నిలిపివేశారు. మెట్టుపల్లి వద్ద నిర్మించతలపెట్టిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. వెంగళాంపల్లె, అబ్బిరెడ్డి పల్లె చెరువుల వద్ద టూరిస్ట్ బోటు కలగా మిగిలింది. డోన్ నియోజకవర్గంలో ఏడు పార్కుల అభివృద్ధి పనులను నిలిపివేశారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ కళాశాల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. రూ.4 లక్షల లీటర్ల నీటి కేపాసిటి గల ఓవర్ హెడ్ ట్యాంక్ పనులను నిలిపివేశారు. -
బాధితులను పరామర్శించిన ఆలూరు ఎమ్మెల్యే
హేమంత్ మృతదేహాన్ని సమ్మతగేరి గ్రామానికి తీసుకొచ్చారు. చదువులో బాగా రాణిస్తూ సౌమ్యంగా ఉండి ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న హేమంత్ మృతి వార్తతో గ్రామం శోకసంద్రంలో మునిగింది. ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి, వైఎస్సార్సీపీ మహిళా రాష్ట్ర ప్రదాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమ్మతగేరికి వెళ్లారు. తల్లిదండ్రులు అడ్వకేట్ లక్ష్మికాంత్, సరిత, కుటుంబ సభ్యులను పరామర్శించి ౖధైర్యం చెప్పారు. హేమంత్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారివెంట మండల కన్వీనర్ షఫివుల్లా, ఎస్కే గిరి, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
అభివృద్ధి నిరోధకులు
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో రాజకీయ వివక్ష చూపించరాదు. దురదృష్టవశాత్తు టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను రద్దు చేయించారు. టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారు. – శ్రీరాములు, రాష్ట్ర మీట్ కార్పొరెషన్ మాజీ చైర్మన్ చంద్రబాబు ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అబివృద్ధి పనులను అడ్డుకోవడం అర్థరహితం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నాం. – మల్యాల విజయ భాస్కర్రెడ్డి, రైతు, మల్యాల గ్రామం -
ఏకగ్రీవ ఎన్నిక
● స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీలు ఏర్పాటుకర్నూలు(సెంట్రల్): కర్నూలు, నంద్యాల జిల్లాల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఎంప్లాయీస్ అసోసియేషన్లు ఏకగీవ్రంగా ఎన్నికయ్యాయి. ఆదివారం కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హాజరై నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కమిటీ సభ్యులు బాల సుబ్రమణ్యం, ఎస్ మహబూబ్బాషా (డోన్), ఫైరోజ్ (ఓర్వకల్) వ్యవహరించారు. కర్నూలు జిల్లా కమిటీ.. కర్నూలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కె.శ్రీనివాసరావు (కర్నూలు సబ్ రిజిస్ట్రార్) జిల్లా అధ్యక్షుడిగా ఎంయూ మురళీ సుందరరావు, ఉపాధ్యక్షులుగా డీ లలితకుమారి, ప్రధాన కార్యదర్శిగా జే ప్రవీణ్కుమార్, జాయింట్ సెక్రటరీగా బీ భవానీ, ట్రెజరర్గా టీ ఈశ్వరయ్య, ఈసీ మెంబర్లుగా ఫైరోజ్, బీ కర్ణ, మూర్తికుమార్, ఉదయ్కుమార్, అనిత, ఎన్ రాధను ఎన్నుకున్నారు. నంద్యాల జిల్లా కమిటీ.. నంద్యాల జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎస్ మహబూబ్బాషా (డోన్), జిల్లా అధ్యక్షుడిగా కే శివకుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శిగా కే అబ్దుల్కరీం, జాయింట్ సెక్రటరీగా కే మంజుల, ట్రెజరరీగా ఎం.హుజిమియ్యా, ఈసీ మెంబర్లుగా జే వీఎన్రాజు, ఎన్. మధుబాబు, బీ వసంత, ఎం రాముడు, ఎన్ నీలమ్మ, ఎల్,వీరన్న, పీ జయవాణిని ఎన్నుకున్నారు. -
సుయతీంద్రతీర్థుల మధ్యారాధన
మంత్రాలయం: నడిచే రాఘవేంద్రులుగా పేరుగాంచిన శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు మధ్యారాధన వేడుకలు ఆదివారం శ్రీమఠంలో వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో స్వామిజీ మధ్యారాధన వేడుకలు కనుల పండువగా సాగాయి. ముందుగా వేద పఠనంతో సుయతీంద్ర తీర్థుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. అలంకరణలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం సుయతీంద్రతీర్థుల చిత్ర పటాన్ని బంగారు రథంపై శ్రీమఠం ప్రాంగణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. -
ఆడ పిల్లలను చదివించాలి
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికర్నూలు(సెంట్రల్): మహిళా శక్తి అపారమని, ఆడ పిల్లలను చదివిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని జిలా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. తాను మహిళగా పుట్టినందుకు గర్వ పడుతున్నానని, అనేక ఆటుపోటులను ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్తున్నానని చెప్పారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాలతో ఆడపిల్లల చదువును మధ్యలోనే ఆపి వేయించడం తదన్నారు. తాను కలెక్టర్గా వచ్చిన తరువాత 8 నెలల కాలంలో 83 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు చెప్పారు. వారందరినీ ప్రత్యేకంగా క్యాంపుల్లో ఉంచి చదివిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో సీ్త్రల అక్షరాస్యత 57 శాతంగా ఉందన్నారు. అనంతరం జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారన్నారు. డీఆర్డీఏ మెప్మా ద్వారా వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన 60.02 లక్షల మంది మహిళలకు మెగా చెక్ను అందించారు. కార్యక్రమంలో డీఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం అధినేత విజయభారతి, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు. ఆమెకు ఏ హోదా ఉంది... అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధికారికంగా హాజరు కావడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆమెకు ఏ హోదా ఉందని అధికారులు ఆహ్వానించారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు అయితే ఇతర పార్టీల మహిళా నాయకురాళ్లను ఎందుకు ఆహ్వానించలేదని ఐద్వా, ఏపీ మహిళా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. -
కుందూలో వ్యక్తి గల్లంతు
కోవెలకుంట్ల: పట్టణ శివారులో ప్రవహిస్తున్న కుందూనదిలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంత య్యాడు. కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న మన్నెపు రవికుమార్(40) గడేకారిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం మద్యం సే వించి ఇదే పట్టణానికి చెందిన నరసింహరాజు అనే మరో గడేకారితో కలిసి గౌండా పనికి బయలుదేరారు. కుందూనది వద్దకు వెళ్లగా ఈత కొట్టాలని భావించి ఇద్దరు నదిలో దిగారు. ఆ ప్రాంతం లోతుగా ఉండి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రవికుమార్ ప్రమాదవ శాత్తూ నీటిలో గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న వ్యక్తి ఒడ్డుకు చేరుకుని గట్టిగా కేకలు వేయగా స్థానికులు అక్కడికి చేరుకునే లోపే రవికుమార్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో కుందూనదిలో గాలింపు చర్యలు చేపట్టారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి ఆలూరు రూరల్: విద్యుత్ షాక్తో మండలంలోని అరికెర గ్రామానికి చెందిన మస్తాన్ వలి (43) మృత్యువాత పడ్డాడు. శనివారం మధ్యాహ్నం అరికెర గ్రామంలో ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాలు.. మస్తాన్ వలి గ్రామంలో జీవనోపాధి కోసం షాపు నిర్మించుకుంటున్నాడు. ఇందులో భాగంగా శనివారం నిర్మాణంలో ఉన్న షాపునకు బోరు వేసి క్యూరింగ్ చేస్తుండగా మోటర్ పైపు ఊడి పోయింది. మోటర్కు పైపు తగిలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య రమిజాబీ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. జామ చెట్లు బుగ్గిపాలు వెల్దుర్తి: రెండేళ్లకు పైగా ఆరుగాలం కష్టపడి సాగు చేసిన జామ చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. మండల పరిధిలోని సూదేపల్లె గ్రామానికి చెందిన రైతు మాదిగ పెద్ద మాదన్నకు చెందిన అదే గ్రామ రెవెన్యూ పరిధిలోని తోటలో జామ చెట్లు సాగు చేస్తున్నాడు. శనివారం తోటకు వెళ్లిన రైతుకు దాదాపు చెట్లకు మంటలు వ్యాపించి తగులబ డుతుంటం కనిపించింది. చుట్టు పక్కల రైతులు, కుటుంబ సభ్యులతో కలిసి మంటలను ఆర్పివేశారు. అప్పటికే దాదాపు 200 చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రెండేళ్ల క్రితం ఎన్ఆర్ఈజీఎస్ కింద రెండున్నర ఎకరాలలో 300 జామ చెట్లను నాటాడు. ప్రస్తుతం మంచి కాపులో ఉన్న చెట్లు కాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. గుర్తుతెలియని దుండగులు పంట దిగుబడిపై కంటగింపుతో అగ్గిరాజేసి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు. రైతు కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిన సంఘటనపై, నిస్సహాయ స్థితిలోని రైతుకు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. బైక్ అదుపు తప్పి యువకుడి మృతి పత్తికొండ రూరల్: పత్తికొండ–రాతన రహదారిలో ఓ మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాతన గ్రామానికి చెందిన మెడికల్ ఏజెన్సీ ఉద్యోగి కురుగోడు సతీష్ (30) మృతి చెందాడు. శనివారం ఉద యం బస్సులో వెళ్లి భార్య, పిల్లలను బళ్లారిలో వదిలేసి పత్తికొండకు వచ్చి పని ముగించుకున్నాడు. పత్తికొండ నుంచి తుగ్గలి మండలం రాతన గ్రామానికి బైక్పై వెళ్తుండగా మలుపు దగ్గర ప్రమాదవశాత్తూ చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య కల్పన, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. ఇద్దరికి ప్రశస్తి అవార్డులు మంత్రాలయం: శ్రీమఠం పూర్వ పీఠాధిపతి సుయతీంద్రతీర్థుల 13వ ఆరాధనోత్సవాలు వైభ వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శని వారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో డోలోత్సవ మండపంలో ఇద్దరికి ప్రశస్తి అవార్డులను అందజేశారు. కర్నూలు జిల్లా ఆడిట్ అధికారి కె.రమేష్బాబు, బెంగళూరుకు చెందిన ఎయిర్స్పేస్ సైన్స్ రంగం సీనియర్ ప్రొఫెసర్, చైర్మన్ జి.జగదీష్ గోపాలన్కు పీఠాధిపతి అవార్డులను ప్రదానం చేశారు. -
నిజాయితీ చాటిన కండక్టర్
● పోగొట్టుకున్న బంగారు బ్రేస్లెట్ ప్రయాణికుడికి అప్పగింతకోవెలకుంట్ల: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బంగారు బ్రేస్లెట్ జారవిరుచుకున్న ప్రయాణికుడు ఆర్టీసీ బస్ కండక్టర్ నిజాయితీతో తిరిగి పొందాడు. కోవెలకుంట్లకు చెందిన ప్రసన్నకుమార్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున 5.10 గంటలకు కర్నూలులో కోవెలకుంట్లకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. బస్సు బనగానపల్లెకు చేరుకోగా సొంత పని ఉండటంతో అక్కడే దిగాడు. బస్సు కోవెలకుంట్లకు చేరుకున్న తర్వాత ఒక ట్రిప్పు అమడాలకు, మరో సింగల్ బనగానపల్లెకు వెళ్లింది. అయితే బస్ వెళ్లిపోయిన రెండు గంటలకు చేతికి బ్రేస్లెట్ కన్పించకపోవడంతో బస్సులో పడిపోయి ఉండవచ్చని భావించి కోవెలకుంట్లలో ఉన్న తన స్నేహితుడు రవితేజకు ఫోన్ చేసి చెప్పాడు. రవితేజ తండ్రి శివరాం స్థానిక ఆర్టీసీ డిపోలో క్లర్క్గా విధులు నిర్వర్తిస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. కుమారుడి ద్వారా విషయం తెలుసుకున్న ఆయన కర్నూలు నుంచి బయలుదేరిన బస్సు వివరాలు తెలుసుకుని ఆ బస్సు కండక్టర్ ఈవీ రమణను ఫోన్ చేశాడు. బస్లో బ్రేస్లెట్ పడిపోయిందని వెనుక నుంచి మూడవ సీటు వద్ద పరిశీలించాలని సూచించాడు. కండక్టర్ సీటు వద్దకు వెళ్లి చూడగా సీటు మధ్యలో కన్పించింది. కండక్టర్ ఏ మాత్రం ఆలోచించకుండా బ్రేస్లెట్ దొరికినట్లు సమాచారం ఇచ్చాడు. రెండున్నర తులాల బంగారు బ్రేస్లెట్ పోగొట్టుకున్న ప్రయాణికుడిని పిలిపించి డిపో మేనేజర్ నాగరాజు సమక్షంలో అందజేశారు. నిజాయితీ చాటిన కండక్టర్ ఈవీ రమణను డీఎంతోపాటు సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. -
రమణీయం.. రంగనాథుడి రథోత్సవం
మద్దికెర: పెరవలి గ్రామంలో శ్రీ రంగనాథస్వామి రథోత్సవం శనివారం అశేష భక్తజనవాహిని మధ నిర్వహించారు. ఉదయం రంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవికి అర్చకులు రంగస్వామి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయంలో గోవింద నామస్మరణ హోరెత్తింది. సాయంత్రం సతీసమేత ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదీర్చి అశేష భక్తజన వాహిని మధ్య మహా రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ఈఓ రెబ్బ వీరయ్య, ఆలయ చైర్మన్ రవి, సర్పంచు మల్లికార్జున, తహసీల్దారు గుండాల నాయక్, దాతలు పారా రామచంద్ర ప్రసాద్, పారా విశ్వనాథ్, మాజీ జెడ్పీటీసీ పురుషోత్తం చౌదరి, రామలింగారెడ్డి, ఉప సర్పంచు గోపాల్, మాజీ ఆలయ చైర్మన్ దస్తగిరిగౌడు తదితర ప్రముఖులు రథోత్సవంలో పాల్గొన్నారు. -
‘కేజీబీవీ’ల్లో దరఖాస్తులకు వేళాయె!
కేజీబీవీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడులైంది. ఇందులో ప్రత్యేకంగా బాలికలు చదువుకోవడం గొప్ప అవకాశంగా చెప్పాలి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత చదువు, వసతి కల్పిస్తూ ప్రభుత్వం నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందిస్తుంది. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని పేద బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. – చైతన్య స్రవంతి, ప్రిన్సిపాల్, కేజీబీవీ కృష్ణగిరికృష్ణగిరి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు గడువు ఉంది. అర్హులైన బాలికలు 6వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులను పరిశీలించి ఏప్రిల్ 14న ఎంపిక జాబితా ప్రచురించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 52 కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 6వ తరగతికి 40 సీట్లు, ఇంటర్ ఫస్టియర్కు సంబంధించి 40 సీట్ల చొప్పున మొత్తం 4,160 సీట్లను ఈ ఏడాది భర్తీ చేయనున్నారు. ఇంటర్కు సంబంధించి కొన్ని విద్యాలయాల్లో బైపీసీ, మరి కొన్నింటిలో ఎంపీసీ గ్రూపుల్లో ప్రవేశాలు ఉన్నాయి. పేద, అనాథ పిల్లలతో పాటు బడి బయట ఉన్న పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసినవారు), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) జీవిస్తున్న బాలికలు, దివ్యాంగులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ముందుగా స్థానిక మండలంలో ఉన్న వారికి అవకాశం కల్పించగా, మిగిలిన సీట్లను పక్క మండలం వారికి కేటాయిస్తారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివిన బాలికలై ఉండాలి. అలాగే ఇంటర్ ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏప్రిల్ 1వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ల అమలు ఇలా.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షల వార్షిక ఆదాయం పొందే వారు అర్హులు. అలాగే రిజర్వేషన్ అమలులో భాగంగా మొత్తం 40 సీట్లలో 15 సీట్లు ఓపెన్ కాంపిటేషన్ (ఓసీ) కింద, 5 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు, ఇతర వెనుకబడిన తరగతులు(బీసీ)లకు 10 సీట్లు కేటాయిస్తారు. మిగిలిన సీట్లలో రిజర్వేషన్ల ప్రకారం సీట్ల విభజనను పూర్తి చేస్తారు. మెరుగైన ఫలితాలు.. కేజీబీవీలు 2004లో ప్రారంభమయ్యాయి. అన్ని వసతులు, సదుపాయాలతో కూడిన ఉచిత విద్యను అందిస్తూ ఏటా కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. 2021 నుంచి అన్ని చోట్ల ఇంటర్మీడియెట్ కోర్సులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కృష్ణగిరి కేజీబీవీ ప్రారంభం నుంచి పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తూ మంచి గుర్తింపు పొందింది. ఇక్కడ సీటు పొందేందుకు తీవ్రంగా పోటీ ఉంటుంది. ప్రతేడాది 40 సీట్లకు వంద మందికిపైగా విద్యార్థినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారంటే పోటీ ఏవిధంగా ఉందో ఇట్లే అర్థమవుతుంది. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు అవకాశం ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52 కేజీబీవీల్లో 4,160 సీట్ల భర్తీకి చర్యలు -
కమనీయం గోరంట్ల మాధవుడి కల్యాణం
కోడుమూరు రూరల్: గోరంట్ల గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ, భూదేవి మాధవస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన కల్యాణం, గరుడోత్సవ సేవకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కల్యాణానికి శ్రీమాధవస్వామి తరఫున ఎర్రగుడి వాసులు, అమ్మవార్ల తరఫున గోరంట్ల వాసులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా, ఆలయ పండితులు ఆగమ శాస్త్రప్రకారం కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించేందుకు స్థానిక భక్తులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది తరలివచ్చారు. స్వామి కల్యాణం సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది. కార్యక్రమంలో ఈఓ గుర్రెడ్డి, వేద పండితులు వందవాసి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, రమణమూర్తి, హరి, వెంకట్రామయ్య, పద్మానాభ ఆచారి, రాజేష్, కర్ణం లక్ష్మీనారాయణ, ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వైభవంగా గరుడోత్సవం.. కల్యాణంతరం ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఉంచి మేళతాళాల మధ్య గ్రామ పురవీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. గరుడ వాహనానికి ముందు ఎర్రగుడి వాసులు, వెనుక గోరంట్ల వాసులు నిలబడి పోటా పోటీగా లాగుతూ గరుడోత్సవాన్ని ఎంతో అట్టహాసంగా కోలాహలంగా నిర్వహించారు. కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
విద్యార్థినుల భద్రతకు పెద్దపీట..
● కేజీబీవీల్లోకి పురుషులకు ప్రవేశం పూర్తిగా నిషేధం, ఉపాధ్యాయులు (టీజీటీ /పీజీటీలు) సైతం మహిళలే. ● అలాగే ప్రతి పాఠశాలకు ప్రహరీ, గేటు, వాచ్మెన్తో కూడిన రక్షణ, భద్రత ఉంటుంది. ● అధికారులు తనిఖీలు, పరిశీలన నిమిత్తం తప్పిస్తే ఇతరులకు వెళ్లేందుకు ప్రవేశం ఉండదు. ● ఎటువంటి ఖర్చు లేకుండా అత్యుత్తమ బోధన, నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలతో కేజీబీవీల్లో సీట్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ● వైఎస్సార్సీపీ హయాంలో మన బడి నాడు–నేడు ద్వారా కేజీబీవీలను సుందరంగా తీర్చిదిద్దారు. అన్ని వసతులు, మౌలిక సదుపాయాలకు తోడు ఐఎఫ్పీ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ తరగతులను మరింత చేరువ చేశారు. ● మోనూ, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, కాస్మోటిక్స్ అందిస్తున్నారు. ● ప్రభుత్వం అందించాల్సిన తల్లికి వందనం, విద్యాకానుక పథకాలకు వీరంతా అర్హులే. -
డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
ఆదోని రూరల్: దీపం పథకం కింద ప్రజలకు అందించే డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని సబ్కలెక్టర్ అజయ్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి సబ్కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు 4 బృందాలుగా ఏర్పడి హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 15 హోటళ్లకు సంబంధించిన వారు 34 డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత హోటల్ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్ మాట్లాడుతూ.. గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం వినియోగించడం చట్ట విరుద్ధమన్నారు. అలాగే హోటల్లో ఆహార పదార్థాల్లో నాణ్యత లోపించినా సహించబోనని హెచ్చరించారు. -
పదోన్నతులు, పేస్కేళ్లను నిర్లక్ష్యం చేస్తే సహించం
● కలెక్టరేట్ ఎదుట విలేజ్ సర్వేయర్ల ఆందోళన ● డిమాండ్లను పరిష్కరించకపోతే రీసర్వేను నిలిపేస్తామని హెచ్చరికకర్నూలు(సెంట్రల్): గ్రామ విలేజ్ సర్వేయర్ల పదోన్నతులు, కనీస పేస్కేళ్ల నిర్ధారణపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఏపీ విలేజ్ సర్వేయర్ల సంఘం హెచ్చరింది. తమ డిమాండ్ల సాధనకు అవసరమైతే రీసర్వేను బహిష్కరిస్తామన్నారు. శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో వందలాది విలేజ్ సర్వేయర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ట్రెజరర్ ఓంకార్ మాట్లాడుతూ అధికారికంగా శనివారం నుంచి విలేజ్ సర్వేయర్లు వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగనున్నట్లు చెప్పారు. సోమవారం విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామరు. 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న విలేజ్ సర్వేయర్లకు గ్రేడ్–1 పదోన్నతితో పాటు పే స్కూలును కనీసం రూ.34,580 నిర్ణయించాలనే డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అడహాక్ పద్ధతిలో మండల డిప్యూటీ సర్వేయర్ పదోన్నతి కల్పిస్తే రీసర్వేలో ప్రధాన భూమికను పోషిస్తామన్నారు. గ్రామ సర్వేయర్ కనీస విద్యార్హత డిప్లమోగా సవరించాలని, రీసర్వేలో క్యూజీఐఎస్, సీఓఆర్ఎస్, ఆటో సీఏడీ వంటి సాంకేతిక నైపుణ్యాలు ఉన్న గ్రామ సర్వేయర్లను టెక్నికల్ రోల్ కింద గుర్తించి ప్రత్యేక పేస్కేలు అమలు చేయాలన్నారు. 5 సంవత్సరాలుగా పైస్థాయి నుంచి మండల స్థాయి సర్వేయర్ పోస్టుకు వరకు పదోన్నతులు వస్తున్నాయని, అయితే విలేజ్ సర్వేయర్ పోస్టులకు స్పెషల్ గ్రేడ్ సర్వేయర్స్, గ్రేడు–2 నుంచి గ్రేడు–1 సర్వేయర్ పదోన్నతులు రావడంలేదన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరూ చెప్పకపోవడంతో రీసర్వేను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం డీఆర్వో వెంకటనారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ, మనోజ్కుమార్, వీ.రఘుదీప్, వంశీ, మహబూబ్బాషా పాల్గొన్నారు. -
రెండో రోజు ఎస్ఐ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు: గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో ఎకై ్సజ్ శాఖ కర్నూలు జోన్ కింద ఎంపికై న 42 మంది అభ్యర్థుల్లో శనివారం 21 మందికి దేహదారుఢ్య, వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా అధికారి సుధీర్ బాబు సమక్షంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అనంతరం ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. జూన్ 12న వీరికి డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆదోని పీఆర్ ఈఈగా రాజన్న కర్నూలు(అర్బన్): ఆదోని పంచాయతీరాజ్ ఈఈగా అనంతపురం జిల్లా మడకశిర సబ్ డివిజన్ పీఐయు డీఈఈగా విధులు నిర్వహిస్తున్న బి.రాజన్నకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తు పీఆర్ ఈఎన్సీ బి.బాలునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆదోని ఈఈగా విధులు నిర్వహించిన డీసీ వెంకటేష్ సెలవులో వెళ్లిన కారణంగా రాజన్నకు బాధ్యతలు అప్పగించారు. నేడు జెడ్పీలో ‘స్థానిక’ మహిళా ప్రజా ప్రతినిధుల కన్వెన్షన్ కర్నూలు(అర్బన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఈ నెల 8న ఉదయం 10 గంటలకు సాంప్రదాయ ఆచరణ(కన్వెన్షన్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన మహిళా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓలు తమ పరిధిలోని స్థానిక సంస్థలకు చెందిన మహిళా ప్రజా ప్రతినిధులకు కార్యక్రమ ఉద్దేశాన్ని తెలియజేసి వారందరూ హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. -
వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యం పెరగాలి
కర్నూలు(అగ్రికల్చర్): 2026 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయంలో మహిళా రైతులను విశేషంగా ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. శనివారం కర్నూలులోని ఉద్యానభవన్లో భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ(ఎంఏఆర్ఐ), జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఒక్కరోజు ముందుగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం నిర్వహించారు. వివిధ మండలాల నుంచి మహిళా రైతులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి మాట్లాడుతూ మహిళా రైతులు, కూలీలు ప్రతి ఒక్కరూ సుకన్య సమృద్ధి యోజన పథకంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామిరెడ్డి మురళి, డీఆర్డీఏ డీపీఎం నరసమ్మ, జెండర్ కో–ఆర్డినేటర్ ఆశాలత, రచయిత్రి తోట అపర్ణ, వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి అక్బర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వ్యాప్తంగా మెగా కార్డెన్ సెర్చ్
కర్నూలు: మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో శనివారం మెగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది మొత్తం దాదాపు 240 మంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. దాదాపు 870 మంది సమస్యాత్మక వ్యక్తులు, ఇళ్లు, 345 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 35 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేసి పత్తికొండలో సమస్యాత్మక వ్యక్తిపై బైండోవర్ కేసు నమోదు చేశారు. నాటుసారా తయారీ, విక్రయాల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీల్లో భాగంగా వెయ్యి లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊట, 300 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉంటే కర్నూలు నగరంలో సమస్యాత్మక ప్రాంతమైన బంగారుపేటలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు, డీఎస్పీ బాబు ప్రసాద్, ఏఈఎస్ రామకృష్ణా రెడ్డితో పాటు సీఐలు నాగరాజరావు, శేషయ్య, చంద్రబాబు నాయుడు, తేజమూర్తి, పార్థసారధి, మన్సూరుద్దీన్, ఎకై ్సజ్ సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు, ఈగల్ టీమ్ ఎస్ఐ సుజన్ కుమార్ తదితరులు బృందాలుగా ఏర్పడి కేసీ కెనాల్ గట్టుపై విస్తృత తనిఖీలు చేపట్టారు. సారా బట్టీలను ధ్వంసం చేసి 350 లీటర్ల బెల్లం ఊట, 50 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. -
ఆమెకు అవస్థలు !
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరి సంఖ్య పెరుగుతోంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు తగిన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కనిపించడం లేదు. విధి నిర్వహణలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి చెప్పుకోలేని బాధలతో అల్లాడుతున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులను పనిసమయం ముగిసినప్పటికీ గంటల తరబడి పనులు చేయిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాగేనా మహిళలను గౌరవించేది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లు ఏవీ? ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా మహిళా రక్షణ సెల్ (ఉమెన్ ప్రొటెక్షన్ సెల్) ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం చెబుతోంది. కలెక్టరేట్ కాంప్లెక్స్, సంక్షేమభవన్, సర్వజనవైద్యశాల, జిల్లా పరిషత్, నగరపాలకసంస్థ, ఆర్డీవో కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వీటిలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కనిపించడం లేదు. వాటి బాధ్యతలను మహిళలకే అప్పగించాల్సి ఉంది. సంబంధిత కార్యాలయాల్లో మహిళలు ఏ విధంగా వేధింపులకు గురైనా, మహిళలకు సంబంధించిన పైళ్లు పెండింగ్లో పెట్టినా.. మహిళల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగించినా ఈ సెల్లో ఫిర్యాదు చేయవచ్చు. మహిళల నుంచి ఫిర్యాదులు వస్తే ఈ విభాగం ఇన్చార్జ్లు సంబందిత హెచ్ఓడీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వీలుంది. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటులో ప్రభుత్వం చేసిన చట్టం కాగితాల మీద ఉంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు. పస్తులే దిక్కు ప్రభుత్వ మహిళ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనంలో కూడిన 180 రోజుల మెటర్నటీ లీవ్లు ఉన్నాయి. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో మహిళలు 50 శాతం వరకు ఉన్నారు. మహిళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలల పాటు మెటర్నటీ లీవ్లు ఇస్తున్నప్పటికీ ఈ కాలానికి వేతనాలు చెల్లించడం లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అంతంతమాత్రంగా రూ.20 వేలలోపు ఉన్నాయి. వేతనంతో కూడిన సెలవులు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఆరు నెలలు మెటర్నటీ లీవ్ల్లో ఉన్న సమయానికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వీరికి వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్లు ఇవ్వాలని ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం స్పందిచడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సౌకర్యాలు కను‘మరుగు’ కర్నూలు జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్లోనే మహిళా ఉద్యోగులకు కనీస సదుపాయాలు లేవు. కలెక్టరేట్లో 30 ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, డీఆర్డీఏ, డ్వామా, సహకార శాఖ, ప్రణాళిక విభాగం తదితర కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో మహిళా ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. రన్నింగ్ వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెస్ట్ రూములు లేవు. కొన్ని శాఖల్లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లు కాగితాల మీదనే కనిపిస్తున్నాయి. రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలి మహిళా ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు సానుభూతితో వ్యవహించాలి. ప్రధానంగా వార్డు, గ్రామ సచివాయాల్లో పనిచేసే వారికి పని ఎక్కువగా ఉంటోంది. ఉదయం 8 గంటలకే విధులకు వెళ్లి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పనిచేయాల్సి వస్తోంది. మొత్తంగా 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు కచ్చితమైన పని వేళలు అమలు చేయాలి. మహిళలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రెస్ట్ రూములు ఏర్పాటు చేయాలి. – ఎస్.చందన, ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వ శాఖల్లో మహిళా ఉద్యోగులు సంఖ్య భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్లకుండా ఆఫీసుల్లోనే భోజనాలు చేస్తున్నారు. ఇటువంటి వారికి తగిన వసతి కల్పించాలి. ఉమన్ ప్రొటెక్షన్ సెల్లను మరింత పకడ్బందీగా అమలు చేయాలి. మరుగుదొడ్లను ఆధునీకరించాలి. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. – సరస్వతి, మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతప్రత్యేక సదుపాయాలు నిల్అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండాలి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవి కనిపించడం లేదు. అంతేగాకుండా మహిళలకు ప్రత్యేక వెయిటింగ్ రూమ్ ఉండాలి. మధ్యాహ్నం భోజనం చేయడానికి, అరగంటపాటు విశ్రాంతి తీసుకోవడానికి వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాని ఎక్కడా మహిళలకు వెయిటింగ్ రూములు లేవు. ప్రస్తుతం గ్రామస్థాయి కార్యాలయం నుంచి మండలం, డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాల వరకు మహిళా ఉద్యోగులు ఉన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చెప్పుకోలేని బాధలతో సతమతం అవుతున్నారు. -
శివయ్యకు సాష్టాంగ మొక్కులు
కన్నడిగుల పాదయాత్ర భక్తులు శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు. కొందరు కావడి మోస్తూ.. మరి కొందరు కర్ర కాళ్లపై నడుస్తూ, భజనలు చేసుకుంటూ శ్రీశైలం చేరుకుంటుండగా ఓ భక్తుడు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ మల్లన్న దర్శనానికి వెళ్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం భాగల్కోటి జిల్లా కొనురోల్ గ్రామానికి చెందిన గుర్రప్ప అతని సతీమణి మల్లమ్మ, అదే గ్రామానికి చెందిన వెంకయ్యతో కలిసి 15 రోజుల క్రితం బయలుదేరాడు. 20 అడుగులకు ఒకసారి చొప్పున సాష్టాంగ నమస్కారం చేస్తూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామిఅమ్మవార్లకు మొక్కు చెల్లిస్తున్నాడు. వాహనదారులు, ప్రజలు అతని భక్తిని చూసి నివ్వెరపోతున్నారు. – ఆత్మకూరు -
కర్నూలుకు వెళ్లాలంటే బస్సుల్లేవ్!
● ఆర్టీసీ ఈడీ దృష్టికి ప్రధాన సమస్యపత్తికొండ: సాయంత్రం ఆరు గంటలు దాటితే కర్నూలు, గుంతకల్, ఆదోని, గుత్తి లాంటి ప్రాంతాలకు వెళ్లడానికి బస్సులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ దృష్టికి ప్రయాణికులు తీసుకెళ్లారు. ప్రతిరోజు ఆదోని, గుంతకల్ రూట్లలో బస్సులు సంఖ్య తక్కువ ఉన్నందున గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్ను రిజినల్ మేనేజర్ శ్రీనివాసులతో కలసి ఈడీ తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉచిత బస్సు పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం రద్దీ ఏర్పడిందన్నారు. రద్దీ నివారణకు ప్రతి డిపోలో నూతనంగా బస్సుల సంఖ్యను పెంచి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. ఈడీ వెంట పత్తికొండ డిపో ఇన్చార్జ్ మేనేజర్ నాగభూపాల్, ఆర్టీసీ సిబ్బంది శేఖర్, మల్లప్ప, కృష్ణమూర్తి, లక్ష్మణ్నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
క్వాంటం టెక్నాలజీతో వేగంగా సమస్యల పరిష్కారం
కర్నూలు సిటీ: క్వాంటం టెక్నాలజీ అత్యంత వేగంగా సమస్యలను పరిష్కారం చేస్తుందని ప్రొఫెసర్లు అన్నారు. జగన్నాథగట్టులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(ట్రిబుల్ఐటీడీఎం)లో క్వాంటం మెటీరియల్స్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్ అనే అంశంపై శుక్రవారం వర్క్షాపు ప్రారంభం అయ్యింది. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వర్క్షాపును ట్రిబుల్ఐటీడీఎం రిజిస్ట్రార్ జె.క్రిష్ణయ్య, ఆన్లైన్లో ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ బి.కోటేశ్వరరావులు ప్రారంభించి ప్రసంగించారు. క్వాంటం టెక్నాలజీ డేటాను అత్యంత వేగంగా విశ్లేషణ చేస్తుందన్నారు. అనంతరం వర్క్షాపు కో–ఆర్డినేటర్ డా.పవన్ ప్రకాష్ మాధురీ మాట్లాడారు. ట్రిబుల్ఐటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు(సెంట్రల్): హెచ్పీవీ(హ్యూమన్ పాపిల్లో మావైరస్) వ్యాక్సినేషన్తో ప్రాణాంతక సర్వైకల్ క్యాన్సర్ నివారణకు అవకాశం ఉంటుందని, 14–15 ఏళ్ల మధ్య ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్ను కచ్చితంగా వేయించాలని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో హెచ్పీవీ వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కోసం ముద్రించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..14 ఏళ్లు నిండి 15వ ఏట అడుగుపెట్ట బాలికలందరికీ హెచ్పీవీ వ్యాక్సిన్ వేయాలన్నారు. గార్డాసిల్–4వ్యాక్సిన్ను 0.5ఎంఎల్ మోతాదులో ఎడమ చేతికివేస్తారని, వయసు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు, తల్లిదండ్రుల నుంచి సమ్మతిపత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. యూవీన్ పోర్టల్ ద్వారా లేదా స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. టీకా వేయించుకోవడానికి వచ్చే వారుతప్పనిసరిగా ఆహారం తిని రావాలని, టీకా తీసుకున్న తరువాత 30 నిమిషాలపాటు ఆరోగ్య కేంద్రంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. జిల్లాలో మొత్తం 19,704 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, అన్ని పీహెచ్సీల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరాజు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రూల్లా పాల్గొన్నారు. పోస్టర్ను విడుదల చేస్తున్న కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, వైద్యాధికారులుఅక్రమ మైనింగ్ను కట్టడి చేయాలి జిల్లాలో అక్రమ మైనింగ్ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మైనింగ్ అధికారులను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆమె మైన్స్ అండ్ జియాలజీ శాఖకు సంబంధించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కడైనా అక్రమ మైనింగ్ జరుగుతుంటే వెంటనే రెవెన్యూ, మైనింగ్, అటవీ, పోలీసులు శాఖలు సమన్వయంతో పని చేసి మూయించివేయాలన్నారు. మైనింగ్ అనుమతుల మంజూరులో పారదర్శకతను పాటించాలని నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తిరస్కరించాలన్నారు. సమావేశంలో మైన్స్అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ జి.వెంకటేశ్వర్లు, అటవీశాఖ అధికారి తేజస్వి, తహసీల్దార్ వెంకటలక్ష్మీ, హుస్సేన్సాహెబ్ పాల్గొన్నారు. -
గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి 8న ప్రవేశ పరీక్ష
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలోని డా.బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 8న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఎంఈ గీత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్ –2 పరీక్షలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో ఈ నెల 2వ తేదీన నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షను 8వ తేదీకి మార్పు చేస్తామని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే ఈ మార్పును చేశామని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరు కొత్త తేదీన నిర్వహించే పరీక్షకు హాజరు కావాలన్నారు. శిశుగృహకు చేరిన మగబిడ్డ కర్నూలు(అర్బన్): ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వదలి వెళ్లిన మూడు రోజుల మగ శిశువు (వీవాన్)ను బాలల సంక్షేమ సమితి ఉత్తర్వుల మేరకు ప్రత్యేక దత్తత సంస్థ ( శిశు గృహ)లో ఉంచి సంరక్షిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి పీ విజయ తెలిపారు. హాస్పిటల్లోని పీడియాడ్రిక్ బ్లాక్లో గుర్తు తెలియని మహిళ వాష్ రూమ్కు వెళ్లివస్తానని చెప్పి మూడు రోజుల మగశిశువును అటెండర్ చేతిలో ఉంచి తిరిగి రాలేదని, పరిసరాల్లో గాలించినా మహిళ ఆచూకీ లభ్యం కాలేదన్నారు. గత నెల 14వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ఆసుపత్రిలోనే ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే తమకు అప్పగించిన మగ శిశువును శిశు గృహలో ఉంచామన్నారు. సాక్ష్యాధారాలతో జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, సంబంధీకులు గాని 30 రోజుల్లోగా తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. లేని పక్షంలో ఈ శిశువును ‘కారా’ న్యూఢిల్లీ దత్తత నిబంధనల ప్రకారం దత్తత ఇస్తామని శుక్రవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేహదారుఢ్య పరీక్షలు కర్నూలు: ఇటీవల విడుదలైన గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో ఎకై ్సజ్ శాఖ జోన్–4 (కర్నూలు జోన్) కింద ఎంపికై న 42 మంది అభ్యర్థులకు గాను శుక్రవారం 20 మంది అభ్యర్థులకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కర్నూలు నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.హనుమంతరావు ఆధ్వర్యంలో ఆరోగ్య, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక డీసీ కార్యాలయంలో 20 మంది అభ్యర్థులకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ జావేద్ బృందం నేతృత్వంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మిగిలిన 22 మంది అభ్యర్థులకు శనివారం దేహదారుఢ్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఏఈఎస్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం నుంచి 27,094 క్యూసెక్కుల నీటి విడుదల శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 27,094 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 20,140 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 800 క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతలకు 335 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,678 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. క -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
జూపాడుబంగ్లా: ఆయిల్పామ్ సాగు చేపట్టడం ద్వారా రైతులు తక్కువ శ్రమతో అధిక లాభాలు ఆర్జించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఆదినారాయణ, నందికొట్కూరు ఉద్యాన అధికారిణి తేజశ్విని సూచించారు. శుక్రవారం మండలంలోని మండ్లెం రైతు సేవా కేంద్రంలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. మార్కెటింగ్ సౌకర్యం కోసం ప్రభు త్వం ఇప్పటికే పతంజలి, ఎంఎంఈఓ ఓపీ కంపెనీలతో ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఈ పథకం కింద ఎకరాకు 57 మొక్కలు ఇవ్వడంతో పాటు హెక్టారుకు రూ. 10,500 ఎరువుల కోసం అందజేస్తామని వివరించారు. సాగు చేసిన నాలుగేళ్ల నుంచి ఏటా ఎకరాకు రూ. 1.50 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో త్రీఎఫ్ కంపెనీ జోనల్ మేనేజర్ మోహన్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
ట్రాన్స్జెండర్ ఆత్మహత్య
ఉయ్యాలవాడ: మండలంలోని అల్లూరు గ్రామంలో ట్రాన్స్ జెండర్ లక్ష్మి(41) అలియాస్ నరసింహుడు ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. లక్ష్మి గత కొంత కాలంగా కిడ్ని వ్యాధితో బాధపడుతూ ఉందన్నారు. పలు వైద్యశాలల్లో చికిత్సలు పొందిన ఫలితం లేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందజేశారు. లక్ష్మి అన్న పెద్ద నరసింహుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. వడదెబ్బతో వలస కూలీ మృతి కృష్ణగిరి: బతుకు దెరువు కోసం వెళ్లిన ఓ వలస కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. లక్కసాగరం గ్రామానికి చెందిన మాల దాసరి పద్మనాభం(59), అనంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి గ్రామంలో కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో కూలీ పనులు లేకపోవడంతోపాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించకపోవడంతో వారం రోజుల క్రితం దంపతులు గ్రామంలో మరి కొంత మంది గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రోంటిపాలెం గ్రామంలో మిరప పనులకు వెళ్లారు. శుక్రవారం పనుల్లో ఉండగా పద్మనాభం వడదెబ్బతో మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. యువకుడి మృతి కోడుమూరు రూరల్: బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కోడుమూరులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కోడుమూరుకు చెందిన కెంచుగుండు నాగార్జున అనే వ్యక్తి గత పదినెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అతని భార్య సుశీల, కుమారుడు వీరేష్ (25) జీవనం సాగిస్తున్నారు. అయితే ఏమి జరిగిందో తెలియదుగాని వీరేష్ గురువారం మధ్యాహ్నం తల్లికి ‘ఐ మిస్ యూ’ అమ్మ అంటూ మెసేజ్ పెట్టి కన్పించకుండా పోయాడు. శుక్రవారం పట్టణ సమీపంలోని నరసప్ప బావిలో శవమై తేలా డు. అయితే వీరేష్ మృతికి కారణాలు తెలియ రాలేదు. తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గడ్డివాములు దగ్ధం హొళగుంద: మండల కేంద్రంలోని పీహెచ్సీ సమీపంలో పాలబావి వద్ద శుక్రవారం రాత్రి రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గౌరమ్మ, బోయ రామచంద్ర అనే రైతులు జొన్నసొప్ప, వరిగడ్డిని కొని నిల్వ చేసుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని మంటలు ఎగిశాయి. స్థానికులు ఆలూరు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా, ఫైరింజన్ చేరుకునేలోపు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. లక్షన్నర ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన డోన్ టౌన్: ఈ నెల 9వ తేదీ డోన్ మండలంలోని కొత్తకోట గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. బహిరంగ సభలో సీఎం పాల్గొని రైతులకు కొత్త పట్టాదార్ పాస్ బుక్లు అందజేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, డీఎస్పీ శ్రీనివాస్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్రెడ్డి తదితరులు పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేశారు. వారి వెంట ఆర్డీఓ నరసింహులు, తహసీల్దార్లు రవికుమార్, నాగమణి, ఎంపిడీఓ వెంకటేశ్వరరెడ్డి, సీఐ రాకేష్తో ఉన్నారు. షార్ట్ సర్క్యూట్తో ఆటో గ్యారేజ్ దగ్ధం శ్రీశైలం ప్రాజెక్ట్: రింగ్ పార్క్ సెంటర్లో ఉన్న సాయిరాం ఆటో గ్యారేజ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కావడంతో మల్లికార్జునకు చెందిన గ్యారేజీలో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. అయినప్పటికీ సుమారు రూ.2.5 లక్షల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ బి వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్కు ఏపీ ఎన్జీజీవోస్ నేతల వినతికర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ కర్నూలు శాఖ అధ్యక్షుడు జవహార్లాల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని కోరారు. శుక్రవారం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జవహార్లాల్, ఎంసీ కాశన్న ఆధ్వర్యంలో పలువురు నేతలు జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఏపీ ఎన్జీజీవోస్ అసోిసి యేషన్ 2026 డైరీని కలెక్టర్ చేతుల మీదుగా విడుదల చేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కలెక్టర్ దృష్టికి వివిధ సమస్యలను తీసుకెళ్లారు. వైద్య ఆరోగ్య శాఖలో అర్బన్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు 2025 జూలై నుంచి వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం లేదని, తగిన చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎంప్లాయీస్ వెల్పేర్ నిధి సమావేశాలు కొన్ని నెలలుగా నిర్వహించకపోవడంతో ఉద్యోగులకు రుణాల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు. జిల్లా ట్రైనింగ్ సెంటరును పునః ప్రారంభించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కారు ణ్య నియామకాల్లో జాప్యం లేకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ కాశన్నతో పాటు సహాధ్యక్షులు ఈశ్వరయ్య, ఇతర జిల్లా నాయకులు భాస్కరనాయుడు, ఆర్వీ రమణ, కేసీహెచ్ కృష్ణుడు, నాగకిశోర్, కర్నూలు నగరశాఖ అధ్యక్షుడు రామకృష్ణ, వ్యవసాయ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి మహేందర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
డిమాండ్లు పరిష్కరించకపోతే రీసర్వే నిలిపేస్తాం
● ప్రభుత్వాన్ని హెచ్చరించిన గ్రామ సర్వేయర్లుకర్నూలు(సెంట్రల్): గ్రామ సర్వేయర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే రీసర్వేను నిలిపివేస్తామని ఏపీ విలేజ్ సర్వేయర్ల సంఘం రాష్ట్ర ట్రెజరర్ ఓంకార్ హెచ్చరించారు. జిల్లాలో పనిచేస్తున్న విలేజ్ సర్వేయర్లు శుక్రవారం నగరంలోని సర్వే ఏడీ కార్యాలయానికి చేరుకుని తమ డిమాండ్లపై వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారికంగా శనివారం నుంచి విలేజ్ సర్వేయర్ల వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగనున్నట్లు చెప్పారు. సోమవారం విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న విలేజ్ సర్వేయర్లకు గ్రేడ్–1 పదోన్నతితోపాటు పే స్కేలును కనీసం రూ.34,580 బేసిక్గా పెట్టాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ సర్వేయర్ గ్రేడు–1కి మండల డిప్యూటీ సర్వేయర్కి మధ్యన స్పెషల్ సర్వేయర్ పోస్టు సాంకేతిక విభాగ సమాన పేరోల్ కనీ సం రూ.37,640 బేసిక్ అమలు చేయాలని చేస్తున్న డిమాండ్ను తోసిపుచ్చడం అన్యాయమన్నారు. అడహక్ పద్ధతిలో మండల డిప్యూటీ సర్వేయర్ పదోన్నతి కల్పిస్తే రీసర్వేలో ప్రధాన భూమికను పోషిస్తామన్నారు. గ్రామ సర్వేయర్ కనీస విద్యార్హత డిప్లొమాగా సవరించాలని, రీసర్వేలో క్యూజీఐఎస్, సీఓఆర్ఎస్, ఆటో సీఏడీ వంటి సాంకేతిక నైపుణ్యాలు ఉన్న గ్రామ సర్వేయర్లను టెక్నికల్ రోల్ కింద గుర్తించి ప్రత్యేక పేస్కేలు అమలు చేయాలన్నారు. ఐదేళ్లుగా విలేజ్ సర్వేయర్ పోస్టులకు స్పెషల్ గ్రేడు సర్వేయర్స్, గ్రేడు–2 నుంచి గ్రేడు–1 సర్వేయర్ పదోన్నతులు రావడం లేదన్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో ఎవరూ చెప్పకపోవడంతో రీ సర్వేను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సర్వే ఏడీ మురళీకృష్ణకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ, మనోజ్కుమార్, వీ.రఘుదీప్, వంశీ, మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు. -
12 గొర్రెలు మృతి
కృష్ణగిరి: వదిలేసిన టమాట పంటను తిని 12 గొర్రెలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని సంగాల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, గొర్రెల యజమానులు తెలిపిన వివరాల మేరకు..గ్రామానికి చెందని మూలింటి కురువ గౌరప్ప, కురువ అంజినేయులుకు చెందిన గొర్రెల మంద గురువారం గ్రామంలో ధర లేక వదిలేసిన టమాట పొలాన్ని కాపర్లు మేపారు. అవి తిన్న గొర్రెలకు శుక్రవారం ఉదయానికి పొట్ట ఊది ఊపిరి ఆడక ఇబ్బందులు పడటాన్ని గమనించి వెంటనే పశువైద్యాధికారులకు సమాచారం అందించారు. అయితే ఎండకు మగ్గిన టమాట కాయలు తినడంతో మందలోని 12 గొర్రెలు మృతి చెందాయి. మిగితా వాటికి మందులు తాపడంతో కోలుకున్నట్లు వారు తెలిపారు. దీంతో ఈ ఇద్దరు రైతులు రూ. 2 లక్షల వరకూ నష్టపోయారని, ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బ్రడ్జి నిర్మాణంలో ‘కోట్లా’ట!
● కోట్ల, సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు ● డోన్ నియోజకవర్గ ప్రజలకు తొలగని కష్టాలు డోన్: ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన టీడీపీ నేతలు ఆధిపత్యం కోసం కోట్లాడుతున్నారు. దీంతో ఒక బ్రిడ్జి నిర్మాణ పనులకు ఇంతవరకు తీర్మానం రాలేదు. డోన్ రూరల్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న 44వ జాతీయ రహదారికి సమాంతరంగా సాయిబాబు గుడికి సర్వీసు రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం అయ్యే సూచనలు కనిపించటం లేదు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. సాయిబాబా మందిర ప్రథమ వార్షికోత్సవానికి వచ్చి బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.20కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆలయ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిల వర్గీయుల మధ్య విభేదాలు తలెత్తి బ్రిడ్జి నిర్మాణ పనులు ముందుకు సాగేందుకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో ఉడుములపాడు గ్రామ పంచాయతీలో బ్రిడ్జి నిర్మాణం పనుల ఆమోదం కోసం పెట్టిన తీర్మానం చేయకుండా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుంటునారని ధర్మవరం వర్గీయులు ఆరోపిస్తున్నారు. సాయిబాబా ఆలయానికి నిత్యం వచ్చే భక్తులతో పాటు ఉడుములపాడు వైపు వేళ్లే వాహన దారులు, పాదచారులకు 44వ జాతీయ రహదారికి సర్వీస్ రోడ్లులా ఉపయోగపడేందుకు ఈ బ్రిడ్జి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. అయితే ధర్మవరం వర్గీయులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే వర్గీయులు కొట్టిపడేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే పనుల ప్రాధాన్యత గురించి ధర్మవరం వర్గీయుల కంటే తమకే బాగా తేలుసని కోట్ల వర్గీయులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా శాశ్వతమైన పనులు చేయలేదు. టీడీపీ నాయకులు ఆధిపత్యం కోసం కాంట్రాక్టుల ద్వారా అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తునారని కోట్ల, ధర్మవరం వర్గీయులపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కదలింది కన్నడిగుల దండు!
మల్లయ్య ఉత్సవ విగ్రహాల పల్లకీతో శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులుశ్రీశైల క్షేత్రంలో నిర్వహించే ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు కన్నడిగుల దండు కదిలింది. బళ్లారి జిల్లా శిరిగేరి, బాద్నట్టి, వద్దట్టి, కుడితిని, మణుసుగూరు, గెణికాళ్, సిద్దమ్మనళ్లి, కొంచిగేరి, బలకుంది తదితర గ్రామాల నుంచి భక్తులు హొళగుంద మీదుగా శ్రీశైలం వైపు పాదయాత్రగా తరలివస్తున్నారు. మల్లయ్య ఉత్సవ విగ్రహాలు కొలువైన పల్లకీని మోసుకుని శివ నామస్మరణతో ముందుకు కదులుతున్నారు. వీరికి హొళగుంద, సమ్మతగేరి, పెద్దహ్యాట, చిన్నహ్యాట, ఎల్లార్తి తదితర గ్రామస్తులు అల్పాహారం, భోజనంతో పాటు అరటి పండ్లు, మజ్జిగ ఇతర శీతల పానీయాలు అందజేశారు. అలాగే మార్లమడికి రోడ్డులో హొళగుందకు చెందిన వారు ఉదయం అల్పాహారంతో పాటు ఆరోగ్య సమస్యలు భక్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. – హొళగుంద -
ఎకై ్సజ్ నేరాల అదుపునకు కృషి
పత్తికొండ: ఎకై ్సజ్ శాఖ పరిధిలో నేరాల అదుపునకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి సూచించారు. శుక్రవారం పత్తికొండ పట్టణంలో ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలన చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నవో దయం పథకంలో భాగంగా ప్రత్యేకించి గిరిజన గ్రామాల్లో నాటుసారా అమ్మకాలను పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని సూచించారు. గిరిజనులకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తూ వారిలో మార్పులు తీసుకురావడానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా పత్తికొండ ఎకై ్సజ్ శాఖ సబ్ డివిజన్లో ఎకై ్సజ్ నేరాల అదుపు కోసం సిబ్బంది ప్రత్యేక కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు రాజశ్రీ, హనుమంతురావు, ఎకై ్సజ్ సీఐ సువర్ణలత, ఎస్ఐలు ప్రవీణ్నాయక్, రాజేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కుమారుడికి తండ్రి పునర్జన్మ
● కిడ్నీ దానం చేసిన తండ్రి ● రక్తం గ్రూపు వేరైనా ఆపరేషన్ విజయవంతంకర్నూలు(హాస్పిటల్): ఆ తండ్రి 28 ఏళ్ల క్రితం కుమారునికి జన్మనిచ్చాడు. తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ పునర్జన్మనిచ్చాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కుమారునికి రక్తం గ్రూపు సరిపోకపోయినా తన కిడ్నీని దానం చేసి ప్రాణం దక్కించుకున్నాడు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన మధుకృష్ణ(28) కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం గత సంవత్సరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతనికి కిడ్నీ వైఫల్యం ఉన్నట్లు నిర్ధారించారు. అతనికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఒక్కటే పరిష్కారమని తేల్చారు. అతనిది ఏ పాజిటివ్ రక్తం గ్రూపు కాగా కిడ్నీ దానం చేయడానికి వచ్చిన తండ్రి గోరంట్ల రక్తగ్రూపు ఏబీ పాజిటివ్ కావడంతో రక్తగ్రూపు సరిపోలేదు. దీంతో కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాల్లోని పలు ఆసుపత్రులను సంప్రదించినా కిడ్నీ మార్పిడి సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్కు వెళ్లి నెఫ్రాలజిస్టు డాక్టర్ కె.అనంతరావును సంప్రదించారు. రోగిని పూర్తిగా పరిశీలించిన అనంతరం ఏబీఓ ఇన్కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చని డాక్టర్ అనంతరావు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక వైద్య పద్ధతులు అనుసరించి గత నెల 13వ తేదీన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను ఆయన విజయవంతంగా నిర్వహించారు. రోగి కోలుకోవడంతో 21వ తేదీన డిశ్చార్జ్ చేశారు. శుక్రవారం ఈ చికిత్సకు సంబంధించి డాక్టర్ అనంతరావు మాట్లాడుతూ రక్తగ్రూపు సరిపోని పరిస్థితుల్లో కిడ్నీమార్పిడి చేయడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ అని, ఇందుకోసం ముందుగా రోగి శరీరంలో ఉన్న యాంటిబాడీలను తగ్గించే ప్రత్యేక చికిత్స(డీసెన్సిటైజేషన్) చేయాల్సి ఉంటుందన్నారు. ఇన్ఫెక్షన్లను నివారించేందుకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో పాటు కొత్త యాంటిబాడీలు ఏర్పడకుండా ఉండేందుకు రిటుక్సిమాబ్ అనే ఇంజెక్షన్ ఇస్తారన్నారు. శరీరంలో ఉన్న యాంటిబాడీలను తొలగించేందుకు ప్లాస్మా ఎక్సేంజ్ వంటి ప్రక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. యాంటిబాడీ స్థాయి 1ః4 కంటే తక్కువ వచ్చిన తర్వాతే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేపడతామని ఆయన వివరించారు. -
దోమల వ్యాప్తితోనే డెంగీ జ్వరాలు
ప్యాపిలి: దోమల వ్యాప్తితోనే డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతాయని జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర రావు అన్నారు. స్థానిక పీహెచ్సీని శుక్రవారం ఆయన సందర్శించారు. పీహెచ్సీ పరిధిలో నమోదైన డెంగీ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని ఒకటో సచివాలయాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో ఆయన మాట్లాడారు. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం ద్వారా జ్వరాలు వస్తాయన్నారు. ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమల వ్యాప్తిని అరికట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, డోన్ సబ్ యూనిట్ అధికారి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మార్కెట్ వేలాలు రద్దు చేయాలి ఎమ్మిగనూరురూరల్: ఈ నెల 4వ తేదీన జరిగిన మున్సిపాలిటీ మార్కెట్ వేలాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, జిల్లా కలెక్టర్ స్పందించి వాటిని రద్దు చేయాలని టీడీపీ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్రప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మున్సిపల్ ఆర్ఐ అస్లాంబాషా నిబంధనలకు విరుద్ధంగా వేలాలు నిర్వహించి అధికార పార్టీ వారికి వత్తాసు పలికారన్నారు. వేలాల్లో పాల్గొనే వారు డిపాజిట్ అమౌంట్ను బ్యాంక్ డ్రాప్ట్ తేవాలని మున్సిపల్ గెజిట్లో ఉండగా కమిషనర్ చెక్కు తీసుకొని వేలం పాట నిర్వహించటం చట్ట విరుద్ధమన్నారు. జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. భ్రమరాంబాదేవికి కొబ్బరికాయల సమర్పణ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శుక్రవారం కొబ్బరికాయలు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి, పసుపు, కుంకుమలతో వాటికి పూజలు జరిపారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించారు. చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 7న కుంభోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారికి సాత్వికబలి నిర్వహించేందుకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు మొదలైనవి సమర్పించి కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున సీ్త్ర వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. -
బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
● ఆగమోక్తంగా ధ్వజావరోహణం ● శాస్త్రోక్తంగా సకల దేవతలకు వీడ్కోలుఆళ్లగడ్డ: శ్రీ అహోబిలేశుడి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన ధ్వజావరోహణ కార్యక్రమాన్ని గురువారం తెల్లవారుజామున ఆగమోక్తంగా చేపట్టారు. 10 రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల మొదటిరోజు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. చివరిరోజు గురువారం వేదమంత్రాచ్ఛారణల మధ్య ధ్వజావరోహణం (గరుడ పటాన్ని కిందకు దించడం) చేసి సకల దేవతలకు వీడ్కోలు ఉత్సవం చేపట్టారు. ముందుగా ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, తిరుమంజన సేవ గావించిన అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్దకు వేంచేశాక ముద్రక్త ఆగమశాస్త్రం ప్రకారం వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభంపై ఉన్న గరుడ పటాన్ని శాస్త్రోక్తంగా కిందకు దించారు. అనంతరం ముద్రకర్త కీడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో అర్చక బృందం గరుడ ధ్యానం, భేరీపూజ, భేరితాడనం, గరుడ గద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక మంత్రాలను జపించి బ్రహ్మోత్సవాలు ముగిసినట్టు వేద పారాయణం ద్వారా ప్రకటించారు. గత నెల 21వ తేదీ మొదలైన బ్రహ్మోత్సవ వేడుకలకు మొదట్లో భక్తులు పెద్దగా కనిపించలేదు. చివరి ఘట్టాలైన రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడ సేవకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు, వసతులు కల్పించడంలో పూర్తిగా సఫలీకృతులయ్యారు. దివ్యాంగులు, వయో వృద్ధులకు తప్పని ఇక్కట్లు.. ఉత్సవాల్లో నేపథ్యంలో ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాల్లో అధికారులు స్వామి దర్శనాలకు వీఐపీలు, వీవీఐపీలకే ప్రాముఖ్యత ఇచ్చారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, గర్భణులు, చంటిపిల్లలు తల్లులు దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించక పోవడంతో తోపులాట చోటు చేసుకుని పలువురు స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. గుడిబయట నుంచే ముక్కుబడులు చెల్లించుకుని వెనుదిరగాల్సిన దుస్థితి నెలకొంది. -
ఉచితంగా ఆధునిక దంత వైద్య సేవలు
ఆసుపత్రిలోని దంత విభాగంలో రోజుకు 50 మంది దాకా ఓపీ రోగులు వస్తారు. వారికి ఆధునిక వైద్యపరికరాలు, ఆధునిక చైర్లపై దంత వైద్యం చేస్తున్నాం. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 నుంచి 4 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. పాడైన దంతాలు, చిగుళ్ల వ్యాధులకు చికిత్స, పిల్లలకు వచ్చే దంత సమస్యలకు, గుట్కా తినడం వల్ల పాడైన దంతాలకు చికిత్స చేయడం, నోటి క్యాన్సర్తో బాధపడే వారికి చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ ఆర్. విజయకుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, దంత వైద్యవిభాగం, జీజీహెచ్, కర్నూలు దంత వైద్యచికిత్సలో ఆధునిక వైద్యసదుపాయాలు మరింత మెరుగైన, నాణ్య మైన చికిత్సను రోగులకు అందించేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఒకప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్కు నాలుగుసార్లు వైద్యుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే విజిట్లోనే ఈ చికిత్సను పూర్తి చేసే అవకాశం వచ్చింది. ఎత్తు, వంకర పళ్లను సరిచేసేందుకు గతంలో క్లిప్స్ ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు అలైనర్స్ ద్వారా సౌకర్యవంతంగా ఎత్తు, వంకర, సందు పళ్లను సవరించుకోవచ్చు. అల్ట్రాసోనిక్ స్కేలింగ్ సహాయంతో ఎప్పటికప్పుడు దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. డెంటల్ లేజర్స్ పరికరం ద్వారా ఇంజెక్షన్స్ లేకుండా రక్తస్రావం రాకుండా కుట్లు వేయవచ్చు. – డాక్టర్ పి. సునీల్కుమార్రెడ్డి, డెంటల్ సర్జన్, కర్నూలు -
‘మగ’వల అందం చూడతరమా!
ఆదోని రూరల్: హోలీ పండగ అంటే రంగుల పండగ అంటూ అందరూ ఆనందంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఎక్కడైనా చూసుంటాం. కానీ సంతెకూడ్లూరు గ్రామంలో మాత్రం వింతగా ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న ఈ గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. గ్రామంలో వెలిసిన రతీమన్మథుల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కోరికలు తీరిన భక్తుల్లో పురుషులు ఆనవాయితీ ప్రకారం మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేకంగా సీ్త్ర వేషంలో చీర కట్టి అందంగా అలంకరించుకుని కలశాలతో రతీ మన్మథుల ఆలయానికి డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా చేరుకున్నారు. పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేశా రు. వేడుకలను చూసేందుకు ఆంధ్రా నుంచే గాక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం రాత్రి కామప్పను దహనం చేసిన గుంత వద్దకు సీ్త్ర వేషధారణలో వెళ్లిన పురుషులు బోరున విలపిస్తూ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎద్దుల సంత నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు ఎద్దులను కొనుగోలు చేసేందుకు తరలివచ్చారు. భక్తుల మధ్య రతీమన్మథుల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కోర్కెలు నెరవేరి సీ్త్ర వేషధారణలో మొక్కులు చెల్లింపు సంతెకూడ్లూరులో కొనసాగిన వింత ఆచారం వైభవంగా రతీమన్మథుల రథోత్సవం -
డీసీసీబీని అభివృద్ధి పథంలో నిలుపుదాం
● డీసీసీబీ సీఈఓ శివలీల కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకును మరింత అభివృద్ధిలోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి (సీఈఓ) కొమ్మ శివలీల అన్నారు. గురువారం డీసీసీబీ సీఈఓగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు డీసీసీబీ జనరల్ మేనేజర్ అయిన పి.రామాంజనేయులు పూర్తి అదనపు బాధ్యతలతో సీఈఓగా ఉన్నారు. ఆప్కాబ్ కొన్ని నెలల క్రితం డీసీసీబీకి రెగ్యులర్ సీఈఓను నియమించుకునేందుకు 11 మందితో కూడిన ప్యానల్ను పంపింది. ఈ మేరకు డీసీసీబీలో జీఎంగా విధులు నిర్వహిస్తున్న శివలీల కూడా ప్యానల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్యానల్లో ఉన్న శివలీలను సీఈఓగా నియమిస్తూ డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఇన్చార్జీ సీఈఓ నుంచి రెగ్యులర్ సీఈఓగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ అధికారులు, ప్రధాన కార్యాలయం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలు వివరించారు. సమష్టిగా పనిచేసి డీసీసీబీని మరింత అభివృద్ధ్దిలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో జీఎం పి.రామాంజనేయులు, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్కుమార్, ఏజీఎం త్రినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాసుపత్రిలో దంత చికిత్సలు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఒకప్పుడు కేవలం దంత వైద్యచికిత్సలు నామమాత్రంగా ఉండేవి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం కారణంగా ఇక్కడి దంత వైద్యసేవలు మరింత మెరుగయ్యాయి. నాలుగేళ్ల దంత విభాగంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేశారు. ఇందులో భాగంగా ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. ప్రస్తుతం ఒక ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉంది. వీరిలో పెరియో డెంటిస్ట్, ఎండో డెంటిస్ట్, ఆర్థో డెంటిస్ట్, ఓరల్ సర్జన్ ఉన్నారు. ఈ విభాగంలో పెద్దలతో పాటు చిన్నపిల్లలకూ దంత చికిత్సను అందిస్తున్నారు. పిప్పి పళ్లను సరిచేయడం, తీసేయడం, ఎముక కట్ చేయడం, స్కేలింగ్ చేయడం, చిగుళ్ల వాపులు, రక్తం కారడంపై చికిత్స చేస్తున్నారు. రెండేళ్ల క్రితం రూ.8 లక్షలతో ఓపీజీ మిషన్(ఎక్స్రే), రూ.8 లక్షలతో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మిషన్ (వెల్స్కోప్) కొనుగోలు చేశారు. గత ప్రభుత్వంలోనే మూడు ఆధునిక దంత వైద్యచికిత్స చైర్లు వచ్చాయి. -
వైభవంగా గరుడోత్సవం
మద్దికెర: శ్రీరంగనాథుడు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మండల పరిధిలోని పెరవలి గ్రామంలో కొలువైన శ్రీరంగనాథుడు శ్రీదేవి, భూదేవి సమేతంగా గురువారం గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో స్వామివారికి బిందెసేవ, పంచామృతాభిషేకం, అష్టోత్తరనామార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువుంచా రు. అనంతరం ప్రభోత్సవం గ్రామ పుర వీధుల్లో మేళతాళాల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వీరయ్య, ఆలయ చైర్మన్ రవికుమార్, అర్చకులు రంగస్వామి, మధుస్వామి, నరసింహస్వామి, సిబ్బంది రఘు పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నీటి కుంటలో పడి 80 గొర్రెలు మృత్యువాత బనగానపల్లె: చెరువుపల్లె గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం నీటి కుంటలో పడి 80 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బేతంచర్ల మండలం బుగ్గానిపల్లి, కొలుములపల్లి గ్రామాలకు చెందిన గొర్రెల యజమానులు తమ గొర్రెలను మేపుతూ బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చేరుకున్నారు. కొద్ది రోజులుగా తమ గొర్రెలను గ్రామ పొలిమేరల్లో మేపుతున్నారు. గురువారం చెరువుపల్లె సమీపంలో నీటి కుంటలో నీరు తాగేందుకు వెళ్లిన గొర్రెలు ఒకదానిపై ఒకటి పడటంతో ఊపిరాడక 80 మృతి చెందాయి. ఈ ప్రమాదంలో నాగేష్కు చెందిన 40 గొర్రెలు, పరశురాముడు 20, శేఖర్ 10, మల్లికార్జున 10 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందజేసి తమను ఆదుకోవాలని కోరారు. కొండాపురంలో ఇరువర్గాల ఘర్షణ సి.బెళగల్: కొండాపురం గ్రామంలో గురువారం ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకుల మధ్య 2023లో జరిగిన క్రికెట్ పోటీల విషయంపై రెండు రోజుల క్రితం వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పంతాలకు వెళ్లిన ఇద్దరు యువకులు వారి బంధుమిత్రులతో కలసి పరస్పరం దాడులకు సిద్ధమయ్యారు. అందరూ ఒక చోట గుమికూడి ఘర్షణ పడుతుండగా సమాచారం అందుకున్న కోడుమూరు సీఐ తబ్రేజ్, సి.బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్రాజు సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కొండాపురంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముందస్తు చర్యగా పలు ప్రాంతాల నుంచి పోలీసులు గ్రామంలో మొహరించారు. అనంతరం పెద్దలు, పోలీస్ అధికారుల జోక్యంతో ఘర్షణ పరిస్థితులు సద్దుమణిగాయి. కర్నూలు ట్రాఫిక్ సీఐ మనుసూరుద్దీన్, ఇంటెలిజెన్స్ సీఐ (జోనల్ ఇన్చార్జ్) వెంకటరామిరెడ్డి, ఎస్ఐ పీరయ్య ఇతర పోలీస్ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. -
వైద్య విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి
● డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ చంద్రశేఖర్కర్నూలు (హాస్పిటల్): ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీలో వస్తున్న నైపుణ్యాలను యువ వైద్యులు పెంపొందించుకోవాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో గురువారం సాయంత్రం 2020 బ్యాచ్ ఎంబీబీఎస్ వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. యువ వైద్యులు సమాజానికి ఆశాకిరణాలుగా నిలవాలని ఆకాంక్షించారు. వైద్యుని వద్దకు ఎంతో ఆశతో వచ్చే రోగి ఒక కేసు కాదని, అతను ఎంతో నమ్మకంతో మీ వద్దకు వచ్చే సగటు మనిషే అని మరువవద్దని తెలిపారు. కోటి ఆశలతో తమ పిల్లలను వైద్య విద్యలో చదివించేందుకు తల్లిదండ్రులు అహర్నిశలు కృషి చేస్తారని, వారి నమ్మకాన్ని పిల్లలు నిలబెట్టాలని సూచించారు. వైద్యవిద్యలో నూతన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నారు. కృత్రిమ మేథస్సుతో జీనోమిక్స్ చేసుకోవాలని, రీసెర్చ్ రంగంలో అధిక ప్రాధాన్యతనివ్వాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి వైద్య విద్యార్థికి విజ్ఞానం, నైపుణ్యం, మానవత్వం కలసినప్పుడే నిజమైన వైద్యసేవలు సమాజానికి అందుతాయన్నారు. అనంతరం ఐసీఎంఆర్, యూజీఎస్ఆర్ఎస్ ప్రాజెక్టులలో పాల్గొనే యూజీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యపరీక్షల్లో రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుధాకర్, ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ హరిచరణ్, డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ రేణుకా దేవి, డాక్టర్ విజయానంద బాబు, డాక్టర్ సింథియా శుభప్రద, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మీబాయి, డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
కర్నూలు(సెంట్రల్): ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పది పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం 9 గంటలకే విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. పరీక్షా సమయానికి అనువుగా ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్లు కూడా సెల్ఫోన్లను తీసుకెళ్లరాదన్నారు. మంచి గాలి, వెలుతురు వచ్చే గదులున్న పాఠశాలలనే కేంద్రాలుగా గుర్తించాలన్నారు. పిల్లలు కింద కూర్చొని పరీక్ష రాసే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. డీఈఓ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ కింద 33,796 మంది, ప్రైవేట్ కింద 1975 మంది హాజరవుతున్నారన్నారు. 160 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 8 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్రాజు, డీపీఓ భాస్కర్, డీటీసీ శాంతకుమారి పాల్గొన్నారు. -
మహిళలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి
కర్నూలు: మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ జిల్లా అంతటా పాఠశాలలు, కళాశాలల్లో సినిమాలు, వీడియోల ప్రదర్శన చేపట్టారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఈనెల 1 నుంచి జిల్లా అంతటా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా పీఎస్ సీఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వీడియోల ప్రదర్శన జరిగింది. సమాజంలో మహిళలకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని సూచిస్తూ అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా కర్నూలు నగరం లేబర్ కాలనీలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శక్తి యాప్ వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో శక్తి వాట్స ప్ నెంబర్ 7993485111కు కాల్ చేసినా, మెసేజ్ చేసి నా పోలీసులు స్పందించి అవసరమైన చర్యలు చేపడతారని తెలిపారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ శక్తి టీమ్ సభ్యులు హెడ్ కానిస్టేబుళ్లు మహబూబ్ ఖాన్, ఎస్ఎం బాషా, వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ మేరీ స్వర్ణలత, జ్యోత్స్న, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తిరు వీధుల్లో దివ్య దర్శనం
● దిగువ అహోబిలంలో వైభవంగా గరుడోత్సవంఆళ్లగడ్డ: శ్రీ మహావిష్ణువుకు నిత్య వాహనమైన గరుత్మండిపై శ్రీ లక్ష్మీనారసింహుడు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. దిగువ అహోబిలంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారు జామువరకు గరుడోత్సవం కనుల పండువగా సాగింది. అహోబిలేశుని బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుంచి పది రోజుల్లో వచ్చే భక్తులు ఈ ఒక్కరోజే అహోబిలం చేరుకుంటారు. స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లిస్తారు. ఈ రోజు కోసం ఏడాది పొడువునా వేచి ఉంటారు. బుధవారం తెల్లవారు జామునుంచే దిగువ అహోబిలం దేవాలయం ప్రాంగణం భక్త జనసందోహంతో కిటకిటలాడింది. ఉదయం ఉత్సవమూర్తులను కోనేరు దగ్గరకు తోడ్కొని వెళ్లి తీర్థవారి చక్రస్నానం, సాయంత్రం ద్వాదశారాధనం, రాత్రి పుష్పయాగం నిర్వహించారు. అర్ధరాత్రి అనంతరం ఉత్సవమూర్తి అయిన శ్రీ ప్రహ్లాదవరద స్వామి వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలు ధరించి గరుడవాహనంపై అధిష్టించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. గరుడోత్సవంలో పాల్గొని స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ, విదేశాలకు చెందిన భక్తులు తరలి వచ్చారు. దిగువ అహోబిలంలో భక్తుల గోవిందా నామస్మరణ మర్మోగింది. -
న్యాయ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు: ఉమ్మడి జిల్లాలోని నంద్యాల స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్–2, టైపిస్టు–1 పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 17లోపు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు https://kurnooldcourt.gov.in/ వెబ్సైట్ను సందర్శించాలన్నారు. అలాగే ఆళ్లగడ్డలోని ఐదవ అదనపు జిల్లా కోర్టు (ఫాస్ట్ ట్రాక్)లో ఖాళీగా ఉన్న హెడ్ క్లర్కు (పర్మినెంట్ బేసిస్) పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 17లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆళ్లగడ్డలోని స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టులో ఖాళీగా ఉన్న కోర్టు అటెండెంట్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జెడ్పీలో సీనియర్ సహాయకులుగా నలుగురికి పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో జూనియర్ సహాయకులు/టైపిస్టులుగా విధులు నిర్వహిస్తున్న నలు గురికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించినట్లు జిల్లాపరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో పదోన్నతి పొందిన నలుగురు ఉద్యోగులకు జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు. అలాగే పదోన్నతి పొందిన వారికి వివిధ మండల పరిషత్ కార్యాలయాలకు పోస్టింగ్స్ ఇచ్చా రు. పదోన్నతి పొందిన వారిలో డి.ప్రభాకర్ను గోనెగండ్ల, ఐ.లక్ష్మీబాయిని దొర్నిపాడు, జె.చిన్నయ్యను బనగానపల్లె, వి.లలితా జ్యోతిని పాములపాడుకు పోస్టింగ్స్ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ఇ.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా 70 కేంద్రాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 10,742 మంది హాజరుకావాల్సి ఉండగా, 10,305 మంది హాజరయ్యారు. ఈ నెల 2వ తేదీ నుంచి పరీక్షల మూల్యాంకనం చేపట్టారు. సంస్కృతం సబ్జెక్టుతో మూల్యాంకనం ప్రారంభించారు. సామాజిక బాధ్యత కలిగి ఉండాలి కర్నూలు కల్చరల్: యువత చదువుతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య వి.వెంకటబసవరావు అన్నారు. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ స్వచ్ఛతా యాక్షన్ ప్లాన్లో భాగంగా కర్నూలు ఆర్టీసీ బస్స్టేషన్ ప్రాంగణంలో చేపట్టిన ఒక రోజు పరిశుభ్రతా కార్యక్రమాన్ని గురువారం వీసీ వర్సిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వ విద్యాలయం ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు బస్టాండ్ పరిసరాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ప్రతి పౌరుడూ తెలుసుకోవాలని వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడు అన్నారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పి.నాగరాజు, హైదరాబాదులోని ఎన్ఎస్ఎస్ డైరెక్టరేట్ ప్రతినిధి సంజయ్, కర్నూలు–1 డిపో మేనేజర్ కె.సుధారాణి, ఆర్టీసీ కంట్రోలర్ వాసుదేవ రెడ్డి, వర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె.వెఎంకటరత్నం, డాక్టర్ బి.విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాద రెడ్డి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
పీజీ ఫలితాల్లో కేఎంసీ విద్యార్థులు ‘సూపర్’
● ముగ్గురు వైద్యవిద్యార్థులకు గోల్డ్మెడల్స్ ● ముగ్గురూ యూనివర్సిటీ టాపర్లే కర్నూలు(హాస్పిటల్): సూపర్ స్పెషాలిటీ కోర్సులను అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇటీవల వార్షిక పరీక్షలు నిర్వహించింది. గురువారం ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో కర్నూలు మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థులు యూనివర్సిటీ టాపర్లుగా రాణించడంతో పాటు మంచి పర్సెంటైల్స్తో గోల్డ్మెడల్స్ను సాధించారు. ఈ పరీక్షలకు కళాశాల నుంచి 11 మంది హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, వైద్యులు అభినందించారు. కార్డియాలజీలో.. కార్డియాలజీ విభాగంలో సూపర్స్పెషాలిటీ పీజీ చేస్తున్న డాక్టర్ సనాఖాన్ పర్వేజ్ నవాజ్ యూనివర్శిటి టాపర్గా నిలిచారు. దీంతో పాటు ఆయన 75 పర్సెంటేజ్తో గోల్డ్మెడల్ సాధించారు. ఈయన తండ్రి సనాహా హుసేన్ అహ్మద్ ఆదోనిలోని అవ్వ బ్యాంకులో మేనేజర్. తల్లి మెహజబీన్ గృహిణి. అన్నయ్య ఇంజనీర్గా, చెల్లెలు టీచర్గా పనిచేస్తున్నారు. సనాఖాన్ పర్వేజ్ నవాజ్ భార్య రాహత్ షేక్ కూడా కంటి వైద్యులుగా రాణిస్తున్నారు. నెఫ్రాలజీ విభాగంలో... నెఫ్రాలజీ విభాగంలో సూపర్స్పెషాలిటీ పీజీ చేస్తున్న డాక్టర్ నేహా శర్మ యూనివర్శిటి టాపర్గా నిలిచారు. దీంతో పాటు 76 శాతం పర్సెంటేల్తో గోల్డ్మెడల్ సాధించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కాంగ్ర జిల్లాకు చెందిన ఈమె 2022 బ్యాచ్లో డీఎం నెఫ్రాలజి సీటు రావడంతో కర్నూలు మెడికల్ కాలేజిలో చేరారు. ఈమె తండ్రి శివకుమార్ శర్మ అగ్నికల్చర్ జేడీగా పనిచేశారు. తల్లి రమాశర్మ పోస్టుమాస్టర్గా పనిచేస్తున్నారు. భర్త డాక్టర్ తుకారామ్ గోవాలో కార్డియాలజిస్టు. యురాలజీ విభాగంలో.. యురాలజీ విభాగంలో సూపర్స్పెషాలిటీ పీజీ చేస్తున్న డాక్టర్ కటారు ప్రశాంత్బాబు యూనివర్సిటీ టాపర్గా నిలిచారు. అంతేగాక మంచి పర్సంటైల్తో ఆయన గోల్డ్మెడల్ సాధించారు. నంద్యాలకు చెందిన ఈయన కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను పూర్తి చేశారు. 2022లో యురాలజీ సీటు కూడా ఇక్కడే రావడంతో యురాలజీ విభాగంలో చేరి రాణించారు. ఆయన తండ్రి కె.బాలుదాసు పోలీస్ కంట్రోల్ రూమ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. తల్లి కె.ప్రేమకుమారి గృహిణి. సనాహా ఖాన్ నవాజ్ డాక్టర్ నేహా శర్మ డాక్టర్ కటారు ప్రశాంత్బాబు -
రంజాన్ మాసంలో శాంతి, సహనం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): పవిత్ర రంజాన్ నెల మానవాళికి శాంతి, సహనం, సోదరభావాన్ని బోధిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని 2వ వార్డు బడి మార్కెట్ సమీపంలో ఉన్న మస్జీద్–ఎ– జులేఖానీ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఐక్యత పెంపొందాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, రెండో వార్డు నాయకులు సిరాజ్, శంకర్, ఫిరోజ్, అఫ్రోజ్, వలీ, ఇలియాజ్, స్థానిక ముస్లిం నాయకులు, యువకులు పాల్గొన్నారు. -
కౌలు రైతులకు దక్కని సాయం
మాకు నాలుగు ఎకరాల సొంత భూమి ఉంది. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఇందులో ఉల్లి, మొక్కజొన్న, టమాట తదితర పంటలు సాగు చేస్తున్నాం. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. నష్టపరిహారం ఇవ్వలేదు. – ఈశ్వరయ్య, రైతు, చిన్నటేకూరు, కల్లూరు మండలం మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. ఈ ఏడాది వర్షాలు ఎక్కువై పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు ఎలాంటి ఆసరా లేకుండా పోయింది. అన్నదాత సుఖీభవకు మొదటి ఏడాది మంగళం పలికారు. రెండో ఏడాది రెండు విడతలకే పరిమితం చేశారు. మూడో విడత ఎప్పుడు ఇస్తారో? రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా బీమా లభించలేదు. – టీ.పక్కీరప్ప, జొన్నగిరి, తుగ్గలి మండలం294598 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘రైతు భరోసా’ అందుకున్న అన్నదాతలు 272757 చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అందుకున్న కర్షకులు 21841 చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవకు దూరమైన రైతులు కర్నూలు(అగ్రికల్చర్): కష్టాన్నే నమ్ముకున్న కర్షకులకు కన్నీళ్లే మిగిలాయి. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నీ కోతలే కనిపిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలన్నీ దెబ్బతిన్నా.. ఉచిత పంటల బీమా జాడ లేకుండా పోయింది. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ గొప్పలు చెప్పినా.. తొలి ఏడాది రిక్తహస్తం చూపారు. రెండో ఏడాది అరకొర సాయం అందింది. ‘అన్నం పెట్టం.. మాటలతోనే కడుపు నింపుకోండి’ అన్నట్లు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉత్తుత్తి మాటలు నమ్మి దారుణంగా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మూడో’ మోసం! అన్నదాత సుఖీభవ అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 2024 జూన్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్–6 హామీల పక్కన పెట్టేశారు. ఇందులో భాగంగానే 2024–25లో అన్నదాత సుఖీభవను ఎగ్గొట్టడంపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. 2025–26 నుంచి అమలు చేస్తున్నా అరకొరకు పరిమితం చేసి మమ అనిపిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాత సుఖీభవ కింద సాయాన్ని మూడు విడతల్లో చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రైతులకు రూ.14 వేలు మాత్రమే లభించాయి. మూడో విడతలో అన్నదాత సుఖీభవ కింద రూ.4000, పీఎం కిసాన్ కింద రూ.2000 విడుదల చేయాల్సి ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరం మరో 25 రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు మూడో విడత సాయం రైతులకు దక్కని పరిస్థితి ఏర్పడింది. అన్నదాత సుఖీభవపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఎన్నికల సమయంలో సూపర్–6లో భాగంగా పీఎం కిసాన్తో సంబంధం లేకుండా మేమే రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడు ఊరూవాడా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో ముడిపెట్టి రూ.14 వేలకు మాత్రమే పరిమితం అవుతుండటంపై రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవను పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది నుంచి అమలు చేస్తున్నప్పటికి మూడో విడత ఊసే లేకుండా పోయింది. పెండింగ్ రూ.10 కోట్లు అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు. 2025 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన అధిక వర్షాలతో వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. నిబంధనల ప్రకారం 33 శాతం కంటే దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలి. అధిక వర్షాలతో 50 నుంచి 100 శాతం వరకు పంటలు దెబ్బతిన్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేయించి పంట నష్టాన్ని అతి తక్కువగా చూపించింది. అతి తక్కువ నమోదు చేసిన ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు చెల్లించలేదు. ఉమ్మడి జిల్లాలో 2026లో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ దాదాపు రూ.10 కోట్ల వరకు పెండింగ్లో ఉండి పోయింది. ధీమా ఇవ్వని బీమా రైతులు ప్రీమియం చెల్లిస్తే 2024–25 రబీ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమాను అమలు చేస్తున్నారు. ఉచిత పంటల బీమాను పక్కన పెట్టి ప్రీమియం చెల్లించిన రైతులకే బీమా అనే విధానాన్ని తెచ్చారు. 2024–25 రబీ, 2025 ఖరీఫ్ సీజన్లో రైతులు ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్నప్పటికీ పరిహారం ఊసే లేకుండా పోయింది. అధిక వర్షాలు, వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నప్పటికీ ఒక్క రూపాయి పరిహారం లేదు. ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్నా పరిహారం వస్తుందో.. లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.. 2025–26 రబీలో పంటల బీమాను అమలే చేయలేదు. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నప్పటికీ బీమా జాడనే లేకుండా పోవడం రైతులకు తీవ్ర ఆందోళనను మిగిల్చింది. వైఎస్సార్సీపీ హయాంలో.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధిక వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లితే కేవలం నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. పంట నష్టం జరిగిన కొద్ది రోజుల్లోనే ఎన్యూమరేషన్ చేపట్టడం, ఆ వెంటనే ప్రభుత్వానికి రిపోర్టు పంపడం, రిపోర్టు పంపిన కొద్ది రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం ఆనవాయితీగా ఉండేది. రైతుల నుంచి ప్రీమియం రూపంలో రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్కు ముందే పంటల బీమా కింద రైతులకు పరిహారం చెల్లించేవారు. నోటిఫై చేసిన పంట ఏదైనా ఈ–క్రాప్లో నమోదైతే చాలు బీమా అమలులో ఉన్నట్లే.41320 ఆర్సీ కార్డులు ఉన్నా అన్నదాత సుఖీభవ అందని కౌలు రైతులు28600 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా అందుకున్న కౌలు రైతులుచంద్రబాబు ప్రభుత్వంలో కౌలు రైతులకు తీరని అన్యాయం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో కౌలుదారులకు రూపాయి కూడా చెల్లించలేదు. కర్నూలు జిల్లాలో 25 వేలు, నంద్యాల జిల్లాలో 28 వేల మంది రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేశారు. ఒక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవ అమలు కాలేదు. కౌలు రైతులతో పాటు ఎండోమెంట్, అటవీ భూములు (ఆర్ఓఎఫ్ఆర్) అనుభవిస్తున్న వారికి, అసైన్ భూములకు, వేలాది పట్టాదారులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కౌలురైతులతో పాటు ఆర్వోఎఫ్ఆర్, ఎండోమెంటు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్థికంగా చేయూత ఇచ్చింది. 2024–25లో అందని అన్నదాత సుఖీభవ 2025–26 నుంచి అరకొరగా అమలు ఏడాది ముగుస్తున్నా మూడో విడత మాటే లేదు! అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు నష్ట పరిహారం ఊసే కరువు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం -
ముగిసిన కామన్న వేడుకలు
హొళగుంద: మండల కేంద్రం హొళగుందలో బుధవారం కామన్న (మన్మథ) వేడుకల ముగింపులో భాగంగా జరిగిన హాస్య కార్యక్రమాలు ప్రజలను కడుపుబ్బ నవ్వించాయి. యువకుల వేషధారణాలు ఆకట్టుకున్నాయి. హోలీ పున్నమిని పురస్కరించుకుని స్థానిక ఉరువకొండ మఠం (విరక్త మఠం) పరిసర ప్రాంతానికి చెందిన యువకులు, పెద్దలు గత నెల 27న ప్రారంభించిన వేడుకల్లో రోజూ హాస్య సన్నివేశాలను ప్రదర్శించారు. మంగళవారం రాత్రి జరిగిన ప్రధాన కార్యక్రమాన్ని చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు. మంగళవారం అర్ధరాత్రి కామన్న (మన్మథ) దహనం జరగడంతో బుధవారం ఉదయం మన్మథుడి మృతదేహం ఊరేగింపు, కామన్నకు పునర్జన్మ రావడంతో మన్మథుడు, రతి పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. ఘనంగా హోలీ వేడుకలు.. బుధవారం రతీ, మన్మథుల వివాహం సందర్భంగా సంతోషంతో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకున్నారు. ఎద్దుల బండ్లపై రంగునీళ్ల డ్రమ్ములను ఉంచి వీధి వీధి తిరిగి జనాలపై రంగు నీళ్లు జల్లి సంబరం చేసుకున్నారు. -
మండలి చైర్మన్పై అనుచిత వ్యాఖ్యలు దారుణం
ఆలూరు రూరల్: శాసన మండలి చైర్మన్ హిందూవు కాదని క్రిస్టియన్ అంటూ రాష్ట్ర మంత్రి అచ్చెం నాయుడు మండలి చైర్మన్ మోషన్ రాజును అనడం దారుణమని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఖండించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన వెంకన్న స్వామి లడ్డూను వాడుకున్నారని, లడ్డు కల్తీపై చర్చ జరగాలంటూ శాసన మండలిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు పట్టుబడుతుంటే చర్చకు రాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. మండలి చైర్మన్ హిందువు కాదని క్రిస్టియన్ అని కులం పేరుతో దూషించడం దుర్మార్గమన్నారు. మంత్రి హోదాలో ఉండి మండలి చైర్మన్పై దురహంకార వ్యాఖ్యలు చేసిన అచ్చెం నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకోండి కర్నూలు(అర్బన్): జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేడీసీ పథకాల ద్వారా 2015–16 నుంచి 2018 –19 వరకు స్వయం ఉపాధి పథకాల ఏర్పాటుకు రుణాలు తీసుకున్న ఎస్సీ లబ్ధిదారులకు వడ్డీ మాఫీ వర్తింపజేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి తెలిపారు. బుధవారం ఆమె తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ ఈ రెండు పథకాలకు సంబంధించి 2025 డిసెంబర్ 31వ తేది నాటికి బకాయి పడిన వడ్డీ రూ.2,41,96,643 ఉందన్నారు. ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి అసలు చెల్లిస్తే వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద 965 మంది లబ్ధిదారులకు రూ.2,30,64,729, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకానికి సంబంధించి 72 మంది లబ్ధిదారులకు రూ.11,31,914 మాఫీ చేయడం జరుగుతుందన్నారు. వడ్డీ మాఫీ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పలువురు లబ్ధిదారులు రూ.35 లక్షల వరకు చెల్లించారన్నారు. ఇంటర్ పరీక్షలకు 259 మంది గైర్హాజరు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షలకు బుధవారం 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు 16,596 మంది విద్యార్థుల్లో 16,337 మంది హాజరైనట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు. తేనె ఉత్పత్తితో అదనపు ఆదాయం ఎమ్మిగనూరు సెంట్రల్: తేనె టీగలు పెంచుతూ తేనె ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని నంద్యాల ఆర్ఏఆర్ఎస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఎం.జాన్సన్, కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డా. రాఘవేంద్ర చౌదరి పేర్కొన్నారు. బనవాసి కేవీకేలో గత కొన్ని రోజులుగా తేనేటీగల పెంపకంపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. శిక్షణకు హాజరైన 30 మంది రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనెటీగల పెంపకం ద్వారా నూనెగింజల పంటలలో పరాగసంపర్కం మెరుగుపడి ఉత్పాదక గణనీయంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు అశోక్కుమార్, రవిప్రకాష్రెడ్డి, సుజాతమ్మ, ట్రైనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గరుడ గమనం.. గోవిందుడి అభయం
గరుడోత్సవాన్ని తిలకిస్తున్న భక్తజనం ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ఎగువ అహోబిలంలో గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నృసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహుడు విశేష అలంకరించిన గరుడ వాహనాన్ని అధిష్టించారు. ఆస్థాన విద్వాంసుల మంగళకరమైన వాయిద్యాలు, పండితుల వేదోక్త మంత్ర పఠనములు.. భక్తుల గోవిందా నామస్మరణల నడుమ అట్టహాసంగా ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. గరుడ మహోత్సవం మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారు జామువరకు కొనసాగింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం చేపట్టారు. శాస్త్రోకంగా అగ్గిసేవ అహోబిల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన ఘట్టం చివరిరోజు నిర్వహించే అగ్గిసేవ. నెత్తిన అగ్గితో కొట్టించుకుంటే శుభం లభిస్తుందని, కర్మలు తెగిపోతాయని భక్తుల నమ్మకం. అగ్ని జ్వాలలు విరజిమ్ముతున్న కుంపటిని నెత్తిన పెట్టుకున్న వ్యక్తి మరో చేత్తో మండుతున్న కొరివితో భక్తుల నెత్తిన కొట్టినా ఎటువంటి గాయం కాదని భక్తులు చెప్పారు. -
వాము క్రయవిక్రయాలపై నిఘా
కర్నూలు(అగ్రికల్చర్): వాము క్రయవిక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనే అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని కర్నూలు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి అసిస్టెంట్ సెక్రటరీ, సూపర్వైజర్లను ఆదేశించారు. ఇందుకోసం ఆరు టీములు ఏర్పాటు చేశారు. బుధవారం ‘సాక్షి’లో వాము క్రయ విక్రయాల్లో జరిగే మోసాలపై ‘కాటా’కట శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి స్పందించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను, మార్కెట్ కమిటీని ఆదేశించారు. మార్కెట్లో వాము క్రయ విక్రయాల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందో.. అలాంటి కమీషన్ ఏజెంట్ దుకాణాలకే సరుకు ఎక్కువగా వస్తుండటం గమనార్హం. ఏఏ కమీషన్ ఏజెంటుకు ఎక్కువ వాము వచ్చిందో.. వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, తూకాలను తనిఖీ చేయాలని సూచించారు. తూకాలను రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగించరాదని, సాయంత్రం ఆరు గంటలకు పూర్తి చేయాలన్నారు. ఇదిలాఉంటే ప్రత్యేక టీమ్లు తనిఖీలు చేపట్టినప్పటికీ తూకాల్లో తేడాలను గుర్తించకపోవడం గమనార్హం. -
బాల్య వివాహాలను అరికట్టండి
కృష్ణగిరి: మండలంలో అధికంగా ఉన్న బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణలు వెంటనే అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్, ఐసీడీఎస్ పీడీ విజయ, ఆదోని ఇన్చార్జి సబ్ కలెక్టర్ అజయ్కుమార్, పత్తికొండ ఇన్చార్జి ఆర్డీఓ కొండయ్యలను ఆదేశించారు. బుధవారం ఆమె కృష్ణగిరి మండలంలోని పీహెచ్సీ, తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పీహెచ్సీ రికార్డులు పరిశీలించి, వైద్యులతో సమావేశమై ఆసుపత్రిలో ప్రసవాల శాతం పెంచాలని సూచించారు. మండలంలో ఎక్కువగా నమోదవుతున్న సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పరిశీలించి వయోజనులైన అభ్యాసకులతో మాట్లాడి చదువులో పురోగతిని పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట సీడీపీఓ ల్యూక్, పీహెచ్సీ వైద్యాధికారి సురేశ్ కుమార్, ఎంపీడీఓ మోహన్ కుమార్, ఏపీఎం మహేశ్వరయ్య ఉన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల మూత
కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం ముక్కంటి ఆలయం, సింహాచలం అప్పన్న ఆలయాలు పూజల అనంతరం మూసివేశారు. గ్రహణానంతర శుద్ధి కార్యక్రమాల తరువాత తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి 8.30 గంటలకు తెరిచారు. మరికొన్ని ఆలయాలు బుధవారం ఉదయం తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పూజాధికాల అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. – తిరుమల/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/సింహాచలం/శ్రీశైలం టెంపుల్తిరుమల శ్రీవారి ఆలయం చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ మూసివేశారు. గ్రహణానంతర శుద్ధి కార్యక్రమాల అనంతరం రాత్రి 8 గంటలకు ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అన్నప్రసాద సముదాయం, లడ్డూ కౌంటర్లు కూడా రాత్రి 8.30 గంటల నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహణ ఇదిలా ఉండగా, మంగళవారం సాయంత్రం కొంతమంది భక్తులు కుమారధార తీర్థం ముక్కోటిని ఆచరించారు. అయితే చంద్రగ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులు తీర్థంలో పవిత్రస్నానం చేసి మధ్యాహ్వానికే తిరిగి వెళ్లిపోయారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయ అర్చకులు అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారాలను కవాట బంధనం చేశారు. బుధవారం తెల్లవారుజామున సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. విశాఖ జిల్లాలోని సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని గ్రహణం కారణంగా మూసిశారు. రాత్రి 7గంటల సమయంలో ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ పూజలు చేశారు. బుధవారం ఉదయం 6.30గంటల నుంచి భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. శ్రీశైలం ఆలయ ద్వారాలు చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూసివేశారు. తిరిగి రాత్రి 7.30గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, తదితర పూజాదికాల తరువాత రాత్రి 9గంటలకు స్వామిఅమ్మవార్ల దర్శనాలను పునఃప్రారంభించారు. గ్రహణ కాలానికి అతీతం.. శ్రీకాళహస్తీశ్వరాలయంశ్రీకాళహస్తి: దేశంలో ఉన్న ఆలయాలు గ్రహణ కాలంలో మూసివేయడం ఆనవాయితీ. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయం గ్రహణాలకు అతీతంగా ఉంటుంది. గ్రహణ కాలంలో కూడా ఈ ఆలయం తెరచి ఉంచుతారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. గ్రహణ కాలంలో రాహు–కేతు పూజలు అధిక సంఖ్యలో జరిగాయి. 35వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శివయ్య సేవలో నెలరేడు గ్రహణానంతరం పౌర్ణమి చంద్రుడు శివయ్యను సేవిస్తున్నాడా..? అన్నట్టుగా శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద ఉన్న భక్త కన్నప్పకొండపై గల శివపార్వతుల ముందు దర్శనమిచ్చారు. భక్తులు పున్నమి చంద్రుడ్ని ఫొటోలు తీస్తూ మురిసిపోయారు. -
బ్రహ్మాండ నాయకా.. భక్తజన పాలకా!
భక్తజనం మధ్య రథోత్సవం● రమణీయం ఉగ్రనరసింహుడి రథోత్సవం ఆళ్లగడ్డ: భక్తుల గోవింద నామస్మరణలు.. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు.. డప్పుల వాయిద్యాల మధ్య శ్రీ జ్వాలా నృసింహస్వామి రథోత్సవం ఎగువ అహోబిలంలో నేత్ర పర్వంగా కొనసాగింది. అహోబిలేశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజైన సోమవారం ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీజ్వాలా నృసింహస్వామి రథోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. భక్తులు భక్తి పారవశ్యంతో రథం లాగారు. ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య పల్లకీలో కొలువుంచి దేవాలయం బయట ఉన్న రథం వరకు తోడ్కొని వచ్చారు. అప్పటికే వివిధ పుష్పాలతో నేత్రానందపర్వంగా ముస్తాబు చేసిన రథంపై అహోబిలేశుడు దేవదేవేరులతో అధిష్టించారు. పండితులు రథాంగ పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయలు సమర్పించి, హారతిచ్చి, రథోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థాన మాడ వీధుల్లో రథోత్సవం కనుల పండువగా సాగింది. ఉభయ దేవేరులతో రథంలో కొలువైన శ్రీజ్వాలా నృసింహస్వామి -
చెన్నూరు ఎద్దుల జయకేతనం
చాగలమర్రి: ఎడ్ల బండలాగుడు పోటీల్లో వైఎస్సార్ జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన గుమ్మల్ల సాయికుమార్రెడ్డి ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. పెద్దవంగలి గ్రామంలో దస్తగిరి స్వామి ఉరుసు సందర్భంగా సోమవారం ఈ పోటీలు నిర్వహించారు. పోటీలను దర్గా కమిటీ చైర్మన్ ముల్లా రబ్బానీ ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన గుమ్మల్ల సాయికుమార్రెడ్డి ఎద్దులు మొదటి స్థానంలో నిలిచి రూ.30,116 నగదును దక్కించుకున్నాయి. అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన అనంతపురం జిల్లా క్రిష్ణాపురం గ్రామానికి చెందిన సాకే పృథ్వీరాజు ఎద్దులు రూ.20,116 అందజేశారు. -
గిరిజనులకు నిత్యావసరాలు పంపిణీ
● సాక్షి కథనానికి స్పందించిన ఎన్హెచ్ఆర్సీ సభ్యులుకొత్తపల్లి: దుర్భర జీవితాన్ని గడుపుతున్న పాతమాడుగుల గూడెం చెంచు గిరిజనులకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్హెచ్ఆర్సీ) సభ్యులు సోమవారం నిత్యావసర సరుకులు అందజేశారు. గత నెల 27వ తేదీన సాక్షిలో ‘గూడెం కడుపు మాడుతోంది’ అనే శీర్షికన కథనం వెలువడింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్హెచ్ఆర్సీ) సభ్యులు విషయం తెలుసుకుని గిరిజనులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షు డు ఈదురు పద్మాకర్ సోమవారం మండలంలోని పాతమాడుగుల గూడెం సందర్శించి గిరిజనులకు నిత్యావసర సహాయం అందించారు. ఆహార పదార్థాలు, దుస్తులు, టవళ్లు, దుప్పట్లు, చిన్నపిల్లకు దుస్తులు, బ్యాగులు, తదితర అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల జీవనోపాధిని మెరుగు పర్చడమే మానవ హక్కుల పరిరక్షణలో భాగమన్నారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యుడు నారాయణరెడ్డి, జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ రోషన్న (రిటైడ్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్), ఎన్హెచ్ఆర్సీ సంస్థ సభ్యులు లేబర్ యూనియన్ లీడర్ అడివప్ప, హర్ష గీత, గంగాధర్ శెట్టి, ఎర్రమఠం పీహెచ్సీ హెల్త్ వర్కర్ శాంతమ్మ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
● పీజీఆర్ఎస్కు 103 ఫిర్యాదులు కర్నూలు: హైదరాబాద్లో నా కుమారునికి ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలు బుధవారపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూ.4 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు నంద్యాల జిల్లా పాములపాడు మండలం జూటూరు గ్రామానికి చెందిన ఉమాదేవి ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంబీఏ చదివిన తన కుమారుడు శశాంక్కు బెంగుళూరు లేదా హైదరాబాద్లో మార్కెటింగ్ జాబ్ ఇప్పిస్తానని నంద్యాలకు చెందిన చందన్ రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని ఆదోనికి చెందిన జయంతి, ఆర్అండ్బీ శాఖలో తన కుమారుడు అభిలాష్కు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.30 లక్షలు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశాడని కర్నూలు గార్గేయపురంకు చెందిన జార్జి ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 103 ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు రామకృష్ణ, శ్రీనివాస నాయక్, రమేష్, మస్తాన్ వలి తదితరులు పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. -
మల్లన్నకు శాస్త్రోక్తంగా సహస్రదీపార్చన సేవ
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా దేవాలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఆశీలు చేసి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దాసుపత్రిలో పనిచేయని లిఫ్ట్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో లిఫ్ట్ పనిచేయడం లేదు. కొన్ని రోజులుగా వైద్యులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు అంతస్తులు ఉన్న ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో చిన్నపిల్లల విభాగం, మొదటి అంతస్తులో ఎన్ఐసీయూ, చిన్నపిల్లల శస్త్రచికిత్సల విభాగం, చిన్నపిల్లల విభాగం, రెండో అంతస్తులో న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ, మూడో అంతస్తులో పలు విభాగాలు ఉన్నాయి. ఆయా విభాగాలకు వైద్యులు, వైద్య సిబ్బంది, రోగులు, వారి సహాయకులు ఈ లిఫ్ట్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే మెట్లు లేదా ర్యాంపు ద్వారా పైకి వెళ్లాల్సి ఉంటుంది. వీటిపై యువకులు, ఆరోగ్యంగా ఉండేవారు మాత్రమే వెళ్లగలరు. రోగులు, వృద్దులు, కీళ్లనొప్పులు ఉన్న వారు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లిఫ్ట్ పనిచేయకపోవడంతో పక్కనే ఉన్న గైనకాలజి విభాగం లిఫ్ట్ను తాత్కాలికంగా వాడుకుంటున్నారు. దీంతో ఈ లిఫ్ట్పై అదనపు భారం పడుతోంది. వైద్యులు, రోగులు, వైద్య సిబ్బంది పైకి వెళ్లి, కిందకు రావాలంటే చాలా సమయం పడుతోంది. ఈ సమస్యల పరిష్కారంగా వెంటనే అధికారులు చిన్నపిల్లల విభాగంలోని లిఫ్ట్ను మరమ్మతు చేయించాలని రోగులు కోరుతున్నారు. -
భక్తులకు ‘అగ్ని’ భయం
శ్రీశైలంటెంపుల్: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో ఇటీవల విస్ఫోటనం జరిగి 22 మంది మృతి చెందారు. మరికొంత మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వచ్చాయి. నిత్యం జనాభా ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదు. శ్రీశైల క్షేత్రంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. అయినా ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. పది రోజుల క్రితం దేవస్థాన కాటేజీలో ఏసీ పేలడంతో అక్కడ ఉన్న వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మరువక ముందే దేవస్థాన పరిధిలోని రెండు ప్రైవేట్ సత్రాల్లో షార్ట్సర్క్యూట్తో మంటలు చేలరేగాయి. ఈ ఘటనల్లో భక్తులకు ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పది రోజుల్లో మూడు అగ్ని ప్రమాదాలు శ్రీశైలంలో 10 రోజుల వ్యవధిలో మూడు చోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దేవస్థాన వసతి విభాగ అధికారుల నిర్లక్ష్యంతో ఫిబ్రవరి 21న వీఐపీ కాటేజీలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అబ్బూరు శ్రీనివాసరావు నిలయం కాటేజీలో ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. కాటేజీలో సేద తీరుతున్న 13 మంది భక్తులు ఒక్కసారిగా కిందకు పరుగులు తీశారు. కాటేజీలోని మొదటి అంతస్తులోని గదిలో ఏసీ పేలడంతో మంటలు చేలరేగాయి. కాటేజీలో ఉన్న భక్తులకు భయాందోళనకు గురై ఏమి చేయాలో దిక్కుతోచక ఒక్కసారిగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. అలాగే ఫిబ్రవరి 26న శ్రీశైలంలోని దేవాంగ సత్రంలో షార్ట్సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చాయి. అలాగే ఫిబ్రవరి 28న శ్రీశైలంలోని గురు సదన్లో షార్ట్సర్క్యూట్ కారణంగా ప్యానెల్ బోర్డు కాలిపోయింది. అయితే ఇవన్నీ చిన్నపాటి అగ్నిప్రమాదాలు కావడంతో భక్తులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నిర్లక్ష్యం శ్రీశైలంలో వసతి విభాగం పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సహాయ కార్యనిర్వహణాధికారిని నియమించారు. వసతి గదుల కేటాయింపు, హౌస్కీపింగ్, శానిటేషన్ తదితర పనులను పర్యవేక్షించాల్సి ఉంది. అధికారి పర్యవేక్షణ లోపంతోనే వీఐపీ కాటేజీలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్ర పరిధిలో ఉన్న ప్రైవేట్ సామాజిక సత్రాల్లో అగ్నిప్రమాదాల నివారణ బాధ్యత కూడా సదరు అధికారిపై ఉంది. అయితే ఆ అధికారి విధులపై నిర్లక్ష్యం వహించడంతో క్షేత్రంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న అరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీశైల దేవస్థాన కాటేజీల్లో, ప్రైవేట్ సత్రాలు తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికే పలు సత్రాల వారికి ఈ విషయం చెప్పాం. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దేవస్థాన సిబ్బందికి, ప్రైవేట్ సత్రాల వారికి అవగాహన కల్పిస్తాం. దేవాంగ సత్రంలో జరిగిన షార్ట్సర్క్యూట్ జరిగినా మా సిబ్బంది వెళ్లి ప్రమాదాన్ని నివారించారు. – శంకర్ప్రసాద్, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీశైలంలో తరచూ అగ్నిప్రమాదాలు దేవస్థాన కాటేజీలో, ప్రైవేట్ సత్రాల్లో మంటలు ఎక్కడా కనిపించని ఫైర్ సేఫ్టీ పరికరాలు కాటేజీలు, ప్రైవేట్ సత్రాలపై పర్యవేక్షణ మరచిన అధికారులుకనిపించని అగ్నిమాపక పరికరాలు శ్రీశైల దేవస్థానం పరిధిలోని వీఐపీ కాటేజీలలో అను నిత్యం వీఐపీలు బస చేస్తారు. అయితే ఒక్క కాటేజీలో సైతం ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని తెలుస్తోంది. న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల, వ్యాపారులు వీఐపీ కాటేజీలలో బస చేస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కాటేజీలలో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. రూ.కోటి ఖర్చు చేసి నిర్మించే కాటేజీకి డోనర్కు చెబితే రూ.10వేలతో ఫైర్సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేస్తారు కదా అని భక్తులు పేర్కొంటున్నారు. అలాగే క్షేత్ర పరిధిలోని పలు ప్రైవేట్ సత్రాల్లో కూడా ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని తెలుస్తోంది. -
రైతులకు ‘ఆటోమేషన్’ మేలు
కర్నూలు(సెంట్రల్): బిందు సేద్యంలో ఆటోమేషన్ సాంకేతికత రైతులకు ఎంతో మేలు చేస్తుందని జేసీ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆధునిక సాగు ఆటోమేషన్ పథకం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద జల్లాలోని రైతులకు సాగునీటి ఆటోమేషన్ పథకం అమలవుతుందన్నారు. ఈ పద్ధతితో రైతులు ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించుకోవచ్చన్నారు. చిన్న, సన్నకారు రైతులకు 55 శాతం, ఇతర రైతులకు 45 శాతం రాయితీ ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాలు, ఉద్యానవన శాఖ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. నమోదు చేసుకునే సమయంలో భూమి పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు తీసుకొని వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్పీడీ చిరంజీవి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య తుగ్గలి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తుగ్గలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కడమకుంట్ల గ్రామానికి చెందిన కాయల శ్రీనివాసులు(46)కు జొన్నగిరికి చెందిన సువర్ణమ్మతో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరు జొన్నగిరిలోనే నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. గిరిగెట్ల సమీపంలో ఉన్న రెండెకరాలతో పాటు మరో 6 ఎకరాలు కౌలు తీసుకుని పంటలు టమాట, ఇతర పంటలు సాగు చేశారు. వ్యవసాయ పెట్టుబడికి, కుటుంబ పోషణకు చేసిన అప్పులు రూ.8 లక్షలకు చేరుకున్నాయి. వీటిని తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై సోమవారం పొలంలో పురుగుల మందు తాగి శ్రీనివాసులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుత్తికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య సువర్ణమ్మ, కూతుళ్లు ప్రవీణ, సింధు, కుమారుడు యోక్షిత్ ఉన్నారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తుగ్గలి పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఏఎల్ఎం మృతి చాగలమర్రి: పెద్దబోధనం గ్రామంలోని విద్యుత్ సబ్–సబ్స్టేషన్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పెద్దబోధనం సబ్–సబ్స్టేషన్లో విఽధి నిర్వహణలో ఉన్న ఏఎల్ఎం ఈదుల శివప్రసాద్రెడ్డి(45) గ్రామంలో విద్యుత్ సరఫరా లోపం ఉందని, లైన్మెన్ తిరుపతయ్యతో కలిసి బైక్పై సబ్–స్టేషన్ నుంచి బయలుదేరారు. జాతీయ రహదారిపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు చాగలమర్రి వైపు నుంచి అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని ఆటో అదుపుతప్పి బైక్ను వెనుక వైపు నుంచి ఢీ కొంది. బైక్పై ఉన్న శివప్రసాద్రెడ్డి, తిరుపతయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి శివప్రసాద్రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించా రు. తిరుపతయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాలకు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. రెండు బైకులు ఢీ.. బాలుడి దుర్మరణం దేవనకొండ:కరిడికొండ గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో రంజిత్(06) మృతి చెందాడు. బండగట్టు గ్రామానికి చెందిన వీరస్వామి అనే వ్యక్తి బైకుపై తన కుమారుడితో కలిసి దేవనకొండకు వస్తున్నాడు. అలాగే రాతన గ్రామం నుంచి కర్నూలుకు వెళ్తున్న మరో బైకు కరిడికొండ స్టేజి దగ్గర ఎదురెదురుగా ఢీకొన్నాయి. బైకుపై ఉన్న బాలుడు రంజిత్ రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి తండ్రి వీరస్వామికి కాలుకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల ను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు ఢీకొని..నంద్యాల(అర్బన్): బైక్ను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటన సోమవారం నంద్యాల కొత్తపల్లె రోడ్డులోని ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద చోటు చేసుకుంది. రూరల్ సీఐ చాన్బాషా తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణం విశ్వనగర్కు చెందిన సుబ్బయ్య(42) పనినిమిత్తం ఆత్మకూరుకు వెళ్లి నంద్యాలకు తిరిగి మోటారుసైకిల్పై వస్తున్నాడు. నంద్యాల నుంచి ఆత్మకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ను ఢీకొట్టండంతో సుబ్బయ్యకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
టీడీపీ నేతల మైనింగ్ దందాకు అడ్డుకట్ట వేయాలి
కర్నూలు(సెంట్రల్): కల్లూరు మండలం బస్తిపాడులో కొందరు టీడీపీ నాయకులు కొండలు, గుట్టలను అక్రమంగా తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని, వారి దందాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్ను వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి కోరారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. అనుమతులు ఒక ప్రాంతంలో తీసుకొని పొలం చదును పేరుతో విధ్వంసం చేస్తున్నారన్నారు. గ్రావెల్ తవ్వి తీసుకెళ్తున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. రాత్రికి రాత్రే కొండలు, గుట్టలు నామరూపాలు లేకుండాపోతున్నాయన్నారు. ఫలితంగా పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇసుక అక్రమ రవాణా.. రాజ్యాంగేతర శక్తిగా ఉల్లిందకొండ ఎస్ఐ మారారని కాటసాని ఆరోపించారు. హంద్రీ వెంట ఇసుకను తీసుకెళ్లే ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీసు స్టేషన్లో ఉంచుకుంటున్నారని, అయితే అందులో వైఎస్ఆర్సీపీ నాయకుల ట్రాక్టర్లనే సీజ్ చేస్తున్నారన్నారు. టీడీపీ వారికి సంబంధించిన వాహనాలను కనీసం పట్టుకోవడంలేదన్నారు. ఫలితంగా నిజంగా ఇసుక అవసరం ఉన్న వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా సాగుతోందని, ప్రజలు ఇసుక కొనుగోలు చేసేలా ఎస్ఐ వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి 44పై ఉన్న సర్వీసు రోడ్డును కొందరు ఆక్రమించుకున్నారని, తద్వారా వాహనాలు వెళ్లడానికి ఇబ్బందిగా మారిందన్నారు. ఈ క్రమంలో రోడ్డులో వెళ్తుండడంతో అధిక స్పీడుతో వాహనాలు ప్రమాదాల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, తక్షణమే సర్వీసు రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. లక్ష్మీపురం కౌన్సిలర్ నారాయణరెడ్డి, రాజేష్, పాండు, లక్ష్మీరావు, షేక్ పాల్గొన్నారు. లేదంటే పర్యావరణానికి ముప్పు వస్తుంది ఉలిందకొండ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
కేఎంసీలో ఏఐ ఆధారిత సీబీఎంఈ ప్రాజెక్టు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ఎడ్మెడ్ ఏఐ ఆధారిత సీబీఎంఈ పైలెట్ ప్రాజెక్టును సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను వైద్యవిద్యలో సమర్ధ్దవంతంగా వినియోగిస్తూ విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కళాశాలలో ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అమలులో ఉన్న కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ విధానాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయడానికి ఈ ఏఐ ఆధారిత డిజిటల్ ఫ్లాట్ఫామ్ను ప్రవేశపెట్టా రని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పైలెట్ ప్రాజెక్టుకు కర్నూలు మెడికల్ కాలేజీ ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. వైద్య విద్యలో డిజిటల్ పరివర్తనకు ఇది ఒక ముఖ్యమైన అడుగు అని, విద్యార్థులు సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. ఎడ్ మెడ్ ఏఐ ప్లాట్ఫామ్ ప్రత్యేకతలు ఎడ్ మెడ్ ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు కింది సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 2,695 కంటే ఎక్కువ ఎన్ఎంసీ గుర్తింపు పొందిన కంపెటెన్సీల ఆధారంగా రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్స్, నీట్ పీజీ, ఐఎన్ఐ–సీఈటీ, యుఎస్ఎంఎల్ఈ వంటి జాతీయ, అంతర్జాతీయ పరీక్షలకు ప్రత్యేక ప్రిపరేషన్ మెటీరియల్, లెక్చర్ ప్లాన్లు, ప్రజెంటేషన్సు, క్లినికల్ నోట్స్, ప్రాక్టీస్ ప్రశ్నలు, అసెస్మెంట్ టూల్స్, ప్రోగ్రెస్ ట్రాకింగ్ సిస్టమ్, అధ్యాపకులకు బోధనలో సులభతరం చేసే ఏఐ ఆధారిత సహాయక విధానాలు ఈ ఫ్లాట్ఫామ్ ద్వారా విద్యార్థుల వ్యక్తిగత అభ్యాసశైలి (పర్సనలైజ్డ్ లర్నింగ్)కు అనుగుణంగా మార్గదర్శనం లభిస్తుంది.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ విజయానందబాబు, డాక్టర్ సింధియా శుభప్రద, ఏఓ నాగమణి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రెంటచింతల కంటే ఎక్కువ!
కర్నూలు(అగ్రికల్చర్): అధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాస్త ఆలస్యంగా మొదలైనప్పటికీ ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. ఇప్పటికే వేసవి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ద్వారా చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టడం లేదు. ఈ సారి కూడా రాష్ట్రంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలకు ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంగా మారింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం. చల్లదనం కనుమరుగు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. గాలిలో తేమ శాతం తగ్గే కొద్ది వేడి, వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో గాలిలో ఉదయం తేమ 90 శాతం వరకు, మధ్యాహ్నం సమయంలో 50 నుంచి 60 శాతం వరకు ఉంది. మార్చి మొదటి వారంలో ఉదయం పూట తేమ 50 శాతం వరకు, మధ్యాహ్న సమయంలో 15–20 శాతానికి పడిపోతోంది. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు వడగాల్పులు పెరుగుతున్నాయి. ఏప్రిల్లో ఉదయం పూట తేమ 40 శాతంలోపునకు, మధ్యాహ్నం సమయంలో 10 శాతానికి గాలిలో తేమ పడిపోయే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో వేసవి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం ఏర్పడింది. కనిపించని పచ్చదనం జిల్లా మొత్తం విస్తీర్ణంలో అడవులు 33 శాతం వరకు ఉండాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 నుంచి 16 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. అడవులు తరిగిపోతుండటానికి తోడు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇది కూడా ఎండల తీవ్రత పెరగడానికి కారణమవుతోంది. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుండటంతో భూమిలో నీటి నిల్వలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. గతేడాది అక్టోబరు నుంచి వర్షాలు లేవు. ఇందువల్ల భూమిలో తేమ లేకపోవడంతో ఎండల తీవ్రతకు నేలకు పగుళ్లు ఏర్పడి వాటి నుంచి వేడి సెగలు పుట్టుకొస్తున్నాయి. అప్పుడే వడగాడ్పులు వాహనాల సంఖ్య పెరగడంతో వాయు కాలుష్యం ఏర్పడుతోంది. కార్బన్ డైఅక్సైడ్ గాలిలో చేరుతుండటంతో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే వేడి గాలులు వీయడం ప్రారంభిస్తాయి. ప్రస్తుతం 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అప్పుడే వడగాడ్పులు మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత ఉంటోంది. ఉపశమనం లేనట్లే! వేసవి తీవ్రత పెరుగుతున్నా ఉపశమన చర్యలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. గతేడాది వేసవి ఉపశమన చర్యలు కనిపించలేదు. ఈ సారి కూడా అధిక ఉష్ణోగ్రతలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకునే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పంటలు ఎండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మూగజీవులకు నీరు అందుబాటులో ఉంచాలని వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అయితే ఈ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. గత ఏడాది వేసవితో పోలిస్తే ఈ వేసవిలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సారి ప్రధానంగా ఎల్నినో ప్రభావం ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో 45–46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంటలు ఎండకుండా నీటితడులు ఇచ్చుకోవాలి. మూగజీవులకు నీరు అందుబాటులో ఉంచాలి. వడదెబ్బకు గురి కాకుండా అన్ని వర్గాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – నారాయణ స్వామి, ప్రధానశాస్త్రవేత్త, వ్యవసాయ వాతావరణ విభాగం, అనంతపురంఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 2025లో 46 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇవే దేశంలోనే ఇదే అత్యధిక ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రెంటచింతలలో నమోదు అవుతాయి. రెంటచింతల కంటే కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువ నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాలుష్యం బెడద ఎక్కువగా ఉంది. కాలుష్యం పెరిగే కొద్ది ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. రానున్న ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉపాధి కూలీలకు ఎండదెబ్బ ఉపాధి పనులకు జనవరి నుంచి మే నెల వరకు సీజన్ వంటిది. ఉమ్మడి జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దాదాపు 3 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యే అవకాశం ఉంది. వేసవి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఉపాధి పనులు జరిగే ప్రాంతంలో నీడ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంది. గతేడాది ఉపాధి కూలీల గురించి పట్టించుకోక పోవడంతో వడదెబ్బకు గురై దాదాపు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది మృతి చెందారు. వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. -
వైభవంగా పదహారు రోజుల పండుగ
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం మహానందిలో శనివారం పదహారు రోజుల పండుగను వైభవంగా నిర్వహించారు. ఏఈఓ ఎరమల మధు ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, పండితులు, అర్చకులు యాగశాలలో అంకురాలకు విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవాల తొలిరోజు పుట్టమన్ను తెచ్చి పాలల్లో తడిపిన ధాన్యములతో చేసిన అంకురార్పణ అనంతరం వచ్చిన మొలకలను రుద్రగుండం కోనేరులో శాసీ్త్రయంగా కలిపారు. అనంతరం రథం వద్దకు చేరుకుని రథాంగ దేవతలను పూజించి వారిని స్వస్థానాలకు పంపి రథాన్ని రథమండపంలోకి చేర్చారు. పలు ప్రాంతాల భక్తులు ఓం నమఃశివాయ అంటూ భక్తిశ్రద్ధలతో రథాన్ని మండపంలోకి లాగారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, ఆలయ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అంకురాలకు మొలకలు బాగా వచ్చాయని, ఈ ఏడాది పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని వేదపండితులు తెలిపారు. -
ఐసీడీఎస్లో కర్నూలు జిల్లాకు చివరి స్థానం
కర్నూలు(సెంట్రల్): ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవలు) సూచికల్లో కర్నూలు జిల్లా చివరి స్థానాల్లో ఉండడం ఆందోళనకరమని ఐసీడీఎస్ డైరక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో బాల్య వివాహ ముక్త భారత్ రథాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరితో కలసి సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని సీడీపీఓలు, సూపర్వైజర్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ..జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీలను పూర్తిగా అరికట్టేందుకు సమగ్ర కార్యచరణను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ రోహిణి, పీడీ విజయ పాల్గొన్నారు. డీసీఓగా బాధ్యతలు స్వీకరించిన శిరీష కర్నూలు (అగ్రికల్చర్): జిల్లా సహకార అధికారిగా శిరీష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆదోని డివిజినల్ సహకార అధికారిగా పనిచేస్తున్న ఈమెను పూర్తి అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లతో జిల్లా సహకార అధికారిగా నియమించారు. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించిన శిరీష విలేకరులతో మాట్లాడుతూ సహకార సంఘాల పటిష్టతకు కృషి చేయడంతో పాటు సహకార చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. హోంగార్డులకు వెల్ఫేర్ చెక్కులు పంపిణీ కర్నూలు: హోంగార్డ్స్ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరైన రూ.60 వేల చెక్కులను ఏడుగురు హోంగార్డులకు హోంగార్డు సదరన్ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్ సోమవారం తన కార్యాలయంలో అందజేశారు. ఇద్దరు హోంగార్డులకు మ్యారేజ్ గ్రాంట్ కింద ఒక్కొక్కరికి రూ.5 వేలు, ఐదుగురు హోంగార్డులకు మెడికల్ గ్రాంట్ కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మంజూరయ్యాయన్నారు. హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ మాధవిరాణి, హోంగార్డ్స్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. హంద్రీనీవా ఎస్ఈగా జి.రాజన్ బాబు కర్నూలు(సిటీ): హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్–1 పర్యవేక్షక ఇంజనీర్గా గిరిపోగు రాజన్ బాబు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. హంద్రీనీవా ఎస్ఈగా పనిచేస్తున్న పి.పాండురంగయ్య గత నెల 28న పదవీ విరమణ పొందారు. ఆ స్థానంలో హంద్రీనీవా డివిజన్–1 ఈఈగా పనిచేస్తున్న రాజన్ బాబుకు ఎస్ఈ బాధ్యతలను అప్పగిస్తూ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలాఉంటే తుంగభద్ర దిగువ కాలువ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జి.శైలేశ్వర్ను నియమించారు. ఈయన ప్రస్తుతం హిందూపురం ఐబీ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. -
వినియోగదారులకు మెరుగైన సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జవాబుదారీతనంతో పని చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి వచ్చే కాల్స్ పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని, అప్పుడే సమస్యలను సత్వరం పరిష్కరించే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయ బాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ జాగ్రత్తలు అవసరం..
● అధిక ఉష్ణోగ్రతల(హీట్వేవ్)తో డీహైడ్రేషన్(శరీరంలో నీటి కొరత) ఏర్పడే ప్రమాదం ఉంది. ● తలనొప్పి, వాంతులు, బీపీ సమస్యలు పెరుగుతాయి. ● ఎండల్లో బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు తిరగరాదు. ● మధ్యాహ్నం 12 నుంచి సాయం6తం 4 గంటల మధ్య బయటికి వెళ్లకపోవడం మంచిది. ● ఈ సమయంలో శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు. ● రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. ● కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, కొబ్బరి నీళ్లు వీలైనంత వరకు ఎక్కువగా తీసుకోవాలి. ● వేసవిలో తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది. ● ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు గొడుగు తీసుకెళ్లాలి. కనీసం తలను టోపీ, టువాలతో కప్పుకోవాలి. -
మిరప రైతులను ‘నల్లి’పేసింది!
● తెగుళ్లతో మిరప రైతు కుదేలు ● స్పందించని చంద్రబాబు ప్రభుత్వం నందవరం: నల్లి.. మిరప రైతును నట్టేట నలిపేసింది. రైతు కంట్లో కారం కొట్టి కోలుకోలేని దెబ్బ తీసింది. పైర్లను పిప్పి జేసి తీరని నష్టాన్ని మిగిల్చింది. చేతికి పంట రాకుండా రైతన్న ఆశలను శిథిలం చేసింది. ఎన్ని మందులు కొట్టినా మాయదారి నల్లి(తామర కీటకం) మాత్రం చావలేదు. రైతన్నలను పీల్చి పిప్పిజేసేసి కన్నీళ్లు పెట్టించింది. నల్లితో నట్టేట మునిగినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. అరకొర దిగుబడులను అమ్ముకుందామన్నా ధరలు లేక రైతులకు నష్టాలు వచ్చాయి. 5 వేల ఎకరాల్లో మిరప ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 5,010 ఎకరాల్లో మిరప సాగైంది. తేజ (సన్న సైజు), డీలక్స్ రకాలు సాగు చేస్తున్నారు. మిరప సాగు ఖర్చు అధికంగా ఉండడంతో ఈ ఏడాది 5,010 వేల ఎకరాల్లో మిరప సాగైంది. నందవరం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల్లో మిరప వేశారు. తామర, నల్లి, జెమిని తదితర తెగుళ్లతో మిరప పంటలు తీవ్రంగా దెబ్బతీన్నాయి. ఓ పక్క తెగుళ్లు..మరో పక్క అధిక వర్షాలతో మొదటిలోనే మిరప పంటలు తీవ్రంగా నాశమయాయి. దిగుబడులు భారీగా తగ్గడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నల్ల తామర బెడద నల్లతామర మిరప రైతులను పీడిస్తూనే ఉంది. పూతంతా నేలరాలిపోతుంది. ఒకవేళ అరకొర పూత మిగిలినా కాయ సైజు మజ్జుగా మారిపోతుంది. కారణంగా దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. ఆరోగ్యకర పైరు ఉంటే ఎకరాకు 50 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. ఈ నల్లతామర సోకి ఎకరాకు 4–5 క్వింటాల్ మించి పంట రాదు. ఈసారి తామర ప్రభావం మరింతగా పెరిగింది. ఇప్పటికే 60 శాతం పైర్లన్నీ పాడుబోయాయి. కొందరు రైతులు పంటను వదిలేసుకున్నారు. చోద్యం చూస్తూ.. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం రూ.60 వేలకు మించి చేతికందలేదని వేలాది మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎరువుల ధర బస్తాపై రూ.100–200 పెంచడంతో పెట్టుబడి భారం మరింతగా పెరిగిపోయింది. రైతులు ఎంతగానో అల్లాడి పోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు. రైతులను గట్టెక్కించే చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తోంది. ఒక ఎకరాలో దేవనూర్ డీలక్స్ రకం మిరప వేశాను. పంట ఎదుగుతున్న తరుణంలో నల్లతామర సోకింది. ఇప్పటి వరకు రూ.1.20 లక్షలు ఖర్చు చేశాను. నల్లి కారణంగా ఎకరాకుగానూ 2 క్వింటాళ్ల వరకు రావొచ్చు. – పెద్ద నాగేంద్ర, జొహరాపురం ఈ మధ్య నల్లతామర ప్రభావం పెరిగిపోయింది . దీనిని పూర్తిగా సంహరించడం అసాధ్యం. తామరను నుంచి పంటల రక్షించుకోవడానికి పైరు చుట్టూరా బార్డర్ క్రాప్ వేసుకోవాలి. నల్లి కారణంగా పంటలు దిగుబడులు దాదాపు తగ్గిపోయాయి. – శ్రీవాణి, వ్యవసాయాధికారిణి, నందవరం -
మహిళా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం
కర్నూలు: అంతర్జాతీయ మహిళ దినోత్సవం మార్చి 8ని పురస్కరించుకొని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం కొండారెడ్డిబురుజు వద్ద అడిషనల్ ఎస్పీ హుసేన్పీరా జెండా ఊపీ ర్యాలీని ప్రారంభించారు. మహిళలు, విద్యార్థులు, చిన్నారులు సాధికారిత కల్పించే ఉద్దేశంతో మహిళ పోలీసు విభాగం ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కొండారెడ్డి బురుజు నుంచి ప్రారంభమైన ర్యాలీ కోల్స్ కళాశాల మీదుగా పాత కంట్రోల్ రూము వరకు, అక్కడి నుంచి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వరకు సాగింది. ఒంటరిగా ప్రయాణిస్తున్నారా...శక్తి యాప్ ఉపయోగించండి అనే నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని వివిధ కళాశాలల విద్యార్థులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలతో పాటు పెయింటింగ్, డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, హెల్త్ క్యాంపులు, ఓపెన్ హౌస్, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్యాండ్షోలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేస్తామని ఏఎస్పీ తెలిపారు. ఏఆర్ ఆడిషినల్ ఎస్పీ కృష్ణమోహన్, సీఐలు రామయ్యనాయుడు, విజయలక్ష్మి, పార్థసారథి, నాగరాజరావు, మన్సూరుద్దీన్, ఆర్ఐలు నారాయణ, జావీద్, ఆర్ఎస్ఐలు శక్తిటీమ్ మహిళా పో లీసులు, సచివాలయ పోలీసులు, శ్రీలక్ష్మి, చైతన్య, కేవీఆర్ కళాశాల, సిరాక్ స్కూల్ విద్యార్థుఽలు ర్యాలీలో పాల్గొన్నారు. -
‘అలగనూరు’ పనులను పూర్తి చేయండి
అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్పై ఆదివారం సీపీఐ, ఏపీ రైతు సంఘం నేతలు జిల్లా పరిషత్లోకి దూసుకువచ్చారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న దృష్ట్యా తమ డిమాండ్ను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని వారు జెడ్పీ గేట్లు దాటుకొని వచ్చి సమావేశం భవనం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు బైఠాయించారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతుల కోసం రూ.33 కోట్లను విడుదల చేసి పనులు పూర్తి చేస్తామని జెడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ అవే తప్పులు ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రామాంజనేయులు, నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ.. నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూరు మండలంలో తుంగభద్ర జలాశయం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టు నీరుకు 1985లో 2.5 టీఎంసీల సామర్థ్యంతో 1999లో పనులు ప్రారంభించి 2002లో పూర్తి చేశారన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2017లో అధిక వర్షాలతో గండి పడిందన్నారు. అప్పట్లో రూ.3 కోట్లు ఖర్చు చేసి ఉంటే పనులు పూర్తి అయ్యేవన్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నాడు చేసిన తప్పులనే మళ్లీ చేస్తోందన్నారు. ఫలితంగా అలగనూరు రిజర్వాయర్ ద్వారా వచ్చే నీటిని కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు వినియోగించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోని మంత్రులు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సీపీఐ నాయకులు ఆరోపించారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు నిధులను విడుదల చేసి వెంటనే పనులను పూర్తి చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫకృద్దీన్, నగర కార్యదర్శి రామక్రిష్ణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్బాబు, నాయకులు రఘురాం, భార్గవ, మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రావణి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసులు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల సుబ్బారెడ్డి, జీ సోమన్న, జిల్లా సమితి సభ్యులు డీ శ్రీనివాసులు, నందికొట్కూరు శ్రీనివాసులు, నరసింహులు, నారాయణ, ప్రతాప్ పాల్గొన్నారు. -
ఏపీ జేఏసీ జిల్లా కార్యవర్గం ఎన్నిక
● చైర్మన్గా జవహార్లాల్, ప్రధాన కార్యదర్శిగా ఇస్మాయిల్కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి( ఏపీ జేఏసీ) కర్నూలు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటైంది. జేఏసీ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా యూనిట్గా ఉంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త జిల్లాల వారీగా ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్లు ఏర్పాటు అయ్యాయి. ఇందుకు అనుగుణంగా జేఏసీలు కూడా ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ మేరకు ఆదివారం కర్నూలులోని ఎన్జీఓ హోమ్లో జిల్లా జేఏసీ నూతన కమిటీ ఏర్పాటైంది. దాదాపు 76 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలతో పాటు వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్గా ఏపీ ఎన్జీజీవోస్ జిల్లా శాఖ అధ్యక్షుడు వి.జవహార్లాల్ ఎన్నికయ్యారు. జేఏసీ ప్రధాన సెక్రటరీగా ఎస్.ఇస్మాయిల్ (ఏపీటీఎఫ్–1938 జిల్లా అధ్యక్షుడు), కో–చైర్మన్లుగా ఎంసీ కాశన్న (ఎన్జీజీవోస్ అసోసియేషన్), పీఎండీ ఇస్మాయిల్ (ఆర్టీజీ ఎన్ఎంయూ), సుంకన్న(ఎస్టీయూ), వెంకటేశ్వర్లు (పశుసంవర్ధకశాఖ), వైస్ చైర్మన్లుగా కృష్ణారెడ్డి, లింగన్న, చాంద్బాషా, నాగకిశోర్, మధుసూదన్రెడ్డి, నవీన్పాటిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాంబశివారెడ్డి, కోశాధికారిగా భాస్కరనాయుడు ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా వివిధ సంఘాల నుంచి 10 మంది, ఈసీ మెంబర్లుగా వివిధ సంఘాల నుంచి 15 మంది ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జవహార్లాల్ మాట్లాడుతూ.. సంఘటితంగా పోరాటాలు చేసేందుకు జేఏసీ అవసరం ఎంతో ఉందని తెలిపారు. జేఏసీ ద్వారా అన్ని సంఘాల సమన్వయంతో ఉద్యమాలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల హక్కులు, డిమాండ్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. నూతన జేఏసీ కార్యవర్గ సభ్యులను వివిధ సంఘాల నేతలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. -
అట్టహాసంగా ‘గురురాజా’ వార్షికోత్సవం
గోస్పాడు: గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. మండలంలోని బాబానగర్ గ్రామంలో ఉన్న ఈస్కూల్లో ఆదివారం నిర్వహించిన వార్షికోత్సవానికి స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి 24వ వార్షికోత్సవ వార్షిక సంచికను ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల ఉన్నత శిఖరాలను అధిరోహించేలా బోధన సాగిస్తున్న గురురాజా పాఠశాల యాజమాన్యాన్ని మంత్రి ఫరూక్ అభినందించారు. గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ 2002 సంవత్సరంలో 120 మంది విద్యార్థులతో ప్రారంభమైన గురు రాజా ఇంగ్లిష్ మీడియం స్కూల్ నేడు 24వ వార్షికోత్సవం జరుపుకుంటుందంటే ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు విద్యాబోధన సాగిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాలలోనీ గురరాజా ఇంగ్లిష్ మీడియం పాఠశాల రాష్ట్రస్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు పొందిందని చెప్పారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యా సంస్థ డైరెక్టర్లు పి. మౌలాలి రెడ్డి, షేక్షావలి రెడ్డి, అతిథులను సత్కరించారు. టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, మౌలాలి రెడ్డి. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు అధిష్టింపజేసి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థానానికి రూ.3 లక్షల విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు దాతలు రూ.3 లక్షల విరాళాలను ఆదివారం అందించారు. అన్నప్రసాద వితరణ పథకానికి గుంటూరుకు చెందిన పి.రాజేశ్వరరావు రూ.1,01,116 విరాళాన్ని ఈఓ ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన ఎం.అవినాష్ గో సంరక్షణ నిధి పథకానికి రూ.లక్ష, ప్రాణదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. యువకుడి ఆత్మహత్య ఆదోని అర్బన్: మండలంలోని కడితోట గ్రామానికి చెందిన రామకృష్ణ, ఈరమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్(21) కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ తెలిపిన వివరాలు.. శ్రీకాంత్ రోజు వారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత ఏడేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతుండేవాడు. ఆదివారం కడుపునొప్పి రావడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిగేలా విలపించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కోవెలకుంట్ల: స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ అద్దె బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. బస్టాండ్లో నుంచి నంద్యాలకు బయలు దేరిన ఆర్టీసీ అద్దె బస్సు బస్టాండ్ ఔట్ గేటు నుంచి బయటకు వస్తుండగా ముదిగేడు రహదారి వైపు నుంచి బస్టాండ్ వైపు టిప్పర్ వెళ్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో రెండు వాహనాలు స్వల్పంగా డ్యామేజ్ కావడంతో ఇరువురు డ్రైవర్లు వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. -
గురు రాఘవేంద్రయా.. పాహిమాం!
మంత్రాలయం: ‘గురు రాఘవేంద్రాయా.. పాహిమాం’ అంటూ భక్తులు శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు నైవేద్యం సమర్పించారు. బంగారు కవచధారణలోని శ్రీరాఘవేంద్ర మూల బృందావనాన్ని భక్తులు దర్శనం చేసుకోని మొక్కులు తీర్చుకున్నారు. పరిమళ ప్రసాదం కౌంటర్లలో, అన్నపూర్ణ భోజశాల దగ్గర భక్తులు రద్దీ కొనసాగింది. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు విహరించారు. వైభవంగా నవరత్న రథోత్సవం భక్తుల మధ్య అంగరంగ వైభవంగా శ్రీ మఠం ప్రాంగణంలో నవరత్న రథోత్సవంపై ప్రహ్లాదరాయలను ఊరేగించారు. అనంతరం ఊంజల మండపంలో ఊంజలసేవ నిర్వహించారు. -
తప్పు చేసినా.. మనవాడైతే ఓకే!
శ్రీశైలంటెంపుల్: భక్తులకు సేవలు అందించాల్సిన ఉద్యోగులు ఎంత పెద్ద తప్పు చేసినా, మోసం చేసినా టీడీపీకి అనుకూలంగా ఉంటే ఓకే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. భక్తుల నుంచి ఫిర్యాదు రాలేదనే సాకుతో తప్పు చేసిన వ్యక్తికే తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ ఇప్పిస్తున్నారు. టీడీపీకి సంబంధం లేని వ్యక్తులు ఎటువంటి తప్పు ఏయకపోయినా, భక్తుల నుంచి ఫిర్యాదు లేకపోయినా వారిని విధుల నుంచి తొలగిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా మానసికంగా హింసిస్తూ..రాజకీయ కక్ష సాధిస్తున్నారన్న అరోపణలు వినిపిస్తున్నాయి. రీ–పోస్టింగ్ గత సంవత్సరం డిసెంబరు 24న ఉత్తరాఖాండ్కు చెందిన హిందీ భక్తులు కుటుంబ సమేతంగా శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చారు. వసతి కోసం మల్లికార్జున సదన్లోని డార్మెంటరీలో ఏడు బెడ్లు తీసుకున్నారు. డార్మెంటరీలో ఒక రోజుకు ఒక బెడ్ రుసుం రూ.250 చెల్లించాలి. ఈ లెక్కన వారి వద్ద నుంచి రూ.1750తీసుకోవాలి. అలాగే అడ్వాన్స్ సైతం తీసుకోవాలి. వారికి బిల్లు ఇవ్వాలి. అయితే ఆ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పి.ఉదయ్కుమార్ వారి వద్ద నుంచి రూ.2వేలు తీసుకుని, బిల్లు ఇవ్వకుండా, ఆ డబ్బును తన జేబులోకి వేసుకున్న వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పంధించిన దేవస్థాన అధికారులు విచారణ జరిపి కౌంటర్ విధులు నిర్వహిస్తున్న పి.ఉదయ్కుమార్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తప్పు చేశాడని ధృవీకరించుకుని అతనిని విధుల నుంచి తప్పించారు. అయితే సదరు ఉద్యోగి నియోజకవర్గ స్థాయి రాజకీయ నేతకు సన్నిహితంగా ఉండడంతో..రాజకీయ నేత మనవాడికి పోస్టింగ్ ఇచ్చేయండని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆగమేఘాల మీద దేవస్థాన అధికారులు, సంబంధిత విభాగపు అధికారి ఔట్సోర్సింగ్ ఉద్యోగి తప్పు చేయలేదన్నట్లు ఫైల్ రాయడంతో, దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి పేరుతో రీ పోస్టింగ్కు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఆదివారం సదరు ఉద్యోగి తిరిగి అదే స్థానంలో ఉద్యోగంలో చేరారు. సదరు ఉద్యోగి తప్పు చేయకపోతే మూడు నెలల పాటు ఎందుకు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు, ఉద్యోగి భక్తుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేయకపోతే అప్పటి సీసీ ఫుటేజ్ను బహిర్గంతం చేయవచ్చు కదా! భక్తులను, దేవస్థానాన్ని మోసం చేసిన వ్యక్తిని కేవలం భక్తుల నుంచి ఫిర్యాదు లేదనే సాకును చూపి అతనికి రీ–పోస్టింగ్ ఇచ్చేశారు. పోస్టింగ్ ఇవ్వకుండా.. గత సంవత్సరం జనవరి నెలలో శ్రీశైల దేవస్థాన టోల్గేట్లో అకస్మిక తనిఖీలు నిర్వహించగా సిబ్బంది వద్ద ఉండాల్సిన డబ్బు కంటే అదనపు డబ్బును అధికారులు గుర్తించారు. దేవస్థాన అధికారులు విచారణ జరిపి టోల్గేట్లో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగి ఎం.రామకృష్ణుడు(హెల్పర్), కాంట్రాక్ట్ లేబర్లు బి.నాగపరమేశ్వరుడు, జి.మల్లికార్జునరెడ్డి, ఎన్.గోవిందు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బి.మల్లికార్జునరెడ్డి, బీ.ఆర్.మల్లేశ్వర్రెడ్డి, జి.శ్రీనివాసులు, డైలీ వేజ్ సిబ్బంది కె.కె.రాజు లను విధుల నుంచి నిలుపుదల చేశారు. వీరిలో ఎం.రామకృష్ణుడుకి పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారందరికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇందులో ఇద్దరు ఉద్యోగులు సైతం తాము ఏ తప్పు చేయలేదని కోర్టు మెట్లెక్కారు. కమిషనర్, కోర్టు కూడా వీరిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పిన ఇంత వరకు విధుల్లోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఉద్యోగులు తప్పులు చేసిన వారికి ఒకలా, ఇతరులకు మరోలా దేవస్థాన అధికారులు వ్యవహరిస్తున్నారు. టోల్గేట్ వ్యవహరంలోనూ భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని సమాచారం. భక్తుల నుంచి ఫిర్యాదు లేకపోతే సిబ్బందికి పోస్టింగ్ ఇవ్వోచ్చు కదా. కేవలం రాజకీయ కక్షతో వీరిని ఇబ్బందులకు గరిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీశైల దేవస్థానంలో తప్పుచేసిన వ్యక్తికి వత్తాసు తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ టోల్గేట్ సిబ్బంది తొలగింపు సంవత్సరం అయినా పోస్టింగ్ ఇవ్వని వైనంరాజకీయ కక్ష తీర్చుకునేందుకు శ్రీశైల దేవస్థానాన్ని రాజకీయ కక్ష సాధింపులకు, వేధింపులకు వేదికగా చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంటుందనే అరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత లేకపోయిన టీడీపీ నాయకుల అనుచరులకు కీలకమైన పోస్టింగులు ఇవ్వడంతోపాటు అనుకూలమైన వారికి దేవస్థానంలో ఆదాయం వచ్చే స్థానాల్లోకి బదిలీ చేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగుల అంతర్గత బదిలీ చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఉన్నప్పటికి వాటిని పాటించడం లేదు. అంతేకాకుండా చిన్న పాటి ఉద్యోగులను సైతం ఎన్నికల్లో ప్రచారానికి తిరిగారని వారికి పోస్టింగులు ఇవ్వకుండా సంవత్సరం పాటు వేధింపులకు గురి చేశారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయని ఉద్యోగులను బదిలీలు, వారిపై విధుల పట్ల అలసత్వం పేరుతో రాజకీయ కక్ష సాధింపులు, వేధింపులకు గురిచేస్తున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. -
అంగన్వాడీ వర్కర్ల, హెల్పర్ల అక్రమ అరెస్టులు
● ‘చలో విజయవాడ’ వద్దంటూ పోలీసుల ఆదేశాలు ● ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐటీయూ నాయకులు కర్నూలు(సెంట్రల్): విజయవాడలో మార్చి 2వ తేదీన చేపట్టే మహాధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొనకుండా పోలీసులు ఎక్కడిక్కడే అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం విజయవాడ వెళ్తున్న వారిని డోన్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. విజయవాడకు వెళ్లడానికి వీలులేదని పోలీసులు చెప్పడంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకు అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో ముందుగా ఇచ్చిన పిలుపుమేరకు మార్చి 2 వతేదీన చలో విజయవాడకు బయలు దేరి వెళ్తుండడంతో పోలీసులు వారిని వెళ్లనీయకుండా ఎక్కడిక్కడే అరెస్టు చేస్తుండడంపై సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ రాధాకృష్ణ, ఎండీ అంజిబాబు, అంగన్వాడీ ఎంప్లాయీస్ అండ్ హెల్పర్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు పి.నిర్మలమ్మ ఖండించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్కార్డుల అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెండింగ్లో ఉన్న 1810 మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. -
సర్కారు నిర్లక్ష్యం..రైతుకు నష్టం!
కర్నూలు సిటీ: తుంగభద్ర జలాల్లో జిల్లా ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా డ్యా గేట్ల మార్పునకు దిగువ కాలువ నీటి విడుదలకు ఎలాంటి సంబఽంధమే లేదు. అయినప్పటికి గేట్ల మార్పు పేరుతో డ్యాంలో ఉన్న నీటిని వృథాగా దిగువకు వదిలేశారు. ఫలితంగా ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 1.5 లక్షల ఎకరాల పంటల సాగును రైతన్నలు కోల్పోవాల్సి వచ్చింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా వర్షాలు రావడంతో తుంగభద్ర డ్యాంలో ఇన్ఫ్లో మొదలైంది. సీజన్ ప్రారంభం నాటికే డ్యాంలో నీటి నిల్వలు ఆశాజనకంగా చేరాయి. 2025–26 నీటి సంవత్సరంలో 415.16 టీఎంసీల నీరు డ్యాంలో చేరింది. 2024 ఆగస్టులో టీబీ డ్యాం గేటు కొట్టుకుపోవడం..ఆ తరువాత గేట్ల నిపుణులతో సలహాతో మొత్తం గేట్లు మార్చేందుకు నిర్ణయం తీసుకొని టెండర్లు సైతం ఖరారు చేశారు. నీటి నిల్వను 105.79 టీఎంసీల నుంచి 80 టీఎంసీల తగ్గించారు. డిసెంబరు నెలలో కూడా 80 టీఎంసీల నీరు ఉన్నప్పటికి గేట్ల పనుల సాకుతో డ్యాం నుంచి వృథాగా దిగువకు నీటిని విడుదల చేసి క్రస్ట్ లెవెల్ 1613 అడుగులకు నీటి మట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నీటి మట్టాన్ని చూపి రబీకి నీరు ఇవ్వలేమని ఈ ఏడాది జనవరి 15 వరకు నీటిని విడుదల చేసి బంద్ చేశారు. గేట్ల మార్పునకు ఎల్ఎల్సీకి నీటి సరఫరా నిలిపివేతకు ఎలాంటి సంబఽంధం లేదు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే దీనిపై చంద్రబాబు సర్కారు స్పందించకపోవడం లోలెవన్ కెనాల్లో మిగిలిపోయిన ఆధునికీకరణ పనులు చేసి బిల్లులు చేసుకునేందుకేనని ఇంజినీరింగ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. దిగువ రైతుకు మొండిచేయి తుంగభద్ర దిగువ కాలువ కింద జిల్లాలో ఖరీఫ్, రబీలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో లక్ష ఎకరాలకు పైగా నీరు ఇవ్వాల్సి ఉంది. గతేడాది టీబీడ్యాం గేట్లు మార్చేందుకు ఖరీఫ్లో మాత్రమే సాగుకు నీరిస్తామని, రబీలో నీరివ్వమని టీబీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం రబీ ఆయకట్టుకు నీరు అవసరం లేదని ఇండెంట్ ఇవ్వలేదు. దీన్ని సాకు చూపించి ఏపీ ప్రభుత్వం కూడా ఎల్ఎల్సీ, కేసీ వాటా నీటికి ఇండెంట్ పెట్టకపోవడం గమనార్హం. టీబీ డ్యాంలో ఎల్ఎల్సీకి 4.7, కేసీకి 4.6 టీఎంసీల వాటాకు ఇండెంట్ పెట్టి ఉన్నట్లైతే ఆరుతడి పంటలైన పండించుకునేందుకు అవకాశం ఉండేది. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన 9.3 టీఎంసీల తుంగభద్ర జలాలను ఆయకట్టుదారులు కోల్పోయారు. ఫలితంగా 1.5 లక్షల ఎకరాలకుపైగా సాగును కోల్పోయి దాదాపు రూ.500 కోట్లకుపైగా ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో పాటు ఎల్ఎల్సీ ఆధారిత, తుంగభద్ర నది తీరంలోని గ్రామాలు, తీరంలోని తాగు నీటి పథకాలకు నీరందని పరిస్థితులు రావడంతో వేసవిలో తాగు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం గేట్ల మార్చేందుకు క్రస్ట్ లెవెల్ 1,613 అడుగులకు నీటి మట్టాన్ని తగ్గించేందుకు డిసెంబరు నెలలో నీటిని దిగువకు విడుదల చేశాం. క్రస్ట్ లెవెల్లో కూడా 43 టీఎంసీల నీరు ఉంటుంది. ఈ నీటిలోనే జనవరి 15 వరకు ఎల్ఎల్సీకి తాగు నీటి ట్యాంకులు నింపుకునేందుకు నీరు ఇచ్చాం. రబీలో సాగు నీరు వద్దని కర్ణాటక ప్రభుత్వం ఇండెంట్ పెట్టకపోవడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఇండెంట్ పెట్టలేదు. ఎల్ఎల్సీ ఆధునీకీకరణ పెండింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – నారాయణ నాయక్, టీబీ డ్యాం ఎస్ఈ డ్యామ్ గేట్ల మార్పు పేరుతో రబీకి నీరు ఇవ్వలేమని ప్రకటించిన టీబీ బోర్డు అవకాశం ఉన్నా ఏపీ వాటాకు ఇండెంట్ ఇవ్వని చంద్రబాబు సర్కారు బిల్లులు చేసుకునేందుకు ఇలా వ్యవహరించిందనే విమర్శలు రబీ ఆయకట్టును కోల్పోయిన రైతులు ప్రస్తుతం డ్యాంలో 23 టీఎంసీల నీటి నిల్వలు ఎల్ఎల్సీ, తుంగభద్ర నది తీర ఆధారిత తాగు నీటి పథకాలకు పొంచి ఉన్న ముప్పు -
ఎంచక్కా.. ఎద్దుల బండిలో..
పల్లెటూరి జీవనశైలిని ప్రతిబింబించే చిత్రమిది. ప్రస్తుత యాంత్రిక యుగంలో ఎద్దుల బండ్లు కనుమరుగై పోయాయి. వ్యవసాయం చేసే రైతులు సైతం యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆదివారం కొలిమిగుండ్ల మండలంలోని తోళ్లమడుగుకు చెందిన ఓ రైతు ఎద్దుల బండిలో కుటుంబ సభ్యులతో కోర్నపల్లె సమీపంలోని పట్టాభిరామాలయంలో విగ్రహాల ప్రతిష్టకు వెళ్తూ కనిపించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు వాహనాల్లో వెళుతూ ఎద్దుల బండిలో వెళ్తున్న మహిళలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. – కొలిమిగుండ్ల -
రైతులకు మేలు చేసే అవకాశం దక్కింది
కర్నూలు సిటీ: జలవనరుల శాఖలో విధులు నిర్వర్తిస్తూ రైతులకు మేలు చేసే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని ఉద్యోగ విరమణ పొందిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్–1 ఎస్ఈ పి.పాండురంగయ్య అన్నారు. శనివారం బీక్యాంపులోని ఓ ఫంక్షన్హాలులో హంద్రీనీవా ఇంజినీర్లు రిటైర్డ్ ఈఈ విశ్వనాథ్ అధ్యక్షతన పాండురంగయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ఇంచార్జీ సీఈ ఎస్.కబీర్ బాషా, రిటైర్డ్ సీఈలు చిట్టిబాబు, నాగరాజు, మురళీనాథ్ రెడ్డి, ఎస్ఈలు బాలచంద్రారెడ్డి, ప్రతాప్, శుభకుమార్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఎస్ఈ పార్థసారథిలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత పి.పాండురంగయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ కుటుంబం వచ్చిన తనకు సాగునీటి కష్టాలు తెలుసునన్నారు. తమకు గురువు ఎ.సుబ్బారెడ్డి అని గుర్తు చేశారు. హంద్రీనీవా కాలువ నిర్మాణ అయ్యే సమయంలోను, జాతికి అంకితం చేసిన సమయంలోను, విస్తరణ చేసిన సమయంలోను తాను ఎస్ఈగా పని చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం మాట్లాడిన ఇంజినీర్లు జల వనరుల శాఖలో పి.పాండురంగయ్య చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో హంద్రీనీవా డిప్యూటీ ఎస్ఈ ఉషారాణి, ఈఈలు చంద్రశేఖర్ రెడ్డి, గుణఖర్ రెడ్డి, ప్రసాద్, రాజన్బాబు, డీఈఈ,తదితరులు పాల్గొన్నారు.


