breaking news
Kurnool
-
శ్రీమఠం పీఠాధిపతి చాతుర్మాస దీక్ష
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు సోమవారం తెల్లవారుజామున చాతుర్మాస దీక్షను స్వీకరించారు. మంగళవాయిద్యాల నడుమ పండితులు, శ్రీమఠం అధికారులు సంప్రదాయ బద్ధకంగా స్వాగతం పలికారు. చాతుర్మాస దీక్షలో భాగంగా శ్రీమూల రాములకు పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేశారు. దీక్ష స్వీరించిన సందర్భంగా శ్రీరాఘవేంద్రస్వామి, శ్రీవాధీంద్ర తీర్థులు బృందావనాలన్నింటికి ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు ఇచ్చారు. పీఠాధిపతికి 48రోజుల పాటు ఎటువంటి ధార్మిక పర్యటనలు ఉండవు అని శ్రీమఠం అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 26వతేదీన సీమోంఘన మహోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్ల నిరసన ● నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కర్నూలు(హాస్పిటల్): తమకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అంతకు ముందు వారు ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఆసుపత్రిలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఇంటర్నీస్, జూనియర్ రెసిడెంట్లు, సూపర్స్పెషాలిటీ పీజీలు, డీఆర్పీ/ఫెరిఫెరల్ పోస్టింగ్లోని పీజీలు, సీనియర్ రెసిడెంట్లు పాల్గొన్నారు. కర్నూలు(హాస్పిటల్): స్టైఫండ్ పెంపును కోరుతూ ఈ నెల 11వ తేదీ నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం కర్నూలు అధ్యక్షులు డాక్టర్ నిశాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. 11వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఆసుపత్రిలోని అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించి వైద్యసేవలు నిలిపివేస్తామన్నారు. అత్యవసర సేవలు, అన్ని ఐసీయు సేవలు కొనసాగిస్తామన్నారు. 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం కాని వైద్యసేవలు నిలిపివేస్తామన్నారు. 15వ తేదీన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తామన్నారు. అయినా లిఖిత పూర్వక స్పందన అందని పక్షంలో 16వ తేదీ నుంచి ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ‘స్క్రబ్వర్క్’ పేరుతో మోసం కర్నూలు: ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయమై విజయవాడకు చెందిన ఎంటర్పైజెస్లో స్క్రబ్ వర్క్ బిజనెస్ పేరుతో ఇంటి వద్దే ప్యాకింగ్ పనిచేస్తే నెలకు రూ.24 వేలు ఆదాయం వస్తుందని నమ్మించి, ముడిసరుకు మిషన్ల కోసం 54 మంది నుంచి సుమారు రూ.కోటి పెట్టుబడికి తీసుకుని ఒక వ్యక్తి మోసం చేశారని ఎమ్మిగనూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన సమర్పించిన వినతిపత్రంలో కోరారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 107 ఫిర్యాదులు వచ్చాయి. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, ఇస్మాయిల్, మస్తాన్ వలి తదితరులు పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ‘రెవెన్యూ’ అర్జీలే అధికం కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్కు రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు. సర్వే, పీఆర్, మునిసిపల్ అర్జీలు అదే స్థాయిలో వస్తున్నాయని, ప్రజలతో నేరుగా మాట్లాడి వాటి ని పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జేసీ నూరుల్ ఖమర్తో కలసి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పీజీఆర్ఎస్ అర్జీల ను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనూరాధ, శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. -
డీఎస్సీలో అక్రమాలు జరిగినా మాట్లాడకూడదా?
కర్నూలు (సెంట్రల్)/కల్లూరు: డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై మాత్రమే వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోందని.. కానీ, వాటిని ప్రశ్నించకూడదన్నట్లుగా టీడీపీ నేతల ప్రవర్తన ఉంటోందని వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులోని కాటసాని రాంభూపాల్రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై తమ పార్టీ ప్రశ్నిస్తుంటే టీడీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులతో ర్యాలీలకు తెరతీశారన్నారు. డీఎస్సీ–2025లో ఉద్యోగాలు పొందిన వారందరూ అక్రమ మార్గాల్లో పోస్టులు సాధించినట్లు తమ పార్టీ ఎక్కడా చెప్పలేదని బుగ్గన స్పష్టంచేశారు. అయితే వారు తమ పార్టీపై అభాండాలు వేస్తూ ర్యాలీల్లో పాల్గొనడం దురదృష్టకరమన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, ఏదో ఒక ఫెడరేషన్ సర్టిఫికెట్ ఎలా చెల్లుబాటవుతుందని ఆయన ప్రశ్నించారు. సర్టిఫికెట్లను రూ.15 లక్షలు నుంచి రూ.25 లక్షల వరకు అమ్ముకున్నారని, ఇందులో టీడీపీ నేతల ప్రమేయం ఉందన్నదే తమ పార్టీ ఆరోపణ అన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై సీబీఐ విచారణ, లోకేశ్ రాజీనామా చేసేవరకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. -
గొంతెండిన ‘గోరంట్ల’
కోడుమూరు రూరల్: వానల్లేక హంద్రీ నది ఒట్టిపోవడంతో గోరంట్ల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. గ్రామానికి మంచినీటిని అందించే బోర్లు అడుగంటి పోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దాదాపు 40 రోజులుగా ప్రజలు తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇంటికి ఒకరు చొప్పున గ్రామస్తులు పనులు మానుకొని సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి బైక్లపై నీళ్లు తెచ్చుకుంటున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని హంద్రీకి విడుదల చేసి నీటి కష్టాలను తీర్చాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రజలు వేడుకుంటున్నా ఎవరూ చలించడం లేదు. కంటి తుడుపు చర్యగా ఒక్క రోజు రెండు ట్యాంకర్లు నీటిని సరఫరా చేసి చేతులెత్తేశారు. గ్రామంలో యథేచ్ఛగా బెల్ట్షాప్లు ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న అధికార టీడీపీ నేతలు ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించి గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని హంద్రీనదిలోకి వదిలి గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే మంచినీళ్ల కోసం రోడ్డెక్కాల్సి ఉంటుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. -
శ్రీ కామేశ్వరీదేవికి చీర, సారె
మహానంది: ఆషాఢమాసం పురస్కరించుకుని మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లకు నంద్యాల పట్టణానికి చెందిన వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో చీర, సారె సమర్పించారు. రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంతాల్లో రజకులపై పెరిగిపోతున్న దాడులు, అత్యాచారాలు, హత్యల నివారణకు వెంటనే రజక సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.గురుశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం చాకలి ఐలమ్మ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోనెగండ్లకు చెందిన చాకలి ఈరమ్మ చావుకు కారణమైన అధికారులు, అదే గ్రామానికి చెందిన గొల్ల సంజన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్ల నుంచి సాగులో అనుభవం ఉన్న ఈరమ్మకు చెందిన 26 సెంట్ల భూమిని టీడీపీ నాయకులు రాసి ఇవ్వడం ఽఅధికారులకు తగదన్నారు. వెంటనే ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శేఖర్బాబు, పర్ల సుంకన్న, రాముడు, జయమ్మ, ఎల్లయ్చ శివరాముడు, శ్రీనివాసులు, సంజీవ్ పాల్గొన్నారు. నేడు, రేపు కర్నూలులో వక్ఫ్బోర్డు చైర్మన్ పర్యటన కర్నూలు(సెంట్రల్): ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సోమ, మంగళవారాల్లో కర్నూలు నగరంలో పర్యటించనున్నారు. పలు వక్ఫ్ ఆస్తులను పరిశీలించి అభివృద్ధి, వాణిజ్య అవసరాలకు ప్రతిపాదించిన స్థలాలపై సమీక్ష చేస్తారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్షలతోపాటు వక్ఫ్ మేనేజింగ్ కమిటీలు, ముతవల్లీలతో సమావేశమై సమస్యలు తెలుసుకోనున్నారు. 11వ తేదీన వక్ఫ్పై పీజీఆర్ఎస్ నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం ఈడెన్ గార్డెన్లో తాలిమ్–ఏ– హునర్ థ్యాంక్ యూ మీట్లో పాల్గొంటారు. ఈ మేరకు ఆయన అధికారిక పర్యటన ఖరారైంది. శ్రీశైలంలో ట్రాఫిక్ జామ్ శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం వాహనాలతో నిండిపోయింది. వారాంతపు సెలవు దినాలు కావడంతో వందలాదిగా తరలివచ్చిన వాహనాలతో క్షేత్రంలోని నంది సర్కిల్ మొదలుకొని టోల్గేట్ సాక్షి గణపతి ముఖద్వారం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం వన్టౌన్ సీఐ గంగనాథ్ బాబు తోపాటు ప్రత్యేక విధులు పై వచ్చిన సిబ్బంది ఆదివారం ఉదయం నుంచి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. వసతి గృహ నిర్మాణానికి దాత విరాళం మహానంది: మహానందిలో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న వసతిగృహాల నిర్మాణంలో భాగంగా హైదరాబాద్ నగరానికి చెందిన ఎలమంచిలి నవీణ్ దంపతులు సూట్ నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు వారు ఆదివారం మహానంది క్షేత్రానికి చేరుకుని ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్బోర్డు చైర్మన్ మౌళీశ్వరరెడ్డి, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధానిలను కలిసి రూ. 5.50 లక్షలను అడ్వాన్స్గా అందజేశారు. పరిశ్రమలకు కాదు ప్రజలకు తాగునీరివ్వండి నందికొట్కూరు: పట్టణ ప్రజలకు తాగునీరు, సాగునీరు ఇవ్వకుండా పరిశ్రమలకు నీళ్లు తరలించడం సరికాదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురామమూర్తి, సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. పట్టణంలో రెండవ రోజు సీపీఐ ఇంటింటి ప్రచార పాదయాత్ర కార్యక్రమం సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ నందికొట్కూరు చుట్టూ నీళ్లు ఉన్నా పట్టణ ప్రజలకు గుక్కెడు తాగునీళ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్దోందని, ఇక్కడి నీళ్లను ఓర్వకల్లు మండలంలోని క్యాంపాకోలా, స్టీల్ పరిశ్రమలకు తరలించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రచార పాదయాత్రలో సీపీఐ నాయకులు పటాన్ మౌలాలి, సుంకన్న, నాగేంద్ర, కురవ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బందులు పడుతున్నాం
మాకు ఒకటిన్నర ఎకరాలు మాత్రమే భూమి ఉంది. సజ్జ, కంది సాగు చేస్తే దెబ్బతిన్నాయి. జూన్ నుంచి ఉపాధి పనులకు వెళ్తున్నాం. రెండు నెలలుగా కూలి రావడం లేదు. కుటుంబం గడవడటం కష్టంగా ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే కూలి డబ్బులు చెల్లించాలి. – చిరంజీవి దంపతులు, కోతికొండ గ్రామం, తుగ్గలి మండలం సాధారణంగా వ్యవసాయ సీజన్లో ఉపాధి పనులకు 60 రోజుల విరామం ఉంటుంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో అన్ని పంచాయతీల్లో పనులు చేపడుతున్నాం. కొన్ని వారాలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. త్వరలోనే పడే అవకాశం ఉంది. నరేగా నుంచి వీబీజీ రామ్జీలోకి మారాం. కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. – నరసింహారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, వీబీజీ రామ్ జీ, డ్వామా, కర్నూలు -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి ఆదివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మూలబృందవనానికి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ఏకాదశి కావడంతో పంచామృతాభిషేకాలు, అలంకరణలు నిర్వహించలేదు. నిజరూప మూల బృందవానంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ మంచాలమ్మ దర్శనం చేసుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్పతరు క్యూకాంపెక్స్, వీఐపీ క్యూలైన్లో భక్తుల రద్దీ కనిపించింది. -
కొనసాగుతున్న తాగునీటి విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ మూడు గేట్ల నుంచి తాగునీటి అవసరాలకు నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం ఏఈ విష్ణువర్ధన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైల జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదనీటి ప్రవాహం భారీగా తగ్గిందన్నారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో జూరాల నుంచి ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలోకి కేవలం 44,279 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో 878.60 అడుగుల నీటితో 181.0590 టీఎంసీల నీటిమట్టం ఉందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద 877.60 అడుగుల నీటిమట్టం ఉండగా 4,5,6 గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 4 వేల క్యూసెక్కులు, జీఎన్ఎస్ఎస్ కాల్వకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. ప్రస్తుతం డ్యాంలోకి వరదనీటి ప్రవాహం తగ్గిపోయినందున తాగునీటి అవసరాల నిమిత్తం రిజర్వాయర్లను నింపుతున్నట్లు తెలిపారు. -
శ్రీశైలానికి పడిపోయిన ఇన్ఫ్లో
శ్రీశైలంప్రాజెక్ట్: జూరాల నుంచి శ్రీశైలంకు వస్తున్న వరద ప్రవాహం ఆదివారం పడిపోయింది. గత కొద్ది రోజుల వరకు 2.11 లక్షల పైచిలుకు ఉన్న ఇన్ఫ్లో శనివారం 1.68 లక్షలకు పడిపోయింది. ఆదివారం జూరాల నుంచి కేవలం 44,279 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 60,177 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగార్జునసాగర్కు 48,511 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,917 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 8,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,611 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 14.883 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 11.400 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 181.0590 టీఎంసిల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 878.60 అడుగులకు చేరుకుంది. -
13న కర్నూలుకు వైఎస్ జగన్ రాక
● ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న జననేతకల్లూరు: అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 13వ తేదీన కర్నూలుకు రానున్నట్లు వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లపై కల్లూరులో ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఇసాక్బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం సమీక్షించారు. అనంతరం ఆ వివరాలను పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విలేకరులకు వివరించారు. గన్నవరం నుంచి హెలికాప్టర్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఆగస్టు 13న చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కర్నూలులోని పంచలింగాల సబ్జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షి వద్దకు వెళ్తారన్నారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ నాయకులను పరామర్శిస్తారని తెలిపారు. ముందస్తుగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులకు ధైర్యాన్ని ఇచ్చేందుకే.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చివరికి ఎమ్మెల్యేలపై కూడా అక్రమ కేసులు నమో దు చేస్తున్నారని కాటసాని ఆరోపించారు. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షిని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేరుగా వస్తున్నట్లు చెప్పారు. టీడీపీ నాయకులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎవరూ భయపడొద్దనే సందేశాన్ని ఇచ్చేందుకు తమ పార్టీ అధినేత వస్తున్నారని తెలిపారు. పోలీసు వ్యవస్థను రాజకీయాలకు వినియోగించుకుంటూ సామా న్య ప్రజలపై కూడా నేడు కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. హద్దులు దాటి విధులు నిర్వహించే అధికారులు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. టీడీపీ నాయకుల అక్రమ కేసులు, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటంతోపాటు ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సమీక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శ్రీదేవి, గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎంపీలు బుట్టా రేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ మేయర్ బీవై రామయ్య, వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, నియోజకవర్గ ఇన్చార్జ్లు రాజీవ్రెడ్డి, ధారా సుధీర్, కోట్ల హర్షవర్ధన్రెడ్డి, ఆదిమూలపు సతీష్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి, మంత్రాలయం నేత ప్రదీప్రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
మహానంది: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని, ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పనిచేయాలని నంద్యాల జిల్లా ఏఎస్పీ ఆర్. సుస్మిత స్పష్టం చేశారు. మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని బుచ్చమ్మతోపు గ్రామంలో ఆదివారం కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో సోదాలు నిర్వహించారు. గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు. పిల్లలు బాగా చదివితే మంచి ఉద్యోగాలు లభిస్తాయని, తద్వారా సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందన్నారు. ఏవైనా సంఘటనలు జరిగితే వెంటనే 100, 112 నంబర్లకు సమాచారం అందిస్తే పోలీసులు వెంటనే చేరుకుని తగిన న్యాయం చేస్తారని సూచించారు. పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ ఎవరికి కేటాయించిన విధులు వారు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. గ్రామాల్లో నేరచరిత్ర కలిగిన వారిపై నిరంతర నిఘా ఉంచుతూ నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
దిశ చట్టం రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
● వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ కర్నూలు (టౌన్): మహిళలకు రక్షణ కవచంలా ఉన్న దిశ చట్టం రద్దు నిర్ణయాన్ని వెంటనే కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఆదివారం స్థానిక దేవనగర్లోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోమన్రెడ్డి అమలు చేసిన దిశ యాప్ మహిళలకు అన్నలా, తమ్ముడిలా రక్షణగా నిలిచిందన్నారు. అనాడు జగనన్న ఈ యాప్ తీసుకు రావడంతో పాటు సత్వర న్యాయానికి 12 మహిళా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారన్నారు. ఆ సమయంలో 1.51 కోట్ల మంది దిశ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రమాద సమయంలో మహిళల చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కదిలిస్తే 15 నిముషాల్లో పోలీసులు వచ్చి బాధితులను రక్షించే వారన్నారు. జగనన్నపై ఉన్న రాజకీయ ఈర్ష్యతో దిశ చట్టాన్ని నిర్వీర్యం చేయడం దురదృష్ట కరమన్నారు. దిశ చట్టాన్ని రద్దు చేయడం వల్ల కూటమి ప్రభుత్వం రౌడీమూకలు, ఉన్నాదుల ఆగడాలకు లైసెన్సు ఇవ్వడం కాదా.. అని ప్రశ్నించారు. మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని, మహిళల ప్రాణాలతో చెలగాటమాడే ఈ అనాలోచిత నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్నారు. -
తూతూమంత్రంగా ఆదివాసీ దినోత్సవం
మాట్లాడుతున్న జేసీ నూరుల్ ఖమర్ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక నృత్యంకర్నూలు(సెంట్రల్): ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని అధికార యంత్రాగం తూతూ మంత్రంగా నిర్వహించి మమ అనిపించింది. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి డుమ్మా కొట్టారు. ఇక కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతోపాటు మిగతా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులందరూ గైర్హాజరయ్యారు. ఒక్క పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాత్రమే కార్యక్రమానికి వచ్చారు. ఇక కలెక్టర్కు బదులుగా హాజరైన జేసీ పాణ్యం ఎమ్మెల్యేతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులు గైర్హాజరు కావడంపై గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆదివారం కావడంతో కలెక్టర్ కూడా సమావేశానికి రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడాదికి ఒక్కసారి జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవం లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకే కలెక్టర్, ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యాంటే వారికి గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంపై ఏ మాత్రం ధ్యాస ఉందో అర్థమవుతుందని కొందరు గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి రాకపోతే తాము చెప్పే సమస్యలు ఎవరూ పట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి చదివితే అభివృద్ధి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ..గిరిజన విద్యార్థులు కష్టపడి చదువుకుంటే గిరిజన తండాలు, చెంచు గూడెలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ, అభివృద్ధి పథకాలను గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి సురేష్ చదివి వినిపించారు. కాగా, సమావేశంలో గిరిజన బాలబాలికలు చేసిన సాంస్కృతిక నృత్యాలు సభాభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గిరిజన సలహా మండలి సభ్యుడు పి.వెంకటపతి, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కై లాష్ నాయక్, జిల్లా అధ్యక్షుడ యోగేష్ నాయక్, గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాగిరి చంద్రప్ప, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరుకుల రాజు, రామ మహేంద్రనాయక్, సూర్య, కుశాల్, ఆల్ ఇండియా బంజార సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు సేవాలాల్నాయక్, కార్యదర్శి సీమకృష్ణ రాథోడ్ నాయక్, సుగాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుండాల్ నాయక్, శంశాక్, మద్దిలేటి, సీమకృష్ణ, డీవీఎంసీ సభ్యులు పాల్గొన్నారు. పాణ్యం ఎమ్మెల్యే మినహా మిగతా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులందరూ డుమ్మా కలెక్టర్కు బదులుగా హాజరైన జేసీ నూరుల్ ఖమర్ -
క్రీడలతో మానసికోల్లాసం
కర్నూలు (టౌన్): నిత్యం న్యాయపరమైన విధులతో తీరిక లేకుండా ఉండే ఉద్యోగులకు క్రీడా పోటీలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని జిల్లా మొదటి అదనపు జడ్జి కమలాదేవి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా జ్యుడిషీయల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెయింట్ జోసఫ్ కళాశాల క్రీడా మైదానంలో 1 వ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. జిల్లా జడ్జి క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తి చాటాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా జ్యుడిషీయల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్, అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ కోర్టులకు చెందిన జ్యుడిషియల్ ఉద్యోగులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పచ్చని పంటలు జీవాలకు మేతగా..
ఖరీఫ్ సీజన్లో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను సాగుచేసిన రైతన్నలను ఎల్నినో ప్రభావంతో కష్టాల పాలుచేసింది. గత జూన్ మొదటి వారంలో తొలకరి వర్షాలకు సాగు చేసిన పంటలు ఆ తర్వాత వానల్లేక గిడసబారిపోతున్నాయి. దీంతో పంటలను దున్నేయడం, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామానికి చెందిన జయభారతిరెడ్డికి నాలుగు ఎకరాల మెట్ట పొలంలో ముంగారి పత్తిని సాగుచేశారు. దీంతో విత్తు మొలక దశలోనే ఉండడంతో గొర్రెలకు మేతగా వదిలేశారు. అలాగే కొత్తపల్లి మండలం సింగరాజుపల్లెలో సూగూరు నారాయణ మూడు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నను జీవాలకు మేతగా వదిలేశాడు. ఇప్పటివరకు విత్తనాలు, దుక్కులు, ఎరువులు, కూలీలు అన్ని కలుపుకొని రూ.90 వేలుదాక ఖర్చుచేశానని మొత్తం నేపాలు అయిందని ఆవేదన రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి దృశ్యాలు ప్రతి పల్లెల్లో కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. – ఆలూరు/కొత్తపల్లి -
నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ
కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ ఎస్ఈ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఏడు మండలాల్లో జల్లులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏడు మండలాల్లో జల్లులు కురిశాయి. దేవనకొండలో 9.4, పత్తికొండలో 5.8, గూడూరులో 5.2, కౌతాళంలో 4.8, ఆదోని–2లో 3.2, ఆదోని–1లో 2.6, ఎమ్మిగనూరులో 2.2 మి.మీ. ప్రకారం వర్షం కురిసింది. జిల్లా సగటున 1.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. క్వింటా వేరుశనగ రూ.8,702 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్టంగా రూ.8,702 ధర లభించింది. మార్కెట్కు 2,932 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్ట ధర రూ.2,100, మధ్యస్థ ధర రూ.6,230 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. పోటెత్తిన భక్తులు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా రెండు రోజుల రెండో శనివారం, ఆదివారం సెలవులు కలసి రావడంతో భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడాయి. -
ఘోరకల్లు
● అటకెక్కిన జలాశయ మరమ్మతులు ● పూర్తిగా దెబ్బతిన్న రిజర్వాయర్ కట్ట ● గోరుకల్లులోకి వచ్చిన కృష్ణా జలాలు పాణ్యం: రాయలసీమకు సాగు, తాగు నీటిని తరలించడంలో కీలకమైన గోరుకల్లు రిజర్వాయర్ పటిష్టత ప్రశ్నార్థకంగా మారింది. బనకచర్ల క్రాస్ రెగ్యులేర్ నుంచి ఎస్సార్బీసీకి రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా అవి ఆదివారం గోరుకల్లు జలాశయానికి చేరాయి. తాగునీటి అవసరాల నిమిత్తం ఈ ఏడాది జలాశయంలో మూడు టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు రిజర్వాయర్ కట్ట రివిట్మెంట్ తాత్కాలిక పనులు పది శాతం కూడా పూర్తికాలేదు. ఈ జలాశయం సామర్థ్యం 12.4 టీఎంసీలు కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 11.2 టీఎంసీల నీటిని నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది కట్ట కుంగిపోవడం ప్రారంభమైంది. ఈ కట్టను పరిశీలించేందుకు ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వచ్చి చూసి తాత్కాలిక పనులకు డీఎంఎప్ నిధుల కింద రూ. 2.50 కోట్లు మంజూరు చేశారు. అయితే ఈ పనులను గత నెలలో ప్రారంభించారు. ఓటీ రెగ్యులేటర్ వద్ద కుంగిన కట్టను పూర్తి చేయలేదు. దాదాపుగా ఐదు ప్యానెళ్లు దెబ్బతిన్న కట్ట పది అడుగులపైగానే కుంగిపోయింది. కేవలం రెండు ప్యానెళ్లు మాత్రమే పూర్తి చేశారు. నిర్వహణ గాలికి! గోరుకల్లు జలాశయం నిర్వహణను గాలికొదిలేశారు. కట్టపై కనీసం కంపచెట్లు తొలగించలేదు. అంతేగాక కట్టకు భారీగా నెర్రలిచ్చాయి. దాదాపు 10 అడుగులపైగానే గోతులు పడ్డాయంటే నిర్వహణ ఎంత మాత్రంగా ఉందో అర్థమతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ. 60లక్షలు ఖర్చు చేసి కట్టపై కంపచెట్లు తొలగించారు. అంతేగాక కట్ట రివ్యూట్మెంట్ పనులు పూర్తి చేయించారు. ప్రస్తుతం ఈ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం గోరుకల్లులో 2.50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. ఎక్కడి పనులు అక్కడే! పనులు పూర్తికాకుంటే గోరుకల్లు భద్రతకు అటంకం కలుగుతుందని నిపుణులు కమిటీ నిర్ధారించింది. తక్షణమే పనులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే మంత్రి పరిశీలిన తర్వాత పెండింగ్ పనులకు రూ. 53కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు కేటాయించి దాదాపుగా ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో జలాశయ భద్రత దేవుడికెరుక అన్నట్లు తయారైంది. పనులు పూర్తికాకపోవడంతో తరచూ సమస్య నెలకొంటోందని సీనియర్ ఇంజినీర్లు అభిప్రాయ పడుతున్నారు. -
బెదిరింపులు.. అక్రమ వసూళ్లు!
పత్తికొండ: అధికార పార్టీ నాయకులు సొంత ఆదాయం కోసం పత్తికొండ మార్కెట్ యార్డులో సరికొత్త వ్యాపారానికి తెరదీశారు. కొత్త మండీలు ఏర్పాటు చేస్తే చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాము చెప్పిన చెప్పిన ధరలకే రైతులు పంటలను విక్రయించి పోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మార్కెట్ ఏర్పడినప్పటి నుంచి గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేదు. పక్కా ప్రణాళికతో... టమాట, పచ్చి మిరప, చౌళకాయులు, బెండ, వంకాయలు తదితర కూరగాయలు పత్తికొండ ప్రాంతంలో విరివిగా పండిస్తారు. పంట చేతికొచ్చిన తరువాత విక్రయం కోసం వాటిని రైతులు పత్తికొండ వ్యవసాయ మార్కెట్కు తీసుకువస్తారు. ఇక్కడ కోనుగోలు చేసిన కూరగాయలను ప్రతిరోజు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు లారీల్లో ఎగుమతులు చేస్తారు. కూరగాయలు అమ్మితే వచ్చిన డబ్బుతో రైతు కుటుంబాలే కాదు మార్కెట్ కూడా స్థిరమైన ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లోని ఆదాయంపై కూటమి నాయకులు కన్నుపడింది. ప్రణాళికతో మార్కెట్ యార్డులో సరికొత్త వ్యాపారానికి తెరదీశారు. మండీల ఏర్పాటుకు బ్రేకులు! కొత్త వ్యాపారులు రాక కోసం ప్రతి ఏడాది అధికారులు అనుమతితో కొత్త మండీలను స్థానిక వ్యాపారులు ఏర్పాటు చేస్తుంటారు. అంతే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూరగాయులు కొనుగోలు కోసం వ్యాపారులను తీసుకు వస్తుంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇటీవల దీనికి బ్రేకులు పడుతున్నాయి. కొత్త మండీలు ఏర్పాటు చేస్తే చంపుతామని బెదిరింపులకు పాల్పడుతూ అడ్డుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇద్దరు మండీదారులకు ఇలాంటి అనుభవం మార్కెట్లో ఎదురైంది. దీంతో అధికార పార్టీ నాయకులను ఎదురించలేక లోలోపల మదనపడుతున్నారు. ఈచర్యతో కొత్త మండీలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు రావడం లేదు. కూటమి నాయకులు కనుసన్నలలో జరిగే మండీల వారు చెప్పిన ధరకే రైతులు అమ్మాలి. దీంతో రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. నేను వారం రోజుల కిందట బాధ్యతలు స్వీరించాను. లైసెన్స్దారుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న కారణంతో సూపర్వైజర్పై జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదంతా నేను బాధ్యతలు తీసుకోక ముందే జరిగింది. ఇక నుంచి అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం. వ్యవసాయ మార్కెట్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. –సునీత, పత్తికొండ వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ కార్యదర్శి పత్తికొండ మార్కెట్ యార్డులో అధికార పార్టీ నాయకుల ఇష్టారాజ్యం నూతన మండీలు ఏర్పాటు చేయొద్దని హెచ్చరికలు కొత్త వ్యాపారులు రాకుండా అడ్డుకట్ట అవినీతి, అక్రమాలు పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో పని చేస్తున్న సూపర్వైజర్ హర్షద్ను కొద్ది రోజులు క్రితం జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మార్కెట్లో ఒక్కో లైసెన్స్దారు నుంచి లక్ష రూపాయలు దాకా వసూలు చేశారు. కొత్త మండీల ఏర్పాటు విషయంలో కొద్దిరోజులుగా గొడవలు జరగడంతో అక్రమాలు విషయం బయటపడింది. దీంతో పలువురు లైసెన్స్దారులు నేరుగా జిల్లా ఉన్నతాధికారులకు అధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి సూపర్వైజర్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. -
లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి
తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని తేరన్నపల్లి క్రాస్ సమీపంలో లారీ డ్రైవర్ నాగేంద్ర (46) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు తాడిపత్రి అప్గ్రేడ్ పోలీసుస్టేషన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాలమేరకు... నంద్యాల జిల్లా అవుకు మండల కేంద్రానికి చెందిన నాగేంద్ర 20 ఏళ్లుగా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 2న గుండ్ల శింగవరం గ్రామానికి చెందిన క్లీనర్ రామకృష్ణారెడితో కలిసి మంగళూరుకు లారీ లోడ్ తీసుకొని వెళ్లారు. ఈనెల 8న భార్య వెంకటలక్ష్మికి నాగేంద్ర ఫోన్ చేసి కొందరితో గొడవ జరిగిందని చెప్పాడు. ఆమె భయంతో తాడిపత్రి అప్గ్రేడ్ పోలీసుస్టేషన్ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు నాగేంద్ర ఆచూకీ కోసం ప్రయత్నించినట్లు సీఐ పేర్కొన్నారు. అయితే తేరన్నపల్లి క్రాస్ వద్ద నాగేంద్ర శవాన్ని కొనుగొన్నామని తెలిపారు. అధిక మద్యం కారణమా, లేక లారీ యజమాని, క్లీనర్తో జరిగిన గొడవలో చనిపోయాడా అన్నది తేలాల్సి ఉందన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
సహస్ర ఘటాభిషేకానికి అంకురార్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక విశేష పూజల్లో భాగంగా ఆదివారం యాగశాల ప్రవేశం చేసి, విశేషపూజలు నిర్వహించి అంకురార్పణ చేశారు. సహస్ర ఘట్టాభిషేక విశేష క్రతువులో భాగంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు స్రందాయబద్దంగా యాగశాల ప్రవేశం చేశారు. అనంతరం శివసంకల్పం, గణపతిపూజ, చండీశ్వరపూజ, కంకణపూజ–కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండస్థాపన తదితర విశేషపూజలను నిర్వహించారు. సోమవారం ఉదయం 5గంటల నుంచి ఏకాదశ రుద్ర రుష్యశృంగ సహిత సహస్ర ఘటార్చన, రుద్రహోమం, చండీపారాయణ, నదీపూజ, పుణ్యనదీజలాలతో పాతాళేశ్వరస్వామికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన ఘట్టములతో ఆలయ ప్రదక్షిణ, మల్లికార్జున స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రధాన ఘట్టాభిషేకం, సహస్ర ఘట్టాభిషేకం జరిపిస్తారు. -
డీఎస్సీ అక్రమాలపై డైవర్షన్ ర్యాలీ
కర్నూలు(సెంట్రల్): డీఎస్సీ–2025 ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ ‘ఒక పక్కా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్’ అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత నుంచి... అర్హులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నేతృత్వంలో జెన్–జెడ్ చేస్తున్న ఆందోళనలకు వస్తున్న అనూహ్య స్పందన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేపట్టిన ‘సర్కారు స్పాన్సర్డ్ డైవర్షన్ ర్యాలీ’ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే... ఈ ర్యాలీకి హాజరైన ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయేలా వారికి తెలియకుండా చేసిన ఏర్పాట్లే ఇందుకు నిదర్శనం. పశ్చిమ రాయలసీమ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించిన డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు కర్నూలులో శనివారం ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ ర్యాలీకి తెరవెనుక నుంచి టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయుల కోసం సకల సౌకర్యాలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. వారు బస్సు ఎక్కినప్పటి నుంచి కూల్డ్రింక్లు, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, దూర ప్రాంతాల వారికి రాత్రి భోజనాలను కూడా అందించారు. సభ జరిగిన ప్రదేశంలో సైతం విందు భోజనాలు వడ్డించారు. అంతటితో ఆగకుండా ర్యాలీలో రాజకీయ పార్టీలు నిర్వహించే 140 డెసిబుల్స్ సౌండ్ వచ్చే డీజే వాహనం, ఉపాధ్యాయులపై పాటల ఆడియోలు కూడా అందుబాటులోకి తెచ్చారు. చివరికి మొబైల్ టాయిలెట్లను సైతం ర్యాలీ వెంట తీసుకురావడం ఈ కార్యక్రమానికే హైలెట్. ఇవన్నీ పరిశీలిస్తే ఈ కార్యక్రమం ఎంత పక్కా స్క్రిప్టో అర్థమవుతోంది. మరోవైపు ఉపాధ్యాయులు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు కూడా పసుపు రంగులో ఉండడం రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. కర్నూలులో తిష్టవేసిన టీడీపీ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల ర్యాలీని ఎలాగైనా విజయవంతం చేయాలని టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్గోపాల్ కర్నూలులోనే తిష్టవేశారు. శుక్రవారమే వారు కర్నూలు చేరుకుని కడప ఆర్జేడీ శామ్యూల్ను పిలిపించుకుని డీఎస్సీ–2025లో ఎంపికైన ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి హాజరయ్యేలా చేయాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన అనధికారికంగా డీఈవోలు, ఎంఈవోలతో మాట్లాడి డీఎస్సీ–2025లో ఎంపికైన ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూడాలని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఎంఈవోలు తమ పరిధిలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులందరూ కచ్చితంగా కర్నూలులో ర్యాలీకి హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సులను కొన్నిచోట్ల ఎంఈవోలే ఏర్పాటు చేశారని సమాచారం. మరికొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. చివరికి కొన్నిచోట్ల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చే ఉపాధ్యాయుల హాజరు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆరోగ్యం బాగోలేదన్నా కూడా కచ్చితంగా రావాల్సిందేనని చెప్పడంతో విధిలేని పరిస్థితిలో వచ్చిన ట్లు టీచర్లు చెబుతున్నారు. ఈ ర్యాలీకి టీడీపీ అనుబంధ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మద్దతు ఇవ్వడంతో డీఎస్సీ–2025కు సంబంధంలేని టీచర్లు కూడా అనేక మంది హాజరయ్యారు. వీరికి తోడు యువగళం పాదయాత్ర బృందాలు కూడా ర్యాలీలో హల్చల్ చేశాయి. 100 మంది వరకు టీడీపీ అనుకూల యూ ట్యూబర్లు సైతం ర్యాలీని కవర్ చేస్తూ హడావుడి చేశారు. చంద్రబాబు, లోకేశ్ రాజకీయ వ్యూహాల్లో పావులుగా కొత్త టీచర్లు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. ఈ ఉద్యమానికి జెన్–జీ (యువత) పెద్ద ఎత్తున కదలివస్తోండగా నిరుద్యోగులు జేఏసీగా ఏర్పడి పోరుబాట పట్టా రు. అన్ని వైపుల నుంచి డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో చంద్రబాబు, లోకేశ్ కొత్తగా ఎంపికైన టీచర్లను పావులుగా చేసుకుని డీఎస్సీలో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ ర్యాలీకి వ్యూహం రచించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కొనసాగుతున్న సహస్ర ఘటాభిషేక క్రతువులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక విశేష క్రతువులు రెండవ రోజు కొనసాగాయి. శనివారం వేదపండితులు రుష్యశృంగ జపాన్ని చేశారు. రుష్యశృంగ మహర్షి కొలువు ఉన్న చోట్ల వర్షాలు సమృద్ధిగా పడతాయని శాస్త్రం చెబుతుందని, ఆయన అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురవాలని, కరువుకాటకాలు నివారించబడాలని రుష్యశృంగమహర్షి మట్టి ప్రతిమను పూజించారు. అలాగే వారుణానుకం మంత్రాలను వేదపండితులు పారాయణ చేశారు. భాగవతం, మహాభారతంలోని విరాటపర్వం పారాయణలు చేశారు. మరోవైపు వరుణజపం, పంచాక్షరిజపం, మూలమంత్రజపాలు చేశారు. వరుణజపం నీటిలో ఉండి చేయాలని శాస్త్రం చెబుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా నిర్మించిన నీటితోట్టిలో పండితులు కంఠం వరకు మునిగేలా కూర్చోని ఆయా జపాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు ఆదివారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం, శివసంకల్పం, గణపతిపూజ, స్వస్తిణ్యహవచనం, చండీశ్వ రపూజ, కంకణపూజ, కంకణధారణ,రుత్విగ్వరణం, సాయంత్రం అంకురారోపణ, అగ్నిప్రతిష్టాపన, రుద్రహోమం, ఉపాంగ దేవతాహవనములు, జపా ంగ హవనములు జపిరిస్తారు. ఆ తరువాత ఏకాదశ రుద్ర రుషశృంగ సహిత సహస్ర ఘటస్థాపన, కలశార్చనలు, రుద్రపారాయణలు జరిపిస్తారు. -
తల్లిదండ్రులకు భారం కాకూడదని..
కొత్తపల్లి: అనారోగ్యం బారి న పడిన యువకుడు తల్లిదండ్రులకు భారం కాకూడ దని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. ఏఎస్ఐ రామ్నాయక్ తెలిపిన వివరాల మేరకు.. ఎదురుపాడు గ్రామానికి చెందిన చాకలి దినేష్ కుమార్ (22) డిప్లొమా చదువును మధ్యలో ఆపేసి గ్రామంలో తండ్రి వద్ద ఉంటున్నాడు. చదువు పూర్తి చేయనందున ఉద్యోగాలు రావని ఆందోళన చెందడం, గతంలో హ్యాండ్ వాల్ క్రీడలో స్టేట్ లెవల్కి ఎంపిక కాలేక పోవడంతో తీవ్రంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఎక్కువగా ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోయి ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో అతని తండ్రి వైద్య ఖర్చులకు దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. ఈ విషయంపై కూడా దినేష్ కుమార్ ఎక్కువగా ఆలోచించి తన తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తండ్రి నాగశేషులు గమనించి వెంటనే వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతి చెందాడు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి గోస్పాడు: పసురపాడు – బనగానపల్లె రహదారిలో తేళ్లపురి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన రమేష్ (45) బనగానపల్లెలోని హెరిటేజ్లో పనిచేస్తున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం విధులకు బైక్పై వెళ్తుండగా ఎదురుగా తాడిపత్రి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్రాలీ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. -
మహానందీశ్వరుడి సేవలో..
మహానంది: మహానందీశ్వరుడిని శనివారం రాత్రి ఏపీ వక్ఫ్బోర్డు ట్రిబ్యునల్ చైర్మన్ టి. రామచంద్రుడు, ఏపీ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ హరిప్రకాశ్ దర్శించుకున్నారు. క్షేత్రానికి వచ్చిన వారికి ఆలయ సూపరింటెండెంట్ ఎం.నీలకంఠేశ్వరరాజు స్వాగతం పలికారు. ఈ మేరకు వారు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. ద ర్శనం అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో స్వామివారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. ఆలూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు శేషు (18) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు ఓంకార్కు త్రీవగాయాలయ్యాయి. ఆలూరు సమీపంలోని హైవే–167లో ఉన్న 133 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలూరు మండలం అగ్రహారం గ్రామానికి చెందిన శేషు, ఓంకార్ స్కూటర్పై ఆలూరు నుంచి స్వగ్రామానికి వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టారు. ప్రమాదంలో శేషు (18) అక్కడిక్కడే మృతిచెందాడు. ఓంకార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అంబులెన్స్కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు శేషు(18) అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. తీవ్రగాయాలైన ఓంకార్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు ఎస్ఐ మన్మథ విజయ్ తెలిపారు. ట్రాన్స్జెండర్లకు మూడు రోజుల మెగా క్యాంప్ కర్నూలు (అర్బన్): జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు వివిధ సంక్షేమ పథకాల అమలు, వారి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు మెగా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయీస్ ఫాతిమా తెలిపారు. ఈ క్యాంప్ ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. ఆధార్, రేషన్, ఓటరు కార్డులు, విద్యార్హత సర్టిఫికెట్లలో పేరు, లింగం మార్పులు, సెర్ప్, మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు, ఉచిత నైపుణ్య శిక్షణ, వ్యాపార రుణాలు, స్వయం ఉపాధి పథకాల నమోదు, ఉచిత సాధారణ ఆరోగ్య పరీక్షలు, మెడికల్ క్యాంప్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా హెల్త్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం కోసం దరఖాస్తుల స్వీకరణ తదితర సేవలు, ప్రయోజనాలు ఈ క్యాంప్లో పొందవచ్చన్నారు. అలరించిన నృత్య ప్రదర్శన శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళావేదికపై హైదరాబాద్కు చెందిన రాగసుధ డ్యాన్స్ అకాడమీ వారిచే నిర్వహించిన సంప్రదాయ నృత్యప్రదర్శన భక్తులను అలరించింది. గణపతికౌత్వం, శివస్తుతి, నటేశకౌత్వం, లింగాష్టకం, భో శంభో శివతాండవం గీతాలకు నృత్యం ప్రదర్శించారు. -
కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు
● వైకుంఠం జ్యోతి మూర్ఖత్వాన్ని వీడాలి ● వీఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.సుభాష్ చంద్రబోస్ కర్నూలు (అర్బన్): ఆలూరు నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని వీఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.సుభాష్ చంద్రబోస్ హితువు పలికారు. మూర్ఖత్వాన్ని విడనాడి దళిత ఆడబిడ్డతో రాజకీయం చేయడం మానుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతికి సూచించారు. కర్నూలులోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుభాష్ మాట్లాడారు. ఆలూరు నియోజకవర్గంలో అత్యధిక జనాభాగా ఉన్న వాల్మీకులు తలుచుకుంటే జీవితంలో వైకుంఠం జ్యోతి ఎమ్మెల్యే కాలేరని అన్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిని రాజకీయంగా ఎదుర్కోలేక వైకుంఠం జ్యోతి తన రాజకీయ స్వార్థం కోసం అమాయకురాలైన ఒక దళిత ఆడబిడ్డతో నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆరోపించారు. వైకుంఠం జ్యోతి ఒక మహిళ అయి ఉండి ఎమ్మెల్యే విరూపాక్షి ఒక దళిత మహిళ చీర చింపారని దిగజారి అబద్ధాలు చెప్పి దళిత ఆడబిడ్డను అవమానించారని సుభాష్ విమర్శించారు. ఈ సంఘటనపై ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించి ఎమ్మెల్యే విరూపాక్షి, తదితరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించి ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడు శ్రీరాములు, ఇంకొందరిపై దాడి చేసి గాయపరచిన టీడీపీ రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలన్నారు. లేనిపక్షంలో జిల్లా స్థాయిలో వాల్మీకులను సమీకరించి త్వరలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. -
వ్యక్తి ఆత్మహత్య
కొలిమిగుండ్ల(అవుకు): గుండ్లశింగవరం శివార్లలో ఓ వ్యక్తి శనివారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కొలిమిగుండ్ల మండలం నాయినపల్లెకు చెందిన గొల్ల చిన్న గంగన్న(45) గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో గ్రామంలోని మరి కొంత మంది గొర్రెల మందలతో కలిసి గుండ్లశింగవరం సమీపంలో ఉంచి మేపుకుంటుండేవారు. మంద దగ్గరి నుంచి కుమారుడు ఇంటికి రావడంతో గంగన్న శుక్రవారం సాయంత్రం అక్కడికి వెళ్లాడు. గొర్రెల మందకు దూరంగా పొలాల్లో ఉన్న చెట్టుకు లుంగీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించిన రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న అవుకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కారు ఢీకొని వ్యక్తి మృతి ఆస్పరి: కారు ఢీకొని ఆస్పరిలో శనివారం రాత్రి కోసిగి ఈరన్న (55) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తులు, ఆస్పరి సీఐ శ్రీనివాసులనాయక్ తెలిపిన వివరాలు మేరకు.. ఆస్పరికి చెందిన కోసిగి ఈరన్న రోడ్డు పక్కన వెళ్తుండగా పత్తికొండ నుంచి ఆస్పరి వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈరన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి దగ్గర నుంచి వెళ్లిన వ్యక్తి కారు ఢీకొని మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటనా స్థలానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
పోలీసులూ.. టీడీపీకి తొత్తులుగా మారొద్దు!
● వైఎస్సార్సీపీ మహిళా నేతలు సిట్రా సత్యనారాయణమ్మ, సిద్ధారెడ్డి రేణుక ఆలూరు: పోలీసులు న్యాయాన్ని కాపాడాలని, టీడీపీకి తొత్తులుగా మారొద్దని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్ధారెడ్డి రేణుక సూచించారు. మండల కేంద్రమైన చిప్పగిరిలో ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ, కుటుంబసభ్యులను శనివారం పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తయనుడు చంద్రశేఖర్, సోదరుడు శ్రీరాములతోపాటు మరి కొందరిపై వివిధ రకాలు కేసులను నమోదు చేసి జైలుకు పంపడం దారుణమన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, అరాచక పాలన సాగుతోందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకెళ్లారన్నారు. ఎప్పుడూ చంద్రబాబు ప్రభుత్వమే ఉండబోదని, వచ్చే రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తుందని, ఽధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే విరూపాక్షి కుటుంబ సభ్యులకు తెలిపారు. టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులను వదలబోమని హెచ్చరించారు. -
బకాయిలకు శ్వేతచీటి!
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్, డీఏలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయం మొత్తం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జీతభత్యాలకే సరిపోతుందని ప్రకటించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉద్యోగుల ప్రయోజనాలకు గండికొట్టడం, ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టడమే శ్వేతపత్రం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను సాధించుకునే విషయంలో ఇటీవల కాలంలో ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కుతున్న నేపధ్యంలో శ్వేతపత్రం విడుదలలో కుట్ర, కుతంత్రాలు ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట పట్టాయి. శ్వేతపత్రం విడుదల తర్వాత చంద్రబాబు సర్కార్పై ఏపీ జేఏసీ, ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్న్ నాయకులు విరుచుకపడుతున్నారు. ముఖ్యమంత్రిని ఒప్పించి డిమాండ్లను నెరవేర్చాలని టీడీపీ ఎంపీకి, ఎమ్మెల్యేలకు, టీడీపీ నేతలకు వినతిపత్రాలు ఇస్తున్నారు. దిక్కులు చూసే పరిస్థితి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2024 మార్చి నాటికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల బకాయిలన్నిటినీ చెల్లించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. వేతనాలు మాత్రం ఒకటి, రెండు తేదీల్లో పడుతున్నాయని, బకాయిలన్నీ పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించారు. 2024 మార్చి నాటికి ఉద్యోగుల బబకాయిలన్నీ చెల్లించగా ఒక్క డీఏ కూడా పెండింగ్లో లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై 26 నెలలు అవుతున్నా ఉద్యోగులకు ఒక్క డీఏ మాత్రమే ఇచ్చారు. గత నెల 22న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలో మంత్రుల కమిటీ సమావేశమై..ముఖ్యమంత్రికి నివేదిస్తామని చెప్పడం మినహా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎంపీఈవోలపై నిర్లక్ష్యం! రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం రెగ్యులర్ నియామకాలకు స్వస్తి పలికి కాంట్రాక్ట్ పద్ధతిపై ఎంపీఈఓలను నియమించింది. కర్నూలు జిల్లాలో 200 మంది, నంద్యాల జిల్లాలో 160 మంది పనిచేస్తున్నారు. వీరు ఐదు నెలలుగా వేతనాలు లేకుండానే పనిచేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీరికి వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగలేదు. ఎంపీఈఓలను కొనసాగిస్తూ ప్రతి ఏటా జీఓ ఇవ్వాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఏడెనిమిది నెలలు ఆలస్యంగా ఇస్తోంది. వేతనాల విషయంలో జాప్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి ఎంపీఈఓలు ఆందోళనలు చేపడుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రధాన డిమాండ్లు ఇవీ.. రూ.20 వేల లోపు వేతనాలు పొందుతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లోనే 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చింది. వెంటనే 12వ వేతన సవరణ చేసి మధ్యంతర భృతి ఇవ్వాలి. 26 నెలల్లో ఉద్యోగులకు ఇచ్చింది కేవలం ఒక్క డీఏ మాత్రమే. పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సరండర్ లీవ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మెడికల్ రీయింబర్స్మెంట్ పూర్తిగా నిలిచిపోయింది. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పునర్ వ్యవస్థీకరించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. నిరాశనే మిగిలింది కర్నూలు జిల్లాలో ట్రెజరీల నుంచి వేతనాలు పొందేవారు 25,859, నంద్యాల జిల్లాలో 20,282 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 46,177 మంది ఉన్నారు. పబ్లిక్ సెక్టారు ఉద్యోగులు మరో 10 వేల మంది వరకు ఉంటారు. వీరందరూ చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఒక్క ఉమ్మడి జిల్లాలోనే రూ.3000 కోట్లు పెండింగ్లో ఉండిపోయాయి. చంద్రబాబు సీఎం అయితే తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయనుకున్న ఉద్యోగులకు నిరాశనే మిగిలింది. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ పంథాలోకి వెళ్లాయి. ఏపీ జేఏసీ, ఏనీ ఎన్జీజీవోస్ అసోషియేషన్ నాయకులు కూడా ఆందోళన చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కుతున్నారు. ఎంపీఈఓలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. శ్వేతపత్రం విడుదలపై ఉద్యోగుల్లో ఆగ్రహం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ, ఐఆర్, డీఏలు ఎగ్గొట్టేందుకే అని విమర్శలు ఇప్పటికే పెండింగ్లో ఐదు సరండర్ లీవ్లు ఏప్రిల్ 1 నుంచి ఆగిపోయిన మెడికల్ రీయిబర్స్మెంట్ ప్రధాన డిమాండ్ల ఊసే లేని వైనం -
కవి అనిల్కు ‘కాశీభట్ల’ పురస్కారం ప్రదానం
కర్నూలు కల్చరల్: ప్రముఖ కవి అనిల్ డ్యానీకి కాశీభట్ల పురస్కారం ప్రదానం చేశారు. అక్షరం ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం కృష్ణా నగర్లోని సర్వేపల్లి పాఠశాలలో కాశీభట్ల పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. పాఠశాల అధినేత శేషన్న, ప్రధానోపాధ్యాయురాలు అరుణ దంపతులు అక్షరం ట్రస్ట్ ప్రతినిధులు అనిల్ డ్యానీ దంపతులకు రూ. 25 వేలు అందజేసి సన్మానించారు. కాశీభట్ల చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో కవి పలమనేరు బాలాజీ, ట్రస్ట్ కార్యదర్శి వెంకట కృష్ణ, సాహతీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్, ప్రసిద్ధ కథకులు మారుతీ పౌరోహితం , ప్రముఖ కవి ముప్పాల శ్రీరామ్, ట్రస్ట్ సభ్యులు అవిజ వెంకటేశ్వరరెడ్డి, కవులు డాక్టర్ హరికిషన్, జంధ్యాల రఘుబాబు, గద్వాల ఈరన్న, ఎస్డీవీ అజీజ్, డాక్టర్ కోటకండ మనోహర్, కల్యాణదుర్గ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
అవుకులో సినిమా షూటింగ్
కొలిమిగుండ్ల(అవుకు): ఉప్పులపాడు రోడ్డులోని అవుకు రిజర్వాయర్ వద్ద శనివారం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న హైందవ సినిమా షూటింగ్ జరిగింది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో పలు సన్నివేశాలు చిత్రీకరించారు. సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. రిజర్వాయర్ బ్రిడ్జితో పాటు పరిసర ప్రాంతాల్లో హీరో, హీరోయిన్లపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. సంగమేశ్వరానికి సందర్శకుల తాకిడి కొత్తపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రమైన సంగమేశ్వరాలయం పూర్తిగా కృష్ణానది జలాలో జలాధివాసం అయ్యింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 876.20 అడుగులకు చేరుకుంది. రెండవ శనివారం సెలవుదినం కావడంతో భక్తులు, సందర్శకులు ఎగువ పుష్కరఘాట్ వద్దకు చేరుకుని కృష్ణమ్మ అందాలను తిలకించారు. భక్తులు పుణ్య స్నానాలు చేసి ఎగువన ఉన్న ఉమా మహేశ్వర ఆలయంలో పూజలు చేశారు. -
‘స్వల్పకాలిక’ సాగు మేలు
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తక్కువ నీటి అవసరం ఉండే స్వల్పకాలిక పంటలను సాగు చేసుకోవాలని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ సూచించారు. కల్లూరు, కర్నూలు, గూడూరు మండలాల్లోని పెంచికలపాడు, పర్ల, జి.సింగవరం, ఉల్చాల గ్రామాల్లో శనివారం పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పొలాలను ఖాళీగా ఉంచకుండా కొర్ర, పెసర, అలసంద, సజ్జ వంటి పంటలు సాగు చేసుకోవాలన్నారు. బెట్ట పరిస్థితుల నుంచి పంటలను కాపాడేందుకు 19–19–19 లేదంటే పోటాషియం నైట్రేటు ఎరువుతో లీటరు నీటికి 10 గ్రాముల ప్రకారం కలిపి పిచికారీ చేయాలన్నారు. సీనియర్ శాస్త్రవేత్త బాలాజీనాయక్, అసిస్టెంటు ప్రొఫెసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.a p.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. శ్రీశైలానికి తగ్గిన వరద శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయంలోకి జూరాల ప్రాజెక్టు నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. శుక్రవారం నుంచి శనివారం వరకు శ్రీశైలానికి 2,11,632 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. శనివారం సాయంత్రం నాటికి ఇన్ఫ్లో 1,68,020 క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్టులకు 47,278 క్యూసెక్కుల నీరు విడుదలైంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగర్జునసాగర్కు 37,141 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,133 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 8వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 875 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శనివారం జలాశయంలో 176.7402 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 877.70 అడుగులకు చేరుకుంది. -
అవయవ మార్పిడికి అస్వస్థత!
కర్నూలు(హాస్పిటల్): ఒకరి అవయవదానం మరో ఎనిమిది మందికి ప్రాణదానం చేస్తుందని చెబుతారు. ఈ విషయాన్ని బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి కుటుంబసభ్యులకు నచ్చజెప్పి అవయవదానం చేసేలా ఒప్పిస్తున్నారు. ఈ మేరకు బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలను సేకరించి అవసరమున్న వ్యక్తులు, ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే ఇదంతా జరుగుతున్న ప్రైవేటు రంగంలో మాత్రమే. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రం అరకొర వసతులు, సౌకర్యాలు ఉండటంతో ప్రక్రియ సాగడం లేదు. ఈ మేరకు అక్కడి వైద్యులు సైతం అవయవమార్పిడి ఆపరేషన్లకు ముందుకు రావడం లేదు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో.. అవయవదానమంటే అదేదో మనిషి బతికున్నప్పుడే వారిలోని అవయవాలను సేకరించి ఇతరులకు అమరుస్తారన్న అపోహ ఇప్పటికీ చాలా మందికి ఉంది. దీంతో పాటు అవయవాలను దానం చేస్తే దాత ఆత్మక్షోభిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే అవయవదానం చేసే అవకాశం ఉన్నా కుటుంబసభ్యులు ముందుకు రావడం లేదు. అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి అవయవాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున జీవనదాన్ ట్రస్ట్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలు అవగాహన కల్పిస్తున్నాయి. ఈ మేరకు అవయవ మార్పిడికి అవకాశం ఉన్న ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా బృందాలను నియమించి దాత కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి అవయవదానం చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కిమ్స్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్లలో అవయవాల సేకరణ, మార్పిడిలకు అనుమతి లభించింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇందుకు సంబంధించి ప్రక్రియ జోరుగా సాగుతోంది. బ్రెయిన్డెత్ కూడా డిక్లేర్ చేయడం లేదు! కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతి నెలా వంద నుంచి 120 దాకా వివిధ ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై చికిత్స కోసం వస్తుంటారు. వీరితో పాటు స్ట్రోక్తోనూ తీవ్ర అనారోగ్యపరిస్థితిల్లో ప్రతి నెలా 80 నుంచి 90 మంది దాకా చికిత్స పొందుతుంటారు. వీరిలో కొందరు బ్రెయిన్డెత్ అయ్యే అవకాశం ఉంది. ఆసుపత్రికి వచ్చిన కాసేపటిలోగా మరణించిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో రోగి బ్రెయిన్ డెత్ నిర్ధారించేందుకు అవసరమైన కమిటీ ఉంది. అందులో న్యూరోసర్జరీ, న్యూరాలజీ, అనెస్తీషియా, జనరల్ మెడిసిన్ వైద్యులతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛైర్మన్గా ఉంటారు. వీరు బ్రెయిన్ డెత్ నిర్ధారిస్తే ఆ వ్యక్తి అవయవాలను సేకరించి అవసరమైన వారికి అందించవచ్చు. కానీ బ్రెయిన్డెత్ను సైతం నిర్ధారించేందుకు కొందరు వైద్యులు ముందుకు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కాగా బ్రెయిన్డెత్ అయిన వారి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి అవయవదానం చేసేలా ఒప్పించేందుకు అవసరమైన ట్రాన్స్ప్లాంట్ కో ఆర్డినేటర్లు ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం వీరికి సైతం పని లేకుండా ఉంటోంది. ఆపరేషన్ థియేటర్లలో ఇన్ఫెక్షన్ల ప్రమాదం ! ఆసుపత్రిలో 24కు పైగా చిన్న పెద్దా ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఆయా థియేటర్లను నిర్వహించేందుకు నిపుణులైన 18 మంది అనెస్తెటిస్ట్లు ఇక్కడ ఉన్నారు. ఒక్కో థియేటర్కు ఒక్కొక్కరు ఇన్చార్జ్గా ఉంటున్నారు. వీరితో పాటు ప్రతి థియేటర్కు శిక్షణ పొందిన స్టాఫ్నర్సులను సైతం డ్యూటీలో నియమిస్తారు. వీరంతా సంబంధిత థియేటర్లో ఎలాంటి ఇన్ఫెక్షన్కు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా చెప్పులతో పాటు డ్రెస్ కూడా మార్చుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ కొందరు వైద్యులు, వైద్య విద్యార్థులు యథేచ్ఛగా థియేటర్లోకి బయటకు తిరుగుతున్నా ఏ ఒక్కరూ అడిగే సాహసం చేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు ఆపరేషన్ థియేటర్లలో ఇన్ఫెక్షన్ రేటు అధికమై పలుమార్లు ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అవయవదాన మార్పిడికి అనుమతి తెచ్చుకున్న కర్నూలులోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో బ్రెయిన్ డెడ్ అయిన వారికి అవయవాల సేకరణ, మార్పిడి ప్రక్రియ జోరుగా సాగుతోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రం ఇప్పటి వరకు ఒకరికి మాత్రమే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఇలా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి సైతం కొంత కాలానికి కోలుకోలేక మృతి చెందాడు. దీని తర్వాత మరో నలుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. కాగా గతంలో బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి ఓ వ్యక్తి నుంచి అవయవాలను సేకరించి ఒక వ్యక్తికి కిడ్నీ మార్పిడి చేసి, ఇతర అవయవాలను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. నాలుగేళ్లుగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా అవయవమార్పిడి ఆపరేషన్ జరగలేదు. ఆసుపత్రిలో కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల మార్పిడికి అనుమతి ఉంది. ఇందుకు సంబంధించి నిపుణులైన వైద్యులు, మా డ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. కానీ అవయవదానానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు సాగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అనుమతి ఉన్న ఈ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అవయవ మార్పిడి కేంద్రంగా చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. జీజీహెచ్లో.. -
సహస్ర ఘటాభిషేక పూజలు ప్రారంభం
శ్రీశైలంటెంపుల్: వర్షాలు కురిసి పంటలు బాగా పండి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో శ్రీశైల దేవస్థానం ఐదు రోజుల పాటు చేపట్టిన వరుణయాగ సహిత ఘటాభిషేక విశేష పూజలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభ పూజల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యురాలు జి.గంగమ్మ పాల్గొని ప్రధానాలయ గోపురం నుంచి పసుపు, కుంకుమ, పూలు, రుష్యశృంగ మహర్షి చిత్రపటంతో ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం అక్కమమాదేవి అలంకార మండంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ, రుత్విగ్వరణం, రుష్యశృంగజపం, వారుణానువాక పారాయణలు, వరుణజపం, భాగవత, విరాటపర్వపారాయణలు, పంచాక్షరి జపాలు జరిపించారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 36 మంది రుత్వికులు పాల్గొన్నారు. -
మేము వద్దన్నా కార్యకర్తలు ఊరుకోరు!
● వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికర్నూలు(సెంట్రల్): వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక తాము వద్దన్నా నేడు గాయపడిన, అవమానపడిన, కేసులు పెట్టించుకున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరుకోరని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్థార్థ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ఆలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు వైకుంఠం మల్లికార్జునతో కలిసి అక్రమ కేసులో కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షిని ములాఖత్లో కలసి ధైర్యం చెప్పారు. అనంతరం బైరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తను కాపాడుకునేందుకు వెళ్లిన ఎమ్మెల్యే కార్లను పగులగొట్టి, ఎమ్మెల్యే తమ్ముడి చేయి విరగొట్టిన టీడీపీ నాయకులు తిరిగి వారిపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. పోలీసులు దాడి చేసిన వారిని వదలి బాధితులపై అక్రమ కేసులు పెడుతున్నారంటే ఇది ఏ సంస్కృతికి దారి తీస్తుందో వారికే తెలియాలన్నారు. ముచ్చుమర్రిలో బోయ సామాజిక వర్గానికి చెందిన 8ఏళ్ల బాలిక తప్పి పోయి రెండేళ్లవుతున్నా బోయ కులస్తులు ఏమయ్యారని ప్రశ్నించారు. ఆదోని నియోజకవర్గం ధనాపురంలో అక్కడి బీజేపీ ఎమ్మెల్యే బి.పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మలు దళిత సర్పంచ్ను కాళ్ల దగ్గర నిలబెట్టుకొని దారుణంగా అవమానించినప్పుడు ఆ సామాజిక వర్గం నేతలు ఎందుకు స్పందించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే విషయంలో ఈ రెండు సామాజిక వర్గాలు నిరసనలు తెలుపడం విడ్డూరంగా ఉందన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని, ఇందుకోసం టీడీపీ నాయకులే సమయం, తేదీ చెప్పాలని సవాల్ విసిరారు. మంత్రి లోకేష్ చర్చకు వస్తే తమ పార్టీ నాయకులు అందుకు సిద్ధమన్నారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కేసులకు భయపడరన్నారు. ఎక్కడైనా అక్రమ కేసులు పెడితే పార్టీ అండగా నిలిచి పోరాడుతుందన్నారు. వైఎస్సార్సీపీ ఆలూరు నాయకుడు వైకుంఠం మల్లికార్జున మాట్లాడుతూ నాగరాజు అనే వ్యక్తి తాళి కట్టిన భార్య బట్టలు చింపి అవమానించాడని, అతడిని తీసుకెళ్లి జైలులో వేయకుండా ఎమ్మెల్యేపై కేసు పెట్టడం దారుణమన్నారు. -
మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి
కర్నూలు(టౌన్): డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని యువకులు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు శుక్రవారం ఉధృతంగా కొనసాగాయి. పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. రిలే దీక్షల్లో పత్తికొండ, ఆదోనికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కంగాటి శ్రీదేవి, సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, కర్నూలు పార్లమెంటరీ ఇన్చార్జ్ బుట్టా రేణుక, కోడుమూరు, ఎమ్మిగనూరు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షల్లో తాము మోసపోయామని నిరుద్యోగులు ఆందోళనలు చేశారని, కొంత మంది కోర్టును ఆశ్రయించారన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం విచారణకు ఆదేశించకపోవడం దారుణమన్నారు. తప్పు చేయకుంటే ఎందుకు డీఎస్సీలో జీవోలు పదేపదే మార్చారని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేయ్యలేదా అని ప్రశ్నించారు. రెండేళ్లు దాటినా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను దగా చేశారన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ నిధులు రాక విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించడం లేదా అన్నారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వంపై పోరాటం చేసి సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. ● కర్నూలులోని ధర్నా చౌక్లో వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. మహిళ జిల్లా అధ్యక్షురాలు సిద్ధారెడ్డి రేణుక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ, కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామక్రిష్ణ, యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, కర్నూలు నగర అధ్యక్షుడు బాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● ఆదోనిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి తబ్రేజ్, కార్యదర్శి జీవన్ సింగ్, మాజీ కౌన్సిలర్ రామలింగేశ్వర యాదవ్ పాల్గొన్నారు. ● కోడుమూరు పాతబస్టాండ్ సెంటర్లో సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టా ప్రతుల్, జెడ్పీటీసీ సభ్యుడు రఘనాథ రెడ్డి, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేష్ పాల్గొన్నారు. ● ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్ వద్ద సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. పార్టీ సీనియర్ నాయకులు రియాజ్ అహమ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచాని వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, వార్డు ఇన్చార్జ్లు పాల్గొన్నారు. ● పత్తికొండలో ఊరు వాకిలి వద్ద మాజీ ఎమ్మెల్యే , పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామచంద్రయ్య సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకుల పాడు ప్రదీప్ రెడ్డి, క్రిష్ణగిరి, పత్తికొండ మండలాల అధ్యక్షులు కంగాటి వెంకటరామిరెడ్డి, నారాయణ దాసు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ● మంత్రాలయంలోని రాఘవేంద్ర సర్కిల్లో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి అధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కొనసాగిన వైఎస్సార్సీపీ రిలే నిరాహారదీక్షలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నియోజకవర్గ సమన్వయకర్తలు -
ఖరీఫ్లో 74 శాతం భూముల్లో సాగు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సాధారణ సాగు 4,35,104 హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3,23,332 హెక్టార్లలో (74 శాతం భూముల్లో) పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు 2,39,774 హెక్టార్లు ఉండగా 2,21,801 హెక్టార్లలో సాగైంది. మిగిలిన పంటలన్నీ కలిపి 1,01,531 హెక్టార్లలో సాగయ్యాయి. జిల్లాలో వరి సాధారణ సాగు 13,243 హెక్టార్లు ఉండగా 152 హెక్టార్లలో సాగైంది. వేరుశనగ 19,988, ఆముదం 8,422, కంది 47,020, ఉల్లి 4,988, మిర్చి4,149, సజ్జ 4,356, మొక్కజొన్న 1,522, కొర్ర 448, టమాట 1,497 హెక్టార్ల ప్రకారం సాగయ్యాయి. వర్షాభారంతో పత్తి, కంది, ఆముదం, ఉల్లి, టమాట తదితర పంటలు లక్ష హెక్టార్ల వరకు దెబ్బతిన్నాయి. 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కర్నూలు(అర్బన్): జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి డి.సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే జిల్లాలోని అన్ని గిరిజన సంఘాల నాయకులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. బీఎడ్ నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ నెలలో జరిగిన బీఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https://rayalaseema university.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. నాల్గవ సెమిస్టర్కు సంబంధించి రెగ్యులర్ విద్యార్థులు 3,241 మంది పరీక్షలు రాయగా.. 2,829 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి 203 మంది పరీక్షలు రాయగా 124 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. శాకంబరీగా కొలనుభారతి కొత్తపల్లి: కొలనుభారతీ క్షేత్రంలో శుక్రవారం శాకంబరీ ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. శుక్రవారం సరస్వతీదేవి అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో శాకాలంకరణ, ఉత్సవ సంబంధిత పూజలు చేపట్టారు. కార్యక్రమంలో ముందుగా అర్చకులు, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పూజలు చేశారు. కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, శివమ్మ, శ్రీశైల దేవస్థానం ఏఈఓ ఫణీంద్ర ప్రసాద్, శ్రీశైల ప్రభ ఎడిటర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాముకాటుతో వలస కూలీ మృతి కొందుర్గు: పాముకాటుతో వలస వెళ్లిన మహిళా కూలీ మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కొందుర్గులో చోటుచేసుకుంది. పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన శాంతమ్మ(45), రంగస్వామి దంపతులతోపాటు మరో పదిమంది వారం రోజుల క్రితం కూలి పనుల కోసం లూర్దునగర్కు చెందిన పోతిరెడ్డి శౌరెడ్డి వద్దకు వచ్చారు. శుక్రవారం అందరూ కలిసి ఉమ్మెంత్యాల గ్రామంలో శౌరెడ్డికి చెందిన కౌలుకు తీసుకొని సాగుచేసిన పత్తి పంటలో కలుపు తీయడానికి వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం శాంతమ్మను పెంజర పాము కాటు వేసినట్లు తోటి కూలీలు గమనించారు. వెంటనే చికిత్స కోసం కొందుర్గు పీహెచ్సీకి అక్కడి నుంచి షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు చెప్పారు. -
పాత ఇంట్లో ‘గుప్త’ తవ్వకాలు
సి.బెళగల్: గుప్త నిధుల కోసం సి.బెళగల్లోని పాడుబడిన ఇంట్లో తవ్వకాలు జరిపారు. స్థానికులు గుర్తించి పోలీసులకు శనివారం సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా 10 అడుగుల లోతులో భారీ గొయ్యి, తవ్వకాలకు వాడిన పనిముట్ల కనిపించాయి.గొయ్యి తవ్విన ఇంటి పరిసరాల్లో పసుపు, కుంకుమ చల్లి ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. మరో పాత గదిలో తవ్వి మధ్యలో వదిలేసిన గొయ్యి కనిపించింది. ఇంటి యజమాని ఆదేశాల మేరకు కూలీలు గొయ్యి తవ్విన గదిలోకి వెళ్లే కిటికీకి అడ్డుగా గోడను నిర్మాంచారు. పాడుబడిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపి గుప్తనిధులు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో వాస్తవం వెలుగుచూడాల్సి ఉంది. ముచ్చుమర్రి పంప్హౌస్కు చేరిన కృష్ణా జలాలు పగిడ్యాల: కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న విస్తారమైన వర్షాలకు శ్రీశైలం రిజర్వాయర్కు వరద జలాలు పోటెత్తాయి. ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రస్తుతం నీటి మట్టం 871.70 అడుగులకు చేరుకుంది. దీంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్హౌస్ జలకళ సంతరించుకుంది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కేసీసీ లిఫ్ట్ రెండు మోటర్ల ద్వారా కేసీ కాలువకు కృష్ణా జలాలు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. కర్నూలు(సెంట్రల్): జిల్లాలో సెప్టెంబర్ 2 నుంచి వంద సీజనల్ హాస్టళ్లను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వలసలు వెళ్లే కుటుంబాల పిల్లల విద్యాభ్యాసానికి ఎలాంటి అంతరాయం కలుగకుండా 2026–27 విద్యా సంవత్సరానికి సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. -
సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం
కర్నూలు (టౌన్): సీసీ కెమెరాలు నిఘాను మరింత పటిష్టం చేస్తాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. బి.తాండ్రపాడు సమీపంలోని కాదంబరి టౌన్షిప్లో శుక్రవారం 35 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీ, అపార్ట్మెంట్, వ్యా పార సంస్థల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చన్నారు. పోలీసులు, ప్రజల సమన్వయంతో నే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐ కేశవ రెడ్డి,తాలూకా సీఐ తేజమూర్తి,కాదంబరి టౌన్షి ప్కాలనీఅసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో అవమాన భారంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బుడగజంగాల శేఖర్ గౌండ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన తూర్పాటి వెంకటేశ్వర్లు శేఖర్ వద్ద దాదాపు రూ. 2 లక్షల వరకు అప్పు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రెండు రోజుల క్రితం అప్పు డబ్బులు తిరిగి చెల్లించాలని వెంకటేశ్వర్లును శేఖర్ ఒత్తిడి చేశారు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడం వలన శేఖర్పై వెంకటేశ్వర్లు దాడికి పాల్పడ్డాడు. అప్పు తీసుకుని దాదాపు మూడేళ్లు అవుతున్నా తిరిగి చెల్లించకపోగా అడిగినందుకు తనపైనే దాడి చేయడాన్ని జీర్ణించుకోలేని శేఖర్ గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనిని కుటుంబీకులు కర్నూలుకు తరలించారు. -
‘సాగు’తున్న నిర్లక్ష్యం!
● టీబీ డ్యామ్లో ఆశాజనకంగానే నీటి లభ్యత ● ఎల్లెల్సీ ఆయకట్టుకు నీరిచ్చే విషయంపై తర్జనభర్జన కర్నూలు (సిటీ): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి కొంత ఆలస్యంగానైనా వరద నీరొచ్చి చేరుతోంది. నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఆయకట్టుకు నీరిచ్చే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. టీబీ డ్యాంలోకి నీరొస్తుందనే ఆశతో వేలాది మంది ఆయకట్టు రైతులు పంటలను సాగు చేసి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో అప్పులు చేసి సాగు చేసిన పంటలను చూసి తట్టుకోలేని చాలామంది తొలగించారు. టీబీ డ్యాంలో నీరొస్తే ఆరుతడి పంటలను సాగు చేయొచ్చని ఆశించారు. అయితే జల వనరుల శాఖ ఇంజినీర్లు, టీబీ డ్యాం ఇంజినీర్లు సాగు నీటి విషయంపై ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల సాకు! ప్రస్తుతం డ్యాంలో 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది, డ్యాంలోకి 47 వేల క్యుసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. బోర్డు నిబంధనల ప్రకారం 40 టీఎంసీలకుపైగా నీరు ఉండి, ఎగువ నుంచి ఇన్ఫ్లో ఆవుట్ ఫ్లో కంటే ఎక్కువగా ఉంటే సాగు నీటిని విడుదల చేయాలి. కానీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులను సాకు చూపించి కాల్వలకు నీటిని విడుదల చేయకపోవడం బట్టి చూస్తుంటే ఖరీఫ్ పంటలకు సాగు నీటిని అందించే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉందని, ఒకటి, రెండు రోజుల్లో కర్ణాటక సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించి ఖరీఫ్ పంటలకు నీరు ఇవ్వాలా? వద్దా అని నిర్ణయం తీసుకోనున్నారు. 4.46 లక్షల ఎకరాల ఆయకట్టు తుంగభద్ర రిజర్వాయర్ సామర్థ్యం 105.788 టీఎంసీల కాగా.. జూన్ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఈ ఏడాది 62 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఆగస్టు 7వ తేదీ నాటికి 208.90 టీఎంసీల తుంగభద్ర జలాల నీటి లభ్యత వచ్చింది. గత పదేళ్లలో సరాసరిగా 76.49 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు టీబీ డ్యాం అధికార వర్గాలు చెబుతున్నాయి. కేడబ్ల్యూడీటీ–1 ప్రకారం ఉమ్మడి జిల్లాల్లోని దిగువ కాలువకు 29.5 టీఎంసీలు ఇవ్వాలి. అలాగే కర్నూలు–కడప కాలువకు 39.90 టీఎంసీల(ఇందులో 29.9 టీఎంసీలు తుంగభద్ర నది ప్రవాహం నీటి నుంచి, 10 టీఎంసీలు టీబీ డ్యాంలో నిల్వ నీటి నుంచి) నీరు ఇవ్వాలి. ఆ నీటిపై ఆధారపడి సుమారు 4.46 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. టీబీ డ్యాం అధికార వర్గాలు చెబుతున్న గణాంకాల ప్రకారం జూలై చివరి నాటికి కనీసం డ్యాంలోకి 80 టీఎంసీలకు పైగా రావాలని ఆ స్థాయిలో ఈ ఏడాది నీటి లభ్యత లేకపోవడంతోనే ఆయకట్టుకు ఇవ్వడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. కేసీ పక్కనే నీరు...అయినా కన్నీరే! తుంగభద్రనదిపై ఆధారపడిన కేసీ కాలువ ఆధారిత తాగునీటి పథకాలను నీరు అందడం లేదు. ఆ పథకాలపై ఆధారపడిన గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మల్యాల దగ్గర కేసీకి నీటిని పంపింగ్ చేసేందుకు ఉన్న రెండు మోటర్లను ఆన్చేస్తే తాగునీటి ఇబ్బందులు తీరుతాయని ప్రజలు కోరుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కేసీ కెనాల్పై నందికొంట్కూరు నగర పంచాయతీకి తాగు నీటిని అందించే వాటర్ స్కీం ఉంది. అలాగే లక్ష్మాపురం తాగు నీటి పథకం, మిడ్తూరు మండలానికి తాగు నీటిని అందించే స్కీంకు నీరు లేదు. ఆ స్కీంలపై ఆధారపడిన ప్రజలు శ్రీశైలం ప్రాజెక్టు పక్కనే ఉన్నా తమ దాహం తీర్చేందుకు అవకాశం లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 70 టీఎంసీల వరకు నీరు ఉంది. తాగునీటి అవసరాలకు కోసమే విడుదల చేస్తున్నాం. ఆయకట్టుకు నీరు ఇవ్వాలనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ ప్రభుత్వం నుంచి సాగుకు ఎలాంటి ఇండెంట్ రాలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంది. ఎగువన వర్షాలు తగ్గుతుండడంతో నీటి చేరికలు హెచ్చు, తగ్గులు ఉన్నాయి. – నారాయణ నాయక్, టీబీ డ్యాం, ఎస్ఈ -
డబ్బుల పంచాయితీలో కొట్టుకుంటే వైఎస్సార్సీపీకి ఏమి సంబంధం?
కర్నూలు (టౌన్): తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు డబ్బుల పంచాయితీలో బజారులో రాళ్లతో కొట్టుకుంటే వైఎస్సార్సీపీకి ఏమి సంబంధమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలులో షేక్ ఇంతియాజ్ హత్య ఘటనలో అన్యాయంగా ఇమ్రాన్, వస్తాద్లను ఇరికించారన్నారు. కత్తులు, కటార్లు పట్టుకుని దాడి చేశారా, అప్పటికప్పుడు రాళ్లతో కొట్టుకుని చనిపోతే వీరికేమి సంబంధమని ప్రశ్నించారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే పాతబస్తీలోని మాసూం బాషా దర్గా వద్ద జరిగిన హత్య ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ద్వారా వీడియోలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం నేతల ఒత్తిడితోనే సంబంధం లేని వ్యక్తులను హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నారన్నారు. మంత్రి ప్రోద్బలంతోనే ఈ కుట్ర చేస్తున్నారని, న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొంటామన్నారు. ఇటువంటివి మంచి పద్ధతి కాదని, ప్రభుత్వం మారితే ఇదే సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. హత్య కేసులో నమోదు చేసిన పేర్లకు సంబంధించి పోలీసులు నిజానిజాలు తేల్చాలన్నారు. గురువారం రాత్రి కర్నూలు పాతబస్తీలో షేక్ ఇంతియాజ్ హత్య ఘటనలో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. అనవసరంగా హత్య ఘటనలో లేని వ్యక్తులను ఇరికించడం టీడీపీకి నేతలకు తగదన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు.సంబంధం లేని వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా పోలీసు యంత్రాంగానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలన్నారు. – మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇమ్రాన్, వస్తాద్లను అక్రమంగా కేసులో ఇరికించారు హత్య ఘటనలో సీసీ కెమెరాలను పోలీసులు బయటపెట్టాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి -
చేనేత కార్మికులను మోసం చేసిన చంద్రబాబు
కర్నూలు (టౌన్): అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికులను సీఎం చంద్రబాబు మోసం చేస్తూ వచ్చారని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక విమర్శించారు. కర్నూలులోని వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు బుట్టా శివ నీల కంఠం, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుట్టా ప్రతూల్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు, కుర్ని నాయకులు రాధక్రిష్ణ హాజరయ్యారు. తొలుత మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖర్ రెడ్డి, చేనేత రంగానికి విశిష్ట సేవలందించిన మాచాని సోమప్ప చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండున్నర్ర ఏళ్ల తరువాత నేతన్న కు రూ.25 వేలు ఇస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కరోనా వంటి ఇబ్బందులు ఉన్నా ఐదేళ్ల పాటు రూ. 24 వేలు అందించిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక వెయ్యి పెంచి రెండేళ్ల తరువాత మంజూరు చేస్తోందన్నారు. మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని, కొర్రీలు పెట్టి ఎగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. అద్దె ఇంట్లో ఉన్నా.. అద్దెకు మగ్గం తీసుకొని వృత్తిని కొనసాగిస్తున్న వారందరికీ నిధులు ఇవ్వాలన్నారు. త్వరలోనే బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతన్నల కోసం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. చేనేత సోసైటీలను కాపాడుకుంటామన్నారు. అనంతరం కర్నూలు, కల్లూరు, ఎమ్మిగనూరు ఇతర ప్రాంతాల నుంచి నేతన్నలు బుట్టా రేణుకను ఘనంగా సత్కరించారు. -
రాజకీయ విభేదాలతో యువకుడి దారుణ హత్య
కర్నూలు(టౌన్): కర్నూలు నగరంలో గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక పాతబస్తీకి చెందిన షేక్ ఇంతియాజ్(32) 2024 కర్నూలు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇతను టీడీపీకి చెందిన మంత్రి టీజీ భరత్ అనుచరుడిగా తెలుస్తోంది. ఇంతియాజ్కు ప్రత్యర్థులు మహబూబ్ అలీ, ఇమ్రాన్ అనే వ్యక్తులతో రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. గతంలో మృతుడు ప్రత్యర్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో వారిపై రాజకీయ, మోసం కేసులను నమోదు చేశారు. గతేడాది ఏప్రిల్లో ఇంతియాజ్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. గతంలో వీరి మధ్య గొడవలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో రాజకీయంగా కక్ష పెంచుకున్న నిందితులు ఉస్తాద్ మహబూబ్ అలీ, ఇమ్రాన్ వారికి అనుచరులుగా ఉన్న జవాద్, ఇర్ఫాజ్ అర్ధరాత్రి సమయంలో మాసుం బాషా దర్గా సమీప పాన్ షాపు వద్ద ఇంతియాజ్తో గొడవ పడ్డారు. నిందితులు బండరాయితో ఇంతియాజ్ తలపై మోదడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన మృతుడి స్నేహితులు సుభాన్, అల్తాఫ్ కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. ఇంతియాజ్ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడి తమ్ముడు షేక్ ఇలియాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు. -
టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
కర్నూలు (టౌన్) : టిప్పర్ ఢీకొనడంతో ఒక యువకుడు మృతిచెందాడు. కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన బందీ పరమేష్ (25) వృత్తిరీత్యా సెంట్రింగ్ పని చేస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంటి నుంచి తన స్నేహితుడు గణేష్ను కూర్చోబెట్టుకుని ద్విచక్ర వాహనంలో బిర్లా గడ్డలోని కాంట్రాక్టర్ను కలిసేందుకు వెళ్లాడు. పని విషయమై మాట్లాడుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో స్థానికంగా కొత్త అయ్యప్ప స్వామి గుడి దగ్గర్లోని అగ్రసేని హాస్పిటల్ టర్నింగ్ వద్ద టిప్పర్ వాహనం (ఏపీ39 డబ్ల్యూ ఎన్ 0378) డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్ను ఢీకొట్టాడు. దీంతో బందీ పరమేష్ తీవ్ర గాయాలకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మిత్రుడికి కుడి కాలు స్వల్ప రక్తగాయాలయ్యాయి. వెంటనే స్థానికుల సహాయంతో ఆటోలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. క్యాజువాలిటీ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయాడని వెల్లడించారు. మృతుని తండ్రి హుసేనయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు డ్రంకెన్ డ్రైవ్ కేసులో నలుగురికి జైలు శిక్ష డోన్ రూరల్: వివిధ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురికి జైలు శిక్ష పడింది. మరో నలుగురికి ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా విధించారు. డోన్ రూరల్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓబులాపురానికి చెందిన వీ.రమేష్కు రెండు రోజుల శిక్ష, రామదుర్గానికి చెందిన సూరన్నకు 10 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం డోన్ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు డోన్ రూరల్ సీఐ రాకేష్, ఎస్ఐ మమత తెలిపారు. డోన్ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుబడిన వెల్దుర్తి మండలం గువ్వలకుంట్ల గొల్ల శేఘుకు మూడు రోజులు జైలు శిక్ష, కృష్ణగిరి మండలం చిట్యాలకు చెందిన గుడిసె మద్దిలేటి నాయుడుకు రెండు రోజులు జైలు శిక్ష విధించారు. అలాగే వీ.నగేష్,కే రాజు,సీ కల్యాణ నాయుడుకు జడ్జి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించినట్లు సీఐ ఇంతీయాజ్ బాషా, ఎస్ఐ శరత్ కుమార్ తెలిపారు. నంద్యాల(వ్యవసాయం): నంద్యాల పట్టణంలో వై జంక్షన్ డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన హుస్సేన్ సాహెబ్కు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ న్యాయమూర్తి మద్దెల శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ సుబ్రమణ్యం తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవర్తో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. -
చోరీ కేసులో కర్ణాటక వాసి అరెస్ట్
బొమ్మలసత్రం: నంద్యాల రూరల్ పోలీస్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షోరాణ్, సబ్డివిజన్ ఏఎస్పీ సుస్మిత పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నంద్యాల మండలం రైతునగరం గ్రామ సమీపంలోని శివసాయి గార్డెన్స్లో కోదండరామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. గతేడాది మార్చి 7న రాత్రి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు దంపతులు బయటకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న 11.5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురువారం ఉదయం పోలీసులు రైతునగరం బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక రాష్ట్రం దండేలి గ్రామానికి చెందిన జాఫర్ అని, దొంగతనానికి పాల్పడింది తానేనని అంగీకరించాడు. చోరీకి పాల్పడిన వారిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వివరించారు. నిందితుడి వద్ద ఉన్న 11.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన తాలుకా సీఐ ఈశ్వరయ్య, సీసీఎస్ సీఐ సురేష్కుమార్ తదితర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆభరణాలు స్వాధీనం -
హడావుడిగా పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల
● తాగునీటి అవసరాలకు మాత్రమేనన్న ఎస్ఈ ● సాగునీటిపై ప్రశ్నిస్తారని మొహం చాటేసిన ప్రజాప్రతినిధులు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి గురువారం ఉదయం 8.30 గంటలకు జలవనరులశాఖ ఎస్ఈ శివశంకర్రెడ్డి, ఈఈ సుబ్రమణ్యంరెడ్డి, డీఈ నగేష్ హడావుడిగా నీటిని విడుదల చేశారు. ప్రభుత్వం ఉదయం 8 గంటలకు అనుమతిచ్చినట్లు పేర్కొన్న ఎస్ఈ అరగంటలోనే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడాన్ని చూస్తే ఏదో మతలబు ఉందనే విషయం అవగతం అవుతుంది. గేట్లకు పూజలు చేసి 5, 6 గేట్లను స్విచ్ ఆన్ చేసి 2 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్మకు పూజలు చేసి వాయనం సమర్పించి రెగ్యులేటర్ వద్ద ఒక్క అధికారి కూడా ఉండకుండా వెళ్లిపోవటం గమనార్హం. సాయంత్రం 6గంటల సమయానికి నీటి విడుదలను 4వేల క్యూసెక్కులకు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. ఈ విషయమై ఎస్ఈ శివశంకర్రెడ్డిని ఫోన్లో సమాచారం అడగ్గా.. ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 10 టీఎంసీలను తాగునీటి అవసరాల కోసం విడుదల చేసుకునేందుకు అనుమతివ్వడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నీటితో వెలుగోడు, గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లను నింపుతామన్నారు. ఆయకట్టు కింద పంటలు ఎండుతున్నాయని, సాగునీటి సంగతేంటని ప్రశ్నించగా శ్రీశైల జలాశయంలో వరద పెరిగి ప్రభుత్వం అనుమతిస్తే విడుదల చేస్తామని చెప్పారు. మొహం చాటేసిన ప్రజాప్రతినిధులు ఏటా పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసేందుకు పోటీపడే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం మొహం చాటేయడం గమనార్హం. పోతిరెడ్డిపాడు దిగువన ఉన్న ఎస్సార్బీసీ, జీఎన్ఎస్ఎస్, కేసీ ఎస్కేప్ కాల్వల ఆయకట్టు కింద పంటలు ఎండుతున్నాయి. సాగునీటి కోసం రైతులు ప్రశ్నిస్తారని గ్రహించిన ప్రజాప్రతినిధులు గేట్లు ఎత్తేందుకు మొహం చాటేయ్యడంతో రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
నేతన్న సేవలో సి‘ఫార్సు’!
టీడీపీ మహిళా నేత పెత్తనం కర్నూలు(అగ్రికల్చర్): పార్టీలకు అతీతంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. చేనేత కార్మికుల కోసం రెండేళ్ల తర్వాత అమలు చేస్తున్న నేతన్న సేవలో టీడీపీ నేతల సిఫార్సులకే పెద్ద పీట వేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నేతన్న సేవలో పథకాన్ని అమలు చేయనున్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లి నియోజకవర్గం నందివర్గంలో కార్యక్రమాలు నిర్వహించను న్నారు. ఒక్కో చేనేత కార్మికుడి కుటుంబానికి రూ.25 వేల ప్రకారం నిధులు విడుదల చేయనున్నారు. టీడీపీ నేత జోక్యం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేల ప్రకారం అర్హులందరికీ అందజేసింది. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. అర్హతకు పెద్దపీట వేశారు. నేతన్న సేవలో అంటూ చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు అమలు చేయలేదు. ప్రస్తుతం అర్హులైన చేనేతకార్మికులను పక్కన పెటి సిఫార్సులకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేత జోక్యం మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ఆ నేత ఆధ్వర్యంలోనే జరిగినట్లు సమాచారం. అనర్హులే ఎక్కువ నేతన్న సేవ పథకానికి ఉచిత విద్యుత్తో లింక్ పెట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ నేతన్న నేస్తం కింద లబ్ధిపొందిన వారి జాబితాలను పరిశీలన కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు పంపారు. తమకు వచ్చిన జాబితాలోని పేర్లనే పరిశీలిస్తున్నామని చెప్పిన సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓలు తర్వాత టీడీపీ నేతల ఒత్తిళ్లతో అనర్హులకు సైతం పెద్దపీట వేశారు. కర్నూలు జిల్లాలో 3,259 కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 590 పేర్లను పరిశీలన కోసం పంపగా...పలువురు అనర్హులకు స్థానం కల్పించారు. ఎమ్మిగనూరు నియోజక వర్గంలో 1,925 చేనేత కార్మిక కుటుంబాల పేర్లను పరిశీలన కోసం పంపగా..2,280 చేనేత కార్మిక కుటుంబాలకు నేతన్న సేవలో అర్హత ఉన్నట్లు ప్రకటించారు. ఒక్క ఎమ్మిగనూరు నియోజక వర్గంలోనే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అదనంగా 355 కుటుంబాలను చేర్చారు. ఇందులో అనర్హులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గుర్తింపు కార్డులు ఇవ్వలేదు ఎమ్మిగనూరు పట్టణంలో 30 మంది చేనేత కార్మికులు గుర్తింపు కార్డుల కోసం ఏడాది నుంచి అధికారుల చు ట్టూ తిరుగుతున్నారు. వారి వివరాలను ఆన్లైన్లో ఉ ంచారు. వారి మగ్గాలను పరిశీలించి చేనేత, జౌళి శాఖ అధికారులు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉంది. వీరికి ఏ డాది నుంచి గుర్తింపు ఇవ్వలేదు. ఫలితంగా నేతన్న సే వలో పథకానికి వీరు దూరం అయ్యారు.రాజకీయ ఒత్తిళ్లతో అనర్హులకు స్థానం కల్పించిన అధికారులు అద్దె ఇళ్లలో ఉంటున్న చేనేత కార్మికులను సైతం పక్కన పుంచారు. అద్దె ఇళ్లు అనే కారణంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వందలాది మందికి అన్యాయం జరిగింది. ఉమ్మడి జిల్లాలో 4,469 కుటుంబాల ఎంపిక నేతన్న సేవలో పథకం కింద కర్నూలు జిల్లాలో 3,750, నంద్యాల జిల్లాలో 719 చేనేత కార్మికుల కుటుంబాలను ఎంపిక చేశారు. లబ్ధిదారుల ఎంపిక టీడీపీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే జరిగినట్లు సమాచారం. మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికకు ప్రయత్నించిన అధికారులను ప్రజాప్రతినిధులు భయపెట్టి దారిలోకి తెచ్చుకున్నారు. రాజకీయ జోక్యం పెరుగడంతో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని చేనేత కార్మిక సంఘాల నేతలే పేర్కొంటున్నారు. పలు చోట్ల అర్హులను పక్కన పెట్టి అనర్హులకు స్థానం కల్పించారనే విమర్శలు వస్తున్నాయి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో మగ్గాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితమే చేనేత వృత్తి నుంచి వైదొలిగిన వారు టీడీపీ నాయకురాలిని ఆశ్రయించారు. అధికారులకు ఆమె ఫోన్ చేసి ప్రస్తుతం మగ్గం ఉన్నా.. లేకున్నా.. అందరి పేర్లు రాయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో అనర్హులకు కూడా పెద్ద పీట వేశారు. ‘సార్... మాకు మగ్గం ఉంది, కొన్నేళ్లుగా చేనేత వృత్తిలోనే రాణిస్తున్నాం. అయితే జాబితాలో మా పేర్లు రాలేదనే కారణంతో పక్కన పెట్టారు.’అని నిజమైన చేనేతకార్మికులు అధికారుల దృష్టికి తీసుకపోయినా ఫలితం లేకుండా పోయింది. నేతన్న సేవలో నిజమైన చేనేతకార్మికులకు న్యాయం జరగలేదు. అనర్హులకు పెద్దపీట వే యడం ఆందోళన కలిగిస్తోంది. కొన్నేళ్లుగా వస్త్రాలను తయారు చేయడమే ప్రధానవృత్తిగా పెట్టుకొని రాణిస్తున్న కుటుంబాలను పక్కన పెట్టడం దారుణం. ప్రభు త్వం చొరువ తీసుకొని అర్హులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. – కాలప్ప, చేనేతకార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి, ఎమ్మిగనూరు -
పులి మరణానికి ముళ్ల పందే కారణం
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలూటి రేంజ్లో పెద్దపులి(టి66ఎఫ్) మరణానికి ముళ్ల పందితో పోరాటమే కారణమని డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అపావ్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ కూడా ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు. టి66 ఎఫ్ పులి ముళ్ల పందిని వేటాడే క్రమంలో తీవ్రంగా గాయపడిందన్నారు. పులి సంచరించిన ప్రదేశాల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైందన్నారు.పులి కళేబరానికి పోస్ట్మార్టం చేసినప్పుడు కడుపులో ముళ్ల పంది ముళ్లు కనిపించినట్లు పేర్కొన్నారు. -
పులి దాడిలో రెండు ఆవులు మృతి
బండిఆత్మకూరు: మండలంలోని సింగవరం గ్రామ సమీపంలోని ఆముదాల చెరువు వద్ద పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాసిర్, సెక్షన్ ఆఫీసర్ నాగరాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆవులకు కళేబరాలకు పార్నపల్లె పశువైద్యాధికారి జ్యోత్స్న పోస్టుమార్టం చేశారు. మృతి చెందిన ఆవులు సోమయాజులపల్లెకు చెందిన తెలుగు సుబ్బరాయుడు, శ్రీనివాసులు అనే రైతులకు చెందినవని అధికారులు తెలిపారు. ఆ రైతులకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. పెద్దపులి సంచరిస్తున్నందున సింగవరం, జీసీ పాలెం, నెమళ్లకుంట, లింగాపురం, నాయినిచెరువు, రామాపురం, సోమయాజుల పల్లె, మణికంఠపురం గ్రామాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పశువులు మేపడానికి అటువైపు వెళ్లవద్దని రైతులను హెచ్చరించారు. బేతంచెర్ల: పట్టణంలోని కోటపేట కాలనీలో ప్రమాదవశాత్తు మిద్దె పైనుంచి కింద పడి యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామానికి చెందిన పెద్దస్వామి, సుంకమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీను (21) తన అక్క ఓలమ్మ, బావ చిన్నరాముడు ఊరైన బేతంచెర్లకు బుధవారం వచ్చాడు. రాత్రి ఇంటిపైన రెండవ ఫ్లోర్లో పడుకోగా వర్షం రావడంతో కిందకు దిగివచ్చే క్రమంలో ప్రమాదశాత్తు పైనుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చేతికి వచ్చిన కొడుకు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తల్లి సుంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ కేశవ రెడ్డి వెల్లడించారు. గొర్రెలకు మేతగా పత్తి పైరు గోనెగండ్ల: ఆరుగాలం శ్రమించి, కష్టనష్టాలను ఎదుర్కొని, అప్పులు చేసి మరి సాగుచేసిన పంటలు వర్షాలు లేక కళ్ల ముందే ఎండిపోతుండడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. చేసేది లేక కొందరు పైర్లను దున్నేస్తుండగా మరికొందరు పశువులకు మేతగా వదిలేస్తున్నారు. మండల పరిధిలోని వేముగోడు గ్రామానికి కౌలు రైతు రామారావు ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకొని పత్తి సాగుచేశాడు. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. బోరులో నీళ్లు అడుగంటిపోయాయి. పైరుకు నీరందక ఎదుగుదల లేకపోవడంతో గురువారం గొర్రెలకు మేతగా వదిలేశాడు. రూ.1.60 లక్షలు పెట్టుబడి పెట్టాను నేను ఎనిమిదెకరాల్లో పత్తి సాగుచేసి రూ.1.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. సకాలంలో వర్షాలు కరువకపోవడంతో మొక్క పెరగలేదు. దిగుబడులు ఎలాగు రావని తెలిసి పంటను గొర్రెలకు మేతగా వదిలేశాను. ఆశలన్నీ పంటపైనే పెట్టుకున్నా, చివరకు అప్పులే మిగిలాయి. ప్రభుత్వం ఉచితంగా పంటల బీమా చేసి ఆదుకోవాలి. – రామారావు, వేముగోడు గ్రామం -
హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
కర్నూలు (టౌన్): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చంద్రుడు డిమాండ్ చేశారు. గురువారం కొత్తపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయవాదుల సంఘం భవనంలో ఆయన మాట్లాడుతూ.. గత నెలలో ఆదోని పట్టణంలో జరిగిన సభలో 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారన్నారు. అయితే పత్రికల్లో వస్తున్న సమాచారం మేరకు క్యాంప్ లేదా సర్క్యూట్ బెంచ్కే పరిమితం చేస్తున్నారన్నారు. దీనివల్ల న్యాయవాదుల్లో ఆందోళన పెరిగిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటుకు అధికారికంగా చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు శుక్రవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. -
● ఎర్ర తెగులుతో పత్తి రైతు కుదేలు ● వర్షాభావంతో ఎండిన పంట ● ఆందోళనలో అన్నదాతలు
కృష్ణగిరి: ఈ ఏడాది పత్తి రైతు ల పరిస్థితి దయనీయంగా మారింది. కోటి ఆశలతో సాగుచేసిన తెల్ల బంగారం నిరాశ నింపుతోంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేసి పంట సాగుచేస్తే.. చివరకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి వారంలో సాగు చేసినప్పటి నుంచి వర్షం లేకపోవడంతో పంట ఎర్రగా మారి ఎండిపోతుంది. బోరు, బావుల కింద కూడా సాగు చేసిన పంట కూడా ఏపుగా వచ్చినా చివరకు ఎర్ర తెగులుతో రంగుమారుతోంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో వేరుశనగ పంటను తొలగించగా, మరో నాలుగైదు రోజుల్లో పత్తి పంటను కూడా తొలగించనున్నట్లు రైతులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో పత్తి పంటను జీవాలతో మేపుతున్నారు. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకంటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
సీనియర్ అసిస్టెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు
● రూ.2.80 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు కర్నూలు(టౌన్): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఫిర్యాదుతో గురువారం తెల్లవారు జామున నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గోపాల రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు నగరంలోని పెద్దపాడులో ఆయన నివసిస్తున్న మైత్రీ వనం ఇంటితో పాటు జొహరాపురం, ఆరోరానగర్, నంద్యాల సబ్రిజిస్ట్రర్ కార్యాలయం,అలాగే ఆయన బంధువుల ఇళ్లు, హైదరాబాదు, అనంతపురం ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. సోదాల్లో బాలాజీనగర్లో జీ ప్లస్ 2 భవనం, ఉల్చాల వద్ద రెండస్తుల భవనం, 5 చోట్ల ఇళ్ల స్థలాలు, ఒక కారును గుర్తించారు. ఏసీబీ ఇంచార్జి డీఎస్పీ సీతారామరావు మాట్లాడుతూ సోదాలు కొనసాగుతున్నాయని, బంధువుల ఇళ్లతో పాటు బ్యాంకు లాకర్లు పరిశీలించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు సోదాల్లో రూ.2.80 కోట్లు విలువ చేసే ఆస్తులు బయట పడినట్లు చెప్పారు. -
నీటి ఎద్దడి నివారించాలి
కర్నూలు(అర్బన్): జిల్లాలో తాగు, సాగు, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి సూచించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది అనేక గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడిందని, అలాగే వ్యవసాయానికి సాగు నీరు అందని పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ప్రక్రియలో ప్రజలు, రైతులకు తాత్కాలిక ఉపశమనం కల్పించడంతో పాటు, శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించేందుకు గురువారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్లోని మినీ సమావేశ భవనంలో జరిగిన ఈ సమావేశానికి జెడ్పీ సీఈఓ ఆర్ సుధాకర్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ మనోహర్, నంద్యాల ఆర్డబ్ల్యూఎస్ అధికారి శ్రీనివాసులు, ఈఈలు అబ్దుల్ఖాదర్, పద్మజ, ఇరిగేషన్ అధికారులు రాజన్బాబు, సుబ్రమణ్యంరెడ్డి, శివశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలువలకు నీరు వదిలితే సమస్య తగ్గుముఖం తాగునీటి సమస్య పరిష్కారానికి సంబంధించి నంద్యాల జిల్లాలో కుందూ నదికి నీరు సమృద్ధిగా వస్తే, కేసీ కెనాల్కు నీరు విడుదల చేస్తే పలు గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారం అవుతుందని నంద్యాల ఆర్డబ్ల్యూఎస్ అధికారి శ్రీనివాసులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఎల్ఎల్సీ నీరు విడుదలవుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని ఎస్ఎస్ ట్యాంకుల్లో 60 నుంచి 70 శాతం వరకు నీటి నిల్వలు ఉన్నాయని పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ మనోహర్ చెప్పారు. అలాగే హెచ్ఎన్ఎస్ఎస్కు కూడా నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నీటి సమస్య తగ్గే అవకాశం ఉందని చెప్పారు. సమావేశంలో హుందాగా వ్యవహరించాలి సమావేశం జరుగుతున్న సమయంలో ఆస్పరి జెడ్పీటీసీ సభ్యుడు దొరబాబు మాట్లాడుతూ మండంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, నాగనాథనహళ్లి వాటర్ స్కీం నుంచి ఆదోని మండలంలోని పలు గ్రామాలకు నీరు ఇవ్వడం వల్ల సమస్య జఠిలంగా మారిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఉద్దేశించి ఆయన మాట్లాడటం పట్ల ఏఈలు తాము కూర్చున్న స్థానాల నుంచి లేచి సమావేశం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అందరూ కూర్చోవాలని ఎస్ఈ మనోహర్ కోరడంతో ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. సమావేశాల్లో ఎవరు పరుషంగా మాట్లాడినా, నివారిస్తామన్నారు. ఏఈల తీరు పట్ల ఆయన ఇట్ ఈజ్ బ్యాడ్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. పలు అంశాలు సమావేశం దృష్టికి.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పలు అంశాలను వివిధ మండలాలకు చెందిన ఏఈలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎస్ఎస్ ట్యాంకులు, గుర్తించిన సోర్స్ నుంచి గ్రామం వరకు నీటిని తీసుకువెళ్లినా, గ్రామ పంచాయతీల్లో నిర్వహణ లోపం వల్ల కూడా నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు ఏఈలు చెప్పారు. అలాగే పలు గ్రామ పంచాయతీల్లో వాటర్మెన్స్కు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వేసిన పైప్లైన్లు పాడైపోవడం వల్ల కూడా డిజైన్ ప్రకారం చివరి ప్రాంతాలకు నీరు అందని పరిస్థితి నెలకొనిందని పలువరు ఏఈలు వాపోయారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాల్లో శివారు కాలనీలు పెరగడం వల్ల కూడా నీటిని నిర్ణీత సమయానికి వారి అవసరాల మేరకు అందించలేకపోవడం తదితర కారణాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పలు గ్రామాలకు అదనంగా బోర్లు మంజూరు చేయాలని పలువురు జెడ్పీటీసీలు కోరారు. ఈ సమావేశానికి జెడ్పీటీసీ సభ్యులు జగదీశ్వరరెడ్డి, యుగంధర్రెడ్డి, మౌలాలి, బీ రఘునాథ్రెడ్డి, రామకృష్ణ, మహేశ్వరరెడ్డి, సుధాకర్రెడ్డి, రంగనాథ్గౌడ్, రాజ్కుమార్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్కు నీరు ఇవ్వాల్సిందే... ప్రస్తుత ఖరీఫ్కు కచ్చితంగా జిల్లాలోని రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయాలని జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఖరీఫ్కు నీటిని విడుదల చేయలేమనే అపోహలో ఇరిగేషన్ ఇంజినీర్లు ఉన్నారని, అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టులకు ఇన్ఫ్లో సంతృప్తికర స్థాయిలో ఉందన్నారు. ముఖ్యంగా వరద ప్రవాహం తగ్గుతున్న సమయంలోనే ముందస్తుగా జిల్లాలోని అన్ని రిజర్వాయర్లను టాప్అప్ చేసుకోవాలన్నారు. ఈ విధంగా అన్ని రిజర్వాయర్లను నింపుకుంటే సాగు, తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
ఎన్నికల హామీల అమల్లో చంద్రబాబు విఫలం
● ఎస్సీలకు బడ్జెట్లో కేటాయింపులే తప్ప అమలులో శూన్యం ● ఆలిండియా దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జేబీ రాజు కర్నూలు(అర్బన్): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఆలిండియా దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డు ఐఐఎస్ అధికారి జేబీ రాజు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సా మాజిక న్యాయం, ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కుల పరిక్షణ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన గురువారం ఇక్కడకు వచ్చారు. ముందుగా ఏపీ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు అధ్యక్షతన స్థానిక టౌన్ మోడల్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జేబీ రాజు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్లో కొన్ని హామీలను అరకొరగా అమలు చేశారని, మిగతా వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ఉన్నత విద్యకు సంబంధించి రూ.9 వేల కోట్ల ఫీజు బకాయి పెట్టారన్నారు. దీని వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా రుణాలు అందించిన దాఖలాలు లేవన్నారు. బడ్జెట్లో కేవలం కేటాయింపులు చేస్తున్నారే తప్ప, నిధులు విడుదల చేయడం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బలహీన వర్గాలన్నీ ఏకమై ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలిగా పద్మావతి రాష్ట్ర షెడ్యూల్డు కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్య క్షురాలిగా యు.పద్మావతిని ఎన్నుకున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోన నాగరాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్బాబు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.జయరాజు, సలహాదా రు ఎన్సీహెచ్ బజారన్న, అధ్యాపకులు గంగాధర్, నాయకు లు రామాంజనేయులు, బాలనారాయణ, రాహుల్కుమార్,చంద్రశేఖర్,జోత్స్నదేవి, మద్దయ్య పాల్గొన్నారు. -
పాలనలో మార్పునకే సీపీఐ పాదయాత్రలు
కర్నూలు(సెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలు పాలన మార్పు కోసమేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అన్నా రు. గురువారం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీపీఐ నాయకులు పట్టణాలు, గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టారు. కర్నూలు నగరంలోని 19వ వార్డు గణేష్ నగర్లో పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలను తెలుసుకుంటామన్నారు. 16వ తేదీన కలెక్టరేట్ ఎదుట భారీ ప్రదర్శన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు పాలనలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు లేనిపోని హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, నాయకులు ఆవుల శేఖర్, మునెప్ప, ప్రమీలమ్మ, మనోహర్ మాణిక్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బంగారు పాదుకలు సమర్పణ
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో గురువారం రోజున శ్రీరాఘవేంద్రస్వాముల వారికి బంగారు కవచంతో తయారు చేసిన పాదుకలను శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సమర్పించారు. పండితులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆశ్రమం నుంచి బృందావనం చెంతకు చేర్చారు. ఆరాధనోత్సవాల ముందస్తులో భాగంగా మూల రాముల బృందావనం ముందు ఉంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి మహామంగళ హారతులు గావించారు. మూలబృందావనం ముందు వెండి పాదుకల స్థానంలో ప్రత్యేక ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన సువర్ణ పాదుకలను శ్రీరాఘవేంద్రస్వాములకు సమర్పించినట్లు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. అనంతరం భక్తులకు బంగారు పాదుకలు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా శ్రీమఠంలో ఊంజల మండపం నుంచి బంగారు పలకీల్లో మూలబృందావనం ప్రతిమను ఉంచి మఠం ప్రాంగణంలో మంగాళ్య వాయిద్యాలు, భక్తుల నడుమ ఊరేగించారు. శ్రీమఠం కారిడార్లో భక్తుల సందడి నెలకొంది. -
కరువు తరిమింది!
బొలేరో వాహనంలో పైన, కింద కూర్చొని.. ట్రాక్టర్లో ఇలా. వర్షాలు లేవు.. వ్యవసాయ పనులు కరువయ్యాయి. కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబాలు గడవడం కష్టమవుతోంది. జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడంతో కూలీలకు ఎక్కడా పనులు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న అరకొర వానలకు భూమిలో తేమ లేనప్పటికీ ఉల్లి సాగుకు అదును మించిపోతుందంటూ వందలాది ఎకరాల్లో ఉల్లి నాట్లకు రైతులు సిద్ధమయ్యారు. ఉల్లి నాట్లు వేసేందుకు చార్జీలతో కలిసి రోజుకు రూ.350 నుంచి రూ.400 వరకు రైతులు చెల్లిస్తున్నారు. దీంతో కోడుమూరుతో పాటు, గోనెగండ్ల, దేవనకొండ, గూడూరు, వెల్దుర్తి మండలాల నుంచి రోజుకు 2 – 3 వేల మంది వరకు కూలీలు వెంకటగిరి గ్రామానికి ఉల్లి నాట్లు వేసేందుకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కూలీలు ఇలా బొలే రో, ఆటోలు, ట్రాక్టర్లలో పదుల సంఖ్యలో ఎక్కి ప్రమాదకర రీతిలో ప్రయాణాలు చేస్తున్నారు. – కోడుమూరు రూరల్ -
అధికార టీడీపీ ఇప్పటికీ కక్ష సాధింపు రాజకీయాలనే నమ్ముకుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా పాలన సాగిస్తోంది. పోలీసులను పావులుగా వాడుకొని బలమైన నాయకులను కటకటాల్లోకి పంపే
సాక్షి ప్రతినిధి, కర్నూలు: చంద్రబాబు పాలనలో పోలీ సులు పెట్రేగిపోతున్నారు. పచ్చపార్టీ నేతలమెప్పుకోసం వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమకేసు లు బనాయిస్తున్నారు.శాసనసభ్యులన్న గౌరవం లేకుండా ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారు. నిర్భంధించి వేధింపులకు గురిచేస్తున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విషయంలో ఇదే జరిగింది. పక్కా ప్రణాళికతో పోలీసులను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేపై పలుకేసులు నమోదు చేయించి జైలుకు పంపారు. ఎస్సీ మహిళ వస్త్రాలను చింపివేశారని ఆయనతోపాటు సోదరుడు, కుమారుడిపైనా ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతటితో ఆగక పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనా కేసులు బనాయించారు. అయితే ఎస్సీ మహిళ వస్త్రాలు ఎమ్మెల్యే చింపలేదని, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయించేందుకు మహిళ భర్త ఉద్దేశపూర్వకంగా భార్య బట్టలు చింపినట్లు ఓ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీడీపీ నేతల దిగజారుడు రాజకీయాన్ని ఈ వీడియో ప్రశ్నిస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో అక్రమ కేసులు -
కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగుల ధర్నా
కర్నూలు(సెంట్రల్): అసెంబ్లీలో హోంమంత్రి అనిత ప్రకటించిన మేరకు వెంటనే 10వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై కేబినెట్లో చర్చించి నోటిఫికేషన్ను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా డిమాండ్ చేశారు. బుధవారం డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బిర్లా కంపౌండ్ నుంచి నిరుద్యోగులు ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకొని మెయిన్ గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడంలేదన్నారు. అసెంబ్లీలో 10వేల పోలీసు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన ప్రభుత్వం.. జాబ్ క్యాలెండర్లో కేవలం 2,500 పోస్టులు మాత్రమే ఉన్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. వెంటనే నోటిఫికేషన్ ప్రకటించకపోతే నిరుద్యోగుల వయో పరిమితి మించిపోయి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులవుతారన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హుస్సేన్, హరికిషన్రెడ్డి పాల్గొన్నారు. -
కరువు బీళ్లురుముతోంది!
వైఎస్సార్సీపీ పాలనలో ఇలా.. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలు నేడు వెలవెలబోతున్నాయి. అవుకు రిజర్వాయర్లో నీళ్లు లేకపోవడంతో ఖరీఫ్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ సీజన్లో రిజర్వాయర్ పరిధిలో మూడు వేల ఎకరాల్లో వరి సాగు చేసుకుంటారు. సాధారణంగా రైతులు ఈపాటికి నారుమళ్లు పోసుకునేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రెండు పంటలు పండించారు. నేడు అవుకు రిజర్వాయర్లో వాటర్ డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో వరి మాగాణులు ప్రస్తుతం బీళ్లుగా మారాయి. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కూడా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
పట్టు వదలని నారుమణులు
బురదలో కాలు తీసి కాలు పెట్టాలంటే కష్టం. అలాంటిది బరువైన పని చేయాలి. కష్టంగా ఉందని చూస్తూ అలా అని వదిలేయలేరు కదా. అందరూ ఒక్కటయ్యారు. బండి లేదు.. ట్రాక్టర్ లేదు. కానీ వారే యంత్రాలయ్యారు. ముందు కొందరు లాగుతుండగా వెనుక మరికొందరూ తోస్తూ ఒకరొకరు కలిసి తలా ఒక చేయి వేశారు. బతుకు దెరువు ముందు ఈ భారమెంతా అనుకుంటూ.. వరి నాట్లు కోసం నారు కట్టలను మహిళలంతా కలిసి ఒకేసారి లాక్కెళుతూ నాట్లేస్తున్న ఈ దృశ్యం బుధవారం తమ్మడపల్లె వద్ద కనిపించింది. – మహానంది -
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వండి
కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఆర్.ప్రదీప్కుమార్ తెలిపారు. బుధవారం కర్నూలు కొత్త బస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో కర్నూలు టౌన్ డివిజన్ విద్యుత్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్టాప్ ఏర్పరచుకొని విద్యుత్ బిల్లులను తగ్గించుకునే అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాకు మంజూరైన ఆరు కొత్త సబ్ స్టేషన్లలో కర్నూలు టౌన్ డివిజన్కు మంజూరైన ఫిల్టర్ బెడ్స్, గణేష్ నగర్ ప్రాంతంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాలను కన్స్ట్రక్షన్ విభాగం గుత్తేదారులకు అప్పగించాలన్నారు. సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ చిన్న రాఘవులు, కర్నూలు టౌన్ ఈఈ శేషాద్రి, కన్స్ట్రక్షన్ ఈఈ భాస్కరరావు, డీఈఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేపై తప్పుడు కేసు .. విచారణ జరిపించాలి
● ఎస్పీకి విన్నవించిన ఆలూరు ఎమ్మెల్యే సతీమణి రామాంజనమ్మ కర్నూలు (టౌన్): ఆలూరు నియోజవర్గం పరిధిలోని సంగాల, నేమకల్ గ్రామాలకు చెందిన ప్రత్యర్థి గ్రూపులకు చెందిన వ్యక్తులతో తన భర్త ఎమ్మెల్యే విరూపాక్షిపై తప్పుడు కేసు నమోదు చేయించారని, శాఖాపరంగా విచారణ జరిపించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే సతీమణి రామాంజనమ్మ విన్నవించారు. బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి ఇటీవల జరిగిన ఘటనను లిఖిత పూర్వకంగా అమె తెలియజేశారు. చిప్పగిరి పోలీసుస్టేషన్లో తన భర్తపై అక్రమంగా కేసు నమోదు చేశారని, అత్యుత్సాహం ప్రదర్శించి ఈనెల 2వ తేదీ అర్థరాత్రి 3 గంటల మధ్య 60 మంది పోలీసులు బలవంతంగా ఇంట్లోకి చొరపడ్డారన్నారు. ఇంట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆనవాళ్లు లేకుండా సీసీటీవీలను ధ్వంసం చేసి హర్డ్ డిస్క్లను సైతం లేకుండా చేశారన్నారు. ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారన్నారు. ఆలూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయిన తన భర్తకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా అరెస్టు చేశారన్నారు. తప్పుడు కేసు నమోదు చేశారని, డిపార్ట్మెంటల్ విచారణ జరిపించాలన్నారు. ఇంట్లో జరిగిన నష్టానికి పోలీసులు నష్టపరిహారం భరించాలని, సీసీటీవీలు, హర్డ్ డిస్క్లు ఇప్చించాలని కోరారు. అన్యాయంగా కేసులో ఇరికించిన వారిపై, పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. -
● బంగారు ఆభరణాలు, నగదు అపహరణ
అప్పులబాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య జూపాడుబంగ్లా: అప్పులబాధ తాళలేక నందికొట్కూరు పట్టణానికి చెందిన పింజరి రఫి (46) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డు ట్యాంకు ఏరియాకు చెందిన పింజరి రఫి కుటుంబ పోషణ, ఇంటి నిర్మాణం కోసం తెలిసిన వారితో పాటు బ్యాంకులో అప్పులు చేశాడు. ఇచ్చిన అప్పులు తిరిగి చెల్లించాలని రుణదాతలు కోరడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక బుధవారం తర్తూరు గ్రామ పొలిమేరలోని రంగయ్యశెట్టి పొలం వద్ద పురుగుల మందుతాగి పడిపోయాడు. విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని హుటాహుటినా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పుటికే చనిపోయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకొన్న ఎస్ఐ మల్లికార్జున ఆసుపత్రికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతుని కుమారుడు పింజరి చాంద్బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. నేలకూలిన 150 ఏళ్ల వేప చెట్టువెలుగోడు: పట్టణంలోని స్థానిక అరుగుల వద్ద దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన వేపచెట్టు మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులు, భారీ వర్షానికి ఒక్కసారిగా నేలకూలింది. వేళ్లతో సహా కూలిపోవడంతో ఆ ప్రాంతంలో కొంతసేపు భయాందోళన నెలకొంది. విద్యుత్ తీగలపై పడటంతో స్తంభం ట్రాన్స్ఫార్మర్తో సహా కూలిపోయింది. అయితే ఘటన అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకోవడంతో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్థానికులు, వ్యాపారులు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. ఈ వేపచెట్టు దశాబ్దాలుగా వెలుగోడు ప్రజలకు నీడనిచ్చే చారిత్రాత్మక చెట్టుగా గుర్తింపు పొందింది. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వందలాది మంది అరుగుల వద్ద కూర్చుని కాలక్షేపం చేస్తుంటారు. చెట్టు కిందే ద్విచక్ర వాహనాలను కూడా పార్కింగ్ చేస్తుంటారు. ఒకవేళ ఈ ఘటన పగటిపూట జరిగి ఉంటే భారీ ప్రాణనష్టంతో పాటు ద్విచక్ర వాహనాలు ధ్వంసమై తీవ్ర ఆస్తి నష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కోవెలకుంట్ల: పట్టణ శివారులోని స్కంద కాలనీలో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం స్థానికులు అందించిన సమాచారం మేరకు.. కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి బాబయ్య భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి నాలుగు రోజుల క్రితం హైదరాబాదులో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తాళం బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని రూ. 3 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ. 5 వేలు నగదు అపహరించుకెళ్లారు. ఇంటి తలుపు తెరచి ఉండటంతో ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బాబయ్య తమ్ముడు గమనించి అన్నకు సమాచారం చేరవేశాడు. హైదరాబాదు నుంచి హుటాహుటినా ఇంటికి చేరుకుని చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు క్లూస్టీం చోరీకి సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(సెంట్రల్): భారతీయ వాయు సేనలో అగ్నివీర్వాయు (మ్యూజిషియన్) పోస్టుల భర్తీకి అవివాహిత భారతీయ పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 12 వాయు సైనిక ఎంపిక కేంద్ర రిక్రూటింగ్ ఆఫీసర్ తెలిపినట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పి.దీప్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా ఎంపికై న అభ్యర్థులకు నాలుగు సంవత్సరాల సర్వీసు వ్యవధి ఉంటుందని, ఆ తరువాత ప్రతిభ ఆధారంగా 25 శాతం మందికి శాశ్వత ఉద్యోగ అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఢిల్లీ, బెంగళూరులలో జరిగే ర్యాలీలో పాల్గొనాల్సి ఉంటుందని, అర్హత కలిగి ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు భారతీయ వాయు సేన అధికారి వెబ్సైట్ WWW. IAFRECRUITMENT. CDAC. INలో అడ్మిట్ కార్డులను పొందాలని ఆమె సూచించారు. -
టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసుల అక్రమ కేసులు కొన్ని..
● అక్టోబర్ 2, 2024 పవన విద్యుత్ సబ్ స్టేషన్లలో సామగ్రిని ధ్వంసం చేశారని వైఎస్సార్సీపీకి చెందిన 24 మందిపై కేసు నమోదు చేశారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ సమీపంలోని సబ్ స్టేషన్, ఆస్పరి మండలంలోని జొహరాపురం వద్దనున్న సబ్ స్టేషన్, దేవనకొండ మండలంలోని సబ్ స్టేషన్లపై దాడికి పాల్పడిననట్లు పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు వెంకటేష్తో పాటు దేవనకొండ జెడ్పీటీసీ రామకృష్ణ, ఆస్పరి మండలంలోని బిణిగేరి సర్పంచ్ వెంకటేష్, హాలహర్వి మండలం ఎంపీపీ భర్త పరశురాము, ఇదే మండలంలోని నిట్రవట్టి గ్రామ ఎంపీటీసీ గోపాల్తో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన నియోజకవర్గ నాయకులపై కేసుపెట్టారు. ● నవంబర్ 3, 2024 తుగ్గలి మండలం శభాషపురానికి చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ వలంటీర్ల విభాగం జిల్లా కార్యదర్శి హనుమంతును అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో చిన్నపాటి గొడవకు సంబంధించి టీడీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు 326 సెక్షన్ కింద జొన్నగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గద్వాలకు పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుండగా హనుమంతును ప్యాపిలి హైవేపై పోలీసులు అదుపులోకి తీసుకుని కర్నూలుకు తరలించి వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు గ్రామంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ● నారాలోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా శభాషపురంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి హనుమంతు కారణమని రెడ్బుక్ కుట్రల్లో భాగంగా అక్రమ కేసు బనాయించి వేధించారు. ● జూన్ 30, 2024 నంద్యాల పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షులు రసూల్ ఆజాద్పై టీడీపీ నేత అంజాద్ ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు 406,408,420,467,468,471,506 సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించారు. ● డిసెంబర్ 12, 2024 నంద్యాల పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గన్ని కరిముల్లాపై టీడీపీ నాయకుడు జావిద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు 329, 351, 133, 308 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు కరీముల్లాపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ● జూన్ 22, 2024 నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసాపై టీడీపీ నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో నంద్యాల 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ● కక్ష సాధింపునకు పరాకాష్ట కోడుమూరు నియోజకవర్గంలో కర్నూలు మండలం ఎదురూరు గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు వైఎస్ఆర్సీపీ విలేజ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టి నాలుగు సార్లు అక్రమ కేసులు పెట్టించినట్లు ప్రచారం ఉంది. 2024 ఏప్రిల్లో గడ్డివాములు కాలిపోగా అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టు చేయించి జైలుకు పంపారు. 2024 సెప్టెంబర్ 11న తన పొలంలో చేతబడి పూజలు జరిపించాడని, 2024 అక్టోబర్ 15న రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారని, 2026 ఫిబ్రవరి 25న రుద్రవరం పొలంలో చేతబడి చేశాడనే కారణాలతో బోయ వెంకటేశ్వర్లుపై పలు కేసులు పెట్టించారు. ● పాత కేసును తిరగతోడి.. 2013లో గాంధీచౌక్లోని జుమ్మామసీదు నిర్వాహణలో కొందరు అవకతవకలకు పాల్పడుతున్నారని ఇషాక్బాషా అప్పట్లో ఆరోపణలు చేశారు. ఆయనపై టీడీపీ నేతలు కక్షగట్టి వన్టౌన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయించారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేపథ్యంలో పాత కేసును తిరగతోడారు. పోలీసుల ద్వారా నోటీసులు పంపి రిమాండ్ చేయించాలని చూశారు. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో టీడీపీ నేతలు మిన్నకుండిపోయారు. -
టీబీ డ్యామ్కు కొనసాగుతున్న వరద
హొళగుంద: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని హొస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువన ఉన్న తుంగా ప్రాజెక్ట్ నుంచి 35 వేల క్యూసెక్కులను వదులుతుండగా ఆ నీరు టీబీ డ్యాం వైపు వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు 1,00,750 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. తాగునీటి అవసరాలకు కాలువలకు 1,443 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం ఎగువ భాగంలోని ఆగుంబే, శృంగేరి, తీర్థనహళ్లీ, వరనాడు, శివమొగ్గ, చిక్ మంగళూర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. 1,633 అడుగుల డ్యాం మట్టానికి గాను బుధవారానికి 1,624 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 68 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటి డ్రమ్ములో పడి బాలుడి మృతి సి.బెళగల్: ఆడుకుంటున్న బాలుడు నీటి డ్రమ్ములో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నింపింది. సి.బెళగల్ మండలంలోని పోలకల్ గ్రామ బీసీ కాలనీలో నివాసం ఉంటున్న బోయ గంపరాజు గోవిందు, సుజాత దంపతులకు ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమారుడు వివేక్ ఉన్నాడు. బుధవారం అదే గ్రామంలోని బంధువులు వారిని భోజనానికి ఆహ్వానించడంతో కుమారుడితో వెళ్లారు. అయితే అక్కడ బాలుడు వివేక్ను ఇంటి ఆవరణలోని కట్ట (అరుగు)పై ఆటాడుకునేందుకు వదిలారు. కుటుంబ సభ్యుల చిన్న ఏమరపాటులో కొన్ని నిమిషాల్లోనే వివేక్ కనిపించకపోవడంతో వారు ఇంటి పరసరాల్లో వెతికారు. కాగా బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో కట్ట దగ్గరున్న నీటి డ్రమ్ములో కుటుంబ సభ్యులు చూడగా బాలుడు కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యాగంటీశ్వరుడికి సహస్ర ఘటాభిషేకం బనగానపల్లె రూరల్: యాగంటిలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో దేవదాయశాఖ ఆదేశాల మేరకు బుధవారం వరుణ జపసహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, పాలక మండలి చైర్మన్ బండి మౌళీశ్వరరెడ్డి, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం 108 జల కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలో ఏకశిలా రూపంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర్లు మూలవిరాట్లు మునిగేంత వరకు 1008 బిందెలలో జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషే కం, సహస్ర ఘటాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ పాండురంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని వరుణ జపసహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహించామన్నారు. -
నీరున్నా.. రైతులకు కన్నీరే!
● శ్రీశైలంలో 863 అడుగులకు పైగా చేరిన నీటి నిల్వ ● రాయలసీమకు తాగునీటికే విడుదల అని ప్రకటన ● ఆయకట్టుకు నీరు ఇచ్చేది లేదని స్పష్టత ● నోరు మెదపని టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కర్నూలు (సిటీ): ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతూ శ్రీశైలం చేరుతోంది. ఇప్పటికే కనీస నీటి మట్టానికిపైగా నీటి నిల్వలు చేరాయి. సాగునీటి ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాల్సి ఉంది. అయితే సీమ ప్రాంతానికి తాగునీరుకు మాత్రమేనని, ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు సాధ్యం కాదని అధికారక ప్రకటన వచ్చింది. ఇదేమిటని రాయలసీమలోని మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం (215 టీఎంసీలు)కు చేరకముందే తెలంగాణ ప్రభుత్వం కుడి విద్యుత్కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఏపీ ప్రభుత్వం సైతం కుడి విద్యుత్కేంద్రం నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ందుకు సిద్ధం అయ్యింది. రెండు విద్యుత్కేంద్రాల ద్వారా రోజుకు 2 టీఎంసీలకుపైగా నీటిని మొదలు పెట్టి రోజుకు 6 టీఎంసీల వరకు వినియోగించే అవకాశం ఉంది. ఇలా జరిగితే రిజర్వాయర్లో నీటి మట్టం పెరగడం తగ్గి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ జిల్లాకు నీటిని తీసుకునేందుకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. కేఆర్ఎంబీ నిర్ణయం సాకు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరదనీరు గత వారం రోజులుగా భారీగానే వచ్చి చేరుతోంది. ఆ నీరంతా దిగువకు వదిలేయడంతో శ్రీశైలం రిజర్వాయర్లో నీటిమట్టం 867 అడుగులకు పైగా చేరుకుంది. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి నిల్వ 130 టీఎంసీలకుపైగా చేరుకుంది. ప్రస్తుతం 2.38 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. రెండు రోజుల క్రితమే రాయలసీమ జిల్లాలకు సాగునీటిని విడుదల చేసేందుకు పోతిరెడ్డిపాడు గేట్ల స్పిల్వేకి నీటి మట్టం చేరింది. 854 అడుగులకు నీటిమట్టం చేరిన తర్వాత నీరిచ్చేందుకు అవకాశమున్నప్పటికీ కేఆర్ఎంబీ నిర్ణయం సాకు చూపించి తాగునీటికి మాత్రమే విడుదల చేయనున్నారు. గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య 3 వేల క్యుసెక్కులకుపైగా విడుదల చేయనున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ఆధారిత ప్రాజెక్టులకు 10 టీఎంసీలు, మద్రాసు తా గునీటికి 10 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి 13 టీఎంసీల నీటిని కేవలం తాగు నీటి అవసరాల కోసం మాత్రమే ఇవ్వనున్నారు. కృష్టా డెల్టాకు సాగునీరు కృష్ణాడెల్టాకు మాత్రం 32 టీఎంసీల నీటిని ఆయకట్టు కేటాయించినట్లు తెలుస్తోంది. శ్రీశైలం నుంచి కుడి, ఎడమ విద్యుత్కేంద్రాల ద్వారా విడుదల చేసే నీటి నుంచే వాడుకోనున్నారు. కృష్ణాడెల్టాకు ఇప్పటికే గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా తరలిస్తున్నామని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడు శ్రీశైలం నీటిని ఎందుకు దిగువకు తీసుకపోతున్నట్లు అనే ప్రశ్న రాయలసీమ రైతుల్లో వస్తోంది. మల్యాల నుంచి నీటి విడుదల! హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా నీటిని విడుదల చేసేందుకు నాలుగు రోజుల క్రితమే శ్రీశైలంలో 834 అడుగులకు చేరుకుంది. ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి మల్యాలకు నీటిని 820 అడుగుల నుంచే పంపింగ్ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. శ్రీశైలంలో 40 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ తాగునీటి సాకుతో తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 1,600 క్యుసెక్కుల నీటిని రోజుకు జూన్ నెల 25వ తేదీ నుంచే పంపింగ్ చేస్తున్నారు. ఏపీ పాలకులకు సీమ ప్రజల తాగు నీటి అవసరాలకు సైతం శ్రీశైలంలో 820 అడుగులకుపైగా నీరు చేరినా నాలుగైదు రోజులుగా ఏ మాత్రం పట్టించుకోలేదు. బుధవారం సాయంత్రం మల్యాల లిఫ్ట్ నుంచి ఓ మోటరును ఆన్ చేసి 350 క్యుసెక్కుల నీటిని హెచ్ఎన్ఎన్ఎస్ కాల్వకు విడుదల చేస్తున్నారు. గురువారం నుంచి రోజు రోజుకు నీటి విడుదలను పెంచనున్నారు. మౌనమెందుకు? తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం 60 టీఎంసీలకుపైగా నీటి నిల్వలు చేరాయి. ఎగువ నుంచి డ్యాంలోకి బుధవారం మధ్యాహ్నానికి 75 వేల క్యుసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వాస్తవానికి డ్యాంలో 40 టీఎంసీలకుపైగా నీటి నిల్వలు ఉండి, ఎగువ నుంచి 50 వేలకుపైగా ఇన్ఫ్లో ఉంటే ఆయకట్టుకు నీరు ఇవ్వాలని బోర్డు నిబంధనలు ఉన్నాయి. కానీ అంతకు మించి నీటి నిల్వలు ఉన్నప్పటికీ ఇంత వరకు ఎగువ, దిగువ కాలువలకు సాగు నీరు ఇవ్వండని చంద్రబాబు ప్రభుత్వానికి చెందిన మంత్రుల నుంచి కానీ, అధికార యంత్రాంగం నుంచి కానీ ప్రతిపాదనలు లేకపోవడం గమనార్హం. వర్షాలు సక్రమంగా రాకపోవడంతో పశ్చిమ పల్లె ఆయకట్టుదారులు సాగు చేసిన పంటలు వానలు లేక ఎండిపోతున్నాయి. టీబీ డ్యాం నుంచి నీటి విడుదలపై ఎందుకు టీడీపీ నేతలు మౌనంగా ఉంటున్నాయే అర్థం కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.75కోట్లు
మంత్రాలయం: శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3,75,91,531 లభించింది. బుధవారం శ్రీమఠం రాజ్యాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. జూలై 14 నుంచి ఆగస్టు 4 తేది వరకు సంబంధించి 21 రోజుల హుండీ కానుకలను అధికారులు లెక్కగట్టారు. నగదు రూపంలో రూ 3,65,16,531.. నాణేలా రూపంలో రూ.10,75,000 వచ్చింది. అలాగే 49 గ్రాముల బంగారం, 865 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజనీర్ సురేష్కోనాపూర్, అనంతపురాణిక్ పాల్గొన్నారు. 11 మండలాల్లో తేలికపాటి వానలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 11 మండలాల్లో వర్షపాతం నమోదైంది. కోసిగిలో 24.8 మి.మీ, పెద్దకడుబూరులో 19.4, కోడుమూరులో 17.4, గోనెగండ్లలో 13.4, ఎమ్మిగనూరులో 12.8, నందవరంలో 7.2, క్రిష్ణగిరిలో 3.2, మద్దికెరలో 1.4, కర్నూలు రూరల్లో 0.8, కర్నూలు అర్బన్లో 0.6, కౌతాళంలో 0.4 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 3.8 మి.మీ వర్షం కురిసింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 117 మి.మీ ఉండగా ఐదు రోజుల్లో 19 మి.మీ వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు జెడ్పీలో సాగు, తాగునీటిపై సమీక్ష కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్లోని మినీ సమావేశ భవనంలో ఈ నెల 6న మధ్యాహ్నం 3 గంటలకు ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీటికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఆర్.సుధాకర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ, సాగునీటి కాలువల ద్వారా నీటి విడుదల అంశాలపై సమీక్ష కొనసాగుతుందన్నారు. సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెంది న జెడ్పీటీసీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారులు హాజరు కావాలని ఆయన కోరారు. దివ్యాంగుల ఉద్యోగాలకు తాత్కాలిక మెరిట్ జాబితా కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు(నాన్ డీఎస్సీ) తా త్కాలిక మెరిట్ జాబితా, తిరస్కరణ వివరాల ను విడుదల చేసినట్లు విభిన్న ప్రతిభావంతు లు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఈ ఏడాది మార్చి 14, మే 6వ తేదిన ప్రకటన విడుదల చేశామన్నా రు.బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడు తూ ఆయా కేటగిరీలకు సంబంధించి ల్యాబ్ అటెండెంట్, ఆఫీసు సబార్డినేట్, వాచ్మెన్, క్లీనర్, నైట్ వాచ్మెన్, పబ్లిక్ హెల్త్ వర్కర్, పబ్లిక్ హెల్త్ మేసీ్త్ర పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించామన్నారు. ఇందుకు సంబంధించి మెరిట్ జాబితాను తమ కార్యాలయంలోని నోటీసు బోర్డులో, డిస్ట్రిక్ట్ వెబ్సైట్ https://kurnool.ap.gov.inలో ఉంచామన్నారు. వివరాల్లో ఏవైనా ఆక్షేపణలు ఉంటే ఈ నెల 14వ తేది సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. కార్యాలయ మెయిల్ ఐడీ: addwknl@gmail.com ద్వారా తగిన ఆధారాలతో తెలియజేయవచ్చన్నారు. టెట్ పరీక్షలు ప్రారంభం కర్నూలు సిటీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. జిల్లాలో ఐదు కేంద్రాలు, హైదరాబాద్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నాలుగు కేంద్రాల్లో పరీక్ష జరుగగా 622 మందికిగాను 547 మంది హాజరయ్యా రు. మధ్యాహ్నం సెషన్లో జరిగిన పరీక్షకు 476 మందికిగాను 440 మంది హాజరుకాగా 36 మంది గైర్హాజరయ్యారు. కొలనుభారతిలో రేపు శాకంబరీ ఉత్సవం శ్రీశైలంటెంపుల్: శ్రీకొలనుభారతి క్షేత్రంలో శుక్రవారం సరస్వతి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటలో బుధవారం తెలిపారు. -
భర్తతో గొడవ పడి.. బిడ్డను వదిలేసి
మంత్రాలయం రూరల్: భర్తతో గొడవ పడిన ఓ మహిళ ఏడాది వయస్సు ఉన్న బిడ్డను మంత్రాలయంలోని శ్రీ మఠం పరిమళ ప్రసాదం కౌంటర్ వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాలు ఇవి.. నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన షేక్షావలి, బాను దంపతులకు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. భర్తతో గొడవ పడిన మహిళ తన ఏడాది వయస్సు ఉన్న బిడ్డను బుధవారం ఉదయం 10 గంటల సమయంలో శ్రీమఠం కారిడార్లోని పరిమళ ప్రసాదం కౌంటర్ వద్ద వదిలేసి వెళ్లిపోయింది. చిన్నారిని శ్రీమఠం సెక్యరిటీ సిబ్బంది గుర్తించి పీఆర్ఓ అధికారుల ద్వారా పోలీసు స్టేషన్కు సమాచారం అందించారు. వారు పాప ఆచూకీ కోసం పలు సామాజిక గ్రూప్లో పెట్టారు. కాగా బాను ఇంటికి వెళ్లగా భర్త తన కుమార్తె గురించి ఆరా తీయగా మంత్రాలయంలో వదిలేసి వచ్చానని చెప్పడంతో వెంటనే అతను భార్యతో మంత్రాలయం చేరుకున్నాడు. శ్రీమఠం సెక్యూరిటీకి విషయం చెప్పగా వారు పోలీసు స్టేషన్ తీసుకెళ్లి అప్పగించారు. దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమిత్రమ్మ, హెడ్ కానిస్టేబుల్ ఆంజినేయులు సమక్షంలో చిన్నారిని అప్పగించారు. -
పంటల పరిశీలనకు ఎల్నినో కాంబాట్ టీమ్లు
కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను శాస్త్రవేత్తల బృందాలు పరిశీలిస్తున్నాయి. కర్నూలు ఏరువాక కేంద్రం, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం, నంద్యాల ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు ఎల్నినో కాంబాట్ శాస్త్రవేత్తలు బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలిస్తూ.. రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కర్నూలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల బృందం కోడుమూరు, గూడూరు, కల్లూరు మండలాల్లో పర్యటించింది. ప్రస్తుతం పంటల పరిస్థితి ఎలా ఉంది.. పంటలు కోలుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి... ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో వేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఏరువాక కేంద్రం ప్రదాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ తెలిపారు. వారి వెంట కల్లూరు ఏవో విష్ణువర్థన్రెడ్డి, అసిస్టెంటు ప్రొఫెసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
విద్యా శాఖను భ్రష్టు పట్టించిన లోకేశ్
● ఏబీవీపీ కలెక్టరేట్ ముట్టడికర్నూలు(సెంట్రల్): విద్యా శాఖను మంత్రి నారాలోకేశ్ భ్రష్టు పట్టించారని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎర్రిస్వామి అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం కర్నూలు కలెక్టరేట్ ఎదుట అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. అధికారులు వచ్చి వినతిపత్రం తీసుకోవాలని కోరగా అందుబాటులో లేరని చెప్పడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి వెళ్లేందుకు మెయిన్ గేట్లు ఎక్కడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చివరకు అధికారులను కలిసేందుకు ఐదుగురు విద్యార్థి సంఘం నాయకులను తీసుకెళ్తామని అక్కడి పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఈ సందర్భంగా ఎర్రిస్వామి మాట్లాడుతూ పాదయాత్రలో విద్యా రంగ సమస్యలపై లేనిపోని హామీలు ఇచ్చి విద్యార్థి, యువతను తీవ్రంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6800 కోట్లు ఉన్నా ఎందుకు విడుదల చేయడంలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో జీఓ 77 రద్దు చేస్తామన్న లోకేష్కు ఎన్ని వంద రోజులు కావాలని ప్రశ్నించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కేటగిరీల పేరుతో చేసే దందాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విభాగ్ కన్వీనర్ యుగంధర్, జిల్లా కన్వీనర్ వీరేష్ పాల్గొన్నారు. -
ఉలిందకొండ పీఎస్ను తనిఖీ చేసిన ఎస్పీ
కర్నూలు: ఉలిందకొండ పోలీస్స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, వాటి పురోగతిపై కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళల రక్షణ చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి రికవరీ శాతం పెంచాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఉన్నారు. -
మహిళ మృతి
బండిఆత్మకూరు: మండలంలోని పెద్ద దేవళాపురం గ్రామానికి చెందిన ఢమావత్ శంకరమ్మ (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. శంకరమ్మ సోమవారం రాత్రి ఇంట్లో కాలుజారి కింద పడగా కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. మృతురాలి కుమారుడు సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సాంబార్లో పడి చిన్నారికి తీవ్రగాయాలు దేవనకొండ: మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఉపేంద్ర, లలిత దంపతుల కుమార్తె మీనా (4) ప్రమాదవశాత్తు వేడి సాంబారులో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఉపేంద్ర తన పొలంలో బోరు మోటార్ దింపి కార్మికులకు భోజనాలు పెట్టేందుకు ఇంటి వద్ద వంట సిద్ధం చేశారు. ఉడికిన సాంబారు పాత్రను కిందకు దింపి ఉంచగా అక్కడ ఆడుకుంటున్న పాప పాత్రలో పడింది. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన బయటికి తీసి దేవనకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. పాముకాటుతో వ్యక్తి మృతి బనగానపల్లె రూరల్: మండలంలోని నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని రామతీర్థం గ్రామానికి చెందిన రామమద్దిలేటి (41)ని పాము కాటు వేయడంతో మృతి చెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రామమద్దిలేటి లారీ డ్రైవర్గా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి పలుకూరులో డ్రైవింగ్ పని ముగించుకొని రామయ్య అనే వ్యక్తితో కలిసి స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. ఊరువాకిలి సమీపంలో బైక్ దిగి రోడ్డు పక్కన రామమద్దిలేటి మూత్రం పోస్తుండగా కాలికి విషసర్పం కాటువేసింది. కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వెంటనే చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే రామమద్దిలేటి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు. నందివర్గం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పత్తికొండ రూరల్: మండల పరిధిలోని హోసూరు గ్రామానికి చెందిన మాల రవి (30) మంగళవారం పాముకాటుకు గురై మృతి చెందాడు. రంగన్న, రామాంజినమ్మల కుమారుడైన రవి కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. నెల రోజుల క్రిందట దేవనకొండకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆషాఢ మాసం కావడంతో ఆమె పుట్టింటికి పోగా, భార్యను పలకరించేందుకు వెళ్లి అక్కడ పడుకుని ఉండగా పాముకాటుకు గురై అపస్మారక స్థితిలో పడిపోగా చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెళ్లైన నెల రోజులకే మృత్యుఒడికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
టీబీ డ్యాంకు లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో
● ఎగువన భారీ వర్షాలు ● డ్యాంలో ఒకే రోజు 7 టీఎంసీల నీరు చేరిక హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హోస్పేట్ వద్ద నిర్మించిన ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయానికి మంగళవారం భారీ ఎత్తున వరద పోటెత్తింది. సోమవారం ఉదయం డ్యాంలో 44.190 టీఎంసీల నీరు నిల్వ ఉండి ఇన్ఫ్లో 90 వేల క్యూసెక్కుల వరకు రావడంతో మంగళవారం ఉదయం నాటికి 51.145 టీఎంసీల నీరు నిల్వ అయ్యాయి. ఒక్క రోజులోనే 7 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. సాయంత్రం నాటికి ఇన్ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరడంతో బుధవారం ఉదయం నాటికి 60 టీఎంసీల (పూర్తి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు) నీరు నిల్వ కానున్నాయి. నీటిమట్టం1633 అడుగులకు గాను 1620 అడుగులకు చేరింది. డ్యాం ఎగువన నిర్మించిన గాజనూరు జలాశయం(అప్పర్ తుంగా) పైభాగంలోని శివమొగ్గ, తీర్థనహళ్లి, శృంగేరి, వరనాడు, మలెనాడు, కొప్ప ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్ర రిజర్వయర్కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు ఇదే విధంగా ఉంటే వారం పది రోజులో డ్యాం నిండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జలాశయంలో చేరిన నీటితో ఖరీఫ్ సాగుకు, ఏడాది పాటు తాగునీటికి డోకా ఉండదు. అయినా భారీ ఎత్తున వరద వస్తుండడంతో ఈ ఏడాది రెండు కార్ల పంట తీసుకునే అవకాశం దొరుకుతుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. ఎల్లెల్సీలో తగ్గిన నీటిమట్టం తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)లో నీటిమట్టం తగ్గింది. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ఇరురాష్ట్రాల కోటకు సంబంధించి ఎల్లెల్సీ హెడ్లో దాదాపు 1,200 క్యూసెక్కుల నీటిని వదిలేవారు. అందులో కర్ణాటక కోటా నీటిని కొద్ది రోజుల నుంచి తగ్గిస్తూ వస్తుండడంతో కాలువలో నీటిమట్టం తగ్గిందని, ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నట్లు బోర్డు అధికారవర్గాలు తెలిపాయి. ఆంధ్రాకు సంబంధించి ఈ నెల 10వ తేదీ వరకు వదిలి ఆ తర్వాత పరిస్థిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇక ఎల్లెల్సీ ఆంధ్ర కాలువ ప్రారంభం 250 కి.మీ వద్ద 540 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. -
ఆగస్టు 15లోపు వంద సీజనల్ హాస్టళ్లు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో వలస వెళ్లిన కుటుంబాల్లో ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకుండా ఆగస్టు 15వ తేదీలోపు వంద సీజనల్ హాస్టళ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు, డ్రాపౌట్ల సంఖ్యపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ విద్యాశాఖ అధికారులు, స్టేక్ హోల్డర్లతో హై లెవల్ కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండల విద్యాశాఖాధికారి తమ పరిధిలోని అన్ని పాఠశాలలను పర్యవేక్షించడంతోపాటు పనితీరు సక్రమంగా లేని ప్రధానోపాధ్యాయులను గుర్తించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే పాలనా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో బాలికల డ్రాపౌట్లు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. వలస వెళ్లే కుటుంబాల పిల్లలు విద్యకు దూరం కాకుండా సీజనల్ హాస్టళ్ల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో రీజినల్ జేడీ శామ్యూల్, డీఈఓ జి.సుధాకర్, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరక్టర్ డాక్టర్ లోకరాజు పాల్గొన్నారు. అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి కర్నూలు(అర్బన్): జిల్లాలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 13 మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, 64 ఆయా పోస్టుల నియామకానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సా ధికారత అధికారిణి పి.విజయ తెలిపారు. కార్యకర్త పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, ఆయా పోస్టులకు 7వ తరగతి పాస్ కావాలన్నా రు. అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1వ తేది నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల్లోపు ఉండాలని, వివాహమై అదే గ్రామ నివాసి తులు అర్హులన్నారు. ఖాళీలలో కొన్నింటికి హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఈ పోస్టు ల్లో నియమించిన అభ్యర్థుల నియామకం భవిష్యత్తులో వెలువడే కోర్టు ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సీడీపీఓ/కర్నూలు కలెక్టరేట్లోని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. దరఖాస్తులను ఆయా సీడీపీఓ కార్యాలయాల్లో ఈ నెల 5 నుంచి 13వ తేదీ లోగా కార్యాలయ పనిదినాల్లో అందించాలన్నారు. బ్యాలెట్ పేపర్ల వివరాలు కోరిన సీపీఆర్ కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ పత్రాలకు ఎంత పేపర్ అవసరమవుతుందనే వివరాలను పంపాలని కమిషనర్ ఆఫ్ పంచాయతీ రాజ్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారం రోజుల క్రితం ఎన్నికల నిర్వహణకు ఎన్ని బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయనే వివరాలను పంపించామన్నారు. తాజాగా బ్యాలెట్ పత్రాల వివరాలను కోరిందన్నారు. వార్డు సభ్యులకు తెలుపు, సర్పంచు స్థానాలకు పింక్ కలర్ పేపర్ను వినియోగిస్తామన్నారు. జిల్లాలో మొత్తం 484 గ్రామ పంచాయతీలకు 237 మజరా గ్రామాలు ఉన్నాయన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో 5,100 వార్డులు ఉన్నాయన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు కర్నూలు సిటీ: అన్ని యాజమన్యాలకు చెందిన ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యా య అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎల్.సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు అర్హులని, ఎలాంటి నేరారోపణలు, అభియోగాలు ఉండకూడదన్నారు. అవార్డుకు ప్రతిపాదనలతో పాటు, అభ్యర్థిపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు లేవని ధ్రువీకరణ పత్రాలను తనిఖీ అధికారులు జతచేయాలన్నారు. గతంలో జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు పొందని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 15లోపు దరఖాస్తులను డిప్యూటీ విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వ విద్యాలయం పరిఽధిలో నిర్వహిస్తున్న ఎల్ఎల్బీ రెండో సెమిస్టర్ పరీక్షలకు మంగళవారం 37 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ నాగస్వరం నరసింహులు తెలిపారు. రెండు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 453 మంది విద్యార్థులకు గాను 416 మంది హాజరయ్యారు. -
అడుగడుగునా అడ్డంకులు..
పాణ్యం: గోరుకల్లు జలాశయాన్ని పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎక్కడికక్కడే చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంగళవారం ఉదయం నుంచి పాణ్యం రహదారి డొంగు వద్ద పోలీసులు గోరుకల్లు వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేసి పంపారు. అనుమానం వచ్చిన వాహనాలను దారి మళ్లించారు. అలాగే గోరుకల్లు గ్రామం వద్ద ప్రముఖుల వాహనాలనే జలాశయం వద్దకు పంపించారు. మిగతా వాహనాలను ఆపేశారు. కట్టపై బురద ఉందని వాహనాలను అడ్డుకున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అడుగడుగునా పోలీసులు ఇబ్బందులు పెట్టినా రైతులు, నాయకులు రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. సంజామల: అవుకు రిజర్వాయర్ సందర్శనకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు అవుకు రిజర్వాయర్ను సందర్శించారు. వారికి సంఘీభావం తెలపడానికి వెళ్తున్న మండల నాయకులు, కార్యకర్తలను ఆకుమల్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. -
గురుశిష్యులు ప్రాజెక్టులను నీరుగారుస్తున్నారు
గురుశిష్యులు చంద్రబాబునాయుడు, రేవంత్రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సీఎంలుగా కొనసాగుతూ రాయలసీమ ప్రాజెక్టును నీరుగారుస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో నాలుగు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్లో రెండు టీఎంసీల నీరు నిల్వ చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్కు పడిన గండికి ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేక పోవడం సిగ్గు చేటు. గోరుకల్లు రిజర్వాయర్లో 13 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నా కట్ట కుంగి 8–9 టీఎంసీల నీరు నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇటీవలచంద్రబాబునాయుడు బనగానపల్లె పర్యటనలో కాల్వలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని మంత్రి బీసీ.. సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం స్పందించలేదు. నాలుగుసార్లు సీఎంగా చేసిన బాబు సీమ పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయలేకపోయారు. ఆయన అధికారంలోకి వచ్చారంటే తప్పకుండా కరువు వస్తుంది. – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బనగానపల్లె -
జలాధివాసంలోకి సంగమేశ్వరాలయం
కొత్తపల్లి: మరికొద్ది గంటల్లో పవిత్ర పుణ్యక్షేత్రమైన సంగమేశ్వరాలయం పూర్తిస్థాయిలో జలాధివాసం కానుంది. తీర ప్రాంతం వెంట ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు అధికంగా వచ్చి చేరుతుంది. మంగళవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టు నుంచి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా కష్ణా నది గుండా వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. దీంతో సప్త నదుల సంగమ ప్రాంతంలో శ్రీశైలం వెనక జలాలు ప్రాచీన సంగమేశ్వర ఆలయం శిఖర భాగానికి చేరుకున్నాయి. మరో నాలుగు అడుగుల మేర శ్రీశైలం జలాశయ నీటిమట్టం పెరిగితే నేడు తెల్లవారేసరికి ప్రాచీన సంగమేశ్వరాలయం కష్ణమ్మ ఒడిలోకి చేరుకొని జలాధివాసం అవుతుంది. కాగా ఈ ఏడాది సంగమేశ్వరాలయంలోని వేపదారు శివలింగాకార స్వామివారు 131 రోజులు భక్తులకు దర్శనమిచ్చి, విశేష పూజలు అందుకున్నారు. హైపవర్డ్ కమిటీ పర్యటన ఆత్మకూరురూరల్: ఎన్ఎస్టీఆర్లోని ఆత్మకూరు, గిద్దలూరు అటవీ డివిజన్లలో ఇటీవల రెండు పెద్ద పులులు అసహజ మరణాలకు గురికావడంతో వీటిపై దర్యాప్తు జరిపి పులి సంరక్షణకు తగు సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీ మంగళవారం ఆత్మకూరు అటవీ డివిజన్లో పర్యటించింది. డివిజన్లోని ఇందిరేశ్వరం బీట్లో మునిమడుగుల వాగు వద్దకు వెళ్లి పులి మరణించిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. అంతకుముందు వారు బైర్లూటి ఎకో– టూరిజం రిసార్ట్లో జరిగిన రివ్యూ మీటింగ్ పాల్గొన్నారు. అనంతరం వారు గిద్దలూరు డివిజన్కు వెళ్లారు. ఈ పర్యటనలో కమిటీ సభ్యులు అటవీ శాఖ ముఖ్య సలహాదారు మల్లికార్జునరావు, అడిషనల్ పీసీసీఎఫ్ రాహుల్ పాండే, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సభ్యుడు రాజశేఖర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేటివ్ సొసైటీకి చెందిన ఇమ్రాన్ సిద్దిఖి, వన్యప్రాణి శాస్త్రవేత్త నవీన్కుమార్తో పాటు ఎన్ఎస్టీఆర్ఎఫ్డీపీటీ యశోధాబాయి, ఆత్మకూరు డీడీ విగ్నేష్ అపావ్ తదితరులు ఉన్నారు. ఈ పర్యటన ఆసాంతం రహస్యంగా ఉంచారు. విలేకరులను అనుమతించలేదు. -
విద్యుదాఘాతంతో మెకానిక్ మృతి
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని బెలుం శింగవరంలో విద్యుదాఘాతంతో మోటార్ మెకానిక్ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న తాగునీటి బోరుకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సరిచేసేందుకు మెకానిక్ కంబయ్య (45) అక్కడున్న స్తంభాన్ని ఎక్కాడు. ఆ సమయంలో తీగ తెగి స్తంభంపైనున్న కాసారంపై పడటంతో విద్యుత్ షాక్కు గురై పైనుంచి కింద పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నగీనా ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడు కంబయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
గురువులకూ పరీక్షే!
కర్నూలు సిటీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి (బుధవారం) నుంచి మొదలయ్యే పరీక్షకు జిల్లాలో ఐదు కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్లో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహించనున్న పరీక్షలు ఈ నెల 16వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కచ్చితంగా టెట్ అర్హత సాధించి ఉండాలని, ఉచిత, నిర్భంద విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) 2009లోని సెక్షన్ 23 ప్రకారం టెట్ అనేది ఉపాధ్యాయ నియామకానికి ఉండాల్సిన కనీస అర్హతలలో ఒకటని, ఈ చట్టం పరిఽధిలోకి వచ్చే స్కూళ్లలో ఉపాధ్యాయులందరికీ టెట్ కచ్చితంగా ఉండాలని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం నిర్వహించనున్న టెట్కు అత్యధిక శాతం మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీకి ముందు నిర్వహించిన టెట్కు కొంత మంది ఉపాధ్యాయులు మాత్రమే దరఖాస్తు చేసి పరీక్ష రాశారు. ప్రస్తుతం తప్పనిసరి చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాసేందుకు ఆన్ డ్యూటీ అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు టెట్ కన్వీనర్, పాఠశాల విద్య కమిషనర్కు సైతం విన్నవించారు. అయితే పరీక్షలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఓడీ ఇవ్వడం లేదని, వ్యక్తిగత సెలవు పెట్టుకోవాలని విద్యాశాఖ అనధికారికంగా సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పాఠశాలల్లో చదువు చెబుతున్న టీచర్లకు టెట్ కంపల్సరీ చేయడంతో ఒకవైపు తరగతులు, మరోవైపు టెట్ పరీక్ష ప్రిపరేషన్కు సమయం సర్దుబాటు చేసుకోలేని పరిస్థితుల్లో.. పరీక్షలో అర్హత సాధిస్తామా? లేదా? అనే ఆందోళన ఉపాధ్యాయుల్లో నెలకొంది. జిల్లాలో టెట్ రాయనున్న 31,773 మంది! జిల్లావ్యాప్తంగా 2254 అన్ని యాజమాన్యాల స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 16,866 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 2010 సంవత్సరానికి ముందు నియామకం అయిన టీచర్లందరూ టెట్ అర్హత పొందాల్సిందే. ఇందులో పదవీ విరమణకు రెండేళ్ల సమయం ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2010కి ముందు నియామకం అయిన టీచర్లలో సుమారుగా 10 వేల మంది టీచర్లు టెట్ అర్హత పొందాల్సి ఉంది. ప్రస్తుతం జరుగనున్న టెట్కు జిల్లాలో 31,773 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో టీచర్లు 5 వేల మంది వరకు దరఖాస్తు చేసి ఉంటారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరీక్షకు జిల్లాలోని కర్నూలు నగరంలో నాలుగు కేంద్రాలు, ఆదోనిలో ఒకటి, హైదరాబాద్లో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్దేశించిన సమయానికి గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి, హాల్ టికెట్పై ఫొటో లేకపోతే.. ఒరిజినల్ ఆధార్, పాన్కార్డు, ఓటరు కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకాన్ని గుర్తింపుగా వెంట తీసుకెళ్లాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పీహెచ్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసిన సమయంలో పీహెచ్సీ అని నమోదు చేయకపోతే, డీఈఓ అనుమతి తీసుకొని సహాయకుడిని పొందవచ్చు. టెట్కు రంగం సిద్ధం జిల్లాలో ఐదు, హైదరాబాద్లో రెండు కేంద్రాలు ఏర్పాటు పరీక్షలకు హాజరుకానున్న 31,773 మంది అభ్యర్థులు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష ఇన్ సర్వీస్ టీచర్లకూ టెట్ తప్పనిసరి జిల్లావ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ బడుల్లో 10 వేలకుపైగా టెట్ అర్హత లేని టీచర్లు -
అంబేడ్కర్ గురుకులంలో మిగులు సీట్ల భర్తీకి చర్యలు
కర్నూలు(అర్బన్): నగర శివారుల్లోని దిన్నెదేవరపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం(బాలికలు)లో జూనియర్ ఎంఈసీ, సీఈసీలో మిగులు సీట్ల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ప్రిన్సిపాల్ బి.నిర్మల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఎంఈసీలో ఎస్సీ–3కు ఐదు, ఎస్టీకి 01, ఓసీకి 01 సీటు.. అలాగే జూనియర్ సీఈసీలో బీసీ–02, ఎస్టీ–02, ఓసీ–01 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ సీట్ల భర్తీకి బీఆర్ఏజీసీఈటీ 2026 ఎంట్రెన్స్ రాసిన వారు అర్హులన్నారు. అర్హులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో ఈ నెల 5న ఉదయం 10 గంటలకు తమ గురుకులంలో కలిసి ప్రవేశం పొందవచ్చన్నారు. పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్స్ కర్నూలు సిటీ: ఎస్.జి.పీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 2026–27 విద్యా సంవత్సరానికి బయో మెడికల్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సులలో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వి.వి.ఎస్.ఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలీసెట్–2026 ప్రవేశ పరీక్ష రాసిన, రాయని వారు, ఇంత వరకు పాలిటెక్నిక్లో అడ్మిషన్ పొందని వారు, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 5న ఉదయం 11 గంటలకు స్పాట్ కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్లతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 9052437831 నంబర్ను సంప్రదించాలన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉండండి కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించేందుకు మరింత జవాబుదారీతనంతో పని చేయాలని విద్యు త్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమంలో వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని, అప్పుడే సమస్యలను సత్వరం పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఈఈ లు, డీఈఈ, ఏడీఈలు వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు మండలాల్లో జల్లులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాలు కేవలం జల్లులకే పరిమితమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 4 మండలాల్లో జల్లులు కురిశాయి. పెద్దకడుబూరులో 10.4 మి.మీ, నందవరంలో 3.6, దేవనకొండలో 3.2, ఎమ్మిగనూరులో 2.8 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. ఆగస్టు నెలలో మూడు రోజుల్లో కురిసిన వర్షం 3.5 మి.మీ మాత్రమే. సోమవారం ఉష్ణోగ్రతలు పెరిగాయి. వర్షాలు లేకపోగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలు మరింత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో కూడా వర్షాలు లేకపోగా.. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. లంచం కేసులో జైలు, జరిమానా కర్నూలు: కడప విమానాశ్రయం ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎంఆర్ శ్రీనివాసులును దోషిగా నిర్ధారించడంతో రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ కర్నూలులోని సీబీఐ కేసుల న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి శోభారాణి సోమవారం తీర్పు వెలువరించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు, అతని సంస్థను బ్లాక్ లిస్ట్లో వేసే ప్రక్రియను ప్రారంభించకుండా ఉండేందుకు 2015 జులై 24న రూ.50 వేలు లంచం డిమాండ్ చేసి మొదటి విడతగా రూ.25 వేలు తీసుకుంటుండగా కడప ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించగా అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 7 మరియు సెక్షన్ 13(2) ప్రకారం రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎస్.మనోహర్ వ్యవహరించారు. -
కొందరు పోలీసు అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డికర్నూలు: పోలీసు అధికారులు కొందరు ఖాకీ డ్రెస్సులు వదిలి పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని సోమవారం కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ శివారులోని జిల్లా కారాగారంలో ములాఖత్ ద్వారా కలసి కాటసాని పరామర్శించారు. ఎమ్మెల్యే విరూపాక్షికి ధైర్యం చెబుతూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడటం ప్రజా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ప్రజల తరఫున పోరాడే నాయకులను ఎంతగా అణచివేయాలని ప్రయత్నించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తుందన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు రాజకీయానికి లోబడకుండా రాజ్యాంగం, చట్టాల ప్రకారమే విధులు నిర్వహించాలన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రావడం పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తుందన్నారు. అధికారాలు శాశ్వతం కాదని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పనిచేసిన సేవే ఎప్పటికీ గుర్తుండిపోతుందని గుర్తు చేశారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, అక్కిమి హనుమంత రెడ్డి, మాజీ కార్పొరేటర్లు గాజుల శ్వేతారెడ్డి, నారాయణ రెడ్డి, కర్నూలు యువజన విభాగం అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి, పాలకొలను రమేష్, సాయికృష్ణ, ఎరుకల రాజు తదితరులు కాటసాని వెంట ఉన్నారు. -
పీజీఆర్ఎస్లో రెవెన్యూ సమస్యలే అధికం
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదుల్లో అధిక భాగం రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. నిషేధిత జాబితా 22ఏ నుంచి తొలగించాలని కోరుతూ ఎక్కువ మంది రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ ప్రజల నుంచి పీజీఆర్ఎస్లో భాగంగా వినతులను స్వీకరించారు. సమస్యలను సరైన పరిష్కారాలు చూపాలని కింది స్థాయి అధికారులకు సూచించారు. 90 ఎకరాల భూమి ఇచ్చినా బువ్వ పెట్టడం లేదు ‘‘నా పేరు పద్మావతమ్మ. పత్తికొండ మండలంలోని దేవనబండ గ్రామం. నా భర్త శ్రీనివాసరెడ్డి 14 సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఇప్పుడు నా వయస్సు సుమారు 85 ఏళ్లు. నాకు ముగ్గురు కుమారులు. మొత్తం 90 ఎకరాల భూమి ఉంది. ముగ్గురికీ 30 ఎకరాలు చొప్పున భాగ పరిష్కారం చేసి వారి పేరిట రాసిచ్చాం. ఇంత ఆస్తి ఇచ్చినా కొడుకులు నన్ను పట్టించుకోవడం లేదు. ముద్ద బువ్వ పెట్టడంలేదు. ఈ వయస్సులో ఆకలితో జీవితాన్ని గడుపుతున్నా. పెద్ద కుమారుడు బీమిరెడ్డి కొంత నా పోషణ చేస్తున్నారు. నా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. ఇటీవల నాకు ఆరోగ్యం బాగోలేకపోతే పెద్ద ఆపరేషన్ చేయించాడు. అతను కూడా కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని దాదాపు 10 ఎకరాల పొలాన్ని అమ్ముకున్నాడు. అయితే మిగిలిన ఇద్దరు కుమారులు నా పోషణ గురించి అడిగితే పట్టించుకోవడం లేదు. పైగా ఈ వయస్సులో తనను కొట్టేందుకు వస్తున్నారు. వారసత్వంగా వారి ఇద్దరికీ వచ్చిన భాగ పరిష్కారం భూమి 60 ఎకరాలను రద్దు చేసి నా పేరిట చేర్చాలి.’’ అని కలెక్టర్కు వేడుకున్నారు. కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి స్పందిస్తూ పత్తికొండ ఆర్డీఓకు ఫోన్ చేశారు. పద్మావతమ్మ ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆమె కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా
● 12 మందికి గాయాలుకోడుమూరు రూరల్: వ్యవసాయ కూలి పనులకు వెళుతుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాలు.. గూడూరు మండలంలోని జూలకల్ గ్రామానికి చెందిన సుమారు 20 మంది మహిళా కూలీలు సోమవారం ఉదయం గుడిపాడు గ్రామంలో ఉల్లినాట్లు వేసే పనికి ట్రాలీ ఆటోలో బయలుదేరారు. ఆటో జూలకల్ గ్రామం దాటి గూడూరు సమీపానికి వస్తున్న సమయంలో డ్రైవర్ ముందుగా వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ట్రాలీ ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జూలకల్ గ్రామానికి చెందిన దేవమ్మ, మార్తమ్మ, రజిత, పుష్పావతి, కవితతో పాటు మరో ఏడుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు గూడూరు ఎస్ఐ రాజకుళ్లాయప్ప తెలిపారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణించొద్దు గూడూరు ఎస్ఐ రాజకుళ్లాయప్ప మాట్లాడుతూ.. వ్యవసాయ కూలీలు వాహనాల్లో పరిమితికి మించి ఎక్కి ప్రయాణించరాదన్నారు. వాహనదారులు కూడా కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, కూలీలను తీసుకెళ్లే సమయంలో అతివేగం మంచిది కాదని, నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలి
కర్నూలు(సెంట్రల్): తాగునీటిని పరీక్షించిన తరువాతే సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ను ఆదేశించారు. సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర జల్ జీవన్ అడిషనల్ సెక్రటరీ కమల్ కిశోర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న జల్జీవన్ మిషన్ పథకం పనులపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం జిల్లాలోని తాగునీటి సరఫరా అంశాలపై కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పారిశ్రామిక వాడలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో, డంపింగ్ యార్డులకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో నీటి పరీక్షలు చేయాని, అలాగే చెరువులు, చెక్డ్యాంలు, బోరు బావుల్లోని నీటిని పరీక్షించిన తరువాతే స్వచ్ఛమైనవిగా తేలితేనే సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పేకాటరాయుళ్ల అరెస్టు కల్లూరు: పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఉలిందకొండ ఎస్ఐ నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని ఉలిందకొండ గ్రామ సమీపంలోని రైల్వే బ్రిడ్జి పక్కనున్న మునిస్వామి తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.7,700 నగదు సాధ్వీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు. -
సిల్వర్ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు సిల్వర్సెట్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభంమైంది. కౌన్సెలింగ్ను కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగరాజు శెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరానికి ఈ ఏడాది జూన్ 24న రాష్ట్ర స్థాయిలో సిల్వర్ సెట్ నిర్వహించామన్నారు. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్, రోస్టర్ విధానం అనుసరిస్తూ ఈ నెల 6వ తేదీ వరకు అన్ని సబ్జెక్టులలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే బీఏ ఎకనామిక్స్ మేజర్ సీట్లు, హిస్టరీ మేజర్ 20 సీట్ల భర్తీకి అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందన్నారు. బీఏ గ్రూప్ అడ్మిషన్లకు జరిగిన అర్హత పరీక్షలో కర్నూలు రూరల్ మండలం ఆర్కే దుద్యాల గ్రామానికి చెందిన ఎస్.వెంకట్రామిరెడ్డి కూతురు శ్రీలేఖరెడ్డి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి బీఏ ఆనర్స్లో అడ్మిషన్ పొందడం పట్ల ప్రిన్సిపాల్ అభినందించారు. బీఏ, హిస్టరీ, ఎకనామిక్స్ గ్రూప్లలో అన్ని సీట్లలో విద్యార్థులు ప్రవేశం పొందినట్లు తెలిపారు. -
టీబీ డ్యామ్కు భారీగా వరద
● తుంగా ప్రాజెక్ట్ నుంచి 90 వేల క్యూసెక్కుల నీరు విడుదలహొళగుంద: కర్ణాటకలోని చిక్ మంగళూరు, కొప్ప, శివమొగ్గ, శృంగేరి, వరనాడు, మలేనాడు, తీర్థనహళ్లీ తదితర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో టీబీ డ్యామ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అక్కడి వాగులు, వంకలు, వరద పోటెత్తి 3.10 టీఎంసీల సామర్థ్యం కలిగిన తుంగా ప్రాజెక్ట్ (గాజనూరు జలాశయం) నిండడంతో 22 గేట్లు ఎత్తి 90 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. తుంగా ప్రాజెక్ట్ నుంచి నదికి వదులుతున్న నీరంతా భద్ర నదిలో సంగమై తుంగభద్రగా మారి టీబీ డ్యాంలోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో టీబీ డ్యామ్కు సోమవారం 65 వేల క్యూసెక్కుల వరకు ఉన్న ఇన్ఫ్లో క్రమేణా పెరుగుతోంది. టీబీ డ్యామ్కు ఆశాజనకంగా వరద నీటి చేరికతో కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాల పరిధిలోని దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా టీబీ డ్యామ్ నుంచి తాగునీటి అవసరాల కోసం ఎల్లెల్సీకి విడుదల చేసిన నీరు ఆంధ్రకు చేరుకోగా సోమవారం 250 కి.మీ వద్ద 630 క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. -
కదిలితే నొప్పే!
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఎముకలు బలహీనపడటం, కీళ్ల నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు మోకాళ్ల సమస్యలు 60 ఏళ్లు పైబడిన వారికి వచ్చేవి. ప్రస్తుతం 30 ఏళ్లకే అవి పలకరిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోని మురికివాడల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అధికంగా కీళ్లనొప్పులతో బాధపడే వారే వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. వారికి నొప్పి నివారణ మందులు, కాల్షియం మాత్రలు, విటమిన్–సి, బి.కాంప్లెక్స్ మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. పట్టణాల్లోని వైద్యులు మాత్రం ఎముకలకు సంబంధించిన మల్టీవిటమిన్ మాత్రలు, విటమిన్–డి, కాల్షియం మాత్రలు, నొప్పి నివారణ మాత్రలు ఇస్తున్నారు. కీళ్ల అరుగుదల ఎక్కువైన వారికి దశలను బట్టి పలు రకాల ఇంజెక్షన్ చికిత్సలు, వాటికీ తగ్గకపోతే చివరకు మోకీలు మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. నొప్పులు తగ్గేందుకు దీర్ఘకాలంగా పెయిన్ కిల్లర్లు వాడే వారిలో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో కొందరు డయాలసిస్ దశకు వెళ్తూ చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ప్రతి నెలా 1600 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. పెరుగుతున్న కీళ్లు, ఎముకల బాధితులు శారీరక శ్రమ లేకపోవడంతో ఈ రుగ్మత వైద్యుల వద్దకు క్యూ కడుతున్న బాధితులు నేడు జాతీయ ఎముకలు, కీళ్ల దినోత్సవం -
డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరపాలి
● ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నంద్యాలలో రిలే నిరాహార దీక్షలు ● విద్యార్థులు, నిరుద్యోగులు తరలిరావాలని పిలుపు నంద్యాల: టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు, స్కాంపై సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్సీ ఇసాక్బాషా, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డీఎస్సీలో అక్రమాలను నిరశిస్తూ ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నంద్యాల కేంద్రంగా విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు, స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టడం దారుణమన్నారు. రేయింబవళ్లు కష్టపడి చదివిన అర్హులైన అభ్యర్థులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని, నిరుద్యోగులు, ప్రతిపక్షాలు కోరుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. పోరాడితేనే హక్కులు సాధ్యమవుతాయని స్పష్టం చేస్తూ, బాధితులైన నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జరిగే రిలే నిరాహార దీక్షల్లో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు దేశం సుధాకర్ రెడ్డి, రామలింగారెడ్డి, రైతు విభాగం సెక్రటరీ రత్నబాబుచౌదరి, మహిళా విభాగం సెక్రటరీ శశికళా రెడ్డి, మాబున్నిసా, పార్టీ మేధావుల సంఘం జిల్లా అధ్యక్షుడు రసూల్ అజాద్, కారు రవికుమార్, టీవీ రమణ, శంకర్నాయక్, శ్రీనివాసులు, కలాం బాషా, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, పార్దుడు, చింపింగ్, బాషీద్, సుబ్బరాయుడు, సాదిక్ బాషా, డాక్టర్ సుబ్బారెడ్డి, గౌస్, సాయిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడి పనులు అక్కడే!
పాణ్యం: రాయలసీమకు తలమానికంగా ఉన్న గోరుకల్లు జలాశయ రివిట్మెంట్ పనులు నత్తతో ప్రయాణం చేస్తున్నట్లు సాగుతున్నాయి. ఇంకా పనులు తుది దశకు చేరుకోకపోవడంతో ఈ ఏడాది గోరుకల్లులో నీటిని నిల్వ ఉంచుతారా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఏడాది వర్షాలు లేక రైతులు, ప్రజలు సాగు, తాగునీటి కోసం ఎంతలా అల్లాడుతున్నారో చూస్తున్నాం. ఇలాంటి సమయంలో పైనుంచి వస్తున్న వరద నీరు శ్రీశైలం డ్యాంకు వచ్చి చేరుతున్న తరుణంలో అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బానకచర్ల క్రాస్ ద్వారా ఎస్సార్బీసీ నుంచి గోరుకల్లుకు చేరుకుంటాయి. అయితే ఈ ఏడాది గోరుకల్లు జలాశయంలో నీటి నిల్వ ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది జలాశయంలో 8 టీఎంసీల నీరు నిల్వ ఉన్న సమయంలో కట్ట కుంగిపోవడం ప్రారంభమైంది. క్రమంగా కుంగిపోవడం మరింత పెరిగి నీరు నిల్వ ఉంచేందుకు అవకాశం లేకుండా పోయింది. కట్ట మరమ్మతులు చేయడంలో అఽధికారులు జాప్యం చేస్తున్నారు. నేటికీ పనులు పూర్తి కాలేదంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. మంత్రి వచ్చి చూసినా..! రాయలసీమ జీవనాడి అయిన గోరుకల్లు కట్ట కుంగిన ప్రాంతాన్ని సాక్షాత్తు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పెండింగ్ పనులకు రూ.53 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గతేడాది జూన్ 11వ తేదీన హడావుడి చేశారు. తక్షణమే పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కట్ట కుంగిన చోట తాత్కాలిక మరమ్మతులకు రూ.కోటిన్నర నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అయితే ఏడాది పూరవుతున్నా పెండింగ్ పనుల ఊసే లేదు. ఇక తాత్కాలిక పనులు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి. పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతులు, ప్రజలు సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత ప్రాధాన్యత గల ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నత్తతో పోటీ పడుతున్న గోరుకల్లు రివిట్మెంట్ పనులు మరో పది రోజుల్లో శ్రీశైలం నుంచి నీరు వదిలే అవకాశం? అయినా పూర్తి కాని పనులు తాత్కాలిక పనుతో తాత్సారం -
మద్యం మత్తులో మృగంగా మారి..
● నిద్రిస్తున్న కుమారుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి ● మద్యం తాగొద్దనడంతో దారుణం బనగానపల్లె రూరల్: మద్యం తాగి జులాయిగా తిరగొద్దని చెప్పినందుకు విచక్షణ కోల్పోయి తండ్రి కన్న కుమారుడిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన బనగానపల్లె పోలీసు స్టేషన్ పరిధిలోని యనకండ్ల గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె మండలంలోని యనకండ్ల గ్రామానికి చెందిన గొల్ల బాలమద్దిలేటి, సుబ్బమ్మ దంపతుల కుమారుడు మధుకృష్ణ (30) జీవాల పెంపకంతో పాటు ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తండ్రి బాలమద్దిలేటి మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్య సుబ్బమ్మ, కుమారుడు మధుకృష్ణ, కోడలు అర్చనతో ఘర్షణ పడేవాడు. ఐదు రోజుల క్రితం భార్య సుబ్బమ్మతో ఘర్షణ పడుతుండగా బాలమద్దిలేటిని మద్యం తాగొద్దని కుమారుడు మందలించాడు. దీంతో ఇంట్లోవారికి చెప్పకుండా కోవెలకుంట్ల మండలంలోని లింగాల గ్రామానికి వెళ్లి పని చేసుకుంటూ అక్కడే ఉన్నారు. విషయం తెలుసుకున్న మధుకృష్ణ ఆదివారం తండ్రి వద్దకు వెళ్లి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. బాలమద్దిలేటి రాత్రి భోజనం చేసేందుకు మజ్జిగ కావాలని అడగడంతో మధుకృష్ణ డబ్బులు ఇచ్చాడు. రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు భోజనం చేసి నిద్రించారు. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన బాలమద్దిలేటి నిద్రిస్తున్న కుమారుడు మధుకృష్ణను గొడ్డలితో విచక్షణారహితంగా నరికాడు. అడ్డుకోబోయిన కోడలు, భార్య సుబ్బమ్మపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మధుకృష్ణ అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె అర్బన్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ కల్పన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా భార్య గర్భిణిగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
గాయపడిన వారే ఎక్కువ
ఆసుపత్రికి ఎక్కువగా వివిధ ప్రమాదాల్లో గాయపడి ఎముకలు విరిగిన వారు వస్తుంటారు. వీరితో పాటు ఓపీ చికిత్సకు వివిధ రకాల ఎముకలు, నొప్పులతో వస్తుంటారు. వారికి ఎక్స్రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, కొన్ని రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. అవసరమైన మందులు సూచిస్తున్నాం. నొప్పులు ఉన్నా యని పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం ప్రమాదకరం. అవి క్రమంగా కడుపులో మంటతో పాటు కిడ్నీలను దెబ్బతీస్తాయి. వైద్యుల సూచన మేరకే వాడాలి. – డాక్టర్ ఎం.రాజేష్కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్ విభాగం, కర్నూలు జీజీహెచ్ -
వలస వెళ్లొద్దన్నందుకు ఆత్మహత్య
గోనెగండ్ల: వలస వెళ్లొద్దు.. గ్రామంలోనే పనులు చేసుకుందామని తండ్రి అనడంతో కుమారుడు క్షణికావేశంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బెలుప్పల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన ఈరన్న, సుబ్బమ్మల కుమారుడు చరణ్ (18) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. చరణ్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తండ్రి ఈరన్నతో తాను వేరే ప్రాంతానికి పని కోసం వలస వెళతానని చెప్పగా ఆయన అంగీకరించలేదు. గ్రామంలోనే కూలీ పనులు చేసుకుందామని చెప్పాడు. తండ్రి తన మాట వినలేదని చరణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి తిరిగివచ్చి వాంతులు చేసుకుంటున్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు ఏమైందని అడగ్గా పురుగు మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కోలుకోలేక సోమవారం ఉదయం చరణ్ మృతిచెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. -
ఆరాధనోత్సవాలకు ముందస్తు గదుల బుకింగ్ రద్దు
మంత్రాలయం: శ్రీమఠంలో ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరగనున్న స్వామివారి 355వ ఆరాధనోత్సాల సందర్భంగా ముందస్తు గదుల బుకింగ్ను రద్దు చేసినట్లు శ్రీమఠం మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సోమవారం శ్రీమఠంలో విలేకరులతో మట్లాడుతూ.. ఆరాధనోత్సవాలకు దాదాపు 6 నుంచి 7 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులు అఽధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్ రూమ్ బుకింగ్ రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు మేనేజర్ తెలిపారు. 11వ తేదీన టీటీడీ కళ్యాణ మండపంలో ఆరాధనోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ అధికారులు, శ్రీమఠం సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 12వ తేదీన శ్రీమఠాలు ఆల్ బ్రాంచ్ మేనేజర్లతో వీవీఐపీ డైనింగ్ హాల్లో సమావేశం ఉంటుందన్నారు. ఆరాధనోత్సవాలకు కలెక్టర్, ఎస్పీల అనుమతులు కోరినట్లు చెప్పారు. పంచాయతి సిబ్బంది శుభ్రతను పాటించే విధంగా చూడాలన్నారు. తుంగభద్ర నదిలో భద్రత, బోట్లు, స్విమ్మింగ్ సిబ్బంది అని కూడా లెటర్లు పంచామన్నారు. ఆగస్టు 30న హెలికాప్టర్తో రథోత్సవంపై పుష్పవృష్టి కురిపించేందుకు ఫైర్ సిబ్బంది, అధికారుల అనుమతులు కోరామన్నారు. 75 ఇంచులతో టీవీ, హుండీ కౌటింగ్ హాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 5వ తేదీన హుండీ లెక్కింపు చేపడతామని వెల్లడించారు. వర్సిటీ టాపర్కు గోల్డ్మెడల్ కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కార్డియాలజీ విభాగం టాపర్గా నిలిచిన డాక్టర్ పర్వేజ్ నవాజ్కు బంగారు పతకం దక్కింది. కర్నూలు జీజీహెచ్ కార్డియాలజీ విభాగంలో పీజీ విద్యనభ్యసిస్తున్న (2022–2025) ఆయన వర్సిటీ టాపర్గా నిలిచారు. ఈయనకు ఆసుపత్రి మొదటి కార్డియాలజిస్టు డాక్టర్ టి.రామకృష్ణారెడ్డి పేరిట ఆయన కుమారుడు డాక్టర్ టి.విజయ్కృష్ణారెడ్డి గోల్డ్ మెడల్ అందజేశారు. సోమవారం కార్డియాలజీ విభాగంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తండ్రి జ్ఞాపకార్థం కుమారుడు డాక్టర్ విజయకృష్ణారెడ్డి ఏటా మెరిట్ విద్యార్థులకు బంగారు పతకం ఇవ్వడం అభినందనీయమన్నారు. డాక్టర్ టి.విజయకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏటా కేఎంసీ విద్యార్థులే వర్సిటీ టాపర్లుగా నిలుస్తుండటం సంతోషకరమన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ లక్ష్మిబాయి, ఐఎంఏ కర్నూలు కార్యదర్శి డాక్టర్ ఎస్వీ రామమోహన్రెడ్డి, వైద్యాధికారులు ఆదిలక్ష్మి, ప్రశాంత్, లలితకుమారి, చింతా రాజ్కుమార్, కిరణ్కుమార్రెడ్డి, రవికిరణ్, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఆగి ఉన్న టిప్పర్ను ఢీ మహానంది: మండలంలోని గాజులపల్లె, బసవాపురం గ్రామాల సరిహద్దుల నుంచి గ్రావెల్ మట్టిని తరలిస్తున్న టిప్పర్లు మితిమీరిన వేగంతో వెళ్తుండటం ప్రమాదకరంగా మారింది. నూతనంగా నిర్మిస్తున్న హైవే రహదారికి నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నాయి. టిప్పర్లు వేగంగా వెళ్తుండటంతో వచ్చి, వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అల్లినగరం గ్రామం వద్ద ఆగి ఉన్న ఓ టిప్పర్ను వెనుక నుంచి వస్తున్న మరో టిప్పర్ ఢీకొట్టింది. డ్రైవర్కు స్వల్పగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న మహానంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాకపోకలకు అంతరాయం లేకుండా టిప్పర్లను రోడ్డు పక్కన పెట్టించారు. ఇదిలా ఉండగా సంబంధిత అధికారులు స్పందించి టిప్పర్లు నిర్ణీత వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సమీప గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య కర్నూలు: కర్నూలు శ్రీరామ్ నగర్కు చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లు (27) అప్పుల బాధతో విరక్తిచెంది ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను నగరంలోని ఐశ్వర్య క్యాంటీన్లో పనిచేస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. వారి నుంచి తిరిగి చెల్లించాలని ఒత్తిడి ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై క్షణికావేశంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఈయనకు భార్యతో పాటు కూతురు, కొడుకు సంతానం. భార్య పుట్టినిల్లు పెరవళికి వెళ్లింది. ఎంత అప్పులు చేశాడు. ఎవరెవరి దగ్గర అప్పులు చేశాడనే విషయం భార్య వచ్చిన తర్వా త తెలుస్తుందని పోలీసులు తెలిపారు. భార్య ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని నాల్గవ పట్టణ పోలీసులు తెలిపారు. -
చివరి ప్రయత్నంగా మోకీలు మార్పిడి
ఇటీవల మోకీలు నొప్పులతో వచ్చేవారు అధికమయ్యారు. ముందుగా కీళ్ల నొప్పులు ఎందుకు వచ్చాయో చూస్తాం. వారికి రుమటాయిడ్, థైరాయిడ్ వంటి సమస్యలుంటే సంబంధిత వైద్యులకు రెఫర్ చేస్తాం. ఆస్టియో ఆర్థరైటిస్ (కీళ్ల అరుగుదల) ఉంటే మందులు ఇవ్వడంతో పాటు ఆహార నియమాలు, వ్యాయామాలు, ఫిజియోథెరపీ సూచిస్తాం. మోకీలు అరుగుదల నాలగవ దశలో ఉంటే మోకీలు మార్పిడి ఆపరేషన్ చేస్తాం. – డాక్టర్ ఎం.విజయకుమార్రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, కర్నూలు -
కర్ణాటక బస్సు ఢీకొని కార్మికుడి దుర్మరణం
మంత్రాలయం రూరల్: కర్ణాటక బస్సు ఢీకొని పారిశుద్ధ్య కార్మికుడు హెచ్.తిక్కయ్య (67)మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని చెట్నెహళ్లిలో ఆదివారం చోటు చేసకుంది. ఘటనపై ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాలు.. తిక్కయ్య ఉదయం బహిర్భూమికి వెళ్లి వస్తూ రోడ్డు దాటుతుండగా మంత్రాలయం వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కర్ణాటక బస్సు (కేఎ 36 ఎఫ్ 1750) ఢీకొట్టింది. బస్సు చక్రాల కింద నలిగి తిక్కయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకొని తిక్కయ్య మృతదేహంతో జాతీయ రహదారిపై దాదాపు రెండు గంటలపాటు ధర్నా చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ రమాదేవి, సీఐ దస్తగిరిబాబుతో వాగ్వాదానికి దిగారు. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చిచెప్పారు. తహసీల్దార్ వెంటనే ఆర్డీఓకు సమాచారం అందించడంతో ఆర్డీఓ కె.అరుణాదేవి, తహసీల్దార్, సీఐ వచ్చి పరిశీలించి జీబ్రా క్రాసింగ్, సిగ్నల్ లైట్ వద్ద సిమెంట్తో యుద్ధ ప్రాతిపదికన స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. ధాదాపు రెండు గంటల పాటు ధర్నా జరగడంతో మంత్రాలయంకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. కర్ణాటక నుంచి వచ్చే బస్సులు అతివేగం తగ్గించుకోవాలని, లేదంటే వాటిని నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై తరచూప్రమాదాలు జరిగే స్పాట్లను గుర్తించామని, ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మృతదేహన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రమదానికి కారణమైన బస్సు డ్రైవర్ మల్లన్న (41)ను అదుపులోకి తీసుకుని బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసిన అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కృష్ణగిరి: ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చుంచుఎర్రగుడి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు తన ట్రాన్స్ఫార్మర్ను వేరొక చోటికి మార్చేందుకు గ్రామంలోని ప్రైవేట్ టెక్నీషియన్ రాందాస్ను తీసుకెళ్తూ, అక్కడ హోటల్ వద్ద ఉన్న గొంగళ్ల పెద్ద మద్దయ్య (56)ను వెంట తీసుకెళ్లారు. సాయంత్రం ఐదున్నర గంటలకు త్రీఫేజ్ సప్లయ్ ముగిసిన తర్వాత రైతు, టెక్నీషియన్ ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు వెళ్లగా అక్కడ ఏమీ జరిగిందో గానీ పెద్ద మద్దయ్య మాత్రం విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు. అధికారుల అనుమతులు తీసుకోకుండా విద్యుత్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అయితే పెద్ద మద్దయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గ్రామానికి ఇన్చార్జ్గా ఉన్న ట్రాన్స్కో లైన్ ఇన్స్పెక్టర్ వెంకటరాముడును వివరణ కోరగా తమకు ఎల్సీ కావాలని ఎవరూ సంప్రదించలేదన్నారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాలుగు నెలలుగా లైన్మెన్ పోస్టు ఖాళీ మండలంలోని చుంచుఎర్రగుడి గ్రామంలో నాలుగు నెలలుగా లైన్మెన్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న లైన్మెన్ పదోన్నతిపై వెళ్లడంతో అప్పటినుంచి ప్రభుత్వం ఈ గ్రామానికి లైన్మెన్ను కేటాయించడంలో నిర్లక్ష్యం వహించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామంతోపాటు లక్కసాగరం గ్రామ పంచాయతీకి కూడా లైన్మెన్ లేకపోవడంతో దాదాపుగా 7 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక సతమవుతున్నారు. అత్యధికంగా కనెక్షన్లు ఉన్న గ్రామాలకు రెగ్యూలర్ లైన్మెన్లను నియమించాలని కోరుతున్నారు. -
తాగునీటికి పాట్లు
కోడుమూరు రూరల్: మండలంలోని గోరంట్ల గ్రామానికి మంచినీటిని అందించే హంద్రీ నది వానల్లేక ఒట్టిపోయింది. హంద్రీలో నీరు లేక, గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే బోర్లు పనిచేయక గ్రామంలోని కొళాయిలకు గత నెల రోజుల నుంచి నీళ్లు రావడం లేదు. వాడుకోవడానికి వదిలేసి కనీసం తాగేందుకు కూడా నీళ్లు దొరక్క గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు. చివరకు గ్రామ సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై బిందెలతో నీటిని తెచ్చుకుంటూ రోజులు గడుపుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గోరంట్ల హంద్రి నదికి గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని విడుదల చేసి తమ ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇద్దరికీ వేదనే!
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కాన్పుల వార్డులో పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్కో మంచంపై ఇద్దరు గర్భిణులను పడుకోబెట్టి చికిత్స అందిస్తుండటంతో కాన్పు కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలింతలు చంటి బిడ్డలతో ఒకే మంచంపై నరకయాతన అనుభవిస్తున్నారు. బాలింతలకు సహాయకులుగా వచ్చిన వారు చంటి పిల్లలను ఎత్తుకుని లాలిస్తున్నారు. పెద్దాసుపత్రిపై నమ్మకంతో ఎంతో దూరం నుంచి ప్రసవం కోసం వస్తే కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
‘బ్లాక్ రెయిన్ బో’ కథలు.. జీవిత ప్రతిబింబాలు
కర్నూలు కల్చరల్: వాస్తవ జీవితానికి ప్రతిబింబంగా కథలు రాస్తూ తెలుగు దళిత సాహిత్యంలో సంచలనంగా నిలిచినవి ‘బ్లాక్ రెయిన్ బో’ కఽథలని ప్రసిద్ధ సాహితీ వేత్త గుంటూరు లక్ష్మీ నరసయ్య అన్నారు. ఆదివారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ రాసిన దళిత కథలు ‘బ్లాక్ రెయిన్ బో’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకంలోని కథలు వైవిధ్యతను సంతరించుకున్నాయని, రాయలసీమ నేపథ్యంలోని అసమానతలు, మారుతున్న సమాజంలో రూపం మార్చుకున్న వివక్షత ఇందులో కథలుగా ఆవిష్కరించబడ్డాయన్నారు. వర్తమాన సాహిత్య సమాజంలో ఈ దళిత కథలు అనివార్యమని, ఇవి సమాజానికి ప్రతిబింబంగా కనబడతాయన్నారు. సాహితీ స్రవంతి జిల్లా గౌరవాధ్యక్షుడు ఎంపీ బసవరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి వెంకట కృష్ణ, ఆర్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, రాయలసీమ ప్రచురణలు సంపాదకులు ఇనయతుల్లా, గౌరవ సంపాదకులు మారుతి, గాడిచర్ల ఫౌండేషన్ అధ్యక్షుడు కురాడి చంద్రశేఖర కల్కూర మాట్లాడారు. పశ్చిమ ప్రాంత మాండలికంలో కథలు రాయడం వల్ల కథా సాహిత్యంలో అరుదైన శిల్పంగా కనబడతాయన్నారు. సాహిత్రీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్, నగర అధ్యక్షుడు ఆకెపోగు నాగరాజు, ప్రధాన కార్యదర్శి పార్వతయ్య, కవులు, రచయితలు పాల్గొన్నారు. -
పోతిరెడ్డిపాడు గేట్లను తాకిన కృష్ణాజలాలు
జూపాడుబంగ్లా: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం జలాశయంలోకి 1,69,211 క్యూసెక్కుల వరద జలాలు వచ్చి చేరుతుండటంతో డ్యాంలో గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యాంలో 849.70 అడుగులకు నీటిమట్టం చేరుకోగా కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను తాకాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీశైలం డ్యాంలో 849.70 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 848.70 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం శ్రీశైలం డ్యాంలో 854 అడుగులకు నీటిమట్టం చేరుకోగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో గంటగంటకు నీటిమట్టం పెరుగుతున్నందున మరో రెండు, మూడు రోజుల్లో డ్యాంలో 854 అడుగులకు నీటిమట్టం చేరుకొనే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్కుగాను జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్, కేసీ ఎస్కేప్ కాల్వల కిందున్న ఆయకట్టు రైతులు మొక్కజొన్న, మినుము, కంది తదితర పంటలు సాగుచేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాల్వలకు సాగునీరు ఎప్పుడు విడుదల చేస్తారా? పంటలను ఎలా కాపాడుకోవాలా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వం నుంచి సత్వరమే అనుమతులు పొంది వెంటనే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లు ఎత్తి కాల్వకు సాగునీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. గతేడాది జులై 5న నీటి విడుదల గతేడాది జులై 6న పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా దిగువనున్న కాల్వలకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన వర్షాలవల్ల శ్రీశైలం డ్యాంలోకి వరద నీరు పోటెత్తడటంతో డ్యాం క్రమేణా జలకళ సంతరించుకొంటోంది. డ్యాంలో మరో రెండు రోజుల్లో 854 అడుగుల నీటిమట్టం చేరుకునే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తే నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. -
క్రీడాకారిణికి ఆర్థిక సాయం
గడివేముల: అంతర్జాతీయ గోల్ షాట్బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థిని జగదీశ్వరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటి వద్ద జగదీశ్వరికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందించడంతోపాటు సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. క్రీడాకారిణికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎల్లారెడ్డి, అనిల్కుమార్ రెడ్డి, సర్వేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ శాఖదే విజయం
పాణ్యం: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో రెవెన్యూ శాఖ జట్టు ఆర్జీఎం జట్టుపై విజయం సాధించినట్లు జిల్లా అధ్యక్షుడు కామేశ్వరరెడ్డి తెలిపారు. ఆదివారం ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో రెవెన్యూ సర్వీసెస్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ, ఆర్జీఎం జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ పోటీల్లో రెవెన్యూ శాఖ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 138 పరుగులు చేసి ఐదు పరుగుల తేడాతో ఆర్జీఎం జట్టుపై విజయం సాధించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ ఘనోరి అత్యధికంగా 41 పరుగులు సాధించారు. నంద్యాల ఆర్డీఓ చల్లా విశ్వనాథ్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కామేశ్వరరెడ్డి, ప్రవీణ్కుమార్, నంద్యాల అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు, పీడీ వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
బళ్లారి రాఘవ సేవలు ఎనలేనివి
కర్నూలు(సెంట్రల్): కళామతల్లికి బళ్లారి రాఘవ చేసిన సేవలు ఎనలేనివని జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయణమ్మ కొనియాడారు. ఆదివారం ఉదయం కలెక్టట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో టూరిజం, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ పితామహుడు, మహానటుడు బళ్లారి రాఘవ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో బళ్లారి రాఘవ 1880 ఆగస్టు 2న జన్మించి తాడిపత్రి, బళ్లారి, మద్రాస్లలో విద్యాభ్యాసం పూర్తి చేసి న్యాయవాదిగా స్థిరపడ్డారని చెప్పారు. ఆయన తెలుగు నాటక రంగానికి విశేషమైన కృషి చేసి కళాకారుడిగా దేశ, విదేశాల్లో పేరు గడించారని చెప్పారు. సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ మాట్లాడుతూ.. బళ్లారి రాఘవ కర్నూలుకు చెందిన కృష్ణమ్మను వివాహం చేసుకున్నారని, ఆయన్ను బ్రిటీష్ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించి రావు బహుదూర్ బిరుదు ఇచ్చినట్లు చెప్పారు. బెంగళూరులో మహాత్మాగాంధీ బళ్లారి రాఘవ నటించిన దీనబంధు కబీర్ నాటికను తిలకించి రాఘవ మహారాజుకి జై అని అన్నట్లు చరిత్ర చెబుతోందని వివరించారు. లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, ఏపీ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కరణ్, డీవీఎం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ కార్యక్రమం
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఈ నెల 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తమ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో.. వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 73826 14308 నంబర్కు ఫోన్ చేసి తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు గాయాలు బండిఆత్మకూరు: మండలంలోని చిన్న దేవళాపురం గ్రామంలో ఆదివారం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో దంపతులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ నాగమ్మ ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లొచ్చిన అనంతరం ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో నాగమ్మకు, భర్త సుబ్బరాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లోని వస్తువులు కొంతమేర ధ్వంసమయ్యాయి.వ గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం బండి ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి ఆదోని అర్బన్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆదోనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. ఎస్సీ వర్గీకరణ వల్ల దళిత సమాజంలో విబేధాలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల హక్కులు, ఐక్యతను పరిరక్షించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రమోహన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భార్య అనారోగ్యంతో ఉందని ఆత్మహత్యాయత్నం ఆదోని అర్బన్: మండల పరిధిలోని ఆరేకల్ గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తి భార్యకు అనారోగ్యం ఉందని మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోవిందు భార్య కిడ్నీ సమస్యలతో బాధపతూ కర్నూలులో చికిత్స పొందుతోంది. దీనిని జీర్ణించుకోలేక మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని అవుట్ పోస్టు పోలీసులు తెలిపారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న గోవిందును స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. గుడిసె దగ్ధం హాలహర్వి: మండలంలోని నిట్రవట్టి గ్రామంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన కజ్జి నాగరాజుకు చెందిన గుడిసె ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు గుడిసె పైకప్పుకు అంటుకున్నాయి. ఎండ తీవ్రత, గాలి తోడవడంతో క్షణాల్లోనే మంటలు గుడిసె అంతటా వ్యాపించాయి. గుడిసె నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావంతో గమనించిన స్థానికులు తక్షణమే మంటలను అదుపు చేసేందుకు నీళ్లు, ఇసుక వేశారు. పక్కనే ఇతర ఇళ్లకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. గుడిసెలో ఉన్న నిత్యావసర సరుకులు, బట్టలు, విలువైన సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో రూ.లక్ష దాకా ఆస్తి నష్ట వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
హాస్టల్లో విద్యార్థిని బంధువు హల్చల్
వెల్దుర్తి: స్థానిక బీసీ బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని బంధువు ఆదివారం హల్చల్ చేశాడు. హాస్టల్ సిబ్బందిపైనే దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గిరిజాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటుపల్లె గ్రామానికి చెందిన శశికళ ప్రస్తుత ఏడాది 6వ తరగతిలో చేరింది. హాస్టల్లో ఉండనంటూ భీష్మించడంతో తల్లికి సమాచారం అందించారు. ఆదివారం కావడంతో హాస్టల్కు వచ్చిన తల్లి కుమార్తెను బయటకు తీసుకెళ్లింది. విద్యార్థిని బాబాయ్ మహేశ్తో కలిసి ఒప్పించి తిరిగి హాస్టల్లో వదిలారు. తర్వాత బాబాయ్ తిరిగి వచ్చి తెలుపు రంగు ద్రావణం ఉన్న ఓ బాటిల్ను గేటు వద్ద ఉన్న విద్యార్థినికి ఇచ్చి ‘ఈ కూల్డ్రింక్ను హాస్టల్లో ఉంటున్న శశికళకు ఇవ్వమని’ అందించాడు. సదరు విద్యార్థిని ఆ బాటిల్ను శశికళకు అందజేయగా తాగి ఉప్పగా ఉండడంతో ఊసేసింది. విషయం తెలుసుకున్న సిబ్బంది అనుమానం కలిగి విద్యార్థిని బాబాయ్కు ఫోన్ చేసి పిలిపించారు. అతను హాస్టల్లోకి వచ్చి సిబ్బందిని దూషిస్తూ, దాడికి పాల్పడ్డాడు. ఘటనపై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గిరిజాదేవి, సిబ్బంది కలిసి స్థానిక పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. బాబాయ్ను విచారించగా తాను బాటిల్ ఇవ్వలేదని చెబుతున్నాడని, సీసీ పుటేజీ, బాటిల్ ద్రావణంపై పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
అన్యాయంగా అరెస్ట్ చేశారు
ఆదోని/ఆలూరు రూరల్/ఆలూరు/ చిప్పగిరి/కర్నూలు (టౌన్): ప్రజల గళాన్ని అసెంబ్లీలో వినిపించాల్సిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ‘రెడ్బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి వేళ బీభత్సం సృష్టించి బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా భయానక వాతారణంలో పోలీస్స్టేషన్లోనే నిర్బంధించారు. ఆదివారం రాత్రి సమయంలో జైలుకు హాజరు పరిచి జడ్జి రిమాండ్కు ఆదేశించడంతో కర్నూలు సబ్జైలుకు తరలించారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. చిప్పగిరిలో భారీగా ధర్నా నిర్వహించి చంద్రబాబు ప్రభుత్వ బెదిరింపులకు బెదరబోమని హెచ్చరించారు. పోలీసుల ‘పచ్చ’పాతం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 34 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు టీడీపీ నేతల సేవల్లో తరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విరూపాక్షి ఎమ్మెల్యే ఎన్నికై రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఆయనకు పోలీసులు సరైన గుర్తింపును ఇవ్వలేదు. టీడీపీ నాయకుల జన్మదినోత్సవాలకు వెళ్లడం, వారి మన్ననలను అందుకోవడం ఆలూరు పోలీసులకు రివాజుగా మారింది. ఎమ్మెల్యే విరూపాక్షి తిరుగులేని నాయకుడిగా ఎదుగుతుండటాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పోలీసులతో పథక రచన చేశారు.‘రెడ్బుక్’ రాజ్యాంగం అమలు చేసేందుకు పక్కాగా ప్రణాళిక రచించి అమలు చేశారని ఎమ్మెల్యే అక్రమ అరెస్ట్ చేయించారని అర్థమవుతోంది. భయభ్రాంతులకు గురిచేసి.. చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త గిరిపై శనివారం రాత్రి టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. టీడీపీకి చెందిన వారు తనపై దాడికి పాల్పడుతున్నారని గిరి ఇచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే విరూపాక్షి, సోదరుడు శ్రీరాములు, వైఎస్సార్సీపీ కార్యకర్తల అక్కడికి వెళ్లారు. వారిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిని పట్టించుకోకుండా టీడీపీ నేతల ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 3 గంటలకు ఎమ్మెల్యే ఇంటికి పోలీసుపలు వెళ్లారు. ప్రజాప్రతినిధి అనే గౌరవం లేకుండా ఆయన ఇంటి సీసీ కెమెరాల వైర్లు కోసి, ఇంటి తాళాలు పగులగొట్టారు. ఎమ్మెల్యే విరూపాక్షిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెయని పరిస్థితి. ఇంట్లో ఉన్న మహిళలు భయభ్రాంతులకు గురైనా పోలీసులు లెక్కచేయలేదు. బాధితులపైనే కేసు నమోదు దాడి చేసిన వారిపైన కాకుండా పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాడిలో గాయపడి చేయి విరిగిన ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ విషయం పక్కన పెట్టారు పోలీసులు తలకు చిన్న గాయమైన వ్యక్తికి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి తీవ్రగాయాలైనట్లు సర్టిఫికెట్ తీసుకున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి తమ ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారని తప్పుడు వాగ్మూలం తీసుకున్నా ఎమ్మెల్యేతో పాటు 34 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగకముందే ఎమ్మెల్యేపైనే తీవ్రమైన కేసు నమోదు చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. సబ్ జైలుకు తరలింపు ఎమ్మెల్యేతో పాటు మరో 12 మందికి ఆదివారం సాయంత్రం 8 గంటలకు ఆలూరు కోర్టులో హాజరు పరచగా ఆలూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి హేమ వీరికి 14 రోజులు రిమాండ్కు ఆదేశించారు. పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 12 వైఎస్సార్సీపీ కార్యకర్తలను ప్రత్యేక బస్సులో ఆదివారం రాత్రి 11:30గంటలకు కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్ద ఉన్న సబ్జైలుకు తరలించారు. కనీస సమాచారం ఇవ్వకుండా రాత్రి సమయంలో దొంగచాటున ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని అరెస్టు చేయడాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఖండించారు. చిప్పగిరిలోని అంబేద్కర్ కూడలిలో రెండు గంటల పాటు నిసరన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ గుండాలు దాడి చేస్తే పరామర్శిండానికి వెళ్లిన ఎమ్మెల్యేపై అదే టీడీపీ గుండాలు దాడి చేసినా పోలీసులు పట్టించుకోవడం దారుణమన్నారు. అక్రమ కేసులతో అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీదేవి, ఎమ్మెల్సీలు మధుసూదన్, ఇసాక్, మాజీ ఎంపీ బుట్టారేణకు, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ మేయర్ బీవై రామయ్య, మాజీ గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కురువ శశికళ, ఆలూరు నియోజకవర్గ నాయకులు వైకుంఠం మల్లికార్జున చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉండబోదని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరసనలో వైఎస్సార్సీపీ చిప్పగిరి మండల కన్వీనర్ మల్లికార్జున, వైఎస్సార్సీపీ నాయకులు జూటూరు మారయ్య, పామిడి వీరయ్య, గుంతకల్లు బాబు, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హత్యాయత్నం కేసు నమోదు భగ్గుమన్న వైఎస్సార్సీపీ నేతలు చిప్పగిరిలో భారీ ధర్నా ‘రెడ్బుక్’కు బెదరబోమని హెచ్చరికకార్యకర్త ఆపదలో ఉన్నాడని సీఐకి ఫోన్ చేస్తే స్పందించలేదు. సరే చచ్చిపోతాడేమోనని మా ఆయన వెళ్తే తిరిగి ఆయన పైనే కేసు పెట్టారు. రాత్రి 11 గంటలకు కేసు విషయమై వెళ్తే అర్ధరాత్రి వరకు అక్కడే ఉంచుకున్నారు. ఆ తర్వాత మేం ఇంటికొచ్చి నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామును 3 గంటలకు వచ్చి పోలీసులు తలుపులు పగులగొట్టి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. వస్తున్నాం అని చెబుతున్నా కూడా దౌర్జన్యంగా లాక్కెళ్లారు. ఇంట్లో తోడు ఉంటాడని గుంతకల్లు నుంచి వచ్చిన మా అబ్బాయిని కూడా బలవంతంగా తీసుకెళ్లారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుని పరిస్థితి ఏంటి? – రామంజనమ్మ, ఎమ్మెల్యే విరూపాక్షి భార్యకార్యకర్తను పరామర్శించేందుకు వెళితే తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి విలేకరులకు తెలిపారు. సబ్జైల్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశపాలన కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. -
ఇలా ప్రారంభించి.. అలా మూతేసి!
● తక్కువ ధరకే బియ్యం కౌంటర్లు ఫొటోలకే పరిమితం ● కాసేపటికే మూసేసిన వైనంకర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు తగ్గింపు ధరలపై నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలే అంతా ఉత్తిదేనని తేలిపోయింది. కర్నూలులోని అమీన్ అబ్బాస్నగర్ రైతుబజారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ఆదివారం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రారంభించి వెళ్లిన అర గంటకే మూసేయడంతో వినియోగదారులు నిరాశగా వెనుదిరిగారు. బయట మార్కెట్లో స్టీమ్డ్ రైస్ ధర కిలో రూ.62. రా రైస్ ధర రూ.58 ఉందని, ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్టీమ్ రైస్ రూ.52కే పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. వినియోగదారులు బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే కౌంటరును ప్రారంభించి ఐదారుగురికి బియ్యం పంపిణీ చేసి ఫొటోలు దిగి.. మరో చోట కౌంటరును ప్రారంభించాల్సి ఉందని.. మూసేసి వెల్లిపోవడం గమనార్హం. తక్కువ ధరకే బియ్యం పంపిణీ చేస్తున్నామని భారీగా ప్రచారం చేసి.. కౌంటరుకు కేవలం 25 కిలోల బస్తా మాత్రమే తీసుకురావడం చూస్తే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. మండిబజారులో కూడా హోల్సేల్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఒక కౌంటరు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నా... అది కూడా ఫొటోలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. అమీన్ అబ్బాస్ నగర్ రైతుబజారులో బియ్యం కౌంటరు ప్రారంభ కార్యాక్రమంలో ఏఎస్ఓ రంజిత్, ఎస్టేట్ ఆఫీసర్ జయమ్మ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
సైకోలుగా తయారయ్యారు!
టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగం ఇలాగే అమలు పరుస్తూ పోతే భవిష్యత్తులో బ్లడ్ బుక్ రాజ్యాంగం వస్తుంది జాగ్రత్త! సైకోలుగా తయారై రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఒక కార్యకర్త ఆపదలో ఉండి ‘అన్నా నీవు ఇప్పుడు రాకపోతే పొద్దున్నే నా శవాన్ని చూస్తావ్’ అని ఫోన్ చేస్తే ఎమ్మెల్యేగా వెళ్లి పరామర్శించడం తప్పా? టీడీపీ నాయకులు సైకోలుగా తయారయ్యారు. ఇష్టానుసారంగా బెదిరిస్తే బెదిరిపోయే నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో ఎవ్వరూ లేరు. మా పార్టీ శ్రేణులకు మేమందరం అండగా ఉంటాం. – సాయిప్రసాద్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే -
ప్రతి పనికో రేటు!
● శ్రీశైలం మండలంలో మితిమీరుతున్న టీడీపీ నాయకుడి ఆగడాలు ● పీజేఆర్ఎస్లో ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ సాక్షి, టాస్క్ఫోర్స్: శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరులు చేస్తున్న ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. ఓ స్థలం విషయంలో రూ.లక్ష తీసుకుని తనని మోసం చేశాడని తాజాగా సున్నిపెంట గ్రామంలో నిర్వహించిన పీజేఆర్ఎస్లో ఏకంగా శ్రీశైల మండల టీడీపీ ప్రధాన నాయకుడిపై ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీ నాయకులే విస్మయానికి గురయ్యారు. తన వద్దకు సమస్యలపై వచ్చేవారికి టీడీపీ ఇన్చార్జ్కి, స్టేషన్లో ఓ అధికారికి డబ్బు ఇవ్వాలని ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి డబ్బు వసూలు చేస్తాడని సమాచారం. అతని ఆగడాలు సున్నిపెంటలో శృతిమించుతున్నట్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు సైతం వెల్లువెత్తినట్లు సమాచారం. ఎమ్మెల్యేతో దిగిన ఫొటోలే పెట్టుబడి.. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అండదండలతో శ్రీశైలం మండలంలో ద్వితీ యశ్రేణి నాయకులు చేస్తున్న ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారిని టార్గెట్ చేసుకుని ఒక్కోపనికి ఒక్కో రేటు కట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే స్థానిక పర్యటనలకు వచ్చినప్పుడు ఆయనతో చనువుగా ఉన్నట్లు వ్యవహరిస్తూ దిగిన ఫొటోలను, వీడియోలను స్టేటస్లలో పెట్టుకుని ప్రజలను మభ్యపెడుతున్నాడు. ఉద్యోగాలు, స్థలాలు, ఇరిగేషన్, గృహాలు, విద్యుత్ తదితర సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఓ స్థలం తనకు ఇప్పిస్తానని రూ.లక్ష తీసుకుని స్థలం ఇప్పించకుండా, డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ మహిళ జిల్లా ఎస్పీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ● తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ పేరుచెప్పి కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. ● పూర్ణానంద ఆమం సమీపంలో ఓ ఇంటి విషయంలో ఒకరికి మద్దతు తెలిపి వారి నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ● ఇటీవల ఓ వడ్డీ వ్యాపారి, మరో యువకుడు గొడవ పడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయంలో రాజీ చేస్తానని ఇద్దరి నుంచీ డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. వసూలు చేసింది కాదని స్టేషన్ అధికారికి, మండల టీడీపీ ఇన్ చార్జ్కి మరో రూ.50 వేలు ఇవ్వాలని పట్టుబట్టడంతో తాము అంత ఇచ్చుకోలేమని వారు నేరు గా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
● కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంతోపాటు అన్ని మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లో ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలున్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. meekosam.ap.gov.in వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు. పది మండలాల్లో తేలికపాటి వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో రుతుపవనాలు బలహీనపడిపోయాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలోని 10 మండలాల్లో తేలికపాటికే వర్షం కురిసింది. పెద్దకడుబూరులో 25.4 మి.మీ. వర్షం కురియగా.. మిగిలిన మండలాల్లో జల్లులకే పరిమితం అయ్యాయి. కౌతాళంలో 8.6, గోనెగండ్లలో 7.8, ఎమ్మిగనూరులో 4.2, కల్లూరులో 2.6, కోడుమూరులో 2.4, కోసిగిలో 2.2, మద్దికెరలో 1.0, కర్నూలు రూరల్లో 0.4, కర్నూలు అర్బన్లో 0.4 మి.మీ. ప్రకారం వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ సంస్థ ప్రకటించింది. ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్వోగా శ్యామల కర్నూలు కల్చరల్: అటవీ శాఖ ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్వోగా ఐఎఫ్ఎస్ పి. శ్యామల నియమతులయ్యారు. అటవీ శాఖ జిల్లా అఽధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్యామలకు ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డేవిడ్ పదవీ విరమణ పొందడంతో కర్నూలు డీఎఫ్ఓ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జి డీఎఫ్ఓగా వ్యవహరించనున్నారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి కర్నూలు (టౌన్): నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. క్వింటా వేరుశనగ గరిష్ట ధర రూ.8,290 ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటం వేరుశనగ గరిష్ట ధర రూ.8,290లు పలికింది. మార్కెట్కు 4,616 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటం వేరుశనగ కనిష్ట ధర రూ.3,130లు, మధ్యస్థ ధర రూ.6,745ల ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. ఆముదాలు క్వింటం రూ.5,100కు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. హైవేపై ఎలుగుబంటి హల్చల్ పాములపాడు: మండలంలోని ఎర్రగూడూరు గ్రామ సమీపంలో జెమ్మి చెట్టు నేషనల్ హైవేను దాటుతూ ఎలుగుబంటి హల్చల్ చేసింది. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఎలుగుబంటిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో పెద్ద శబ్దంతో హారన్లు కొడుతూ కేకలు వేశారు. దీంతో ఎలుగుబంటి పరుగున అడవిలోకి వెళ్లిపోయింది. ఎలుగుబంటి విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో అటువైపు వెళ్లేందుకు ప్రజలు సాహసించలేదు. అటవీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి అటవీ సమీప గ్రామాల్లోకి అడవి జంతువులు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పోలీసులు దారుణంగా వ్యవహరించారు
ఒక శాసనసభ్యుడికి పోలీసులు కనీస మర్యాదు కూడా ఇవ్వలేదు. రాత్రివేళ ఇంటి తలుపులు పగలగొట్టి దొంగల మాదిరిగా, టెర్రరిస్టుల్లా తీసుకుపోవడం అత్యంత దుర్మార్గం. ఈ రోజు పోలీసులు తమ ధర్మాన్ని మర్చిపోయి టీడీపీ నాయకుల ఆదేశాలను మాత్రమే అమలు చేస్తున్నారు. బాధితులు కేసు పెట్టడానికి వెళ్తే తీసుకోరు. కానీ దౌర్జన్యం చేసిన టీడీపీ ఫిర్యాదుల ఆధారంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా క్యాడర్ను భయభ్రాంతులకు గురి చేయాలనే ఈ విధంగా పోలీసులతో చేయిస్తున్నారు. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కసి పెరుగుతుందే తప్ప ఎవ్వరూ భయపడరు. 2029లో మళ్లీ జగన్ను సీఎంగా చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. – కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు -
అక్రమ కేసులు దుర్మార్గం
ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్లపైనే తిరిగి పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గం. ఎమ్మెల్యే విరూపాక్షిని ట్రాప్ చేసి రప్పించడం కోసమే ముందస్తు ప్రకారం కార్యకర్తపై దాడికి తెగబడ్డారు. రాత్రి పిలిస్తే వచ్చే ఎమ్మెల్యేను అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి హర్డ్ డిస్క్లు, కెమెరాలు లాక్కెళ్లడం ఏ చట్టం కిందకు వస్తుందో పోలీసు ఉన్నతాధికారులు ఆలోచించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా వైఎస్సార్సీపీ నేతలు అన్యాయం జరిగిందని పోలీసుస్టేషన్కు వెళితే వాళ్లపైనే కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమం నడుస్తోంది. విరూపాక్షిపైన పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే విరమించుకోవాలి. మేం న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ చట్టబద్ధంగా పోరాడుతాం. – శైలజనాథ్, మాజీ మంత్రి -
అర్ధరాత్రి ‘ఆపరేషన్ విరూపాక్షి’!
ఆదోని: ఆదివారం అర్ధరాత్రి.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్వగ్రామం, మండల కేంద్రమైన చిప్పగిరిలో తన భార్య, బిడ్డలతో మంచి నిద్రలో ఉన్నారు. ఐతే ఇంటి ప్రధాన ద్వారం తలుపులు బద్దలు కొడుతున్న శబ్దంతో ఉలిక్కిపడి లేచారు భార్యాభర్తలు. ఇంట్లో నుంచి తొంగి చూస్తే దాదాపు 40 మందికి పైగా పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ పక్కకు తిప్పేశారు. గునపాలు, కొడవళ్లతో తలుపులను పగలగొడుతూ తెరిచే ప్రయత్నం చేశారు. విధిలేక ఆ భయానక వాతావరణంలోనే ఎమ్మెల్యే విరూపాక్షి భార్య రామాంజనమ్మ తలుపులు తెరిచారు. ఒక్కసారిగా పోలీసులందరూ ఇంట్లోకి దౌర్యన్యంగా చొరబడ్డారు. నీ భర్త ఎక్కడ అంటూ ఆమె మీద చేతులు వేస్తూ పక్కకు నెట్టారు. ఎమ్మెల్యే ఉన్న బెడ్ రూం ద్వారాన్ని కూడా గునపంతో బద్దలు కొడుతూ తెరిచే ప్రయత్నం చేస్తుంటే ఆయన తలుపు తెరిచి బయటకు వచ్చారు. ఆరేడుగురు సీఐలు, దాదాపు నలభై మంది పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని చుట్టుముట్టి చిప్పగిరి పోలీసు స్టేషన్కు బలవంతంగా తరలించారు. రెడ్బుక్ రాజ్యాంగంలో తమ ఇంట్లో పోలీసులు జరిపిన దమనకాండ గురించి ఆలూరు ఎంఎల్ఏ విరూపాక్షి భార్య రామాంజనమ్మ నిలువెల్లా వణికిపోతూ చెప్పిన వివరాలివి. ఘటన పూర్వాపరాలను ఓమారు పరికిస్తే..టీడీపీ మూకల దాడి నుంచి కార్యకర్తను కాపాడుకునేందుకు..చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన గిరి అనే వ్యక్తి శనివారం రాత్రి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తనపై నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ మూకలు దాడులు చేస్తున్నాయని, తనను కాపాడాల్సిందిగా వేడుకున్నాడు. వెంటనే ఎమ్మెల్యే సీఐకి ఫోన్ చేశారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్లడానికి తాత్సారం చేస్తున్న విషయాన్ని గ్రహించి వెంటనే తన కార్యకర్త కోసం తన సోదరుడు శ్రీరాములు, కొందరు కార్యకర్తలను తీసుకుని రాత్రికి రాత్రే నేమకల్లు గ్రామానికి వెళ్లారు. అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీకి చెందిన ఇరుపక్షాలకు నచ్చచెప్పి ఇంటికి తిరుగు ముఖం పట్టారు. అయితే ముందస్తు పథకంలో భాగంగా గ్రామంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు గూండాలు ఎమ్మెల్యేను చుట్టుముట్టి మా గ్రామానికి ఎందుకు వచ్చావంటూ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ దౌర్జన్యంగా దాడికి దిగారు. వారి దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములుకు చేయి విరిగింది. వెంటనే తన సోదరుడిని వెంట తీసుకుని చిప్పగిరి పోలీసు స్టేషన్కు వెళ్లారు. ఫిర్యాదు ఇస్తే పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసులు టీడీపీ వర్గీయులకు వత్తాసు పలుకుతున్నారంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్ ఎదుట కొద్దిసేపు బైఠాయించారు. అర్ధరాత్రి తన ఇంటికి తిరిగివెళ్లారు.పక్కా పథకం ప్రకారమే ఎమ్మెల్యే నివాసంపై దాడిముందు రచించుకున్న పథకం మేరకు ఇక పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చుట్టు పక్కల ప్రాంతాలైన ఆదోని, పత్తికొండ, గుంతకల్లు, ఆస్పరి స్టేషన్లకు చెందిన సీఐలను, పోలీసులను పిలిపించుకున్నారు. పక్కా పథకం మేరకు 2.45 గంటల సమయంలో నక్సల్స్ను పోలీసులు చుట్టిముట్టినట్లు సీఐలు, భారీ ఎత్తున పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి బయట ఉన్న ఎమ్మెల్యే అనుచరులను ముందే స్టేషన్కు తరలించారు. ఇక ఇంట్లో కేవలం ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి, మరో మహిళా బంధువు మాత్రమే మిగిలారు. తర్వాత పోలీసులు గుండాల్లా రెచ్చిపోయారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. గునపాలతో తలుపులను పగలగొడుతూ తెరిచే ప్రయత్నం చేశారు. చివరకు ఎమ్మెల్యే భార్య తలుపులు తెరిచారు. ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసి ఎమ్మెల్యే ఉన్న బెడ్ రూంను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన బయటకు వచ్చారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీసుస్టేషన్కు తరలించారు. చిప్పగిరిలో ఆదివారం ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి గడియ ధ్వంసం చేసిన పోలీసులు స్టేషన్ వద్ద కార్యకర్తల ఆందోళన..ఎమ్మెల్యే నివాసంపై దాడిచేసి అత్యంత దుర్మార్గంగా నిర్బంధించిన విషయం తెల్లవారుజామునే సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రమంతా వ్యాపించింది. దీంతో కర్నూలు, నంద్యాల, అనంతపురం, తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వందలాది మంది కార్యకర్తలు, నాయకులు , మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు చిప్పగిరి పోలీసు స్టేషన్కు తరలివచ్చారు. భారీగా చేరుకున్న కార్యకర్తలు పోలీసు స్టేషన్ను ముట్టడించే ప్రయత్నం చేస్తుండటంతో స్టేషన్ గేట్లను మూసివేశారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆగ్రహించిన నాయకులు, కార్యకర్తలు గుంతకల్లు–ఆలూరు ప్రధాన రోడ్డు మీద బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఎమ్మెల్యే విరూపాక్షిని వెంటనే విడిచిపెట్టాలని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. కార్యకర్తకు అండగా నిలవడం తప్పా?టీడీపీ మూకలు దౌర్జన్యం చేస్తున్నాయని పార్టీ కార్యకర్త గిరి బాధపడుతుంటే కాపాడుకోవాలని ఎమ్మెల్యే వెళ్లడం, కార్యకర్తకు అండగా ఉండడం తప్పెలా అవుతుందని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన విలేకరులకు సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పెద్దల సూచనల మేరకు పోలీసులు పన్నిన పన్నాగమిది అని వ్యాఖ్యానించారు. కేసులకు బెదరబోమన్నారు. అంతకుముందు సాయిప్రసాద్ రెడ్డి సీనియర్ న్యాయవాది జీవన్సింగ్తో పాటు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి శైలజనాథ్, ఎంఎల్సీ డా.మధుసూదన్లను స్టేషన్లోకి తీసుకువెళ్లి డీఎస్పీ వెంకటరామయ్య, తదితర పోలీసు అధికారులతో మాట్లాడారు.హత్యాయత్నం కేసు.. 14 రోజులు రిమాండ్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై చిప్పగిరి పోలీసులు హత్యాయత్నం కేసు (ఎఫ్ఐఆర్ నంబరు: 37/2026) నమోదు చేశారు. ఈ కేసులో ఆయనతో పాటు మరో 16 మందికి ఆలూరు జేఎఫ్సీఎం కోర్టు 14 రోజుల జ్యుడీషీయల్ రిమాండ్ విధించింది. వీరిని కర్నూలు జైలుకు తరలించారు. కాగా ఎమ్మెల్యే మీద హత్యాయత్నం కేసులో మాత్రమే కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఎమ్మెల్యే తరఫు న్యాయవాది జీవన్సింగ్ ఆదివారం రాత్రి కీలక పిటిషన్ దాఖలు చేశారు. అట్రాసిటీ కేసులో కూడా రిమాండ్ అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.ఈ పిటిషన్పై సోమవారం కోర్టు విచారణ జరపనుంది. ఇదే సమయంలో ఘటనకు సంబంధించి కీలక ఆధారాలను భద్రపరచాలని కోరుతూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఘటన అనంతరం ఎమ్మెల్యేను తీసుకువచ్చిన చిప్పగిరి పోలీసు స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను కోర్టు ముందుంచాలని న్యాయవాది జీవన్సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సంబంధిత పోలీసు స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచి రెండు రోజుల్లోగా కోర్టు ముందుంచాలని పోలీసు అధికారులను ఆదేశించింది. కేసు విచారణలో ఆ ఫుటేజీ కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీమంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిమంత్రాలయం రూరల్: ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూపాక్షిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. ఈ ఘటనను సామాజిక మాధ్యమాల ద్వారా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలువుతోందన్నారు. ఆలూరు ఎమ్మెల్యేతో పాటు మరో 15 మందిని నిర్బంధించిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజా ప్రతినిధులకు సైతం స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని రకాల దాడులు, దౌర్జన్యాలు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదన్నారు. వైఎస్సార్సీపీ పైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఏపీలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ఆలూరు సీఐ రవిశంకర్ ఎమ్మెల్యేను ఏకవచనంతో మాట్లాడడం అత్యంత హేయమని అని అన్నారు. -
AP: ఆలూరు నియోజకవర్గంలో టెన్షన్.. టెన్షన్..
సాక్షి, కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గంలో పోలీసులు భారీగా మోహరించారు. అన్ని ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎవరిని రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే వీరుపాక్షిపై అట్రాసిటీ కేసు బనాయించేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.చిప్పగిరి పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళనవిరూపాక్షిని చిప్పగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. విరూపాక్షి అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కూటమి సర్కార్కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పీఎస్కు వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు.. పోలీస్స్టేషన్కు వచ్చే అన్నిదారులు మూసివేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా..కాగా, వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా అక్రమ అరెస్ట్లు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి.. వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2.45 గంటలకు భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరినీ చిప్పగిరి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా హార్డ్ డిస్క్లను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఇది జరిగింది..టీడీపీ నాయకుడు నాగరాజు.. వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే వీరుపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ విరుపాక్షిపై సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం, ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు.. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన విరూపాక్షి, చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. -
ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్
అప్డేట్స్:విరూపాక్షికి రిమాండ్ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్విరూపాక్షితో పాటు 17 మందికి రిమాండ్ విధింపు రిమాండ్ విధించిన ఆలూరు జూనియర్ సివిల్ కోర్టు 307 సెక్షన్ కింద కేసు నమోదుఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేసి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విరూపాక్షితో పాటు మరో 34 మంది కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపువిరూపాక్షిని కోర్టుకు తరలించిన చిప్పగిరి పోలీసులుజడ్జి ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులుసాక్షి, కర్నూలు జిల్లా: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో రాత్రి 2.45 గంటల సమయంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఎమ్మెల్యే నివాసం తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించడం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ నేతలు ఎస్వీ మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ ఎ. మధుసూధన్, బీవై. రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు.చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నాయకుడు నాగరాజు, అతని అనుచరులు దాడికి తెగబడితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే విరూపాక్షి వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ గూండాలు ఎమ్మెల్యేపై రాళ్లు రువ్వడంతో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనపై టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా, గొడవకు ఎమ్మెల్యేనే కారణమంటూ సీఐ రవిశంకర్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు.దాడికి పాల్పడిన టీడీపీ నాయకులను అరెస్టు చేయకుండా, బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రజాప్రతినిధిపై కేసులు పెట్టడం పోలీసు వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసినట్లు పోలీసు బలగాలు వ్యవహరించడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం, తలుపులు పగులగొట్టి విరూపాక్షితో పాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్టు చేసి చిప్పగిరి పోలీస్స్టేషన్కు తరలించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.ఎమ్మెల్యే నివాసంలోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లను పోలీసులు తీసుకెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వాస్తవాలను బయటకు రానివ్వకుండా సాక్ష్యాలను మాయం చేసేందుకే హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకున్నారా? అని ప్రశ్నించారు. వాటిలోని దృశ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వంసం చేయకుండా భద్రపరచాలని, ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుబంధ విభాగంలా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ శ్రేణులను బెదిరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పార్టీ భయపడేది లేదని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు నాగరాజుతో పాటు నిందితులందరినీ అరెస్టు చేయాలని, సీఐ రవిశంకర్రెడ్డి ఏకపక్ష వ్యవహారశైలిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. చిప్పగిరిలో శాంతిభద్రతలను పరిరక్షించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్.. చిప్పగిరిలో ఉద్రిక్తత
సాక్షి, కర్నూలు: కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా అక్రమ అరెస్ట్లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి పోలీసులు హైడ్రామాకు తెరలేపారు. వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్ట్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2.45 గంటలకు భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగులగొట్టి ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరినీ చిప్పగిరి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా హార్డ్ డిస్కులను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, టీడీపీ నాయకుడు నాగరాజు వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే వీరుపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోనలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ విరుపాక్షిపై సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం, ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు.. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిన విరూపాక్షి, చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. -
తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం
కర్నూలు(హాస్పిటల్): తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారమని, అవి అన్ని వ్యాధులు రాకుండా బిడ్డను రక్షిస్తాయని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. శనివారం ఆసుపత్రిలోని గైనిక్ వార్డులో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. పుట్టిన గంటలోపు శిశువుకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా శిశువు ఆరోగ్యానికి బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. మొదటి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అదనపు ఆహారం లేదా నీరు అవసరం లేదన్నారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి శిశువుకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దయనీయం
మేం ఇప్పటి వరకు 8 ఎకరాల్లో కందులు, 3 ఎకరాల్లో పసుపు, రెండు ఎకరాల్లో ఎర్ర మిరప సాగు చేశాం. మాకు నాలుగు బోర్లు ఉన్నాయి. గతంలో ఎపుడూ లేని విధంగా బోర్లలో నీరు అడుగంటి పోయింది. వర్షాలు లేక, బోర్లలో నీరు అడుగంటి పోవడంతో పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు ఎరువులు, విత్తనాలు, సేద్యాలు, బాడుగలు, కూలీ ఖర్చులు మొత్తంగా రూ.6 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. పెట్టుబడి మొత్తం మట్టిపాలు అయినట్లే. వానల్లేక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. – బత్తుల రాముడు, రామళ్లకోట, వెల్దుర్తి మండలం జల్లులు మినహా ఒక మోస్తరు వర్షం కూడా లేదు. మాకు సొంత భూమి 2 ఎకరాలు ఉండగా... 2 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. వర్షాధారం కింద రెండు ఎకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో ఎర్ర మిరప సాగు చేశాం. జూలై నెలలో వర్షాలు పడి ఉంటే పంటలు కోలుకునే అవకాశం ఉంది. నెల రోజులుగా చినుకు జాడ లేకపోవడం, ఎండలు, గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇపుడు వర్షాలు పడినా కోలుకునే అవకాశం లేదు. ఇప్పటి వరకు రూ. లక్ష పెట్టుబడి పెట్టాం. ఎకరాకు రూ.12 వేలు కౌలు ఉంది. రెండు ఎకరాలకు రూ.24 వేలు చెల్లించాలి. గతంలో ఎపుడూ లేని విధంగా నష్టాలు మాట కట్టుకున్నాం. – ఎం.మల్లయ్య, హొళగుంద -
పింఛన్ సొమ్ము మాయం.. గంటల్లోనే రికవరీ
కోడుమూరు రూరల్: సచివాలయంలో పింఛన్ల పంపిణీ కోసం దాచిన డబ్బును కాజేసి చివరకు పోలీసులకు చిక్కిన సంఘటన శనివారం కోడుమూరులో చోటు చేసుకుంది. కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీలోని సచివాలయం–1లో ఆగస్టు 1న పింఛన్లు పంపిణీ చేసేందుకు వెల్ఫేర్ అసిస్టెంట్ అనీల్కుమార్ శుక్రవారం సాయంత్రం బ్యాంకు నుంచి పింఛన్ అమౌంట్ రూ.29.96 లక్షలు డ్రా చేశాడు. డ్రా చేసిన మొత్తంలో నుంచి పింఛన్ల పంపిణీ కోసం సిబ్బందికి రూ.16.56 లక్షలు ఇవ్వగా, మిగిలిన రూ.13.40 లక్షల నగదును సర్వేయర్, మహిళా పోలీస్, ఆఫీస్ బాయ్ సమక్షంలో గ్రామ సచివాలయంలోని బీరువాలో భద్రపరిచి తాళాలను అనీల్కుమార్ తీసుకెళ్లాడు. శనివారం ఉదయం పింఛన్ల పంపిణీ కోసం బీరువా తాళాలు తెరిచి చూడగా రూ.60 వేలు తక్కువగా ఉండటాన్ని గమనించి డబ్బుపోయిన విషయంపై సిబ్బందితో కలిసి కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామికి వెల్ఫేర్ అసిస్టెంట్ ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై ఎస్ఐ విచారణ చేపట్టగా ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న బోయ సురేష్ మారు తాళాలతో బీరువా నుంచి డబ్బులను దొంగలించినట్లుగా గుర్తించాడు. దీంతో బోయ సురేష్ నుంచి డబ్బులను ఎస్ఐ రికవరీ చేసి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్కు నగదును అప్పగించాడు. కాగా నగదు మాయమైన విషయాన్ని ఫిర్యాదు చేసిన వెంటనే చేధించి ఇంటి దొంగను పట్టుకున్న కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి, సిబ్బందిని గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు, ప్రజలు అభినందిస్తున్నారు. -
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డికల్లూరు: బస్తిపాడు గ్రామ పొలిమేరలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై, చెట్లమల్లాపురం గ్రామంలోని జగనన్న కాలనీలో ప్లాట్లను ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీసీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ ఆంజనేయులతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను ఆక్రమించడం ప్రజల హక్కులపై దాడితో సమానమన్నారు. బస్తిపాడు గ్రామంలోని సర్వే నంబర్ 382లో ఉన్న సుమారుగా 1.93 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలన్నారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం అధికారుల ప్రాథమిక బాధ్యత అన్నారు. చెట్లమల్లాపురం గ్రామంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నా.. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం వైఎస్సారీసీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కల్లా వెంకట రమణారెడ్డి, నారాయణరెడ్డి, దండు లక్ష్మీకాంతరెడ్డి, అక్కిమి హనుమంతురెడ్డి, శివశంకర్రెడ్డి, తిరుపాల్, పెద్దన్న, యూనస్, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారాన్ని ప్రోత్సహించండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధికర్నూలు: మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి కక్షిదారులను ప్రోత్సహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం మధ్యవర్తిత్వం 3.0పై న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి/న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు కబర్ధి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథులుగా హాజరై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించాలని హైకోర్టు తీర్మానించిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల నుంచి డిసెంబర్ 31 వరకు దేశం కోసం మధ్యవర్తిత్వం 3.0పై ముమ్మర ప్రచారాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని కోర్టుల్లో నిర్వహిస్తామని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా ఏ విధంగా కేసులు పరిష్కారమవుతాయో న్యాయవాదులకు అవగాహన కల్పించారు. కక్షిదారులకు న్యాయవాదులు కూడా మీడియేషన్పై అవగాహన కల్పించి వారి కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని తెలిపారు. దీనివల్ల కోర్టుల్లో కేసులు విచారణ వరకు వెళ్లకుండానే పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా సత్వర పరిష్కారం, ఖర్చు లేకుండా శాశ్విత పరిష్కారం కక్షిదారులకు లభిస్తుందని తెలిపారు. కర్నూలు బార్ అసోసియేషన్ న్యాయవాదులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
5 నుంచి 16 వరకు ‘టెట్’
కర్నూలు(సెంట్రల్): టీచర్ ఎలిజబులిటీ టెస్టు(టీఈటీ)ను ఆగస్టు 5 నుంచి 16వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ...జిల్లాలో టెట్ కోసం 31,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి జిల్లాలో ఐదు, హైదరాబాద్లో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి పంపుతామని, ఆలస్యంగా వస్తే అనుమతించబోరని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను తీసుకెళ్లరాదన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలతో గట్టి నిఘా ఉంచాలని డీఈఓ సుధాకర్ను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ సామాజిక బాధ్యత ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు: రోడ్డు ప్రమాదాలను నివారించడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా నిరంతరం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఈ ఏడాది జనవరి 1నుంచి జూలై 31వ తేదీ వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి 24,846 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్స్టేషన్ల వారీగా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటు తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం కర్నూలు(అర్బన్): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల 9వ తేదీన అందరి సహకారంతో ఘనంగా నిర్వహిద్దామని జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి డీ సురేష్ అన్నారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన శనివారం తన చాంబర్లో గిరిజన సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఆయా సంఘాల నాయకులతో చర్చించారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు ఆర్ కై లాస్నాయక్, ఆర్ చంద్రప్ప, రామరాజు, వై రాజు, వై మద్దిలేటి, యోగేష్నాయక్, గుండాల నాయక్, సేవాలాల్నాయక్, సీమ కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రోజూ 35 వేల మందికి ఉపాధి పనులు కల్పించాలికర్నూలు(సెంట్రల్): వ్యవసాయ పనులు తక్కువ ఉన్న నేపథ్యంలో జిల్లాలో ప్రతి రోజూ 35 వేల మందికి ఉపాధి పనులు కల్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం ఆమె వీబీజీరామ్జీ పథకం అమలుపై ఎంపీడీఓలు, ఏపీఓలు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, ఏపీడీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. హార్టికల్చర్ కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు ఐదు వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ కింద 11 రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో చేపడుతున్న ప్లాంటేషన్ కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. అనంతరం మండలాల వారీగా ఉపాధి పనుల కల్పన, ప్లాంటేషన్పై కలెక్టర్ సమీక్షించారు. టెలీకాన్ఫరెన్స్లో డ్వామా పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై పచ్చమూక దాడి
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారం మదంతో పచ్చమూకలు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేత గిరి ఇంటిపైకి దాడికి తెగబడ్డారు. టీడీపీ నేత నాగరాజు ఈ దాడికి పాల్పడ్డారు. ఏ కారణం లేకుండానే వైఎస్సార్సీపీ నేత ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నేతను పరామర్శించడానికి ఎమ్మెల్యే విరుపాక్షి అక్కడి చేరుకున్నారు. ఎమ్మెల్యే వీరుపాక్షిపై కూడా టీడీపీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాముడుకి గాయాలయ్యాయి. ఈ ఘటనపై టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు చోద్య చూస్తున్నారు. గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ సీఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. ఇంకా గొడవ సర్దుమనుగక కాక ముందే టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి సంగాల గ్రామానికి బయలుదేరారు. -
నీట్ ఫలితాలు.. కుటుంబం ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి!
ఆంధ్రప్రదేశ్, కోడుమూరు రూరల్: నీట్ పరీక్షలో మార్కులు తక్కువగా రావడంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని అనుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాల వేణుగోపాల్కు పిల్లలు లేకపోవడంతో భార్య భాగ్యమ్మ తరపు బంధువులకు చెందిన పుష్పావతి(19)ని ఆరేళ్ల వయస్సులోనే తెచ్చుకొని పెంచుకుంటున్నారు.బాగా చదివించడం.. పుష్పావతి డాక్టర్ కావాలనుకోవడంతో ఇంటర్ బైపీసీ ఇప్పించగా 965మార్కులను సాధించింది. ఆ తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్ నీట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ సైతం ఇప్పించి పరీక్షలు రాయించాడు. అయితే మొదటి సారి రాసిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల క్యాన్సిల్ కావడంతో రెండవసారి పరీక్ష రాసింది. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో తనకు 487మార్కులు వచ్చాయంటూ ఆ బాలిక వేణుగోపాల్కు చెప్పసాగింది.అయితే ఆయన ఈ రోజు కర్నూలుకు వెళ్లి పుష్పావతికి వచ్చిన మార్కులను చెక్ చేయగా నీట్ పరీక్షలో 347 మార్కులు మాత్రమే వచ్చాయంటూ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్పావతి రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకు బయటకు రాకపోవడం, పిలిచినా పలుకక పోవడంతో అనుమానం వచ్చిన వేణుగోపల్ భార్య భాగ్యమ్మ చుట్టుపక్కల వారి సాయంతో తలుపులను పగులగొట్టి చూడగా అప్పటికే పుష్పావతి ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఉరి నుంచి తప్పించి చూడగా అప్పటికే మృతి చెందింది.పిల్లలు లేకపోవడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పుష్పావతి నీట్లో మార్కులు తక్కువగా వచ్చాయనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి సొంత తండ్రి కొండ్ర లక్ష్మీదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
భార్యను చంపి.. ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకుని..
కర్నూలు జిల్లా: నిద్రిస్తున్న భార్యను అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన నిందితుడు ఆమె సమాధి వద్దే బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు, సీఐ మధు వివరాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన మాదరమోని బాబు (56), అమృత (45) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. మద్యానికి అలవాటు పడిన బాబు తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న భార్యను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన పోలీసులు అతడిని పట్టుకొని రిమాండ్కు తరలించారు. వారం రోజుల కిందట పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ క్రమంలో అతనితో ఎవరూ సరిగా మాట్లాడటం లేదు. దీంతో మానసిక వేదనకు గురైన బాబు గురువారం రాత్రి నోములలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న భార్య సమాధి వద్దకు వెళ్లి అక్కడే నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు చూసి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల
కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలకు తాత్కాలిక మెరిట్ జాబితా, తిరస్కరణ వివరాలను విడుదల చేసినట్లు ఆ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆయా కేటగిరీలకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్, జానియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, టైపిస్టు, ఎల్డీ కంప్యూటర్, ఏఎన్ఎం గ్రేడ్ –3 పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించామన్నారు. తమ కార్యాలయంలోని నోటీసు బోర్డులో, డిస్ట్రిక్ట్ వెబ్సైట్ https://kurnool.ap.gov.in లో జాబితాలను ఉంచామన్నారు. వివరాల్లో ఏవైనా ఆక్షేపణలు ఉంటే ఈ నెల 7వ తేది సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. అలాగే కార్యాలయ మెయిల్ ఐడీ addwknl@gmail.comకి తగిన ఆధారాలతో తెలియజేయవచ్చన్నారు. ‘నీట్’ విద్యార్థిని ఆత్మహత్య కోడుమూరు రూరల్: నీట్ పరీక్షలో మార్కులు తక్కువగా రావడంతో ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనుగొండ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాల వేణుగోపాల్కు పిల్లలు లేకపోవడంతో భార్య భాగ్యమ్మ తరపు బంధువులకు చెందిన పుష్పావతి(19)ని ఆరేళ్ల వయస్సులోనే తెచ్చుకొని పెంచుకుంటున్నారు. బాగా చదివించడం.. పుష్పావతి డాక్టర్ కావాలనుకోవడంతో ఇంటర్ బైపీసీ ఇప్పించగా 965మార్కులను సాధించింది. ఆ తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేట్ నీట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ సైతం ఇప్పించి పరీక్షలు రాయించాడు. అయితే మొదటి సారి రాసిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో క్యాన్సిల్ కావడంతో రెండవసారి పరీక్ష రాసింది. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో తనకు 487మార్కులు వచ్చాయంటూ ఆ బాలిక వేణుగోపాల్కు చెప్పసాగింది. అయితే ఆయన ఈ రోజు కర్నూలుకు వెళ్లి పుష్పావతికి వచ్చిన మార్కులను చెక్ చేయగా నీట్ పరీక్షలో 347 మార్కులు మాత్రమే వచ్చాయంటూ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్పావతి రూమ్లోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు లేకపోవడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పుష్పావతి ఆత్మహత్యకు పాల్పడడంతో దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి సొంత తండ్రి కొండ్ర లక్ష్మీదాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు(అర్బన్): తల్లి పాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 1 నుంచి 7వ తేది వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ సాధికారత అధికారి పి.విజయ తెలిపారు. ప్రసవించిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టించాలని ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాల్లో జిల్లాలోని గర్భిణిలు, బాలింతలు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తమ పరిధిలో తప్పక పాల్గొనాలని ఆమె కోరారు. -
అనుమాన భూతం.. తల్లీ, బిడ్డ హతం
● భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త ● బళ్లారిలోని ఆంఽధ్రాళ్ ప్రాంతంలో దారుణం సాక్షి,బళ్లారి: కుటుంబ కలహాలు, భార్యపై అనుమానం పెంచుకున్న కిరాతక భర్త ఏడు నెలల పసికందును, భార్యను దారుణంగా హత్య చేశాడు. కర్ణాటక రాష్ట్రం బాళ్లారి నగర శివార్లలో 8వ వార్డు పరిధిలోని ఆంధ్రాళ్ ప్రాంతంలో జరిగిన ఈ జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. ఆంధ్రాళ్లో నివాసం ఉంటున్న హొన్నూరప్ప(28), తన భార్య రాజేశ్వరి(24)ని, కుమార్తె అశ్విని(1)ని దారుణంగా హత్య చేశాడు. స్థానికులు సమాచారం అందించిన వెంటనే ఎస్పీ సుమన్ పన్నేకర్, డీఎస్పీ, సీఐలు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన రాజేశ్వరికి హొన్నూరప్పతో పెళ్లయింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే చివరి సంతానం అశ్విని తనకు పుట్టలేదంటూ భార్య శీలంపై అనుమానం పెంచుకుని తరచు గొడవ పడేవాడు. చివరకు పసికందును, భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పథకం ప్రకారం భార్యను, పసికందును సుత్తితో కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానే హత్య చేసినట్లు చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిగ్రీ సప్లిమెంటరీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మార్చి/ఏప్రిల్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ 2, 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు htt ps://rayalaseemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. రెండవ సెమిస్టర్కు సంబంధించి 454 పేపర్స్కు దరఖాస్తు చేసుకోగా 152, నాల్గవ సెమిస్టర్కు సంబంధించి 587 పేపర్స్కు దరఖాస్తు చేసుకోగా 283 పేపర్స్ ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.అశ్విని (ఫైల్)హొన్నూరప్ప, రాజేశ్వరి (ఫైల్) -
ఉద్రిక్తంగా స్కీం వర్కర్ల కలెక్టరేట్ ముట్టడి
కర్నూలు(సెంట్రల్): స్కీం వర్కర్ల కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మెయిన్ గేట్ వద్ద కనీస వేతనాల కోసం ఉద్యమించిన స్కీం వర్కర్లను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేట్లు దూకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించడంతో పోలీసులు, స్కీం వర్కర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కనీస వేతన డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి.నిర్మల మాట్లాడుతూ స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలన్నారు. వర్కర్లకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమ్మ, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రమీజాబీ, బాలదుర్గమ్మ, శివలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
లోకేష్.. మంత్రి పదవి నుంచి తప్పుకో
● డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలికర్నూలు(సెంట్రల్): డీఎస్సీ–2024 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ డీఎస్సీ–2024లో పెద్ద ఎత్తున అవకతవకాలు జరిగాయన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో కొందరు టీడీపీ నాయకులు ఒక్కో టీచర్ ఉద్యోగాన్ని రూ.15 లక్షలకు అమ్ముకున్నారన్నారు. డీఎస్సీ పేపర్ లీకేజీ జరిగిందని.. స్వయంగా పేపర్ తయారు చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి టీచర్ ఉద్యోగం రావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ అక్రమాలకు మంత్రి లోకేష్ సన్నిహితులే పాల్పడ్డారని, అందులో ఆయనకూ వాటా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖమంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఏపీలో డీఎస్సీ అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలన్నారు. కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి బుట్టా రేణుక, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, కోడుమూరు ఇన్చార్జి ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తన కుమారుడు మంత్రిగా ఉండటం వల్లే అక్రమాలు జరిగినా విచారణ జరిపించడం లేదన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నా ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చెప్పడం లేదన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ షరీష్, జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడు శివారెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రశాంత్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతం కటికె, మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించండి
కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సీఐలు, ఎస్ఐలు పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సైబర్ నేరాల కేసుల విషయంలో 1930కి వచ్చిన ఫిర్యాదులు, ఆన్లైన్ ఫిర్యాదులు, బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన నగదు అంశాలను పర్యవేక్షించి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీఎస్ పోలీసులు పనితీరు మెరుగుపరచుకుని బృందాలుగా ఏర్పడి ప్రాపర్టీ నేరాలను ఛేదించాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు వెంకటరామయ్య, రాఘవేంద్ర, దుర్గాప్రసాద్తో పాటు సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. నేషనల్ అడ్వెంచర్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా అందించే టెన్జింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డు–2025కు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్కూరు సీఈఓ డాక్టర్ కె.వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు సంవత్సరాలైన 2023, 2024, 2025 కాలంలో భూమి, సముద్రం, గగనతలంపై నిర్వహించిన సాహసక్రీడలు, సాహస కార్యక్రమాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన వ్యక్తులు ఈ అవార్డు దరఖాస్తుకు అర్హులన్నారు. అవార్డును అర్జున అవార్డులతో పాటు ప్రదానం చేస్తారన్నారు. అవార్డు గ్రహీతలకు టెన్జింగ్ నార్కే కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ.15లక్షల నగదు బహుమతి అందజేస్తారన్నారు. ఈనెల 20లోపు httpr://awardr.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను కర్నూలు నగరం కల్లూరు ఎస్టేట్లోని సెట్కూరు కార్యాలయంలో సమర్పించాలన్నారు. -
సర్లో 2,73,587 మంది ఓటర్ల తొలగింపు
● సర్లో తొలగించిన ఓటర్ల సంఖ్య 2,73,587 ● అత్యధికంగా పాణ్యంలో 2,83,030 మంది ఓటర్లు ● అత్యల్పంగా మంత్రాలయంలో 1,97,152 మంది ● ముసాయిదా జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం ● అభ్యంతరాలకు ఆగస్టు 30వ తేదీ వరకు గడువు ● అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా విడుదల కర్నూలు(సెంట్రల్): స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్ఓ)ల ఇంటింటి సర్వే పూర్తి కావడంతో జిల్లా ఎన్నికల సంఘం ముసాయిదా జాబితా విడుదల చేసింది. ఆ ప్రకారం జిల్లాలో 18,14,128 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8,93,162 మంది కాగా.. మహిళలు 9,19,105.. ఇతరులు 264, సర్వీసు ఓటర్లు 1,596 మంది ఉన్నారు. కాగా, పురుష ఓటర్ల కంటే 25,944 మంది మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అత్యధికంగా పాణ్యంలో 2,83,030 మంది ఓటర్లు, అత్యల్పంగా మంత్రాలయంలో 1,97,152 మంది ఓటర్లు ఉన్నారు. ఆలూరు తప్ప అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం తప్ప అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఆలూరులో 1,19,008 మంది పురుష ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 1,18,259 మంది ఉన్నారు. ఇక జిల్లా మొత్తంగా మహిళా ఓటర్లు 9,19,105 మంది ఉండగా పురుష ఓటర్లు 8,93,162 మంది, ఇతరులు 265 మంది ఉన్నారు. ఇతరుల్లో అత్యధికంగా పాణ్యంలో 63 మంది, అత్యల్పంగా కర్నూలులో 18 మంది ఉన్నారు. కర్నూలు, పాణ్యం, ఆదోనిలోనే ఎక్కువ ఓటర్ల తొలగింపు? కర్నూలు, పాణ్యం, ఆదోని నియోజకవర్గాల్లోనే ఎక్కువగా తొలగింపులు ఉన్నాయి. కర్నూలులో మొత్తం ఓటర్లు 2,74,622 మందిలో 67,755 మంది, పాణ్యంలోని 3,35,015 మందిలో 51,985 మంది, ఆదోనిలోని 2,67,980 మందిలో 34,946 మంది ఓటర్లను తొలగించారు. ఇందులో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్లోని 16 వార్డుల్లోనే తొలగించిన జాబితా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. దీనిని బట్టి కర్నూలు నగరంలోని ఓటర్ల వివరాలు ఎక్కువగా గల్లంతయ్యాయని తెలుస్తోంది. తొలగింపుల్లో అర్హులు ఉంటే ఏమి చేయాలి సర్లో భాగంగా జిల్లాలో తొలగించిన ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్లు ఉంటే ఏమి చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. వీరంతా త్వరలోనే జరిగే స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఫాం–6 ఇచ్చి మళ్లీ ఓటును పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఉంది. లేదంటే వారి ఓటు శాశ్వతంగా తొలగిపోతుంది. పెరిగిన 249 పోలింగ్ బూత్లు జిల్లాలో సర్లో భాగంగా పోలింగ్ బూత్ల విభజన కూడా జరిగింది. 2024 ఎన్నికల ప్రకారం జిల్లాలో 2203 పోలింగ్ బూత్లు ఉండేవి. ఈ క్రమంలో ప్రతి బూత్లో 1,200 ఓటర్లు మాత్రమే ఓటు వేసేలా బూత్ల పరిధిని కుదించారు. గతంలో 1,500 పైగా కూడా ఒక్కో బూత్లో ఓటు వేసే వారు. అయితే ఆ సంఖ్య ను 1,200లకు కుదించడంతో జిల్లాలో భారీగా పోలింగ్ బూత్లు పెరిగాయి. ఆ సంఖ్య 2,203 నుంచి 2,452కు పెరిగింది. మొత్తంగా జిల్లాలో సర్ తరువాత 249 పోలింగ్ బూతులు పెరిగాయి. నియోజకవర్గం పోలింగ్ పురుష మహిళా ఇతరులు సర్వీస్ మొత్తం కర్నూలు 318 99820 107029 18 79 206946 పాణ్యం 373 137835 145132 63 277 283307 పత్తికొండ 277 103259 103578 22 449 207308 కోడుమూరు 291 112792 113772 12 177 226753 ఎమ్మిగనూరు 322 109503 112167 31 187 221888 మంత్రాలయం 267 96405 100719 28 57 197209 ఆదోని 284 114540 118449 45 108 233142 ఆలూరు 320 119008 118259 46 262 237575 మొత్తం 2452 893162 919105 265 1596 1814128 ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ జిల్లాలో సంచలనం సృష్టించిన సర్–2026 సర్వేలో ఏకంగా 2,73,587 మంది ఓటర్లను తొలగించారు. జూన్ 15 నుంచి జూలై 24వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటా సర్వే నిర్వహించి సేకరించిన జాబితాల ఆధారంగా ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను శుక్రవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితాపై ఆగస్టు 30వ తేదీ వరకు సలహాలు, సూచనలు, ఫిర్యాదులను స్వీకరిస్తుంది. కాగా, ముసాయిదా జాబితాలను అన్ని పోలింగ్ బూత్ల వారీగా అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్లోనూ తొలగించిన జాబితాలు, సర్ సర్వే జాబితాలు అందుబాటులో ఉంటాయి. ఆ జాబితాల ఆధారంగా ఏమైనా ఫిర్యాదులు చేస్తే వాటిపై ఆగస్టు 30వ తేదీ వరకు పరిశీలన చేసి సెప్టెంబర్ 28వ తేదీలోపు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తారు. అక్టోబర్ 3వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.జిల్లాలో మొత్తం 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. సర్లో భాగంగా బీఎల్ఓలు 2026 జూన్ 15 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటా సర్వేకు శ్రీకారం చుట్టారు. 2025 ఓటరు జాబితాను 2002 సర్ జాబితా ఆధారంగా పోల్చి చూశారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్లు ఇచ్చి సేకరించారు. మొత్తం 20,86,119 మంది ఓటర్లలో 18,12,532 మంది ఓటర్లే తమ ఎన్యుమరేషన్ ఫామ్లను తిరిగి సమర్పించారు. దీంతో ఎన్యుమరేషన్ ఫామ్లను సమర్పించని 2,73,587 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. -
కొత్త పింఛన్లు లేనట్లే!
● వృద్ధులకు తప్పని ఎదురు చూపులు ● దివ్యాంగులకు తొలగని కష్టాలు ● నేడు ఆగస్టు నెల పింఛన్ల పంపిణీ ఈ చిత్రంలో కనిపించే వృద్ధురాలి పేరు కటికే మాసూంబీ. ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన ఈమెకు 73 ఏళ్ల వయస్సు ఉంది. నా అనే వాళ్లు లేరు. ఒంటరి మహిళ. కొన్ని నెలల కిత్రం వరకు ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో రోడ్డు పక్కన చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవారు. రోడ్డు విస్తరణ పేరుతో గుడిసెను మున్సిపల్ అధికారులు తొలగించడంతో ఆధారం కోల్పోయి మసీదుపురంలోని బంధువుల అవ్వ ఉంటున్నారు. అధికారుల చుట్టూ తిరిగా రెండేళ్లుగా అవ్వకు పింఛన్ మంజూరు కాలేదు. .. జిల్లాలో ఇలాంటి వారు 18,717 మంది ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ పింఛన్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారాన్ని చేపట్టి రెండేళ్లు పూర్తయినా హామీని అమలు చేయలేదు. కనీసం 60 ఏళ్లు నిండిన వారికి కూడా పింఛన్లు ఇవ్వడం లేదు. లబ్ధిదారులు మరణిస్తే భార్యకు పింఛన్ మంజూరు చేయడం మినహా కొత్తవి ఇవ్వడం లేదు. స్పౌజ్ పింఛన్లు కూడా 2025 జూలై నుంచి మాత్రమే ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అంటే 2024 జూన్ నుంచి 2026 జూన్ వరకు 18,717 మంది పింఛన్దారులు మరణించినట్లు లెక్కలు ఉన్నాయి. 2026 జనవరిలో 754, ఫిబ్రవరిలో 761, మార్చిలో 663, ఏప్రిల్లో 580, మేలో 713, జూన్లో 629 మంది పింఛన్దారులు మృతిచెందారు. పింఛన్ల కోసం వృద్ధులు ఎదురు చూడాల్సి వస్తోంది. దివ్యాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేనేత, మత్స్యకారులు, వివిధ వ్యాధిగ్రస్తుల కష్టాలు అన్నీఇన్నీ కావు. చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఏడాది జూన్ 12 నాటికి రెండేళ్లు పూర్తి అయింది. ఆ సమయంలోకొత్త పింఛన్లు ఇస్తున్నామంటూ టీడీపీ నేతలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. కాని కొత్త పింఛన్లు లేనట్లేనని తేలిపోయింది. నేడు పింఛన్ల పంపిణీ ఆగస్టు నెల పింఛన్ల పంపిణీ శనివారం జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ చేసేందుకు డీఆర్డీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లాలో జూలై నెలలో 2,34,266 పింఛన్లు ఉండగా.. ఆగస్టు నాటికి 2,33,902కు తగ్గాయి. అంటే 364 పింఛన్లపై వేటు పడింది. -
మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరం
● న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి కర్నూలు: మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరమని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ సేవా సదన్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశాల మేరకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానవ అక్రమ రవాణా గురించి అనేక విషయాలపై మాట్లాడారు. ప్రతి సంవత్సరం జులై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యూఎన్ఓడీసీ సంస్థ ఈ సంవత్సరం మానవ అక్రమ రవాణా అనేది వ్యవస్థీకృత నేరం – దోపిడీని అంతమొందిస్తాం.. అనే నినాదాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి చట్టాలను బలోపేతం చేయడం, అవగాహన పెంచుకోవడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరచడం వంటి చర్యలను తీసుకోవాలని తెలిపారు. అనంతరం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా న్యాయ సేవా సదన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. డీసీపీఓ శారద, చైల్డ్ వెల్ఫేర్ సభ్యుడు సుధాకర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ శివరామచంద్రరావు, రాయపాటి శ్రీనివాస్, ఎస్ఆర్ఈడీఎన్జీఓ సుధాకర్ రెడ్డి, పోలీసులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, ఎన్జీఓలు పాల్గొన్నారు. -
పశుగ్రాసానికి పనికి వచ్చే పంటలేవీ?
డోన్ సంతకు భారీగా వచ్చిన పశువులుకర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో తీవ్రత మూగజీవులపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఒకవైపు పశుగ్రాసం కొరత, మరోవైపు నీటి కరువుతో రైతులకు పశుపోషణ పెనుభారంగా మారింది. వానాకాలం మొదలై రెండు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకోలేదు. సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయాయి. లక్షలాది ఎకరాల్లో విత్తనం కూడా వేయని పరిస్థితి ఏర్పడింది. ఏడాది పొడవునా ఇదే పరిస్థితులు ఉంటే పశువులను ఎలా పోషించాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. తప్పుడు లెక్కలు జిల్లాలో తెల్ల, నల్లజాతి పశువులు 3.40 లక్షలు ఉన్నాయి. గొర్రెలు, మేకలు 18 లక్షలు ఉన్నాయి. ఆవు/ ఎద్దును ఒక యూనిట్గా తీసుకుంటారు. గేదెను ఒకటిన్నర యూనిట్గా పరిగణిస్తారు. ఒక దూడను 0.6 యూనిట్, ఐదు గొర్రెలు/ మేకలను ఒక యూనిట్గా వ్యవహరిస్తారు. వీటిని లైవ్స్టాక్ యూనిట్లుగా పేర్కొంటారు. ఇటువంటి యూనిట్లు ఏడు లక్షలు ఉన్నాయి. జాతి పశువులకు రోజుకు 30 కిలోల పచ్చి మేత, 7–8 కిలోల ఎండమేత అవసరం. నాటు పశువులకు 15 కిలోల పచ్చిమేత, 5–6 కిలోల ఎండుమేత అవసరం. పశుసంవర్ధక శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో పశుగ్రాసం కొరత లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఒకవైపు మేత, మరోవైపు నీటి సమస్యలతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సెప్టెంబరు నెల చివరి వరకు జిల్లాకు 3.50 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే 3.31 లక్షల టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉందని చెబుతున్నారు. 19 వేల టన్నుల వరకు పశుగ్రాసం కొరత ఏర్పడుతుందని, దీనిని నివారించేందుకు పశుగ్రాసం సాగుకు 75 శాతం సబ్సిడీపై గడివిత్తనాలు, 50 శాతం సబ్సిడీపై దాణా సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. 26 టన్నుల గడ్డి విత్తనాలు, 946 టన్నుల దాణా సరఫరా చేస్తుండటం వల్ల పశుగ్రాసం కొరత నుంచి బయట పడుతున్నామని కాకి లెక్కలు చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పశుగ్రాసం కొరత కనిపిస్తోంది. నీటి తొట్లు ఉన్నా.. లేనట్లే! వర్షాలు లేకపోవడంతో చెరువులు, వాగులు, వంకల్లో చుక్కనీరు లేకుండా పోయింది. ఇప్పటికే నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆస్పరి, ఆలూరు, పెద్దకడబూరు, పత్తికొండ, ఆదోని తదితర మండలాల్లో 20 రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. పశువులు దాహార్తి తీర్చేందుకు ‘ఉపాధి’ నిధులతో 423 నీటితొట్లు నిర్మించారు. ప్రజలకు మంచినీరు ఇవ్వడమే కష్టమైన పరిస్థితుల్లో తొట్లకు నీటిని నింపడం కష్టంగా మారింది. మామూలుగా అయితే గ్రామ పంచాయతీలు తొట్లను నీటితో నింపాల్సి ఉంది. కాలువలకు నీరు రాకపోవడం, చెరువులు, కుంటలు ఎండిపోవడం.. సమస్య తీవ్రం కావడంతో తొట్లను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రధానంగా జిల్లా పశ్చిమ ప్రాంతంలో నీటి తొట్లు ఉన్నా లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పడిపోయిన పాల ఉత్పత్తి ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 52 లక్షల జనాభా ఉంది. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు 250 ఎంఎల్ పాలు తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాకు 13 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక పశుగ్రాసం, నీటి కొరత ఏర్పడంతో పాల ఉత్పత్తి రోజురోజుకు పడిపోతోంది. సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రోజుకు 8.58 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం 7.2 లక్షల లీటర్ల వరకు మాత్రమే పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మాకు పది ఎకరాల పొలం ఉంది. అందులో ఏడు ఎకరాల్లో కంది, సజ్జ, మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. వరుసగా నెల రోజుల పాటు వర్షాలు లేకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మాకు రెండు ఎద్దులు, ఆరు బర్రెలు, మూడు దూడలు ఉన్నాయి. వీటికి మేత కోసం ట్రాక్టరు వేరుశనగ పొట్టు రూ.30 వేలకు కొనుగోలు చేశాం. ఇంటికి చేరేందుకు రూ.40 వేల వరకు ఖర్చు వస్తోంది. అది కూడా 45 రోజులకు సరిపోతుంది. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం చొరువ తీసుకొని రైతులకు పశుగ్రాసం సరఫరా చేయాలి. – ఎం.ప్రహ్లాదరెడ్డి, తుగ్గలికొన్నేళ్లుగా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, ఉల్లి, శనగ పంటలు ఎక్కువగా సాగవుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం పశుగ్రాసానికి పనికి వచ్చే వేరుశనగ, కొర్ర, జొన్న పంటలే ఎక్కువగా సాగు చేసేవారు. అప్పట్లో కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ పశుగ్రాసానికి ఇబ్బందిగా ఉండేది కాదు. ఇప్పుడు పండించే పంటలు పశుగ్రాసానికి పనికి రావు. కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 3.02 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి 2.17 లక్షల హెక్టార్లలో, మిగిలిన పంటలన్నీ 85 వేల హెక్టార్లలో ఉన్నాయి. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నాయి. రానున్న రోజుల్లో ఎల్నినో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో పశుపోషణ ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారంగా మారిన పశుపోషణ చెరువులు, కుంటల్లో కనిపించని నీరు దొరకని పశుగ్రాసం సంతల్లో పశువులను అమ్మేస్తున్న రైతులు -
వరిగడ్డికి పెరిగిన డిమాండ్
ఎల్నినో నేపథ్యంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో వరిగడ్డికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర, వెల్దుర్తి, క్రిష్ణగిరి, దేవనకొండ, ఆదోని, ఆస్పరి, కోడుమూరు, గూడూరు, సీ బెళగల్ తదితర మండలాల రైతులు వరిగడ్డిని సమకూర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. గత ఏడాది ట్రాక్టరు వరిగడ్డికి రూ.10 వేల వరకు ధర లభించింది. ఈ సారి రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు పెరిగిపోయాయి. ఎల్నినో ప్రభావంతో పశుపోషణ భారం కావడంతో రైతులు పశువులను సంతకు తరలిస్తున్నారు. ప్రతి గురువారం డోన్తో సంత జరుగుతుంది. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది డోన్ సంతకు 15 నుంచి 20 శాతం వరకు పశువులు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆదోని జిల్లా కథ ఇక కంచికేనా?
● జిల్లా హామీ లేదన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ఆదోని: పిడికిలి బిగించి ఎనిమిది నెలలుగా ‘ఆదోని జిల్లాగా ప్రకటించాలి’ అనే డిమాండ్తో కొనసాగుతున్న ఉద్యమానికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన తాజా వ్యాఖ్యలు ఊహించని మలుపు తిప్పాయి. అధికారంలోకి వస్తే ఆదోని జిల్లా కల నెరవేరుతుందనే ఆశతో ఎదురు చూసిన ఉద్యమకారులకు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. దాదాపు 256 రోజులుగా సాగుతున్న ఉద్యమాన్ని అవహేళన చేస్తున్నట్లు అనిపించింది. రెండు రోజుల పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్ను జిల్లా సాధన సమితి ప్రతినిధులు కలిసి మరోసారి తమ డిమాండ్ను వినిపించారు. జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశా రు. అయితే దీనిపై స్పందించిన లోకేష్ ‘‘నేను కాని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గానీ యువగళం పాదయాత్రలో ఎక్కడా ఆదోనిని జిల్లాగా చేస్తామని హామీ ఇవ్వలేదు..అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత ఆ అంశాన్ని పరిశీలిద్దాం’’ అని స్పష్టం చేశారు. ఈ ఒక్క వ్యాఖ్యతో జిల్లాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యమకారులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గత 256 రోజులుగా ఎండా,వానా తేడా లేకుండా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసన ర్యాలీలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదోని జిల్లా డిమాండ్ను సజీవంగా ఉంచిన ఉద్యమానికి ఈ వ్యాఖ్యలు పెద్ద ఎదురు దెబ్బగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో మద్దతు.. అధికారంలోకి వచ్చాక భిన్న స్వరం జిల్లా సాధన ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి అప్పటి టీడీపీ నాయకులు పలుమార్లు ఉద్యమ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించారు. ఉద్యమకారులతో కలిసి ధర్నాల్లో పాల్గొనడంతోపాటు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఇచ్చిన రాజకీయ మద్దతు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కనిపించడం లేదని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమం కొనసాగుతుందా.. ముగుస్తుందా? లోకేష్ వ్యాఖ్యల తర్వాత జిల్లా సాధన సమితి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలా? లేక ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరపాలా? అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు ఉద్యమకారులు. ఇదిలా ఉండగా.. ఆదోని జిల్లా కథ ఇక కంచికేనా? అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
బైకును ఢీకొన్న ఐచర్.. ఇద్దరి దుర్మరణం
తాడిపత్రి రూరల్: బైకును ఐచర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తాడిపత్రి అప్గ్రేడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. నంద్యాల జిల్లా కొలమిగుండ్ల మండలం బందార్లపల్లికి చెందిన అన్నదమ్ములు పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరి (35), సమీప బంధువు రాజేంద్ర (40)లు బండల గనిలో కూలీలుగా పనిచేసేవారు. కొన్ని రోజులుగా పెద్ద దస్తగిరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గనిలో పని చేసి ఇంటికి వచ్చిన అతనికి అకస్మాత్తుగా బీపీ పడిపోయింది. దీంతో చిన్న దస్తగిరి, రాజేంద్రలు కలిసి పెద్ద దస్తగిరిని బైకులో ఎక్కించుకుని వైద్యం కోసం తాడిపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో మండలంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద గల పెద్దమ్మ గుడి సమీపంలో రోడ్డు దెబ్బతినడంతో బైకును చిన్నగా పోనిస్తుండగా ఓ ఐచర్ వాహనం వేగంగా వచ్చి వీరిని ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన రాజేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చిన్న దస్తగిరి, పెద్ద దస్తగిరిని 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్న దస్తగిరి మృతి చెందాడు. రాజేంద్రకు భార్య అలివేలితో పాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. చిన్న దస్తగిరికి భార్య కవితతో పాటు 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. రాజేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐచర్ డ్రైవర్ రఘురాముడుపై కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి వెల్లడించారు. -
ప్రభుత్వ భూముల్లో ప్లాట్ల విక్రయం
శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటలోని జలవనరుల శాఖకు చెందిన సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులు ప్లాట్ల విక్రయానికి తెగబడుతున్నారు. అటవీశాఖ కార్యాలయం, ప్రభుత్వ ఐటీఐ కళాశాల వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు వేస్తున్నారు. ఇప్పటికే సున్నిపెంటలోని ప్రభుత్వ భూములు, గృహాల అన్యాక్రాంతంపై హైకోర్టు విచారణ జరుపుతున్నప్పటికీ, కూటమి ప్రభుత్వ నేతల అండతో ఏ భయం లేకుండా ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అమ్మకానికి పెట్టారు. సుమారు 40 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో సన్నకార రైతులు ఆకుకూరలు, కూరగాయలు పండించి వినియోగించుకుంటున్న భూమికి అద్దెలు చెల్లించేవారు. కాలక్రమేణా ఎటువంటి అధికారం లేకుండానే క్రయవిక్రయాలు జరిగాయి. యలమంచిలి రవి అనే వ్యక్తి ఆ ప్రాంతంలో గోశాలను నిర్వహించేవాడు. రవి, ఆయన సతీమణి మరణాంతరం ఈ స్థలాలు తమవంటు ఫేక్ డ్యాక్మెంట్లు సృష్టించుకొని శ్రీధర్, శివకుమార్ అనే వ్యక్తులు ప్లాట్ల విక్రయానికి తెరలేపారు. ఇంత జరుగుతున్నా జిల్లా పంచాయతీ, జలవనరుల, రెవెన్యూ శాఖ అధికారులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సేవలకు దూరమై.. లక్ష్యం ధ్వంసమై!
ప్రజలకు ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలందించాల్సిన గ్రామ సచివాలయం దుండగుల చేతిలో ధ్వంసమైంది. సి.బెళగల్ మండలం కొండాపురం గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రజల కోసం ఈ భవనాన్ని నిర్మించింది. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా పట్టించుకోలేదు. నిరుపయోగంగా ఉన్న ఈ భవన తలుపులను, అద్దాలను ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు. అదేవిధంగా కిటికీలను పెకళించి తీసుకెళ్లారు. ర్యాంప్ రోలింగ్ పైపును సైతం కొంతమేర అపహరించారు. ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. – సి.బెళగల్ -
రైతు ఆత్మహత్య
కొత్తపల్లి: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ రామ్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. కొత్తమాడుగుల గ్రామానికి చెందిన ఈడిగ బాలస్వామి గౌడ్(50)కు రెండు ఎకరాల పొలం ఉంది. మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. గత రెండేళ్లుగా పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయాడు. పంటల సాగుకోసం బాలస్వామి గౌడు ఇతరుల వద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు భారంతో మానసికంగా కుంగిపోయి తీవ్ర భయాందోళన చెందాడు. ఈ క్రమంలో ఈనెల నెల 28వ తేదీన తాను కౌలుకు తీసుకున్న పొలం వద్దకు వెళ్లి గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబీకులు బాలస్వామి గౌడ్ను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కర్నూలుకు రెఫర్ చేశారు. అక్కడ ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతిచెందాడు. మృతుడి కొడుకు విక్రమ్ కుమార్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. దైవదర్శనానికి వెళ్తూ ..సి.బెళగల్: దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సి.బెళగల్ చెందిన రాజు నూతన బొలెరో ట్యాలీ ఆటో కొనుగోలు చేసి బుధవారం మిత్రులు, పరిచయస్తులతో కలిసి మొక్కు చెల్లించుకునేందుకు శ్రీశైలానికి వెళ్లారు. అయితే దోర్నాల మండలం మెట్లమల్లికార్జునపురం గ్రామం దగ్గర ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు, సి.బెళగల్ వాసులు ప్రయాణిస్తున్న బొలెరో ట్యాలీ ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో తెలుగు గోవిందు (48) అక్కడికికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించి వైద్యం చేయించారు. తెలుగు గోవిందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి గురువారం సి.బెళగల్కు తీసుకవచ్చారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
దాతల విరాళం.. దేవస్థానం నిర్లక్ష్యం!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం పలువురు దాతలు ఆరు బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేశారు. ప్రస్తుతం వాటిలో ఒక్కటి మాత్రమే పనిచేస్తుంది. మిగతా వాహనాలు మరమ్మతులకు గురై వర్క్షాప్కు చేరాయి. దీంతో క్షేత్రానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. దాతలు విరాళంగా అందించిన బ్యాటరీ వాహనాలను నడపకుండా దేవస్థానం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుడటంపై పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల కరుణా కటాక్షాల కోసం అనునిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. పర్వదినాల్లో, ముఖ్యమైన రోజుల్లో ఈ రద్దీ మరింత అధికంగా ఉంటుంది. అయితే క్షేత్ర భద్రతా చర్యల్లో భాగంగా భక్తులు బస చేసిన వసతి గదుల నుంచి తమ వాహనాల్లో కొంత దూరం వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. ఈ క్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులను క్యూలైన్ల వద్దకు చేర్చేందుకు ఇబ్బందులు లేకుండా దేవస్థానం ఉచిత బ్యాటరీ వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. గత దేవస్థాన పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కనకదుర్గ–1, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–1, యూనియన్ బ్యాంక్–2, తాడేపల్లికి చెందిన దాత–1, మరో దాత–1 ఇలా ఆరు బ్యాటరీ వాహనాలు దేవస్థానానికి సమకూరాయి. నంది సర్కిల్, గంగాధర మండపం, ఉచిత క్యూలైన్, శీఘ్ర, అతిశీఘ్ర క్యూలైన్, ఆర్జిత సేవల క్యూలైన్, అన్నదాన భవనం, లడ్డూ కౌంటర్, దర్శనం అనంతరం నంది సర్కిల్ వరకు ఆరు బ్యాటరీ వాహనాలతో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేవ కొనసాగుతుంది. వాహన డ్రైవర్లు భక్తులకు ఉచిత ప్రయాణ సేవ గురించి అవగాహన కల్పిస్తూ వారు వెళ్లాల్సిన ప్రాంతాలకు వాహనంలో చేర్చేవారు. మూలనపడిన బ్యాటరీ వాహనాలు శ్రీశైల దేవస్థానంలో ఆరు బ్యాటరీ వాహనాలు ఉండగా ప్రస్తుతం ఒక్క వాహనం మాత్రమే నడుస్తోంది. మిగతా ఐదు వాహనాలు వర్క్షాప్లో మూలనపడ్డాయి. దేవస్థాన అధికారుల నిర్లక్ష్యంతో బ్యాటరీ వాహనాలు మరమ్మతులకు గురై వర్క్షాప్కు చేరినట్లు తెలుస్తోంది. భక్తులకు ఎంతగానో ఉపయోగపడే బ్యాటరీ వాహనాలు దేవస్థాన అధికారుల నిర్లక్ష్యం వల్లనే పనిచేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా దేవస్థాన అధికారులు స్పందించి వెంటనే బ్యాటరీ వాహనాలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తేవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. శ్రీశైల దేవస్థానానికి ఉచితంగా బ్యాటరీ వాహనాలు అందించిన దాతలు అధికారుల నిర్లక్ష్యంతో పనిచేయని బ్యాటరీ వాహనాలు ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, దివ్యాంగ భక్తులు -
మహానందిలో వరుణయాగం
● నేడు సహస్ర ఘటాభిషేకంమహానంది: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని కాంక్షిస్తూ మహానంది క్షేత్రంలో గురువారం వరుణయాగం పూజలు నిర్వహించారు. వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, అర్చకులు, రుత్వికుల బృందం పూజలు చేశారు. ముందుగా గణపతిపూజతో ప్రారంభించి త్రయాహ్నిక వరుణయాగం పూజలు జరిపారు. ఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి వర్షాలు కురవాలని కాంక్షిస్తూ పూజలు జరిపామన్నారు. ఆగస్టు 1వ తేదీ వరకు వరుణయాగం, సహస్ర ఘటాభిషేకం పూజలను వేదమంత్రాలతో వరుణదేవుని ఆరాధన చేసి వర్షాలు కరువాలని, భూమికి జలసంపద, పాడిపంటలకు రక్షణ, ప్రజలకు శ్రేయస్సు కలగాలని శాస్త్రోక్తంగా పూజలు చేస్తామని వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని వివరించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలకంఠ్వేర రాజు, పి. సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సరుకుల వివరాలు రాస్తే ఒట్టు
ఆలూరు: రేషన్ షాపులకు పంపిణీ చేసే నిత్యావసర సరుకులు వివరాలు నోటీస్ బోర్డులో ఉండాలి. అయితే ఆలూరు పట్టణంలోని ఎల్లార్తి రోడ్డు సమీపంలో ఉన్న సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్లో ఇవి కనిపించడం లేదు. వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని గతంలో గోదాం డిప్యూటీ తహసీల్దార్ను పత్తికొండ ఆర్డీఓ చిన్న ఓబులేసు ఆదేశించారు. నెలరోజులు గడిచినా ఎలాంటి మార్పు రాలేదు. కరువు జిల్లాగా ప్రకటించాలి కర్నూలు(సెంట్రల్): ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు పడకపోవడంతో రైతులు వేసిన పంటలన్నీ ఎండిపోయాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు నాలుగు బృందాలు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్నట్లు చెప్పారు. ఆయా కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలవుతున్నా సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి, వేరుశనగ, కంది, జొన్న, సజ్జ తదితర పంటలన్నీ నష్టపోయినట్లు చెప్పారు. -
కదం తొక్కిన కార్మికులు
నంద్యాల(న్యూటౌన్): వివిధ రంగాల్లో పని చేస్తున్న షెడ్యూల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆయా రంగాల్లో ఉత్పత్తిని స్తంభింపజేస్తామని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్పష్టం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ పట్టణంలోని కోవెలకుంట్ల –నూనెపల్లి జంక్షన్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నాకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కార్మిక వర్గం లేకుండా ప్రభుత్వాలు నడవలేవన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. బజారు హమాలీలు, వేర్హౌస్లు, షాపింగ్ మాల్లు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయితీలు, గనుల్లో పనిచేసే కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వడం లేదన్నారు. జీతాలు పెంచమంటే జీవోలు ఉన్నాయా అని అడుగుతున్నారని, కానీ ఎమ్మెల్యేలకు మాత్రం లక్షల వేతనాలు పెంచడం న్యాయమేనా అని ప్రశ్నించారు. కనీస వేతనం ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఓ రామునాయక్కు అందజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, బాల వెంకట్, వెంకట్ లింగం, రామ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు కే మహమ్మద్ గౌస్, శివరాం జిల్లా నాయకులు రణధీర్, రత్నమయ్య, మారెన్న, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు బాలదుర్గ,భాస్కరాచారి రంగనాథ్, గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, వీఆర్ఏ సంఘం జిల్లా నాయకుడు శివరామకృష్ణ పాల్గొన్నారు. -
తుంగభద్ర వెలవెల.. కృష్ణమ్మ గలగల!
కర్నూలు సిటీ: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా సబ్ బేసిన్లోని తుంగభద్ర నది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ, భీమ, మలప్రభ, ఘట్టప్రభ నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఈ నీటి సంవత్సరం ఆలస్యంగానైన ఆల్మట్టి డ్యాం గేట్లు ఐదు రోజుల క్రితం తెరచుకున్నాయి. ఆ డ్యాం నుంచి ఉదయం 8 గంటల సమయంలో 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఆ నీటినంతా దిగువన ఉన్న నారాయణ పూర్డ్యాంకు వదిలారు. అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటున్నాయి. జూరాల నుంచి వదిలిన నీరు సప్తనదుల సంగమానికి, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్తోంది. కృష్ణా నది కంటే ముందుగానే తుంగభద్ర నదిలో వరద నీటి ప్రవాహాలు కనిపించినా..ఆశించిన స్థాయిలో కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ భాగంలో వర్షాలు కురువలేదు. దీంతో ఒక రోజు ఉన్న నీటి ప్రవాహం ఆ మరుసటి రోజుకు ఉండటం లేదు. ప్రస్తుతం కేవలం తాగు నీటికి మాత్రమే తుంగభద్ర జలాలను విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో పెరుగుతున్న నీటి మట్టం! శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 215.8 టీఎంసీలు. ఈ నెల 28వ తేదీ 1.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సుంకేసుల బ్యారేజీ నుంచి 2.06 టీఎంసీల నీరు చేరింది. గురువారం మధ్యాహ్నానికి 825.20 అడుగుల మట్టంతో 46.82 టీఎంసీల సామర్థ్యానికి నీటి నిల్వలు చేరాయి. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి నారాయణపూర్ డ్యాంకు 1,10,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. నారాయణపూర్ నుంచి 1,11,064 క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతుండగా 12 గేట్లు పైకెత్తి 47,112, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 37,997 క్యూసెక్కుల నీటిని మొత్తం 85,109 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. ఉదయం 67 వేల క్యూసెక్కుల నీరు మధ్యాహ్నానికి 85 వేల క్యూసెక్కులకు చేరింది. నీటి విడుదల మరింత పెరగనుంది. సీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం మరో మూడు నాలుగు రోజుల పాటు మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో వర్షాలు భారీగానే కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే తుంగభద్ర డ్యాం ఇన్ఫ్లో అంచనాకు అందడం లేదని తెలుస్తోంది. -
ఆలయాలు, గ్రంథాలయాలనూ వదల్లేదు!
కర్నూలు(అగ్రికల్చర్): అంతా వారిష్టం.. మార్గదర్శకాలు పట్టించుకోరు.. వివిధ రూపాల్లో నిధులు దుర్వినియోగం చేస్తారు. టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కు కావడంతో ఈ బాగోతం సాగుతోంది. స్టేట్ ఆడిట్(లోకల్ ఫండ్) అధికారుల తనఖీల్లో వారి అక్రమాలు బహిర్గతం అయ్యాయి. స్థానిక సంస్థలు, దేవాలయాలు, గంథ్రాలయాలు, యూనివర్సిటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు తదితర వాటికి వచ్చిన నిధులు, వాటి వినియోగంపై స్టేట్ అడిట్ అధికారులు ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తారు. ప్రస్తుతం 2025–26 ఆర్థిక సంవత్సరం లావాదేవీలు, ఖర్చులపై ఆడిట్ జరుగుతోంది. అక్రమాలు ఇవీ.. చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరం నిర్వహించిన ఆడిట్లో నిధుల వినియోగానికి సంబంధించి 18,799 అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం రూ.38.13 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించి రూ.77.30 కోట్లు దుర్వినియోగం అయినట్లు స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించి 2,413 ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్లో ఉండిపోయాయి. నిబంధనలు ఉల్లంఘించి రూ. 23.34 కోట్లు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. అలాగే రూ.21.21 కోట్ల నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను చూపలేదు. ఇదిలా ఉండగా ఎంపీ నిధులకు సంబంధించి రూ.181 కోట్లు, రాయలసీమ యూనివర్సిటీ నిధుల్లో రూ.51.15 కోట్లు దుర్వినియోగం అయినట్లు వెల్లడైంది. దేవాలయాల్లో ఏకంగా రూ.799 కోట్లు ఆడ్డుగోలుగా వినియోగించినట్లు సమాచారం. చర్యలు శూన్యం నిధుల వినియోగానికి సంబంధించి అనేక లొసుగులు వెల్లడైనప్పటికీ, రూ.కోట్లు దుర్వినియోగం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వేలాది ఆడిట్ అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. నిధుల వినియోగానికి సంబంధించి ఆడిట్కు ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత చూపుతోంది. ఆడిట్ అభ్యంతరాలు, సర్చార్జ్ సర్టిఫికెట్లకు విలువ లేకుండా పోయింది. ఆడిట్ అభ్యంతరాలు గుట్టల కొలది పేరుకపోయి ఉన్నప్పటికీ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు, యూనివర్సిటీలకు, గంథ్రాలయాలకు నిధుల విడుదల ఆగడం లేదు. దీంతో అక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ నిధుల దుర్వినియోగం రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో రూ.368.28 కోట్ల దుర్వినియోగం అయినట్లు ఆడిట్ అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి 25,827 అభ్యంతరాలు పెండింగ్లో ఉండిపోయాయి. 2014–15 సంవత్సరానికి సంబంధించే రూ.45.03 కోట్ల నిధుల దుర్వినియోగానికి 7,352 ఆడిట్ అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే 2018–19లో రూ.98.15 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆడిట్ అధికారులు తేల్చారు. ఇందుకు సంబందించి 2,463 అభ్యంతరాలు పెండింగ్లో ఉండిపోయాయి. అధికారులు, టీడీపీ నేతలు కుమ్మకై ్క నిధులు కొల్లగొట్టినట్లు ఆడిట్లో అక్రమాలు వెలుగు చూశాయి. సాధారణంగా ప్రతి ఏటా ఆడిట్ పూర్తి చేసిన తర్వాత సేట్ ఆడిట్ జిల్లా అధికారులు నివేదికను స్టేట్ ఆడిట్ డైరెక్టర్కు పంపుతారు. అక్కడి నుంచి ఆడిట్ అభ్యంతరాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన నివేదిక ఆయా శాఖల హెచ్వోడీలకు వెళ్తుంది. అక్కడి నుంచి చర్యలు మొదలు కావాలి. కాని ఆడిట్ నివేదికలు హెచ్ఓడీల దగ్గర మరుగున పడిపోతున్నాయి. వివిధ పనుల్లో అడ్డుగోలుగా నిధులు స్వాహా స్టేట్ ఆడిట్ నివేదికలో అక్రమాల నిర్ధారణ నాటి టీడీపీ పాలనలో రూ.368 కోట్ల దుర్వినియోగం 2024–25లో 18,799 అభ్యంతరాలు ఈ ఏడాది ఇంకా ఎన్నెన్నో! -
శ్రీవ్యాసతీర్థ రిజర్వాయర్కు భూమి పూజ
● రూ. 50 కోట్లతో నిర్మాణం ● శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు చేతుల మీదుగా శంకుస్థాపన మంత్రాలయం: ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా మంత్రాలయంలో గోశాల ఎదురుగా ఉన్న 25 ఎకరాల శ్రీమఠం భూమిలో గురువారం ఇంపౌండింగ్ రిజర్వాయర్కు భూమి పూజచేశారు. శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులు చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం శ్రీవ్యాసతీర్థ రిజర్వాయర్గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణానికి బెంగళూరుకు చెందిన హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఎఎల్ ) ముందుకు వచ్చిందన్నారు. వచ్చే 30 సంవత్సరాల్లో పెరిగే జనాభాకు అనుగుణంగా తాగునీటి సరిపోయే విధంగా అంచనా రూపొందించారన్నారు. శ్రీగురు రాఘవేంద్రస్వామి భక్తుల కోసం ఈ కీలక ప్రాజెక్టుకు హెచ్ఎఎల్ సహకారం అందించడం సంతోషం అన్నారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తయారు చేసే సంస్థ రూ. 50 కోట్లు భరిస్తోందన్నారు. తుంగభద్ర నది కాలుష్యం కాకుండా భక్తులు చూడాలన్నారు. మురుగు నీరును ఫీల్డర్ చేసి తాగునీటిని చేస్తున్న తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల సమక్షంలో శ్రీమఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసులు, హెచ్ఎఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కె.రవి తో అధికారులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)కలసి ఒప్పంద పత్రాలు సంతకాలు చేశారు. 18 నెలల్లో పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం 20.67 ఎంసీఎఫ్టీలు (మిలియన్ క్యూబిక్ ఫీట్లు). రిజర్వాయర్ 35 అడుగుల తోతు ఉంటుంది. ఒక కిలోమీటరు దూరంలో ఉండే తుంగభద్ర నది నుంచి అత్యాధునిక టెక్నాలజీతో స్టీల్ పైపులైన్ వేయనున్నారు. రిజర్వాయర్కు అవసరమైన నీటిని తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోస్తారు. వరదనీరు వచ్చినప్పుడు, నదిలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు రిజర్వాయర్కు తరలిస్తారు. ఎండాకాలంలో భక్తులకు, గ్రామప్రజలకు ఈ నీటిని సరఫరా చేస్తారు. ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేయడానికి కృషి చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నాణ్యత ప్రామాణాలతో రిజర్వాయర్ పనులు చేస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీమఠం ఏఏఓ మాధవశెట్టి, శ్రీమఠం మేనేజర్–2 వెంకటేష్జోషి, ధార్మిక అధికారి శ్రీపతి, ఇంజినీర్ సురేష్కోనాపూర్, హాల్ సంస్థ హెచ్ఆర్ సభ్యులు బాలసుబ్రమణ్యం, డాక్టర్ గుప్త, మంజునాథ్, రమేష్, సోమన్చౌదరి, డిజైనింగ్ అధికారి రంగనాథ్, హాల్ సంస్థ అధికారులు, శ్రీమఠం అధికారులు పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతంగా.. మంత్రాలయంలో గోశాల ఎదురుగా 40 ఎకరాల శ్రీమఠం భూమి ఉంది. అందులో 25 ఎకరాల్లో మాత్రమే రిజర్వాయర్ నిర్మించనున్నారు. రిజర్వాయర్ పక్కన స్థలంలో అత్యాధునిక టెక్నాలజీతో పార్కు ఏర్పాటు చేయనున్నారు.ఈ స్థలాన్ని పర్యాటక ప్రాంతంగా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దనున్నారు. -
టీ66ఎఫ్ పెద్దపులికి పోస్ట్మార్టం
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ఇందిరేశ్వరం బీట్లో బుధవారం కనిపించిన పులి కళేబరానికి గురువారం పోస్ట్మార్టం నిర్వహించారు. డీకంపోజ్ దశలో ఉన్న కళేబరానికి చనిపోయిన చోటే శవపరీక్షలు నిర్వహించి దహనం చేశారు. పులి శరీరంపై గాయాలుండడంతో టెరిటోరియల్ ఫైట్ (వాసం కోసం పోరాటం)లో డామినేటెడ్ మేల్ టైగర్ చేత గాయపడి మరణించి ఉండవచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. పులి 9 సంవత్సరాల వయసు కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆత్మకూరు డీడీ విగ్నేష్ అపావ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, ఎన్టీసీఏ గైడ్ లైన్స్ పరిధిలో పూర్తి చేశామన్నారు. రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య ఆదోని సెంట్రల్: ప్రేమించిన అమ్మాయిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి రైలు కింద పడి శివరాజ్(20) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామ య్య తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన పాండవగల్లు ఎల్లప్ప అనారోగ్యంతో ఏడాది క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి అతని కుమారుడు శివరాజ్ తాగుడుకు అలవాటు పడ్డాడు. తన అక్క కూతురిని ప్రేమించానని, పెళ్లి చేయాలని పట్టుబట్టాడు. మద్యానికి బానిసైన శివరాజ్కు అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టం లేక వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. దీంతో మనస్తాపం చెందిన శివరాజ్ బుధవారం రాత్రి ఇస్వి–కుప్పగల్ ఆర్ఎస్ల మధ్యన రైలు కింద పడి మృతిచెందాడు. గూడ్స్ రైలు లోకో పైలెట్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుని తల్లి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. లారీ ఢీకొని యువకుడి మృతి బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణ సమీపంలో అవుకు రోడ్డులో జీఎంఆర్ వేర్ హౌస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కొండ పేటకు చెందిన చాకలి బాలసుబ్బన్న, జయ మ్మ దంపతుల కుమారుడు సుధాకర్ (28) గురువారం ఇంటి నుంచి గేదెలను మేపుకునేందుకు అవుకు రోడ్డు వైపు ఉన్న పొలాల వైపు బయల్దేరాడు. జీఎంఆర్ వేర్హౌస్ వద్ద వెయింగ్ వేబ్రిడ్జి వద్ద ఉన్న లారీని డ్రైవర్ రివర్స్ చేస్తుండగా అక్కడే ఉన్న సుధాకర్ను ఢీకొంది. లారీ టైరు అతనిపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బనగానపల్లె పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. చేతికి వచ్చిన కుమారుడు మృత్యువాత పడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బనగానపల్లె టౌన్ ఇన్చార్జ్ సీఐ మంజునాథ్రెడ్డి తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య డోన్ టౌన్: స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ రసూల్ (59) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ఎస్ఐ బింధు మాధవి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన రసూల్ డోన్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నారు. కాగా అనారోగ్యం కారణంతో ఈ నెల 27వ తేదీ నుంచి సెలవులో ఉన్నాడు. గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే డిప్యూటీ స్టేషన్ మాస్టర్ లాబాన్ విషయం తెలుసుకుని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతునికి భార్య రేష్మాకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్యతో పాటు తో ఒక కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ బింధు మాధవి తెలిపారు. కల్వర్టు గుంత చుట్టూ మట్టి కుప్ప! కల్లూరు: కర్నూలు నగరంలోని కృష్ణానగర్ రవీంద్ర స్కూల్ లైన్లో డ్రైనేజీ కాలువపై ఏర్పాటు చేసిన కల్వర్టు దెబ్బతిని గుంత ఏర్పడింది. గుంత చుట్టూ రక్షణగా మట్టి కుప్పను వేసి కానుగ ఆకులను ఉంచారు. ఈ రోడ్డుపై ద్విచక్ర, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. రాత్రి సమయంలో కల్వర్టుకు రక్షణగా ఏర్పాటు చేసిన మట్టి కుప్ప సరిగా కనిపించకపోతే వాహనాలు డ్రైనేజీ కాలువపై ఉన్న కల్వర్టు గుంతలో పడితే గాయాలకు గురికావాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ముగ్గురు పిల్లల్లో ఒక్కరికీ దక్కని తల్లికి వందనం
● ఆటో డ్రైవర్కు ఐటీ రిటర్న్స్ చూపుతూ రిజెక్ట్కర్నూలు(సెంట్రల్): నగరంలోని పాతబస్తీలో నివాసం ఉంటున్న జావీద్బాషా ప్యాసింజర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు పిల్లలు సంతానం. అయితే ఒక్కరికీ తల్లికి వందనం వర్తించకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనవుతున్నాడు. వృత్తిరీత్యా ఆటోకు సంబంధించిన ఈఎంఐలు, ఇంటి అద్దె, పొదుపు లోన్లను అతికష్టం మీద చెల్లిస్తున్నాడు. అయితే అతను ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారనే కారణంతో ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడికి తల్లికి వందనం వేయలేదు. గతేడాది కూడా ఇదే కారణంతో తల్లికి వందనాన్ని తిరస్కరించారు. అయితే అప్పట్లో తనకు ఎలాంటి ఐటీ రిటర్న్స్ లేవని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా తల్లికి వందనాన్ని ప్రభుత్వం ఎగ్గొట్టింది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పన్ను చెల్లింపుదారుడని నమోదు చేయడంతో తన కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదని జావీద్బాషా వాపోతున్నాడు. -
నిబంధనల పేరుతో అన్నదాతలకు మోసం
● ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి ● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపత్తికొండ: భూములు తీసుకుని అగ్రిమెంట్ చేసుకునే సమయంలో రైతులకు నిబంధనలు వివరించకుండా మోసం చేశారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. మోసపోయిన అన్నదాతలకు చంద్రబాబు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ కంపెనీ చేతిలో మోసపోయిన వైనంపై హోసూరు, పెద్దహుల్తి గ్రామాల రైతులు బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హోసూరు, పెద్దహుల్తి గ్రామాల్లో దాదాపు 700 మంది రైతుల నుంచి 1800 ఎకరాలు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం లీజుకు తీసుకుందన్నారు. అయితే లీజుకు సంబంధించిన విషయంపై రైతులతో అగ్రిమెంట్ చేసుకునే సమయంలో నిబంధనలను గోప్యతగా ఉంచి మోసం చేశారన్నారు. భూమిని 29 ఏళ్ల 11 నెలలు పాటు లీజ్కు తీసుకొని రైతులకు నగదు చెల్లింపు విషయంలో ఒక్కో రైతుకు ఒక రకంగా అడ్వాన్స్ చెల్లించారని తెలిపారు. కొంత మందికి రెండేళ్లకు నగదు చెల్లిస్తే మరికొందరికి పదేళ్ల లీజు మొత్తం చెల్లించి మోసం చేశారని మండిపడ్డారు. రైతులు ఇచ్చిన భూములను కంపెనీ అవసరాల కోసం కాకుండా వాటిని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్నట్లు తెలపడం దారుణమన్నారు. ఇలాగైతే భవిష్యత్లో భూములపై హక్కులు కోల్పోతామని రైతులు అందోళన చెందుతున్నారన్నారు. గురువా రం హోసూరు గ్రామ పర్యటనకు వస్తున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రైతులకు న్యాయం చే యాలని కోరారు. లేనిపక్షంలో రైతుల పక్షాన నిలిచి అందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల నాయకు లు శ్రీరంగడు, బాబుల్రెడ్డి, నారాయణ్దాస్, భా స్కర్నాయక్, బనగాని శ్రీనువాసులు, నరసింహాచారి, నాగరాజు, జిట్టా నాగేష్, కేశవరెడ్డి, శ్రీరాములు, నాగరాజు, కృష్ణారెడ్డి, రంగనాయక్, నాగిరెడ్డి, వాసుదేవనాయుడు, రవిరెడ్డి పాల్గొన్నారు.


