breaking news
Kurnool
-
దేవదాయ శాఖ డీఈఈగా శ్రీనివాసులు
కర్నూలు కల్చరల్: దేవదాయ శాఖ కర్నూలు సబ్ డివిజన్ డీఈఈగా సీహెచ్ శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎం.శ్రీనివాస ప్రసాద్ సోమవారం పదవీ విరమణ పొందారు. దీంతో గుంటూరు సబ్ డివిజన్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీనివాసులుకు కర్నూలు డీఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి నుంచి జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 13వ తేదీలోపు https:// nationalawardstoteachers. gov. in/ Login. aspx అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ పేర్కొన్నారు. కనీస వేతనం ఇవ్వాలి కర్నూలు(సెంట్రల్): పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, నైట్ వాచ్మన్కుల కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జే.నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఐదు నెలల నుంచి పెండింగ్లో ఉన్న జీతాలను ఇవ్వాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆయాల పేరుతో ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంలో ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేలు జమ చేసుకుందని, ఆ నిధులతో వారికి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయాలకు గ్రూపు ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. ఆయాలు బజారమ్మ, సుశీలమ్మ, లక్ష్మీదేవి పాల్గొన్నారు. కేఎంసీలో పాథాలజీ రాష్ట్రస్థాయి సదస్సు కర్నూలు(హాస్పిటల్): ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజీ అండ్ మైక్రోబయాలజీ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజీలో త్వరలో 7వ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆమె పాథాలజీ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ వైద్యులు పాల్గొంటారన్నారు. ఆమె వెంట డాక్టర్ హేమలత, డాక్టర్లు రేవతి, సునీత, షహనాజ్, విష్ణు పాల్గొన్నారు. వజ్రం లభ్యం మద్దికెర: మండల పరిధిలోని బసినేపల్లి గ్రామ సమీపంలోని పొలంలో వ్యవసాయ కూలీకి సోమవారం వజ్రం లభ్యమైంది. ఓ వ్యాపారి రూ.2 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆర్టీసీలో పదోన్నతులు కల్పించాలి కర్నూలు సిటీ: ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, దీర్ఘకాలికంగా పెంగింగ్లో ఉన్న పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఏపీ జిల్లా ప్రజా రవాణా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగస్వామి, ఏవీ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 4,5 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేయనున్నట్లు ప్రకటించారు. -
టీబీ డ్యాంకు తగ్గిన ఇన్ఫ్లో
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి ఉన్నట్టుండి ఇన్ప్లో తగ్గిపోవడంతో క్రస్టుగేట్ల ఎత్తివేత మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం డ్యాంకు 65వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. సోమవారం దాదాపు 40 వేల క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు డ్యాంపై నిర్మించిన శివమొగ్గలోని అప్పర్ తుంగా ప్రాజెక్టు(గాజనూరు జలాశయం) నుంచి దిగువకు నీటి నిడుదలను నిలిపివేశారు. దీంతో టీబీ డ్యాంకు వచ్చే వరద సగానికి తగ్గింది. ప్రస్తుతం డ్యాంలో 74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే 80 టీఎంసీలకు చేరితే క్రస్టు గేట్లు ఎత్తి నీటిని నదికి వదులుతారు. ఈ లెక్కాన గేట్లు ఎత్తడానికి మరో రెండు, మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ఇదిలాఉంటే ఈ నెల 10న తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు నీటిని విడుదల చేయనుండడంతో రైతులు వరిసాగుకు సిద్ధమయ్యారు. -
అమ్మానాన్న కోసం..
● ముంబై నుంచి ఆదోనికి వచ్చిన యువకుడుఆదోని సెంట్రల్: ఎప్పుడో నాలుగేళ్ల వయస్సులో తప్పిన పోయి.. ఇప్పుడు 32 ఏళ్ల వయస్సుల్లో అమ్మానాన్నలను చూసేందుకు ముంబై నుంచి ఒక యువకుడు ఆదోనికి వచ్చాడు. సోమవారం సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ను కలిసి తన తల్లిదండ్రుల వివరాలు చెప్పి, వారి దగ్గరికి తనను చేర్చాలని కోరారు. వివరాలు.. ఆదోనికి చెందిన వీరేష్ నాలుగేళ్ల వయస్సులో ఆడుకుంటూ ఆదోని రైల్వేస్టేషన్ చేరుకుని అక్కడ రైలులో కూర్చొని తమిళనాడు చేరుకున్నాడు. అక్కడ రెండేళ్లు అనాథ బాలల కేంద్రంలో ఉన్నాడు. అక్కడి నుంచి ముంబై చేరుకుని వెయిటర్గా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. 32 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత తన గ్రామం ఆదోని అని తెలసుకుని తల్లిదండ్రులను చూసేందుకు ఆదోనికి చేరుకున్నాడు. ఆదోని పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ప్రాంతంలో ఉన్నట్లు, తన తండ్రి జనార్దన్, తన అమ్మమ్మ అంజనమ్మగా చెబుతున్నాడు. వీరేష్కు తెలుగు రాదు మరాఠీలో మాత్రమే మాట్లాడుతున్నాడు. ఆదోనికి వచ్చిన యువకుడికి తల్లిదండ్రులను చూపించాలని పురపాలక సిబ్బందిని సబ్కలెక్టర్ ఆదేశించారు. -
వక్ఫ్ బచావో.. దస్తూర్ బచావో
వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ సోమవారం కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు ముస్లింలు వేలాదిగా తరలివచ్చారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముస్లింలకు చంద్రబాబు మోసం చేశారన్నారు. టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీని, జనసేన పార్టీలను ఘోరంగా ఓడించాలన్నారు. – కర్నూలు టౌన్ -
హామీ నిలబెట్టుకోవాలి
చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటిపోయింది. మాది నిరుపేద కుటుంబం. మూడు ఎకరాల భూమి ఉన్నా పంటలు పండటం లేదు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పొషించుకుంటున్నాం. ఇప్పుడు నా వయస్సు 58 ఏళ్లు. బీసీ సామాజిక వర్గం. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేరకు నాకు వృద్ధాప్య పింఛనుకు అర్హత ఉంది. ఈ ప్రభుత్వం నాలాంటి వాళ్లను ఆదుకోవాలి. – నామాల దేవేంద్ర, రామాపురం,. తుగ్గలి మండలం -
విద్యార్థుల ఆకలి కేకలు
ఎమ్మిగనూరుటౌన్: మధ్యాహ్న భోజనం అందక పోవడంతో విద్యార్థులు ఆకలితో కేకలు వేశారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సోమవారం ఖాళీ ప్లేట్లతో ఆందోళన నిర్వహించారు. నిబంధనల మేరకు మధ్నాహ్నం 12.40గంటలకు మధ్యాహ్న భోజనం వడ్డించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 2 గంటలైనా స్పందించకపోవడంతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. పాఠశాలకు, కళాశాలకు ఒకే వంట ఏజెన్సీ ఉండటంతో ఆకలితో అలమటించే పరిస్థితి వస్తోందని విద్యార్థులు వాపోయారు. సకాలంలో మధ్యాహ్న భోజనం వడ్డించాలని కోరారు. విద్యార్థి సంఘ నాయకులు నాగరాజు, వీరాస్వామి, రాజు, రంగన్న, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఖాళీ ప్లేట్లతో ఆందోళన -
పదవీ విరమణ సమస్యలుంటే నేరుగా కలవండి
కర్నూలు: పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు ఉంటే నేరుగా తనను కలవచ్చని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన తొమ్మిది మంది సిబ్బంది సోమవారం పదవీ విరమణ పొందారు. జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి, పత్తికొండ ఎస్ఐ ఎస్టీ జమీర్, ఆదోని పీసీఆర్ ఎస్ఐ బి.శ్రీరాములు, కర్నూలు డీటీసీ ఎస్ఐ సి.వెంకటరమణ, ఏఆర్ఎస్ఐలు బి.శ్రీనివాసులు, ఎం.బందే నవాజ్, కర్నూలు పీసీఆర్ ఏఎస్ఐ పీఆర్ సులోచన రాణి, ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు వి.గోవిందరాజులు, డి.హుసేనయ్య తదితరులను పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఇకపై కుటుంబాలతో శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని, పదవీ విరమణ సమస్యలేవైనా ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు. సత్కారం అనంతరం వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ భాస్కర్ రావు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు కేశవరెడ్డి, తేజమూర్తి, ఆర్ఐలు జావెద్, నారాయణ, సోమశేఖర్ నాయక్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అభ్యంతరాలు.. ఆందోళనలు
కర్నూలు(హాస్పిటల్): అభ్యంతరాలు, ఆందోళనల మధ్య గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–3 ఏఎన్ఎంలకు సోమవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ ఆడిటోరియంలో ఉదయం 7.30 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 750 మందికి పైగా ఏఎన్ఎంలకు బదిలీ కౌన్సిలింగ్ చేయాల్సి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.శాంతికళ, ఏవో అరుణ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు వచ్చాయి. కౌన్సెలింగ్ నిర్వహించకుండానే కొందరు ఏఎన్ఎంలకు ఉద్యోగాలు ఎలా కట్టబెడతారని పలువురు ఆందోళన చేశారు. వందకు పైగా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు రావడం, అందులోనూ కొన్ని సచివాలయాలకు ఎక్కువ మందికి లేఖలు ఇవ్వడంతో అధికారులు అయోమయానికి గురయ్యారు. ఈ లేఖలతో పలు సంఘాల లేఖలను సైతం పక్కన బెట్టి ర్యాంకు ఆధారంగా సాయంత్రం 200 మందికి మాత్రమే కౌన్సెలింగ్ చేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగించి, మిగిలిన వారికి మంగళవారం కూడా కౌన్సెలింగ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో కొందరు ఏఎన్ఎంలు ఇతర పీహెచ్సీలకు గాకుండా పక్క పీహెచ్సీలోని సచివాలయాలకు బదిలీ చేయాలని నినాదాలు చేశారు. దీంతో అధికారులు భోజన విరామాన్ని ప్రకటించి ఉన్నతాధికారుల వివరణ తీసుకుని పక్క పీహెచ్సీలకు సచివాలయ ఉద్యోగులను బదిలీ చేసేందుకు అంగీకరించారు. గందరగోళంగా ఏఎన్ఎంల బదిలీల ప్రక్రియ -
మద్యం మత్తులో శాశ్వత నిద్రలోకి..
చంద్రగిరి: మద్యం మత్తు ఇద్దరు అన్నదమ్ములను బలితీసుకుంది. మద్యం సేవించి కారులో నిద్రపోయిన వారిద్దరూ.. చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులోని రంగనాథ రోడ్డులో జరిగింది. పోలీసులు కథనం మేరకు.. తిరుపతి జిల్లా బుచి్చనాయుడుకండ్రిగ, గోవిందప్ప కండ్రిగలకు చెందిన దిలీప్(25), వినాయక అలియాస్ వినయ్(20) వరుసకు అన్నదమ్ములు.గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న దిలీప్ తిరుచానూరులోని రంగనాథ రోడ్డులో భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. వినయ్ టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ అన్నమయ్య సర్కిల్ వద్ద ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం వీరిద్దరూ మద్యం తాగారు. రాత్రి సమయంలో దిలీప్ ఇంటి సమీపంలోని కారులోకి మకాం మార్చారు. అందులోనే మద్యం సేవించి.. ఏసీ ఆన్ చేసుకొని నిద్రపోయారు. కొంతసేపటికి పెట్రోల్ అయిపోవడంతో కారు ఇంజిన్ ఆగిపోయింది. అద్దాలు మూసిఉండటంతో మత్తులో ఉన్న వారిద్దరూ ఊపిరాడక మరణించారు. కారుపై కవర్ కప్పి ఉండటంతో ఎవరూ గుర్తించలేకపోయారు. -
బాబు, పవన్ను ఓడిద్దాం.. ముస్లింలకు అసదుద్దీన్ పిలుపు
కర్నూలు (టౌన్): బీజేపీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మద్దతుగా నిలిచి ముస్లింలను దగా చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం రాత్రి కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ‘వక్ఫ్ బచావో.. దస్తూర్ బచావో’ నినాదంతో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ మరువరన్నారు. టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు, ప్రజాప్రతినిధులు, నాయకులు బయటకు రావాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వక్ఫ్ బోర్డు సవరణల్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచి్చనా టీడీపీ, జనసేన పార్టీలను చిత్తుగా ఓడిద్దామని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు రూ.వేల కోట్లను ఆయన వర్గీయులు, బంధువులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. వక్ఫ్ అమలుకు ప్రతి ముస్లిం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల ఏరివేత ముసుగులో ముస్లింలను బీజేపీ ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తోందన్నారు. పహల్గాంలో అమాయకులను ఊచకోత కోసిన నిందితులను మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోందని ప్రశ్నించారు.ఆర్ఎస్ఎస్ దేశంలో పేట్రేగిపోతోందని, మసీదులు, దర్గాలను టార్గెట్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫర్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ముస్లిం మతపెద్దలు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
రైతులపై ఎందుకింత కక్ష?
పీసీపల్లి/ కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వ తీరుపై కడుపు మండిన పొగాకు రైతులు రోడ్డెక్కారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఏపీ రైతు సంఘంతో కలిసి పొగాకు బేళ్లను రోడ్డుపై వేసి ధర్నా చేశారు. రైతులపై ఎందుకింత కక్ష అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి పండించిన పంటలను.. కనీసం కొనుగోలు చేయలేని ప్రభుత్వం తమకు వద్దంటూ నినదించారు. సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు కొనుగోలు చేశామని చెప్పడం దారుణమన్నారు.వారు చెబుతున్నట్లుగా కంపెనీలు గానీ, ప్రభుత్వం గానీ కర్నూలు జిల్లాలో ఒక్క ఆకును కూడా కొనలేదని ఏపీ రైతుసంఘం రాష్ట్రకార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదన్నారు. బేళ్లకు నిప్పంటించి.. ఆ మంటల్లో దూకేస్తాం‘లోగ్రేడ్ పొగాకు కొంటేనే వేలంలో పాల్గొంటాం. లేదంటే పొగాకు బేళ్లకు నిప్పంటించి.. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటాం’ అని పొగాకు రైతులు బోర్డు అధికారులకు తెగేసి చెప్పారు. ప్రకాశం జిల్లా కనిగిరి పొగాకు బోర్డు పరిధిలోని పెద్ద అలవలపాడు క్లస్టర్ రైతులు లోగ్రేడ్ పొగాకును బయ్యర్లు కొనడం లేదంటూ రెండు రోజుల నుంచి పొగాకు లోగ్రేడ్ పొగాకు కొంటేనే వేలం జరుగుతుందని.. లేదంటే పొగాకుకు నిప్పుపెట్టి.. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు తెగేసి చెప్పారు. -
14 రోజుల బాలింతను పొట్టనబెట్టుకున్న అధికారులు
ఆదోని అర్బన్(కర్నూలు): ఆదోని పట్టణంలోని 36వ వార్డు, మేదరి గేరీలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న దివ్య (26) బదిలీ ఒత్తిడితో అనారోగ్యానికి గురై మృతి చెందింది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 15వ తేదీన పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ రోజు నుండి మెటర్నిటీ సెలవులో ఉంది. ఈ క్రమంలో కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ నిర్వహించారు. అధికారుల ఆదేశాల మేరకు శిశువుతో 8 ఉదయం గంటలకు అక్కడికి చేరుకుంది. అయితే తన పరిస్థితి వివరించి త్వరగా కౌన్సెలింగ్కు పంపాలని అక్కడ విధుల్లో ఉన్న అధికారులను వేడుకుంది. తాను బాలింతను అని, సిజేరియన్ జరిగిందని వివరించినా ఎవరూ పట్టించుకోలేదు. అర్ధరాత్రి 1 గంటల సమయంలో కౌన్సెలింగ్ పూర్తి కావడం, ఆమెకు ఆస్పరి మండలం అలిగేరికి బదిలీ చేశారు. అప్పటి వరకు కార్యాలయం ఆవరణలో ఉన్న తన బిడ్డకు పాలు ఇచ్చేందుకు లోపలకి, బయటకు తిరిగి అలసిపోయింది. అలాగే దూర ప్రాంతానికి బదిలీ కావడంతో ఆందోళనకు గురైంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆదోనికి చేరుకున్న దివ్య కొద్ది సేపటి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని కర్నూలుకు రెఫర్ చేశారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో దివ్య మృత్యుఒడి చేరారు. మానవత్వం లేకుండా అధికారులు వ్యవహరించడంతో తన బిడ్డ మృతి చెందిందని దివ్య తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
రాఘవుడి దర్శనానికి దారేది?
● సింగిల్ ఎంట్రెన్స్తో భక్తుల నిరీక్షణ ● తోపులాటలతో ఉక్కిరి బిక్కిరి.! మంత్రాలయం : శ్రీమఠం అధికారుల తీరు భక్తుల తోపులాటకు దారి తీసింది. సింగిల్ ఎంట్రన్స్తో భక్తులకు ముచ్చెమటలు తెప్పించింది. వృద్ధులు, చిన్నారులను కన్నీళ్లు పెట్టించింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. గురు, శని, ఆదివారాలు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీమఠం అధికారులు ఏర్పాట్లు చేయడంలో కాస్త అలసత్వం కనబడుతోంది. మొన్నటి వరకు శ్రీమఠం ప్రాంగణంలోకి ప్రవేశించాలంటే చుట్టూరా మూడు ప్రధాన ద్వారాలతోపాటు, ప్రధాన ద్వారం ఇరువైపులా చిన్న ద్వారాలు నుంచి అవకాశం కల్పించేవారు. ద్వారాలతో రద్దీ తక్కువగానే ఉన్న క్యూలైన్లలో భక్తుల బారులు తీరే పరిస్థితి. క్యూలైన్లు పెంచాల్సి వస్తుందేమోనని.. లేక ప్రాంణగంలో రద్దీ తగ్గించాలనో.. కొత్త పద్ధతిని ఆచరణలోకి తెచ్చారు. ఆదివారం దర్శనాలకు వచ్చిన భక్తులను కేవలం ప్రధాన ద్వారం నుంచి ప్రవేశం కల్పించారు. పోలీసులు, సెక్యురిటీగార్డులతో రోప్ ఏర్పాటు చేసి భక్తులకు బ్రేకులు వేస్తూ వచ్చారు. అయితే రోప్తో భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. శ్రీమఠంలోకి వచ్చేందుకు తోసుకుంటూ ఎగబడ్డారు. తోపులాటతో వృద్ధులు, చిన్నారులు కన్నీళ్లు సైతం పెట్టుకున్నారు. లక్షలాది మంది భక్తులకు ఒకే ఎంట్రెన్స్ పెట్టడంతోనే ఇబ్బందులు తలెత్తాయి. ఇన్నాళ్లూ ఇలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ఆయా ద్వారాల నుంచి సాఫీగా మఠంలోకి వెళ్లి వచ్చే పరిస్థితి. ఈ అనాలోచనతో దర్శనాలకు బాగానే సమయం పట్టింది. కూలైన్లతో భక్తులకు ఎలాంటి వసతు లు కూడా లేకపోవడంతో తలలు పట్టుకున్నారు. కనీసం క్యూలైన్లతో తాగునీటి సౌకర్యమైనా కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఇక అన్నపూర్ణ భోజనశాలలోనూ అదే పరిస్థితి. గంటల తరబడి భక్తులు క్యూలైన్లలోనే కూర్చుండిపోయారు. సాధారణ రోజుల్లోనే ఇలా ఉంటే రాఘవేంద్రుల ఆరాధనోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయోనని భక్తులు వాపోయారు. -
వక్ఫ్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలి
కర్నూలు(సెంట్రల్): నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సేవ్ వక్ఫ్..సేవ్ రాజ్యాంగం జేఏసీ కన్వీనర్ మౌలానా సయ్యద్ జాకీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై నేటి (సోమవారం) సాయంత్రం 5 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈసభకు రాజకీయాలకు అతీతంగా హాజరై మద్దతు తెలపాలన్నారు. మంగళవారం మౌర్య ఇన్కు ఎదురుగా ఉన్న మసీదులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కో కన్వీనర్లు ఎంఏ హమీద్, ఎస్ఎండీ షరీఫ్లతో కలసి మాట్లాడారు. బహిరంగ సభకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముస్లిం సంస్థల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవడంతో చట్టానికి సవరణలు చేశారని విమర్శించారు. ఆయన అధికారంలోకి వచ్చాక మసీదులు, మదరసాలు, కబరస్తాన్ల భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మరోవైపు ఇప్పటికే ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన పది రకాల చట్టాలను రద్దు చేసినట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తూ చేపట్టే బహిరంగసభను జయప్రదం చేయాలని ఆయన రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళ సంఘాల ప్రతినిధులను కోరారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు
కర్నూలు (టౌన్): నగర శివారులోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రగ్బీ జూనియర్ అండర్–18 బాల, బాలికల చాంపియన్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. బాలుర విభాగంలో ప్రకాశం (ప్రథమ), కర్నూలు (ద్వితీయ), విశాఖపట్నం (తృతీయ), బాలికల విభాగంలో గుంటూరు (ప్రథమ), అనంతపురం (ద్వితీయ), తూర్పు గోదావరి (తృతీయ) స్థానాల్లో నిలిచాయి. విజేతలకు ఆదర్శ విద్యా మందిర్ డైరెక్టర్ డాక్టర్ బి. హరికిషన్, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటి పదిమందికి ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో రగ్బీ ఇండియా ప్రతినిధి నోయల్ మ్యాథ్య్సు, రగ్బీ, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● ఏడాది పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదు ● ‘సూపర్ సిక్స్’ అంటూ వంచన చేశారు ● మేనిఫెస్టో అమలు చేయలేదు ● జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలి ● విడతల వారీగా ‘బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమం ● వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితీవ్ర ఇబ్బందుల్లో రైతులు ● జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరం కాలంగా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేది లేదన్నారు. ● పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విధానాన్ని ఎండగడదామని పిలుపునిచ్చారు. ఐదేళ్ల జగనన్న పాలనలో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు ఎక్కడ అని ప్రశ్నించారు. అన్ని వివరాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ● ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. ఈ ప్రభుత్వంపై మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అదే జగనన్న ఉంటే ఎన్నో సంక్షేమ పథకాలు అందేవని భావిస్తున్నారన్నారు. కర్నూలు(టౌన్): ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసాలకు చిరునామా మారారని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రాంచంద్రా రెడ్డి విమర్శించారు. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ’ అని మాటఇచ్చి నేడు ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’గా మారారన్నారు. కర్నూలు బిర్లా సర్కిల్లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరీటీ– మోసం గ్యారెంటీ’ పేరుతో క్యూఆర్ కోడ్ అవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియోను సమావేశంలో ప్రదర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ఏదీ? వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని తేలిపోయిందన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి పేదలు, మహిళలు మోసపోయామని అర్థమైందన్నారు. జగనన్న హయాంలో ఏటా రూ. 70 వేల కోట్లు ప్రతి పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు, మహిళలకు నేరుగా వారి అకౌంట్లలో జమ చేశారని గుర్తు చేశారు. ఏడాది పాలనలో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పటికీ అమలులోకి రాలేదని విమర్శించారు. ఇంటింటికీ మోసం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇంటింటికీ మోసం చేశారన్నారు. మోసాలను గ్రామా గ్రామానా వివరిద్దామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రూ. 1500 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రూ. 4 వేలు పెన్షన్, నిరుద్యోగులకు రూ. 3 వేలు, అన్నదాత సుఖీభవ పేరుతో రూ. 20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయని, గ్రామ స్థాయిలో కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలన్నారు. ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందన్నారు. బాబు ష్యూరీటీ మోసం గ్యారెంటీ పేరుతో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ మోసాలను వివరిస్తామన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీల పేరుతో ఇంటింటికి రూ.2.40 లక్షల లబ్ధి పొందుతారని చెప్పి దగా చేశారని విమర్శించారు. హాజరైన ఎమ్మెల్యేలు సమావేశంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, హఫీజ్ఖాన్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్టా రేణుక, కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సతీష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్, గడ్డం రామక్రిష్ణారెడ్డి, రుద్రగౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్, షరీఫ్, అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కల్లా నాగవేణి రెడ్డి, గాజుల శ్వేతారెడ్డి, మంగమ్మ, భారతి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టా ప్రతుల్, కార్పొరేటర్లు షేక్ యూనిస్ బాషా, సిట్రా సత్యనారాయణమ్మ, షేక్ ఆర్షియా ఫర్హీన్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.జమిలీ ఎన్నికలు 2027 సంవత్సరంలో వస్తున్నాయని, పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేసి జగనన్నను గెలిపించుకుందామని మాజీ మంత్రి, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ఏడాది పాలనపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ‘సూపర్ సిక్స్’ అంటూ ప్రజలను వంచన చేశారని, ఈ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికల సమయంలో 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఆశలు కల్పించి దగా చేశారని విమర్శించారు. అరకొరగా తల్లికి వందనం నిధులు వేసి ఎవరైనా ఈ పథకం గురించి మాట్లాడితే నాలుక మడత పెడతామంటూ బెదిరించడం ముఖ్యమంత్రి స్థాయిలో తగదన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోబోరన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి చేసిన మోసాలను జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాదిలో ప్రజలకు ఎలాంటి లబ్ధిని చేకూర్చిందో తెలియజేయాలన్నారు. -
జూలైలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు
కర్నూలు(సెంట్రల్): ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) కర్నూలు జిల్లా మహాసభలను జూలై మూడో వారంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం కన్వీనింగ్ కమిటీ నిర్ణయించింది. ఆదివారం టీజీవీ కళా క్షేత్రంలో నగర అధ్యక్షుడు ఎం.శివశంకర్ అధ్యక్షతన సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, కేబీ శ్రీనివాసులు, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డి.హుస్సేన్. జిల్లా కన్వీనర్ నాగేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా మహాసభల నిర్వహణపై చర్చించి జూలై మూడో వారంలో జరపాలని నిర్ణయించారు. ఈ మహాసభలకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించారు. కాగా, మహాసభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘాన్ని ఎనుకున్నారు. కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల, ఆదోని డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బసప్ప, చంద్రమోహన్, ఎమ్మిగనూరు డివిజన్ గౌరవాధ్యక్షుడు దేవేంద్రమూర్తి, అధ్యక్షుడు షబ్బీర్, ఆలూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కృష్ణ, కర్నూలు జిల్లా నాయకులు సునీల్కుమార్, బ్రహ్మయ్య, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వడ్డె శ్రీనివాసులు, నగర ఉపాధ్యక్షుడు బాబు పాల్గొన్నారు. -
అమ్మవారికి పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. మద్దిలేటి స్వామి ఆలయ నీటి గుండంకు కంచె ఏర్పాటు బేతంచెర్ల: మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని నీటి గుండం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రతి శుక్ర, శనివారం అధిక సంఖ్యలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలివస్తుంటారు. ఈక్రమంలో కోనేరులో కాకుండా నీటి గుండంలోకి ఈతకు వెళ్లి ఏడాదికి ఇద్దరు లేదా ముగ్గురు మృత్యువాతపడుతున్నారు. ఈక్రమంలో ఆలయ ఉప కమిషనర్, ఈఓ రామాంజనేయులు ఆలయ నీటి గుండం వద్ద ప్రమాదాల నివారణకు కంచె ఏర్పాటు చేయించారు. బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం నంద్యాల(న్యూటౌన్): పట్టణానికి చెందిన మహంకాళి జశ్వంత్ జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ డబుల్స్లో గోల్డ్ మెడల్, సింగిల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకానాథ్, సెక్రటరీ అంకమ్మ చౌదరి తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన గోవాలో అండర్–13 ర్యాంకింగ్ నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయన్నారు.ఇందులో జశ్వంత్ ప్రతిభ చాటి బంగారు పతకంతో పాటు ట్రోఫీ అందుకున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ క్రీడాకారుడిని ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ నంద్యాల జిల్లా సెక్రటరీ వంశీధర్, కోచ్ నాగార్జున పాల్గొన్నారు. మంటల్లో చిక్కుకున్న లారీ తుగ్గలి: లారీ టైర్లు వేడెక్కి మంటలు వ్యాపించిన ఘటన ఆదివారం సాయంత్రం మండలంలోని చెర్వుతండ వద్ద చోటు చేసుకుంది. ముంబై నుంచి చైన్నెకు బెల్లం పానకం ట్యాంకర్తో వెళుతున్న లారీ మార్గమధ్యంలో చెర్వుతండ బ్రిడ్జి కిందికి రాగానే టైర్లు హీటెక్కి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ లారీ ఎక్కడ పేలుతుందోనని అక్కడ గుమికూడిన జనం బెంబేలెత్తి పోయారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం కాలి పోయింది. స్థానికులు సమాచారం అందించడంతో పత్తికొండ నుంచి ఫైర్ ఇంజిన్ వెళ్లి మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. రైల్వే బ్రిడ్జి కింద లారీకి మంటలు వ్యాపించడంతో రైల్వే అధికారులు సైతం అప్రమత్త మయ్యారు. ప్రమాదంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు కాసేపు అంతరాయం కలిగింది. -
కొండల్ని కొల్లగొట్టి.. ఎర్రమట్టి దోపిడీ
ఎమ్మిగనూరురూరల్: కొండల్లో ఎర్రమట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వానికి రుసుం చెల్లించకుండా కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎమ్మిగనూరు మండలంలోని మాచుమాన్దొడ్డి, నవోదయ పాఠశాల ఎదురుగా, బనవాసి ఫారెస్ట్, ఎస్.నాగాలపురం, హనుమాపురం, వెంకటగిరి గ్రామ కొండల్లో ఎర్రమట్టిని తరలిస్తున్నారు. బనవాసి ఫారంలో చాలా చోట్ల గోతులు తవ్వి మట్టిని తరలించారు. కొన్ని చోట్ల ప్రొక్లెయిన్లు ఉపయోగిస్తున్నారు. లక్షల రూపాయలు విలువ చేసే అటవీ సంపదను తరలిపోతుంది. అక్రమార్కులకు ఆర్థిక వనరుగా.. కొండలకే పరమితమైన తవ్వకాలు ఇప్పుడు నేరుగా బనవాసి ఫారంలో టేకు చెట్లు పెంచుతున్న వనంలోకి వచ్చాయి. టేకు చెట్లు అడుగు వరకు ఉన్న మట్టిని తీస్తున్నారు. చెట్ల నరికివేసి వాటిని కూడా ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. కళకళాడిన బనవాసి ఫారం నేడు అక్రమార్కులకు ఆర్థిక వనరుగా మారిపోయింది. గతంలో ఇక్కడ పనిచేసి వలంటీర్లు ఇప్పుడు లేకపోవటంతో కాంట్రాక్టర్లు టాక్టర్లలో ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోని అధికారులు అటవీకి ప్రాంతంలో యఽథేచ్ఛగా ఎర్రమట్టిని తరలిస్తూ చెట్లను నరికివేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. అటవీశాఖ అధికారులు ఆదోని, కర్నూలు ప్రాంతాల్లో ఉండటంతో పర్యవేక్షణ లోపించింది. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు బరితెగించారు. బనవాసి ఫారెస్ట్ పరమాన్దొడ్డికి వెళ్లే దారి సమీపంలోని స్మార్ట్ సిటీ దగ్గర ఎర్ర చందనం చెట్లను నరికివేశారు. ఎవరు గుర్తించకపోతే వాటని రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. ఎర్ర చందనం చెట్లు నరికివేతకు గురైనా ఫారం అధికారులకు కనిపించకపోటం గమనార్హం.కఠిన చర్యలు తీసుకుంటాం అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫారంలో ఇంతకు ముందే మట్టిని తరలించరాదని చెప్పాం. తరలిస్తున్నట్లు మాకు సమాచారం ఇస్తే పట్టుకుంటాం. కాంట్రాక్టర్లు తరలిస్తే కేసులు నమోదు చేస్తాం. – శ్రీనివాసులు, రూరల్ ఎస్ఐ -
పట్టు వదలని ‘విత్తు’ మార్కుడు
అన్నదాత ఆశలను అడియాసలు చేస్తు వరుణుడు ముఖం చాటేయడంతో రైతులకు కన్నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో రైతులు ఖరీఫ్లో వర్షాధారం కింద పంటలు సాగు చేశారు. అయితే వర్షం జాడలేక పంటలు వాడు ముఖం పడుతున్నాయి. పెట్నికోటకు చెందిన రైతు గొంగటి వెంకట్రామిరెడ్డి ఆదివారం ట్యాంకర్తో పత్తి పంటకు నీరు అందించాడు. నెల రోజుల క్రితం నాలుగు ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాడు. సగం భూమిలో మొలకెత్తగా మిగిలిన చోట్ల మొలకెత్తలేదు. దీంతో ట్యాంకర్తో విత్తనం మొలకెత్తని చోట పైపుతో నీళ్లు పడుతూ కనిపించాడు. వర్షం లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. – కొలిమిగుండ్ల -
సెలవు రోజూ తప్పని తిప్పలు
కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవు అయినా ఇబ్బందులు ఎదుర్కొంటూ సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –6 ( డిజిటల్ అసిస్టెంట్ ) బదిలీలకు సంబంధించిన కౌన్సిలింగ్ను నిర్వహించారు. కర్నూలు జిల్లాలో మొత్తం డిజిటల్ అసిసెంట్లు 375 మంది ఉండగా, వీరిలో ఐదు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో సర్వీసును పూర్తి చేసుకున్న వారు 207 మంది, రిక్వెస్ట్ బదిలీలు కోరుతు 71 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్, కర్నూలు డీఎల్పీఓ టీ లక్ష్మి, కార్యాలయ ఏఓ ప్రతిమ కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగుల ఆప్షన్స్ తీసుకున్నారు. అలాగే నంద్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –6 ( డిజిటల్ అసిస్టెంట్లు ) మొత్తం 404 మంది ఉండగా, ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు 258, రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నా వారు 30 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా కౌన్సెలింగ్కు హాజరయ్యారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో జరిగిన నంద్యాల జిల్లా ఉద్యోగుల కౌన్సిలింగ్ డీపీఓ లలితాబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాగా, గ్రేడ్ –5 కార్యదర్శుల బదిలీలను ఈ నెల 28వ తేదిన పూర్తి చేశారు. విశ్వేశ్వరయ్య భవన్లో ... పీఆర్ ఎస్ఈ కార్యాలయం విశ్వేశ్వరయ్య భవన్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 728 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉండగా, వీరిలో ఐదు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో విధులు నిర్వహించిన వారు 477 మంది ఉన్నారు. ఈ నెల 28వ తేదిన రాత్రి వరకు ఐదేళ్లు పూర్తి అయిన వారికి, స్పెషల్ కేటగిరి ( మెడికల్, స్పౌస్ తదితరాలు ) వారికి బదిలీలు నిర్వహించారు. ఆదివారం రిక్వెస్ట్ బదిలీలు కోరుతు దరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఎస్ఈ వీ రామచంద్రారెడ్డి, డీఈఈలు రవీంద్రరెడ్డి, నివాసులు, నాగిరెడ్డి, ధనిబాబు, కర్రెన్న, డీఏఓలు, ఏఈలు పాల్గొన్నారు. జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ... ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియం హాల్లో నిర్వహించారు. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి జిల్లాలోని ఒకే ప్రాంతంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు 570 మంది, రిక్వెస్ట్ బదిలీలను కోరుతూ 131 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కే తులసీదేవి ఆధ్వర్యంలో కొనసాగింది. సహాయ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లతో కిక్కిరిసిన జెడ్పీ -
ఒకటి మంత్రికి.. రెండోది ఎమ్మెల్యేకు!
కర్నూలు(సెంట్రల్): సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలకు పాతరేసి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉన్న వారికి అనువైన స్థానాలు ఇస్తున్నారు. ఎవరైనా ఆ స్థానాలను కోరుకుంటే వాటిలో మంత్రి చెప్పిన వ్యక్తి ఉన్నారని, ఎమ్మెల్యే సూచించిన వారికి ఇవ్వాల్సి ఉందని, మరో స్థానం కోరుకోవాలని నేరుగా చెబుతున్నారు. దీంతో ఆదివారం చేపట్టిన వీఆర్వోలు, సర్వేయర్ల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇదంతా అధికారుల తీరుతోనే జరుగుతోందని, ఇందులో కొందరు అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడంతోనే జరుగుతోందని చెబుతున్నారు. అధికారుల తీరుపై సర్వేరయర్ల ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కర్నూలు, నంద్యాల డీఆర్వోలు సి.వెంకటనారాయణమ్మ, రామునాయక్ ఆధ్వర్యంలో వీఆర్వోలకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. సునయన ఆడిటోరియంలో కర్నూలు, నంద్యాల సర్వే ఏడీలు మునికన్నన్, జయరాముడు ఆధ్వర్యంలో సర్వేయర్లకు బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. ముందుగా స్పౌజ్, అరోగ్యం, ఒంటరి మహిళ, మ్యూట్వువల్ విభాగాల్లో ర్యాంకుల ఆధారంగా వీఆర్వోలు, సర్వేయర్లను కౌన్సెలింగ్ పిలిచారు. వచ్చిన వారిలో ర్యాంకుల ఆధారంగా పిలిచి...మూడు ఆప్షన్లు ఇచ్చిన అధికారులు.. ‘మూడింటిలో ఒక స్థానం మంత్రి సిఫారసు ఉంది.. మరొక స్థానం ఎమ్మెల్యే మనిషికి ఇవ్వాలి.. ఇంకో స్థానం కోరుకో’ అని చెబుతుండడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఫార్సు లేఖల పేరిట ఫోకల్ స్థానాలను రిజర్వ్ చేసినట్లు చేయడం అన్యాయమని వాపోయారు. సిఫార్సు అంటే ఒకటో..రెండో ఉండాలి తప్ప.. ఎక్కువ స్థానాలను వారికే కేటాయించేలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఫార్సులు లేని వారికి నాన్ఫోకల్ పోస్టులను ఇస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించాలని ప్రశ్నించారు. ఎవరికీ కావాల్సిన స్థానాలు వారికి ఇచ్చుకుంటే సరిపోతుంది కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు.. సర్వేయర్లలో బదిలీల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. 800 మందిలో 294 మందికి ఐదేళ్ల సర్వీ సు పూర్తి కాగా...మిగిలిన వారు రిక్వెస్టు జాబితాలో దరఖాస్తు చేసుకున్నారు.అలాగే వీఆర్వోల్లో గ్రేడు–2లో మొత్తం 77 మంది దరఖాస్తు చేసుకొగా ఇద్దరు హాజరు కాలేదు. ఇందులో ఐదేళ్ల సర్వీసు పూర్తైన వారు 30మంది ఉన్నారు. గ్రేడు–1 వీఆర్వోలో 14 మంది దరఖాస్తు చేసుకోగా 9 మంది మాత్రమే హాజరయ్యారు. కాగా, వీఆర్వోల బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగిసింది. అయితే సర్వేయర్లు భారీ సంఖ్యలో ఉండడంతో రాత్రి వరకు కొనసాగింది. కాగా, సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సిఫార్సు లేఖల నేపథ్యంలో సర్వేయర్లు కౌన్సెలింగ్ను బహిష్కరించారు. దీంతో అధికారులు వారికి సర్దిచెప్పి నిబంధనలకు మేరకు ఖాళీలను చూపుతామని చెప్పి అర్ధరాత్రి వరకు కొనసాగించారు. ముగిసిన కౌన్సెలింగ్ కర్నూలు (టౌన్): ఉమ్మడి జిల్లాకు సంబంధించి సచివాలయాల కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం ముగిసింది. ప్లానింగ్ కార్యదర్శులు 155 మంది, ఎమినీటీస్ కార్యదర్శులు 170 మందికి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత వార్డు, సొంత వార్డు మినహా ఇతర వార్డులకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అదనపు కమిషనర్ ఆర్జీవీ క్రిష్ణ,డిప్యూటీ కమిషనర్ సతీష్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మూడు ఆప్షన్లు ఇచ్చి వీఆర్వో, సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్ లేఖలు లేని వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేసిన అధికారులు అర్ధరాత్రి వరకు కొనసాగిన సర్వేయర్ల బదిలీల ప్రక్రియ -
పౌరాణికాలకు ఆదరణ తగ్గలేదు
కర్నూలు(హాస్పిటల్): ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గలేదని పారిశ్రామిక వేత్త, సినీనటులు బీవీ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో స్వేచ్ఛ నాటక ప్రదర్శనలో భాగంగా శ్రీకృష్ణ రాయబారంలోని ఒక సన్నివేశం ప్రదర్శన జరిగింది. సభ ప్రారంభంలో శ్రీకృష్ణ రాయబారంలోని పడక సీను సన్నివేశాన్ని శ్రీకృష్ణునిగా భాస్కరయాదవ్, అర్జునుడిగా కేవీ రమణ, దుర్యోధనుడిగా చల్ల నవీన్కుమార్ నటించారు. ఈ సందర్భంగా బీవీ రెడ్డి మాట్లాడుతూ తన చిన్నతనంలో రాత్రి 10 గంటలకు నాటకం ప్రారంభమైతే ఉద యం 6 గంటల వరకు కొనసాగేవన్నారు. ఎన్టీ రామారావుతో పాటు ఎందరో సినీనటులతో తనకు పరిచయం ఉందని, సినిమాలకు ఆదరణ క్రమేపీ తగ్గడం విచారకరమన్నారు. రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య మాట్లాడుతూ కొత్తతరం నటులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కళాక్షేత్రం అధ్యక్షులు పత్తిఓబులయ్య, బలగం సినిమా ఫేమ్ సురభి లలిత మంజు గోవర్దన్రెడ్డి, కళాకారులు బీవీ రెడ్డి, బీసీ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, దస్తగిరి, పి.రాజారత్నం, మహమ్మద్మియ్య పాల్గొన్నారు. -
ఽఢణాపురం దళిత సర్పంచ్ ఘటనపై తీవ్ర వాగ్వాదం
ఇటీవల ఆదోని మండలం ఽఢణాపురం గ్రామంలో చోటు చేసుకున్న దళిత సర్పంచ్కు జరిగిన అవమానంపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఆస్పరి జెడ్పీటీసీ దొరబాబు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దళితుల పట్ల ఎమ్మెల్యే పార్థసారథి చిన్న చూపు చూస్తున్నారని, ఎమ్మెల్యే తప్పు చేసినందునే క్షమాపణ చెప్పారని దొరబాబు అన్నారు. తాను తప్పు చేయకపోయినా, దళిత ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తిగా క్షమాపణ చెప్పానని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్సార్సీపీ వారికి దళితులంటే చిన్న చూపు ఉన్నందునే గడచిన ఎన్నికల్లో వారిని పక్కన కూర్చోబెట్టారని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటే అమితమైన ప్రేమ ఉన్నందునే కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర రాజధానిలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారని దొరబాబు చెప్పారు. -
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని హైకోర్టు జడ్జి(జిల్లా ఫోర్టుపోలియో జడ్జి) జస్టిస్ బీఎస్ భానుమతి అన్నారు. శనివారం జిల్లాకోర్టు హాలులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ది ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. సివిల్ దావాల్లో సెక్షన్9 సీపీసీ, లోక్అదాలత్ అవార్డుల్లో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి వివరించారు. హైకోర్టు విశ్రాంత జడ్జి వీఆర్కే కృపాసాగర్, విశ్రాంత జిల్లా జడ్జి టి.వేణుగోపాల్ శిక్షణ తరగతులను కొనసాగించారు. హైకోర్టు విశ్రాంత జడ్జి వీఆర్కే కృపాసాగర్ను బార్ అసోసియేషన కార్యాలయంలో సన్మానించారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి.హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు , న్యాయవాదులు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి -
ఏపీఎంఎస్ఐడీసీ ఈఈగా చిరంజీవులు
కర్నూలు(హాస్పిటల్): ఏపీ ఎంఎస్ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఎం.చిరంజీవులు నియమితులయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ తాడేపల్లి గూడెంలో ఈఈగా పనిచేస్తున్న ఆయన డిప్యుటేషన్పై కర్నూలుకు వచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదుళ్లచెరువు గ్రామానికి చెందిన ఆయన 1990లో ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ(తిరుపతి)లో ఏఈగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత హైదరాబాద్లోని హార్టికల్చరల్ యూనివర్సిటీలో డీఈగా పనిచేశారు. 2014 నుంచి వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఈఈగా కొనసాగుతున్నారు. -
జీఓ నం.4 దివ్యాంగ క్రీడాకారులకు వరం
● న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాల(న్యూటౌన్): జీఓ నం.4 దివ్యాంగ క్రీడాకారులకు వరమని న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫ రూక్ అన్నారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, కార్యదర్శి రామస్వామి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన పారా స్పోర్ట్స్ చైతన్య రథయాత్ర శనివారం నంద్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం క్రీడా కోటలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పించిందన్నారు.అనంతరం జాతీయ స్థాయి పథకం సాధించిన దివ్యాంగ క్రీడాకారుడు వెంకట్ను అసోసియేషన్ నాయకులతోపాటు మంత్రి ఫరూక్ అభినందించారు. పారా స్పోర్ట్స్ జిల్లా అధ్యక్షుడు రవికృష్ణ, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు పీవీ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు. -
బదిలీల కౌన్సెలింగ్ గందరగోళం
● సచివాలయాల ఉద్యోగుల్లో ఆందోళన ● టీడీపీ నేతల సిఫార్సులకే యంత్రాంగం మొగ్గుకర్నూలు (టౌన్): సచివాలయాల ఉద్యోగుల కౌన్సెలింగ్లో గందరగోళం నెలకొంది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ‘టిక్ పెట్టండి.. వెళ్లిపోండి’ అంటూ చెప్పడంతో సచివాలయాల ఉద్యోగులు అవాక్కుయ్యారు. ‘ఇదేం కౌన్సిలింగ్ తీరు’ అంటూ వాగ్వావాదానికి దిగారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేసే సచివాలయాల ఉద్యోగులకు రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హడావుడిగా కర్నూలు కార్పొరేషన్ ఆధికారులు శనివారం సుంకేసుల రోడ్డులో ఉన్న నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఉమ్మడి జిల్లాలో 308 సచివాలయాలు ఉన్నాయి. ఒకే చోట పనిచేస్తూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిలో 173 ఆడ్మిన్ కార్యదర్శలు, 235 ఎడ్యుకేషన్ కార్యదర్శులు, 248 మంది వెల్ఫేర్ కార్యదర్శులు, 208 శానిటేషన్ కార్యదర్శులు ఉన్నారు. వీరందరికీ రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. మొదటి రోజు ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు వార్డు శానిటేషన్ ఎన్విరాన్ మెంటల్ కార్యదర్శులకు, 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శులకు, సాయంత్రం 5 నుండి 7.30 గంటల వరకు వెల్ఫేర్ కార్యదర్శులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వచ్చిన వారు మూడు ఆప్షన్లు ఎంచుకొని వెళ్లాలని కమిషనర్ చెప్పడంతో సచివాలయాల ఉద్యోగులు జేఏసీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ప్లానింగ్ కార్యదర్శుల కౌన్సెలింగ్ బహిష్కరణ ఈనెల 29వ తేదీ ఆదివారం వార్డు ప్లానింగ్, ఎమినిటీ స్ కార్యదర్శులకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించా రు. ఈ కౌన్సెలింగ్ను బహిష్కరిస్తున్నట్లు సచివాలయాల ఉద్యోగుల సంఘం నాయకులు శివప్రసాద్, ఆలీ, భా స్కర్, జ్యోత్న్స, తారకేశ్వర్ రెడ్డి, అమర్ నాథ్, ప్రసాద్ తెలిపారు. కర్నూలు కార్పొరేషన్ ఆధికారులు అన్యాయంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళన కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు తమకు అన్యాయం చేస్తున్నారంటూ సచివాలయాల ఉద్యోగులు శనివారం రాత్రి భారీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతిపత్రం ఇచ్చారు. అయితే జర్నలిస్టులు రావడంపై అమె చిందులు తొక్కారు. ఎందుకు మీడియాకు చెప్పారంటూ సచివాలయాల ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల సిఫార్సులకే మొగ్గు..ఎక్కడా లేని విధంగా కర్నూలులో బదిలీల కౌన్సెలింగ్ గుట్టుగా చేయడం ఏంటని కొందరు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించారు. కేవలం టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారు మాత్రమే కర్నూలు అర్బన్, పాణ్యం అర్బన్, కోడుమూరు అర్బన్లో కొనసాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టారన్న విమర్శలు వస్తున్నాయి. సిఫార్సు లేని వారికి ఎక్కడ పడితే అక్కడ బదిలీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
దర్శనం దందా!
● దర్శనం పేరుతో భక్తులకు గాలం ● అడ్డదారుల్లో జేబులు నింపుకుంటున్న దళారులు ● ఆలస్యంగా మేలుకున్న శ్రీ మఠం అధికారులు అమాయక భక్తులు దొరికితే చాలు.. ఇక్కడి దళారులకు పండగే. అడ్డదారుల్లో దర్శనాలు చేయించి అందినకాడికి దోచుకోవడం వీరికి అలవాటే. ఏకంగా శ్రీ మఠం అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తుండటం ఆశ్చర్యకరం. ఇంతటి అపచారం రాఘవేంద్రుని సన్నిధిలో కొంతకాలంగా జరుగుతుండటం మహా అపచారం. – మంత్రాలయం మంత్రాలయం ఆధ్యాత్మిక క్షేత్రం ఎంతో పేరెన్నిక గన్నది. ఇక్కడ కొలువుదీరిన శ్రీరాఘవేంద్రస్వామి, గ్రామ దేవత మంచాలమ్మలను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ, మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దీనినే ఆసరాగా చేసుకున్న కొంత మంది దళారులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో కొంత మంది ప్రైవేటు వసతి గృహాలను లీజుకు నడుపుతున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో గదులు కేటాయించే సమయంలో గదుల అద్దెతో పాటు దర్శన సౌకర్యం, పరిమళ ప్రసాదం ప్యాకేజీగా మాట్లాడుకుంటున్నారు. సాధారణ రోజుల కంటే బుధ, గురు, శని, ఆది వారాల్లో లక్షకు పైగా భక్తులు మంత్రాలయం దర్శన నిమిత్తం వస్తుంటారు. తమ వసతి గృహాల్లో బస చేసిన వారు శ్రీ మఠం చేరుకోగానే 6, 7 గేటు నెంబర్ల వద్దకు వెళ్లి మన వారే అంటే చాలు క్షణాల్లో దర్శనం అయిపోతుంది. సాధారణ భక్తులకు మాత్రం గంటల కొద్ది సమయం పడుతుంది. అంతేగాకుండా ఇక్కడ లభించే పరిమళ ప్రసాదం తరహాలోనే కొంత మంది వ్యాపారులు కొన్ని రకాల మిఠాయిలను తయారు చేసి ప్రసాదం పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. ఈ తంతు ఇటీవల కాలంలో శ్రీ మఠం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఆలస్యంగా స్పందించిన అధికారులు శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో స్వామి వారి దర్శన దందా బాగోతంపై శ్రీ మఠం అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. మేనేజర్ ఎస్.కె.శ్రీనివాసరావు, శ్రీపతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక క్యూలైన్లో ఏర్పాటు చేశామని, ఎవ్వరూ కూడా డబ్బు కట్టి మోసపోవద్దని మైకుల ద్వా రా సూచనలు చేయించినట్లు తెలిపారు. ఎవరైనా డబ్బు వసూలు చేసినట్లైతే తమ దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పరిమళ ప్రసాదం తరహాలోనే ప్రసాద విక్రయాలు జరుగుతున్నాయని తమ దృష్టికి రాగానే విజిలెన్స్ విభాగం వారు తనిఖీలు చేపట్టి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇక మీదట ఎవరైనా నకిలీ పరిమళ ప్రసాదం విక్రయిస్తే షాపు లీజు రద్దు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
839 మంది మహిళా పోలీసులకు స్థానచలనం
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 839 మంది గ్రామ/వార్డు సచివాలయ మహిళా పోలీసులకు స్థానచలనం కలిగింది. ర్యాంకింగ్ ఆధారంగా మహిళా పోలీసులను బదిలీ చేశారు. కౌన్సిలింగ్ నిర్వహించారు. కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ దగ్గరుండి పర్యవేక్షించారు. మొత్తం 839 మంది కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. ర్యాంకింగ్ ఆధారంగా ఖాళీ ఉన్న సచివాలయాల ఆప్షన్లను కంప్యూటర్ తెరపై చూపి కోరుకున్న స్థానానికి బదిలీ చేశారు. దృష్టి లోపం, అంధత్వం ఉన్నవారికి (విజువల్ ఛాలెంజ్), మేధో వైకల్యం (మెంటల్లీ డిసేబుల్డ్), ట్రైబ్స్ దివ్యాంగులు, మెడికల్, స్పౌజ్, జనరల్ కేటగిరీల కింద ఉన్నవారిని వరుస క్రమంలో వ్యాస్ ఆడిటోరియంలోకి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కంప్యూటర్ తెరపై ప్రదర్శించిన ఆప్షన్లకు అనుగుణంగా కోరుకున్న స్థానానికి నియమించారు. బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ జులై 1న పింఛన్ల పంపిణీ ఉన్నందున ఎక్కడివారు అక్కడే ఉండాలని పోలీసు అధికారులు తెలిపారు. పింఛన్ల పంపిణీ పూర్తయ్యేవరకు అక్కడే కొనసాగి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బదిలీ ప్రొసీడింగ్స్ విడుదల చేస్తామన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసాచారి, పోలీస్ వెల్ఫేర్ డాక్టర్ స్రవంతి, సీఐలు తేజమూర్తి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. ‘కౌన్సెలింగ్’ పాట్లు! ఆదోనికి చెందిన లక్ష్మీదేవి మహిళా పోలీస్గా పనిచేస్తోంది. ఆరు నెలలుగా మెటర్నిటీ లీవ్లో ఉంది. మూడు రోజుల కిందట శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇదే సమయంలో శనివారం సచివాలయ ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుండటంతో ఏకంగా తన చంటిబిడ్డను తీసుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్కు హాజరైంది. అలాగే మరికొంత మంది కడుపుతో ఉన్న ఉద్యోగినులు, ఇంకొందరు చంటిబిడ్డలతో వచ్చి అక్కడే ఊయలలు కట్టిన దృశ్యాలు కౌన్సెలింగ్ కేంద్రం వద్ద చర్చనీయాంశమయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సాఫీగా సాగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రహసనంగా మారడంతో ఉద్యోగులకు అవస్థలు తప్పడంలేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
సరిహద్దు చెక్ పోస్టు వద్ద నగదు పట్టివేత
మంత్రాలయం/ఎమ్మిగనూరురూరల్: మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారులో ఉన్న సరిహద్దు చెక్పోస్టు వద్ద ఎకై ్సజ్ అధికారులు రూ.39 లక్షల నగదును పట్టుకున్నారు. రాయచూరు నుంచి బళ్లారి వెళ్లే కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఆదోనిలోని విక్టోరియా పేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి వద్ద నుంచి రూ.39 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఎలాంటి బిల్లులు లభ్యం కాకపోవడంతో నగదును కర్నూలు ఇన్కంట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు ఎకై ్సజ్ సీఐ రమేష్రెడ్డి, చెక్పోస్ట్ సీఐ రాయుడు తెలిపారు. ఏఎన్ఎంల జాబితాపై గందరగోళం కర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంలకు బదిలీలకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయాల్లో అన్ని కేటగిరిలకు బదిలీలను ర్యాంకు ఆధారంగా చేస్తుండగా వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్ను ఎలా తీసుకుంటారని దాదాపు 30 మందికి పైగా ఏఎన్ఎంలు శనివారం వారి అభ్యంతరాలను కార్యాలయ అధికారులకు అందజేశారు. తాజా జాబితాలోనూ ర్యాంకు ఎక్కువగా ఉన్న వారు పై భాగాన ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఏఎన్ఎంలకు 2019 అక్టోబర్ 2న జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారని, ఆ రోజున గాంధీ జయంతి ఉండటం వల్ల సెలవు అని, ఆ తేదీని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు విడుదల చేసిన జాబితాలోనూ పలు తప్పులు ఉన్నాయని, అధికారులు వీటిని సరిచేసి ర్యాంకు ఆధారంగా జాబితా తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు. చిన్నారిపై కుక్కదాడి కొత్తపల్లి: ఇంటి బయట ఉన్న 9 నెలల చిన్నారి పై కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటన ముసలిమడుగు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు, చిన్నారి దంపతులు తమ తొమ్మిది నెలల కూతురిని ఇంటి బయట ఉన్న అరుగు వద్ద కూర్చోబెట్టి తల్లి ఇంట్లోకి వెళ్లిది. అంతలోనే ఓ కుక్క చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసింది. చెవికి, ముక్కుకు రక్తగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. పీఏసీఎస్లకు త్రీమెన్ కమిటీలు కర్నూలు(అగ్రికల్చర్):ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు ముగ్గురు సభ్యుల నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జీ కమిటీలను ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు తమ పరిధిలోని పీఏసీఎస్లకు త్రీమెన్ కమిటీలను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి జాబితాలు అందజేశారు. త్రీమెన్ కమిటీలో ఒకరు చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజక ఇన్చార్జీలు ఇచ్చిన జాబితాలను సహకార శాఖకు పంపింది. ఇందులో భాగంగా సహకార శాఖ కమిషనర్ ఆయా జిల్లాల సహకార అధికారులకు జాబితాలను పంపారు. కర్నూలు జిల్లాలో 43 పీఏసీఎస్లు ఉండగా 28 పీఏసీఎస్లు.. నంద్యాల జిల్లాలో 56 పీఏసీఎస్లు ఉండగా 28 సంఘాలకు త్రీమెన్ కమిటీల నియామకానికి వెరిఫికేషన్కు సహకార శాఖ కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు డీసీవోలు చర్యలు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కర్నూలు: స్థానిక సంతోష్ నగర్ వద్ద లోకాయుక్త ఆఫీస్ ఎదురుగా 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సయ్యద్ ఇస్మాయిల్ (38) అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు తిలక్ నగర్కు చెందిన ఇస్మాయల్ ప్రస్తుతం కర్నూలు శివారులోని గీతాముఖర్జీ నగర్లో నివాసముంటూ కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం. శుక్రవారం రాత్రి లోకాయుక్త కార్యాలయం వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాదు నుంచి బెంగళూరు వైపు వెళ్లే గుర్తు తెలియని కారు ఢీకొంది. తలకు, కాళ్లకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలో పడివుండగా స్థానికులు 108 అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ కేంద్రానికి తరలించారు. భార్య షెహనాజ్ బేగం ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలులో చిరుత టెన్షన్
సాక్షి, కర్నూలు: చిరుత సంచారంతో కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. దానిని పట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో..జనసంచారం నుంచి పోలాల్లోకి వెళ్ళే క్రమంలో కోల్మాన్ పేటకు చెందిన లక్ష్మయ్య అనే యువకుడిపై చిరుత దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో గాయపడిన లక్ష్మయ్య ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చిరుతను బంధించేందుకు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసినట్లు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. -
తొలగని
‘దారి’ద్య్రంగ్రామీణ ప్రాంతాలకు చెందిన రోడ్లు పూర్తి స్థాయిలో ఛిద్రం అయ్యాయి. పల్లె ప్రజలు అవస్థల మధ్య ప్రయాణాలను సాగిస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయలేదని ఆరోపణలు చేసిన కూటమి నేతలు నేడు పల్లె రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. పల్లెలకు సంబంధించిన రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో పలు బస్సు సర్వీసులు కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. కోడుమూరు నుంచి గూడురు వరకు (వయా చనుగొండ్ల ) రోడ్డు పూర్తి అయినా నేటికీ బస్సు సర్వీసు ఏర్పాటు చేయలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎమ్మిగనూరు, కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు తదితర మండలాల్లోని గ్రామాలకు చెందిన రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. ● ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం – శిరివెళ్ల రోడ్డు పూర్తి స్థాయిలో ఛిద్రమైంది. గుంతలమయంగా మారిన ఈ రోడ్డుపై 15 గ్రామాలకు చెందిన ప్రజలు అవస్థల ప్రయాణం చేస్తున్నారు. ● గ్రామాల్లో డ్రైనేజీలను ఏర్పాటు చేయకుండా సీసీ రోడ్లను నిర్మించడంతో అనేక ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. జూపాడుబంగ్లాతో పాటు తంగడంచె ఎస్సీ, బీసీ కాలనీలు, పారుమంచాల ఎస్సీ కాలనీతో అంతర్గత రహదారులు నిర్మించినా డ్రైనేజీలను ఏర్పాటు చేయలేదు. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
విధి ‘పరీక్ష’లో విగతజీవిగా!
● బైక్ చక్రంలో బురక ఇరుక్కుని కింద పడిన మహిళ ● వెనక వస్తున్న ట్యాంకర్ ఆమైపె వెళ్లడంతో దుర్మరణం పాణ్యం: టీచర్ ఉద్యోగం సాధించాలన్నది ఆమె కల. ప్రభుత్వ కొలువు సాధించి కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. కల సాకారం చేసుకునేందుకు పరీక్షకు సైతం హాజరైంది. విధి ఆ కలతో పాటు ఆమెను ఛిద్రం చేసింది. పాణ్యం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. పాణ్యం ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన ఎస్ షబానా (30) పాణ్యం సమీపంలో ఆర్జీఎం కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన డీఎస్సీ పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసిన తర్వాత భర్త ఇద్రూస్బాషాతో కలసి బైక్పై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో పాణ్యం వద్ద ఎస్సార్బీసీ కాల్వ దాటగానే షబానా ధరించిన బురక బైక్ వెనుక చక్రంలో ఇరుక్కుపోవడంతో ఆమె కింద పడింది. అదే సమయంలో వారి వెనుక వస్తున్న ట్యాంకర్ ఆమైపె వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ట్యాంకర్ను పోలీసు స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం కాగా.. ఇద్రూస్ బాషా పాలిష్ కటింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. -
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముందుగా కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికై న వారిని జెడ్పీ స్థాయీ సంఘ కమిటీల్లో సభ్యునిగా నియమించేందుకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. అనంతరం వ్యవసాయం – అనుబంధ శాఖలు, వైద్యం – ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. సమావేశాని కంటే ముందు ఉదయం 9 గంటలకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో 1వ స్థాయీ సంఘ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సీఈఓ తెలిపారు. -
నేరాల నియంత్రణకు ‘చెక్ డివైజ్’
కర్నూలు: నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా రాత్రి గస్తీ విధుల్లో ఉంటే పోలీసులు మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ (ఎంఎస్సీడీ) తప్పనిసరిగా ఉపయోగించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. అనుమానాస్పదంగా కనిపించే వారి వేలి ముద్రలను సేకరించి నేర రికార్డులతో వాటిని సరిపోల్చి నేరస్తులను పట్టుకోవాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలో కేసులు పెండింగ్కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నేరస్తులను పట్టుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. పెండింగ్ కేసులను తగ్గించే విధంగా కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలి దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. డయల్ 100కు వచ్చే కాల్స్కు వెంటనే స్పందించాలన్నారు. పోక్సో కేసుల్లో నివేదికలు త్వరగా సిద్ధం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమస్యాత్మక ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లు, బారికేడ్స్, జిగ్జాగ్ డ్రమ్స్, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. మహిళలపై జరిగే నేరాల పట్ల పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయ మహిళా పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులకు, పోలీసు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. అడ్మిన్ ఏఎస్పీ హు సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటరామయ్య, ఉపేంద్ర బాబు, హేమలత, బాబు ప్రసాద్, భాస్కర్రావు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వారి వేలిముద్రలు సేకరించాలి నేర సమీక్షలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
సార్.. మాకెందుకు పుస్తకాలు ఇవ్వరు?
● డీఈఓ కార్యాలయం దగ్గర విద్యార్థుల నిరసనకర్నూలు సిటీ: ‘సార్..మాకెందుకు పుస్తకాలు ఇవ్వడం లేదు’ అంటూ విద్యార్థులు శుక్రవారం కర్నూలు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు రావడం లేదని, పాఠాలు చెప్పే వారు కరువయ్యారని.. ఇలాగైతే ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. కర్నూలు బీక్యాంపులో ఉన్న నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు ఉంది. ఈ స్కూల్లో మొత్తం 418 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల పునఃవ్యవస్థీకరణతో ఆ స్కూల్ను మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్పు చేశారు. అందులో 6,7,8 తరగతులకు చెందిన 183 మంది విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు మ్యాపింగ్ చేశారు. మ్యాపింగ్ చేసిన స్కూల్కు వెళ్లకుండా పాత పాఠశాలలోనే తరగతులకు విద్యార్థులు హాజరవుతున్నారు. పుస్తకాలు ఇవ్వకపోవడంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా పెట్టకపోవడంతో విద్యార్థులు శుక్రవారం డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. -
మండలాల వారీగా సమస్యలు ఇవీ..
● మండల కేంద్రమైన వెల్దుర్తి ప్రజలను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో రూ.3.5 కోట్లు ఖర్చు చేసి కృష్ణగిరి రిజర్వాయర్ ద్వారా రోజుకు 9 లక్షల లీటర్ల నీటిని మూడు సంపుల ద్వారా వెల్దుర్తికి నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ గురించి పట్టించుకోకపోవడంతో చుక్క నీరు రావడం లేదు. అలాగే గత ప్రభుత్వంలో వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట, గోవర్ధనగిరి గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు అయ్యాయి. సొంత భవనాలు లేకపోవడంతో వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత భవనాలను నిర్మిస్తే దాదాపు 39 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందే అవకాశాలు ఉంటాయి. ● కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలో 40 వేల ఎకరాలు ఎల్లెల్సీ ఆయకట్టు ఉన్నా, ప్రస్తుతం 400 ఎకరాలకు కూడా నీరందని పరిస్థితి నెలకొనింది. అలాగే కోడుమూరు నుంచి పులకుర్తి, కల్లపరి మీదుగా సీ బెళగల్ వరకు నడుస్తున్న ఆర్టీసీ బస్సు రద్దు కావడంతో ప్రజలు, ద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ● గాజులదిన్నె డ్యాం పక్కనే ఉన్నా మండల కేంద్రమైన గోనెగండ్లను తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. తుంగభద్ర కెనాల్లో నీటిని ఎస్ఎస్ ట్యాంకకు లిఫ్ట్ చేసి కుళాయిల ద్వారా నీటిని అందించాల్సి ఉంది. అయితే కెనాల్లో నీరు తగ్గిపోవడంతో రోజుకు 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే నీటిని సరఫరా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ● పెద్దకడుబూరు మండలంలోని బసలదొడ్డి, గవిగట్టు, పీకలబెట్ట, కంబదహాల్ గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనింది. పులికనుమ రిజర్వాయర్ నుంచి నీరు సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు బోర్లపైనే అధారపడి ఇబ్బందులు పడుతున్నారు. నెదర్ల్యాండ్ స్కీం ఉన్నా కోసిగి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కూడా తాగునీరు అందని పరిస్థితి నెల కొనింది. ఈ స్కీం నుంచి 16 గ్రామాలకు నీరు అందించాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగైదు గ్రా మాలకు మించి నీరు అందని పరిస్థితి నెలకొంది. ● మద్దికెర మండలం బరుజుల గ్రామ ప్రజలకు తాగునీరు అందడం లేదు. గ్రామంలోని బోర్లే వీరికి దిక్కవుతున్నాయి. తాగునీటిని 10 కిలోమీటర్ల దూరంలోని పత్తికొండ నుంచి తెచ్చుకుంటున్నారు. గుంతకల్ నుంచి పెరవలి మీదుగా ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు. -
నేడు, రేపు పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు కౌన్సెలింగ్
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శి ( గ్రేడ్ – 5 ), డిజిటల్ అసిస్టెంట్ ( గ్రేడ్ – 6 ) బదిలీలకు ఈ నెల 28, 29వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ –5 ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే 29వ తేదీన ఉదయం 10 గంటలకు డిజిటల్ అసిస్టెంట్లకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కౌన్సిలింగ్కు హాజరయ్యే వారు తమ కేటగిరీలకు సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకురావాలన్నారు. -
పేద విద్యార్థులకు అందని ఉచిత విద్య
● అడ్మిషన్లకు నిరాకరిస్తున్న ప్రయివేట్ పాఠశాలలు ● బకాయిలు చెల్లించాలని మొండిపట్టు ● విద్యాశాఖ నోటీసులకూ స్పందించని యాజమాన్యాలు ● అడ్మిషన్లకు నేటితో ముగియనున్న గడువు ● డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించిన తల్లిదండ్రులు కర్నూలు సిటీ: కూటమి ప్రభుత్వంలో ఉచిత విద్య అందని ద్రాక్షగా మారింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయి పాఠశాలల కేటాయింపు చేపట్టినా ఇప్పటికీ అడ్మిషన్ల ప్రక్రియ కొలిక్కిరాని పరిస్థితి. పాఠశాలలు ప్రారంభమై ఇరవై రోజులు దాటుతున్నా ఇప్పటికీ తమ పిల్లలకు ప్రయివేట్ పాఠశాలలు అడ్మిషన్ ఇవ్వకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా కలెక్టర్ ఆదేశిస్తున్నా, డీఈఓ చర్చలు సాగిస్తున్నా ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు మెట్టు దిగిరాని పరిస్థితి. అదేమంటే.. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందో, లేదోనని తమకు అనుమానంగా ఉందని చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో శుక్రవారం వందలాది మంది తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కలిసి డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉచిత విద్యపై కొరవడిన చిత్తశుద్ధి కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో పేదింటి పిల్లలు చదువుకునే అవకాశాన్ని 2022–23 నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారు. మూడేళ్లు ఎక్కడ కూడా ఉచిత విద్యకు ఎంపికై న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చదువులు సాఫీగా సాగిపోయాయి. అయితే గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడంతో కోర్టు జీఓ 24 రద్దు చేసింది. అయితే 2024–25 విద్యా సంవత్సరం విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జీఓను కొనసాగిస్తూ తీర్పునిచ్చింది. 2025–26 విద్యా సంవత్సరంలో 12(1)సీ ప్రకారం సరైన విధివిధానాలు లేకుండా సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఫస్ట్, సెకెండ్ జాబితాలు విడుదల చేసి, ఎంపికై న వారి వివరాలను ఆయా స్కూళ్లకు పంపించారు. అయితే మెజార్టీ స్కూళ్ల యాజమాన్యాలు అడ్మిషన్ చేసుకోకుండా తల్లిదండ్రులను తిప్పిపంపుతున్నారు. నోటీసులను లెక్కచేయని యాజమాన్యాలు ఆయా ప్రయివేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కింద సీటు పొందినప్పటికీ అడ్మిషన్ ఇవ్వని పరిస్థితిపై జిల్లా విద్యా శాఖ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేస్తూ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు డీఈఓతో సమావేశమై బకాయిలు చెల్లించకపోతే అడ్మిషన్లు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఆయన సర్దిచెప్పినప్పటికీ అడ్మిషన్లు ఇవ్వని పరిస్థితి. ఇదే సమయంలో రెండో విడత సీట్ల కేటాయింపు జరిగిపోయింది. ఈ విద్యార్థులు కూడా ఆయా పాఠశాలలకు వెళ్లగా అడ్మిషన్కు నిరాకరించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఈఓ కార్యాలయం చుట్టడి ప్రయివేట్ పాఠశాలల తీరుతో విసిగిపోయిన తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలతో కలిసి శుక్రవారం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో డీఈఓ లేకపోవడంతో అక్కడే మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. డీఈఓ వచ్చాక ఆయనను చుట్టుముట్టి అడ్మిషన్ ఇవ్వని ప్రయివేట్ పాఠశాలలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పిల్లలకు అన్యాయం చేయకండిని చేతులెత్తి మొక్కారు. ఈ నేపథ్యంలో డీఈఓ స్పందిస్తూ శనివారం సాయంత్రంలోపు సీట్లు పొందిన విద్యార్థులందరినీ పాఠశాలల్లో చేర్పించుకునేలా చూస్తామన్నారు. లేనిపక్షంలో ఏ కారణంచేత తిరస్కరించారో స్పష్టంగా నివేదిక ఇవ్వాలని ఎంఈఓను ఆదేశించారు. 122 పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు జిల్లాలోని ప్రయివేట్ స్కూళ్లు .. 7691,110 ఉచిత విద్యను అందించేందుకు మొదటి విడతలో దరఖాస్తు చేసుకున్న పాఠశాలలు 384 262 పాఠశాలల్లో అడ్మిషన్కు నిరాకరించిన విద్యార్థుల సంఖ్య 1,179 ఉచిత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 173 స్కూళ్లలో రెండో విడత సీట్లు దక్కించుకున్న విద్యార్థులు 1,056 2,289 -
సీమ రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ
జూపాడుబంగ్లా: రాయలసీమ రైతులపై సీఎం చంద్రబాబు నాయుడు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు, రైతులు విమర్శించారు. పోతిరెడ్డి పాడు నుంచి నీటి విడుదలకు ఆస్కారం ఉన్నా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వెంటనే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలంటూ వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగల భరత్కుమార్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, సర్పంచ్ నాగార్జునరెడ్డి, జిల్లా జాయింట్ సెక్రటరీ కోసిక తిరుమలేశ్వరరెడ్డితో పాటు పలువురు రైతులు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు తోకల కృష్ణారెడ్డి తదితరులు శుక్రవారం పోతిరెడ్డిపాడును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీబాగ్ ఒడంబడిక, బచావత్ తీర్మాన ప్రకారంగా శ్రీశైలం జలాశయంతో 854 అడుగుల నీటిమట్టం చేరితే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా సాగు, తాగునీటిని విడుదలకు అనుమతి ఉన్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. హెడ్రెగ్యులేటర్కు అనుసంధానంగా ఉన్న తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్, కేసీ ఎస్కేప్ కాల్వల కింద 6.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ముందస్తు వర్షాలకు ఖరీఫ్ సీజన్ కింద మొక్కజొన్న, పత్తి, మినుము, కంది, తదితర పంటలను సుమారు లక్ష ఎకరాల మేర రైతులు పంటలను చేసుకున్నారన్నారు. ప్రస్తుతం వర్షాలు లేక పంటలు ఎండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. డ్యాంలో 854 అడుగుల నీటిమట్టం దాటి వారం రోజులైనా నీటిని విడుదల చేయకపోవటంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి రాయలసీమ రైతాంగానికి సాగు, తాగునీటినివ్వకుండా సీఎం చంద్రబాబునాయుడు రైతులను మభ్యపెట్టడం తగదన్నారు. ముందుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిచేయకుండా పోలవరం నుంచి బానకచర్ల వరకు గోదావరి జలాలను తరలిస్తామని పేర్కొనటం సబబుకాదన్నారు. 70 శాతం పూరైన ప్రాజెక్టును గాలికొదిలేసి.. రూ.81వేల కోట్ల నిధులతో గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తామనటం విడ్డూరంగా ఉందన్నారు. ఆందోళనలో వైఎస్సార్సీపీ నాయకులు గోపాల్రెడ్డి, నరేష్రెడ్డి, తరుణ్కుమార్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, నాగశేనారెడ్డి, చిన్నమల్లయ్య, చిన్న ఎర్రన్న, భాస్కర్రెడ్డి, సుధాకర్రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ‘పోతిరెడ్డిపాడు’ నుంచి నీటి విడుదల చేయండి -
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
మంత్రాలయం: కట్టుకున్న భార్యనే ఒక భర్త మద్యం మత్తులో కడతేర్చాడు. నూరేళ్ల బంధాన్ని మధ్యలోనే తెంచుకున్నాడు. మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ హనుమంతును 28 ఏళ్ల క్రితం ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామానికి చెందిన బి.లక్ష్మిదేవి(45) వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని రోజు లుగా హనుమంతు మద్యం తాగుతూ తిరిగేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. అనుమానంతో భార్యను వేధిస్తూ వచ్చాడు. పెద్దలు ఎంతగా నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. శుక్రవారం వేకువ జామున 3.30 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న భార్య పై ఇంట్లోని గుంటక మేడిగుంజతో విచక్షణ రహితంగా దాడికి చేశాడు. తల్లి అరుపులు విన్న కుమారుడు, కుమార్తె అడ్డుకోబోయారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం బొలెరో వాహనంలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. కళ్లెదుటే తల్లి మృతి చెందడంతో కుమారుడు, కుమార్తె బోరున విలపించారు. భార్యను హతమార్చిన హనుమంతు ఊర్లోనే రోకలిబండ పట్టుకుని తిరుగుతూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్ఐ శివాంజల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
జూలై 10న ఎల్లెల్సీకి నీటి విడుదల
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి జూలై 10న ఎల్లెల్సీకి కర్ణాటక కోటా నీటి విడుదలకు కర్ణాటక నీటి సలహా మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. శుక్రవారం బెంగళూరులోని విధానసౌధలో జరిగిన 124వ నీటి సలహా మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1,620 అడుగుల వద్ద 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే ఈ ఏడాది ముందుగానే డ్యాంకు వరదలు రావడం, ఇంకా ఆగస్ట్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో కాలువలకు నీటి విడుదలపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుత నిల్వ ఆధారంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకారంగా ఖరీఫ్కు జూలై 10 నుంచి నవంబర్ 30 వరకు కర్ణాటక దిగువ కాలువకు 650 క్యూసెక్కుల ప్రకారం నీరు విడుదల చేయనున్నారు. ఇక ఆంధ్ర అధికారులు తమ కోటా నీటిలో ఇండెంట్ ఇస్తే అదే రోజు ఇరు రాష్ట్రాల కోటా నీటిని (దాదాపు 1,400 క్యూసెక్కులు) వదలనున్నారు. ఇదిలాఉంటే ఎల్లెల్సీ 155 కి.మీ, 205కి.మీ నుంచి 250 కి.మీ వరకు కాలువలో గత నెలన్నర రోజులుగా ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తి మందకొడిగా సాగుతుండటంతో నీటి విదుదల నాటికి పూర్తవుతాయో లేదోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అదేవిధంగా టీబీ డ్యాం 33 కొత్త క్రస్టు గేట్లను అమర్చే పనులు డ్యాంకు వచ్చే వరదను బట్టి డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా టీబీ డ్యాం నుంచి వివిధ కాలువలతో పాటు దిగువ కాలువ(ఎల్లెల్సీ) కింద కేవలం ఖరీఫ్కు మాత్రమే సాగుకు నీరిచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బెంగళూరులో జరిగిన ఐసీసీలో నిర్ణయం -
30న వక్ఫ్ బచావో బహిరంగ సభ
కర్నూలు (టౌన్): నగరంలోని ఎస్టీబీసీ కళశాల క్రీడా మైదానంలో ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ‘వక్ఫ్ బచావో– దస్తూర్ బచావో’ పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం సాయంత్రం ఎస్వీ కాంప్లెక్స్లో ముస్లిం నేతలతో కలిసి ఎస్వీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి కోసం వక్ఫ్ బోర్డు పనిచేస్తోందన్నారు. ఈ బోర్డు కింద లక్షలాది ఎకరాల భూములు ఉన్నాయన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తాహుఫజ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హమీద్, వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నగర అద్యక్షులు పత్తా బాషా, అవాజ్ కమిటీ నగర అధ్యక్షుడు షరీఫ్, అమానుల్లా మౌలానా సాహెబ్, సౌఖత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్లను ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
ప్రైవేటు దిగిరాక.. అడ్మిషన్లు అందక!
● ఓర్వకల్లు మండలం నన్నూరుకు చెందిన మద్దయ్యకు ఇద్దరు మనవళ్లు. ఒకరు నన్నూరులోనే చదువుతున్నారు. మరో మనవుడు కురువ అనిల్ కుమార్ 1వ తరగతికి ఉచిత విద్య కోసం దరఖాస్తు చేశారు. వీరికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్(కేజేఎఫ్ సిటీ, చిన్నటేకూరు)లో సీటు కేటాయించారు. ఈ స్కూల్ గతంలో నన్నూరు పరిధిలో ఉంది. ప్రస్తుతం కల్లూరు మండలం చిన్నటేకూరుకు మార్చారు. యాజమాన్యం ఈ స్కూల్ చిరునామాను మార్చకపోవడంతో ఆన్లైన్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను ఎంపిక చేసుకున్నారు. అడ్మిషన్ కోసం స్కూల్కు వెళితే మీరు అర్హులు కాదని వెనక్కి పంపించారు. కల్లూరు ఎంఈఓ ఆ స్కూల్కి నోటీసులు ఇచ్చి చేర్చుకోవాలని సూచించారు. అయినప్పటికీ యాజమాన్యం పెడచెవిన పెడుతుండటంతో తల్లిదండ్రులు వారం రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ● కర్నూలు నగరంలోని బంగారుపేటకి చెందిన సి.శిరీషా, రామాంజనేయులు దంపతులకు ఇద్దరు సంతా నం. చిన్న కూతురు సి.యామినికి ఉచిత విద్య కింద దరఖాస్తు చేయగా కొత్తపేటలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో సీటు వచ్చింది. అయితే అడ్మిషన్ కోసం వెళితే ప్రభుత్వం మాకు డబ్బులు ఇస్తుందనే నమ్మకం లేదని, ఫీజులు ప్రభుత్వం ఇవ్వకపోతే మేమే చెల్లిస్తామని రాతపూర్వకంగా ఆ స్కూల్ యాజమాన్యం రాయించుకుంది. అయినప్పటికీ సీటు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. ● కల్లూరు మండలం కస్తూరి నగర్లో నివాసం ఉంటున్న బండారి శివాజీకి ఒక కూతురు సంతానం. చిరుద్యోగం చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యాహక్కు చట్టం కింద ఉచితంగా దరఖాస్తు చేయగా అబ్బాస్ నగర్లోని రవీంద్ర స్కూల్లో సీటు వచ్చింది. అయితే మీరు నివాసం ఉంటున్న కాలనీ నుంచి మా స్కూల్కి రావాలంటే హైవేరోడ్డు ఉందని, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అడ్మిషన్కు నిరాకరించారు. మొదటి, రెండో విడతలోనూ సీటు కేటాయించిన యాజమాన్యాం అడ్మిషన్ ఇవ్వడం లేదని ఆయన వాపోతున్నాడు. ● ...జిల్లాలో వందలాది మంది తల్లిదండ్రులు పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ఉచిత విద్యకు ఎంపికై నా ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ ఇవ్వకుండా చుక్కలు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
శ్రావణంలో శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
మంత్రాలయం: సద్గురు శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు శ్రావణ మాసంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం 354వ సప్తరాత్రోత్సవాలకు సంబంధించి ఆహ్వాన కార్డుకు ప్రత్యేక పూజలు చేపట్టారు. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, ధార్మిక మేనేజర్ శ్రీపతి ఆచార్ నేతృత్వంలో రాఘవేంద్రులు, వాదీంద్రతీర్థుల మూల బృందావనాలతో ఉంచి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ప్రముఖులకు ఈ ఆహ్వాన కార్డుల ద్వారా ఆహ్వానం పలుకనున్నారు. కారు అద్దాలు పగులగొట్టి .. ● రూ. 7 లక్షలు అపహరణ ఆళ్లగడ్డ: సినీ ఫక్కీలో కారు అద్దాలు పగలగొట్టి పట్టపగలే రూ. 7 లక్షలు చోరీ చేసిన ఘటన ఆళ్లగడ్డలో శుక్రవారం జరిగింది. అహోబిలం గ్రామానికి చెందిన నరేష్ పట్టణంలోని ఓ బ్యాంకులో రూ. 7 లక్షలు డ్రా చేసుకుని నగదు బ్యాగ్ను కారులో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి విశ్వశాంతి స్కూల్లో చదువుతున్న పిల్లల దగ్గరకు వెళ్లాడు. స్కూల్ ఎదుట కారు ఆపి తరగతి గదిలోని పిల్లల దగ్గరకు వెళ్లాడు. అంతలోనే కారు వెంట బైక్పై ఫాలో అవుతూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే కారు అద్దాలు పగులగొట్టి రూ. 7 లక్షలు ఉన్న బ్యాగును దొంగిలించి పారిపోయారు. గమనించిన వ్యక్తులు కేకలు వేస్తూ వెంటపడగా నిమిషాల్లోనే కనిపించకుండా పారిపోయారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేత అనుమానాస్పద మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: వైఎస్సార్సీపీ నేత మునగాల రామసుబ్బారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. మహానంది మండలం మసీదుపురం గ్రామ శివారులోని బావిలో రామసుబ్బారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఆయన తల, శరీరంపై దెబ్బలను పోలీసులు గుర్తించారు. ఇది ముమ్మాటికీ హత్యేనని మృతుని కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ నేత వంటెద్దు ప్రవీణ్కుమార్ రెడ్డి హత్య చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.రామసుబ్బారెడ్డి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగం వల్లే శ్రీశైలం నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయని శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుండడమే ఈహత్యలకు కారణమన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి హత్యకు కారకులను శిక్షించాలని శిల్పా డిమాండ్ చేశారు. మహానంది పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
పోక్సో కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
కర్నూలు: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఇ.రాజేంద్రబాబు గురువారం తీర్పు చెప్పారు. 2020 అక్టోబర్ 22న బాధిత బాలిక (4) ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన గుడిసె రుద్రేశ్ (22) అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు బనగానపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ నరసింహారెడ్డి కేసు విచారించి నిందితుడిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు. జరిమానా మొత్తాన్ని బాధిత బాలికకు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో ఆదేశించారు. -
ఐజీ గుర్తింపుతో అంతర్జాతీయ మార్కెటింగ్
ఎమ్మిగనూరుటౌన్: చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న టవళ్లు, బెడ్షీట్లకు భౌగోళిక గుర్తింపు(ఐజీ) వస్తే అంతర్జాతీయంగా మార్కెటింగ్ పెరగుతుందని రెసెల్యూట్ బి2బి సంస్థ లీగల్ కౌన్సిల్ ప్రతినిధి శ్రీవత్సవ తెలిపారు. ఎమ్మిగనూరులోని వైడబ్లూసీఎస్ కార్యాలయంలో చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన బర్డ్ ఐ టవళ్లు, జిందగీ బెడ్షీట్లను చేనేత జౌళిశాఖ డీఓ నరసింహారెడ్డి, స్థానిక సంఘ కార్యదర్శి, ఏడీ అప్పాజిలతో కలిసి ఆయన పరిశీలించారు. చేనేత కార్మికులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పద్మశ్రీ మాచాని సోమప్ప ప్రారంభించిన సొసైటీ ద్వారా ఉత్పత్తి అయిన టవళ్లు, బెడ్షీట్లకు భౌగోళిక గుర్తింపునకు తాము పరిశీలించామన్నారు. సేకరించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని అక్కడ వారు పరిశీలించిన తరువాత ఐజీ గుర్తింపు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఐజీ గుర్తింపు వస్తే ఎమ్మిగనూరులో మాత్రమే ఆయా ఉత్పత్తులు చేయాల్సి ఉంటుందన్నారు. తద్వార ఉత్పత్తుల విక్రయాల మార్కెటింగ్ పెరగడంతో పాటు ఆయా ఉత్పత్తుల ధరలు కూడా 15 నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక్కడి టవళ్లు, బెడ్షీట్లకు జీఐ గుర్తింపు వస్తే ఆయా ఉత్పత్తులను వేరొకరు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉండబోదన్నారు. ఎమ్మిగనూరు చేనేతకు మంచి పేరు ఎమ్మిగనూరు ప్రాంతంలో పత్తి సాగు ఎక్కువగా ఉండటంతో పద్మశ్రీ మాచాని సోమప్ప 1938లో వైడబ్ల్యూసీఎస్ను ప్రారంభించారని సొసైటీ కార్యదర్శి, ఏడీ అప్పాజి తెలిపారు. ఎన్హెచ్డీసీతో నాణ్యమైన ముడిసరుకు తీసుకొని ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మిగనూరు చేనేత ఉత్పత్తులకు మంచి పేరుందన్నారు. సొసైటీ డిజైనర్ రవికుమార్, వైడబ్ల్యూసీఎస్ సిబ్బంది, చేనేత కార్మికులు పాల్గొన్నారు. టవళ్లు, బెడ్షీట్లను పరిశీలించిన రెసెల్యూట్ బి2బి సంస్థ ప్రతినిధి -
కమిటేషన్ రికవరీ సుప్రీం తీర్పునకు వ్యతిరేకం
కర్నూలు(అగ్రికల్చర్): విశ్రాంత ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు జిల్లా కలెక్టర్ రంజిత్బాషాను కోరారు. గురువారం కలెక్టర్ను ఆయన చాంబర్లో కలసి వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు తీసుకున్న కమిటేషన్ రికవరీ 11 సంవత్సరాల 3 నెలల్లో పూర్తవుతుందన్నారు. అందువల్ల ఇక రికవరీ చేయరాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ఇందుకు అనుగుణంగా ఆరు నెలల పాటు కమిటేషన్ రికవరీ నిలిపేశారన్నారు. అయితే గత నెల నుంచి మళ్లీ రికవరీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒక్కో విశ్రాంత ఉద్యోగి పెన్షన్లో రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు ప్రభుత్వం మళ్లీ రికవరీ మొదలు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని.. 11 ఏళ్ల 3 నెలలు కమిటేషన్ రికవరీ చేసి ఉంటే అలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో సంఘం జనరల్ సెక్రటరీ జయచంద్రారెడ్డి, ఇతర నాయకులు గోవిందరాజులు, రామచంద్రరావు, జేసీ నాథ్, ఇనయతుల్లా, విజయకుమార్రెడ్డి, సూర్యనారాయణ, పుల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
శ్రీమఠంలో భక్తుల రద్దీ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి గురువారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో మంత్రాలయ క్షేత్రం కళకళలాడింది. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, తర్వాత రాఘవేంద్రుల మూల బృందావన దర్శనం చేసుకున్నారు. సుమారు రెండున్నర గంటల సమయం పట్టింది. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లతో భక్తుల రద్దీ కనిపించింది. పాఠశాలకు వచ్చి.. విద్యార్థులతో మాట్లాడి ● కె.సింగవరంలో తెలంగాణ విజిలెన్స్ డీజీ సి.బెళగల్: తెలంగాణ రాష్ట విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన కె.సింగవరానికి గురువారం వచ్చారు. గ్రామంలోని యూపీ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ కావడంతో అక్కడికి చేరుకుని విద్యార్థులతో గడిపారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం రాధ, సర్పంచ్ రవీంద్రరెడ్డి, ఎంఈఓ ఆదామ్బాషా, స్కూల్ టీచర్లు, విద్యార్థులతో కలసి ఆయన పాఠశాల ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట విజిలెన్స్ డీజీని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద నాగేశ్వరెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మన్న, క్రిష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఏడీఏల బదిలీలు కొలిక్కి కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో ఎట్టకేలకు ఏడీఏల బదిలీలు కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ డిల్లీరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రానికి డోన్ ఏడీఏ అశోక్వర్ధన్రెడ్డి, శైలకుమారీలను నియమించారు. తాజాగా అశోక్వర్ధన్రెడ్డిని భూసార పరీక్ష కేంద్రం ఏడీఏగా నియమించారు. శైలకుమారికి పోస్టింగ్ ఇవ్వలేదు. మొదట పలమనేరులో ఏడీఏగా పనిచేస్తున్న అన్నపూర్ణను ఎమ్మిగనూరు సీడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏడీఏగా నియమించారు. తాజా ఉత్తర్వుల్లో ఈమె పేరు లేదు. కర్నూలు డీఆర్సీలో ఏడీఏగా పనిచేస్తున్న గిరీష్ ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. అయినప్పటికీ నందికొట్కూరు ఏడీఏగా బదిలీ చేశారు. అయితే ఈ పోస్టులో ఎవ్వరినీ నియమించలేదు. ఈ పోస్టు కోసం అన్నపూర్ణ కూటమి పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఏడీఏల బదిలీల్లో ఎలాంటి మార్పులు లేవు. ఆషాఢమాసం ఎఫెక్ట్ మహానంది: ఆషాఢమాసం ప్రారంభం కావడంతో మహానందికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేసవిసెలవులతో పాటు శుభముహూర్తాలు ఉన్నందున గత నెలరోజులుగా నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడిన మహానందీశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం భక్తులు లేక వెలవెలబోతూ కనిపించింది. -
ఇదేమి ‘తీరు’వా?
బకాయిలు వసూలు చేయమన్నాం కాలువల ద్వారా సాగునీటిని పంటల సాగుకు వాడుకుంటున్న రైతుల నుంచి బకాయి పడ్డ పన్నులను వసూలు చేయాలని వీఆర్వోలకు తెలిపాం. అయితే మైక్ల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. అన్నదాత సుఖీభవ పథకాలు వంటిపై ప్రచారం చేస్తున్న విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సాగునీరు సక్రమంగా రాకున్నా పన్నులు ఎలా చెల్లించాలని కొందరు రైతులు తన దృష్టికి తెచ్చారు. – ఎజాజ్ అహ్మద్, చిప్పగిరి తహసీల్దార్ ఆలూరు: ‘‘ఆయకట్టు భూములకు సాగునీరు అంద కున్నా మాకు సంబంధం లేదు. మీరు పెండింగ్లో ఉన్న నీటి తీరువా బకాయిలు చెల్లించాలి. ఈకేవైసీ చేసుకోవాలి. లేదంటే అన్నదాత సుఖీభవ పథకం అమలు కాదు’’ అంటూ రైతులపై వీఆర్వోలు ఒత్తిళ్లు తెస్తున్నారు. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువ కింద పొలాలు ఉన్న రైతులు నీటితీరువా వెంటనే చెల్లించాలని మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. హాలహర్వి మండలం ఎం.కె.పల్లి, శ్రీధర్హాళ్, బాపురం, కొక్కెరచేడు, చింతకుంట, చిప్పగిరి మండలం బెల్డోణ, రామదుర్గం, ఖాజీపురం, తిమ్మాపురం, ఆలూరు మండలం హత్తిబెళగళ్ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇంగదహాళ్, ఏ.గోనెహాళ్, వందవాగిలి, గజ్జహళ్లి, హొళగుంద, కోకిలతోట గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి పెండింగ్ బకాయిలను చెల్లించాలంటున్నారు. వీఆర్వోలతోపాటు టీడీపీ నాయకులు కూడా వెళ్తున్నారు. రైతులపై ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో తహసీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ఎంకేపల్లి గ్రామంలో మైక్ ద్వారా నీటి తీరువా చెల్లించాలని ప్రచారం చేయడం బహిర్గతమైంది. ఏడాదికి ఎకరాకు రూ. 120 ఆలూరు నియోజకవర్గంలో చిప్పగిరి మండలం కమ్మకొట్టాల గ్రామాల నుంచి హెచ్చెల్సీ ప్రారంభమై ఆలూరు మండలం హత్తిబెళగళ్ గ్రామం వరకు సాగుతుంది. ఈకాలువ పరిధిలో 19 డీపీల కింద 14,555 ఎకరాలకు కాను 250 క్యూసెక్కుల సాగునీరు విడుదల కావాల్సి ఉంది. అయితే కాలువ పటిష్టతను కోల్పోవడంతో సాగనీరు అంతా వృథా అవుతోంది. కాలువ కింద కేవలం 4వేల నుంచి 6 వేల ఎకరాలకు సాగునీరు మించి అందటంలేని రైతులు చెబుతున్నారు. నీరు అందినా, అందకున్నా ఏడాది ఎకరాకు రూ.120 ప్రకారం చెల్లించాలని కొందరు వీఆర్వోలు టీడీపీ నాయకులతో కలసి రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎల్లెల్సీ కింద ఆలూరు నియోజకవర్గంలో చింతకుంట, బాపురం, హొళగుంద మూడు సెక్షన్లు ఉన్నాయి. చివరి ఆయకట్టు రైతులకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. అయినా నీటి పన్ను చెల్లించాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. సాగునీరు అందకున్నా పన్ను చెల్లించాలా? ఆందోళన చెందుతున్న రైతులు -
డ్రగ్స్తో జీవితాలను నాశనం చేసుకోవద్దు
కర్నూలు(సెంట్రల్): డ్రగ్స్ బారిన పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ పి.రంజిత్బాషా అన్నారు. గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిషేధం విధించినట్లు చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమరవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతముందు రాజ్ విహార్నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. హోర్డింగ్లు ఏర్పాటు చేస్తాం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ఫలితాలపై కళాశాలలు, పాఠశాలలు, మూనివర్సిటీ సమీపంలో హోర్డింగ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో ఈగల్ టీంలను విద్యార్థులతో ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్ అలవాటు పడకుండా వాటితో కలిగే అనర్థాలపై తల్లిదండ్రులు వివరించాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణాపై పటిష్ట నిఘా ఉన్నట్లు డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. ఇంట్లో ఒక్కరూ డ్రగ్స్ తీసుకుంటే ఆ కుటుంబం మొత్తం నాశనం అవుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి అన్నారు. కళాశాలలు, పాఠశాలల్లో ఎవరైనా మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్పాటిల్ సూచించారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా వేసి ఉంచాలన్నారు. అనంతర డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కేర్ కమిటీ సభ్యుడు రాజేంద్రప్రసాద్, స్ఫూర్తి రిహాబిలిటేషన్ సంస్థ ప్రతినిధి శివశంకర్, సైకియాట్రిస్టు డాక్టర్ చైతన్య కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా -
రాజ్యాంగంపై అవగాహన ఉండాలి
కర్నూలు(హాస్పిటల్): యువత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ కె.వేణుగోపాల్ సూచించారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ, సాంస్కృతిక పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ‘సంవిధాన్ హత్య దివస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేది వరకు 21 నెలల పాటు కొనసాగిందన్నారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధి అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సంవిధాన్ హత్య దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసిందని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ఎన్నో బాధలు అనుభవించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో, రాజ్యాంగ దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ నివాళులర్పించేందుకు, ప్రజలకు భారత రాజ్యాంగ విశిష్టత తెలియపరిచే అవగాహన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖ అధికారి విజయ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాశాంతి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీతో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ తన ప్రాబల్యాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రధాన వక్త రమేష్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎమర్జెన్సీ విధించారని, అందులో రెండుసార్లు యుద్ధాల కారణంగా విధిస్తే 1975 జూన్ 25న ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ చరిత్ర పుటలలో నిలిచిపోయిందన్నారు. -
పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన రైలు
● పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం ఆదోని సెంట్రల్: ఆదోనిలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని మదిరె గ్రామానికి చెందిన విశ్వనాథ్, సావిత్రి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు నితిన్ బిట్స్ కళాశాలలో పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం కళాశాలకు బయలుదేరాడు. పట్టణంలోని నల్లగేటు వద్ద కి.మీ. నంబర్ 495/33–31 వద్ద ట్రాకు దాటుతుండగా రైలు ఢీకొని తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ట్రాఫిక్ పీఎస్లకు అత్యాధునిక ద్విచక్ర వాహనాలు
కర్నూలు: ట్రాఫిక్ నియంత్రణకు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 22 ద్విచక్ర వాహనాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు ఈ వాహనాలను కేటాయించనున్నారు. నాలుగు చక్రాల వాహనాల్లో వెళ్లలేని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పుడు ఈ ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్దీకరించే ఉద్దేశంతో పోలీసు చీఫ్ కార్యాలయం నుంచి ఈ వాహనాలను జిల్లాకు కేటాయించారని ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ సదరన్ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు బాబుప్రసాద్, భాస్కర్ రావు, ప్రసాద్, సీఐలు తేజమూర్తి, మన్సూరుద్దీన్, నాగరాజ రావు, రామయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ హెచ్డబ్ల్యూఓస్ అసోసియేషన్ ఎన్నిక
కర్నూలు(అర్బన్): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా పెద్దకడుబూరు వసతి గృహ సంక్షేమాధికారి పాలెగార్ సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శిగా పత్తికొండ కళాశాల బాలుర వసతి గృహం సంక్షేమాధికారి పి.శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎస్.ప్రమీల, కోశాధికారిగా కనకలత, ఉపాధ్యక్షులుగా సీ.శంకర్కుమార్, రాజశేఖర్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్.గిరిజాదేవి, సంయుక్త కార్యదర్శులుగా నరసప్ప, హారతీదేవి, ఎల్లమ్మ, కార్యవర్గ సభ్యులుగా గోపాల్, బసవరాజు, ప్రసన్నబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా వసతి గృహ సంక్షేమాధికారులందరూ ఐకమత్యంగా విధులు నిర్వహించాలన్నారు. నూతన కార్యవర్గాన్ని సహచర వసతి గృహ సంక్షేమాధికారులు అభినందించారు. -
టీబీ నివారణకు పటిష్ట చర్యలు
కర్నూలు (సెంట్రల్): జిల్లాలో టీబీ (క్షయ) నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్కు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వివరించారు. బుధవారం సాయంత్రం ఆమె ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీబీ ముక్త్ భారత్పై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో టీబీ నివారణ చర్యలను కలెక్టర్ ఆమెకు వివరించారు. 2,500 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్స్, మందులను అందజేస్తున్నట్లు వివరించారు. -
మల్లన్న సేవలో మంచు విష్ణు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా, మల్లికార్జునస్వామి వార్లను సినీ హీరో మంచు విష్ణు బుధవారం దర్శించుకున్నారు. రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంచు విష్ణు మల్లికార్జున స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడంతో 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తయ్యిందని చెప్పారు. తాను నటించిన కన్నప్ప సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుందని, ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు. -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలకు, అలాగే 70 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీలా వెంకట శేషాద్రిలు తెలిపారు. నంద్యాలలోని జిల్లా ప్రత్యేక ఉపకారాగారాన్ని బుధవారం వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలతో సమావేశం ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్తో ఉచిత న్యాయం పొందవచ్చన్నారు. ఆన్లైన్ 15100 ద్వారా సేవలు అభ్యర్థించవచ్చని తెలిపారు. జైల్ సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, న్యాయవాది నాయక్, లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు. -
రాకపోక.. నరకయాతన
ప్రభుత్వం స్పందించాలి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం స్పందించాలి. పక్కన కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి లేదు. అక్కడ వెంటనే స్పందించి మరమ్మతులు చేపడుతారు. ఇక్కడ చానా కష్టంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలి. –మహదేవి దారుణ పరిస్థితి మా పొలాలు కుంబళనూరు ప్రాంతంలో ఉన్నాయి. నాది గొతులదొడ్డి గ్రామం. పొలం పనికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతటి దారుణ పరిస్థితి ఎప్పుడూ లేదు. –వెంకటేష్ కౌతాళం: కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత పల్లెలకు కర్ణాటక రాష్ట్రంలోని గ్రామాలతో సంబంధాలు తెగిపోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కౌతాళం మండల పరిధిలోని కుంబళనూరు–గోతులదొడ్డి గ్రామాల మధ్య ఉన్న వాగు వద్ద ఉన్న వంతెన ఏప్రిల్ నెలలో కూలిపోయినా ఇప్పటి వరకు శాశ్వత మరమ్మతులు చేయలేదు. తాత్కాలికంగా చేసిన పనులు ఈనెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో నదిచాగి, కుంబళనూరు క్యాంపు–1, క్యాంపు–2, కుంబళనూరు, మేళిగనూరు గ్రామాలతో పాటు కర్ణాటకలోని వివిధ గ్రామాల నుంచి హాల్వి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ సర్వీసులు కూడా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల నుంచే వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాల్వి నుంచి కర్ణాటకలోని శిరుగుప్పకు వెళ్లేందుకు కూడా సౌకర్యాలు నిలిచిపోయాయి. వంతెన దెబ్బతిని రెండు నెలలు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. గొతులదొడ్డి, హాల్వి గ్రామాల రైతుల పొలాలకు కుంబళనూరు వైపు, కుంబళనూరు, క్యాంపు వాసుల పొలాలు హాల్వి, గొతులదొడ్డి వైపు ఉన్నాయి. బుధవారం అమావాస్య కావడంతో కర్ణాటకలోని మాన్వి, శిరుగుప్ప, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్ణాటకకు చెందిన ఒకరు రాత్రి కల్వర్టు గుర్తించక ద్విచక్ర వాహనంలో వచ్చి ఇక్కడ కింద పడి మృతి చెందాడు.మరమ్మతుల కోసం రూ.40 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంబిస్తాం. తాత్కలిక పనులు చేయడానికి ఎవరూ కూడ ముందుకు రావడం లేదు. –ఆర్అండ్బీ–ఏఈ సాయిసురేష్ ప్రతిపాదనలు పంపాం కూలిన వంతెన మరమ్మతులు చేయని రాష్ట్ర ప్రభుత్వం -
వైఎస్సార్సీపీ పోరాటంతోనే జీఆర్పీ టెండర్లు
ఎమ్మిగనూరుటౌన్: వైఎస్సార్సీపీ పోరాటంతోనే ప్రభుత్వం గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం (జీఆర్పీ) పనులకు టెండర్లు పిలిచినట్లు వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం లక్ష్మినారాయణరెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి సాగునీరు అందివ్వాలని కోరుతూ ఈ నెల 19న స్థానిక జీఆర్పీ కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతులు ముట్టడించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. ప్రాజెక్ట్ కింద ఎమ్మిగనూరు నియోజకవర్గంతో పాటు మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని ఎత్తిపోతల పథకం కింద 7 పనులను మొదలెట్టేందుకు ఈ నెల 21న టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో చిలకలడోన ఎత్తిపోతల పథకం–1కు రూ.16,75,250, రెండవ పథకానికి రూ.16,60,270, సోగనూరు పథకం –1కు రూ.16,68,360, రెండవ దానికి రూ.16,66,938, పూలచింత పథకం కింద ఒక పనికి రూ.16,68,360, రెండవ దానికి రూ.16,60,270 కేటాయించడం వివరించారు. జూలై 1న టెండర్లను ఓపెన్ చేసే అవకాశం ఉందని, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 6 నెలల్లో పనులను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలి గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని గడ్డం లక్ష్మినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పట్టణంలో జీఆర్పీ ఆయకట్టు రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు ముందుగా ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లకు 15 రోజుల్లో మరమ్మతులు చేయాలన్నారు. మిగతా జీఆర్పీ పనులను అధికారులు వెంటనే పూర్తి చేయించి సాగునీరందించాలని కోరారు. సర్పంచ్లు నరసింహులు, కోటేశ్వరరావు, ప్రకాష్రెడ్డి, పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు చాంద్బాషా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శాంతిరాజు, చుక్కామల్లేష్, వెంకటేష్, గోవిందు, ప్రభాకర్, సోమన్న, శివ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగ ‘మట్టెద్దు’ల పండుగ
హొళగుంద: కర్ణాటక సంప్రదాయాలను పుణికి పుచ్చుకున్న హొళగుంద మండల ప్రజలు బుధ వారం మట్టెద్దుల పండుగను భక్థిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇక్కడి ప్రజలు ఏటా ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమవాస్య రోజున మట్టితో ఎద్దుల ప్రతిమలను తయారుచేసి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భా గంగా బుధవారం ఆయా గ్రామాల ప్రజలు మట్టి ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. చిన్నహ్యాట గ్రామంలో సాయంత్రం కోలాటం, నృత్యాలతో మట్టి ఎద్దుల ఊరేగించి వైభవంగా నిమజ్జనం చేశారు. -
సచివాలయం ఖాళీ !
ఖాళీగా దర్శనమిస్తున్న మద్దికెర గ్రామ సచివాలయం – 1 మద్దికెర: కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే ప్రజలకు ప్రభుత్వ సేవలందించాలనే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించింది. కార్యకలాపాలు సాఫీగా సాగాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో స్థానిక ఒకటవ సచివాలయంలోని ఫర్నిచర్ ఇతర కార్యాలయానికి తరలించడంతో ఖాళీగా ఇలా దర్శనమిస్తోంది. కూర్చోవడానికి కుర్చీలు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఎవరూ లేరని వెనుదిరిగిపోతున్నారు. ఇదే సచివాలయంలో ఆధార్ సేవల కేంద్రం నిర్వహిస్తుండడంతో వచ్చిన వారు అవస్థలు పడుతున్నారు. ఒక కార్యాలయంలోని ఫర్నిచర్ మరో కార్యాలయానికి ఎలా తరలిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. -
ఆగకుండా.. ఆటంకం లేకుండా..!
● ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కార్యాచరణ ● ప్రజల చేతిలో కర్నూలు ట్రాఫిక్ వాట్సాప్ నంబర్ ● త్వరలో ప్రారంభించేందుకు పోలీసుల కసరత్తు కర్నూలు: ట్రాఫిక్.. కర్నూలు నగరంలో ఇదో పరిష్కారం దొరకని సమస్య. సగటు జీవి సహనానికి పరీక్ష.. దీని పరిష్కారానికి కొన్నేళ్లుగా పోలీసు అధికారులు చేయని ప్రయత్నం.. ప్రయోగమంటూ లేదు. ప్రజలు, వాహనదారులే కాదు.. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఎదుర్కొంటున్న చికాకులు అన్నీ ఇన్నీ కావు. మళ్లీ ఇన్ని రోజులకు మరో కొత్త ఆలోచనతో పోలీసులు ముందుకొచ్చారు. ప్రజల చేతిలో కర్నూలు టాఫిక్ పేరుతో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. అవస్థలు... కర్నూలు మున్సిపాలిటీ స్థాయి నుంచి నగరపాలక సంస్థగా, కుడాగా రూపాంతరం చెందినప్పటికీ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాలేదు. ఏడాదికేడాది వాహనాల సంఖ్య పెరగడం, రోడ్ల విస్తరణ లేకపోవడం, ఉన్నవి సైతం ఆక్రమణ వల్ల కుచించుకుపోవడం తదితర కారణాలతో నానాటికీ ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. దీనికి తోడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఎక్కడైనా వాహనాలు జామ్ అయినా క్రమబద్దీకరించేందుకు గంటలకొద్దీ సమయం పడుతోంది. వాహనాల నియంత్రణ, ఓవర్ లోడ్, రాంగ్ రూట్ ప్రయాణం, ఇతర ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని పోలీసులు ఆలోచించారు. ప్రజల చేతిలో కర్నూలు ట్రాఫిక్ వాట్సప్ నంబర్ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలో ట్రాఫిక్ వాట్సప్ నంబర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. ఫొటోలు తీసి గ్రూప్లో పోస్ట్ చేయాలి కర్నూలు నగరం నలుదిక్కులా ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తినా, వాహనాలు ఆగిపోయినా స్థానికులు ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దుతారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపటం, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం, సీటు బెల్టు లేకుండా కారు నడపటం వంటి ఉల్లంఘనలపై ఫొటోలు తీసి వాట్సప్లో పోస్ట్ చేయవచ్చు. అలాగే వాహనాల చిత్రాలు, వీడియోలు కూడా తీసి షేర్ చేయవచ్చు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫొటోలు, వీడియోల రూపంలో వాట్సప్కు షేర్ చేస్తే పోలీసులు వాటిపై విచారణ జరిపి నిర్ధారించుకుని వారికి జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. నగర సమాచారం కర్నూలు నగర జనాభా సుమారు ఆరు లక్షలు ట్రాఫిక్ స్టేషన్కు అవసరమైన సిబ్బంది 100 మంది ప్రస్తుతమున్న సిబ్బంది 60 మంది నగరంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు – 36 ట్రాఫిక్ సిగ్నల్స్ – 13 ద్విచక్ర వాహనాలు సుమారు 2 లక్షలు ఆటోలు 25 వేలకు పైగా కార్లు 50 వేలకు పైగా బస్సులు – 2 వేలు లారీలు, జీపులు – 2 లక్షలు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలు, జిల్లాల నుంచి వచ్చి వెళ్లే అన్ని రకాల వాహనాలు సుమారు 2 లక్షలు గతంలో ట్రాఫిక్ నియంత్రణ పేరుతో వెబ్సైట్ కర్నూలు నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం గతంలో ట్రాఫిక్ మిత్ర పేరుతో వెబ్సైట్ను ప్రారంభించారు. అయితే అప్పటి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బదిలీపై వెళ్లడంతో ట్రాఫిక్ మిత్ర కార్యక్రమం అటకెక్కింది. కర్నూలు నగరంలో సుమారు ఆరు లక్షలకు పైగా జనాభా ఉంది. రోజురోజుకూ కాలనీలు విస్తరిస్తున్నాయి. వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రధాన రహదారుల్లో సుమారు 36 పాయింట్లు ఉన్నాయి. ట్రాఫిక్ స్టేషన్లో ప్రస్తుతం 60 మంది మాత్రమే సేవలుందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు సిబ్బంది కొరత వేధిస్తున్న నేపథ్యంలో పౌరులను భాగస్వాములను చేసేందుకు పోలీస్ వాట్సప్ నంబర్ను అందుబాటులోకి తేనున్నారు. -
డబ్బులెప్పుడు ఇస్తారు సారూ..?
సార్.. మేము రోజూ తిరుగుతున్నాం.. ఆసుపత్రిలో ఇవ్వాల్సిన దానికంటే చార్జీలకే ఎక్కువ ఖర్చయ్యాయి. మాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్. అంటూ ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స పొందిన రోగులు ప్రాధేయపడుతున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స పొందిన రోగులు వైద్య పరీక్షలు, మందుల కోసం పెట్టుకున్న ఖర్చులను డిశ్చార్జ్ అనంతరం అధికారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆసుపత్రిలోని పేయింగ్ బ్లాక్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. డిశ్చార్జ్ అయిన రోగులు సంబంధిత బిల్లులు, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ప్రతులను అక్కడ అందజేస్తే ఖర్చు చేసిన మొత్తంలో కొంత తిరిగి ఇస్తారు. అయితే కొన్ని రోజులుగా ఈ కౌంటర్ తెరవడం మానేశారు. దీంతో ఆ కౌంటర్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ వైద్యసేవ కార్యాలయంలో వారు డబ్బుల కోసం ఆరా తీస్తున్నారు. సార్ మాకు డబ్బులు ఎప్పుడిస్తారని వారిని అడుగుతుంటే మాకు సంబంధం లేదని, ఆసుపత్రి అధికారులను కలవాలని చెప్పి పంపిస్తున్నారు. – కర్నూలు(హాస్పిటల్) -
మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉండాలి
ఆదోని సెంట్రల్: పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ సూచించారు. పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు సరిపడా ఇవ్వడం లేదని ఫిర్యాదులు రావడంతో బుధవారం జిల్లా విద్యాధికారి శామ్యూల్పాల్, మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణతో కలిసి పరిశీలించారు. భోజనం రుచికరంగా ఉంటుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం తగినంత పెడుతున్నారా? తక్కువగా పెడుతున్నారా అని ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూశారు. మధ్యాహ్న భోజన పథకం రికార్డులను పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు తగినంత భోజనం వడ్డించాలన్నారు. రుచి, నాణ్యత లోపిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. డిప్యూటీ ఈఓ వెంకటరమణారెడ్డి, హెచ్ఎం ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు
కర్నూలు(అర్బన్): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తితే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ హెచ్చరించారు. పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉందని ఆస్పరి మండలం జోహరాపురం గ్రామం నుంచి ఐవీఆర్ఎస్కు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఈనెల 24న గ్రామాన్ని సందర్శించి తగిన చర్యలు చేపట్టామన్నారు. బుధవారం ఆయన కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో ఇంటింటి చెత్త సేకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రోజు ఇళ్ల నుంచి చెత్తను సేకరించి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. తొలకరి వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. అలాగే తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి కర్నూలు(అర్బన్): జిల్లాలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.ప్రసూన కోరారు. బుధవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో జిల్లాలోని హెచ్డబ్ల్యూఓలతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టళ్లు పునః ప్రారంభం కావడం, హెచ్డబ్ల్యూఓల బదిలీలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఆయా హాస్టళ్లను అన్ని అంశాల్లో మెరుగుపర్చాలన్నారు. వసతి గృహ సంక్షేమాధికారుల కొరత నేపథ్యంలో దాదాపు ఒక్కో హెచ్డబ్ల్యూఓ అదనంగా మరో హాస్టల్కు ఇన్చార్జిగా ఉన్నారన్నాని, తమ పరిధిలోని రెండు హాస్టళ్లల్లో ఏ రోజు ఏ హాస్టల్లో ఉంటున్నారనే సమాచారాన్ని తప్పక సహాయ బీసీ సంక్షేమాధికారి నోటీసులో ఉంచాలన్నారు. సమావేశంలో సహాయ బీసీ సంక్షేమాధికారులు ఎం.శ్రీనివాసులు, ఆంజనేయులు నాయక్ తదితరులు పాల్గొన్నారు. పీజీసెట్ ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: ఏపీ పీజీ సెట్–2025 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 9 నుంచి 12వ తేదీ వరకు 10 సెషన్లలో 31 సబ్జెక్టులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 1,770 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,490 మంది పరీక్ష హాజరయ్యారు. వీరిలో 1,294 మంది అర్హత సాధించారు. కర్నూలుకు చెందిన బి.అర్షిత ఎలక్ట్రానిక్స్ కోర్సులో ప్రథమ ర్యాంకును కై వసం చేసుకున్నారు. ఆరు సంస్థలకు అనుమతి కర్నూలు(సెంట్రల్): జువైనల్ జస్టిస్ చట్టం–2015 ప్రకారం అర్హత కలిగిన ఆరు బాలల సంరక్షణ సంస్థలకు నిర్వహణ అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. బుధవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి సిఫార్సుల కమి టీ సమావేశంలో ఆరు బాలల సంరక్షణ సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. మొత్తం 9 సంస్థలు దరఖాస్తు చేసుకోగా నిబంధనల మేరకు లేని మూడు సంస్థల దరఖాస్తులను తిరస్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్పీరా పాల్గొన్నారు. -
ఏపీ ఏఐయూకేఎస్ అధ్యక్షుడిగా అర్లప్ప
నందికొట్కూరు:ఆంధ్రప్రదేశ్ అఖిలభారత ఐక్య రైతు సంఘం అధ్యక్షుడిగా వేల్పుల అర్లప్పను ఏకగ్రీవంగా ఎన్నుకునట్లు సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. జంగారెడ్డి గూడెంలో రోటరీ క్లబ్లో జరిగిన అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రథమ మహాసభలో ఆయన్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వేల్పుల అర్లప్ప మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో రైతు సమస్యలపై నిరంతరం కృషి చేస్తానన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే
పొగాకు రైతు ఆత్మహత్యాయత్నం నంద్యాల(న్యూటౌన్): పొగాకు కంపెనీల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం వల్లే పొగాకు రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడని, వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్కుమార్, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం చౌట్కూరుకు చెందిన పొగాకు రైతు మంగళి రామకృష్ణ (47) గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. రామకృష్ణకు గ్రామంలో ఆరెకరాల పొలం ఉండగా ఆంజనేయస్వామి ఆలయ భూమి 16 ఎకరాలను కౌలుకు తీసుకొని జీపీఐ, అలయన్స్ కంపెనీల ఒప్పందంతో పొగాకు పంటను సాగు చేసినట్లు తెలిపారు. పంట సాగు, పెట్టుబడి, కౌలు చెల్లించేందుకు రూ.30 లక్షల వరకు అప్పులు అయినట్లు చెప్పారు. ఈ స్థితిలో జీపీఐ, అలయన్స్ కంపెనీలు పొగాకును కొనుగోలు చేయకపోవడంతో వర్షాల వల్ల పొగాకు నాణ్యత దెబ్బతింటుందేమోనన్న భయంతో, అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేస్తుండటంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి రైతుల నుంచి పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని, మోసం చేసిన పొగాకు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
శాంతియుత ఉద్యమాలను కొనసాగిస్తాం
కర్నూలు(అర్బన్): వక్ఫ్ సవరణ చట్టం వెనక్కు తీసుకునే వరకు శాంతియుతంగా ఉద్యమాలను చేస్తూనే ఉంటామని సేవ్ వక్ఫ్ సేవ్ కాన్స్టిట్యూషన్ జేఏసీ నేతలు ప్రకటించారు. మంగళవారం ఉదయం స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈ నెల 30న నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సయ్యద్ జాకీర్ అహ్మద్ రషాదీ, కో కన్వీనర్ ఎంఏ హమీద్, నాయకులు షరీఫ్, షౌకత్ఆలీ, పాదిక్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలపై తమకున్న వివక్షతో శతాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని సమూలంగా మార్చి ఉమీద్గా నామకరణం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి అనేక నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి స్పందన కనిపించడం లేదన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించామన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 30న సాయంత్రం 5 నుంచి రాత్ర 9.30 గంటల వరకు స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సేవ్ వక్ఫ్ సేవ్ కాన్స్టిట్యూషన్ జేఏసీ -
ఏపీకే ఫైల్స్, లింక్లు డౌన్లోడ్ చేయొద్దు
కర్నూలు (టౌన్): సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఏపీకే ఫైల్స్, లింక్లను ఎవరూ ఓపెన్/డౌన్లోడ్ చేయరాదని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని క్లిక్ చేస్తే ఫోన్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారని చెప్పారు. సై బర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపిన లింక్లు,డాక్యుమెంట్లు,ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దన్నారు. ఫోన్లను హ్యాక్ చేసి వారి వ్యక్తిగత స మాచారం,బ్యాంకింగ్ డేటా, ఫొటోలు, డాక్యుమెంట ను దొంగలించి ఆర్థిక నష్టానికి గురి చేస్తారని వివరించారు. ఎస్పీ సూచనలు ● ప్లే స్టోర్ తప్పా మరో వేదికల నుంచి యాప్లను డౌన్లోడ్ చేయరాదు. ● గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింకులు, డాక్యుమెంట్లు, ఏపీకే ఫైల్లు ఓపెన్ చేయవద్దు ● ఫోన్లోని ప్రతి యాప్కు ఇచ్చే అనుమతులను అప్రమత్తంగా పరిశీలించండి ● బ్యాంకు అకౌంట్, యూపీఐ కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు ● ఫోన్లో అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ చేసిన ట్లయితే వెంటనే ఆయాప్ను అన్ ఇన్స్టాల్ చేయాలి. ● మొబైల్ను రీసెట్ చేసి, ట్రస్ట్ చేసిన యాప్లను మాత్రమే తిరిగి ఇన్స్టాల్ చేయాలి ● ఫోన్లో భద్రతా యాప్ ఉపయోగించండి ● బ్యాంకింగ్ ఆప్లికేషన్లలో బయోమెట్రిక్, 2– ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ను వాడాలి మోసానికి గురైన వారు చేయాల్సిన చర్యలు ● తక్షణం జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలి ● www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి ●సమీపంలోని పోలీసు స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. మోసాలు ఏలా చేస్తారంటే ! నిందితులు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, మేసేంజర్, ఇన్స్టా గ్రామ్, ఎస్ఎంఎస్ ద్వారా లింక్ పంపుతారు. డెలివరీ బాయ్, రీఫండ్ లింక్, డిజిటల్ కేవైసీ, రివార్ుడ్స అప్డేట్, షీ గిఫ్ట్, అరెంట్ డాక్యుమెంటు ఈ– చలానా తదితర పేర్లతో లింక్ల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తారు. ఆ లింకు ద్వారా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడు దీన్ని యాప్ అనుకొని ఇన్స్టాల్ చేస్తారు. ఆ యాప్ అనుమతులు అడుగుతుంది. ఎస్ఎంఎస్, కాంటాక్ట్స్, కాల్ లాగ్, స్టోరేజీ, నోటిఫికేషన్స్, యాక్సెసబిలిటీ ద్వారా ఆకర్షిస్తున్నారు. ఈ అనుమతులతో నేరగాళ్లు ఫోన్ను పూర్తిగా నియంత్రిస్తారు. ఫోన్లోని ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డు సమాచారం నేరుగా నిందితులకు అందుతుంది. కొన్నిసార్లు యుపీఐ యాప్లను కూడా యాక్సెస్ చేసి ఖాతాల్లోని డబ్బును దొంగిలిస్తారు. కొన్ని సందర్భాల్లో ఫోన్ కెమెరా, మైక్ యాక్సెస్ చేసి వ్యక్తిగత వీడియోలు, ఆడియోలు సేకరించి బ్లాక్ మెయిల్కు ప్రయత్నిస్తారు. -
సొంతవారికి పరీక్షే!
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వార్డ్బాయ్లు, స్ట్రెచర్బాయ్ల కొరత వేధిస్తోంది. ఉన్నవారు ఉన్నతాధికారుల సేవకు పరిమితం కావడంతో ఆయా వార్డుల్లో చికిత్స కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులు, ప్రమాదాల్లో గాయపడిన వారిని వైద్య పరీక్షల నిమిత్తం సొంతవారే తీసుకెళ్లాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు రోగులను ఆక్సిజన్ మాస్క్లతోనే వీల్చైర్లు, స్ట్రెచర్లపై ఆయా కేంద్రాలకు తీసుకెళ్లి వేచిఉండి పరీక్షలు చేయించుకుని వస్తున్నారు. ఆస్పత్రి ఉన్నతాధికారులు స్పందించి ఆయా వార్డుల్లో వార్డ్బాయ్స్, స్ట్రెచర్ బాయ్స్లను నియమించాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
9న దేశవ్యాప్త సమ్మె
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం కర్నూలు శాఖ కార్యదర్శి సునీయకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం శాఖ అధ్యక్షుడు మక్బూల్ అహమ్మద్ ఆధ్వర్యంలో స్థానిక బ్రాంచ్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సునీయకుమార్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బీమా చట్టాల సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎల్ఐసీలో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించుకునే కార్యక్రమాన్ని మరోమారు చేపట్టనున్నదని, దీన్ని ప్రతిఘటిస్తామన్నారు. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని ఆయన కోరారు. 3, 4 తరగతుల సిబ్బంది కోసం రిక్రూట్మెంట్ తక్షణం చేపట్టాలన్నారు. ఎల్ఐసీలో పాత పెన్షన్ విధానమే అమలు చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో ఏజెన్సీ యూనియన్ సెక్రటరీ గజేంద్రరెడ్డి, డెవలప్మెంట్ యూనియన్ నేతలు రమేష్, కర్నూలు బ్రాంచ్ సంయుక్త కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు రైతులను ఆదుకోవాలి
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో పొగాకు పండించిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రైవేటు కంపెనీలు, రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్కుమార్, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై అడ్డంగా కూర్చొని ఆందోళన చేయడంతో పోలీసులకు, రైతులకు మధ్య కొంత మేర వాగ్వాదం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, రైతులను మోసం చేస్తున్న పొగాకు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని అక్కడే భైఠాయించారు. దీంతో సీఐ కంబగిరి రాముడు విషయాన్ని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ దృష్టికి తీసుకెళ్లారు. జాయింట్ కలెక్టర్ అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడుతూ.. పొగాకు కొనుగోళ్లలో జరుగుతున్న లోపాలపై చర్చించి మూడు రోజుల్లోగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం, ప్రైవేటు కంపెనీల విషయంపై స్పష్టత ఇచ్చి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రైవేటు పొగాకు కంపెనీలు ఒప్పందం చేసుకున్న మేర క్వింటాకు రూ.18 వేలు ఇవ్వాలని రైతు నాయకులు కోరారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు మార్క్, సుధాకర్, సీఐటీయూ నాయకులు లక్ష్మణ్, పొగాకు రైతులు సుబ్బనర్సయ్య, పుల్లారెడ్డి, నారాయణ, రామ్మోహన్, వీరన్న, రామకృష్ణ, బుజ్జన్న, ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీబీలో అక్రమాల పరంపర!
● కూటమి ప్రభుత్వంలో మసకబారిన డీసీసీబీ ప్రతిష్ట ● గతేడాది సెప్టెంబరులో ఆత్మకూరు బ్రాంచ్లో రూ.80.12 లక్షల స్వాహా ● చిప్పగిరి మండలంలో రూ.కోటి మింగేసిన సొసైటీ సీఈఓ ● తాజాగా నాగంపల్లి సొసైటీలో రూ.40 లక్షలు స్వాహాకార్యం ● కొండలా పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తులు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరువు బజారున పడుతోంది. ఏదో ఒక మూల అక్రమాలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు బ్యాంకు ఉద్యోగులు, మరోవైపు పీఏసీఎస్ సీఈఓలు నిధులు కొల్లగొడుతూ.. డీసీసీబీ ప్రతిష్టను గంగలో కలిపేస్తుండటం గమనార్హం. దీపం ఉన్నపుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా అవకాశం ఉన్నపుడే డబ్బులు మూట కట్టుకోవడానికి అడ్డుదారులు తొక్కుతున్నారు. ఇటీవల కొత్తపల్లి మండలం నాగంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో సీఈఓ చేతి వాటం ప్రదర్శించి నిధులు కొల్లగొట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది సెప్టెంబరు చివర్లో ఆత్మకూరు బ్రాంచ్లో దాదాపు రూ.కోటి కుంభకోణం వెలుగు చూసింది. నిధులు మింగేసిన వారు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు. బ్యాంకుకు మాత్రం ఒక్క రూపాయి రికవరీ కాలేదు. ఇటీవల చిప్పగిరి మండలం రామదుర్గం పీఏసీఎస్లో సీఈఓనే నిధులు కొల్లగొట్టారు. ఏకంగా రూ.కోటి స్వాహా కావడం సంచలనమే. తాజాగా నాగంపల్లి పీఏసీఎస్లో సీఈఓనే నిధులకు ఎసరు పెట్టారు. వెలుగులోకి రాని అక్రమాలు ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.80.12 లక్షలు స్వాహా.. రికవరీ రూ.5 లక్షలు మాత్రమే.. గతేడాది సెప్టెంబరులో ఆత్మకూరు బ్రాంచ్లో క్యాషియర్ ఆల్తాఫ్, పాసింగ్ ఆఫీసర్ రంగయ్య, మరో ఉద్యోగి శంకర్ పథకం ప్రకారం దాదాపు రూ.80.12 లక్షలు నిధులు మళ్లించారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే రికవరీ అయ్యింది. మేనేజర్ పులిరాజుతో సహా నలుగురు సస్పెన్షన్లో ఉన్నారు. భారీ ఎత్తున నిధులు కొల్లగొట్టిన వీరు టీడీపీ నేతల ద్వారా పోస్టింగ్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పెరిగిపోతున్న ఎన్పీఏ అధికారుల అవినీతి కారణంగా జిల్లా సహకార కేంద్రబ్యాంకు నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయి. రికవరీపై దృష్టి పెట్టని అధికారులు స్వాహాపై ఆసక్తి చూపుతుండటం గమనార్హం. ఇందువల్ల బ్యాంకు నిరర్ధక ఆస్తులు పేరుకపోతున్నాయి. 2024 ఏప్రిల్లో నిరర్ధక ఆస్తులు రూ.195 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.265 కోట్లకు పెరిగిపోయాయి. నిరర్ధక ఆస్తులు కొండలా పేరుకపోతున్నాయి. రూ.40 లక్షలు మిగేసిన నాగంపల్లి సీఈఓ కొత్తపల్లి మండలం నాగంపల్లి పీఏసీఏస్కు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సభ్యత్వం ఉంది. పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలకు కర్నూలు డీసీసీబీ ఈ సొసైటీకి నిధులు ఇస్తుంది. రుణాలు పంపిణీ చేసిన సీఈఓ రికవరీ చేసే సమయంలో చేతివాటం చూపినట్లు స్పష్టమవుతోంది. రైతులు రికవరీ చేసిన మేరకు రసీదులు ఇచ్చినప్పటికీ, సొసైటీకి మాత్రం జమ చేయడంలో కోతలు పెట్టారు. ఒక రైతు నుంచి రూ.లక్ష రికవరీ చేస్తే పూర్తి మొత్తానికి రసీదు ఇచ్చి సొసైటీకి మాత్రం రూ.50 వేలు మాత్రమే జమ చేసేవారు. రెండు బిల్లు బుక్కులు ఉండటం వల్ల ఒక దానిని రైతులకు, మరో దాన్ని సంఘానికి వినియోగించే వారని తెలుస్తోంది. ఈ విధంగా రైతుల నుంచి రికవరి చేసిన మొత్తంలో రూ.40 లక్షల వరకు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. సదరు సీఈఓ కోటేశ్వరరావు మూడు నెలలకుపైగా విధులకు గైర్హాజరు అవుతున్నారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన డీసీసీబీ అధికారులు విచారణకు శ్రీకారం చుట్టారు. విచారణ జరిపిన కొద్ది సమయంలోనే రూ.10 లక్షలకుపైగా స్వాహా వెలుగులోకి వచ్చింది. ముక్కున వేలేసుకున్న అధికారులు స్వాహా కార్యం ఎంతుందో తేల్చడానికి లోతుగా విచారణ జరపుతున్నారు. సొసైటీ లావాదేవీలు, రికవరీలపై డీసీసీబీ సంబంధిత బ్రాంచ్ మేనేజర్ దృష్టి ఉండాలి. పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ పర్యవేక్షణ ఉండాలి. సొసైటీపై ఎవ్వరు దృష్టి పెట్టకపోవడంతో యథేచ్ఛగా స్వాహా పర్వాన్ని కొనసాగించినట్లు స్పష్టమవుతోంది. -
పచ్చిరొట్ట ఎరువులతో నేల సారవంతం
బండి ఆత్మకూరు: బండి ఆత్మకూరు, ఎరగ్రుంట్ల గ్రామాల్లో ఏఓ పవన్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో డీఏఓ వైవీ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయం సాంకేతిక విప్లవం ద్వారా రైతులు మరింత నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు అధికారులందరూ కృషి చేయాలన్నారు. రసాయన రహితంగా సేంద్రియ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడి పొందడమే గాకుండా నేలలో కర్బన శాతం, సూక్ష్మ పోషకాలు పెరుగుతాయన్నారు. రైతులు మిశ్రమ పంటలు సాగు చేయాలని, వరి సాగు చేసే నేలలో ముందుగా జీలుగ, పిల్లి పెసర, ఉలవలు వంటి పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలన్నారు. మండలంలో వరి, మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారని, బయో డీజిల్ ఫ్యాక్టరీల్లో వరిగడ్డి, మొక్కజొన్న కాండం ఇతర భాగాలకు డిమాండ్ ఉన్నందున రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థికంగా లబ్ధి పొందాలన్నారు. అనంతరం కౌలు రైతులకు గుర్తింపు కార్డులను అందజేశారు. వెటర్నరీ డాక్టర్ అనూష, ఏఈఓ సాయి హిమబిందు, వ్యవసాయ విస్తరణ సిబ్బంది అశోక్ శత్రు నాయక్, ఆసియా పలువురు రైతులు పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో రాజకీయం
కీలకంగా నేతల సిఫారసు లేఖలు ● చిరుద్యోగుల జేబులు ఖాళీ చేస్తున్న చోటా కూటమి నేతలు ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా బదిలీలు, నియామకాలు ● బదిలీల దరఖాస్తుకు ముగిసిన గడువు ● జిల్లాలో మొత్తం 5,562 మంది సచివాలయ ఉద్యోగులు ● వీరిలో 3,619 మందికి ఒకే ప్రాంతంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పైరవీలు ఊపందుకున్నాయి. నిబంధనల మేరకు ఐదేళ్లు ఒకే ప్రాంతంలో విధులు నిర్వహించిన వారిని బదిలీ చేయాలని, అలాగే ఐదేళ్లు పూర్తి కాకున్నా.. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కోరుకునే వారికి అవకాశం కల్పించనున్నారు. ఈ నేఫథ్యంలోనే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అంశం చోటా కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. సొంత మండలాల్లో ఐదేళ్లు విధులు నిర్వహించిన పలువురు ఉద్యోగులు తమకు సమీపంలోని సచివాలయాలకు బదిలీ అయ్యేందుకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల సిఫారసు లేఖల కోసం క్యూ కడుతున్నారు. నేరుగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల వద్దకు పోయే సాహసం చేయలేని అనేక మంది ఉద్యోగులు నేతల అనుచరులను ముందుగా ప్రసన్నం చేసుకునేందుకు చేతులు తడుపుతున్నారు. ఇదే అదనుగా భావించిన చోటా నేతలు బరితెగించి చిరుద్యోగుల జేబులను ఖాళీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నా, నేతల సిఫారసు లేఖలు లేకుంటే జిల్లాలోని సుదూర ప్రాంతాల్లోని సచివాలయాలకు బదిలీ అయ్యే ప్రమాదం ఉంటుందనే భయంతో వారు అడిగినంత ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి సొంత మండలాల్లో పనిచేసే వెసులుబాటును తొలగించి, వేరే మండలాలకు వీరిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే నిబంధనల ప్రకారం బదిలీలు జరుగుతాయా? సిఫారుసుల మేరకు జరుగుతాయా? అనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. గత వైఎస్సార్సీపీ పాలనలో ఎలాంటి రాజకీయ పైరవీలు, అవినీతికి తావు లేకుండా ఎంతో పారదర్శకంగా బదిలీలు, నియామకాలు జరిగాయని ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ముగిసిన గడువు గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 నుంచి 24వ తేది వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అర్హత కలిగిన వారందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 5,569 మంది గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉండగా, వీరిలో ఐదు సంవత్సరాలు ఒకే ప్రాంతంలో విధులు నిర్వహించిన వారు 3,619 మంది ఉన్నారు. అందిన సమాచారం మేరకు మాడ్యూల్లో 3,299 మంది ఉద్యోగుల డాటాను అప్లోడ్ చేశారు. వార్డు సచివాలయాల్లో గందరగోళం ● ప్రస్తుత బదిలీల్లో వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. ● ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కొందరు తమకు కేటాయించిన సచివాలయాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ● మరి కొందరు రెండేళ్ల క్రితం అంతర్గత బదిలీల్లో భాగంగా ఇతర వార్డుల్లోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ● ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఐదేళ్లు ప్రామాణికంగా తీసుకుంటారా? లేక అంతర్గత బదిలీలను తీసుకుంటారా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది. ● అలాగే ర్యాంకుల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ●ఉద్యోగులు సొంత వార్డు పరిధిలో కాకుండా ఆ పట్టణంలో నే ఇతర వార్డులకు లేదా ఉమ్మడి జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలు,కార్పొరేషన్లకు బదిలీపై వెళ్లేందుకు అర్హులని చెప్పింది. ● అయితే గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు సొంత మండలాలకు బదిలీ అయ్యే అవకాశం కల్పించకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సొంత మండలాల్లోనే అవకాశమివ్వండి తుగ్గలి: సొంత మండలాల్లో బదిలీ అవకాశం కల్పించాలని సచివాలయ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పులిశేఖర్, అన్ని శాఖల సచివాలయ ఉద్యోగులు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయ ఏఓ మహబూబ్బాషా, డిప్యూటీ తహసీల్దార్ సుదర్శన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శుల బదిలీలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులతో వేలాది మందికి ఇబ్బందులు తప్పవన్నారు. ప్రభుత్వ జీవో 5 వల్ల ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత రేషనలైజేషన్ చేసి బదిలీలు చేపట్టాలని, సొంత ప్రాంతాల్లో అవకాశం కల్పిస్తూ జీఓను సవరించాలని డిమాండ్ చేశారు. -
● ఐదుగురికి గాయాలు ● అతిగా మద్యం సేవించి కారు నడపడంతోనే ప్రమాదం
డివైడర్ను ఢీకొన్న కారు కర్నూలు (టౌన్): కొత్త కారు. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. అందులో ఐదుగురు వ్యక్తులు ఫుల్గా మద్యం సేవించి రోడ్డు మధ్యలో డివైడర్పై ఉన్న విగ్రహం దిమ్మెను ఢీకొట్టారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. కొత్త మహీంద్రా థార్ కారులో స్థానిక సోమిశెట్టి నగర్కు చెందిన డ్రైవర్ శశికుమార్,వితేష్ , సునీల్, భార్గవ్, చంద్రకాంత్ కలిసి మద్యం సేవించారు. కొత్త బస్టాండ్ వద్ద మద్యం సేవించి మద్యం మత్తులో ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి బళ్లారి చౌరస్తా మీదుగా హోసన్న మందిరం వైపు వెళుతున్నారు. అయితే స్థానికంగా ఏపీఎస్పీ క్యాంపు ప్రధా న రహదారి గేటు ఎదురుగా మొయిన్ రోడ్డు డివైడర్పై ఉన్న దివంగత మేజర్ సీ.ఆర్.రెడ్డి పోలీసు అధికారి విగ్రహం దిమ్మెను ఢీకొట్టారు. విగ్రహం కూలిపోయింది. ఆ సమయంలో కారులోని బెలూ న్లు తెరుచుకోవడంతో ఐదుగురు గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు మంగళవారం తెలిపారు. -
వ్యవసాయంలో పెరిగి పోతున్న పెట్టుబడి వ్యయం
● ఆకాశాన్నంటిన రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలు ● యాంత్రికంగా మద్దతు ధరలను ప్రకటించిన కేంద్రం ● క్షేత్రస్థాయి వాస్థవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోని వైనం ● రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చల ఊసే కరువు 2025–26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు నిరాశజనకంగా ఉన్నాయి. మద్దతు ధరలను అశాసీ్త్రయంగా ప్రకటించినట్లు కనిపిస్తోంది. పత్తి, వరి, మొక్కజొన్న, కంది, మినుము ఇలా అన్ని పంటల్లో పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. వరికి హెక్టారుకు పెట్టుబడి వ్యయం రూ.1.30 లక్షల వరకు ఉంటోంది. మద్దతు ధరలపై కేంద్రం పునఃసమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది. – జి.రామకృష్ణ, జిల్లా ప్రదాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం, కర్నూలు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయి. పత్తిలో హెక్టారుకు రూ.లక్షకు పైగా పెట్టుబడి వ్య యం వస్తోంది. రసాయన ఎరువులు, పురుగు మందు లు, లేబర్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలు, ట్రాక్టరు, ఇంప్లిమెంట్స్ బాడుగలతో పాటు అన్ని రకాల ఖర్చు లు పెరిగిపోయాయి. దిగుబడి 8–10 క్వింటాళ్ల వరకు మాత్రమే ఉంటోంది. క్వింటాకు మద్దతు ధర రూ.10 వేలు ఉంటేనే రైతులకు న్యాయం జరుగుతుంది. – వేణుబాబు, అధ్యక్షుడు, ఏపీ విత్తన రైతు సంఘం నాకు 14 ఎకరాల సొంత భూమి ఉంది. మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. గతేడాది వరిసాగు చేసి నష్టపోయా. మద్దతు ధర ఆశాజనకంగా ఉంటే దళారీలు కూడా అదే ధర ఇవ్వడానికి ముందు కు వస్తారు. మేము కూడా డిమాండ్ చేస్తాం. మద్దతు ధర కనీసం రూ.2600 ఉంటే పెట్టుబడి చేతికొస్తుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్వర రెడ్డి, లింగాపురం, బండి ఆత్మకూరు మండలం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొక్కజొన్న ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో 5,101, నంద్యాల జిల్లాలో 50,155 హెక్టార్లలో సాగవుతోంది. భూమి చదును చేసుకోవడం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సేద్యం, లేబర్ చార్జీలు.. ఇలా అన్ని రకాల ఖర్చులు కలిపి వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం హెక్టారుకు పెట్టుబడి వ్యయం రూ.66,642. హెక్టారుకు దిగుబడి 25 క్వింటాళ్లు వస్తుందని అంచనా. అంటే క్వింటా మొక్కజొన్న పండించడానికి రైతుకు అవుతున్న ఖర్చు రూ.2,665. అయితే కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి క్వింటా మొక్కజొన్నకు ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400 మాత్రమే. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడి కూడా దక్కదని రైతులు వాపోతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి వివిధ పంటలకు మద్దతు ధరలను ప్రకటించింది. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. క్షేత్రస్థాయిలో పర్యటించి వాప్తవ పరిస్థితులను గుర్తించి, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించిన తర్వాత మద్దతు ధరలను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇటీవల ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలిస్తే యాంత్రికంగా ప్రకటించినట్లుగా స్పష్టమవుతోంది. రసాయన ఎరువుల ధరలను కేంద్రం అడ్డగోలుగా పెంచింది. పురుగు మందల ధరలు కొండెక్కాయి. సేద్యం, కూలీ ఖర్చులు భారీగా పెరిగాయి. ఫలితంగా సాగులో పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను సవరించాల్సి ఉంది. అలాంటిది పెట్టుబడి వ్యయానికి, ఇటీవల ప్రకటించిన మద్దతు ధరలకు పొంతన లేకపోవడం గమనార్హం. మద్దతు ధరలు లేకపోతే దళారీలు చెప్పిందే ధర అయ్యే ప్రమాదం ఉంది. పెట్టుబడి వ్యయం కొండంత.. మద్దతు ధరలు అంతంతే! ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, మినుము, జొన్న సాగు చేస్తారు. ఏ పంటకు చూసిన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ భారీగా ఉంది. మద్దతు ధరలను ప్రకటించడంలో విధిగా పంటల వారీగా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే 2025–26 ఏడాది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, దిగుబడులను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలను ప్రకటించడం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కేంద్రంలో కీలకంగా ఉన్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మద్దతు ధరల ప్రకటనలో రైతులకు అన్యాయం జరిగినప్పటికీ కనీస స్పందన లేకుండా పోయింది. గతంలో వ్యవసాయం దండగ అని మాట్లాడిన చంద్రబాబు నేడు మద్దతు ధరల్లో జరిగిన అన్యాయాన్ని ఎలా పట్టించుకుంటారనే చర్చ రైతుల్లో జరుగుతోంది. కనిష్టంగా రూ.69.. గరిష్టంగా రూ.596 కేంద్రం 2025–26 సంవత్సరానికి సవ రించిన మద్దతు ధరలు రైతులకు నిరాశ, ఆందోళన మిగిల్చాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి ప్రధాన ఆహార పంట. ఈ పంటలో పెట్టుబడి వ్యయం ఏడాదికేడాది పెరుగుతోంది. కానీ మద్దతు ధరలను కనిష్టంగా రూ.69, గరిష్టంగా రూ. 596 మాత్రమే పెంచడం పట్ల రైతుల్లో నిరుత్సా హం వ్యక్తమవుతోంది. 2024 –25 మద్ద తు ధరపై కేవలం రూ.69 మా త్రమే పెరి గింది. కనీస మద్దతు ధర రూ. 2,600 పైన ఉంటే ధాన్యం రైతుకు కొంతమేర న్యాయం జరుగుతుందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. దాదాపుగా మిగిలిన పంటలదీ ఇదే పరిస్థితి.వివిధ పంటల్లో హెక్టారుకు పెట్టుబడి వ్యయం ఇలా.. పంట పెట్టుబడి వ్యయం క్వింటా ఉత్పత్తికి మద్దతు ధర (రూశ్రీశ్రీల్లో) అవుతున్న వ్యయం(రూశ్రీశ్రీల్లో) (రూశ్రీశ్రీల్లో) మొక్కజొన్న 66,641 2,666 2,400 సజ్జ 38,851 2,775 2,775 వరి 1,24,096 2,160 2,389 జొన్న 77,376 3,517 3,699 పత్తి 95,107 7,336 8,110 కంది 64,486 7,271 8,000 కొర్ర 31,382 2,617 2,500 వేరుశనగ 1,06,662 5,480 7,263 -
అనాథ పిల్లల న్యాయ సహాయానికి 15100
కర్నూలు(సెంట్రల్): దిక్కులేని/అనాథ పిల్లలకు న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటప్రసాద్ ప్రజలకు సూచించారు. మంగళవారం న్యాయ సేవా సదన్లో సాథి కమిటీలోని సభ్యులతో స్పెషల్ డ్రైవ్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సాథి కమిటీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలతో 125 మంది అనాథ పిల్లలను గుర్తించామని, వీరందరికీ జూన్ 26 నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించి ఆధార్ కార్డులు ఇచ్చేలా చూడాలని సూచించారు. ఆధార్ కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐసీడీఎస్ పీడీలు నిర్మల, లీలావతి, నంద్యాల డీఎంహెచ్ఓ శారదబాయి, ప్యానల్ లాయర్ వెంకటేశ్వర్లు, పారా లీగల్ వలంటీర్లు రాయపాటి శ్రీనివాస్, సుధారాణి, హేమంత్ పాల్గొన్నారు. గురుకుల ఇంటర్మీడియెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పు కర్నూలు(అర్బన్): 2025–26 విద్యా సంవత్సరానికి డాక్టర్ అంబేద్కర్ గురుకులాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పు చేసినట్లు జిల్లా కన్వీనర్ డాక్టర్ ఐ.శ్రీదేవి మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు 1:3 నిష్పత్తిలో కౌన్సెలింగ్కు పిలుస్తున్నందున సీటు రావడం కచ్చితమని భావించకూడదన్నారు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు బీసీ–సి, ఎస్సీ కేటగిరీలకు చెందిన అమ్మాయిలకు, 28వ తేదీన బీసీ, ఓసీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అమ్మాయిలకు దిన్నెదేవరపాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా 27వ తేదీన బీసీ–సి, ఎస్సీ కేటగిరీలకు చెందిన అబ్బాయిలకు, 29వ తేదీన బీసీ, ఓసీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అబ్బాయిలకు చిన్నటేకూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జూనియర్ కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కేవలం ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు స్వయంగా ఆహారం, నీరు, ఇతర అవసరమైన సామగ్రి తెచ్చుకోవాలని, ఇక్కడ ఎలాంటి వసతులు కల్పించబడవన్నారు. గ్రామాభివృద్ధిలో మహిళా సర్పంచులు కీలకంకర్నూలు(అర్బన్): గ్రామాల అభివృద్ధిలో మహిళా సర్పంచులు కీలక పాత్ర పోషించాలని డీపీఆర్సీ ప్రిన్సిపాల్, జెడ్పీ సీఈఓ జీ.నాసరరెడ్డి అన్నారు. స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో మూడు రోజుల పాటు జరగనున్న మహిళా సర్పంచుల శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. గ్రామ స్వరాజ్య అభియాన్ – ఆర్జీఎస్ఏ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఈఓ నాసరరెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ పోషణ, అభివృద్ధి విషయంలో మహిళలు పోషిస్తున్న పాత్రనే గ్రామాభివృద్ధిలోనూ నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్య, స్వచ్ఛమైన తాగునీరు, గ్రామ పంచాయతీ ఆస్తుల రక్షణ తదితర వాటిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులతో గ్రామాలను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే పంచాయతీరాజ్ చట్టం గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. డీపీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీ, డిప్యూటీ ఎంపీడీఓలు నాగేష్, శ్రీహరి, రవి, కిషోర్, సందీప్, పంచాయతీ కార్యదర్శులు శ్రావణ్కుమార్, రాముడు తదితరులు పాల్గొన్నారు. -
గాలులతో కూడిన తేలికపాటి వర్షాలే!
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో గాలుల తీవ్రతే కొనసాగనుంది. ఈ నెల 25న ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26 నుంచి గాలుల తీవ్రతతో పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులను వర్షాలు నిరాశకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు పత్తి, కంది, వేరుశనగ పంటలు సాగు చేసినప్పటికీ వర్షాలు లేక మొక్కలు ఎదగడం లేదు. కాగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఏడు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వెల్దుర్తిలో 4.2 మి.మీ, హొళగుందలో 3.2, మద్దికెరలో 2.8, ఓర్వకల్లో 1.2, గోనెగండ్లలో 1.2, ఆదోనిలో 1.2, కృష్ణగిరిలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. -
ఓపెన్ స్కూల్తో చదువులకు సువర్ణావకాశం
నంద్యాల: విద్య పట్ల ఆసక్తి ఉన్న ఉద్యోగులు, గృహిణులు ఓపెన్ స్కూల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో డీఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సులను విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. ఆసక్తి కలిగిన వారు జూలై 30 చివరి తేదీలోగా htt ps://apopenschool.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విద్యాపీఠం జారీ చేసే సర్టిఫికెట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొంది, ఉన్నత చదువులు, ఉద్యోగాలు అర్హత కలిగి ఉన్నాయన్నారు. ఓపెన్ స్కూల్ విధానంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోక్సో కేసు నమోదు పాణ్యం: మండల కేంద్రానికి చెందిన బోయమద్దిలేటిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఈనెల 22న ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
పాముకాటుతో విద్యార్థి మృతి
ఆదోని అర్బన్: పట్టణంలోని ఎరుకల కాలనీకి చెందిన ఓ విద్యార్థి మంగళవారం పాముకాటుకు గురై మృతిచెందాడు. స్థానికంగా నివాసముంటున్న భారతి, మారేష్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమా ర్తె. పెద్ద కుమారుడు అభిరామ్ రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి అభిరామ్ ఇంట్లో భోజనం చేస్తుండగా కాలు వద్ద ఏదో కుట్టినట్లు కనిపించడంతో తల్లికి వచ్చి చెప్పాడు. అనుమానంతో వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాము కాటేసిందని వైద్యులు గుర్తించి వైద్యం అందిస్తుండగా కోలుకోలేక మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
రమణీయం.. విజయీంద్రతీర్థుల రథోత్సవం
హొళగుంద: స్థానిక కోటవీధిలో వెలసిన విజయీంద్రతీర్థుల రథోత్సవంను బ్రాహ్మణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. విజయీంద్రతీర్థుల 411వ మహా ఆరాధనోత్సవం ముగింపులో భాగంగా జరిగిన ఉత్తరాధన కార్యక్రమం సందర్భంగా రాఘవేంద్రస్వామి, విజయీంద్రతీర్థుల మూల విరాట్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. శనివారం పూర్వరాధన, ఆదివారం ఏకాదశి, సోమవారం మద్యరాధన పూజలు చేసిన బ్రాహ్మణులు మంగళవారం ఉత్తరాధన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం మూలవిరాట్లకు నిర్మల్య విసర్జన, సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, తులసి అర్చన పూజలు జరిగాయి. రమణీయంగా సాగిన రథోత్సవం గ్రామ పురవీధుల్లో స్వామి వారి రథోత్సవం రమణీయంగా సాగింది. ఈ సందర్భంగా శ్రీపురందరదాసర భజన మండలి, భక్తి భారతి కోలాట మండలి బృందాల ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, చిన్నారులు కోలాట నృత్యాలు, బ్రాహ్మణుల నృత్యాలు అలరించాయి. అనంతరం భజన స్వస్తి వాచన, మహా నైవేద్య, తీర్థ ప్రసాద కార్యక్రమాలతో ఆరోధనోత్సవ కార్యక్రమాలు ముగిశాయి. కార్యక్రమానికి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి బ్రాహ్మణులు హాజరైనట్లు విజయీంద్ర తీర్థుల సేవా ట్రస్ట్ సభ్యులు పవనాచారి, రఘునాథాచారి తదితరులు తెలిపారు. -
నీటి అగచాట్లు ఇంకెన్నాళ్లు?
వెల్దుర్తి: ఇరవై రోజులుగా కుళాయిలకు నీళ్లు రాక అవస్థలు పడుతున్నామని వెల్దుర్తి పట్టణంలోని రాణితోటకు చెందిన మహిళలు స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. నీటి, ఇంటి పన్నులు కట్టించుకునే అధికారులు నీళ్లను ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. 20 రోజులుగా నీరు రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులు అర్థం చేసుకోవాలన్నారు. తమ నీటి కష్టాలను విన్నవించేందుకు పంచాయతీ కార్యాలయం చేరుకోగా అధికారులు, సిబ్బంది లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సెక్రటరీ లక్ష్మీనాథ్ మాట్లాడుతూ బ్రహ్మగుండం పథకం పైప్లైన్ లీకేజీలు, మరమ్మతుల నేపథ్యంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. వెంటనే చర్యలు తీసుకుని నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. అయితే పంచాయతీ కార్యాలయంలో కొందరి సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యంతో పట్టణంలో తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం కర్నూలు(టౌన్): మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు సర్వనాశనం అవుతాయని అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామక్రిష్ణా రెడ్డి అన్నా రు. మంగళవారం స్థానిక టౌన్ మోడల్ జూనియర్ కళశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంతో శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్యలు ఏర్పడతాయన్నారు. వీటిని సేవించడం వల్ల చట్టపరమైన సమస్యలు ఎదుర్కొ వాల్సి ఉంటుందన్నారు. అనంతరం మత్తు పదా ర్థాల జోలికి వెళ్లం అంటూ విద్యార్థినీ, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలోఎకై ్సజ్ అధికారులు రాజేంద్రప్రపాద్, కర్నూలు పట్టణ ఎస్ఐ నవీన్బాబు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు. పాలిసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా కర్నూలు సిటీ: పాలిసెట్ కౌన్సెలింగ్కు హాజరై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడినట్లు హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్.ఎన్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల కౌన్సెలింగ్కు మొత్తం 228 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించి రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లను అందించారు. షెడ్యుల్ ప్రకారం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటి(బుధవారం) నుంచి మొదలు కావాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదికి వాయిదా వేసినట్లు కో–ఆర్డినేటర్ పేర్కొన్నారు. -
శ్రీశైలంలో ముమ్మర తనిఖీలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీసు బృందాలచే తనిఖీలు చేపట్టారు. మంగళవారం శ్రీశైలం పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ పరిసర ప్రాంతాలు, సరిహద్దుల్లో, వసతి గృహాలు, గుడి పరిసర ప్రాంతాలు, చెక్పోస్టులలో, శ్రీశైలం అంతటా తనిఖీలు చేపట్టారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో, ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమోనని ముందస్తు జాగ్రత్తగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు ఆలయం చుట్టుపక్కల, పార్కింగ్ స్థలాలు, ప్రయాణికుల విశ్రాంతి గదులు, బస్టాండ్, కల్యాణకట్ట తదితర ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. -
ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువకులు పిడికిలి బిగించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంపై నిరసన గళం విప్పారు. రాష్ట్రం ప్రభుత్వ మోసంపై నిరుద్యోగులు, విద్యార్థులు భగ్గుమన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘యువత పోరు’ నిరసనక
కర్నూలు (టౌన్): జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు కర్నూలులో కదం తొక్కారు. ఎ.క్యాంపులోని విజయ పాల డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ‘సీఎం డౌన్ డౌన్, జయహో వైఎస్సార్’ అంటూ నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వై. శివారెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఏడాది దాటినా నిరుద్యోగ భృతి మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు నిరుద్యోగులను సైతం మోసం చేశారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరచి సినిమాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఉన్నత చదువులు ! కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యార్థుల చదువులు ఆందోళన కరంగా మారాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు రెడ్డి పోగు ప్రశాంత్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో మంజూరు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉన్నత చదువులు చదివే పరిస్థితులు ఈ ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. ఫీజు బకాయిలు, నిరుద్యోగ భృతి నిధులు రూ. 26 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా ప్రభుత్వంపై పోరాటాలు చేయడంతో తల్లికి వందనం అమలు చేశారని, అయితే అందులోనూ రూ. 8 వేల కోట్ల నిధులు ఎగ్గొట్టారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి నిధులు విడుదల చేసేంత వరకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాటం ఆగబోదన్నారు. అనంతరం కలెక్టరేట్కు వెళ్లి ఇన్చార్జ్ డీఆర్వో వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందించారు. నిరసనలో పాల్గొన్న వారు వీరే.. వైఎస్సార్సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ (పాణ్యం), బాలు (కర్నూలు), నజీర్ (ఎమ్మిగనూరు), వెంకటేష్ (కోడుమూరు), ఆశోక్ రెడ్డి (పత్తికొండ), ఆశోక్ నాయుడు (ఆలూరు), రాజశేఖర్రెడ్డి (మంత్రాలయం), వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షులు మణిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కటారి కొండ సాయికుమార్, నగర అధ్యక్షులు అన్సూర్, ఆలూరు నియోజకవర్గ అధ్యక్షులు రాజు, ఎమ్మిగనూరు (బలరాం యాదవ్), జిల్లా నాయకులు మధు, సంతోష్, మణీదీప్ రెడ్డి, హేమంత్ కుమార్, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. కర్నూలులో నిర్వహించిన ‘యువత పోరు’ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న యువకులు, నిరుద్యోగులు -
నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకం
మహానంది: మహానందీశ్వరస్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందీశ్వరస్వామికి సోమవారం సాయంత్రం ప్రదోష కాలంలో విశేష ద్రవ్యాభిషేకం నిర్వహించారు. వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, మహానందీశ్వర ఆలయ అర్చకులు మూలస్థానం సుబ్బయ్యశర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ పి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ముందుగా గణపతిపూజ, పంచామృతాలు, విశేష ద్రవ్యాలు, వట్టివేర్లతో పాటు క్షీరాభిషేకం చేశారు. పలు ప్రాంతాల భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవల ద్వారా నందీశ్వరాభిషేకం వీక్షించి స్వామివారి పూజలో పాల్గొన్నారు. -
ఘనంగా శివపార్వతుల కల్యాణం
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలోని ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మాసశివరాత్రి సందర్భంగా స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ఆలయంలో ఏకశిలా రూపంలో కొలువైన పుస్తకపాణిగా కొలనుభారతి దేవి కొత్తపల్లి: శివపురం గ్రామం సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన కొలనుభారతి దేవి పుణ్యక్షేత్రంలో సరస్వతీ దేవి అమ్మవారు పుస్తకపాణిగా భక్తులకు దర్శమిచ్చారు. బహుళ త్రయోదశి సోమవారం అమ్మవారు భక్తుల ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చన, బిల్వార్చన, అభిషేకం, మంగళహారతి వంటి విశేష పూజలు చేశారు. సోమవారం కావడంతో భక్తులు అమ్మవారిని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, వారి చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. తప్పుడు సమాచారంతో ఆర్టీఐ చట్టానికి తూట్లు కర్నూలు(సెంట్రల్): తప్పుడు సమాచారంతో దేవనకొండ తహసీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారని రాయలసీమ యువజన పోరాట సమితి అధ్యక్షుడు వీవీనాయుడు ఆరోపించారు. సోమవారం ఏక్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేవనకొండ తహశీల్దార్ కార్యాలయంలో ఏదైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు లేనిపోని ప్రశ్నలు సంధించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇటీవల తాను గుండ్లకొండ రెవెన్యూపరిధిలోని సర్వే నంబర్ 772లోని భూములకు సంబంధించిన పత్రాల కోసం దరఖాస్తు చేశానని, ఆలస్యంగా సర్వే నంబర్ 777 సర్వే సమాచారం ఇచ్చారన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
12, 13 తేదీల్లో తెలుగు భాషా పరిరక్షణ సదస్సు
కర్నూలు కల్చరల్: రాష్ట్రస్థాయి తెలుగు భాషా పరిరక్షణ సదస్సును జులై 12, 13 తేదీల్లో కర్నూలు సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ పత్తి ఓబులయ్య తెలిపారు. సోమవారం కళాక్షేత్రంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు ఒక వేదికను ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయి సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సదస్సు అధ్యక్ష ఉపాధ్యక్షులు చంద్రశేఖర కల్కూర, జేఎస్ ఆర్కే శర్మ మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారన్నారు. మొదటి రోజు కొండారెడ్డి బురుజు సమీపంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి సదస్సు జరిగే వేదిక వరకు పాదయాత్ర జరుగుతుందన్నారు. రెండో రోజు జరిగే సదస్సులో బోధనా భాషగా తెలుగు, మాతృ భాషగా తెలుగు, అధికార భాషగా తెలుగు, ప్రథమ భాషగా తెలుగు అనే అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. శాసన సభ్యులు మండలి బుద్ధప్రసాద్, విశ్రాంత ఐఏఎస్ ముక్తేశ్వరరావు, తమిళనాడు రాష్ట్రం తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు తూమాటి సంజీవరావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాజపాళెం చంద్రశేఖర రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పాల్గొని సందేశమిస్తారన్నారు. తెలుగు భాషాభివృద్ధిపై కవి సమ్మేళనం, పేపర్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. సాహిత్యాభిమానులు, తెలుగు భాషాభిమానులందరూ సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సదస్సు కార్యదర్శి డాక్టర్ దండెబోయిన పార్వతీ దేవి, సభ్యులు సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు. -
26 ఎకరాలైనా చూపించండి... తల్లికి వందనమైనా ఇప్పించండి!
కోడుమూరు రూరల్: ‘ నా ముగ్గురు పిల్లలకు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద డబ్బులు రాలేదు. కారణం అడిగితే 26 ఎకరాల పొలముందంటూ చెబుతున్నారు.. డబ్బులైనా ఇప్పించండి.. లేదా పొలమైనా చూపించండంటూ’ కోడుమూరుకు చెందిన గాయత్రి అనే మహిళ అధికారులను వేడుకుంటోంది. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ నాగరాజుకు మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు నలుగురు సంతానం కాగా, ముగ్గురు కుమార్తెలు, రెండేళ్లలోపు ఒక బాలుడు ఉన్నారన్నారు. ఇందులో ముగ్గురు కుమార్తెలు ప్రస్తుతం 1, 4, 5వ తరగతులు చదువుతున్నారన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం డబ్బులు జమ కాలేదన్నారు. విషయం తెలుసుకోగా తమ కుటుంబం పేరు మీద 26 ఎకరాల భూమి ఉన్నట్లుగా చూపిస్తోందని, దీని వల్ల తమకు తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదని వాపోయారు. తమ పేరు మీద కేవలం ఎకరా 85 సెంట్ల భూమి మాత్రమే ఉందని, అధికారులు చర్యలు తీసుకుని తమకు తల్లికి వందనం పథ కం వర్తించేలా చూడాలని ఆమె తహసీల్దార్తో మొరపెట్టుకున్నారు. గాయత్రి ఇచ్చిన అర్జీని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మహిళ మొర -
మొక్కజొన్న రైతుకు కన్నీటి కష్టాలు
కుంటకు ట్రాక్టర్ సాయంతో ఇంజిన్లు అమర్చిన దృశ్యంకోవెలకుంట్ల: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఇరవై రోజులు దాటినా వరణుడు పూర్తిస్థాయిలో కరుణించకపోవడంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. వర్షాధారంగా మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులు అదునుకు వర్షం పడకపోవడంతో సాగునీటిని మళ్లించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. కోవెలకుంట్లకు చెందిన రాముడు మండలంలోని గుంజలపాడు సమీపంలో ఎకరా రూ. 15 వేలు కౌలు చెల్లించి నాలుగు ఎకరాల పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. పైరు నెల రోజుల దశలో ఉండగా సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో సాగునీటి మళ్లింపుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. పైరుకు రెండు కి.మీ దూరంలో ఎస్సార్బీసీ 10వ బ్లాక్ కాల్వ పక్కన ఉన్న కుంటలో నీరు సంవృద్ధిగా ఉంది. ఆ కుంటకు ట్రాక్టర్ ఇంజిన్ సాయంతో రెండు మోటార్లు అమర్చి నీటిని పక్కనే ఉన్న ఎస్సార్బీసీలోకి వదిలి అక్కడి నుంచి పొలానికి సమీపంలో కాల్వకు మరో డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేసి పైపుల ద్వారా పొలానికి సాగునీరు మళ్లించుకుంటున్నాడు. ట్రాక్టర్, డీజిల్ ఇంజిన్లు, పైపులు సొంతంగా ఉన్నప్పటికి డీజిల్, కూలీల రూపంలో ఒక్కో తడికి రూ. 10 వేలు వెచ్చించాల్సి వస్తోందని రైతు పేర్కొన్నాడు. ట్రాక్టర్, ఇంజిన్లు సొంతంగా లేకపోతే అదనంగా మరో రూ. 10 వేలు భారం పడేదన్నారు. ఎస్సార్బీసీకి సాగునీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వానలు లేక వాడు పడుతున్న పంట కుంటనీటిని మెటార్లసాయంతో పైరుకు మళ్లింపు -
పట్టపగలే భారీ చోరీ
● 60 తులాల బంగారం, రూ. 27 లక్షల నగదు అపహరణ ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా నగర్లో సోమవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్గా ఉన్న శరభారెడ్డి ఇంటిని దొంగలు లూటీ చేశారు. దాదాపు 60 తులాల బంగారు ఆభరణాలు, రూ. 27 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇటీవల శరభారెడ్డి కుమార్తె వివాహం జరిగింది. కాగా నల్లకాల్వ సమీపంలో ఉన్న వైఎస్సార్ స్మృతివనంలో పోస్ట్ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఉదయం కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉంచిన నగదు, బంగారు ఆభరణాలు అపహరించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోస్ట్ వెడ్డింగ్ ఫొటో సెషన్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న కుటుంబీకులు ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ రాము సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ను రప్పించి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
28లోపు ఉచిత విద్య ప్రవేశాలు
కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 12(1)(సీ) కింద 1వ తరగతి అడ్మిషన్ పొందిన విద్యార్థులందరినీ ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ఈ నెల 28వ తేదీలోపు చేర్చుకోవాలని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ తెలిపారు. కర్నూలు ఏక్యాంపులోని మాంటెస్సోరి హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ ఆన్–ఎయిడెడ్ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉచిత విద్యను అందిస్తామని దరఖాస్తూలు చేసుకున్న స్కూళ్లకు చెందిన వారందరు మొదటి, రెండో విడతల్లో సీట్లు కేటాయింపులు చేశారన్నారు. మొదటి విడతలో 384 స్కూళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా 122 స్కూళ్లకు చెందిన వారు మాత్రమే 2289 మంది విద్యార్థులకు సీట్లు కేటాయిస్తే, 1110 మందిని స్కూళ్లలో చేర్పించుకున్నారన్నారు. 1179 మందిని ఇంత వరకు 262 స్కూళ్ల యాజమాన్యాలు చేర్చుకోలేదన్నారు. రెండో విడత కింద 173 స్కూళ్లలో 1056 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారని, పెండింగ్ బిల్లులు మంజూరు చేయిస్తామని, అందుకు కావాల్సిన అకౌంట్స్, ఇతర పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని డీఈఓ హామీనిచ్చారు. ఆ తరవాత ఆంధ్రప్రదేశ్ ఆన్–ఎయిడెడ్ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల అసోసియేషన్ జిల్లా అద్యక్షులు వాసుదేవయ్య, రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డిలు యాజమాన్యాల ఇబ్బందుల గురించి డీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సీఎంఓ ధన్రాజ్, తదితరులు పాల్గొన్నారు. డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ -
టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోండి
డోన్ టౌన్: ప్రభుత్వ స్థలాలు అక్రమించి ఇతరుల పేర్ల మీద రికార్డులు తయారు చేసి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న టీడీపీ నాయకుడు, వ్యవసాయ మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ౖపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు అధికారులను కోరుతున్నారు. సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యులు ధర్మారం రంగనాయకులు ఆధ్వర్యంలో ఆర్డీఓ నరసింహులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐ వద్ద ఉన్న ప్రభుత్వ భూములు, వంక పోరంబోకు స్థలాలను ఆక్రమించి, అదే స్థలాన్ని తన సొంత స్థలంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చి దాతగా మార్కెట్యార్డు చైర్మన్ వ్యవహరించారన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చూస్తూ ఊరుకున్నారని వీరిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికార పార్టీ నేత కావడంతో చర్యలు తీసుకోవడంలో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆర్డీఓకు వివరించారు. వినతి పత్రం అందించిన వారిలో ఐఎఫ్టీయూ నాయకులు రేషు, రంగస్వామి, రాముడు, హరి, సుధాకర్, రామనాయుడు తదితరులు ఉన్నారు. కొనసాగుతున్న పాలిసెట్ కౌన్సెలింగ్ కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు హెల్ప్ డెస్క్ సెంటర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతోంది. రెండో రోజు సోమవారం మొత్తం 200 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను వెరిఫై చేసి, విద్యార్థులకు రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. హెల్ప్లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్.ఎన్ ప్రసాద్, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ రామకృష్ణయ్య కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించారు. వెరిఫికేషన్కు హాజరైన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చునని కో–ఆర్డినేటర్ తెలిపారు. నిరుపయోగం మద్దికెర: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏడేళ్ల క్రితం ఆర్ఎంఎస్యూ ఫేస్ –3 నిధులతో అదనపు గదులు నిర్మించారు. ఇంతవరకు వాటిని ఉపయోగించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. లక్షలాది రూపాయలతో నిర్మించిన గదులు ఎలాంటి ఉపయోగం లేకుండా శిథిలావస్థకు చేరుతుండడంతో ప్రజాధనం వృథా అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
తలుపులు తెరుచుకున్న వసతి గృహాలు
ఆలూరు: ఎట్టకేలకు బీసీ బాలుర వసతి గృహం, ప్రభుత్వ కళాశాల బాలుర విద్యార్థులకు కోసం ఏర్పాటు చేసిన వసతి గృహం తెరుచకున్నాయి. వసతి గృహాలు మూతబడి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సాక్షి దినపత్రికలో వార్తా కథనం రావడంతో అధికారులు స్పందించారు. ఆలూరు–ఎల్లార్తి రోడ్డు సమీపంలో ఉన్న వసతి గృహాలను సోమవారం ఏఎస్బిడబ్ల్యూఓ శ్రీనివాసులు తనిఖీ చేశారు. వసతి గృహాలను తెరిపించి విద్యార్థులు అందులో చేర్చించి వారితో ఏఎస్బిడబ్ల్యూఓ మాట్లాడారు. హెచ్డబ్ల్యూఓలు బదిలీలతో వసతి గృహాల ప్రారంభం కాస్త ఆల్యమైయిందన్నారు. కళాశాల వసతి గృహానికి అనిమిరెడ్డి, బీసీ బాలు వసతి గృహానికి బదిలీపై వెళ్లిన సంపత్కుమార్ ఇన్ చార్జ్హెచ్ డబ్ల్యూఓగా విధులను నిర్వహిస్తారన్నారు. ఇక నుంచి విద్యార్థులకు అసౌకార్యలను కల్పించకుండా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. -
బాబూ.. దాహం తీర్చండి
కౌతాళం: పక్షం (15) రోజులుగా మంచినీరు లేకపోవడంతో కౌతాళంలోని అత్తర్వీధికి చెందిన ప్రజలు సోమవారం రోడ్డు ఎక్కారు. కౌతాళం అంబేద్కర్ సర్కిల్లో ఖాళీబిందెలతో బైఠాయించారు. ‘బాబూ.. దాహం తీర్చండి’ అంటూ నినదించారు. విషయం తెలుసుకున్న గ్రామ కార్యదర్శి ప్రకాశం, సర్పంచ్ పాల్దినకర్లు అక్కడి చేరుకుని ప్రజలతో చర్చించారు. ‘మంచినీరు 15 రోజులకొకసారి వదులుతారా ఇది ఎక్కడి న్యాయం’ ప్రజలు అడిగారు. ఈనెల 6 నుంచి మంచినీరు రావడం లేదని నిలదీశారు. తమ కాలనీలో కాదు గ్రామంలో ఎక్కడా చేతిపంపు కూడా లేదని నీటి కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. రోడ్డు ప్రజలు ఆందోళన చేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఉప్పరవీధి నుంచి అత్తార్ వీధి తాగునీరు వదిలారు. పోలీస్టేషన్ నుంచే వచ్చే పైప్లైన్కు డమ్మీ ఏర్పాటు చేసి ఉప్పరవీధి నుంచే తాగునీరు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పైప్లైన్ నుంచి కూడా నీరు రాకపోతే వాల్ ఏర్పాటు చేస్తామని సర్పంచ్ పాల్దినకర్ హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు ఆందోళన విరమించారు. మంచి నీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు -
ఎల్లెల్సీ పనుల్లో టీడీపీ ‘పైసా’చికం!
ఆలూరు: నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వకుండా నాసిరకంగా తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) పనులు చేస్తున్నారు. టీడీపీ నేతలు కమీషన్లు ఇవ్వాలని ఒత్తిళ్లు చేస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేసి బిల్లులను దండుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంజినీర్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఎల్లెల్సీ పనుల్లో నాణ్యత కొరవడింది. ఆలూరు నియోజకవర్గంలో 135 కి.మీ. వద్ద ఎల్లెల్సీ కనిపిస్తుంది. ప్రస్తుతం 135 కి.మీ. నుంచి 138 వరకు, హాలహర్వి మండలంలో 155 నుంచి 156 కి.మీ. వరకు, అలాగే 220 నుంచి 222 కి.మీ. వరకు ఎల్లెల్సీ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కాలువ పరిధిలో 155 నుంచి 156 కి.మీ. వరకు 950 మీటర్ల మేర లైనింగ్ సైడ్ వాల్ కడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 10 ఎంఎం కడ్డీలకు బదులు 8 ఎంఎం కడ్డీలు వాడుతున్నారు. అలాగే 20 ఎంఎం చిప్స్కు బదులు 15 ఎంఎం చిప్స్ను, నాణ్యతలేని ఇసుకను వినియోగిస్తున్నారు. ‘చిన్న’బోయిన పనులు కాలువ 155 నుంచి 156 కి.మీ. వరకు చిన్నగా ఉంది. అధిక క్యూసెక్కుల నీటిని తట్టుకోవాలంటే అందుకు కాలువ ఎత్తుతోపాటు డిజైనింగ్ కోసం రూ.6.5 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కాంట్రాక్టర్లు రాళ్లపైనే కడ్డీలను కడుతున్నారు. దీంతో కాలువ నీటి ప్రవాహంలో అవి కొట్టుపోయే పరిస్థితి నెలకొంది. ● చింతకుంట పరిధిలో 136 నుంచి 138 కి.మీ. వరకు జరుగుతున్న పనులకు ముందుగా ఎర్రమట్టి వేయాలి. అలాకాకుండా పనులు కొనసాగిస్తున్నారు. ● హొళగుంద పరిధిలో 202 నుంచి 222 కి.మీ. వరకు లైనింగ్ పనులు చేయగా అప్పుడే పెచ్చులూడిపోయాయి. ఇదీ దుస్థితి.. ఖరీఫ్ సీజన్లో సాగు, తాగునీటి విడుదలపై ఈనెల 27న తుంగభద్ర బోర్డు అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అయితే ఎల్లెల్సీ పనులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జరగలేదు. పనులు నాసిరకంగా ఉన్నాయి. ఈఈ, డీఈఈల పర్వేక్షణ అంతంతా మాత్రంగానే ఉంది. కాలువలో నీరు దిగువకు వచ్చేనా అని ఆదోని, ఎమ్మినూరు, కోడుమూరు డివిజన్లకు సంబంధించిన ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతలకు మేలు చేయాలి రైతుల సమస్యలను టీడీపీ నేతలు పట్టించుకోరు. వారికి వారి సొంత ప్రయోజనాలే ముఖ్యం. ఎక్కడ పనులు చేస్తున్నా వారికి కమీషన్లు ఇవ్వాలి. ఎల్లెల్సీ పనుల్లో నాణ్యత ఎలా ఉందో అధికారులకే తెలియాలి. అన్నదాతలకు మేలు చేసే విధంగా పనులు చేయాలి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. – బి. విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే తూతూ మంత్రంగా తుంగభద్ర దిగువ లైనింగ్ పనులు కొరవడిన ఇంజినీర్ల పర్యవేక్షణ కమీషన్లు ఇవ్వాలని టీడీపీ నేతల ఒత్తిళ్లు?ఫిర్యాదులు ఇవీ.. ఎల్లెల్సీ పనులు చేసే కాంట్రాక్టర్లు కచ్చితంగా కమీషన్లు ఇవ్వాలని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే పనులు చేయించబోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంజినీర్లుపై కూడా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. టీడీపీ నేతలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవద్దంటూ టీడీపీ ప్రజాప్రతినిధులతో చెప్పించిట్లు తెలుస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గూటుపల్లె విజ య్, తెలుగు మహేష్ ఆదివారం అర్ధరాత్రి బైక్పై ప్రధాన రహదారిపైకి వస్తుండగా మద్దిలేటి స్వామి ఆలయ ముఖ ద్వారం వద్ద అదే సమయంలో బేతంచెర్ల వైపు నుంచి డోన్ వైపు వెళ్తున్న బొలొరే వాహనం ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రగాయాల పాలైన గూటుపల్లె విజయ్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాల పాలైన తెలుగు మహేష్ను మెరు గైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు మహేష్కు భార్య పవిత్ర ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. కాగా అదే ప్రాంతంలో కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమా దాలు జరిగే అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పొలం రస్తా తగాదా.. రైతు ఆత్మహత్య ఆలూరు రూరల్: పొలం రస్తా విషయంలో పక్కన పొలానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తితో గొడవ పడి గోపాల్ (43) అనే రైతు పురుగుల మందుతాగి ఆత్మహ్యత చేసుకున్నాడు. మండలంలోని హులేబీడు గ్రామంలో ఆదివారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ మహబూబ్ తెలిపిన వివరాలు.. పొలం రస్తా విషయంలో హులేబీడు గ్రామానికి చెందిన వెంకటేష్తో గోపాల్కు కొన్ని రోజుల నుంచి తగాదాలు ఉన్నాయి. ఆదివారం సాయంత్రం వెంకటేష్తో గోపాల్ గొడవపడ్డాడు. రస్తా విషయం ఎప్పటికీ తెగదని మనస్తాపానికి గురైన గోపాల్ (43) ఆదివారం రాత్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన బంధువులు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. 108 అంబులెన్సులో తరలిస్తుండగా గోపాల్ కోలుకోలేక మృతిచెందాడు. మృతుడి భార్య తాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహబూబ్ బాషా విలేకరులకు తెలిపారు. -
పెద్దాసుపత్రిలో ముగ్గురికి అరుదైన ఆపరేషన్లు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని యురాలజి విభాగంలో ముగ్గురు రోగులకు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. వివరాలను సోమవారం యురాలజి విభాగంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లుతో కలిసి ఆ విభాగం ఇన్ఛార్జి హెచ్వోడి డాక్టర్ పి.ముత్యశ్రీ వివరించారు. ● కోడుమూరుకు చెందిన బావన్న(75)కు మూత్ర సంచి, కుడి కిడ్నీకి క్యాన్సర్ ఉంది. ల్యాప్రోస్కోపిక్ విధానంలో ఆయనకు ఈ నెల 12న కిడ్నీ, మూత్రసంచిని తొలగించారు. ● ఎమ్మిగనూరుకు చెందిన శ్రీనివాసులు(55)కు కుడి కిడ్నీలో క్యాన్సర్ ఉంది. ఈ క్యాన్సర్ శరీరంలోని పెద్ద రక్తనాళాలైన అయోట్రా, ఐవీసీకి చుట్టుపక్కల ఉన్న లింప్ గ్రంధులకు పాకి, వాటికి అతుక్కుని ఉన్నాయి. ఈయనకు ల్యాప్రోస్కోపిక్ విధానంలో 13వ తేదిన కిడ్నీతో పాటు లింప్ గ్రంధిని తీసివేశారు. ● ఆత్మకూరుకు చెందిన అఫ్జల్బీ(59)కి అడ్రినల్ గ్రంధిలో 12 సెం.మీల క్యాన్సర్ కణితి ఉంది. ఆమె అధిక బరువు ఉండటం వల్ల పెద్దకోత లేకుండా ల్యాప్రోస్కోపిక్ విధానంలో ఈ నెల 16న ఆపరేషన్ చేసి తొలగించారు. ఈ ఆపరేషన్లు డాక్టర్ ముత్యశ్రీతో పాటు యూరో ఆంకాలజిస్టు డాక్టర్ సేపూరి బాలరవితేజ, యురాలజిస్టులు రాజశేఖర్, మహేష్, అరుణ, అనెస్టెటిస్ట్ డాక్టర్ మురళీప్రభాకర్ నిర్వహించారు. -
ఖాతాలకు ఎన్పీసీఐ లింకు తప్పనిసరి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు తల్లికి వందనం నిధులు విడుదల కావాలంటే తల్లి పోస్టల్ లేదా బ్యాంకు ఆధార్ నెంబర్ ఖాతాలకు ఎన్పీసీఐ లింక్ చేయాలని ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.తులసీ దేవి తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఎంపీడీఓ, ఏఎస్డబ్ల్యూఓ, గ్రామ/వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు తమ పరిధిలోని అర్హత కలిగిన విద్యార్థులను గుర్తించి ఎన్పీసీఐ లింకు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు 9, 10 తరగతులకు చెందిన 164 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ పెండింగ్లో ఉందన్నారు. అలాగే 764 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల ఖాతాలకు కూడా ఎన్పీసీఐ లింక్ కాలేదన్నారు. ఎస్సీ విద్యార్థులకు సింగల్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే, అది కూడా విద్యార్థి ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాకు తల్లికి వందనం నిధులు విడుదల అవుతాయన్నారు. రేపటిలోగా ఎన్పీసీఐ ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె కోరారు. ఆశా కార్యకర్త పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ పి.శాంతికళ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 32, పట్టణ ప్రాంతాల్లో 12 ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, జీతం మొదలైన వివరాలు, దర ఖాస్తు నమూనాలు https://kurnool.ap.gov.in వెబ్సైట్లో ఉంచామన్నారు. నిర్ణీత దరఖాస్తు నమూనాను డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఈ నెల 24వ తేది ఉదయం 10 గంటల నుంచి 28వ తేది సాయంత్రం 5 గంటల వరకు అర్బన్ ప్రాంతం వారు వార్డు సచివాలయం పరిధిలోని యుపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్కు, గ్రామీణ ప్రాంతం వారు ఆ గ్రామం పరిధిలోని పీహెచ్సి మెడికల్ ఆఫీసర్కు స్వయంగా అందజేయాలన్నారు. నియామకాలు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ(డీహెచ్ఎస్) ఆధ్వర్యంలో చేపడతామన్నారు. కార్డియాలజీ హెచ్ఓడీగా డాక్టర్ ఆదిలక్ష్మి కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ హెచ్ఓడీగా డాక్టర్ బి.ఆదిలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. వైజాగ్కు చెందిన ఈమె ఎంబీబీఎస్, జనరల్ మెడిసిన్ కాకినాడ ఆర్ఎంసీ కళాశాలలో అభ్యసించారు. అనంతరం వైజాగ్లోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో డీఎం కార్డియాలజీ పూర్తి చేశారు. 2008లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వైజాగ్లో చేరారు. ఆ తర్వాత 2015లో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల కార్డియాలజీ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. 2019 నుంచి తిరిగి వైజాగ్లో విధులు నిర్వహించి 2022లో అక్కడే హెచ్ఓడీగా బాధ్యతలు నిర్వర్తించారు. 16 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని 16 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద సగటున 5.3 మి.మీ వర్షపాతం నమోదైంది. దేవనకొండలో 31.6 మి.మీ, ఆదోనిలో 16.2, నందవరంలో 14.2, కోసిగిలో 12.2, గూడూరులో 12.2, పెద్దకడుబూరులో 10.2 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. కౌతాళం, ఎమ్మిగనూరు, ఆస్పరి, కర్నూలు రూరల్, అర్బన్ మండలాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 69.1 మి.మీ వర్షపాతం నమోదైంది. మే నెలలో మురిపించిన వర్షాలు.. జూన్ నెలలో నిరాశకు గురి చేస్తుండటంతో పంటల సాగులో పురోగతి లోపించింది. శ్రీశైలానికి తగ్గిన వరద శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. గత ఆదివారం ఎగువ ప్రాజెక్ట్ల నుంచి 76,178 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చింది. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేసుల నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. దీంతో ఆదివారం నుంచి సోమవారం వరకు 60,336 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదనను గత ఐదు రోజుల నుంచి నిలిపివేశారు. బ్యాక్ వాటర్ నుంచి కూడా దిగువ ప్రాంతాలకు నీటిి విడుదల నిలిలిచిపోయింది. డ్యాం నీటిమట్టం 857 అడుగులకు చేరుకుంది. -
విద్యార్థులకు ఉప్పు నీరే దిక్కు
పత్తికొండ: పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులు ఉప్పు నీరు తాగి దాహం తీర్చుకుంటున్నారు. పాఠశాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్ఆర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్లాంట్ను పట్టించుకోవడం లేదు. దీంతో బడిలో చదువుతున్న విద్యార్థులకు నీటి కష్టాలు తప్పడం లేదు. బాలుర ఉన్నత పాఠశాలలో 900 మంది చదువుకుంటున్నారు. మామూలు సమయంతో పాటు మధ్యాహ్నం భోజనం అనంతరం విద్యార్థులు ఉప్పునీరు తాగుతూ రోగాలు బారిన పడుతున్నారని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి విద్యార్థులకు మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
బ్యాంకు ఉద్యోగితో భార్య వివాహేతర సంబంధం.. చివరికి..!
కర్నూలు: కర్నూలు టీజే మాల్లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమలరావు దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల రాజవీధిలో ఉంటున్న ప్రైవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32)ను వివాహేతర సంబంధంతో హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తిరుమలరావు అదే బ్యాంకులో పనిచేసే కల్లూరుకు చెందిన చిరుద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అలాగే కూతురుతో కూడా వివాహేతర సంబంధం కొనసాగించే ప్రయత్నం చేశాడు. అప్పటికే గద్వాలకు చెందిన తేజేశ్వర్ను ఆ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సర్వేయర్ను హత మార్చాలని యువతి తల్లితో కలిసి తిరుమలరావు పథకం పన్నాడు. ల్యాండ్ సర్వే చేయించాలని స్నేహితుల ద్వారా తేజేశ్వరరావును కర్నూలుకు రప్పించి రహస్య ప్రాంతంలో హత్య చేసి పాణ్యం సమీపంలోని పిన్నాపురం రస్తాలో పడేశారు. అయితే సర్వేయర్ తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతని సోదరుడు తేజవర్థన్ ఐదు రోజుల క్రితం గద్వాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం శనివారం కర్నూలుకు వచ్చి విచారించారు. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు సంబంధించిన స్నేహితులను అదుపులోకి తీసుకొని కర్నూలు మూడో పట్టణ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద తేజేశ్వర్ మృతదేహం ఉన్నట్లు గుర్తించి పాణ్యం పోలీసుల సహయంతో మృతదేహాన్ని వెలికి తీసి ఆదివారం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి గద్వాల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. హత్య కుట్రకు వెనుక మరి కొందరి హస్తం ఉన్నట్లు గద్వాల పోలీసులు భావించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గొంతు కోసి.. మృతదేహాన్ని పడేసి పాణ్యం: తేజేశ్వర్ను అత్యతం కిరాతకంగా హత్య మార్చారని పాణ్యం ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. కారులోనే తేజేశ్వర్ను గొంతు కోసి హత్య చేశారని, నన్నూరు టోల్ప్లాజా మీదుగా పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద పిన్నాపురం రస్తాలో పడేశారన్నారు. కారులో వచ్చిన వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కారు కోసం గద్వాల్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు ఉండగా మరో కీలక వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. -
సెల్ఫోన్ వాడకంతో మాటలు రాని చిన్నారులు
కర్నూలు వెంకటరమణకాలనీకి చెందిన శివరాముడుకి ఒక కుమారుడు ఉన్నాడు. పాలుతాగాలన్నా, ఏదైనా తినాలన్నా మొబైల్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ బాలునికి మూడేళ్ల వయస్సు. ఇప్పటికీ ఆ బాలుడికి మాటలు రావడం లేదు.కర్నూలుకు చెందిన లలితకుమారికి భర్త ఇటీవలే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారున్ని అల్లారుముద్దుగా పెంచేందుకు ఆమె రెండేళ్ల వయస్సు నుంచే పిల్లాడిని గారాబం ఎక్కువ చేసింది. ఈ క్రమంలో ఆ బాలుడు సెల్ఫోన్కు ఎక్కువగా బానిసయ్యాడు. అర్ధరాత్రి 2 గంటలైనా సెల్ఫోన్ చూస్తూ గడిపేవాడు. ఈ క్రమంలో బాలుడు నాలుగేళ్ల వయస్సు వచ్చినా మాట్లాడటం లేదు.ఒకప్పుడు చంటిపిల్లలకు చందమామను చూపి గోరుముద్దలు తినిపించేవారు. ఆ తర్వాత తరం వారు వీధిలోకి వెళ్లి జంతువులు, ఇతర పిల్లలను చూపిస్తూ అన్నం పెట్టేవారు. గత తరం వారు టీవీలో కార్టూన్ బొమ్మలు చూపించి పిల్లలకు భోజనం పెట్టేవారు. కానీ నేటితరం మాత్రం మొబైల్ చేతికిచ్చి భోజనం తినిపిస్తున్నారు. అలవాటైన చిన్నారులు రాత్రింబవళ్లూ మొబైల్ కావాలంటున్నారు. దీంతో వారికి మూడేళ్ల వయస్సు వచ్చినా మాటలు రాని పరిస్థితి నెలకొంటోందని, చిన్న పదాలు కూడా పలకడం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. – కర్నూలు(హాస్పిటల్)ఒకప్పుడు ప్రతి ఇంట్లో పిల్లలకు అమ్మానాన్నలతో పాటు తాతయ్య, నానమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, అత్తమ్మలు ఉండేవారు. వీరందరూ పిల్లలను ఆడిస్తూ పెంచేవారు. బయటకు తీసుకెళ్లి ప్రపంచాన్ని చూపించి పిల్లలను ఆనందింపజేసేవారు. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరూ బిజీగా మారారు. చిన్నకుటుంబాలు ఎక్కువ కావడంతో పిల్లలను ఆడించేవారు కరువయ్యారు. వారికి సెల్ఫోన్లో వచ్చే ఆటలే ఆటవస్తువులుగా మారాయి. అందులో వచ్చే కార్టూన్ బొమ్మలను, రంగులను చూసి పిల్లలు ఆకర్షితులు అవుతున్నారు. రెండేళ్ల వయస్సు కూడా రాకముందే పెద్దల కంటే మిన్నగా మొబైల్ను ఆపరేట్ చేసేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వారి ఉత్సాహం, చైతన్యం చూసి ఆ వయస్లులోని చిన్నారులను చూసి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పెద్దలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మాట ముచ్చట కురువై.. అతి చిన్న వయస్సులోనే సెల్ఫోన్లోని ఫీచర్లను వాడేయడం, యూట్యూబ్తో పాటు సోషల్ మీడియాను ఎలా వాడాలో పెద్దలకు చూపించడం వంటివి నేర్వడంతో సంతోషించడం పెద్దల వంతైంది. ఈ క్రమంలోనే వారికి మూడేళ్లు వచ్చినా మాటలు రాకపోవడం చాలా మంది గమనించలేకపోతున్నారు. ఒకప్పుడు ఏడాదిన్నరకే అమ్మా నాన్నతో పాటు అవ్వా తాత, అత్తమ్మ, మామ అనే చిన్న చిన్న పదాలు పలికేవారు. రెండేళ్ల వయస్సుకు పొట్టిపదాలతో మాట్లాడేవారు. మూడేళ్లకు వచీ్చరానీ మాటలతో గలగలా మాట్లాడుతూ అల్లరి చేసేవారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఆ ముచ్చటే కరువైంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా సెల్ఫోన్లకు బానిసలు కావడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. చికిత్స కోసం ఆసుపత్రులకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని బాలల సత్వర చికిత్స కేంద్రంలో గత ఐదేళ్లలో పుట్టుకతో వచ్చిన లోపాలతో పాటు ఎదుగుదల లోపాలతో వచ్చే చిన్నారులు కూడా ఉన్నారు. వీరిలో అధిక శాతం చిన్నతనంలోనే మొబైల్ వాడకం వల్ల మాటలు రాకపోవడంతో పాటు దృష్టిలోపం, వినికిడిలోపం, నేర్చుకోలేకపోవడం, భాష తెలియకపోవడం వంటి లోపాలతో వస్తున్నారు. ఇక్కడే గాకుండా చిన్నపిల్లల విభాగంలోనూ ఇలాంటి చిన్నారులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు,క్లినిక్లలోనూ ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఇలాంటి చిన్నారులను చూస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చిన్నతనంలో ఎక్కువ సమయం డిజిటల్ తెరలను చూడటంతో వారిలో సమాజంలో ఇతరులను కలిసే తత్వం తగ్గుతుంది. పిల్లలు ఆటల పట్ల దృష్టి పెట్టే సమయాన్ని తగ్గిస్తాయి. ఎక్కువసేపు మొబైల్ చూసే పిల్లల్లో ఊబకాయం వస్తుంది. ఇది భవిష్యత్లో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారు నిద్రించే సమయాన్ని తగ్గిస్తుంది. డిజిటల్ తెరల నుంచి వెలువడే నీలికాంతి ఎండోజెనస్ మెలటోనిన్ను అణిచివేస్తుంది. మొబైల్కు దూరంగా ఉంచడమే మేలు పిల్లల భాషా నైపుణ్య అభివృద్ధికి మొబైల్ తెరలే అవరోధంగా నిలుస్తున్నాయి. అల్లరి మాని్పంచేందుకు, ఆహారం తినిపించేందుకు అలవాటు పడిన ఈ మొబైల్ ఫోన్ వారిని బానసలుగా మార్చుకుంటోంది. ఈ క్రమంలో చిన్నారుల ఎదుగుదలపై అవి తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ఇంట్లోని పెద్దలు సైతం వారి ఇంట్లోని చిన్నారులను మొబైల్కు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఈ మేరకు ముందుగా పిల్లల ముందు పెద్దలు సైతం మొబైల్ ఎక్కువగా వాడకుండా ఉండటమే మేలు.పెద్దలు వాడకపోతే పిల్లలు అటువైపు దృష్టి సారించరు. ఈ సమయంలో పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలను కొనివ్వడం, ఆటలు ఆడించడం, మైదానాలు, పార్కులకు తీసుకెళ్లి ఆడించడం, బందువుల ఇళ్లకు తీసుకెళ్లి వారిని పరిచయడం చేయించడం, వారి పిల్లలతో స్నేహం చేయించడం వంటివి చేయాలి. అప్పుడే పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి చెందుతుంది. -
కౌన్సెలింగ్ ఆలస్యం.. అస్తవ్యస్తం
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు ఇటీవలే కూటమి ప్రభుత్వం రెన్యూవల్ చేసింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి కావడంతో మిగిలిన ఖాళీల్లో 1998 డీఎస్సీ, 2008 డీఎస్సీలకు చెందిన మినిమం టైం స్కేల్ టీచర్లను నియమించేందుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ఎంటీఎస్ టీచర్లకు స్థానాలు కేటాయించేందుకు కర్నూలు సమగ్ర శిక్ష కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కాకుండా ఆలస్యంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల మధ్య సీనియారిటీ విషయంలో వాగ్వాదం జరిగింది. విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహి స్తామని చెప్పినా వివాదం సమసిపోలేదు. దీంతో విద్యాశాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కౌన్సెలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చి అధికారులు పిలిచిన వారిని మాత్రమే హాల్లో అనుమతించారు. మిగిలిన వారిని బయటకు పంపించారు. ఆ తరువాత కౌన్సెలింగ్ మొదలైంది. ముందుగా ఉర్దూ, కన్నడ మీడియం టీచర్లకు స్కూళ్లను కేటాయించారు. కౌన్సెలింగ్ ఆలస్యం కావడం..వర్షం రావడంతో ఎంటీఎస్ టీచర్లు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 3,296 ఖాళీలను చూపిన విద్యాశాఖ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక మిగిలిన ఖాళీలలో ఎంటీఎస్ టీచర్లను నియమించేందుకు విద్యాశాఖ ఉమ్మడి జిల్లాలో 3296 టీచర్ పోస్టుల ఖాళీలను చూపించారు. అయితే ఇందులో పశ్చిమ ప్రాంతంలోని స్కూళ్లలోనే అధిక శాతం ఖాళీలు ఉన్నాయి. 1998, 2008 డీఎస్సీలకు చెందిన ఎంటీఎస్ టీచర్లు ఉమ్మడి జిల్లాలో 353 మంది ఉన్నారు. వీరందరికీ జాబితాలో ఉండే సీరియల్ నంబరు ఆధారంగా ఆయా మండలాల్లోని ఖాళీలను చూపించి స్కూళ్లను కేటాయించారు. ఎంటీఎస్ టీచర్లను నియమించినా కూడా ఇంకా జిల్లాలో 2, 943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. ఇందులో 2024 డీఎస్సీ ఎస్జీటీ తెలుగు మీడియం 1,671, కన్నడ మీడియం 28 పోస్టులు, ఉర్దూ మీడియం పోస్టులు 118 పోయినా 1,126 టీచర్ పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉండనున్నాయి. ఎంటీఎస్ టీచర్ల మధ్య వాగ్వాదం -
కారు బీభత్సం
● పలువురికి గాయాలు కర్నూలు కల్చరల్: కర్నూలు నగరంలో ఆదివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రాజ్విహార్ నుంచి సీక్యాంప్ వైపు వెళుతున్న కారు బుధవారపేట వద్ద బైక్పై వెళుతున్న జయచంద్ర అనే వ్యక్తిని, త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న ఎస్ఐ ఆశలతను ఢీకొట్టింది. ప్రమాదంలో జయచంద్రకు తీవ్ర గాయాలు కాగా, ఎస్ఐకి కాలు విరగడంతో హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతకుముందు మార్గ మధ్యలో ఐదారుగురిని ఢీకొట్టింది. కర్నూలు కలెక్టరేట్లోని చీకటి ప్రాంతంలో కారును వదిలేశారు. కారు నడుపుతున్న వ్యక్తి న్యాయవాది శ్రీనివాసులుగా గుర్తించారు. అతన్ని బ్రీత్ అనలైజర్తో పరీక్షించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
గోనెగండ్లలో కలుషిత నీటి సరఫరా
గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లలో కొన్ని రోజులుగా మంచినీటి కుళాయిలకు కలుషిత నీరు వస్తోంది. పాచి పట్టి దుర్వాసనతో వస్తుండటంతో ఆ నీటిని తాగేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోనెగండ్లలో 30 వేల మంది ప్రజలు ఉండగా ఎస్ఎస్ ట్యాంక్ నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం కుళాయిలకు పచ్చటి పాచి పట్టి దుర్వాసనతో కూడిన నీరు వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నీటిని తాగితే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు రద్దీ కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు స్పర్శ దర్శనం టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు. -
ఆర్యూలో అనధికార ఉద్యోగులు
జీతాలు చెల్లించడం లేదు వర్సిటీలో అనధికారికంగా కొందరు విధులు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. గతంలో నలుగురు డైలీ వేజ్ కింద వచ్చి విధులు నిర్వహించే వారు. మధ్యలో మానేసి మళ్లీ వస్తున్నారు. వారికి ఎలాంటి జీతం ఇవ్వడం లేదు. ఒక ఎలక్ట్రీషియన్ను గతంలో రెండు నెలలు వచ్చి విధు లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే రావొద్దమని చెప్పాం. ఒక నెల రాలేదు. ఈ మధ్యలో వస్తున్నట్లు తెలిసింది. జీతం కోసం ఇటీవల నాదగ్గరికి వచ్చాడు. జీతం చెల్లించలేమని చెప్పాం. – విజయకుమార్ నాయుడు, రిజిస్ట్రార్, ఆర్యూ సీఎంఓ చెప్పింది.. ఉద్యోగం చేపిస్తాం ● సీఎంఓలో విద్యా వ్యవహారాలు చూసే ప్రొఫెసర్ సిఫారసుతో ఒకరికి ఉద్యోగం ● ఎలాంటి ఉద్యోగ ప్రకటన, నియామకం లేకుండానే ఎలక్ట్రీషియన్గా విధులు ● కీలకమైన పరీక్షల విభాగంలో ప్రైవేటు కళాశాల ఉద్యోగికర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయంలో అనధికారికంగా కొందరు వ్యక్తులు ఉద్యోగులుగా చలామణి అవుతున్నారు. వీరికి వర్సిటీ ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో రెగ్యులర్ వైస్ఛాన్సలర్గా విధులు నిర్వహించిన ప్రొఫెసర్ నలుగురికి డైలీ వేజ్ కింద విధులు నిర్వహించేలా ఒక సర్క్యులర్ జారీ చేశారు. దాని ప్రకారం వారు వర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. తరువాత వచ్చిన వీసీ గతంలో వీసీ జారీ చేసిన సర్క్యులర్లో స్పష్టత లేకపోవడంతో వారిని విధులు నిర్వహించొద్దని ఆదేశించారు. దాంతో వారు కొన్ని రోజులు విధులకు హాజరు కాలేదు. ఇంజినీరింగ్ సెక్షన్లోని ఓ ఉద్యోగి జోక్యం చేసుకొని వారితో లోపాయికారీ ఒప్పందం చేసుకొని మళ్లీ విధులకు హాజరయ్యేలా వీసీతో మాట్లాడటంతో తిరిగి విధులు నిర్వహిస్తున్నారు. నెలల కొద్దీ విధులు నిర్వహిస్తున్నా వీరికి ఎలాంటి నియామక ప్రకటన, ఉత్తర్వులు లేకపోవడంతో వీరు అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. ● సీఎంఓలో విద్యా వ్యవహారాలు చూసే ఓ సీనియర్ ప్రొఫెసర్ సిఫారసుతో ఎలాంటి ప్రకటన లేకుండా, ఉన్నత విద్యా మండలి, ఫైనాన్స్ అనుమతి లేకుండానే ఆర్యూ అధికారులు ఒకరికి ఉద్యోగం కల్పించారు. ఇతను తెలంగాణ రాష్ట్రం రాజోలికి చెందిన వ్యక్తిగా వర్సిటీలో చర్చ జరుగుతోంది. ఇతను మూడు నెలలుగా ఎలాంటి నియామక పత్రం లేకుండానే అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదకరమైన ఎలక్ట్రీషియన్ పనులు ఇతనితో చేయిస్తున్నారు. విధులకు హాజరు అవుతున్న సదరు ఉద్యోగి జీతం ఇవ్వాలని వర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఎవరైనా ఎమైనా అడిగితే సీఎంవో నుంచి ఆదేశాలు ఉన్నాయి.. అవసరం ఉన్నప్పుడు పనిచేయించుకుంటున్నామని వర్సిటీ ఉన్నతాధికారులు చెబుతున్నారని చర్చించుకుంటున్నారు. ● వర్సిటీలో కీలకమైన పరీక్షల విభాగంలో ఆ విభాగం అధికారి తన సొంత నిర్ణయంతో ప్రైవేట్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగితో పనిచేయించుకుంటున్నారని బహిరంగాంగానే చర్చించుకుంటున్నారు. ఇతను కేవలం కళాశాల ప్రిన్సిపాల్తో అనుమతి తీసుకొని పరీక్షల విభాగంగా విద్యార్థుల మార్క్స్మెమోస్, ప్రొవిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫై చేయిస్తున్నట్లు చెబుతున్నారు. వర్సిటీ ఉన్నతాధికారులకు ఈ సమాచారం తెలియదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి కీలకమైన కాన్ఫిడెన్సియల్ అయిన పరీక్షల విభాగంలో అనధికారికంగా ఒక వ్యక్తితో పనిచేయించుకోవడంపై తీవ్రమైన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ● ఇలా వర్సిటీలో అనధికార ఉద్యోగులు కీలకమైన పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వర్సిటీలో ఎంత మంది ఉద్యోగులు అధికారికంగా, ఎంత మంది అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నారో అనే సరైన సమాచారం వర్సిటీ ఉన్నతాధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. అధికారంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకే వివిధ కారణాలతో సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా కాకుండా వర్సిటీ ఇంటర్నల్ ఫండ్స్ నుంచి జీతాలు చెల్లిస్తుండటంతో వర్సిటీ ఖజానా మొత్తం ఖాళీ అవుతుందని, వర్సిటీ అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవడం ఇబ్బందికరమేని మేధావులు అభిప్రాయపడుతున్నారు. -
హామీల అమలులో ఘోర విఫలం
హొళగుంద: వివిధ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి విమర్శించారు. హామీల అమలులో సీఎం చంద్రబాబు ఘోర విఫలం చెందారన్నారు. హొళగుందలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికి చేసే ఖర్చులు ప్రజల బాగు కోసం చేస్తే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద ఇంకా 60 శాతం మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ కాలేదన్నారు. అన్నదాత సుఖీభవ పథకంతో రైతుల ఖాతాల్లో నగదు వేస్తామని ఈ నెల 20న చెప్పినా..ఇప్పటి వరకు ఆచరణ కాలేదన్నారు. ఏడాది దాటినా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉచిత గ్యాస్ చాలా మంది అర్హులకు అందడం లేదన్నారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్, ఆడబిడ్డ నిధి తదితర పథకాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గుణపాఠం తప్పదు హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధింపుల పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం జరగక తప్పదని ఎమ్మెల్యే అన్నారు. కర్నూలులో సోమవారం నిర్వహించే యువత పోరు కార్యక్రమానికి నిరుద్యోగులు, యువత తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే వెంట కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మండల కన్వీనర్ షఫివుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, నాయకులు ఈశా, కోగిలతోట శేషప్ప, కెంచప్ప, మల్లికార్జున, హనుమప్ప, సమ్మతగేరి నాగరాజు, వెంకటేష్, సిద్దయ్య, లక్ష్మన్న, సిద్దప్ప, శేఖర్ తదితరులు ఉన్నారు. ప్రజలను పట్టించుకోని ప్రభుత్వం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి -
చదువుకే ప్రాధాన్యం..
ఇంటర్లో అందరికీ తొలి ప్రాధాన్యం చదువే కావాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులిచ్చే నోట్స్ను ఎప్పటికప్పుడు చక్కగా రాసుకోవడం, పోటీ పరీక్షలకు అనుగుణమైన ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతో ఉపయుక్తం. సమయం.. సద్వినియోగం ఇంటర్లో సెలవు రోజులు ఉంటే విద్యార్థులకు పండగే. అయితే వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే విద్యార్థి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు. మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచే మంచి క్రీడలు, లైబ్రరీలో పుస్తక పఠనం, స్నేహితులతో సబ్జెక్టులపై చర్చ, శ్రుతిమించని వినోదం వంటివి ఆహ్లాదంతో పాటు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. వ్యసనాలకు దూరంగా ఉండాలి.. జీతితాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వ్యసనాలు ఈ దశలో అలవాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవాలి. సిగరెట్, గుట్కాలు, మద్యం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. సెల్ఫోన్ వైరస్ విద్యార్థుల ప్రగతికి అవరోధంగా మారుతుంది. అశ్లీలత వైపు మనసు మళ్లితే అంతే సంగతులు. పార్టీలు, వేడుకల పేరుతో స్నేహితులు చెడుదారుల వైపు ప్రేరేపించే అవకాశం ఉంటుంది. లక్ష్యానికి తొలి అడుగులు.. భవిష్యత్లో లక్ష్యం సివిల్స్, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర ఏ కోర్సుకై నా తొలి అడుగు పడాల్సింది ఇంటర్లోనే. కొత్త కొత్త స్నేహదనంతో నిండి కళాశాల జీవితం సక్రమంగా సాగితే ఒక బంగారు లోకమవుతుంది. తప్పటడుగులు వేస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగాలి. స్నే‘హితులు’ ఇంటర్లో విద్యార్థులను ప్రభావితం చేసే తొలి అంశం స్నేహం. అదృష్టం కొద్దీ అది ఉన్నత భావాలున్న వారితో కుదిరితే జీవితానికి మంచి చుక్కాని లభించినట్లే. చదువుపై ఇష్టం, పెద్దలపై గౌరవం, సమాజం మీద అవగాహన, అధ్యాపకులపై సదాభిప్రాయం ఉన్న వారితో స్నేహం చేయాలి. -
అమ్మవారికి పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఇద్దరు శ్రీశైల ఆలయ ఉద్యోగులపై వేటు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులపై దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు సస్పెన్షన్ వేటు వేశారు. ఆదివారం ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. గత నెల 27వ తేదీన దేవస్థానంలోని ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు చేపట్టారు. ఆ సమయంలో రెండు సంచులలోని నాణేలను అక్కడే మరిచిపోయారు. ఈ విషయంపై దేవస్థానం ఈఓ అంతర్గత విచారణ చేపట్టారు. ఈ విచారణలో దేవస్థానంలో క్యాషియర్గా విధులు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాసులు, మంజునాథ్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్దారించి అధికారులు ఈఓకు నివేదికను సమర్పించారు. ఈ మేరకు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులను విధుల నుంచి తాత్కాలికంగా నిలుపుదల (సస్పెన్షన్) చేశారు. కాగా జూనియర్ అసిస్టెంట్ మంజునాథ్ ఇటీవల సాధారణ బదిలీలలో భాగంగా కాణిపాకం దేవసస్థానానికి బదిలీ అయ్యారు. సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కాణిపాక దేవస్థాన ఈఓను శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు కోరారు. -
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
కర్నూలు (టౌన్): క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా జడ్జి కబర్ది అన్నారు. ఆదివారం ఒలింపిక్ డే క్రీడా సంబరాలను పురస్కరించుకొని కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు పరుగు నిర్వహించారు. క్రీడా జ్యోతి పట్టుకొని జిల్లా జడ్జి ఈ పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. కర్నూలు ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. పరుగులో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం విశేషమన్నారు. ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. ఒలంపిక్ డేను పురస్కరించుకొని క్రీడా సంఘాల ఆధ్వర్యంలో 10 రోజులుగా చిన్నారులకు క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. స్పోర్ట్స్ ప్రమోటర్ శ్రీధర్ రెడ్డి, విద్యావేత్త డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ సభ్యులు గుడిపల్లి సురేందర్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి కబర్ది -
గుర్తుకొస్తున్నాయ్..
● 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న తెర్నెకల్ జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఆలూరు రూరల్: చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల అందించిన అనుభవాలను వారు గుర్తు చేస్తున్నారు. అప్పటి చదువులపై ముచ్చటించుకున్నారు. బాల్యం జ్ఞాపకాల్లో మునిగి తేలారు. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామ జెడ్పీ హైస్కూల్లో 1994–95 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. అప్పట్లో చదువు చెప్పిన గురువులు హరిచంద్రా రెడ్డి, రంగస్వామి, గంగాధర్ను ఆత్మీయంగా సన్మానించారు. వారు బోధించిన చదువు, క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలను అవరోధించామని చెబుతూ పాదాభివందనం చేశారు. పూర్వ విద్యార్థులు రాఘవేంద్ర రెడ్డి, వెంకటేశ్వర్లు, రామచంద్ర తదితర 20 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● ఇద్దరికి తీవ్ర గాయాలు ఆదోని అర్బన్: పట్టణ శివారులోని ఎమ్మిగనూరు రోడ్డు బైపాస్ సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన ప్రకాష్పాల్, యోగేష్పాల్, సురేష్పాల్లు శనివారం పని నిమిత్తం ఎమ్మిగనూరుకు వెళ్లారు. అక్కడ పని మునిగించుకుని శనివారం అర్ధరాత్రి ఆదోనికి బైకుపై వస్తుండగా పట్టణశివారులోని ఎమ్మిగనూరు బైపాస్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ప్రకాష్పాల్ చికిత్స పొందుతూ మృతిచెందారు. యోగేష్పాల్, సురేష్పాల్కు తీవ్ర గాయాలు కావడంతో వారిని వైద్యులు కర్నూలుకు రెఫర్ చేశారు. యోగేష్పాల్ను బళ్లారికి తరలించగా, సురేష్పాల్ పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు ప్రకాష్పాల్కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పానీపూరి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నల్లమల ఘాట్లో తప్పిన పెను ప్రమాదం మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు చింతమాను టర్నింగ్ సమీపంలో ఢీకొన్నాయి. అయితే, అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో రెండు కార్లల్లో ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న మహానంది, రోడ్సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రయాణికుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలోని ప్లైవర్పై టిప్పర్ ఢీకొని వడ్డుగండ్ల గ్రామానికి చెందిన వ్యక్తి ఆదివారం దుర్మరణం చెందాడు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వడ్డుగండ్ల గ్రామానికి చెందిన నల్లబోతుల రాంభూపాల్(40) బైక్పై పాణ్యంలోని ఎస్సార్బీసీ కాల్వ సమీపంలోని డోజర్ పని విషయం మాట్లాడేందుకు వెళ్తుండగా ఏపీ 05టీఈ2355 నంబర్ గల టిప్పర్ లోడ్తో ఎదురై ఢీకొంది. ఈ ఘటనలో నల్లబోతులు రాంభూపాల్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హైవే పెట్రోల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానిక గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు
కర్నూలు (టౌన్): పార్టీ కోసం పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన రెడ్డి మంజులత ఆదివారం స్థానిక గిప్సన్ కాలనీలో పార్టీ జిల్లా అధ్యక్షుడిని కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు వైఎస్సార్సీపీదేనని, ఏడాదిలోపే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. మహిళలు సైతం మోసపోయామన్న భావనకు వచ్చారన్నారు. అన్ని వర్గాలకు ఆశలు కల్పించి నిరాశకు గురిచేసిన చంద్రబాబు సర్కారుకు గుణపాఠం తప్పదన్నారు. ప్రస్తుతం ప్రజలు జగనన్న పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటికి చేర్చిన ఘనత ఆయనదని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు అలా చేయకపోగా ప్రశ్నించే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని, హామీల అమలుకు ప్రభుత్వ మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎస్వీ యూత్ పాల్గొన్నారు. -
ప్రైవేట్ సర్వేయర్ దారుణ హత్య
కర్నూలు: కర్నూలు టీజే మాల్లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమలరావు దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల రాజవీధిలో ఉంటున్న ప్రైవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32)ను వివాహేతర సంబంధంతో హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. తిరుమల రావు అదే బ్యాంకులో పనిచేసే కల్లూరుకు చెందిన చిరుద్యోగితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అలాగే కూతురుతో కూడా వివాహేతర సంబంధం కొనసాగించే ప్రయత్నం చేశాడు. అప్పటికే గద్వాలకు చెందిన తేజేశ్వర్తో అ యువతి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సర్వేయర్ను హత మార్చాలని యువతి తల్లితో కలిసి తిరుమల రావు పథకం పన్నాడు. ల్యాండ్ సర్వే చేయించాలని స్నేహితుల ద్వారా తేజేశ్వరరావును కర్నూలుకు రప్పించి రహస్య ప్రాంతంలో హత్య చేసి పాణ్యం సమీపంలోని పిన్నాపురం రస్తాలో పడేశారు. అయితే సర్వేయర్ తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతని సోదరుడు తేజవర్థన్ ఐదు రోజుల క్రితం గద్వాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం శనివారం కర్నూలుకు వచ్చి రహస్య విచారించారు.బ్యాంకు మేనేజర్ తిరుమల రావుకు సంబంధించిన స్నేహితులను అదుపులోకి తీసుకొని కర్నూలు మూడో పట్టణ పోలీసుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు తేజేశ్వర్ మృతదేహం ఉన్నట్లు గుర్తించి పాణ్యం పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి ఆదివారం పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి గద్వాల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. హత్య కుట్రకు వెనుక మరి కొందరి హస్తం ఉన్నట్లు గద్వాల పోలీసులు భావించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ జరుపుతున్న గద్వాల పోలీసులు -
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన
ఆదోని రూరల్: రాష్ట్రంలో రెడ్బుక్ పాలన కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.రామచంద్రయ్య మండిపడ్డారు. ఆదివారం ఆదోని పట్టణంలోని రెడ్డి హాస్టల్లో సీపీఐ 20వ ఆదోని పట్టణ, మండల మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రామచంద్రయ్యతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య హాజరయ్యారు. ముందుగా స్థానిక మున్సిపల్ మైదానం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు కామ్రేడ్ మహాదేవ ఆచారి ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో రామచంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాయన్నారు. నమ్మి ప్రజలు ఓట్లేశాక వారిని మోసగిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్బుక్ పేరుతో రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. దళితుల పట్ల వివక్ష పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లింగప్ప, అజిత్గౌడ్, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.రామచంద్రయ్య ధ్వజం -
నేడు యువత పోరు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు (టౌన్): నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరవేర్చాలన్న డిమాండ్తో సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యువత పోరు పేరుతో నిర్వహిస్తున్న నిరసన, ధర్నాకు పార్టీ శ్రేణులతో పాటు స్వచ్ఛందంగా నిరుద్యోగులు తరలి రావాలని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఏటా 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చేంత వరకు ప్రతి నెలా రూ. 3 వేలు భృతి ఇస్తామని చెప్పి ఏడాది అయినా అమలు చేయలేదన్నారు. -
వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరీక్షలు నిర్వహించి ఫలితాలను సకాలంలో రైతులకు ఇవ్వలేకపోతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు మట్టి నమూనాల సేకరణే పూర్తి కాలేదు. భూసార పరీక్షల నిర్వహణక
● ఖరీఫ్ మొదలైనా ఊసేలేని భూసార పరీక్షలు ● ఇష్టారాజ్యంగా మట్టి నమూనాల సేకరణ ● విద్యుత్ సరఫరా లేని ఎమ్మిగనూరు పరీక్ష కేంద్రం ● గతేడాది కెమికల్స్ నిధులు స్వాహా ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రానికి గత ఏడాది వచ్చిన మట్టి నమూనాలు (ఫైల్)కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు భూసార పరీక్ష వివరాలు అందితే సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 49 వేల భూసార పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కాని ఇంతవరకు మట్టి నమూనాల సేకరణ, రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం మినహా ఇతరత్రా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. 20 రోజులు గడిచినప్పటికీ... భూసార పరీక్షల్లో ఉదజని సూచిక, స్థూల పోషకాలైన భాస్వరం, నత్రజని, పోటాష్తో పాటు సూక్ష్మ పోషకాలైన జింక్, కాల్షియం, క్లోరిన్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, సల్ఫర్, కాపర్, మాలిబ్డినం తదితర 15 పరీక్షలు నిర్వహిస్తారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికి భూసార పరీక్షల నిర్వహణలో చిత్తశద్ధి లోపించడం రైతుల పాలిట శాపంగా మారింది. ఉమ్మడి జిల్లాలో 877 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో దాని నుంచి 55 మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. వాటి ఇన్చార్జ్లు మట్టి నమూనాలు సేకరించి.. వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత మట్టి నమూనాలను సంబందిత భూ సార పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. ఖరీఫ్ సీజన్ మొదలై 20 రోజులు గడచినప్పటికీ మట్టి నమూనాల సేకరణనే పూర్తి కాలేదు. భూసార పరీక్షల నిర్వహణ కు ప్రభుత్వం ఒక్క రూపాయి విదిల్చలేదు. కెమికల్స్ లేవు.. ఇన్ని సమస్యల మధ్య భూసార పరీక్ష ఫలితాలు ఎప్పడు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షలకు ‘విద్యుత్’ షాక్ ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రంలో ఏడీఏ పోస్టుతో పాటు నాలుగు ఏవో పోస్టులు ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా వైరింగ్ మొత్తం కాలిపోయి ఈ కేంద్రానికి నాలుగు నెలల నుంచి కరెంటు లేదు. విద్యుత్ ప్రమాదానికి బిల్డింగ్ కూడా దెబ్బతినింది. భవనానికి పూర్తి స్థాయిలో వైరింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.4.60 లక్షలతో ప్రతిపాదనలు పంపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. కరెంట్ లేకపోవడంతో భూసార పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రహసనం మట్టి నమూనాల సేకరణకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ ప్రకారమే సేకరించాల్సి ఉంది. గ్యాప్ పొలంబడి నిర్వహించే ప్రాంతాలు, ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, ఆయిల్ సీడ్స్ ప్రదర్శనా క్షేత్రాలు..తదితర ప్రాంతాల్లోనే మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. 2024–25లో మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా సేకరించి మమ అనిపించారు. దీంతో భూసార పరీక్షలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ ఏడాది ఆన్లైన్లోనే మట్టి నమనాలు సేకరించాల్సి ఉంది. ఈ సారి కూడా మట్టి నమూనాల సేకరణ ప్రహసనంగా మారింది. మార్గదర్శకాలకు విరుద్ధంగా మట్టి నమూనాలు సేకరిస్తుండటంతో భూసార పరీక్షల్లో పారదర్శకత లేకుండా పోయింది. నిధులు స్వాహా భూసార పరీక్షల్లో నాణ్యత ఉండాలంటే తగిన మోతాదులో రసాయనాలు వినియోగించాల్సి ఉంది. గత ఏడాది భూసార పరీక్షలకు అవసరమైన రసాయనాల కొనుగోలు చేసేందుకు విడుదల చేసిన రూ.15 లక్షలు స్వాహా అయ్యాయి. ఈ ఏడాది ఒక్క రూపాయి విడుదల కాలేదు. రసాయనాలు లేవు. గతంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం భూసార పరీక్షలంటూ హంగామా చేసిందే తప్ప.. ఫలితాలను రైతులకు ఇవ్వలేదు. ఇదే పరిస్థితి 2024–25లో కూడా పునరావృతం అయ్యింది. 2025–26లో భూసార పరీక్షల నిర్వహణ మరింత అస్తవ్యస్తం అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇవీ సమస్యలు ● ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రంలో12,971 మట్టి నమూనాలను పరీక్షించాల్సి ఉంది. రైతుసేవా కేంద్రాల నుంచి ఒక్క మట్టి నమూనా కూడా ఇక్కడికి చేరలేదు. కరెంటు లేకపోవడంతో భూసార పరీక్షల నిర్వహణకు గ్రహణం పట్టింది. ● కర్నూలు మార్కెట్ యార్డులోని సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో 12,971 మట్టి నమూనాలను పరీక్షించాల్సి ఉంది. ఈ ల్యాబ్కు రైతు సేవా కేంద్రాల నుంచి 1,430 మట్టి నమూనాలు చేరాయి. అయితే శాసీ్త్రయంగా పరీక్షించేందుకు కెమికల్స్ లేపోవడంతో ఇంతవరకు భూసార పరీక్షలు చేపట్టిన దాఖలాలు లేవు. ● నంద్యాల జిల్లాకు సంబంధించి ఇంతవరకు భూసార పరీక్షల నిర్వహణ అతీగతీ లేకుండా పోయింది. ఈ జిల్లాలో 411 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రం నుంచి 55 మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. ఈ ప్రకారం 22,605 మట్టి నమూనాలు సేకరించి.. ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ల్యాబ్కు పంపాల్సి ఉంది. ఇంతవరకు నంద్యాల ల్యాబ్కు ఒక్క మట్టి నమూనా కూడా రాలేదు. చర్యలు తీసుకుంటున్నాం ఈ ఏడాది జిల్లాలో 25 వేలకుపైగా భూసార పరీక్షలు చేపట్టేందుకు వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో రైతుసేవా కేంద్రం పరిధిలో 55 మట్టి నమూనాలు సేకరించే విధంగా లక్ష్యాలు ఇచ్చాం. ప్రస్తుతం రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆన్లైన్ చేసిన తర్వాత మట్టి నమూనాలు ల్యాబ్లకు వస్తాయి. కర్నూలులో సగం, ఎమ్మిగనూరు ల్యాబ్ల్లో సగం ప్రకారం మట్టి నమూనాలకు పరీక్షలు నిర్వహిస్తారు. రైతులకు త్వరగా భూసార పరీక్షల ఫలితాలు అందచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు ఇవీ భూసార పరీక్ష కేంద్రాలు.. కర్నూలు జిల్లాకు సంబందించి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో భూసార పరీక్ష కేంద్రం ఉంది. అలాగే ఎమ్మిగనూరులోని భూసార పరీక్ష కేంద్రాల్లో మట్టి నమూనాలను పరీక్షిస్తారు. నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాలలోని భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తారు. -
సిల్వర్సెట్ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన సిల్వర్సెట్ ఫలితాలను క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు, రిజిస్ట్రార్ డా.కె వెంకటేశ్వర్లు శనివారం వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వీసీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సిల్వర్జూబ్లీ డిగ్రీ ప్రవేశాలకు ఎంతో పోటీ ఉంటుందన్నారు. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. సిల్వర్ సెట్లో సీట్లు పొందిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 29న సిల్వర్ సెట్ పరీక్ష నిర్వహించామని, 1,196 మంది విద్యార్థులు హాజరు కాగా 1,085 మంది అర్హత సాధించారన్నారు. బీఏలో ఈవూరి సుస్మిత ఫస్ట్ ర్యాంకు సాధించారని, బి.కామ్లో జి.మానస, బీఎస్సీ మ్యాథ్స్లో పి.చిరు హాసిని, బీఎస్సీ లైఫ్ సైన్స్లో షేక్ హమ్నా లేహర్ మొదటి ర్యాంకు సాధించారన్నారు. కార్యక్రమంలో సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి.శ్రీనివాస్, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఇందిరాశాంతి, కేవీఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, సిల్వర్సెట్ కన్వీనర్ మహమ్మద్ వాహీద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి, క్లస్టర్ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ నాగరాజు శెట్టి పాల్గొన్నారు. సూక్ష్మ సేద్యానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి కర్నూలు(అగ్రికల్చర్): బిందు, తుంపర్ల సేద్యం కోసం రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. 2025–26 సంవత్సరంలో 7వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం సదుపాయం కల్పించాలనేది లక్ష్యమని.. బోరు, బావి ఉన్న రైతులు సూక్ష్మ సేద్య సదుపాయం పొంది ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకునేందుకు సూక్ష్మ సేద్యం చక్కటి అవకాశమన్నారు. గత ఏడాది 5,961 మంది రైతులకు 5,653.09 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం కల్పించినట్లు తెలిపారు. ఐదు ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీ ఉంటుందన్నారు. 10 ఎకరాలు పైబడిన రైతులకు 50 శాతం రాయితీతో డ్రిప్ సదుపాయం కల్పిస్తామన్నారు. స్ప్రింక్లర్లు అన్ని కేటగిరీల రైతులకు 50 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. నాన్ సబ్సిడీ చెల్లించిన రైతులకు త్వరలోనే అనుమతులు ఇస్తామన్నారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే meekosam. ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
ఆత్మహత్యలే శరణ్యం
● సెల్టవర్ ఎక్కిపంచాయతీ కార్మికుల నిరసన కోడుమూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని నగర పంచాయతీ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం గూడూరు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు ఆరవింద్, మధు మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో పనిచేస్తూ తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. 15 సంవత్సరాలకు పైబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయడంతో పాటు నెలనెలా సక్రమంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం 46రోజుల నుంచి విధులు బహిష్కరించి నిరవధిక దీక్షలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిరసనలో కార్మికులు డూకేశ్వరరావు, షబ్బీర్, ఆంజనేయులు, బసవరాజు, జయన్న, అల్లిబాషా, ఖాజా, ప్రభాకర్, ఉసేన్, పఠాన్ తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయ విద్యా విధానాలే మేలు
విద్య విషయంలో పిల్లలకు సంప్రదాయ విధానాలతోనే బోధించాలి. డిజిటల్ తెరలను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. పిల్లలు మొబైల్ ఫోన్లను పాఠశాలలకు తీసుకురావడానికి అనుమతించకూడదు. సోషల్ మీడియాలో పోస్టులు చేయడాన్ని ప్రోత్సహించకూడదు. ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలకు డిజిటల్ తెరలకు దూరంగా ఉంచాలి. ఆహారం తినిపించేందుకు సైతం వీటిని ఉపయోగించకూడదు. వారికి కథలు చెప్పడం, ఆటలు ఆడించడం, పాటలు పాడించడం, నృత్యం చేయించడం, వయస్సుకు తగిన బొమ్మలతో ఆడేలా చేయాలి. వీటి వల్ల వారు డిజిటల్ తెరలకు క్రమంగా దూరం అవుతారు. – డాక్టర్ జి. సుధాకర్, చిన్నపిల్లల వైద్యనిపుణులు, కర్నూలు -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు ...
● ఆటో బోల్తా పడి వృద్ధురాలి దుర్మరణం గోస్పాడు/మహానంది: ఎస్.నాగులవరం–పసురపాడు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మహానంది మండలం మసీదుపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం దైవదర్శనం నిమిత్తం రంగాపురం సమీపంలోని మద్దిలేటిస్వామి దర్శనానికి ఆటోలో వెళ్లారు. పూజలు నిర్వహించుకుని తిరిగి వస్తుండగా ఎస్.నాగులవరం సమీపంలో ఆటో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆవుల లక్ష్మీదేవి(65) అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటేశ్వర్లు, మౌనిక, చిన్న సరవయ్య, లక్ష్మిపతి, ఆవుల నరసమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆవుల నరసమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. మృతురాలు లక్ష్మీదేవి భర్త గత కొద్దినెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారని, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు బంధువులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పాణ్యం: పిన్నాపురం గ్రామ రస్తాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. శనివారం సాయంత్రం గొర్రెల కాపరులు గడ్డిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో వెళ్లి చూడగా వ్యక్తి మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. మృతదేహంపై దుస్తులు లేకపోవడం, కాళ్లకు బెల్ట్ చెప్పులు ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
‘కూటమి’ నాయకుల ధ్వంస రచన
● ఆదోనిలో వైఎస్సార్సీపీ జెండా కట్ట ధ్వంసం ● త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఆదోని టౌన్: ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ‘కూటమి’ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ధ్వంస రచన చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ఆదోని పట్టణంలోని విజయనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి వైఎస్సార్సీపీ జెండా కట్టను ధ్వంసం చేశారు. జెండా, జెండాకు సంబంధించిన పైపును విరగొట్టారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు దేవ, పట్టణ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్ తదితరులు అక్కడి వెళ్లి ధ్వంసమైన కట్టను పరిశీలించారు. అనంతరం త్రీటౌన్ పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్కు ఫిర్యాదు చేశారు. ప్రజల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుండాన్ని చూస్తూ సహించలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు. పార్టీ జెండాను ఇలా అవమానించడం తగదన్నారు. ఇలాంటి దుశ్చర్యలతో ఘర్షణలు, గొడవలు జరిగే ప్రమాదం ఉందన్నారు. దుండగులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ పట్టణ సెక్రటరీ తాయన్న, ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడు యేసేపు, కౌన్సిలర్ అశోక్, నాయకులు ప్రసాద్, బుడ్డేకల్ బాబు, కిషోర్, పట్టణ కార్యదర్శి బాబా, కౌన్సిలర్లు రఘునాథ్రెడ్డి, ఫయాజ్, అశోక్, నాయకులు దినేష్, ఉస్మాన్, చిన్నరామకృష్ణారెడ్డి, భీమ, వీరప్ప, నారాయణ, హరిశ్చంద్ర, కౌన్సిలర్ చలపతి తదితరులు పాల్గొన్నారు. -
అడుగు దూరంలో నీటి విడుదల
● పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను తాకిన కృష్ణాజలాలు జూపాడుబంగ్లా: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి వస్తున్న వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిమట్టం రోజుకు రోజుకు పెరిగి కృష్ణాజలాలు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లను తగిలాయి. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద 851.90 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీటిమట్టం చేరుకోగానే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేసుకోవచ్చు. గతేడాది జులై 27న పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువనున్న కాల్వలకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలవల్ల శ్రీశైలం డ్యాంలోకి వరదనీరు వచ్చి చేరుతుండటంతో క్రమేణా డ్యాంలో నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో గతేడాది కంటే నెలరోజులు ముందుగానే పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు నీటిని విడుదల చేసుకునే అవకాశాలున్నాయి. -
మొబైల్కు దూరంగా ఉంచడమే మేలు
పిల్లల భాషా నైపుణ్య అభివృద్ధికి మొబైల్ తెరలే అవరోధంగా నిలుస్తున్నాయి. అల్లరి మాన్పించేందుకు, ఆహారం తినిపించేందుకు అలవాటు పడిన ఈ మొబైల్ ఫోన్ వారిని బానసలుగా మార్చుకుంటోంది. ఈ క్రమంలో చిన్నారుల ఎదుగుదలపై అవి తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ఇంట్లోని పెద్దలు సైతం వారి ఇంట్లోని చిన్నారులను మొబైల్కు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఈ మేరకు ముందుగా పిల్లల ముందు పెద్దలు సైతం మొబైల్ ఎక్కువగా వాడకుండా ఉండటమే మేలు. పెద్దలు వాడకపోతే పిల్లలు అటువైపు దృష్టి సారించరు. ఈ సమయంలో పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలను కొనివ్వడం, ఆటలు ఆడించడం, మైదానాలు, పార్కులకు తీసుకెళ్లి ఆడించడం, బందువుల ఇళ్లకు తీసుకెళ్లి వారిని పరిచయడం చేయించడం, వారి పిల్లలతో స్నేహం చేయించడం వంటివి చేయాలి. అప్పుడే పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి చెందుతుంది. ● మూడేళ్లయినా మాటలు రాని చిన్నారులు ● పదాలు పలికేందుకు ఇబ్బందులు ● సెల్ఫోన్ వాడకమే కారణమంటున్న వైద్యులు ● చిన్నపిల్లల వైద్యుల వద్దకు తల్లిదండ్రుల క్యూ ఒకప్పుడు చంటిపిల్లలకు చందమామను చూపి గోరుముద్దలు తినిపించేవారు. ఆ తర్వాత తరం వారు వీధిలోకి వెళ్లి జంతువులు, ఇతర పిల్లలను చూపిస్తూ అన్నం పెట్టేవారు. గత తరం వారు టీవీలో కార్టూన్ బొమ్మలు చూపించి పిల్లలకు భోజనం పెట్టేవారు. కానీ నేటితరం మాత్రం మొబైల్ చేతికిచ్చి భోజనం తినిపిస్తున్నారు. అలవాటైన చిన్నారులు రాత్రింబవళ్లూ మొబైల్ కావాలంటున్నారు. దీంతో వారికి మూడేళ్ల వయస్సు వచ్చినా మాటలు రాని పరిస్థితి నెలకొంటోందని, చిన్న పదాలు కూడా పలకడం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. – కర్నూలు(హాస్పిటల్)● కర్నూలుకు చెందిన లలితకుమారికి భర్త ఇటీవలే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారున్ని అల్లారుముద్దుగా పెంచేందుకు ఆమె రెండేళ్ల వయస్సు నుంచే పిల్లాడిని గారాబం ఎక్కువ చేసింది. ఈ క్రమంలో ఆ బాలుడు సెల్ఫోన్కు ఎక్కువగా బానిసయ్యాడు. అర్ధరాత్రి 2 గంటలైనా సెల్ఫోన్ చూస్తూ గడిపేవాడు. ఈ క్రమంలో బాలుడు నాలుగేళ్ల వయస్సు వచ్చినా మాట్లాడటం లేదు. ● కర్నూలు వెంకటరమణకాలనీకి చెందిన శివరాముడుకి ఒక కుమారుడు ఉన్నాడు. పాలుతాగాలన్నా, ఏదైనా తినాలన్నా మొబైల్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ బాలునికి మూడేళ్ల వయస్సు. ఇప్పటికీ ఆ బాలుడికి మాటలు రావడం లేదు. -
నిత్య యోగాతో ఆరోగ్యం
కర్నూలు(టౌన్): అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలని, నిత్య యోగాతోనే అది సాధ్యమని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ ఔట్డోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో కర్నూలు జిల్లా నుంచి 12,76,000 మంది రిజిస్రేషన్ చేసుకోవడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. ఇక మీదట కూడా యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, మహిళలు, అధికారులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలెక్టర్ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, కర్నూలు ఆర్డీవో సందీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి కష్టాలు పట్టవా?
● ఎల్లెల్సీ నీటిలో నిలబడి మున్సిపల్ కార్మికుల నిరసన ఎమ్మిగనూరుటౌన్: తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని, సమస్యలు పరిష్కరించాలని గత 46 రోజులుగా సమ్మె చేస్తున్నామని, అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఇంజినీరింగ్ కార్మికులు శనివారం తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) వరకు ర్యాలీగా వెళ్లారు. కాలువలో అర్ధనగ్నంగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈసందర్భంగా మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యునియన్ నాయకులు నారాయణ, రాజేంద్ర మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇంజినీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలన్నారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్.. కార్మికుల అకౌంట్లో జమ చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదన్నారు. -
పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి గాయాలు
● బాధితుల్లో ఎంపీటీసీ సభ్యుడు సి.బెళగల్: మండల కేంద్రమైన సి.బెళగల్లో పిచికుక్క దాడి చేయడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. తొలుత గ్రామ శివారులోని ఇటుబట్టీలో పనిచేసే ప్రదీప్పై దాడి చేసి గాయపరచింది. అనంతరం గ్రామంలోకి ప్రవేశించి తహసీల్దార్ కార్యాలయం దగ్గరున్న సి.బెళగల్ ఎంపీటీసీ సభ్యుడు వీరన్న గౌడ్ను కరిచింది. వెలుగు కార్యాలయం బయట ఉన్న సీసీ శ్రీనివాసులుపై దాడిచేసి గాయపరచింది. పోలీస్ స్టేషన్లో వెళ్లి కొత్తకోట గ్రామానికి చెందిన మధు అనే యువకుడికి కరిచి గాయపరచింది. బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తిని కరవడంతో అతను గాయంతో అలాగే వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధితులకు సి.బెళగల్ పీహెచ్సీలో డాక్టర్ మిథున్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వైద్యం అందించారు. -
జిల్లా కోర్టులో...
కర్నూలు(సెంట్రల్): ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది ఉద్యోగులకు సూచించారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ప్రాంగణంలో యోగాసానాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత పని భారం ఉన్నా రోజూ అరగంటపాటు యోగాసానాలు వేస్తే మానసిక ఒత్తిడి తొలగి ప్రశాంతం చేకూరుతుందన్నారు. శ్వాసను మనసుతో అనుసంధానం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, న్యాయ శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
రక్తదానం చేసిన ఆర్డీఓ
ఆదోని టౌన్: పత్తికొండ ఆర్డీఓ డాక్టర్ ఎస్.భరత్నాయక్ శనివారం ఆదోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(ఏరియా ఆసుపత్రి)లో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇప్పటికే ఐదుసార్లు రక్తదానం చేశానన్నారు. రక్తం దానం చేయడం ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడమే అన్నారు. బాధితుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపినవారమవుతామన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే రక్తదానం ప్రధాన లక్ష్యమన్నారు. డివైడర్పైకి దూసుకెళ్లిన లారీ ఆలూరు రూరల్: డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఒక లారీ ఆలూరులోని డివైడర్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. లారీ కర్నూలు నుంచి బళ్లారి వైపునకు ఆలూరు మీదుగా వెళ్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం అర్ధరాత్రి సయమం కావడంతో ఆలూరులోని సహకారం సంఘం బ్యాంక్ సమీపంలో డివైడర్పైకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో లారీ కింది భాగమంతా ధ్వంసం కాగా.. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. నల్లమలలో ట్రాఫిక్ జాం ఆత్మకూరురూరల్: నల్లమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు నిలిచి ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడ్డారు. ఆత్మకూరు – దోర్నాల ప్రధాన రహదారిలోని నంద్యాల – ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో శనివారం భారీ వృక్షం నేల కూలడంతో రెండు గంటల సేపు ట్రాఫిక్ నిలిచి పోయింది. పెద్ద పెంట రాస్తా ఏటిపాయ గేటు వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో దాదాపు 2 గంటల వరకు అడవిలో ప్రయాణికులు అల్లాడి పోయారు. అటవీ శాఖకు చెందిన ప్రొటక్షన్ వాచర్లు అక్కడికి చేరుకుని చెట్టును తొలగించడంతో వాహనాల రాకపోకలు యథాతధంగా కొనసాగాయి. జిల్లా ఔషధ నియంత్రణ అధికారి బాధ్యతల స్వీకరణ గోస్పాడు: జిల్లా ఔషధ నియంత్రణ అధికారిగా హనుమన్న శనివారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన దాదా ఖలందర్ చిత్తూరు జిల్లా మదనపల్లెకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురంలో పని చేస్తున్న హనుమన్నను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విధుల్లో చేరారు. నంద్యాల డ్రగ్ ఇన్స్పెక్టర్ బాధ్యతలతో పాటు కర్నూలు అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. డోన్, డివిజన్కు డ్రగ్ ఇన్స్పెక్టర్గా కర్నూలు రూరల్ విభాగానికి జయరాంను నియమించారు. -
వసతి మూత‘బడి’
ఆలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పేద విద్యార్థులకు వసతి గృహాలు కూడా అందుబాటులోకి రాని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభం కాగా ఆలూరులోని సాంఘిక సంక్షేమ శాఖ బీసీ బాలురు వసతి గృహం ఇంత వరకు తెరుచుకోలేదు. విద్యార్థులు ఇక్కడ ఉండలేక ఇంటి బాట పట్టారు. సొంత భవనం లేకపోవడంతో ఆలూరు సమీపంలోని ఎల్లార్తి రోడ్డు వద్ద ప్రగతి జూనియర్ కళాశాల, పాఠశాల ఆవరణలోనే గత ఏడాది నుంచి సాంఘిక సంక్షేమ శాఖ బీసీ బాలురు వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ బాలుర వసతి గృహంలో 120 మంది, కళాశాల వసతి గృహంలో 110 మంది ఉంటున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న హెచ్డబ్ల్యూఓ సంపత్కుమార్ను ఈనెల 10న కర్నూలుకు బదిలీ చేశారు. ఆదోని డివిజన్ ఏఎస్డబ్యూఓగా విధులు నిర్వహిస్తున్న రాజా కుళ్లాయప్ప ఈనెల 1న పదవీ విరమణ పొందారు. ఆదోని, ఆలూరు సబ్డివిజన్ పరిధిలో ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహాలకు ఏఎస్డబ్ల్యూఓగా పత్తికొండలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులకు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఆలూరు బీసీ బాలుర వసతి సంక్షేమ కళాశాల వసతి గృహానికి అనిమిరెడ్డిని హెచ్డబ్ల్యూఓగా అధికారులు నియమించారు. అయితే ఆరోగ్య కారణాలతో ఆయన ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించలేదు. వసతి గృహాల తలుపులకు మూతపడి ఆదివారం నాటికి 22 రోజులకు చేరుతుంది. వసతి గృహం తెరవకపోవడంతో విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, ఒక ఫైల్ కూడా పంపామని ఏఎస్డబ్ల్యూఓ శ్రీనివాసులు తెలిపారు. తలుపులు తెరుచుకోని బీసీ బాలుర వసతి గృహం ఇంటి బాట పట్టిన విద్యార్థులు -
జాతి వైరం మరచి.. తల్లిలా లాలించి
కర్నూలు: శునకం, వరాహం ఈ రెండు మూగ జీవాల మధ్య జాతి వైరం తీవ్రంగా ఉంటుంది. రెండు తారసపడితే శత్రుత్వం ప్రదర్శిస్తాయి. సహజంగా పందులు కనిపిస్తే కుక్కలు వెంటబడి తరిమేస్తాయి. కుక్క పిల్లలు కనిపిస్తే పందులు కసితీరా గాయపర్చుతాయి. ఇలాంటి జాతి వైరం ఉన్న జంతువుల మధ్య మాతృప్రేమ వికసించింది. శుక్రవారం అంకిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని రామాలయం ఆవరణలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ఓ వీధికుక్క పిల్లలకు జన్మనించింది. తల్లి కుక్కను ఇతర కుక్కలు కరవడంతో తీవ్రంగా గాయపడి కొద్ది రోజుల నుంచి పిల్లల వద్దకు రాకుండా దూరంగా ఉంటుంది. చిన్న వయసులో ఉన్న కుక్క పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ సమయంలో వరాహం అక్కడికి చేరడంతో కుక్క పిల్లలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలు తాగడం ఆరంభించాయి. వరాహం కూడా కుక్క పిల్లలను ఏమీ అనకుండా కట్టు కదలకుండా పాలు ఇచ్చి అమ్మలా ఆకలి తీర్చింది. ఈ దృశ్యాన్ని కాలనీ వాసులు చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. -
క్వింటా పత్తి రూ.8,025
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా పత్తి ధర రూ.8 వేలు దాటింది. యార్డులో అమ్మకానికి రైతులు 300 క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చారు. గరిష్ట ధర రూ.8,025, మధ్య ధర రూ.7,689, కనిష్ట ధర రూ.4,511 నమోదైంది. అదేవిధంగా వేరుశనగకాయలు 16 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.5,682, కనిష్ట ధర రూ.4,800 లభించింది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కర్నూలు(సెంట్రల్): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాలో 5,264 వేదికల్లో 12లక్షల మందితో యోగాసనాలు వేయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతనెల మే 21 నుంచి యోగాంధ్ర పేరిట గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పలు కార్యక్రమాలను నిర్వహించామన్నారు. జూన్ 21న శనివారం జిల్లా వ్యాప్తంగా 5,264 వేదికల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. జిల్లాస్థాయిలో నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో 5వేల మందితో యోగా కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి మొదలవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. స్కూళ్లలోనే విద్యార్థులకు అల్పాహారం కర్నూలు సిటీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేటి(శనివారం)ఉదయం 8.30 గంటలకు విద్యార్థులకు స్కూళ్లలోనే అల్పాహారం అందించాలని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన స్కూళ్ల ప్రధానోపాద్యాయులు యోగాంధ్ర కార్యక్రమం తరువాతే ఉప్మా, చెట్నీ తయారు చేయించాలన్నారు. విద్యార్థులకు అల్పాహారం అందించే ఫొటోలను తీసి యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. అల్పాహారం ఎట్టి పరిస్థితుల్లో యోగాకు ముందు ఇవ్వకూడదని డీఈఓ పేర్కొన్నారు. రానున్న ఐదు రోజుల్లో తీవ్ర గాలులు కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు, గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందన్నారు. ఇదిలాఉంటే వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మే నెలలో అధిక వర్షాలు కురిశాయి. జూన్ నెలలో ఒకటి, రెండు రోజుల పాటు వర్షాలు కురిసినప్పటికీ అనావృష్టి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. గాలి తీవ్రత పెరిగింది. ఈ నెల 25 వరకు బలమైన గాలులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడం గమనార్హం. ఈ నెల 21న 1.2 మి.మీ, 22న 1.0 మి.మీ, 23 నుంచి 25 వరకు 0.5 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు వేసవి తరహాలో 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాలి వేగం 21 నుంచి 22 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. మరో మూడు నాలుగు రోజుల్లో వర్షాలు లేకపోతే ప్రధానంగా సాగు చేసిన పత్తి పంట దెబ్బతినే పరిస్థితి నెలకొంది. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు
ఆలూరు రూరల్: ‘‘మా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన కార్యక్రమం నుంచి జనం దృష్టి మరల్చేందుకే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాత్రికి రాత్రే బెంగళూరులో అరెస్టు చేశారు. అక్రమ కేసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేయాలని కూటమి నేతల అవివేకం. ఇలాంటి వాటికి బెదిరేది లేదు’ అని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది నుంచి రాష్ట్రంలో అరాచక పాలనకు అంతులేకుండా పోయిందని, రెడ్బుక్ పేరిట అక్రమ అరెస్టులు చేయడం కూటమి నాయకులకే చెల్లిందన్నారు. జరగని స్కాంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చేర్చి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి భయపడి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న పాలనను ప్రజ లు గమనిస్తున్నారనే విషయం తెలుసుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవ న్ కల్యాణ్ ఎక్కడున్నాడో తెలియదని, ఆయన ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఒక పక్క హత్యలు, హత్యాచారాలతో రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్ష ణ లేకుండాపోయిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు పర్యటనకు ప్రజలు రాకుండా ఎన్ని ఆంక్షలు విధించినా వారిని నిలువరించలేకపోయారన్నారు. -
పీఏసీఎస్ల కంప్యూటరీకరణ పూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) కంప్యూటరీకరణ పూర్తయినందున సంఘాల లావాదేవీలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించే అవకాశం ఏర్పడిందని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ పి.రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం నంద్యాల జిల్లాలోని 56 పీఏసీఎస్ల కంప్యూటరీకరణ పూర్తయిన నేపధ్యంలో సంఘాల సీఈఓలకు కర్నూలులో నిర్వహించిన వర్క్షాపులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది మార్చి 31 ఆడిట్ పైనల్ రిపోర్టులను, 2025 సంవత్సరానికి సంబంధించి ఇయర్ ఎండ్ ప్రాసెస్ మాడ్యుల్స్పై అవగాహన కల్పించారు. టెక్నికల్ సపోర్టు గురించి వివరించారు. ఎన్ఎల్పీఎస్వీ టెక్నికల్ సపోర్టర్ భువనేశ్వర్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా సహకార అధికారి ఎన్.రామాంజనేయులు, ఆప్కాబ్ డీపీడీఎం నహిదా సుల్తాన, డీజీఎంలు సునీల్కుమార్, నాగిరెడ్డి, డిపార్టుమెంటల్ ఆడిటర్స్, సంఘాల సీఈఓలు పాల్గొన్నారు. పీఏసీఎస్ల పర్సన్ ఇన్చార్జ్ల పదవీ కాలం పొడిగింపు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 79 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్జ్ల పదవీ కాలన్ని ఈ ఏడాది జూలై 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో 32, నంద్యాల జిల్లాలో 47 పీఏసీఎస్ల పర్సన్ ఇన్చార్జ్లుగా సహకార శాఖ అధికారులు పనిచేస్తున్నారు. వీరి పదవీ కాలం ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై 30 వరకు పదవీ కాలాన్ని పొడిగిస్తూ సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ బాలికల కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వచ్చే నెల 15వ తేదీలోపు www.iti.ap.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే నెల 17వ తేదీన జరుగనున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు జూలై 21, 22, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు 23 నుంచి 25వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
30 ఏళ్లుగా యోగా శిక్షణ
1982లో నాకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. స్నేహితుల సలహాతో వారం రోజుల పాటు యోగా చేసి తగ్గించుకున్నాను. ఆ తర్వాత సికింద్రాబాద్లో యోగా గురువు సూరిరాఘవ దీక్షితుల వద్ద, అనంతరం కర్ణాటకలోని శివమొగ్గలో ఉన్న రాఘవేంద్ర స్వామీజీ వద్ద 30 రోజుల శిక్షణ పొందాను. 1991లో గుజరాత్, గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, డిప్లామాలో యోగా చేశాను. కర్నూలులో శ్రీ వాల్మీకి యోగా కేంద్రం ద్వారా 30 ఏళ్లుగా ప్రజలకు యోగాను నేర్పిస్తున్నాను. ఇందులో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఉన్నారు. నా సేవలకు డాక్టరేట్లు, భారత యోగ శిరోమణి, గురుబ్రహ్మ వంటి అవార్డులు దక్కాయి. – బీటీ జయలక్ష్మి, యోగా శిక్షకురాలు, శ్రీ వాల్మీకి యోగా కేంద్రం, కర్నూలు -
నీటి విడుదలపై 27న సమావేశం
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ, ఇతర కాలువలకు నీటి విడుదలపై ఈ నెల 27న బెంగళూరు విధాన సౌధలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నీటి సలహా మండలి సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో 124వ నీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు శుక్రవారం తెలిపారు. గతేడాది వరద నీటి ప్రవహానికి డ్యాం 19వ క్రస్టుగేటు కొట్టుకుపోవడంతో సాట్ప్లాక్ గేటు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టాప్లాక్ గేటు స్థానంలో కొత్త గేటుతో పాటు మిగిలిన 32 క్రస్టుగేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు గాను పనులు మొదలు పెట్టేందుకు ఒక పంటకు (ఖరీఫ్) మాత్రమే నీరిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. అయితే దీనిపై కర్ణాటకలోని తుంగభద్ర రైతు సంఘం నాయకులు, రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపడ్తామని హెచ్చరికలు చేస్తున్నారు. డ్యాంలో కూడా 40 టీఎంసీల నీరు చేరడంతో కాలువలకు ముందుగానే నీటిని విడుదల చేయడం, రైతుల వ్యతిరేకత, ఇతర సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్యాంలో నిల్వ అయ్యే నీటితో ఆయా రాష్ట్రాల కాలువలకు నీటి విడుదుల, కేటాయింపులపై చర్చించనున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది టీబీ డ్యాం నీటిపై గందరగోళం నెలకొనడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1612 అడుగుల వద్ద 44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
రెవెన్యూ ఉద్యోగులు సేవాభావంతో పనిచేయాలి
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ ఉద్యోగులు సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, అప్పుడు ఆ ఉద్యోగానికి గుర్తింపు ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో రెవెన్యూ డేను పురస్కరించుకొని ఏపీఆర్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్తో పాటు జేసీ డాక్టర్ బి.నవ్య, ఇన్చార్జి డీఆర్వో బీకే వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, లక్ష్మీరాజు ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెవెన్యూ అసోసియేషన్ భవన్లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఏపీఆర్ఎస్ఏ సభ్యులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలకు రెవెన్యూ తల్లివంటిదన్నారు. రెవెన్యూలో అనేక సంస్కరణలు వచ్చాయని, వాటిపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలని సూచించారు. తాను కడపలో డిప్యూటీ కలెక్టర్గా శిక్షణలో ఉన్న సమయంలో(2007–08) అనేక సంస్కరణలను అమలుచేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నట్లు చెప్పారు. గుడివాడ ఆర్డీఓగా ల్యాండ్ రికార్డ్స్’లో ఆధార్సీడింగ్ ప్రక్రియను రూపొందించానన్నారు. కడప ఆర్డీఓగా కొప్పర్తిలో 6 వేలు, ఇళ్ల నిర్మాణాల కోసం 3వేల ఎకరాలు, 14రోడ్ల విస్తరణ భూసేకరణకు ప్రత్యేక యాప్ను తయారు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ కడపకు వెళ్లినప్పుడు రోడ్ల విస్తరణ చూస్తే తనకు ఎంతో సంతృప్తి లభిస్తుందన్నారు. ● జేసీ డాక్టర్ బి.నవ్య మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అతిప్రాచీనమైనదని, ఇప్పుడున్న మిగిలిన శాఖలన్నీ రెవెన్యూ నుంచే ఉద్భవించినవేనన్నారు. ప్రజలకు ఏమి కష్టాలు వచ్చినా రెవెన్యూ అధికారులనే ఆశ్రయిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. ● అనంతరం విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు శశిదేవి, కిష్టోఫర్, జయన్న, విజయుడు, హుస్సేన్, రమణ, ఆదినారాయణ, రామన్న, ఎల్లరాముడు తదితరులను ఏపీఆర్ఎస్ఏ తరపున కలెక్టర్, జేసీలు సన్మానించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ సందీప్కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, అజయ్కుమార్, కొండయ్య, నాగప్రసన్న, సునీతాభాయ్, ఏఓ శివరాముడు పాల్గొన్నారు. -
కర్నూలులో 23న యువత పోరు
కర్నూలు (టౌన్): కర్నూలులో ఈనెల 23వ తేదీ యువత పోరు పేరుతో ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆద్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘యువత పోరు’ పోస్టర్లను అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి రూ. 3 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారన్నారు. యువత కోసం ఏటా 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని.. లేదంటే తమ కాలర్ పట్టుకోవాలని నారా లోకేష్ పలు సమావేశాల్లో చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, కొత్తగా ఉద్యోగాల కల్పన లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటం చేయడంతో అరకొరగా తల్లికి వందనం నిధులు విడుదల చేశారని విమర్శించారు. బెదిరిస్తే భయపడేది లేదు! సూపర్ సిక్స్ హామీలు నేరవేర్చామని, ఏవరైనా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తే వారి నాలుక మడత పెడతామని సీఎం చంద్రబాబు నాయుడు బెదిరింపులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని ఎస్వీ అన్నారు. ముఖ్యమంత్రి బెదిరిస్తే ఇక్కడ ఎవరూ భయపడే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగలకు రూ. 3 వేలు ఇచ్చారా.. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ. 1500, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీలకు పెన్షన్ రూ. 4 వేలు, అన్నదాత సుఖీభవ రూ. 20 వేలు ఇలా.. సూపర్ సిక్స్ కింద ఇస్తామని ఈ పథకాలన్నీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యువత పోరు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి తెలిపారు. ఏడాది దాటినా ఫీజు బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంటు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువకులు, నిరుద్యోగులు తరలి రావాలని పిలుపు నిచ్చారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, వైఎస్సార్సీపీ యువజన విభాగం, విధ్యార్థి విభాగం, అనుబంద విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. నిరుద్యోగులను దగా చేసిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
విజయేంద్రతీర్థుల ఆరాధనోత్సవాలు
హొళగుంద: మండల కేంద్రంలోని కోట ఆంజనేయస్వామి ఆలయంలో వెలసిన విజయేంద్రతీర్థుల 411వ ఆరాధనోత్సవాలు శుక్రవారం నుంచి స్థానిక అర్చక బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారికి ధ్వజారోహణం, ప్రార్థనోత్సవం, గోపూజ, లక్ష్మీపూజ, శాఖా–ధాన్యోత్సవ పూజ, స్వస్తివాచన, మహామంగళారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు పూర్వరాధన, ఏకాదశి, మధ్యరాధన, ఉత్తరాధన తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. 24న ఉత్తరాధన రోజు స్వామి రథోత్సవం, ఇతర ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు శ్రీపురందరదాసర భజన మండళి, భక్తి భారతి కోటాల మండళి బృందాలతో భజనాలు, కోలాట కార్యక్రమంతో పాటు స్వామి వారికి స్వస్తివాచన, మహా నైవేద్యం తదితర కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయని విజయీంద్ర తీర్థుల సేవా ట్రస్ట్ సభ్యులు పవనాచారి, రఘునాథాచారి, పాండురంగాచారి, మురళీధరాచారి, వెంకటేశాచారి, రాఘవేంద్రాచారి తెలిపారు. -
దేశంలోనే 5వ స్థానం
28 దఫాలుగా పురుగు మందుల పిచికారీ కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే అత్యధికంగా మిర్చి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. పురుగు మందుల వినియోగం అధికమవడంతో రైతులకు పెట్టుబడి వ్యయం తడిసి మోపెడవుతోంది. ఇదే సమయంలో మిర్చిలో పురుగు మందుల అవశేషాల కారణంగా ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఇకపోతే ఈ కారణంగానే ఎగుమతులు కూడా పడిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల గుంటూరు నుంచి వ్యాపారులు 60 కంటైనర్లలో 900 టన్నుల మిర్చి చైనాకు ఎగుమతి చేశారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో మిర్చిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించి వెనక్కు తీసుకెళ్లాలని చెప్పినట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన మిర్చి ప్రధానంగా గుంటూరు యార్డుకు తరలుతోంది. ధర లేకపోవడంతో 80 శాతం పంటను అక్కడి ఏసీ గోదాముల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో మిర్చి సాగు బాగా కలిసొచ్చింది. 2022–23లో ఉమ్మడి జిల్లాలో 1,29,575 ఎకరాల్లో మిర్చి సాగయింది. ఆ ఏడాది ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. బ్యాడిగ రకాలకు క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.56 వేల వరకు ధర పలికింది. 2024–25లో ఉమ్మడి జిల్లాలో 1,17,868 ఎకరాల్లో మిర్చి సాగయింది. సాగు తగ్గినప్పటికీ చీడపీడలు, వైరస్ తెగుళ్లు, నల్లతామర ప్రభావం తీవ్రంగా ఉండటంతో పురుగుమందుల వినియోగం భారీగా పెరిగింది. 20–25 దఫాలుగా పురుగుమందుల వినియోగం మిర్చి పంట నాట్లు మొదలుకొని చివరి కోత వరకు ఆరు నెలలు ఉంటుంది. ఈ మధ్య కాలంలో 20 నుంచి 25 దఫాలుగా పురుగుమందులు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మంత్రాలయం, పెద్దకడుబూరు, గోనెగండ్ల, కోడుమూరు, దేవనకొండ, హొళగుంద, ఆదోని, సి.బెళగల్, ఓర్వకల్, ఆలూరు, కౌతాళం, కోసిగి మండలాలు.. నంద్యాల జిల్లాలో రుద్రవరం, శిరువెళ్ల, ప్యాపిలి, అవుకు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు తదితర మండలాల్లో మిర్చి సాగవుతోంది. ఒక్కో దఫా పురుగు మందులు పిచికారీ చేయాలంటే ఎకరాకు రూ.3వేల పైనే ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఎకరాకు కేవలం పురుగు మందులపైనే రూ.54 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేస్తుండటం గమనార్హం. డీలర్ల ఇష్టారాజ్యం మిర్చి రైతులు పురుగుల నియంత్రణకు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. డీలర్లు అమ్మకాలను పెంచుకునేందుకు రెడ్, ఎల్లో లేబుల్ పురుగుమందులనే అధికంగా అంటగడుతున్నట్లు తెలుస్తొంది. గ్రీన్ లేబుల్ పురుగుమందులు వినియోగించేలా డీలర్లు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ ఆ దిశగా ప్రోత్సహించకపోవడం వల్లే పురుగుమందుల వినియోగం పెరిగిపోతోంది. మిర్చి సహా అన్ని పంటల్లో గ్రీన్ లేబుల్ పురుగుమందులను వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడుకునే వీలుంటుంది. అయితే గ్రీన్ లేబుల్ పురుగుమందుల వినియోగం అతి తక్కువగా అంటే 10–20 శాతం ఉండగా.. రెడ్, ఎల్లో, బ్లూ లేబుల్ పురుగుమందుల వినియోగం 80–90 శాతం వరకు ఉంటోంది. సేంద్రియ ఎరువులతోనే పంటల్లో నాణ్యత రసాయన ఎరువులు మితిమీరి వినియోగిస్తుండటంతో తెగుళ్లు, పురుగుల బెడద పెరుగుతోంది. సేంద్రియ ఎరువులు వినియోగిస్తే తెగుళ్లు, పురుగుల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు పురుగుమందుల వాడకం కూడా తగ్గించుకోవచ్చు. పురుగుమందులను వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకే వినియోగించాలి. గ్రీన్ లేబుల్ పురుగుమందులను సిఫారసులకు లోబడి వినియోగిస్తే మిర్చిలో నాణ్యత కూడా పెరుగుతుంది. – సుజాతమ్మ, ప్రదాన శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, కర్నూలు మిర్చి తోటలో పురుగుమందు పిచికారీ చేస్తున్న రైతుఉమ్మడి కర్నూలు జిల్లాలో 2023–24తో పోలిస్తే.. 2024–25లో పురుగుమందుల వినియోగం భారీగా పెరిగింది. 2023–24లో 2.92 లక్షల లీటర్ల పురుగుమందులు వినియోగించినట్లు తెలుస్తోంది. 2024–25లో ఏకంగా 3,61,355 లీటర్ల పురుగుమందులు వినియోగించడం గమనార్హం. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగంలో నంద్యాల జిల్లా దేశంలోనే 5వ స్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.పెద్దకడుబూరు మండలం బసలదొడ్డి గ్రామం మిర్చి సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ మిర్చి సాగుకు మల్చింగ్ కూడా వినియోగిస్తారు. ఈ గ్రామానికి చెందిన ఒక రైతు గత ఏడాది 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. అయితే నల్ల తామర తీవ్రత పెరిగిపోవడం, పంటకు నష్టం తీవ్రత ఎక్కువగా ఉండటంతో నాలుగు రోజులకోసారి పురుగు మందులు పిచికారీ చేశారు. ఒక సీజన్లోనే 28 దఫాలు పురుగు మందులు పిచికారీ చేయడం గమనార్హం. ఇందుకోసం ఎకరాకు రూ.60 వేల వరకు ఖర్చు చేశారు. -
ఓట్లు అడిగినప్పుడు దళితులని తెలియదా?
ఆదోని టౌన్: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగిన కూటమి నేతలకు అప్పుడు దళితులనే విషయం తెలియలేదా అని దళిత, గిరిజన ఐక్యవేదిక హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక(జేఏసీ) నాయకులు ప్రశ్నించారు. ఢణాపురం సర్పంచ్ చంద్రశేఖర్ను కులం పేరుతో అవమానించిన ఎమ్మెల్యే బి.పార్థసారధి, టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు, అక్కడి నుంచి తిరిగి భీమాస్ సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు అజయ్బాబు, వీరేష్, దేవదాస్, వై.పి.గంగాధర్, కల్లుబావి నాగేంద్ర, ప్రసాద్, మహిళా నాయకురాళ్లు శ్రీలక్ష్మి, సుజ్ఞానమ్మ తదితరులు మాట్లాడారు. గ్రామ ప్రథమ పౌరుడిని జనం మధ్యలో కులం పేరుతో అవమానించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒకరు క్రిష్టియనా అంటే, మరొకరు ఎస్సీ అని నోరు పారేసుకోవడంతో దళిత సమాజాన్ని అగౌరవపరచడమేనన్నారు. ఓట్ల కోసం దళితుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి కులం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బాధిత సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కులాన్ని ఎత్తి చూపడంతో తాను వేదికపైకి వెళ్లలేకపోయానన్నారు. వందలాది మంది గ్రామస్తుల సమక్షంలో తనను కులం పేరుతో అవమానం చేసిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు, ఇస్వీ పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు అందజేశారు. ఎమ్మెల్యే బి.పార్థసారధి, టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు, వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. దళిత సర్పంచ్కు అవమానంపై ఆదోనిలో భారీ నిరసన ప్రదర్శన -
కూటమి పాలనలో ఒరిగిందేమీ లేదు
కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీల అమల్లో ఘోరంగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్ విమర్శించారు. శుక్రవారం సీపీఎం కార్యాలయంలో కూటమి ఏడాది పాలనపై సీపీఎం బుక్ను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్కల్యాణ్ అధికారంలోకి రావడం కోసమే రాష్ట్ర ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికే 143 వాగ్ధానాలు చేశారన్నారు. తల్లికి వందనం అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్కు కేంద్రం ఇచ్చిన నిధులు తప్పా ఒక్క రూపాయి కేటాయించలేదని, వేదవతి, గుండ్రేవుల రిజర్వాయర్ల ప్రస్తావనే లేదని, హంద్రీనీవా నత్తడనకన సాగుతోందన్నారు. జిల్లా ప్రాజెక్టులు పట్టించుకోకుండా బనకచర్లతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని అంటున్నారని, ఇదంతా నాటకమేనని మండిపడ్డారు. రైతులు పండించిన పొగాకును కొనుగోలు చేయలేని, అప్పుడు స్మార్ట్ మీటర్లను వద్దని, ఇప్పుడు బలవంతంగా పెట్టిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న రూ.100 కోట్ల ఉపాధి బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. డీఎస్సీలో సగం పోస్టుల్లో కోత పెట్టారని విమర్శించారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఇప్పటికై నా ప్రజలకు మేలు చేయాలని సూచించారు.సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.1500, ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని ప్రశ్నించారు. వైన్ షాపులు బార్లలా మారిపోయాయని, రోడ్లపైనే తాగుబోతులు తాగి తూళుతుండడంతో మహిళలకు తీవ్ర ఇబ్బందిగా ఉందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ, కేవీ నారాయణ, టి.రాముడు, ఓల్డ్ సిటీ కార్యదర్శిరాజశేఖర్ పాల్గొన్నారు. -
ఔదార్యం చాటుకున్న ‘తలి’్లకి వందనం
ఉయ్యాలవాడ: పేద కుటుంబమైనప్పటికీ తన బ్యాంకు ఖాతాలో జమైన మరో తల్లికి చెందిన ‘తల్లికి వందనం’ డబ్బును తిరిగిచ్చి ఓ మహిళ ఔదార్యం చాటుకుంది. వివరాలు.. ఉయ్యాలవాడ మండల ప్రజా పరిషత్ పాఠశాల(మెయిన్)లో గ్రామానికి చెందిన కుమారి కుమారుడు శివ సాత్విక్, పావని కుమారుడు పవన్ గౌతమ్ 2వ తరగతి చదువుతున్నారు. ఆ ఇద్దరు పిల్లలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ‘తల్లికి వందనం’ డబ్బులు కుమారి ఖాతాలో రూ.26 వేలు జమ అయ్యాయి. దీంతో తనకు సంబంధం లేని డబ్బులు తనకు వద్దని కుమారి శుక్రవారం పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి సమక్షంలో పావనికి నగదు అందజేశారు. రాజు, కుమారి దంపతుల నిజాయితీని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఆదామ్, మహబూబ్ బాషా, రాజు మెచ్చుకుని వారిని అభినందించారు. -
శరీరం, మనస్సును సమన్వయం చేస్తుంది
మనసు చెప్పిన మాట శరీరం వినదు. శరీరం చెప్పిన మాట మనసు వినదు. ఈ రెండింటినీ సమన్వయం చేయడమే యోగా. నేను 14 ఏళ్లుగా ఉచితంగా యోగా నేర్పిస్తున్నాను. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శరీరం దృఢంగా, మనసు స్థిరంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంది. యోగా మనసుకు శాంతి, శరీరానికి ధృఢత్వం, చిత్తానికి ఓర్పు చేకూర్చే అద్భుత ప్రక్రియ. శరీరంలో మూసుకుపోతున్న ద్వారాలన్నీ తెరుచుకుంటాయి. శరీరంలో ఎంజైమ్లు, హార్మోన్లు ఉత్తేజితం అవుతాయి. బరువును నియంత్రణలో ఉంచుతుంది. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను, సయాటిక, థైరాయిడ్, కిడ్నీ, లివర్కు సంబంధించిన జబ్బులను నివారిస్తుంది. – ఎల్.నరేష్గౌడ్, యోగా శిక్షకులు, కర్నూలు -
మిర్చిలో పురుగుమందుల అవశేషాలు
● చీడపీడల నియంత్రణకు అడ్డగోలు వినియోగం ● ఎకరాకు రూ.54 వేల నుంచి రూ.60 వేల ఖర్చు ● అత్యంత ప్రమాదకర మందుల విక్రయాలు ● లాభాల కోసం ప్రోత్సహిస్తున్న డీలర్లు ● ఎగుమతులపైనా తీవ్ర ప్రభావం ● ఈ కారణంగానే పతనమవుతున్న ధర రెడ్ లేబుల్: ఇవి అత్యంత విషపూరితమైనవి. మోనోక్రోటోఫాస్, జింక్ ఫాస్పేట్, ఇథైల్, మెర్కూరి అసిటేట్ వంటివి. బ్లూ లేబుల్: ఈ లేబుల్ కలిగిన పురుగుమందుల్లో విష ప్రభావం మధ్యస్తంగా ఉంటుంది. స్పైనోశాడ్, మలాథియాన్, ధిరామ్, గ్లైపోసేట్ తదితరాలు. గ్రీన్ లేబుల్(హెచ్చరిక): ఈ లేబుల్ పురుగుమందుల్లో విష ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆహార పంటలకు వీటినే వినియోగించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. మాంకోబెబ్, అక్సిప్లోర్పెస్, కొరాజిన్, వేపనూనే తదితరాలు. ఎల్లో లేబుల్(డేంజర్): ఇవి కూడా అత్యంత విషపూరితమైనవే. వీటి ఉత్పత్తిని తగ్గించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఓమైట్, అవాంట్, ఎండోసల్ఫాన్, కార్బరిల్, క్వినాల్ఫాస్, సైఫర్మెత్రిన్, ఫిప్రోనిల్, రోగార్ వంటివి పురుగు మందుల్లో విష తీవ్రత ఇలా.. -
పట్టపగలే చోరీ
● 6 తులాల బంగారు నగలు, రూ.2 లక్షల నగదు అపహరణఓర్వకల్లు: మండలంలో గురువారం పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు అందినకాడికి దోచుకెళ్లిన సంఘటన మీదివేముల గ్రామంలో చోటుచేసుకొంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రామేశ్వరరెడ్డి వ్యయసాయ పనులు చేస్తుండగా, భార్య కళావతి స్థానిక అంగన్వాడీ కేంద్రం టీచర్గా పనిచేస్తోంది. రోజులాగే ఇంటికి తాళం వేసి, వారి కూతురి పిల్లలను పక్కంటి వారి వద్ద వదిలి తమ పనుల నిమిత్తం వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపు పెకిలించి అందులోని 6 తులాల బంగారు నగలు, రూ.2 లక్షల నగదును అపహరించుకెళ్లారు. పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటంతో పొరుగింటి వారితో చెప్పగా వారు ఇంటి యజమానులకు విషయం తెలియజేశారు. వారు ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సునీల్కుమార్ గ్రామానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.