breaking news
Kurnool
-
గ్రంథాలయ ఉద్యమ నాయకుల సేవలు చిరస్మరణీయం
కర్నూలు కల్చరల్: గ్రంథాలయ ఉద్యమ నాయకుల సేవలు చిరస్మరణీయమని వక్తలు అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో మూడో రోజు ఆదివారం గ్రంథాలయ ఉద్యమ నాయకులను స్మరించుకునే కార్యక్రమం నిర్వహించా రు. గ్రంథాలయ ఉద్యమ నాయకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యంకి వెంకట రమణ య్య, పాతూరి నాగభూషణం, ముచ్చుకోట చంద్రశేఖర్ చిత్ర పటాలకు డిప్యూటీ కలెక్టర్ ప్రసన్న లక్ష్మి, ఆర్అండ్బీ డీఈ పి.ప్రేమకుమారి, సైనిక్ వెల్ఫేర్ అధికారి ఎస్ఆర్ రత్న రూత్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం పుస్తక పఠంతో మేదస్సు పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శన అలరించింది. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఇన్చార్జ్ సెక్రటరీ పెద్దక్క అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, బాషా, చంద్రమ్మ, నసీమా, రేణుక, పద్మావతమ్మ, ఈశ్వరమ్మ, ఉమ పాల్గొన్నారు. -
20 శాతం మంది మూర్ఛరోగులే...!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి విభాగానికి వచ్చే రోగుల్లో 20 శాతానికి పైగా మూర్చరోగులే ఉంటున్నారు. తాము ప్రతి వారం దాదాపు వంద మంది మూర్చవ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నాము. అవసరమైన వారికి ఈఈజీ, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు చేయించి ఎందువల్ల ఈ వ్యాధి వచ్చిందో గుర్తించి చికిత్స చేస్తున్నాము. ఇక్కడ చికిత్సతోపాటు అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా రోగులకు అందిస్తున్నాము. –డాక్టర్ సి. శ్రీనివాసులు, న్యూరాలజి విభాగాధిపతి, పెద్దాసుపత్రి ఈ వ్యాధికి ఆడ, మగా తేడా లేదు. వయస్సుతో సంబంధం లేదు. సున్నా నుంచి 90 ఏళ్ల వయస్సు వారి వరకు ఈ వ్యాధి రావచ్చు. కొందరికి పుట్టుకతో వస్తే, మరికొందరికి ప్రమాదాలు, ఇన్ఫెక్షన్లు, ట్యూమర్ల వల్ల వస్తుంది. చిన్నపిల్లల్లో పలు కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అది ఎందువల్ల వచ్చిందో వైద్యులు నిర్ధారించి చికిత్స చేస్తారు. కొందరు మాత్రమే దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. అధిక శాతం వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం మందులు వాడితే సరిపోతుంది. – డాక్టర్ బి.హైందవకుమార్రెడ్డి, న్యూరోఫిజీషియన్, కర్నూలు -
ఔటర్ రింగ్ రోడ్డులో ఆటోవాలాల స్టంట్లు
కర్నూలు: నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద అవుటర్ రింగ్ రోడ్డులో బైక్ రేసింగ్లు, ఆటోవాలాల స్టంట్లు మితిమీరాయి. ఈ ప్రాంతంలో పోలీసు గస్తీ అంతంత మాత్రంగా ఉండటంతో ఆకతాయిలు గుంపులుగా చేరి బైక్ రేసింగ్లు, ఆటోలతో స్టంట్లు చేస్తూ రీల్స్ చేసి ఇన్స్ట్రాగ్రామ్లో పోస్టులు పెడుతున్నారు. గత కొంతకాలంగా ఆకతాయిలకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. రౌడీషీటర్లు కూడా మద్యం సేవించి గట్టు ప్రాంతానికి వచ్చే ప్రేమికులను బెదిరించి నిలువు దోపిడీకి పాల్పడి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. ఆటోవాలాలు మద్యం మత్తులో రోడ్డుపైనే ఆటోలతో స్టంట్లు చేస్తూ రీల్స్ చేసి ఇన్స్ట్రాగామ్లో పోస్టులు పెడుతున్నట్లు సమాచారం అందడంతో ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. నాలుగు ఆటోలతో స్నేక్ డ్రైవింగ్, స్టంట్లు చేస్తూ వీడియోలు తీస్తుండగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేట వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. స్టంట్ల వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో వివరించి నలుగురిపై కేసు నమోదు చేశారు. ఆటోలతో స్టంట్లు, ర్యాష్ డ్రైవింగ్లకు పాల్పడుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే 112 లేదా 100 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. -
కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు శివారులోని తుంగభద్ర బ్రిడ్జి దగ్గర కేసీ కెనాల్లోకి దూకి కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ అన్వర్(60) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గత 20 ఏళ్లుగా కిమ్స్ హాస్పిటల్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఆదివారం ఉదయం మాసామసీదు వద్ద కేసి కెనాల్లో శవమై తేలాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు అర్బన్ తాలుగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కుటుంభ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య పాతిమాతో పాటు కుమారుడు, కూతురు సంతానం. సోదరి కుమారుడు జావీద్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నదీ తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సి.బెళగల్: తుంగభద్ర నదితీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించిందని ఎస్ఐ వేణుగోపాల్రాజు తెలిపారు. ఆదివారం నదితీర గ్రామమైన ముడుమాల గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీస్లకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వేణుగోపాల్రాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కర్నూలు నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మాజీ బృందం సభ్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని సంఘటన స్థలంలోనే ఖననం చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతుడి ఎత్తు 172 సెంటీమీటర్లు ఉన్నట్లు, మృతుడి ఎడమ భుజముపై ఎస్యూ అనే అక్షరాలు ఉన్నాయని, వివరాలు తెలిస్తే సి.బెళగల్ పోలీస్లను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. నల్లమల ఘాట్లో రోడ్డు ప్రమాదం మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘాట్రోడ్డులోని బొగద దొరబావి వంతెన వద్ద గిద్దలూరు నుంచి వస్తున్న లారీ, నంద్యాల నుంచి వెళ్తున్న కారు మలుపు వద్ద ఢీకొన్నాయి. కారు ముందు భాగం దెబ్బతినింది. కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కొద్దిసేపు ఘాట్రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మహానంది, శిరివెళ్ల మండలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు ఆదోని అర్బన్: బాలికను వేధించడంతో త్రీటౌన్ పోలీసులు బీజేపీ నాయకుడు మహేష్నాయక్ అనే యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాలు.. మహేష్నాయక్ అనే బీజేపీకి చెందిన నాయకుడు వేధిస్తున్నాడని శనివారం ఎమ్మెల్యే పార్థసారథికి ఫిర్యాదు చేసేందుకు బాధితులు వచ్చారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు మహేష్నాయక్ ఎమ్మెల్యే ఇంటి ముందే వారితో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. వెంటనే ఇరువురు త్రీటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లారు. బాలికను వేధిస్తున్నాడని బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. మహేష్నాయక్పై బాలిక తల్లిదండ్రులు దాడి చేసినట్లు మహేష్నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గం
కర్నూలు (టౌన్): హిందూపురంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యాలయాన్ని టీడీపీ గూండాలు విధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. ఆదివారం స్థానిక సీ.క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దాడులతో వైఎస్సా ర్సీపీ నాయకులను బెదిరించలేరన్నారు. ప్రజల్లో ఇప్పటికే బాబు సర్కార్పై పూర్తి వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ విజయాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. 24న డాక్టర్ ఖాదర్వలి కర్నూలు రాక కర్నూలు(అగ్రికల్చర్): ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ స్పెషలిస్టు, పద్యశ్రీ అవార్డు గ్రహాత డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 24న కర్నూలుకు రానున్నారు. చిరుధాన్యాల వినియోగంపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీ.క్యాంపు సెంటరులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారని అధితి చిరుధాన్యాల ప్రతినిధులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. క్వింటా పత్తిని రూ.12 వేల ప్రకారం కొనుగోలు చేయాలి కర్నూలు(సెంట్రల్): రైతులు పండించిన పత్తిని క్వింటాలు రూ.12 వేల ప్రకారం సీసీఐ ద్వారా కొనుగోలు చేయించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం డిమాండ్ చేశారు. ఆదివారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మంగళ, బుధవారాల్లో ఆదోనిలోని రోషన్ గార్డెన్స్లో జరిగే పత్తి రైతుల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, రావుల వెంకయ్య, మాజీ మంత్రి రఘువీరారెడ్డి హాజరు కానున్నట్లు చెప్పారు. తిప్పాయపల్లెలో దొంగలు హల్చల్ ఓర్వకల్లు: మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. వరుసగా నాలుగు ఇళ్లలో చొరబడి దొంగతనం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురువ బాలమద్దిలేటి, బైరాపురం చంద్రశేఖర్రెడ్డి, వడ్డె రవిచంద్రుడు ఇళ్లకు తాళం వేసి వేర్వేరు ప్రాంతాలో జీవనం సాగిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఆ ఇళ్లకు వేసిన తాళం గడియలను ఆక్సిల్ బ్లేడుతో కోసి ఇళ్లలోకి చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. కురువ బాలమద్దిలేటి ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు, బైరాపురం చంద్రశేఖర్రెడ్డి ఇంట్లో రూ.30 వేల నగదు, వడ్డె రవిచంద్రుడు ఇంటిలో రూ.7 వేలు, ముల్ల బషీర్ అహ్మద్ ఇంట్లో సుమారు రూ.25 వేల నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. బాధితులు ఆదివారం ఇంటికి వెళ్లి చూడగా చోరీ జరిగిన విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారణ చేపట్టారు. -
30 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం
నందికొట్కూరు: వడ్డేమాన్ గ్రామంలో ఓ రైతు నిర్లక్ష్యం వల్ల 30 ఎకరాల మొక్కజొన్న పంట, 4 ఎకరాల్లో కంది పంట దగ్ధమైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ తిరుపాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోయ సోమన్న అతని రెండు ఎకరాల్లో మొక్కజొన్న కొయ్యలకు నిప్పు పెట్టారు. ఈ సమయంలో చుట్టూ ఉన్న కొందరు రైతులకు చెందిన మొక్కజొన్న పంట, కంది పంటకు మంటలు వ్యాపించి మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో తెలుగు రోషన్నకు చెందిన 10 ఎకరాల మొక్కజొన్న, బ్రాహ్మణకొట్కూరుకు చెందిన అబ్దుల్ రహిమాన్–7 ఎకరాలు, ముర్తుజావలి–4, ఈశ్వరన్న–5, నూరుల్లా–4, నాగపుల్లన్నకు 4 ఎకరాల కంది పంట మొత్తం దగ్ధమైంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపాలు పొలాలను పరిశీలించారు. రైతుల ఫిర్యాదు మేరకు బోయ సోమన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
సీమ వెనుకబాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం
● రాయలసీమ ప్రయోజనాల కోసం నిరంతర పోరాటం ● డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి కర్నూలు(అర్బన్): రాయలసీమ వెనకబాటు తనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్లో శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేయాలనే డిమాండ్పై సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలతో వేలకోట్ల రూపాయాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పలుమార్లు ప్రధానమంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రాయలసీమ జిల్లాలో పర్యటించారని, ఏ ఒక్కరికి కూడా శ్రీబాగ్ ఒప్పందం గురించి మాట్లాడేందుకు నోరు రాకపోవడం దురదృష్టకరమన్నారు. అనేక రూపాల్లో నష్టపోతున్న రాయలసీమ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తన తుది శ్వాస విడిచేంత వరకు పోరాటం అపబోమన్నారు. రాయలసీమ ఎప్పటికై తే ప్రత్యేకంగా ఉంటుందో అప్పుడే ఇక్కడి ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులు ఎంతో అనుకులంగా ఉన్న రాయలసీమను అభివృద్ధి చేయడంలో పాలక ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లోనే వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు చూస్తున్న పాలకులు రాయలసీమపై కూడా దృష్టి సారించాలన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బంది పడుతున్న రాయలసీమ ఎడారి కాకముందే ఇక్కడి ప్రజలు మెల్కోవాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ పౌరుషాన్ని చూపించకపోతే భావితరాలు మనల్ని క్షమించబోవన్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ కంటే రాయలసీమ చాలా వెనకబడి ఉందని గతంలో శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, రాయలసీమ రాష్ట్ర సమితి మైనార్టీ నాయకులు ఖాదర్ వలి, బి. ముసికిన్, సుభాన్, రాజశేఖర్, ఖాసీం వలి, మీడియా కోఆర్డినేటర్ ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు. -
న్యాయపోరాటం చేస్తాం
గ్రామ కంఠం భూమి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్, ఆదోని సబ్కలెక్టర్, తహసీల్దార్లకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎందుకు పట్టించుకోవటం లేదు. అధికార పార్టీ నాయకుల చెప్పిందే రెవిన్యూ అధికారులు పాటిస్తున్నారనే అనుమానాలు మాకు ఉన్నాయి. గ్రామ కంఠంలో కొన్ని సంవత్సరాలుగా దిబ్బలు వేసుకుంటున్నారు. మహిళలు బహిర్భూమికి వెళ్లేవారు. ఇప్పుడు నాయకులు అక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. – శంకర్, మల్లారిపేట, గుడేకల్ గ్రామం కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న స్థలంలో ఎరువు దిబ్బలు, వరిగడ్డి వాములు వేసుకుంటున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మాటవిని మమ్మల్ని స్థలం లోకి రాకూడదని చెప్పితే ఎలా? మాకు స్థలం చూపించాలి. ఇంటి ముందు దిబ్బలు వేసుకోవటానికి స్థలం లేదు. –మహదేవి, మల్లారిపేట, గుడేకల్ గ్రామం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అండదండలు మాకు ఉన్నాయని, మమ్మల్ని ఏమి చేసుకోలేరని గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఆక్రమించుకోవాలని చూసే తెలుగుదేశం పార్టీ నాయకులది 4వ వార్డు. మాది 3వ వార్డు. మా కాలనీలో వారి దౌర్జన్యం ఏమిటి? ప్రజల సహనం కోల్పోయి ఏమైనా జరిగితే దీనికి అధికారులు, ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – తిమ్మయ్య, మల్లారిపేట, గుడేకల్ -
అన్నదానానికి విరాళం
పాణ్యం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యన్నదానానికి గుంటూరు పట్టణానికి చెందిన శ్రీ భువనేశ్వరి ట్రేడర్స్ అధినేత వనకూరి శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులు రూ. 1,11, 669 విరాళం అందించినట్లు ఈఓ రామకృష్ణ తెలిపారు. అలాగే గోస్పాడు మండలం పసురపాడుకు చెందిన చాకిరెడ్డి ఉమామహేశ్వరరెడ్డి రూ. 20, 020 విరాళంగా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు సుబ్బారెడ్డి, అర్చకులు సురేష్శర్మ, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అరటి రైతు కుదేలు కృష్ణగిరి: ఆరుకాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైంది. దీంతో అన్నదాతల కష్టాలకు విలువ లేకుండా పోతోంది. కృష్ణగిరి మండలంలోని బాపనదొడ్డి, కర్లకుంట, కోయిలకొండ తదితర గ్రామాల్లో ఉద్యాన పంట కింద అరటి పంటను అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేశారు. తీరా పంటకు చేతికి వచ్చిన తర్వాత ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెండు సంవత్సరాల క్రితం అరటి కిలో రూ. 20 ఉండగా సంవత్సరం క్రితం రూ.15కు పడిపోయింది. ప్రస్తుతం రూ.6 కూడా ఇవ్వడం లేదు. పంటకు గిట్టుబాటు ధరలు ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆరటి రైతులు కోరుతున్నారు. అంతర్జాతీయ డాడ్జ్బాల్ పోటీలకు ఆదోని క్రీడాకారుడు ఆదోని సెంట్రల్: అంతర్జాతీయ స్థాయి డాడ్జ్బాల్ పోటీలకు ఆదోని క్రీడాకారుడు బి.వెంకట్ ఎంపికయ్యాడు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు మలేసియాలోని కౌలాలంపూర్లో జరగనున్న అంతర్జాతీయ డాడ్జ్బాల్ పోటీల్లో భారతదేశం తరఫున బి.వెంకట్ పాల్గొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ డాడ్జ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంబిరెడ్డి, సెక్రటరీ సాబీర్అహ్మద్ ఆదివారం తెలిపారు. ఈ క్రీడను ఒక జట్టుగా ఆడతారని, దీనిలో ఆటగాళ్లు తమ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను బంతులతో కొట్టి అవుట్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. క్రీడాకారుడు బి.వెంకట్ను అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అభినందన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డాడ్జ్బాల్ అసోసియేషన్ సభ్యులు భరత్షా, మేఘనాథ్రెడ్డి, సోమశేఖర్రెడ్డి, డాక్టర్ సైఫుల్లా తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం టెంపుల్: ధర్మపథంలో భాగంగా ఆదివారం నిత్య కళావేదికపై హైదరాబాద్కు చెందిన పద్మ హేమమాలిని, శిష్య బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రదర్శించారు. గణేశ పంచరత్నం, కంజదళాయతాక్షి, శివాష్టకం తదితర గీతాలకు శ్రీదేవి, లక్ష్మీమేఘన తదితరులు నత్యప్రదర్శన ప్రదర్శించారు. -
ఎత్తిపోయిన పథకాలు!
దుద్ది రిజర్వాయర్ కింద 15 ఎకరాల భూమి సాగుచేసుకున్నా. ఖరీఫ్లో భారీ వర్షాలు కారణంగా పత్తి, ఉల్లి పంటలు పూర్తి దెబ్బతిన్నాయి. కనీసం పెట్టుబడి రాక అప్పులు మిగిలాయి. రబీలో వేరుశన, మిరప, ఉల్లి పంటలు సాగు చేసుకున్నా. ఇప్పుడు ఎల్లెల్సీ కాల్వకు నీళ్లు ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. పంటలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. – తిమ్మయ్య, ఆయకట్టు రైతు, కోసిగి కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోంది. గతంలో ఖరీఫ్లోనే మండలంలోని దుద్ది, మూగలదొడ్డి రిజర్వాయర్లు నిండుగా నీటితో నింపేవారు. ఎల్లెల్సీ నీరు తగ్గిన వెంటనే ఆ రిజర్వాయర్ నీటితో పంటలను పండించుకునే వాళ్లం. కానీ ఈ ఏడాది ఎల్లెల్సీ నీరు ఇవ్వమంటున్నారు. వర్షకాలంలో పంటలు దెబ్బతిన్నాయి, రబీలోను పంటలు లేక పోతే రైతులు ఎలా బతకాలి? – నాడుగేని వీరారెడ్డి, రైతు, కోసిగి కోసిగి: భారీ వర్షాలు కురిసి తుంగభద్ర నది నిండుగా ప్రవహించినా రైతుల కష్టాలు తొలగలేదు. ఎత్తిపోతల పథకాలు పనిచేయకపోవడం, తుంగభద్ర దిగువ కాలువకు జనవరి 10 వరకే నీరు ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాలన్నీ బీళ్లుగా మారుతాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎల్లెల్సీ (తుంగభద్ర దిగువ కాలువ)కింద చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడాన్ని గమనించి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. తుంగభద్ర నది ఒడ్డున దుద్ది, మూగలదొడ్డి, మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి పుష్కలంగా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించారు. సాగుకు ‘చంద్ర’గ్రహణం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదు. తుంగభద్ర నది నిండుగా ప్రవహించే సమయంలో ఎత్తిపోతల పథకాల పంప్హౌస్ల నుంచి రిజర్వాయర్లను నీటితో నింపాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు నిర్వహణ నిధులు మంజూరు చేయలేదు. దీంతో పంప్ హౌస్లు పనిచేయలేదు. ఫలితంగా రిజర్వాయర్లు నీరు లేక వెలవెలబోతున్నాయి. ‘దుద్ది’ ఎత్తిపోయింది! తుంగభద్ర నది ఒడ్డున సాతనూరు సమీపంలో నిర్మించిన దుద్ది ఎత్తిపోతల పథకం మిషన్లు ఏడాది మరమ్మతులు చేయలేదు. రిజర్వాయర్కు చుక్క నీరు కూడా పంపింగ్ చేయలేదు. ఈ రిజర్వాయ కింద దుద్ది, కోసిగి, దేవరబెట్ట, డి.బెళగల్ వరకు 3,500 ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. అలాగే నీటిని సరఫరా చేసే దుద్ది పొలాల్లో నెల రోజల క్రితం పైప్లైన్ పగిలిపోయింది. ఇంత వరకు మరమ్మతులు చేపట్టక లేక పోయారు. నదిలో వృథా నీరు దిగువ ప్రాంతాలకు తరలి పోయాయి. ఖరీఫ్ ముగిసి పోయినా రిజ్వాయర్ వైపు పాలకులు, అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రబీలో నైనా సాగు చేసుకుందామనుకున్నా జనవరి 10 వరకే నీరు ఇస్తామని చెబతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పంటలు లేక బతుకు భారమై వలస బాట పడుతున్నారు. ‘మూగ’నోము మూగలదొడ్డి ఎత్తిపోతల పథకం కింద 3,700 ఎకరాలు ఆయకట్టు భూములు ఉన్నాయి. మూగలదొడ్డి, అగసనూరు, జంపాపురం, చిర్తనకల్లు, ఐరన్గల్లు, సాతనూరు వరకు ప్రవహిస్తోంది. ఎత్తి పోతల పథకం వద్ద రెండు మిషన్లు ఉన్నారు. ఒకటి మరమ్మతులకు గురైనా మరమ్మతులు చేయలేదు. ఒక మిషన్తో రైతులు దగ్గరుండి పంపింగ్ చేయించుకుంటున్నారు. ఒక మిషన్తో రిజర్వాయర్లోకి అరకొరగా వచ్చి చేరుతున్నారు. దీంతో రిజర్వాయర్లో పుష్కలంగా సాగునీరు నిండలేదు. అలాగే మంత్రాలయం మండలంలోని మాధవరం, బసలదొడ్డి ఎత్తి పోతల పథకాలకు గతేడాది ఒక్క చుక్క నీరు కూడా అందించలేక పోయారు. ఈ ఏడాది కూడా అందిస్తారో లేదో నని రైతులు ఎదురు చూపులే మిగిలాయి. ఈ ఏడాది దుద్ది రిజర్వాయర్కు చుక్క నీరు నింపని వైనం పంప్ హౌస్ మరమ్మతులు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం తుంగభద్ర దిగువ కాలువకు జనవరి 10 వరకే నీరు పొలాలు బీళ్లు అవుతాయనే ఆందోళనలో అన్నదాతలు -
బియ్యం గింజలతో పరమ శివుడు
కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ బియ్యపు గింజలతో పరమశివుడు రూపాన్ని ఆవిష్కరించారు. కుంచె, రంగులు లేకుండా స్కెచ్లు ఉపయోగించకుండా బియ్యపు గింజలను పలకమీద పోస్తూ చేతి వేలితో బియ్యపు గింజలను క్రమంగా సరి చేస్తూ శివయ్య రూపాన్ని ఆవిష్కరించారు. గంగాదేవి, సిగలో నెలవంక, మెడలో నాగరాజు(పాము), త్రిశూలం, ఓం ఆకారం, కార్తీక ప్రమిదలను చిత్రంలో రూపొందించడంతో కోటేష్ను పలువురు అభినందించారు. – నంద్యాల(అర్బన్) -
సాగునీరు ఇవ్వడం కష్టమే!
గురురాఘవేంద్ర ప్రాజెక్ట్లలో భాగంగా తుంగభద్ర నది ఒడ్డున నిర్మించిన ఏడు ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు రూ.4.50కోట్లుకు ప్రతిపాదనలు తయారు చేసి పంపాం. కోసిగి మండలంలోని దుద్ది, మూగలదొడ్డి రిజర్వాయర్లు ఒక్కొక్క మిషన్ పనిచేస్తోంది. దుద్ది పైప్లైన్ పగిలి పోవడంతో కాంట్రాక్టర్ సమయం ముగిసిందని పట్టించేకోలేదు. బడ్జెట్ వచ్చిన వెంటనే మరమ్మతులు చేయిస్తాం. ఈ ఏడాది దుద్ది నుంచి సాగునీరు ఇవ్వడం కష్టమే. – ప్రేమ్, గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ ఏఈ -
ఊరూరా కష్టాలు.. కన్నీళ్లు!
కోవెలకుంట్ల/కోడుమూరురూరల్/హాలహర్వి/కౌతాళం: చంద్రబాబు ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు కష్టాలు పడుతున్నారు. పంటలు పండక రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పలు గ్రామ సచివాలయాలు అసంపూర్తిగా ఉండి అవస్థలు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మందుబాబులు మద్యం సేవించి సీసాలు పగులగొడుతున్నారు. ఊరూరా కష్టాలు.. కన్నీళ్లు కనిపిస్తుండటంతో ‘ఇదేం పాలన’ అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. తొలగని ‘దారి’ద్య్రం హాలహర్వి మండలంలోని గూళ్యం–బల్లూరు గ్రామ రహదారి కంకరతేలి గుంతలతో అధ్వానంగా మారింది. ఏడాదిగా గ్రామ రహదారి బాగుపడడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఉదయం పాఠశాలలకు వెళ్లేందుకు వాహనాల్లో ఈ మార్గం గుండానే విద్యార్థులు వెళ్తుంటారు. రోడ్డుబాగా లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ రహదారిలో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి..ఆధోగతి కోడుమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని గ్రామ సచివాలయ భవనం నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో ఈ భవనంలో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కొందరు ఆకతాయిలు నిత్యం మద్యం తాగుతున్నారు. ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భవనంపైనే కాంట్రాక్టర్ ఇసుక, కంకరను అలాగే వదిలేశారు. దీంతో వర్షాలకు నీళ్లు నిలిచిపోయి భవనం దెబ్బతింటోంది. అసాంఘిక చర్యలు కౌతాళంలోని కన్నడ ప్రాథమిక పాఠశాల కాంపౌండ్లో విద్యార్థులు నిత్యం ప్రార్థన చేసే స్థలంలో బీర్ బాటిళ్లను పగలగొట్టారు. గాజు ముక్కల్ని చెల్లాచెదురుగా పడేశారు. పంచాయతీ కార్యాలయానికి పక్కనే ఈ పాఠశాల ఉంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల కాంపౌండ్లోకి దూకి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. విద్యార్థులు ప్రార్థన చేసే స్థలంలో ఇలా చేయడం చాలా బాధాకరం అని, వారిని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మిరప పైరును తొలగించి.. కోవెలకుంట్ల మండలం రేవనూరులో ఇటీవల తుపాన్తో కురిసిన భారీ వర్షాలు మిరప రైతులకు కన్నీటిని మిగిల్చాయి. గ్రామానికి చెందిన హనుమంతు రెడ్డి నాలుగు ఎకరాల సొంత పొలంలో ఈ ఏడాది జూలై నెలలో మిరప పంట సాగు చేశాడు. ఎకరాకు రూ. 90 వేలు ఖర్చు చేశాడు. నాలుగు నెలల పంట కావడంతో మొక్కకు 60 నుంచి 70 మిరప కాయలు కాశాయి. గత నెలాఖరులో తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురియడంతో పైరులో తేమ శాతం అధికమై వేరుకుళ్లు తెగులు ఆశించి పైరంతా ఎండిపోయి దెబ్బతినింది. అలాగే ఇదే గ్రామానికి చెందిన ప్రసాద్ అనే మరో రైతు ఎకరా రూ. 40 వేలు కౌలు చెల్లించి మూడున్నర ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు. ఎకరాకు రూ. లక్ష చొప్పున పెట్టుబడుల రూపంలో వెచ్చించాడు. భారీ వర్షాలతో వేరుకుళ్లు తెగులు ఆశించి పైరు పూర్తిగా దెబ్బతినింది. పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నమంతా వృథా కావడంతో విధిలేని పరిస్థితుల్లో పైరును తొలగించారు. అధికారులు పంటనష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
మెదడులో కలకలం!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి విభాగానికి సోమ, గురువారాల్లో ఓపీ రోగులకు చికిత్స అందిస్తారు. ప్రతి ఓపీ రోజున 200 నుంచి 250 మంది దాకా చికిత్స కోసం వస్తారు. ఇందులో వీరిలో 20 శాతం మంది మూర్చ వ్యాధి బాధితులుంటున్నారు. ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో ఐపీ సేవలతో పాటు ఈఈజీ, ఎపిలెప్సీ స్టడీ సేవలు ఏడాదికి 3వేల మంది వరకు ఉచితంగా అందిస్తున్నారు. ఇవే పరీక్షలు ప్రైవేటుగా చేయించుకుంటే రూ.2 వేలకు పైగానే ఖర్చు అవుతుంది. మూర్ఛ బాధితులకు అవసరమైతే ఎంఆర్ఐ, వీడియో ఈఈజీ పరీక్షలు కూడా నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలోనే గాక జిల్లా మొత్తంగా సీహెచ్సీలు, పీహెచ్సీలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్దకు వెళ్లే వారు ప్రతి నెలా మరో 10వేల మంది దాకా ఉంటారని అంచనా. కాగా ఇప్పటికీ గ్రామాల్లో కొందరు ఈ వ్యాధికి నాటు మందు తీసుకుంటున్నారు. ప్రాణాల మీదకు వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వస్తున్నారు. మూర్చలో రకాలు–లక్షణాలు ● సాధారణ మూర్ఛలో మొత్తం మెదడు చాలా వరకు దెబ్బతింటుంది. టానిక్ క్లోనిక్లో ఆకస్మికంగా స్పృహ కోల్పోవచ్చు. రోగిపడిపోవడం, దీంతో పాటు చేతులు, కాళ్లు కొట్టుకోవడం చేస్తారు. అబ్సెన్స్ లేక సెటిల్ మాలో మూర్చలో స్పృహ స్వల్పకాలంపాటు కోల్పోతారు. ఈ దశలో రోగి కొంత కాలం పాటు శూన్యంలోకి చూస్తూ ఉంటారు. ● మయోక్లోనిక్ మూర్చలో ఆకస్మిక, సంక్లిప్త కండరాలు సంకోచాలు సంభవిస్తాయి. ఇవి మొత్తం శరీరమంతా లేదా కొన్ని భాగాలకు సంభవిస్తాయి. అటోనిక్ మూర్ఛలలో ఆకస్మిక విచ్ఛిన్నం సంభవిస్తుంది. ఆ తర్వాత తక్షణమే కోలుకుంటారు. సరళమైన ఫోకల్ మూర్ఛలో రోగికి చేతులలో, కాళ్లల్లో కండరాల లాగుట కనిపిస్తుంది. లేదా వినికిడి, దృశ్యం, వాసన, రుచిలో ఆటంకం కలగవచ్చు. ● ఫోకల్ మూర్ఛలో రోగి స్పృహ కోల్పోతాడు.రోగికి విచిత్రమైన ప్రవర్తన ఉన్నట్లుగా కనిపిస్తాడు. కొన్ని సెకన్లు, నిమిషాల పాటు ప్రతిస్పందన లేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. సూక్ష్మ ముడతలు, లేదా ముఖంలో, చేతులలో, కాళ్లల్లో తరచూ లాగుతుంది. చికిత్స మూర్ఛ వ్యాధులను 75 శాతం మందులతోనే నయం చేయవచ్చు. 25 శాతం మాత్రం ఆపరేషన్ అవసరం అవుతుంది. ఇలాంటి వారికి కూడా ముందుగా మందులు ఇచ్చి చూస్తారు. అయినా మందులకు లొంగకపోతే ఆపరేషన్కు సూచిస్తారు. ఇలాంటి ఆపరేషన్లకు ఎక్కువగా కేరళలోని శ్రీ చిత్ర ఆసుపత్రికి వెళతారు. ఆ తర్వాత హైదరాబాద్లోని నిమ్స్, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం మూర్చ వ్యాధికి 25 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. కాస్త బాగైందిలే అని మందులు మానిస్తే ప్రమాదం సంభవించవచ్చు. మూర్ఛవ్యాధి అంటే... మూర్ఛ అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ రుగ్మతల సమూహం. మెదడులోని ఎలక్ట్రిక్ యాక్టివిటి అసాధారణ పగుళ్ల వల్ల సంభవిస్తుంది. మూర్చలు వాటి కారణం, కేంద్ర స్థానాన్ని బట్టి వర్గీకరించవచ్చు. మూర్చలు తరచుగా కన్వల్షన్స్ లేదా ఎపిలెప్టిక్ ఫిట్స్గా సూచిస్తారు. ఇది సున్నా నుంచి 10 ఏళ్లలోపు, 50 నుంచి 70 ఏళ్లలోపు వారికి కలుగుతుంది. ఒక్కోసారి ఏ వయస్సులో వారికై నా రావచ్చు. పెరుగుతున్న మూర్ఛ వ్యాధి బాధితులు అవగాహనే ఈ జబ్బుకు నివారణ కొద్దికాలం మందులు వాడితే నయం చికిత్సలో ఆధునిక మందులు, పరికరాలు నేడు జాతీయ మూర్ఛ వ్యాధి అవగాహన దినంఉన్నట్లుండి కింద పడిపోయి కాళ్లూ, చేతులు కొట్టుకుంటూ నోట్లో నురగ వస్తుంటే అలాంటి వారిని చూసి మూర్చ వచ్చిందని భావిస్తాము. వెంటనే కొందరు వారి నుదుటన అదిమి పట్టి, చేతుల్లో తాళం చెవి పెట్టి అలాగే ఉంచుతారు. కొద్దిసేపటికే ఆ వ్యక్తి సాధారణ వ్యక్తిలా మారి మళ్లీ ఎలా వచ్చాడో అలా వెళ్లిపోతారు. సమాజంలో నిత్యం ఇలాంటి వ్యక్తులను మనం గమనిస్తూ ఉంటాము. దీనినే వైద్యపరిభాషలో ఎపిలెప్సీ అని, సాధారణ పరిభాషలో మూర్ఛ/వాయి/ఫిట్స్ అని పిలుస్తారు. ఇలాంటి సమస్యతో బాధపడే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. అవగాహన కలిగి ఉండటంతో పాటు సకాలంలో మందులు వాడితే ఈ జబ్బు నుంచి బయటపడొచ్చు. నేడు జాతీయ మూర్చవ్యాధి అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. – కర్నూలు(హాస్పిటల్)కారణాలు వంశపారంపర్యం, మెనింజైటిస్, రక్తంలో షుగర్ శాతం పెరగడం, తగ్గడం, మెదడుకు గాయాలైనప్పుడు, గడ్డలు ఉన్నప్పుడు, రక్తంలోని కొన్ని ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల మూర్చ వస్తుంది. -
30లోపు పొగాకు కొనుగోలు ఒప్పందం
కర్నూలు(సెంట్రల్): పొగాకు పంటకు సంబంధించి రైతులతో కొనుగోలు ఒప్పందాన్ని ఈనెల 30వ తేదీలోపు కుదుర్చుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆయా కంపెనీలను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పొగాకు సంబంధించి జిల్లా స్థాయి టాస్క్ఫోర్సు కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..2025–26 సంవత్సరం రబీలో హెచ్డీ బీఆర్జీ, హెడీ బార్లీ, బ్లాక్ బెర్రీ రకాల పొగాకు సాగును పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. అందువల్ల అన్ని పొగాకు కంపెనీలు/ఎగుమతిదారులు వాటి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఒప్పందం చేసుకోరాదన్నారు. వైట్ బార్లీ రకం పొగాకు సాగుపై నియంత్రణ అమల్లో లేదని, రైతులు, పొగాకు కంపెనీలు కొనుగోలు ఒప్పందాన్ని కచ్చితంగా చేసుకోవాలని సూచించారు. పొగాకుకు సంబంధించి టాస్కుఫోర్సు కమిటీలు డివిజన్, మండల స్థాయిల్లో కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆయా కమిటీల్లో ఒక్క రైతు ఉండే విధంగా చూడాలన్నారు. ఫలితంగా రైతుల తరఫున సమస్యలను కమిటీ దృష్టికి తెస్తే పరిష్కారానికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్పీరా, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ, డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
మినీ బస్సుకు రూ.86 వేల జరిమానా
కృష్ణగిరి: అమకతాడు టోల్ప్లాజా వద్ద శనివారం ఉదయం 10 గంటల సమయంలో డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) క్రాంతికుమార్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఒక మినీ బస్సును ఆపే ప్రయత్నం చేయగా బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. నిర్ఘాంతపోయిన అధికారి తేరుకుని మినీ బస్సును తన వాహనంలో వెంబడించి పట్టుకున్నారు. శ్రీసాయి విష్ణు ట్రావెల్స్కు చెందిన మినీ బస్సు హైదరాబాద్ నుంచి యాగంటికి వెళ్తున్నట్లు తెలుసుకున్నారు. తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బస్సుకు ఫిట్నెస్ పత్రాలు లేకపోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్యాక్స్ చెల్లించకపోవడం, చివరకు బస్సు డ్రైవర్కు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేనట్లు గుర్తించి బస్సును జప్తు చేశారు. రూ.86వేల జరిమానా విధించి, బస్సును ఆర్టీసీ డిపోకు తరలించినట్లు ఎంవీఐ తెలిపారు. -
జనానికి జ్వరమొచ్చినా.. ప్రమాదం జరిగినా వెంటనే ఆసుపత్రికి పెరిగెడతారు. పెంపుడు జంతువులకు సైతం పశు వైద్యశాలలు అందుబాటులో ఉన్నాయి. మరి అడవిలో స్వేచ్ఛగా సంచరించే వన్య ప్రాణులకు అనుకోని ప్రమాదం జరిగితే... అనారోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటి? అరుదైన జంతు
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్– శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో ముఖ్య సంరక్షిత జంతువు పెద్ద పులి. దానికి అనారోగ్య సమస్యలు తలెత్తితే కనీసం పరీక్షించేందుకు మత్తు ఇవ్వాలన్నా హైదరాబాద్, తిరుపతి జంతు ప్రదర్శనశాలల నుంచి వైద్యులు రావాల్సి ఉండేది. ఇదంతా నాలుగేళ్ల క్రితం వరకే. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటీలో 2021లో వైల్డ్ లైఫ్ డిస్పెన్సరీని ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. డిస్పెన్సరీ వైద్యులు, సిబ్బంది అరుదైన వన్యప్రాణాలను కాపాడుతూ వస్తున్నారు. ఇందులో ప్రత్యేక శిక్షణ పొందిన ఇద్దరు వైల్డ్ లైఫ్ నాలెడ్జ్ ఉన్న వైద్యులను నియమించారు. వారికి ఒక వెటర్నరీ సహాయకుడిని, ఒక న్యాచురాలజిస్ట్ (వన్యప్రాణి ప్రవర్తనను అంచనా వేసేందుకు), మరో ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే అన్ని సౌకర్యాలు కలిగిన ఒక అనిమల్ ట్రాన్స్పోర్ట్ వాహనం కూడా ప్రతి అటవీ డివిజన్లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా తయారు చేసిన అనిమల్ రెస్క్యూ వ్యాన్ కూడా ఉంది. ఓ వైపు అనుభవం ఉన్న వైద్యులు, మరో వైపు సాంకేతిక పరిజ్ఞానంతో అరుదైన వన్యప్రాణులకు రక్షణగా నిలుస్తున్నారు. సహజంగా అడవిలో ఏదో కారణంగా గాయపడిన వన్యప్రాణిని చేరుకోవడానికి ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. నల్లమల అడవుల్లో విస్తారంగా ఏర్పాటు చేసిన ఇన్ఫ్రారెడ్ కెమెరాలలో వన్యప్రాణుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఏదైన జంతువు గాయ పడిన విషయం సాధారణంగా కెమోరాల ద్వారానే తెలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ జంతువు సంచరించే ప్రాంతాన్ని గుర్తించి, దానిని పట్టుకుని వైద్యం అందించేందుకు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు. వైల్డ్ లైఫ్ డిస్పెన్సరీ వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ అండ్ రెస్క్యూ పార్టీ విధులు ఇలా.. ● వన్యప్రాణులను రక్షించి తిరిగి అడవిలోకి వదలడం ● ప్రమాదవశాత్తూ మరణించిన వన్యప్రాణుల పోస్ట్మార్టం, దహనం ● పులి దాడిలో మరణించిన పెంపుడు జంతువుల పోస్ట్ మార్టం (లైవ్స్టాక్ డిప్రిడేషన్) ● అడవుల్లో అంటువ్వాధుల నిరోధం, పర్వవేక్షణ ● అటవీ సమీప గ్రామాల్లో పెంపుడు జంతువుల వాక్సినేషన్పై పర్యవేక్షణ ● వేటగాళ్ల దగ్గర లభించే మాంసాన్ని పరిశీలించి వన్యప్రాణి మాంసంగా నిర్ధారించడం ● అటవీశాఖ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ మానిటరింగ్ ● ట్రైనీ ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్లకు శిక్షణా కార్యక్రమాలు డిస్పెన్సరీ వైద్యుల విజయాలు.. ● నల్లమలలో అడవి పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ సోకినట్లు గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం. ● రాష్ట్రం నలుమూలల చిరుతలు, ఎలుగుబంట్లు గ్రామాల సమీపంలోకి వచ్చినపుడు వాటిని పట్టి తిరిగి అడవిలోకి వదలడం. ● అడవి దున్న (గౌర్)ను తిరిగి నల్లమలకు తెప్పించే ప్రాజెక్ట్లో సాంకేతిక సహాయకులుగా ఉండటం. ● డిస్పెన్సరీ వైద్యులు రక్షించిన వన్య ప్రాణుల్లో చిరుత, పెద్దపులులు, ఎలుగు బంటి వంటి జంతువులే కాకుండా పాంగోళిన్ (అలుగు), అడవిపంది, పునుగు పిల్లి, మొసలితో పాటు రకాల పక్షులు ఉన్నాయి. ● నల్లమలలో నాలుగు పెద్దపులి కూనలు తల్లికి దూరమై ఆత్మకూరు అటవీ డివిజన్లోని గుమ్మడాపురం గ్రామ శివార్లకు చేరుకోగా బైర్లూటీ వైల్డ్లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు వాటిని క్షేమంగా తిరుపతి జంతు ప్రదర్శన శాలకు తరలించారు. కాని అప్పటికే అవి మానవ స్పర్శకు అలవాటు కావడంతో వాటి వన్యజీవన విధానానికి దూరమయ్యాయి. అవి ఇప్పుడు తిరుపతి జూలోనే ఉన్నాయి. అడవిలో ఎవరి పర్యవేక్షణలో లేని వన్యప్రాణులకు వైద్యం చేయడం అత్యున్నత సేవగా భావిస్తాం. ఎన్నో రకాల వన్యప్రాణులకు చికిత్స చేసి అడవుల్లోకి తిరిగి పంపాం. నెమలి పిల్లలు, గద్ద(కై ట్) వంటి వాటికి ఇక్కడ చికిత్స అందించాం. అవి కోలుకుంటున్నాయి. పెద్దపులి లాంటి ముఖ్య రక్షిత వన్యజంతువు సంరక్షణ మాకు ఎంతో కీలకం. వన్యప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – డాక్టర్ జుబేర్, వైల్డ్లైఫ్ డిస్పెన్సరీ పశువైద్యులు డ్రోన్తో గుర్తించి.. ఉచ్చు తొలగించి..వేటగాడు జింకల కోసం పన్నిన ఉచ్చు పెద్దపులి మెడకు బిగుసుకోవడంతో గాయపడింది. బైర్లూటి రేంజ్లోని ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఆ పులిని చిత్రీకరించడంతో విషయం తెలుసుకున్న బైర్లూటీ వైల్డ్లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు రంగంలోకి దిగారు. గాయపడిన పులి ఆవాస ప్రాంతం సమీపంలో ప్లాష్ కెమెరాలను ఉంచారు. పులి వాటి సమీపంలో వెళుతున్నప్పుడు ఆటో మేటిగ్గా ప్లాష్ వెలిగి పులి రాకపై సమాచారం అందడంతో అక్కడ మాటు వేసి దాని జాడను కనిపెట్టారు. వంద అడుగుల దూరం నుంచి ఓ వైద్యుడు ట్రాంక్విలైజర్ గన్తో మత్తు ఇచ్చాడు. ఆ తర్వాత డ్రోన్తో దానిని అనుసరించారు. అది మత్తులోకి జారుకున్న తర్వాత బోనులోకి చేర్చి ప్రత్యేక వాహనంలో బైర్లూటీ వైల్డ్లైఫ్ డిస్పెన్సరీకి తరలించారు. పులి మెడకు వున్న ఉచ్చును తొలగించారు. ఆహార నాళానికి గాయం తీవ్రంగా ఉండడంతో వైద్యం అందించి తిరుపతిలోని జంతుప్రదర్శన శాలకు తరలించారు. అక్కడ వెటర్నరీ సర్జన్ల చేత ఆపరేషన్ చేసి గాయానికి కుట్లు వేశారు. వారం రోజులు పరిశీలనలో ఉంచారు. దురదృష్టవశాత్తు ఆ పులి కోలుకోలేక మరణించింది. క్షేమంగా 60 జింకల తరలింపు.. వన్యప్రాణులను ఒకచోట నుంచి మరో చోటికి తరలించడం అంటే అది ఒక పెద్ద టాస్క్. ఇలాంటి తరలింపుల్లో గమ్యం చేరేది 50 శాతం మాత్రమే. అయితే దేశంలోనే మొట్ట మొదటి సారి నూరుశాతం సక్సస్ రేట్తో పుట్టపర్తిలోని 60కి పైగా కృష్ణజింకలు, పొడదుప్పులను బైర్లూటీ డిస్పెన్సరీ వైద్యుల పర్యవేక్షణలో నల్లకాల్వ సెక్షన్కు తరలించారు. జింకలు తరలించే సమయంలో అవి తీవ్రమైన భయాందోళనకు గురవుతాయి. అకారణంగా వాటి శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగి అవి షాక్కు గురై రవాణాలో ఎక్కువ శాతం మరణిస్తాయి. అయితే బైర్లూటీ వైల్డ్లైఫ్ డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ జుబేర్, డాక్టర్ అరోన్ వెస్లీల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రవాణా వాహనంలో చల్లటి నీటిని వెదజల్లే స్ప్రింక్లర్లు ఉంచడం, కుదుపుల్లో వాహనం అంచులకు తగిలి గాయపడకుండా కుషన్ ఏర్పాటు చేయడం, నల్లమలలో ఒక ఎన్క్లోజర్లో 10 రోజులు ఉంచి, ఈ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత వాటిని అడవిలో వదిలారు. నల్లమలలో వన్యప్రాణులకో ఆసుపత్రి ఎన్ఎస్టీఆర్లో విస్తృత సేవలందిస్తున్న ౖబైర్లూటీ వెల్డ్ లైఫ్ డిస్పెన్సరీ గాయపడిన వన్యప్రాణులకు సత్వర చికిత్స -
ఫాస్టాగ్ లేకపోయినా స్మార్ట్ టోల్ సిస్టమ్
కర్నూలు: ఫాస్టాగ్ లేకపోతే ఇకపై టోల్ ప్లాజాల్లో డబుల్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్ లేకుండా ప్రయాణించే వాహనదారులు ఇప్పటివరకు టోల్ప్లాజాలో క్యాష్ (నగదు) చెల్లిస్తే డబుల్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఉదాహరణకు రూ.100 టోల్ ఉన్న చోట ఫాస్టాగ్ ఉంటే రూ.100, లేకపోతే నగదు రూ.200 వసూలు చేసేవారు. కానీ కొత్త నిబంధనల ప్రకారం యూపీఐ ద్వారా చెల్లిస్తే కేవలం 25 శాతం అదనంగా మాత్రమే అంటే రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నిబంధన ఈనెల 16వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం.. యూపీఐ చెల్లింపుల ద్వారా టోల్ ఫీజు చెల్లించడం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గి రాకపోకలు సాఫీగా సాగుతాయి. నగదు లావాదేవీల్లో ఉండే అవినీతి, ఆలస్యం కూడా తగ్గుతుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఈ మేరకు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్కు ఆమోద పత్రం జారీ చేసింది. ఇకపై కర్నూలు–కడప జాతీయ రహదారి (ఎన్హెచ్40)లోని టోల్ ప్లాజాల్లో స్టాటిక్ క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపు విధానం అమలు చేయనున్నారు. దీనివల్ల వాహనదారులకు ఫాస్టాగ్ లేకపోయినా సులభంగా క్యూఆర్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. కర్నూలు–కడప జాతీయ రహదారిపై క్యూఆర్ యూపీఐ టోల్ చెల్లింపు అమలు ప్రారంభం కావడం వేలాది వాహనదారులకు పెద్ద ఉపశమనం. వాహనదారులు టోల్ బూత్ వద్ద ఆగి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెంటనే యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. నగదు చెల్లింపులతో పోలిస్తే ఇది తక్కువ ఖర్చు. ట్రాఫిక్ తగ్గింపుతో పాటు పారదర్శకత కూడా ఉంటుంది. డిజిటల్ లావాదేవీలతో టోల్ప్లాజాల్లో లైన్లు తగ్గి ట్రాఫిక్ కుదింపు, సమయం ఆదా అవుతుంది. – వి.మదనమోహన్, ప్రాజెక్ట్ హెడ్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే -
ఎమ్మెల్యే ఇంటి వద్ద ఇరువర్గాల ఘర్షణ
ఆదోని అర్బన్: ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఇంటి వద్ద శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు ఓ మైనర్ బాలికను వేధింపులకు గురి చేశాడని, ఆ బాలిక తల్లిదండ్రులు శనివారం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అక్కడే ఉన్న బీజేపీ నాయకుడు వారిని చూసి.. మాటామాటా పెరిగి.. పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు త్రీ టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లినట్లు తెలిసింది.ముగ్గురు వేటగాళ్లు అరెస్ట్ బండి ఆత్మకూరు: వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు వేటగాళ్లను శనివారం అరెస్ట్ చేసినట్లు బండి ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాసిర్ ఝా తెలిపారు. మండలంలోని ఈర్నపాడు గ్రామానికి చెందిన కల్లూరి వెంకట రమణ, కల్లూరి వెంకటేశ్వర్లు, కలడి ఈశ్వరయ్య సెప్టెంబర్ నెలలో గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ వద్ద అడవి పందిని వేటాడుతుండగా అటవీ శాఖ సిబ్బంది వారిని వెంటబడించారు. అప్ప టి నుంచి పరారీలో ఉన్న ముగ్గురిని శనివారం గ్రామ ంలో ఉన్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేసినట్లు అటవీ అధికారి తెలిపారు. సమావేశంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీ సర్లు జి. రామకృష్ణ, వై. నాగేంద్రయ్య, బీట్ ఆఫీసర్ పరమేశ్వరి పాల్గొన్నారు. -
విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల: పట్టణంలోని కేశవరెడ్డి పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి శనివారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ముల్లాన్పేటకు చెందిన దినేష్, ప్రవళ్లికల కుమారుడు ప్రజ్వల్(15) శుక్రవారం రాత్రి ఇంట్లో దిమ్మెకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడం, చదువులో రాణించకపోవడం, త్వరలోనే పదవ తరగతి పరీక్షలు వస్తుండటంతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.గుండె పోటుతో ఉపాధ్యాయుడి మృతి పాణ్యం/కొలిమిగుండ్ల: ఎంతో కష్టపడి ఆశల ఉద్యోగం సాధించి విధుల్లో చేరిన నెల రోజుల్లోనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండె పోటుతో మృతి చెందారు. అవుకు పట్టణానికి చెందిన విజయ్కుమార్ (37) ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికయ్యారు. ఉపాధ్యాయ శిక్షణ అనంతరం నిర్వహించిన కౌన్సెలింగ్లో పాణ్యం మండలం నెరవాడ సమీపంలోని గిరిజన బాలుర పాఠశాలకు నియమితులయ్యారు. సోషల్ స్కూల్ అసిస్టెంట్గా అక్టోబర్ 13న విధుల్లో చేరాడు. అంతకు ముందు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తుండేవారు. ఎట్టకేలకు డీఎస్సీలో ప్రతిభ చాటుకొని కొలువు సాధించడంతో జీవితంలో స్థిరపడేందుకు మార్గం సుగమమైంది. ఈలోగా విధి వక్రీకరించడంతో అర్ధాంతంగా మృతి చెందారు. శుక్రవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాదకర సంఘటనతో కుటుంబ సభ్యులు రోదనలు స్థానికులను కంట తడిపెట్టించాయి. ఎంఈఓ శ్రీధర్రావుతో పాటు నెరవాడ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణానాయక్, సిబ్బంది అవుకు చేరుకొని విజయ్కుమార్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్య కేసుగా నమోదు వెల్దుర్తి: గుంటుపల్లె గ్రామానికి చెందిన గొల్ల సుధాకర్ అనుమానాస్పద మృతిని ఆత్మహత్యగా నమోదు చేసినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. తన భర్త అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య శ్రీదేవి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. రెండెకరాల పొలం సాగుకు, కుటుంబ ఖర్చులకు దాదాపు బ్యాంక్లో రూ. 3 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ. 6 లక్షలు అప్పులు కావడంతో తీర్చే మార్గం లేక మనస్తాపంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. యువకుడి బలవన్మరణం కోవెలకుంట్ల: పట్టణంలోని జమ్మలమడుగు చౌర స్తా సమీపంలో నివాసం ఉంటున్న ఓ యువకుడు శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమచారం మేరకు.. శ్రీరాం నగర్ కాలనీకి చెందిన సుజాత కుమారు డు గణేష్(22) పట్టణంలోని ఓ మార్ట్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. యువకుడి తల్లి ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం తల్లి ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూసేసరికి ఉరికి వేలాడుతూ కన్పించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కిందికి దించి చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా పదేళ్ల క్రితం యువకుడి తండ్రి తిమ్మరాజు అనారోగ్యంతో మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి, బంధువుల రోదన లు మిన్నంటాయి. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమా ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆర్బీకేల్లో కనిపించని ఈ–క్రాప్ బుకింగ్ వివరాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ–క్రాప్ బుకింగ్ వివరాలను సోషల్ ఆడిట్కు పెట్టాలనే వ్యవసాయ శాఖ ఆదేశాలను కిందిస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. పంటల నమోదు వివరాలను ప్రింట్ తీసి ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు అన్ని రైతుభరోసా కేంద్రాల్లో రైతుల పరిశీలనకు ప్రదర్శించాల్సి ఉంది. వివరాలను రైతులు పరిశీలించి అభ్యంతరాలు ఉంటే అక్కడికక్కడే రాతపూర్వకంగా చెప్పవచ్చు. పంటల నమోదు వివరాలను ప్రింట్ తీసి రైతుల పరిశీలనకు పెట్టేందుకు ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సగానికిపైగా ఆర్బీకే ఇన్చార్జీలు సోషల్ ఆడిట్ను పట్టించుకోనట్లు తెలుస్తోంది. అక్కడక్కడ ఆర్బీకే ఇన్చార్జీలు ఐదారుగురు రైతులను పిలిపించి ఫొటోలు తీసుకొని మమ అనిపించినట్లు సమాచారం. డ్రంకెన్ డ్రైవ్లో మైనర్లు పట్టుబడితే వాహనం జప్తు కర్నూలు: డ్రంకెన్ డ్రైవ్లో మైనర్లు పట్టుబడితే వాహనాలను జప్తు చేసి వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని యజమానులు, తల్లిదండ్రులకు సూచించారు. ఏదైనా జరగరాని ఘటన జరిగితే కుటుంబం జీవితాంతం బాధ పడాల్సి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదం ద్వారా పిల్లలను దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు. ట్రాఫిక్ నిబంధనల గురించి జిల్లాలో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. రహదారి ప్రమాదాలను అరికట్టి ప్రజలంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలనే సంకల్పంతో పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ రెండోసారి పట్టుబడితే రూ.5 వేల జరిమానా కూడా విధిస్తామని పేర్కొన్నారు. -
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధికర్నూలు (సెంట్రల్): జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి ఆదేశించారు. కోర్టు సముదాయంలోని న్యాయ సదన్లో శనివారం జిల్లాస్థాయి న్యాయాధికారుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని కోర్టుల జడ్జీలు, సీనియర్, జూనియర్ సివిల్ కోర్టుల జడ్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల నిర్వహణను పక్కాగా చేపట్టాలని సూచించారు. ఈపీ కేసులను ఆరు నెలల్లోపు పరిష్కరించేందుకు చేయాల్సిన సవరణలపై పలు సూచనలు ఇచ్చారు. కోర్టు భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేసుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్జీలు పి.కమలాదేవి, పీజే సుధ, డి.అమ్మన రాజ, పి.వాసు, లక్ష్మీరాజ్యం, శ్రీవిద్య, ఎం.శోభారాణి, ఇ.రాజేంద్రబాబు, ఎంవీ హరినాథ్ పాల్గొన్నారు. -
సివిల్స్కు ఉచిత శిక్షణ
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన వారై ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు రెండు ఫోటోలు, విద్య, కుల, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్ కార్డు తదితర జిరాక్స్ కాపీలను జతపరిచి ఏపీ బీసీ స్టడీ సర్కిల్, కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా, కల్లూరు చిరునామాలో స్వయంగా వచ్చి దరఖాస్తులను ఈ నెల 25లోగా అందించాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు బీసీ భవన్, గొల్లపూడి, విజయవాడలో ఉచిత శిక్షణను అందించేందుకు ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటైందన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. వివరాలకు 08518– 236076 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నందవరం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ అందిస్తామని, ప్రత్యేక క్లాసులు నిర్వహించి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు డీఈఓ శామ్యూల్ పాల్ సూచించారు. నందవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను శనివారం పరిశీలించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించా రు. పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.63 కోట్లు మంజూరు చేసిందని, నిధులు విడుదల కావాల్సి ఉందన్నారు. పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల కొరత ఉందని, సర్దుబాటు చేయాలని జెడ్పీ పాఠశాల హెచ్ఎం రామకృష్ణం రాజు, ఉపాధ్యాయులు డీఈఓకి వినతి పత్రం అందజేశారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రీకౌంటింగ్కు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు సిటీ: ఈ ఏడాది ఆగస్టులో జరిగిన 2024–25 రెగ్యులర్ బ్యాచ్ డీఎడ్ 2వ సెమిస్టర్లో ఫెయిల్ అయిన వారు, అలాగే ఉత్తీర్ణత కాని 2022–24, 2023–25 బ్యాచ్కి చెంది వారు ఈ నెల 20వ తేదీలోపు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున సీఎఫ్ఎంఎస్ సిస్టం చలానా ద్వారా చెల్లించాలన్నారు. మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు కర్నూలు(అగ్రికల్చర్): మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరింత చొరవ తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వసంతలక్ష్మి తెలిపారు. బేతంచెర్ల ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్ సహాయ సంచాలకులు(ఏడీ)గా పనిచేస్తున్న ఈమెకు ప్రభుత్వం డిప్యూటీ డైరెక్టర్(డీడీ)గా పదోన్నతి కల్పించింది. పదోన్నతిపై కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్గా నియమించిన నేపథ్యంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పోస్టు దాదాపు మూడు నెలలుగా ఖాళీగా ఉంది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఈమె వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా, సహాయ సంచాలకులుగా సుదీర్ఘకాలం జిల్లాలోనే పనిచేశారు. డీడీ కార్యాలయం సహాయ సంచాలకులు భవానిశంకర్రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
పరిశుభ్రమైన సమాజాన్ని నెలకొల్పుదాం
ఓర్వకల్లు: పరిశుభ్రమైన సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. శనివారం మండలంలోని నన్నూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్తో పాటు సీఈఓ నాసర రెడ్డి, డీపీఓ భాస్కర్, ఆర్డీఓ సందీప్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలి, నీటి వనరులను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్నా వాటిని కట్టెలు, కోళ్లు ఉంచడానికి ఉపయోగిస్తుండటం శోచనీయమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్డిని విధిగా నిర్మించుకోవడంతో పాటు వినియోగించుకోవాలన్నారు. ఇంటి బయట చెత్త పడేయకుండా ప్రతిరోజూ డోర్ టు డోర్ కలెక్షన్ కోసం వచ్చే సిబ్బందికి అందివ్వాలన్నారు. వలసలకు వెళ్లే సమయంలో పిల్లలను వారితో పాటు తీసుకెళ్లకుండా సీజనల్ హాస్టల్లో ఉంచితే వారి విద్యకు అంతరాయం కలుగకుండా సహకరించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. విద్యార్థులతో కలసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగ అనసూయ, తహసీల్దార్ విద్యాసాగర్, డీఎల్డీఓ రమణారెడ్డి, సర్పంచు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతు సేవా కేంద్రాల్లో వైద్య సేవలు బంద్
2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల పశువుల ఆసుపత్రులు కేవలం 338 మాత్రమే ఉన్నాయి. మూగజీవాలకు సరైన వైద్య సేవలు అందడం లేదనే విషయాన్ని గుర్తించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలలో కూడా వైద్య సేవలు అందించే ఏర్పాటు చేసింది. ఆ మేరకు రైతుభరోసా కేంద్రాలకు ప్రత్యేకంగా మందులు సరఫరా అయ్యాయి. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పశువైద్య కేంద్రాల సంఖ్య 721కి చేరింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుభరోసా కేంద్రాల్లో వైద్య సేవలు స్తంభించాయి. వీటికి మందుల సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఆర్బీకేలకు ప్రత్యేకంగా మందులు ఇవ్వమని.. ఏరియా హాస్పిటల్స్, వెటర్నరీ డెస్పెన్సరీలు, గ్రామీణ పశువైద్యశాలలకు ఇస్తున్న మందుల నుంచే తీసుకోవాలని ఉన్నతాధికారులు ఉచిత సలహా ఇస్తుండటం గమనార్హం. వీటిల్లోనే మందులు లేకపోతే రైతుభరోసా కేంద్రాలకు ఎలా ఇస్తారని పశుసంవర్ధక శాఖ అధికారులు వాపోతున్నారు. -
పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం
కర్నూలు కల్చరల్: పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని తద్వారా ఉన్నత దశకు చేరుకోవడానికి అవకాశం ఉంటుందని వక్తలు అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలో శుక్రవారం ఇన్చార్జ్ కార్యదర్శి వి.పెద్దక్క అధ్యక్షతన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జేసీ నూరుల్ ఖమర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు చంద్రశేఖర కల్కూర, గంగాధర్రెడ్డి, విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, నిఖిల్ ఎడ్యుకేషన్ అకాడమీ అధ్యక్షుడు మద్దిలేటి, నైస్ కప్యూటర్స్ అధినేత రాయపాటి శ్రీనివాస్ ప్రారంభించారు. గాడిచర్ల హరిసర్వోత్తమవు విగ్రహం, అయ్యంకి వెంకట రమణ, ఎస్ఆర్ రంగనాథన్, పాతూరు నాగభూషణం చిత్ర పటాలకు అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు గ్రంఽథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి. అంతకు ముందు గ్రంథాలయాల అవగాహన ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించారు. అసిస్టెంట్ లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, బాషా, తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వెల్దుర్తి: మండల పరిధిలోని గుంటుపల్లె గ్రామానికి చెందిన రైతు గొల్ల సుధాకర్ (40) శుక్రవారం అనుమానాస్పద స్థితి లో మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీ సులు తెలిపిన వివరాలు.. సుధాకర్కు గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది.ఆ మహిళ శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి సుధాకర్ హైవే–44 లద్దగిరి క్రాస్ దాటుకుని గోకులపాడు వెళ్లే రోడ్డు పక్కన పొలాల్లో కొన ఊపిరితో పడి ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సుధాకర్ను 108 వాహనంలో స్థానిక సీహెచ్సీకి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. మృతునికి భార్య లక్ష్మిదేవి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకుని వారంతా ఆసుపత్రికి వెళ్లి బిగ్గరగా రోదించారు. మృతుడి వెంట ఉన్న మహిళ సైతం ఆసుపత్రి వద్ద ఉండి.. తాను వెల్దుర్తికి బ్యాంకు పనిమీద వచ్చానని, సుధాకర్ ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్లినట్లు తెలపడం విశేషం. పో స్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అతని మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. -
కోలుకోలేక రిటైర్డ్ ఉద్యోగి..
కర్నూలు: కర్నూలు శివారు నంద్యాల చెక్పోస్టు సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాయకల్లు సుంకన్న (72) తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈయన కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని మంగళగిరి కాలనీలో నివాసముంటాడు. అగ్నిమాపక శాఖలో లీడ్ ఫైర్మెన్ (ఎల్ఎఫ్)గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. గురువారం మధ్యాహ్నం కర్నూలులోని టెలికాం నగర్ నందు ఉన్న వెంకటేశ్వర ఫర్నీచర్ షాపు వద్దకు వచ్చి కొత్త ఇంటికి తలుపులు, కిటికీలు బిగించుకునేందుకు కార్పెంటర్ కుమ్మరి మహేశ్వరాచారి స్కూటీ వెనుక కూర్చొని తాండ్రపాడుకు వెళ్లారు. చెక్క సామాన్లు కొలతలు తీసుకోవడానికి తిరిగి నంద్యాల చెక్పోస్టు వద్ద ఉన్న సూర్య టింబర్ డిపో వద్దకు స్కూటీపై వస్తుండగా భారత్ పెట్రోల్ బంకు సమీపంలో వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్కూటీ నడుపుతున్న మహేశ్వరాచారికి స్వల్ప గాయాలు కాగా, వెనుక కూర్చున్న సుంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించగా కోలుకోలేక తెల్లవారుజామున మృతిచెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
పాములపాడు:మండలంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మజారా కృష్ణానగర్ గ్రామానికి చెందిన వీరేష్ (17) ఎస్ఆర్బీసీ కాలువలో గల్లంతు కాగా శుక్రవారం మృతదేహం లభ్యమైంది. వీరేష్ పాములపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 13న ఎస్ఆర్ బీసీ కాలువ గట్టుపై ఆరబోసిన మొక్కజొన్న ధా న్యం వద్దకు కాపలాగా వెళ్లాడు. అక్కడ నీటి కోసం ఎస్ఆర్బీసీ కాలువలో దిగి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యా డు. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం మృతదేహం లభించగా ఎస్ఐ సురేష్బాబు పంచనామా నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తండ్రి మొగులేశ్వరప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
సీట్ల కోసం పాట్లు
చంద్రబాబు సర్కారు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. పథకం ప్రారంభించినప్పటి నుంచి బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు ఫీట్లు చేయాల్సిన దుస్థితి నెలకొంది. బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దివ్యాంగులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ స్థితిలో శుక్రవారం మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు బస్సుల్లో సీట్ల కోసం పరుగులు తీస్తూ కనిపించారు. కొందరు ప్రమాదకర స్థితిలో తమ పిల్లలను కిటికీల్లోంచి బస్సులోకి ఎక్కించారు. బస్సులు రద్దీగా మారడంతో ప్రయాణికులను నియంత్రించడం డ్రైవర్, కండక్టర్లకు కష్టతరంగా మారింది. – మహానంది పిల్లలను కిటికీలోంచి బస్సులోకి ఎక్కిస్తున్న దృశ్యం -
నాలుగు గ్రామాల రోడ్డును మూసివేస్తే సహించం
పాములపాడు: జాతీయ రహదారి 340సి భానుముక్కల టర్నింగ్ వద్ద కర్నూలు వైపు నుంచి బస్సులు వచ్చే దారిని పీఎస్కే కంపెనీ వారు మూసి వేసేందుకు ప్రయత్నించగా భానుముక్కల, బానకచర్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. భానుముక్కల క్రాస్ రోడ్డు మీదుగా భానుముక్కల, బానకచర్ల, గుండాలనట్టు, వేంపెంట, కొత్త రామాపురంతో పాటు వెలుగోడు మీదుగా నంద్యాలకు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటిది భానుముక్కల టర్నింగ్ వరకు బస్సులు రాకుండా రోడ్డును బంద్ చేసి కాస్త దూరంలో ఉన్న జాతీయ రహదారి పైనుంచి వెళ్లేలే మళ్లిస్తే సహించబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. నాలుగు గ్రాముల ప్రజలు ఏకమై రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. పీఎస్కే కంపెనీ సీఈఓ ప్రసాద్యాదవ్, మేనేజర్ చంద్రమౌళి నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి వెనుదిరిగారు. నిర్మించిన డివైడర్ను తొలగించారు. భానుముక్కల క్రాస్ వరకు రోడ్డును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పాములపాడు వైస్ ఎంపీపీ బండ్లమూరి వెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
జూపాడుబంగ్లా: మండలంలోని పారుమంచాల గ్రామానికి చెందిన సతీష్ (23) గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్ఐ మల్లికార్జున శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దేవరాజు కుమారు డు సతీష్ తిరుపతిలో బంధువుల వద్ద ఉంటూ పెయింటర్ పనిచేసేవాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సతీష్ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం పనులకు వెళ్లి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు.. తలుపు లోపలవైపు గడియపెట్టి ఉండటంతో ఎంతగా పిలిచినా తెరవలేదు. ఇంటి గవాక్షి ద్వారా లోపలికి వెళ్లి గడియ తీశారు. ఇంట్లోని ఫ్యాన్కు సతీష్ విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. తన కుమారుడు కడుపునొప్పితో బాధపడుతుండేవాడని, నొప్పి తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి దేవరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహానికి నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రాయల్టీ సిబ్బందితో వాగ్వాదం
కొలిమిగుండ్ల: బెలుం సమీపంలో శుక్రవారం రాయల్టీ వసూలు చేసే ప్రైవేట్ సిబ్బంది, మైనింగ్ యజమానులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని నాపరాతి గనుల నుంచి పెద్దగా ఖరీదు చేయని రాళ్లను ట్రాక్టర్లో తీసుకెళుతుండటంతో ప్రైవేట్ సంస్థ సిబ్బంది బెలుం ప్రధాన రహదారిపైకి చేరుకోగానే జీపులో వచ్చి ట్రాక్టర్ను అడ్డుకుని రాయల్టీ చెల్లించాలని పట్టుబట్టారు. కొద్ది సేపటికే యజమానులు, కార్మికులు అక్కడ గుమికూడి సిబ్బందితో వాదోపవాదానికి దిగారు. గనుల్లో వృథాగా ఉన్న వాటిని తీసుకెళుతున్నారని వాటికి రాయల్టీ చెల్లించాలంటే ఎలా అని ప్రశ్నించారు. సిబ్బంది మాత్రం రాయల్టీ చెల్లించాలని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల లోడ్తో ఉన్న ట్రాక్టర్ను యజమానులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. వృధా రాళ్లకు కూడా రాయల్టీ ఇవ్వాలనడం దారుణమని యజమానులు మండిపడ్డారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఆలూరు: మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని సెట్కూర్ సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ సూచించారు. శుక్రవారం స్థానిక జూనియర్ కళాశాలలో మత్తుపదార్థాలు, వ్యసనాలు వాటివల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల దేశంలో ఏటా 1.40 లక్షల మంది మరణిస్తున్నారన్నారు. యవత డ్రగ్స్కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నాయని వివరించారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు ప్రజలు, యువత దూరంగా ఉండాలని సూచించారు. ఎకై ్సజ్ సీఐ లలిత, ప్రిన్సిపాల్ రమాదేవి, సిబ్బంది శశికుమార్, పాండురంగ తదితరులు ఉన్నారు. -
ఎర్రజెండాలన్నీ ఏకం కావాలి
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో ఎర్రజెండాలన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని, కమ్యూనిస్టులు రాజకీయంగా ప్రత్యామ్నాయంగా ఎదగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. శుక్రవారం సీఆర్ భవన్లో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. నేపాల్లో 9 కమ్యూనిస్టు పార్టీలు ఏకమై ఒకే వేదికపైకి వచ్చినట్లు ఇక్కడ కూడా ఎర్రజెండాలన్నీ ఏకం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో వందలాది మావోయిస్టు నేతలు, సభ్యులను హత్య చేస్తోందని, మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి పోరాటాలకు దిగాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ భ్రష్టు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని, చంద్రబాబు పాలనలో 4111 పాఠశాలలను మూసివేశారని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వేలాది టీచింగ్, నాన్ టీచించ్ పోస్టులను భర్తీ చేయడంలేదని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను పేదలకు అందని ద్రాక్షగా మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. రూ.6400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు కాలేజీలు మానుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా నిరుద్యోగులకు భృతి లేదని, మహిళలకు ఇస్తామన్న ఆడబిడ్డ నిధి నెలకు రూ.1500 ఇవ్వడం లేదని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. కేంద్రంతో అంటకాగుతున్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.లెనిన్బాబు, పూర్వపు జిల్లా కార్యదర్శి పి.భీమలింగప్ప పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన పెరగాలి
కర్నూలు(అర్బన్): ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ ఎస్సీ, బీసీ బాలికల వసతిగృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కంటి వైద్యులు డాక్టర్ స్వాతి సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ బాల్యం, విద్యాబ్యాసం, దేశానికి చేసిన సేవలను వివరించారు. అలాగే విద్యా హక్కు చట్టం, బాలల హక్కులు, పేదరికం, నిరక్షరాస్యత, బాల కార్మిక సమస్య, అక్రమ రవాణా తదితర అంశాలపై ఆయన చట్టపరమైన అవగాహన కల్పించారు. అనంతరం దృష్టి లోపం ఉన్న పిల్లలకు ఉచితంగా కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి.విజయ, డీసీపీఓ టి.శారద, సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటి, 3వ పట్టణ సీఐ శేషయ్య, వసతి గృహ సంక్షేమాధికారిణులు సులోచన, రజనీ, శైలజ తదితరులు పాల్గొన్నారు. -
టీనేజ్ ప్రెగ్నెన్సీలు లేకుండా చర్యలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికర్నూల(సెంట్రల్): టీనేజ్ ప్రెగ్నెన్సీలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. ముఖ్యంగా 8, 9, 10వ తరగతి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థినులు ఏమి చేస్తున్నారో చూడాలని డీఈఓలను ఆదేశించారు. అంతేగాక బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి వైద్య, ఆరోగ్య అంశాలపై మెడికల్ ఆఫీసర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులోని లక్ష్మణ్పేట, ఆదోనిలోని హనుమాన్నగర్, ఇందిరాగాంధీ నగర్ యూపీహెచ్సీల్లో హైరిస్కు ప్రెగ్నెన్సీలను గుర్తించడంలో వెనుకబడి ఉన్నట్లు చెప్పారు. సరైన సమయంలో గుర్తించకపోతే వైద్య సేవలు అందక ప్రసూతి, శిశు మరణాలకు దారి తీసే అవకాశం ఉంటుందన్నారు. హైరిస్కు ప్రెగ్నెన్సీలను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణుల వివరాలు రిజిస్టర్ చేయడంలో కోసిగి, పెద్దతుంబళం, నందవరం ప్రాథమిక కేంద్రాల పనితీరు బాగుందని అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్రావు, డీసీహెచ్ఎస్ జఫ్రూల్లా, జీజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
కోసిగి: విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు జెడ్పీ సీఈఓ నాసర రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కోసిగి మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం దుద్ది గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేయగా.. హాజరు పట్టిక ఉద్యోగుల సంతకాలు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పనిచేసే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీఓ ఎస్. మహబూబ్ బాషాను ఆదేశించారు. సాతనూరు గ్రామంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టారు. వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఇక్బాల్ బాషా కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పాణ్యానికి చెందిన ఎస్. ఇక్బాల్ బాషాను నియమించారు. అలాగే కళాకారుల విభాగం ఆలూరు, కర్నూలు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులుగా వడ్ల మల్లికార్జున ఆచారి, కన్నా ప్రదీప్ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. క్యాజువాలిటీలో ఆకస్మిక తనిఖీ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యసేవలు, సిబ్బంది హాజరు, ఎఫ్ఆర్ఎస్, సమయపాలన తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ఆర్ఎంఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తనిఖీల్లో నిర్లక్ష్యం బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్యాజువాలిటిలో సీఎంఓలు, డ్యూటీ డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఆయన వెంట ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, క్యాజువాలిటి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫయాజ్ ఉన్నారు. గోనెగండ్లలో డెంగీ కేసు గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల ఎస్సీ కాలనీలో 34 ఏళ్ల వ్యక్తి డెంగీ బారిన పడ్డాడు. గత కొన్ని రోజులుగా జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు. అయినా తగ్గకపోడంతో కర్నూలు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించగా డెంగీ వ్యాధి సోకినట్లు తెలిసింది. దీంతో జిల్లా మలేరియా సబ్యూనిట్ అధికారి విజయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణుడు గోనెగండ్ల వైద్య సిబ్బంది శుక్రవారం డెంగీ సోకిన వ్యక్తి ఇంటి ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కాలనీవాసులకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. 21 నుంచే సాగునీరు విడుదల చేయాలి గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు కింద రబీలో సాగుచేసుకుంటున్న గోనెగండ్ల, కోడుమూరు, పత్తికొండ ప్రాంతాల ఆయకట్ట భూములకు ఈనెల 21 నుంచే సాగునీరు విడుదల చేయాలని జీడీపీ ఆయకట్టు సాగునీటి సంఘం అధ్యక్షుడు మల్లికార్జున గౌడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం సాగునీటి సంఘం అధ్యక్షుడు, సంఘం సభ్యులతో కలిసి ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది కుడి కాలువ కింద 11 వేల ఎకరాలు, ఎడమ కాలువ కింద 2వేల ఎకరాలు సాగు కావచ్చునని తెలిపారు. పంట కాలం పూర్తయ్యే వరకు సాగునీటిని విడుదల చేయాలని కోరారు. -
రబీలో ఆయకట్టుకు నీరు ఇవ్వలేం
● తుంగభద్ర ప్రాజెక్టు ఐఏసీ నిర్ణయంకర్నూలు సిటీ: రబీలో తుంగభద్ర దిగువ కాలువ కింద ఆయకట్టుకు నీరు ఇవ్వలేమని తుంగభద్ర ప్రాజెక్టు నీటిపారుదల సలహా కమిటీ(ఐఏసీ) నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ఐఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. తుంగభద్ర డ్యాం 19వ క్రస్టు గేటు 2024 ఆగస్టు నెలలో కొట్టుకుపోగా, దాని స్థానంలో స్టాప్లాక్ గేటు ఏర్పాటు చేశారు. సీడబ్యూసీ, నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీల చేసిన సూచనల మేరకు డ్యాం 33 గేట్లు మార్చాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. రైతులకు అవగహన కల్పించి గేట్ల మార్పునకు సహకరించేటట్లు ఒప్పించాలని సూచించారు. ప్రస్తుతం డ్యాంలో ఉన్న నీటిని ఇంకా ఎన్ని రోజులు అందించవచ్చో సమావేశంలో చర్చించారు. అందుబాటులో ఉన్న నీటిని సాగులో ఉన్న ఆయకట్టుకు దామాషా ప్రకారం అందించేందుకు షెడ్యుల్ను ప్రకటించారు. జనవరి 10 వరకు ఖరీఫ్ పంటలకు నీరు తుంగభద్ర జలాలపై రాయలసీమ జిల్లాల్లో ఎల్ఎల్సీ, హెచ్చెల్సీ, ఆలూరు బ్రాంచ్ కెనాల్, కేసీ కాలువల పరిధిలో 6.56 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో రబీ సీజన్లో 3.5 లక్షల ఎకరాల్లో ఆయకట్టు సాగు కావాలి. అయితే డ్యాం గేట్ల మార్పుతో సామర్థ్యాన్ని 80 టీఎంసీలకు తగ్గించారు. ప్రస్తుతం డ్యాంలో 75.96 టీఎంసీలకు నీటి నిల్వలు తగ్గాయి. దీంతో పాటు డ్యాం ఎగువ నుంచి ఇన్ఫ్లో నిలిచిపోయింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను చూస్తుంటే వర్షాలు వచ్చేటట్లు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రబీకి నీరు ఇవ్వబోమని ఖరీఫ్ సీజన్కు ముందే బోర్డు ప్రకటించింది. మొన్నటిదాకా వర్షాలు కురుస్తుండడం డ్యాంలో నీటి నీటి నిల్వలు ఆశజనకంగా ఉండడంతో రబీ ఆయకట్టుకు కూడా నీరు ఇస్తారని ఆయకట్టు రైతులు అశలు పెంచుకున్నారు. డ్యాం గేట్ల మార్పు చేయాల్సి ఉండడం..ఇందుకు డ్యాంలో 1613 అడుగులకు నీటి నిల్వలు చేరితేనే కొత్త గేట్లకు అవకాశం ఉండడంతో రబీకి నీరు ఇవ్వలేమని ఐఏసీ తీర్మానం చేసింది. ఖరీఫ్లో కురిసిన వర్షాలతో కొంత మంది రైతులు దెబ్బతిన్న పంటలను తొలగించి పంటలు సాగు చేశారు. తుంగభద్ర దిగువ, ఎగువ కాలువల పరిధితో పాటు, టీబీ డ్యాల జలాలు అందించే కాల్వలకు నీటిని సాగుకు వచ్చే నెల 1 నుంచి జనవరి 10వ తేదీ వరకు నీటిని అందించాలని తీర్మానం చేశారు. తాగు నీటిని అవసరమైన సమయంలో వచ్చే ఏడాది మే 31వ తేదీ వరకు నీటిని అందించాలని నిర్ణయించారు. -
ప్రతిభను ప్రోత్సహించేలా..!
● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈఈఎంటీ పరీక్ష ● రిజిస్ట్రేషన్కు ఈనెల 14న తుది గడువు ● విజేతలకు నగదు బహుమతులు నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసేందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎడ్యుకేషనల్ ఎపీఫనీ అనే సంస్థ 2025–26 విద్యా సంవత్సరానికి మెరిట్ టెస్టు (ఈఈఎంటీ) నిర్వహించనుంది. ప్రభుత్వ పాఠశాలలోని 7, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనుంది. ఈఈఎంటీ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్ రెండు దశల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 6న ప్రిలిమినరీ పరీక్ష, 7న ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటి వద్ద నుంచి లేదా పాఠశాల నుంచి పరీక్షకు హాజరు కావచ్చు. మెయిన్ పరీక్షకు డిసెంబరు 8 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష డిసెంబరు 27న నిర్వహిస్తారు. జిల్లాకు ఒక పరీక్ష కేంద్రం ఉండగా, అభ్యర్థి ఎంచుకున్న కేంద్రంలో పరీక్ష రాయాలి. పరీక్షలో 50 శాతం మార్కులు పొంది ఆన్లైన్ నిబంధనలు కచ్చితంగా పాటించిన వారికి బహుమతులు అందజేస్తారు. పరీక్షను మొబైల్/ల్యాప్టాప్/ట్యాబ్/ కంప్యూటర్ వీటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ రాసే వారికి నవంబరు 29న మాక్ టెస్ట్, మెయిన్స్ పరీక్షకు డిసెంబరు 20న టెస్ట్ రాసే అవకాశం కల్పిస్తారు. హెచ్టీటీపీఎస్–ఎడ్యుకేషనల్ ఎపిఫనీ.ఓఆర్జీ–ఈఈ ఎంటీ2026/రిజిస్ట్రేషన్, పీహెచ్పీ లింక్ ద్వారా ఈనెల 14వ తేదీ లోపు దరఖాసు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈఈఎంటీ పరీక్ష అని, అధిక శాతం విద్యార్థులు హాజరయ్యేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి ఆదేశించారు. దరఖాస్తుకు ఎటువంటి రుసుం లేదన్నారు. బహుమతులు ఇలా.. ఈ పోటీ పరీక్షల్లో 162 మంది విజేతలకు దాదాపుగా రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతిగా రూ.20వేలు, 7వ తరగతితో రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచిన వారికి అందజేస్తారు. జిల్లా స్థాయిలో 10వ తరగతిలో రూ.8వేలు, రూ.8వేలు, రూ.4వేలు, 7వ తరగతి విద్యార్థులకు రూ.5 వేలు,రూ.4వేలు, రూ.3వేలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులుగా ఇస్తారు. మండల స్థాయిలో 10, 7 తరగతుల్లో ప్రథమ స్థానం పొందిన వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసా పత్రాన్ని మాత్రమే ఇస్తారు. మరింత సమాచారం తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి. -
తేలు కాటుకు విద్యార్థిని మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని దైవందిన్నె గ్రామంలో పొలంలో తేలు కాటుకు గురై కురవ సరస్వతి(13) అనే విద్యార్థిని మృతి చెందింది. గ్రామానికి చెందిన కురవ శేఖర్, కురవ శకుంతలమ్మ కుమార్తె కె. సరస్వతి స్థానిక హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. బుధవారం తల్లిదండ్రులతో పాటు సాయంత్రం పత్తి పొలంలో పనిచేస్తుండగా తేలు కాటుకు గురైంది. ఇంటికి వచ్చాక గ్రామంలో నాటు వైద్యం చేయించటంతో నొప్పి తగ్గి రాత్రి మరలా ఎక్కువ కావటంతో గురువారం ఉదయం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో కోలుకోలేక మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. గుండెపోటుతో జీవితఖైదీ మృతి కోవెలకుంట్ల: భీమునిపాడుకు చెందిన మార్కెట్యార్డు మాజీ చైర్మన్ ఆరికట్ల సుంకిరెడ్డి(73) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకేసులో 2022వ సంవత్సరంలో జీవితఖైదీ పడింది. అప్పటి నుంచి కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ఽధ్రువీకరించారు. ఈ మేరకు మృతదేహాన్ని రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. భార్య కాపురానికి రాలేదని భర్త అదృశ్యం కర్నూలు: భార్య దీణరాణి కాపురానికి రాకుండా ఉందని మనస్తాపానికి గురైన భర్త సుంకన్న అలియాస్ రాజు (39) అదృశ్యమయ్యాడు. ఈయన కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. శిరివెళ్ల మండలం మాదేపురం గ్రామానికి చెందిన దీణరాణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. చిన్న గొడవ కారణంగా భార్య పుట్టింటికి వెళ్లి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి సంసారానికి రాకపోవడంతో పోలీస్స్టేషన్లో పంచాయితీ జరిగింది. అయినా ఆమె కాపురానికి రాకపోవడంతో సుంకన్న మనస్తాపానికి గురై ఈనెల 1వ తేదీన పిల్లలను చూడటానికి భార్య దగ్గరకు వెళ్తున్నట్లు చెప్పి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి సాగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు 95029 81868 లేదా 7989690812 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని తండ్రి సాగర్ కోరారు. ముచ్చట్లలో వ్యక్తి మృతి బేతంచెర్ల: ముచ్చట్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ కోనేరు సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల మేరకు.. ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మనోహర్(45) కొంత కాలంగా నాపరాయి ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అప్పుడప్పుడు ముచ్చట్ల క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్న మనోహర్ ఆలయ కోనేరులో స్నానం చేస్తుండటంతో ఆయాసం వచ్చింది. భయంతో ఒడ్డుకు వచ్చి మెట్లపైనే కుప్పకూలి పోయి మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో భక్తుడు గమనించి ఆలయ పూజారికి తెలపడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బేతంచెర్ల ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య నాగలక్ష్మితోపాటు కుమారులు మణికంఠ, మురళీ ఉన్నారు. ఆస్పరి: చిరుత పులి దాడిలో ఆవు దూడ మృతి చెందడంతో తొగలగల్లు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పంట పొలాలకు వెళ్లలేకపోతున్నారు. గ్రామ సమీపంలోని కొండ పక్కన అహోబిలం అనే రైతు బోరు కింద పంటలను సాగు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజులాగే బుధవారం సాయంత్రం పశువులను ఆరుబయట కట్టేశాడు. రాత్రి సమయంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసింది. గురువారం తెల్లవారుజామున రైతు చూస్తే ఆవు దూడ కన్పించకపోవడంతో వెతకగా కొద్ది దూరంలో ఆవు దూడ కళేబరం కన్పించింది. ఆవు దూడపై చిరుతే దాడి చేసిందని రైతు తెలిపారు. రెండు సంవత్సరాలు నుంచి చిరుత పులి ఇక్కడే కొండల్లో సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించాలని అహోబిలం అనే రైతుకు పరిహారం ఇవ్వాలని తొగలుగల్లు గ్రామస్తులు కోరుతున్నారు. -
ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
షుగర్ రోగుల్లో ఎముకల ఆరోగ్యం తగ్గిపోతోంది. తక్కువ ఎత్తు నుంచి కింద పడినా కొందరి ఎముకలు విరుగుతున్నాయి. కొందరు నిద్ర నుంచి లేచిన వెంటనే కళ్లు తిరిగి కింద పడతారు. షుగర్ రోగుల్లో న్యూరోపతి వచ్చి నడిచేటప్పుడు అదుపు తప్పి కిందపడే అవకాశం ఉంది. మహిళలు పయోగ్లిటజోన్ అనే మందు వాడటం వల్ల ఎముకలు బలహీనమవుతున్నట్లు ఇటీవల పరిశోధనల్లో తేలింది. ఎముకల బలాన్ని తెలుసుకునేందుకు జీజీహెచ్లో డెక్సా స్కాన్ చేసి, ఎముకల సాంధ్రత తక్కువగా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ పి. శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్వోడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
నాలుగు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కోడుమూరు రూరల్: హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను గురువారం కోడుమూరు పోలీసులు పట్టుకున్నారు. ‘బరి తెగించిన ఇసుకాసురులు’ అన్న శీర్షిక ఈనెల 12వతేదీన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు పోలీసులు ఈ మేరకు స్పందించారు. వర్కూరుకు చెందిన రెండు ట్రాక్టర్లు, కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్లు పారిపోగా, మరో ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ యాజమానులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు(అగ్రికల్చర్): ఏపీజీఎల్ఐలో 2024 ఏప్రిల్ నుంచి అమలులోని ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టమ్ విజయవంతంగా నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన కర్నూలులోని ఏపీజీఎల్ఐ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఏపీజీఎల్ఐ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టమ్, నిధి పోర్టల్ అమలు తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉద్యోగంలో చేరిన వారు దరఖాస్తు చేసుకుంటేనే బీమా అమలయ్యేదని, బీమా బాండు పొందడం కూడా కష్టతరమయ్యేదన్నారు. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏపీజీఎల్ఐ తప్పనిసరి చేశారన్నారు. ప్రతి నెలా రూ.800 నుంచి రూ.3వేల వరకు ప్రీమియం ఉంటుందన్నారు. బీమా బాండు కూడా సంబంధిత డీడీఓనే ఆన్లైన్లో జనరేట్ చేస్తారన్నారు. నిధి పోర్టల్ ద్వారా ఏపీజీఎల్ఐ నుంచి లోన్ పొందడం సులువైందన్నారు. కార్యక్రమంలో ఏడీలు రంజిత్కుమార్ నాయుడు, గౌరిప్రసన్న, పర్యవేక్షకులు శివనాగకుమార్, రామకృష్ణారెడ్డి, కళ్యాణి తదితరులు పా ల్గొన్నారు. ఇదిలాఉంటే డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్తో ఏపీన్జీజీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్లాల్ ఆధ్వర్యంలో పలువురు సంఘం నాయకు లు సమావేశమయ్యారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. -
ఎస్సార్బీసీలో విద్యార్థి గల్లంతు
పాములపాడు: మద్దూరు పంచాయతీ కృష్ణానగర్ గ్రామ సమీపంలోని ఎస్సార్బీసీ కాలువలో వీరేష్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన మొగిళీశ్వరప్ప, మల్లిక దంపతుల కుమారుడు వీరేష్ (17) పాములపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంట ర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం తల్లిదండ్రులు పొలంలో మొక్కజొన్న కోత కోపిస్తున్నారు. కాగా అప్పటికే కోత కోసి ఎస్సార్బీసీ కాల్వ గట్టుపై మొక్కజొన్నలు ఆరబోయగా అక్కడికి వీరేష్ వెళ్లాడు. అయితే నీటి కోసం కాల్వలో దిగిన వీరేష్ కాలు జారి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. కాల్వ గట్టుపై జీవాలు మేపుతున్న ఓ యువకుడు గమనించి కేకలు వేశా డు. చుట్టు పక్కల రైతులు అక్కడికి చేరుకునేలోపే యువకుడు నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సురేష్ బాబు పుట్టీల సాయంతో మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కగానొక్క కొడుకు నీటిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కొలనుభారతి పూజార్లపై చర్యలు తీసువాలి
● కాకనూరు శారద పీఠం పీఠాథిపతి కొత్తపల్లి: అమ్మవారి పూజల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొలనుభారతి ఆలయ పూజార్లపై చర్యలు తీసుకోవాలని కాకనూరు శారధ పీఠం పీఠాధిపతి శివయోగేంద్ర సరస్వతి స్వామి అధికారులను కోరారు. గురువారం ఆయన క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఉదయం 8 గంటల లోపు అన్ని పూజలు పూర్తిచేసుకొని భక్తులకు దర్శనమివ్వాల్సిన అమ్మవారికి పురోహితులు 9.20 గంటలైనా పూజలు చేయకపోవడంతో ఆయన మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆల య పురోహితుల ప్రవర్తనలో మార్పురాకపోతే దేవ దాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నా రు. ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానానికి అనుసంధానం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు, ఛారుఘోషిణి నది విస్తరణ, డార్మెంటరీ, ప్రత్యేక క్యూలైన్లు నిర్మాణానికి శ్రీశైల దేవస్థానం కృషి చేయాలని కోరారు. -
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్యకర్నూలు(సెంట్రల్): ఉల్లి, టమాటా, పత్తి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తిని కూడా క్వింటాల్ రూ.12 వేల ప్రకారం సీసీఐ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో ఏర్పాటు చేసిన జిల్లా సమితి సమావేశంలో గురువా రం ఆయన మాట్లాడారు. అధికారంలో లేని సమయంలో మాత్రమే గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ కుడి కాలువల ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడికి గుర్తుకు వస్తాయన్నారు. అధికారంలోకి వస్తే మాత్రం పట్టించుకోరని విమర్శించారు. కులగణన జరిగిన తరువాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అయిన తరువాత తొలిసారి కర్నూలు వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు పూలమాలలు, శాలువాలు వేసి సన్మానించారు. సీపీఐ నాయకులు రామచంద్రయ్య, గిడ్డయ్య, జగన్నాథం, మునెప్ప, లెనిన్బాబు, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యాయామం తప్పనిసరి
మధుమేహం అనేది కేవలం చక్కెర స్థాయిల సమస్య మాత్రమే కాదు. శరీరంలో వాత దోషం అసమతుల్యతతో వస్తుంది. దీని నివారణకు ఆహారంలో మార్పులు, వ్యాయామం, మూలికల వాడకం వంటి సమగ్ర విధానాన్ని సూచిస్తాం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలు, మెంతులు, దాల్చిన చెక్క, పసుపు వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆయుర్వేద చికిత్సలో ఈ వ్యాధిని నియంత్రించేందుకు ఆహార మార్పులు, వ్యాయామం, మూలికల కలయికను సూచిస్తాం. –డాక్టర్ వెంకటనాగరాజ పాల, ఆయుర్వేద వైద్యులు, కర్నూలు -
జాగ్రత్తలు తీసుకోవాలి
కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారిలో 50 శాతం డయాబెటీస్ రోగులే ఉన్నారు. షుగర్ రోగులు వారి మూత్రంలో యూరిన్ ప్రొటీన్ ఎక్కువగా వెళ్తుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. మూత్రంలో నురగ, కాళ్లవాపులు, రాత్రిపూట మూత్రంకు ఎక్కువసార్లు వెళ్లడం దీని లక్షణాలు. షుగర్ వచ్చి ఐదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూరిన్ ప్రొటీన్ క్రియాటినిన్ రేషియో పరీక్ష చేయించుకోవాలి. క్రియాటినిన్ 1.2 దాటితే కిడ్నీ జబ్బు ప్రారంభమైందని గుర్తించాలి. బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. – డాక్టర్ పీఎల్. వెంకట పక్కిరెడ్డి,అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
‘బహుళ’ తప్పిదం
కర్నూలు(అగ్రికల్చర్): సామూహికంగా ఇళ్లు నిర్మించుకోవాలన్నా.. గొర్రెలు, చేపల పెంపకం చేపట్టాలన్నా సహకార వ్యవస్థ దోహద పడుతుంది. మార్క్ఫెడ్, నాఫెడ్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్లు సైతం ఈ వ్యవస్థ కిందనే ఏర్పాటయ్యాయి. అయితే రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత సహకార వ్యవస్థ తిరోగమనం అయ్యింది. ప్రగతికి సహాయ నిరాకరణ జరుగుతోంది. సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు, జిల్లా సహకార కేంద్రబ్యాంకుకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాలకవర్గాలు ఏర్పాటు చేశారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా 18 నెలల కాలంలో చేయలేదు. ఇదీ దుస్థితి.. ఉమ్మడి జిల్లాలోని 99 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఉన్నాయి. ఇందులో 2014–15 నుంచి 2018–19 వరకు 85 సంఘాల వరకు నష్టాల్లో కూరుకపోయాయి. నాటి ఐదేళ్ల కాలంలో సహకార సంఘాల అభివృద్దికి చేసింది సున్నానే. ఆ ఐదేళ్లు సహకార రంగానికి చీకటి రోజులే. అలాంటి పరిస్థితులే మళ్లీ ఉత్పన్నం అవుతున్నాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం నేడు డీలా పడింది. చేనేత సహకార సంఘాలు ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉండగా అత్యధిక సంఘాలు నష్టాల్లో కూరుకపోయాయి. ఇందులో 70 సంఘాలు నష్టాల్లో మునిగితేలుతున్నాయి. వీటిని లాభాల బాట పట్టించేందుకు ఎలాంటి చర్యలు లేవు. వీటికి అనుబంధంగా గత ప్రభుత్వం మల్టీపర్పస్ గోదాములు నిర్మిస్తే చంద్రబాబు సర్కార్ వీటిని సద్వినియోగం చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా 2024–25లో రూ.50 కోట్లు లోనింగ్ జరగలేదు. సంఘాలకు నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయి. నష్టాలే మిగిలాయి! ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉండగా చాలా వరకు నష్టాల్లో కూరుకుపోయాయి. కల్లూరు సహకార సంఘానికి రూ.1,57,98,842, గూడూరు సహకార సంఘానికి రూ.1,52,41,998, పసుపుల సహకార సంఘానికి రూ.70,72,847 నష్టాలు ఉన్నాయి. సహకార సంఘాలకు ఉన్న నష్టాలను అధిగమించేందుకు చంద్రబాబు సర్కార్ నుంచి ప్రోత్సాహం లేకుండాపోయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నేటి నుంచి వారోత్సవాలు... 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఆత్మనిర్బర్ భారత్కు సాధకాల సహకారం అనేది ఈ ఏడాది థీమ్. జాతీయ స్థాయిలో సహకార వ్యవస్ధ పటిష్టతకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం నిరాదరణ చుట్టుముట్టింది. వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక జిల్లా సహకార కేంద్రబ్యాంకులో జరిగే కార్యక్రమంలో సహకార పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. షెడ్యూల్ ప్రకారం సహకార వారోత్సవాలను నిర్వహించేందుకు జిల్లా సహకార శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు తర్వాత ప్రగతి అంటూ ఏదీ లేకుండా పోయింది. దీంతో 72వ సహకార వారోత్సవాల్లో సహకార ప్రగతి చాటి చెప్పడానికి అధికారులకు అవకాశమే లేకుండా పోయింది. వారోత్సవాలను తూతూమంత్రంగా నిర్వహించనున్నట్లు సమాచారం. పోస్టర్ల ఆవిష్కరణ అఖిలభారత సహకార వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సహకార అధికారి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా శుక్రవారం సహకార వారోత్సవాలను కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ప్రారంభించనున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. 2019లో వైఎసార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సహకార సంఘాల దశ తిరిగింది. వీటిని బహుళ సేవా కేంద్రాలుగా మార్పు చేసేందుకు తీసుకున్న చర్యలు తీసుకున్నారు. సహకార సంఘాల్లో 2023లోనే కంప్యూటరీకరణ చేసి మినీ బ్యాంకులుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాయి. ఫలితంగా అనేక సంఘాలు ఆస్తులు పెంచుకున్నాయి. వ్యాపారాలు అభివృద్ధి చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా రూ.400 కోట్ల వరకు లోనింగ్ జరిగేది. సహకార వ్యవస్థను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ 18 నెలల్లో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు నేటి నుంచి సహకార వారోత్సవాలు ప్రజలకు ఏం చెప్పాలో తెలియక అధికారుల తికమక! -
శ్రీశైలంలో నేడు కోటి దీపోత్సవం
శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసోత్సవాల సందర్భంగా నాల్గవ శుక్రవారం శ్రీశైల దేవస్థానం కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కోటి దీపోత్సవం ఏర్పాట్లను గురువారం శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద సాయంత్రం 6 గంటల నుంచి కోటి దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కైలాస పర్వతం సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. ఉత్సవంలో పాల్గొనే భక్తులకు అవసరమైన పూజాద్రవ్యాలన్నింటిని దేవస్థానమే సమకూర్చనుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ వారిచే శ్రీశైలక్షేత్రం–కోటిదీపోత్సవం అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. పరమేశ్వరునికి దివ్యజ్యోతిని సమర్పించడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాల్సిసినదిగా దేవస్థాన అధికారులు కోరుతున్నారు. -
టెండర్ ‘క్లాస్’గా కట్టబెట్టేందుకు..!
శ్రీశైలంటెంపుల్: ‘వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి’.. అన్న చందంగా మారింది దేవస్థాన ఇంజినీర్ల వ్యవహారశైలి. అర్హత లేని కాంట్రాక్టర్కు పనులు దక్కేలా తమ పనితనం చూపారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది నూతనంగా పాతాళగంగలో తెప్పోత్సవం నిర్వహించాలని దేవస్థాన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈనెల 18వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా తెప్పోత్సవానికి సంబంధించి హంస వాహనం తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ సరఫరా, ట్రాన్స్పోర్టు, ఫిక్సింగ్ చేసేందుకు రూ.21.81 లక్షల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్ పిలిచారు. అక్టోబరు 30న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సాధారణంగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 14 రోజుల కాలవ్యవధి ఇస్తారు. కానీ ఈ పనికి మాత్రం కేవలం ఐదు రోజులు మాత్రమే కాలవ్యవధి ఇచ్చారు. కాంట్రాక్టర్లతో తమకు ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకు లేక ఏకంగా తమ వారి కోసం నిబంధనలను సైతం మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా తాము అనుకున్న కాంట్రాక్టర్కే పని దక్కేలా విశ్వప్రయత్నాలు చేస్తూ పప్పులో కాలేశారు. పని విలువ రూ.21.81 లక్షలు ఉన్నప్పుడు నిబంధనల మేరకు క్లాస్–4, అపైన ఉండే కాంట్రాక్టర్లు అర్హులు అవుతారు. కానీ మన ఇంజినీర్లు టెండర్ షెడ్యూల్లో క్లాస్–5, అపైన వారు అర్హులుగా నోటిఫికేషన్ ఇచ్చారు. క్లాస్–5 కాంట్రాక్టర్ రూ.10 లక్షల లోపు పనులు మాత్రమే చేసేందుకు అర్హులు. కానీ ఇక్కడ పని విలువ రూ.21.81 లక్షలు ఉన్నప్పుడు క్లాస్–4, అపై కాంట్రాక్టర్ అర్హులు. కానీ మన ఇంజినీర్లు తమకు కావాల్సిన కాంట్రాక్టర్కు పని దక్కేలా క్లాస్–5 టెండర్లో పొందుపరిచారు. ఈ టెండర్కు ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్ దాఖాలు చేశారు. నేడో, రేపో టెండర్లను ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికై న దేవదాయశాఖ ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘించే దేవస్థాన ఇంజినీర్లపై చర్యలు తీసుకుని, మల్లన్న ఆదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ఈ విషయంపై శ్రీశైల దేవస్థాన ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ నరసింహారెడ్డిని వివరణ కోరగా.. తెప్పోత్సవానికి సంబంధించి హంస వాహనం టెండర్లో క్లాస్–5, ఆపైన ఏదేని సివిల్ రిజిస్ట్రేషన్ కలిగిన కాంట్రాక్టర్లు ఎవరైనా పాల్గొనవచ్చునని తెలిపారు. శ్రీశైల ఇంజినీర్ల ఇష్టారాజ్యం ఓ కాంట్రాక్టర్కు హంస వాహనం టెండర్ వరించేలా నిబంధనలు మార్పు క్లాస్–4 వర్క్ను క్లాస్–5గా మార్పులు చేసిన వైనం -
రోజుకో పుంజు చొప్పున ఏసీబీకి పట్టిస్తా!
● వీఆర్వోలందరూ అవినీతిపరులే.. ● మండల మీట్లో టీడీపీ సర్పంచ్ హల్చల్ ● అవాకై ్కన అధికారులు డోన్: మండల సర్వసభ్య సమావేశంలో టీడీపీ మద్దతుదారుడైన గుమ్మకొండ సర్పంచ్ తీరుతో అధికారులు తలలు పట్టుకున్నారు. సభలో సంబంధం లేని అంశాలపై మాట్లాడమే కాకుండా.. వీఆర్వోలపై నోరు పారేసుకోవడంతో అధికారులు అవాక్కయ్యారు. ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరుగుతుండగా గుమ్మకొండ సర్పంచ్ దశరథరామిరెడ్డి వీఆర్ఓలపై రెచ్చిపోయారు. ‘మండలంలో పనిచేస్తున్న వీఆర్ఓలందరూ అక్షరం ముక్క రాని వారు. అందరూ అవినీతిపరులు. ఇలాంటి వారి పట్ల రైతులకు ఏమి మేలు జరుగుతుంది. నేను అనుకుంటే రోజుకో పుంజు చొప్పున అన్నట్లు ఏసీబీకి అధికారులను పట్టిస్తా’ అంటూ సవాల్ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎలక్షన్ డీటీ నారాయణమ్మ తప్పుబడుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా అవినీతిపరులు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, అందరూ అవినీతిపరులని సంబోధించడం సబబు కాదన్నారు. వీఆర్వోలపై నోరు పారేసుకున్న సర్పంచ్.. ప్యాకెట్ పాల వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రబలుతుందని, విక్రయాలను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే తమకు సంబంధం లేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నా ఆయన ఉపన్యాసం ఆపలేదు. అలాగే వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు అనధికారికంగా పీఆర్ఓలను ఏర్పాటు చేసి గర్భిణులను భయబ్రాంతులకు గురిచేసి సిజేరియన్ల కోసం తమ ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో పాటు డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేస్తా మని ఎంపీపీ హామీ ఇచ్చారు. కాగా సర్యసభ్య సమావేశానికి ప్రజా ప్రతినిధుల స్థానంలో వారి కుటుంబీకులు హాజరైనా అధికారులు పట్టించుకోకపోవడంపై ఎంపీడీఓను కొందరు సభ్యులు ప్రశ్నించారు. -
కౌతాళం ఎంపీడీఓకు డీఎల్డీఓగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని కౌతాళం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్న పి.రాజేంద్రప్రసాద్కు డీఎల్డీఓగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పదోన్నతి పొందిన ఆయనను గుంటూరు డ్వామా ఏపీఓ ( ఎంఅండ్ఈ )గా నియమించారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రద్దు కర్నూలు(సెంట్రల్): జిల్లా న్యాయ సేవాధికార సంస్థలోని మీడియా సెంటర్లో ఖాళీగా ఉన్న స్టెనో, టైపిస్టు కమ్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసినట్లు ఆ సంస్థ జిల్లా కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు. పంటల నమోదుపై నేటి నుంచి సామాజిక తనిఖీలు కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబందించి పంటల నమోదు వివరాలను ఈ నెల 14 నుంచి సోషల్ ఆడిట్కు పెట్టనున్నారు. అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేసేందుకు నేటి నుంచి 17వ తేదీ వరకు జాబితాలను ఆర్ఎస్కేల్లో పెట్టాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. అయితే ప్రింట్ తీసేందుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఆర్బీకే ఇన్చార్జీలకు ఖర్చు తడసి మోపెడుకానుంది. భూమి విస్తీర్ణం, పంటల వివరాలు, విత్తనం రకాలు తదితర వివరాలను పరిశీలించుకొని తేడాలు ఉంటే సరిచేసుకోవాలనేది లక్ష్యం. పంటల నమోదు వివరాలు సరిగ్గా ఉంటే భవిష్యత్లో ఉత్పన్నమయ్యే సమస్యలను అధిగమించవచ్చు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో పంటల నమోదు వివరాలు ప్రింటు తీసి సోషల్ ఆడిట్కు పెడుతారా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది. ఎస్ఏ–1 పరీక్ష వాయిదా కర్నూలు సిటీ: బాలల దినోత్సవం సందర్భంగా నేడు(శుక్రవారం)జరగాల్సిన ఎస్ఏ–1 పరీక్షను వాయిదా వేశారు. వాయిదా వేసిన పరీక్షను 1వ తరగతి నుంచి 5తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 20వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్ష పత్రాలను సురక్షితంగా భద్ర పరచాలని, ఎట్టి పరిస్థితుల్లోను తెరవకూడదని పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 25 లోపు ‘పది’ పరీక్షల ఫీజు చెల్లించాలి కర్నూలు సిటీ: పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు ఈ నెల 25వ తేదీలోపు చెల్లించాలని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువులోపు ఫీజు చెల్లించాలని, రూ.50 రుసుంతో వచ్చే నెల 3వ తేదీ వరకు, రూ.200 రుసుంతో వచ్చే నెల 10వ తేదీ, రూ.500 రుసుంతో డిసెంబరు 15వ తేదీలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ తేదీల్లో సాధారణ సెలవులు ఏవైనా ఉన్నట్లు అయితే ఆ మరుసటి రోజు కూడా చెల్లించవచ్చునని తెలిపారు. పూర్తి వివరాలకు www.bseap.ap.gov.in అనే వెబ్సైట్ను సందర్శించాలన్నారు. అనాథ శిశువుల కోసం ఊయల కర్నూలు(అర్బన్): అనాథ శిశువుల సంరక్షణ కోసం ఊయలను ఏర్పాటు చేశామని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి పీ విజయ తెలిపారు. కర్నూలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఊయలను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా తమ వ్యక్తిగత సమస్యలతో శిశువులను ముళ్లపొదలు, చెత్తకుప్పల్లో పారవేయకుండా సురక్షితమైన ప్రదేశాల్లో వదలాలన్నారు. ఎక్కడపడితే అక్కడ శిశువులను వదిలి వేయడం వల్ల శిశువులు ప్రమాదాలకు గురై పలు సందర్భాల్లో మృతి చెందే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో శిశువుల సంరక్షణ కోసం ఊయలను ఏర్పాటు చేశామన్నారు. బాలల పరిరక్షణ అధికారిణి టీ శారద, రైల్వే సీనియర్ డీఎంఓ జీ విజయకుమార్, ఏఎస్ఐ కే ప్రకాష్, ఎస్ఏఏ మేనేజర్ మోహతాజ్ బేగం, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్టాండ్లో విస్తృత తనిఖీలు
కర్నూలు: ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ బాబు ప్రసాద్ నేతృత్వంలో సీఐలు, ఎస్ఐలు తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి బస్టాండ్ ఆవరణలో నెలల తరబడి పార్కు చేసి ఉన్న బైకులు, కార్లు, పార్సిల్, రవాణా కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్ బృందాలు పోలీసు జాగిలాలతో కలసి ఆర్టీసీ బస్టాండ్లోని అనుమానితులు, ప్రయాణికుల బ్యాగులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పార్సిల్ కార్యాలయంలో లగేజీలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీ చేశారు. అనుమానితుల వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే 112 లేదా 100 నంబర్లకు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. సీఐలు నాగరాజరావు, మన్సూరుదీన్, ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
మల్లన్న సేవలో జగద్గురు పీఠాధిపతి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డా.చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకున్నారు. గురువారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అలాగే భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదపండితులు వేదగోష్టి నిర్వహించగా, దేవస్థాన ఈఓ శేషవస్త్రాలు బహుకరించి సత్కరించారు. పీఠాధిపతి అధికారులకు, అర్చకులకు, వేదపండితులకు అనుగ్రహభాషణం చేశారు. -
ఢిల్లీ పేలుడు..చిన్న పోస్టర్తో.. జైషే కుట్రపై గర్జించిన తెలుగు సింహం!
న్యూఢిల్లీ: భారత్లో భారీ ఉగ్రహింసకు స్కెచ్ వేసిన జైషే మహ్మద్ ఉగ్రకుట్రను ఓ చిన్న పోస్టర్ ద్వారా భగ్నం చేయడం విశేషం. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు వ్యూహరచన చేసిన జైషే మహ్మద్ పోస్టర్లను నెల క్రితమే ఓ పోలీసు అధికారి గుర్తించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఫలితంగా దేశాన్ని పెను విధ్వంసం నుంచి కాపాడగలిగారు. ఈ ఘనత సాధించిన అధికారి మన తెలుగువారే కావడం గర్వకారణం.తెలుగు ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి, జైషే మహ్మద్ కుట్రను ఛేదించి తన శౌర్యాన్ని చాటారు. ఇప్పటికే ఆరు సార్లు రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం అందుకున్న ఆయన, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. ఇది ఆయనకు ఆరో అవార్డు కావడం విశేషం.పోస్టర్తో బండారం బట్టబయలు 2019 వరకు కాశ్మీర్లో ఉగ్రసంస్థలు సైనిక అధికారులను బెదిరిస్తూ పోస్టర్లు వేయడం సాధారణంగా జరిగేది. కానీ ఆర్మీ అప్రమత్తతతో ఆ కార్యకలాపాలు తగ్గాయి. అయితే, గత నెలలో శ్రీనగర్లో రహస్యంగా తరలిస్తున్న జైషే మహ్మద్ పోస్టర్లను ఐపీఎస్ సందీప్ గమనించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీ తెప్పించి, ముగ్గురు యువకులు పోస్టర్లు తరలిస్తున్న దృశ్యాలను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి విచారించగా, షోపియాన్కు చెందిన మత గురువు ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఆధ్వర్యంలో జైషే కుట్ర జరుగుతున్నట్లు వెల్లడైంది.ఉగ్రవాదుల అరెస్టు..పేలుడు పదార్థాల స్వాధీనం విచారణలో జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు స్కెచ్ వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఫరిదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో డాక్టర్లుగా పనిచేస్తున్న ముజమ్మీల్ షకీల్, అదీల్ అహ్మద్, లక్నోకు చెందిన షాహీన్ సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2900 కిలోల పేలుడు పదార్థాలు, అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్, అలాగే రెండు AK-47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాకు చెందిన మరో డాక్టర్ ఉమర్ పరారీలో ఉండగా, అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.సందీప్ చక్రవర్తి ప్రస్థానం కర్నూలులో జన్మించిన సందీప్ చక్రవర్తి, మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించి, మెడిసిన్ పట్టభద్రులయ్యారు. అనంతరం సివిల్స్లో ర్యాంకు సాధించి 2014లో ఐపీఎస్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) గా సేవలందిస్తున్నారు. పూంచ్ ఏఎస్పీగా తన సర్వీసు ప్రారంభించిన ఆయన, హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్ సౌత్ జోన్, బారాముల్లా వంటి కీలక ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించారు.ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలుసందీప్ ఇప్పటివరకు ఆరు రాష్ట్రపతి శౌర్య పతకాలు, నాలుగు జమ్మూ అండ్ కశ్మీర్ గ్యాలంట్రీ మెడల్స్, ఇండియన్ ఆర్మీ చీఫ్ కమెండేషన్ డిస్క్ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ముగ్గురు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆపరేషన్ మహదేవ్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. -
కష్టానికి ఫలితం
మాది అనంతపురం జిల్లా బత్తలపల్లి. అమ్మలేరు, నాన్న ఉపాధ్యాయుడు. ఆర్యూసీఈలో ఈసీఈ బ్రాంచ్తో బీటెక్ పూర్తి చేశాను. బ్రాంచ్లో టాపర్గా నిలిచి కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్మెడల్ అందుకోవడం చాలా గర్వంగా ఉంది. నేను చదువుకున్న కోర్సులో టాపర్గా నిలవడంతో కష్టానికి ఫలితం లభించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా రాణించాలని ఉంది. – యశ్విత, బీటెక్ విద్యార్థి మాది ఎమ్మిగనూరు. తల్లిదండ్రులు క్లాత్ బిజినెస్ చేస్తున్నారు. నేను ఎమ్మెస్సీ కంప్యూటర్స్లో పీజీ పూర్తి చేశాను. కోర్సులో డిపార్ట్ మెంట్లో టాపర్గా నిలిచాను. నాల్గవ స్నాతకోత్సవంలో గవర్నర్గా చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోవడం సంతోషంగా ఉంది. కంప్యూటర్స్ రంగంలో ప్రొఫెషనల్గా స్ధిరపడాలని ఉంది. ఎంచుకున్న కోర్సులో ఇష్టంతో చదివితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. – ప్రభావతి, ఎమ్ఎస్సీ కంప్యూటర్స్● -
స్నేహితుడే చంపేశాడు
బేతంచెర్ల: ఇద్దరి స్నేహితుల మధ్య ఏర్పడిన మనస్పర్థలు చివరకు హత్యకు దారితీశాయి. ఓ వ్యక్తి స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఆర్ఎస్ రంగాపురంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మహబూబ్ బాషా(41) అదే గ్రామానికి చెందిన బోయ మదనభూపాల్ స్నేహితులు. వీరు మూడేళ్ల క్రితం గుజిరిషాపు నిర్వహించే వారు. కాగా మద్యం అక్రమ అమ్మకాల కేసులో మహబూబ్ బాషా జైలుకెళ్లాడు. ఆ సమయంలో తన భార్యకు మదనభూపాల్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని మహబూబ్ బాషా అనుమానిస్తూ వచ్చాడు. అలాగే గుజిరీ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల్లో మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న మదన భూపాల్తో మంగళవారం రాత్రి కూడా మద్యం మత్తులో మహబూబ్ బాషా గొడవ పడగా, స్థానికులు సర్ది చెప్పారు. ఈ క్రమంలో మధనభూపాల్ బుధవారం తెల్లవారుజామున మహబూబ్ బాషా ఇంటికెళ్లి నిద్రిస్తున్న అతన్ని బళ్లెంతో పొడిచి, రోకలి బండతో తలపై మోది చంపేశాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. హతుడి కుమార్తె ఆసియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. వ్యక్తి దారుణ హత్య -
జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారం పెరగాలి
కర్నూలు(సెంట్రల్): డిసెంబర్ 13వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కరించేందు కు చర్యలు తీసుకోవాలని జిల్లాప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షుడు జి.కబర్ధి ఆదేశించారు. బుధవారం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రితో కలసి జిల్లాలోని వివిధ కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులతో జాతీయ లోక్ అదాలత్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీకాదిగన కేసులు, ఎకై ్సజ్, మెటార్ యాక్సిడెంట్, చెక్బౌన్స్, భూసేకరణ, సివిల్ కేసులను జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ ప్రీలోక్ అదాలత్లను పెట్టి త్వరతిగతిన ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. సదస్సులో మొదటి అదనపు జిల్లా జడ్జి కమాదేవి, అరో అదనపు జిల్లా జడ్జి వాసు, ఏడో అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, సీబీఐ కోర్టు జడ్జి శోభారాణి, ఫోక్సోకోర్టు జడ్జి రాజేంద్రబాబు, ఏసీబీ కోర్టు శ్రీవిద్య, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, సీనియర్ సివిల్ జడ్జీలు మల్లేశ్వరి, దివాకర్, జూనియర్ సివిల్ జడ్జీలు సరోజమ్మ, అపర్ణ, అనిల్కుమార్, అనూష పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య ఆళ్లగడ్డ: పట్టణంలోని ఎస్వీ నగర్లో ఓ మహిళ బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన యోహాను కూతురు సీతమ్మ (31)కు చందలూరు గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో వివాహమైంది. ఈ మధ్యకాలంలో సీతమ్మ మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతుండటంతో ఎస్వీనగర్లో ఉన్న తండ్రికి వద్దకు చేరింది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు కిందకు దించి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ శివయ్య (50) మృతి చెందాడు. పట్టణంలోని ఎస్వీ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ శివయ్య మంగళవారం రాత్రి పొద్దుపోయాక పట్టణ శివారులోని టిడ్కో గృహాల్లో ప్రయాణికుడిని దించి తిరిగి వచ్చేక్రమంలో జాతీయ రహదారిపైకి వస్తుండగా వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శివయ్యను ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యవసాయాధికారుల తనిఖీలు కర్నూలు(అగ్రికల్చర్): జీవన ఎరువులు (బయో పర్టిలైజర్స్), సూక్ష్మ పోషకాలు ఉత్పత్తి చేసే కంపెనీల్లో బుధవారం వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిల్లా వ్యవసాయ అధికారి జీవన ఎరువులు, సూక్ష్మ పోషకాలు ఉత్పత్తి చేసే సంస్థల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఇందు లో భాగంగా కర్నూలు క్రిష్ణానగర్లోని పుష్పా ంజలి అగ్రీటెక్, చౌరస్తాలోని ఎస్ఎస్ఎల్వీ టెక్నాలజీస్లో జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్రెడ్డి, డీఏవో కార్యాలయం సాంకేతిక ఏవో రాఘవేంద్ర టీమ్ గా వెళ్లి తనిఖీలు చేపట్టారు. వీటిల్లో తయారవుతున్న ఉత్పత్తులను పరిశీలించారు. అనుమతుల పత్రాలు, రికార్డులు, ల్యాబ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్పాంజలి అగ్రిటెక్లో మూడు శ్యాంపుల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపారు. అన్ని రకాల అనుమతులతో జీవన ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. -
స్నాతకోత్సవ సంబరం
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నాల్గవ కాన్వొకేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం వర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి చాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గవర్నర్తో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి పాల్గొన్నారు. ఎ.ఎం.గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ ఎస్.ఎస్.వి.రామకుమార్కు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను గవర్నర్ ప్రదానం చేశారు. పీజీ, ఇంజినీరింగ్ విద్యలో ప్రతిభ కనబరిచి టాపర్స్గా నిలిచిన 20 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ను అందజేశారు. గవర్నర్ కాన్వొకేషన్ సందేశాన్నిచ్చారు. అనంతరం గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ ఎస్ఎస్వీ రామకుమార్ స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు విద్యుత్ రంగంలో తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా తనను గౌరవించిన రాయలసీమ యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలిపారు. స్టార్టప్స్ రంగంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. దేశ ప్రగతి రథానికి విద్యార్థులు అంతా చోదక శక్తిగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు వర్సిటీ ౖవైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు వర్సిటీ ప్రగతి నివేదికను వివరించారు. వర్సిటీలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కోర్సులు, జరుగుతున్న పరిశోధనలను తెలియజేశారు. విద్యార్థులచేత ప్రతిజ్ఙ చేయించారు. అనంతరం ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ మధుమూర్తి, వీసీ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు, గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ రామకుమార్ 55 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది పరిశోధకులకు పీహెచ్డీ పట్టాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, వర్సిటీ రెక్టార్ ప్రొఫెస్ ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బీవీ జయకుమార్నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు, వివిధ విభాగాల డీన్లు ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి, ప్రొఫెసర్ సుందరానంద్, ప్రొఫెసర్ భరత్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, వర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ సునిత, డాక్టర్ శైలజ, ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ షావలి ఖాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లోకనాథ, తదితరులు పాల్గొన్నారు. అందరూ గర్వపడేలా యువత ఎదగాలి.. చాన్స్లర్ హోదాలో మొదటి సారి వర్సిటీకి రావడం సంతోషంగా ఉందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ, సమాజానికి రుణం తీర్చుకోడం అందరి ప్రాథమిక కర్తవ్యం, బాధ్యత అన్నారు. తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా యువత ఎదగాలన్నారు. వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ పట్టాలు స్వీకరిస్తున్న విద్యార్థులంతా ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. వర్సిటీ నాణ్యమైన బోధన, పరిశోధనల ద్వారా విద్యార్థుల భవితకు బాటలు వేయడం సంతోషకరమన్నారు. డిగ్రీలు సంపాదించుకున్న విద్యార్థులు జ్ఞానంతో సార్థకమైన జీవితాన్ని గడపాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలో విద్యార్థులు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నప్పుడు భవితకు డోకా ఉండదన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి అయ్యే 2047 నాటికి దేశాన్ని ప్రగతి పథంలో నిలపాలన్న దేశ ప్రధాని మోదీ ఆశయాలకు నూతన విద్యా విధానం తోడ్పాటు అందిస్తుందన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడతా..
మాది నందికొట్కూరు. ఆర్యూసీఈలో సీఎస్ఈ బ్రాంచ్తో బీటెక్ పూర్తి చేశాను. బ్యాచ్లో టాపర్గా, కోర్సులో టాపర్గా నిలిచి రెండు గోల్డ్ మెడల్స్ అందుకోవడం గర్వంగా ఉంది. పాఠాలు బోధించిన అధ్యాపకులు, ఫ్రెండ్స్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడాలన్నది నా లక్ష్యం. – ఖాజ మొయినుద్దీన్, బీటెక్ విద్యార్థి మాది అవుకు మండలం చెర్లోపల్లె. నాన్న దాసరి పెద్దరాజు, అమ్మ రాజ్యలక్ష్మి వ్యవసాయం చేస్తూ ముగ్గురు ఆడపిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె అయిన నేను చదువు లో ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. పీహెచ్డీ రీసెర్చ్ చేయడమే నా లక్ష్యం. – శిరీష, ఎమ్మెస్సీ బాటనీ మాది వెల్దుర్తి. నా తల్లిదండ్రులు హసీనా, ఫరీద్బాబా. నేను ఆర్యూలో 2020–22లో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. ఆర్యూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉంది. – షేక్ ఇర్ఫాన్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్ -
పది ఇసుక ట్రాకర్ల పట్టివేత
కౌతాళం: ఎలాంటి వే బిల్లులు, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న పది ట్రాక్టర్లను బుధవారం ఏరిగేరి గ్రామం వద్ద పట్టుకున్నట్లు తహసీల్దారు రజనీకాంత్రెడ్డి తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఉండటంతో మూడు రీచ్లను తాత్కలికంగా బంద్ చేయించామన్నారు. కొంత మంది ఎలాంటి రశీదులు లేకుండా అనుమతులు తీసుకోకుండా కుంబళనూరు వద్ద ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసి ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఇసుక ఉచితంగా ఉన్న కొంతమంది ఇసుక వ్యాపారం చేసుకోవడానికి అక్రమ ఇసుక రవాణాకు తెరలేపారన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లకు మైనింగ్ అధికారుల సూచనల మేరకు జరిమానా విధిస్తామన్నారు. -
‘హద్దు’లు దాటి ఇసుక దందా!
సాక్షి ప్రతినిధులు మహబూబ్నగర్/ఖమ్మం/సత్తుపల్లి: ధనార్జనే ధ్యేయంగా ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ వాహనాల్లో ఇసుకను రవాణా చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తూ భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీ సరిహద్దులు దాటి మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల మీదుగా లారీలు తెలంగాణలో ప్రవేశిస్తున్నాయి. ఏపీలోని తాడిపత్రిలో ఉన్న ఓ అధికారిక రీచ్ నుంచి కర్నూలు మీదుగా వాహనాలు వస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజా గుండా ఉమ్మడి మహబూబ్నగర్లోని గద్వాల, రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, ఆదిభట్ల తదితర ప్రాంతాలతోపాటు హైదరాబాద్లోని పలు చోట్లకు ఇసుకను తరలిస్తున్నారు. నిత్యం 70 నుంచి 90 వరకు బెంజ్ వాహనాల్లో ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో ఏపీ కూటమి ప్రభుత్వంలోని కీలక పార్టీకి చెందిన వ్యక్తి ఈ దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అండతో బినామీలు రెచ్చిపోతున్నారు. గోదావరి ఇసుకను దర్జాగా ఏపీ సరిహద్దు దాటిస్తున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే బినామీలకు చెందిన ఇసుక టిప్పర్లు ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పట్టుబడడం గమనార్హం. కాగా ఏపీకి చెందిన నేతలు ఈ విధంగా ఇష్టారాజ్యంగా ఇసుక దందా చేస్తున్నా..పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడిపత్రి నుంచి యధేచ్చగా.. అనంతపురం జిల్లా తాడిపత్రి రీచ్ వద్ద ఒక లారీ లేదా బెంజ్ లోడ్కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ధర తక్కువగా ఉండడంతో కన్నేసిన ఇసుక మాఫియా అక్కడి నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి టన్ను రూ.1,800 నుంచి రూ.2,400 వరకు విక్రయిస్తూ సొమ్ము చోసుకుంటున్నట్లు సమాచారం. అర్ధరాత్రి 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఇసుక లోడ్ వాహనాలు సరిహద్దులోని పుల్లూరు టోల్ప్లాజా దాటేలా అక్రమార్కులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో గస్తీ నామమాత్రంగా ఉండడంతో ఇసుక వాహనాలు సులువుగా సరిహద్దులు దాటుతున్నాయి. ఎక్కువగా 16 టైర్ల లారీల్లోనే ఇసుకను తరలిస్తున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం 16 టైర్ల వాహనంలో 47 టన్నులు, 14 టైర్ల వాహనంలో 42 టన్నులు, 12 టైర్ల వాహనంలో 36 టన్నులు, 10 టైర్ల వాహనంలో 28 టన్నుల ఇసుకను మాత్రమే తరలించాలి. కానీ ఆయా వాహనాలను రీడిజైన్ చేసి.. సామర్థ్యానికి మించి 35 నుంచి 45 శాతం మేర అధికంగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ కూటమి పార్టీ వ్యక్తి, స్థానిక నేత కుమ్మక్కు ఇసుక దందా వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పార్టీకి చెందిన ఒక వ్యక్తి.. తెలంగాణ అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కనుసన్నల్లో ఈ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఆ ఇద్దరి మధ్య ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సమీప బంధువులని కూడా సమాచారం. నెల రోజులుగా ఏపీ నుంచి తెలంగాణకు ఇసుకను తరలిస్తున్న పది వాహనాలను స్థానిక పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినా ఇసుక రవాణా కొనసాగుతుండగా.. ఇటు పోలీసులు, అటు రవాణా శాఖ చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాత్రివేళ దొంగ చాటుగా ఇసుక లారీలు తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో టోల్ప్లాజా వద్ద గస్తీ పెంచామని జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి ఎస్ఐ శేఖర్ తెలిపారు. ఏజెంట్ల ద్వారా వ్యవహారం ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరులో లోడ్ చేస్తున్న గోదావరి ఇసుకను ఆర్డర్ల ఆధారంగా టిప్పర్లు, లారీల్లో సత్తుపల్లి, ఖమ్మం, హైదరాబాద్కు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వాహనాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఇందులో ఏలూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టన్ను రూ.250 చొప్పున టిప్పర్లలో 40 – 50 టన్నుల వరకు లోడ్ చేసి, సత్తుపల్లిలో టన్ను రూ.1,200 చొప్పున, ఖమ్మంలో రూ.1,600 – రూ.1700, అదే హైదరాబాద్కు తీసుకెళ్తే రూ.2,500కు అమ్ముతున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లాకు ఆనుకుని తెలంగాణలోని అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. సత్తుపల్లిలో కొందరు ఏజెంట్లను నియమించుకుని వారి కనుసన్నల్లో ఆయన బినామీలు వ్యవహారం నడిపిస్తున్నారు. టిప్పర్లు రాగానే వేగంగా అన్లోడ్ చేసేలా ఈ ఏజెంట్లు చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో పూర్వపు ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు కలిసి ఉండడంతో అడ్డూ అదుపూ లేకుండా ఇసుక దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఎమ్మెల్యే బినామీలే ఇటీవల ఏపీలో రూ.100 కోట్ల ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేకు చెందిన బినామీలే ఇసుక దందా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇసుక టిప్పర్లు కూడా ఆ ఎమ్మెల్యేకు చెందిన నియోజకవర్గాల్లోని వ్యక్తులవే కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అయితే రెండురోజుల క్రితం ఆ ఎమ్మెల్యే హడావుడిగా ప్రెస్మీట్ ఏర్పాటు చేసి తన పేరు చెప్పుకుని కొందరు ఇసుక, మట్టి దందా చేస్తున్నారని.. వారికి, తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించడం విశేషం. కాగా ఇసుక అక్రమ రవాణ జరుగుతున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారంతో నిఘా వేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు..ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని గంగవరం రాజవరం గ్రామానికి చెందిన కలిదిండి రాజేష్ పేరుతో ఉన్న ఏపీ 39 డబ్ల్యూహెచ్ 7666, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామానికి చెందిన కరకం శ్రీనివాస్ పేరిట ఉన్న ఏపీ 36డబ్ల్యూజీ 9666 టిప్పర్లలో ఇసుక తరలిస్తుండగా ఆదివారం రాత్రి పట్టుకోవడం గమనార్హం. -
కొత్త బట్టలు వేసుకుందువు లెయ్యి రా!
నంద్యాల జిల్లా: పుట్టిన రోజంటూ కొత్త దుస్తులు కొనిచ్చుకుంటివి, వేసుకుందువు లెయ్యి రా అంటూ ఓ తండ్రి విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. తల్లి మృతిని జీరి్ణంచుకోలేక, ఆరోగ్యం కుదుట పడక జీవితంపై విరక్తితో పుట్టిన రోజు నాడే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంకిరెడ్డి పల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రాస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు కుమారుడు కార్తీక్(23) పదో తరగతి తర్వాత అగ్రికల్చర్ చదువుతూ మధ్యలో మానేశాడు. 2016లో తల్లి అరుణకుమారి అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకోవడంతో కార్తీక్ అప్పటి నుంచి ముభావంగా ఉండేవాడు. దీనికి తోడు ఇటీవల బ్రీతింగ్ సమస్యతో బాధ పడుతున్నాడు. మంగళవారం బర్త్డే ఉండటంతో సోమవారం కార్తీక్ను తండ్రి తాడిపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించడంతోపాటు కొత్త దుస్తులు కొనిచ్చాడు. తనకు నంద్యాలలో పని ఉండటంతో వెళ్లిపోగా కార్తీక్ పట్టణంలోని పెద్దనాన్న కుమారుడి ఇంటికి వెళ్లాడు. రాత్రి వరకు అక్కడే సరదాగా గడిపాడు. మంగళవారం బర్త్డే కూడా ఇక్కడే చేద్దామని పెద్దనాన్న కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా నానమ్మ ఒక్కతే ఇందని గ్రామానికి చేరుకున్నాడు. ఉదయం టిఫిన్ చేసి మేడ పైకి వెళ్లాడు. మధ్యాహ్నం అయినా భోజనానికి రాకపోవడంతో నానమ్మ నారాయణమ్మ వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో ఉరి నుంచి తప్పించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి గ్రామానికి చేరుకుని కొత్త దుస్తులు వేసుకుందువు లెయ్యి రా అంటూ విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ రాసిన సూసైడ్ నోట్ను స్వాదీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రానున్న రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో పొడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి వర్షసూచన లేదని వ్యవసాయ వాతావరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త జి.నారాయణ స్వామి తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి. ఇందువల్ల ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 32.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 18.5 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 74–80 శాతం వరకు ఉండటం వల్ల చలి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చన్నారు. గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్ నీటిని మంగళవారం తెల్లవారుజామున హంద్రీనదికి విడుదల చేశారు. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో ముందు జాగ్రత్తగా నాలుగో క్రస్ట్ గేటు ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని హంద్రీనదిలోకి విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అలాగే ఎల్లెల్సీ నుంచి 50 క్యూసెక్కుల నీరు జీడీపీలోకి వస్తోందన్నారు. 270 టన్నుల సమీకృత దాణా కేటాయింపు కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ పాడిపశువుల కోసం సమీకృత దాణా సరఫరా చేస్తోందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ హేమంత్కుమార్ తెలిపారు. జిల్లాకు 270 టన్నుల దాణాను కేటాయించారని, రైతులకు 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు మంగళవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 50 కిలోల బస్తా పూర్తి ధర రూ.1,110 ఉండగా.. ఇందులో రూ.555 సబ్సిడీ వర్తిస్తుందన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు బస్తాల ప్రకారం పంపిణీ చేస్తామన్నారు. కర్నూలు డివిజన్ డీడీగా వసంతలక్ష్మి కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్గా డాక్టర్ పి.వసంతలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నంద్యాల జిల్లా బేతంచెర్ల ఏరియా వెటర్నరీ హాస్పిటల్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న ఈమెకు డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. ఈమెను ఖాళీగా ఉన్న కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ పోస్టులో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ● వెలుగోడు ఏరియా వెటర్నరీ హాస్పిటల్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న డాక్టర్ ఏ.వెంకటేశ్వర్లు పదోన్నతిపై కడప డివిజన్ డిప్యూటీ డైరెక్టర్గా నియమితులయ్యారు. -
నేడు జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు(బుధవారం) కర్నూలుతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టనున్న నిరసనలు, ర్యాలీలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ కళాశాల నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ఆర్ఎస్ రోడ్డు, జిల్లా పరిషత్ కార్యాలయంలోని అర్బన్ తహసీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తాం. ర్యాలీలో ప్రజలతో పాటు వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు హాజరై విజయవంతం చేయాలి. – ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు -
అలుపెరుగని పోరు
చంద్రబాబు సర్కార్ 17 నెలల వ్యవధిలో ప్రజలకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు ఆందోళనలు చేపడుతోంది. పొగాకు, మిర్చి, టమాట, ఉల్లి రైతులకు మద్దతుగా అనేక పోరాటాలు చేసింది. ప్రభుత్వ మొండి వైఖరి, నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నా లు, మీడియా సమావేశాలు నిర్వహించి ఒత్తిడి తీసుకొస్తోంది. అన్నదాత పోరు, యువత పోరు, విద్యుత్చార్జీల పెంపుపై భారీ ర్యాలీలు నిర్వహించి ప్రజలకు మ ద్దతుగా నిలిచింది. ప్రజా స్పందన చూసి వైఎస్సార్ సీపీ కార్యక్రమాలపై పోలీసు శాఖ అడ్డుకునే ప్రయ త్నం చేస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుని ఇంటికి 30 పోలీ సు యాక్ట్ ఉందంటూ నోటీసులు అంటించడం చూస్తే ఏస్థాయిలో అవాంతరాలు సృష్టిస్తున్నారో తెలుస్తోంది -
జిల్లాలో హై అలర్ట్
కర్నూలు: ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా అంతటా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో జిల్లాలో జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఓర్వకల్లు ఎయిర్పోర్టు, దేవాలయాలు, మసీదులు, జాతీయ రహదారులు, టోల్ గేట్లు, రాష్ట్ర రహదారులు, పట్టణాల్లోని లాడ్జీలు, వ్యాపార సముదాయాలతో పాటు వాహన తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. అనుమానితుల కదలికలు, లగేజీపై ప్రత్యేక నిఘా ఉంచారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 112 లేదా 100కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
ఏకగ్రీవంగా సహకార ఎన్నికలు
కర్నూలు (అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ అమరావతి జిల్లా శాఖ ఎన్నికలు మంగళవారం ఏకగ్రీవంగా జరిగాయి. కర్నూలు కృష్ణానగర్లోని సహకార శాఖ డివిజనల్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా కె.శ్రీనివాసులు వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా కర్నూలు సబ్ డివిజన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.నాగరమణయ్య ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఎం.రామరాజు, సెక్రటరీగా పత్తికొండ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.లక్ష్మీకాంత రెడ్డి, జాయింట్ సెక్రటరీగా షేక్ మున్వర్ బాషా, జాయింట్ సెక్రటరీ (ఉమన్) పి. తిరుమల, కోశాధికారిగా శ్రీ నివాస్, క్యాడర్ సెక్రట రీగా పుష్పలత, ఖలీలుల్లా షరీఫ్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యుల చేత ఎన్నికల అధికారి కె.శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను సహకార శాఖ ఉద్యోగులు అభినందించారు. తమపై నమ్మకముంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీకాంత రెడ్డి జిల్లా సెక్రటరీ నాగరమణయ్య జిల్లా అధ్యక్షుడు -
స్నాతకోత్సవానికి వేళాయే!
కర్నూలు కల్చరల్: పట్ట భద్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్నాతకోత్సవ (పట్టాల) పండుగ రానే వచ్చింది. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నాల్గవ కాన్వొకేషన్ వేడుకలు బుధవారం వర్సిటీలో జరగనున్నాయి. వీటి నిర్వహణకు వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాయలసీమ యూనివర్సిటీ ఏర్పాటు అయ్యాక ప్రస్తుతం జరుగుతున్న ఈ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చాన్స్లర్ హోదాలో మొదటి సారి వర్సిటీకి రానుండటం విశేషం. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఎ.ఎం. గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి. రామకుమార్కు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనుంది. ఆయనే ప్రధాన వక్తగా ఉపన్యసించనున్నారు. గవర్నర్ పర్యటన ఇలా.. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చాన్స్లర్ హోదాలో ఆర్యూ నాల్గవ స్నాతకోత్సవం, మాంటిస్సోరి పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు కర్నూలు రానున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 10.50 గంటలకు రోడ్డు మార్గాన రాయలసీమ యూనివర్సిటీకి చేరుకుంటారు. 11 నుంచి 12.15 గంటల వరకు వర్సిటీ నాల్గవ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.35 గంటలకు మాంటిస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ స్కూల్కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం, విశ్రాంతి తీసుకొని 2.20 గంటలకు బయలు దేరి 2.30 గంటలకు ఏక్యాంప్ మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్కు చేరుకు ని స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో 3.30 గంటల వరకు పాల్గొంటారు. సాయంత్రం 4.10 గంటలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. గవర్నర్ పరట్యన నేపథ్యంలో ప్రొటోకాల్ అధికారులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏయిర్పోర్ట్ నుంచి ఆర్యూ వరకు ట్రయల్ రన్ నిర్వహించి, సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. ముస్తాబైన వర్సిటీ వర్సిటీ నాల్గవ కాన్వొకేషన్కు ముస్తాబైంది. పరిపాలనా భవనం, అకడమిక్ బిల్డింగ్స్, వర్సిటీ ముఖ ద్వారాలు, వర్సిటీ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించి పెయింటింగ్ వేయించి సుందరంగా తీర్చిదిద్దారు. పరిపాలనా భవనాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కాన్వొకేషన్ జరిగే వేదికను అందంగా తీర్చిదిద్దారు. 75 మందికి బంగారు పతకాలు వర్సిటీలో 60 మంది పీజీ, 15 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కలిపి మొత్తం 75 మందికి బంగారు పతకాలను గవర్నర్ అందజేయనున్నారు. 283 మంది స్కాలర్స్కు పీహెచ్డీ కాన్వొకేషన్కు దరఖాస్తు చేసుకోగా ఇన్పర్సన్ 138 మంది, పీజీ విద్యార్థులు 889 మంది దరఖాస్తు చేసుకోగా ఇన్పర్సన్గా 256 మంది విద్యార్థులు నేరుగా కాన్వొకేషన్ పట్టాను అందుకోనున్నారు. 2024–25 విద్యా సంవత్సరం వరకు డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులకు 17,224 మంది దరఖాస్తు చేసుకోగా అన్ని కోర్సులకు సంబంధించి మొత్తం 18,396 మంది విద్యార్థులు కాన్వొకేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీ నాల్గవ కాన్వొకేషన్కు వర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొత్తం 2,000 మంది పాల్గొనేలా సభా ప్రాంగణం ముస్తాబైంది. కాన్వొకేషన్కు హాజరయ్యే వారు ఉదయం 10 గంటల్లోగా వేదిక ప్రాంగణానికి చేరుకోవాలి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, వర్సిటీ అనుబంధ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లను ఆహ్వానించాం. చాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ వర్సిటీకి రానున్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే స్నాతకోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉంది. – ప్రొఫెసర్ వి.వెంకట బసరావు, వైస్చాన్స్లర్, ఆర్యూ -
ప్రజల అభ్యున్నతికి సహకారం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజల అభ్యున్నతికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకరిస్తుందని కర్నూలు రీజినల్ హెడ్ నరసింహారావు తెలిపారు. స్థానిక హోటల్ మౌర్యాఇన్లో మంగళవారం యూబీఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని బ్రాంచ్ల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముంబయి నుంచి యూబీఐ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అషిష్ పాండే ప్రసంగంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వివరాలను లైవ్టెలీకాస్ట్ ద్వారా వీక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. హంద్రీ నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి కర్నూలు: జొహరాపురం శివారులోని హంద్రీ నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. మంగళవారం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి క్రీమ్ కలర్ ఫుల్ షర్ట్, లేత నీలి రంగు ప్యాంటు ధరించాడు. మృతదేహం ఉబ్బిపోయి గుర్తు పట్టని విధంగా ఉంది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు 9121101059 లేదా 9985726737, ల్యాండ్ నెంబర్ 08518–240012కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఐటీసీ మార్కెటింగ్ ఏజెంట్ ఆత్మహత్య కర్నూలు: మండల పరిధిలోని ఉల్చాల గ్రామానికి చెందిన రఘువరన్ (23) పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈయన కర్నూలులోని ఐటీసీలో మార్కెటింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఐటీసీ కంపెనీకి సంబంధించిన లోన్ కలెక్షన్ డబ్బు కంపెనీకి చెల్లించకుండా వాడుకున్నాడు. దీంతో కొంతకాలంగా కంపెనీ నిర్వాహకులు తీవ్ర ఒత్తిడి చేయడంతో వాడుకున్న డబ్బు చెల్లించే మార్గం లేక మనస్తాపానికి గురై సోమవారం ఇంటి వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడివుండగా కుటుంబ సభ్యులు కనుగొని ఆసుపత్రిలో చేర్పించి వైద్యచికిత్సలు చేయించారు. కోలుకోలేక తెల్లవారుజామున మృతిచెందాడు. కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారవేత్త అరెస్ట్ ● రిమాండ్ తిరస్కరించిన కోర్టు నంద్యాల: వ్యాపారవేత్తను త్రీటౌన్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. సరైన విచారణ విధానం పాటించకుండా అరెస్ట్ చూపడంతో జడ్జి రిమాండ్ తిరస్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన వ్యాపారవేత్త బొగ్గరపు నాగరాజు బెంగళూరుకు చెందిన మనూ అనే వ్యక్తికి స్థిరాస్థి వ్యాపార లావాదేవీల్లో మోసం చేశారని, త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అరెస్ట్ సమయంలో పోలీసు అధికారులు చట్టం ప్రకారం నోటీసు ఇవ్వకపోవడం, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం, చట్టపరమైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని జడ్జికి వివరించడంతో రిమాండ్ను తిరస్కరించినట్లు న్యాయవాది నిఖిలేశ్వర్రెడ్డి తెలిపారు. -
టీబీ డ్యాం నీటిపై 14న ఐఏబీ సమావేశం
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీ ఇతర కాలువలకు నీటి విడుదల, నిలిపివేత తదితర అంశాలపై ఈనెల 14న బెంగళూరు విధానసౌధలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నీటి సలహా మండలి సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో 125వ నీటి సలహా మండలి(ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు. గతేడాది డ్యాం 19వ క్రస్టుగేటు వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో ఏర్పాటు చేసిన స్టాప్లాక్ గేటు స్థానంలో కొత్త గేటుతోపాటు మిగిలిన 32 క్రస్టుగేట్ల స్థానంలో కొత్తవి బిగించేందుకు పనులు ప్రారంభించనున్నారు. అందులోభాగంగా ఒక పంటకు(ఖరీఫ్) మాత్రమే నీరిచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాగా కర్ణాటక, ఏపీలోని తుంగభద్ర రైతు సంఘం నాయకులు, రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంతోపాటు ఇతర సమస్యలను సమావేశంలో చర్చించనున్నారు. టీబీ డ్యాం -
రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
కోసిగి: మండల పరిధిలోని మూగలదొడ్డి గ్రామాని కి చెందిన బోయ వెంకట రెడ్డి(25) తిరుపతిలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామంలో పనులు లేకపోవడంతో మూడేళ్లుగా తిరుపతికి వలస వెళ్లి అక్కడ జీవనం సాగిస్తూ అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చిపోచేవాడు. మొహర్రం అనంతరం మూడు నెలల క్రితం భార్య పిల్లలతో కలిసి వెంకట రెడ్డి తిరుపతికి వెళ్లాడు. సోమవారం సాయంత్రం పనులు ముగించుకుని బైక్పై తిరుపతిలో సరుకులు కొనుగోలు చేసేందుకు బయలదేరాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో తలకు తీవ్రమై గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వగ్రామం మూగలదొడ్డికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య మహేశమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
బరితెగించిన ఇసుకాసురులు
గోరంట్లలో రెచ్చిపోతున్న తమ్ముళ్లు ● హంద్రీ నుంచి రోజుకు 50 పైగా ట్రాక్టర్ల ఇసుక తరలింపు ● సోషల్ మీడియాలో వీడియోల హల్చల్ సాక్షి టాస్క్ఫోర్స్: కోడుమూరు మండలం గోరంట్ల గ్రామ హంద్రీనదిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. హంద్రీనది నుంచి ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేడీసీసీబీ చైర్మన్ ఎదురూరు విష్ణువర్దన్రెడ్డి అనుచరులు పగలు, రాత్రి తేడా లేకుండా గోరంట్ల హంద్రీ నది నుంచి రోజుకు 50కు పైగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి చుట్టుపక్క గ్రామాలతో పాటు, క్రిష్ణగిరి, డోన్, పత్తికొండ వంటి ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇటీవలే హంద్రీనదికి వరదలు రావడంతో గోరంట్ల హంద్రీలో భారీగా ఇసుక మేటలు వేసింది. దీన్ని అదనుగా భావించిన విష్ణు అనుచరులు గోరంట్ల హంద్రీ నుంచి పట్టపగలే ఇతర ప్రాంతాలకు భారీగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరో 10నుంచి 15రోజుల్లో హంద్రీలో ఇసుకంతా ఖాళీ అయ్యే ప్రమాదముందని గ్రామస్తులు వాపోతున్నారు. పగిలిపోతున్న మంచినీటి పైపులైన్లు హంద్రీ నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తుండటంతో గ్రామానికి మంచినీటి సరఫరా కోసం హంద్రీలో వేసిన పైపులైన్లు పగిలిపోతున్నాయి. దీంతో గోరంట్ల గ్రామంలో రెండు, మూడు రోజులకోసారి మంచినీటి సమస్య తలెత్తుతోంది. ఇసుక తరలింపు వల్లే పైపులైన్లు పగిలిపోతున్నాయని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలంటూ పోలీసు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోతోందని ప్రజలు వాపోతున్నారు. నిత్యం పైపులైన్లు పగులుతుండడంతో పంచాయతీకి భారీగా నష్టం చేకూరుతోంది. సోషల్ మీడియోలో పోస్టులు పెట్టి మరీ తరలింపు అనుమతి లేకుండా హంద్రీనది నుంచి ఇసుకను తరలించరాదనే నిబంధనలున్నా గోరంట్లకు చెందిన విష్ణు అనుచరులు బేఖాతర్ చేస్తున్నారు. ప్రజల అవసరాలు, డిమాండ్ను బట్టి ఒక్కో ఇసుక ట్రాక్టర్ రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పలుకుతుండడంతో తెలుగుతమ్ముళ్లు భారీగా దోచేస్తున్నారు. ఇక్కడి ఇసుక మాఫియా ఒక అడుగు ముందుకేసి హంద్రీనది నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలించే వీడియోలను సైతం సోషల్ మీడియాలో పెడుతూ హల్చల్ చేస్తున్నారు. బహిరంగంగానే పోస్టులు పెడుతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం గమనార్హం. -
వృద్ధురాలిని కాపాడిన యువకులు
బండి ఆత్మకూరు: కుందూ నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన లింగాపురం గ్రామానికి చెందిన అంబటి ఈశ్వరమ్మను మంగళవారం నలుగురు యువకులు కాపాడారు. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు.. లింగాపురం గ్రామానికి చెందిన అంబటి ఈశ్వరమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది బండి ఆత్మకూరు సమీపంలోని కుందూనదిలో దూకింది. స్థానిక యువకులు ఫిదా, సూరజ్, శీను, అఫ్రోజ్ గమనించి ఈశ్వరమ్మను కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఏపీ ఎన్జీజీఓస్ సభ్యత్వ నమోదు కర్నూలు(అగ్రికల్చర్): ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ పటిష్టతకు మరింత జవాబుదారితనంతో పనిచేయాల్సిన అవసరముందని జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి జవహార్లాల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. పలువురు ఉద్యోగులకు సభ్యత్వం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సాంబశివారెడ్డి, రమణ, భాస్కరనాయుడు, వెటర్నరీ పారా సిబ్బంది సంఘాల సమాఖ్య చైర్మన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
చిన్నారుల అస్వస్థతపై విచారణ
ఆదోని రూరల్: మండల పరిధిలోని నాగులాపురం గ్రామ అంగన్వాడీ కేంద్రం–2లో పది మంది చిన్నారులు అస్వస్థతకు గురైన విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. ఐసీడీఎస్ పీడీ విజయ, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సత్యవతి మంగళవారం అంగన్వాడీ కేంద్రం–2ను పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తను, ఆయాను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కర్నూలు నుంచి వచ్చిన స్పెషల్ వాటర్ టెస్టింగ్ టీం తాగునీటిని సేకరించి ల్యాబ్కు తరలించింది. గడ్డ కట్టిన పాలు ఇవ్వడం, భోజనం, వంట పాత్రలు అపరిశుభ్రంగా ఉండడం వల్లే అస్వస్థతకు కారణమని గ్రామస్తుల ఆరోపణలతో వాటినీ పరిశీలించారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఐసీడీఎస్ పీడీ, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ తెలిపారు. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ కోలుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓ డిల్లీశ్వరి, సూపర్వైజర్ పుష్ప, ఆదోని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మధుసూదన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
వంద శాతం ఫలితాలు సాధించకుంటే నో రెన్యూవల్
కర్నూలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా ల్లో తమతమ సబ్జెక్ట్ల్లో వంద శాతం ఫలితాలు సాధించకపోతే వచ్చే ఏడాదికి రెన్యూవల్ ఉండదని కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీని కేజీబీవీ స్కూళ్ల డైరెక్టర్ దేవానందరెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లాలోని 26 కేజీబీవీ ప్రిన్సిపాళ్లతో వర్చువల్ స్టూడియోలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో ఎప్పు డూ లేని విధంగా జూలై 15 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు విజయపథం కార్యక్రమాన్ని ప్రారంభించామని, దాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపాళ్లపై ఉందని ఆయన తెలిపారు. సమావేశంలో డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ ఎస్.శామ్యూల్ పాల్, జీసీడీఓ స్నేహలత పాల్గొన్నారు. డైరెక్టర్ దృష్టికి సమస్యలు.. నాన్ టీచింగ్ స్టాఫ్ పని చేయమంటే గొడవలకు దిగుతున్నారని, స్థానికంగా ఉండేవారు కావడంతో వారి కుటుంబ సభ్యులు వచ్చి తాము ఫలానా పార్టీ నాయ కులమంటూ పరోక్షంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారని పలువురు ప్రిన్సిపాళ్లు డైరెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ● కొన్ని కేజీబీవీల్లో రాత్రిళ్లు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామని ఇన్వర్టర్లు మంజూరు చేయాలని కో రారు. ● నాడు–నేడు పనులు నిలిచిపోవడంతో తరగతి గదులు చాలక, డ్రైనేజీ సిస్టం సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ●ఇంటర్ పిల్లలకు ల్యాబ్లు నిర్మిస్తున్నా పూర్తి కాలేదని, పరికరాలు పూర్తిగా అందజేయలేదని డైరెక్టర్కు వివరించారు. -
విద్య, పరిశోధనల్లో పరస్పర సహకారం
● ట్రిపుల్ఐటీ, ఆర్యూ మధ్య ఒప్పందంకర్నూలు సిటీ: విద్య, పరిశోధన అంశాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీ), రాయలసీమ యూనివర్సిటీలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు సోమవారం జగన్నాథగట్టులో ఉన్న ట్రిపుల్ ఐటీడీఎంలో ఆ సంస్థఽ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఆర్యూ వీసీ ఆచార్య వెంకట బసవరావు సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య, పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాఠ్యంశాల రూపకల్పన, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, నిర్వహణ, సమావేశాలు, ఆధునాతన ప్రయోగశాలలు, ఆవిష్కరణ, కేంద్రాల స్థాపనలో పరస్పర మద్దతుకు ఈ ఒప్పందం దోహద పడుతుందన్నారు. ఈ భాగస్వామ్యం కింద రెండు సంస్థలు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్చెయిన్, క్వాంటం, పోస్ట్ క్వాంటం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, ఇతర అభివృద్ధి చెందుతున్న డోమైన్ల వంటి అత్యాధునిక రంగాల్లో ఉమ్మడి చొరవలకు అవకాశాలను అన్వేషిస్తుందన్నారు. ఈ అవగాహన ఒప్పందం రెండు సంవత్సరాల కాలం పాటు చెల్లుబాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్యూ రిజిస్ట్రార్ విజయ్కుమార్, ట్రిపుల్ఐటీ డీఎం రిజిస్ట్రార్ రాజ్ కుమార్, అచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పశ్చిమ ప్రాంతం అభివృద్ధి పట్టదా?
ఆదోని రూరల్: అన్ని విధాలుగా వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి పట్టదా అని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, సీపీఎం జిల్లా కార్య దర్శి గౌస్దేశాయ్ చంద్రబాబు సర్కారును ప్రశ్నించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆదోని సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పాదయాత్ర సోమవారం ఆదోని సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ భారీ ధర్నా చేపట్టి వారు మాట్లాడారు. కర్నూలు జిల్లా నుంచి పలువురు రాష్ట్ర మంత్రులుగా, కేంద్రమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. అందుకే ఇక్కడి నుంచి చాలా మంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి బతుకుతున్నారన్నారు. కోసిగి, పెద్దకడబూరు, ఆదోని, ఆస్పరి, ఆలూరు, కౌతాళం మండలాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. రెండో ముంబాయిగా పిలువబడే ఆదోనిలో ప్రస్తుతం పరిశ్రమలు మూతపడి వెలవెలబోతుందన్నారు. కార్మికులకు, యువకులకు ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు పరిశ్రమలు తీసుకువచ్చి వారికి ఉపాధి కల్పించడంలో విఫలమైందన్నారు. ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరగడం లేదని, ఎందుకో పాలకులు వాటి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఏటా వంద ల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతున్నా చోద్యం చూస్తున్నారన్నారు. ఒడిసి పట్టి ఈ ప్రాంతా న్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేయడం లేద న్నారు. హగరి నదిపై వేదావతి ప్రాజెక్టు, నగరడోన రిజర్వాయర్ నిర్మాణం తదితరవి మధ్యలోనే ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అలాగే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పనకు పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్కలెక్టర్ కార్యాలయ ఏఓ వసుంధరకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ -
స్కూటర్ అదుపుతప్పి ..
ఆలూరు రూరల్: స్కూటర్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని కురువళ్లి సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ మన్మథ విజయ్ తెలిపిన వివరాలు.. హాలహర్వి మండల కేంద్రానికి చెందిన షేక్షావలి బెంగళూరులో గౌండా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం సొంత పని నిమిత్తం ఆలూరు వచ్చి హాలహర్వికి వెళ్తుండగా కురువళ్లి సమీపంలోని హైవే 167లో కుక్కను ఢీకొట్టి స్కూటర్ అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రయాణికులు గమనించి 108 అంబులెన్సులో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడు షేక్షావలికి భార్య షాషా బీ, ఇద్దరు పిల్లలు సంతానం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విలేకరులకు తెలిపారు. లారీ, బొలెరో ఢీ.. ఒకరు మృతి ● మరో ముగ్గురికి గాయాలు చిలుకూరు: లారీ, బొలెరో వాహనం ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని మిట్స్ కళాశాల సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి ఏపీలోని కర్నూలుకు వెళ్తున్న బొలెరో వాహనం చిలుకూరు మండల పరిధిలోని మిట్స్ కళాశాల వద్దకు రాగానే ఎదురుగా హుజూర్నగర్ నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఏపీలోని కర్నూలు పట్టణంలోని ఆర్ఆర్ నగర్కు చెందిన బొలేరో వాహన డ్రైవర్ నల్లబొక్కల రఘు(43) అక్కడికక్కడే మృతిచెందగా.. అదే వాహనంలో ప్రయాణిస్తున్న ఉపేంద్ర పవన్కుమార్రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. చిక్సిత నిమిత్తం అతడిని విజయవాడకు తరలించారు. అదేవిధంగా లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించండి కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తగిన భూమిని గుర్తించాలని మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కర్నూలు నగరంలోని ఏ, బి, సి క్యాంపుల్లో ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ భూమిని గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డీఆర్వో వెంకటనారాయ ణమ్మ పాల్గొన్నారు. -
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అరుదైన ఆపరేషన్
● క్యాన్సర్ సోకిన కాలు కోల్పోకుండా కాపాడిన వైద్యులు కర్నూలు(హాస్పిటల్): కార్పొరేట్ ఆసుపత్రు ల్లో జరిగే అరుదైన సర్జ రీ కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జరిగింది. బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ మహిళకు ఇక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి కాలు కోల్పోకుండా కాపాడారు. వివరాలను హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్ సోమవారం విలేకరులకు వెల్లడించారు. కదిరి ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల మహిళ ఎడమ తొడ కింది భాగంలో వాపు, నొప్పితో బాధపడుతూ గత నెల 15వ తేదీన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చికిత్స నిమిత్తం వచ్చారు. ఆమెను పరీక్షించిన ఎముకల క్యాన్సర్ వైద్యులు డాక్టర్ బ్రహ్మ మహేశ్వరరెడ్డి, డాక్టర్ శివకృష్ణ కండ్రోసర్కోమా అనే ఎముకల క్యాన్సర్గా నిర్దారించారు. అదే నెల 27వ తేదీన ఆమెకు వచ్చిన క్యాన్సర్ పైభాగం వరకు కాలు తీసి వేయకుండా క్యాన్సర్ ఉన్న ఎముక, కండరాలను మాత్రమే తీసివేసి కృత్రిమ ఎముక (మెగా ప్రాస్తెసిస్) వేసి కాలుని కాపాడారు. ఆపరేషన్ సమయంలో, తర్వాత గాని ఎలాంటి ఇబ్బంది రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం వాకర్ సహాయంతో ఆమెను నడిపించి సాధారణ జీవితాన్ని ప్రసాదించారు. ఇలాంటి సర్జరీ చేయడం ఇక్కడ మొదటిసారని డాక్టర్ ప్రకాష్ చెప్పారు. ఆమె పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో వైద్యులు చైతన్యవాణి, బీసన్న, భారతి, వరలక్ష్మి పాల్గొన్నారు. -
విద్యార్థులతో ముచ్చటించి..సౌకర్యాలపై ఆరాతీసి
హొళగుంద: శిక్షణలో భాగంగా మండల కేంద్రం హొళగుందకు వచ్చిన ట్రైనీ కలెక్టర్లు శివంసింగ్, శివానీ, శివణేంధరణ్, మైఖెల్, నిధి యా, ఆల్ప్రెడ్లు సోమ వారం ప్రభుత్వ పాఠశాలలను, అంగన్ వాడీ కేంద్రాలను, ప్రభుత్వ కార్యాలయాలను చుట్టేశారు. ముందుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజానగర్ కాలనీలోని కన్నడ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), అంగన్వాడీ సెంటర్లను పరిశీలించారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించి..విద్యాబోధన, సౌకర్యాలు తదితర వాటిపై ఆరా తీశారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేశారు. తర్వాత తహసీల్దారు కార్యాలయం, పోలీస్స్టేషన్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్ చలవాది రంగమ్మ, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్గౌడ్ తదితరులు ఉన్నారు. -
పసిబిడ్డ కిడ్నాప్ కేసులో ముద్దాయి అరెస్టు
కర్నూలు: నాలుగేళ్ల పసిబిడ్డ కిడ్నాప్ చేసిన కేసులో ముద్దాయి బోయ మధును నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. బాలిక తల్లి తెలుగు సునిత అలియాస్ సుమిత్ర కర్నూలులోని బళ్లారి చౌరస్తా ఎస్ఏపీ క్యాంప్ పరిసర ప్రాంతాల్లో పేపర్లు ఏరుకోవడం, భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈనెల 8న తన కూతురును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తల్లి సుమిత్ర నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం పంచలింగాల చెక్పోస్టు వద్ద అనుమానాస్పదంగా బాలికతో ఉన్న బోయ మధును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన బోయ మధు నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని ముజఫర్ నగర్ ఆటోస్టాండ్ వద్ద నివాసముంటాడు. నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి భిక్షాటన కోసం విక్రయించేందుకు హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్లు విచారణలో అంగీకరించాడు. బాలికను తల్లికి అప్పగించి నిందితుడిని డోన్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. -
ఉద్యోగం పేరుతో మోసం
● ఎస్పీని ఆశ్రయించిన బాధితులు కర్నూలు: ‘నేను బయోమెడికల్ కోర్సు పూర్తి చేశాను. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలు సి.క్యాంప్నకు చెందిన రాఘవరెడ్డి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడ’ని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన నరసింహులు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 99 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామకృష్ణ తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించండి కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ సంబంధ సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటీ అధికారులను ఆదేశించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచి నిర్వహించిన ఈకార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పలువురు వివిధ సమస్యలను సీఎండీ దృష్టికి తెచ్చారు. వాటిని సత్వరం పరిష్కరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కర్నూలు, నంద్యాల జిల్లాల ఎస్ఈలను ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు డయల్ యువర్ కార్యక్రమానికే కాకుండా టోల్ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800425155333 నంబర్లకు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చని సూచించారు. 91333 31912 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చునన్నారు. జిల్లాలో పోలీసులు అప్రమత్తం ● ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు కర్నూలు: ఢిల్లీలో ఎర్రకోట దగ్గర భారీ పేలుడు నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లా అంతటా ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఎస్పీ గుత్తి పెట్రోల్ బంకు దగ్గర చేపట్టిన వాహన తనిఖీల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు బృందాలు రాత్రి పొద్దుపోయే వరకు రాష్ట్ర, జాతీయ, గ్రామీణ రహదారుల్లో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. -
గ్రామాల్లో టీడీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు
● కలెక్టర్ సిరికి విన్నవించిన మాజీ ఎమ్మెల్యే కాటసానికర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ నాయ కులు నిరంకుశంగా వ్యవహరిస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని కోరారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కల్లూరు, ఓర్వకల్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై కల్టెక్టర్కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ..కల్లూరు మండలం బొల్లవరంలో ఉన్న నీలం రామచంద్రయ్య గ్రామైక్య సంఘంలో మొత్తం 27 సంఘాలు ఉండగా..ఐక్య సంఘం లీడర్ను కేవలం 14 సంఘాల లీడర్లతోనే ఎన్నుకున్నారని, అన్ని సంఘాల మద్దతుతో నూతన కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం బుక్కీపర్గా ఉన్న కృష్ణమోహన్నాయుడును కొనసాగించాలని, ఆయన సెల్ఫోన్ను బ్లాక్ చేయడం అన్యాయమని చెప్పారు. అలాగే ఓర్వకల్ మండలం మీదివేములకు చెందిన భూములను ఏపీఐఐసీ సేకరించిందని, ఆ గ్రామానికి చెందిన 37 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 17 మందికి మాత్రమే పరిహారం ఇచ్చిందని, బోర్లు, బావులు, చెట్లకు కూడా పరిహారం ఇవ్వలేదని చెప్పారు. వెంటనే రైతులందరికీ పరిహారం ఇవ్వాలని కోరారు. -
సంచార పశువైద్య కేంద్రాలకు మందులొచ్చాయి
కర్నూలు(అగ్రికల్చర్): మూగజీవులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంచార పశువైద్య కేంద్రాలకు ఎట్టకేలకు మందులు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆ కేంద్రాలు మనుగడ కోల్పోతున్న వైనాన్ని వివరిస్తూ ఈ నెల 5వ తేదీన మూగబోయిన సేవలు అనే శీర్షికపై సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనం ఉన్నత స్థాయి దృష్టికి పోవడంతో సంచార పశువైద్య కేంద్రాలకు మందులు సరఫరా అయ్యాయి. 10 రకాల మందులను సరఫరా చేసినట్లు పశుసంవర్ధకశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే 1962 పనితీరు మెరుగుపడలేదు. టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే తగలకపోవడం, రింగ్ అయినా లిఫ్ట్ చేయకపోవడం ఇప్పటికీ జరుగుతోంది. ఉదయం 11 తర్వాత కాల్స్కు స్పందిస్తున్నట్లు సమాచారం. 12న కర్నూలుకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కర్నూలు(సెంట్రల్): ఆర్యూ నాలుగో స్నాతకోత్సవం, మాంటెస్సోరి పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కర్నూలుకు రానున్నారు. గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, డీఐజీ, ఎయిర్పోర్టు డైరెక్టర్లకు రాజ్భవన్ నుంచి సమాచారాన్ని అందించారు. 12వ తేదీ ఉదయం 10.30 గంటలకు గవర్నర్ ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 10.50 గంటలకు రోడ్డు మార్గంలో రాయలసీమ యూనివర్సిటీకి చేరుకుంటారు. 11 నుంచి 12.15 గంటల వరకు రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం 12.20 గంటలకు మాంటెస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ స్కూల్కు చేరుకుంటారు. అక్కడ మాంటెస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి 4.10 గంటలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. అడవుల సంరక్షణకు ప్రాధాన్యత కర్నూలు కల్చరల్: అడవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రధానంగా అటవీ ఉద్యోగులు ఈ బాధ్యతను మరువకూడదని ఆ శాఖ కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ బీవీఏ కృష్ణ మూర్తి అన్నారు. సోమవారం అటవీ శాఖ సర్కిల్ కార్యాలయంలో అటవీ అమర వీరుల దినోత్స వం నిర్వహించారు. చీఫ్ కన్జర్వేటర్తో పాటు డీఎఫ్వో శ్యామల, రేంజర్లు, అటవీ శాఖ ఉద్యోగులు అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎఫ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో 23 మంది అటవీ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణ లో అమరులయ్యారన్నారు. వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్ఓ రమణారెడ్డి, కర్నూలు డివిజన్ ఎఫ్ఆర్ఓ విజయకుమార్, ఏవో అబ్దుల్ సుభాన్, కార్యాలయ సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
హైకోర్టు చీవాట్లు పెట్టినా మారని ప్రభుత్వం
కర్నూలు(టౌన్): అక్రమ కేసుల విషయంలో హైకోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి పార్టీలు విషం చిమ్మినా ఏనాడూ ప్రతీకార చర్యలకు పాల్పడలేదన్నారు. చంద్రబాబు పాలన ఇందిరాగాంధీ హయాంలోని ఎమర్జెన్సీ రోజులను మించిపోయిందని, ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మీడియాతో పాటు తాము కూడా ప్రభుత్వ తప్పులను ప్రశ్నించామన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా మద్యం మత్తులో ఉన్న బైకర్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారన్నారు. లక్ష్మీపురం పరిధిలోని బెల్ట్ షాపులో మద్యం సేవించినట్లు పత్రికల్లోనూ వచ్చిందన్నారు. ఇదే విషయంపై తాము మాట్లాడితే అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఎడిటర్ స్థాయి జర్నలిస్టుల ఆఫీసులకు పోలీసులు వెళ్లడం, నోటీసులు ఇవ్వడం ఎప్పుడూ చూడలేదన్నారు. సోషల్ మీడియాకు చెందిన 27 మందిపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులు, భయాందోళనకు గురిచేయడం దుర్మార్గమన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి, కర్నూలు మేయర్ బీవై రామయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుకా, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సువర్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోంది. చంద్రబాబు నాయుడు, లోకేష్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వీటికి ఎంతమాత్రం భయపడబోం. పత్రికలపై, జర్నలిస్టులపై కేసులు పెట్టడం 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం. ఏడాదిన్నర పాలనలో చీప్ లిక్కర్, బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారుతుంది. బెల్ట్ షాపులు లేవని ఈ ప్రభుత్వం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు -
కలుషిత ఆహారంతో పదిమంది చిన్నారులకు అస్వస్థత
● ఆదోని మండలం నాగలాపురం అంగన్వాడీ కేంద్రంలో ఘటన కర్నూలు (అర్బన్): ఆదోని మండలం నాగలాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సోమవారం కలుషిత ఆహారం తిని పది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారులకు సంబంధిత అంగన్వాడీ టీచర్ ముందుగా పాలు ఇచ్చారని, మధ్యాహ్నం అన్నం, సాంబారు పిల్లలకు పెట్టినట్లు సమాచారం. ఈ ఆహారం తిన్న వెంటనే పది మంది చిన్నారులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వెంటనే సమాచారాన్ని సంబంధిత అధికారులకు, వైద్య సిబ్బందికి చేరవేయడంతో హుటాహుటిన వైద్యసిబ్బంది అక్కడికి చేరుకుని అస్వస్థతకు గురైన చిన్నారులకు వైద్య సహాయం అందించారు. అయితే, 9 మంది చిన్నారులకు అక్కడే శిబిరం ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందించి, మరొక చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న ఆదోని ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. చిన్నారులకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. -
దీక్షా నియమాల్లో కొన్ని..
● ప్రతి రోజు వేకువనే చన్నీటితో స్నానం చేయాలి. ● నలుపు లేదా నీలి రంగు దుస్తులు ధరించాలి. కన్నె స్వాములు (మొదటి సారి దీక్ష స్వీకరించిన వారు) కచ్చితంగా నలుపు దుస్తులనే ధరించాలి. ● కాళ్లకు చెప్పులు ధరించరాదు. ● ప్రతి సీ్త్రని (భార్యను సైతం) దేవి స్వరూపాలుగా భావించాలి. ● రోజుకు ఒక్క పూట మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి. రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ● ఉదయం పాలు పండ్లు మాత్రమే ఆరగించాలి. ● పగటి పూట నిద్ర పోరాదు. ● మద్యం, మాంసం, ధూమపానం, తాంబూలం నిషేధం. ● తల్లిదండ్రులకు, గురుస్వాములకు, తోటి అయ్యప్పలకు, దైవానికి, మహాత్ములకు మాత్రమే నమస్కారం చేయాలి. స్వాముల హోదా కన్నెస్వామి: మొదటి సారి దీక్షను స్వీకరించిన వారు కత్తి స్వామి: వరుసగా రెండో సారి దీక్ష తీసుకున్న వారు గంటస్వామి: వరుసగా మూడో సారి దీక్ష స్వీకరించిన వారు గదస్వామి: వరుసగా నాలుగోసారి దీక్ష తీసుకున్న వారు పెరుస్వామి: వరుసగా ఐదో సారి దీక్షను స్వీకరించిన వారు గురుస్వామి: వరుసగా ఆరోసారి దీక్షను తీసుకున్నవారు. -
దీక్షతో అనంత పుణ్యఫలం
హరిహర సుతుడు అయ్యప్పస్వామి అవతారమే ఒక అద్భుతం. మనుషుల్లో స్వార్థాన్ని రూపు మాపేందుకు అరిషడ్వర్గాలైన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలను నిర్మూలించడమే అయ్యప్ప ఆరాధన లక్ష్యం. దీక్షను ఎంత నిష్టగా ఆచరిస్తే అంత పుణ్య ఫలం సిద్ధిస్తుంది. కార్తీక మాసం మొదలు కొని మకర జ్యోతికి వెళ్లే వారు డిసెంబర్ 3వ తేదీ వరకు దీక్ష స్వీకరించవచ్చు. – బాలస్వామి, పూజారి, భాస్కర్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయం దీక్షా కాలం మండలం రోజులు దేహమే దేవాలయంగా అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, అవిద్యలకు దూరంగా బ్రహ్మచర్యం, చన్నీటి స్నానం, దీపారాధనలు, అయ్యప్ప శరణుఘోష, సాత్వికాహారంతో దీక్షను పాటించాలి. ఈ సమయంలో పాటించే నియమాలను దీక్షానంతరం కూడా పాటిస్తే ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది – సత్యనారాయణ, గురుస్వామి, 21వ పడి అయ్యప్ప స్వామి దీక్ష మండల కాలం జీవన విధానంలో ప్రత్యేకంగా ఉంటుందని చాలా మంది గురు స్వాములు చెప్పారు. దీంతో ఐటీఐ చదువుతున్న నేను మొదటి సారి దీక్ష స్వీకరించాను. చాలా ప్రత్యేకంగా జీవన విధానం మారింది. నియమ నిష్టలతో నిత్యం అయ్యప్పను సేవిస్తూ దీక్షను కొనసాగిస్తున్నాను. ఉదయం, సాయంత్రం ఆలయానికి వెళ్లటం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతోంది. – ఈశ్వర్, కన్నెస్వామి -
వజ్రాల్లేవ్...రావొద్దు!
నంద్యాల జిల్లా: మహానంది, శిరివెళ్ల మండలాల సరిహద్దులోని గాజులపల్లె సమీపంలో ఉన్న వజ్రాలవంకలో వజ్రాన్వేషణ కోసం జనం పోటెత్తుతున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలివస్తున్నారు. వజ్రాలు దొరకకపోయినా వజ్రాలు దొరుకుతున్నాయి.. రూ. లక్షల విలువైనవంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడంతో వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వజ్రాలు దొరకడం దేవుడెరుగు...వజ్రాన్వేషణ మాటున అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో అప్రమత్తమయ్యారు. వజ్రాల కోసం అంటూ కొందరు అక్రమ కార్యకలాపాలకు పాల్ప డం గుర్తించినట్లు తెలిసింది. వంక వెంట కంపచెట్లు, పొదలు ఉండటం కొందరికి కలిసొస్తుంది. దీంతో పలు ప్రాంతాలకు చెందిన వారు పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని ప్రేమ జంటలు సైతం అక్కడికి చేరుకుంటున్నట్లు సమాచారం. వజ్రాల వంక దగ్గర జరుగుతున్న వ్యవహారాలపై ఇంటలిజెన్స్ విభాగం, ఎస్బీ పోలీసుల ద్వారా అన్ని వివరాలు సేకరించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వజ్రాల వంక వద్దకు ఎవరిని రానివ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం రంగంలోకి దిగి ఎలాంటి వజ్రాలు దొరకడం లేదని, రంగురాళ్లు, సూదిముక్కు రాళ్ల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ హితవు చెబుతూ అక్కడి నుంచి పంపించేస్తున్నారు. -
రూ.1.54 లక్షలు రావాల్సి ఉంది
నేను నాలుగు ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టా. సెప్టెంబరు 8న కర్నూలు మార్కెట్కు ఉల్లిని తీసుకెళ్తే ఒక లాట్ క్వింటాలు ధర రూ,359, మరో లాట్ క్వింటాలుకు రూ.409 ధరతో వ్యాపారులు కొన్నారు. మద్దతు ధర రూ.1200 ఉండగా.. వ్యాపారులు కొన్న ధరను మినహాయించి బ్యాలెన్స్ అమౌంటు నేరుగా బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని అధికారులు చెప్పారు. మాకు మద్దతు కింద రూ.1.54 లక్షల వరకు రావాల్సి ఉంది. రెండు నెలలు గడచినప్పటికీ బ్యాలెన్స్ మొత్తం బ్యాంకు ఖాతా జమ కాలేదు. – చిన్నమద్దిలేటి, ఈర్లదిన్నె, సి.బెళగల్ మండలం -
మంత్రాలయం..భక్తజనసంద్రం
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంత్రాలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. కల్పతరు క్యూలైన్ దగ్గర భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీ మఠం మధ్వ కారిడార్ వేలాదిమంది భక్తులతో కిక్కిరిసి కనిపించింది. నేటి నుంచి ఎస్ఏ–1 పరీక్షలు కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో ఎస్ఏ–1 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు 6,7 తరగతులకు పరీక్షలు జరగనున్నాయి. 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఎస్సీఈఆర్టీ జిల్లా సాధారణ పరీక్షల విభాగానికి పంపించారు. అక్కడి నుంచి హైస్కూల్ విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఎంఈఓ ఆఫీస్కు పంపుతారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్ల విద్యార్థులకు ఆయా క్లస్టర్ స్కూళ్ల నుంచి ప్రశ్నపత్రాలను తీసుకపోవాల్సి ఉంటుంది. ఈజీ మనీ కోసం ఆశపడొద్దు ● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఈజీ మనీ కోసం ఆశపడితే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్లో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. రూ. లక్ష పెడితే రూ. కోట్లు వస్తాయంటే కచ్చితంగా మోసమే అని తెలిపారు. ఎపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయవద్దని, అలాగే అపరిచిత లింక్స్ క్లిక్ చేయవద్దని పేర్కొన్నారు. నేడు డయల్ యువర్ ‘సీఎండీ’ కర్నూలు (టౌన్): విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఈనెల 10 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ ఎపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 సెల్ నంబర్ను ఫోన్ చేసి విద్యుత్ సమస్యలు తెలియజేయాలని తెలిపారు. అలాగే వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు, 1800425 155333కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. వాట్సప్ నంబర్ 9133331912కు చాట్ చేసి విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. -
రెండు నెలలైనా డబ్బు జమ కాలేదు
ఆరు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో 4.50 ఎకరాల్లోని ఉల్లి పంటను దున్నేశాం. మిగిలిన ఎకరన్నర భూమిలో పండిన 72 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను గత సెప్టెంబర్ 8న కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకెళ్లాం. వ్యాపారులు క్వింటా రూ.198 ప్రకారం కొన్నారు. మద్దతు ధర రూ.1,200 కాగా.. వ్యత్యాసం రూ.1,002 ప్రకారం రూ.72,144 బ్యాంకు ఖాతాకు 10 రోజుల్లో విడుదలవుతాయని చెప్పారు. ఇప్పటికి రెండు నెలలవుతున్నా ఆ ఊసే లేదు. రైతులను మోసం చేయడం సరికాదు. – బి.రామలింగడు, లింగందిన్నె, గోనెగండ్ల మండలం -
కూటమి పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయం
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిఆలూరు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచి పేదలకు అన్యాయం చేస్తోందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు కష్టాలతో జీవనం సాగించేలా పాలన సాగుతోందని ఆరోపించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా, తన అనుచరులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వ వైద్యకళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ సీఎం చంద్రబాబు పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12న ఆలూరులో నిర్వహించే ర్యాలీకి సంబంధించి వాల్పోస్టర్లును ఆదివారం ఆలూరులోని ఆర్అండ్బీ అతిథిగృహ ఆవరణలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య అందేలా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు సాధించి, అందులో ఐదు పూర్తి చేశారన్నారు. మిగిలిన వాటిని పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణకు పూనుకోవడం దుర్మార్గం అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేసినా ప్రభుత్వంలో కనీసం స్పందనలేదన్నారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసి, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు తాము, తమ పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గిరి, బీసీసెల్ కార్యదర్శులు శ్రీనివాసులు, భాస్కర్, వీరేషప్ప, ఈరన్న, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఎంపీపీలు దేవరాజ్, బాషా, బోయ ఎల్లమ్మ, మోతి ఎల్లమ్మ, నాగమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కిశోర్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం
● 12న కర్నూలులో ప్రజా ఉద్యమ ర్యాలీ ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు (టౌన్): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న కర్నూలు నగరంలో నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్లను ఆదివారం సాయంత్రం గిప్సన్ కాలనీలో అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయకూడదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. కర్నూలులో నగరంలో పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపడతున్నట్లు చెప్పారు. ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ప్రజలు, మహిళలు, విద్యార్థినీ, విధ్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో తమకు అనుకూలమైన టీడీపీ నాయకులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నారు. ప్రజాభీష్టం మేరకు పాలకులు పనిచేయాలని, అందుకు విరుద్ధంగా చేస్తే ప్రజలు సహించబోరన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి, కార్పొరేటర్ వి. అరుణ, నాయకులు షరీఫ్, కిషన్, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, కంటూ, రామాంజనేయులు , లాజరస్ తదితరులు పాల్గొన్నారు. -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
కర్నూలు (టౌన్): బీటెక్ విద్యార్థి కుమ్మరి భరత్ కుమార్ (20) ఉరివేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కల్లూరు విఠల్ నగర్కు చెందిన ఈ విద్యార్థి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఐదో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. తండ్రి కుమ్మరి శ్రీరాములు మెడికల్ ఏజెన్సీకి, తల్లి మాధవి పనిమీద ఆదివారం బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమ్మరి భరత్ బెడ్రూమ్లో ఉన్న సిలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకున్నాడు. ఇంటికి వచ్చి తల్లి ఉరి వేసుకున్న కుమారుడిని చూసి బోరున విలపిస్తూ భర్త శ్రీరాములుకు ఫోన్ ద్వారా తెలియజేసింది. వెంటనే ఇంటికి వచ్చిన తండ్రి కుమారుడిని ఉరి నుంచి తప్పించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. తమ కుమారుడు చనిపోవడానికి ఎవరూ కారణం కాదని తల్లిదండ్రులు తెలిపారు. -
సమస్యలపై ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తాం
● ఎల్పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చంద్రబోస్కర్నూలు(అర్బన్): సమస్యలపై ప్రజల గొంతుకగా న్యాయవాదుల ప్రజాకూటమి ప్రశ్నిస్తుందని ఎల్పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. న్యాయవాదుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. నూతనంగా లాయర్స్, పబ్లిక్ ఫ్రంట్(ఎల్పీఎఫ్) న్యాయవాదుల ప్రజా కూటమి ఆవిర్భవించింది. ప్రతిష్టాత్మకంగా వెలసిన న్యాయవాదుల ఎల్పీఎఫ్కి రాష్ట్ర కన్వీనర్గా మద్దూరు సుభాష్ చంద్రబోస్ ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యులు కూడా నియమితులయ్యారు. ఆదివారం కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మిదేవి, దేవపాల్, సుబ్బయ్య, ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాదులు రవీందర్చౌదరిలతో పాటు పెద్ద ఎత్తున న్యాయవాదులు హాజరై ఏకగ్రీవంగా లాయర్స్, పబ్లిక్ ఫ్రంట్కు శ్రీకారం చుట్టారు. చట్టాలపై అవగాహన కల్పిస్తాం సామాన్య ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించే కార్యాక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతామని ఎల్పీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీఎఫ్ పని చేస్తుందని, ఎవ్వరికి అన్యాయం జరిగినా పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. మాజీ మంత్రి మారెప్ప మట్లాడుతూ.. ప్రజా ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వారు ప్రజాసమస్యలు పట్టించుకోకుండా రూ.కోట్లు కూడబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న లోపాలను సవరించేందుకు ఎల్పీఎఫ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మిదేవి, పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. న్యాయవాదుల ప్రజా కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. న్యాయవాదులు గాలిరాజు, గౌతంశేఖర్, ఉపేంద్ర, సువర్ణకుమారి, సుమలత, జ్యోతి లావణ్య, శ్రావణ్కుమార్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. లాయర్స్, పబ్లిక్ ఫ్రంట్ కమిటీలో సభ్యులు.. ఎల్పీఎఫ్ రాష్ట్ర కో–కన్వీనర్గా ముప్పసాని గాలిరాజు, కర్నూలు జిల్లా కన్వీనర్గా గౌతంశేఖర్, కో–కన్వీనర్లుగా న్యాయవాదులు కె.సుమతల, డి.లావణ్య, జీఎన్జ్యోతి, వై.ఉపేంద్ర, ఎం.శ్రావణ్కుమార్, మహేంద్రరెడ్డి, వినోద్కుమార్ ఎన్నికయ్యారు. -
ఆనందం.. ఆధ్యాత్మికం
● కుల సంఘాల ఆధ్వర్యంలో వన భోజనాలు ● ఆటపాటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు గంగపుత్రుల వన భోజన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న ఎస్వీ మోహన్రెడ్డి కాటసాని రాంభూపాల్రెడ్డిని సన్మానించిన దృశ్యం కర్నూలు కల్చరల్: కార్తీక వన భోజన కార్యక్రమాలు ఆదివారం ఆనందంగా, ఆధ్యాత్మికంగా సాగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పలు కుల సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వనసమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. తులసి చెట్టు, ఉసిరి చెట్టుకు పూజలు, గోమాత పూజలను భక్తి శ్రద్ధలతో చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, మహిళలకు ఆటల పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కళాకారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. కుల ప్రముఖుల సందేశాలిచ్చారు. ఆయా రంగాల్లో ప్రతిభావంతులకు అభినందనలు తెలుపుతూ సత్కారాలు చేశారు. ● కర్నూలు రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్లో రెడ్ల కార్తీక మాస వన భోజన మహోత్సవం జరిగింది. వేలాది మంది కుల సంఘీయులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు పుల్లకుర్తి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. దాతల సహకారంతో రెండు వృద్ధాశ్రమాలు, పేద రెడ్డి విద్యార్థులకు విద్యానిధి ద్వారా విద్యాభ్యాసానికి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడారు. సిని కళాకారుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తన మిమిక్రీతో సందడి చేశారు. సంఘం అధ్యక్షులు ప్రభాకర రెడ్డి, ఉపాధ్యక్షులు దొనపాటి ఎల్లారెడ్డి, దామోదర్ రెడ్డి, విక్రమ్ సింహారెడ్డి, లోకేశ్వర్రెడ్డి, జి.పుల్లారెడ్డి ట్రస్ట్ సభ్యులు రాఘవ రెడ్డి, ఏకాంబర్ రెడ్డి, సుబ్బారెడ్డి, కేజే రెడ్డి కేవీ సుబ్బారెడ్డి, సరేష్ రెడ్డి, హనుమంత రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీఆర్ ఇంజినీర్ నూతన కార్యవర్గం ఎన్నిక
● అధ్యక్షులుగా నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సతీష్ కుమార్ కర్నూలు (అర్బన్): ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్కు నూతన కార్యవర్గాన్ని ఎనుకున్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగంణంలోని విశ్వేశ్వరయ్య భవనంలో అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురళి కృష్ణనాయుడు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులుగా పాణ్యం పీఆర్ఐ డీఈఈ ఇ. నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కర్నూలు పీఐయూ ఎఈఈ ఆర్. సతీష్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎమ్మిగనూరు పీఆర్ఐ డీఈఈ ఎస్. చంద్రశేఖర్, కోశాధికారిగా ఆదోని పీఆర్ఐ ఏఈఈ ఎం. మహదేవప్ప, అర్గనైజింగ్ సెక్రటరీగా కర్నూలు పీఆర్ఐ ఏఈఈ జ్యోత్స్నను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, పీఆర్ ఎస్ఈ వేణుగోపాల్, ఈఈ మహేశ్వరెడ్డితో పాటు జిల్లాలోని డివిజన్లు, సబ్ డివిజన్లకు చెందిన డీఈఈ, ఏఈఈలు పాల్గొన్నారు. -
కమనీయం.. స్వర్ణరథోత్సవం
శ్రీశైలంటెంపుల్: ఆరుద్రనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీశైల మహాక్షేత్రంలో వెలిసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు.వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకస్వాములు జరిపించారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. స్వర్ణరథోత్సవంలో శ్రీశైల దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఏఈవో, అర్చకస్వాములు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
స్విమ్మింగ్ పోటీలో స్టాఫ్ నర్సు ప్రతిభ
కర్నూలు(హాస్పిటల్): విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టాఫ్నర్సుగా పనిచేస్తున్న డి. మంజులాదేవి ప్రతిభ చూపారు. విజయవాడలోని సర్ విజ్జి మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ ఫూల్లో ఆరవ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఇందులో మంజులదేవికి వంద మీటర్ల ఫ్రీ స్టైల్, బ్రెస్ట్ స్ట్రోక్లలో రెండు గోల్డ్మెడల్లు, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీ స్టైల్లలో రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు. రేపు పలు ప్రాజెక్టులకు వర్చువల్గా సీఎం శంకుస్థాపన కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారని, తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఏపీఐఐసీ, ఎయిర్పోర్టు, టూరిజం ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారన్నారు. ఆయా ప్రాజెక్టుల వద్ద లబ్ధిదారుడు, స్టేక్ హోల్డర్తో మాట్లాడుతారని తెలిపారు. అందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్లో జేసీ నూరుల్ ఖమర్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన జాతీయ కవిసమ్మేళనం
నంద్యాల(వ్యవసాయం): సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని శ్రీశైల హైస్కూల్ సెమినార్ హాల్లో నిర్వహించిన జాతీయ కవిసమ్మేళనం సాహితీవేత్తలు, ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఉషోదయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి, మేనేజింగ్ డైరెక్టర్ డా.యు.వి రత్నం నేతృత్వంలో కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డా.గెలివి సహదేవుడు, రచయిత డాక్టర్ కిశోర్ కుమార్, బేతంచర్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియాదాసు, కవులు నీలకంఠమాచారి, అన్నెం శ్రీనివాసరెడ్డి, మురళీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. కవిత్వమనేది కవి గుండెల్లో నుంచి ఉప్పొంగి అక్షర రూపం దాల్చి సమాజానికి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. ‘పసిడి నవ్వులు వెన్నెల దివ్వెలు’ అనే అంశంపై అనేక మంది కవులు వివిధ జిల్లాల నుంచి పాల్గొని తమ కవితలను చదివి వినిపించారు. సంస్థ నిర్వాహకులు కవుల సాహిత్య సేవకు గుర్తింపుగా జానపద మంజరి సేవా పురస్కారాలు, బాల చైతన్య సేవా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కవులు వెంకటేశ్వర్లు, నరేంద్ర, మహమ్మద్ రఫి, శేషఫణి, మాబుబాష, కేశవమూర్తి పాల్గొన్నారు. -
పేదలందరికీ ఉచిత న్యాయ సహాయం
● శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్కర్నూలు(సెంట్రల్): సమాజంలో ఆర్థింగా వెనుకబడిన ప్రతి ఒక్కరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ తెలిపారు. ఆదివారం జిల్లా కోర్టులోని న్యాయ సదన్లో జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..1987లో రూపొందించిన లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ను 1995 నవంబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఏ ప్రకారం ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్కౌన్సిల్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద మాట్లాడుతూ..మహిళా శిశు సంక్షేమ శాఖ, లీగల్ సర్వీసెస్ సంయుక్తంగా మహిళలు, పిల్లలకు, ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కర్నూలు మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ అనురాధ, ప్యానెల్ లాయర్లు, న్యాయ విద్యార్థులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ మరింత బలోపేతానికి కృషి
ఎమ్మిగనూరుటౌన్: కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్తగా తనను నియమించినందున బాధ్యత పెరిగిందని, వైఎస్సార్సీపీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని మాజీ ఎంపీ బుట్టారేణుక పేర్కొన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఎమ్మిగనూరులో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తనపై జగనన్నకు మంచి నమ్మకం ఉందని, పార్టీలో ఉన్న వారంతా కుటుంబసభ్యులమేనన్నారు. కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్తగా నియమించినందున జిల్లా కేంద్రంలో ఒక కార్యాలయం ఉంటుందని, అదేవిధంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మిగనూరులో ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని అలానే కొనసాగించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో బుట్టాఫౌండేషన్ అధినేత బుట్టాశివనీలకంఠ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో మాట్లాడి.. కూరగాయలు పరిశీలించి!
● మద్దికెరలో కలియతిరిగిన ట్రైనీ కలెక్టర్లుమద్దికెర: మండలకేంద్రమైన మద్దికెరకు ఆదివారం ట్రైనీ ఐఏఎస్ కలెక్టర్లు అంకిత్ రాజుపుత్, మోహిత్ మంగల్, భరత్ దత్ తివారి, తన్మయి మెగ్వాల్, అమర్ బాగిల్, అతుల్సోని వచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా విద్యాలయానికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం ప్రధాన కూడలిలో ఉన్న కూరగాయల మార్కెట్ను పరిశీలించి ధరల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి, గ్రామంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి.. తదితర వివరాలు తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీపీ అనిత, సర్పంచ్ సుహాసిని, తహసీల్దార్ గుండాలనాయక్, ఎంపీడీఓ కొండయ్య, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ మయాంక్, ఎంఈఓ రంగస్వామి, ఏఓ రవి, ఏపీఓ నర్సిరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ త్రివేణి ఉన్నారు. -
కొత్తూరులో సినిమా డైరెక్టర్ సురేందర్రెడ్డి
పాణ్యం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సినీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పూజలు చేశారు. అతనొక్కడే, అశోక్, అతిథి, కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, ధ్రువ, సైరా వంటి చిత్రాలకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. పలువురు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు. పాల కోసం వస్తూ.. మహానంది: జీవనోపాధి నిమిత్తం వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఝార్ఖండ్ రాష్ట్రంలోని అఫదిమడూరి గ్రామానికి చెందిన పవన్(26) గాజులపల్లె రైల్వేస్టేషన్ వద్ద ఉన్న నవగ్రహాల ఆలయంలో పనిచేస్తున్నాడు. ఆలయానికి దగ్గరలోని ఎంసీఫారం వద్ద ఆదివారం ఉదయం పాలు తెచ్చేందుకు బైక్పై వెళ్తుండగా బుక్కాపురం గ్రామానికి చెందిన షేక్ జమాల్ బాషా బొలొరో ఢీకొంది. ఈ ఘటనలో పవన్ తీవ్రంగా గాయపడటంతో కోలుకోలేక మృతి చెందాడు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ అదృశ్యం కోడుమూరు రూరల్: కొత్తూరు గ్రామానికి చెందిన 33 సంవత్సరాల వితంతువు మల్లెపూలు లక్ష్మి కన్పించకుండా పోయినట్లు ఆమె తల్లి బైరిపోగు తిరుపాలమ్మ కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. మల్లెపూలు లక్ష్మీ అనే మహిళకు 11 ఏళ్ల కిందట భర్త చనిపోవడంతో కొత్తూరు గ్రామాన్ని వదిలి పుట్టినిల్లైన గూడూరు మండలం మునుగాల గ్రామానికి వెళ్లిపోయింది. అయితే ఆరు నెలల కిందట లక్ష్మి తిరిగి కొత్తూరు చేరుకుని అక్కడే కుమారిడితో పాటు నివాసముంటోంది. ఈ నేపథ్యంలో గత శనివారం కోడుమూరుకు సంతకు వచ్చిన లక్ష్మి తిరిగి ఇంటికి పోలేదు. అయితే కోడుమూరులోని కొత్తబస్టాండ్ పిండి గిర్ని వద్ద నుంచి ఆడబిడ్డ భర్తకు ఫోన్చేసి తనను ఇద్దరు వ్యక్తులు వెంటాడుతున్నారని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. విషయం తెలుసుకున్న లక్ష్మి తల్లి బైరిపోగు తిరుపాలమ్మ తన కుమార్తె కన్పించకుండా పోయిన విషయాన్ని ఆదివారం కోడుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూడో అంతస్తు పై నుంచి పడి యువకుడు మృతి కర్నూలు: నగర శివారు నంద్యాల చెక్పోస్ట్ కేంద్రీయ విద్యాలయంకు ఎదురుగా ఉన్న ధనలక్ష్మి నగర్లో ఇంటి నిర్మాణం పనులు చేస్తూ కె.కిరణ్ (24) ప్రమాదవశాత్త్తూ కింద పడి మృతి చెందాడు. కర్నూలు మండలం పడిదంపాడు గ్రామానికి చెందిన బక్కన్నకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. బక్కన్న.. ధనలక్ష్మి నగర్లో శ్రీనివాసులు ఇంటి నిర్మాణం వద్ద వాచ్ మెన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్వగ్రామానికి వెళ్లా డు. ఇంటి నిర్మాణానికి సంబంధించి క్యూరింగ్ కోసం నీళ్లు కొట్టేందుకు కుమారుడు కిరణ్కు చెప్పి ఊరికి వెళ్లాడు. మూడో అంతస్తులో నీళ్లు కొడుతుండగా పైపు కాలికి తగులుకొని అదుపు తప్పి పై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి బక్కన్న ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. -
చ..చ..చలి!
● పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. నవంబరు మొదటి పక్షంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగైదు రోజులుగా రాత్రి 8 గంటల నుంచే చలి ప్రభావం మొదలై తెల్లవారుజాముకు తీవ్రత పెరుగుతోంది. పొగమంచు కూడా జిల్లాను ఆవరిస్తోంది. ఈ సారి చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టు నుంచి వరుసగా అధిక వర్షాలు కురుస్తుండటంతో జలాశయాలు, వాగులు, వంకలు, కాలువలు నీటితో నిండి ఉన్నాయి. గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఈ ప్రభావంతో పగటిపూట ఎండతో పొడి వాతావరణం ఉంటున్నప్పటికీ రాత్రి చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 21 డిగ్రీల వరకు ఉంటున్నా..పలు ప్రాంతాల్లో 18 నుంచి 19 డిగ్రీల వరకు పడిపోయాయి. వెల్దుర్తి, కోసిగి, మంత్రాలయం, బండిత్మకూరు, అవుకు, వెలుగోడు తదితర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల వరకే నమోదు అవుతున్నాయి. ఈ సారి రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలోపునకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ద్రోణి కారణంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. పగలు ఎండ, రాత్రి చలి. మరోవైపు వానలు కూడా కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వాతావరణంలో వచ్చిన మార్పులతో కర్నూలు, నంద్యాల జిల్లాలో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. అలర్జీ, అస్తమా, డెంగీ, విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. -
బాల్యానికి మూడు 'ముల్లు'
కర్నూలు(హాస్పిటల్): పేదరికం, నిరక్షరాస్యత, బాలికల ఎదుగుదలపై ఆందోళన, అభద్రతాభావం వంటి కారణాలతో కర్నూలు జిల్లాలో బాల్యవివాహాలు అధికమవుతున్నాయి. ఇందులో అధికారులు కొన్ని మాత్రమే అడ్డుకుంటుండగా అధిక శాతం గుట్టుచప్పుడు కాకుండా, ఆధార్కార్డులో వయస్సు మార్చి వివాహ తంతు జరిపించేస్తున్నారు. వీటిలో అధికశాతం గ్రామ పెద్దల సహకారంతోనే జరుగుతున్నా అడిగే నాథుడు కరువయ్యారు. బిడ్డకు మూడుముళ్లు పడితే భారం తగ్గిపోతుందన్న భావనతో గ్రామాల్లో కూతురు పుష్పవతి అయితే చాలు ఏ అయ్యకు కట్టబెడదామా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఈ కారణంగా బాలికల చదువు మధ్యలోనే ఆగిపోతూ వారి భవిష్యత్ నాశనమవుతోంది. మరోవైపు చిన్నవయస్సులో గర్భవతి కావడంతో ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 4,754 మంది బాలికలు తల్లులు జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 38,779 మంది గర్భం దాల్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అందులో 19 ఏళ్లలోపు బాలికలు 4,754 మంది ఉన్నారు. వీరిలో కర్నూలు డివిజన్లో 10.27శాతం, ఆదోని డివిజన్లో 12.75శాతం, పత్తికొండ డివిజన్లో అధికంగా 15.04శాతం మంది గర్భం దాల్చారు. జిల్లాలో 10 నెలల కాలంలో జరిగిన మొత్తం వివాహాల్లో 16 ఏళ్లకు 814 (21.5శాతం), 17 ఏళ్లకు 888(23.6శాతం), 18 ఏళ్లకు 1,237(32.8శాతం), 19 ఏళ్లకు 595(15.8శాతం) వివాహం చేసుకున్నారు. 19 ఏళ్లకు పైగా కేవలం 236 మంది అమ్మాయిలు మాత్రమే వివాహం చేసుకున్నారు. అది కూడా కర్నూలు నగరంలాంటి చోట్ల మాత్రమే వివాహ వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తున్నారు. గ్రామాల్లో వివాహ వయస్సు చూపించేందుకు అధిక శాతం ఆధార్కార్డులో 63.4 శాతం మంది వయస్సును తప్పుగా నమోదు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చదువుకూ అమ్మాయి దూరం ఆదోని, పత్తికొండ డివిజన్లలో ఆడపిల్లలు ఎక్కువగా చదువుకునేందుకు ఇష్టపడటం లేదు. అమ్మాయిని చదువుకోసం దూరంగా పంపించేందుకు భయపడటం, అభద్రతభావం, సామాజిక పరిస్థితులతో మధ్యలోనే చదువు మాన్పించేస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేక 1,614(44.4శాతం) మంది, ఆర్థిక కారణాలతో 1,473(36.6శాతం) మంది, మిగిలిన వారు కుటుంబసమస్యలతో ఏడుగురు, సామాజిక రుగ్మతలతో 105 మంది, తల్లిదండ్రుల ఒత్తిడితో 388 మంది, మరికొందరు ప్రేమవివాహాల కారణంగా బా లికలు మధ్యలోనే చదువు మానేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా జరిగిన వివాహాల్లో అధికంగా 89.1శాతం పెద్దలు కుదుర్చిన వివాహాలు కాగా దాని తర్వాతి స్థానంలో 8.4శాతం మంది తమకు నిచ్చిన వారిని ప్రేమవివాహాలు చేసుకున్నారు. కమిటీలు ఉన్నా చర్యలు నామమాత్రమే! జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీని అరికట్టేందుకు జిల్లా స్థాయి, డివిజన్ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. జిల్లా›స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్/చైర్పర్సన్ కాగా, కన్వినర్గా జిల్లా ఎస్పీ, డీఎంహెచ్ఓ, సభ్యులుగా గైనకాలజీ హెచ్ఓడీ, ఐసీడీఎస్ అధికారి, డీఈఓ, ఆర్ఐఓ, డివిజన్ స్థాయిలో చైర్మన్/చైర్పర్సన్గా ఆర్డీఓ, కన్వినర్గా డిప్యూటీ డీఎంహెచ్ఓ, సభ్యులుగా స్థానిక డీఎస్పీ ఉంటారు. ఈ కమిటిలు బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పాఠశాలలకు కౌమారదశ బాలికలకు పునరుత్పత్తి ఆరోగ్యం, న్యాయపరమైన హక్కులు, లైఫ్ స్కిల్స్ గురించి వివరించారు. బాల్యవివాహాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. కౌమార దశ బాలికలకు వచ్చే సమస్యలపై ఆరోగ్యశిబిరాలు నిర్వహించాలి. కానీ అధికారులు మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నా చర్యలు కరువయ్యాయి. ఆదోని, పత్తికొండ డివిజన్లలో అధికంగర్భం దాల్చే వారిలో నిరక్షరాస్యులైన బాలికలే అధికంగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 10 నెలల్లో నమోదైన గర్భిణుల్లో ఐదవ తరగతి వరకు చదివిన వారు 23.5శాతం, పది ఫెయిలైన వారు 18.8శాతం, 6 లేదా 7వ తరగతి చదివిన వారు 14.7శాతం, 8 లేదా 9వ తరగతి చదివిన వారు 13.8శాతం మంది ఉన్నారు. ఆదోని, పత్తికొండ డివిజన్లలో అధికంగా అక్షరాస్యత తక్కువగా ఉంటోంది. దీనికి తోడు పేదరికం, వర్షపాతం తక్కువగా ఉండటం, ఫలితంగా పంటలు సరిగ్గా పండకపోవడం, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం, అమ్మాయిల భద్రత గురించి ఆందోళన, సామాజికపరమైన అంశాలు వంటి కారణాలతో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్నాయి. పుష్పవతి అయిన బాలికలను ఒకరికిచ్చి పెళ్లి జరిపిస్తే తమ బాధ్యత తీరిపోతుందని నమ్మే వారు అధికంగా ఉన్నారు. చెడు వ్యసనాల కారణంగా భార్య లేదా భర్త మరణించడంతో ఒంటరివారైన పిల్లల వివాహాలు కూడా త్వరగా జరిపించేస్తున్నారు. ఇందులో అమ్మాయిల అవ్వాతాతలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ... ఆదోని పట్టణంలోని పట్టణంలోని ఇందిరానగర్లో బాల్య వివాహాన్ని టూటౌన్ పోలీసులు అడ్డగించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్యవివాహాలతో జరిగే నష్టాలను వివరించారు. కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఏం చేయాలి..అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండే వరకు ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయరాదు. బాల్య వివాహాలు చేసే వారి గురించి చైల్డ్ హెల్ప్లైన్ 1098, పోలీసు హెల్ప్లైన్ 100, ఉమెన్ హెల్ప్లైన్ 181 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం చిన్న వయస్సులో గర్భం దాలిస్తే బాలికకు రక్తహీనత ఏర్పడటం, కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, అబార్షన్లు జరుగుతాయి. అమ్మాయికి పెల్విన్బోరాన్ వృద్ధి చెందక ముందే వివాహం చేయడం వల్ల వారికి ప్రసవం కష్టమై సిజేరియన్ చేయాల్సి వస్తుంది. బీపీ, ఫిట్స్, నెలలు నిండకముందే బిడ్డ జన్మించడం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు అవిటితనం ఉన్న పిల్లలు జన్మించే అవకాశం ఉంది. –డాక్టర్ ఎస్.సావిత్రి, గైనకాలజీ హెచ్వోడీ, కర్నూలు పెద్దాసుపత్రి అనారోగ్య సమస్యలు బాల్య వివాహాలతో చాలా మంది కౌమార దశ పూర్తి గాకుండానే గర్భం దాలుస్తున్నారు. ఈ కారణంగా వారికి నెలలు నిండకుండా శిశువు జన్మించడం, సరైన సమయంలో జన్మించినా బరువు తక్కువగా ఉండటం జరుగుతుంది. ఇలాంటి పిల్లలకు బుద్ధిమాంద్యం, చురుకుగా లేకపోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. తల్లులకు ప్రసవం తర్వాత తల్లిపాలు సరిగ్గా పడవు. దీంతో శిశువులు పలుమార్లు ఇన్ఫెక్షన్లకు గురై అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. – డాక్టర్ అమరనాథరెడ్డి, చిన్నపిల్లల వైద్యుడు, కర్నూలుటీనేజీ ప్రెగ్నెన్సీపై అవగాహన కార్యక్రమాలు జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా ఐసీడీఎస్ శాఖతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే స్థానిక పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బందితో కలిసి వెళ్లి పెళ్లి జరగకుండా చూస్తున్నాం. అప్పటికే వివాహం జరిగి ఉంటే ఆమె టీనేజీలో గర్భం దాల్చకుండా ఆరోగ్య సిబ్బందిచే అవగాహన కల్పిస్తున్నాం. టీనేజీలో గర్భం దాల్చడం వల్ల వచ్చే దుష్పరిణాల గురించి బాలికలకు, వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. –డాక్టర్ ఎల్.భాస్కర్, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ -
అక్కసుతోనే వైద్య కళాశాలల ప్రయివేటీకరణ
కర్నూలు టౌన్: ‘‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళశాలలను తీసుకొచ్చింది. ఇప్పటికే ఐదు వైద్య కళాశాలల్లో విద్యాభ్యాసం కొనసాగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తి కళాశాలలను పూర్తి చేస్తే ఎక్కడ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందోనని చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం దిగివచ్చే వరకు ప్రజల తరపున పోరాటం చేస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరిట ప్రయివేటీకరించాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలనే డిమాండ్తో ఈనెల 12న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. కేవలం ప్రభుత్వ సొమ్మును దోచుకునేందుకే చంద్రబాబు నాయుడు, లోకేష్లు పీపీపీ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణను అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రభుత్వంలో చలనం రాకపోతే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. ఆరోగ్యశ్రీ పేరు చెప్పగానే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి గుర్తుకు వస్తారన్నారు. అయితే చంద్రబాబునాయుడు రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో ప్రయివేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందించలేని స్థితిలో ఉన్నాయన్నారు. వైఎస్ఆర్ పేరును చెరిపేసేందుకే ఇన్సూరెన్స్ స్కీను తెరపైకి తెచ్చారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయమనోహరి, వైఎస్సార్సీపీ కర్నూలు అబ్జర్వర్ కర్రా హర్షవర్థన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, కల్లా నాగవేణి రెడ్డి, కార్పొరేటర్ ఆర్షియా ఫర్హీన్, లాజరస్, కల్లా నరసింహారెడ్డి, ఫిరోజ్, కంటూ పాల్గొన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతిపత్రాల అందజేత ప్రజా ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి -
తూతూమంత్రంగా భక్త కనకదాసు జయంతి
కర్నూలు(సెంట్రల్): కురువల ఆరాధ్య దైవం భక్త కనకదాసు జయంతోత్సవాన్ని కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. ఉత్సవాలకు స్థానికంగానే ఉన్న మంత్రి టీజీ భరత్ సహా కూటమి ప్రజప్రతినిధులంతా గైర్హాజరవడం పట్ల కురువ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో భక్త కనకదాసు జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరితోపాటు ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉంది. అయితే ఏ ఒక్కరూ హాజరు కాకపోవడం గమనార్హం. మంత్రి టీజీ భరత్ స్థానికంగానే ఉన్నా అటువైపు తొంగి చూడని పరిస్థితి. కురువ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు.. నారాలోకేష్ ప్రాపకం కోసం కల్యాణదుర్గంలో జరిగే రాష్ట్ర స్థాయి భక్త కనకదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. కురువ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కూడా కార్యక్రమంలో పాల్గొనకపోవడం పట్ల కురువ సంఘం నాయకులు మండిపడుతున్నారు. కార్యక్రమాన్ని జేసీ నూరుల్ ఖమర్ అధ్యక్షతన మొక్కుబడిగా ముగించారు. మనషులంతా ఒక్కటేనని చాటిన భక్త కనకదాసు భక్తకనకదాసు తన కీర్తనల ద్వారా భక్తితత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని బోధించి మనుషులంతా ఒక్కటేనిని చాటారని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన భక్త కనకదాసు జయంతోత్సవంలో ఆయన భక్త కనకదాసు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భక్త కనకదాసు తన కీర్తనల ద్వారా సామాజిక సమానత్వాన్ని బోధించి ప్రజలను చైతన్యం చేశారన్నారు. ఆ కాలంలో చిన్న కులాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించి మనషులంతా ఒక్కటేనని బోధించారన్నారు. ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రసూన, బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులెవరూ హాజరు కాకపోతే జిల్లాలోని కురువలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి. జిల్లా జనాభాలో అధిక భాగం కురువలు ఉన్నారు. వారి సమస్యల పరిష్కారంపై నాయకులు, అధికారులు చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. – కురువ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరక్టర్ భక్త కనకదాసు జయంతి వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నాం. అయితే కర్నూలులో ఆ సందడి లేకపోవడం, జిల్లాలోని ప్రజాప్రతినిధులెవరూ రాకపోవడ బాధాకరం. కలెక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఈ పరిణామం కురువలను అవమానించడమే. – రంగస్వామి, ప్రధాన కార్యదర్శి, కురువ సంఘం మంత్రి టీజీ భరత్ స్థానికంగా ఉన్నా హాజరుకాకపోవడంపై కురువల ఆగ్రహం -
సోమశిల నుంచి శ్రీశైలానికి టూరిజం లాంచ్
శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ ఏర్పాటుచేసిన లాంచ్ సోమశిల జలాశయం నుంచి కష్ణానదిపై శ్రీశైలానికి(120 కిలోమీటర్లు) శనివారం రాత్రి 7 గంటలకు చేరుకుంది. ఈ ఏడాదిలో టూరిజం శాఖ లాంచ్ ప్రయాణాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి. శనివారం ఉదయం సుమారు 11 గంటలకు సోమశిల నుంచి ప్రారంభమైన ఈ జల విహారయాత్రలో 66 మంది ప్రయాణికులు పాల్గొన్నట్లు టూరిజం అధికారులు తెలిపారు. ప్రయాణ సమయంలో లాంచ్లో ఉన్నవారికి టీ, స్నాక్స్, భోజన ఫలహారాది సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే వారికి శ్రీశైలం చేరిన తర్వాత వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని వెల్లడించారు అన్నారు. జల విహారయాత్రకయ్యే ఖర్చు సోమశిల నుంచి శ్రీశైలానికి కృష్ణానది మార్గంలో లాంచ్(వారంలో ఒక్కరోజు) ద్వారా ప్రయాణం చేయడానికి పెద్దలకు రాను పోను రూ.3వేల టికెట్ నిర్ణయించారు. అలాగే పిల్లలకు రూ.2400. ఒకవైపు ప్రయాణానికై తే పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రరూ.1600 వసూలు చేస్తున్నారు. శనివారం సాయంత్రం శ్రీశైలం చేరుకున్న తర్వాత వారికి వసతి, భోజన. ఫలహారాది సౌకర్యలు కల్పిస్తారు. స్వామి, అమ్మ వార్ల దర్శనానంతరం ఆదివారం ఉదయం తిరిగి 9 గంటలకు లాంచ్ ప్రయాణం ప్రారంభమై అదే రోజు సాయంత్రానికి సోమశిలకు చేరుకుంటుంది. -
ప్రైవేట్ రాయల్టీ చెక్ పోస్టులు ఎత్తేయాలి
బనగానపల్లె: రాయల్టీ వసూలును ప్రైవేట్కు అప్పగించడంతో పాటు ప్రైవేట్ చెక్పోస్టులు ఏర్పాటు చేయడంపై నాపరాతి పరిశ్రమ యజమానులు, కార్మికులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. రాయల్టీ వసూలులో పాత పద్ధతిని కొనసాగించి, ప్రైవేట్ చెక్పోస్టులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బనగానపల్లె మండలం పలుకూరు రాయల్టీ చెక్పోస్టు సమీపంలోని అడ్డరోడ్డు వద్ద వారు ఆందోళనకు దిగారు. నాపరాళ్ల లోడ్తో ఉన్న ట్రాక్టర్లను ఆపివేసి నిరసనకు దిగడంతో బనగానపల్లె–కర్నూలు రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇప్పటికే ప్రభుత్వ తీరుతో కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో రాయల్టీ పెంచి వసూలు బాధ్యతను ప్రైవేట్కు అప్పగించడం సరికాదంటూ చెక్పోస్టుషె డ్డ్, ఫర్నీచర్ను పక్కకు తోసేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి, నందివర్గం ఎస్ఐ వెంకట సుబ్బయ్య పోలీసు బందోబస్తుతో అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. -
ఎల్లెల్సీ కాలువలో పడి విద్యార్థి మృతి
ఆదోని రూరల్: ప్రమాదవశాత్తు ఎల్లెల్సీ కాలువలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన వరలక్ష్మి, రంగస్వామి దంపతులకు ఇద్దరు పిల్లలు. గౌరమ్మ వేడుకల సందర్భంగా వరలక్ష్మి రెండురోజుల క్రితం పుట్టినిల్లు అయిన ఆదోని మండలం బసాపురం గ్రామానికి పిల్లలతో కలిసి వచ్చారు. శుక్రవారం సాయంత్రం చిన్న కుమారుడు హరికృష్ణ (12) తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి సమీపంలోని ఎల్లెల్సీ కాలువ వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలువలో పడి నీట మునిగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రాత్రంతా గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం మధ్యాహ్నం హాన్వాల్ గ్రామం వద్ద మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ బాలుడు స్థానిక హాలహర్వి గ్రామంలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రమాద సంఘటనపై ఇస్వీ పోలీస్స్టేషన్ ఎస్ఐ మహేష్కుమార్ను వివరణ కోరగా బాలుడు గల్లంతైన విషయం తెలిసిందని, మృతదేహం లభ్యమైన విషయం తెలియదన్నారు. -
షుగర్ రోగుల్లో ఎముకల సమస్యలు
కర్నూలు(హాస్పిటల్): షుగర్ రోగుల్లో ఎముకల సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎండోక్రైనాలజి హెచ్ఓడీ డాక్టర్ పి.శ్రీనివాసులు చెప్పారు. శనివారం ఆయన తన చాంబర్లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రాధారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ అలీమ్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరల్డ్ డయాబెటీస్ డేను పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో ‘బోన్ హెల్త్ ఇన్ డయాబెటీస్’ అనే అంశంపై నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అంశంపై నిమ్స్ హాస్పిటల్ ఎండోక్రైనాలజి హెచ్ఓడీ డాక్టర్ ెట్రీస్ యాని హాజరై ప్రసంగిస్తారన్నారు. డయాబెటీస్ (షుగర్) వచ్చిన వారికి ఆస్టియో బ్లాస్ట్ కణాలు సరిగ్గా పనిచేయవని, దానివల్ల వారి ఎముకలు బలహీనంగా మారతాయన్నారు. ఎముకల్లో సాంద్రతను తెలుసుకునేందుకు ఆసుపత్రిలో డెక్సా స్కాన్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా ప్రతిరోజూ 6 నుంచి 8 మందికి స్కాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎముకలు బలహీనంగా ఉన్న వారికి ఏడాదికి ఒకసారి ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఆసుపత్రిలో చేర్చుకుని ఇంజెక్షన్ వేస్తామన్నారు. -
● మహిళా మృతి
బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు నందికొట్కూరు: ద్విచక్రవాహనానికి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందారు. నందికొట్కూరు పట్టణంలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలు వైపు వెళుతుంది. నందికొట్కూరులోని హజీనగర్లో నివసించే షేక్ ఆఫ్రీన్ (26) అనే మహిళ పోలీసు స్టేషన్కు సమీపంలోని పెట్రోల్ బంకులో పెట్రోల్ వేయించుకొని బైక్పై రోడ్డుమీదకు వస్తున్నారు. ఆత్మకూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆఫ్రీన్ను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో మెస్ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. విధులకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. తండ్రి షేక్ అబ్దుల్ ఆలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం
కొలిమిగుండ్ల: కల్వటాల సమీపంలోని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఉయ్యాలవాడ మండలం అల్లూ రు గ్రామానికి చెందిన నక్కా గురుప్రసాద్ (30) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో సిమెంట్ ఫ్యాక్టరీలో లారీలో సిమెంట్ బస్తాలు నింపాక పైకి ఎక్కి పట్టుకునే సమయంలో జారి కింద పడటంతో గాయపడ్డాడు. చికిత్స కోసం కొలిమిగుండ్ల పీహెచ్సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తాడిపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేక రించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆధునిక వైద్యపరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
గోస్పాడు: వైద్యులు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని యూరాలజీ వైద్యులు డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సదస్సు నంద్యాల పట్టణంలో శనివారం సాయంత్రం అటహాసంగా ప్రారంభమైంది. నంద్యాల,కర్నూలు జిల్లాల యూరాలజీ సంఘాల సంయుక్త నిర్వహణలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. తొలి రోజు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మూత్రపిండాలు, మూత్రశయ, మూత్రనాల, జననేంద్రియ జబ్బులకు అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ యూరాలజీ వైద్యులు డాక్టర్ విక్రమ సింహారెడ్డి, దక్షిణ భారత యూరాలజీ వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్ర మోహన్, ఉభయ తెలుగు రాష్ట్రాల యూరాలజీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జగదీశ్వర్, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ జై బాబు రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ దాసరి రమేష్, డాక్టర్ విక్రమసింహారెడ్డి, డాక్టర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయమైన సేవలే లక్ష్యం
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశం ఇదే ● ప్రజలకు చేరువవుతున్న న్యాయ సేవలు ● నేడు న్యాయ సేవల దినోత్సవం కర్నూలు(సెంట్రల్): చట్టం ముందు పౌరులంతా సమానమే. ఈ విషయాన్ని భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. పేదరికం, సామాజికంగా వెనుకబాటు ఇలా వివిధ కారణాలతో న్యాయం అందనివారికి ప్రభుత్వమే న్యాయ సహాయం అందించాలని, అందుకు తగిన చట్టాలు, పథకాలు ప్రవేశపెట్టాలని ఆర్టికల్ 39ఏ నిర్దేశిస్తోంది. ఈ లక్ష్యంలో భాగంగానే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆవిర్భవించింది. 1985లో రూపొందించబడిన జాతీయ న్యాయ సేవా అధికారుల చట్టం 1995 నవంబర్ 9వ తేది నుంచి అమల్లోకి వచ్చింది. నాటి నుంచి ప్రతి ఏటా ఆ ఆరోజున జాతీయ న్యాయ సేవల దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలపై ప్రత్యేక కథనం ఎల్ఏడీసీఎస్ ద్వారా అండర్ ట్రయల్ ఖైదీలకు న్యాయ సహాయం జిల్లాలో లీగల్ ఎయిడ్ డెఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా అండర్ ట్రయల్ ఖైదీలు, బలహీన వర్గాలకు చెందిన నిందితులకు న్యాయ సేవలను అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 2023 జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 93 మందికి సంబంధించిన కేసులు తీసుకోగా అందులో 70 కేసులను పరిష్కరించింది. అంతేకాక ఆసంస్థ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మొత్తం 253 కేసులు తీసుకోగా అందులో ఎస్సీలకు సంబంధించి 3, ఎస్సీ మహిళలకు సంబంధించి 52, పిల్లలకు సంబంధించి 19, సాధారణం–24, రిమాండ్–148 కేసుల వారికి న్యాయ సహాయం అందించింది. భూసేకరణ కేసులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మొత్తం 38 మందికి సంబంధించి 154 కేసుల్లో రూ. 1.18 కోట్ల రుణాన్ని రెండు జాతీయ లోక్ అదాలత్ ద్వారా చెల్లింపులు చేయడంతో నిర్వాసితులకు ఎంతో ఊరట లభించింది. మధ్యవర్తిత్వం..లోక్అదాలత్.. జిల్లా న్యాయ సేవాధికర సంస్థకు మధ్యవర్తిత్వం, లోక్ అదాలత్లు ముఖ్య వేదికలుగా వెన్నంటే ఉంటున్నాయి. కర్నూలు జిల్లాలో 2,297 కేసుల్లో 111 కేసులను మధ్యవర్తిద్వారా పరిష్కరించారు. అలాగే పర్మనెంట్ లోక్ అదాలత్ ద్వారా విద్యుత్, రవాణా, టెలికాం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి సేవలపై ప్రజా యూటిలిటీ వివాదాల ఉంటే పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తోంది. గత సంవత్సరం ఇలాంటి 138 కేసుల్లో 54 కేసులు పరిష్కరించబడ్డాయి. జాతీయ లోక్ అదాలతో ప్రజలకు మరింత చేరువ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జాతీయ లోక్ అదాలత్ల నిర్వహణతో ప్రజలకు మరింత చేరువవుతోంది. గత నాలుగు లోక్ అదాలత్లో కర్నూలు యూనిట్లో 876 ప్రీలిటిగేషన్, 1,383 సివిల్, 43,701 క్రిమినల్ కేసులను పరిష్కరించింది. అంతేకాక ఎంవీఓపీ కేసుల్లో రూ.26.47 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందేలా జాతీయ లోక్ అదాలత్ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి (ఫైల్) జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించిన కేసుకు సంబంధించిన రసీదు అందిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది (ఫైల్)జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న మరికొన్ని సేవలు ప్యానెల్ లాయర్లు, పారాలీగల్ వలంటీర్లకు న్యాయ సేవలపై శిక్షణ ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేస్తుంది. ప్యానెల్ లాయర్లు ఉచిత న్యాయం కోసం వచ్చే వారి తరఫున కోర్టుల్లో వాదిస్తారు. పారాలీగల్ వలంటీర్లు గ్రామాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పునరావాస కేంద్రాలకు చేరుకొని చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పిస్తారు. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అధికారుల సమన్వయంతో 125 మంది నిరాధార పిల్లలకు ఆధార్ కార్డులు జారీ చేయించారు. ఇందులో కర్నూలులో 75, నంద్యాలలో 50 మంది ఆధార్ కార్డులను అందుకున్న పిల్లలు ఉన్నారు. దూర ప్రాంత గిరిజన ప్రాంతాల్లో వైద్య, న్యాయ శిబిరాలు నిర్వహిస్తారు. ప్రజా భద్రత కోసం 200 హెల్మెట్లు పంపిణీ చేశారు. సమాజంలోని చివరి వ్యక్తికి న్యాయం చేరుకోవాలి అనేదే మా లక్ష్యం. న్యాయం అవగాహన ద్వారానే సాధికారత సాధ్యమవుతుంది. అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ప్రజలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులో ఉంటుంది. న్యాయం అనేది ఏ ఒక్కరికీ సొంతం కాదు. న్యాయ సేవలను పొందలేని వారికి అండగా ఉండి న్యాయాన్ని ఉచితంగా అందిస్తాం. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, బాధితులు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికీ న్యాయ సేవలు అందడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చివరి లక్ష్యం. – బి.లీలా వెంకట శేషాద్రి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,కర్నూలు -
ఈ రోడ్డులో బస్సులు నడపలేం
హొళగుంద: భారీ గుంతలు, రాళ్లు రప్పలతో అధ్వానంగా మారిన హొళగుంద–ఢణాపురం రోడ్డులో బస్సులు నడపలేమని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బస్సుల రూట్ను మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరతామని ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ రామలింగప్ప తెలిపారు. శనివారం హొళగుంద–ఢణాపురం రోడ్డులో రూట్ సర్వే చేపట్టారు. హొళగుందలో విలేకరులతో వారు మాట్లాడుతూ ఆదోని నుంచి ఢణాపురం వరకు బస్సులు నడపడం ఒక ఎత్తయితే ఢణాపురం నుంచి హొళగుందకు మరో ఎత్తవుతుందన్నారు. దాదాపు 27 కి.మీ ప్రయాణం రెండు గంటలు పడ్తుందని, ఈ రోడ్డులో బస్సులు నడిపి ఇద్దరు డ్రైవర్లు ఆస్పత్రుల పాలయ్యారని, మిగిలిన వారు ఈ రూట్లో బస్సులు నడపలేమని వాపోతున్నారని చెప్పారు. వారు సమస్యను యూనియన్ దృష్టికి తీసుకురావడంతో రూట్ సర్వే చేపట్టినట్లు చెప్పారు. రోడ్డు దారుణంగా ఉందని వెంటనే ఎల్లార్తి మీదుగా తిప్పేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తామని, విద్యార్థి బస్సులు మాత్రమే ఈ రూట్లో తిప్పుతామన్నారు. -
తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం
చిన్న వయస్సులో గర్భం దాలిస్తే బాలికకు రక్తహీనత ఏర్పడటం, కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, అబార్షన్లు జరుగుతాయి. అమ్మాయికి పెల్విన్బోరాన్ వృద్ధి చెందక ముందే వివాహం చేయడం వల్ల వారికి ప్రసవం కష్టమై సిజేరియన్ చేయాల్సి వస్తుంది. బీపీ, ఫిట్స్, నెలలు నిండకముందే బిడ్డ జన్మించడం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు అవిటితనం ఉన్న పిల్లలు జన్మించే అవకాశం ఉంది. –డాక్టర్ ఎస్.సావిత్రి, గైనకాలజీ హెచ్వోడీ, కర్నూలు పెద్దాసుపత్రి బాల్య వివాహాలతో చాలా మంది కౌమార దశ పూర్తి గాకుండానే గర్భం దాలుస్తున్నారు. ఈ కారణంగా వారికి నెలలు నిండకుండా శిశువు జన్మించడం, సరైన సమయంలో జన్మించినా బరువు తక్కువగా ఉండటం జరుగుతుంది. ఇలాంటి పిల్లలకు బుద్ధిమాంద్యం, చురుకుగా లేకపోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. తల్లులకు ప్రసవం తర్వాత తల్లిపాలు సరిగ్గా పడవు. దీంతో శిశువులు పలుమార్లు ఇన్ఫెక్షన్లకు గురై అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. – డాక్టర్ అమరనాథరెడ్డి, చిన్నపిల్లల వైద్యుడు, కర్నూలు జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా ఐసీడీఎస్ శాఖతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే స్థానిక పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బందితో కలిసి వెళ్లి పెళ్లి జరగకుండా చూస్తున్నాం. అప్పటికే వివాహం జరిగి ఉంటే ఆమె టీనేజీలో గర్భం దాల్చకుండా ఆరోగ్య సిబ్బందిచే అవగాహన కల్పిస్తున్నాం. టీనేజీలో గర్భం దాల్చడం వల్ల వచ్చే దుష్పరిణాల గురించి బాలికలకు, వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. –డాక్టర్ ఎల్.భాస్కర్, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ -
శ్రీమఠంలో భక్తుల రద్దీ
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. రెండో శనివారం, ఆదివారం కలసి రావడంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక భక్తులు భారీగా వచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దర్శనం చేసుకున్నారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లు శ్రీమఠం అధికారులు ఏర్పాటు చేశారు. కల్పతరు క్యూలైన్ వద్ద శనివారం ఎండ ఎక్కువ ఉండటంతో భక్తులకు కొద్దిపాటి ఇబ్బంది నెలకొంది. – మంత్రాలయం రూరల్శ్రీమఠం మధ్వ కారిడార్లో భక్తుల కోలహలం -
రేషన్ బియ్యం పట్టివేత
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ స్థలంలో 700 కేజీల రేషన్ బియ్యం పట్టుబడింది. వన్ టౌన్ సీఐ ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన శీను, అదే గ్రామానికి చెందిన దుర్గా వీరాంజనేయులు కలిసి శ్రీశైలంలోని స్థానికుల నుంచి తక్కువ ధరకు 7 క్వింటాళ్ల రేషన్ బియ్యం కొనుగోలు చేశారు. తర్వాత 50 కేజీలు చొప్పున 14 సంచుల్లో నింపి వినుకొండకు తీసుకెళ్లటానికి బస్టాండ్కు తీసుకొచ్చారు. స్థానికులు గమనించి వన్టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకొని రేషన్ బియ్యాన్ని పరిశీలించి సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే శీను, దుర్గ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. టెక్నికల్ కోర్సులు అభ్యసించేందుకు వెసులుబాటుకర్నూలు(హాస్పిటల్): వైద్య ఉద్యోగులకు ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్ వంటి టెక్నికల్ కోర్సులను ఇన్ సర్వీస్ కింద అభ్యసించేందుకు వెసులుబాటు కల్పించారని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బాలు నాయక్ తెలిపారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో యూనియన్ ఆసుపత్రి శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ ఈ కోర్సులు చేసేందుకు ఈ నెల 21వ తేదిలోపు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో ఎంఎన్ఓల అదనపు హెచ్ఆర్ఏ తీసివేశారని, మళ్లీ అదనపు హెచ్ఆర్ఏ ఇవ్వాలని డీఎంఈకు వినతి పత్రం ఇవ్వగా ఈ మేరకు ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో శాఖ కార్యదర్శి ఖాజాముద్దీన్, నాయకులు హరిచంద్రనాయుడు, శశిరెడ్డి, సుశీలమ్మ, భాగ్యమ్మ, రామేశ్వరమ్మ, రమేష్, ఉరుకుందయ్య, నరసింహులు, శ్రీనివాసులు, గీతాకళ్యాణి, జయలక్ష్మి, రాజు, లక్ష్మి, మంగమ్మ, శివలక్ష్మి పాల్గొన్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదం సి.బెళగల్: మండలంలో వేర్వేరు చోట్ల చోటు చేసుకున్న ప్రమాదాల్లో త్రుటిలో ప్రాణాపాయాలు తప్పాయి. వివరాల్లోకి వెళితే.. పోలకల్ గ్రామం దగ్గర గూడూరు నుంచి ముడుమాలకు వస్తున్న ఖాళీ ట్రాక్టర్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. కాగా ఈ ఘటనలో ట్రాక్టర్ కింద పడిపోయిన డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే మండలంలోని ఇనగండ్ల క్రాస్ రోడ్డు దగ్గర గూడూరు – ఎమ్మిగనూరు ప్రధాన రోడ్డుపై భారీ గోతులు ఏర్పడ్డాయి. వీటిని తప్పించబోయిన ఇసుక లోడ్ టిప్పర్ రోడ్డు ప్రక్కకు ఒరిగిపోయింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఇనగండ్ల గ్రామ క్రాస్ రోడ్డు దగ్గర ప్రధాన రోడ్డును బాగు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు. వెల్దుర్తి: మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఎరుకలి లక్ష్మన్న వద్ద నుంచి శనివారం దాదాపు 900 గ్రాముల గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు సీఐ యుగంధర్, ఎస్ఐ నరేశ్ సిబ్బందితో కలిసి నిందితుడి ఇల్లు, పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మండల పరిధిలోని మదార్పురం వద్ద నిందితుడు గంజాయి మొక్కలను కలిగి పట్టుబడ్డాడు. అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏఓ అక్బర్బాషా, ఆర్ఐ మంజుల ఆధ్వర్యంలో పంచనామా అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వివిధ పథకాలను పక్కన పెడుతూ అన్నదాతలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. వానల్లేక పంటలు ఎండిపోయినా కరువు లేదని ప్రకటిస్తోంది. అధిక వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లితే పంటలు బాగా ప
నేలవాలిన వరి పైరును చూపుతున్న రైతు(ఫైల్)ఉచిత పంటల బీమాకు మంగళం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు ఉచిత పంటల బీమాను అమలు చేసింది. నోటిఫైడ్ పంటలు ఈ–క్రాప్లో నమోదైతే చాలు.. బీమా వర్తించింది. ఐదేళ్లలో ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకపోయినప్పటికీ ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.2 లక్షల వరకు లబ్ధి కలిగింది. కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని పక్కన పెట్టేసింది. ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే బీమా అనే విధానాన్ని అమలు చేసింది. 2025 ఖరీఫ్ సీజన్లో కేవలం 38,918 మంది రైతులు మాత్రమే పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించారు. మిగిలిన రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. అంచనా.. అంతా వంచన! కర్నూలు జిల్లాలో పంట పత్తి, వేరుశనగ, వరి ప్రధాన పంటలు. అధికారిక లెక్కల ప్రకారం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన అధిక వర్షాలతో 397.58 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. మోంథా తుపానుతో కర్నూలు జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరుగలేదని వ్యవసాయ యంత్రాంగం ప్రకటించింది. నంద్యాల జిల్లాలో మాత్రం 40 వేల హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయని వ్యవసాయ యంత్రాంగం నిర్ధారించింది. అయితే టీడీపీ నేతలు సూచనల మేరకు వ్యవయసాయ అధికారులు అంచనాను మార్చి 11,446.7 హెక్టార్లలోనే పంటలు దెబ్బతిన్నట్లు తేల్చారు. కంది, పెసర, మినుము, మొక్కజొన్న, వరి, పత్తి, సోయాబీన్, బీన్స్, వేరుశనగ, జనపనార పంటలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు చూపారు. కొండంత నష్టం జరిగితే చూపింది నామమాత్రమేనన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆదుకోని అన్నదాత సుఖీభవ రబీలో పంటల బీమాకు ఎగనామం ఎక్కడా కనిపించని యాంత్రీకరణ అనావృష్టితో పంటలు ఎండిపోయినా పరిహారం శూన్యం ‘మోంథా’ ముంచినా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా నష్టం అంచనా! -
విష జ్వరంతో విద్యార్థిని మృతి
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లె మోడల్ ప్రైమరీ పాఠశాల విద్యార్థిని విష జ్వరం బారిన పడి కోలుకోలేక శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన తలారి రాజు, రామాంజినమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె పద్మిని(10) గ్రామంలోని పాఠశాలలో నాల్గో తరగతి చదువుతోంది. వారం రోజుల నుంచి జ్వరం రావడంతో పలు చోట్ల ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. తగ్గక పోవడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని సూచించారు. అప్పటికే రూ.60 వేల మేర వైద్యానికి ఖర్చు చేశారు. ఆర్థిక స్థోమత లేక పోవడంతో కూతురిని అనంతపురంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. చివరకు చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. పద్మిని చదువులో చురుగ్గా ఉండేదని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థిని మృతికి సంతాపంగా మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు సెలవు ప్రకటించారు. -
ఉరుకుంద హుండీ ఆదాయం రూ. 1.37కోట్లు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలోని హుండీల్లో భక్తులు రెండు నెలలపాటు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.1,37,79,215 సమర్పించినట్లు ఆలయ డిప్యూటి కమిషనర్ వాణి తెలిపారు. అలాగే వెండి 18 కేజీల 990 గ్రాములు, బంగారం 6 గ్రాముల 750 మిల్లీగ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆదోని గ్రేడ్–1 కార్యనిర్వహణాధికారి రాంప్రసాద్, దేవాలయ సిబ్బంది, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి పాల్గొన్నారు. వచ్చే ఐదు రోజుల్లో పొడి వాతావరణం కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఈ నెల 12వ తేదీ వరకు ఎలాంటి వర్షసూచన లేదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉష్ణోగ్రతలు 33.2 డిగ్రీల నుంచి 33.4 డిగ్రీల వరకు నమోదు కావచ్చన్నారు. నవంబర్ నెల మొదటి వారంలో 13 మి.మీ వర్షపాతం నమోదైంది. బాధిత కుటుంబాలకు చేయూత మంత్రాలయం రూరల్: మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జనవరి 21వ తేదీన కర్ణాటక రాష్ట్రం గంగవతి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం శ్రీమఠం పీఠాధిపతి మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు చొప్పున ఫిక్స్డ్ డిపాజి ట్ బాండ్లను వారి తల్లిదండ్రులకు అందజేశారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు శ్రీ మఠంలో ఉద్యోగం కల్పిస్తున్నట్లు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఎలా వేళ్లలా అండగా ఉంటామని పీఠాధినతి భరోసా కల్పించారు. మహానందీశ్వరుడి సేవలో.. మహానంది: మహానందీశ్వరుడి సన్నిధిలో సౌత్ సెంట్రల్ రైల్వే పోలీస్ ఫోర్స్ ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్ పూజలు నిర్వహించారు. శుక్ర వారం మహానందీశ్వరుడి దర్శనానికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్కు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. నేటి నుంచి రాష్ట్రస్థాయి వైద్యుల సదస్సు గోస్పాడు: నంద్యాల పట్టణంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల 37వ వార్షిక యూరాలజీ వైద్యుల వైజ్ఞానిక సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహక కార్యదర్శి యూరాలజీ డాక్టర్ భార్గవవర్ధన్రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. ఈనెల 8, 9 తేదీల్లో స్థానిక సౌజన్య కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు 25 మంది ప్రముఖ యూరాలజీ నిపుణులు హాజరై వివిధ అంశాలపై సదస్సులో ప్రసంగిస్తారని, దాదాపుగా 300 మంది యూరాలజీ వైద్య నిపుణులు సదస్సులో పాల్గొననున్నట్లు తెలిపారు. యూరాలజీ విభాగ పీజీ విద్యార్థులు పరిశోధన పత్రాలు సమర్పిస్తారని తెలిపారు. అనంతరం సదస్సు వివరాల పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్లు రమేష్, శ్రీకాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నురగలో నేనుంట!
పొలాల వెంట, పొలం గట్ల వెంబడి ఉన్న గడ్డి పరకల మీద, మొక్కల మీద జిగటగా ఓ నురగ కనిపిస్తోంది. వీటిని చూస్తే ఎవరైనా ఉమ్మేసి వెళ్లారో ఏమో అన్నట్లు అనిపిస్తోది. అయితే వాటి అసలు పేరు స్పిటిల్ బగ్ అంటారు. చిన్న కీటకాలు మొక్కల కాండం వెంట సృష్టించే నురుగే ఇది. గాలిని ద్రవ విసర్జనలో కలపడం ద్వారా నురుగు మిశ్రమాన్ని ఉత్పత్తి చేస్తాయి. కొన్ని కీటక జాతులు నిమిషానికి సుమారు 100 బుడగలను ఉత్పత్తి చేస్తుందని కీటకశాస్త్రవేత్తలు చెప్పారు. స్పిటిల్ బగ్ మొక్కల్లో ఉన్న తేమను పీల్చుకుంటూ నురగ సృష్టిస్తూ ఎండ, ఇతర కీటకాల నుంచి రక్షణ కోసం కవచంలా ఏర్పరచుకుంటాయని వన్యప్రాణి ప్రేమికుడు, హైటికాస్ సంస్థ ప్రతినిధి దూపాడు శ్రీధర్ తెలిపారు. – మహానంది -
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు
● రూ.10 వేలు జరిమానాకర్నూలు: భార్య లక్ష్మిదేవిని హత్య చేసిన కేసులో భర్త శ్రీనివాసులుకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కమలాదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. శ్రీనివాసులు 2007లో లక్ష్మీదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర్లోని శివప్ప నగర్లో నివాసముంటున్నారు. శ్రీనివాసులు బస్టాండ్ దగ్గర టీస్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనిపై నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. పెళ్లయిన పదకొండు సంవత్సరాల తర్వాత భార్య ప్రవర్తనపై అనుమానంతో తరచూ గొడవ పడుతూ 2018 నవంబర్ 18వ తేదీన గొంతు నులిమి హత్య చేశాడు. బంధువుల ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ మహేశ్వర్ రెడ్డి చార్జిషీటు దాఖలు చేశారు. అన్ని కోణాల్లో కేసును విచారించిన పిదప నేరం రుజువు కావడంతో ముద్దాయి శ్రీనివాసులుపై జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితునికి శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుల్ వెంకటరమణ, సాక్షులను కోర్టులో హాజరుపరచిన ఏఎస్ఐ సుబ్బరాజు తదితరులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఆలయ అర్చకుడు మృతి
బేతంచెర్ల: కారు, ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో ఆలయ అర్చకుడు మృతి చెందారు. ఈ దుర్ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బేతంచెర్లకు చెందిన గిరీష్ కుమార్ (37) గోరుమానుకొండ కనుమ ఆంజనేయ స్వామి ఆలయ అర్చకునిగా ఉన్నారు. కొలుములపల్లె గ్రామానికి వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై బేతంచెర్లకు వస్తుండగా జాతీయ రహదారి వద్ద క్రాస్ రోడ్డులో డోన్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో గిరీష్ కుమార్కు తీవ్రగాయాలు కాడంతో చికిత్స నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారని ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతునికి భార్య రాణితో పాటు వంశీ, స్వాతి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ చెప్పారు. -
ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ట్యాంక్ బండ్ రోడ్డులో శుక్రవారం ఆర్ఎస్ ల్యాబ్ టెక్నీషియన్ కృపాసాగర్(40) ల్యాబ్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు...లక్ష్మీపేటకు చెందిన రత్నమ్మ కుమారుడు కృపాసాగర్(40) ట్యాంక్ బండ్ రోడ్డు గుడ్షెప్పర్డ్ స్కూల్ ఎదురుగా ఎస్ఆర్ ల్యాబ్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇదే ల్యాబ్లో పనిచేస్తున్న నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన మేసయ్య, దేవమణిల కుమార్తె సుభాషిణిని ఈ సంవత్సరం ఆగష్టులో ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యభర్తలు ల్యాబ్లో కాపురం ఉంటున్నాడు. తిరుపతికి వెళ్తున్నాని భార్యను పుట్టింటికి పంపించాడు. అయితే భార్య మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తుండగా లిప్ట్ చేయకపోవటంతో అనుమానం వచ్చి చూడగా ఇంటికి లోపల లాక్ వేసి ఉండటంతో పగలగొట్టి చూడగా ఫ్యాన్ ఉండే ఇనుప కడ్డీకి పంచ, టవల్ జాయింట్ చేసుకొని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కలుగోట్ల రోడ్డులోని అరుణ అనే మహిళ వేధింపులు తాళలేకనే తన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సుభాషిణి ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ కిష్టప్పనాయక్, కానిస్టేబుల్ రంగన్న పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని టౌన్ సీఐ వి.శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు. -
వందేమాతరంతో దేశభక్తి భావన
కర్నూలు(సెంట్రల్): భారత ఆత్మను ప్రతిబింబించే నినాదం వందేమాతరం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పేర్కొన్నారు. ఈ గీతం దేశభక్తి భావన పెంపొందిస్తుందన్నారు. కొండారెడ్డి బురుజు దగ్గర వందేమాతరం 150 ఏళ్ల సంస్మరణోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లతో కలసి శుక్రవారం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వందేమాతరం అంటే భారత జాతిని మేల్కోపే శక్తి అని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమకారులకు మనోబలం, మనో నిబ్బరాన్ని ఇచ్చిన గీతానికి 150 ఏళ్లు రావడం సంతోషమన్నారు. ఈ గేయాన్ని 1875 నవంబర్ 7వ తేదీన బంకించంద్ర ఛటర్జీ రచించారని చెప్పారు. ప్రతి ఒక్కరూ జాతీయత భావాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, డీఈఓ శ్యామూల్ పాల్, ఎస్డీసీ అనురాధ, ఆర్ఐఓ లాలెప్ప పాల్గొన్నారు. డీపీఓలో ‘వందేమాతరం’ ఆలాపనకర్నూలు: భారత స్వాతంత్య్ర సమరానికి ప్రేరణనిచ్చిన వందేమాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. బంకించంద్ర ఛటర్జి 1875 నవంబర్ 7న జాతీయ గేయాన్ని రచించారు. 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో సామూహికంగా వందేమాతరం జాతీయ గేయాన్ని ఆలపించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్పీతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ కలసి వందేమాతరం జాతీయ గేయం ఆలాపన చేశారు. ప్రతి ఒక్కరూ జాతీయత భావాన్ని పెంపొందించుకుని దేశాభివృద్ధికి పాటు పడాలని ఎస్పీ పేర్కొన్నారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీలు బాబుప్రసాద్, ప్రసాద్, డీపీఓ పరిపాలన అధికారి విజయలక్ష్మి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పింఛన్ వస్తుందా.. రాదా?
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు దస్తగిరి. యర్రగుడి గ్రామం. ఇటీవలనే తొంభై ఏళ్లు పూర్తయ్యాయి. రెండేళ్ల క్రితం వృద్దుడి భార్య దస్తగిరిమ్మ మృతి చెందారు. అమెకు పింఛన్ వస్తుండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటుతున్నా నేటికీ కొత్త పింఛన్ల నమోదు చేసేందుకు వెబ్సైట్ ఓపెన్ కాలేదు. వృద్ధుడు దస్తగరి తొమ్మిది పదుల వయసులో కూడా టైలరింగ్ చేస్తున్నాడు. తనకు ఇంకెప్పుడు పింఛన్ వస్తుందని, చచ్చే లోపు అయినా ఇస్తారో, లేదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కొలిమిగుండ్ల -
రైతులకు అన్యాయం
నేను ఐదు ఎకరాల్లో పత్తి, నాలుగు ఎకరాల్లో కంది సాగు చేశా. వరుసగా వర్షాలతో పత్తి పంట పూర్తిగా దెబ్బతినింది. కాయలు కుళ్లిపోయాయి. మామూలుగా అయితే ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కాని కేవలం 2–3 క్వింటాళ్ల వరకే వచ్చింది. మద్దతు కొనుగోళ్లు లేకపోవడంతో క్వింటాలు రూ.6500 ధరతో అమ్ముకున్నాం. ఉచిత పంటల బీమా లేకపోవడంతో రైతులకు అన్యాయం జరిగింది. మోంథా తుపాను ప్రభావంతో కందిలో పూత పూర్తిగా రాలిపోవడంతో దిగుబడులపై ఆశలు లేకుండా పోయాయి. – ఏ.రాజశేఖర్, మామళ్లకుంట, తుగ్గలి మండలం నాకు ఐదు ఎకరాలు సొంత భూమి ఉండగా 20 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశా. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టా. 19 ఎకరాల్లోని వరి దెబ్బతినింది. ఎకరాకు కోత కోయడానికే రూ.3500 ఖర్చు వస్తోంది. దిగుబడి ఎకరాకు 18 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కౌలు కింద 11 క్వింటాళ్ల వరకు ధాన్యం ఇవ్వాల్సి ఉంది. అప్పులే తప్ప ఏమీ మిగిలే అవకాశం లేకుండా పోయింది. – సీమ రామిరెడ్డి, బండిత్మకూరు -
బీజేపీలో చేరింది గుమ్మనూరు వర్గమే!
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిఆలూరు రూరల్: కూటమి నాయకుల్లో ఉన్న వ్యతిరేకతతో టీడీపీకి చెందిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు బీజేపీలో చేరారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి వ్యతిరేక వర్గీయులు, గుమ్మనూరు జయరాం అనుచరులు గుమ్మనూరు నారాయణ, ఆలూరు మండలం జెడ్పీటీసీ సభ్యుడు ఏరూరు శేఖర్, అరికెర సర్పంచ్ నాగరాజు, ముసానపల్లి సర్పంచ్ భర్త సోమశేఖర్, నంచర్ల ఎంపీటీసీ సభ్యుడు నరసింహులు, ఖాజీపురం సర్పంచ్... శుక్రవారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారన్నారు. అరికెర సర్పంచ్ నాగరాజు మూడు నెలల క్రితం వరకు వైకుంఠం ప్రధాన అనుచరుడిగా పని చేశారన్నారు. గుమ్మనూరు నారాయణ, మూసానపల్లి సర్పంచ్ సోమశేఖర్, నంచర్ల ఎంపీటీసీ సభ్యుడు నరసింహులు గుమ్మనూరు జయరాంకు ప్రధాన అనుచరులన్నారు. అయితే టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి.. సోషల్ మీడియా వేదికగా బీజేపీ పార్టీలో చేరిన వారంతా వైఎస్సార్సీపీకి చెందిన వారని ప్రచారం చేయడం హాస్యాస్పదం ఉందన్నారు. వీరంతా టీడీపీకి చెందిన వారని గుర్తు చేశారు. కూటమిలో బహిర్గతమైన విభేదాలను జీర్జించుకోలేక వైఎస్సార్సీపీపై బురదజల్లుతున్నారని పేర్కొన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు, ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివప్రసాద్ల మధ్య విబేధాలు ఉన్నాయి. గుమ్మనూరు జయరాం పుట్టినరోజు సందర్భంగా ఆయన వర్గీయులు ఆలూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వైకుంఠం వర్గీయులు చించివేశారని, 20 రోజుల క్రితం గుమ్మనూరు జయరాం స్వయంగా వచ్చి వైకుంఠం అనుచరులకు వార్నింగ్ ఇచ్చారన్నారు. రెండేళ్ల నుంచి పార్టీకి దూరంగా ఆలూరు జడ్పీటీసీ 2024 ఏడాదికి కంటే ముందు గుమ్మనూరు జయరాం వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన నాటి నుంచి ఆలూరు జడ్పీటీసీ ఏరూరు శేఖర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని ఎమ్మెల్యే విరూపాక్షి తెలిపారు. ఆయన అప్పటి నుంచి గుమ్మనూరు వర్గమని, 17 నెలల నుంచి వైఎస్సార్సీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో ఆయన పార్టీకి పని చేయలేదన్నారు. -
కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని కేజీబీవీలో ఓ విద్యార్థిని శుక్రవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఉపాధ్యాయలు తల్లిదండ్రులకు తెలపడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కదిరిపురం తండాకు చెందిన మానేపాటి చిన్న ఈశ్వరయ్య, వెంకటలక్ష్మి దంపతుల కుమారై సుష్మప్రియ(13) స్థానిక కేజీబీవీలో 6వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో యోగా తరగతి అనంతరం విద్యార్థిని బయటికి వెళ్లిపోతుండటంతో గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని పీఈటీ అలివేలిబాయి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినికి చదువుపట్ల ఇష్టం లేక పోవడంతో గతంలో కూడా ఒక సారి ఇలాగే విద్యాలయం నుంచి వారి బంధువుల ఊరికి వెళ్లి కొన్ని రోజుల తరువాత వచ్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సుష్మప్రియ కోసం పోలీసులు, బాలిక తల్లిదండ్రులు గాలిస్తున్నట్లు ఎస్ఓ స్వప్న తెలిపారు. కాగా ఈ పాఠశాలకు మొయిన్ గేట్ లేక పోవడం వల్ల విద్యార్థినులకు రక్షణ కరువైంది. -
12న ఆర్యూ కాన్వొకేషన్
● హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్, వర్సిటీ చాన్సలర్ అబ్దుల్ నజీర్కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ 4వ కాన్వొకేషన్ కార్యక్రమాన్ని ఈనెల 12న వర్సిటీలో నిర్వహిస్తున్నట్లు వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు వెల్లడించారు. శుక్రవారం వీసీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ ఎస్.అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ హాజరవుతారన్నారు. ఎ.ఎం. గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి.రామకుమార్కు వర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఆయనే ప్రధాన వక్తగా ఉపన్యసిస్తారన్నారు. స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న బంగారు పతక విజేతలు, పరిశోధన విద్యార్థులు కాన్వొకేషన్కు ఒక రోజు ముందు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నుంచి ఎంట్రీ పాసులు పొందాలని సూచించారు. విద్యార్థితో పాటు మరొకరికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. మిగిలిన విద్యార్థుల కోసం కాన్వొకేషన్ రోజు ఉదయం 8 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని.. 10 గంటల సమయంలోపు కాన్వొకేషన్ హాల్లో సిద్ధంగా ఉండాలన్నారు. 283 మందికి పీహెచ్డీ పట్టాలు, 889 మందికి పీజీ పట్టాలు, 17,224 మందికి డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల పట్టాలు ప్రదానం చేస్తామన్నారు. 60 మంది పీజీ, 15 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ బి.విజయ్ కుమార్ నాయుడు, వర్సిటీ వైస్ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.నరసింహులు, సీడీసీ డీన్ ఆచార్య పి.వి. సుందరానంద్, అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య ఆర్.భరత్ కుమార్, రీసెర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ప్యవ‘సాయం’పై నిలదీత
కర్నూలు(అర్బన్): ‘‘వ్యవసాయం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో ఈ క్రాప్ బుకింగ్ చేయలేదు, అధిక వర్షాలు, తుఫాన్ల వల్ల నష్టపోయిన పంటల ఎన్యుమరేషన్ కూడా పూర్తి కాలేదు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లికి నేటికీ అనేక మందికి నగదు జమ కాలేదు. నంద్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో నష్టపోయిన మొక్కజొన్నకు నష్ట పరిహారం అందిస్తారా, లేదా? మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?’’ అని జెడ్పీటీసీ, ఎంపీపీలు తీవ్ర అందోళనను వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్ ఎ.సిరి, రాజకుమారి గనియా, కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే నందికొట్కూరు, కొత్తపల్లి, ఓర్వకల్, జూపాడుబంగ్లా జెడ్పీటీసీలు షేక్ కలీమున్నీసా, సుధాకర్రెడ్డి, రంగనాథ్గౌడ్, జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మొక్కజొన్న పూర్తి స్థాయిలో నష్టపోయిందని, వెంటనే నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు మిగిలిన మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ మోంథా తుఫాను ప్రభావంతో నంద్యాల జిల్లాలో 11,448 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఇందులో 4297 హెక్టార్లలో మొక్కజొన్న, 6384 హెక్టార్లలో వరి పంటలు నష్టపోయినట్లు తెలిపారు. నష్ట పరిహారం నివేదికలను ప్రభుత్వానికి పంపామన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సోమవారం నాటికి స్పష్టత రానుందని చెప్పారు. సమావేశంలో రూ.5.86 కోట్ల అంచనాతో 137 పనులకు ఆమోదం తెలిపారు. త్వరితగతిన చెరువులు నింపండి: జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో హంద్రీనీవా నీటితో చెరువులను పూర్తి స్థాయిలో నింపాలని జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కోరారు. ఇప్పటి వరకు ఎన్ని చెరువులను నింపారని ఆయన ప్రశ్నించారు. మొత్తం 73 చెరు వుల్లో ఇప్పటి వరకు 45 చెరువులను పూర్తి స్థాయిలో నింపామని, మిగిలిన వాటిని పాక్షికంగా నింపినట్లు ఇరిగేషన్ ఎస్ఈ బాల చంద్రారెడ్డి సమాధానమిచ్చారు. తుంగభద్ర దిగువ కాలువకు ప్రస్తుత రబీ సీజన్లో నీటిని విడుదల చేయలేమని టీబీ డ్యాం అధికారు లు స్పష్టం చేశారని, ప్రస్తుత ఖరీఫ్కు కూడా డిసెంబర్ 20వ తేదీ వరకు మాత్రమే నీరు విడుదల య్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇరిగేషన్ అధికారులకు ముందు చూపు లోపించడం వల్ల వర్షాలు బాగా కురుస్తున్నా, నీటిని నిల్వ చేసుకోలేకపోతున్నామన్నారు. త్వరలో ఉల్లి రైతుల బకాయిలు విడుదల: డాక్టర్ ఎ.సిరి, కర్నూలు జిల్లా కలెక్టర్ మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లికి సంబంధించి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.8 కోట్లు త్వరలో విడుదల కానున్నాయి. ఉల్లి కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు రైతులకు రూ.10 కోట్లు జమ అయ్యాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలుకు సంబంధించి తేమ 13, 14 శాతం ఉన్నా కొనుగోలు చేసే విధంగా మిల్లులకు ఆదేశాలు జారీ చేశాం. మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, సమావేశానికి హాజరైన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులుచిత్తశుద్ధిలేని మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రజలు, ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి అవసరమైతే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు వేదికై న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఒకరు మినహా మిగిలిన ప్రజా ప్రతినిధులందరూ గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, కేవలం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. వీరి గైర్హాజరును చూస్తే ప్రజా సమస్యలపై వీరికి ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో తెలియజేస్తుంది. హెచ్ఎన్ఎస్ఎస్ నీటితో త్వరితగతిన చెరువులు నింపండి: జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి రబీకి ఎల్ఎల్సీ నీరు రాదు: ఇరిగేషన్ ఎస్ఈ బాల చంద్రారెడ్డి ఖరీఫ్కు కూడా డిసెంబర్ 20వ తేది వరకు మాత్రమే నీళ్లు -
ఇథనాల్ ట్యాంకర్ బోల్తా
ఆలూరు రూరల్: అదుపుతప్పి ఇథనాల్ ట్యాంకర్ బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. గురువారం అర్ధరాత్రి ఆలూరు సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హైవే–167 లో ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర రాష్ట్రంలోని సోలాపూర్ నుంచి అనంతపురం జిల్లా గుంతకల్లుకు ఇథనాల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ (లారీ) అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇథనాల్ పేలుడు స్వాభావం కలిగిన ద్రవం కావడతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫైర్ సిబ్బందిని పిలిపించారు. రాత్రంతా సంఘటన స్థలంలో ఉండి రాకపోకలు సాగిస్తున్న వాహనదారులను అప్రమత్తం చేశారు. ఉదయం క్రేన్ల సహాయంతో లారీని సురక్షితంగా పక్కకు తీసి పంపించారు. కూలీల వలస బాట హొళగుంద: మండల పరిధిలోని గజ్జహళ్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలకు చెందిన కూలీలు శుక్రవారం రాత్రి వలస బాట పట్టారు. దసరా పండుగ ముగియడం, గ్రామంలో వ్యవసాయ పనులు తక్కువగ ఉండడంతో కూలీలు తెలంగాణ రాష్ట్రం జహిరాబాద్కు, ఇతర ప్రాంతాలకు వలసెళ్లారు. అక్కడ పత్తి, మిరప పొలంలోని కోత పనులు చేసేందుకు వెళ్తున్నట్లు కూలీలు తెలిపారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడం, ఉపాధి పనులు జరగకపోవడం, జరిగినా కూలీ గిట్టుబటు కాకపోవడంతో వలస బాట పట్టినట్లు కూలీలు తెలిపారు. యువకుడి దుర్మరణం డోన్ టౌన్: బైకును లారీ ఢీ కొనడంతో విజయరాజు(24)అనే యువకుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన డోన్ పట్టణ సమీపంలోని యు.కొత్తపల్లె జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుత్తి మండలం బేతపల్లె గ్రామానికి చెందిన విజయరాజు సెట్రింగ్ పనులు చేస్తున్నాడు. బైకుపై డోన్కు వచ్చి గ్రామానికి తిరిగి వెళుతుండగా కర్నూలు నుంచి ఆనంతపురం వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన విజయరాజును స్థానికులు చికిత్సల నిమ్మిత్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుని తండ్రి చిట్టిబాబు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఖాళీ ఊళ్లు.. ఇంటింటా కన్నీళ్లు!
ఇళ్లకు తాళాలు వేసి, మూటాముల్లె సర్దుకుని, పిల్లాపాపలతో కలసి వాహనాల్లో దూరప్రాంతాలకు వలస వెళ్తున్న వీరు కోసిగి మండలానికి చెందిన వారు. ‘ఉపాధి’ పనులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడంతో వీరు వలస బాట పట్టారు. విద్యార్థులను సైతం తమ వెంట తీసుకెళ్లడంతో గ్రామీణ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. కర్నూలు(అర్బన్): కరువు నేలపై కూటమి ప్రభుత్వం కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. కరువును అధిగమించాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించడం లేదు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ పల్లెలు ఖాళీ అవుతున్నాయి. గ్రామాల్లో పనుల్లేక, పస్తులండలేక వేల సంఖ్యలో ప్రజలు దూర ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళ్తున్నారు. ఇళ్ల వద్ద వృద్ధులను మాత్రమే ఉంచి పిల్లలను సైతం తమ వెంట తీసుకెళ్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి.ఆర్థిక కష్టాలుజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులకు జిల్లా వ్యాప్తంగా ఐదు వేలకు మంచి కూలీలు హాజరు కావడం లేదంటే, వలసల ప్రభావం ఎంత మాత్రం ఉందో ఊహించుకోవచ్చు. పైగా కూలీలకు చెల్లించాల్సి వేతనాలు ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పడినట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధి నిధులతో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులకు (సీసీ రోడ్లు, డ్రైనేజీ, ప్రహరీగోడలు, పశువుల షెడ్లు, సోక్పిట్స్) కూడా దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. వ్యవసాయ కూలీల పరిస్థితి ఈ విధంగా ఉంటే ... రైతుల పరిస్థితి చెప్పనలవి కాదు. అతివృష్టి, అనావృష్టితో ఏయేటికాయేడు జిల్లాలోని రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు. ఈ ఏడాది అధిక శాతం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి రైతులు తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. తగ్గిన సాగు విస్తీర్ణం వివిధ కారణాలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్లో దాదాపు 59 వేల హెక్టార్ల సాగు విస్తీర్ణం తగ్గింది. కర్నూలు జిల్లాలో 4.22 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం కాగా, కర్నూలు జిల్లాలో 3.86 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.15 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారు. సెప్టెంబర్ నెలలో కురిసిన అధిక వర్షాలతో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఉల్లి తదితర పంటలు పూర్తి స్థాయిలో నష్టపోవడమే గాక, పంటల దిగుబడి కూడా తగ్గింది. రెండు జిల్లాల్లో దాదాపు 30 వేలకు పైగా హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే నష్టపోయిన పంటలకు పరిహారం అందించే ప్రక్రియలో పూర్తి జాప్యం చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెజారిటీ మండలాల్లో నష్ట పరిహారం అందించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ నేటికి పూర్తి కాలేదు. ఉల్లి రైతుకు కన్నీరే మిగిలింది! ఈ సీజన్లో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక, పండిన ఉల్లిని కొనేవారు లేక రైతులు నరకయాతనను అనుభవించారు. అనేక మంది రైతులు ఉల్లి పంటను మేకలు, గొర్రెలకు వదిలి వేయగా, మరి కొందరు పంటను పూర్తిగా దున్నేశారు. మరి కొంత మంది కోసిన ఉల్లిని మార్కెట్కు తీసుకువచ్చినా, ఎలాంటి లాభం లేకపోవడంతో హంద్రీనీవా కాలువలో పడవేశారు. ఉల్లి రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 2,554 మంది రైతుల వద్ద నుంచి దాదాపు 10 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. ఉల్లిని విక్రయించన 250 మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే జమ అయినట్లు తెలుస్తోంది. ఇంకా ప్రభుత్వం రూ.16.50 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ఉల్లిని కొనుగోలు చేసి నెల రోజులు దాటి పోయినా, నేటి వరకు నగదు జమ చేయకపోవడంపైరైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందని సబ్సిడీ శనగ విత్తనాలుప్రస్తుత రబీ సీజన్లో రైతులకు అందించాల్సిన శనగ విత్తనాలను కూడా ప్రభుత్వం అందించలేని పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొనింది. కర్నూలు జిల్లాలో 46 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 23 వేల క్వింటాళ్లను మాత్రమే సరఫరా చేశారు. అలాగే నంద్యాల జిల్లాలో 37 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా, కేవలం 12,654 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. రైతులకు అవసరాలకు అనుగుణంగా సకాలంలో శనగ విత్తనాలను అందించక పోవడం పట్ల రైతులు బయటి మార్కెట్లపై ఆధారపడి కొనుగోలు చేశారు.ఎల్లెల్సీ పరిధిలో రెండో పంట సాగు కష్టమే తుంగభద్ర దిగువ కాలువ కింద ఈ ఏడాది రెండో పంటకు నీరందే పరిస్థితి లేదు. టీబీ డ్యాం గేట్ల మార్పుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడంతో భారీ వర్షాలు కురిసినా, నీటిని వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ కారణంగా ఎల్ఎల్సీ పరిధిలో 1,07,615 ఎకరాలు, కేసీ కెనాల్ కింద 1.50 లక్షల ఎకరాలు, ఎగువ కాలువ పరిధిలోని ఆలూరు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు (20 వేల ఎకరాలు) నీరందని పరిస్థితి నెలకొంది. డ్యాంలో నీరు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గేట్ల మార్పు సాకుతో ఆయకట్టు రైతులకు అన్యాయం చేస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. శ్రీశైలం నీటిపై ఆధారపడిన తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ కాలువల పరిధిలో రెండో ఆయకట్టు సాగుపై ఇప్పటి వరకు స్పష్టత లోపించింది. -
కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం
సాక్షి, కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ను పోలీసులు అరెస్టు చేశారు. వేమూరి వినోద్ కుమార్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వినోద్కు సొంత పూచికత్తుపై స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం ఘటనలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటనపై బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు.చిన్న టేకూరు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందికొండ పోలీస్ స్టేషన్లో యజమాని, డ్రైవర్పై కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. డ్రైవర్తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద BNS 125(a), 106(1) సెక్షన్లు పోలీసులు నమోదు చేశారు.కాగా, 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు. -
వారు పట్టించుకోరు.. వీరు తీరు మార్చుకోరు!
చింతకుంట సచివాలయం–1లో అధికారులు లేక వెలవెలబోతున్న కుర్చీలుచింతకుంట సచివాలయం–2కు తాళం వేసిన దృశ్యంపల్లెల్లో సమస్యల పరిష్కారం కోసం గత వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన సచివాలయాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సచివాలయాల ఉద్యోగులు సమయానికి విధులకు హాజరుకావడం లేదు. అప్పుడప్పుడూ అధికారులు చుట్టపుచూపుగా వచ్చి సమయపాలన పాటించాలని చెప్పి వెళ్లడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సచివాలయ ఉద్యోగులు తమ తీరు మార్చుకోవడం లేదు. హాలహర్వి మండలం చింతకుంట గ్రామంలోని సచివాలయం–1, 2 ఉద్యోగులు గురువారం 11:30 గంటలైనా విధులకు హాజరుకాలేదు. వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు సచివాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ప్రజలకు సేవాలయాలుగా ఉన్న సచివాలయాలను పట్టించుకుని ఉద్యోగులు సమయపాలన పాటించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. – హాలహర్వి -
జీజీహెచ్లో అఖిల భారత సర్వీసుల అధికారులు
కర్నూలు(హాస్పిటల్): అఖిల భారత సర్వీసుల అధికారుల బృందం గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను సందర్శించింది. తెలంగాణ రాష్ట్రం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 15 మందితో కూడిన బృందం(ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐసీఏఎస్, ఐఎస్ఎస్) శిక్షణ నిమిత్తం కొద్దిరోజులుగా జిల్లాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని ఓపీ, ఐపీ సేవలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్యసేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభిస్తున్న వైద్యపరికరాలు, సదుపాయాల గురించి సమగ్రంగా తెలుసుకున్నారు. వారికి ఆసుపత్రి కార్యకలాపాలు, సేవలు, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు వివరించారు. వారి వెంట ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, డాక్టర్ కిరణ్కుమార్ ఉన్నారు. -
న్యాయశాఖ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(సెంట్రల్): జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న స్టెనో, టైపిస్టు కమ్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పోస్టులు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా పోస్టులకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు, ఇతర వివారలకు జిల్లా కోర్టు వెబ్సైట్ను సందర్శించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబర్ 15వ తేదీ సాయంత్రంలోపు జిల్లా కోర్టులో నేరుగా, కోరియర్ ద్వారా, రిజిష్టర్ పోస్టు ద్వారా కానీ అందజేయాలని ఆయన పేర్కొన్నారు. స్నేహితునికి ఆర్థిక సాయం శిరివెళ్ల: అనారోగ్యంతో బాధ పడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యర్రగుంట్లకు చెందిన ఎద్దుల రాముడికి తోటి స్నేహితులు గురువారం ఆర్థిక సాయం అందజేశారు. యర్రగుంట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1992–93లో రాముడు పదో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతుండటంతో తోటి క్లాస్మేట్స్ రూ.20 వేలు సేకరించి పూర్వ విద్యార్థుల సంఘం నాయకుడు బద్రి ఆధ్వర్యంలో రాముడికి అందజేశారు. -
క్రమశిక్షణతోనే వైద్య విద్యలో రాణింపు
గోస్పాడు: క్రమశిక్షణతోనే వైద్యవిద్యలో రాణించగలమని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. గురువారం నంద్యాల మెడికల్ కాలేజీని ఆయన పరిశీలించారు. ప్రిన్సిపాల్ చాంబర్లో ఆయా విభాగాల హెచ్ఓడీలు, వైద్య అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో యూజీ, పీజీ రీసెర్చ్కు సంబంధించిన యూనిట్ల ఏర్పాటుకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మెడిసిన్లో మూడో సంవత్సరం చదివే విద్యార్థులందరికీ తప్పనిసరిగా బేసిక్ లైఫ్ సపోర్టు, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్టు నేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెడిసిన్లో చేరగానే వైద్య విద్య పూర్తికాదని, క్రమశిక్షణతో మెలిగి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకుని, లేటెస్ట్ పుస్తకాలను చదవకపోతే వెనుకబడిపోతారన్నారు. మొదటి ఏడాది వైద్యవిద్యలో చేరిన వారికి సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్టడీ అవర్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మెడికల్ కళాశాలలో బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్, పారామెడికల్ నర్సింగ్ కోర్సులకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయిస్తానన్నారు. జీఎంసీ నంద్యాలకు పీజీ సీట్లు మంజూరు కావడం అభినందనీయమన్నారు. అనంతరం వైస్ చాన్స్లర్ చంద్రశేఖర్ను సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్లు కళావతి, రాజశేఖర్, హెచ్ఓడీ మదన్మోహన్రావు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించొద్దు
కర్నూలు: పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను తరలించే బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి ఎక్కిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు జారీ చేసి గురువారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆటోడ్రైవర్లకు సూచించారు. పరిమితికి మించి ఓవర్ లోడ్తో ప్రయాణించడం ప్రమాదకరమని, విద్యార్థుల భద్రతకు ముప్పు కలిగిస్తుందని తనిఖీల సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ప్రతి పాఠశాల, కళాశాల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని, విద్యార్థులను తరలించే వాహన డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం తాగి వాహనం నడపటం, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ వాడటం తగదని డ్రైవర్లను హెచ్చరించారు. నిప్పంటుకుని బాలుడికి తీవ్ర గాయాలు కృష్ణగిరి: తండ్రి వెంట పొలానికి వెళ్లిన కుమారుడు ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదానికి గురైన సంఘటన గురువారం మండలంలోని తెగదొడ్డి గ్రామ పరిసరాల్లో జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు పొలం పనులకు వెళ్తుండగా 11 ఏళ్ల కుమారుడు మహేంద్ర వెళ్లాడు. పొలంలో పత్తి కట్టె కాల్చే క్రమంలో ప్రమాదవశాత్తూ మహేంద్రకు మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన మహేంద్రను వెల్దుర్తి సీహెచ్సీకు తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మల్లన్న సేవలో ప్రముఖులు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను మాజీ మంత్రి ఆర్కే రోజా, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సినీ హిరోయిన్ రవళి వేరువేరు సమయాల్లో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం వేకువజామున వీఐపీ దర్శన సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, పిన్నెల్లి, రామకృష్ణారెడ్డి, 11.30గంటల వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సినీ నటి రవళి మల్లికార్జున స్వామివారిని స్పర్శ దర్శనం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం రోప్వే ద్వారా పాతాళగంగకు చేరుకుని పాతాళగంగలో కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు, హారతులు వెలిగించి పూజలు నిర్వహించుకున్నారు.రవళిఆర్కే రోజా -
రోడ్డెక్కిన నాపరాళ్ల ట్రాక్టర్లు
● చెక్పోస్టు వద్ద గుమికూడిన యజమానులు ● రాయల్టీలు లేకుండానే రయ్రయ్.. కొలిమిగుండ్ల: నెల రోజుల తర్వాత నాపరాళ్లు రవాణ సాగించే ట్రాక్టర్లు గురువారం రోడ్డెక్కాయి. రాయల్టీ వసూలు నిర్వహణ బాధ్యతను కూటమి ప్రభుత్వం సుధాకర ఇన్ఫ్రా సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ గత నెల నుంచి రంగంలోకి దిగింది. ప్రతి ట్రిప్పునకు ఎక్కువ మొత్తంలో రాయల్టీ చెల్లించి రవాణా సాగించాలంటే కష్టంతో కూడుకోవడంతో యజమానులు నాపరాళ్ల రవాణాను ఎక్కడికక్కడే నిలిపేశారు. గనులు, పాలీష్ ఫ్యాక్టరీలు, ట్రాక్టర్ యజమానులు మూడు వందలకు పైగానే యజమానులు ఉదయం జిల్లా సరిహద్దులోని బందార్లపల్లె క్రాస్ రోడ్డు చెక్పోస్టు వద్దకు చేరుకున్నారు. అప్పటికే 70కి పైగా ట్రాక్టర్లు నాపరాళ్లు లోడ్ చేసుకొని అక్కడికి సిద్ధంగా వచ్చారు. ప్రైవేట్ సంస్థ సిబ్బంది మాత్రం రాయల్టీ ఉంటేనే ట్రాక్టర్లు పంపుతామని పట్టుబట్టారు. పాత పద్ధతిలోనే సింగిల్ రాయల్టీతో రవాణాకు అనుమతించాలని యజమానులు డిమాండ్ చేశారు. ఇందుకు ప్రైవేట్ సంస్థ సిబ్బంది నిరాకరించినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు కార్మికులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాపరాళ్ల రవాణా పూర్తిగా స్తంభించింది. జిల్లా సరిహద్దులోని చెక్పోస్టు వద్దకు చర్చలకు రావాలని యజమానులు పేర్కొన్నారు. శనివారం యజమానులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సంస్థ సిబ్బంది స్పష్టం చేశారు. యజమానులతో పాటు చాలా మంది కూటమి నాయకులు అక్కడికి వచ్చారు. నాపరాళ్ల లోడ్తో సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లను రాయల్టీ లేకుండానే తాడిపత్రి సమీపంలోని పాలీష్ ఫ్యాక్టరీలకు రవాణా చేశారు. ప్రైవేట్ సంస్థ సిబ్బంది చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. సీఐ రమేష్బాబుతో పాటు పది మంది సిబ్బంది చెక్పోస్టు వద్ద బందోబస్తులో ఉన్నారు. ఒక్క రోజే 200 మేర ట్రాక్టర్లలో యజమానులు రాళ్లను ఆఘమేఘాల మీద రవాణా సాగించారు. ఈవిషయంపై ప్రైవేట్ సంస్థ సిబ్బందిని వివరణ కోరగా సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా రూపంలో నిరసన వ్యక్తం చేయకుండా స్థానిక నాయకులు, యజమానులు నాపరాళ్ల లోడ్ ట్రాక్టర్లతో వచ్చి రాయల్టీ లేకుండా పంపించారని తెలిపారు. -
విజేతలకు బహుమతుల ప్రదానం
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల విజేతలకు గురువారం టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ బోర్డు రీజినల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా వృత్తి విద్యాధికారి డాక్టర్ సి.సురేష్బాబు, ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప బహుమతులు ప్రదానం చేశారు. వ్యాస రచనలో కర్నూలు ప్రభుత్వ జూనియర్ కాలేజీ సీఈసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి పి.సురేష్, వక్తృత్వంలో ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ హెచ్ఈసీ విద్యార్థి ఎం.హన్సిక ప్రియదర్శిని, క్విజ్లో కేవీఆర్ బాలికల జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థి టి.వేదావతి విజేతలుగా నిలిచినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపాల్ పరమేశ్వరరెడ్డి, టౌన్ మోడల్ కాలేజీ ప్రిన్సిపాల్ పద్మావతి, ఏజీఎంఓ నాయకల్లు సుంకన్న పాల్గొన్నారు. -
వంట గ్యాస్ లీకై పేలుడు
వెల్దుర్తి: మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో గురువారం వంటగ్యాస్ లీకై ఇంట్లో పేలుడు సంభవించింది. గ్రామానికి చెందిన జి రామాంజనేయులు మామిడి పంట్ల వ్యాపారం నిమిత్తం తెలంగాణకు వెళ్లగా భార్య, తల్లి కూలీ పనులకు వెళ్లారు. ఇద్దరు పిల్లలు స్కూల్కు వెళ్లారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వంట గ్యాస్ లీకై భారీ శబ్దంతో పేలడంతో ఇల్లు ధ్వంసమైంది. ఇంట్లోని వస్తువులు, బయలు ఉంచిన బైక్ కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్వేశారు. కాగా ఇంట్లో ఉన్న 10 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు కాలిపోయి ముద్దగా మారాయని, ఫ్రిజ్, టీవీ, వంట సామగ్రి, బీరువాలోని దుస్తులు, విలువైన పత్రాలు, రూ.97వేల నగదు కాలిపోయాయని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితుడు కోరాడు. విద్యుదాఘాతంతో బాలుడి మృతి హాలహర్వి: మండలంలోని సిద్ధాపురం గ్రామంలో భీమేష్, శాంతమ్మ దంపతుల కుమారుడు సోమశేఖర్(12) గురువారం విద్యుదాఘాతానికి క్కు గురై మృతిచెందాడు. తల్లిదండ్రులు తెలిపిన వివరాలు.. ఇంట్లో బోరు నీటి కోసం మోటార్ను స్విచ్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమేష్, శాంతమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక్క కుమారుడు సంతానం. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. -
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించండి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి. రాధిక కోరారు. గురువారం స్థానిక సంక్షేమభవన్లోని తన చాంబర్లో సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వసతిగృహ సంక్షేమాధికారి హాస్టళ్లలోని విద్యార్థుల రక్షణ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. నిబంధనల మేరకు పౌష్టికాహారాన్ని అందించాలని, ప్రతి హాస్టల్లో విద్యా వాతావరణం కల్పించాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అన్ని హాస్టళ్లలో 10వ తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, ఎస్.లీలావతి, బి.మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
నిషేధిత పొగాకు రకాలను ప్రోత్సహిస్తే చర్యలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత రబీ సీజన్లో నిషేధిత పొగాకు రకాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మార్గదర్శకాలను వివరించారు. హెచ్డీ బీఆర్జీ/హెచ్డీ బర్లీ/ బ్లాక్ బర్లీ రకాల పొగాకు సాగును ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందన్నారు. వీటి సాగును ప్రోత్సహించరాదని, రైతులతో ఎలాంటి ఎంఓయూ, కొనుగోలు ఒప్పందం చేసుకోరాదని తెలిపారు. రైతులు, పొగాకు కంపెనీలు విధిగా వంద శాతం బైబ్యాక్ ఒప్పందం చేసుకున్న తర్వాతే వైట్ బర్లీ రకం పొగాకు సాగు చేపట్టాలన్నారు. ఈ నెల 15న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, అన్ని కంపెనీలు తప్పక హాజరు కావాలన్నారు. సమావేశంలో అగ్రానమీ ఏడీఏ రాజశేఖర్, కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, సాంకేతిక ఏఓ అల్లీపీర, వివిధ పొగాకు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రాణం పోశావు.. ఆటబొమ్మను చేశావు!
నందికొట్కూరు: ఓ మహిళ బిడ్డ పుట్టిన వెంటనే ఆసుపత్రిలో వదిలేసిన ఘటన నందికొట్కూరులో గురువారం వెలుగుచూసింది. వివరాలివీ.. పట్టణంలోని ఆదినగర్లో నివాసం ఉంటున్న అవివాహిత మహిళ(30 సంవత్సరాలు) గురువారం తెల్లవారుజామున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఉదయం 11.50 గంటల సమయంలో ప్రభుత్వ వైద్యశాలకు ఓ మహిళ పసికందుతో పాటు చేరుకుంది. అక్కడి వార్డులో బిడ్డను పడుకోబెట్టి తాగేందుకు నీళ్లు తెచ్చుకుంటానని వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె రాకపోవడంతో చుట్టుపక్క మహిళలు ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. వైద్య సిబ్బంది పసికందును ఇంకుబేటర్లో ఉంచి వైద్యం అందించారు. తక్కువ బరువు ఉండటం, వెన్నెముక సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈమె గతంలోనూ ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ పిల్లలు ఏమయ్యారో తెలియడం లేదని కొందరు, అమ్మేసిందని మరికొందరు చర్చించుకుంటున్నారు. తాత్కాలిక వైద్య సేవల అనంతరం బిడ్డను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా.. 108లో మెరుగైన వైద్యం కోసం నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీసీ ఫుటేజీతో గుర్తింపు ఓ మహిళ ఆసుపత్రిలోకి వచ్చి బిడ్డను వదిలి వెళ్లిన దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా మహిళ ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీశారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామానికి చెందిన దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ముగ్గురు కూతుళ్లు సంతానం. ఇద్దరు కూతుళ్లకు వివాహం కాగా.. ఓ కూతురు కుటుంబాన్ని వదిలి కొన్నేళ్లుగా నందికొట్కూరులో స్థిరపడింది. ఈమె గురువారం ఆడబిడ్డకు ఇంటి వద్దే జన్మనిచ్చింది. అయితే పసికందు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె అక్క ఆసుపత్రిలో వదిలేసింది. ఆ తర్వాత తల్లికి కూడా అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలోనే చికిత్స నిమిత్తం చేర్పించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు పిల్లలు ఏమైనట్లు? ప్రస్తుతం ఆడబిడ్డను వదిలించుకున్న మహిళ గతంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో పిల్లలకు జన్మనిచ్చిన సమయంలో ప్రభుత్వం ఇచ్చే నగదు కోసం ఆసుపత్రి వర్గాలతో గొడవపడినట్లు సమాచారం. అయితే ఆమెకు వివాహం కాకపోవడంతో ఆసుపత్రిలో ప్రభుత్వం తరపున ఇచ్చే నగదును ఇవ్వలేదని చర్చ జరుగుతోంది. అయితే ఈమె పిల్లలను తెలంగాణలో విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మూడో కాన్పులో ఆడపిల్ల జననం అనారోగ్యంతో వదిలించుకున్న తల్లి ఆసుపత్రిలో వదిలేసిన వైనం మెరుగైన చికిత్సకు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలింపు


