breaking news
Kurnool
-
ఏరా.. ల... కొడకా!
సాక్షి, కర్నూలు జిల్లా: అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ముఖ్య అనుచరుడిపై బూతులతో విరుచుకుపడ్డారు. ‘ఏరా ల..కొడుకా.. నా ఫ్లెక్సీని చించమని చెప్పింది ఎవరు?’ అంటూ దుర్భాషలాడారు. గుమ్మనూరు జయరాం ఆలూరులోని ఉపాధ్యాయనగర్లో నివాసం ఉంటున్నారు. ఈనెల 16న జయరాం పుట్టిన రోజు సందర్భంగా ఆలూరులోని ఆర్ అండ్ బీ అతిథిగృహం ఎదుట రెండు రోజుల కిందట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఈ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. జయరాం మంగళవారం ఆర్ అండ్ బీ అతిథిగృహానికి చేరుకోగా.. ఫ్లెక్సీని చించివేసిన విషయం అనుచరులు ఆయనకు తెలియజేశారు. వెంటనే ఆయన కారు దిగి ఎదురు షాపులో ఉన్న జ్యోతి ముఖ్య అనుచరుడు రహిమాన్ను పిలిచి ‘ఏరా ల..కొడుకా.. నా ఫ్లెక్సీని చించమని చెప్పింది ఎవరు?’ అంటూ దుర్భాషలాడారు. తమ పారీ్టకే చెందిన నాయకుడిని టీడీపీ ఎమ్మెల్యే పచ్చి బూతులు తిట్టడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. జయరాం హడావుడి కారణంగా దాదాపు 15 నిమిషాలు కర్నూలు–బళ్లారి రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. -
‘మోదీకి మా బాధ తెలియాలి..’ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల ఆందోళన
సాక్షి, కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో వేళ.. న్యాయం కోరుతూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో, ఫ్లకార్డుతో నిరసన చేపట్టారు. మోదీకి తమ కుటుంబం పడుతున్న బాధేంటో తెలియజేసుకునే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వాళ్లు కోరుతున్నారు.సుగాలి ప్రీతిపై అఘత్యానికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలి(Sugali Preethi Case News). అసలు లోకేష్ రెడ్ బుక్లో వాళ్ల పేర్లు లేవా?. మా కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలి అంటూ ఫ్లకార్డలతో నినాదాలు చేశారు. మరోవైపు.. తమకు న్యాయం చేయాలని, తమ గోడను ప్రధాని మోదీకి వినిపించే అవకాశాన్ని కల్పించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి వేడుకుంటున్నారు. 2017లో కర్నూలులోని ఓ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతిబాయి మృతి చెందింది. అయితే.. స్కూల్ యజమాన్యమే అత్యాచారం చేసి, తన బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్ తల్లితండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ ప్రీతి కుటుంబానికి అందాయి. అలాగే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పటికీ.. ఆ అంశం ముందుకు కదల్లేదు. ఈలోపు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఈ కేసు విపరీతమైన రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. అయితే తాజాగా బాధిత కుటుంబం కూటమి పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆందోళనకు దిగిన నేపథ్యంలో.. ప్రభుత్వం దిగి వచ్చి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఇదిలా ఉంటే.. న్యాయం చేస్తానని నమ్మించి పవన్ నమ్మక ద్రోహం చేశారని పార్వతి ఆరోపిస్తున్నారు(Sugali Preethi Mother Slams Pawan Kalyan). అంతేకాదు.. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాం. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రశ్నించాను అయినా మాకు న్యాయం జరగలేదు. ప్రీతికి న్యాయం జరగకపోతే.. చంద్రబాబు, పవన్, లోకేష్కు మా ఉసురు తగులుతుంది’’ అని వాపోయారామె. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ రేపు(అక్టోబర్ 16న) కర్నూలుకు రానున్నారు(PM Modi AP Kurnool Tour). ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ను మోదీ అప్పాయింట్మెంట్ ఇప్పించాలని పార్వతి విజ్ఞప్తి చేశారు. అయితే.. అవతలి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. ఇదీ చదవండి: న్యాయం గెలిచింది.. కూటమికి గట్టి దెబ్బ -
డెంగీతో చిన్నారి మృతి?
పత్తికొండ : డెంగీ జ్వరంతో చిన్నారి మృతి చెందిన సంఘటన మంగళవారం పత్తికొండ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని కొండగేరికి చెందిన శ్రీలక్ష్మి, రవి దంపతుల పెద్ద కుమార్తె కావ్య(7) రెండు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో సోమవారం పత్తికొండ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ వైద్యులు చికిత్స నిర్వహించి రక్తకణాలు పూర్తిగా తగ్గిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్ చేశారు. బాలిక తల్లిదండ్రులు వెంటనే కర్నూలు ప్రభుత్వ అసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కోలుకోలేక మంగళవారం మృతి చెందింది. చిన్నారి మృతితో బాలిక కుటుంబీకుల రోదనలతో పలువురు కంటతడి పెట్టారు. -
వడ్డీరేట్లు భారీగా తగ్గింపు
కర్నూలు(అగ్రికల్చర్): స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా వెహికల్, పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిందని, ఈ అవకాశాన్ని ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రెజరీ శాఖ చీఫ్ మేనేజర్ భాస్కరవర్మ తెలిపారు. కారు లోన్లపై ఇప్పటి వరకు 9.45 శాతం వడ్డీ రేటు ఉందని, దీనిని 8.75 శాతానికి తగ్గించినట్లు మంగళవారం విలేకర్లకు తెలిపారు. పర్సనల్ లోన్లపై వడ్డీరేటు 13.50 వరకు ఉండగా.. దీనిని 10.75 శాతానికి తగ్గించామన్నారు. ఈ రుణాల మంజూరుకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదన్నారు. ఈ అవకాశం పర్సనల్ లోన్లకు సంబంధించి నవంబరు నెల చివరి వరకు, కారు లోన్లు డిసెంబర్ చివరి వరకు మాత్రమే అవకాశం ఉందన్నారు. అన్నా చెల్లెలు టీచర్లు.. ఒకే పాఠశాలలో విధులు తుగ్గలి: ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికై న అన్నా చెల్లెలు చివరకు ఒకే పాఠశాలలో పోస్టింగ్ పొందారు. ఆత్మకూరుకు చెందిన బాలస్వామి (హెచ్ఎం), నాగమణి దంపతుల కుమారుడు, శ్యామూల్ రాజు, కుమార్తె సారాపింకి కొత్తగా ఉపాధ్యా య ఉద్యోగాలు పొందారు. ఒకేసారి ఉద్యోగా లు పొందడమే కాకుండా ఒకే పాఠశాలలో టీచర్లుగా చేరడం విశేషం. మండలంలోని హు సేనాపురం ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయులుగా మంగళవారం విధుల్లో చేరారు. వీరి సోదరి మౌనిక కూడా అమలాపురంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నట్లు శ్యామ్యూల్ రాజు, సారాపింకి తెలిపారు. ఒకే పాఠశాలలో ఇద్దరం విధుల్లో చేరడం ఆనందంగా ఉందని, విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కర్నూలు(అగ్రికల్చర్): వివిధ డిమాండ్లను సాధించుకునేందుకు చేపట్టిన పోరాటాన్ని వి ద్యుత్ ఉద్యోగులు మరింత తీవ్రం చేయనున్నా రు. మంగళవారం వర్క్టురూల్ చేపట్టారు. నిర్ణీత పనివేళలకు విధులకు హాజరై నిర్ణీత సమయానికి వెళ్లారు. ఇటు కూటమి ప్రభుత్వం నుంచి అటు విద్యుత్ సంస్థల నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు మంగళవారం సాయంత్రం ఏపీ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి జిల్లా చైర్మన్ సతీష్కుమార్ తెలిపారు. 23 సంఘాలతో జేఏసీ ఏర్పాటు డిమాండ్ల సాధనకు ఏపీ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. ఇందు లో 1104,327, డిప్లమా ఇంజినీర్స్, బీసీ, ఓసీ, బహుజన ఉద్యోగ సంఘాలు మొత్తం 23 సంఘాలు జేఏసీలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 4వేల మంది విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏఈఈ(బీటెక్) నుంచి ఏడీఈలు, డీఈఈ, ఎస్ఈఈ, ఇతర గెజిటెడ్ అధికారులు మాత్రం సమ్మెలో ఉండరని సమాచారం. -
అంకితభావంతో విధులు నిర్వహించాలి
కర్నూలు కల్చరల్: అటవీ శాఖ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆ శాఖ కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ బీవీఏ కృష్ణ మూర్తి అన్నారు. మంగళవారం ఆయన డీఎఫ్వో శ్యామలతో కలిసి కర్నూలు డివిజన్ ఎఫ్ఆర్వో, డీఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు నగరవనం, విజయ వనం, పుల్లయ్య పార్క్లను అభివృద్ధి చేయాలన్నారు. వివిధ స్కీంల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. అటవీ భూ ముల ఆక్రమణలను అడ్డుకోవాలని, వన్యప్రాణులను సంరక్షించాలని ఆదేశించారు. ఉద్యోగులు విధులు నిర్వహించే చోటే నివాసం ఉండాని, వేరో చోట ఉంటే చర్యలు తప్పవన్నారు. సర్కిల్ కార్యాలయం ఏవో అబ్దుల్ సుభాన్, కర్నూలు ఏవోలు మహమ్మద్ హెసాన్, చంద్రశేఖర్, ఫ్లయింగ్ స్క్వాడ్ రేంజ్ అధికారి రమణారెడ్డి, ఎఫ్ఆర్వోలు విజయకుమార్, తేజశ్వి, డీఆర్వోలు ఓబులేస్, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
సాగునీటి రంగానికి తీవ్ర అన్యాయం
బీజేపీ డిక్లరేషన్లో పెండింగ్ ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని పెట్టారు. ఆ నిధుల ద్వారా సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల, వేదవతితో రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చన్నది వారి ఆలోచన. అయితే అందుకు సంబంధించిన నిధులను కేటాయిండంలో విఫలం కావడంతో రాయలసీమ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. వర్షాలు సమృద్ధిగా పడినా సముద్రం పాలవుతున్నాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితి లేకపోవడంతో కళ్లెదుటే నీళ్లున్నా పొలాల్లో కన్నీళ్లు పారుతున్నాయి. రాయలసీమలోని ఓర్వకల్లు(కర్నూలు), కొప్పర్తి(వైఎస్ఆర్)లలో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వాటిని వృద్థిపథంలోకి తేవడానికి కేంద్రం చేయూత ఎంతో అవసరం. అయితే ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ పార్కులో 10 వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసినా మౌలిక వసతుల కల్పనలో విఫలంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడంలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పారిశ్రామికవాడలపై దృష్టి సారించాల్సి ఉంది. -
నిధులు, నీళ్లు కావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. పెండింగ్లోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలేదు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి 8 ఏళ్లు అయినా ఒక్క డిమాండ్నూ నెరవేర్చలేదు. ఒక్క ప్రాజెక్టును కూడా కట్టలేదు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేస్తామన్నా అమలుకు నోచుకోలేదు. 11ఏళ్లుగా జీఎస్టీ భారం మోపుతున్న మోదీ ఇప్పుడు కొసరులో పీసరు తగ్గించి సంబరాలకు రావడం అన్యాయం. – కె.ప్రభాకరరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు, కర్నూలు -
కర్నూలుకు ఏపీ డీజీపీ
కర్నూలు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్నూలు పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త పర్యవేక్షించారు. శ్రీశైలం నుంచి మంగళవారం మధ్యాహ్నం కర్నూలు బి.క్యాంప్లోని పోలీసు అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆయనకు మర్యాదపూర్వకంగా పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన కమాండెంట్ కంట్రోల్ రూమ్కు చేరుకుని ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా సెక్యూరిటీ పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్, ఐపీఎస్ అధికారులు శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సెంథిల్, గోపీనాథ్ జెట్టి, ఫక్కీరప్ప తదితరులతో సమీక్షించారు. -
శ్రీగిరి అభివృద్ధికి ఆమోదీంచేనా!
శ్రీశైలంటెంపుల్: ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వరూపంలో కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగ స్వరూపుడు, శక్తిపీఠం కలగలసి వెలసి ఉన్న ఏకై క క్షేత్రం. అంతటి ప్రాశస్త్యం ఉన్న మహాక్షేత్రం అభివృద్ధికి దూరమవుతోంది. అరకొర సౌకర్యాలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. క్షేత్రంలో ఏ చిన్న అభివృద్ధి చేయాలన్న అటవీశాఖ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రహదారులు, వసతి సౌకర్యాలు భక్తులను వేధిస్తున్నాయి. గురువారం శ్రీశైలానికి భారత ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో క్షేత్ర అభివృద్ధిపై దృష్టి సారించి, శ్రీగిరిలో నెలకొన్న సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే అటు ఆంధ్రా నుంచి అయినా, ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి అయినా రైలు మార్గం లేదు. సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని మార్కాపురం రోడ్డు వరకు మాత్రమే రైలు మార్గం ఉంది. ఇటు తెలంగాణ నుంచి అయితే రైలు మార్గం అసలే లేదు. గతంలో పార్లమెంట్సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడంతో పరిశీలించాలని అధికారులకు ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో ప్రత్యేక కమిటీ సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. శ్రీగిరి చుట్టూ నల్లమల అభయారణ్యం కావడంతో మార్కాపురం రోడ్డు నుంచి దోర్నాల వరకు రైలు మార్గాన్ని విస్తరించవచ్చునని ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం. అయితే ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు శ్రీశైలానికి రైలు మార్గం బడ్జెట్లో ప్రస్తావనకు రావడం లేదు. క్షేత్రానికి రైలు మార్గం ఉంటే సామాన్య భక్తులు సైతం క్షేత్ర యాత్ర చేసుకునే అవకాశం ఉంటంది. ఐకానిక్ బ్రిడ్జికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేనా? శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు సున్నిపెంటగ్రామంలో సుమారు రూ.70 కోట్లతో స్టాఫ్ క్వాటర్స్ నిర్మించారు. సున్నిపెంట నుంచి శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరాన్ని తగ్గించాల నే ఉద్దేశంతో సున్నిపెంట నుంచి కృష్ణానదిపై శ్రీశైలం వరకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించారు. అలాగే తెలంగాణ నుంచి శ్రీశైలంకు సమీపంలో దూరాన్ని తగ్గించేలా తెలంగాణ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేసి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఏపీ, తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలి. ఐకానిక్ వంతెనను నిర్మిస్తే భక్తులకు శ్రీశైలం దూరం తగ్గడంతో పాటు ప్రయాణం సాఫీగా సాగుతుంది. భూ బదలాయింపు జరిగేనా గతంలో దేవదాయ, అటవీ, రెవెన్యూ శాఖల మంత్రులు, మూడు శాఖల ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ప్రాథమికంగా శ్రీశైల దేవస్థానానికి 5,302 ఎకరాల భూమి ఉందని నిర్ధారించారు. శ్రీశైల దేవస్థానానికి 1967 నవంబర్లో ఫుడ్ అండ్ అగ్రికల్చరేట్ డిపార్ట్మెంట్ ప్రకారం 5,302 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మొత్తం భూమి 9 సర్వే నెంబర్లలో ఉంది. 5,302 ఎకరాల్లో 900 ఎకరాలు శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్లో ముంపు అయింది. బ్రిటీష్కాలం నాటి జీవో, బ్రిటీష్ కాలం నాటి గెజిట్ ఎంట్రీ ద్వారా సర్వే చేయించి క్షేత్ర సరిహద్దులను గుర్తించారు. 4,400 ఎకరాలు శ్రీశైల మల్లన్న కు చెందిన భూమి అని గుర్తించి, అటవీశాఖ అంగీకరించింది. దీంతో ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవదాయశాఖకు భూమిని అప్పగించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే డిపార్ట్మెంట్కు డీఎఫ్వో లేఖ రాశారు. అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. మల్లన్న క్షేత్రానికి ‘ప్రసాదం’ అందేనా..! శ్రీశైల క్షేత్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం రూ.43 కోట్లతో అభివృద్ధి చేసింది. శ్రీశైలక్షేత్రానికి రోజు రోజుకు పెరుగుతున్న భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం శ్రీశైలంలో కల్పించాల్సిన సౌకర్యాలపై 2017 లో అప్పటి ఈవో భరత్గుప్తా కేంద్ర పర్యటక శాఖ అధికారులకు వివరించి, డీపీఆర్ను సమర్పించారు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ (పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) ప్రసాద్ పథకం కింద శ్రీశైల క్షేత్రంలో భక్తులకు, పర్యాటకులకు కల్పించాల్సి న సౌకర్యాల కోసం రూ.43 కోట్లు నిధులు మంజూరు చేసింది. మూడు విడతలుగా నిధులు మంజూరయ్యాయి. 2017లో శ్రీశైలంలో ప్రసాద్ పథకం ద్వారా పనులు ప్రారంభించారు. కేంద్రం మంజూరు చేసిన పనులను రాష్ట్ర పర్యాటక శాఖ, శ్రీశైల దేవస్థాన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టారు. 2022 డిసెంబరు 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మల్లన్న దర్శనానికి వస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీగిరి అభివృద్ధికి వరాలు కురిపించాలని భక్తులు కోరుతున్నారు. -
ఘాట్రోడ్డు విస్తరించేనా:
శ్రీశైల క్షేత్రానికి ఏపీ, అటు తెలంగాణ నుంచి చేరుకోవాలంటే సుమారు 100 కి.మీ దూరం ఘాట్రోడ్డులో రోడ్డు ప్రయాణం చేయాలి. ఏపీ వైపు శ్రీశైలం నుంచి ఆత్మకూరు వైపు సుమారు 100 కిలోమీటర్లు ఘాట్రోడ్డు సింగిల్ రోడ్డు మాత్రమే. వర్ష కాలంలో ఇరుకై న ఈ రోడ్డులో తరచూ భారీ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. ఈ రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉన్నప్పటికీ విస్తరించడం లేదు. ఆత్మకూరు నుంచి దోర్నాల, దోర్నాల నుంచి శ్రీశైలం నాలుగు లైన్లుగా విస్తరిస్తే క్షేత్రానికి భక్తుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే దోర్నాల–శ్రీశైలం నేషనల్ హైవే 765 పరిధిలో ఉంది. ఎన్హెచ్–765 రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3వేల కోట్లతో చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో అండర్పాస్, ఓవర్ పాస్ బ్రిడ్జిలు నిర్మిస్తే వన్యప్రాణులు, పులుల సంచారానికి ఆటంకం లేకుండా, వన్యప్రాణులు వాహనాల ప్రమాదానికి గురికాకుండా ఉంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే లింగాలగట్టు నుంచి శ్రీశైలానికి ఆంధ్రా–తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ సుమారు రూ.300కోట్లతో ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
నవంబర్ 2న కురువల కార్తీక వనభోజనాలు
కర్నూలు(అర్బన్): జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 2న స్థానిక పెద్దపాడు రోడ్డు ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న భీర లింగేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి తెలిపారు. కార్యక్రమ కరపత్రాలను మంగళవారం పంచలింగాల గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక వన భోజన కార్యక్రమానికి మంలో జిల్లాలోని కురువలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న, మ హిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ, ప్రధాన కార్య దర్శి అనిత,నాయకులు ధనుంజయ, బీ వెంకటేశ్వర్లు, పాల సుంకన్న, కేసీ నాగన్న, శ్రీనివాసులు, బి తరుణ్, చిరంజీవి, మద్దిలేటి, బాలరాజు పాల్గొన్నారు. -
శిశు గృహకు ఆపేక్ష
కర్నూలు(అర్బన్): స్థానిక ప్ర భుత్వ సర్వజన వైద్య శాలలో గత నెల 26న గుర్తించిన ఆపేక్షను మంగళవారం సి.క్యాంప్ సెంటర్లోని శిశు గృహకు చేర్చినట్లు ఐసీడీఎస్ పీడీ పి.విజయ తెలిపారు. ఆడ శిశువును తల్లిదండ్రులు హాస్పిటల్లోనే వదలి వెళ్లారని, స్వల్ప అనారోగ్యంతో ఉన్న శిశువుకు వైద్యం అందించి, బాలల సంక్షేమ సమితి ఉత్తర్వుల మేరకు తమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక దత్తత సంస్థ (శిశు గృహ)కు చేర్చి సంరక్షిస్తున్నట్లు తెలిపారు. శిశువును తమ చిన్నారిగా రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలతో జన్మనిచ్చిన తల్లిదండ్రులు, సంబంధీకులు 30 రోజుల్లోపు సంప్రదించాలన్నారు. లేని పక్షంలో ‘వదిలేసిన శిశువు’గా ప్రకటించి కారా, న్యూఢిల్లీ దత్తత నిబంధనల మేరకు దత్తత ఇస్తామన్నారు. -
టిమ్స్..కిమ్స్..నిమ్స్ ఉత్తుత్తేనా!
● నాటి హామీలను గాలికొదిలిన చంద్రబాబు ● కర్నూలు జీజీహెచ్పై శీతకన్ను ● వైఎస్సార్సీపీ హయాంలో నాడు–నేడు కింద రూ.500 కోట్లతో పనులకు శ్రీకారం ● చివరి దశలో కూటమి ప్రభుత్వం రాకతో నిలిచిన పనులు కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మొదటిసారి స్వాతంత్య్ర దినోత్సవాలను కర్నూలులో నిర్వహించింది. అప్ప ట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రిమ్స్(రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)/కిమ్స్(కర్నూలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)/టిమ్స్(తుంగభద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)గా మారుస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లయ్యింది. ఇప్పటిదాకా దీనికి ఎలాంటి అడుగూ పడలేదు. ఇప్పుడు ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని వెంటబెట్టుకుని కర్నూలు వస్తున్నారు. ఇప్పటికై నా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై దృష్టి సారిస్తారా లేదా ఎప్పటిలాగే హామీలు ఇచ్చి వదిలేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.22.70 కోట్లు ఇస్తే భవనాలు అందుబాటులోకి.. ఐపీ భవన నిర్మాణానికి రూ.60.5 కోట్లు ఖర్చు అయితే అప్పట్లో రూ.42 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.18.5 కోట్లు పెండింగ్లో ఉంది. లెక్చరర్ గ్యాలరీకి, ఎగ్జామినేషన్ హాలుకు పనులు జరుగుతుండగానే బిల్లులు చెల్లించారు. ఎగ్జామినేషన్ హాలు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన డ్రగ్ కంట్రోల్ భవనానికి కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పూర్తి చేయించింది. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.46 లక్షల బిల్లులు పెండింగ్ పెట్టింది. దీంతో కాంట్రాక్టర్ దానిని ఇంకా అప్పగించలేదు. ఐపీడీకి రూ.18.5కోట్లు, లెక్చరర్ గ్యాలరికి 2.95కోట్లు, ఎగ్జామినేషన్ హాలుకు రూ.79లక్షలు, డ్రగ్ కంట్రోల్ భవనానికి రూ.46 లక్షలు కలిపి మొత్తం రూ.22.70 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని చెల్లిస్తే భవనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కీలకంగా ఇన్పేషెంట్ భవనం ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ భవనం కీలకంగా మారింది. ఈ భవనం నిర్మాణం కోసం అప్పట్లో పాత భవనాలన్నీ ఖాళీ చేయించి వాటిని ఇతర వార్డుల్లో సర్దుబాటు చేశారు. 2023లో భవన నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. ఆరు నెలల కాలంలోనే సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ఫ్లోర్ వరకు పిల్లర్లు, గోడలు లేచాయి. మరో ఏడాది ఉంటే భవన నిర్మాణం మొత్తం పూర్తయ్యేది. ఈలోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు ఆగిపోయాయి. 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ ఫోర్లో నిర్మాణమయ్యే ఈ భవనం పూర్తయితే సెల్లార్లో పెద్ద సంఖ్యలో కార్లు, బైక్లు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో టీబీసీడీ వార్డు, గేరియాట్రిక్ (వృద్ధులకు)వార్డు, మొదటి అంతస్తులో ఈఎన్టీ విభాగం, ఫిమేల్ ఆర్థోపెడిక్ విభాగం, మేల్ ఆర్థోపెడిక్ విభాగం, రెండవ అంతస్తులో సైకియాట్రిక్ వార్డు, జనరల్ సర్జరీ విభాగం, మూడో ఫ్లోర్లో డీవీఎల్ విభాగం, జనరల్ మెడిసిన్ విభాగం, 4వ అంతస్తులో పోస్టు ఆపరేటివ్ వార్డు, రికవరీ వార్డు, ఐసీయూ, ఐసీసీయూ, ఎంఐసీయూతో పాటు 14 ఆపరేషనన్ థియేటర్లు ఇందులో అందుబాటులోకి వస్తాయి. అలాగే కొద్దిపాటి నిధులు విడుదల చేస్తే మెడికల్ కాలేజీలోని లెక్చరర్ గ్యాలరీ, ఎగ్జామినేషన్ హాలు, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నిమ్స్ తరహాలో తీర్చిదిద్దితే.. వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద నిధులు కేటాయించి అన్ని బోధనాసుపత్రులను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలల అభివృద్ధికి రూ.500 కోట్లకు అప్పట్లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. ఇందులో రూ.350 కోట్లు భవనాలకు, రూ.150 కోట్లు పరికరాలకు కేటాయించారు. భవనాల్లో భాగంగా ఆసుపత్రిలో ఇన్ పేషంట్ డిపార్ట్మెంట్ భవనం, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్, అధునాతన క్యాజువాలిటీ, మోడరన్ మార్చురీ, బయోమెడికల్ వేస్ట్ షెడ్డు, మెడికల్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, లెక్చరర్ గ్యాలరీల నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. ముందుగా ఆసుపత్రిలో ఐపీడీ, కళాశాలలో ఎగ్జామినేషన్ హాల్, లెక్చరర్ గ్యాలరీల నిర్మాణాలు కొనసాగాయి. హైదరాబాద్లోని నిమ్స్ తరహా ఆసుపత్రిగా కర్నూలు జీజీహెచ్ను తీర్చిదిద్దుతామని పదేళ్ల క్రితం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అప్పట్లో ఐదేళ్లు ఆ పార్టీ నాయకులు ఈ మాట చెబుతూనే వచ్చినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. నిమ్స్ తరహాలో ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తే రాయలసీమకు తలమానికంగా మారుతుంది. అత్యాధునిక వైద్యసేవలు, స్పెషాలిటీ, సూపర్స్పెషాలిటీ బ్లాక్లలో అత్యాధునిక వైద్యపరికరాలతో రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో ఏర్పాటవుతుందనుకున్న రిమ్స్ హాస్పిటల్ను అమరావతికి తరలించుకుపోవడంతో ఇక్కడి ప్రజల ఆశలు నీరుగారిపోయాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదటి రాజధాని కర్నూలుకు వస్తున్నందున ఆయనైనా ఆసుపత్రి రూపురేఖలు మార్చేందుకు ఏదైనా ప్రకటన చేస్తారని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
బనవాసి ఏఓ ఆన్డ్యూటీపై బదిలీ
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ బనవాసి ఫామ్లో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న శారదమ్మ ఆన్ డ్యూటీపై కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి బదిలీ అయ్యారు. హాలహర్వి ఏఓగా పనిచేస్తున్న వేదానందం బనవాసి ఫామ్కు బదిలీ అయిన నేపథ్యంలో ఆ స్థానంలో ఉన్న శారదమ్మ డిప్యుటేషన్పై కర్నూలు డీఏఓ కార్యాల యం సాంకేతిక ఏఓగా బదిలీ అయ్యారు. ఈమె ఈ ఏడాది జూన్ వరకు ఇక్కడ పనిచేసి బనవాసి ఫామ్కు బదిలీ అయ్యారు. తాజాగా డిప్యుటేషనన్పై మళ్లీ ఇక్కడకు బదిలీ కావడం విశేషం. కాగా మంత్రాలయం అగ్రీ ల్యాబ్ ఏఓ అనిల్కుమార్ కూడా ఆన్ డ్యూటీపై డీఏఓ కార్యాలయానికి బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. కొత్తిమీర పంటపై గడ్డి మందు పిచికారీ ఎమ్మిగనూరురూరల్: మండల పరిఽధిలోని రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన రైతు సలాం సాగు చేసిన ఎకరా కొత్తిమీర పంటకు గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేశారు. రూ.60 వేలు పెట్టుబడి పెట్టి సాగుచేశానని, చేతికొచ్చే సమయంలో ఓర్వలేని వారు గడ్డి మందు పిచికారీ చేయటంతో పంట పూర్తిగా ఎండిపోయిందని రైతు వాపోయాడు. దాదాపు రూ.2 లక్షల వరకు తనకు నష్టం వచ్చిందని, దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు కోరాడు. బస్సు కింద పడివిద్యార్థికి గాయాలు ఎమ్మిగనూరు రూరల్: స్థా నిక ఆర్టీసీ బ స్టాండ్ ఆవరణలో మంగళవారం సా యంత్రం బడి బస్సు కింద పడి ఓ విద్యార్థి గాయ పడ్డాడు. వివరాలు.. మండల పరిధిలోని వెంకటగిరి గ్రామానికి చెందిన తిమ్మప్ప, అనితల కుమారుడు శివశంకర్(13) పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. రోజూ గ్రామం నుంచి బడి బస్సులో రాకపోకలు సాగిస్తున్నా డు. సాయంత్రం వెంకటగిరికి వెళ్లే బడి బస్సు రావటంతో పరిగెత్తుకుంటూ విద్యార్థులు వెళ్తుండగా శివశంకర్ అదుపుతప్పి బస్సు వెను క చక్రం కింద పడ్డాడు. కుడి తొడపై చక్రం ఎక్కటంతో తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్నూలు(అర్బన్): 2025–26 విద్యా సంవత్సరంలో ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు మొదటి సంవత్సరం చదువుతున్న మాజీ సైనికుల పిల్లలకు ప్రధానమంత్రి ఉపకార వేతనాలను అందించనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి ఎస్ఆర్ రత్నరూత్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్ణీత దరఖాస్తును వెబ్సైట్ అడ్రస్ ఠీఠీఠీ.జుట ఛ.జౌఠి.జీ ుఽ ద్వారా ఆన్లైన్లో మాత్రమే డిసెంబర్ 31లోగా అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన ఉప్పరి రవితేజ సోమవారం రాత్రి స్నేహితులను బైక్పై హైవే–44పై అమకతాడు టోల్ప్లాజా వద్ద డ్రాప్ చేశాడు. తిరుగుప్రయాణంలో లద్దగిరి రహదారిలో గుర్తు తెలియని వాహనం బైక్ను కొనడంతో రవితేజ మృతిచెందాడు. మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెల్దుర్తి సీహెచ్సీకి తరలించారు. మృతుడి తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోండి
కోవెలకుంట్ల: ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మద్దిలేటి సూచించారు. స్థానిక మార్కెట్యార్డు ఆవరణలో మంగళవారం రైతులకు సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీ సీజన్లో 57,299 హెక్టార్లలో పప్పుశనగ సాగు చేయాల్సి ఉండగా 11,950 క్వింటాళ్ల విత్తనాలు మంజూరయ్యాయన్నారు. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్లోని ఆరు మండలాలకు 7,900 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించామన్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.7,800 ధర నిర్ణయించగా 25 శాతం సబ్సిడీ పోనూ రైతులకు రూ. 5,850కు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సుధాకర్, మార్కెట్యార్డు చైర్పర్సన్ మధులత, వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి, సెక్రటరీ నారాయణస్వామి, వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గువ్వల సుబ్బారెడ్డి, మండల వ్యవసాయాధికారులు సుధాకర్రెడ్డి, నాగేంద్ర ప్రసాద్, జ్యోతి, ఏఈఓలు రమణ, దివ్య పాల్గొన్నారు. -
యువకుడి ఆత్మహత్య
ఆదోని సెంట్రల్: మండల పరిధిలోని మదిరె గ్రామానికి చెందిన గంపల ఈరప్ప కుమారుడు కొరియా గంపల సోమ(31) మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్ఐ గోపాల్ తెలిపిన వివరాలు.. సోమ ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. కూతురు ఉంది. మగ సంతానం లేదని మనోవేదనతో మధ్యాహ్నం ఇస్వీ రైల్వే స్టేషన్ సమీపంలోని 501/18–20 కిలో మీటరు నంబర్ వద్ద గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరు కుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమో దు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత మంత్రాలయం: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను మంత్రాలయంలో పాఠశాల చైర్మన్, విద్యార్థులు కలిసి అడ్డుకున్నారు. కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. తుంగభద్ర నది నుంచి దాదాపు 30 ట్రాక్టర్లలో ఇసుకను మండల కేంద్రంలోని సంత మార్కెట్లో ఉన్న ఎంపీయూపీ పాఠశాల ఆవరణంలో నుంచి అక్రమంగా తరలిస్తుడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన పాఠశాల చైర్మన్ సున్నం గురురాజు మంగళవారం ట్రాక్టర్లను నిలిపివేశాడు. ఇటు ట్రాక్టర్లను తిప్పవద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకపోడంతో రోడ్డుకు అడ్డంగా ఎద్దుల బండ్లను నిలిపి ట్రాక్టర్లను నిలిపి వేశామని, ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి ఇసుక ట్రాక్టర్లను ఇటు వైపు రాకుండా చూడాలని కోరారు. -
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకుల మృతి
బేతంచెర్ల/వెల్దుర్తి: వేర్వేరు ప్రమాదాల్లో మంగళవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. బలపాలపల్లె గ్రామ సమీపంలోని జిందాల్ కంపెనీలో టిప్పర్ ఢీకొని బేతంచెర్ల బైటిపేట కాలనీకి చెందిన శ్రీకాంత్(30), బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో రామళ్లకోటకు చెందిన ఉప్పరి రవితేజ(25) మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీకాంత్రెడ్డి ఆరేళ్లుగా జిందాల్ కంపెనీలోని ఎంఎస్ఆర్ మైన్స్లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఉదయం టిప్పర్ మరమ్మతులకు గురి కావడంతో బాగు చేయించడానికి బేతంచెర్లకు బయలుదేరారు. మార్గమధ్యలో మెట్ట వద్ద టిప్పర్ నుంచి శబ్దం రావడంతో నిలిపి డోర్ వెనుక పరిశీలిస్తుండగా టిప్పర్ ఒక్కసారిగా వెనక్కి రివర్స్ అయి శ్రీకాంత్ ఛాతీని ఢీకొంది. విషయం తెలుసుకున్న కంపెనీ అధికారులు హుటాహుటిన శ్రీకాంత్రెడ్డిని కర్నూలు ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
● పట్నమెళ్లిపోతున్న పల్లెలు!
రెక్కల కష్టం వర్షార్పణమైంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. కనీసం చేసేందుకు కూడా ఉన్న ఊళ్లో పని లేదు.. ఊరకే ఉంటే తినడానికి తిండి దొరకదు. అందుకే కడుపు చేతపట్టుకుని వలస బాట పడుతున్నారు పశ్చిమ ప్రాంతవాసులు. నందవరం మండలం పూలచింత గ్రామానికి చెందిన దాదాపు 20 కుటుంబాలు మంగళవారం పిల్లాపాపలతో కలిసి మూటాముల్లె సర్దుకుని తెలంగాణ రాష్ట్రానికి వెళ్లగా.. ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన మరో పది కుటుంబాలు కర్ణాటక రాష్ట్రానికి పత్తి తీసే పనులు కోసమంటూ బయలుదేరారు. కొన్ని రోజుల నుంచి పల్లెలు వలస బాట పడుతున్నా అధికారులు మాత్రం గుడ్లప్పగించి చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – నందవరం -
కూలీల వాహనాలు బోల్తా
గడివేముల: మండల పరిధిలోని పెసరవాయి రస్తాలో అదుపుతప్పి ఓ బొలేరో వాహనం, ఆటో బోల్తా పడిన ఘటనలో దాదాపు 20 మంది కూలీలు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. బండిఆత్మకూరు మండలం పెద్దదేవుళాపురం, భోజనం, మోత్కూరు గ్రామాల నుంచి ప్రతిరోజు దాదాపు 40 నుంచి 50 ఆటోల్లో గడివేముల మండలంలోని వివిధ గ్రామాలకు వ్యవసాయ పనులకు వస్తుంటారు. మంగళవారం ఉదయం ఆయా గ్రామాల నుంచి బొలేరో వాహనం, ఆటో కూలను ఎక్కించుకుని గని గ్రామ పరిధిలోని పొలాలకు బయలుదేరాయి. పెసరవాయి రస్తాలోని ఘటనా స్థలం వద్ద బొలేరో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి పూర్తిగా ఒరిగిపోయింది. వెనక నుంచి వస్తున్న ఆటో కూడా వేగం అదుపుకాక బోల్తా పడింది. ప్రమాదంలో పెద్దదేవుళాపురం గ్రామానికి చెంది న రాములక్క, కళావతి, మాధవి, పద్మావతి, బాలలక్ష్మమ్మ, రామేశ్వరి, దస్తగరి, భోజనం గ్రామానికి చెందిన దూదేకుల బజారమ్మ, నాగలక్ష్మమ్మ, సుభద్రమ్మతోపాటు మరో పదిమంది కూలీలకు గాయా లయ్యాయి. చుట్టుపక్కల పొలాల రైతులు స్పందించి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రతి రోజు పరిమితికిమించి వాహనాలు కూలీలకు ఎక్కించుకుని రాకపోకలు సాగిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గ నాయకుడు శిల్పా భువనేశ్వరరెడ్డి ఆస్పత్రికి చే రుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. -
మోదీ పర్యటన ఏర్పాట్లు చకచక
● సున్నిపెంటలో ఆరు హెలిపాడ్లు సిద్ధం ● నల్లమలలో కొనసాగుతున్న గ్రేహౌండ్స్ కూంబింగ్ శ్రీశైలంప్రాజెక్ట్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన శ్రీశైలం పర్యటన సందర్భంగా సున్నిపెంటలో ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యుత్, అటవీ, ఐటీడీఏ, దేవదాయ, కేంద్ర, రాష్ట్ర పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సున్నిపెంటలోని ఎకలాజికల్ పార్క్లో ఇప్పటికే శాశ్వత హెలిపాడ్లు మూడు ఉన్నాయి. ప్రధాని మోదీ వెంట మూడు హెలికాప్టర్లు వస్తుండడంతో ఆ హెలిపాడ్లను మరింత పటిష్ట పరుస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఇతర మంత్రుల కోసం ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మరో మూడు తాత్కాలిక హెలిపాడ్లను నిర్మిస్తున్నారు. విద్యుత్ లైన్ల కింద, ప్రధాన రహదారికి ఇరువైపుల చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఇంటలిజెన్స్, బాంబ్స్క్వాడ్, గ్రేహౌండ్స్ బలగాలు శ్రీశైలం పరిసర ప్రాంతాలను తనిఖీ చేస్తున్నాయి. ప్రధాని పర్యటన విధులకు వచ్చే అధికారులు, ఉద్యోగులకు సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సాధారణ ప్రయాణికుల రాకపోకలకు, సౌకర్యాలకు ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నందున అత్యవసరమైతే తప్ప భక్తులు, యాత్రికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
హాస్టల్ నుంచి వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులు
పత్తికొండ: ఉపాధ్యాయులకు చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయిన ఇద్దరు విద్యార్థులు తిరిగి మళ్లీ వచ్చారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. పత్తికొండ పట్టణంలోని పుచ్చకాయలమాడ గ్రామ రహదారిలో ఉన్న బాలురు గురుకుల పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థులు దనుష్, ప్రణిత్లు ఉదయం హాస్టల్ నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. రోల్కాల్ సమయంలో వ్యాయామ ఉపాధ్యాయుడు గుర్తించి పిల్లల లేరన్న విషయంపై ప్రిన్సిపాల్కు తెలిపారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో తప్పిపోయిన విద్యార్థులు వివరాలతో ఫొటోలతో పాటు ఫోన్ నంబర్లును ఇచ్చి సోషల్మీడియాలో ప్రచారం చేశారు. ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామం దగ్గర ఎమ్మిగనూర్ వైపు నడుచుకుంటూ వెళ్లుతున్న విద్యార్థులను స్థానికులు గుర్తించారు. వారినే అక్కడ ఉంచుకుని గురుకుల పాఠశాల సిబ్బందికు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయులు అక్కడికి చేరుకోని విద్యార్థులను గురుకుల పాఠశాలకు తీసుకోచ్చారు. దాదాపు రెండు గంటల వ్యవధిలోనే 20 కిలోమీటర్లు దూరం పైగా నడుచుకుంటూ వెళ్లారు. సోషల్మీడియాలో వారి ఫొటోలు చూసి గుర్తుపట్టి విద్యార్థులను గురుకుల పాఠశాల సిబ్బంది, తల్లితండ్రులకు అప్పచేప్పడంతో కథ సుఖాంతమైంది. -
21 నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు
కర్నూలు(అగ్రికల్చర్): పత్తికొనుగోలు కేంద్రాలు ఈ నెల 21 నుంచి అందుబాటులోకి రానున్నట్లు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు తెలిపారు. సోమవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఏడీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాలో 12 జిన్నింగ్ మిల్లులు, నంద్యాల జిల్లాలో మూడు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుందన్నారు. మద్దతు ధర రూ.8,110 కాగా.. పత్తిలో తేమ ఎనిమిది శాతం వరకు ఉంటే పూర్తి ధర లభిస్తుందని తెలిపారు. కొనుగోలులో ఎలాంటి పరిమితులు ఉండవని, మార్చి నెల చివరి వరకు కొనుగోళ్లు చేస్తామన్నారు. సమావేశంలో ఏడీఎం నారాయణమూర్తి పాల్గొన్నారు. విధుల్లో చేరిన జిల్లా అటవీ శాఖాఽధికారి శ్యామల కర్నూలు కల్చరల్: జిల్లా అటవీ శాఖాధికారిగా ఐఎస్ఎఫ్ శ్యామల సోమవారం తిరిగి విధుల్లో చేరారు. డెహ్రాడూన్లో రెండు నెలల పాటు జరిగిన వృత్యంత శిక్షణకు హాజరైన ఆమె తిరిగి డీఎఫ్వోగా బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు సర్కిల్ నూతన సీఎఫ్ బీవీఏ కృష్ణమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు. శిక్షణలో తెలుసుకున్న విషయాలను వివరించారు. దేశ శ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 67 మంది డీఎఫ్వోలు శిక్షణలో పాల్గొన్నారన్నారు. శిక్షణలో తెలుసుకున్న, నేర్చుకున్న అంశాలు జిల్లా అటవీ శాఖ సంరక్షణలో ఉపయోగపడతాయని తెలిపారు. డీటీడబ్ల్యూఓగా సురేష్ బాధ్యతల స్వీకరణ కర్నూలు(అర్బన్): జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిగా డి.సురేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 9న జరిగిన డీపీసీలో అనంతపురం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న సురేష్కు డీటీడబ్ల్యూఓగా పదోన్నతి కల్పించి కర్నూలుకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ డీటీడబ్ల్యూఓగా బాధ్యతలు స్వీకరించిన సురేష్కు కార్యాలయ పర్యవేక్షకులు మునిచంద్ర, సిబ్బంది, వసతి గృహ సంక్షేమాధికారులు పూలబోకేను అందించి అభినందనలు తెలిపారు. నేడు మద్యం షాపులపై తాజా సర్వే కర్నూలు(అర్బన్): గ్రామాలు, పట్టణాల్లో ఉన్న మద్యం షాపులు, బార్లపై తాజాగా నేడు సర్వే నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు ఈ సర్వేను చేపట్టాల్సి ఉంటుంది. ఆయా సచివాలయాల పరిధిలోని మద్యం షాపులు, బార్లకు సంబంధించి భౌగోళిక అక్షాంశాలను తమ జీఎస్డబ్ల్యూఎస్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వేలో ఆయా సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శులకు మినహాయింపు ఇచ్చారు. వారి స్థానంలో ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని ఎంపీడీఓలు, కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రానికి సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. -
కర్నూలులో కదంతొక్కిన మహిళలు
వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు కార్పొరేషన్ మేయర్ బీవై రామయ్య ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులో మహిళలు కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోట్ల సర్కిల్ (పాత కంట్రోల్ రూమ్) వద్ద నుంచి ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకు పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘నకిలీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వం’ అంటూ భారీ బ్యానర్ చేత పట్టి ఎన్–బ్రాండ్ లిక్కర్ను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట దాదాపు రెండు గంటల పాటు బైఠాయించారు. ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వం మద్యం విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎకై ్సజ్ కార్యాలయం గేటు వద్ద మద్యాన్ని పారబోసి నిరసన తెలియజేశారు. అనంతరం ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. పల్లెల్లో బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఏఈఎస్ను నాయకులు నిలదీశారు. వెంటనే బెల్టు షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించాలని కోరారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, హనుమంత రెడ్డి, కార్పొరేటర్లు చిట్టెమ్మ, అరుణ, లక్ష్మిరెడ్డి, సుదర్శన్రెడ్డి, నారాయణ రెడ్డి, నాయకులు రామకృష్ణా రెడ్డి, కేశవరెడ్డి, ఈశ్వరయ్య, శివశంకర్రెడ్డి, రమణారెడ్డి, గోపాల్రెడ్డితో పాటు మాజీ జెడ్పీటీసీలు, సహకార సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. -
కూలి పనులకు పోవడం మేలు
వ్యవసాయం చేసుకోవడం కంటే కూలీపనికి పోవడం మేలు. ఈఏడాది రెండు ఎకరాల్లో టమాటను సాగు చేశాను. రూ. 80వేలు పెట్టుబడి కోసం ఖర్చు చేశాను. 56 గంపలు మార్కెట్కు తీసుకొచ్చాను. జత గంపలు 100 రూపాయలకు కోనుగోలు చేశారు. కూలీలు, రవాణా కోసం రూ. 2వేలు ఖర్చు అయ్యింది. ఈఏడాది ఒక్కసారి కూడా మంచి రేటుకు అమ్ముకోలేదు. – నాగరాజు, ఆర్ కొత్తూరు టమాట రైతుల కష్టాలపై ప్రభుత్వం స్పందించడం లేదు. నేను రెండు ఎకరాల్లో సాగు కోసం రూ. 80 వేలు దాకా ఖర్చు చేశాను. ఇప్పటివరకు పైసా కూడా చేతికంద లేదు. ఈ రోజు 30 గంపలు తెచ్చాను. జత 120 రూపాయలు లెక్క కొన్నారు. వ్యాపారులు కమీషన్ పట్టుకొని ఇస్తారు. 8 మంది కూలీలు టమాటలను తెంపినారు. ఆటో బాడుగ రూ. 600 ఇచ్చాను. వచ్చిదంతా వాళ్లకే సరిపోతుంది. రైతుకు ఏమీ మిగలడం లేదు. – రవి, రాతన -
ట‘మాట’ పడిపోయింది!
● కిలో రెండు రూపాయలతో కొనుగోలు ● అందని గిట్టుబాటు ధర ● తీవ్రంగా నష్టపోతున్న రైతులుపత్తికొండ: టమాటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు ఉత్తివే అని తేలిపోయింది. వారు చెప్పిన మాటలకు మార్కెట్లో లభించే ధరకు పొంతన పొంతన లేదు. ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు విని వ్యాపారులతో మాట్లాడి మూణ్ణాళ్ల ముచ్చటగా కొద్దిమేర ధరలు పెంచి టమాటాలను కోనుగొలు చేశారు. అనంతరం ధరలు తగ్గించి అన్నదాతలకు చుక్కలు చూపిస్తున్నారు. సోమవారం పత్తికొండ మార్కెట్కు 61 టన్నుల టమాటను రైతులు తీసుకొచ్చారు. అయితే మార్కెట్లో కిలో రూ. 1 నుంచి రూ.2 ప్రకారమే కోనుగోలు చేశారు. 15 కేజీల జత గంపలను రూ. 80 నుంచి రూ. 120 లోపు, 25 కేజీల జత గంపలను రూ. 100 నుంచి రూ.200 లోపు కోనుగోలు చేశారు. గిట్టుబాటు ధర కోసం వారం రోజుల కిందట రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజులు పాటు ఉన్నత స్థాయి అధికారులు మార్కెట్లో హడావిడి చేశారు. అప్పట్లో కిలో రూ. 6 నుంచి రూ. 8 లోపు కోనుగొలు చేశారు. అయితే శనివారం రోజు నుంచి ధరలు తగ్గించుకుంటూ వచ్చారు. సోమవారం ఉన్నట్టుండి కిలో రెండు రూపాయలలోపు కొన్నారు. మాట తప్పడంపై రైతులు మండిపతున్నారు. మార్కెట్కు వచ్చిన టమాటలో నాణ్యత లేదనడంలో వాస్తవం లేదని, వానల్లేక చాలా నాణ్యతగా ఉందని రైతులు చెబుతున్నారు. గిట్టుబాటు ధరతో ఎందుకు కొనడం లేదని ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యం.. అలసత్వం పత్తికొండ మార్కెట్ను వారం కిందట కడప రీజనల్ డైరక్టర్ లావణ్య, కర్నూలు ఎడీ అదినారాయణ సందర్శించారు. గిట్టుబాటు ధరపై రైతులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో ధర తగ్గినప్పుడు గిట్టుబాటు ధరతో ప్రభుత్వం కోనుగొలు చేస్తుందని హామీ ఇచ్చారు. అంతే కాదు ఆదనంగా ప్రత్యేక అధికారి పద్మావతితో పాటు ఆదోని, ఎమ్మిగనూర్ మార్కెట్యార్డుల నుంచి ఐదుగురు సిబ్బందిని కూడా నియమించారు. సిబ్బంది ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో ధర తగ్గితే తామే కోనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యధోరిణి, అధికారుల అలసత్వం రైతులకు శాపంగా మారింది. -
డ్రోన్ల ఎగురవేత నిషేధం
కర్నూలు: ప్రధాని మోడీ పర్యటన పరిసర ప్రాంతాల్లో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు డ్రోన్ల ఎగురవేతపై జిల్లా పోలీసు శాఖ నిషేధం విధించింది. బహిరంగ పరిసర ప్రాంతాల్లో దాదాపు 200 పైగా సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పీఎం పర్యటన బందోబస్తు నిమిత్తం వచ్చిన అడిషనల్ ఎస్పీ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులకు కర్నూలు శివారులోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని యూబీఆర్ కన్వెన్షన్ హాల్లో పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి బహిరంగ సభకు వచ్చి వెళ్లే సమయంలో బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు ఫొటోలు, వీడియోలు తీయరాదన్నారు. డీజీపీ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. అనుమానితులు కనిపిస్తే పైఅధికారులకు వెంటనే సమాచారమివ్వాలని సూచించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ట్రైనీ ఐపీఎస్లు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
ఎస్టీ జాబితాపై వాల్మీకులకు స్పష్టత ఇవ్వాలి
● వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు కర్నూలు (టౌన్): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని 2017లో సీఎం చంద్రబాబు, 2019లో ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, వెంటనే స్పష్ట ఇవ్వాలని వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో వైఎస్సార్సీపీ బీసీసెల్ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆ పార్టీలకు వాల్మీకులు గుర్తుకొస్తారన్నారు. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని వెంటనే వాల్మీకులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఈనెల 16న కర్నూలులో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గతంలో వాల్మీకులకు ఇచ్చిన హామీపై స్పష్టంగా ప్రకటించాలన్నారు. ఏళ్ల తరబడి వాల్మీకులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. బీసీల జపం చేసే చంద్రబాబు నాయుడు వాల్మీకులకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. వాల్మీకులకు న్యాయం జరిగేంతవరకు వైఎస్సార్సీపీ పోరాటం చేసేందుకు సిద్ధమైందన్నారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, యువజన విభాగం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ నాయుడు, వాల్మీకి యూత్ ప్రెసిడెంట్ నాయుడు, బండిమెట్ట మధు, అశోక్, లక్ష్మన్న, జగన్ పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధరలేక ఉల్లి పంట తొలగింపు
తుగ్గలి: మార్కెట్లో ఉల్లిగడ్డలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రాతన గ్రామానికి చెందిన రైతు ఏటిగడ్డ వెంకప్ప సోమవారం పంటను ట్రాక్టర్ పల్టర్తో దున్నేశారు. ఏడెకరాలలో సుమారు రూ.4 లక్షలకు పైగా పెట్టుబడి ఉల్లి పంట సాగు చేస్తే ఇప్పుడు కొనేవారు లేరని రైతు వాపోయారు. ఇప్పుడు పంటకోసి గ్రేడింగ్ చేసి మార్కెట్కు తీసుకెళ్లాలంటే మరో రూ.2లక్షల దాకా అవుతుందని, క్వింటాకు ఐదారు వందలకు మించి ధర లేదన్నారు. ఇంత ఖర్చుచేసినా కూలీల ఖర్చులు కూడా రావని దున్నేశానని చెప్పారు. క్వింటా ధర రూ.3వేల నుంచి రూ.4వేలు ఉంటేనే గిట్టుబాటు అవుతుందన్నారు. ప్రభుత్వం హెక్టారుకు రూ.50వేలు పరిహారం ఇచ్చి ఆదుకుంటామని చెప్పినా ఇంత వరకు ఇవ్వలేదన్నారు. రూ. 1.60 కోట్లతో దేవాలయాల పునర్నిర్మాణం కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రం వద్ద ఆంజినేయస్వామి, బసవన్న ఆలయాలను 1.60కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. సోమవారం వేదపండితులు, అర్చకులు పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోతట్టులో ఉండడంతో బసవన్న గుడిని రూ. 43లక్షలతో, ఆంజినేయస్వామి ఆలయాన్ని రూ. 1.15కోట్లతో పునర్నిర్మిస్తున్నట్లు చెప్పారు. వేద పండితుడు మురళికృష్ణపండిత్, ప్రధాన, ఉపప్రధాన అర్చకులు ఈరప్పస్వామి, మహదేవస్వామి పాల్గొన్నారు. నేటి నుంచి న్యాయవాదుల విధుల బహిష్కరణ కర్నూలు(సెంట్రల్): కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో మంగళవారం నుంచి మూడు రోజులపాటు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్ చౌదరి, ఎం.వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయవాదుల అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వ తీరుతో కర్నూలుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధకశాఖలో కర్నూలు డివిజన్ డీడీగా పనిచేస్తూ జేడీగా పదోన్నతి పొంది డైరెక్టరేట్కు బదిలీ అయిన డాక్టర్ దుర్గాప్రసన్నబాబును సోమవారం కర్నూలులోని బహుళార్ధ పశువైద్యశాల ప్రాంగణంలో సన్మానించారు. ఉమ్మడి జిల్లాకు 2005 నుంచి డాక్టర్ దుర్గాప్రసన్నబాబు అందించిన సేవలను ఎప్పటికి మరచిపోలేమని అన్నారు. కర్నూలు, ఆదోని డీడీలు హేమంత్కుమార్, వెంకటరమణ, ఏడీలు డాక్టర్ నాగరాజు, భవానిశంకర్రెడ్డి, ధనుంజయుడు, పార్థసారిథి, వెటర్నరీ అసిస్టెంటు సర్జన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు గిడ్డయ్య, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కమాండ్ కంట్రోల్ రూమ్ 24 గంటలు పని చేయాలి
కర్నూలు(సెంట్రల్): పీఎం పోగ్రామ్ కోసం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారి వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పీఎం ప్రోగ్రామ్పై కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులతో సమీక్షించారు. మూడు బృందాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ 24 గంటలు పని చేయాలని, సరైన టైమ్లో పీఎం పోగ్రామ్ పనులు పూర్తయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఐఏఎస్ అధికారులు విజయసునీత, దినేష్, జేసీ నూరుల్ ఖమర్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, సచిన్ పాల్గొన్నారు. ఇదిలాఉంటే ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఇన్చార్జి మంత్రి, ఇరిగేషన్ శాఖమంత్రి నిమ్మల రామానాయుడు, రోడ్లు భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్రెడ్డి పరిశీలించారు. -
సలహాలేనా.. సౌకర్యాలు కల్పిస్తారా?
సమన్వయం అవసరం శ్రీశైల దేవస్థాన ఈఓ, ఆయా విభాగాల అధికారులతో అలాగే ధర్మకర్తల మండలి సభ్యులతో సమన్వయం అతి ముఖ్యమైనది. భక్తుల సమస్యలపై, సౌకర్యాల కల్పన విషయంలో అధికారుల బృందంతో, పాలక మండలి సభ్యులతో సామరస్యంగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు, సభ్యులతో బేధాబిప్రాయాలు లేకుండా ట్రస్టబోర్డు సమావేశాలు సాగేలా చూసుకోవాలి. అధికారులు, సభ్యులు అందరిని సమన్వయం చేసుకుని వెళితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చు. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి నూతన ధర్మకర్తల సలహా మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సోమవారం ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. చైర్మన్గా పోతుగంటి రమేష్ నాయుడిని ఎన్నుకున్నారు. అయితే దేవస్థాన ప్రస్తుత ధర్మకర్తల సలహా మండలి కేవలం భక్తులకు అవసరమైన సౌకర్యాలపై సలహాలు మాత్రమే ఇవ్వగలదు. దేవస్థాన ఈఓ, దేవదాయశాఖ కమిషనర్ చైర్మన్, సభ్యులు ప్రతిపాదించిన సమస్యలను అనుమతించవచ్చు లేక తిరస్కరించవచ్చు. ప్రతి ప్రతిసాదనకు దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి తప్పనిసరి. సౌకర్యాలు కల్పించాలి.. మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి శ్రీశైల దేవస్థాన చైర్మన్గా ఎన్నికై న నూతన చైర్మన్ శ్రీశైల దేవాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. శ్రీశైల క్షేత్రంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా అనేక సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది. భక్తుల రద్దీని అంచనా వేసి రూ.1657.28కోట్ల అంచనాలతో గతంలోనే మాస్టర్ప్లాన్ను సిద్ధం చేశారు. దీని అమలు విషయంపై ప్రభుత్వం, దేవదాయశాఖ అధికారుల అనుమతులు తీసుకురావాల్సి ఉంది. దేవస్థాన భూములు దక్కేనా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేవదాయ, రెవెన్యూ, అటవీశాఖ మంత్రులతో, ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. వారంతా పరిశీలించి 4,500ఎకరాల భూమి శ్రీశైల క్షేత్రానికి చెందినదని గుర్తించారు. అటవీ, రెవెన్యూ, దేవదాయశాఖల సమన్వయంతో ల్యాండ్ అండ్ సర్వే అధికారులు సరిహద్దులను సైతం గుర్తించారు. అటవీశాఖ నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా దేవస్థాన భూములను తిరిగి దేవస్థానానికి దక్కేలా తీర్మానాలు చేసి అగ్రిమెంట్ సైతం చేసుకున్నారు. అయితే కేంద్ర అటవీశాఖ అధికారులు భూమిని బదిలీ చేసేది లేదని తిరస్కరించినట్లు సమాచారం. అటవీశాఖ అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి క్షేత్ర భూమి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నూతనంగా ఏర్పాటైన ధర్మకర్తల సలహా మండలి శ్రీశైలం ట్రస్ట్బోర్డు చైర్మన్కు సమస్యల స్వాగతం -
వ్యాపారుల మధ్య పోటీ.. రూ.100కే కిలో చికెన్
కర్నూలు జిల్లా: ఇద్దరు వ్యాపారస్తుల మధ్య నెలకొన్న పోటీతో ఆదివారం చికెన్ చౌక ధరకు లభించింది. కోడుమూరులోని బళ్లారి రోడ్డులో ఇటీవల కర్నూలుకు చెందిన ఓ వ్యాపారి నూతనంగా చికెన్ వ్యాపారం ప్రారంభించాడు. తన వ్యాపారం వృద్ధి చేసుకునేందుకు మార్కెట్ రేటు కంటే తక్కువకు చికెన్ అమ్మకాలను చేపట్టాడు. దీంతో అప్పటికే చికెన్ వ్యాపారం చేస్తున్న మరో వ్యాపారి కూడా ఆ వ్యాపారి ఇచ్చే రేటు కంటే తక్కువగా చికెన్ అమ్ముతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కర్నూలుకు చెందిన వ్యాపారి కిలో చికెన్ రూ.110 పెట్టగా, స్థానిక పాత వ్యాపారి రూ.10 తగ్గించి రూ.100కే కిలో చికెన్ అంటూ బోర్డు పెట్టాడు. దీంతో జనం బారులు తీరారు. పట్టణ వాసులతో పాటు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం కోడుమూరుకు వచ్చి చికెన్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.180 పలుకుతుండగా, స్కిన్ లెస్ చికెన్ రూ.200 పలుకుతోంది. -
ఆత్మీయ కలయిక..ఆనంద డోలిక!
ఆలూరు రూరల్: గుర్తుకొస్తున్నాయ్.. అంటూ 27 ఏళ్ల తర్వాత వారంతా కలుసుకున్నారు. పట్టణంలోని ఎల్లార్తి రోడ్డులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 1997–98 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించా రు. స్నేహితులంతా ఒకేచోట చేరడంతో కుశల ప్రశ్న లు వేసుకొని ఉల్లాసంగా గడిపారు. నాటి స్మృతుల ను గుర్తుకు తెచ్చుకొని, మళ్లీ చిన్నపిల్లలైపోయారు. అలాగే నాడు వారికి విద్యాబుద్ధులు చెప్పిన గురు వులు రుక్మిణి, రమణయ్య, మహబూబ్ సాబ్ను ఘనంగా సత్కరించారు. నాటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో సరస్వతి ఆలయం నిర్మించడం అభినందనీయం అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులకు షీల్డులు అందజేశారు. -
హామీలు ‘భద్రం’.. ప్రాజెక్టులు ఛిద్రం
కర్నూలు సిటీ: ‘‘రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం.. ప్రతి ఎకరానికి నీరిస్తాం..కరువును శాశ్వతంగా తరిమేస్తాం’’ అని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా పలు సభల్లోనూ రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్నాం అంటున్నారు. అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. తుంగభద్ర నదికి వచ్చిన వరద నీటిని వినియోగించుకోలేకపోయారు. వచ్చిన నీటిని వచ్చినట్టే కిందకు వదిలేశారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం ఈ దుస్థితి నెలకొంది. తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్టీఎస్ కుడి కాలువ, హగేరి నదిపై వేదావతి ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో వాటిని టీడీపీ నేతలు ప్రచార అస్త్రాలుగా వాడుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టులపై దృష్టికి సారించలేదు. నీరు నిల్వలేక నిర్వేదం ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాలకు ప్రధాన జలవనరు తుంగభద్ర నది. ఈ నది జలాలపై ఆధారపడి కేసీ కింద 2.65 లక్షలు, తుంగభద్ర దిగువ కాలువ కింద 1.51 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయి. అలాగే ఈ నదిపై 50కిపైగా ఎత్తిపోతల పథకాలు ఉండగా 36 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. తుంగభద్ర నదిలో ఏటా 250 నుంచి 400 టీఎంసీలకుపైగా నీటి లభ్యత ఉంది. ఇందులో 10 శాతం నీటిని కూడా వినియోగించుకోని పరిస్థితులు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఈ ఏడాది 333 టీఎంసీల తుంగభద్ర జలాలు వృథా అయినట్లు సమాచారం. తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మించి ఉంటే 20 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మిస్తే 4 టీఎంసీలు, హగేరిపై వేదావతి స్కీమ్ పూర్తి చేస్తే 8 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉండేది. మాటలు.. నీటి మూటలు! కర్నూలు–కడప కాలువ కింద 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే 259 గ్రామాలకు తాగునీరు అందుతోంది. కేసీ కాలువకు 39.9 టీఎంసీల తుంగభద్ర నీటిని కేటాయించినా నిల్వ చేసుకునేందుకు అవసరమైన రిజర్వాయర్లు లేవు. సుంకేసులలో 1.2 టీఎంసీలు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 2.965 టీఎంసీలకు మాత్రమే నిల్వ చేయవచ్చు. కేసీ ఆయకట్టుకు రెండు పంటలకు నీరు ఇవ్వాలంటే గుండ్రేవుల అవసరమని 2014లో మొదటగా రూ.2,400 కోట్లతో అంచనాలు వేశారు. 2019 ఎన్నికలకు నెలన్నర ముందు పరిపాలన అనుమతులు ఇచ్చి..నామమాత్రంగానే శంకుస్థాపన చేసి వదిలేశారు. 2024 ఎన్నికల సమయంలో నారా లోకేష్ పాదయాత్రలో, ఎన్నికల ప్రచారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కచ్చితంగా గుండ్రేవుల నిర్మించి తీరుతామని హామీనిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మిస్తామని టీడీపీ మంత్రి చెప్పిన మాటకే నీటి మూట అయ్యింది. నిధులు ఇవ్వలేక.. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాల ఆయకట్టుకు 4 టీఎంసీల సాగు నీటిని అందించేందుకు ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టును రూ.1,985.42 కోట్లతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్ ఆనకట్ట కుడి వైపు హెడ్వర్క్, కొంత కాలువ పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాన ఏడాదిగా పనులు నిలిపి వేసింది. పనులకు ఈ ఏడాది జూలైలో గ్రీన్ ఇచ్చినా నిధులు ఇవ్వకలేదు. దీంతో పనులు మొదలు కాలేదు. తుంగభద్ర నదిపై నిర్మించాలనుకున్న గుండ్రేవుల ప్రాజెక్టు విషయంపై వివాదం ఉంది. ఈ ప్రాజెక్టు ప్రస్ధావన అసెంబ్లీలో వచ్చిందే. ఇంకేమీ లేదు. ఆర్డీఎస్ కుడి కాలువ, వేదావతి ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రూ. 30 కోట్ల నిధులు కూడా ఇస్తామని చెప్పారు. పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. – కబీర్ బాషా, జల వనరుల శాఖ, కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ వరద నీటిని వినియోగించుకోని కూటమి ప్రభుత్వం వృథా అయిన తుంగభద్ర నది జలాలు పూర్తికాని ఆర్డీఎస్ కుడి కాలువ వేదావతి ప్రాజెక్టులను పట్టించుకోని వైనం రైతులకు మిగిలింది క‘న్నీటి’ కష్టాలే!ప్రకటనకే పరిమితం ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లోని 80 వేల ఎకరాలకు హగేరి నది నుంచి సాగు నీటిని అందించేందుకు వేదావతి లిఫ్ట్ను రూ.1942.80 కోట్లతో గత ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. స్టేజ్–1, స్టేజ్–2 పనులు సుమారు రూ.106.2 కోట్ల పనులు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు నిలిపి వేశారు. తిరిగి పనులు మొదలు పెట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినా అది కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అయ్యాయి. -
స్తంభించిన నాపరాతి రవాణా
కొలిమిగుండ్ల: నాపరాళ్ల రవాణాకు సీనరేజ్ వసూలు చేసే బాధ్యత ప్రవేట్ సంస్థకు అప్పగించడంతో ఆదివారం నాపరాతి రవాణా స్తంభించింది. ట్రాక్టర్, లారీలకు ప్రతి ట్రిప్పుకు టన్నుల ప్రకారం సీనరేజ్ చెల్లించాల్సి వస్తోంది. దీంతో యజమానులు నాపరాతి గనుల్లోంచి రాళ్లను ఎగుమతి చేయకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. లోడింగ్, అన్లోడింగ్ కార్మికులు, ట్రాక్టర్, లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల, అవుకు మండలాల నుంచి ప్రతి రోజు ట్రాక్టర్లు 300, లారీలు 30 మేర ఇతర ప్రాంతాలకు నాపరాళ్లను ఎగుమతి చేస్తుంటారు. సీనరేజ్ కారణంగా నాపరాళ్ల వాహనాలు రవాణా కాక పోవడంతో ప్రధాన రహదారి బోసిపోయింది. సీనరేజ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ రాయల్టీలను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా బుక్ల రూపంలో ఇవ్వనున్నారు. ట్రాక్టర్కు 8 టన్నుల నుంచి 5 టన్నులకు కుదించినట్లు తెలుస్తుంది. అయినా ఒక్కో ట్రిప్పుకు రూ.1100కు పైగానే చెల్లించాల్సి రావడంతో యజమానులకు దిక్కుతోచడం లేదు. నాపరాళ్ల ట్రాక్టర్లు అడ్డగింత బేతంచెర్ల: బనగానపల్లె రహదారిలోని ప్రైవేట్ రాయల్టీ చెక్ పోస్టు వద్ద సిబ్బంది ఆదివారం బేతంచెర్ల పట్టణంలోకి వస్తున్న నాపరాళ్ల ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రాయల్టీలు ఉంటేనే పంపిస్తామని లేకపోతే పంపమని తెలపడంతో నాపరాళ్ల ట్రాక్టర్లు అన్నీ నిలిచిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాపరాళ్ల పరిశ్రమలకు రాయల్టీలు ఇస్తుండగా ప్రస్తుతం ప్రైవేటుకు అప్పగించడంతో బనగానపల్లె రహదారిలో చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రైవేటుకు అప్పగించడమే కానీ ఇంత వరకు గనుల యజమానులకు రాయల్టీలు ఇవ్వలేదు. రాయల్టీలు జారీ చేయకుండా ఇలా అడ్డుకుంటే తమ పరిస్థితి ఏంటని ట్రాక్టర్ల డ్రైవర్లు, లోడింగ్ కార్మికులు వాగ్వాదం చేయడంతో సిబ్బంది వదిలి వేశారు. -
ప్రాణం తీసిన నిద్రమత్తు
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం ఆళ్లగడ్డ: అతి వేగం, అపై నిద్రమత్తు ఒకరిని బలితీసుకుంది. కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని గూబగుండం మెట్ట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆళ్లగడ్డ పట్టణ ఎస్ఐ జయన్న తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా కమలాపురానికి చెందిన పిచ్చిరెడ్డి తిరుపతిలోని ఓ కారు షో రూంలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి కొత్త కారును కొనుగోలు చేయడంతో పిచ్చిరెడ్డి ఆ కారును డెలివరీ ఇచ్చేందుకు శనివారం అర్ధరాత్రి తర్వాత బయలుదేరాడు. మార్గమధ్యలో కడప దగ్గర నంద్యాలకు వెళ్లేందుకు నజీర్ హుస్సేన్, శ్రీను అనే ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ పట్టణ శివారులోని గూబగుండం మెట్ట సమీపంలోకి వచ్చే సరికి కారు నడుపుతున్న పిచ్చిరెడ్డి నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీటులో కూర్చున్న నజీర్హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందగా పిచ్చిరెడ్డి, శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన నజీర్ హుస్సేన్ది కడపవాసిగా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు. -
వైభవంగా మాల మల్లేశ్వర విగ్రహ ప్రతిష్ఠ
పత్తికొండ: పట్టణంలో నూతనంగా నిర్మించిన అలయంలో మాల మల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం వేద పండితులు హోమం నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠ పూజలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన బీరప్ప స్వాములు ఆదోని రహదారిలో హంద్రీనీవా కాలువ దగ్గర గంగపూజ చేపట్టారు. అనంతరం పట్టణంలోని పుర వీధుల్లోకి సంప్రదాయ నృత్యంతో బీరప్పస్వాములును నూతన అలయం దగ్గరకు తీసుకొచ్చారు. కాగా మాల మల్లేశ్వర స్వాములు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హిందూపురం మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ హాజరై ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి కురువలు అధిక సంఖ్యలో తరలిరావడంతో కొండగేరి, గాంధీ నగర్లో పండుగ వాతావరణం నెలకొంది. -
ఉడుము కనిపించెన్!
దొర్నిపాడు: ఉడుము ఒకప్పుడు పల్లెల్లో తరచూ కనిపించేవి. ప్రస్తుతం వాటి సంతతి కనుమరుగవుతుండటంతో చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఆదివారం దొర్నిపాడు పొలాల్లో మూడు అడుగుల పొడవైన ఉడుము ఆహార అన్వేషణలో భాగంగా పరుగులు తీస్తూ ఓ కల్వర్టు వద్ద ఆగిపోయింది. పొడవాటి మెడ, బలమైన కాళ్లు, శక్తివంతమైన తోక, పదునైన పళ్లతో కనిపించింది. పొలాల్లో, చిత్తడినేలలు, నదుల దగ్గర ఇవి నివసిస్తాయి. మాంసాహారులు కావడంతో కీటకాలు, చిన్న సరీసృపాలు, పక్షులు, వాటి గుడ్లను ఆహారంగా తీసుకుంటాయి. అప్పట్లో పెద్దలు ఏదైనా బలం ప్రదర్శించాలంటే ఉడుం పట్టు పట్టాలి అనే సామెతను వాడేవారు. వాటి కాళ్లలో అంత పట్టుత్వం ఉంటుంది. గతంలో కొందరు ఉడుము మాంసం తినేవారు. అంతరించిపోతున్న జాతుల్లో ఇది చేరడంతో దీనిని వేటాడితే వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. -
జీవ పరిణామం నిరంతర ప్రక్రియ
కర్నూలు(హాస్పిటల్): జీవ పరిణామం నిరంతర ప్రక్రియ అని, మనిషి మూలాలన్నీ ఆఫ్రికన్ నుంచే బయలుదేరి కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయని జనవిజ్ఞాన వేదిక నాయకులు, జనరల్ సర్జన్ డాక్టర్ కాలేషా బాషా చెప్పారు. నగరంలోని డాక్టర్ బ్రహ్మారెడ్డి హాస్పిటల్లోని కాన్ఫరెన్స్లో వైద్య విద్యార్థులకు నిర్వహిస్తున్న రెండు రోజుల హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ కాలేషా బాషా మాట్లాడుతూ.. మనిషి జీవన పరిణామక్రమం గురించి వివరించారు. డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడారు. జేవీవీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి.సురేష్కుమార్, రాష్ట్ర నాయకులు మహమ్మద్ మియ్యా, గోపాల్ నాయక్, రమణయ్య, శ్రీరాములు, ధనుంజయ్, మీనా, బాషా, వీరేష్ పాల్గొన్నారు. -
కోటి సంతకాలతో ప్రభుత్వ కళ్లు తెరిపిస్తాం
కర్నూలు (టౌన్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగించాలని చూస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. పీపీపీ విధానాన్ని విరమించుకునేంత వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో ఆదివారం కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి నేతల బినామీలకు కట్టబెట్టేందుకు పీపీపీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నారు. గత ప్రభుత్వం 17 వైద్య కళాశాలల నిర్మాణంలో భాగంగా వేలాది ఎకరాలు కేటాయించి ఒక్కొక్క బిల్డింగ్కు రూ.300 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వాటిని ఎలా ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తారని ప్రశ్నించారు. దాదాపు రూ.10 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించకూడదని ఇప్పటికే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని ఎస్వీ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రచ్చబండల వద్ద కోటి సంతకాల సేకరణ వచ్చే నెల 22 వరకు నిర్వహిస్తామన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్య, వైద్యం ఎలా అందిందో, సచివాలయాల వ్యవస్థ ఎలా పనిచేసిందో గ్రామ, మండల, నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అద్యక్షుడు రాఘవేంద్ర నాయుడు, కార్పొరేటర్ షాషా వలీ, పార్టీ నేతలు లాజరస్, వస్తాద్, నీలకంటూ, రాజశేఖర్, శ్రీను పాల్గొన్నారు. పీపీపీ విధానాన్ని విరమించుకోవాలి వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి కర్నూలు కల్చరల్: జిల్లాలో ఈనెల 16న ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారని, ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. నన్నూరు టోల్గేట్ వద్ద సభా ప్రాంగణం, హెలిపాడ్ ఏర్పాట్లను ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాని వచ్చే దారిలో బ్యారికేడింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. సభ ప్రాంగణంలో హెలిపాడ్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు భరత్ గుప్తా, శౌర్యమాన్ పటేల్, అన్నమయ్య జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర భరద్వాజ్, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ తదితరులు పాల్గొన్నారు. పొరపాట్లకు తావివ్వొద్దు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లపై విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలన్నారు. కాన్ఫరెన్స్లో ఐఏఎస్ అధికారులు, జేసీలు, సబ్ కలెక్టర్లు పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు కర్నూలు: ప్రధాని నరేంద్రమోదీ జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సెక్టార్, లైజనింగ్ పోలీసు అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్ గురించి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ గురించి, వీఐపీ కాన్వాయ్ రూట్, ఏఏ నియోజక వర్గాల నుంచి ఎంతమంది ప్రజలు వస్తున్నారని క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలనే విషయాల గురించి జియోగ్రాఫికల్ మ్యాప్లు చూపిస్తూ దిశానిర్దేశం చేశారు. ప్రతి సెక్టారు ఇన్చార్జీ, లైజనింగ్ ఆఫీసర్ విధి నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. ● ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను నాగలాపురం దగ్గర రూట్ మళ్లించాలన్నారు. బస్తిపాడు. చిన్నటేకూరు, తడకనపల్లి మీదుగా రాగమయూరి దగ్గర ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ● డోన్, ప్యాపిలి, పత్తికొండ, తగ్గలి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు హైవేలో రాగమయూరి దగ్గరకు చేరుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ● నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు రాగమయూరి దగ్గర ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ● పార్కింగ్ ప్రాంతాల్లో ఆయా నియోజక వర్గాల ఇండికేషన్ సైనింగ్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ● సమావేశంలో ఐపీఎస్ అధికారులు పరమేశ్వరరెడ్డి, దేవరాజ్, మాధవరెడ్డి, దీపికాపాటిల్, జి.కృష్ణకాంత్ పటేల్, శ్రీనివాసరావు, మణికంఠచందవోలు, దీరజ్కునిబిల్లి, చక్రవర్తి, లక్ష్మినారాయణ, ట్రైనీ ఐపీఎస్లు అడిషినల్ ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు. -
వలసబాట పట్టిన ఆగవేళి
కోడుమూరు రూరల్: కృష్ణగిరి మండలంలోని ఆగవేళి గ్రామానికి చెందిన సుమారు 100మందికి పైగా వ్యవసాయ కూలీలు బతుకు తెరువుకోసం ఆదివారం ఆరు బొలేరో వాహనాల్లో గుంటూరుకు వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ కూలీలు కోడుమూరులో తమ వాహనాలను ఆపుకుని కిరాణా సరుకులు, తిండిగింజలను కొనుగోలు చేసుకుని వెళుతూ కన్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు సాగు చేసిన పంటలన్నీ దెబ్బతిన్నాయని, ఉన్న ఊర్లో చేసేందుకు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గుంటూరులో పనులున్నాయని కొందరు చెప్పడంతో అక్కడికి వెళుతున్నామని చెప్పారు. -
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకుని ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పులకించారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. నేడు పీజీఆర్ఎస్ రద్దు కర్నూలు కల్చరల్: ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈనెల 13వ తేదీ సోమవారం జిల్లాలో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిస్కార వేదిక కార్యక్రమాన్ని (పీజీఆర్ఎస్) రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లలో జిల్లా అఽధికారులు, ఉద్యోగులు నిమగ్నమైనందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దయిందని కలెక్టర్ పేర్కొన్నారు. 14న విద్యుత్ ఉద్యోగుల వర్క్టురూల్ కర్నూలు(అగ్రికల్చర్): జేఏసీ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 14న వర్క్ టు రూల్ ప్రకారం విధులు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 3500 మంది విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తుండగా సోమవారం 2500 మంది సెలవు పెట్టి చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళ్లారు. కాగా.. ఈ నెల 15 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడానికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇది వరకే నిర్ణయించింది. -
ముల్లె సర్దుకున్నాం.. వెళ్లిపోతున్నాం!
కోసిగి: జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బతుకు తెరువు కోసం పిల్లా పాపలతో కలిసి మూటాముల్లె సర్దుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఖరీఫ్ సీజన్ ముగియక ముందే ఈ ఏడాది పనుల కోసం కూలీలు, రైతులు వలసబాట పట్టారు. కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పంటలన్నీ పూర్తిగా దెబ్బతిని రైతులకు తీరని నష్టం మిగిలింది. ఏటా పనులు ముగించుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఈఏడాది ఖరీఫ్ పూర్తికాక ముందే కోసిగి, కౌతాళం మండలాల నుంచి పక్షం రోజులుగా వివిధ వాహనాల్లో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు తరలి వెళ్లుతున్నారు. ఆదివారం కోసిగి మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 30కి పైగా టెంపోల్లో 1500 మందికి పైగా కూలీలు తరలి వెళ్లారు. మండలంలోని కోసిగిలోని కొండుగానీ వీధి, కింద మారెమ్మ దేవి, నాగన్నగేరి, దుర్నిగేని, విద్యుత్ సబ్ స్టేషన్ సమీప కాలనీ, రామక్కమ్మ కాలనీల నుంచే కాక దుద్ది, చింతకుంట, పల్లెపాడు, కామన్దొడ్డి, పెద్దకడబూరు మండలంలోని గవిగట్టు, పీకలబెట్ట, బాపుల దొడ్డి, కౌతాళం మండలంలోని మరళి, గుడింకబాలి, హాల్వి, తదితర గ్రామాల నుంచి తరలి వెళ్లారు. ఇందులో కొందురు కర్ణాటక రాష్ట్రంలోని సైదాపూర్, గబ్బూర్, మటమారి, మర్చటాల్ ప్రాంతాలకు తెలంగాణ ప్రాంతంలో పలు ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇళ్లకు తాళాలు వేసుకుని బడికి వెళ్లే పిల్లలను సైతం తమ వెంట తీసుకెళ్లారు. వలసలు ఎందుకంటే.. వలస వెళ్లిన ప్రాంతంలో పత్తి పొలాల్లో చిరు రైతులు, వ్యవసాయ కూలీలు పనులు చేసుకుని జీవనం సాగిస్తారు.ఒక్కొక్కరికి రోజుకు రూ.1000 కూలి లభిస్తుంది. తమ వెంట తీసుకెళ్లిన పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు అందరూ పనులు చేస్తారు. ఉన్న ఊరిలో పనులు దొరకక పోగా కుటుంబ పోషణ భారం కావడంతో దూర ప్రాంతాలకు ప్రజలు వలస వెళ్తున్నారు. కొన్నాళ్ల పాటు పనులు చేసి డబ్బులు సంపాదించుకుని మళ్లీ గ్రామాలకు చేరుకుంటామని పలువురు కూలీలు తెలిపారు. వలస వెళ్లిన ప్రాంతాల్లో జీవనం దుర్భరంగా ఉంటుందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లోను గూడారాలు వేసుకుని, మరికొన్ని ప్రాంతాల్లో పొలాల యజమానుల షెడ్లలో నివసిసస్తూ కాలం గడుపుతామని చెప్పారు. మాకున్న ఇద్దరు కుమారులు బతుకు తెరువు కోసం భార్యలు, పిల్లలతో కలిసి పనుల కోసం తెలంగాణ ప్రాంతానికి వెళ్లారు. ప్రతి ఏటా మాకు ఇదే పరిస్థితి. మాకు చేతకాక పోవడంతో ఇళ్ల వద్ద కాపలా ఉన్నాం. పిల్లలు అప్పుడు వస్తారు, ఇప్పుడు వస్తారంటూ ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాం. ఒక పూట తింటూ మరొక పూట పస్తులు ఉంటూ ఇబ్బందులు పడుతున్నాం. ఈ కష్టం ఎవరికీ రాకూడదు. – హనుమయ్యగారి లసుమయ్య, సంజమ్మ, కోసిగి పనుల్లేక వలసబాట పడుతున్న ప్రజలు బడికి వెళ్లే పిల్లలను తమతో తీసుకెళ్తున్న వైనం ఇళ్లకు తాళాలు.. ఖాళీ అవుతున్న పల్లెలు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం -
ముగిసిన పవిత్రోత్సవాలు
● పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన అహోబిల పవిత్రోత్సవాలు ● గోవింద నామస్మరణతో హోరెత్తిన నల్లమల ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వెలసిన శ్రీప్రహ్లాదవరదస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం తెల్లవారుజామున పూర్ణాహుతితో ముగిశాయి. శనివారం రాత్రి నుంచి వైభవోపేతంగా పూజలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంత్ర మహాదేశికన్ స్వామీజీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు ముందుగా గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, అర్ధరాత్రి అనంతరం ఉత్సవ మూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, సంప్రోక్షణం చేపట్టారు. ఆదివారం తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. ఏడాది పొడువునా ఆలయంలో నిర్వహించే నిత్యకై ంకర్యాలు, వార, మాస, వార్షిక మహోత్సవాలు, ఇతరత్రా పూజాది కార్యక్రమాల్లో తెలసీ తెలియక చేసిన తప్పుల వలన ఏర్పడిన దోష నివారణకు ఏటా నియమనిష్టలతో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
విత్తుకోని ఆశలు.. పొలాలు బీళ్లు!
కర్నూలు (అగ్రికల్చర్): రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతుకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఎరువులు అందక, ప్రకృతి సహకరించక, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేక నష్టాలే మిగులుతున్నాయి. ఖరీఫ్లో వేసిన పంటలన్నీ మట్టిపాలయ్యాయి. అరకొర పండిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర కూడా లభించక మట్టి మనిషికి కన్నీళ్లే దిక్కయ్యాయి. రబీపై ఆశలు పెట్టుకున్నా.. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా మొండికేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంతో చాలా పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అవసరం ఎక్కువ... కేటాయింపు తక్కువ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 4.22 లక్షల హెక్టార్లు ఉండగా 3.85 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రకృతి వైపర్యీతాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పంటలు దెబ్బతిని 2.50 లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీలో శనగ సాగు చేద్దామనుకుంటే సబ్సిడీ విత్తనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. విత్తనం వేయకపోవడంతో పొలాలు బీళ్లుగా దర్శనం ఇస్తున్నాయి. జిల్లాకు 46 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించగా 23,897 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. వీటిలో 10 వేల క్వింటాళ్లు ఏపీ సీడ్స్లో ఉన్నాయి. ప్రయివేటు విత్తన కంపెనీల దగ్గర శనగ విత్తనాలు ఉన్నప్పటికీ గత ఏడాదికి సంబంధించిన బకాయిలను ఇప్పటికి చెల్లించలేదు. ఉన్న అరకొర విత్తనం ఎవరికి పంపిణీ చేయాలో తెలియక వ్యవసాయ అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రబీలో శనగతో పాటు వేరుశనగ, జొన్న తదితర పంటలు సాగు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం శనగ విత్తనాలను మినహా ఇతర విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేయడానికి తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం నిల్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టింది. కేంద్ర వాటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ ప్రారంభంలోనే కొన్ని పంటలు దెబ్బతిన్నా పరిహారం ఇవ్వలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 చెల్లిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.14 వేలకు కుదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంట రుణాల పంపిణీలో నిర్లక్ష్యం రైతులకు ఎటువంటి హామీ లేకుండానే రూ.2లక్షల వరకు రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎటువంటి చర్యలు లేవు. పంటరుణాల పంపిణీలో కొన్ని బ్యాంకులు తీవ్ర అలసత్వం వహించాయి. ఖరీఫ్ సీజన్ సెప్టెంబరు నెల చివరితోముగిసింది. ఖరీఫ్లో రూ.3,635.62 కోట్లు పంట రుణాలుగా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించినా రూ.2,537.61 కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్లు స్పష్టం అవుతోంది. పలు బ్యాంకులు కొత్త రైతులకు రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రబీ సీజన్లో రూ.2,526.44 కోట్లు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఖరీఫ్లో రైతులకు మొండిచెయ్యి చూపిన బ్యాంకులు రబీలో పంపిణీ చేయడం అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎరువులు అందేనా? రబీ సీజన్లో శనగ, జొన్న, వాము, వరి, వేరుశనగ తదితర పంటలు కర్నూలు జిల్లాలో 1.01 లక్షలు, నంద్యాల జిల్లా 1.73 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాకు లక్ష టన్నులు, నంద్యాల జిల్లాకు 1.52 లక్షల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. రబీలోనూ ఎరువుల సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర ఎక్కువ.. సబ్సిడీ తక్కువ బహిరంగ మార్కెట్లో శనగల కిలో ధర గరిష్టంగా రూ.55 వరకు మాత్రమే ఉంది. ప్రభుత్వం సబ్సిడీ పోను కిలో శనగ విత్తనాలను రూ.58.50 ప్రకారం పంపిణీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధిక ధర నిర్ణయించి సబ్సిడీ మాత్రంగా 25 శాతానికే పరిమితం చేయడంతో రైతులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసే శనగ విత్తనాలు కిలో ధరను రూ.78గా నిర్ణయించింది. ఇందులో 25శాతం సబ్సిడీ (రూ.19.50) పోగా రైతులు కిలోకు రూ.58.50 చెల్లించాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకు లభిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఆంద్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ 20కిలోల ప్యాకెట్లతో శనగ విత్తనాలు సిద్ధం చేస్తోంది. ఎకరాకు 80కిలోల శనగలు అవసరం. అయితే ఎకరాకు 60 కిలోలు(3 ప్యాకెట్లు) మాత్రమే పంపిణీ చేయనున్నారు. భూమిని బట్టి ఎకరాకు గరిష్టంగా 10 ప్యాకెట్లు( 2 క్వింటాళ్లు) పంపిణీ చేస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రారంభమైన రబీ అతీగతీ లేని సబ్సిడీ విత్తనాలు అరకొరగా పంట రుణాల పంపిణీ వేధిస్తున్న ఎరువుల సమస్య పొంచి ఉన్న అధిక వర్షాల గండం -
బిట్కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు
కర్నూలు: బిట్కాయిన్ పెట్టుబడుల విషయంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తున్నాయంటూ ఫాలోయర్లకు నకిలీ లింకులు పంపుతున్నారని, బిట్కాయిన్ను క్రిప్టో కరెన్సీలలో మదుపు చేస్తే లాభాలంటూ స్నేహితులకు సందేశాలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. లాభాలు వచ్చినట్లు కొన్ని ఫొటోలు చూపించి ఆశ కల్పిస్తారని, ఆ సందేశాలు చూసి కొందరు లింకు ద్వారా రూ.లక్షల్లో నగదు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా టెలిగ్రామ్, ఫేస్బుక్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి లింకులు వస్తే అసలు క్లిక్ చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి ఎవరైనా గురైతే వెంటనే సైబర్ క్రైం 1930 హెల్ప్లైన్ నంబర్కు, అలాగే www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
పీజీ ఇన్ సర్వీస్ ఇవ్వాలి
పీహెచ్సీల్లో పనిచేసే వైద్యులకు గత పీజీ కోటానే పునరుద్ధరించాలి. అలాగే గత సంవత్సరం సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్)గా విధుల్లో చేరిన వారికి కూడా పీజీ ఇన్ సర్వీస్ ఇవ్వాలి. 15 ఏళ్లకు మించి సీఏఎస్గా ఉన్న వారికి టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలి. ట్రైబల్లో పనిచేస్తున్న వైద్యులకు ప్రభుత్వం ఇస్తామని చెప్పిన అలవెన్సులు ఇవ్వాలి. అప్పటి వరకు మేం మా పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –డాక్టర్ ఆర్. విజయభాస్కర్, జనరల్ సెక్రటరీ, ఏపీ పీహెచ్సీ డాక్టర్స్ అసోసియేషన్, కర్నూలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.2,700కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి 8 నెలలుగా బిల్లులు ప్రాసెస్ కావడం లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రావడం లేదు. మరోవైపు 15 ఏళ్ల క్రితం నాటి ప్యాకేజీలే ఇప్పుడు ఉన్నాయి. ధరలు పెరగడం వల్ల ఆసుపత్రుల నిర్వహణ కష్టమైంది. ఈ పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాల్సి వచ్చింది. మేం చర్చలకు రావాలంటే ముందుగా క్లియరెన్స్లో ఉన్న రూ.2,700కోట్లు తక్షణం విడుదల చేయాలి. మిగిలిన మొత్తం ఎలా ఇస్తారో హామీ ఇవ్వాలి. త్వరలో ప్రారంభించనున్న యూనివర్శల్ హెల్త్ ప్యాకేజీ విధి విధానాల్లో ప్రైవేటు ఆసుపత్రులను భాగస్వామ్యం చేయాలి. – డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్, ఏపీ ప్రైవేటు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, జిల్లా కార్యదర్శి -
కమనీయం.. ప్రహ్లాదవరదుడి పవిత్రోత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందు లో భాగంగా శనివారం తెల్లవారు జామున మూలవిరాట్ శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం ప్రత్యేక అర్చనలు, హారతులతో పూజలు చేశారు. అనంతరం పవిత్ర యాగశాలలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వాములను కొలువుంచి నవకలశ స్నపనం, ద్వారతోరణ పూజ, మండల ప్రతిష్ట, కుంభ ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర హోమం నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుంచి మంగళ వాయిద్యాల మధ్య మాడ వీధుల్లో గ్రామోత్సవం చేపట్టారు. -
జిల్లా అభివృద్ధికి కృషి
● జేసీగా బాధ్యతలు స్వీకరించిన నూరుల్ ఖమర్ కర్నూలు(సెంట్రల్): జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అధికారుల సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం జేసీని డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, సీపీఓ భారతి, సివిల్ సప్లయ్ డీఎం వెంకటరాముడు, డీఎస్ఓ రాజారఘువీర్, ఏపీ ఆర్. శివరాముడు తదితరులు అభినందించారు. 22న యువజనోత్సవ పోటీలు ● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కర్నూలు(సెంట్రల్): యువజనోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 22న కర్నూలులోని రవీంద్ర మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి పోటీలను ఏడు విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో సెట్కూరు సీఈఓ వేణుగోపాల్తో కలసి యువజనోత్సవ పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో మొదటి స్థానంలో నిలిచిన విజేతలను రాష్ట్ర స్థాయికి, రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. ఆయా పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విజేతలకు జనవరం 12న యువజన దినోత్సవం సందర్భంగా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను 22వ తేదీలోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, వెబ్సైట్ ఇతర వివరాల కోసం 9292207601కు ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐఓ లాలెప్ప, ఏఓ శివరాముడు, సెట్కూరు పర్యవేక్షణాధికారి శ్యామ్బాబు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పుత్తుల ధరలు మరింత పతనం కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మా ర్కెట్లో ధరలు మరింత పడిపోయాయి. వేరుశనగ మద్దతు ధర రూ.7,263 ఉండగా మా ర్కెట్ లో గరిష్టంగా లభించిన ధర రూ.5,800 మా త్రమే. మార్కెట్కు 85 లాట్ల వేరుశనగ వచ్చింది. కనిష్టంగా రూ.3,402, గరిష్టంగా రూ.5,800 లభించగా.. సగటు ధర రూ.5,266 నమోదైంది. ● మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400. మార్కెట్లో మాత్రం కనిష్ట ధర రూ.1,695, గరిష్ట ధర రూ.1,721 మాత్రమే లభిస్తోంది. ● సజ్జకు మద్దతు ధర రూ.2775 ఉండగా మార్కెట్లో కనిష్టంగా రూ.1661, గరిష్టంగా రూ.2,200 పలికింది. సగటు ధర రూ.1850 నమోదైంది. ● మార్కెట్కు రూ.2,174 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. కనిష్ట ధర రూ.208, గరిష్ట ధర రూ.1289 లభించగా.. సగటు ధర రూ.587 నమోదైంది. అన్ని రకాల పంట ఉత్పత్తుల ధరలు పడిపోయి రైతులు అల్లాడుతున్నా కూటమి ప్రభుత్వం మేల్కొనకపోవడం గమనార్హం. -
అందని ఆరోగ్య‘సిరి’
రాష్ట్ర వ్యాప్తంగా తమకు బకాయి ఉన్న రూ.3వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) నెట్వర్క్ ఆసుపత్రులు శుక్రవారం నుంచి సమ్మె ప్రారంభించాయి. గత నెలలోనే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం నాయకులు ఓపీ సేవలు నిలిపివేసి నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తప్పనిసరై వారు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా 57, నంద్యాల జిల్లాలో 25 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో కొన్ని ఆసుపత్రులు రోగులకు అత్యవసర వైద్యం అందించేందుకు తాత్కాలికంగా వైద్యసేవలు అందిస్తున్నా ఆరోగ్యశ్రీలో నమోదు చేయడం లేదు. అడ్మిషన్ అవసరమైన వారికి ప్రాథమిక చికిత్స చేసి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నాయి. తర్వాత ఆపరేషన్ చేయాలనుకున్న వారికి మళ్లీ రావాలని వెనక్కి పంపిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయని కొందరు ముందుగానే తెలుసుకుని వాటికి రావడం మానేశారు. అయితే కర్నూలులో ఓ ప్రజాప్రతినిధికి సంబంధించి ఆసుపత్రితో పాటు మరికొన్ని ఆసుపత్రులు సమ్మెకు దూరంగా ఉన్నాయి. దీంతో అత్యవసర చికిత్స అవసరమైన వారిని సమ్మె చేస్తున్న ఆసుపత్రుల నుంచి అక్కడికి రెఫర్ చేస్తున్నారు. -
మోదీ పర్యటనను విజయవంతం చేద్దాం
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని మంత్రులు బీసీ జనార్థన్రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం నన్నూరు సమీపంలోని రాగమయూరిలో జరుగుతున్న ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పీఎం ప్రోగ్రామ్ నోడల్ అధికారి వీరపాండియన్, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్పాటిల్ తదితరులు పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ స్థానికంగా టోల్ గేట్ వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 16వ తేదీన టోల్ఫీజు లేకుండా వాహనాలను వదలాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ప్రోగ్రామ్ నోడల్ అధికారి వీరపాండియన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం, కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైల దర్శనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి మోదీ బహిరంగసభలో పాల్గొంటారన్నారు. సభా ప్రాంగణంలోకి పెన్నులు, నోటుబుక్లు, మ్యాచ్ బాక్సులు, సిగరెట్లు, స్నాక్స్ వంటివి అనుమతించకూడదని, కేవలం నీటిని మాత్రం కప్ల ద్వారా ట్రేలలో అందిస్తారన్నారు. సెక్యూరిటీ పరంగా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలాఉంటే ఆదివారం ప్రధానమంత్రి పర్యటించే రూట్లన్నీ ఎస్పీజీ సెక్యూరిటీ ఆధీనంలోకి వెళ్తాయని ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్, విజయ సునీత, శివ్ నారాయణ్, డాక్టర్ బి.నవ్య, గణేష్కుమార్, గీతాంజలి, జేసీ నూరుల్ ఖమర్, ఆదోని సబ్ కలెక్టర్ భరద్వాజ్ పాల్గొన్నారు. -
సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
నందికొట్కూరు: సారా తయారీ చేసినా, విక్రయించినా చట్ట పరమైన చర్యలు తప్పవని కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎకై ్స జ్ సూపరిటెండెంట్ రాజశేఖర్గౌడ్ హెచ్చరించారు. శనివారం పట్టణంలోని నీలిషికారిపేటలో రాజశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ఎకై ్సజ్ పోలీసులు సారా స్థావరాలపై దాడి చేసి 220 లీటర్ల బెల్లం ఊటను, 10 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. పట్టణంలో సారా తయారీ స్థావరాలపై దాడులు చేయడంతో పాటు కల్లు దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సారా రవాణా చేస్తే క్రిమినల్ కేసులతో పాటు వాహనాలు సీజ్ చేసి జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. దాడుల్లో కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ మారుతి ప్రసాద్,పట్టణ ఎకై ్స జ్శాఖ ఎస్ఐ జప్రూల్లా, హెడ్ కానిస్టేబుల్ కృపవర కుమారి, పద్మనాభం, రామాంజనేయులు, పోలీసులు మధుసూదన్, ప్రసాద్, శ్వేతారాణి, రమిజాబీ, అల్లాస్వామి, జయచంద్రుడు, మధుసూదన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కామినేని హాస్పిటల్ వద్ద మృతదేహంతో ఆందోళన
కర్నూలు(హాస్పిటల్): గుండెపోటుతో వచ్చిన రోగి మృతిచెందడంతో కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్ ఎదురుగా ఉన్న జెమ్కేర్ కామినేని హాస్పిటల్ వద్ద మృతుని కుటుంబ సభ్యులు శనివారం ఆందోళన చేశారు. కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన పెద్దమాదన్న(56)కు గుండెపోటు రావడంతో ఈనెల 5న కామినేని హాస్పిటల్లో చేర్పించారు. మల ద్వారం నుంచి రక్తస్రావం అవుతుండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గురు, శుక్రవారాల్లో కూడా గుండె ఆపరేషన్ వాయిదా పడింది. కాగా శనివారం మధ్యాహ్నం ఆయన కోలుకోలేక మృతిచెందాడు. వైద్యులు సకాలంలో ఆపరేషన్ చేసి ఉంటే బతికేవాడంటూ అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
చికిత్స పొందుతూ కోలుకోలేక మహిళ మృతి
ఎమ్మిగనూరురూరల్: ఆత్మహత్యాయ త్నానికి పాల్పడిన మహిళ చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం అర్ధరాత్రి చెందింది. ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన ధనుంజయ్గౌడ్, శశికళ(30) ప్రేమించుకున్నారు. వీరికి వేర్వేరుగా పెళ్లిళ్లు అయినా ఇద్దరు కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్లు కలసి ఉండగా ఈ నెల 6వ తేదీన శశికళ వేధిస్తుందని ధనుంజయ్గౌడ్ పురుగు మందు తాగి ఆత్మహత్మ చేసుకున్నాడు. మరసటి రోజే శశికళ పురుగు మందు తాగడంతో చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం రాత్రి మృతి చెందింది. క్షణికావేశంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవటంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
పత్తి మద్దతు కొనుగోళ్లు మరింత ఆలస్యం
కర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లు మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే దాదాపు 2 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకాలు జరిగాయి. పత్తి కనీస మద్దతు ధర రూ.8,110 ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో క్వింటా పత్తి రూ.6,500 నుంచి రూ.7వేల వరకు ధరతో అమ్ముకొని నష్టపోయారు. ఈ ఏడాది ఖరీఫ్లో పత్తి సాధారణ సాగు 2,34,409 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 2.26 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. అధిక వర్షాల వల్ల పత్తి పంట భారీగా దెబ్బతినింది. దిగుబడులు హెక్టారుకు కనీసం 10 క్వింటాళ్లు పడిపోయింది. అంతంతమాత్రం వచ్చిన దిగుబడులకు కూడా ధర లేకపోవడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచే మార్కెట్లోకి పత్తి వస్తోంది. మామూలుగా అయితే సెప్టెంబర్ 20 నాటికే సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు జిన్నింగ్ మిల్లులను కూడా నోటిఫై చేయలేదంటే కూటమి ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది. మార్కెటింగ్ శాఖ అధికారుల సమాచారం మేరకు ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్లీక్ ఘటనలో గాయపడిన తల్లి, బిడ్డ మృతి వెల్దుర్తి: వంట గ్యాస్ లీకై బోయనపల్లె గ్రామంలో గత ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వడ్డె నాగరాజు కోలుకోలేక కర్నూలులోని ఆసుపత్రిలో శుక్రవారం మృతి చెందారు. శనివారం ఉదయం గర్భిణి సువర్ణకు అబార్షన్ అయ్యింది. అనంతరం చిన్న కుమారుడు నాలుగేళ్ల చరణ్ కోలుకోలేక మృతి చెందాడు. తండ్రి, కుమారుడి అంత్యక్రియలు బోయనపల్లె గ్రామంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన అనంతరం కర్నూలు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న సువర్ణ సైతం మృతి చెందింది. దీంతో గ్యాస్ లీక్ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది.ప్రస్తుతం ఆసుపత్రిలో 12 ఏళ్ల అనిల్ చికిత్స పొందుతున్నాడు. కూలీ పనులు చేసి జీవనం సాగించే వడ్డె నాగరాజు కుటుంబంలో ఒక్కసారిగా ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈతకు వెళ్లి వ్యవసాయ విద్యార్థి మృతి మహానంది: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం బలిగొంది. మహానంది సమీపంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి పాలేరు వాగులో నీట మునిగి మృతి చెందాడు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండలం జిల్లెలమంద సమీపంలోని పెద్దతాండకు చెందిన బి.జనార్దన్నాయక్ (21) మహానంది సమీపంలోని వ్యవసాయ కళాశాలలో మూడో సంవత్సవరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం కళాశాల సమీపంలోని పాలేరువాగు వద్దకు తోటి విద్యార్ధులతో కలిసి వెళ్లాడు. అక్కడ కొంత మంది దుస్తులను శుభ్రం చేసుకోవడంతో పాటు ఈతకు దిగారు. ఈ క్రమంలో ఐదారుగురు ఈతకు దిగగా సరిగా ఈత రాని జనార్ధన్ నాయక్ వాగులోకి దిగాడు. కొద్ది సేపటికి పక్కనే ఉన్న అతను కనిపించకపోవడంతో మిగిలిన విద్యార్థులు అన్వేషించగా అక్కడే లోతు ఉన్న గుంతలో అపస్మారక స్థితిలో కనిపించాడు. బయటికి తీసి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, పోలీసులు, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కష్టం కరిగి.. నష్టం మిగిలి
తుగ్గలి/ కోడుమూరు రూరల్: ఆరుగాలం కష్టించి, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పండించిన ఉల్లి పంటకు ధర లేకపోవడంతో రైతులకు నష్టమే మిగులుతోంది. తుగ్గలి మండలం రాతనకు చెందిన రైతు వీరాంజనేయులు ఉల్లి పంటను కోసి వృథాగా పడేశాడు. తనకున్న 3.5 ఎకరాలతో పాటు ఎకరా రూ.15వేలు చొప్పున మరో రెండెకరాలు గుత్తకు తీసుకుని ఉల్లి పంట సాగు చేశాడు. మొత్తం రూ.3లక్షల పెట్టుబడి పెట్టాడు. ఉల్లి పంట మధ్యలో వాము పంటవేశాడు. దాన్ని కాపాడుకునేందుకు ఉల్లి పంట పీకి పారబోస్తున్నట్లు చెప్పారు. కోడుమూరులో ఓ రైతు పొలంలో నుంచి ఉల్లిగడ్డలను తెచ్చి ఖాళీ స్థలంలో కుప్పగా పోసి పశువులకు మేతగా వదిలేశారు. గిట్టుబాటు ధరలేక పశువులకు ఉల్లి పంటను మేతగా వదిలేయడాన్ని చూసిన జనాలు అయ్యో పాపం రైతన్న అంటూ నిట్టూర్చారు. కోడుమూరులో ఉల్లిని పశువులకు వదిలేసిన దృశ్యం -
మృత శిశువు కలకలం
నంద్యాల: పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఏ తల్లికి పుట్టిన బిడ్డో, ఎందుకు భారమయ్యాడో తెలియదు కాని చిన్నారి మృతదేహాన్ని ఇళ్ల మధ్యలో ఉన్న డ్రైనేజీలో పడేసి పోయారు. చనిపోయాక అక్కడ పడేశారా.. లేక ప్రాణం ఉన్న శిశువును అక్కడ వదిలేయడంతో మరణించారా అన్నది తెలియాల్సి ఉంది. పట్టణంలోని విశ్వనగర్ ఇళ్ల మధ్యలో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు డ్రైనేజీ కాల్వ వద్దకు వెళ్లి చూడగా అక్కడ మగ శిశువు మృతదేహం కనిపించింది. ఎప్పుడు అక్కడ పడేశారో తెలియదు కాని శిశువు మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. ఈ విషయాన్ని స్థానికులు టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ అస్రార్బాషా, ఎస్ఐ సురేష్ అక్కడ చేరుకొని శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. శిశువు మృతదేహాన్ని బట్టి కొన్ని రోజుల క్రితమే ఇక్కడ పడేసినట్లు కనిపిస్తుందని, స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా వారి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆరిపోయిన ఆశల దీపం ● స్కూటర్పై నుంచి పడి బాలుడి మృతి మంత్రాలయం రూరల్ : విధి ఆడిన నాటకంలో ఓ చిన్నారి జీవితం అర్థంతరంగా ముగిసిపోయింది. ఆ ఇంట తీరని శోకాన్ని నింపింది. మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన దేవర నాగప్ప, వీరేషమ్మ దంపతుల ఏకై క పుత్రుడు భీరప్ప (5). వంశాంకురమని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆ ఇంటిల్లిపాది తమ భవిష్యత్తును తనలోనే చూసుకున్నారు. పెద్దనాన్న సైతం అతనిపై ప్రాణం పెంచుకున్నాడు. శనివారం రోజూలాగే పెద్దనాన్న భీరప్పను తన స్కూటర్పై గ్రామంలోని మారెమ్మ దేవాలయం చెంతకు తీసుకెళ్లాడు. స్కూటర్ను ఆపుకుని ఉండగా అటుగా కాజన్న తన ఎడ్ల బండితో పొలానికి వెళ్తుండగా.. ఒక్కసారిగా ఎద్దులు బెదిరి స్కూటర్ వైపు దూసుకెళ్లాయి. ఎద్దులు స్కూటర్ను తగలడంతో పడిపోయింది. అయితే బైక్పై ఉన్న భీరప్ప దాని కింద పడటంతో మృతి చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు తనువు చాలించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. గ్రామమంతా శోకసంద్రంగా మారింది. -
ముగతి పేటలో చోరీ
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ముగతి పేటలో శనివారం చోరి జరిగింది. కాలనీకి చెందిన యూసూఫ్ ఆటో మోకానిక్గా పనిచేస్తున్నాడు. భార్యకు ఆరోగ్యం బాగలేకపోతే ఆదోనిలోని ఓ హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నాడు. రోజూ ఆదోనికి వెళ్లి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆదోనికి వెళ్లి శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బీరువాలో ఉన్న 12 తులాల బంగారు, కేజీ వెండి, రూ. 70వేలు నగదు చోరీకి గురైనట్లు యూసుఫ్ తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారిస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్ర సందర్శనకు ఈ నెల 16న భారత ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న నేపథ్యంలో భద్రత పరంగా పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్ బలగాలతో శనివారం ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, శ్రీశైలం సీఐ జి.ప్రసాదరావు ఆధ్వర్యంలో శ్రీశైల ఆలయం, ఆలయ పరిసరాలు, హెలిపాడ్, నల్లమల అడవుల్లో కూంబింగ్ నిర్వహించారు. అంతకు ముందు స్థానిక పోలీసు స్టేషన్లో గ్రేహౌండ్స్ బలగాలకు ప్రత్యేక సూచనలు చేశారు. ప్రధాని పర్యటన ముగిసేంత వరకు నల్లమల అడవుల్లో కూంబింగ్ నిర్వహించడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. -
కరువునేలలో పసిడి పంట
తుగ్గలి (కర్నూలు జిల్లా): కరువు నేలల్లో పసిడి పంట పండనుంది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలిసారి ప్రైవేటు గోల్డ్ మైనింగ్ కంపెనీ బంగారం నిక్షేపాల వెలికితీతకు సిద్ధమైంది. నాలుగు దశాబ్దాల పాటు చేసిన సర్వేలు, పరిశోధనలు ఫలించడంతో ఈ నెలాఖరున పట్టాలెక్కనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, బొల్లవానిపల్లి, జీ.ఎర్రగుడి పరిసర ప్రాంతాల్లో 597.82 హెక్టార్లలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు సర్వేల్లో గుర్తించారు. ఆ నిక్షేపాలను వెలికితీసేందుకు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. కంపెనీలో 70 శాతం వాటాతో త్రివేణి ఎర్త్మూవర్స్, ప్రాకార్, లాయిడ్స్ మెటల్స్ ప్రధాన వాటాదారు. డెక్కన్ గోల్డ్ మైన్స్ 27.27 శాతం వాటా కలిగి ఉంది. ప్రధాన వాటాదారు మైనింగ్ దిగ్గజం బి. ప్రభాకరన్ ఈ ప్రాజెక్టు బాధ్యతలు పర్యవేక్షించనున్నారు.40 ఏళ్లకు పైగా సర్వేలు, పరిశోధనలుఈ ప్రాంతంలో 40 ఏళ్లకు పైగా పలు సంస్థలు సర్వేలు, పరిశోధనలు చేశాయి. మొదట జీఎస్ఐ, ఎమ్మీసీఎల్ సంస్థలు సర్వే చేశాయి. ఆ తర్వాత 1994 నుంచి జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సర్వే చేపట్టింది. బంగారం నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించుకున్న సంస్థ ప్రభుత్వ అనుమతులు కోరడంతో 2013లో అనుమతులు వచ్చాయి. పలు పరిశోధనల అనంతరం సంస్థ నిర్ధారించుకున్న తర్వాత 2023 సెపె్టంబరు 2న ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి కంపెనీ ప్రతినిధులు భూమి పూజచేశారు. మొదట చిన్నప్లాంట్ ఏర్పాటుచేసి అందులో ప్రాసెసింగ్ ట్రయల్ నిర్వహిస్తూనే మరో రూ.200 కోట్లతో పెద్ద ప్లాంట్ నిర్మాణం పూర్తిచేశారు. బంగారం ఉత్పత్తికి సిద్ధందాదాపు రూ.500 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అక్టోబరు నెలాఖరు నుంచి గానీ, నవంబరు ప్రారంభం నుంచి కానీ బంగారం ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైనట్లు ప్రధాన వాటాదారు బి. ప్రభాకరన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రారంభంలో ఏడాదికి 500 కిలోలు ఉత్పత్తి చేయనున్నారు. అన్ని చట్టబద్ధమైన అనుమతులతో క్రమంగా ఏడాదికి సుమారు 1,000 కిలోల బంగారం ఉత్పత్తి చేసేందుకు కంపెనీ సమాయత్తమవుతోంది. అలాగే, ప్రభుత్వ అనుమతులతో ఇక్కడే 24 క్యారెట్ల బంగారం ప్రాసెసింగ్ చేయనున్నారు. 597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు నిజానికి.. ఈ ప్రాంతంలో 597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఎప్పుడో గుర్తించారు. జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ దాదాపు 30 ఏళ్ల క్రితం ఎకరా రూ.4,500 చొప్పున రైతుల నుంచి లీజుకు తీసుకుని సర్వేలు, పరిశోధనలు, డ్రిల్లింగ్ చేపట్టింది. ఆ తర్వాత లీజు మొత్తం పెంచుతూ వచ్చింది.బంగారం వెలికితీతకు ఎకరా రూ.12 లక్షల చొప్పున రైతుల నుంచి ఇప్పటివరకు 283 ఎకరాలు కొనుగోలు చేసింది. మిగిలిన భూములకు ఎకరాకు ఏడాదికి రూ.18 వేలు చొప్పున చెల్లిస్తోంది. కంపెనీలో ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఉపాధి లభించింది. మున్ముందు మరింత మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు.. మరోవైపు.. జియో మైసూర్ కంపెనీ బంగారం నిక్షేపాలు వెలికితీస్తూనే సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జొన్నగిరి, పగిడిరాయిలో పాఠశాలలకు మినరల్ వాటర్ సరఫరా చేస్తోంది. పాఠశాలలకు అవసరమైన సదుపాయాలకు కృషిచేస్తోంది. చెన్నంపల్లి, పీ.కొత్తూరు, బొల్లవానిపల్లి విద్యార్థులు ఉన్నత చదువుకు పక్క గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిoచింది. ఉత్పత్తి బాగా జరిగితే విద్య, వైద్యంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్లాంట్ ప్రతినిధులు వివరించారు. -
ప్రధాని సభకు విస్తృత ఏర్పాట్లు
● మూడు లక్షల మందికి సరిపడే విధంగా సదుపాయాల కల్పన ● పది వేల బస్సులకు పార్కింగ్ సౌకర్యం ● కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడి కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని పర్యటనకు సబంధించి సభ నిర్వహణ, హెలిప్యాడ్, పార్కింగ్ ఇతర ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ, కోడుమూరు ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, కుడా చైర్మన్ సోమిశెట్టి, సీఎం ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణరాజుతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుగా ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం వెళ్తారన్నారు. శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబదేవి దర్శనం అనంతరం నన్నూరు టోల్ ప్లాజా వద్ద రాగమయూరి వెంచర్లో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ బహిరంగ సభను 40 ఎకరాల్లో మూడు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 347 ఎకరాల్లో 10 వేల బస్సులు నిలుపుకునేలా 12 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి జాతీయ రహదారికి అనుసంధానం చేసినట్లు చెప్పారు. సభకు వచ్చే వారికి 15 లక్షల లీటర్ల తాగునీరు, మజ్జిగ, భోజనం, అవసరమైన వైద్య సదుపాయాలు, టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, నోడల్ ఆఫీసర్ పీఎం సభా ఏర్పాట్లను మంత్రి టీజీ భరత్, పీఎం ప్రోగ్రాం నోడల్ అధికారి వీరపాండియన్, కలెక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్పాటిల్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.ఈ సందర్భంగా ఏర్పాట్ల గురించి కలెక్టర్ వారికి వివరించారు. సభకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని వారు కలెక్టర్ను ఆదేశించారు. -
నాణ్యత ‘తెల్ల’బోయి!
కోడుమూరు రూరల్: ఈ ఏడాది పత్తి పంట సాగు చేసినప్పటి నుంచి రైతులకు వరుణదేవుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇప్పటికే అధిక వర్షాలకు నియోజకవర్గంలో పత్తి పంట భారీగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల వరుణదేవుడు కొంత తెరిపి ఇచ్చాడు. దీంతో రైతులు ఉన్న కాస్తా పత్తి దిగుబడులను తీసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెలవారుజామున వరకు కురిసిన వర్షాలకు చెట్ల మీద ఉన్న పత్తి అంతా తడిసిపోయింది. దీంతో చేతికొచ్చిన పత్తి తెంపకుండానే చెట్లపై తడిసి మద్దవ్వడంతో పత్తి నాణ్యత దెబ్బతింటుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే ప్రస్తుతం కురుస్తున్న వ ర్షాలకు సజ్జ పంట కూడా దెబ్బతినే ప్రమాదం నెలకొందని రైతులు వాపోతున్నారు -
గురుకులాల్లో వసతులు మెరుగుపరచాలి
జూపాడుబంగ్లా: సాంఘిక సంక్షేమశాఖ అంబేడ్కర్ గురుకుల పాఠశాల్లో వసతులు మరింత మెరుగుపరచాలని ఆశాఖ సెక్రటరీ ప్రసన్నవెంకటేశ్ అన్నారు. శుక్రవారం ఆయన జూపాడుబంగ్లా గురుకుల పాఠశాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఎదుట నిరుపయోగంగా ఉన్న మినరల్ వాటర్ ప్లాంటును చూసి మరమ్మతులు చేయించి విద్యార్థులకు ఉపయోగపడేలా చేయాలని ఆదేశించారు. తరగతిగదిలోనే విద్యార్థుల పెట్టెలు, బట్టలు ఉండటాన్ని చూసి డార్మెట్రీ లేదా అని డీసీఓ శ్రీదేవి, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తిని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకంగా డార్మెట్రీ లేదని, తరగతి గదులనే డార్మెట్రీగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. డైనింగ్ హాల్ను పరిశీలించి డార్మెట్రీ వెనుకభాగం అపరిశుభ్రంగా ఉండటంతో పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు తెచ్చిన అరటిపండ్లను పరిశీలించి నాసిరకమైనవి ఎందుకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండిపెట్టాలని, ఏదైనా పొరపాట్లు జరిగితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. -
శ్రీనివాసరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
తుగ్గలి: వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, దివంగత మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి చిన్న కుమారుడు తుగ్గలి శ్రీనివాసరెడ్డి కంటి సమస్యతో బాధపడుతూ బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఆయనను ఫోన్లో పరామర్శించారు. కంటి చికిత్సపై ఆరా తీసి, ఆరోగ్యం బాగా చూసుకోవాలని సూచించినట్లు శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీశైల దేవస్థాన నూతన ట్రస్ట్బోర్డు ఏర్పాటు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ధర్మకర్తల సలహా మండలిని నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17 మందితో కూడిన ధర్మకర్తల సలహా మండలిని నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దేవదాయ ధర్మదాయ చట్టాన్ని అనుసరించి రెండేళ్ల కాలపరిమితితో ఈ నూతన ధర్మకర్తల సలహా మండలి ఉంటుంది. సభ్యులుగా పోతుగంటి రమేష్ నాయుడు, ఏ.వి.రమణ, బి.రవణమ్మ, చిట్బిట్ల భరదద్వాజ శర్మ, జి.లక్ష్మీశ్వరి, గుల్లా గంగమ్మ, కె.వర్ధిని, ఎస్.పిచ్చయ్య, జె.రేఖాగౌడ్, ఏ.అనిల్కుమార్, దేవకి వెంకటేశ్వర్లు, బి.వెంకటసుబ్బారావు, సి.కాశీనాథ్, ఎం.మురళీధర్, యు .సుబ్బలక్ష్మీ, పి.యు. శివమ్మ, జి.శ్రీదేవిలను శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల సలహా మండలి సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవస్థాన సీనియర్ అర్చకులను ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమిస్తారు. ట్రస్ట్బోర్డు సభ్యులు ప్రమాణస్వీకారం అనంతరం సమావేశమై చైర్మన్ని ఎన్నుకుంటారు. రోడ్డు ప్రమాదంలో లస్కర్ మృతి కౌతాళం/ఆదోని రూరల్: తుంగభద్ర దిగువ కాల్వ పరిధిలో కౌతాళం సెక్షన్లో లస్కర్గా పని చేసే తిరుపాల్ (46) శుక్రవారం సాయంత్రం ఆదోని మండలం ఆరెకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భార్య సుమలత, కుమారుడు విక్రమ్తేజాతో కలిసి ఆరెకల్లు పరిసరాల్లోని పార్క్కు పోయి తిరిగి వస్తుండగా లారీ వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీ కొట్టింది. దీంతో తిరుపాల్ అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు తేజ, భార్య సుమలతకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తిరుపాల్ మృతి పట్ల ఈఈ పాండురంగయ్య, డీఈ షఫీవుల్లా, ఏఈ ఈశ్వర్లు సంతాపాన్ని తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ చెంతకు బాలుడు ఎమ్మిగనూరురూరల్: అమ్మ, నాన్నను కోల్పో యి అనాథగా మిగిలిని బాలుడు చైల్డ్ వెల్ఫేర్ చెంతకు చేరాడు. సాక్షి కథనానికి అధికారులు స్పందించారు. దెవందిన్నె గ్రామానికి చెందిన నాగరాజు, ఎల్లమ్మల కుమారుడు ప్రసన్నరాజు 9వ తరగతి వరకు చదువుతూ మధ్యలో మానేసి కూలీ పనులకు వెళ్లేవాడు. తండ్రి నాగరాజు చనిపోవడం, పక్షవాతంతో మంచం పట్టిన తల్లి ఎల్లమ్మకు అన్ని తానై కుమారుడు ప్రసన్నరాజు సేవలు అందిస్తున్న వైనాన్ని గత నెల 23వ తేదీన సాక్షిలో ‘అమ్మకు కుమారుడు లాలి’ కథనం ప్రచురితమైంది. ఈ కథనం ప్రచురితమైన రోజుల వ్యవధిలో బాలుడి తల్లి ఎల్లమ్మ కూడా మృతి చెందటంతో బాలుడు ప్రసన్నరాజు అనాథగా మిగిలాడు. అప్పటికే ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఐసీడీఎస్ పీడీ విజయ స్పందిస్తూ బాలుడి పరిస్థితిపై విచారణ చేయాలని ఎమ్మిగనూరు ఐసీడీఎస్ సీడీపీఓ సఫర్నీసాబేగాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆమె గ్రామానికి వెళ్లి బాలుడి పరిస్థితిని ఆరా తీయగా ఇటీవల తల్లి కూడా మరణించినట్లు తెలుసుకున్నారు. బాలుడితో మాట్లాడి చదువుపై ఆసక్తి ఉన్న విషయాన్ని ఆమె పీడీకి వివరించారు. దీంతో కర్నూలులో చైల్డ్ వెల్ఫెర్ ప్రొటెక్షన్ కమిటీకి అప్పగించాలని పీడీ ఆదేశించించారు. ఈ మేరకు శుక్రవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ వయోల ప్రీతి బాలుడి ని తీసుకొని కర్నూలులోని చైల్డ్ వెల్ఫ్ర్ ప్రొటెక్షన్ కమిటీకి అప్పగించారు. దసరా సెలవులు రావటం, చనిపోయిన బాలుడు తల్లి అంత్యక్రియల కార్యక్రమాలు ఉండటంతో బాలుడి అప్పగింత కొంత ఆలస్యమైందని తెలిపారు. -
ఉపాధ్యాయుడిపై విద్యార్థి తండ్రి దాడి
● కేసు నమోదు చేసిన పోలీసులు గోనెగండ్ల: తన కుమారుడిని మందలించాడని ఉపాధ్యాయుడిపై విద్యార్థి తండ్రి దాడి చేసిన సంఘటన గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత ఉపాధ్యాయుడు బసవరాజు, విద్యాశాఖ అధికారులు, పోలీసులు అందించిన సమాచారం మేరకు.. కర్నూలుకు చెందిన బసవ రాజు గత ఎనిమిదేళ్లుగా గాజులదిన్నె గ్రామంలో ప్రాథమిక పాఠశాల(ఎస్సీ కాలనీ)లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. అదే కాలనీకి చెందిన మీసాల రంగస్వామి కుమారుడు హర్షవర్ధన్ మానసిక దివ్యాంగుడు. ఆ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడు. కాగా మూడు, నాలుగు రోజులుగా హర్షవర్ధన్ పాఠశాలకు రాకపోవడంతో గురువారం ఉపాధ్యాయుడు బసవరాజు కొంత మంది విద్యార్థులను బాలుడి ఇంటికి పంపాడు. అయితే తన కుమారుడిని ఉపాధ్యాయుడు భయపెట్టాడని, అందుకే పాఠశాలకు రావడం లేదని తండ్రి మీసాల రంగస్వామి విద్యార్థులకు చెప్పి పంపాడు. ఇంటి వద్దకు విద్యార్థులను ఎలా పంపుతావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉదయం బైక్పై పాఠశాలకు వస్తున్న ఉపాధ్యాయుడు బసవరాజుపై ఈత కర్రతో దాడి చేశాడు. అక్కడే ఉన్న కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఉపాధ్యాయుడికి ముక్కుకు, తలకు, చేతికి రక్త గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఉపాధ్యాయుడు బసవ రాజు, ఎంఈఓలు రామాంజినేయులు, నీలకంఠ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు మీసాల రంగస్వామిపై దాడి కేసు నమోదు చేశారు. చివరి రోజు దాడి.. ఒకే చోట ఎనిమిదేళ్లు పనిచేస్తున్న బసవరాజును గాజులదిన్నె నుంచి కోడుమూరుకు బదిలీ చేశారు. గాజులదిన్నె పాఠశాలలో శుక్రవారం చివరి రోజు విధులు నిర్వహించి సోమవారం కోడుమూరు పాఠశాలలో జాయిన్ కావాల్సి ఉంది. కాగా చివరి రోజు విధులు నిర్వహించాలని వచ్చిన ఉపాధ్యాయుడికి ఇలాంటి సంఘటన జరగడం విచారకరం అని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కేసీలో గుర్తు తెలియని వ్యక్తి శవం
జూపాడుబంగ్లా:కర్నూలు–కడప(కేసీ)కాల్వలో శుక్రవారం ఉదయం 8.20 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకుపోయింది. శరీరం బాగా ఉబ్బిపోయి దుర్వాసన వెదజల్లుతున్న వ్యక్తి మృతదేహం నీళ్లపై తేలియాడుతూ కేసీ కాల్వలో కొట్టుకపోతుండటాన్ని పొలాలకు వెళ్తున్న కూలీలు, రైతులు చూసి భయాందోళనకు గురయ్యారు. మృతదేహంపై ఉన్న దుస్తువులు చిరిగిపోయి ఉండగా కాళ్లవద్ద కేవలం నల్లనిప్యాంటు మాత్రమే కనిపించింది. కేసీ కాల్వలో నీటి ప్రవాహం మొదలైందంటే చాలు కేసీ కాల్వలో మృతదేహాలు కొట్టుకపోవటం పరిపాటిగా కొనసాగుతుంది అనుమతి లేని టపాసులు పట్టివేత నంద్యాల: నంద్యాల పట్టణంలో అనుమతి లేకుండా టపాసుల వ్యాపారం చేస్తున్న వారి ఇళ్లు, షాపులపై శుక్రవారం దాడులు చేసినట్లు వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో పట్టణంలోని చిత్తలూరి వీధికి చెందిన కృష్ణమోహన్ అనే వ్యక్తి ఇంట్లో అనుమతులు లేకుండా రూ.30వేలు విలువ చేసే టపాసులు నిల్వ ఉంచుకున్నారని, వీటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఈ టపాసులను భద్రతా దృష్ట్యా గోడౌన్కు పంపామన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ దాడులు చేస్తున్నామని, అనుమతి లేకుండా టపాసుల వ్యాపారం చేసినా, నిల్వ ఉంచుకున్నా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చీటీల పేరుతో రూ.2 కోట్లకు టోపీ! డోన్ టౌన్: చీటీల పేరుతో రూ.2 కోట్ల మేర వసూలు చేసిన వ్యక్తి అదృశ్యమవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్లో జరిగింది. వివరాలు.. పట్టణంలోని శ్రీకృష్ణనగర్లో నివాసం ఉంటున్న వాయిగండ్ల వెంకటేశ్వర్లు చీటీల వ్యాపారం చేస్తుండేవాడు. అందరి వద్ద డబ్బు వసూలు చేయడంతో పాటు బయటి వ్యక్తుల వద్ద కూడా ఫైనాన్స్ డబ్బులు తీసుకున్నాడు. కొన్ని రోజులుగా అతను కనిపించకపోవడంతో.. డబ్బు లిచ్చిన వారంతా ఆందోళనకు గురయ్యా రు. కర్నూలులో ఉంటున్న అతని సోదరులకు ఫోన్లు చేసినా ఉపయోగం లేకపోవడంతో.. బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. వెంకటేశ్వర్లు ఐపీ పెట్టాలనే ఉద్దేశంతో ఇల్లును సైతం కొద్ది రోజుల క్రితం ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై బాధితులు శుక్రవారం పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకోవాలి
కర్నూలు(హాస్పిటల్): ఆలోచనలు, భావోద్వేగాలు నియంత్రణలో ఉంచుకోగలిగితే మానసికంగా దృఢంగా ఉంటారని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, న్యాయసేవాసదన్ సివిల్ జడ్జి బి. లీలా వెంకటశేషాద్రి అన్నారు. శుక్రవారం ప్రపంచ మాన సిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూ లు మెడికల్ కాలేజీలోని సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక, సామాజిక ఆరోగ్యం బాగున్నప్పుడే వారిని ఆరోగ్యవంతులు అంటారన్నారు. వ్యక్తులు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు స్నేహితులు, దగ్గరి బంధువులు వారిని గుర్తించి కలుపుకుని వెళ్తే ఆ సమస్యలోంచి బయటపడతారన్నారు. పౌరులకు ఎవ్వరికై నా ఇబ్బందులు ఎదురైనప్పుడు లీగల్ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 15100ను సంప్రదించాలన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ.. ‘విపత్తులు, ఆపత్కాల పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యసేవలో అందుబాటులో’ అన్నది ఈ ఏడాది థీమ్గా నిర్ణయించారన్నారు. ఎవ్వరికై నా మానసికంగా ఆపత్కర పరిస్థితి ఏర్పడితే సేవల కోసం టెలీమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 నంబర్ను సంప్రదించాలన్నారు.అనంతరం మెడికల్, నర్సింగ్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.చివరగా నర్సింగ్ కాలేజిజీ విద్యార్థులు ‘ఒత్తిడి సమయాల్లో ఎలా వ్యవహరించాలి’ అనే నాటిక ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎండోక్రైనాలజి హెచ్ఓడీ డాక్టర్ పి.శ్రీనివాసులు, డీఎల్ఎస్ఏ సభ్యులు రాయపాటి శ్రీనివాస్, సైకియాట్రి విభాగ వైద్యులు గంగాధరనాయక్, యతిరాజు, ఎస్ఆర్లు ఉమైద్ సిరాజ్, జయశ్రీ, పీజీలు పాల్గొన్నారు. మానసిక వ్యాధుల విభాగం సందర్శన.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వ్యాధుల విభాగాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న మానసిక రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం అక్కడి రోగులను చూసుకునే తల్లిదండ్రులు, ఇతర పరిచారికులకు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఆరోగ్య సంరక్షణ హక్కు, ఆస్తి హక్కు మొదలైన వాటితో సహా మానసిక రోగుల హక్కులు, వారి రక్షణ, వైద్యచికిత్సల గురించి వివరించారు. సమాజంలో అందరిలాగే వీరికీ జీవించే హక్కు ఉందని తెలిపారు. -
ఆదాయం వద్దు.. ప్రయివేట్ ముద్దు
శ్రీశైలం టెంపుల్: పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) యూనిట్లను కూటమి ప్రభుత్వం ప్రయివేట్కు అప్పగించేందుకు అడుగులు వేస్తోంది. ప్రసిద్ధ శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఉన్న ఏపీ టూరిజంకు చెందిన హరిత రిసార్ట్ను ఇలానే వ్యక్తులకు కట్టబెట్టనుంది. 2002లో దాదాపు రూ.కోటితో 32 రూములతో ఈ రిసార్ట్ ప్రారంభమైంది. అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. గత వైఎసార్సీపీ ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక శ్రద్ధ చూపి మరింత మెరుగుపరిచింది. ప్రస్తుతం 124 రూములతో భక్తులకు సేవలందిస్తోంది. 98 శాతం ఆక్యుపెన్సీతో టూరిజం శాఖకు నెలకు రూ.57 లక్షల ఆదాయం ఒక్క హరిత రిసార్ట్ నుంచే వస్తోంది. అయినా, ప్రైవేట్కు ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో టూరిజం ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ●శ్రీశైల దేవస్థానానికి చెందిన ఎకరం భూమిలో ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత రిసార్ట్ ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశం, లక్ష్యంతో నామమాత్ర రుసుము, భూమి అద్దెతో ఈ భూమిని 23 ఏళ్ల క్రితం టూరిజం శాఖకు కేటాయించారు. 2002లో రూ.కోటితో 32 వసతి గదులు, హోటల్ నిర్మించారు. సామాన్య భక్తులకు సైతం వసతి గదులు అందుబాటులో ఉండేలా హరిత రిసార్ట్ ఏర్పాటు చేశారు. ఆదరణ బాగుండడంతో 2009లో మరో 44 గదులను నిర్మించారు. ● హరిత రిసార్ట్ను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు మెరుగైన సేవలు అందించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రూ.14.97 కోట్లతో టెండర్లను పిలిచి 2024 మార్చిలో పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేశారు. ప్రస్తుతం శ్రీశైలం హరిత రిసార్ట్లో పాత, కొత్త భవనాల్లో 124 వసతి గదులు ఉన్నాయి. ● వీటిలో 12 నాన్ ఏసీ గదులు (రోజుకు రూ.1,232), 44 ఏసీ గదులు (రోజుకు రూ.1,904), 24 డీలక్స్ గదులు (రోజుకు రూ.2,128), ఇవికాక 8 ఎగ్జిక్యూటివ్ గదులు (రోజుకు రూ.2,688) ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మించిన 36 గదులు, కొత్త హంగులతో నిర్మించిన రెస్టారెంట్ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ● శ్రీశైలం హరిత రెస్టారెంట్ పర్యటకుల మన్ననలు పొందుతోంది. 2022లో నెలకు రూ.32 లక్షలున్న ఆదాయం అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టడంతో మరింత పెరిగింది. కేవలం ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న హరిత రిసార్ట్ 98 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. రిసార్ట్ నుంచి నెలకు రూ.57 లక్షల ఆదాయం టూరిజం శాఖకు లభిస్తోంది. ● రిసార్ట్లో 23 ఏళ్ల నుంచి వివిధ కేటగిరీల్లో 45 మంది విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 26, ఔట్సోర్సింగ్లో 9, సెక్యూరిటీలో ముగ్గురు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తానని ప్రకటించడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం హరిత రిసార్ట్ ముఖ ద్వారంశ్రీశైల మహాక్షేత్రంలో ఉన్న హరిత రిసార్ట్ను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే పవిత్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ధరలు అందుబాటులో ఉండకపోగా, వసతి గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం హరిత రిసార్ట్ స్థలం దేవస్థానానికి చెందినది. ప్రభుత్వం ప్రైవేట్కు అప్పగించాలనే ఉద్దేశంలోనే ఉంటే.. హరిత రిసార్ట్ను దేవస్థానమే నిర్వహించేలా చూడాలని భక్తులు కొరుతున్నారు. శ్రీశైల దేవస్థానం ఎకరం భూమిలో హరిత రిసార్ట్ ఏర్పాటు ప్రైవేట్కు అప్పగిస్తే క్షేత్ర పవిత్రతకు ముప్పు! -
పరుగు పోటీలో ట్రాన్స్జెండర్ ఘనత
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యూత్ ఫీస్ట్ మారథాన్–5 కి.మీ పరుగు పోటీలో కర్నూలు జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్ లీలా ప్రసాద్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి కై వసం చేసుకున్నారు. ఈ పోటీలలో పురుషులు, మహిళలు, ట్రాన్స్జెంటర్లు కలిపి 130 మంది పాల్గొనగా లీలా ప్రసాద్ ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నీలకంఠారెడ్డి, అదనపు పీడీ డాక్టర్ సుచిత్ర, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల చేతుల మీదుగా రూ.25 వేల నగదు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు లీలా ప్రసాద్ అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లాకు ద్వితీయ స్థానం రావడం పట్ల లీలా ప్రసాద్ను డీఎంహెచ్ఓ డాక్టర్ పి.శాంతికళ, జిల్లా ఏయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్, ఏపీ సాక్స్ క్లస్తర్బ్ ప్రోగ్రామ్ మేనేజర్ అలీ హైదర్ అభినందించారు. -
ఇసుక మాఫియా డాన్ హొళగుంద ఎస్ఐ
కర్నూలు(సెంట్రల్): హొళగుంద ఎస్ఐగా పనిచేస్తున్న దిలిప్కుమార్ ఇసుక మాఫియా డాన్గా వ్యవహరిస్తున్నారని ఆలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బి.విరుపాక్షి సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా ఆయనే రెండు టిప్పర్లను ఏర్పాటు చేసుకొని దందా చేస్తున్నారని, ఇతరులు ఎవరైనా టిప్పర్లతో ఇసుక రవాణా చేస్తే అందులో ఒక్క ట్రిప్పును ఎస్ఐ పేరిట వేసి డబ్బు వసూలు చేసిచ్చేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఎమ్మెల్యే బి.విరుపాక్షి కలెక్టర్ను కలిసేందుకు కర్నూలు వచ్చారు. అయితే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో మీడియాతో మాట్లాడుతూ హొళగుంద ఎస్ఐ దిలిప్కుమార్ కాకి డ్రెస్సు ముసుగులో టీడీపీ ఏజెంట్గా పనిచేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని, బలవంతంగా వైఎస్ఆర్సీపీ నాయకులను టీడీపీలో చేరుస్తున్నట్లు చెప్పారు. ఇటీవల హొళగుందలో వాటర్ ఫిల్టర్ కోసం రూ.19 లక్షల జెడ్పీ నిధులు మంజూరయ్యాయన్నారు. అయితే పనులను చేసుకోవాలంటే వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఇతర నాయకలను టీడీపీలో చేరాలని బలవంతం చేస్తున్నారన్నారు. మరోవైపు ఎస్ఐ దిలిప్కుమార్పై చర్యలు తీసుకోకపోతే హోళగుంద పోలీసు స్టేషన్ను ముట్టడిస్తామని, ఆయన పేరును వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్లో నమోదు చేస్తామని హెచ్చరించారు. స్వయంగా రెండు టిప్పర్ల ద్వారా ఇసుక దందా -
మనేకుర్తిలో చోరీ
ఆలూరు రూరల్: మనేకుర్తి గ్రామంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఇంటి తలుపులు, బీరువా ధ్వంసం చేసి బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పెద్ద లింగయ్య వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలో సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇంటి వద్ద భార్య లక్ష్మి, కూతురు నివాసం ఉంటున్నారు. గురువారం గ్రామంలో బంధువు మరణించడంతో కూతురుతో కలిసి ఇంటికి తాళాలు వేసి అక్కడికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు బీరువా తలుపులు పెకిలించి అందులో ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు ఆలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి బేతంచెర్ల: గోర్లగుట్ట గ్రామంలో నాపరాళ్ల ట్రాక్టర్, బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ముక్కెర నారాయణరెడ్డి కుమారుడు నరేంద్ర కుమార్ రెడ్డి (30), చాకలి సుబ్బయ్య కలసి బైక్పై పలుకూరు క్రాస్ రోడ్డు వద్దకు బయలు దేరారు. అదే సమయంలో బనగానపల్లె మండలం రామకృష్ణాపురం గ్రామం నుంచి నాపరాళ్ల లోడుతో బేతంచెర్ల వైపు వస్తున్న ట్రాక్టర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నరేంద్ర కుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, చాకలి సుబ్బయ్యతో పాటు అదే సమయంలో అక్కడ రోడ్డు దాటుతున్న బాలిక రజని గాయాలతో బయట పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
గిజిగాడి ప్రేమ సౌధాలు!
దొర్నిపాడు: అత్యద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో గిజిగాడు పక్షి నిర్మించిన వేలాడే గూళ్లు చూపరులను అబ్బుర పరుస్తున్నాయి. మండలంలోని డబ్ల్యూ కొత్తపల్లె, చాకరాజువేముల, డబ్ల్యూ గోవిందిన్నె గ్రామాల శివారుల్లో నీటి కుంటల మధ్య తుమ్మ, రేగుచెట్ల కొమ్మలకు ఏర్పాటు చేసుకున్న గూళ్లు ఆ వైపు వెళ్లిన వారికి కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం గిజిగాడి సంతానోత్పతి కాలం కావడంతో ఎక్కడ చూసినా గూళ్లు ఆకట్టుకుంటున్నాయి. చెట్టు కొమ్మపై పక్షులుఎంతో నేర్పరితనం.. గిజిగాడు కట్టే గూడు ఎంతో నేర్పరితనం కల్గి ఉంటుంది. గూళ్లు అల్లడం, పిల్లలకు ఆహారం నోటికి అందించడం, శత్రువులను ఎదుర్కొనడం.. పాములు, ఇతర శత్రువుల నుంచి గుడ్లనూ, పిల్లల్నీ కాపాడుకోవడానికి ముళ్ల చెట్లపైన, నీటికి దగ్గరగా కిందకు వేలాడే రీతిలో కట్టుకోవడం వీటి అద్భుతమైన తెలివికి నిదర్శనం అని చెప్పవచ్చు. ప్రేమ కోసం.. ఈ పక్షిజాతిలో మగపక్షి చక్కటి ఇంజినీరింగ్ ప్రతిభతో అందంగా గూడును అల్లి ఆడ గిజిగాడిని ఆకర్షిస్తుంది. ఆడపక్షికి ఆ గూడు నచ్చితే అందులో ఆవాసం ఎర్పరచుకొని మగపక్షితో జతకట్టి జీవనం గడుపుతుంది. ముందుగా మగ గిజిగాడు సగం గూడు అల్లాక రెక్కలు ఆడిస్తూ ఆడపక్షుల వద్దకు వచ్చి తాను తయారు చేస్తున్న గూడు చూడమన్నట్లు సంకేతం ఇస్తుంది. గుంపులో ఉన్న ఏ ఒక్క ఆడపక్షి మెచ్చకపోయినా దాన్ని వదిలేసి మరో గూడు అల్లడం మొదలు పెడుతుందట. అలా మెప్పించలేని మగ పక్షులు ఏడాది పాటు ఒంటరిగానే ఉండాల్సిందేనట. మంచిగా గూడు కట్టే ప్రతిభ ఉన్న మగ పక్షులే ఆడ పక్షుల ప్రేమను పొందుతాయట. వినడాడికి ఆశ్చర్యంగా ఉన్నా ఎంతో ఆసక్తి అనిపిస్తుంది కదా. పాపం గిజిగాడు ప్రేమకోసం ఎన్ని కష్టాలో. -
మట్కా జోరు!
● కర్ణాటక తీర నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా జూదం ● మంత్రాలయంలో చాపకింద నీరులా మట్కా ● పచ్చని పల్లెల్లో మట్కా మరకలు ● రోజుకు రూ.లక్షల్లో బీట్ 24.05.2025న కోసిగి మండల కేంద్రానికి చెందిన ముగ్గురు బీటర్లు మట్కా ఆడుతూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.3,100 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కోసిగి మండల కేంద్రానికి చెందిన కురువ లింగారెడ్డి, పులుసు వీరేష్, హనుమంతుపై కేసు నమోదు చేయడం జరిగింది. 25.07.2025న కోసిగి మండలం కోల్మాన్పేటలో మరో ముగ్గురు మట్కా బీట్ రాస్తూ పోలీసులకు దొరికిపోయారు. వారి నుంచి రూ. 4,120, సెల్ఫోన్లు స్వాధీన పరుచుకున్నారు. కోల్మాన్పేటకు చెందిన గిరిస్వామి, కృష్ణ, ఆంజనేయులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 20.09.2025న మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని రచ్చమర్రి గ్రామంలో మట్కా నిర్వాహకులపై దాడులు చేశారు. గ్రామానికి చెందిన మట్కా బీటర్లు పింజరి నవాబ్, బోయ మజ్జిన ఈరన్న, బోయ నర్సిరెడ్డి జమ్మి మరుసు దగ్గర మట్కా రాస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.38,450 నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ ఆ గ్రామం మట్కాకు కేంద్రమన్నది బహిరంగ రహస్యం. -
గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
కర్నూలు: నగర శివారు 44వ నంబర్ జాతీయ రహదారి తుంగభద్ర బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. జంగిల్ పాచి కలర్ ఫుల్ షర్టు, పంచ ధరించాడు. 5.5 అడుగుల ఎత్తు ఉంటాడు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 91211 01063 లేదా 91211 01064 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
అర్చకుల వల్లే ఆలయ ప్రతిష్టకు భంగం
● దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ తీవ్ర అసంతృప్తి ● తగ్గిన కొలనుభారతి అమ్మవారి హుండీ ఆదాయం కొత్తపల్లి: రాష్ట్రంలో ఏకై క సరస్వతీ దేవి క్షేత్రం కొలనుభారతి. అలాంటి ఆలయ ప్రతిష్టను, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల మనోభావాలను అర్చకులే దెబ్బతిస్తున్నారని నంద్యాల జిల్లా దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కొలనుభారతి క్షేత్రంలో ఈఓ రామలింగారెడ్డి, చైర్మన్ వెంకటనాయుడు, సర్పంచు చంద్రశేఖర్తో కలిసి హుండీ ఆదాయం లెక్కింపు చేపట్టారు. ఈ ఏడాది మే 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా కేవలం రూ.1,44,115 మాత్రమే రావడంతో ఆశ్చర్యపోయారు. తీరు మార్చుకోకుంటే సస్పెండ్ చేస్తాం ఈ సందర్భంగా దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అర్చకుల మధ్య గొడవలు, ప్రవర్తన ద్వారా ఆలయ ప్రతిష్ట మసకబారుతుందన్నారు. అక్షరాభ్యాసాలు, అర్చనలు, సంభావనల పేరుతో భక్తుల నుంచి ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తూ వారి మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల పట్ల దురుసు ప్రవర్తన, సమయపాలన పాటించకుండా ఆలయ ప్రతిష్ట భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్ల నుంచి భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హుండీ ఆధాయం రూ.2 లక్షలకు పైగా వచ్చేదని ఇప్పుడు భారీగా తగ్గిందంటే అర్చకుల అంతర్గత వ్యవహరాలే కారణమన్నారు. ఇప్పటికై నా అర్చకుల ప్రవర్తనలో మార్పురాకపోతే విధుల నుంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. -
కౌన్సెలింగ్ తికమక!
కర్నూలు(సిటీ): ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ మొదలైంది. ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఉండటంతో మాన్యువల్గా, స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఎస్జీటీలకు గురువారం రాత్రి శిక్షణ కేంద్రాల్లోనే కౌన్సెలింగ్ ప్రారంభించారు. కౌన్సెలింగ్పై ముందుగానే అవగాహన కల్పించినా విద్యా శాఖ చూపించిన ఖాళీల్లో ఏ స్కూల్ ఎంత దూరంలో ఉందో అభ్యర్థులకు తెలియకపోవడం అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా 3, 4 కేటగిరీల్లోని పోస్టులలో నూతన టీచర్లను నియమిస్తున్నారు. శుక్రవారం నాటికి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రక్రియ కొనసాగుతోంది. కౌన్సెలింగ్కు హాజరైన టీచర్లందరికీ 11వ తేదీన ఎంపిక చేసుకున్న స్కూళ్ల పేరుతో ఆర్డర్లు జారీ కానున్నాయి. ఈనెల 13న వారికి కేటాయించిన స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎస్జీటీలగా ఎంపికై న వారిలో అత్యధిక శాతం మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగాలు సాధించిన వారున్నారు. దీంతో స్కూళ్లను ఎంపిక చేసుకునే అంశంపై సరైన అవగాహన లేక, కనీసం తెలిసిన వారిని అడిగి ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో తికమకపడుతున్నారు. జోనల్ స్థాయిలో టీజీటీ, పీజీటీలకు, ప్రిన్సిపల్ పోస్టులకు ఎంపికై న టీచర్లు శిక్షణ పొందే చోటనే వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. -
నేటి నుంచి బోధనేతర పనుల బహిష్కరణ
కర్నూలు సిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖ రికి నిరసనగా ఈ నెల 7వ తేదీన ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చేసిన తీర్మానం మేరకు.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో బోధనేతర, విద్యాశక్తి కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు ఫ్యాఫ్టో నాయకులు ప్రకటించారు. ఈ మేరకు ఫ్యాఫ్టో సెక్రటరీ జనరల్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం డీఆర్ఓ నారాయణమ్మ, డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్కు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం హాజరు చేపడ తామని, గూగుల్ షీట్ సమాచారం పంపడం, ఆన్లైన్ సమావేశాలు వంటి వాటిని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.ఫ్యాఫ్టో అనుబంధ సంఘాల నాయకులు నవీన్ పాటిల్, గోకారి, జనార్ధన్, మరియానందం, మధుసూదన్ రెడ్డి, హుసేన్, నందీశ్వరుడు, రోశన్న, తదితరులు పాల్గొన్నారు. ఖతార్– దోహాలో హోంకేర్ నర్సు ఉద్యోగాలు కర్నూలు(అర్బన్): స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓఎంసీఏపీ ద్వారా బీఎస్సీ నర్సింగ్/ జీఎన్ఎం నర్సింగ్ చదివి 21 –40 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులకు కథార్ – దోహాలో హోంకేర్ నర్సుగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ ఎస్ సబీహా పర్వీన్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు htt ps://naipunyam.ap.gov.in/userregistration? page=programme-registration వెబ్లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తులకు సర్టిఫికెట్లను జతచేసి ఈ నెల 12లోగా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో అందించాలన్నారు. మరి న్ని వివరాలకు సెల్ 94408 22219, 98488 64449 నంబర్లను సంప్రదించాలన్నారు. 13వ తేదీన ఇంటర్వ్యూలు ఓఎంసీఏపీ ఆఫీసు, ప్రభు త్వ ఐటీఐ క్యాంపస్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడలో ఉంటాయని వెల్లడించారు. కోలుకోలేక వ్యక్తి మృతి కర్నూలు: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామానికి చెందిన షేక్ మాబు బాషా (41) రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. సమీప బంధువు వహీద్ బాషాతో కలిసి బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై కర్నూలుకు వస్తుండగా ఎదురూరు గ్రామ శివారులోని సూరత్ హైవే బ్రిడ్జి వద్ద టిప్పర్ ఢీకొట్టడంతో షేక్ మాబు బాషా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. ఈయన కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య షేకున్తో పాటు ముగ్గురు కూతుర్లు సంతానం. వాహనం నడుపుతున్న వహీద్ బాషా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వహీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
పాఠశాలకు వెళ్తుండగా ఘోరం
● స్కూటర్ను ఢీకొన్న లారీ ● తండ్రి, కుమారుడు మృతి ● బిల్లేకల్లు సమీపంలో దుర్ఘటనఆస్పరి: దసరా సెలవులు మగియడంతో కుమారుడిని పాఠశాలకు స్కూటర్పై తీసుకెళ్తుండగా గురువారం ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామ సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. కృష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన మహేష్, రామేశ్వరమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె లావణ్య 10వ తరగతి పాసై ఇంటి దగ్గరే కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు. చిన్న కుమార్తె గౌతమి.. పోతుగల్లు గ్రామంలో 7వ తరగతి చదువుతున్నారు. కుమారుడు శ్రీనివాసులు 9వ తరగతి ఆలూరు మండలం అరికెర గురుకులంలో చదువుతున్నాడు. దసరా సెలవులు ముగియడంతో కుమారుడు శ్రీనివాసులును (14) పాఠశాలలో విడిచేందుకు తండ్రి మహేష్ (45) గురువారం ఉదయం స్కూటర్పై బయలు దేరాడు. అయితే దేవనకొండ దాటిన తరువాత బిల్లేకల్లు సమీపంలో ఆస్పరి నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టడంతో విద్యార్థి శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన తండ్రి మహేష్ను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందినట్లు ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపారు. కూలి పనులు చేసుకుంటూ ముగ్గరిని చదివిస్తున్నారు. ఒకే సారి తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. పొతుగల్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. విద్యార్థి శ్రీనివాసులు, తండ్రి మహేష్ (ఫైల్) -
చిరుత గోరు, కణితి కొమ్ము స్వాధీనం
శ్రీశైలంప్రాజెక్ట్: పాత సున్నిపెంట ప్రాంతంలో వై.చెన్నారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో గురువారం చిరుతపులి గోరు, కణితి కొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ బబితా కుమారి వెల్లడించారు. ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావుకు అందిన రహస్య సమాచారం మేరకు బుధవారం రాత్రి బబితాకుమారి, ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రణతిబాయి, శ్రీశైలం రేంజ్ అధికారి ఎం.పరమేశ్ తనిఖీలు చేపట్టారు. నిందితుడి ఇంట్లో చిరుత గోరు, కణితి కొమ్ము లభ్యమయ్యాయని, చెన్నారెడ్డి అందుబాటులో లేని కారణంగా నోటీసులు ఇచ్చామని, కేసు నమోదు చేసినట్లు ఎస్డీఎఫ్ఓ చెప్పారు. పాత తరం వ్యక్తులు వన్యప్రాణుల చర్మాలు, గోర్లు, కొమ్ములు, దంతాలను మూఢ నమ్మకాలతో ఇళ్లల్లో ఉంచుకుంటారని, ఇలాంటి చర్యలు నేరమన్నారు. అలాంటివి కలిగిఉన్న వారు స్వచ్ఛందంగా అటవీ అధికారులకు అందిస్తే సంజాయిషీతో వదిలేస్తామని, లేకపోతే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. -
కొత్త జేసీగా నూరుల్లా ఖమర్
కర్నూలు(సెంట్రల్): జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా నూరుల్లా ఖమర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన నూరుల్లా ఖమర్ ప్రస్తుతం ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ప్రభుత్వానికి డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన కర్నూలు జిల్లాలోనే ట్రైనీ కలెక్టర్గా పనిచేశారు. కాగా ఇక్కడ జేసీగా పనిచేస్తున్న డాక్టర్ బి.నవ్యను వేర్హౌస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా బదిలీ చేశారు. ఆమె దాదాపు 15 నెలలపాటు జేసీగా విధులు నిర్వహించారు. రెవెన్యూ అంశాలపై పట్టు సాధించిన ఆమె చాలా వరకు విజయం సాధించారు. ముఖ్యంగా రీసర్వే, భూసమస్యలపై నిక్కచ్చిగా వ్యవహరిస్తూ పలు సమస్యలను పరిష్కరించారు. ఇదిలాఉంటే ఆదోని సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న ఎం.మౌర్య భరద్వాజ్ను సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించారు. అయితే ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. సత్యసాయి జిల్లా జేసీగా ఆదోని సబ్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ గతంలో ట్రైనీ కలెక్టర్గా కర్నూలులో పనిచేసిన నూరుల్లా ఖమర్ -
సమన్వయంతో పీఎం పర్యటనను విజయవంతం చేద్దాం
కర్నూలు(సెంట్రల్): ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం ఆమె ప్రధానమంత్రి పర్యటించే నన్నూరు సమీపంలోని రాగమయూరి వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ సమీపంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా అధికారులతో సమీక్షించారు. అంతకుముందు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలసి పీఎం సభా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పార్కింగ్ ప్రదేశాల్లో 11వ తేదీలోపు అంతర్గత రహదారులను నిర్మించాలని ఇన్చార్జీలుగా ఉన్న ఇరిగేషన్, పీఆర్ ఎస్ఈలు, హౌసింగ్ పీడీ, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈలను ఆదేశించారు. పార్కింగ్ ప్రాంతం, నన్నూరు టోల్గేట్లో హెల్ప్డెస్కులను ఏర్పాటు చేయాలని మునిసిపల్ కమిషనర్ను ఆదేశించారు. బస్సుల్లోనే వచ్చిన వారికి భోజనం, నీటిని అందించాలని డీఎస్ఓ రాజారఘువీర్కు సూచించారు. స్టేజీకి కుడి పక్కన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని డీఈఓ శ్యామూల్ పాల్కు తెలిపారు. సమావేశంలో జేసీ డాక్టర్ బి.నవ్య, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓలు సందీప్కుమార్, భరత్ నాయక్లు పాల్గొన్నారు. -
న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాలి
కర్నూలు(సెంట్రల్): న్యాయ సేవలపై పారా లీగల్ వలంటీర్లు అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్థి సూచించారు. గురువారం న్యాయ సదన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మణ్ వెంటక హరినాథ్ ఆధ్వర్యంలో పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా బాల్య వివాహాల నిరోధక చట్టం, వరకట్న నిషేధం, కార్మిక సంక్షేమ చట్టం, వినియోగదారుల రక్షణ చట్టం, రెవెన్యూ చట్టాలను వివరించారు. లోక్ అదాలత్లో తగదాలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని, ఈ తీర్పులపై అప్పీలుకు వీలుండదని, చెల్లించిన కోర్టు ఫీజును కూడా తిరిగి ఇవ్వనున్నట్లు వివరించారు. న్యాయ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వలంటీర్లకు సూచించారు. -
వైద్య కళాశాలల ప్రయివేటీకరణపై పోరుబాట
కర్నూలు(టౌన్): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రయివేటీకరణను విరమించుకునేంత వరకు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను తీసుకొస్తే వాటిని ప్రయివేటీకరించేందుకు కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందన్నారు. పీపీపీ విధానం పేరిట దాదాపు రూ.లక్ష కోట్లు విలువ చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలు, వేలాది ఎకరాల భూములను తన అనయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు చేస్తున్న చీకటి బాగోతాన్ని నిలదీస్తామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈనెల 10 నుంచి వచ్చే నెల 22వ తేదీ వరకు కోటి సంతకాల సేకరణ, 28వ తేదీ ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు చేపడతామన్నారు. వినతిపత్రాలను సంబంధిత ఆర్డీవోలు, తహసీల్దార్లకు అందజేస్తామన్నారు. వచ్చే నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు, సమన్వయకర్తలు కలిసి ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. 23వ తేదీన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కోటి సంతకాల సేకరణను పూర్తి చేసి 24వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతామన్నారు. 26వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. ఈనెల 16వ తేదీ కర్నూలుకు వస్తున్న దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ప్రయివేటీకరణ అంశాన్ని వివరిస్తామన్నారు. ఈనెల 28న అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు ఆంధ్రప్రదేశ్ను మద్యాంధ్ర ప్రదేశ్గా మార్చిన ఘనత చంద్రబాబుదే ఈనెల 16న ప్రధాని మోదీ దృష్టికి ప్రయివేటీకరణ అంశం విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి -
టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక
ఎమ్మిగనూరుటౌన్: టీడీపీని వీడి గోనెగండ్ల మండల పరిధిలోని పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గరువారం ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీ, నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్టారేణుక సమక్షంలో పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన కందనూలు వెంకటేష్, కురువ రవికుమార్, వల్కూరు శివ,కొమ్మల శేఖర్, కురువ శ్రీనివాసులు, కురువ రాముడు, సుధాకర్, బాస్కర్, కురువ వెంకటేష్, సోమన్న, ప్రవీణ్, బోయ విష్ణుకుమార్, చిన్న దుబ్బన్నతో పాటు 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ ఐక్యతతో కృషి చేయాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. పార్టీ నేతలు బుట్టా శివనీలకంఠ, మురహరి రెడ్డి, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాల పార్టీ కన్వీనర్లు కేవీ కృష్ణారెడ్డి, బీఆర్ బసిరెడ్డి, నాయకులు నాగేష్ నాయుడు, పార్టీ బీసీ సెల్ నాయకుడు దొరబాబు నాయుడు, ఉరుకుందారెడ్డి, దేవేంద్ర, ఒంటెడుదిన్నె రాజారెడ్డి, కై రవాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నేటికీ నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం. దరఖాస్తు చేసుకొని ఐదు నెలలు గడచిపోయినా, నేటి వరకు ఆయా దరఖాస్తులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి. ఎవరిని అడిగినా తెలియదనే సమాధానమే వస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమాలను చేపడతాం. – సి.మహేష్, డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం
పేదలకు అందించాల్సిన సబ్సిడీ రుణాల జాప్యానికి సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తాం. ముందుగా బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారికి స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. యూనిట్లు తక్కువైనా, వేల సంఖ్యలో నిరుద్యోగులు అనేక కష్టనష్టాల మధ్య దరఖాస్తు చేసుకున్నారు. అయితే చివరకు ఏవో కారణాలు చూపుతూ రుణాల ప్రక్రియను నిలిపి వేయడం పేద వర్గాలను మోసగించడమే. – బి.రాఘవేంధ్రనాయుడు, వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ● -
హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణి బి.రాధిక కోరారు. గురువారం ఉదయం సంక్షేమభవన్లోని తన చాంబర్లో సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు జ్వరం, ఇతరత్రా వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని పీహెచ్సీకి సమాచారం అందించాలన్నారు. ప్రతి వసతిగృహంలో ఫస్ట్ఎయిడ్ కిట్లు, ప్రాథమిక మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హాస్టల్ రికార్డులను పక్కాగా నిర్వహించాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, ఎస్.లీలావతి, బి.మద్దిలేటి, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. ఆదోని బాలుర వసతి గృహాన్ని స్వచ్ఛ హాస్టల్గా నిలిపిన వసతి గృహ సంక్షేమాధికారి సిద్దప్పను ఆమె ఘనంగా సన్మానించారు. నేటి నుంచి ‘ఎన్టీఆర్’ వైద్య సేవలు నిలిపివేత కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీ నుంచి ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్లో ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా అందించే వైద్యసేవలు నిలిపివేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ రెడ్డికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా) నాయకులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రాహుల్, డాక్టర్ సునిల్ సేపూరి నోటీసులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లకు పైగా ఎన్టీఆర్ వైద్యసేవ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదని, అందుకే వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. దీంతో శుక్రవారం నుంచి కర్నూలు జిల్లాలో 60 ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత నెలలోనే సంఘం నాయకులు ఓపీ సేవలు బహిష్కరించినా ప్రభుత్వం చర్చ లకు పిలిచి పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి విస్మరించడం పట్ల ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కర్నూలు(టౌన్): కర్నూలు నగరంలోని శ్రీ లక్ష్మీ సమావేశ హాలులో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గసమన్వయకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన తెలిపారు. అద్దె చెల్లించకుంటే ఖాళీ చేయాల్సిందే! ● ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ల్లోని దుకాణాదారులకు నోటీసులు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్సుల్లోని దుకాణదారులు పెండింగ్ అద్దెలు చెల్లించకపోతే ఖాళీ చేయిస్తామని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఏడు షాపింగ్ కాంప్లెక్సుల్లో 59 దుకాణాలు, నంద్యాల జిల్లాలోని ఆరు షాపింగ్ కాంప్లెక్సుల్లో 46 దుకాణాలను నిర్వహిస్తూ పేద దళితులు జీవనోపాధి పొందుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్కు అద్దెలు జమ చేయడంలో గత ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అద్దెలను నిక్కచ్చిగా వసూలు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 18న జీఓ 26 జారీ చేసింది. ముచ్చటగా మూడవసారి నోటీసులను అందించారు. కాగా.. ఉమ్మడి జిల్లాలో అద్దె బకాయిలు రూ.1.01 కోట్లు ఉండగా, ఇప్పటి వరకు రూ.43 లక్షలను చెల్లించారు. మరో రూ.57 లక్షల బకాయి ఉంది. ప్రభుత్వ చర్యల పట్ల ఎస్సీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
పంట పొలాల్లో చిరుత సంచారం
ఆలూరు: ఆస్పరి మండలం జొహరాపురం, ఆలూరు మండలం మొలగవెల్లి, పెద్దహోతూరు గ్రామాల పంటపొలాల్లో మూడు రోజుల నుంచి చిరుతపులి సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఆలూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాసులు, ఎఫ్ఆర్ఏ తేజస్విణికి ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం సిబ్బందితో కలసి బీట్ అధికారులు బాలకృష్ణ, విమల్ కుమార్ జొహరాపురం పంట పొలాల్లో చిరుత పాద ముద్రలను పరిశీలించారు. రైతులు, ప్రజలకు పంట పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. ఎల్లెల్సీకి కోటా నీటిని అందిస్తాం హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు సంబంధించి ఆంధ్రా కోటా నీటిని పూర్తిస్థాయిలో అందిస్తామని, జలచౌర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని టీబీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే, సెక్రటరీ ఓఆర్కె రెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ నారాయణనాయక్ తెలిపారు. దిగువ కాలువపై బుధవారం వారు పర్యటించారు. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందుతుందో లేదో తెలుసుకున్నారు. అక్విడేటర్లు, అండర్టెన్నల్(యూటీ) లను పరిశీలించి వాటి ద్వారా బయటకెళ్తున్న నీటి గురించి ఆరా తీశారు. కాలువ పక్కన ఉన్న పొలాలకు అక్రమంగా నీటిని మళ్లించుకోకుండా(సైఫింగ్) తగిన చర్యలు తీసుకోవాలని సెక్షన్ ఆఫీసర్లను అదేశించారు. వారి వెంట ఎస్డీఓలు హుసేన్బాషా, సురేష్బాబు ఉన్నారు. 8 చెరువుల్లో పూడికతీత పనులు కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలోని వివిధ చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఇందుకోసం రూ.36.64 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు ఉపాధి నిధులతో చేపట్టే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. సీ.బెలగల్ మండలంలో 3, గూడూరు మండలంలో రెండు, ఆదోని, చిప్పగిరి, వెల్దుర్తి మండలాల్లో ఒక్కొక్కటి ప్రకారం 8 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10న పారామెడికల్ కోర్సులకు కౌన్సెలింగ్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో డిప్లమా ఇన్ అలైడ్ అండ్ హెల్త్కేర్ సర్వీసెస్ కోర్సులకు ఈ నెల 10న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కళాశాలలోని ఆడిటోరియంలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ఇంటర్ బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇంటర్ ఒరిజినల్ మార్క్స్’ మెమో లేని వారి దరఖాస్తులు తిరస్కరిస్తామన్నారు. భూసంరక్షణ అక్రమాలపై విచారణాధికారి నియామకం కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ భూ సంరక్షణ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఆయన సాగించిన అక్రమాలపై సమగ్ర విచారణకు విచారణాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.36 లక్షలు కొల్లగొట్టారు. అనుమతి లేకుండానే అద్దె వాహనాలు వినియోగించారు. సెల్ఫ్ చెక్లతో నిధులు స్వాహా చేశారు. అక్రమాలపై ఈ ఏడాది జనవరిలో 14 ఆభియోగాలు నమోదయ్యాయి. తాజాగా వ్యవసాయ శాఖలో అడిషనల్మ డైరెక్టర్గా పనిచేస్తున్న వినయ్చంద్ను విచారణాధికారిగా నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ రాజశేఖర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013 నుంచి దాదాపు మూడేళ్లపాటు భూసంరక్షణ విభాగం ఆదోని ఏడీఏగా పనిచేస్తున్నప్పుడు నిధులను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేశారు. వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ అయిన రామునాయక్ ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా రైతుశిక్షణ కేంద్రం డీడీఏగా ఉన్నారు. -
‘బంగారు’ కాంతులు!
విద్యుత్ కాంతుల మధ్య ప్లాంట్మండలంలోని జొన్నగిరి, బొల్లవానిపల్లి, పగిడిరాయి గ్రామాల మధ్య జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ కంపెనీ ప్రాసెసింగ్ ప్లాంట్ రాత్రి పూట విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. 30 ఎకరాల్లో దాదాపు రూ.200 కోట్లతో గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మించారు. ప్లాంట్ లోపలి భాగంలో చుట్టూ పచ్చని గడ్డితో పాటు మొక్కలు నాటారు. అధునాతన హంగులతో ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఈనెలఖారు నుంచి ప్లాంట్లో బంగారం ఉత్పత్తి మొదలు కానుండటం విశేషం. –తుగ్గలి -
ఆర్టీసీ ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలి
కర్నూలు సిటీ: ఆర్టీసీ ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ అద్దె బస్సుల డ్రైవర్లు నిరసన తెలిపారు. కర్నూలు కొత్త బస్టాండ్ ఆవరణలో మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపి వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దువ్వూరులో ఇంటి దగ్గర బస్సును ఆపలేదన్న కారణంతో ఆళ్లగడ్డ డిపోలో అద్దె బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న మహమ్మద్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. దాడిలో గాయపడిన మహమ్మద్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారన్నారు. కోలుకునేందుకు ఆరు నెలల సమయం పడుతుందని, అంత వరకు ప్రభుత్వమే చికిత్సకు అయ్యే ఖర్చులు భరించాలన్నారు. డ్రైవర్కు రూ.5 లక్షల పరిహారం ప్రభుత్వం చెల్లించాలన్నారు. గతంలో ఎమ్మిగనూరు దగ్గర కూడా డ్రైవర్పై దాడి చేశారన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసిన తరువాత ప్రయాణికుల రద్దీ పెరిగిపోయిందన్నారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనపు బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. డ్రైవర్లకు రక్షణ కల్పించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. హైర్ బస్సు కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య గౌడ్, గౌరవ సలహాదారులు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి యు.శ్రీనివాసులు, జిల్లా నాయకులు రాంబాబు, చెన్నకేశవులు, మద్దిలేటి, మధు, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ప్రదక్షిణలు
ఈ చిత్రంలో కనిపించే రైతు పేరు ఎర్రిస్వామి, మద్దికెర మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన సన్నకారు రైతు. ఈయన వైఎస్ఆర్సీపీ హయాంలో బోరు వేయించుకున్నాడు. నీళ్లు కూడ పడ్డాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ అధికారులు వేసిన ఎస్టిమేట్ ప్రకారం నాన్ సబ్సిడీ అమౌంటు కూడ చెల్లించారు. పోల్స్ వేసి డీపీ కూడ పెట్టారు. నిబందనల ప్రకారం విద్యుత్ శాఖనే వారి వాహనం ద్వారా డీపీ సరఫరా చేయాలి. కాని స్వంత ఖర్చులతో డీపీ తెచ్చుకున్నారు, బోల్టాలు, మెటీరియల్ మొత్తం రైతులే తెచ్చుకున్నారు. అర్త్ గుంతలు కూడ తవ్వుకున్నారు. కాని ఇంతవరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. గ్రామంలో ఇటువంటి రైతులు నలుగురు ఉన్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్మ అధికారుల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నా.. మెటీరియల్ రాలేదని, ఇతరత్రా కారణాలతో జాప్యం చేస్తున్నారు. –ఎర్రిస్వామి, బసినేపల్లి, మద్దికెర మండలం -
ఆటోను ఢీకొట్టిన కారు
● ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు మరో ఇద్దరికి గాయాలు మహానంది: నంద్యాల – మహానంది రహదారిలో బుక్కాపురం మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తిమ్మాపురం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బుక్కాపురం మలుపు వద్ద వెనుక నుంచి వస్తున్న కారు ఓవర్ టేక్ చేయబోయి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పుట్టుపల్లె పాఠశాల ఉపాధ్యాయురాలు రాఘవేంద్రమ్మ, అబ్బీపురం ఉపాధ్యాయురాలు ఉమా మహేశ్వరమ్మలతో పాటు ఆటో డ్రైవర్ బాలస్వామి, ప్రయాణికుడు పుట్టుపల్లెకు చెందిన జయరాముడు తీవ్రంగా గాయపడ్దారు. అదే సమయంలో నంద్యాల నుంచి వస్తున్న మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి ప్రమాద ఘటన చూసి చలించి వెంటనే పోలీస్ వాహనంలో గాయపడిన వారికి చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు. అనంతరం వివరాలు సేకరించి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్, ఓనర్ ఈశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
ప్రమాదపుటంచున కొత్తపల్లె చెరువు
కోడుమూరు రూరల్: కొత్తపల్లె చెరువు కట్ట కోతకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఇదే సమయంలో కొతపల్లె నుంచి కృష్ణగిరి వైపు వెళ్లే దారిలో ఉన్న చెరువు కట్ట బలహీనంగా ఉండడంతో కొంత భాగం కోతకు గురై చె రువులోని నీళ్లన్నీ రైతుల పొలాలను ముంచెత్తుతున్నాయి. అధికారు లు కోతకు గురైన చెరువు కట్టకు సకాలంలో మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేయడంతో రోజురోజుకు కోత పెరిగిపోతుంది. భారీ వర్షాలు పడి చెరువుకు నీళ్లు పోటెత్తితే కట్ట పూర్తిగా కో తకు గురైతే తమ పంట పొలాలు నీట మునిగే పరి స్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే చెరువు కట్టకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం
ఎమ్మిగనూరుటౌన్: తేనెటీగల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని నంద్యాల ఆర్ఏఆర్ఎస్ అసోసియేట్ డైరెక్టర్ రీసెర్చ్ డాక్టర్ ఎం.జాన్సన్ అన్నారు. బనవాసి కేవీకేలో నూనెగింజల మిషన్ ఎన్బీహెచ్ఎం ఆధ్వర్యంలో శాసీ్త్రయ తేనెటీగల పెంపకంపై 30 మంది రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. తేనెటీగల పెంపక ప్రాధాన్యత, పంటల పరాగసంపర్కంలో వాటి పాత్ర, తేనె ఉత్పత్తి ద్వారా రైతులు పొందే అదనపు ఆదాయం గురించి పలువురు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం.జాన్సన్ మాట్లాడుతూ.. తేనెటీగల శాసీ్త్రయ పెంపకం ద్వారా నూనెగింజలు పంటల ఉత్పాదకత పెరుగుతుందన్నారు. అలాగే పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడినవారవుతారన్నారు. కార్యక్రమంలో కేవీకే సమన్వయకర్త డాక్టర్ కే.రాఘవేంద్రచౌదరి, శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ అశోక్కుమార్, మంజునాథ్, సుజనమ్మ, శివశంకర్, మల్లికార్జున, రమేష్, ఏడీఏ మహమ్మద్ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా ఈ–క్రాప్ నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ పంటల నమోదు అస్తవ్యస్తంగా మారింది. పొలంపై ఉన్న పంట ఒకటైతే.. ఈ–క్రాప్లో నమోదు చేస్తున్న పంట మరొకటనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభు త్వం ఉన్న ఐదేళ్లు పంటల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంటల నమోదు ప్రక్రియ అవకతవకలకు కేంద్రమవుతోంది. ఖరీప్ సీజన్ సెప్టెంబర్ 30తోనే ముగిసిపోయినప్పటికీ పంటల నమోదు అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు కేవలం 4,11,704 సర్వే నెంబర్లలోని 6,94,235 ఎకరాలు నమోదు చేశారు. రెండున్నర నెలల్లో 41.6 శాతం మాత్రమే పంటల నమోదు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆలూరు, ఓర్వకల్, చిప్పగిరి, హాలహర్వి, కర్నూలు రూరల్ మండలాల్లో పంటల నమోదు అంతంతమాత్రంగానే ఉన్నట్లు వెల్లడవుతోంది. నమోదు అస్తవ్యస్తం కావడం, సుదీర్ఘంగా సాగుతుండటంతో ప్రభుత్వం ఈ–క్రాప్ బుకింగ్ను ఈ నెల 25 వరకు పొడిగించింది. పై నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో పంటల నమోదులో వీఏఏలు, వీహెచ్ఏలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే గ్రామస్థాయిలో టీడీపీ నేతలు, రైతు సేవా కేంద్రాల ఇన్చార్జీలు కుమ్మకై ్క ఉల్లి పంటను నమోదు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పత్తి దా దాపు 6 లక్షల ఎకరాల్లో సాగయింది. ఈ–క్రాప్లో మాత్రం పత్తి నమోదు మందగించింది. కోడుమూ రు, దేవనకొండ, కర్నూలు రూరల్, పత్తికొండ, సీ.బెలగల్, గోనెగండ్ల తదితర మండలాల్లో ఏకపక్షంగా ఉల్లి నమోదవుతుందటం గమనార్హం. నోటిఫైడ్ పంటలకు మాత్రమే ఈ–కేవైసీ గతంలో ఈ–క్రాప్లో నమోదైన అన్ని పంటల నమోదుకు రైతుల నుంచి ఈ–కేవైసీ తీసుకున్నారు. బయోమెట్రిక్ ద్వారా లేదా ఓటీపీ ద్వారా ఈ–కేవైసీ చేయించారు జరిగేది. ఈ సారి మాత్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా కింద నోటిఫై చేసిన పంటలకు మాత్రమే ఈ–కేవైసీ చేయించుకునేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. అయితే ఇంతవరకు ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. మొదట్లో అనుమానం వచ్చినా రాజీ పడ్డారు 41.6 శాతమే పూర్తి ఈ–క్రాప్లో ఉల్లి పంట శరవేగంగా నమోదవుతుండటాన్ని గమనించిన జిల్లా ఉన్నతాధికారులు విస్తు పోయారు. తహసీల్దార్లు, ఆర్డీఓలతో తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. అయితే ఆ తర్వాత రాజీపడి మిన్నకుండిపోయారు. అధికార టీడీపీ నేతల సూచనలతో ఈ–క్రాప్లో ఉల్లి నమోదు పరిశీలన ప్రక్రియ మరుగున పడినట్లు తెలుస్తోంది. ఉల్లి సాధారణ సాగు 41,442 ఎకరాలు మాత్రమే. ఈ సారి ఈ–క్రాప్లో ఇప్పటికే 58 వేల ఎకరాలకు చేరిందంటే.. పంటల నమోదు ప్రక్రియ ముగిసే సమయానికి 75 వేల ఎకరాలకు చేరే అవకాశం ఉన్నట్లు ఉద్యాన అధికారులు అంచనా వేస్తున్నారు. -
శరవేగంగా మోదీ పర్యటన ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన కర్నూలు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చకచకగా సాగుతున్నాయి. నన్నూరు టోల్గేటు దగ్గర ఉన్న రాగమయూరి వద్ద ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగ సభ, హెలిపాడ్, 11 చోట్ల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో పనులు వేగం పుంజుకుంటున్నాయి. అధికారులు ఇతర జిల్లాల నుంచి జేసీబీలు, ఇతర పరికరాలతోపాటు కూలీలను తీసుకొచ్చి పనులను వేగవంతం చేశారు. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఉదయం, సాయంత్రం దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి టీజీ భరత్ కూడా పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన్న సత్యనారాయణరాజు కూడా బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేయండి.. బహిరంగ సభ ప్రాంగణంలో వీవీఐపీల కోసం 10 పడకలు, ప్రజల కోసం 20 పడకల తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. పార్కింగ్ ప్రాంతాల్లో రెండు బేసిక్ లైఫ్ సపోర్టెడ్ అంబులెన్స్లను సిద్ధంగా ఉంచడంతోపాటు మెడికల్ క్యాంప్లను ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. హెలిపాడ్, ఓర్వకల్ పీహెచ్సీల వద్ద స్పెషలిస్టు వైద్యులు, ఎమర్జెన్సీ మెడికల్ బృందాలు, స్ట్రెచర్లు, వీల్ చైర్లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతి కళను ఆదేశించారు. -
పిడుగుపాటుకు ఐదు జీవాలు మృతి
బనగానపల్లె రూరల్: పసుపల గ్రామ సమీపంలో బుధవారం ఉదయం పిడుగుపడి ఐదు జీవాలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన మద్దిలేటిస్వామికి వంద జీవాలు ఉన్నాయి. ఉదయం పసుపల గ్రామ సమీపంలోని పోలిక కొండ వద్ద జీవాలు మేత మేస్తుండగా అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఆదే సమయంలో పిడుగు పడటంతో ఐదు జీవాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు మద్దిలేటిస్వామి తెలిపారు. వీటి విలువ సుమారు రూ.40 వేలు ఉంటాయన్నారు. నందవరం: గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సచివాలయాలపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో అందులో పని చేసే ఉద్యోగులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు నాగలదిన్నె గ్రామంలోని సచివాలయ ఉద్యోగులే నిదర్శనం. గ్రామంలో ఒకే చోట సచివాలయం 1, 2 ఉన్నాయి. ప్రస్తుతం రెండు సచివాలయాల్లో దాదాపు 14 మంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి వివిధ పనుల మీద ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అయినా 11 గంటలైనా సచివాలయానికి తాళం కూడా తీయలేదు. 11. 40 గంటల తర్వాత ఒకరిద్దరు రావడం మొదలు పెట్టారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కొందరు పోయారని చెబుతుండగా, మిగతా వారిలో కొందరు ఆలస్యంగా రావడంపై ప్రజలు మండిపడ్డారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజం కల్లూరు: క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి అన్నారు. బుధ వారం కల్లూరు మండలం చిన్నటేకూరులోని ఏపీఎస్డబ్ల్యూఆర్లో జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లాకు చెందిన ఖోఖో, వాలీబాల్, కబడ్డీ క్రీడాకారులు ప్రతిభకనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాఘవేంద్ర, పలువురు ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పాల్గొన్నారు. -
ఐద్వా జిల్లా నూతన కమిటీ ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): ఐద్వా జిల్లా నూతన కమిటీ ని 35 మందితో ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకోగా గౌరవాధ్యక్షురాలుగా పి.నిర్మల అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్.శ్యామల, కె.అరుణ, కోశాధికారిగా పీఎస్ సుజాతలతో పాటు ముగ్గురు ఉపాధ్యక్షులు, మగ్గురు సహాయ కార్యదర్శులు, 13 మంది ఆఫీసు బేరర్లు, 22 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో బుధవారం కార్మిక, కర్షక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. బెల్టుషాపుల రద్దు, మద్యం దుకాణాల సమయాన్ని కుదింపు కోసం పోరాటాలు చేస్తామన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేయాలన్నారు. యువకుడి బలవన్మరణం ఆలూరు రూరల్: ఆర్థిక కష్టాలతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కురుకుంద గ్రామానికి చెందిన శివప్ప (32) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం పక్షవాతం వచ్చి తండ్రి మునెప్ప మంచాన పడ్డాడు. ఎనిమిదేళ్ల క్రితం శివప్ప అన్న మృతిచెందాడు. తల్లి మల్లమ్మ, కుమారుడు శివప్ప వ్యవసాయ పనులకు వెళ్లేవారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి తట్టుకోలేక మూడు రోజుల క్రితం ఇంటి నుంచి శివప్ప వెళ్లిపోయాడు. ఆలూరులోని గుంతకల్లు రహదారి పక్కన పురుగు మందు తాగి శవమై కనిపించాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య సంజామల: కానాల గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు.. కానాల గ్రామనికి చెందిన ఏరాశి దస్తగిరి, సుశీల కుమార్తె ఏరాశి శ్యామల(17) అవుకు మోడల్ స్కూల్లో ఇంటర్ రెండవ సంవత్సరం చుదువుతోంది. దసరా సెలవుల నుంచి ఇంటి దగ్గరనే ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆయిల్ ఇంజిన్లో పాము మహానంది: బొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణ, మరికొంత మంది రైతులు బుధవారం వారి పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి ఆయిల్ ఇంజిన్ను ఆన్ చేయగా ఎంత సేపటికి ఆన్ కాలేదు. ఏమైందోనని పరిశీలించగా ఫ్యాన్ (పంకా) వద్ద ఓ పాము ఇరుక్కపోయి ఉండటాన్ని గుర్తించారు. బతికి ఉందేమోనని చూస్తే అది అప్పటికే మృతి చెందినట్లు చూసి తీసేశారు. -
భద్రత కట్టుదిట్టం
● పోలీసు అధికారులతో సమీక్షలో అడిషనల్ డీజీ కర్నూలు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేయాలని అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. పీఎం పర్యటన ఏర్పాట్లపై ఓర్వకల్లు ఎయిర్పోర్టు దగ్గర ఉన్న ఏరో వన్ ఫంక్షన్ హాల్లో ఐజీ, డీఐజీలు, ఎస్పీలతో మధుసూదన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట గూగుల్ రూట్ మ్యాప్ను పరిశీలించారు. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ శివా రులో ఉన్న రాగమయూరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ, ఇతర ప్రదేశాల గురించి పర్యటన వివరాలను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ను అడిగి తెలుసుకున్నారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, హెలి ప్యాడ్, బహిరంగ సభ, వాహనాల డైవర్షన్స్ తదితర విషయాల గురించి అడిషనల్ డీజీ, ఐజీ, డీఐజీలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరించారు. మోడీ పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఆపై స్థాయి అధికారులు మాత్రమే ప్రధా ని పర్యటన బందోబస్తు విధులకు కేటాయించాలన్నారు. విధులకు కేటాయించిన పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పూర్తి బాధ్యత వహించాలన్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించే రాగమయూరి ప్రాంతంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు. సమావేశంలో ఐజీ శ్రీకాంత్, డీఐజీలు కోయ ప్రవీణ్, సెంథిల్ కుమార్, సత్య ఏసుబాబు, ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీలు షెల్కేనచికేత్ విశ్వనాథ్, కృష్ణకాంత్, మణికంఠ చందవోలు, దేవరాజు, ధీరజ్ కునుబిల్లి, దీపిక పాటిల్తో పాటు అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు, ఇంటెలిజెన్స్ అధికారులు, సీఐలు, ఆర్ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నకిలీ మద్యం విక్రయాలపై దృష్టి సారించండి
కర్నూలు: అన్నమయ్య జిల్లా మొలకల చెరువు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, విజయవాడలోని ఇబ్రహీం పట్నం వద్ద పట్టుబడిన నకిలీ మద్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో తనిఖీలు విస్తృతం చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. కర్నూలులోని ప్రధాన కార్యాలయంలో బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లతో ఆమె నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే సారా రహిత ప్రాంతాలుగా ప్రకటించిన గ్రామాల్లో తిరిగి నాటుసారా తయారు కాకుండా నిఘా ఉంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. పాత కేసుల్లో ముద్దాయిలను బైండోవర్ చేసి వారి ప్రస్తుత కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా నిరంతరం దాడులు కొనసాగించాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ఎకై ్సజ్ జిల్లా అధికారి మచ్ఛ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణారెడ్డి, రాజశేఖర్ గౌడ్లతో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకుడి నుంచి ప్లాట్లకు రక్షణ కల్పించాలి
కర్నూలు(సెంట్రల్): 20 ఏళ్ల క్రితం కల్లూరు పరిధిలోని సర్వే నంబర్ 292లో ఉన్న 3.95 ఎకరాల్లో డీటీసీపీ అప్రూవల్ లేవుట్లోని తమ ప్లాట్లను టీడీపీ నాయకుడు పోలిశెట్టి దేవేంద్రకుమార్ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు కృష్ణమూర్తి, నరసింహరావు, రాజు, వెంకటేష్ అధికారులను కోరారు. టీడీపీ నేత నుంచి తమ ప్లాట్లకు రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్లోని డీఆర్వో సి.వెంకట నారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆ లేవుట్లో దాదాపు 30 మంది ప్లాట్లను విక్రయించారని, అందులో చాలా మంది ఇళ్లు కట్టుకొని కూడా నివాసం ఉంటున్నారన్నారు. అయితే ఆ స్థలం తమ తాతల ఆస్తి అంటూ టీడీపీ నాయకుడు పోలిశెట్టి దేవేంద్రకుమార్ ఆక్రమించుకునేందుకు ఇటీవల జేసీబీతో వచ్చి సైడ్వాల్స్ను పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. ఆయన నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ స్థలం కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను చూపించారు. -
కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేస్తారా?
కర్నూలు (టౌన్): ‘ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది.. అమాయక ప్రజలు మద్యం తాగి పిట్టల్లా రాలుతున్నారు.. అయినా ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది.. చాలా దారుణం’ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి అన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలాగే వ్యవహరిస్తూ కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం కర్నూలులో నిరసన తెలిపారు. చిల్డ్రన్స్ పార్కు నుంచి ఎకై ్సజ్ కార్యాలయం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. ‘ సీఎం డౌన్.. డౌన్, కల్తీ మద్యం విక్రయాలు అరికట్టాలి’ అని నినాదాలు చేశారు. ‘నకిలీ మద్యంతో పేదలు పిట్టల్లా రాలిపోతున్నారు.. ప్రభుత్వ పెద్దలే మద్యం సూత్రధారులు.. రాష్ట్రంలో ఎన్–బ్రాండ్ విక్రయాలు’ తదితర ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంటు కార్యాలయం ఎదుట బైఠాయించారు. మద్యాన్ని పారబోసి బాటిళ్లను పగులకొట్టారు. ‘మద్యం తాగి ప్రజలు చనిపోతుంటే డిప్యూటీ సీఎం నోరు మెదపరేం, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్కడ’ అని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కరువు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, భారతి, మంగమ్మ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. నకిలీ మద్యం సరఫరా చేస్తూ పేద ప్రజలను నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపించారు. అడ్డగోలు పర్మిట్ రూమ్లతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టీడీపీ నాయకులు వైన్ షాపుల ద్వారా కల్తీ మద్యం అమ్ముతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి బెల్టు షాపులు రద్దు చేయాలని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని, పర్మిట్ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంటు అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నగరపాలక కార్పొరేటర్లు ఆర్షియా ఫర్హీన్, సయ్యద్ మల్లిఖాబేగం, పార్టీ మహిళలు పాల్గొన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలి నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో కల్తీ మద్యం తాగి నలుగురు పేదలు మృతిచెందినా రాష్ట్రప్రభుత్వంలో చలనం లేదని ఎస్వీ విజయ మనోహరి విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి వైన్ షాపులో కల్తీ మద్యం అమ్ముతున్నా చర్యలు లేవన్నారు. కల్తీ మద్యం విక్రయాల వెనుక రాష్ట్ర పెద్దలు ఉన్నారని ఆరోపించారు. కల్తీ మద్యం తయారు చేసేందుకు టీడీపీ నాయకులు ఏకంగా ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోందన్నారు. విచ్చలవిడిగా రోడ్ల మీద మద్యం తాగుతున్నా ఎకై ్సజ్, సివిల్ పోలీసులు పట్టించుకోవడం లేదని, దీంతో రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయన్నారు. కల్తీ మద్యం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మద్యాన్ని పొరబోస్తున్న దృశ్యం ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుంది వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసెడింట్ ఎస్వీ విజయ మనోహరి -
రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
పత్తికొండ: అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి విమర్శించారు. మంగళవారం పత్తికొండ వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోనే హోసూరు రహదారిలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజకీయ కారణాలతో మరో చోటుకు మార్చడంతో పాటు ఆరు నెలల్లో పూర్తి చేశామని ప్రారంభ సమయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రగల్బాలు పలికారన్నారు. ఇంకా ఇప్పటికీ పనులు పునాదులు దశలోనే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు రూ. 30 కోట్లతో ప్రారంభిస్తే టీడీపీ లీగల్ సెల్ నాయకుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి నాయకులు రోడ్డు పనులు ప్రారంభించి ప్రజలకు మేలు చేయాలని హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా గ్రామాల్లో బెల్ట్షాపుల్లో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉల్లి, టమాట రైతులు భారీగా నష్టపోతున్నా ప్రభుత్వంలో కనిస స్పందన లేకపోవడం దారుణమన్నారు. రైతులు దిగుబడిని పొలంలోనే పశువులకు మేతగా వదిలేస్తున్నారని, ఇలాంటి పరిస్థితిని కూడా పార్టీలకు ఆపాదించడం వారి కూటమి నేతల అవివేకమన్నారు. ఉల్లి, టమాట పంటలను వైఎస్సార్సీపీకు చెందిన రైతులు మాత్రమే సాగు చేయలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తలా.. తోక లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధర కల్పించ డం చేతగాక టమాట నాణ్యతపై మాట్లాడటం మంత్రి స్థాయిలో తగదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, ఎంపీపీ నారాయణ్దాస్, ఎస్టీ సెల్ జిల్లా ఆధ్యక్షుడు భాస్కర్నాయ క్,మండల కన్వీనర్ కారం నాగరాజు, సీనియర్ నాయకులు టీఎమ్డీ హుశేన్, జిట్టా నాగేష్, భాస్కర్రెడ్డి, కోతిరాళ్ల అంజినయ్య, పులికొండ తిప్పన్న, కారుమంచి నజీర్, సాబ్డిన్ నూర్బాషా, అట్లా గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రావెల్స్ బస్సుకు భారీ జరిమానా
డోన్ టౌన్: రాష్ట్రానికి చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించకుండా రాకపోకలు సాగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు రూ.1.91 లక్షల జరిమానా విధి ంచినట్లు డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ మంగళవారం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి కర్నూలు రోడ్డులోని అముకతాడు టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శిఖర్వార్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ రాష్ట్రం నుంచి బెంగుళూరుకు వెళుతుండగా అమకతాడు టోల్ గేట్ వద్ద ఆపి తనిఖీ చేయగా ఏపీ చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించలేదని తెలిసింది. దీంతో వాహనంపై జరిమానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. తనిఖీల్లో నంద్యాల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేంద్రరావు ఉన్నారు. హడావుడిగా మండలాలకు శనగ విత్తనాలు కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ మొదలై వారం రోజులు గడచినప్పటికీ పప్పు శనగ విత్తన పంపిణీ అతీగతీ లేకపోయింది. మంగళవారం ‘సాక్షి’లో శనగ విత్తు అందక రైతుకు బెంగ శీర్షికన కథనం ప్రచురితమవడంతో వ్యవసాయ శాఖలో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో హడివుడిగా వెల్దుర్తి, తుగ్గలి, ఆలూరు, బనగానపల్లి మండలాల్లో శనగ విత్తనాలను అరకొరగా అందుబాటులో ఉంచడం గమనార్హం. విత్తనాల కోసం రైతులు డి–క్రిషి యాప్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ‘సాక్షి’లో కథనం వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద యాప్ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క రైతు కూడా పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్తనాలు పొందలేదంటే యాప్ అమలులోకి రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. సబ్సిడీపై విత్తనాల పంపిణీకి ఎగనామం పెట్టే కుట్రలో భాగంగానే అధిక ధర నిర్ణయం, నామమాత్రపు సబ్సిడీ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమాలతోనే మహిళా సమస్యలకు పరిష్కారం కర్నూలు(సెంట్రల్): ఐక్య ఉద్యమాల ద్వారానే మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం కార్మిక కర్షక భవన్లో ఐద్వా 12వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ముందుగా ఆమె జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్య మండలి కళాకారులు మహిళల ఔన్నత్వాన్ని కళారూపంలో వివరించారు. అనంతరం జరిగిన సభకు అరుణమ్మ, ధనలక్ష్మీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన పి.నిర్మల మాట్లాడారు.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. మహిళలపై దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, మానభంగాలు ఎక్కువయ్యాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రత్నమ్మ, ఉమాదేవి, సుజాత పాల్గొన్నారు. -
కోసిగిలో భారీ చోరీ
కోసిగి: మండల కేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. స్థానిక ఉరుకుంద మెయిన్ రోడ్డులో మధు, లీలావతి దంపతులు నివాసం ఉంటున్నారు. సోమవారం కౌతాళంలో బంధువు చనిపోగా మధు అంత్యక్రియలకు వెళ్లాడు. రాత్రి వేళ ఇంట్లో ఒంటరిగా ఉండలేక లీలావతి గ్రామంలోనే ఉంటున్న అమ్మ వద్దకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు అర్ధరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి బీరువాలోని సొమ్మును దోచుకెళ్లారు. ఉదయం దంపతులు ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉంచిన 6 తులాల బంగారు నగలు, కేజీ వెండి, రూ.లక్ష నగదును దుండగులు దోచుకెళ్లినట్లు బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. బయటి వ్యక్తులకు చెందిన బంగారు తాకట్టు పెట్టుకుని డబ్బు వడ్డీకి ఇచ్చినట్లు దంపతులు తెలిపారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా క్లూస్ బృందం వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సీజీ ఫుటేజీ పరిశీలించగా ఇద్దరు దుండగులు మూఖా నికి గుడ్డ కట్టుకొని చోరీకి పాల్పడినట్లు తెలిసింది. వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు రాత్రి వేళ గస్తీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ట్రావెల్స్ బస్సు బోల్తా ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని సిరాలదొడ్డి సబ్స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్స్ అదుపుతప్పి బోల్తాపడింది. బస్సులోని ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ స్వల్ప గాయాలతో బయట పడటంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లకుండా తెల్లవారుజామునే ఎవరికి వారు ఇతర వాహనాలలో ఆదోనికి వెళ్లిపోయినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారని పోలీసులు చెప్పారు. -
భారీగా నష్టపోయా..
ప్యాలకుర్తిలో ఎకరా రూ.20 వేల ప్రకారం కౌలుకు తీసుకొని రెండెకరాల్లో రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టి ఉల్లి పంట సాగు చేశా. పంట చేతికొచ్చినప్పటి నుంచి మార్కెట్లో ధర లేకుండా పోయింది. కనీసం ఉల్లి గడ్డలు కోసి మార్కెట్కు తరలించినా కూలీలకు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. దీంతో రెండెకరాల్లోని ఉల్లి పంటను పూర్తిగా రోటావేటర్తో ధ్వంసం చేశా. ఉల్లి సాగుతో భారీగా నష్టపోయా. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. – రైతు గోపాల్, ముడుమలగుర్తి గ్రామం రెండున్నర ఎకరాల్లో బోరు కింద రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంట సాగు చేశా. ఉల్లి దిగుబడి బాగున్నా మార్కెట్లో కొనే నాథుడే లేడు. చేసేది లేక పంటనంతా గత రెండు రోజుల నుంచి గొర్రెలకు వదలేశా. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ఉల్లి రైతులకు ప్రకటించిన నష్టపరిహారంమైన త్వరగా అందిస్తే ఇతర పంటలు సాగు చేసుకుంటాం. – రైతు విజయభాస్కర్రెడ్డి, ప్యాలకుర్తి గ్రామం -
పంటకోతకు ముందే కన్నీరు
● ఉల్లికి గిట్టుబాటు ధర లేక దున్నేయడం, గొర్రెలకు మేతగా వదిలేస్తున్న వైనం ● పది రోజుల్లో వందలాది ఎకరాల్లో పంటను ధ్వంసం చేసిన రైతులు కోడుమూరు రూరల్: ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లి పంటకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించలేకపోతుంది. ధర లేక చేతికొచ్చిన ఉల్లి పంట ను కొందరు దున్నేస్తుండగా, మరికొందరు రైతులు గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. దీంతో కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నాశనమవుతున్న దృశ్యాలను చూస్తూ రైతుల గుండెలు బరువెక్కుతున్నాయి. గతంలో ఏనాడు కూడా ఇలా చేతికొచ్చిన పంటలను చేజేతులా నాశనం చేసే దృశ్యాలను చూడలేదనిని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ దృశ్యాలు ప్రతి గ్రామంలో నిత్యం చోటుచేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 30 వేలకు పైగా ఎకరాల్లో రైతులు వర్షాధారం, బోరుబావుల కింద లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఉల్లి పంటను సాగు చేశారు. రైతుల కష్టం ఫలించి దిగుబడులు బాగానే ఉన్నా మార్కెట్లో మాత్రం ధర పూర్తిగా పడిపోవడంతో పాటు, ఉల్లి అంటే మాకొద్దు అనే పరిస్థితి నెలకొంది. మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ.500 కూడా పలకకపోవడంతో పంట కోసి మార్కెట్కు తరలించినా కూలీ రేట్లు కూడా రైతులకు గిట్టుబాటుగాని పరిస్థితి నెలకొంది. దీంతో గత 10 రోజుల వ్యవధిలో జిల్లాలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, క్రిష్ణగిరి, దేవనకొండ, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆస్పరి, తుగ్గలి, పత్తికొండ, ఆదోని, ఆలూరు వంటి ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో రైతులు చేతికొచ్చిన ఉల్లి పంటను దున్నేస్తూ గొర్రెలకు మేతగా వదిలేస్తూ ధ్వంసం చేశారు. ఒక్క కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలోనే గత వారం రోజుల్లో వెంకటప్ప, రఫీక్, శ్రీనివాసులు, షఫీ, తెలుగు శ్రీనివాసులు, గోపాల్, భాస్కర్రెడ్డిలతో పాటు మరికొందరు రైతులు 40కు పైగా ఎకరాల్లో సాగు చేసిన ఉల్లి పంటను ధ్వంసం చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతోంది. ఉల్లి రైతులను పట్టించుకోని ప్రభుత్వం ఆరంభ శూరత్వంగా కొద్ది రోజుల పాటు ఉల్లికి మద్దతు ధర అంటూ క్వింటాలు ఉల్లి రూ.1200 ప్రకారం కోనుగోలు చేసిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. తర్వాత ఉల్లికి మద్దతు ధర గాకుండా హెక్టార్కు రూ.50 వేల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. ఉల్లి పంటను రోటావేటర్తో ధ్వంసం చేస్తున్న రైతు ధ్వంసమైన ఉల్లి -
నవంబర్ 12న ఆర్యూ కాన్వొకేషన్
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ (ఆర్యూ) 4వ కాన్వొకేషన్ నవంబర్ 12న వర్సిటీలో నిర్వహిస్తున్నట్టు వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకటబసవరావు తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కాన్వొకేషన్కు గవర్నర్, వర్సిటీ చాన్స్లర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరవుతారన్నారు. 2021–22, 2022–23, 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో వర్సిటీ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, ఎల్ఎల్బీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసుకొని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారి విద్యార్హత పట్టాలను పొందవచ్చన్నారు. ఇప్పటికే రెండుసార్లు కాన్వొకేషన్కు నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. యూజీ విద్యార్థులు 9404, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు 420, పీహెచ్డీ 148 మంది దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారన్నారు. 70 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
అడవిలో అగ్నిశిఖ
ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని కనువిందు చేస్తున్నాయి. కొత్తపల్లి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం, గువ్వలకుంట్ల, పాలెంచెరువు, బండినాయిని పాలెం సమీపంలోని వరి పంట పొలాల్లో, ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెరువు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మొక్కలు విరివిగా ఉన్నాయి. దీనినే నాగేటిగడ్డ, నీరుపిప్పిలి మొక్క అని పిలుస్తుంటారు. ఈ తీగ జాతి మొక్క పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. ఈ పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి. ఈ పుష్పాలను ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలన్నీ విషపూరితం. పాముకాటు, తేలు కాటుకు విరుగుడుగా, పలు రోగాల నివారణగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యుల సూచనలు, సలహాల మేరకు వాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. – కొత్తపల్లిఎరుపు, పసుపు రంగులతో.. -
బాధ దిగమింగి.. జీవాలకు మేతగా..
ఉల్లిని కూలీలతో తెంపి మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తే సొమ్ము చేతికి రావాల్సింది పోయి.. మరింత అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన దుస్థితి. దీంతో దిక్కుతోచక రైతులను పంటను జీవాలకు మేతగా వదిలేస్తున్నారు. ఆలూరు మండలం మనేకుర్తికి చెందిన చాకలి పరమేష్ బోరు బావి కింద రెండెకరాల్లో ఉల్లి సాగు చేశారు. పెట్టుబడుల కోసం రూ.2 లక్షలు అప్పు చేశారు. పంట చేతికొచ్చిన దశలో ఉల్లికి ధర లేకుండా పోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. మార్కెట్లో ఉల్లి ధర.. పంట కోతకు కూలీల ఖర్చు, రవాణా ఖర్చును భేరీజు వేసుకోగా మరింతగా అప్పుల భారం మీద పడుతుందని లెక్కలు వేసుకున్నారు. బాధను దిగమింగుకుని మంగళవారం ఉల్లి పంటను జీవాలకు మేతగా వదిలేశారు. దీనిపై బాధిత రైతును పలకరించగా.. ప్రభుత్వం ఉల్లి పంట హెక్టారుకు రూ.50 వేలు సాయం ప్రకటించింది. అది వచ్చే వరకు పొలంలో పంటను అలాగే ఉంచుకోలేం. అంతకుముందు ఉల్లి క్వింటాలుకు ప్రకటించిన రూ.1,200 మద్దతు ధర కూలీలకు కూడా సరిపోదు. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం శ్రమించి పంటలను సాగు చేసిన రైతులకు చివరకు ఆత్మహత్యలే శరణ్యం తప్పా.. మిగిలేది ఏమీ లేదని కన్నీటి పర్యంతమయ్యారు. – ఆలూరు జీవాలకు మేతగా వదిలేసిన ఉల్లి పంట ఉల్లిగడ్డలను చూపుతున్న రైతు వీరేష్ -
కల్వర్టు వద్ద ఇరుక్కుపోయిన లారీ
● స్తంభించిన రాకపోకలు కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో మంగళవారం అర్ధరాత్రి కల్వర్టు వద్ద ఫ్లయాష్ లారీ ఇరుక్కుపోయింది. నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మండలంలోని గుళ్లదూర్తి సమీపంలో కల్వర్టు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డును పక్కకు మళ్లించారు. అరకొరగా గ్రావెల్ వేసి తాత్కాలికంగా రోడ్డును ఏర్పాటు చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతింది. ఈ స్థితిలో మంగళవారం జమ్మలమడుగు నుంచి కోవెలకుంట్లకు వస్తున్న ఫ్లయాష్ ట్యాంకర్ లారీ గ్రావెల్ రోడ్డులో ఇరుక్కుపోయింది. ఈ రహదారిలో ప్రత్యామ్నా యం లేకపోవడంతో రెండు వైపులా వాహనాలు నిలిచి రాకపోకలు స్తంభించాయి. దీంతో కర్నూలు, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, తిరుపతి, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్ని వాహనాలను గుళ్లదూర్తి నుంచి సంజామల మీదుగా కోవెలకుంట్ల వైపు మళ్లించారు. ఉదయం 10 గంటలకు జేసీబీ సాయంతో లారీని తొలగించడంతో రాకపోకలు యథావిధిగా సాగాయి. -
ఉల్లి.. రైతు తల్లడిల్లి!
కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు తల్లడిల్లుతున్నారు. ఉల్లి రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పండించిన ఉల్లిని మార్కెట్కు తీసుకెళ్తే పెట్టుబడి ఖర్చులు దేవుడెరుగు కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ప్రభుత్వం మొదట ఉల్లి క్వింటాలుకు రూ.1200 ధర కల్పిస్తామని చెప్పడం తర్వాత ఎకరానికి రూ.20 వేలు ఇస్తామంటూ రోజుకో మాట చెబుతుండటంతో నమ్మకం లేక రైతన్నలు తీవ్ర ఆవేదనతో చేతికొచ్చిన పంటను దున్నేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్పరి మండలం జొహరాపురం గ్రామానికి చెందిన జేపీ రంగస్వామి అనే రైతు ఆరెకరాల్లో ఉల్లి పంటను ట్రాక్టర్తో మంగళవారం తొలగించాడు. పంట సాగు కోసం రూ.3 లక్షల పెట్టుబడి పెట్టాడు. మార్కెట్లో ఉల్లికి ధర లేకపోవడం, కోతలకు అయ్యే ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉండటంతో తీవ్ర ఆవేదనకు గురై చేతికొచ్చిన పంటను ట్రాక్టర్తో దున్నేశాడు. అంతకుముందు పంటను గొర్రెలకు వదిలేశాడు. ఇదిలాఉండగా జొహరాపురంలో 15 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో నల్లరేగడి మెట్ట పొలంలో ఉల్లిని సాగు చేశారు. వారు కూడా చేసేది లేక ఉల్లి పంటను తొలగించారు. – ఆస్పరిజొహరాపురంలో ఉల్లి పంటను ట్రాక్టర్తో తొలగిస్తున్న రైతన్న -
తెల్లబంగారం చిన్నబోతోంది!
వైఎస్సార్సీపీ టాక్స్–కర్నూలు యూట్యూబ్ చానల్ ప్రారంభంసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ టాక్స్– కర్నూలు యూట్యూబ్ చానల్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాట సాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, కర్నూలు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలిదివ్యాంగులకు మరోసారి ‘పరీక్ష’ కర్నూలు(అగ్రికల్చర్): దివ్యాంగులు మరోసారి సదరం క్యాంపు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దివ్యాంగుల పింఛను పొందుతూ రీ వెరిఫికేషన్లో అనర్హత వేటు పడిన వారిలో అప్పీల్ చేసుకున్న వారికి మరోసారి పునః పరిశీలన చేపట్టనున్నారు. కర్నూలు జిల్లాలో 4731 దివ్యాంగుల పింఛన్లు, 17 హెల్త్ పించన్లు.. నంద్యాల జిల్లాలో 4,099 దివ్యాంగులు, 64 హెల్త్ పింఛన్లపై అనర్హత వేటు పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ నెలలోనే తొల గింపులు జరగాల్సి ఉంది. అయితే దివ్యాంగులఆందోళనలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో యథావిధిగా పింఛన్లు పంపిణీ చేసింది. అనర్హత ఉన్నట్లు నోటీసులు అందుకున్న కర్నూలు జిల్లాలో 4,286 మంది, నంద్యాల జిల్లాలో 4వేల మందికిపైగా దివ్యాంగులు అప్పీల్ చేసుకున్నారు. వీరందరికీ మరోసారి వికలత్వం పరిశీలించే కార్యక్రమం ఈ నెల 8వ తేదీ నుంచి మొదలు కానుంది. ఇందు కోసం కర్నూలు సర్వజన వైద్యశాల, ఎమ్మిగనూరు, ఆదోని ప్రభుత్వ వైద్యశాలల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రతి వారం బుధ, గురు, శుక్రవారాల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తా రు. కర్నూలు సర్వజన వైద్యశాలలో చెవి, కన్ను, ఆర్థోపెడిక్, మానసిక వైకల్యం కలిగిన వారికి పరీక్షలు నిర్వహిస్తారు. ఎమ్మిగనూరులో కేవలం ఆర్థోపెడిక్, ఆదోనిలో ఆర్థోపెడిక్, కన్నుకు సంబంధించి సదరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆలూరు: వాల్మీకులను ఓటు బ్యాంక్గా చూడకుండా ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేయాల్సిన బాధ్యత ఉందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో మంగళవారం వాల్మీకి సంఘం నియోజకవర్గం నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి పాత బస్టాండు సమీపంలో ఉన్న వాల్మీకి విగ్రహం వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా వాల్మీకులు, సంఘ నాయకులు ర్యాలీగా తరలివచ్చారు. వాల్మీకి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీ, తదితరులు మాట్లాడారు. ప్రధానంగా వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలోకి చేర్పించేందుకు కూటమి నేతలు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వాల్మీకులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, నాయకులు శ్రీనివాసులు, ఎల్లప్ప, అరికెర వెంకటేశ్వర్లు, వరుణ్, వీరేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు(అగ్రికల్చర్): పత్తి ధరలు తగ్గుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. పత్తికి మద్దతు ధర రూ.8,110 ఉంది. మార్కెట్లో మాత్రం క్వింటాకు లభిస్తున్న ధర రూ.7వేల వరకు మాత్రమే. సోమవారం ఆదోని మార్కెట్కు 11,623 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా.. కనిష్ట ధర రూ.3,960, మధ్య ధర రూ.7,450.. గరిష్ట ధర రూ.7,769 నమోదైంది. పత్తి క్రయవిక్రయాలు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మాత్రమే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆదోని మార్కెట్కు దాదాపు 12 వేల క్వింటాళ్ల పత్తి వస్తోంది. మార్కెట్లోకి పత్తి వస్తుందంటేనే ప్రభుత్వం సీసీఐని రంగంలోకి దించాలి. మామూలుగా అయితే సెప్టెంబర్ 15వ తేదీ నాటికే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు అతీగతీ లేని పరిస్థితి. అధిక వర్షాల వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా పత్తి దెబ్బతినింది. సగటు దిగుబడిలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. అంతంతమాత్రం వచ్చిన దిగుబడులకు ధరలు లేవు. వెంటనే సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నెల రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదించినా చలనం లేకపోవడం గమనార్హం. -
వైభవంగా పవిత్రోత్సవాలు
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాదవరదస్వామి ఆలయంలో మూడురోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్ఛారణలతో ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల మధ్య పవిత్ర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు గ్రామోత్సతం నిర్వహించారు. ప్రత్యేకాలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాదవరదుడు -
స్కూల్ బ్యాగులు చిరిగి.. నాణ్యత నవ్వి!
● జిల్లాలో 2.68 లక్షల మందికి స్కూల్ బ్యాగుల పంపిణీ ● చిరిగిన బ్యాగ్లు వెనక్కి ఇస్తే కొత్తవి ఇస్తామని ప్రకటన ● కుట్లు పోయింటే కుట్టించుకుని వాడుకోవాలంటున్న అధికారులు కర్నూలు సిటీ: ‘సర్వేపల్లి రాధా కృష్ణ విద్యార్థిమిత్ర’ బ్యాగుల పరిస్థితి జిల్లాలో దారుణంగా ఉంది. చిరిగిపోయిన బ్యాగు లు గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు స్కూల్ బ్యాగులను అత్యంత నాణ్యత కలిగినవి అందిస్తున్నామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. అయితే విద్యా సంవత్సరం మొదల య్యాక కొంత ఆలస్యంగా విద్యార్థులకు బ్యాగులను అందించారు. నెల రోజుల్లోపే వాటిలో 60 శాతంపైనే చిరిగిపోయాయి. విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. చిరిగిన, కుట్లు పోయిన వాటిని రిటర్న్ పంపించాలని, వాటి స్థానంలో కొత్తవి ఇస్తామని ఇటీవలే ఆయా స్కూళ్ల హెచ్ఎంలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో చాలా మంది హెచ్ఎంలు యాప్లో బ్యాగ్లను రిటర్న్ చేసేందుకు వివరాలు నమోదు చేశారు. అయితే ఇందులో బ్యాగ్ మొత్తం పనికిరాకుండా ఉంటేనే వెనక్కి తీసుకుని కొత్తది ఇస్తామని విద్యాశాఖ అధికారులు మెలిక పెట్టారు. చిరిగితే కుట్టించుకోండి! జిల్లాలోని 1,457 ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లు ఉండగా 2,76,971 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు 2.68 లక్షలు అందజేశారు. ఒక్కో కిట్టు విలువ రూ.2,279 కాగా వీటిలో స్కూల్ బ్యాగు ఉంది. చిరిగిపోయిన స్కూల్ బ్యాగ్ రిటర్న్ ఇవ్వాలని విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో రెండు రోజులకే 1,174 మంది పిల్లలు రిటర్న్ చేసేందుకు యాప్లో అప్లోడ్ చేశారు. అయితే 252 మందికి మాత్రమే కొత్త బ్యాగ్లు ఇవ్వనున్నారు. మిగిలిన బ్యాగ్లను ఆయా స్కూళ్లకు వెనక్కి పంపించి కుట్లు పోయింటే, చిరిగిపోయింటే కుట్లు వేయించుకోండి అని విద్యాశాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. కొలతలు లేకుండానే బూట్లు.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో 2,71,006 మంది విద్యార్థులకు బూట్లు, ఒక్కో విద్యార్థికి రెండు జతల సాక్సులు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందజేయలేదు. కొందరికి ఇచ్చినా ఎలాంటి ముందస్తు కొలతలు తీయకుండానే విద్యార్థులకు అందజేశారు. దీంతో చాలా మంది విద్యార్థులు బూట్లు వేసుకోకుండానే చెప్పులు వేసుకోని స్కూళ్లకు వస్తున్నారు. చిప్పగిరి, కృష్ణగిరి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు మండలాల్లో సుమారుగా 500 మంది విద్యార్థులకు ఇంత వరకు స్కూల్ బ్యాగ్లు ఇవ్వలేదని ఉపాధ్యాయ వర్గాలే చెబుతున్నాయి. ఆయా మండలాల పరిధిలోని స్కూళ్ల నుంచి చిరిగిన బ్యాగ్లు, కుట్లుపోయిన బ్యాగ్లను సేకరించి జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టోరేజీ పాయింట్కు చేర్చాలని సమగ్ర శిక్ష అధికారులు ఎంఈఓలకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 26 మండలాలు ఉంటే కేవలం నాలుగు మండలాల నుంచి మాత్రమే బ్యాగ్లు మార్పులు చేసేందుకు యాప్లో అప్లోడ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నాలుగు మండలాల్లో కూడా కొన్ని స్కూళ్ల నుంచి మాత్రమే కొత్త బ్యాగ్లు కోరినట్లు తెలుస్తోంది. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు, బూట్లు అందజేశాం. బ్యాగ్లో కొన్ని డ్యామేజ్ వచ్చినవి, చినిగిపోయి వినియోగించేందుకు ఉపయోగంగా లేని వాటిని మార్చి నాణ్యమైన బ్యాగ్లను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా కొలతలు సరిపోని బూట్లను సైతం మార్పులు చేసి కొత్తవి ఇవ్వనున్నాం. – ఎస్.శ్యామూల్ పాల్, డీఈఓ -
మతోన్మాదులను కట్టడిచేయకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం
కర్నూలు(సెంట్రల్): మతోన్మాదులను కట్టడి చేయకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హరి నాథ్చౌదరి, వెంకటేశ్వర్లు అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడిని న్యాయవాదులు, ప్రజా సంఘాలు ఖండించాయి. ఆయనకు మద్దతుగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలను చేపట్టారు. జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. నేషనల్ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. న్యాయవాది ఉద్దేశపూర్వకంగా కోర్టులో మత నినాదాలు చేస్తూ దాడికి పాల్పడడం మంచి పద్ధతి కాదని సీనియర్ న్యాయవాది జయరాజు అన్నారు. ఆయనన్ను న్యాయవాద వృత్తి నుంచి తొలగించాలని కోరారు. తనపై దాడి జరిగినా కోర్టును కొనసాగించిన ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అత్యున్నత పదవికి ఇచ్చిన గౌరవమని, ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు. తల్లిదండ్రులను విస్మరిస్తే ఆస్తిహక్కు కోల్పోతారు కర్నూలు(అర్బన్): వృద్ధ తల్లిదండ్రులకు పిల్లలు చేయూతనివ్వకపోతే ఆస్తి హక్కు కోల్పోతారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. మంగళవారం జిల్లా హార్టిక్చలర్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన ప్రపంచ వృద్ధుల దినోత్సవ వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థికంగా ఒకస్థాయి లో ఉన్న వృద్ధులు కూడా కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం.. ఆస్తుల కోసం వేధింపులు, దాడులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వృద్ధులను ఆదుకోవడానికి అనేక చట్టాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ చట్టం(2007) ప్రకారం వృద్ధులకు నెలవారీ జీవన భృతి కల్పించాలన్నా రు.వారి పోషణను విస్మరించిన వారికిజరిమానా, జైలు శిక్ష తప్పవన్నారు. వృద్ధులకు ఏమైనా సమస్యలుంటే 15100 కాల్ చేస్తే ఉచిత న్యాయ సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం వృద్ధులకు సంక్షేమశాఖ నుంచి వచ్చిన బెడ్షీట్లను అందించారు. కార్యక్రమంలో గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ జఫ్రుల్లా తదితరులు పాల్గొన్నారు. రానున్న ఐదు రోజులు వర్ష సూచన కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. జిల్లా మొత్తంగా సగటున ఈ నెల 8న 4 మి.మీ, 9న 12, 10న 15, 11న 13, 12న 15 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా మంగళవారం తెలిపారు. ఉష్ణోగ్రతలు 31.8 డిగ్రీల నుంచి 32.6 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నంద్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఈశాన్యం దిశగా గాలులు గంటకు 9–10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. పీహెచ్సీల వైపు చూడని వైద్యులు కర్నూలు(హాస్పిటల్): దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఓ వైపు మెడికల్ ఆఫీసర్లు విధులు బహిష్కరించి వారం రోజులుగా సమ్మె చేస్తుండగా వారి స్థానంలో సర్దుబాటు చేసిన వైద్యులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వివిధ వ్యాధులతో చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చిన రోగులు వైద్యులు లేరని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. సోమవారం మొత్తం 35 మందిలో 15 మంది మాత్రమే విధులకు హాజరుకాగా, మంగళవారం కేవలం ఇద్దరు రెగ్యులర్ వారితో పాటు 9 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. ఇందులో ఉలిందకొండ, కోసిగి, గజ్జిహల్లి, గార్గేయపురం, కౌతాళం, కల్లూరు, హాలహర్వి–ఎ, గూడూరు, పగిడిరాయి, పెద్దకడుబూరు, పెద్దహరివాణం పీహెచ్సీలు ఉన్నాయి. వైద్యులు లేకపోవడంతో రోగులకు అక్కడున్న ఫార్మాసిస్టులు, నర్సులు వ్యాధి లక్షణాల మేరకు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. మరోవైపు సంచార చికిత్స వాహనాలు సైతం వారం రోజులకు పైగా కదలడం లేదు. దీంతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న రోగులు వైద్యపరీక్షలు, మందు లు లేక ఇబ్బందులు పడుతున్నారు. -
పవన్, జనసేన నేతలపై సుగాలి పార్వతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నారని బాధితురాలు తల్లి సుగాలి పార్వతి ప్రశ్నించారు. మాకు న్యాయం చేస్తానని నమ్మించి.. పవన్ నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే.. చంద్రబాబు, పవన్, లోకేష్కు తమ ఉసురు తగులుతుందని ఘాటు విమర్శలు చేశారు.సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు ఆమె తల్లి పార్వతి . ఈ సందర్భంగా సుగాలి పార్వతి మాట్లాడుతూ..‘2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాం. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రశ్నించాను అయినా మాకు న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వంలో తమ కేసును సీబీఐకి అప్పగించినట్లు ప్రకటన చేయడం లేదు. దీనిపై స్పష్టత ఇవ్వలేదు.సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని చంద్రబాబు, పవన్ గొప్పలు చెబుతున్నారు. మా సమస్యలను పట్టించుకోవడం లేదు. అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పిన పవన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఒక్కసారైనా అసెంబ్లీలో ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు. ఎందుకు సైలెంట్గా ఉన్నారు. జనసేన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మాపై అనేక ఆరోపణలు చేసి కించపరిచే విధంగా మాట్లాడారు. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ ఎమ్మెల్యే గాద వెంకటేశ్వర్లు అనేక ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు పవన్ అనేక హామీలు ఇచ్చారు. కానీ అధికారంలో వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదు. న్యాయం చేస్తానని చెప్పి.. నమ్మక ద్రోహం చేశారు. హైకోర్టులో పిటిషన్ వేశాం. మాకు న్యాయం జరగడం కోసం వీల్ చైర్ యాత్ర నిర్వహించేందుకు హైకోర్టును ఆశ్రయిస్తాం. మాకు న్యాయం జరగకపోతే పవన్, చంద్రబాబు, లోకేష్కు మా ఉసురు తగులుతుంది. వీల్ చైర్ యాత్ర చేస్తానంటే అడ్డుకున్నారు. చిత్తశుద్ధి ఉంటే వీల్ చైర్ యాత్రకు అనుమతి ఇప్పించాలి.బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా మేము కలిసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈనెల 16వ తేదీ ప్రధాని మోదీ కర్నూలు వస్తున్నారు.. అప్పుడు మోదీని కలిసి మా బాధను విన్నవించే ప్రయత్నం చేస్తాను. బీజేపీ నేతలు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి. మోదీని కలవడానికి అనుమతించకుంటే 13,14,15 తేదీలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తా. కలెక్టరేట్ ముందు ఆందోళన చేయకుండా అడ్డుకుంటే ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తా’ అని చెప్పుకొచ్చారు. -
ప్రియురాలి వేధింపులతో యువకుడి ఆత్మహత్య
ఎమ్మిగనూరు రూరల్: ఇరువురూ ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎవరికి వారు పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత కూడా ప్రియుడితోనే ఉండేందుకు నిశ్చయించుకుంది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆ యువకుడు సూసైడ్ నోట్ రాసుకొని తనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భీమన్నగౌడ్, రాజమ్మలకు అనికుమార్గౌడ్, సునీల్కుమార్గౌడ్, ధనుంజయ్గౌడ్, జయలక్ష్మీలు సంతానం. ధనుంజయ్గౌడ్(27) పెళ్లి కాక ముందు నుంచే గ్రామానికి చెందిన, వయస్సులో తనకన్నా పెద్దదైన శశికళను ప్రేమించాడు. కులాలు వేరుకావటం, వయసులో పెద్దది కావటంతో పెద్దలు, తల్లిదండ్రులు ఇద్దరికీ సర్దిచెప్పడంతో దూరంగా ఉంటున్నారు. శశికళను మంత్రాలయంకు చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు సంతానం. ధనుంజయ్గౌడ్(27) ఎమ్మిగనూరులో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఎర్రకోటలోని తన మేనమామ కృష్ణగౌడ్ కుమార్తె సాయిప్రియతో 2022 జూన్లో వివాహమైంది. అయితే శిశకళకు పెళ్లై పిల్లలున్నా ధనుంజయ్గౌడ్తో తిరిగి స్నేహం కొనసాగించింది. ఇరువురూ ఊరు వదలి పారిపోయారు. కుటుంబ సభ్యులు ఇద్దరినీ పిలుచుకొచ్చి సర్దిచెప్పారు. ఆ తర్వాత మరోసారి కూడా ఇరువురూ పారిపోవడంతో ధనుంజయ్గౌడ్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకుల కేసు కోర్టు నడుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ భర్త, ఇద్దరు ప్లిలలను వదలి ధనుంజయ్గౌడ్ వద్దకు చేరుకుంది. చేసేది లేక కర్నూలు రోడ్డులోని ఓ లేడిస్ హాస్ట్టల్లో శశికళ ను ఉంచి తాను ఎమ్మిగనూరులోనే ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అయితే శిశకళ తనను పెళ్లి చేసుకొవాలని, ఎన్ని రోజులు హాస్టల్లో పెడతావంటూ వేధించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం గువ్వలదొడ్డికి వెళ్లిన ధనుంజయ్గౌడ్కు హాస్టల్లో ఉన్న శశికళ వీడియోకాల్ చేసి నన్ను తీసుకెళ్లకపోతే ఉరేసుకొని చనిపోతానంటూ బెదిరించింది. ఆమె చనిపోతే కేసు తన మీదకే వస్తుందని భయాందోళనకు లోనైన ధనుంజయగౌడ్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పపడ్డారు. కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు సోమవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. శశికళను భర్త, పిల్లల దగ్గరకు చేర్చండి ధనుంజయ్గౌడ్ తన సుసైడ్ నోట్లో ‘‘నేను చనిపోతున్నా.. శశికళను తన భర్త, పిల్లల దగ్గరకు చేర్చి పుణ్యం కట్టుకోండి’’ అని రూరల్ ఎస్ఐ శ్రీనివాసులును కోరాడు. ‘‘శశికళ భర్త చాలా మంచివాడు, శశికళ చనిపోతానని నన్ను భయపెట్టినందుకే నేను తప్పు చేశాను. నా చావే అన్నింటికీ పరిష్కారం.. అమ్మా.. నాన్నా నన్ను క్షమించండి. మేన మామకు వేరీ వేరీ సారీ. చెల్లెలు బుజ్జమ్మను కలెక్టర్గా చూడాలనుకున్నా.. ప్రియురాలి కోసం అందరనీ దూరం చేసుకున్నా. ఇక సెలవు..’’ అనే సమాచారంతో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసుకుని తనువు చాలించాడు.సుసైడ్ నోట్ధనుంజయ్గౌడ్ (ఫైల్) -
మట్టి మిద్దె కూలి చిన్నారి మృతి
మంత్రాలయం రూరల్: మట్టి మిద్దె కూలి ఐదేళ్ల చిన్నారి లలిత మృత్యువాత పడింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంత్రాలయం మండలం మాధవరం గ్రామం బీసీ కాలనీకి చెందిన ఉలువ బీమరాయుడుతో పాటు భార్య బోయ నాగమ్మ, వారి కొడుకు రామాంజనేయులు, కుమార్తె శ్రావణి, మనవరాలు లలిత(5) ఇంట్లో నిద్రిస్తున్నారు. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు మట్టి మిద్దె పూర్తిగా తడిసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా కూలి పోయింది. పెద్ద ధ్వని రావడంతో ఇరుగుపొరుగు వారు వచ్చిన మట్టిని, జెంతలను తొలగించి కుటుంబ సభ్యులను బయటకు తీశారు. ప్రమాదంలో చిన్నారి లలిత స్పృహ కోల్పోయింది. నాగమ్మ, రామాంజనేయులు, శ్రావణి, భీమరాయుడికి స్వల్ప గాయాలతో బయట పడ్డారు. లలిత స్పృహకోల్పవడంతో వెంటనే ఆర్ఎంపీని సంప్రదించగా మృతి చెందినట్లు తెలిపారు. గోనేగండ్ల మండలం గంజహళ్లి గ్రామానికి చెందిన మహేశ్వరి, రామాంజి దంపతుల కుమార్తె లలితను చదువు నిమిత్తం తాత భీమరాయుడు వద్ద ఉంచారు. తాత వద్ద ఉంటూ నర్సరీ చదువుతూ ఆటపాటలతో అలాడుతున్న చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ జనార్దన్రావు పరిశీలించి వివరాలు, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతురాలు తల్లి మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
గ్యాస్ లీకై ఇంట్లో భారీ పేలుడు
● భార్యాభర్తలకు, ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలు వెల్దుర్తి: గ్యాస్ లీకై మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించి ఇల్లు ధ్వంసం కావడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన వెల్దుర్తి మండలం బోయనపల్లె గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో చోటుచేసుకుంది. గాయపడిన వారిలో వడ్డె నాగరాజు, అతని భార్య సువర్ణ (6 నెలల గర్భిణి), వారి కుమారులు అనిల్, చరణ్ ఉన్నారు. వడ్డె నాగరాజు గౌండ పనిచేస్తూ గ్రామంలో చర్చి వద్ద ఉన్న ఇంట్లో బాడుగకు నివాసముంటున్నాడు. ప్రతిరోజులాగేే ఆదివారం అందరూ ఇంట్లో నిదురించారు. అర్ధరాత్రి దాటిం తర్వాత పేలుడు శబ్దం రావడంతో చుట్టపక్కల వారు లేచి వచ్చి చూశారు. అప్పటికే ఇంటి చెక్క తలుపు విరగగొట్టబడి అందులో నుంచి పదేళ్ల అనిల్, నాలుగేళ్ల చరణ్ మంటలతో బయటకు రావడం గమనించారు. వారి మంటలార్పే సమయంలో ‘అమ్మా, నాన్నలు మంటల్లో కాలిపోతున్నారు’ అని అనడంతో ఇంట్లోకి ప్రవేశించి వడ్డె నాగరాజు, అతని భార్య సువర్ణను కాపాడారు. సిలిండర్ వద్ద గ్యాస్ లీకై ఇంటి నిండా వ్యాపించి ఉండగా అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో వడ్డె నాగరాజు లేచి లైట్ వేయడంతోనో, బీడీ అంటించుకునే ప్రయత్నంలోనో పేలుడుతో కూడిన మంటలు రేగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పేలుడు ధాటికి గోడలు బీటలు వారి, తలుపు విరిగి, ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడ్డాయి. తీవ్రగాయాలతో ఉన్న నలుగురిని హుటాహుటిన కృష్ణగిరి 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామానికే చెందిన గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ సుంకన్న సంఘటనాస్థలికి చేరుకుని విచారించారు. సిలిండర్ ఆఫ్ చేయకపోవడం, స్టవ్ నాబ్ పూర్తిగా కట్టకపోవడంతో గ్యాస్ లీకై నట్లు తెలుస్తోందన్నారు. తీవ్రగాయాలైన నలుగురికి దాదాపు 50 శాతం మేర గాయాలైనట్లు కర్నూలు జీజీహెచ్ వైద్యులు ధృవీకరించి చికిత్స అందిస్తున్నారు. వెల్దుర్తి పోలీసులు విచారణ చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు అశోక్ రెడ్డి, గ్రామ నాయకుడు కాంతారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు దాదిపోగు సుంకన్న కోరారు. చరణ్అనిల్తీవ్రంగా గాయపడిన వడ్డె నాగరాజు, సువర్ణ -
అహోజలం
అహోబిల క్షేత్రంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లమల అడవి పచ్చదనాన్ని పరుచుకోవడంతో పాటు ఎత్తైన కొండ చరియల్లోంచి నీటి ధారలు జాలువారుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఎగువ అహోబిలం జ్వాలా నృసింహస్వామి సన్నిధి, ఉక్కు స్తంభం రహదారి వెంట జలపాతాలు ఉద్ధృతంగా కిందకు దూకుతూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. నవనారసింహ స్వాముల దర్శనార్థం వచ్చే భక్తులు, పర్యాటకులు జల సోయగాలను చూస్తూ మురిసిపోతున్నారు. – ఆళ్లగడ్డరేపటి నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ కర్నూలు(అగ్రికల్చర్): శాసీ్త్రయ పద్ధతులకు అనుగుణంగా తేనెటీగల పంపకంపై రైతులకు ఈ నెల 8 నుంచి ఏడు రోజుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉద్యాన శాఖ, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా మొత్తం ఆరు బ్యాచ్లకు శిక్షణ కొనసాగుతుందన్నారు. శిక్షణ పొందిన రైతులకు ఉద్యాన శాఖ తేనెటీగల పెంపకానికి రాయితీలు ఇస్తుందన్నారు. అదే విధంగా 50 శాతం సబ్సిడీపై బాక్స్లు కూడా అందిస్తామన్నారు. ఒక్కో బ్యాచ్లో 25 మందికి మాత్రమే అవకాశం ఉందని, అయితే ఇప్పటికే 160 మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. యాగంటిని సందర్శించిన విదేశీయులు బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని సోమవారం దక్షిణ కొరియాకు చెందిన ఐదుగురు దర్శించుకున్నారు. వీరు భారతదేశంలోని పలు క్షేత్రాలను దర్శించుకుంటూ యాగంటికి చేరుకున్నారు. వీరు క్షేత్ర విశిష్టతలు తెలుసుకుని క్షేత్ర పరిసరాలను ఆసక్తిగా తిలకించారు.ఎగువ అహోబిలం కొండపై నుంచి జాలువారుతున్న జలపాతాలుకిందకు దూకుతున్న జలపాతం క్షేత్రం ఎదుట జల పరవళ్లు, మెట్ల మార్గంలో వరద ప్రవాహం -
బస్సులు కిటకిట
కొలిమిగుండ్ల: దసరా సెలవులు ముగియడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే ప్రజలు ప్రయాణాలు మొదలు పెడుతున్నారు. సోమవారం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు వారి తల్లులు అధిక సంఖ్యలో కొలిమిగుండ్ల, అవుకు బస్టాండ్లకు చేరుకున్నారు. వివిధ రకాల పనుల నిమిత్తం పోయే సాధారణ ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కావడంతో ఎక్కడ చూసినా జనాలే కనిపించారు. ఆర్టీసీ బస్సుల్లో ముందున్న స్జేజీల నుంచే ఓవర్లోడ్తో వచ్చాయి. చాలా మంది ఫుట్బోర్డు మీద నిలబడి ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వచ్చింది. చిన్న పిల్లలు, గర్భిణులు బస్సులు ఎక్కలేని పరిస్థితి ఎదురైంది. వచ్చిన ప్రతి బస్సులో ఫుట్బోర్డు వరకు ప్రయాణికులే కనిపించారు. బస్టాండ్ల వద్ద గంటల సమయం వేచి చూసినా బస్సుల్లో ఏమాత్రం రద్దీ తగ్గలేదు. మార్గమధ్యలోనే పల్లెల్లో బస్సులు ఆపకుండానే వెళ్లాల్సి వచ్చింది. కండక్టర్లు టికెట్లు ఇచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. ప్రత్యేక రోజుల్లో ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులు నడపకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అగ్రహారంలో పట్ట పగలే చోరీ
● 3 తులాల బంగారం, రూ.10 వేల నగదు అపహరణ ఆలూరు రూరల్: మండలంలోని అగ్రహారం గ్రామంలోని ఓ ఇంట్లో పట్ట పగలే దొంగలు పడ్డారు. ఇంటి తలుపులు, బీరువా ధ్వంసం చేసి మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు అపహరణ చేశారు. గ్రామానికి చెందిన ఉరుకుందప్ప సోమవారం ఉదయం 8 గంటలకు ఇంటి తలుపులకు తాళాలు వేసి భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు. పొలం పనులు ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి రాగా తాళాలు పగులగొట్టి చోరీ చేసిన విషయాన్ని గుర్తించాడు. బీరువాలో ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలయ భూమిలో అక్రమ మైనింగ్పై దాడి బనగానపల్లె రూరల్: పలుకూరు గ్రామంలోని రామేశ్వరస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్ 308లో జరుగుతున్న అక్రమ మైనింగ్పై బనగానపల్లె భూగర్భ గనుల శాఖ ఆర్ఐ రెడ్డప్ప సోమవారం ఆకస్మిక దాడి చేశారు. దాడి విషయం ముందుగానే తెలుసుకున్న సుమారు ఆరుగురు మైనింగ్దారులు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. వారిలో బాబాయి, లక్ష్మయ్య, నాగమయ్య, రాజన్నలు ఉన్నారని ఆలయ అర్చకులు భాస్కరయ్య తెలిపారు. ఆర్ఐ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, మైనింగ్దారులు పారిపోవడంతో ఎటువంటి స్వాధీనం జరగలేదని తెలిసింది. ఈ అక్రమ మైనింగ్పై కఠి న చర్యలు తీసుకోవాలని ఆలయ అర్చకులు మండల తహసీల్దార్ను కోరారు. ఈ దాడుల్లో వీఆర్ఐ, సర్వేయర్ తదితర అధికారులు పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహం అపహరణ హాలహర్వి: దేవుళ్ల విగ్రహాలను సైతం దొంగలను అపహరిస్తున్నారు. పచ్చారపల్లి గ్రామంలోని సుంకులమ్మదేవి ఆలయంలో అమ్మవారి వెండి విగ్రహాన్ని అపహరించారు. అలాగే అమ్మవారి తాళిబొట్టు, ముక్కుపుడక, ఒకటిన్నర తులం బంగారాన్ని చోరీ చేశారు. సోమవారం ఉదయం అర్చకుడు దేవేంద్రప్ప ఆలయానికి పూజ చేయడానికి వెళ్లి చూడగా విగ్రహం కనిపించలేదు. దీంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు అక్కడికి చేరుకుని వెంటనే హాలహర్వి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మారుతి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కర్నూలు నుంచి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అనుమానం పెనుభూతమై!
● భార్యను కిరాతకంగా చంపిన భర్త ● తలపై ఇటుకతో మోది.. ● మృతదేహాన్ని మిద్దైపె నుంచి కిందకు పడేసిన వైనం ఆళ్లగడ్డ: జీవితాంతం తోడు ఉంటానంటూ మూడు ముళ్లు వేశాడు.. ఏడు అడుగులు నడిచాడు. వారి అన్యోన్య దాంపత్యానికి నలుగురు పిల్లలు పుట్టారు. 20 ఏళ్ల తర్వాత భార్యపై అతనికి అనుమానం మొదలైంది. అది పెనుభూతమై చివరకు ఆమెను అతి కిరాతకంగా అంతమొందించాడు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళిధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలం ఆర్. కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓలమ్మ (40)కి ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంటకు చెందిన శేషగిరితో సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న సంసారంలో అనుమానం పెనుభూతమైంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో విసుగు చెందిన ఓలమ్మ వారం రోజుల క్రితం పుట్టినిల్లు ఆర్ కృష్ణాపురం చేరుకుంది. ఈ క్రమంలో ఆదివారం భార్య దగ్గరికి వచ్చిన ఆయన తనతో రావాలని చెప్పడంతో సోమవారం ఉదయం పోదామని చెప్పింది. కింది ఇంట్లో ఓలమ్మ తల్లి, అన్న నిద్రించగా ఓలమ్మ, భర్త శేషగిరిలు మిద్దైపె గదిలో నిద్రించారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి భార్యను ఇటుకతో తలపై మోది హత్య చేశాడు. అనంతరం మృతి చెందిన ఓలమ్మను మిద్దైపె నుంచి కిందకు విసిరి పడేసి అక్కడ నుంచి శేషగిరి పారిపోయాడు. ఏదో శబ్దం వచ్చిందని ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా విగతజీవిగా పడిఉన్న ఓలమ్మను గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ మురళీధర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతురాలి అన్న ఓబులేసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’తో ఎంతో మేలు
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్కర్నూలు కల్చరల్: ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేవైఎం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సునీల్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం బీఏఎస్ కల్యాణ మండపంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాధవ్ మాట్లాడుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువుల వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈనెల 16న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జిల్లా పర్యటనకు వస్తున్నారని, ప్రజలు ఘన స్వాగతం పలకాలని కోరారు. సూపర్ జీఎస్టీపై కర్నూలులో జరిగే బహిరంగ సభలో ప్రధాని మాట్లాడతారన్నారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రమేష్ నాయుడు, దయాకర్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు విష్ణువర్థన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గీతామాధురి, శ్రీశైలం దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన
కర్నూలు కల్చరల్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 16న ప్రధాని మోదీ పర్యటించనున్నారని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్రెడ్డి, టీజీ భరత్ తెలిపారు. సోమవారం కర్నూలులోని స్టేట్ గెస్ట్హౌస్లో జిల్లాలో ప్రధాని పర్యటనపై వీరు సమీక్ష చేపట్టారు.3 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. సభ ఏర్పాటుకు అనుగుణంగా ఉండే ప్రదేశాలను ఈ సందర్భంగా మంత్రులు గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. -
ప్రైవేటీకరణపై ‘ప్రజా’గ్రహం
● జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన ● ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని వైద్య కళాశాలలను, ఆసుపత్రులను వ్యాపార కేంద్రాలుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు. పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం విద్య, వైద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు జీఓ నెంబర్ 107/108 విడుదల చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రజలకు రానున్న రోజుల్లో వైద్యం అందక తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఐక్య వేదిక కన్వీనర్ ఎం రామక్రిష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన నిరసనలో కే రామాంజనేయులు (చేతి వృత్తుదారుల సమాఖ్య), పీ రాధాక్రిష్ణ (సీఐటీయు), ఎస్ మనోహర్ మాణిక్యం (ఏఐటీయుసీ), భార్గవ్ ( పీఓపీ ), జహంగీర్ (ఎస్డీపీఐ), హరీశ్వరరెడ్డి (ఏడీఎస్ఓ), సుబ్బరాయుడు (డీటీఎఫ్), కే శేషాద్రిరెడ్డి (జనవిజ్ఞాన వేదిక), డేవిడ్ (ప్రజా పరిరక్షణ సమితి), వీ నాగరాజు (ఏపీ ప్రజా నాట్య మండలి), కే శివనాగిరెడ్డి (స్పార్క్), జయన్న (భవన నిర్మాణ కార్మిక సంఘం), వివిధ సంఘాల నాయకులు సాయి ఉదయ్, అబ్దుల్లా, శరత్కుమార్, బీసన్న, వెంకట్రామిరెడ్డి, సుంకన్న, వాడాల శేఖర్రెడ్డి, కే శేషగిరి, సీ రమేష్, డీ ఏసురాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరుతో మోసం
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు ● పీజీఆర్ఎస్కు 58 ఫిర్యాదులు కర్నూలు: రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్కు చెందిన విజయభాస్కర్ రూ.7 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఎస్పీ విక్రాంత్ పాటిల్కు కర్నూలుకు చెందిన దినేష్ నాయుడు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో ఎస్నీప మాట్లాడారు. మొత్తం 58 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. పీజీఆర్ఎస్లో పాల్గొని అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. -
ముగిసిన దేవరగట్టు ఉత్సవాలు
హొళగుంద: దేవరగట్టు ఉత్సవాలు సోమవారం ముగిశాయి. శ్రీమాళ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరాయి. కాడసిద్ధప్ప మఠంలో ఉంచిన ఉత్సవమూర్తులకు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను, పల్లకీని నెరణికి గ్రామం ఊరువాకిలి వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్దకు తీసుకొచ్చి అక్కడ కొలువుంచారు. దీంతో గ్రామంలో పండుగ వాతవరణం నెలకొంది. గ్రామస్తులు ఆలయం నుంచి విగ్రహాలను అర్చకుల ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీ మాళమల్లేశ్వరుని కంకణధారణతో నిష్టతో ఉన్న ప్రజలు సోమవారం దీక్షను విరమించారు. -
అర్జీలను గడువులోపు పరిష్కరించాలి
కర్నూలు కల్చరల్: అర్జీలను గడువులోపు పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం అఽధికారులకు సూచనలు ఇచ్చారు. అర్జీలు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. సీఎం కార్యాలయ గ్రీవెన్స్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న వాటిని బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించాలన్నారు. డీఆర్వో వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అజయ్కుమార్, అనురాధ, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొండన్న తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
ఆదోని టౌన్/ఆదోని రూరల్: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భరత్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం కర్నూలు జిల్లా నాయకులు రవిచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో పార్టీ ఆదోని మండల అధ్యక్షుడు గురునాథ్రెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి తదితరులతో కలిసి సోమవారం ఆదోని మార్కెట్యార్డులో వారు పర్యటించారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో పత్తి, వేరుశనగ, కంది తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. అరకొరగా వచ్చిన పత్తి దిగుబడులను సీసీఐ ద్వారా మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులతో అత్యవసరంగా పంట నష్టం అంచనా వేయాలన్నారు. నష్టపోయిన ప్రతిరైతుకూ పరిహారం అందించాలన్నారు. రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం మార్కెట్యార్డు కార్యాలయ సెక్రటరీ గోవిందుకు వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ ఆదోని నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ ప్రతాపరెడ్డి, రాష్ట్ర యూత్ నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు. -
శనగ విత్తు అందక రైతుకు బెంగ
కర్నూలు (అగ్రికల్చర్): రబీ సీజన్ ప్రారంభమై వారం కావొస్తున్నా ఇప్పటి వరకు రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ చేయలేదు. సెప్టెంబరు నెలలో విస్తారంగా వర్షాలు పడటంతో రైతులు ముందస్తుగా శనగ సాగుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల పంపిణీలో చేతులెత్తేసింది. కేవలం కాగితాలపై శనగ విత్తనాల కేటాయింపు, ధర, సబ్సిడీలు ఖరారు అయ్యాయి. ఇంతవరకు రైతులకు విత్తనం అందని పరిస్థితి ఏర్పడింది. ఏపీ సీడ్స్ నిర్వీర్యం ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్) శనగ విత్తనాలు సరఫరా చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ సీడ్స్ నిర్వీర్యం అయింది. 2024 ఖరీఫ్, 2024–25 రబీ, 2025 ఖరీఫ్ సీజన్లలో ఏపీసీడ్స్ సరఫరా చేసిన విత్తనాలకు సబ్సిడీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కొన్ని ప్రయివేటు విత్తన కంపెనీలు రైతులతో శనగ ఉత్పత్తి చేయిస్తాయి. ప్రభుత్వం టెండరు ద్వారా ఖరారు చేసిన ధరలకు ఈ కంపెనీలు ఏపీ సీడ్స్కు సరఫరా చేస్తాయి. ప్రయివేటు విత్తన కంపెనీల దగ్గర శనగ విత్తనాలు ఉన్నప్పటికీ పాత బకాయిలను చెల్లించకపోవడంతో సరఫరా చేసేందుకు ముందుకు రావడం లేదు. పాత బకాయిలు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడంతో నేడు విత్తన సమస్య తీవ్రమై కూర్చుంది. యాప్ ఇవ్వకుండా ఆదేశాలు శనగ విత్తనాలను ఈ నెల 3వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రైతు సేవా కేంద్రాల్లో సిద్ధం చేయాలని ఏపీసీడ్స్కు వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇందుకు యాప్ ఇవ్వలేదు. డీ క్రిషి యాప్ ఇస్తేనే రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. విత్తన పంపిణీకి వీలవుతుంది. యాప్ ఇవ్వకపోవడం, ప్రయివేలు విత్తన కంపెనీలు సహకరించకపోవడంతోనే విత్తనాల పంపిణీ దిశగా ఎలాంటి చర్యలు లేవు. కర్నూలు జిల్లాలో కౌతాళం, కోసిగి మండలాలు, నంద్యాల జిల్లాలో మహానంది, శిరివెళ్ల మండలాలు మినహా మిగిలిన అన్నిమండలాల్లో శనగ సాగు చేస్తారు. సబ్సిడీ విత్తనాలు అందుబాటులోకి రాకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రయివేటు వ్యాపారుల దగ్గర విత్తనాలు కొని సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఆలూరు ప్రాంతంలో శనగ విత్తనం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రూపాయి ఇవ్వకుండానే విత్తన సేకరణ ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ప్రతి ఏటా రైతులకు బ్రీడర్ సీడ్, సర్టిఫైడ్ సీడ్ ఇచ్చి విత్తనోత్పత్తి చేయిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల్లో 2024 రబీలో విత్తనోత్పత్తి చేయించింది. విత్తనోత్పత్తి చేసిన 100 మందికిపైగా రైతుల నుంచి ఏపీ సీడ్స్ 10 వేల క్వింటాళ్ల విత్తనాలను సేకరించింది. మామూ లుగా అయితే ఉత్పత్తి చేసిన విత్తనాలను సేకరించే సమయంలోనే అడ్వాన్స్ కింద క్వింటాకు రూ.5,000 ఆపైన చెల్లిస్తారు. ప్రభుత్వం విత్తనోత్పత్తి ధరలను ఖరారు చేసిన తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మొదటి సారిగా రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఏపీసీడ్స్ 10 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను సేకరించింది. 2024 రబీలో విత్తనోత్పత్తి చేసిన రైతులకు మళ్లీ రబీ వచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. విత్తనోత్పత్తి చేసిన రైతులు అడ్వాన్స్ కోసం ఏపీ సీడ్స్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. రబీ మొదలైనప్పటికీ ప్రారంభం కాని సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ పాత బకాయిలు చెల్లిస్తేనే విత్తనాల సరఫరా అంటున్న ప్రయివేటు విత్తన కంపెనీలు విత్తనోత్పత్తి చేసిన రైతులకు రూపాయి కూడా విదిల్చని వైనం ఉద్దేశపూర్వకంగానే... 2019 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 20వ తేదీనే సబ్సిడీ శనగ విత్తన పంపిణీ జరిగేది. రబీ ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం పూర్తయ్యేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది రబీ సీజన్లో ఇదే సమయానికి 10వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సారి ఎలాంటి కదలిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో నాలుగు రోజుల్లో కూడా యాప్ వచ్చే అవకాశం లేదు. రాయలసీమకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండున్నర లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేసేది. ప్రస్తుత ప్రభుత్వం లక్ష క్వింటాళ్లు కూడా కేటాయించలేదు. ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ రైతులకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. -
పత్తికొండ మార్కెట్లో విజిలెన్స్ తనిఖీలు
పత్తికొండ: విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం పత్తికొండ మార్కెట్యార్డులో తనిఖీలు నిర్వహించారు. ధరలు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కోనుగోలు విధానాలు, మార్కెటింగ్ అధికారుల పనితీరును పరిశీలించారు. ధరల హెచ్చుతగ్గుదలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీ చౌడేశ్వరిదేవి ఆదేశాలు మేరకు తనిఖీ చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్తో ఉల్లి పంట తొలగింపు పత్తికొండ రూరల్: మార్కెట్లో ధర లేకపోవడంతో పందికోన గ్రామానికి చెందిన కస్తూరి రంగప్పరాజు అనే రైతు రెండెకరాల్లో ఉల్లి పంటను ట్రాక్టర్తో సోమవారం తొలగించాడు. పంట సాగు కోసం ఎకరాకు రూ.లక్షకు పైగానే ఖర్చుపెట్టాడు. మార్కెట్లో క్వింటా ధర రూ.200 మాత్రమే ఉండటంతో కోత ఖర్చులు కూడా రాబోవని పండిన పంటను ట్రాక్టర్తో దున్నేశాడు. దానిని గొర్రెల మంద వదిలాడు. -
దేవరగట్టు.. భక్తిపారవశ్యం
● దేవరగట్టులో ఇనుప గొలుసు తెంపిన గొరవయ్య ● నేడు నెరణికి చేరనున్న ఉత్సవ విగ్రహాలుహొళగుంద: వందలాది మంది గొరవయ్యల ఢమరుక నాదాలతో దేవరగట్టు ఆదివారం హోరెత్తింది. భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. శ్రీమాళ మల్లేశ్వరస్వామి సన్నిధానంలో ఆదివారం గొరవయ్యల నృత్యాలు అలరించాయి. గొలుసు తెంపుట ఆకట్టుకుంది. జైత్రయాత్ర అనంతరం సింహాసన కట్టమీద కొలువుదీరిన మాళమల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాల ఎదుట దేవదాసిల క్రీడత్సవం, వసంతోత్సవం, కంకణ విసర్జన తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. దైవ వచనాలు వల్లెవేస్తూ.. జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో గొరవయ్యలు దేవరగట్టుకు తరలివచ్చారు. శ్రీమాళ మల్లేశ్వరస్వామి మూలవిరాట్ను దర్శించుకున్నారు. అనంతరం మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీదున్న స్వామి వారి ఉత్సవమూర్తుల ఎదుట పిల్లనిగ్రోవి ఊదుతూ, త్రిశూలం చేతబట్టి, ఢమరుకాలను ఆడిస్తూ లయబద్ధంగా నృత్యం చేశారు. గురు గొరవయ్యలు చాటిలతో కొట్టుకుంటూ ఉద్వేగంగా వచనాలు చెప్తూ పూనకంతో ఊగిపోయారు. కొందరుదైవ వచనాలు వల్ల్లెవేస్తూ అందుకు తగ్గట్టు హావభావాలు ప్రదర్శిస్తూ నృత్యం చేశారు. నాలుగు జఠికలకు తెగిన గొలుసు ఉత్సవంలో భాగంగా ఇనుప గొలుసును హాలహర్వి మండలం బల్లూరు గ్రామానికి చెందిన గొరవయ్య గాదిలింగప్ప నాలుగు జఠికలకు తెంపాడు. ఉత్సవమూర్తులు కొలువుదీరిన మల్లప్ప గుడి ఎదుట ప్రతి ఏటా ఇనుప గొలుసు తెంపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఆదివారం దాదాపు 20 కేజీల బరువు ఉన్న గొలుసును నాలుగు జఠికలకు తెంపారు. దీంతో భక్తులు గొరవయ్యను భుజాల మీదెత్తుకుని ఈలలు, కేకలు వేస్తూ ఆనందంతో నృత్యాలు చేశారు. గతేడాది 51 జఠికలకు గొలుసు తెగితే ఈ ఏడాది నాలుగు జఠికలకే తెగడం పట్ల భక్తులు సంతోషంతో ఎగిరి గంతులు వేశారు. వసంతోత్సవం.. కంకణ విసర్జన ఆదోని, ఆలూరు, గుంతకల్లు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బసివినిలు క్రీడోత్సవం చేశారు. అనంతరం రంగు నీళ్లను భక్తులపై చల్లి వసంతోత్సవం, కంకణ విసర్జన కార్యక్రమాలను నిర్వహించారు. మాళమల్లేశ్వర విగ్రహాలతో పాటు పల్లకీని భక్తులు ఊరేగింపుతో కొండ పైనున్న ఆలయానికి తీసుకెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో హొళగుంద, హాలహర్వి, చిప్పగిరి, ఆలూరు మండలాల ఎస్ఐలు దిలీప్కుమార్, శ్రీనివాసులు, మారుతి తదితరులతో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నేటితో ముగియనున్న ఉత్సవాలు దేవరగట్టులో ఉన్న శ్రీమాళ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను సోమవారం గొరవయ్యలు కాలినడకన నెరణికి గ్రామానికి మోసుకెళ్తారు. ఉత్సవ విగ్రహాలను గ్రామ ఊరు వాకిలి వద్ద ఉన్న ఆంజనేయస్వామి వద్ద కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి ఊరేగింపు నిర్వహించి యథాస్థానానికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
ముగిసిన రాష్ట్ర స్థాయి జలక్రీడలు
● సీనియర్స్, మిక్స్డ్ విభాగాల్లో కర్నూలుకు పతకాలు సీనియర్ బాయ్స్ విభాగంలో మొదటి స్థానం సాధించిన ఏలూరు జిల్లా జట్టు జూనియర్స్ బాయ్స్ విభాగంలో రెండో స్థానం సాధించిన కర్నూలు జిల్లా జట్టు కర్నూలు (టౌన్): మండలంలోని గార్గేయపురం చెరువులో రెండు రోజులు పాటు జరిగిన 4 వ రాష్ట్ర స్థాయి కెనోయింగ్అండ్ కయాకింగ్ డ్రాగన్ బోటో పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. అనంతరం నిర్వహించిన విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమానికి ఏపీఈ డబ్ల్యూ డీసీ డైరెక్టర్ నగరూరు రాఘవేంద్ర, రాష్ట్ర కెనోయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బలరాం నాయుడు అతిథులుగా హాజరై మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా 3 శాతం వినియోగించుకొని క్రీడాకారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. కర్నూలులో మొట్టమొదటి సారిగా రాష్ట్ర స్థాయి వాటర్ స్పోర్ట్స్ను విజయవంతంగా నిర్వహించడం శుభ పరిణామమన్నారు. విజేతలకు మెడల్స్, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కెనోయింగ్ అండ్ కయాకింగ్ సంఘం వ్యవస్థాపకులు శివారెడ్డి, ఏపీ డ్రాగన్ బోట్ అసోసియేషన్ కార్యదర్శి అవినాష్ శెట్టి, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విజేతల వివరాలు : జూనియర్స్ విభాగంలో... 200 మీటర్ల పురుషుల జూనియర్ విభాగంలో ఏలూరు (ప్రథమస్థానం), కర్నూలు (ద్వితీయ స్థానం) నంద్యాల (మూడో స్థానం) సీనియర్స్ విభాగంలో... కర్నూలు మొదటి స్థానం, ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ స్థానం, పశ్చిమ గోదావరి మూడవ స్థానం మిక్స్డ్ విభాగంలో... ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానం, కర్నూలు రెండవ స్థానం, నంద్యాల తృతీయ స్థానం 500 మీటర్ల పురుషుల జూనియర్స్ విభాగంలో.... ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానం, కర్నూలు ద్వితీయ స్థానం, నంద్యాల తృతీయ స్థానం సీనియర్స్ విభాగంలో ... ఏలూరు ప్రథమ స్థానం, నంద్యాల ద్వితీయ స్థానం, కర్నూలు మూడో స్థానం మిక్స్డ్ విభాగంలో... కర్నూలు ప్రథమ స్థానం, కృష్ణ జిల్లా ద్వితీయ స్థానం, నంద్యాల జిల్లా తృతీయ స్థానం దక్కించుకున్నాయి. -
ఆస్తి విషయంలో తల్లి, అక్కలపై దాడి
బేతంచెర్ల: ఆస్తి విషయంలో తల్లి, అక్కపై ఓ వ్యక్తి తన భార్య, అత్త, బావమరిదితో కలసి కత్తులతో దాడి చేసిన సంఘటన ఆర్. కొత్తపల్లె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న రామ మద్దయ్య, సుభద్రమ్మ దంపతులకు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. వీరికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అప్పులు ఉండటంతో పొలం అమ్మాలని దంపతులు కొడుకు, కుమార్తెలతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పొలం అమ్మ కూడదని కొడుకు శేఖర్, భార్య శ్యామల, బావమరిది నీలకంఠం మధు, అత్త పుల్లమ్మతో కలసి తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నారు. ఆ క్రమంలో అక్కలు లక్ష్మి, మాధవ లక్షమ్మ, సుజాత, రమాదేవిపై తమ్ముడు శేఖర్, బంధువులతో కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘర్షణలో తీవ్రగాయాలపాలైన లక్ష్మి, మాధవ లక్షమ్మను బేతంచెర్ల ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ఆసుపత్రికి చేరుకుని వివరాల సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు శేఖర్, నీలకంఠం, పుల్లమ్మ, శ్యామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జ్ఞాపకాల జడివాన
బనగానపల్లె రూరల్: ఇల్లూరుకొత్తపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జ్ఞాపకాల జడివాన కురిసింది. 21 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ పరవశించిపోయారు. 2003–2004 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఆర్గనైజర్లు మహబూబ్బాషా, ఇస్మాయిల్, షరీఫ్, ఓబులేసు, విజయ్, చంద్రుడు, షఫీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ దూర ప్రాంతంలో ఉన్న ఈ కార్యక్రమానికి హాజరై మిత్రులను, చదువు చెప్పిన గురువులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు రంగారెడ్డి, దాదాబాషా, సురేష్బాబు, పద్మావతి, వెంకటలక్ష్మీ, సుబ్బరాయుడు నారాయణ, రమేష్ను సన్మానించి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. కార్యక్రమంలో 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ
● ఎనిమిది మందికి గాయాలు బనగానపల్లె రూరల్: మండలంలోని టంగుటూరు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు–ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. నందివర్గం ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాల మేరకు.. శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన చిలకల రమేష్ కుటుంబ సభ్యులు ట్రాక్టర్లో కై ప గ్రామంలోని బిజ్జి తిమ్మయ్య స్వామికి మొక్కబడి నిమిత్తం వచ్చారు. కార్యక్రమం అనంతరం తిరిగి స్వగ్రామానికి ట్రాక్టర్లో బయల్దేరారు. అయితే టంగుటూరు గ్రామంలోని పెద్దమ్మగుడి సమీపంలో ట్రాక్టర్ను వెనుక వైపు నుంచి ఆర్టీసీ బస్సు ప్రమాదశాత్తు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న రమేష్ బంధువులు పుల్లయ్య, లక్ష్మీదేవి, మాధురి, లింగమ్మ, తిమ్మయ్య, కాశమ్మ, అబ్దుల్రహీం, దస్తగిరిలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 ద్వారా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
స్కార్పియో బోల్తా – ఐదుగురికి గాయాలు
కొలిమిగుండ్ల: పెట్నికోట–నాయినిపల్లె గ్రామాల మధ్యలో ఆదివారం ప్రమాదవశాత్తు స్కార్పియో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న ఐదుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పెట్నికోట నుంచి కొలిమిగుండ్ల పార్టీ కార్యాలయం వద్దకు వస్తున్న సమయంలో మార్గమధ్యలో వాహనం బోల్తాపడింది. పెట్నికోటకు చెందిన ఆంజనేయులు, కంబగిరి, నాయినిపల్లెకు చెందిన కృష్ణారెడ్డి, కోటపాడుకు చెందిన పెద్దన్నతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన వాహనాన్ని పైకి లేపి అందులో ఉన్న క్షతగాత్రు లను బయటకు తీశారు. వారిని 108లో కొలిమిగుండ్ల పీహెచ్సీకి తరలించారు. మైరుగైన చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పరామర్శించారు. -
కష్టాలు.. కన్నీళ్లు!
● భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఉల్లి రైతులుకోసిగి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు కుళ్లి పోయి పూర్తి దెబ్బతిన్నాయి. రైతుల కష్టమంతా నేలపాలైపోయింది. ఉల్లి పంట బాగా కాపు కొచ్చి మంచి దిగుబడిని ఇచ్చింది. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. దసరా పండుగ అయిన వెంటనే కోతలు కోసి పంటను అమ్ముకుందామనుకున్నారు. అయితే అంతలో భారీగా వర్షం కురువడంతో పొలాలలోనే ఉల్లి పంట మొలకులు వచ్చేసింది. మార్కెట్లో గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేశారు. కొందరు ట్రాక్టర్ను ఏర్పాటు చేసి రోటవేటర్తో తొలగించారు. మరికొందరు పంటను తొలగించి దిబ్బలో పడేశారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరారు. -
అదిగదిగో జీరంగి
జీరంగి..ఇప్పటి తరానికి మినహా అందరికీ తెలిసిందే. 30 ఏళ్ల క్రితం పిల్లలు పొలాలు, కొండ గుట్టల వెంట తిరుగుతూ చెట్లపై ఉన్న జీరంగులను పట్టుకుని ఆడుకునే వారు. వీటిని అగ్గి పెట్టెలో దాచి తుమ్మ ఆకు వేసి దాచి పెట్టేవారు. ఇవి గుడ్లు పెడుతూ ఉంటే వాటిని చూసి సంతోషపడుతూ ఉండేవారు. వర్షాకాలం వస్తే చెట్లపై ఇవి విపరీతంగా కనిపించేవి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావంతో రోజురోజుకూ అంతరించి పోతున్నాయి. తుగ్గలి మండలంలోని ఆముదం పొలంలో ఆదివారం ఒకటి కనిపించింది. గంటల తరబడి ఏక ధాటిగా శబ్దం చేసింది. సూర్యుని కిరణాలు దీనిపై పడటంతో బాగా కనిపించింది. – తుగ్గలి -
20 కిలోల టమాట ధర రూ.50
ఈ చిత్రంలోని రైతు పేరు లింగన్న. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన టమాట రైతు. శుక్రవారం మార్కెట్కు 30 గంపల టమాట తెచ్చారు. ఒక్కో గంప 20 కిలోలు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కనీస ధర రూ.8 ప్రకారం కొంటే గంపకు రూ.160 లభిస్తుంది. అయితే పత్తికొండ మార్కెట్లో 20కిలోల గంపకు లభించిన ధర రూ.50 మాత్రమే. అంటే కిలో టమాటకు లభించిన ధర రూ.2 మాత్రమే. ఒక ఎకరాలో టమాట సాగు చేశారు. పెట్టుబడి రూ.60 వేల వరకు వచ్చింది. కొద్ది రోజులుగా మార్కెట్కు టమాట తీసుకొస్తున్నా ఒక్క రోజు కూడా రూ.8 ధర లభించలేదు. టమాట పంటకు కూడా ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు. -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులు దీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి. శాస్త్రోక్తంగా శేర్తి పూజ ఆళ్లగడ్డ: నవనారసింహులు కొలువైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలోని నల్లమల అటవీ ప్రాతంలో కొలువైన శ్రీ మాలోల లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం శేర్తి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపారు. నిత్య పూజలు అనంతరం గద్య త్రయం విన్నవించారు. అనంతరం నిత్యం ఆరాధించే ఉత్సవమూర్తి స్వర్ణ మాలోల నరసింహస్వామిని మూలమూర్తితో ఉంచి ప్రత్యేక శేర్తి పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధించారు. అనంతరం శాత్తుమురై గోష్టి కార్యక్రమాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ పూజలు ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
జాడలేని బట్టమేక పక్షి
● వాతావరణ మార్పులే కారణమా?నందికొట్కూరు: ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో అరుదైన బట్టమేక పక్షి.. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని నెలల పాటు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ పక్షులు ఇక్కడే గుడ్లు పెడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంత వరకు అభయారణ్యంలో బట్టమేక పక్షుల జాడ కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు సుమారు 80 నుంచి 100 పక్షి జాతులు ఇక్కడికి వస్తుంటాయి. కొల్లేరు ప్రాంతంలో అరుదుగా కనిపించే ఫ్లవింగ్ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు రావడంతో కొన్ని పక్షులు సమయానికి రాలేదని తెలుస్తోంది. అందువల్లే బట్టమేక పక్షి కూడా రావడానికి ఆలస్యం అయ్యి ఉంటుందన్నా రు. పక్షి జాతులపై అధ్యయనం చేయడానికి చైన్నె, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు, జంతు ప్రేమికులు ప్రతి శని, ఆదివారాల్లో వస్తుంటారు. వచ్చిన వారికి వసతి కోసం రెండు గదులు ఉన్నాయి. మరిన్ని వసతులు కల్పిస్తే పక్షులను, జింకలను చూసేందుకు జంతు ప్రేమికులు, పాఠశాలల విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. పక్షులను చూసేందుకు అభయారణ్యంలోకి వెళ్లాలంటే తప్పని సరిగ్గా ఉన్నతాధికారుల అనుమతులు ఉండాలని అధికారులు తెలిపారు. -
శ్రీశైలం డ్యాం గేట్ల మూసివేత
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం సాయంత్రం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను మూసివేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో జలాశయానికి భారీగా వరద ప్రవా హం చేరడంతో 10 రేడియల్ క్రస్ట్గేట్లను 26 అడుగుల మేర తెరచి దిగువకు నీటిని విడుదల చేశారు. గత కొద్దిరోజుల నుంచి వరద తగ్గుముఖం పడుతుండడంతో క్రమేపి గేట్ల ఎత్తును, సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. శనివారం నుంచి ఆదివారం వరకు జలాశయానికి 3,19,207 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేర గా దిగువ ప్రాంతాలకు 3,13,478 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 2,35,088 క్యూసెక్కు లు, విద్యుత్ ఉత్పత్తి అనంతరం 70,555 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుండి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 5,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,835 క్యూసెక్కుల నీటిని వదిలా రు. కుడిగట్టు కేంద్రంలో 15.450 మిలియన్ యూ నిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.955 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 884.20 అడుగులకు చేరుకుంది. -
ఆదర్శనీయుడు అంబేడ్కర్
● మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డిపెద్దకడబూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ ఆదర్శనీయుడని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. కల్లుకుంట గ్రామంలో ఆదివారం నూతన అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్రెడ్డి మాట్లాడారు. సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన అంబేడ్కర్ అందరికీ ఆదర్శనీ యుడన్నారు. అలాంటి మహానుభావుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మన దేశానికి ఒక దిక్సూచి అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పురుషోత్తంరెడ్డి, మండల అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రవిచంద్రరెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి శివరామిరెడ్డి, రైతు విభాగం తాలూకా అధ్యక్షుడు యల్లప్ప, వాణిజ్య విభాగం మండల అధ్యక్షుడు బ్రహ్మయ్య, సర్పంచ్ ఇస్మాయిల్, మాజీ సర్పంచ్ సత్యన్నగౌడ్, జైభీమ్ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు: రైతులను కంటతడి పెట్టిస్తున్న ఉల్లి పంట
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఉల్లి పంట రైతుకు కంటతడి పెట్టిస్తోంది. ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో పంటను రైతులు పొలంలోనే వదిలివేస్తున్నారు. పంట పండించినా ప్రయోజనం లేకపోగా భూమి చదును చేసేందుకు రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉల్లి పంటను గొర్రెలకు, మేకలకు రైతులు వదిలేస్తున్నారు. పత్తికొండ మండలం పెద్దహుల్తి ఉల్లి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకు పోయమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతి కొచ్చిన పంటను వదిలేసి.. రైతు విశ్వనాథ్ ట్రాక్టర్తో దున్ని వేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా రైతులను ఆదుకోకపోతే భవిష్యత్తు కష్టమేనని రైతులు అంటున్నారు. -
నువ్వు టీడీపీలోకి రాకపోతే... నీ మనవడిని చంపేస్తాం
సాక్షి టాస్క్ ఫోర్స్: ‘ఆమెకు చెప్పండి... లక్ష్మీదేవమ్మ టీడీపీలో చేరకపోతే ఆమె మనవడిని చంపేస్తాం...’ అని కర్నూలు జిల్లా కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి.విష్ణువర్ధన్రెడ్డి కర్నూలు రూరల్ మండలం నూతనపల్లె వైఎస్సార్సీపీ మహిళా ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మను హెచ్చరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 40 కార్లలో లక్ష్మీదేవమ్మ ఇంటికి వెళ్లి పట్టపగలు పోలీసుల సమక్షంలోనే ఆమె మనవడు మహేంద్రను కిడ్నాప్ చేశారు.అడ్డొచ్చిన మహిళలపై విచక్షణారహితంగా టీడీపీ మూకలు దాడి చేశారు. ఈ దౌర్జన్యకాండను వీడియోలు తీసినవారి సెల్ఫోన్లు లాక్కుని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒక ఎమ్మెల్యేనే దగ్గరుండి కిడ్నాప్ చేయించడం, పోలీసులు చేష్టలుడిగి చూడటం రాష్ట్రంలో అరాచక పాలనకు మరో నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామంపైకి దండయాత్ర టీడీపీ నాయకులు కర్నూలు రూరల్ ఎంపీపీ పదవిపై కన్నేశారు. తమకు బలం లేకపోయినా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను భయపెట్టి టీడీపీలో చేర్చుకోవాలని ఎమ్మెల్యే దస్తగిరి, విష్ణువర్ధన్రెడ్డి నిర్ణయించారు. గురువారం వైఎస్సార్సీపీకి చెందిన నూతనపల్లె ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, నందనపల్లె ఎంపీటీసీ జ్యోతి, రేమట ఎంపీటీసీ సుజాత, దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్రెడ్డిలను అభివృద్ధి పనులపై చర్చించాలని పిలిచి వారికి టీడీపీ కండువాలు వేశారు. నూతనపల్లె ఎంపీటీసీ లక్ష్మీదేవి తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని శుక్రవారం ప్రకటించారు.దీనిని జీరి్ణంచుకోలేని టీడీపీ ఎమ్మెల్యే దస్తగిరి, విష్ణువర్ధన్రెడ్డి శనివారం ఉదయం 40 వాహనాలతో నూతనపల్లెపై దండయాత్ర చేశారు. ఊరిలో అడ్డువచ్చిన వారిని కొట్టి ఎంపీటీసీ సభ్యురాలి ఇంటిపై దండెత్తారు. ఆ సమయంలో ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ, ఆమె కుమారుడు కృష్ణ ఇంట్లో లేరు. భయంతో ఆడవాళ్లు తలుపులు వేసుకుని లోపల ఉన్నారు. టీడీపీ మూకలు తలుపులు పగలగొట్టి అడ్డువచ్చిన మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి లక్ష్మీదేవమ్మ మనవడు మహేంద్ర(22)ను లాక్కెళ్లి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.లక్ష్మీదేవమ్మ టీడీపీలోకి రాకపోతే మహేంద్రను చంపేస్తామని కుటుంబ సభ్యులను హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకలు ఇష్టానుసారంగా కొట్టడం, యువకుడిని కిడ్నాప్ చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. మరో ఎంపీటీసీ కుటుంబానికీ బెదిరింపులు గురువారం టీడీపీ నేతలు కండువా కప్పిన దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్రెడ్డి కూడా శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా టీడీపీ నాయకులు బెదరించారు. రామనాథ్రెడ్డి టీడీపీలోకి రాకపోతే ఎంతవరకైనా వెళతామని, అంతు చూస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఖూనీ: ఎస్వీ మోహన్రెడ్డి నూతనపల్లె ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవమ్మ, దిన్నెదేవరపాడు–1 ఎంపీటీసీ రామనాథ్రెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు బెదిరించడం, కిడ్నాప్ చేయడంపై వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులు బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలకడం అన్యాయమన్నారు. మహేంద్ర కిడ్నాప్పై వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలం లేకపోయినా బరితెగింపుకర్నూలు రూరల్ మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 12, టీడీపీ 10 స్థానాల్లో విజయం సాధించాయి. ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందారు. వైఎస్సార్సీపీకి చెందిన జి.సింగవరం ఎంపీటీసీ డి.సవారన్న, పసుపల టీడీపీ ఎంపీటీసీ మురళీకృష్ణ చనిపోయారు. పంచలింగాల ఎంపీటీసీగా ఉన్న బస్తిపాటి నాగరాజు(టీడీపీ) కర్నూలు ఎంపీగా గెలిచారు. ఆర్.కొంతలపాడు ఎంపీటీసీ కె.గిడ్డమ్మ(టీడీపీ) సుంకేసుల సర్పంచ్గా గెలిచారు.దీంతో పంచలింగాల, ఆర్.కొంతలపాడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎంపీటీసీ బోయమద్దిలేటి(దిన్నెదేవరపాడు–2)తో కలుపుకొని వైఎస్సార్సీపీకి 12 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ బలం 7కు తగ్గింది. ఎంపీపీగా ఉల్చాల ఎంపీటీసీ వెంకటేశ్వరమ్మ(వైఎస్సార్సీపీ) కొనసాగుతున్నారు. తగిన బలం లేకపోయినా ఎంపీపీ పదవిని పొందాలని టీడీపీ నాయకులు కుట్రలు పన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను బెదిరించి తమ పార్టీలో చేర్చుకునేందుకు బరితెగించారు. -
శమీ వృక్షానికి పూజ
కల్లూరు: దసరా పండుగను గురువారం ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లోని దుర్గామాతలకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శమీవృక్షం పూజలో పాల్గొన్నారు. కల్లూరు అర్బన్ కల్లూరు, వీకర్సెక్షన్ కాలనీ శమీవృక్ష పూజ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పాల్గొన్నారు. దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శమీ వృక్షానికి, దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.