breaking news
Kurnool
-
చలిలో బెల్స్ పాల్సీ ముప్పు!.. పెరుగుతున్న ముఖపక్షవాతం
కర్నూలు(హాస్పిటల్): మూతి వంకర పోవడం, అ లాంటి నోటి నుంచి నీరు కారుతుండటం, తినాలన్నా, తాగాలన్నా ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే దానిని వైద్యపరిభాషలో బెల్స్ పాల్సీ అంటారు. తెలుగులో దానిని ముఖ పక్షవాతమని పిలుస్తారు. శీతాకాలంలో ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువవుతాయి. శీతల గాలుల నుంచి రక్షణ పొందడమే ఈ సమస్య రాకుండా నివారించే చర్య అని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో చలిగాలులు తీవ్రమయ్యాయి. రాత్రి పూటే కాదు పగలు కూడా వాతావరణం చల్లగా ఉంటోంది. ఈ కారణంగా ఇల్లు, కార్యాలయం ఏదైనా, ఎక్కడైనా ఫ్యాన్ వేయాలన్నా జంకుతున్నారు. విపరీతమైన చలి ప్రజలను తీవ్రంగా వణికిస్తోంది. చలికారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పగలు 20 డిగ్రీల సెల్సియస్కు, రాత్రి 13 డిగ్రీల సెల్సియస్కు పడిపోతున్నాయి. చాలా మందికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల రీత్యా చల్లగాలికి బయటకు వెళ్లాల్సి ఉంటోంది. మరికొందరు ఉదయం వేళల్లో వాకింగ్కు వెళ్తుంటారు. ఇలా చల్లగా ఉన్న సమయంలో బయటకు వెళ్లే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చెవుల్లో నుంచి చల్లగాలి లోపలికి వెళ్లి ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి, జనరల్ మెడిసిన్, క్యాజువాలిటీ విభాగాలకు ప్రతి వారం ముగ్గురు నుంచి నలుగురు ముఖ పక్షవాతానికి (బెల్స్పాల్సీ) గురై చికిత్స నిమిత్తం వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు సైతం రోజూ 6 నుంచి 8 మంది వరకు న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్ల వద్దకు చికిత్సకు వెళ్తున్నారు. కారణాలు బెల్స్పాల్సీకి కచ్చితమైన కారణం ఉండదు. దీనికి అనేక వైరస్లు కారణమవుతాయి. వీటిలో హెర్పస్ సింప్లెక్స్, హెర్పెస్ జోస్టర్, హెచ్ఐవీ, సైటోమెగలోవైరస్, ఎప్సీ›టన్ బార్ వైరస్లు ప్రధానమైనవి. మధుమేహం, గర్భిణులు, గాయం, వాపు, ముఖ నరాలకు హాని కలిగించే ఏదైనా కారణం ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. చలివాతావరణంలో ఈ వైరస్లు మనుగడు ఎక్కువగా సాగిస్తాయి కాబట్టి అధిక శాతం వీటి ప్రభావానికి గురవుతుంటారు. వీరు వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.బెల్స్ పాల్సీ అంటే...! బెల్స్ పాల్సీ (ముఖపక్షవాతం) అనేది ముఖంలోని నరాలకు హాని కలిగించే ఒక రకమైన ఆరోగ్య సమస్య. తద్వారా రోగి ముఖ కదలికలను వ్యక్తం చేయడం, తినడం, మాట్లాడటం వంటివి చేయలేడు. లక్షణాలు ⇒ కనురెప్పలు మూసివేయడం, రెప్పలు కొట్టుకోవడం సాధ్యపడదు ⇒ ముఖం కదిలించడంలో ఇబ్బంది ⇒ నోరు ఒకవైపునకు వాలిపోవడం ⇒ ముఖ ఆకృతులను సమతుల్యం చేయడంలో ఇబ్బందులు ⇒ బెల్స్ పాల్సీలో వ్యక్తి తన కనుబొమ్మలను ఎగురవేయలేడు ⇒ మాట్లాడటం, తినడంలో ఇబ్బందిచలిలో తిరిగితే ఈ సమస్య గత కొన్ని రోజులుగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి తీవ్రంగా ఉంటోంది. చలిగాలులు పగలు సైతం అధికమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెవులకు అచ్ఛాదన లేకుండా బయటకు వెళ్లకూడదు. ఎందుకంటే చల్లటి వాతావరణంలో వైరస్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషి నరాలపై దాడి చేస్తాయి. దీనినే న్యూరోట్రోపిక్ అటాక్స్ అంటాము. అధిక శాతం వైరస్ల వల్ల బెల్స్ పాల్సీ వస్తుంది. కొందరిలో ఎలాంటి కారణం లేకుండా వస్తుంది. ఇలాంటి వారికి అవసరమైన మందులు ఇచ్చి చికిత్స చేస్తాము.– డాక్టర్ సి. శ్రీనివాసులు, న్యూరాలజి హెచ్ఓడీ, జీజీహెచ్, కర్నూలు -
రైతు ఆత్మహత్య
వెల్దుర్తి: వెల్దుర్తి మండలంలోని చెరుకులపాడు గ్రామానికి చెందిన రైతు జయరాముడు (52) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జయరాయుడు తన ఇంట్లో ఉరివేసుకుని ఉండగా బయటకెళ్లిన చిన్న కుమారుడు యుగంధర్ మధ్యాహ్న సమయంలో వచ్చి చూసి ఆందోళన చెందాడు. ఈ సమయంలో భార్య కృష్ణవేణి, పెద్ద కుమారుడు బలరాముడు, కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలోని తమ పొలంలో సాగు చేసిన పంట పొగాకు ఆకులు కోసి కుట్టే పనిలో నిమగ్నమై ఉండగా సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఉరికొయ్యకు వేళాడుతూ మరణించిన జయరాముడుని చూసి విలపించారు. గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ కోడుమూరు రూరల్: కోడుమూరు నుంచి కర్నూలుకు వెళ్లే రోడ్డులో విశ్వభారతి హాస్పిటల్ సమీపాన రోడ్డుపై వెళుతున్న గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లింది. శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో 35 గొర్రెలు మృతి చెందాయి. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణలోని కొల్లాపుర్కు చెందిన గొర్రెల కాపరులు గొల్ల చిన్న రాముడు, గొల్ల పెద్దరాముడు, శివ అనే వ్యక్తులు తమ గొర్రెలను పెంచికలపాడు గ్రామం వద్ద ఉన్న పొలాల్లో గత కొద్ది రోజుల నుంచి మేపు కోసం ఆపుకుంటున్నారు. అయితే, శనివారం సాయంత్రం గొర్రెల మందను పొలాల్లో ఆపుకునేందుకు రోడ్డుపై తీసుకెళుతుండగా, కోడుమూరు వైపు నుంచి కర్నూలుకు వెళుతున్న లారీ వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో సుమారు 35 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా పలు గొర్రెలు గాయపడ్డాయి. ఈ ప్రమాదంతో సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. కె.నాగలాపురం ఎస్ఐ శరత్కుమార్రెడ్డి ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి చాగలమర్రి: అహోబిలం పుణ్యక్షేతం పరిధిలోని అటవీ ప్రాంతంలో శనివారం గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎగువ అహోబిలం సమీపంలోని చెరువు వద్ద చాకలిబండ సమీపంలో మేకలను మేపుతున్న గొర్రెల కాపరి ఎరుకలి శ్రీరాములుపై ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్రగాయాలైన అతడిని స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అహోబిలం అడవుల్లోకి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు. కిక్కు దిగేలా మద్యం బాబులకు జరిమానా కర్నూలు: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పోలీసులకు పట్టుబడిన మద్యం బాబులకు కిక్కు దిగేలా న్యాయమూర్తి తీర్పు చెప్పారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో నగరంలో ప్రతిరోజూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టుబడిన 93 మందిని శనివారం జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.9.30 లక్షలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ప్రతిరోజూ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై మద్యం తాగి పట్టుబడిన వారిపై నెల రోజుల పాటు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. -
ఉమ్మడి జిల్లాలో 19,577 కేసుల పరిష్కారం
కర్నూలు(హాస్పిటల్): జాతీయ లోక్ అదాలత్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయమూర్తి జి.కబర్ధి ఆద్వర్యంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 19,577 కేసులు పరిష్కారమయ్యాయి. 197 మోటార్ ఆక్సిడెంట్ కేసుల్లో రూ.6,34,62,000 బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ మొత్తం రెండు జిల్లాల్లో 28 బెంచీలను ఏర్పాటు చేసి 284 సివిల్ కేసులు, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులు, 19,096 క్రిమినల్ కేసులను పరిష్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, ఆరవ అదనపు జిల్లా జడ్జి వాసు, ఏడవ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీ రాజ్యం, కర్నూలు బార్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనరసింహారెడ్డి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మల్లేశ్వరి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, జూనియర్ సివిల్ జడ్జి కిరణ్కుమార్, అనూష, కోర్టు మానిటరింగ్ సీఐ రామానాయుడు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, బీఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా గంధం వేడుకలు
కౌతాళం: మండల కేంద్రమైన కౌతాళం నుంచి శనివారం గంధంను వైభవంగా కర్ణాటక రాష్ట్రం కురుగోడుకు తీసుకుని వెళ్లారు. కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్లింగస్వామి దర్గాకు 10వ ధర్మకర్తగా, ముతవల్లిగా 41సంవత్సరాలు సేవలు అందించి 2022 జనవరి26న మృతి చెందిన సయ్యద్ సాహెబ్పీర్ వుసేని చిష్తీ నాల్గవ ఉరుసు ఆదివారం (నేడు) కర్ణాటక రాష్ట్రం కురుగోడులో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఖాదర్లింగస్వామి దర్గాలో ప్రత్యేక ఫాతెహాల అనంతరం గంధంను గ్రామ పూర వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి డప్పు వాయిద్యాల మధ్య బ్యాండు మేళాలతో తరలించారు. వివిధ దర్గాల పీఠాధిపతులు పాల్గొన్నారు. క్రాస్ కంట్రీ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల క్రాస్ కంట్రీ చాంపియన్షిప్ పోటీలు శనివారం కర్నూలులో నగరంలోని బి.క్యాంపు మైదానంలో నిర్వహించారు. నాలుగు కిలోమీటర్లు, 8 కిలోమీటర్ల పరుగును నిర్వహించారు. కార్యక్రమానికి విక్టర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మాజీ కార్యదర్శి డాక్టర్ హర్షవర్దన్, ఒలంపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి క్రాస్ కంట్రీ చాంపియన్షిప్లు ఎక్కువగా నిర్వహించాలని చెప్పారు. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే రాష్ట్ర, దేశస్థాయిల్లో రాణించవచ్చన్నారు. అనంతరం క్రీడాకారుడు వెంకటరామిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు జాఫర్ మున్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మయ్య, కోచ్ కాశీరావు, నసీరుల్లాబేగ్, బిల్లా శ్రీను, మల్లేష్, మల్లి పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పట్టణంలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు కర్నూలు జిల్లా క్రీడాకారులు పాల్గొంటారని ఇన్చార్జ్ కార్యదర్శి లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి బిల్లా శ్రీను, అథ్లెటిక్ కోచ్ కాశీరావు తెలిపారు. పోస్టాఫీస్లో చోరీ పత్తికొండ: పోస్టాఫీసు సిబ్బందితో మాటలు కలిపి చోరీకి పాల్పడిన ఘటన శనివారం పత్తికొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయం ఇద్దరు దొంగలు పట్టణంలోని పోస్టాఫీసుకు వచ్చారు. క్యాషియర్ దగ్గరకు వెళ్లి తమిళంలో మాట్లాడుతూ ఓ పేపరు చూపించి అడ్రస్ అడిగారు. సిబ్బంది ఆ పేపర్ చూస్తుండగా క్యాస్ బాక్స్లోని రూ. 60వేలు నగదు చోరీ చేసుకొని వెళ్లిపోయారు. కాసేపటికే గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ జయన్న తెలిపారు. చలి కాచుకుంటుండగా.. కొలిమిగుండ్ల: స్థానిక కస్తూర్బా పాఠశాల ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న శిరీష అనే మహిళ శనివారం తెల్లవారు జామున చలి మంట వేసుకొని చలి కాచుకునే సమయంలో గాయాలయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో కాలనీలోని మహిళలు చలి మంట వేసుకున్నారు. ప్రమాదవశాత్తు శిరీష చీరకు నిప్పు అంటుకోవడంతో గాయాలయ్యాయి. పక్కనే మహిళలు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. గాయపడిన ఆమెను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అక్కడి నుంచి కర్నూలుకు తీసుకెళ్లారు. -
పింఛన్ల పంపిణీపై విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ పంపిణీపై కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు బృందాలు విచారణ చేపట్టాయి. ప్రతి నెల 1, 2వ తేదీల్లో జరిగే పింఛన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా ఫోన్లు వస్తుంటాయి. ఈ సమయంలో పలువురు పింఛన్దారులు తమ నుంచి పంపిణీ ఉద్యోగులు డబ్బులు తీసుకుంటున్నారని, సమయానికి ఇవ్వడం లేదని.. మర్యాదగా వ్యవహరించడంలేదని.. అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐవీఆర్ఎస్ కాల్స్ అసంతృప్తిదారుల జాబితా చూసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ర్యాండమ్గా నాలుగు గ్రామాల్లో విచారణ జరపాలని డీఆర్డీఏ పీడీ వైపీ రమణారెడ్డికి ఆదేశాలు అందాయి.ఈ మేరకు కోసిగి మండలంలోని కందుకూరు, కౌతాళం మండలం బాపురం, ఆదోని మండలం నూతనహల్లి, దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామాల్లో డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, పింఛన్ల ఏపీఎం డాక్టర్ అనిల్కుమార్, డీపీఎం (ఫైనాన్స్) నవీన్, ఏపీఎం అశోక్ ఇంటింటికి వెళ్లి విచారణ జరిపారు. పింఛన్ల పంపిణీ సమయంలో డబ్బులు తీసుకున్నారా.. అమర్యాదగా వ్యవహరించారా తదితర వాటిపై పింఛన్దారుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు. విచారణకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని డీఆర్డీఏ పీడీ తెలిపారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష ఎమ్మిగనూరురూరల్: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగినట్లు నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి పేర్కొన్నారు. శనివారం పరీక్ష కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల జిల్లాలో 24 పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరిగినట్లు తెలిపారు. మొత్తం 6,469 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 4,548 మంది హజరుకాగా 1,921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. 15న కలెక్టరేట్లో హైటీ కర్నూలు (అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 15న కలెక్టరేట్లో హైటీ కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సయీద సబిహ పర్వీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సునయన ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధ్యక్షతన కార్యక్రమం నిర్విహిస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, అనధికారులు పాల్గొంటారని, అందరూ హాజరుకావలసిందిగా ఆమె కోరారు. సుంకేసులకు 14,000 క్యుసెక్కుల ఇన్ఫ్లో కర్నూలు సిటీ: ఎగువ ప్రాంతాల నుంచి సుంకేసుల జలాశయానికి 14,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. మొత్తం 11,555 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే 2,286 క్యూసెక్కుల నీరు కేసీ కాలువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సుంకేసుల బ్యారేజీ నుంచి 393.59 టీఎంసీలు, కేసీ కాలువకు 24.80 టీఎంసీలు, కర్నూలు పరిధిలోని జనావాసాలకు తాగునీటికి 2.66 టీఎంసీల నీటిని విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం ● కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ కర్నూలు (హాస్పిటల్): ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంయుక్తంగా ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. పోలీసు అధికారులకు వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపా రు. ఈ సందర్భంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్స్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. బైక్లు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్తో వాహనాలు వెళ్లకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని, తదితర రోడ్డు భద్రత ప్రా ముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. -
ప్రభుత్వాలే బుడగ జంగాలు కులానికి అన్యాయం చేస్తున్నాయి
● రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె.చంద్రు వ్యాఖ్య కర్నూలు(సెంట్రల్) : భిక్షాటన చేస్తూ జీవనం సాగించే బుడగ జంగాలులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీరని అన్యాయం చేస్తున్నాయని మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి కె. చంద్రు అభిప్రాయపడ్డారు. శనివారం కర్నూలు వచ్చిన ఆయనను బుడగ, బేడ సంక్షేమ సంఘం నాయకులు కలసి వారికి రిజర్వేషన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. అందుకు ఆయన స్పందించి ఏపీ ప్రభుత్వం బుడగ జంగాలుల రాజ్యాంగ పరమైన హక్కులన కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసే బుడగ జంగాలుల కు ఏ రిజర్వేషన్ లేకుండా చేశాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. కుల సర్టిఫికెట్ లేని కారణంగా బుడగ జంగాలుల విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారన్నారు. సంక్షేమ పథకాలకు అర్హత సాధించలేకపోతున్నారని, తక్షణమే వారికి కుల సర్టిఫికెట్ను ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో తూర్పాటి మనోహర్, నరసింహులు, నాగలక్ష్మీ, విజయభారతి, కుమార్ పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న వెదుర్లు స్వాధీనం
బండి ఆత్మకూరు: ఎస్ఆర్ కుంట సెక్షన్ పరిధిలో నల్లమల నుంచి అక్రమంగా తరలిస్తున్న వెదర్లను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెదురులు తరలిస్తున్న బొలెరో వాహనాన్ని, ఆరు సైకిళ్లను పట్టుకున్నారు. బండిఆత్మకూరు ఫారెస్ట్ కార్యాలయంలో శనివారం రేంజ్ ఆఫీసర్ నాసిర్ ఝా వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంత గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తుండగా నారాయణపురం గ్రామం నుంచి అక్రమంగా వెదురు తరలిస్తున్న బొలెరో వాహనాన్ని గుర్తించి వెంబడించారు. పరమటూరు గ్రామం వద్దకు వాహనాన్ని వదిలిపెట్టి పరారయ్యారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసు కుని గాజులపల్లి డిపోకు తరలించారు. అంతేకాక శనివారం మధ్యా హ్నం ఓంకారం నార్త్ బీట్ పరిధిలో వెదుర్లు తరలిస్తున్న ఆరు సైకిళ్లను పట్టుకుని సీజ్ చేశారు. అడవి నుంచి అక్రమంగా కలప రవాణా చేస్తే అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆఫీసర్ నాసిర్ ఝా హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రత్నప్రభ, ఎఫ్ఎస్ఓ నాగేంద్రయ్య, జీసీపాలెం ఎఫ్ఎస్ఓ నాగరాజు, ఓంకారం నార్త్ బీట్ ఎఫ్బీఓ. హైమావతిలు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య కార్మికులకు 50 కష్టాలు
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఏ ఉద్యోగికై నా పదవీవిరమణ వయస్సు 60. కొంత మందికి వారి వారి అర్హత, స్థాయిలను బట్టి 62 నుంచి 63కు పెంచారు. కొందరు వైద్యులు, ఇతర అధికారులు ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఇతర సంస్థల్లో పనిచేస్తున్నారు. అలాంటిది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అవుట్సోర్సింగ్ విధానంలో పారిశుద్ధ్యకార్మికులుగా పనిచేసే వారికి మాత్రం ఉద్యోగ విరమణ వయస్సు 50గా నిర్ణయించారు. 50 దాటితే పనిలోకి రావద్దని కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురిని ఉద్యోగంలో నుంచి తీసేశారు. మరికొందరిని తీసేయడానికి రంగం సిద్ధం చేశారు. దీనిపై కార్మికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 40 దాకా వివిధ విభాగాల్లో 1050 పడకలు ఉన్నాయి. రోగుల రద్దీ దృష్ట్యా అనధికారికంగా అదనంగా మరో 500 దాకా పడకలు ఏర్పాటు చేశారు. దీంతో కార్మికులను సైతం 1500 పడకలకు అనుగుణంగా తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు కొన్ని నెలల క్రితం తిరుపతికి చెందిన పద్మావతి ఏజెన్సీ టెండర్ దక్కించుకుని నిర్వహిస్తోంది. ఈ మేరకు ఈ సంస్థకు ప్రభుత్వం రూ.84.10 లక్షలను ప్రతి నెలా చెల్లిస్తుంది. ఇందులో భాగంగా ఎంఓయూ ప్రకారం 399 మంది పారిశుధ్య కార్మికులు ఉండాలి. వార్డుల్లో ఉదయం 150 మంది, మధ్యాహ్నం 75 మంది, రాత్రి 56 మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు వార్డుల బయట విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మరో 33 మంది రిజర్వులో ఉంటారు. వీరిని పర్యవేక్షించేందుకు 29 మంది సూపర్వైజర్లు పనిచేస్తున్నారు. ఈ మేరకు వారు కార్మికులతో పనిచేయిస్తారు. ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ, నర్సింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజీ, ప్రభుత్వ కంటి ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రుల్లోనూ ఈ సంస్థే పారిశుధ్య నిర్వహణ చేపడుతోంది. 20 ఏళ్లగా పని చేస్తున్నా.. ఆసుపత్రిలో పాతికేళ్ల క్రితం పారిశుధ్య నిర్వహణ పనులు ప్రభుత్వం నియమించిన ఉద్యోగులే నిర్వహించేవారు. పాతికేళ్ల క్రితం ఈ బాధ్యతలను అప్పటి టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. పదేళ్లకు పైగా ఆ సంఘాల సభ్యులే ఆసుపత్రిలో పారిశుధ్యపనులు నిర్వహించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాయి. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఇప్పటి వరకు మూడు, నాలుగు ఏజెన్సీలు పారిశుధ్య పనులు నిర్వహించాయి. ఇందులో భాగంగా కొందరు కార్మికులు 20 ఏళ్లుగా ఆసుపత్రిని నమ్ముకుని పనిచేస్తున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం పారిశుధ్య నిర్వహణ పనులను దక్కించుకున్న పద్మావతి ఏజెన్సీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. 50 ఏళ్లు దాటిన వారిని ఉద్యోగంలో నుంచి తీసేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలువురిని రావద్దని కూడా చెప్పేశారు. ఈ విషయమై ఆ సంస్థ కార్యాలయం వద్ద ఇటీవల ఘర్షణ కూడా జరిగింది. తాజాగా మరికొందరిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. డిగ్రీ లేదని ఒక సూపర్వైజర్ను సైతం తొలగించినట్లు సమాచారం. అధికారుల అండతో.. ఆసుపత్రిలో పద్మావతి ఏజెన్సీకి అధికారులు, ఉద్యోగుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. వాస్తవంగా గతంలో పనిచేసిన సంస్థ 330 మంది కార్మికులతో పనిచేయించేది. ప్రస్తు తం టెండర్ దక్కించుకున్న సంస్థకు 399 మందిని కేటాయించారు. దీంతో తొలగించిన వారితో పాటు కొత్తగా 70 మందిని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు చెప్పిన వారిని విధుల్లో తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భారీగా డబ్బులు చేతులు మారినట్లు చర్చ జరుగుతోంది. ఒక్కో పోస్టుకు రూ.1లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించే వీరు తమ చేతిలో ఉన్నారని, తాము ఎవ్వరు చెప్పినా, ఎవ్వరికి చెప్పుకున్నా వినేది లేదని కార్మికులకు తెగేసి చెబుతుండటంతో ఏమి చేయాలో అర్థంగాని పరిస్థితి కార్మికుల్లో నెలకొంది. 50 ఏళ్ల తొలగింపు అంశం గురించి ఆసుపత్రి ఉన్నతాధికారులను కలిసి విన్నవించగా.. ‘అది సంస్థ నిర్ణయమని, తాము ఏమీ చేయలేమని’ తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఇదే అంశంపై వైఎస్సార్ జిల్లా కడపలో పలువురు కార్మికులు కోర్టును ఆశ్రయించారు. ఇటీవల అనంతపురంలో ఓ పారిశుధ్ధ్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నూలు జీజీహెచ్లోనూ ప్రజాసంఘాలతో కలిసి పారిశుధ్యకార్మికులు ఆందోళనకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త రూల్ యాభై ఏళ్లు దాటితే ఇంటికే..! కొత్తగా ఏజెన్సీ దక్కించుకున్న యాజమాన్యం చర్యలు నోరు మెదపని అధికారులు ఆందోళనకు సిద్ధమైన కార్మికులు -
భావితరాలకు మార్గదర్శకులు కావాలి
అపూర్వ మహసమ్మేళ నానికి హజరైన పూర్వ విద్యార్థులుమాట్లాడుతున్న హైకోర్ట్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిఎమ్మిగనూరుటౌన్: ‘‘ అందరూ ఆరు, ఏడు పదుల వయసు దాటిన వారే.. అందరికీ తెలియనిదంటూ ఏమీ లేదు.. భావితరాలకు మార్గదర్శకులు కావాలి’ అని తన తోటి మిత్రులు, సీనియర్లు అయిన పూర్వ విద్యార్థులకు హైకోర్ట్ జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1971–1974, 1972–1975 విద్యాసంవత్సరాలతో పాటు తరువాత చదివిన పూర్వ విద్యార్థుల అ‘పూర్వ’ మహా సమ్మేళనం ఎమ్మిగనూరు విశాల గార్డెన్లో శనివారం నిర్వహించారు. సుప్రీం కోర్ట్ న్యాయవాది బి.పురుషోతం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాడు చదువులు చెప్పిన కళాశాల అధ్యాపకులైన బి.కేశవరెడ్డి, టీజీ.దత్త, పివి.రాజు, పి.నాగిరెడ్డిలను హైకోర్టు జడ్జితో పాటు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఆనాటి హృదయాల ఆనందగీతం అ‘పూర్వ’ మహా సమ్మేళనంలో దేశ, విదేశాల్లో స్థిరపడిన వారందరూ కలిసి భోజనాలు చేశారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి స్మృతులను ఒరరికొకరు చెప్పుకొంటూ సాయంకాలం వరకు సరదాగా గడిపారు. బాల్య మిత్రులను పేరుపెట్టి పలకరించారు. యాభై ఏళ్ల తర్వాత కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ దైవాదీనంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో విద్య నేర్పిన గురువును ఎప్పటికీ ఎవరూ మరచిపోరు. తాను ఒకానొక కేసులో ఒక విద్యార్థిని హాస్టల్ వార్డెన్ కోచ్గా వ్యవహరించిన అంశంపై దాఖలు చేసిన కేసును వివరించాను. విద్యనేర్పిన వారు ఎవరైనా కావచ్చు ఆయన గురువే అని తీర్పు ఇచ్చాను. పుస్తక పఠనం ద్వారా తెలుసుకున్న విలువలతో కూడిన అంశాలను యువత, విద్యార్థులతో పంచుకొంటే అవి ఎంతో ఉపయోగపడతాయి. – హైకోర్ట్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిగురువులు క్రమశిక్షణతో చదువులు చెప్పడంతో మేం ఉన్నత స్థాయికి చేరుకొన్నాం. కళాశాల చదువుల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. మిత్రుడు పురుషోత్తం రెడ్డితో కలిసి కళాశాల చదివే రోజుల్లోనే పలు వ్యాపారాలు చేశాను. ఇంట్లో పెద్దలు వారించడంతో చదువులపై దృష్టి సారించా. ఏడు పదుల వయసులో అందరు కలవడం ఎంతో సంతోషంగా ఉంది. – రంగన్న, రిటైర్డ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1973లో చదువుకున్నా. ఇన్నేళ్లకు కళాశాల స్నే హితులను, సీనియర్లను, జూనియర్లను చూసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నా. గతంలో అనంతపురంలో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యురాలిగాను న్యాయవాదిగా పని చేశా. ప్రస్తుతం సైక్రియాటిస్టుగా అమెరికాలో పని చేస్తున్నాను. అప్పటి స్నేహితులు సంధ్య, శశికళలు బెంగళూరు నుంచి వచ్చారు. – లలిత, అమెరికా హైకోర్ట్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఎమ్మిగనూరులో గోల్డెన్ జూబ్లీ మహాసమ్మేళనం 50 ఏళ్ల తర్వాత కలసిన పూర్వ విద్యార్థులు గురువులకు ఘన సన్మానం -
ప్రజల సొమ్మును ప్రైవేట్కు ఇస్తే ఊరుకోం
● ఢిల్లీలో ధర్నా చేస్తాం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి ఆదోని టౌన్: ప్రజల సొమ్మును అప్పనంగా ప్రైవేట్ వారికి కట్టబెడతామంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి హెచ్చరించారు. ఆదోని పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కొనసాగుతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేయడంతో ప్రభుత్వమే రెండు సంవత్సరాల పాటు డాక్టర్లకు, సిబ్బందికి వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. పేద విద్యార్థులకు డాక్టర్ల విద్య దూరం చేయడంతో పాటు ప్రైవేట్ వారు ఆపరేషన్లు, ఓపీలు, వివిధ రకాలైన పరీక్షలకు ఫీజులు వసూలు చేస్తారన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగభృతి, ప్రతి మహిళకు రూ.1500, అన్నదాత సుఖీభవ, బీసీ ఎస్సీ, మైనార్టీలకు 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇస్తామన్న హామీలు తుంగలో తొక్కారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణలో కూటమి నేతలు మినహా మిగతా వారంతా భాగస్వాములయ్యారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా సేకరించిన 4.2 లక్షల సంతకాల ప్రతులతో ఈనెల 15న కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వీటిని ఈనెల 18న రాష్ట్ర గవర్నర్కు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమర్పిస్తారన్నారు.ప్రైవేటీకరణను గవర్నర్ అడ్డుకోకపోతే సుప్రీంకోర్టులో పిల్ వేసి అవసరమైతే ఢిల్లీలో జాతీయ స్థాయిలో ధర్నా చేస్తామన్నారు. లేనిపక్షంలో కూటమి ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు నిలదీసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు! ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిన సీఎం చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి, కౌన్సిలర్ రామలింగేశ్వరయాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ దేవదాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలను బహిష్కరిస్తాం
ఆదోని రూరల్: చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పెద్దహరివాణం మండలం ఏర్పాటు నిర్ణయాన్ని 16 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం 16 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు ఆదోని పట్టణంలోని రెడ్డి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోపాల్రెడ్డి, బసాపురం వెంకటేష్, గణేకల్ విరుపాక్షి, మదిరె సర్పంచ్ నారాయణ, బసాపురం రామస్వామి, చాగి రాము, గణేకల్ ఎంపీటీసీ ఉచ్చీరప్ప మాట్లాడుతూ.. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఐక్యమత్యంతో బహిష్కరిస్తామని తీర్మానం చేశారు. ఇప్పటికే 16 గ్రామాలను పెద్దహరివాణం మండలంలో చేర్చవద్దని జిల్లా కలెక్టర్కు, సబ్కలెక్టర్కు, తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు వారు తెలిపారు. -
వంద రోజుల పనిదినాలు చేసిన కుటుంబాలు మండలాల వారీగా..
ఉపాధి పనులకు అరకొర హాజరైన కూలీలు (ఫైల్)చిన్నారులతో కలసి వలస వెళ్తున్న వీరు పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం కోతికొండ గ్రామస్తులు. ఈ ఊరిలో మొత్తం 900 మంది నివాసం ఉంటున్నారు. గ్రామంలో వ్యవసాయ పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఉపాధి పనుల జాడే లేకుండా పోయింది. దీంతో గ్రామం నుంచి ఇప్పటికే 400 మందికిపైగా వలసబాట పట్టారు. ఇంతమంది వలసవెళ్లినప్పటికి ఉపాధి పనులు కల్పించలేదు. మరో 100 మంది వలస వెళ్లారు. త్వరలో గ్రామం ఖాళీ అయ్యే అవకాశం ఉంది.పొలంలో పత్తి తీస్తున్న ఈ మహిళ పేరు ఉరుకుందమ్మ. కోసిగి మండలం పల్లెపాడుకు చెందిన ఈమెకు రెండు ఎకరాల వరకు భూమి ఉంది. నీటి సదుపాయం లేకపోవడం, వర్షాలు ఒకసారి ఎక్కువగా, మరొకసారి పడకపోవడంతో పొలాన్ని బీడుగా ఉంచారు. గ్రామంలో ఉపాధి పనులు లేకపోవడంతో ఈమె తన భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలసి కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. ఉరుకుందమ్మ ఒక కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. కరువుతో డబ్బుల్లేక పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు కూడా చెల్లించలేదు. కర్ణాటకలో ప్రస్తుతం ఈ మహిళ పత్తి తీస్తున్నారు.కర్నూలు(అగ్రికల్చర్): చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి పనులు కరువయ్యాయి. వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు వలసబాట పట్టారు. పనిదినాల సంఖ్య అతి తక్కువగా ఉండటంతో పల్లెలన్నీ ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే జిల్లా నుంచి 1.50 లక్షల కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం కర్నూలు జిల్లాకు కేవలం 58 లక్షలు పనిదినాలు ఇచ్చారు. వీటిని 2026 మార్చి వరకు వినియోగించాల్సి ఉంది. ఇప్పటికే 50.88 లక్షల పనిదినాలను ఉపాధి కూలీలు వినియోగించుకోగా మిగిలింది కేవలం 7.12 లక్షలు మాత్రమే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ప్రతి ఏటా కోటి పనిదినాలు కల్పించారు. అడిగిన వారందరికీ ‘ఉపాధి’ చూపించారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అధికారులపై ఫిర్యాదులు సైతం వెళ్లాయి. కర్నూలు జిల్లాలో 1,214 కుటుంబాలకు.. ఎన్ఆర్ఈజీఎస్ మార్గదర్శకాల ప్రకారం జాబ్కాార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలి. కర్నూలు జిల్లా ఉమ్మడిగా ఉన్నసమయంలో ఏటా లక్ష కుటుంబాలకు 100 రోజుల పని కల్పించేవారు. విభజన తర్వాత ఒక్కో జిల్లాలో 50 వేల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు తొమ్మిది నెలలు గడచిపోగా కేవలం 1214 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించారు. కర్నూలు జిల్లాలోని ఆదోని, పత్తికొండ, కర్నూలు డివిజన్లు కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఒక్క ఆదోని డివిజన్లో తొమ్మిది నెలల్లో 171 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించడం గమనార్హం. నంద్యాల జిల్లాలో 1,759 కుటుంబాలకు... నంద్యాల జిల్లాలో 489 పంచాయతీలు ఉండగా ఈ ఏడాది 58 లక్షల పని దినాలు కేటాయించారు. జాబ్కార్డులు 2.56 లక్షలు ఉండగా 4.69 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇప్పటికే 51.19 లక్షల పని దినాలను వినియోగించుకున్నారు. నంద్యాల జిల్లాలో ప్రధానంగా ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, మిడుతూరు, జూపాడుబంగ్లా తదితర మండలాల్లో ఉపాధి పనులకు డిమాండ్ ఉంది. డోన్ నియోజకవర్గం పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడింది. ఇప్పటి వరకు 51.19 లక్షల పనిదినాల్లో ఎక్కువ డోన్ నియోజకవర్గానికి చెందిన వారు వినియోగించుకున్నారు. నంద్యాల జిల్లాకు మిగిలిన పని దినాలు కేవలం ఏడు లక్షలు మాత్రమే. డోన్ నియోజకవర్గంలో ఇప్పటికే వ్యవసాయ పనులు పూర్తి అయ్యాయి. ఉపాధి పనులు లేక వలసబాట పట్టారు. కానీ ఇంతవరకు ఉపాధి పనుల జాడే లేకుండా పోయింది. నంద్యాల జిల్లాలో తొమ్మిది నెలల్లో 1759 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించారు. ప్రాధాన్యం తగ్గించి చంద్రబాబు ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యత తగ్గించింది. సాధారణంగా ఒక పని దినం విలువ రూ.511 ఉంటుంది. ఇందులో రూ.307 లేబర్ కాంపోనెంట్ కింద ఖర్చు చేస్తారు. రూ.204 మెటీరియల్ కింద అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. ఉపాధి పనులకు కూలీలు ఎంత మంది వస్తే మెటీరియల్ కింద అభివృద్ధి పనులకు కూడ అదేస్థాయిలో అవకాశం ఉంటుంది. చంద్రబాబు సర్కార్ చర్యలతో ఉపాధి పనులు కూడా ఇక కరువు అవుతున్నాయి. జిల్లాకు కేటాయించిన పనిదినాల్లో కేవలం 7.12 లక్షలు మాత్రమే మిగిలి ఉండటంతో ఉద్దేశపూర్వకంగానే ప్రజలకు పనులు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. మండలం పనిచేసిన కుటుంబాలు ఆదోని 2 పెద్దకడుబూరు 8 ఎమ్మిగనూరు 9 నందవరం 14 గూడూరు 14 కర్నూలు 14 కోసిగి 15 కల్లూరు 21 సి.బెళగల్ 21 పత్తికొండ 22 కౌతాళం 25 కృష్ణగిరి 25 కొత్తపల్లి 30 మంత్రాలయం 30 కోడుమూరు 30 ఆస్పరి 32 కొలిమిగుండ్ల 32 నందికొట్కూరు 32 గోనెగండ్ల 33 పగిడ్యాల 36 హొళగుంద 36 దేవనకొండ 36 వెలుగోడు 37వైఎస్సార్సీపీ హయాంలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెటీరియల్ కింద పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు అవకాశం ఇచ్చింది. అందువల్లనే అప్పట్లో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ క్లీనిక్లు, బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్లు, డిజిటల్ ల్రైబ్రరీలు నిర్మించే అవకాశం ఏర్పడింది. గ్రామాలకు అవసరమైన సదుపాయాలు ఏర్పడ్డాయి. అప్పట్లో ప్రతి ఏటా కర్నూలు జిల్లాకు కోటి పనిదినాలు కల్పించారు. నంద్యాల జిల్లాలో ప్రజలకు అదే స్థాయిలో పనులు ఇచ్చారు. పని దినాల్లో భారీగా కోత ఈ ఏడాది 58 లక్షలకే పరిమితం ఇప్పటికే 50.88 లక్షల వినియోగం మిగిలింది 7.12 లక్షలు మాత్రమే మార్చి వరకు పనులు ఉండవు వలసబాట పట్టిన ప్రజలు -
చలిలో బెల్స్ పాల్సీ ముప్పు!
● పెరుగుతున్న ముఖపక్షవాతం కేసులు ● పెద్దాసుపత్రిలో వారంలో నలుగురికీ సమస్య ● చలిగాలిలో తిరగకపోవడమే నివారణ బెల్స్ పాల్సీ అంటే...! బెల్స్ పాల్సీ (ముఖపక్షవాతం) అనేది ముఖంలోని నరాలకు హాని కలిగించే ఒక రకమైన ఆరోగ్య సమస్య. తద్వారా రోగి ముఖ కదలికలను వ్యక్తం చేయడం, తినడం, మాట్లాడటం వంటివి చేయలేడు. లక్షణాలు ● కనురెప్పలు మూసివేయడం, రెప్పలు కొట్టుకోవడం సాధ్యపడదు ● ముఖం కదిలించడంలో ఇబ్బంది ● నోరు ఒకవైపునకు వాలిపోవడం ● ముఖ ఆకృతులను సమతుల్యం చేయడంలో ఇబ్బందులు ● బెల్స్ పాల్సీలో వ్యక్తి తన కనుబొమ్మలను ఎగురవేయలేడు ● మాట్లాడటం, తినడంలో ఇబ్బంది కర్నూలు(హాస్పిటల్): మూతి వంకర పోవడం, అలాంటి నోటి నుంచి నీరు కారుతుండటం, తినాలన్నా, తాగాలన్నా ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే దానిని వైద్యపరిభాషలో బెల్స్ పాల్సీ అంటారు. తెలుగులో దానిని ముఖ పక్షవాతమని పిలుస్తారు. శీతాకాలంలో ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువవుతాయి. శీతల గాలుల నుంచి రక్షణ పొందడమే ఈ సమస్య రాకుండా నివారించే చర్య అని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో చలిగాలులు తీవ్రమయ్యాయి. రాత్రి పూటే కాదు పగలు కూడా వాతావరణం చల్లగా ఉంటోంది. ఈ కారణంగా ఇల్లు, కార్యాలయం ఏదైనా, ఎక్కడైనా ఫ్యాన్ వేయాలన్నా జంకుతున్నారు. విపరీతమైన చలి ప్రజలను తీవ్రంగా వణికిస్తోంది. చలికారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పగలు 20 డిగ్రీల సెల్సియస్కు, రాత్రి 13 డిగ్రీల సెల్సియస్కు పడిపోతున్నాయి. చాలా మందికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల రీత్యా చల్లగాలికి బయటకు వెళ్లాల్సి ఉంటోంది. మరికొందరు ఉదయం వేళల్లో వాకింగ్కు వెళ్తుంటారు. ఇలా చల్లగా ఉన్న సమయంలో బయటకు వెళ్లే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చెవుల్లో నుంచి చల్లగాలి లోపలికి వెళ్లి ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి, జనరల్ మెడిసిన్, క్యాజువాలిటీ విభాగాలకు ప్రతి వారం ముగ్గురు నుంచి నలుగురు ముఖ పక్షవాతానికి (బెల్స్పాల్సీ) గురై చికిత్స నిమిత్తం వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు సైతం రోజూ 6 నుంచి 8 మంది వరకు న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్ల వద్దకు చికిత్సకు వెళ్తున్నారు. కారణాలు బెల్స్పాల్సీకి కచ్చితమైన కారణం ఉండదు. దీనికి అనేక వైరస్లు కారణమవుతాయి. వీటిలో హెర్పస్ సింప్లెక్స్, హెర్పెస్ జోస్టర్, హెచ్ఐవీ, సైటోమెగలోవైరస్, ఎప్సీటన్ బార్ వైరస్లు ప్రధానమైనవి. మధుమేహం, గర్భిణులు, గాయం, వాపు, ముఖ నరాలకు హాని కలిగించే ఏదైనా కారణం ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. చలివాతావరణంలో ఈ వైరస్లు మనుగడు ఎక్కువగా సాగిస్తాయి కాబట్టి అధిక శాతం వీటి ప్రభావానికి గురవుతుంటారు. వీరు వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.గత కొన్ని రోజులుగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి తీవ్రంగా ఉంటోంది. చలిగాలులు పగలు సైతం అధికమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెవులకు అచ్ఛాదన లేకుండా బయటకు వెళ్లకూడదు. ఎందుకంటే చల్లటి వాతావరణంలో వైరస్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషి నరాలపై దాడి చేస్తాయి. దీనినే న్యూరోట్రోపిక్ అటాక్స్ అంటాము. అధిక శాతం వైరస్ల వల్ల బెల్స్ పాల్సీ వస్తుంది. కొందరిలో ఎలాంటి కారణం లేకుండా వస్తుంది. ఇలాంటి వారికి అవసరమైన మందులు ఇచ్చి చికిత్స చేస్తాము. –డాక్టర్ సి. శ్రీనివాసులు, న్యూరాలజి హెచ్ఓడీ, జీజీహెచ్, కర్నూలు -
వేర్వేరు చోట్ల అదుపు తప్పిన కార్లు
అవుకు(కొలిమిగుండ్ల): ఉప్పలపాడు ఆర్చీ సమీపంలో శుక్రవారం కారు అదుపుతప్పి ప క్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. నంద్యాల నుంచి తాడిపత్రికి వెళుతున్న కారు అవుకు దాటాక ఆర్చీ సమీపానికి చేరుకోగానే ఎదురు గా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పడంతో పక్కనే ఉన్న వరిపొలాల్లోకి వెళ్లింది. ప్రమాద సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వల్పగాయాలతో బయట పడ్డారు. వరి కోత పనుల్లో ఉన్న కూలీలు అక్కడికి చేరుకొని బోల్తా పడిన కారును పైకి లేపారు. అలాగే గుండ్ల శింగవరం సమీపంలో బనగానపల్లె నుంచి తాడిపత్రికి వెళుతున్న జీపు బస్సును తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న పంట కాల్వలోకి పడింది. ప్రమాదం నుంచి డ్రైవర్ క్షేమంగా బయట పడ్డాడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు పాములపాడు: కర్నూలు – ఆత్మకూ రు రహదారిపై ఎర్రగూడూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. భానుముక్కల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, బలరాములు కారులో కర్నూలు వెళ్తుండగా అదే సమయంలో ఎర్రగూడూరు గ్రామానికి చెందిన హరి బైక్పై వెళ్తూ యూటర్న్ వద్ద క్రాస్ చేస్తుండగా కారు ఢీకొంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్క గొయ్యిలో పడింది. తీవ్ర గాయాలైన హరిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ రమణ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. -
పీఎం జేఏవై ద్వారా పేదలకు ఉచిత వైద్యం
కర్నూలు: ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎం జేఏవై) ద్వారా ఆర్థికంగా నిరుపేదలైన వారికి ప్రభు త్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఖర్చ య్యే ఉచిత ఆరోగ్య చికిత్సలు పొందవచ్చని జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు.శుక్రవారం కర్నూలు కొత్తపేటలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా లీలా వెంకటశేషాద్రి హాజరై మాట్లాడారు. పీఎం జన ఆరోగ్య యోజన పథ కం ద్వారా లబ్ధిదారులకు ఆరోగ్య సంరక్షణ సేవలు నగదు రహితంగా అందిస్తుందని తెలిపారు. రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులను కేంద్రమే భరిస్తుందన్నారు. ఈ పథకానికి పదహారేళ్ల వయస్సు నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రోజూవారీ కూలీపై ఆధారపడి జీవిస్తున్నవారు, నిర్మాణ కూలీలు, పెయింటర్స్, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు లబ్ధి పొందవచ్చని తెలిపారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శివరాం మాట్లా డుతూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ ప్రభుత్వ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని, తర్వాత వారు హెల్త్ కేర్ పొందడానికి అర్హత కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఆయుష్మాన్ భారత్ యోజన టోల్ఫ్రీ కాల్ సెంటర్ 14555, 1800 111 565కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి -
మద్దిలేటయ్యలో తిరుచ్చి మహోత్సవం
బేతంచెర్ల: మండలంలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో మార్గశిర మాసం శుక్రవారం రాత్రి స్వామి వారికి ఆలయ మాడవీధుల్లో తిరుచ్చి మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు వేదపండితులు జ్వాలా చక్రవర్తి, కల్యాణ చక్రవర్తి, అర్చకులు మద్దిలేటి నరసింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువుంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని ఊరేగించారు. భక్త జనసందోహం, గోవిందనామ స్మరణల నడుమ స్వామి వారు పుష్పాలంకరణ శోభితుడై పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. -
ఉద్యానశాఖలో నిధుల వ్యయంపై ఏజీ ఆడిట్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ఉద్యాన శాఖలో 2017–18 నుంచి వివిధ పథకాల కింద చేసిన నిధుల వ్యయంపై ఏజీ ఆడిట్కు శ్రీకారం చుట్టారు. 2017–18 నుంచి 2024–25 వరకు ఎంఐడీహెచ్, ఆర్కేవీవై తదితర వాటి కింద జిల్లాకు విడుదలైన నిధులు, వాటి వినియోగంపై అకౌంటెంట్ జనరల్(ఏజీ) ఆడిట్కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది ఆడిట్ చేపట్టారు. సంవత్సరం వారీగా వివిధ పథకాల కింద కాంపోనెంటు వారీగా నిధులు, ఖర్చులు, వాటికి సంబందించిన బిల్లులు, ఓచర్లు తదితర వాటిని పరిశీలిస్తారు. ఆడిట్కు అవసరమైన రికార్డులు, బిల్లులు, ఓచర్లను జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి ఆద్వర్యంలో సిద్ధం చేశారు. ఆడిట్కు పూర్తిగా సహకరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు కర్నూలు(సెంట్రల్) : పెన్షన్ల పంపిణీపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో పెన్షన్ పంపిణీపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పెన్షన్ల పంపిణీకి కొన్ని చోట్ల డబ్బులు వసూలు చేస్తున్నారని, కొందరు పెన్షన్దారులతో సరిగా మలుచుకోవడంలేదని ఐవీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకు వారంలో మూడుసార్లు ఎంపీడీఓలు, డీఆర్డీఏ పీడీ వెళ్లి విచారించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వచ్చే నెల నుంచి ఫిర్యాదులు రాకూడదని, వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తమపరిధిలోని అన్నా క్యాంటీన్లను పరిశీలించి భోజనం నాణ్యతపై దృష్టి సారించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటరమణారెడ్డి, మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ్ పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ఉప్పర కాలనీలో శుక్రవారం సాయంత్రం డిగ్రీ విద్యార్థి సంపత్(19) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు..కాలనీకి చెందిన శ్రీనివాసులు, మీనాక్షిలకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. మీనాక్షి ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో సంపత్(19) మూడో సంవత్సరం చదువుతున్నాడు. మధ్యాహ్నం తల్లిదండ్రులను సినిమాకు పంపించి ఇంట్లో ఉన్నాడు. తల్లిదండ్రులు సినిమా చూసి సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే తలుపులు వేసివుండటంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తీసి చూస్తే ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతున్నాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయటంతో ఇంటి పక్కన వారు వచ్చి సంపత్ను కిందకు దించి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ప్రభుత్వాసుపత్రికి వచ్చేలోపు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డిగ్రీలో కూడా అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అయితే తనకు తలనొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సంతప్(19) సూపైడ్ నోట్ను పెన్సిల్తో వ్రాసి జేబులో పెట్టుకున్నాడు. కిందకు దించేటప్పుడు కుటుంబ సభ్యులు ఈ లెటర్ను జేబులో నుంచి బయటకు తీసుకొని చూసి బోరన విలిపించారు. తలనొప్పి ఉందని ఇంత వరకు ఒక్కమాట కూడ మాకు చెప్పలేదని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పాములపాడు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మ కూరుపట్టణం తోటగిరిలో నివాసం ఉంటున్న ప్రశాంత్ అనే యువకుడు కర్నూలు జిల్లా హుసేనాపురంలో బంధువుల దగ్గరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పాములపాడు మండలంలోని భానుముక్కల టర్నింగ్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వారు యువకుడిని 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా, ఇక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్సల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
హంద్రీ–నీవా కాల్వలో గుర్తు తెలియని మృతదేహం
కోడుమూరు రూరల్: లద్దగిరి సమీపంలో ఉన్న హంద్రీ–నీవా కాల్వలో శుక్రవారం 30 సంవ త్సరాలు పైబడ్డ ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కోడుమూరు పోలీసులు గుర్తించా రు.మృతదేహం గుర్తు పట్టలేని విధంగా తయా రైంది.కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవ్వరైనా చంపి కాల్వలో పడవేశారా అన్న కోణంలో కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదోని జిల్లా సాధనకు పోరాడుదాం ఎమ్మిగనూరుటౌన్/మంత్రాలయం: ఆదోని జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరం కలిసి పోరాడుదామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఆదోని జిల్లా సాధనకై ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్, మంత్రాలయంలలో విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు నిర్వహి స్తున్నారు. దీక్షలో కూర్చున్న వారికి శుక్రవారం పలు ప్రజాసంఘాల నాయకులతో పాటు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. అంతకుమునుపు పట్టణంలో ఆదోని జిల్లా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదోని జిల్లా ఏర్పాటుపై మీకు ఏమైనా విషయం హమీ ఇచ్చామా అని స్థానిక నాయకులతో చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం, హంద్రీనీవా, గుండ్రేవుల,వేదావతి ప్రాజెక్ట్ల నిర్మాణాలపై ఏమి చేశారని నిలదీశారు. రెండవ ముంబైగా పిలవబడే ఆదోనిని జిల్లాగా ప్రకటించడానికి అన్ని అర్హతలున్నాయని తెలిపారు.దీక్షలో కూర్చున్న జేఏసీ నాయకులు శేఖర్నాయుడు, ఉదయ్, ఖాజ, కృష్ణ, ఆఫ్రిది, రఘు తదితరులకు సీపీఐ నాయకులు భాస్కర్ యాదవ్, రాజీవ్, బీజేపీ నాయకులు దయాసాగర్, లలిత్జైన్, బీఎల్ నారాయణ, ఎంఈఎఫ్ నాయకులు తిమ్మరాజు, ఆర్వీపీఎస్ నాయకులు నల్లారెడ్డి మాట్లాడారు. -
సి.క్యాంపు రైతుబజారు విస్తరణ
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు సి.క్యాంపు రైతుబజారు విస్తరణకు రూ.6.05 కోట్లు మంజూరు చేస్తూ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రిన్స్పల్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడున్న రైతుబజారు పక్కన ఆర్అండ్బీ క్వార్టర్ల ప్రదేశంలో జిప్లస్ తరహాలో నూతన రైతుబజారును అభివృద్ధి చేస్తారు. గ్రౌండ్ప్లోర్లో పార్కింగ్, పైన 135 స్టాళ్లు, 35 షాపులు నిర్మిస్తారు. కాంపౌండ్ వాల్కు బదులుగా షాపు లు వస్తాయి. షాపుల్లో రెండు అన్న క్యాంటీన్కు వినియోగిస్తారు. రైతుబజారు విస్తరణకు నిధులు రూ.6.05 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్టీ నెంబరు 1067 జారీ అయింది. దీనిపై మార్కెటింగ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. రైలు కింద పడి లారీ డ్రైవర్ ఆత్మహత్య ఆదోని అర్బన్: పట్టణంలోని విక్టోరియాపేటకు చెందిన లక్ష్మన్న(60) అనే లారీ డ్రైవర్ రైలు కింద పడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్కానిస్టేబుల్ శివరామయ్య, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... లారీ డ్రైవర్ లక్ష్మన్న శుక్రవారం బుడ్లపొట్టుతో ఆదోని నుంచి నాగలదిన్నెకు ఆరుగురు కూలీలతో బయలుదేరాడు. బైచిగేరి సమీపంలో ఎదురుగా వస్తున్న పత్తి వాహనాన్ని తప్పించబోగా లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ఉన్న సుంకన్న, రంగన్న, హనుమంతు, సూరి, దూలయ్య, అంజిలకు గాయాలయ్యాయి. దీంతో భయపడిపోయిన లక్ష్మన్న శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీ–బెంగళూరుకు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గాయాలపాలైన ఆరుగురిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఉరుకుందప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వసతి గృహ సంక్షేమాధికారులు స్థానికంగా లేకుంటే చర్యలు కర్నూలు(అర్బన్): జిల్లాలోని వసతి గృహ సంక్షేమాధికారులు, సహాయ సంక్షేమాధికారులు, నాలుగో తరగతి సిబ్బంది తాము పనిచేస్తున్న వసతి గృహాలకు స్థానికంగా నివాసం ఉండాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక హెచ్చ రించారు. సంబంధిత అధికారులు, ఉద్యోగులు స్థానికంగా ఉంటే విద్యార్థుల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం స్థానిక సంక్షేమభవన్లోని తన చాంబర్లో జిల్లాలోని ఏఎస్డబ్ల్యూఓ, హెచ్డబ్ల్యూఓలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అన్ని వసతి గృహాల్లోని విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రేరణ తరగతులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలన్నారు. వంట గదులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. రక్షిత మంచి నీటిని విద్యార్థులకు అందించాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె. బాబు, ఎస్ లీలావతి, బి.మద్దిలేటి, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి కొలిమిగుండ్ల: ఎస్సీ, ఎస్టీలు మరింత చైతన్యవంతులై రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని జైభీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్కుమార్ అన్నా రు. కొలిమిగుండ్ల కస్తూర్బా పాఠశాల ఎదురుగా ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు వంకదారి చిన్నచెన్నప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఘనంగా ప్రారంభించారు. విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్వటాల సమీపంలో ఏర్పాటైన రామ్కో సిమెంట్ కంపెనీ ఆరు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని మండిపడ్డారు. భూములను రక్షించేందుకు హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకదారి రవికుమార్, జైభీమ్ పార్టీ నాయకులు,కల్వటాల గ్రామ పెద్దలు కామిని ప్రతాప్రెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సొమ్ముతో పవన్ చక్కర్లు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రజా సొమ్ముతో హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారని జడా శ్రవణ్కుమార్ మండిపడ్డారు. షూటింగ్లు, ఫంక్షన్ లు అంటూ రోజూ విజయవాడ – హైదరాబాదు కు హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజా సొమ్మును దుబారా చేస్తున్నారన్నారు. సొంత డబ్బులతో హెలికాప్టర్లలో ఎన్ని సార్లు తిరిగినా ఎవరికీ అభ్యంతరం ఉండదని హితువు పలికారు. -
వ్యక్తి దారుణ హత్య
● పాత కక్షలతో దారుణం ● కొడవలితో మెడపై నరికిన నిందితుడుగుంతకల్లు/చిప్పగిరి: పాత కక్షలు మనసులో పెట్టుకున్న ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. కొడవలితో దారుణంగా ఓ వ్యక్తిని నరికి చంపిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటు చేసుకుంది. హతుని భార్య పుష్పవతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాత గుంతకల్లులోని అంకాళమ్మ గుడి సమీపంలో కురబ చంద్రశేఖర్(30), పుష్పవతి దంపతులు నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ టైలర్ వృత్తితో పాటు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతని సొంతూరు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నంచర్ల. రెండేళ్ల నుంచి పాత గుంతకల్లులోని అంకాళమ్మ గుడి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వారి ఇంటి పక్కనే కురబ బండయ్య, నాగవేణి దంపతులతో పాటు వారి కుమారుడు శివకుమార్ ఉంటున్నారు. ఏడాది క్రితం చంద్రశేఖర్ మిరపకాయల లోడ్ చేయడానికి కూలి పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లాడు. భార్య పుష్పవతి ఒక్కరే ఇంట్లో ఉండగా..ఇది అదనుగా తీసుకున్న శివకుమార్ అర్ధరాత్రి ఇంటి తలుపులు కొట్టాడు. ఈ విధంగా రెండు, మూడు సార్లు చేయడంతో ఆమె విషయాన్ని భర్త చంద్రశేఖర్కు తెలిపింది. దీంతో చంద్రశేఖర్, శివకుమార్ మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పటి నుంచి శివకుమార్ కక్ష పెంచుకున్నాడు. ప్రతి చిన్న విషయానికీ గొడవకు దిగేవాడు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఇంటి సమీపంలోని కుళాయి వద్ద నీళ్లు పట్టుకోవడానికి చంద్రశేఖర్, శివకుమార్ వెళ్లారు. తాను ముందుగా వచ్చానని, నీళ్లు పట్టుకుంటానని చంద్రశేఖర్ అనడంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన శివకుమార్ ఘర్షణ పడ్డాడు. వెంటనే పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లి కొడవలి తీసుకొచ్చి నీళ్లు పట్టుతున్న చంద్రశేఖర్ మెడపై మూడు సార్లు నరికాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంట్లో నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన పుష్పవతి రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. సీఐలు మనోహర్, ప్రవీణ్కుమార్, ఎస్ఐ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పుష్పవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు కురబ శివకుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
ఆదోని జిల్లా చేయాలి
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు: ప్రజల ఆకాంక్షను గౌరవించి ఆదోని జిల్లా చేయాలని ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. ఆలూరులో శుక్రవారం జేఏసీ నాయకులు రఘరామయ్య, ఆశోక్నందారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరహారదీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. వీరికి మద్దతు ప్రకటించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదోని జిల్లా ఏర్పాటుపై సమగ్రంగా నివేదికను అందజేయాలని సీఎం చంద్రబాబు కోరినా టీడీపీ నాయకులు తమ ఉనికి కోల్పోతామని అడ్డుకుంటున్నారన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు ఆదోని జిల్లా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గిరి, పార్టీ నాయకులు శ్రీనివాసులు, రాజు, మల్లికార్జున, వరుణ్, రాజు, వెంకటేశ్వర్లు ఉన్నారు. అంతకు ముందు స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలను వేసి నివాళులర్పించారు. కర్నూలు (అర్బన్): ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉమీద్ వక్ఫ్ పోర్టల్లో వివరాల అప్లోడ్నకు గడువును మరో ఆరు నెలలు పొడిగించినట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యనిర్వాహక అధికారి షేక్ మొహమ్మద్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ సంస్థలు, వాటికి చెందిన అనుబంధ ఆస్తుల వివరాలను ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేసే ప్రక్రియను జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభించామని చెప్పారు. చివరి తేదీగా ఈ ఏడాది డిసెంబర్ 5గా నిర్ణయించబడిందని తెలిపారు. అయితే సాంకేతిక సమస్యలు, కొంత వక్ఫ్ ఆస్తుల రికార్డులు తెలంగాణ వక్ఫ్ బోర్డు నుంచి వివిధ కారణాలతో అందకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. వక్ఫ్ బోర్డు వారు దాఖలు చేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ పరిశీలించిన సమస్యలను పరిగణలోకి తీసుకుని గడువు పొడిగింపు ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. దీంతో ఉమీద్ పోర్టల్లో వక్ఫ్ సంస్థల వివరాలను అప్లోడ్ చేసుకునే గడువు జూన్ 6వ తేదీ వరకు పొడిగించబడిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ సంస్థల మేనేజింగ్ కమిటీలు, ముతవల్లీలు, సంబంధిత బాధ్యులు తమ సంస్థలకు సంబంధించిన పూర్తి వివరాలను సమయానికి ఉమీద్ పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆయన కోరారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత
● ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు (టౌన్): చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గస్థాయిలో సేకరించిన కోటి సంతకాల సేకరణ పత్రాలను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్వీ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోకుంటే సుప్రీం కోర్టులో పిల్ వేస్తామన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్కు ఈనెల 18న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తారన్నారు. అప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకుంటే ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజాకాంక్షను గౌరవించాలి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు వచ్చాయన్నారు. వీటిని నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం రూ. 8,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్య సీట్లు వద్దంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసిందన్నారు. పీపీపీ విధానంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. ప్రజల తరఫున వైఎస్సార్సీపీ దశల వారీగా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించిందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి నాలుగు లక్షలకు పైగా ప్రజల నుంచి సంతకాలు సేకరించామన్నారు. కర్నూలు నియోజకవర్గంలో 67 వేల మంది సంతకాలు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు అహమ్మద్ ఆలీఖాన్, కార్పొరేటర్ క్రిష్ణ కాంత్ రెడ్డి, పార్టీ నేతలు షరీఫ్, శ్రీనివాసరెడ్డి, నరసింహులు యాదవ్, రాఘవేంద్ర నాయుడు, కిషన్, లాజరస్, నవీన్, ఫిరోజ్, పత్తాబాషా, కంటూ, కటికె గౌతమ్ పాల్గొన్నారు. -
హైకోర్టు జడ్జిని కలసిన కలెక్టర్
కర్నూలు(సెంట్రల్): కర్నూలు వచ్చిన రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి కలిశారు. శుక్రవారం ఆమె రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఆయనను కలుసుకొని మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్ జడ్జికి వివరించారు. మద్యం మత్తులోనే ప్రమాదాలు కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడపటం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్ల వల్ల సంభవించే ప్రమాదాలను నిరోధించేందుకు తనిఖీలు విస్తృతం చేశామని పేర్కొన్నారు. అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ ఎనలైజర్తో చెక్ చేస్తున్నారని, డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు క్రమం తప్పకుండా రోజూ కొనసాగుతాయని తెలిపారు. ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు నెల రోజుల పాటు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. లోక రక్షకుడు క్రీస్తు కర్నూలు(సెంట్రల్): మానవుల రక్షణ కోసం ఏసుక్రీస్తు భూమికి వచ్చిన సందర్భమే క్రిస్మస్ వేడుక అని దైవజనులు డాక్టర్ సతీష్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఎస్టీబీసీ కళాళాల మైదానంలో కల్వరి గారండ్క్రిస్మస్ వేడుకలు వేలాది మంది క్రైస్తవుల మధ్య జరిగాయి. కార్యక్రమానికి హైదరాబాద్కుచెందిన డాక్టర్ సతీస్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యేసుక్రీస్తు రాకపై తన సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఆర్డీ సజీవరాజు, డాకటర్ ఆర్,దాస్, అమ్రోజ్, రామాంజనేయులు తదితరులు తమ సందేశాలను ఇచ్చారు. నందికొట్కూరు: జాతీయ స్థాయిలో విశ్వసనీయమైన గణంకాల తయారీకి క్షేత్రస్థాయి సర్వేలు చాలా కీలకమని నేషనల్ స్టాటిస్టిక్స్ అదనపు డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో జరుగుతున్న క్షేత్రస్థాయి సర్వేను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చేపట్టిన గణంకాల కార్యక్రమం ఎంత ఉపయోగమన్నారు. ఈ సర్వే దేశ వ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగిత రేట్లను అంచనా వేయడానికి ఎన్ఎస్ఓ సర్వే ప్రతి ఏడాది ఉంటుందని చెప్పారు. పీఎల్ఎఫ్ఎస్ సర్వే కోసం ఎంపిక చేయబడిన గృహాలను సందర్శించామన్నారు. ఈ సర్వే దేశ ఆర్థిక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎన్ఎస్ఓ కర్నూలు ఉప ప్రాంతీయ కార్యాలయం సర్వే సూపర్వైజర్ సీ.బీ శ్రీనివాసులు, సర్వే ఎన్యుమరేటర్ నాగన్న, స్థానిక వీఆర్వోలు నర్సరాజు, హనుమంతు, వీఆర్ఏలు శ్రీను, సుధాకర్ పాల్గొన్నారు. నాగంపల్లి సొసైటీ సీఈఓ అరెస్టు కొత్తపల్లి: కొత్తపల్లి మండల కేంద్రంలోని నాగంపల్లి సొసైటీ సీఈఓ కోటేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఎస్ఐ జయశేఖర్ శుక్రవారం రాత్రి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. నాగంపల్లి సొసైటీలో 2022 నుంచి కోటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు సొసైటీ ద్వారా మండలంలోని ఆయా గ్రామాల రైతులు తీసుకున్న రుణాలను వసూలు చేస్తూ, రైతులకు తప్పుడు రశీదులు ఇచ్చారు. నగదు మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా దారి మళ్లించాడు. విషయమై ప్రస్తుతం నాగంపల్లి సొసైటీ చైర్మన్గా ఉన్న నాగేశ్వరరావు యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోటేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్కు ఆదేశించారని వెల్లడించారు. -
అక్రమంగా బాలలను తలరిస్తున్న ముఠా అరెస్ట్
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలో అక్రమంగా బాలలను తరలిస్తున్న ముఠా సభ్యులను రైల్వే పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ రవీంద్ర తెలిపిన వివరాల మేరకు.. నంద్యాలలో ఆరుగురు ముఠా సభ్యులు కొంత కాలంగా బాలలను మాయమాటలతో వస పరుచుకొని ఇతర రాష్ట్రాల వారికి కూలీ పని చేసేందుకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఆరుగురు బాలలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరుగురు బాలురలను, ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారించగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అంగీకరించారని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. చిన్నారులను చిల్డ్రన్ హోంకు తరలించామని సీఐ తెలిపారు. -
పేదలకు ‘ఏడు’పే మిగిలింది!
రేషన్ షాపులను కచ్చితంగా ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు తెరవాల్సిందే. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు వినియోగదారులకు అందుబాటులో ఉండాలి. అలా లేని పక్షంలో షాపులను సీజ్ చేస్తాం. కర్నూలు నగరంలో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. తనిఖీలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –వెంకటరాముడు, ఇన్చార్జి డీఎస్ఓ, కర్నూలు కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ చౌక దుకాణాల్లో పేదలకు నిత్యావసరాలు అందడం లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి రెండు వారాల పాటు రేషన్ణ సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఏడు రోజుల్లోనే జిల్లాలో దాదాపు అన్ని రేషన్ దుకాణాలు మూతపడుతున్నాయి. ఏడు రోజుల్లో పేదలు రాకుంటే షాపులకు డీలర్లు తాళాలు వేస్తున్నారు. మూసిన షాపులు ఎప్పుడు తెరుస్తారని ప్రజలు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో గత ప్రభుత్వ హయాంలోనే సరులకు పంపిణీ బాగుండేదని, నేరుగా ఇళ్ల దగ్గరకే ఆటోల ద్వారా తీసుకొచ్చి ఇస్తుండడంతో ఎలాంటి మోసాలు, అక్రమాలు జరిగేవి కావని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమాల ‘ముద్ర’ జిల్లాలో 1,233 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6,34,631 కార్డుదారులు ఉండగా వాటిలో దాదాపు 12.5 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా 10,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తోంది. ప్రతి నెలా 1 నుంచి 16వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసరాలను అందించాల్సి ఉంది. ఈ క్రమంలో డీలర్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. వారం రోజులపాటు సరుకులను పంచి తరువాత షాపులను క్లోజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వినియోగదారులు కచ్చితంగా బియ్యం కావాలని అడిగితే స్టాక్ అయిపోయిందని, కావాలంటే బియ్యానికి బదులుగా డబ్బులు తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో డీలర్లు ఇచ్చే పదో, పదకొండుకో బియ్యాన్ని విక్రయించి వేలిముద్రలు వేసి వెళ్లిపోతున్నారు. తనిఖీలకు వెళ్లని అధికారులు జిల్లాలో దాదాపు 1233 రేషన్ షాపులు ఉన్నాయి. ఇందులో కర్నూలు నగరంలోనే 160 షాపులు ఉన్నాయి. అయితే రేషన్ షాపుల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి పౌర సరఫరాల అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంది. అయితే వారు పట్టించుకోవడంలేదు. దీంతో డీలర్లు వారం మాత్రమే బియ్యం, ఇతర సరుకులను ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా వినియోగడారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ సరుకులను ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉండి సరఫరా చేయాలి. అయితే ఎక్కడా అది జరగడంలేదు. కేవలం వారికి అనుకూలమైన సమయాల్లోనే వస్తుండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీడీపీ నేతలకు వాటాలు! బియ్యం అక్రమ దందాలో విస్తుపోయే నిజాలు దాగి ఉన్నాయి. వినియోగదారుడి నుంచి రేషన్ డీలరో లేదా ఇళ్లిళ్లు తిరిగే వారు కేవలం రూ.10 నుంచి రూ.13లకు కొనుగోలు చేసి దానిపై రూ.9 నుంచి రూ.6 వరకు లాభం పెట్టుకొని సమీపంలో ఉండే వ్యాపారులకు రూ.19 ప్రకారం అమ్ముతారు. వారు దానిపై రూ.5 అదనంగా లాభం వేసుకొని రూ.24 విక్రయిస్తారు. వీరు దానిపై 10 లాభం వేసుకొని జిల్లా సరిహద్దులు దాటిస్తారు. అంటే జిల్లా సరిహద్దులు దాటేలోపు బియ్యం ధర రూ.34 చేరుకుంటుంది. ఎక్కడికక్కడే బియ్యం అధికారులు, టీడీపీ నేతలకు వాటాలు ఉంటాయి. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులేకుండా చేరాల్సిన చోటుకు అక్రమ బియ్యం చేరిపోతూ ఉంటుంది. జిల్లా సరిహద్దులు దాటిన తరువాత మిల్లులు చేరుకొని అక్కడ సన్న బియ్యం మాదిరిగా తయారై 25 కేజీలు, 50 కేజీల ప్యాకెట్లుగా తయారై తిరిగి ప్రజల చెంతకే చేరుకుంటుంది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వినియోగదారుల ఇళ్ల దగ్గరకే వెళ్లి సరుకులను ఇచ్చేవారు. ఇందుకోసం 409 ఎండీయూ వాహనాల ద్వారా సరుకులను సరఫరా చేసేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వాటిని తీసి వేయడంతో పేదలు మళ్లీ రేషన్ షాపుల వద్ద ఎదురు చూడాల్సివస్తోంది. అక్కడికి వెళ్లితే వారు చెప్పినట్లు వినికపోతే అస్సలు సరుకులే వేయరు. ఈ క్రమంలో ప్రజలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే సరుకుల పంపిణీ బాగుండేదని, ఇప్పుడు డీలర్లు చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికే రేషన్ షాపులకు తాళాలు బియ్యం లేవని చెబుతున్న డీలర్లు తంబ్ వేసి డబ్బులు తీసుకెళ్లాలని ఒత్తిళ్లు చర్యలు తీసుకోని అధికారులు కర్నూలులో దారుణ పరిస్థితులు -
టీడీపీకి ఎదురు దెబ్బ
● కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో వైఎస్సార్పీపీ జయకేతనందొర్నిపాడు: మండల కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో అధికార పార్టీ టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి అచ్చుకట్ల షఫీబాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ గోవిందనాయక్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దొర్నిపాడు మండల ప్రజాపరిత్ కార్యాలయంలో గురువారం ఈ ఎన్నిక ఉత్కంఠంగా సాగింది. కోఆప్షన్ సభ్యుడు అచ్చుకల్ల అల్లా మహమ్మద్ మృతిచెందడంతో ఈ ఎన్నిక నిర్వహించారు. మృతుడి కుమారుడు అచ్చుకట్ల షఫీబాషాకు వైఎస్సార్సీపీ పోటీ చేసే అవకాశం ఇచ్చింది. టీడీపీ అభ్యర్థులు దొర్నిపాడుకు చెందిన మాబుహుసేన్, చాకరాజువేముల గ్రామానికి చెందిన నొస్సం హుసేన్బాషాలు రెండు నామినేషన్లు వేశారు. వారు తప్పుగా సంతకాలు చేయడంతో నామినేషన్లను పీఓ తిరష్కరించారు. దీంతో అధికారులు వైఎస్సార్సీపీ అభ్యర్థి అచ్చుకట్ల షఫీబాషా గెలుపును ఏకగ్రీవంగా ప్రకటిస్తూ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. -
దత్తాత్రేయస్వామికి విశేషపూజలు
శ్రీశైలంటెంపుల్: లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం గురువారం ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద వెలసిన శ్రీదత్తాత్రేయస్వామికి విశేషపూజలను దేవస్థానం అధికారులు, అర్చకులు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజ జరిపించారు. అనంతరం దత్తాత్రేయస్వామికి అభిషేకాది, అర్చనలు చేసి ప్రసాద వితరణ గావించారు. మిర్చి ధరలు నిరాశాజనకం కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధరలు రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఈ ఏడాది జిల్లాలో మిర్చి దాదాపు 48 వేల ఎకరాల్లో సాగు అయింది. కొద్ది రోజులుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 100 క్వింటాళ్ల వరకు మిర్చి వస్తోంది. అయితే ధరలు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి. బ్యాడిగ రకానికి రూ.17,869. ఆర్మూర్ రకానికి గరిష్టంగా రూ.14,819. తేజా రకానికి రూ.14,800 ప్రకారం ధరలు లభించాయి. ఈ రకాలకు కనీసం రూ.20 వేల వరకు ధర లభిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఉల్లికి కనిష్టంగా రూ. 536, గరిష్టంగా రూ.1511 లభించింది. వేరుశనగ ధర కనిష్టంగా రూ.5677, గరిష్ఠంగా రూ.7500 ధర లభించింది. కందులకు కనిష్టంగా రూ.4800, గరిష్టంగా రూ.6939 ధర లభించింది. ధరలు పడిపోయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలగని ‘దారి’ద్య్రం పత్తికొండ: రాష్ట్రంలో గుంతల లేని రహదారులు ఉంటాయని, సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు వచ్చే వారికి కానుకగా ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒక సంక్రాంతి గడిచిపోయి మరికొద్ది రోజుల్లో మరోసారి సంక్రాంతి పండుగ వస్తోంది. అయితే రోడ్ల పరిస్థితి మారలేదు. పత్తికొండ ఆర్అండ్బీ పరిధిలో గుంతల పడిన రోడ్లులో ప్రయా ణం ప్రమాదకరంగా మారింది. వేలాది మంది రాకపోకలతో ఎల్లప్పుడు రద్దీగా ఉండే పత్తికొండలో రహదారులు సైతం గుంతలపడి ఉన్నాయి. ఉయ్యాలవాడ: ఈ ఏడాది అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. ఖరీఫ్లో మొదట వర్షాభావం, ఆ తర్వాత వరుస తుపాన్లు, భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు వరి, మొక్కజొన్న, మినుము, మిరప, పత్తి వంటి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు రబీపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మండలంలో 11,076 హెక్టార్లలో పప్పు శనగ సాగు చేశారు. అయితే అధిక వర్షాల కారణంగా భూమిలో తేమ శాతం పెరిగి తెగుళ్లు సోకడంతో శనగ పంట ఎండిపోతోంది. దీనికి తోడు పంటలో కలుపు మొక్కలు అధికంగా పెరగడంతో వాటిని తొలగించేందుకు కూలీల డిమాండ్ పెరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లలో వరుస ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ఖరీఫ్లో నష్టపోయిన పంటలపై వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినా ఇంతవరకు పరిహారం అందలేదని రైతులు వాపోతున్నారు. రబీలో మిగిలిన పైరును కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. -
వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన స్థానికులు
పెద్దకడబూరు: బతుకుపై విరక్తి చెందిన వృద్ధురాలు కాలువలో దూకిన సంఘటన పెద్దకడబూరు మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ నిరంజన్రెడ్డి వివరాల మేరకు.. మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామానికి చెందిన తెలుగు లక్ష్మి(65) జీవితంపై విరక్తి చెంది చనిపోవాలనే ఉద్దేశంతో ఆదోని రహదారిలో ఎల్ఎల్సీ బ్రిడ్జ్ దగ్గర నీళ్లులో దూకింది. నీళ్లులో కొట్టుకొని పోతున్న వృద్ధురాలను చిన్నకడబూరు గ్రామానికి చెందిన దశరథరామరెడ్డి, కనుగొట్ల భీమరెడ్డి గమనించి నీళ్లలో దూకి కాపాడారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వెళ్లి ఆమెను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. వృద్ధురాలి కుమారుడు, కోడలును పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వృద్ధురాలిని బాగా చూసుకోవాలని చెప్పి వారితో ఇంటికి పంపినట్లు ఎస్ఐ తెలిపారు. -
మల్లన్న సేవలో అఖండ–2 మూవీ టీం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను గురువారం అఖండ–2 చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మల్లన్న దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటులు అశ్విన్బాబు, ఆది సాయికుమార్, ఇతర నటినటులకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో అఖండ చిత్ర యూనిట్ సభ్యులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల డైరెక్టర్ బోయపాటి మాట్లాడుతూ అఖండ–2 సినిమాకు అన్ని విఘ్నాలు తొలగిపోవడంతో శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నామన్నారు. తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన డీఈఓ
కర్నూలు సిటీ: జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎల్. సుధాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఈఓగా ఉన్న ఎస్.శామ్యూల్ పాల్ రిలీవ్ అయ్యారు. నూతన డీఈఓ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎస్.శ్యామూల్ పాల్తో కలిసి జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్లను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ తరువాత నూతన డీఈఓను వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. రిజర్వాయర్ రివిట్మెంట్కు మరమ్మతులు అవుకు(కొలిమిగుండ్ల): అవుకు రిజర్వాయర్కు చెందిన రివిట్మెంట్కు మరమ్మతులు చేపట్టేందుకు ఎస్సార్బీసీ అధికారులు సిద్ధమయ్యారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన అక్షిత అండర్వాటర్ సర్వీసెస్ లిమిటెడ్కు చెందిన సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకోవడంతో గురువారం వివిధ రకాల యంత్రాలు, సామగ్రి, కెమికల్ను రిజర్వాయర్ వద్ద చేర్చారు. మద్రాసు ఐఐటీకి చెందిన నిపుణుల ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టనున్నారు. సోమవారం నుంచి రివిట్మెంట్ పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది వ్యవధిలోనే రెండు సార్లు రివిట్మెంట్ కుంగిపోవడంతో అధికారులు తాత్కాలిక చర్యలు మాత్రమే చేపట్టారు. రిజర్వాయర్లో 4 టీఎంసీల నీటి నిల్వ ఉంటే కట్టకు ప్రమాదముందని భావించిన అధికారులు గాలేరు నగరి వరద కాల్వ ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రెండు టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. కుంగిన రివిట్మెంట్ ప్రాంతంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా తెప్పించిన కెమికల్ సాయంతో లీకేజీ నివారణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ నెలాఖరు లోగా పనులు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం పరిధిలో పద్మావతి ఏజెన్సీ కింద పనిచేస్తున్న శానిటేషన్, హౌస్ కీపింగ్ కార్మికులకు ఎట్టకేలకు ఒక నెల జీతాన్ని సంస్థ చెల్లించింది. గురువారం కార్మికులకు ఒక నెల వేతానాన్ని వారి బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. మూడు రోజుల క్రితం సాక్షిలో ‘వేతన.. వేదన!’ శీర్షికతో రెండు నెలలుగా జీతాలు అందక కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన దేవస్థాన అధికారులు పద్మావతి ఎజెన్సీపై ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు ఒక నెల వేతనాన్ని జమ చేశారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. -
వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువులు
● డ్వామా పీడీ వెంకటరమణయ్య కర్నూలు(అగ్రికల్చర్): గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో ఉత్పన్నమయ్యే వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకోవచ్చని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. ఇందుకోసం కంపోస్ట్ పిట్లు తవ్వుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉపాధి నిధులతో పల్లెపండుగ–2 కింద రూ.20 కోట్లతో పశువుల షెడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 4000 ఫాంపాండ్స్ తవ్వాలని లక్ష్యంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30 వేల కంపోస్ట్ పిట్లు తవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 2500 సోప్ పిట్స్ తవ్వాలనేది లక్ష్యమని, రూ.25 కోట్లతో అంతర్గత సిసీ రోడ్లు వేయనున్నట్లు పేర్కొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎంహెచ్ఓ’ కర్నూలు(హాస్పిటల్): డయల్ యువర్ డీఎంహెచ్ఓ కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేదీ(శుక్రవారం) నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు ప్రజలకు అందని వారు 9849902409 నంబర్కు ఫోన్ చేసి వారి సమస్యలను తనకు తెలపవచ్చని పేర్కొన్నారు. రబీలో టమాటకు మాత్రమే ‘బీమా’ కర్నూలు(అగ్రికల్చర్): రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా(దిగుబడి ఆధారిత బీమా) కింద శనగ, వేరుశనగ, జొన్న, వరి, ఉల్లి పంటలు గుర్తిస్తారు. వాతావరణ ఆధారిత బీమా కింద టమాట నోటిఫై అవుతోంది. ఈ ప్రక్రియ అక్టోబరు నెలలోనే చేపడుతారు. ఇటీవల వాతావరణ ఆధిరత బీమా కింద చంద్రబాబు ప్రభుత్వం టమాట పంటను నోటిఫై చేసింది. మిగిలిన పంటలను పట్టించుకోలేదు. టమాట పంటకు కూడా ఈ నెల 15లోగా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. హెక్టారుకు రూ.75 వేల విలువకు ప్రీమియం 5 శాతం ప్రకారం రైతులు చెల్లించాల్సి ఉంది. బీమా చేయించుకోవాలంటే హెక్టారుకు రైతులపై రూ.3750 భారం పడుతోంది. మిగిలిన శనగ, వేరుశనగ, జొన్న, వరి, ఉల్లి పంటలకు బీమా ఉంటుందా లేదా అనేదానిపై సమాచారం లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాతకందుకూరులో చోరీ దొర్నిపాడు: ఆళ్లగడ్డ మండలం పాతకందుకూరు గ్రామంలో గురువారం చోరీ జరిగినట్లు రూరల్ ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. గ్రామాని చెందిన లక్ష్మిదేవి ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరులో ఉంచిన 5 తులాల బంగారు నగలు, రూ.30 వేల నగదు అహపరించారు. దీంతో బాధితురాలి ఫిర్యాది మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వరకట్నం కేసు నమోదు కొలిమిగుండ్ల: కల్వటాలకు చెందిన కుమ్మరి మాధురిని వేధించిన కేసులో భర్తపై వరకట్నం కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్ బాబు గురువారం తెలిపారు. అనంతపురం జిల్లా రంగంపేటకు చెందిన నాగేంద్రతో మాధురితో వివాహమైంది. కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు భార్య ఫిర్యాదు మేరకు భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. తుగ్గలి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా టీడీపీ తుగ్గలి నాయకుడు కె నాగేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం నియామకాలు చేపట్టినట్లు సమాచారం. యువకుడి దుర్మరణం తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో చోటు చేసుకున్న ప్రమాదంలో నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన బండి చరణ్ (18) దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. మద్దిలేటి తన ఇద్దరు కుమారులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అన్న కుమారుడు చరణ్తో కలసి ద్విచక్ర వాహనంపై గురువారం సాయంత్రం తాడిపత్రిలోని ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు బయలుదేరాడు. తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ముందు వెళుతున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో బైక్ నడుపుతున్న బండి చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మద్దిలేటికి తీవ్ర గాయాలయ్యాయి. మద్దిలేటి కుమారులు అర్జున్, సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తాడిపత్రి రూరల్ యూపీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
● జిల్లా జడ్జి కబర్ధికర్నూలు: వయస్సులో 70 ఏళ్ల పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడేవారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.కబర్ధి తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి గురువారం కర్నూలు పురుషుల, మహిళా కారాగారాలను తనిఖీ చేశారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపర్చాలని జైలు అధికారులకు సూచించారు. జైలులో ఉన్న ఖైదీలు వారి హక్కులను తెలుసుకోవాలని, ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా నియమిస్తామని తెలిపారు. ఖైదీలకు అందించే ఆహారాన్ని, రేషన్ను, వారి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఖైదీలకు ఏవైనా సమస్యలు ఉంటే కర్నూలు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నంబర్ 15100పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, అవసరమైతే హెల్ప్లైన్ నంబర్కు తమ సమస్యలు చెప్పుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో జైలు అధికారులతో పా టు లీగల్ ఎయిడ్ న్యాయవాది శివరాం పాల్గొన్నారు. -
వేసవిలో నీటి ఎద్దడి రానీయొద్దు
కర్నూలు(సెంట్రల్): వచ్చే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి విడుదల, వినియోగంపై ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులతో గురవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తుంగభద్ర డ్యామ్ నుంచి జనవరి 10వ తేదీ వరకు తాగు,సాగు కోసం నీటిని విడుదల చేయాలన్నారు. తదుపరి ఏప్రిల్లో తాగునీటి కోసం 15 రోజులు కాకుండా 30 రోజులపాటునీటిని విడుదల చేయాలన్నారు. కేవలం 15 రోజులే వదిలితే గుడేకల్ వరకు మాత్రమే నీరు వస్తుందని, 30 రోజులపాటు విడుదల చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చెరువులు, ఎస్ఎస్ ట్యాంకులను నింపుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఎస్తో మాట్లాడుతానని చెప్పారు. వర్షాలు ఆలస్యమైన పక్షంలో జూలైలో మరోసారి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 10వతేదీలోపు జిల్లాలోని అన్ని చెరువులు, ఎస్ఎస్ ట్యాంకులను సంపూర్ణంగా నీటితో నింపాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పైపు లీకేజీలు లేకుండా చూసుకోవాలి కర్నూలు కార్పొరేషన్లో నీటి ఎద్దడి రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మునిసిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పైపులు లీకేజీ లేకుండా చూసుకోవాలన్నారు. సుంకేసుల నుంచి కర్నూలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వరకు పైపులైన్ పనులను మార్చిలోపు పూర్తి చేయాలన్నారు. ఆదోని ఎస్ఎస్ ట్యాంకు ట్యాంకు మరమ్మతులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ పాండురంగయ్య, తుంగభద్ర బోర్డు ఎస్ఈ నారాయణ నాయక్, కర్నూలు మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ సతీష్కుమార్రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటరమాణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మి పాల్గొన్నారు. -
కొర్చెవంకలో దూసుకెళ్లిన బైక్
● తీవ్ర గాయలతో హమాలీ మృతి హొళగుంద: స్థానిక బస్టాండ్ వద్ద బీసీ కాలనికి వెళ్లే రస్తాలో ఉన్న కొర్చెవంకలో మోటార్ సైకిల్ అదుపు తప్పి దూసుకెళ్లి తీవ్ర గాయాలతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. హొళగుంద పట్టణం అయోధ్య నగర్లోని మహంకాళమ్మ గుడి వద్ద నివాసముంటున్న బోయ రొడ్డె సిద్ధప్ప(45) అనే వ్యక్తి రైస్ మిల్లుల వద్ద ట్రాక్టర్ హమాలీగా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం బైక్పై బీసీ కాలనీ వైపు వెళ్తుండగా బస్టాండ్ వద్ద ఉన్న కొర్చెవంకలో బైక్ అదుపు కాక వేగంగా వంకలోకి దూసుకెళ్లింది. దీంతో తల, చేతులు, మోహం మీద తీవ్ర రక్తగాయాలు కావడంతో స్థానికులు సిద్ధప్పను వంకలో నుంచి బయటకి తీయగా కొద్ది సేపటికే మృతి చెందాడు. విషయం ఎస్ఐ దిలీప్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆలూరుకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు.. భార్య రొడ్డె రేణుకమ్మ ఇచ్చిన ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తున్న చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ శేషిరెడ్డి విలేకరులకు తెలిపారు. కాగా.. ప్రమాద జరిగిన వంక చాలా కాలంగా ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. -
రౌడీలపై పిడికిలి
కర్నూలు: అసాంఘిక శక్తులు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో నేరాలు అధికంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో స్టేషన్ పరిధిలోని శరీన్ నగర్లో నివాసముండే కిరాయి హంతకులు (షీట్ నెం.1) వడ్డె రామాంజినేయులు అలియాస్ వడ్డె అంజి, సస్పెక్ట్ షీటర్ (నెం.216) పఠాన్ ఇమ్రాన్ ఖాన్లపై కలెక్టర్ జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడిన వీరిద్దరిపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదనల మేరకు క్రిమినల్ రికార్డులను పరిశీలించి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. వడ్డె రామాంజినేయులుపై 17కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. హత్యలు, దోపిడీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల మీద దాడులు, హత్యాయత్నం కేసులు, జులుం.. ఇలా పలు కేసులు ఉన్నాయి. అలాగే పఠాన్ ఇమ్రాన్ ఖాన్ కూడా 19 క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. పలుమార్లు వీరు జైలుకు వెళ్లినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో 2022లో వీరిద్దరినీ పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి కడప సెంట్రల్ జైలుకు పంపించారు. ఎన్ని కేసులు నమోదు చేసినా పరివర్తన చెందకపోగా పదేపదే నేరాల్లో పాల్గొంటున్నందున వీరిద్దరినీ జిల్లా బహిష్కరణకు గురిచేశారు. ఇకపై వారు జిల్లా పరిధిలో కనిపించకూడదు. ఒకవేళ కనిపించినా అరెస్టు చేసి జైలుకు పంపించే అధికారం పోలీసులకు ఉంటుంది. గతంలో కూడా నలుగురిపై పీడీ యాక్ట్... గతంలో కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నలుగురిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు కడప సెంట్రల్ జైలుకు పంపారు. కర్నూలు మాజీ ఎంపీపీ భర్త రామకృష్ణ యాదవ్, నకిలీ విత్తన వ్యాపారి మునిగొండ రత్నాకర్ రావు, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన గూడూరు సంజీవరాయుడు, పెద్దిరెడ్డి కొండారెడ్డి, నాసారి వెంకటేశ్వర్ల పూర్వపు నేర చరిత్రను పరిశీలించి, పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. మరికొందరిపై వేటుకు ప్రతిపాదనలు... జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారుగా 1,500 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. ఒక్క కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోనే అత్యధికంగా 460 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో కర్నూలు నగరంలోనే 220 మంది ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో శరీన్ నగర్కు చెందిన సంజన్నను అదే కాలనీలో నివాసముండే కిరాయి హంతకుడు వడ్డె అంజి, అతని కుమారులు కలసి హత్యకు పాల్పడిన నేపథ్యంలో పోలీసు అధికారులు కిరాయి హంతకులు, రౌడీ షీట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మరో ఐదుగురిపై పీడీ యాక్ట్ నమోదుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి జిల్లా బహిష్కరణ హెచ్చరిక లాంటిది. రౌడీల కార్యకలాపాలు, వారిపై ఉన్న కేసుల తీవ్రతను బట్టి బహిష్కరణ నిర్ణయం తీసుకుంటున్నాం. దీని ద్వారా మార్పు రాకపోతే పీడీ చట్టాన్ని కూడా ప్రయోగిస్తాం. స్టేషన్ల వారీగా రౌడీషీటర్లపై చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే నగర, జిల్లా బహిష్కరణలు, పీడీ యాక్టుల నమోదు. ఈ ప్రక్రియ నిర్విరామంగా ఉంటుంది. – ఎస్పీ విక్రాంత్ పాటిల్ వడ్డె రామాంజినేయులు, కిరాయి హంతకుడు (ఫైల్)పఠాన్ ఇమ్రాన్ ఖాన్, సస్పెక్ట్ షీటర్ (ఫైల్)సంవత్సరం పాటు నిర్బంధం... రెండు సంవత్సరాల వ్యవధిలో ఐదు కంటే ఎక్కువ నేరాల్లో పాల్గొంటే అతనిపై పీడీ చట్టం నమోదు చేసే అవకాశం ఉంది. సాధారణంగా మూడు కంటే అధికంగా నేరాలకు పాల్పడేవారిపై ఆటోమేటిక్గా అతనిపై షీటు తెరుస్తారు. ఐదు నేరాల కంటే అధికంగా చేస్తే కలెక్టర్ ఆదేశాలతో పీడీ చట్టం ప్రయోగిస్తారు. ఒకసారి ఈ చట్టం ప్రయోగిస్తే సంవత్సర కాలం పాటు అతనిని నిర్బంధిస్తారు. బాహ్య ప్రపంచానికి సంబంధం ఉండదు. కడప సెంట్రల్ జైలుకు తరలిస్తారు. ఎవరినీ కలిసేందుకు అనుమతి ఉండదు. బెయిల్ కావాలంటే హైకోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఎవరైనా ములాఖత్ కావాలంటే అనుమతి జైలర్కు ఉండదు. ప్రభుత్వ హోం ప్రిన్సిపాల్ సెక్రటరీ అనుమతి ఉండాల్సిందే. ఏడాది తర్వాత సత్ప్రవర్తన బాగోలేదని పోలీసు శాఖ నివేదిస్తే మరో సంవత్సరం పాటు నిర్బంధంలో ఉండాల్సిందే. రౌడీషీటర్లపై తీసుకునే అత్యంత కఠినమైన శిక్ష పీడీ యాక్ట్. ఇద్దరు రౌడీషీటర్లపై జిల్లా బహిష్కరణ వేటు కలెక్టర్ ఉత్తర్వులతో కడప సెంట్రల్ జైలుకు ఏడాది పాటు జైలులోనే నిర్బంధం మరికొందరిపై వేటుకు ప్రతిపాదనలు -
బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి వంద రోజుల జాతీయ ప్రచార కార్యక్రమం నిర్వహణపై బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించి వంద రోజుల జాతీయ ప్రచారంలో మూడు దశల్లో నిర్వహించనున్నారన్నారు. నవంబర్ 27 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 8వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. మొదటి దశ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలన్నారు. రెండో దశలో 2026 జనవరి 1 నుంచి మసీదులు, చర్చీలు, దేవాలయాల్లో సదస్సు లు నిర్వహించాలన్నారు. మూడో దశ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 8వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం కల్పించాలన్నారు. అడిషినల్ ఎస్పీ హుస్సేన్పీరా, ఐసీడీఎస్ పీడీ విజయ, డీటీసీ శాంతకుమారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు జుబేదా బేగం, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, సోషల్వెల్ఫేర్ డీడీ రాధిక, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రసూన పాల్గొన్నారు. మానవ హక్కులపై అవగాహన కర్నూలు: స్థానిక బి.క్యాంప్లో ఉన్న క్లస్టర్ యూనివర్సిటీలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలో పౌర, రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందంపై అవగాహన కల్పించడానికి 1948 నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది ‘మన హక్కులు – మన భవిష్యత్తు’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జడ్జి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద రెడ్డి, ప్రొఫెసర్లు యల్లా కృష్ణ, సబితా రెడ్డి, మల్రెడ్డి నాగార్జున పాల్గొన్నారు. చిన్నకొత్తిలిలో ‘డెంగీ’ భయం నందవరం: మండల పరిధిలోని చిన్నకొత్తిలి గ్రామంలో నాలుగు డెంగీ కేసులు నమోదైనట్లు పీహెచ్సీ డాక్టర్ శ్రీలేఖ తెలిపారు. బుధవారం గ్రామంలో వైద్యాధికారులు పర్యటించారు. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణకు చర్యలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అలాగే గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దోమల నివారణకు ఇంటింటికి తిరిగి హైప్రోద్రావణం పిచికారీ చేశామన్నారు. గ్రామంలో రెండు రోజుల పాటు మెడికల్ క్యాంపు నిర్వహిస్తునట్లు వివరించారు. కర్నూలు సిటీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో కర్నూలు నగరంలో 3 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆదోని, ఎమ్మిగనూ రు, హైదరాబాదులో ఐదు సెంటర్లు ఏర్పాటు చేశారు. 9.30 గంటలకు మొదలైన పరీక్షకు గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాల దగ్గరకు చేరుకోగా, అరగంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షలకు 665 మందికిగాను, 590 మంది హాజరై, 75 మంది గైర్హాజరయ్యారు. కర్నూలులో పరీక్ష కేంద్రాలను డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ తనిఖీ చేశారు. -
పది రోజులుగా నరక ‘వేతన’
● వ్యవసాయ శాఖకు చెందిన ఒక ఉద్యోగి కలెక్టరేట్లోని ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచీ నుంచి ఏడాది క్రితం పర్సనల్ లోన్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాబుగారు ఉన్నారు కదా... ఒకటో తేదీ లేదా ఐదో తేదీలోపు వేతనాలు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారనే ఉద్దేశంతో ప్రతి నెలా 5వ తేదీలోపు రూ.30 వేలు చెల్లించే విధంగా(ఈఎంఐ) ఏర్పాటు చేసుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం కొన్ని నెలలుగా ఉద్యోగులకు ఎప్పుడు వేతనాలు చెల్లిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. నవంబరు నెల వేతనం డిసెంబరు 10వ తేదీ వరకు బ్యాంకు ఖాతాకు జమ కాలేదు. .. ఈ పరిస్థితి ఒక్కరిది, ఇద్దరి కాదు... ఉమ్మడి కర్నూలు జిల్లాలో 30 వేల మంది వరకు ఉద్యోగులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ట్రెజరీ ద్వారా వేతనాలు పొందే ఉద్యోగులు కర్నూలు జిల్లాలో 25,985, నంద్యాల జిల్లాలో 20,282 ఉన్నారు. మొత్తం 46,287 మందికి డిపార్టుమెంటు వారీగా వేతనాలు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకే వేతనాలు జమ అయ్యాయి. ఇప్పటికీ దాదాపు 30 వేల మందికిపైగా వేతనాలు చెల్లించిన దాఖలాలు లేవు. నవంబరు నెల వేతనాలే కాదు... ఐదారు నెలలుగా ప్రతి నెలా జీతాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. హిందువులకు అతి దసరా పండగ అక్టోబరు 2వ తేదీ ఉన్నప్పటికీ వేతనాలు మాత్రం ఇవ్వలేదు. నోరుమెదపని ఉద్యోగ సంఘాల నేతలు ఉమ్మడి జిల్లాలో 18 శాఖలకు సంబందించిన ఉద్యోగులకు వేతనాలు లేకపోవడంతో ఆయా శాఖల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వ్యవసాయం, ఉద్యానశాఖ, పట్టుపరిశ్రమ శాఖ , నీటిపారుదల, రోడ్లు–భవనాలు, రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే, పరిశ్రమలు, సహకార శాఖ, రవాణా, సమాచార పౌరసంబంధాలు, ఐఎంఎస్–ఈఎస్ఐ, మైనింగ్, ఎన్సీసీ, ట్రైబల్ వెల్ఫేర్లకు చెందిన ఉద్యోగులు నవంబరు నెల వేతనాల కోసం ఎదరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి నెలా ఐదారు తేదీల్లోనే వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ అప్పట్లో ఉద్యోగ సంఘాల హైరానా అంతా ఇంతా కాదు. ఇపుడు పది రోజులు, ఆపైనే ఆలస్యమవుతున్నా... ఉద్యోగ సంఘాలు నోరుమెదపడం లేదు. వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నా ఏపీ ఎన్జీజీఎవోస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నెల 10 వతేదీ వరకు అందని జీతాలు చంద్రబాబు ప్రభుత్వంపై రగులుతున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో వేతనాలు పొందని ఉద్యోగులు 30 వేల మంది! -
ప్రజల నుంచి ఊహించని స్పందన
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి ఉహించని స్పందన వచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన సంతకాలను ఈనెల 15వ తేదీ విజయవాడ కేంద్ర కార్యాలయానికి పంపించే విధంగా చర్యలు చేపట్టాం. – ఎస్వీ మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ● -
సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఊడిపడ్డ పైకప్పు
ఎమ్మిగనూరురూరల్: ఒక ఫైల్ కోసం సబ్ ట్రెజరర్ రఘునందన్ బయటకు రాగానే బుధవారం ఎమ్మిగనూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలోని సబ్ ట్రెజర్ క్యాబిన్ పైకప్పు ఊడిపడింది. దీంతో ఉద్యోగులు, సిబ్బంది కేకలు వేస్తూ భయంతో బయటకు పరుగులు తీశారు. పెచ్చులు ఊడిపడ్డటప్పుడు సబ్ ట్రెజరర్ తన క్యాబిన్లో ఉంటే పెనుప్రమాదం సంభవించేంది. ఆయన మీద సిమెంట్ పెచ్చులు పడేవి. సబ్ ట్రెజరర్ రఘనందన్ మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నాటి కట్టడం అని, పాత భవనంలో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి పాత భవనానికి మరమ్మతులైనా చేయించాలి, లేదా కొత్త భవనమైన ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరుతున్నారు. -
నియోజకవర్గం సంతకాల సంఖ్య
ఆదోని 60,000 కోడుమూరు 60,000 పత్తికోండ 60,000 ఆలూరు 60,000 ఎమ్మిగనూరు 40,000 మంత్రాలయం 67, 500 కర్నూలు 62,000 (కొనసాగుతోంది)పత్తికొండలో జెండా ఊపుతున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి -
చాలా దారుణం
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా మొదటి వారంలో ఇంటి అద్దెలు, ఈఎంఐలు, ఇతర అనేక ఖర్చులు ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా రూ.12 వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. కొంతమంది రూ.30 నుంచి రూ.60 వేల వరకు ఈఎంఐలు చెల్లించాలి. ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు పడతాయనే ఉద్దేశంతో ఈఎంఐలు పెట్టుకున్నాం. వేతనాల చెల్లింపులో నెల నెలా జాప్యం పెరుగుతుండటం దారుణంగా ఉంది. నవంబరు నెల వేతనాలు డిసెంబరు 10 వతేదీ వరకు చెల్లించ లేదంటే ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదనే భావన కలుగుతోంది. – బి.చిన్నశంకర్నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ -
వేద విద్యతో ఆధ్యాత్మిక జ్ఞానం
వేద విద్యాలయంలో క్రమశిక్షణతో విద్యను అందిస్తున్నాం. ప్రతి రోజు తెల్లవారు జాము న 4.30 గంటలకు వేద విద్యార్థుల దినచర్య ప్రారంభమై రాత్రి 9.45 గంటలకు ముగుస్తుంది. ప్రతీది ప్రణాళికా బద్దంగా జరుగుతోంది. వేద విద్యతో ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతోంది, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలు ధ్యానం, స్వీయ పరిశీలన జరుగుతుంది. – హెచ్.కె. మనోహర్ రావు, సభ్యులు, అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం -
చిన్న చూపు చూస్తోంది!
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా.. 18 నెలల కాలంలో ఒక్కటి ఇచ్చింది. పీఆర్సీ లే దు. మధ్యంతర భృతిని పట్టించుకోవడం లేదు. పదవీ విమరణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వ డం లేదు. నాలుగు విడతల సరండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఇవ్వకపోయినా జీతాలైన సకాలంలో చెల్లిస్తుందా అంటే అది కూడా లేదు. ఇది ఉద్యోగులకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. దాదాపు 20 శాఖల ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు. బ్యాంకుల్లో పైన్లతో ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం జరిమానాలను భరించాల్సిందే. – రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు, ఏపీఎన్జీజీవోస్ అసోషియేషన్, కర్నూలు -
జాతీయ స్థాయి పోటీలకు కంబదహాల్ విద్యార్థులు
సి.బెళగల్: మండల పరిధిలోని కంబదహాల్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాఫ్ట్ బాల్ క్రీడలలో ప్రతిభ చాటడంతో జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం రవీంద్ర తెలిపారు. బుధవారం ఆయన వివరాలను తెలిపారు. పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అమ్యూల, అజయ్లు గుంటూరు జిల్లాలోని మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ – 19 సాఫ్ట్ బాల్ పోటీలలో జిల్లా జట్లలతో పాల్గొన్నారని తెలిపారు. క్రీడలలో ప్రతిభ చాటడంతో అమ్యూల, అజయ్ (స్టాండ్ బైగా) జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి నెల 3వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున మహారాష్ట్రలోని నాగాపూర్లో జరిగే జాతీయ స్థాయి అండర్ – 19 సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై హెచ్ఎం పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) శ్రీనివాసులు (బబ్లు)ను, విద్యార్థులను అభినందించారు. -
జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్
కర్నూలు : ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు స్టేషన్ల వారీగా పోలీసులు అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. నిషేధిత వస్తువులు, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలతో పాటు రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవర్లు విధిగా సీటు బెల్టు ధరించాలని అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ తదితర వాటిపై దృష్టి సారించి తనిఖీల్లో భాగంగా వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిప్పుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ప్రజల భద్రతకు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటుంటే స్థానిక పోలీసులకు కాని, డయల్ 112, 100కు కాని సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు. -
ఆదోని బంద్ సంపూర్ణం
ఆదోనిలో భీమాస్ సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ నాయకుల ఆందోళన స్కూటీ నడుపుతూ బంద్లో ర్యాలీగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆదోని టౌన్/రూరల్/అర్బన్/సెంట్రల్: ఆదోని జిల్లా కోసం అఖిలపక్ష, జాయింట్ యాక్షన్ కమిటీ, ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం బంద్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్రెడ్డి, ప్రకాష్జైన్, కాంగ్రెస్ పార్టీ ఆదోని ఇన్చార్జి దేవిశెట్టి ప్రకాష్, అగ్రి ఫర్టిలైజర్స్ సీడ్స్ అసోసియేషన్ నాయకులు అశోకానందరెడ్డి, బంగారం షాపుల అసోసియేషన్ నాయకులు మద్దతు తెలియజేశారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి భీమాస్ సర్కి ల్ వరకు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి బైకుపై ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి మద్దతు తెలిపారు. జగనన్న హామీ ఇచ్చారు రిలే దీక్షా శిబిరం వద్ద మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి మాట్లాడారు. ఆదోని జిల్లా అయితే అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య అందుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆదోని ప్రాంతానికి మెడికల్ కళాశాలను కేటాయించాలని అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డికి తెలియజేసిన వెంటనే మంజూరు చేశారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం పార్లమెంట్ స్థానాలనే జిల్లాగా ఏర్పాటు చేశారన్నారు. అప్పట్లో ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని జగనన్న హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబు అన్యాయం చేశారు చంద్రబాబు ప్రభుత్వంలో రంపచోడవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాలను చేశారని, వాటితో పాటు ఆదోని చేయకుండా అన్యాయం చేశారని సాయిప్రసాద్రెడ్డి అన్నారు. ఆదోని ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల ప్రజలకు ఆదోని ప్రాంతం అనుకూలంగా ఉంటుందన్నారు. ఆదోని జిల్లాను సాధించుకునేందుకు తాము ముందుంటామన్నారు. అందరూ కలిసి మద్దతు తెలుపుతుండడం సంతోషంగా ఉందన్నారు. ఐదు నియోజకవర్గాల్లో ఆందోళనలు ఆదోని బంద్కు మద్దతుగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో ప్రజలు ఆందోళనలు చేశారు. ఆదోని జిల్లా తప్పకుండా చేయాల్సిందేనని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని జిల్లా అయితే పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. మార్కెట్యార్డులో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. సాగు, తాగునీరు వస్తాయన్నారు. పోలీసుల అత్యుత్సాహం ఆదోని పట్టణంలో బుధవారం నిర్వహించిన బంద్ విజయవంతమయ్యింది. ఉదయం 5 గంటల నుంచి సాధన కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసన గళం విప్పారు. ఆర్టీసీ డిపో దగ్గర బస్సులు వెళ్లకుండా ప్రగతిశీల మహిళా నాయకురాలు సుజ్ఞానమ్మ, బీఎస్ఎఫ్ నాయకులు ఉదయ్, సీఐటీయూ నాయకులు వీరేష్, ఇతర పార్టీల నాయకులతో కలిసి బస్సులను అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న టూటౌన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంద్లో పాల్గొన్న వారిని పక్కకు లాగేశారు. దీంతో ప్రజలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు బంద్లో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఆయా పాఠశాల లు, కళాశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కోసం కదంతొక్కిన ప్రజలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బైక్ ప్రదర్శన మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ -
చోరీ కేసుల్లో ముగ్గురు అరెస్ట్
మహానంది: ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రైతుల పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్ల వద్ద ఏర్పాటు చేసిన అల్యూమినియం తీగల చోరీ ఘటనలో మహానంది మండలానికి చెందిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీసులు రైతుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టడంతో చోరీకి పాల్పడిన వారిని గుర్తించారు. మార్కాపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అల్యూమినియం తీగల చోరీ ఘటనలో గిద్దలూరు పోలీస్స్టేషన్ పరిధిలో మూడు, పెద్దారవీడు, కంభం పోలీస్స్టేషన్ల పరిధిలో మరో నాలుగు కలిసి మొత్తం ఏడు కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. గత మూడు నెలల నుంచి చోరీలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని ఆంజనేయకొట్టాల గ్రామానికి చెందిన ఆంజనేయులు, శ్రీనివాసులు, దావీదులను అరెస్ట్ చేశామన్నారు. వీరు గతంలో వెదుర్లు సేకరించి జీవనోపాధి పొందేవారని, చిన్న చిన్న చోరీలకు అలవాటు పడ్డారని మార్కాపురం పోలీసులు చెప్పారు. వారి నుంచి ఓ ఆటోను సీజ్ చేయడంతో పాటు రూ. 3.85లక్షల విలువైన 15,100 మీటర్ల పొడవున్న 11కేవీ అల్యూమినియం కరెంటు వైరు, 45 కిలోల బరువున్న కాపర్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల మహానంది, శిరివెళ్ల మండలాల పరిధిలోనూ మోటార్ వైర్ల చోరీలు తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉరివేసుకొని లారీ డ్రైవర్ మృతి బేతంచెర్ల: హెచ్ కొట్టాల గ్రామంలో లారీ డ్రైవర్ చల్లా తిరుమలేష్ (31) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చల్లా తిరుమలేష్ భార్య మంజుల కాన్పు కోసం పుట్టినిల్లు బేతంచెర్లకు వెళ్లింది. తల్లి కృష్ణవేణమ్మ రెండేళ్ల క్రితం, అన్న గంగాధర్ మూడేళ్ల క్రితం మృతి చెందడంతో మన స్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న తిరుమలేష్ మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బేతంచెర్ల సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య మంజులతో పాటు ఒక కుమార్తె, కొడుకు ఉన్నారు. మృతుడి తండ్రి వెంకట్రాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు శెట్టి బుధవారం తెలిపారు. -
చలించని పట్టుదల
వారి లక్ష్యం ముందు గజగజ వణికించే చలి సైతం చిన్నబోయింది. వారి పట్టుదలను చూసి మంచు కరిగిపోయింది. వారి కష్టాన్ని మబ్బుల చాటు నుంచి చూసిన భానుడు నులివెచ్చిని కిరణాలు ప్రసరించి శభాష్ అంటూ ప్రోత్సహించాడు. జిల్లాలో రోజురోజకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం 8 గంటలైనా జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని జిల్లా పరిషత్ పాఠశాల పదో తరగతి విద్యార్థులు రోజూ ఉదయాన్నే పాఠశాల ప్రాంగణంలో చలిని లెక్కచేయకుండాస్టడీ అవర్లో చదువుకుంటున్నారు. – మహానంది -
జగనన్న కాలనీలో విద్యుత్ మీటర్లు తీసుకెళ్లారు!
మద్దికెర : మండల పరిధిలోని ఎడవలి గ్రామంలోని జగనన్న కాలనీలో ఉన్న 15 మందికి చెందిన విద్యుత్ మీటర్లను తీసుకెళ్లారని ఇంటి యజమానులు బుధవారం విలేకరులకు తెలిపారు. కాలనీలో 40 ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. ఇళ్లన్నింటికీ విద్యుత్ అధికారులు మీటర్లు బిగించి వెళ్లారన్నారు. అయితే రెండు రోజు లు క్రితం 15 మందికి చెందిన వారి విద్యుత్ మీటర్లు తీసుకెళ్లారన్నారు. ఈవిషయాన్ని విద్యుత్ శాఖ ఏఈ రఫీ దృష్టికి తీసుకెళ్లగా మీటర్లు బిగించినపుడు ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధార్కార్డులు ఇవ్వలేదని దీంతో వీరిపేర్లు ఆన్లైన్లో నమోదు కాలేదన్నారు. అంతేగాక పలుమార్లు తెలిపినా పట్టించుకోక పోవడంతో మీటర్లు తీసుకొచ్చారన్నారు. ఇంటి యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం చెల్లిస్తే వెంటనే మీటర్లు బిగిస్తామన్నారు. -
వేద పరిమళాలు.. జీవన కిరణాలు !
కర్నూలు కల్చరల్: అఖిలమైన ధర్మాలకు మూలం వేదాలే. ‘వేదోఖిలో ధర్మ మూలం’ అను వాక్యంతో ఇది స్పష్టమవుతోంది. అలాగే సకల పురుషార్థాలకు మూల భూతాలు వేదాలేనని రుగ్వేద ప్రాతిశాఖ్య మనకు తెలియజేస్తుంది. ఇటువంటి మహత్తరమైన వేదాలను సంరక్షించుటకు గత ఐదు సంవత్సరాలుగా శ్రీ కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం ఎంతో కృషి చేస్తోంది. అఖిల భారతీ య బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో కర్నూలు ఓల్డ్సిటీలోని శంకర మందిరంలో 2021 ఆగస్టు 13వ తేదీన ఈ వేద విద్యాలయాన్ని ప్రారంభించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే చతు ర్వేదాలతో (రుగ్వేదం, యజర్వేదం, సామవేదం, అధర్వణ వేదం)పాటు రుగ్వేద, యజర ్వేద స్మార్థ విద్యలను అందిస్తోంది. వేద పాఠశాల కరస్పాండెంట్ కె.చిదంబరం, అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం డాక్టర్ ఎన్. వేణుగోపాల్, సభ్యులు హెచ్.కె. మనోహర్ వేద పాఠశాల నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేస్తున్నారు. నాలుగు వేదాలు నేర్పడం ప్రత్యేకం.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ వేద విద్యాలయం తరువాత నాలుగు వేదాలను నేర్పుతున్న ఏకై క విద్యాలయం కర్నూలు శ్రీ కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం. ఇక్కడ వేద విద్య, వసతి, భోజనం సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నారు. దీంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక వేద విద్యను అభ్యసిస్తున్నారు. సుమారు 75 మంది ప్రస్తుతం వేద అధ్యయనం చేస్తున్నారు. రుగ్వేదం (శాఖల శాఖ)ను 16 మంది అభ్యసిస్తుండగా కరణం శ్రీదత్త శర్మ బోధిస్తున్నారు. రుగ్వేద స్మార్థంను ఐదుగురు అభ్యసిస్తుండగా మేడవరం శ్రీ ప్రణవ శర్మ బోధిస్తున్నారు. కృష్ణ యజుర్వేదం (తైత్తిరీయ శాఖ)ను 17 మంది అభ్యసిస్తుండగా కళ్లే ప్రతాపశర్మ ఈ వేదంను బోధిస్తున్నారు. కృష్ణ యజుర్వేద స్మార్థంను 14 మంది నేర్చుకుంటుండగా, పాలపర్తి శివరామ శర్మ బోఽధిస్తున్నారు. సామవేదం (రాణాయనీయ శాఖ)ను 10 మంది అభ్యసిస్తుండగా, శుభం భగవత్కర శర్మ ఈ వేదాన్ని బోధిస్తున్నారు. అధర్వణ వేదం (శౌనక శాఖ)ను 14 మంది మంది నేర్చుకుంటుండగా కాశీభట్ల పవన శర్మ బోధిస్తున్నారు. -
వరి తినకుంటే.. గడ్డి తింటారా బాబూ!
● సీఎం చంద్రబాబుపై ఏపీ రైతు సంఘం నాయకులు ధ్వజం కర్నూలు(సెంట్రల్): వరి పంటకు మద్దతు ధర ఇవ్వలేక..వరి తింటే రోగాలు వస్తాయని చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది దారుణమైన విషయమని, వరి తినకుంటే గడ్డి తింటారా అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం, సీసీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పంటలకు మద్దతు ధర కోసం నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసనలో సీపీఐ, ఏపీ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలోమహేష్, శ్రీనివాసరావు, బీసన్న, నాగరాజు, నల్లన్న పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూముల కబ్జా!
పత్తికొండ రూరల్: ప్రభుత్వ భూములపై టీడీపీ నాయకులు గద్దల్లా వాలిపోతున్నాయి. రూ. కోట్ల విలువైన భూముల్లో పాగా వేస్తున్నారు. పత్తికొండ మండలం మండగిరి గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 616–2లో 90 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఈ భూమిని గతంలో ప్రభుత్వ భవన నిర్మాణాలకు కేటాయించారు. అయితే ప్రభుత్వ భవన నిర్మాణాలకు కేటాయింపు జరగకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకులు పత్తికొండ–చిన్నహుల్తి రోడ్డులో ప్రధాన రోడ్డుపక్కనే ఉన్న ఈ భూమిని ఆక్రమించారు. కొన్ని రోజుల నుంచి పునాది తవ్వకాలు చేపట్టి, బండలు పాతే పనులు సాగిస్తున్నారు. 306–3, 306–4 ప్రభుత్వ భూముల్లో ఎవరికి ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు. కానీ గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దారుతో మాన్యువల్గా పట్టాలు పొందిన వారు స్థలం చదును పనులు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దర్జాగా పునాది తవ్వకాలు కోట్ల విలువైన భూముల కబ్జాకు రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తున్నట్లు తెలుస్తోంది. వారి సహకారంతోనే స్థలం కొలతలు వేసి మరీ రాళ్లు పాతేశారు. అంతటితో ఆగకుండా ప్రైవేటు వెంచర్లా మార్చి దర్జాగా రాళ్లకు రంగులేసి ప్రభుత్వ భూముల్లో పాగా వేశారు. అక్రమంగా బండలు నాటి స్థలం హద్దులు ఏర్పరచుకున్నారు. పట్టపగలే ఆక్రమిత ప్రదేశాల్లో పనులు జరుగుతున్నా అధికారుల్లో చలనం మాత్రం కరువైంది. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి కోట్ల విలువైన ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
తెల్ల పొట్టేలు.. ధర తెలిస్తే షాక్ అవుతారు..!
కర్నూలు జిల్లా: కోసిగి సంతమార్కెట్లో మంగళవారం గొర్రెలు, పొట్టేళ్ల క్రయ, విక్రయాలు భారీగా జరిగాయి. మండలంలోని అగసనూరు, దుద్ది, కొల్మాన్పేట, అగసనూరు, మూగలదొడ్డి, కందుకూరు గ్రామాలతో పాటు కౌతాళం మండలంలోని గోతుల దొడ్డిలతో పలు గ్రామాలు, ఆదోని మండలంలోని గణేకల్లు గ్రామాల్లో ఈనెలలోనే దేవర్లు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు దేవర్లకు పొట్టేళ్లను కొనుగోలు చేసేందుకు కోసిగి సంతకు చేరుకోవడంతో కిటకిటలాడింది. ఈ క్రమంలో పొట్టేళ్ల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి అమ్మకానికి పొటేళ్లను తెచ్చారు. దాదాపు 2 వేల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 800 – 900 వరకు ప్రజలు కొనుగోళ్లు చేశారు. మిగతా పొటేళ్లను వ్యాపారులు బుధ, గురువారాల్లో సమీప ప్రాంతాల్లో జరిగే సంతకు తరలించనున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తెచ్చిన పోటీ పొట్టేలు ధర రూ.45వేలు పైగా పలికాయి. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
పగిడ్యాల: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఉమ్మడి కర్నూలు జిల్లా ఖోఖో అసోషియేషన్ చైర్మన్ పుల్యాల నాగిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లాపరిషత్ క్రీడా మైదానంలో ఖోఖో జిల్లా స్థాయి క్రీడా జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జోనల్ స్థాయి క్రీడాపోటీలు నిర్వహించడం లేదని భవిష్యత్ లో ఎంఈఓలు ఈ క్రీడాపోటీల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా స్థాయి జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పోటీల్లో సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు సుభాన్, మురళీమోహన్రెడ్డి, ఖోఖో అసోషియేషన్ రాష్ట వైస్ చైర్మన్ ప్రభాకర్, నంద్యాల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల అసోషియేషన్ అధ్యక్షులు రవికుమార్, జిల్లా అసోషియేషన్ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, సర్పంచ్లు పెరుమాళ్ల శేషన్న, జయపాల్, ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
పద్మవ్యూహాన్ని ఛేదించేదెవరు?
● మహాభారతంలో కౌరవులు పన్నిన పద్మవ్యూహం గురించి అందరికీ తెలిసిందే. అంత్యంత దుర్బేధ్యమైన వ్యూహంలో లోపలికి వెళ్లే కొద్ది తిరిగి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఇందంతా ఎందుకంటారా.. గ్రామ రచ్చ కట్ట బండపై ప్రజలు సరదాగా బారకట్ట, పులి జూదం, చెర్పర్.. తదితర ఆటలు ఆడుతూ కనిపిస్తారు. కలుగొట్ల గ్రామ రచ్చకట్ట బండపై చెక్కిన పద్మవ్యూహాన్ని పూర్తి చేయాలంటే ఎంతో మేధస్సు ఉండాలి. ఈ పద్మవ్యూహం లోనికి వెళ్లాలంటే ముందు ప్రారంభం గుర్తించాలి. వేలి ద్వారా ప్రారంభిస్తే మధ్యలో వెనుదిరగాల్సిందే. ఓ బలపం లాంటిది తీసుకుని ఆట ప్రారంభించాలి. లోపలికి వెళ్లేందుకు ఏడు దారులున్నాయి. ఎటు నుంచి వెళ్తే గమ్యం చేరుకుంటామో తెలియని పరిస్థితి. 1996లో సి. బెళగల్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గ్రామంలో ఉంటూ అందరికీ సుపరితుడయ్యాడు. అతడు ఈ వ్యూహాన్ని ఈ రచ్చకట్టపై కొండ బలపంతో గీయగా గ్రామస్తుడైన కేశవయ్య చెక్కినట్లు ప్రజలు చెబుతున్నారు. చిక్కుముడి పక్కనే చెక్కిన తేదీ కూడా ఉంది. ఈ రచ్చకట్టపై కూర్చున్న వారు ఎవరైనా ఈ పద్మవ్యూహాన్ని చూస్తే ఆసక్తిగా ఒకసారైనా ప్రయత్నం చేయక మానరు. – వెల్దుర్తి -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వెలుగోడు: బోయరేవుల గ్రామ సమీపంలో గాలేరు వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. వాగులో సుమారు 50–55 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం నీటిలో తెలియాడుతూ కనిపించించడంతో మోత్కూరు గ్రామ వీఆర్వో షేక్ మహబూబ్ బాషా వెలుగోడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీసి పంచనామా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. కుక్కల దాడిలో ఐదు పొట్టేళ్లు మృతి శిరివెళ్ల: యర్రగుంట్లలో మంగళవారం కుక్కల దాడిలో ఐదు పొట్టేళ్లు మృతి చెందాయి. మరో రెంటింటికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లమ్మపేటకు చెందిన గొర్రెల యజమాని మందపై కుక్కలు ముక్కుమ్మడి దాడి చేశాయి. ఈ దాడి వలన యజమానికి రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. గాయపడిన వాటికి పశు వైద్యాధికారి దస్తగిరి చికిత్స చేశారు. గ్రామంలో కుక్కల సంచారం అధికమయ్యాయని నిరోధించాలని పంచాయతీ అధికారులను గ్రామస్తులు కోరారు. సహకార సంఘాల ఉద్యోగుల పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచాలి కర్నూలు(సెంట్రల్): వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం డిమాండ్ చేశారు. మంగళవారం సీఆర్భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యూటీ సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతోపాటు ఆరోగ్య బీమా కింద రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. అంతేకాక ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని చేయించాలన్నారు. జీఓ నంబర్ 36 ప్రకారం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగులర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, కల్లూరు మండల రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణానాయక్, బి.రాముడు పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం డోన్ టౌన్: పట్టణ సమీపంలోని యు.కొత్తపల్లె గ్రామం బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి మతిస్థిమితం లేని ఒక వ్యక్తి రోడ్డుపై తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. కింద పడిన వ్యక్తిపై మరికొన్ని వాహనాలు వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. -
పిల్లలకు ఉచిత న్యాయ సహాయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి కర్నూలు: బలహీనవర్గాల పిల్లలకు ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం స్నేహపూర్వక పథకం–2024 ఏర్పాటైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జి.కబర్ధి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు, ముఖ్యంగా అణగారిన బలహీన వర్గాల పిల్లలు, దివ్యాంగ పిల్లలు స్నేహపూర్వక పథకంతో లబ్ధి పొందుతారన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100, పిల్లల హెల్ప్లైన్ నెంబర్ 1098 గురించి కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి వివరించారు. పిల్లలకు గుడ్టచ్, బ్యాడ్టచ్పై డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్, డీఈఓ శామ్యూల్పాల్, కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ సాంబ శివరావు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ హుసేన్ బాషా, లీగల్ సర్వీసెస్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, సంజీవయ్య మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ విజయనిర్మల, ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ హైస్కూల్ హెడ్మాస్టర్ హుసేన్, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. -
టీడీపీకి ఎదురు దెబ్బ
● పార్టీని వీడిన సీనియర్ నాయకులు ● వైఎస్సార్సీపీలోకి చేరిన 150 కుంటుబాలు సి.బెళగల్: అధికార టీడీపీ పార్టీకి సి.బెళగల్ మండలంలో గట్టి ఎదురు దెబ్బ తలిగింది. మంగళవారం మండల పరిధిలోని కంబదహల్ గ్రామానికి చెందిన దాదాపు 150 కుటుంబాల సభ్యులు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వారిని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్లు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాము ఏళ్ల తరబడి టీడీపీని నమ్ముకుని ఉన్నామని, చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు ఏమీ జరగడం లేదని, అధికార పార్టీలో ఉండలేక వైఎస్సార్సీపీలో చేరామని గ్రామానికి చెందిన బోయ లోటి సోమన్న, కొత్తపల్లి వీరేష్, చాకలి మద్దిలేటి, నాగేష్, చాకలి రాజు, దేవసహాయం తదితరులు తెలిపారు. అండగా ఉంటాం.. ప్రజలకు, వైఎస్సార్సీపీలో నాయకులకు, కార్యకర్తలకు, తాము అండగా ఉంటామని కోట్ల హర్షవర్ధన్రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ తెలిపారు. ప్రజా వ్యతిరేక పాలనను మాకు వద్దు అని ప్రజలు బహిరంగా అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సోమశేఖర్రెడ్డి, నాయకులు కరుణాకర్రెడ్డి, రామాంజనేయులు, సోమశేఖర్, రాజు, దేవరాజు, ఏలియా, సాంసూన్, ఏసేపు తదితరులు పాల్గొన్నారు. -
● పొట్టేళ్ల సంత కిటకిట
కోసిగి సంతమార్కెట్లో మంగళవారం గొర్రెలు, పొట్టేళ్ల క్రయ, విక్రయాలు భారీగా జరిగాయి. మండలంలోని అగసనూరు, దుద్ది, కొల్మాన్పేట, అగసనూరు, మూగలదొడ్డి, కందుకూరు గ్రామాలతో పాటు కౌతాళం మండలంలోని గోతుల దొడ్డిలతో పలు గ్రామాలు, ఆదోని మండలంలోని గణేకల్లు గ్రామాల్లో ఈనెలలోనే దేవర్లు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు దేవర్లకు పొట్టేళ్లను కొనుగోలు చేసేందుకు కోసిగి సంతకు చేరుకోవడంతో కిటకిటలాడింది. ఈ క్రమంలో పొట్టేళ్ల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి అమ్మకానికి పొటేళ్లను తెచ్చారు. దాదాపు 2 వేల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 800 – 900 వరకు ప్రజలు కొనుగోళ్లు చేశారు. మిగతా పొటేళ్లను వ్యాపారులు బుధ, గురువారాల్లో సమీప ప్రాంతాల్లో జరిగే సంతకు తరలించనున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తెచ్చిన పోటీ పొట్టేలు ధర రూ.45వేలు పైగా పలికాయి. – కోసిగి -
చెలగాటమా?
యువత భవిష్యత్తోకల్లూరు: ‘టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఇప్పటి వరకు నిరుద్యోగభృతి అందలేదు. పరిశ్రమ లు ఏర్పాటు చేయలేదు. ఉద్యోగాలు రాలేదు. మోసపూరిత హామీలతో చంద్రబాబు ప్రభుత్వం యువత భవిష్యత్తో చెలగాటమాడుతుంది’ అంటూ వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. కూటమి ఇచ్చిన వాగ్దానాలు – చేస్తున్న మోసాలపై పార్టీ యువ నాయకుడు కాట సాని శివ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ‘యువత మేలుకో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాటసాని రాంభూపాల్రెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో సచివాలయ వ్యవస్థను అమలు చేసి సుమారుగా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి వలంటీర్లుగా ఉపాధి అవకాశం కల్పించి గౌరవవేతనం అందించామన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చివరి ఏడాది పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కళాశాలల్లో సర్టిఫికెట్లు తెచ్చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేణుక, రాయలసీమ జోనల్ మహిళా విభాగం అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, మాజీ జెట్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, నాయకులు మీదివేముల ప్రభాకర్రెడ్డి, ఏ హనుమంతురెడ్డి, బెల్లం మహేశ్వరరెడ్డి, పాణ్యం నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీగా హాజరైన వైస్సార్సీపీ వివిధ విభాగాల నాయకులు, యువకులు -
డీఈఓగా ఎల్. సుధాకర్
కర్నూలు సిటీ: జిల్లా విద్యా శాఖ అధికారిగా ఎల్.సుధాకర్ను నియమిస్తూ మంగళవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సె క్రటరీ కోనా శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జూలై నెలలో డీఈఓగా పనిచేస్తున్న కె.శామ్యూల్ పాఠశాల విద్య ఆర్జేడీగా వెళ్లారు. దీంతో డీఈఓ ఆఫీస్ లో ఏడీగా పనిచేస్తున్న ఎస్.శామ్యూల్పాల్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. గతేడాది అక్టోబరు 25న ఏడీ వేతనంతోనే డీఈఓగా నియమించారు. ప్రస్తుతం డీఈఓగా ఎల్.సుధాకర్ను నియమించారు. విశాఖపట్టణానికి చెందిన ఈయన త్వరలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. -
● అంతర్జిల్లా బైకుల దొంగ అరెస్టు ● సీసీ ఫుటేజీ ద్వారా ఛేదించిన పోలీసులు ● 42 బైకులు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన కర్నూలు డీఎస్పీ
కన్నేసి.. బైకులు కాజేసి! కర్నూలు: అతను ఇంటర్ వరకు చదువుకున్నాడు. అతనితో పాటు చదువుకున్న వారంతా ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అయితే అతను అడ్డదారులు తొక్కుతూ బైకుల దొంగగా మారి జైలు పాలయ్యాడు. అనంతపురం జిల్లా రుద్రంపేట గ్రామం (కక్కలపల్లె) చంద్రబాబు నగర్లో నివాసముంటున్న పోతుల జాన్ కర్నూలులోని వివిధ ప్రాంతాల్లో బైకులు చోరీ చేసి పక్కా ఆధారాలతో మూడో పట్టణ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. చదువు మధ్యలో ఆగిపోయి జీవనోపాధి కోసం కొత్తగా నిర్మాణమైన ఇళ్లల్లో ఇంటీరియర్ వర్క్ చేస్తూ జీవనం సాగించేవాడు. దానిపై వచ్చే ఆదాయం సరిపోక సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని అన్వేషించాడు. ద్విచక్ర వాహనాల చోరీని ఎంచుకున్నాడు. కర్నూలు నగరంలో ప్రభుత్వాసుపత్రి, గాయత్రి ఎస్టేట్, జగదీష్ మాల్, సి.క్యాంప్ రైతుబజార్ తదితర రద్దీ ప్రాంతాల్లో భారీగా ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. ఏడాదిన్నర కాలంగా సాగుతున్న అతని చోరీల పర్వానికి మూడు పట్టణ పోలీసులు చెక్ పెట్టారు. పక్కా ఆధారాలతో నిఘా పెట్టి అతని నుంచి రూ.35 లక్షలు విలువ చేసే 42 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. మూడో పట్టణ సీఐ శేషయ్య, ఎస్ఐ ఆశాలతతో కలసి కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ స్థానిక స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వెలుగు చూసిందిలా... ప్రభుత్వాసుపత్రిలో ద్విచక్ర వాహన చోరీలు అధికమయ్యాయని పోలీసుల దృష్టికి వచ్చింది. ఇదే క్రమంలో నవంబర్ 29వ తేదీన కుమ్మరి కృష్ణవేణి అనే మహిళ తన మనవడితో ప్రభుత్వాసుపత్రిలోని గైనిక్ వార్డు వద్దకు వచ్చి మోటర్ సైకిల్ పార్కుచేసి లోపలికి వెళ్లి వచ్చేసరికి వాహనం కనిపించలేదు. ఈ మేరకు ఆమె మూడో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు నిఘా పెంచారు. చోరీ జరిగిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను సేకరించి దొంగ కోసం గాలిస్తుండగా ఇదే సమయంలో ఓ ఫిర్యాదుదారుని సెల్ఫోన్కు అనంతపురం జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనల మెసేజ్ వచ్చింది. దాని ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నంద్యాల చెక్పోస్టు సమీపంలోని అరుంధతి నగర్లో గల టైల్స్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న కంప చెట్లలో నిందితుడు ఉన్నట్లు గుర్తించి వలపన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతని నేరాల చిట్టా బయటపడింది. అతని వద్ద నుంచి రూ.35 లక్షలు విలువ చేసే 42 మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. చోరీ చేసిన బైకులను గుర్తు పట్టకుండా ఉండేందుకు గాను నంబర్ ప్లేట్లు, ఇంజన్ నంబర్లు మార్చి తక్కువ ధరలకే విక్రయించినట్లు విచారణలో బయటపడింది. అనంతపురం రూరల్ గ్రామాల్లో కొన్నింటిని రూ.20 నుంచి రూ.25 వేల వరకు తాకట్టు కూడా పెట్టినట్లు గుర్తించారు. డోన్, గుత్తి ప్రాంతాల్లో కూడా ఇతను బైకులు చోరీ చేసినట్లు విచారణలో అంగీకరించాడు. తెలంగాణ రాష్ట్రం వరంగల్కు చెందిన శంకర్ కర్నూలు మెడికల్ కళాశాలలో వైద్య విద్య పీజీ చదువుతున్నాడు. అతని బైకును కూడా చోరీ చేసినట్లు విచారణలో బయటపడింది. రద్దీ ప్రాంతాలను ఎంచుకుని రద్దీ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తాడు. వాహనాలు ఆపి ఆసుపత్రులు, వ్యాపార సముదాయాల్లోకి ఎవరైనా వెళ్లగానే పని కానిచ్చేస్తాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న మారుతాళంతో చోరీ చేస్తాడు. ఎంచక్కా వాహనంపైనే డోన్ మీదుగా స్వగ్రామం రుద్రంపేటకు చేరుకుని విక్రయించి లేదా తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటాడు. -
రహదారుల మధ్యలో ‘దిమ్మె’
బొమ్మలసత్రం: కలెక్టరేట్కు రెండు కిలోమీటర్ల దూరం...ఎస్పీ కార్యాలయానికి 3.5 కిలోమీటర్ల దూరం.. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుటి ప్రాంతం.. మూడు రహదారుల మధ్య లో వారం రోజులుగా దాదాపు 8 అడుగల చుట్టుకొలతతో 10 అడుగుల దిమ్మె నిర్మాణం జరుగుతోంది. ప్రతి రోజు స్థానిక నేతలు, ఉన్నతాధికారులు ఆ దిమ్మెను దాటి వెళ్తుంటారు. ఎవరికీ ఎందుకు దిమ్మెను నిర్మిస్తున్నారన్న ప్రశ్నరాలేదు. మారుమూల ప్రాంతాల్లో చిన్న ఇంటి నిర్మాణం చేపడితే అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించే మున్సిపల్ అధికారులకు ఈ విషయం తెలవకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. అధికారపార్టీ నాయకులు అని వదిలేశారో తెలియదు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం 2013లో జీవో ఎమ్ ఎస్ నంబర్ 18 ప్రకారం ప్రజా రోడ్లు, కాలిబాటలలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతిలేదు. అయితే ఈ ఆదేశాలను పక్కనపెట్టి విగ్రహ ఏర్పాటుచేస్తుండటంపై సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు ఇప్పటికై నా కళ్లు తెరిచి దిమ్మెను తొలగించాలని కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నాయకులు దిమ్మె ఏర్పాటు చేస్తున్నారని ఆర్డీవో విశ్వనాథ్కు వామపక్ష నాయకులు ఫిర్యాదు చేశారు. ఇది ఎన్హెచ్ఏ అధికారుల పరిధిలోకి వస్తుందని, అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. -
వలసలే దిక్కు
కర్నూలు (టౌన్): చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయ రంగం దివాలా తీసిందని, రైతాంగాన్ని అదుకోవాలన్న డిమాండ్తో జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఉద్యమం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో పార్టీ అధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాతలు ఎప్పుడూ లేని కష్టాలు చూస్తున్నారన్నారు. ఉల్లి రైతులు ధర్నాలు చేసినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు, పొగాకు రైతుల వద్దకు వచ్చేంత వరకు సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఉల్లికి అరకొరగా రూ.1,200 మద్దతు ధర ప్రకటించి రైతుల వద్ద 10 శాతం కూడా కొనలేదన్నారు. పత్తి, టమాట, అరటి ఇలా అన్ని పంటలకు గిట్టుబాటు ధరల్లేక, ప్రభుత్వం నుంచి మద్దతు ధరల్లేక రైతులు అప్పులపాలయ్యారన్నారు. ఎకరాకు రూ. లక్ష ఖర్చు చేసి ఉల్లిపంటను పండిస్తే చంద్రబాబు ప్రభుత్వం హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించి ఎంత మందికి ఇచ్చిందని ప్రశ్నించారు. అరటి ధరలు దారుణంగా పడిపోయాయని, రైతుల వద్ద కిలో రూపాయి, రూపాయిన్నర్రకు కొనుగోలు చేస్తున్నారని, హెరిటేజ్లో మాత్రం ఒక్క అరటి పండు రూ.3 ప్రకారం అమ్ముతున్నారని ఎస్వీ అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రూ. 7,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీకి రూ. 3,862 కోట్లు, రైతుభరోసా కింద రూ.34,268 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పత్తి అధిక ధరలకు అమ్ముడుపోతే ఇప్పుడు రూ. 6 వేల నుంచి రూ. 7 వేలు మాత్రమే ఉందన్నారు. తేమ పేరుతో పత్తి రైతులను దగా చేస్తున్నారన్నారు. జగనన్న హయాంలో యూరియా కోసం రోడ్డెక్కిన చరిత్ర ఎక్కడైన ఉందా.. అని ప్రశ్నించారు. ఆర్బీకేల ద్వారా రైతుకు గత ప్రభుత్వం అండగా ఉంటే నేటి ప్రభుత్వంలో రైతులు బిచ్చగాళ్ల పరిస్థితికి రావడం చాలా బాధాకరమన్నారు. ప్రతి ఏడాది అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చి రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఎస్వీ విమర్శించారు. ఇప్పటి వరకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. రైతన్న మీ కోసం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారని దాని పేరును ‘ రైతన్నకు మోసం’ అని మార్చితే బాగుంటుందేమో అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు పోలీసులు లేకుండా గ్రామాల్లో తిరగాలన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రైతులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు. రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉన్నా ప్రశ్నిస్తా అని చెప్పుకునే పవన్కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వానికి తొత్తుగా మారారన్నారు. రబీ సీజన్ నుంచి అయినా ఉచిత పంటల బీమా అమలు చేయాలన్నారు. సమావేశంలో పార్టీ నేతలు షరీఫ్, నరసింహులు యాదవ్, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి,కిషన్, రాజశేఖర్ పాల్గొన్నారు. చాలా బాధాకరం రైతన్నకు మోసం! -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
మంత్రాలయం రూరల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఐదుశాతం పెరిగాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంత్రాలయం పోలీసు స్టేషన్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ప్రముఖ పుణ్యకేత్రంలో వాహనాల రద్దీ లేకుండా, భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. బాధితులు పోలీసుస్టేషన్ను ఆశ్రయించిన వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డీఎస్పీ భార్గవి , సీఐ రామాంజులు పాల్గొన్నారు. -
మార్కెట్లో నకిలీ మందులను అరికట్టండి
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో నకిలీ మందులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. స్థానిక ప్రాంతీయ కంటి ఆసుపత్రి సమీపంలో నూతనంగా రూ.2.78 కోట్ల వ్యయంతో నిర్మాణం చేసిన డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్, రీజనల్ లేబరేటరీ భవనాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఔషధ దుకాణ యజమానులతో కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి మాట్లాడుతూ ఔషధ దుకాణాలలో నకిలీ మందులను, కాలం చెల్లిన మందులను విక్రయించరాదన్నారు. ప్రజలు యాంటిబయాటిక్స్ను అధిక మోతాదులో, వారి ఇష్టానుసారం దుకాణాల నుంచి కొని, వీటిని అధిక మోతాదులో వాడటం వల్ల రోగనిరోధక శక్తి క్షీణించి, ఇతర రోగాల బారిన పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేనిదే వాటిని విక్రయించరాదని దుకాణ యజమానులను కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా, డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ నాగకిరణ్కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ హరిహరతేజ, డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న, జయరామ్ తదితరులు పాల్గొన్నారు. ప్లానింగ్ లేకుండా నిర్మాణం...! జిల్లా కలెక్టరేట్కు కూతవేట దూరంలో ప్రధాన రహదారి పక్కన 15 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించిన డ్రగ్ కంట్రోల్ కార్యాలయం సరైన ప్లానింగ్ లేకపోవడంతో అస్తవ్యస్తంగా నిర్మించారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రూ.2.78 కోట్లతో నిర్మించిన ఈ భవనానికి కనీసం ప్రహరీ లేకపోవడం, భవనం వెనుకవైపున పార్కింగ్కు స్థలం కేటాయించడం, దానికి కూడా గేటు ఏర్పాటు చేయడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీ ప్లస్ 2 పద్ధతితో నిర్మించిన ఈ భవనంలో కింద అధికారుల చాంబర్లు, మొదటి అంతస్తులో ల్యాబ్కు సంబంధించిన గదులు, రెండో అంతస్తులో ల్యాబోరేటరీ పరికరాలు ఉన్నాయి. అన్నీ ఇరుకు ఇరుకుగా, చిన్నవిగా గదులు నిర్మాణం చేశారు. అలాగాకుండా పార్కింగ్ కోసం సెల్లార్ ఏర్పాటు చేసి, మొదటి, రెండు అంతస్తుల్లో కార్యాలయం, ల్యాబరేటరీ నిర్మాణం చేసి ఉంటే గదులు కూడా పెద్దగా వచ్చేవని, ఇలాంటి నిర్మాణానికి అధికారులు ఎలా అనుమతించారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
చిన్నారి గొంతులో ఇరుక్కున్న నాణెం
● విజయవంతంగా తొలగించిన వైద్యులు కర్నూలు(హాస్పిటల్): ప్రమాదవశాత్తూ చిన్నారి గొంతులో ఇరుక్కున్న రూ.2ల నాణేన్ని కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ఎండోస్కోపి పరికరం ద్వారా విజయవంతంగా తొలగించారు. మంగళవారం వివరాలను ఆసుపత్రి క్లస్టర్ హెడ్ మహేశ్వరరెడ్డి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...‘ పత్తికొండ మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన చిన్నారి లాస్య(7) రెండు రోజుల క్రితం రూ.2ల నాణేన్ని నోట్లో పెట్టుకుని స్కూల్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ గొంతులో దిగిపోయి అన్నవాహికలో ఇరుక్కుపోయింది. వెంటనే తల్లిదండ్రులు పాపను కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. పాపను సోమవారం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ అబ్దుల్ సమద్ ఎక్స్రే తీసి చూడగా అది గొంతులో ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే ఎండోస్కోపిక్ సాయంతో శస్త్రచికిత్స అవసరం లేకుండా నాణేన్ని తొలగించారు. అనంతరం చిన్నారికి నియోనెటాలజిస్టు డాక్టర్ వై.గణేష్ తగిన చికిత్స అందించి త్వరగా కోలుకునేలా చేశారు’ అని వివరించారు. పాప కోలుకోవడంతో మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. -
జాబ్ క్యాలెండర్ ఎక్కడ
– కాటసాని శివనరసింహారెడ్డి చంద్రబాబు అబద్ధపు హామీలతో యువత నిలువునా మోసపోయింది. ఎన్నికల సమయంలో యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తారు. జిల్లాలో 5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా నిరుద్యోగ భృతి అందలేదు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బాబు సర్కారుకు ప్రజలే గుణపాఠం చెబుతారు. ఐటీ హబ్ ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు పూర్తిగా అన్యాయం చేసింది. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి సముచిత స్థానం దక్కుతుంది. -
● రూ.2.10 కోట్ల నష్టం
పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం ఆదోని అర్బన్: బసాపురం గ్రామ సమీపంలో ఉన్న హరి పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంగళవారం అగ్ని ప్రమా దం జరిగింది. దాదాపు రూ.2.10 కోట్లు విలువ చేసే పత్తి, మిషనరీలు అగ్నికి ఆహుతయ్యాయి. మిల్లులో ఉన్న హమాలీలు, వ్యాపారస్తులు అగ్ని ప్రమాదానికి చూసి వెంటనే అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మిల్లుకు చేరుకుని మంటలను అదుపు చేశారు. మిల్లులో నలుగురు వ్యాపారులు పత్తిని జిన్నింగ్ చేస్తున్నారన్నారు.శ్రీ గురుసిద్దేశ్వర కాటన్, ఎన్డీబీఎల్, శ్రీ వెన్నెల కాటన్స్, శ్రీలక్ష్మీ వెంకటరమణ కాటన్స్ కంపెనీలకు చెందిన పత్తిని జిన్నింగ్ చేసేందుకు వేశారు. మొత్తం రూ.1.50 కోట్లు విలువ చేసే పత్తి, రూ.60 లక్షలు విలువ చేసే జిన్నింగ్ మిషనరీలు అగ్నికి ఆహుతై ఆస్తి నష్టం వాటిల్లిందని కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ యజమాని హరి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాపారులు, హమాలీలు అప్రమత్తమై కాటన్ బేళ్లను త్వరితగతిన బయటకు తీసుకొచ్చి నిల్వ చేయడంతో రూ.2 కోట్ల ఆస్తి మిగిలిందని చెప్పారు. కాగా.. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక ఇన్చార్జి అధికారి రామాంజనేయులు, సీనియర్ లీడింగ్ ఫైర్మెన్ రాజారామ్, సిబ్బంది ఇబ్రహీం, ఆనంద్, ఉదయ్కుమార్, హోంగార్డు నరసింహులు రెండు ఫైర్ ఇంజన్లతో పరిశ్రమకు చేరుకుని మంటలను ఆర్పి వేశారు. -
చెట్ల కిందే చదువులు!
జెడ్పీ హైస్కూల్లో నిలిచి పోయిన గదుల నిర్మాణం చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల వైపు దృష్టి సారిచడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద చేపట్టిన పాఠశాలల అదనపు గదులు నిర్మాణాలు ఎక్కడిక్కడే నిలిచి పోయాయి. కోసిగి మండలం వందగల్లు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1–10 వతరగతి వరకు 450 మందిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అదనపు గదులు పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు చెట్లకింద చదువుకుంటూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. –కోసిగి -
పెరిగిన చలి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. మంచు కూడా కురుస్తోంది. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 15–16 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం 8 గంటల వరకు చలి తగ్గని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రతతో అలర్జీ, అస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నెల 11 నుంచి చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈశాన్యం దిశగా గాలులు గంటకు 3 నుంచి 4 కిలో మీటర్ల వేగంతో విస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 16.17 డిగ్రీల వరకు నమోదు అవుతాయని ప్రకటించారు. రోడ్ల అభివృద్ధ్దికి పాలనా అనుమతులు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.156.64 కోట్లతో 71 పనులను చేపట్టేందుకు పాలనా అనుమతులు మంజూరైనట్లు పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో 115.409 కిలో మీటర్ల మేర రోడ్లను అభివృద్ది చేసేందుకు రూ.62.67 కోట్లతో 27 పనులు మంజూరైనట్లు చెప్పారు. అలాగే నంద్యాల జిల్లాలో 178.110 కిలో మీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.93.97 కోట్లతో 44 పనులను చేపట్టేందుకు పాలనా అనుమతులను మంజూరు చేస్తు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరిన రోడ్లను అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతిపాదనలను పంపించడం జరిగిందన్నారు. ఈ ప్రతిపాదనల మేరకు ఆయా రోడ్లను అభివృద్ధి చేసేందుకు అనుమతులు వచ్చాయని ఎస్ఈ వివరించారు. త్వరలోనే రెండు జిల్లాల్లో పాలనా అనుమతులు లభించిన రోడ్ల పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. కర్నూలు(సెంట్రల్): ప్రసూతి మరణాలను పూర్తిగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆమె తన చాంబరులో వైద్యశాఖకు సంబంధించిన కీలక పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)లపై వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కీలక పనితీరు సూచికలను సాధించడంలో వంద శాతం పురోగతి కనిపించాలన్నారు. గర్భిణులకు అందించే యాంటి నేటల్ కేర్ (ఎన్ఏసీ)సేవలు తప్పనిసరిగా అందేలా చూడాలన్నారు. ప్రతి గర్భిణి వివరాలను రిజిస్టర్ చేసి నిర్ణీత కాలపట్టిక ప్రకారం సకాంలో ఆరోగ్య పరీక్షలు, అవసరమైన రక్త పరీక్షలు, హిమోగ్లోబియన్ స్థాయి, బీపీ, బరువు, టీకాలు, పోషకాహారానికి సంబంధించిన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. శిశు మరణాల శాతాన్ని కూడా పూర్తిగా తగ్గించాలని ఆదేశించారు. అంటు వ్యాధులతో మరణాలతో తగ్గించడం, సకాలంలో వైద్య సేవలు అందించడం కోసం వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. విలేజ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఓ భారతి, డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రూల్లా, ఏఓ సింధు సుబ్రమణ్యం పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్లో ఈ నెల 10 తేదీన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ ఆర్.ప్రదీప్కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 7382614308 నంబర్ ఫోన్ చేసి చెప్పవచ్చని పేర్కొన్నారు. మంచాలమ్మ దేవరకు స్థల పరిశీలన మంత్రాలయం: గ్రామ దేవత మంచాలమ్మ దేవర సంబరాల నిమిత్తం స్థల పరిశీలన చేపట్టారు. మంగళవారం గ్రామస్తులు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో కలిసి ఉత్సవ స్థలం పరిశీలించారు. పూర్వం మంచాలమ్మ ఆలయం అభిముఖంగా గ్రామస్తులు దేవర చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం సుజయీంద్ర నగర్ ప్రాంతంలో వేడుక చేసుకోవడానికి స్థలం చూశారు. స్వామిజీ, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, మాజీ సర్పంచ్ పన్నగ వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
జగన్ మళ్లీ సీఎం అయ్యేంత వరకు ఇలాగే...
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం అయ్యేంత వరకు ఏక రూప వస్త్రధారణ ధరిస్తా. నేటి నుంచి వెయ్యి రోజుల పాటు ఇలాగే ఉంటా. మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించారు. ప్రస్తుతం బాబు పాలనలో మోసపోతున్న యువతలో చైతన్యం నింపేందుకు పార్టీ సీనియర్ నాయకులు కాటసాని రాంభూపాల్రెడ్డి ‘యువత మేలుకో’ అనే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో వీధుల్లో మద్యం అందుబాటులోకి వచ్చింది. కేవలం 18 నెలల కాలంలోనే చంద్రబాబు పాలనపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థమవుతుంది. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడం ఖాయం. బీవై రామయ్య, నగర మేయర్ -
ట్రాఫిక్ చలానా పెండింగ్ కేసులపై దృష్టి సారించండి
కర్నూలు: ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టి పెండింగ్ చలానాలను సెటిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సూచించారు. పోక్సో కోర్టు అదనపు జిల్లా జడ్జి రాజేంద్రప్రసాద్తో కలసి మంగళవారం స్థానిక మున్సిఫ్ కోర్టు హాల్లో జ్యుడీషియల్, పోలీసు అధికారులతో జాతీయ లోక్ అదాలత్పై సమీక్షించారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాలను ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. పోలీసులందరూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానా కేసులను లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవాల్సిందిగా కోరారు. వాహన వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ట్రాఫిక్ చలానా కేసులను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు. జూనియర్ సివిల్ జడ్జిలు అనిల్ కుమార్, అనూష, అపర్ణ, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
బాత్రూమ్ కడితేనే సంసారానికి వస్తా!
కర్నూలు జిల్లా: బాత్రూమ్ సమస్య ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఎదురుపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాని కి చెందిన శివశంకర్ (35), అతని సోదరుడు పక్కపక్కన నివాసముంటున్నారు. రెండిళ్లకు కలసి ఒకే బాత్ రూమ్ ఉంది. కొన్నాళ్ల పాటు సర్దుకుంటూ వచ్చిన శివశంకర్ భార్య శశికళ ఇటీవల వేరుగా బాత్రూమ్ నిర్మించాలని కోరింది. 10 రోజుల క్రితం ఈ విషయంలో దంపతులు ఘర్షణ పడ్డారు. బాత్రూమ్ నిర్మించేంత వరకు ఇంట్లో ఉండనంటూ శశికళ జూపాడుబంగ్లాలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. అయితే భర్త శివశంకర్ ఎంత బతిమలాడినా తిరిగిరాలేదు. దీంతో మనస్తాపం చెందిన శివశంకర్ శనివారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి తేనె భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.రవీంద్రబాబు సోమవారం వెల్లడించారు. -
ఉద్యోగం పేరుతో మోసం
కర్నూలు: హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన బొజుగు కిషోర్ రూ.11.10 లక్షలు తీసుకుని ఫేక్ లెటర్ ఇప్పించి మోసం చేశాడని హైదరాబాద్కు చెందిన దీప, కర్నూలు ఆర్మీ ఎన్సీసీ క్యాంటీన్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్నూలుకు చెందిన ఖాశీం వలి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని బాలాజీ నగర్కు చెందిన భారతి ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శ్రీనివాస నాయక్, ఇబ్రహీం, శ్రీధర్ తదితరులు కూడా పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. -
కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టండి
కర్నూలు: పెండింగ్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అధికారులకు సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా సదన్లో సోమవారం లీలా వెంకటశేషాద్రి మున్సిపల్, సచివాలయ అధికారులతో డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్అదాలత్పై సమీక్షించారు. కోర్టులలో ఉన్న సివిల్ కేసులు, భూసేకరణ కేసులు, ట్యాక్స్ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్న కోర్టులలో ప్రతిరోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. మున్సిపల్, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. -
పొలాల మధ్య మైనింగ్కు ఒప్పుకోం
వెల్దుర్తి: ‘మా పంట పొలాల మధ్య మైనింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం’ అంటూ మండల పరిధిలోని బుక్కాపురం, లింగాల పల్లె గ్రామాల రైతులు స్పష్టం చేశారు. మైనింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఇటీవల పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమ వారం ఆయా గ్రామాల రైతులు, పార్టీలకతీతంగా నాయకులు శంకర్ రెడ్డి, ఈశ్వర్రెడ్డి, రామచంద్రారెడ్డి, చిన్నమద్దిలేటి, బసవయ్య, గోపాల్ రెడ్డి తదితరులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమకు సమాచారం అందించకుండా తమ పొలాల మధ్య గల సర్వే నంబరు 214లోని 4.5 హెక్టార్లలో ఇన్ఫినిటి మినరల్స్ వారు క్వార్ట్జ్ మైనింగ్ ఏర్పాటుకు ఈనెల 6న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిపారన్నారు. ఈ ప్రక్రియను ఆర్డీఓ, తహసీల్దార్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్వహించడం సరికాదన్నారు. దొడ్డిదారిన అనుమతు లు పొందేందుకు ప్రయత్నిస్తున్న కంపెనీకి కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అనంతరం మైనింగ్ పరిశ్రమ ఏర్పాటును ఆపాలంటూ డిప్యూటీ తహసీల్దార్ గురుస్వామిరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. -
పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై సంబంధిత అధికారులు వేగంగా స్పందించి నివేదికను పంపాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సుమారు 450 మంది గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోందని, వారిని తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, గృహ నిర్మాణ అధికారి చిరంజీవి, ఎస్డీసీలు అనురాధ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా అయ్యప్పస్వామి విళక్కు దీపోత్సవం
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని గుడిపాటిగడ్డలో వెలసిన అయ్యప్పస్వామి దేవస్థానంలో సోమవారం అయ్యప్పస్వామి విళక్కు దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ అయ్యప్ప సేవా సమాజ్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉదయాన్నే కన్య స్వాములచే సింగారి మేళ వాయిద్యాలతో చిన్నచెరువు కట్టవద్దకు వెళ్లి గంగాజలాన్ని తీసుకొచ్చారు. ముందుగా మూలవిరాట్కు వివిధ రకాల పూలతో పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామి ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేసి విశేషంగా అభిషేకాలు, తిరుమంజనసేవ చేపట్టారు. సాయంత్రం స్వామి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అఘోరాలు, దేవతల వే‘షధారణలతో అలరించారు. ఈ ఉత్సవంలో అయ్యప్ప నామ స్మరణ మార్మోగింది. అనంతరం స్వామికి అష్టాదశ కలశాన్విత పడిపూజ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమాజ్ సభ్యులు, గురుస్వాములు, తదితరులు పాల్గొన్నారు. -
విజిలెన్స్ అధికారుల దాడులు
ఆత్మకూరు: పట్టణంలోని పలు దుకాణాలపై సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అతిథి హోటల్లో చికెన్ను పరిశీలించి సరిగ్గా లేకపోవడంతో రూ.10 వేలు జరిమానా విధించారు. అలాగే కప్పలకుంట్లలోని అనన్ బేకరీలో అటుకులు పరిశీలించి నాణ్యతగా లేవని రూ.8 వేలు జరిమానా విధించారు. బ్రదర్ బేకరీలో కూల్ కేకులను టెస్టింగ్కు పంపించారు. అధికారుల దాడుల నేపథ్యంలో పలువురు వ్యాపారులు దుకాణాలు మూసేశారు. విజిలెన్స్ అధికారులు వెంకటరమణ, విశ్వనాథం, ఫుడ్ఇన్స్పెక్టర్ షేక్షావలి, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికత పెంపునకు కృషి
చాగలమర్రి: విద్య, వైద్యంతో పాటు ఆధ్యాత్మికత పెంపునకు ఎస్పీజీ మిషనరీ కృషి చేస్తోందని నంద్యాల అధ్యక్ష కాండపు బిషప్ ప్రసన్నరావు అన్నా రు. సోమవారం ఎంతో చరిత్ర కలిగిన ముతాల్యపాడులోని ఎస్పీజీ పరిశుద్ధ జన్మోత్సవ 133వ ప్రతిష్ట వార్షికోత్సవం కార్యక్రమం జరిగింది. అతిథిగా హాజరైన నంద్యాల బిషప్ ప్రసన్నరావు, ఆయన సతీమణి నంద్యాల డయాసిసి ఉమెన్ ఫెలోషిప్ అధ్యక్షురాలు బ్యాలా సంతోష్కు డీనరీ చైర్మన్ రెవ. చంద్రశేఖర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని భక్తులకు ఏసుక్రీస్తు సందేశం అందించారు. కార్యక్రమంలో నంద్యాల డయాసిస్ సెక్రటరీ రెవ. నందం ఐజాక్, ట్రెజరర్ రెవ. బండి శామ్యుల్, ఎస్ఈజీ ప్రతాప్, ఆళ్లగడ్డ డీనరీ చైర్మన్ ఐజాక్ ప్రసన్నరావు, చర్చి సంఘం పెద్దలు పాల్గొన్నారు. -
మంచు కురిసే వేళలో..
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. నందికొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంత పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఉదయం 9 గంటలైనా సూర్యుడు మంచు దుప్పటి చాటునే ఉన్నాడు. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు దారి కనిపించక ఇబ్బంది పడ్డారు. లైట్లు వేసుకొని ప్రయాణించాల్సి వచ్చింది. నందవరం మండల పరిసరాల్లో ఇరుగుపొరుగు వారు కనిపించనంతగా మంచు కురిసింది. – నందవరం/కొత్తపల్లి/గోనెగండ్లనందవరం సమీపంలో పొగ మంచులో సూర్యోదయంకమ్ముకున్న పొగమంచునాగలదిన్నె – మంత్రాలయం ప్రధాన రహదారిలో.. -
కొడుకు మరణాన్ని తట్టుకోలేక..
పాములపాడు/జూపాడుబంగ్లా: కన్నకొడుకు బలవన్మరణాన్ని తట్టుకోలేక ఓ వృద్ధురాలు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోమవారం జూపాడుబంగ్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...జూపాడుబంగ్లా క్వార్టర్స్లోని పింజరిపేటలో ఏసమ్మ అనే మహిళ కొడుకు సునీల్ (22)తో కలిసి నివాసం ఉంటుంది. ఈమెది స్వగ్రామం నందికొట్కూరు మండలం వడ్డెమాను. భర్త మరణం తర్వాత దాయాదులతో గొడవపడి జూపాడుబంగ్లాకు వచ్చి స్థిరపడింది. అయితే, కొన్నాళ్ల నుంచి స్వగ్రామానికి వెళ్లాలని కుమారుడు ఏసమ్మపై ఒత్తిడి పెంచాడు. తాగి వచ్చి వేధిస్తున్నా సర్దిచెబుతూ వెళ్లేది. ఆదివారం అనంతపురం జిల్లా గుత్తిలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థన ఉందని ఏసమ్మ వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేలోపు కుమారుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి బోరున విలపిస్తూ ఇస్కాల –కంబాలపల్లి గ్రామాల మధ్య ఉన్న సూపర్ ప్యాసేజ్ వంతెన పై నుంచి ఎస్ఆర్ఎంసీలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటుగా వెళ్తున్న ఇస్కాల గ్రామానికి చెందిన నాగలక్ష్మి రెడ్డి అనే వ్యక్తి గమనించి గట్టిగా కేకలు వేయడంతో కాలువలో చేపలు పడుతున్న మత్స్యకారులు పుట్టీ సాయంతో ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో జీర్ణించుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వృద్ధురాలు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొలిమిగుండ్లలో రాయల్టీ చెక్పోస్టు ఏర్పాటు
కొలిమిగుండ్ల: నాపరాళ్ల రవాణకు రాయల్టీ వసూలు చేసే బాధ్యత ప్రవేట్ సంస్థకు అప్పగించడంతో అడుగడుగునా ప్రైవేట్ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం కొలిమిగుండ్లలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. బెలుం సమీపంలోని నాపరాతి గనుల నుంచి ట్రాక్టర్ లోడ్ చేసుకొని వెళుతున్న సమయంలో సిబ్బంది ఆపినా నిలపక పోవడంతో బైక్లో వచ్చి ట్రాక్టర్ను అడ్డుకున్నారు. రాయల్టీ చెల్లించి రవాణ చేయాలని యజమానికి సూచించారు. కొలిమిగుండ్ల, ఇటిక్యాల, కనకాద్రిపల్లె, రాఘవరాజుపల్లె గ్రామాల్లో వందకు పైగానే పాలీష్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొలిమిగుండ్లలో చెక్పోస్టు ఏర్పాటు చేయకముందు బెలుం, బెలుం శింగవరం గ్రామాల్లోని నాపరాతి గనుల నుంచి రవాణ చేసే ట్రాక్టర్లు రాయల్టీలు లేకుండా పోతుండేవి. గమనించిన ప్రైవేట్ సంస్థ ఇక్కడ చెక్పోస్టు ఏర్పాటు చేశారు. దీంతో యజమానులు తప్పక రాయల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క వాహనం కూడ రాయల్టీ లేకుండా వెళ్లేందుకు లేకుండా పలు చోట్ల చెక్పోస్టులు పెట్టారు. బెలుం–బెలుం శింగవరం మధ్యలో, కొలిమిగుండ్లలోని జమ్మలమడుగు క్రాస్ రోడ్డు, బందార్లపల్లె క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేయగా తాజాగా కొలిమిగుండ్ల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఏర్పాటు చేసి 24 గంటల పాటు సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.ప్రైవేట్ సంస్థ నెలకు రూ.14.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి రావడంతో పక్బడందీగా వసూలు చేస్తున్నారు. -
తనిఖీలు చేస్తున్నా ఆగని కల్తీలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆహార భద్రతా విభాగం కార్యాలయం కర్నూలులో ఉంది. ఇక్కడ ఒక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్తో పాటు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్, నంద్యాలలో ఇద్దరు అధికారులు ఉన్నారు. వీరు ఒక్కొక్కరు నెలకు 12 శాంపిల్స్ను తీసి ల్యాబ్కు పంపుతున్నారు. తీసిన శాంపిల్స్ ల్యాబోరేటరికీ వెళ్లి రిపోర్టు రావడానికి కొన్నిసార్లు నెల నుంచి మూడు నెలల సమయం పడుతోంది. నివేదిక ఆధారంగా అధిక శాతం వ్యాపారులకు జరిమానాతో సరిపెడుతున్నారు. ఫలితంగా జరిమానాలు చెల్లించి మళ్లీ పాత పద్ధతిలో వ్యాపారాలు చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల అధికారులు శాంపిల్ తీసిన నూనె -
కాయ్ రాజా కాయ్..!
బేతంచెర్ల: తెలుగు తమ్ముళ్లు అక్రమ సంపాదనకు బడి, గుడిని కూడా వదలడం లేదు. కొందరు ప్రకృతి వనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటుండగా.. మరి కొందరు దర్జాగా పేదలను దోచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా జేబులు ఖాళీ చేసి పంపిస్తున్న వైనం చూస్తే నివ్వెరపోవాల్సిందే. స్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులను క్షేత్ర పరిసరాల్లో మాటు వేసిన జూద నిర్వాహకులు సర్వం దోచుకుని పంపుతున్నారు. జిల్లాలో వైష్ణవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన మద్దిలేటి నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు దర్జాగా జూదం (బిళ్ల ఆట) నిర్వహిస్తున్నారు. బేతంచెర్ల పట్టణానికి చెందిన ఓ అధికార పార్టీ వార్డు కౌన్సిలర్ అండతో యువకులు జూదం నిర్వహిస్తూ భక్తుల జేబులను గుళ్ల చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రతి శుక్ర, శనివారాలతో పాటు పర్వదినాలలో స్వామి వారి దర్శనార్థం భక్తులు చేరుకుంటారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల్లో కొందరిని ఆశ పెడుతూ జూదం ముగ్గులోకి దింపుతున్నారు. ఆలయ పరిధిలోని గోశాల, ముఖ ద్వారం, మెట్ల మార్గం వద్ద రోజూ రాత్రి వేళ, వేకువజామున జూదం ఆడిస్తున్నారు. గత నెల 29వ తేదీన 130 రూము వద్ద రూ. లక్షలలో జూదం ఆడి డబ్బులు పొగొట్టుకున్న వ్యక్తులు జూదం నిర్వహకులతో గొడవకు దిగినట్లు సమాచారం. క్షేత్ర పరిధిలో ఇంత తతంగం జరుగుతున్నా ఆలయ ఉప కమిషనర్, పోలీసులు చూసీ చూడన్నట్లు వ్యహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆలయ విశిష్టతకు భంగం వాటిల్లకుండా, ఇలాంటి జూదం ఆడకుండా దేవదాయశాఖ, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. దీనికి తోడు అప్పుడప్పుడూ సెల్ ఫోను దొంగతనాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మద్దిలేటయ్య క్షేత్రంలో జోరుగా జూదం బేతంచెర్ల వార్డు కౌన్సిలర్ అండతో నిర్వహణ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఆలయ అధికారులు, పోలీసులు -
మద్యం తాగొద్దన్నందుకు...
పాములపాడు: మద్యం తాగవద్దు అని వా రించినందుకు ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మజరా క్రిష్ణానగర్ గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించే బాలయ్య (60) మద్యానికి బానిసయ్యాడు. భార్య లక్ష్మీదేవి, కుమారుడు అరుణ్ ఆరోగ్యం దెబ్బతింటుంది మద్యం అలవాటు మానేయాలని వారించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి జైలు శిక్ష, జరిమానా కర్నూలు: కాంట్రాక్టు బిల్లులు చెల్లించే విషయంలో లంచం తీసుకున్న కేసులో నిందితుడు దక్షిణ మధ్య రైల్వే డివిజినల్ ఫైనాన్స్ సీనియర్ అకౌంటెంట్ చల్లా శ్రీనివాసులు (ప్రస్తుతం రిటైర్డ్)కు రెండేళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభారాణి సోమవారం తీర్పు ఇచ్చారు. 2017 నవంబర్ 20న ఫిర్యాది కాంట్రాక్టర్ అయిన సీహెచ్డీ రాజుల నాయుడు కాంట్రాక్టు చేసిన బిల్లులు సుమారు రూ.30 లక్షలు ఆయనకు చెల్లించే విధంగా అనుకూలంగా చేసినందుకు నిందితుడు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై కాంట్రాక్టర్ ఫిర్యాదుతో సీబీఐ పోలీసులు వలపన్ని పటు్టు కున్నారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరికొండ మనోహర్ వాదించారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి బనగానపల్లె రూరల్: మండలంలోని పలుకూరు గ్రామానికి చెందిన సురేంద్ర (44)అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గంగన్న కుమారుడు సురేంద్ర తన ఇంటిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ మీటర్ వద్దకు వెళ్లీ ఫ్యూజ్ బిగిస్తుండగా విద్యుత్షాక్కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం గ్రామంలోని ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే సురేంద్ర మృతి చెందినట్లు అతను తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మృతుడి భార్య సంధ్యా సుధా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐతెలిపారు.మృతుడికి ఒక కూతురు ఉంది. కేసీకి పెరిగిన నీటి విడుదల జూపాడుబంగ్లా: కర్నూలు కడప (కేసీ) కాల్వకు సాగునీటి విడుదలను అధికారులు పెంచారు. సుంకేసుల డ్యాం నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుంకేసుల డ్యాం నుంచి 2 వేల క్యూసెక్కుల నుంచి 2500 క్యూసెక్కులకు పెంచామన్నారు. -
ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు రూ.4.91 లక్షల జరిమానా
డోన్ టౌన్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ రూ.4.91 లక్షల జరిమానా విధించారు. సోమవారం డోన్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా అనంతపురం వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ట్రావెల్ పాయింట్ బస్సు నిలిపారు. అయితే డ్రైవరు బస్సు ఆపకుండా వెళ్లడంతో అధికారిలో కారుతో వెంబడించి జగదుర్తి సమీపంలో అడ్డుకున్నారు. పర్మిట్లు చూపించమని డ్రైవర్ను అడుగగా అధికారిపై దురుసుగా వ్యవహరిస్తూ ఎలాంటి పత్రాలు చూపలేదు. వెంటనే ఆన్లైన్లో పరిశీలించగా ఎలాంటి రోడ్డు టాక్స్లు చెల్లించడం లేదని గుర్తించి బస్సును సీజ్ చేశారు. జరిమానా కింద రూ. 4.91 లక్షలు విధించినట్లు ఎంవీఐ తెలిపారు. -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం కావడంతో స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల వద్ద స్వామివారి దర్శనానికి బారులుదీరారు. స్వామివారి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు మల్లన్న అలంకార దర్శనం భక్తులందరికీ కల్పించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. -
వేతన వేదన!
● రెండు నెలలుగా శానిటేషన్ సిబ్బందికి అందని వేతనాలు ● శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుల దుస్థితి ● పద్మావతి సంస్థ నిర్లక్ష్యపు వైఖరిపై మండిపడుతున్న కార్మికులు ● సున్నిపెంట కార్మికులకు అదనపు భారంగా రవాణా చార్జీలు శ్రీశైలంటెంపుల్: ‘అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా మారింది శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి. ఏజెన్సీ మారి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు అందలేదు. దీంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య, హౌస్కీపింగ్ నిర్వహణను తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ దక్కించుకుంది. శ్రీశైల దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని ఆరు ప్రముఖ దేవాలయాలకు కలిపి సెంట్రలేజేషన్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వానికి అత్యంత అప్తుడైన వ్యక్తికి చెందిన సంస్థకు పారిశుద్ధ్య నిర్వహణను కట్టబెట్టారు. అక్టోబరు 1 నుంచి పద్మావతి సంస్థ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటైన పద్మావతి ఏజెన్సీకి సూపర్వైజర్స్–4, శానిటరీ మేసీ్త్ర–52, హౌస్కీపింగ్ వర్కర్స్–506, స్కావెంజర్స్–58, మెషిన్ ఆపరేటర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్–4, ఎలక్ట్రిషియన్స్–5, ఏసీ మెకానిక్–3, ప్లంబర్స్–5, కార్పెంటర్స్–4 ఇలా (వీక్లి ఆఫ్ రీలీవర్స్తో) మొత్తం కలిపి సుమారు 641మందికి కేటాయించారు. వీరికి కార్మిక చట్టం ప్రకారం జీవో నెం.11 ప్రకారం నెలకు రూ.12,253 వేతనంగా చెల్లిస్తామని టెండర్లో పొందుపర్చారు. రెండు నెలలు గడుస్తున్నా అందని వేతనాలు పద్మావతి సంస్థ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టి రెండు నెలలు పూర్తయి మూడవ నెల గడుస్తున్నా ఇంత వరకు వేతనాలు చెల్లించలేదు. మొత్తం 641మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.12,253 నెలకు వేతనంగా చెల్లించాలి. ఇందులో ఈపీఎఫ్, ఈఎస్ఐకి పోను బేసిక్ వేతనంగా ఒక్కొక్కరికి నెలకు రూ.10,690 ఇవ్వాలి. 641మంది కార్మికులకు గాను నెలకు రూ.68.52లక్షలు వేతనాలుగా చెల్లించాలి. అయితే పద్మావతి సంస్థ రెండు నెలలు గడుస్తున్నా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. సున్నిపెంట నుంచి వచ్చే సుమారు 300మంది కార్మికులు జీతాలు రాకపోగా, రవాణా చార్జీలకు నెలకు రూ.2వేలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. -
మల్లన్నకు వెండి రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఉంచి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పల్లకీ సేవ బనగానపల్లె రూరల్: పవిత్రశైవక్షేత్రమైన యాగంటిలో సోమవారం స్వామి అమ్మవార్ల పల్లకీ సేవ నిర్వహించారు. ఉదయం ఆలయంలో ఏకశిలా రూపంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వరస్వామికి అభిషేకం అర్చన తదితర పూజలు జరిగాయి. సాయంత్రం ఆలయం ఆవరణలో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి పల్లకీ సేవా కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి, యాగంటిపల్లె గ్రామ ఉపసర్పంచ్ మౌలిశ్వరరెడ్డితో పాటు అలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు కల్చరల్: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జనవరి 8, 9 తేదీల్లో తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ జి.శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఇందిరాశాంతి తెలిపారు. సోమవారం రాయలసీమ విశ్వవిద్యాలయంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను వీసీ, క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ వి.వెంకట బసవరావు ఆవిష్కరించారు. ‘21వ శతాబ్ధి మహిళా సాహిత్యం–సమాలోచన’ అంశంపై సదస్సు జరుగుతుందన్నారు. పరిశోధకులు తమ వ్యాసాన్ని జనవరి 1వ తేదీలోగా పంపాలని, మరిన్ని వివరాలకు 97053 83422 నంబర్ను సంప్రదించాలన్నారు. -
అబ్బురపరిచే ఆళ్లగడ్డ రాతి చిత్రాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తయారవుతున్న రాతి చిత్రాలకు ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు ఉంది. ఇక్కడ చేతులతో చెక్కుతున్న రాతి బొమ్మలు, దేవతామూర్తుల విగ్రహాలు దేశంలోని తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణలోకి యాదగిరిగుట్టలోని దేవతామూర్తుల చిత్రాలు ఆళ్లగడ్డ శిల్పుల చేతుల నుంచి జాలువారినవి కావడం విశేషం. ఈ రాత్రి చిత్రాలకు మరింత గుర్తింపు రావాలంటే శిల్పారామం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు రాతి బొమ్మలు, మరోవైపు గద్వాల పట్టుచీరలు, ఇంకోవైపు కలంకారీ పెయింట్లో రాణింపు ఒక్క మాటలో చెప్పాలంటే హస్తకళలకు ఉమ్మడి కర్నూలు జిల్లా నెలవు. శిల్పారామం ఏర్పాటై ఉంటే ఈ అపురూప కళలకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించేది. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జాతీయ హస్తకళల వారోత్సవాల (నేషనల్ హ్యాండీక్రాప్ట్ వీక్) నేపథ్యంలో కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలోని లేపాక్షి హ్యాండీక్రాప్ట్ ఎంపోరియంలో హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కలంకారీ పెయింటింగ్లో అద్భుతాల సృష్టి బనగానపల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన 69 ఏళ్ల శివానందరెడ్డి 46 ఏళ్లుగా కలంకారీ పెయింటింగ్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వేలాది చిత్రాలు ఈయన చేతుల నుంచి ఇప్పటికే జాలువారాయి. భారతీయ ఇతిహాసాల మీద ఈయన కలంకారీ పెయింటింగ్స్ వేయడం ప్రత్యేకత. ఈయన ప్రతిభకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 13 అవార్డులు లభించాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పలువురు ప్రముఖల నుంచి నుంచి ఆయన అభినందనలు అందుకున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కూడా లభించింది. పట్టుచీరలకు పుట్టినిల్లు కర్నూలు జిల్లా చేనేత పట్టుచీరలకు పుట్టినిల్లు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న పట్టుచీరలను గద్వాల పట్టుచీరల పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. విదేశాల్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రవాసాంద్రులు, ప్రవాస భారతీయుల మహిళలు వీటిపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న చొరువతో ఒక ఉత్పత్తి కింద 2023లో జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. దీని ద్వారా భౌగోళిక గుర్తింపు లభించడంలో కదలిక వచ్చింది. ఇటీవలనే కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ చేనేత పట్టుచీరల ఉత్పత్తిని అధ్యయనం చేసింది. కార్యరూపం దాల్చని శిల్పారామం ఏర్పాటు హస్తకళలకు గుర్తింపు తీసుకరావడం కోసం కర్నూలులో శిల్పారామం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికి కార్యరూపం దాల్చలేదు. 2014–15 నుంచి 2018–19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు శిల్పారామానికి జగన్నాథగట్టులో భూమి కేటాయించినట్లే కేటాయించి తర్వాత ఇతర అవసరాలకు మళ్లించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. శిల్పారామం లేకపోవడంతోనే హస్తకళలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలోని పట్టుచీరలు, ఆళ్లగడ్డ రాతి చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు కలంకారీ పెయింటింగ్లో రాణిస్తున్న శివానందరెడ్డి జాతీయ హస్తకళల వారోత్సవాలు ప్రారంభం -
ప్రత్యేక బస్సులో వైద్యులకు శిక్షణ
కర్నూలు(హాస్పిటల్): జాన్సన్ అండ్ జాన్సన్ ఇన్స్టిట్యూట్ ఆన్ వీల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో వైద్య విద్యార్థులకు స్కిల్ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ వాహనం సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చేరుకుంది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణను కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, వైద్యకళాశాలల్లో ఈ వాహనం ద్వారా ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్సా పద్ధతులపై వైద్య విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ(లైవ్ టిష్యూ, స్టిములేటర్స్–ట్యూబింగెన్ మోడల్) ఇస్తున్నట్లు తెలిపారు. బస్సులో పలు రకాల కుట్లకు సంబంధించిన శిక్షణ, ల్యాపరోస్కోపిక్ ఆపరేషన్లకు సంబంధించిన శిక్షణ, పేగుల ఆపరేషన్లో ఉపయోగించే స్టాప్లర్లు అనేక ప్రత్యేక పరికరాలపై శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణతో నైపుణ్యాలను మెరుగుపరచుకుని రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ రీజనల్ మేనేజర్ ఎం.మురళీకృష్ణ, జగదీష్, రిషికుమార్, జనరల్ సర్జరీ విభాగ వైద్యులు, పీజీలు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉమెన్స్ వన్డే క్రికెట్ పోటీలకు కౌసల్య ఎంపిక
కర్నూలు(టౌన్)/వెల్దుర్తి: ముంబైలో బీసీసీఐ ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న అండర్–19 ఉమెన్స్ వన్డే క్రికెట్ టోర్నమెంట్కు వెల్దుర్తి మండలం ఎల్. బండ గ్రామానికి చెందిన మహిళా క్రికెటర్ కౌలస్య ఎంపికయ్యారు. వన్డే పోటీలకు ఎంపికై న క్రీడాకారిణిని క్రికెట్ కోచ్ శేఖర్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు దేవేంద్రగౌడ్, రమేష్ సోమవారం అభినందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా కేడీసీఎ కోచ్ శ్రీనివాసులు ఎంపికై నట్లు క్రికెట్ వర్గాలు ధృవీకరించాయి. డిగ్రీ పరీక్షలకు 89 శాతం హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో 89 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా సోమవారం జరిగిన పరీక్షలకు 385 మందికి 342 మంది హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు శ్రీ సాయికృష్ణ డిగ్రీ కళాశాలలో చూచిరాతకు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్ చేశామన్నారు. పీఎం కిసాన్కు ఈ–కేవైసీ చేయించుకోండి కర్నూలు(అగ్రికల్చర్): కొంతమంది రైతులు ఆధార్ ఈ–కేవైసీ చేయించుకోకపోవడం వల్ల పీఎం కిసాన్ కింద సాయం పొందలేకపోయారని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఇలాంటి రైతులు సమీపంలోని మీ సేవా కేంద్రం/కామన్ సర్వీస్ సెంటర్లలో సత్వరం ఈ–కేవైసీ చేయించుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. మరికొంత మంది రైతులు బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయించుకోనందున పీఎం కిసాన్ లబ్ధి పొందలేదన్నారు. ఇలాంటి రైతులు సంబంధిత బ్యాంకు, పోస్టాఫీసుల్లో సంప్రదించి ఖాతాకు ఆధార్ లింక్ చేయించుకోవాలన్నారు. 2019 ఫిబ్రవరి 1 తర్వాత మ్యుటేషన్ చేయించుకున్న వారికి కూడా పీఎం కిసాన్ లబ్ధి వర్తించలేదన్నారు. కుటుంబం యూనిట్గా ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుందన్నారు. మైనర్ డ్రైవింగ్పై కేసు నమోదు కర్నూలు: కర్నూలు బళ్లారి చౌరస్తా సమీపంలోని తిలక్నగర్లో నివాసముంటున్న వెంకటేష్ కుమారుడు ఉదయ్ (16)పై మైనర్ డ్రైవింగ్ కేసు నమోదైంది. వెంకటేష్ కుటుంబ సభ్యులు స్థానికంగా తోపుడు బండిపై టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయ్ తన స్నేహితులు అశోక్, హరితో కలసి ఈనెల 6వ తేదీ రాత్రి బళ్లారి చౌరస్తా దగ్గర్నుంచి బుల్లెట్ కేఫ్ దగ్గర ఉన్న ఢాబాకు ద్విచక్ర వాహనంపై వెళ్తూ లారీ క్లీనర్ మగ్బూల్ రోడ్డు దాటుతుండగా ఢీకొట్టారు. దీంతో అతను తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 7వ తేదీ రాత్రి మృతిచెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్పై తాలూకా పోలీసులు మైనర్ డ్రైవింగ్ కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనం ఉదయ్ సోదరుడు శివశంకర్ పేరుతో ఉండటంతో అతనిపై కూడా కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు(అగ్రికల్చర్): సహకార సంఘాల ఉద్యోగులకు జీవో 36 ప్రకారం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్లోని డిమాండ్లు, వివిధ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీల ఎదుట ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 6 నుంచి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లాలో ని 18 డీసీసీబీ బ్రాంచీల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. డిమాండ్లపై నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి డీఎల్ఎస్ఎఫ్ ద్వారా జీతభత్యాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు హరీఫ్బాషా డిమాండ్ చేశారు. వేతన సవరణ కొలిక్కి వచ్చే వరకు మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. అనంతరం ఆయా బ్రాంచ్ మేనేజర్లకు వినతి పత్రాలు సమర్పించారు. -
నేను.. మీ శిరోధైర్యాన్ని!
కర్నూలు: నాకే బాధేస్తోంది... ఇలా నా గురించి, నా అవసరం గురించి మీతో చెప్పక తప్పడం లేదు. జిల్లాలో నన్ను విస్మరిస్తున్న తీరును పోలీసులు విస్తృతంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మార్పు కనిపించకపోవడంతో తట్టుకోలేక మీ ముందుకు వచ్చి నా గోడు వినిపిస్తున్నా.. ఇంతకూ నేనెవరనేగా... ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. మీ ప్రయాణంలో మీ తలకు రక్షణగా ఉండే హెల్మెట్ను. మీ ప్రాణం విలువ మీ కంటే నాకే బాగా తెలుసు. రహదారి ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయిన వారి కుటుంబాలను చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇదంతా ఎందుకంటే ఇటీవల నన్ను ధరించని వారు జిల్లాలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా తీరు మార్చుకోకపోవడంతో ఎంతో బాధ కలుగుతోంది. అనాలోచిత చర్యల ద్వారా జరిగిన ప్రమాదాల్లో యువకులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో పెళ్లి కాని వారు కొందరు ఉంటే పెళ్లయి ఏడాది, రెండేళ్లకే అనంత లోకాలకు చేరినవారు మరికొందరు. ఇందులో ఏ ఒక్కరూ నా విలువను గుర్తించినా నేడు వారి కుటుంబీకులతో ఆనందంగా ఉండేవారు. ఇప్పటికైనా మీరు మారండి.. నా మాట వినండి.. నన్ను తలకెక్కించుకోండి. తలకు పెట్టుకుంటే ప్రాణం దక్కించుకున్నట్లే... ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు నన్ను తప్పనిసరిగా ధరించాలి. ప్రమాదం జరిగినప్పుడు అది ఊగి కింద పడకుండా బెల్టు పెట్టుకోవాలి. రహదారి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించే ఐఎస్ఐ మార్కును పరిశీలించి వినియోగించండి. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగితే తల దెబ్బ తగలకుండా ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు. మీ శరీర భాగంలో నేను అండగా ఉండే తలే కీలకం. ఇందులోనూ మెదడు చాలా సున్నితమైంది. దెబ్బ తగలకుండా నేను కాపాడతా.. అందుకే నన్ను ధరించండి.. ధైర్యంగా ఉండండి. నన్ను ధరిస్తే జుట్టు ఊడిపోతుందనేది కేవలం అపోహనే. ఈ విషయం ఇప్పటికే వైద్యపరంగా రుజువైంది. నేను రక్షగా ఉంటే జుట్టు కాలుష్యం బారిన పడదు. జుట్టు ఊడుతుందన్న భయంతో మహిళలు నన్ను ధరించేందుకు వెనుకాడుతుంటారు. ఇది తగదని గుర్తుంచుకోండి. ముఖం పూర్తిగా కప్పి ఉంచేవి వాడటం వల్ల తలకు, ముఖానికి రక్షణగా ఉంటా. చెల్లించిన మూల్యం ఎంతో తెలుసా? నన్ను వినియోగించకపోవడం వల్ల పోలీసులు జిల్లాలో 9,540 కేసులు నమోదు చేశారు. అపరాధ రుసుం రూపంలో పదకొండు మాసాల కాలంలో మీరు రూ.3.50 కోట్లు మూల్యం చెల్లించారు. నన్ను ధరిస్తే రక్షణతో పాటు సొమ్ము కూడా మిగులుతుందన్న వాస్తవాన్ని గ్రహించుకోండి. ఇట్లు... మీ హితం కోరే హెల్మెట్ -
రూ. 10 వేల వేతనం.. పక్కా మోసం
● కలుపు తొలగింపులో కాడెద్దుగా మారిన వలంటీర్గ్రామ పరిపాలనను వికేంద్రీకరణ చేస్తూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చించి. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ను నియమించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారుల గడపకు చేరేలా చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు నెలకు రూ. 10 వేలు వేతనం అందజేస్తామని 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా వలంటీర్ వ్యవస్థను పట్టించుకోలేదు. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారంతా జీవనోపాధి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కోవెలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఐదేళ్లపాటు వలంటీర్గా పనిచేసిన రాజేష్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న పొలంలో ఈ ఏడాది శనగ పంట సాగు చేయగా చిన్నపాటి గుంటిక సాయంతో తానే స్వయంగా కలుపు నివారణ పనుల్లో నిమగ్నమయ్యాడు. – కోవెలకుంట్ల -
నేడు, రేపు మహిళా కమిషన్ చైర్పర్సన్ పర్యటన
కర్నూలు(సెంట్రల్): మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం కర్నూలు చేరుకొని బాలసదన్ను పరిశీలిస్తారు. మంగళవారం ఉదయం కర్నూలులోని శక్తి సదన్కు వెళ్లి పరిశీలన చేస్తారు. విత్తన చట్టాలకు వ్యతిరేకంగా నేడు నిరసన కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విత్తన, విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, రైతు కూలీ సంఘం నాయకులు వెంకటస్వామి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని దండగ చేసి రైతులను అప్పుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ వ్యాపారులకు లాభం చేకూర్చేల విత్తన, విద్యుత్ చట్టాలను తీసుకురావడం అన్యాయమన్నారు. ఇప్పటికే 66 విత్తన చట్టాలు ఉన్నాయని, వాటిని కాదని కొత్త చట్టం ఎందుకని ప్రశ్నించారు. రేపు ‘స్వర్ణామృత’ పంపిణీ ఆదోని అర్బన్: పట్టణంలోని అభయాంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఈనెల 9వ తేదీ(మంగళవారం) స్వర్ణామృత ప్రాసనం మందును పంపిణీ చేస్తున్నట్లు అవోపా మాజీ అధ్యక్షుడు కాకుబాళ్ నగేష్, ఆదోని అవోపా పట్టణాధ్యక్షుడు వంకదారు శ్రీనాథ్గుప్తా ఆదివారం తెలిపారు. ఆరు నెలల నుంచి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ మందును అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ ఔషధం రోగ నిరోధకశక్తిని పెంచుతుందన్నారు. వివరాలకు 9849478178 నంబర్ను సంప్రదించాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి కర్నూలు(సెంట్రల్): తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎకరాకు 30 క్వింటాల దిగుబడి వస్తుండడంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,450 ఇస్తే సరిపోదన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావన్నారు. కనీసం రూ.5 వేలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవిషయంపై కలెక్టర్ దృష్టి సారించాలని సూచించారు. నేడు ‘డయల్ యువర్ సీఎండీ’ కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 8977716661 నంబరుకు ఫోన్చేసి సమస్యల గురించి చెప్పవచ్చని పేర్కొన్నారు. కర్నూలు(సెంట్రల్): ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా వై.నాగేశ్వరరావు మూడోసారి ఎన్నికయ్యారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రమేష్బాబు సమక్షంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా వై.నాగేశ్వరరావును జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నట్లు మద్దతు తెలపడంతో ఆయన ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన 2017 నుంచి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా మరోసారి ఎన్నిక కావడంతో ధ్రువపత్రాన్ని అందజేసి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మూడోసారి గెలిపించిన డ్రైవర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పాపారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంకోబా, నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఖాదర్, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బులు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కోసం ర్యాలీ
కర్నూలు(సెంట్రల్): ఉద్యోగ భద్రత కల్పించాలని 104 ఉద్యోగులు ఆదివారం కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మిక, కర్షక భవన్లో 104 ఉద్యోగుల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడారు. అరబిందో కంపెనీ నుంచి బకాయి లు విడుదల చేయాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కనీసం రూ.18,500 వేతనం ఇవ్వాలని, ప్రతి డివిజన్కు ఒక బఫర్ సిబ్బందిని నియమించాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షు డు పీఎస్ రాధాకృష్ణ, యూనియన్ నాయకులు ఇలియాజ్, మల్లికార్జున, బొజ్జప్ప, ఈరన్న, రాఘవేంద్ర, అశోక్, అయ్యప్ప, ఓబులేసు పాల్గొన్నారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య కోసిగి: మండల కేంద్రం కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి బీదర్(16577) వెళ్లే రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. మృతుడి వద్ద ఆధార్ కార్డు ఆధారంగా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా ఆరోలి గ్రామానికి చెందిన తిమ్మప్ప(45) అనే వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. అనారోగ్యంతో రాయచూరు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా, జబ్బు నయకం కాగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు. మృతదేహాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు చెప్పారు. వివాహిత బలవన్మరణంవెల్దుర్తి: మండల పరిధిలోని ఎల్ నగరం గ్రామానికి చెందిన సుహాసిని(32) శనివారం అర్ధరాత్రి (తెల్లారితే ఆదివారం) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన భర్త కురువ చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు హుటాహుటిన వెల్దుర్తి సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యానికి కర్నూలు జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మద్యానికి బానిసైన భర్త కుటుంబాన్ని పట్టించుకోవడం లేదన్న క్షణికావేశంలో తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందంటూ మృతురాలి తల్లి భాగ్యలక్ష్యి ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. సుహాసినికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్తపై కేసు నమోదు కొలిమిగుండ్ల: కుమారుడిని తీసుకొని వెళ్లేందుకు వచ్చిన భార్యపై దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్బాబు ఆదివారం తెలిపారు. ఉమ్మాయిపల్లెకు చెందిన భూషిపల్లె లక్ష్మీనారాయణరెడ్డికి ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అన్నెం సుధారాణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అనివార్య కారణాల వల్ల మూడేళ్ల నుంచి దంపతులిద్దరు వేరుగా ఉంటున్నారు. వారం రోజుల క్రితం కుమారుడు పుట్టిన రోజు ఉండటంతో భర్త ఆళ్లగడ్డకు వెళ్లాడు. అక్కడి నుంచి చిన్న కుమారుడిని వెంట తీసుకొని ఉమ్మాయిపల్లెకు వచ్చాడు. కుమారుడిని తీసుకొని పోయేందుకు సుధారాణి ఉమ్మాయిపల్లెలోని ఇంటికి చేరుకోగానే భర్తతో పాటు అతని బంధువులు దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
విరగ్గాసిన.. చింత
కుంట చుట్టు ఉన్న చింతచెట్లుచింత కాయలు పేరు వింటే నోరుతుంది కదూ.. సీజన్ వచ్చేసింది. మార్కెట్లో వాటి విక్రయాలు కనిపిస్తున్నాయి. ఈ సారి అధిక వర్షాలు కురువడంతో చెట్లనిండా చింతకాయలే కనిపిస్తున్నాయి. ఇలా కాస్తే పంటల దిగుబడులు ఆశించింత వస్తాయని ఆ గ్రామ రైతుల నమ్మకం. చాలా మంది వేసవిలో పెనుగాలులకు చింతకాయలు నేలరాలిన తర్వాత చింతపండుకోసం పరుగులు తీస్తారు. చింత పూతను సీతమ్మ ప్రసాదంగా భావిస్తారు. ఇక చింతకాయలను పచ్చళ్లకు, చింతపండును వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు. చెక్కను వడ్రంగి పనుల్లో విత్తనాలను ఔషధాల తయారీకి ఉపయోగాస్తారు. క్రిష్టిపాడు శివారులో ఉన్న రేగుమానుకుంట వద్ద చింతచెట్లు విరగ్గాసి చూపరులందరినీ నోరూరిస్తున్నాయి. – దొర్నిపాడుకొమ్మకొమ్మకు కాసిన చింతకాయలు.. -
రెడ్డప్ప.. నిను మరువలేం!
జవహర్ నవోదయ విద్యాలయం మొదటి ప్రిన్సిపాల్ దివంగత ఎస్వి రెడ్డప్ప విగ్రహాన్ని ఆయ న సతీమణి లలితమ్మ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. రాజంపేట జిల్లా జడ్జి ప్రవీణ్కుమార్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామకృష్ణయ్య, ప్రిన్సిపాల్ ఇ. పద్మావతి హాజరయ్యారు. నవోదయ విద్యాలయంలో నిర్వహించిన అపూర్వ సమ్మేళనంలో 1986 సంవత్సరం నుంచి చదువుకున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ చుదువుకుని చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. –ఎమ్మిగనూరురూరల్ -
కమ్మని రుచులు.. కలసి తింటే..!
ఉరుకుపరుగుల జీవితాలు.. ఇంట్లో నలుగురు ఉన్నా కలసి తీనేదెప్పుడో. అందరూ ఉన్నా టీవీ చూస్తూ.. ఫోన్ మాట్లాడుతూనే భోజనం పూర్తి చేసేవారందరో ఉన్నారు. రుచి ఎరుగరు.. కబుర్లు ఉండవు. మరి కొందరు ఆకలేస్తే అప్పటికప్పుడు ఆన్లైన్ ఆర్డర్లు తెప్పించుకోవడం తినేయడం జరుగుతోంది. కానీ పంట పొలాల్లో కూలీలు తమ కష్టాన్ని మైమరిచి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ.. రుచులు పంచుకుంటూ భోజనం ఆరగించే దృశ్యాలే కమనీయమే. పచ్చడి అన్నమైనా సరే ఆ రుచే వేరు. ప్రస్తుతం మిరప, కంది, సీడుపత్తి, పప్పు శనగ, తదితర పంట పొలాల్లో కలుపులు, పండు మిరపకాయల కోతలు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డ, చింతకుంట్ల, రుద్రవరం, సంజామల, తదితర గ్రామాల నుంచి మహిళా వ్యవసాయ కూలీలు మండలంలోని పలు గ్రామాలకు ట్రాక్టర్లు, ఆటోల్లో చేరుకుంటున్నారు. ఉదయానే వస్తూ వెంట సద్దులు తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ అందరూ ఒక చోట చేరి సద్దులు (క్యారేర్లు) తిని కాస్త సేద తీరి ఆ వెంటనే పనుల్లోకి వెళ్లిపోతున్నారు. – ఉయ్యాలవాడ -
సనాతనం.. సన్మార్గం.. ఉత్తమం
కోడుమూరు రూరల్: ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని ఆచరించాలని, సన్మార్గంలో నడవాలని, ప్రజలందరికీ ఎంతో ఉత్తమమైనదని విజయవాడ అష్టాక్షరీ పీఠం పీఠాధిపతి శ్రీరామానుజ జీయర్ స్వామి అన్నారు. కోడుమూరు శ్రీరాములవారి దేవాలయం నుంచి శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఆదివారం హిందూ జనజాతర ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథి శ్రీరామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ..హరి–హర క్షేత్రంగా కోడుమూరులో పురాతన పద్ధతిలో భారతి సిమెంట్ జిల్లా డిస్ట్రిబ్యూటర్ ఎద్దుల మహేశ్వరరెడ్డి ఆలయాలు నిర్మిస్తుండడడం గొప్ప విషయమన్నారు. అంబాత్రయ క్షేత్రం పీఠాధిపతి ఆదిత్యపరాశ్రీ స్వామి మాట్లాడుతూ..సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, వైఎస్సార్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, జెడ్పీటీసీ సభ్యులు రఘునాథ్రెడ్డి, విశ్వహిందూ పరిషత్ దక్షిత భారతదేశ అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, విశ్వబ్రాహ్మణ చైర్మన్ పార్వతమ్మ, నాయకులు కేవీ సుబ్బారెడ్డి ఆర్ఎస్ఎస్ నాయకులు సురేంద్ర, శ్రీనివాసరెడ్డి, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
పసిమొగ్గకు ‘రూ.16 కోట్ల’ కష్టం
వెల్దుర్తి: పసిమొగ్గకు ఒక్కసారిగా రూ.16కోట్ల కష్టం వచ్చి పడింది. ఎనిమిది నెలలు నిండిన చిన్నారి రెండేళ్లకు మించి బతకని రుగ్మత వచ్చింది. బతకాలంటే రూ.16కోట్ల ఇంజక్షన్ అవసరమైంది. వెల్దుర్తి పట్టణానికి చెందిన జెఎమ్ సురేష్, పుష్పావతి కుమార్తె పునర్విక శ్రీ శరీరాన్ని కదపలేని స్థితిలో, ఏడవాలన్నా, నవ్వాలన్నా, చివరికి ఊపిరికై నా కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో వైద్య పరీక్షలు చేయించగా ఎస్ఎమ్ఏ టైప్ వన్(స్పైనల్ మస్స్క్యులర్ ఆత్రఫి–జన్యు సంబంధిత వెన్నముక కండరాల క్షీణత)రుగ్మత అని తేలింది. ఈ వ్యాధి చికిత్సకు రూ.16కోట్ల విలువ చేసే ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యులు చెప్పారు. వెల్దుర్తి కొత్త బస్టాండు ప్రాంతంలో ఓ చిన్న షాపులో కులవృత్తి మంగలి పనితో జీవనం సాగించే సురేష్ (ఫోన్ నంబర్ 9052635529) దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఇంజక్షన్ కొనుగోలు చేసేందుకు 14 నెలల్లోనే డబ్బు సమీకరించుకోవాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పందించాలని సురేష్ కోరుతున్నారు. -
అ‘పూర్వ’ కలయిక
కల్లూరు: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 25 ఏళ్ల తర్వాత ఆ మిత్రులందరూ ఒక్కచోటికి చేరారు. కల్లూ రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999–2000 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం డైమండ్ ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా గెట్ టు గెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత మిత్రులందరూ ఒకే చోట కలవడంతో చిన్ననాటి సంగతులను గర్తు చేసుకున్నారు. ఒకరినొకరు పకలరించుకుని కష్టసుఖాలను పంచుకున్నారు. తమ కు చదువు చెప్పిన ఉపాధ్యాయులందరినీ పూలమాల లు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అందరూ కలిసి విందు భోజనాలు చేశారు. నాటి సంఘటనలు గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. ప్రధానోపాధ్యాయులు హుస్సేన్, పాములపాడు ఎంఈఓ సుభాషిణి, ధరిత్రి దేవి, రత్నారెడ్డి, సుభాషిని జీవితంలో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొవాలని సూచించారు. -
ఆదోని జిల్లా సాధనకు ఉద్యమం ఉధృతం
ఆదోని టౌన్: ఆదోని జిల్లా సాధనకు ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి అన్నారు. ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో పట్టణంలోని ద్వారకా ఫంక్షన్ హాల్లో ఆదివారం రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఆదోని జిల్లా చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల ప్రజలకు ఆదోని ప్రాంతం అనుకూలంగా ఉంటుందన్నారు. పెద్దతుంబళం గ్రామాన్ని కూడా మండలకేంద్రంగా ప్రకటించాలన్నారు. జేఏసీ నాయకులు, కో కన్వీనర్లు నూర్అహమ్మద్, రఘురామయ్య, దస్తగిరినాయుడు, న్యాయవాది లలిత, కుంకనూరు వీరేష్, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఆదోని జిల్లా ఏర్పాటులో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ ఈనెల 10న ఆదోని పట్టణ బంద్ను చేపడుతున్నట్లు చెప్పారు. -
భక్తిశ్రద్ధలతో లక్ష దీపోత్సవం
హాలహర్వి: అశేష భక్తజనం మధ్య జె.హొసళ్లి గ్రామంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీశైలం మఠం జగద్గురువులు డాక్టర్ కె.చన్నసిద్ధరామ హాజరయ్యారు. శ్రీ అఖండ పరశివమూర్తి శివాచార్య మహాస్వామివారి 46వ సంస్మరణోత్సవం, లక్ష దీపోత్సవం చేపట్టారు. స్వామివారికి ఆకుపూజలు, పంచామృతాభిషేకం, గణపతిపూజ తదితర విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు భక్తులు పొందారు. కోలాట, నందికోలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జి.హొసళ్లి గ్రామంలో లక్ష దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. భక్తులు 50 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి పట్టదా శంభులింగ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలన్నారు. -
శ్రీమఠం.. భక్త జనసంద్రం
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. చలిని సైతం లెక్క చేయకుండా తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించారు. మార్గశిర అరుద్ర నక్షత్రం సందర్భంగా గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు చేశారు. అమ్మవారికి ఉదయాన్నే అభిషేకం, కుంకుమ ఆర్చన నిర్వహించారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు రథంపై ప్రహ్లాదరాయులు వైభవంగా విహరించారు. కల్పతరు క్యూలైన్లో భక్తుల రద్దీ కొనసాగింది. – మంత్రాలయం రూరల్ -
సీసీఐ కేంద్రాల్లో ‘ధర’ దగా!
గూడూరు మండలం పెంచికలపాడులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలో ఇటీవల 16 వాహనాల పత్తిని తేమ, రంగు లేదని తిరస్కరించారు. ఇందులో కల్లూరు పర్ల గ్రామానికి చెందిన ఓ రైతు దిగుబడులు ఉన్నాయి. పత్తిని ఇంటికి తీసుకెళ్ల లేక ఆ రైతు క్వింటా రూ.6,800 ప్రకారం దాదాపు 100 క్వింటాళ్ల పత్తిని దళారికి విక్రయించాడు. ఇదే పత్తిని అదే రైతు పేరుతో స్లాట్ బుక్ చేసి బొలెరో వాహనాల ద్వారా దళారి లోపలికి పంపారు. మొదట తిరస్కరించిన వారు దళారి పంపితే క్వింటాకు రూ.7,900 ధర ఇచ్చారు. దీంతో క్వింటాపై రూ.1,100 లాభం పొందారు. ఇలా రూ.1.10 లక్షలు సంపాదించారు. ఇందులో సగం వరకు అధికారులకు వాటా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ... ఇటువంటివి ఘటనలు రోజుకు ఎన్నో జరుగుతున్నాయి. పెచ్చుమీరిన దళారుల దందా అధికారులతో కుమ్మక్కు తక్కువ ధరతో కొనుగోలు రైతుల పేర్లతోనే స్లాట్లో బుకింగ్ తిరస్కరించిన పత్తినే కొనుగోలు చేస్తున్న వైనం దళారులంతా టీడీపీ మద్దతు దారులు -
ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష
కర్నూలు సిటీ: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)పరీక్షను ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. 8వ తరగతి విద్యార్థులు రాసే ఈ పరీక్షకు జిల్లాలో కర్నూలులో ఆరు, ఆదోనిలో 9, పత్తికొండలో 9 కేంద్రాల ఏర్పాటు చేశారు. మొత్తం 4,124 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,960 మంది హాజరయ్యారు. కర్నూలు బీక్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ తనిఖీ చేశారు. 21న ‘పల్స్పోలియో’ కర్నూలు(హాస్పిటల్): చిన్నారులు పోలియోబారిన పడకుండా ఈ నెల 21న పల్స్పోలియో చుక్కల మందు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమ తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు 3,52,164 మంది చిన్నారులు ఉన్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు ముందస్తు ప్రణాళికలో భాగంగా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. 21న పోలియో కేంద్రాల్లో పల్స్పోలియో కార్యక్రమం ఉంటుందని, ఆ తర్వాత 22, 23వ తేదీల్లో ఇంటింటికి తిరిగి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఇందుకోసం జిల్లాలో 35 పీహెచ్సీలు, 28యుపీహెచ్సీల పరిధిలో 1600 బూత్లు ఏర్పాటు చేశామన్నారు. 52 ట్రాన్సిట్, 63 మొబైల్ కేంద్రాల ద్వారా ఆరుగురు డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. వీరితో పాటు 160 మంది సూపర్వైజర్లు, 39 మంది వ్యాక్సిన్ మేనేజర్లు, 6,400 మంది వ్యాక్సినేటర్లు కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. 12న అంగన్వాడీల సమ్మె వెల్దుర్తి: అంగన్వాడీ సంఘాల ఐక్య ఉద్యమంలో భాగంగా ఈనెల 12న ఒక్క రోజు సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లలిత తెలిపారు. వెల్దుర్తిలో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 1,05,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో పాల్గొనబోతున్నట్లు వివరించారు. గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ వర్కర్లను, హెల్పర్లను 4వ తరగతి, 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని తీర్పునిచ్చిందని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అహోబిలం దేవస్థానం ఏఓగా వీఎల్ఎన్ రామానుజన్ చాగలమర్రి: అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నియమితులైన వీఎల్ఎన్ రామానుజన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర దేశికన్ ఆదేశాలు పాటిస్తూ భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. -
పోలీసు ప్రతిష్ట పెంచేలా పనిచేయండి
కర్నూలు: పోలీసు ప్రతిష్టను పెంచేలా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ మైదానంలో శనివారం హోంగార్డుల 63వ వ్యవస్థాపక దినోత్సవం(రైజింగ్ డే) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించి పరేడ్ పరిశీలన వాహనంపై మైదానం కలియతిరుగుతూ ప్లటూన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులతో సమానంగా హోంగార్డులు సేవలు అందించడం అభినందనీయమన్నారు. సాధారణ డ్యూటీలు మొదలుకొని క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. పోలీసు సిబ్బందితో సమానంగా హోంగార్డుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. హోంగార్డులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో గెలుపొందిన విజేతలకు ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. నలుగురికి సత్కారం సుదీర్ఘకాలం హోంగార్డు విభాగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన శ్రీనివాస శెట్టి, శేషమ్మ, వీరమ్మ, హసీనా బేగం తదితరులను ఎస్పీ శాలువ, పూలమాలలతో సత్కరించి ఒక్కొక్కరికి రూ.2 లక్షల కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కులను అందజేశారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీలు బాబుప్రసాద్, ఉపేంద్ర బాబు, ప్రసాద్, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, సీఐలు మధుసూదన్రావు, చంద్రబా బు, నాగరాజరావు, మన్సూరుద్దీన్, ఆర్ఐలు పోతల రాజు, జావేద్, నారాయణ, ఆర్ఎస్ఐలు మహేశ్వర రెడ్డి,హుసేన్, ప్రదీప్, కల్పన, మహాలక్ష్మి పాల్గొన్నారు. -
పైళ్లెన నెల రోజులకే..
● యువకుడి బలవన్మరణం కొలిమిగుండ్ల: వివాహ బంధంతో ఆనందంగా గడపాల్సిన యువకుడికి ఏమైందో ఏమో కానీ పైళ్లెన నెల రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన శనివారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరుకు చెందిన బట్ట జయరాముడు కుమారుడు శరత్కుమార్(25)కు కర్ణాటక రాష్ట్రం సుగ్నీల్ కొట్టాలకు చెందిన సుస్మితతో గత నెల 4వ తేదీన వివాహమైంది. శరత్కుమార్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం బెంగళూరు వెళ్తూ భార్యను పుట్టింటిలో వదిలిపెట్టాడు. శుక్రవారం బుగ్గకు చేరుకుని కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఉంటున్న స్నేహితుడు హరీష్కు ఫోన్ చేసి అక్కడికి వస్తున్నట్లు చెప్పాడు. హరీష్ పెట్నికోట సమీపంలో నిర్మాణంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ ప్యాక్టరీలోకి డ్యూటీకి వెళ్లాడు. ఆతర్వాత శరత్ తన భార్యతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. శనగ మాత్రలు మింగి డ్యూటీలో ఉన్న స్నేహితుడికి వాయిస్ మెసేజ్ చేశాడు. దీంతో అక్కడి నుంచి రూంకు చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న మిత్రుడిని తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం అనంతపురం రెఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు అనంతపురం చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. రైల్వే డబుల్ లేన్ పనుల పరిశీలనపాణ్యం: నంద్యాల–గుంతకల్లు మధ్య రైల్వే శాఖ చేపట్టిన డబుల్ లేన్ పనులను గుంతకల్లు ఏడీఆర్ఎం సుధాకర్ శనివారం పరిశీలించారు. ఈనెల 12వ తేదీన సికింద్రాబాద్ నుంచి సేఫ్టి అధికారులు పర్యవేక్షణకు వస్తున్న క్రమంలో ముందుస్తుగా ఏడీఆర్ఎం, ఇంజినీర్ల బృందం పనులను పరిశీలించేందుకు ప్రత్యేక రైలులో మార్గంలో తనిఖీలు చేపట్టారు. వారికి ఆయా స్టేషన్ మాస్టర్లు, సిబ్బంది స్వాగతం పలికారు. నూతనంగా చేపట్టిన డబుల్ లేన్, విద్యుత్ సరఫరా, బ్రిడ్జిల నిర్మాణం, ఇతర పనులపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ల వారీగా ఇంజినీర్లును అడిగి తెలుసుకున్నారు. పాణ్యం రైల్వే స్టేషన్లో చేట్టిన డబుల్ ట్రాక్ పనులకు సంబంధించి సమీక్ష చేపట్టారు. -
డిజిటల్ అసిస్టెంట్ లేక వెల్దుర్తికి వెళ్తున్నాం
నా భర్త సత్యానంద్(70) నెల క్రితం చనిపోయాడు. ఆయనకు పింఛన్ వచ్చేది. మా గ్రామంలోని సచివాలయానికి వెళ్లి డెత్ సర్టిఫికెట్, నాకు పింఛన్ సౌకర్యం, ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నా. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. పింఛన్ నాకు వచ్చేలా చేస్తానన్నారు. వారంగా తిరుగుతూ శనివారం వెళ్లి ఫ్యామిలీ సర్టిఫికెట్ గురించి అడిగితే డిజిటల్ అసిస్టెంట్ లేడన్నారు. ఇతను ఎల్.నగరం సచివాలయంలో మూడేళ్లుగా ఖాళీగా ఉన్న డీఏ స్థానంలో డిప్యూటేషన్ చేస్తున్నాడంట. ఆయన అందుబాటులో లేకపోవడంతో సెక్రటరీ సోమవారం రమ్మన్నారు. ఇక ఎదురు చూడలేక సచివాలయంలో దరఖాస్తు చేసుకునే బదులు వెల్దుర్తి మీ సేవలో అప్లయ్ చేసుకునేందుకు వెళ్తున్నాం. పొలం పనులు మానుకుని కాళ్లీడ్చుకుంటూ తిరుగుతున్నాం. – సుశీలమ్మ, స్వాములు (తల్లీ, కొడుకులు), నర్సాపురం గ్రామం -
మొక్కజొన్న రూ.2,400లతో కొనుగోలు చేయాలి
కర్నూలు(సెంట్రల్): మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400 వర్తింపజేయాలని ట్రేడర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ పంటలకు సంబంధించి ట్రేడర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వకపోతే తీవ్ర చర్యలు తప్పవన్నారు. రైతులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖాధికారులను ఆదేశించారు. తూకాల్లో రైతులను మోసం చేస్తే ట్రేడ్ లైసెన్స్లను రద్దు చేయాలన్నారు. లారీ అసోసియేషన్ రవాణా ధరలను పెంచడంతో కొంత సమస్య ఉందని, దానిని పరిష్కరించాలని ట్రేడర్లు కోరారు. సమావేశంలో జేసీ నూరుల్ ఖమర్, డీఏఓ పీఎల్ వరలక్ష్మీ, ఎల్డీఎం రామచంద్రరావు, ఉద్యాన అధికారి రాజకృష్ణారెడ్డి, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్ సెక్రటరీ జయలక్ష్మి పాల్గొన్నారు.మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి -
ప్రజలకు పారదర్శక సేవలు అందించాలనే సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఉద్యోగులను కార్యాలయాల్లో ఉంచకుండా సర్వేల పేరిట ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ కారణంగా ఉద్యోగులు మానసిక ఒత
గ్రామ/వార్డు సచివాలయల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో ప్రభుత్వం 41 రకాల సర్వేలను చేయిస్తోంది. ఇందులో కొన్ని.. హౌస్ హోల్డ్ జీయో కోఆర్డినేట్ మ్యాపింగ్, చిన్నారుల ఆధార్, జనన సర్టిఫికెట్ డేటా కలెక్షన్, పెండింగ్ సిటీజన్ ఈకేవైసీ, మైగ్రేటెడ్ విత్ ఇన్ ఏపీ–జియో కోఆర్డినేట్స్ క్యాప్చరింగ్, మనమిత్ర క్యాంపెయిన్, ఆధార్ సీడింగ్ ఫర్ వాహన్ డాటా, బయోమెట్రిక్ అప్డేషన్ ఫర్ చిల్డ్రన్స్, రైస్ కార్డుల పంపిణీ, వాట్సాప్ డోర్ టు డోర్ క్యాంపెయిన్, రీ వెరిఫికేషన్ హౌస్ హోల్డ్స్ జియో కోఆర్డినేషన్, నాన్ ఏపీ రెసిడెంట్ సర్వే, పీఎంఏవై 2.0 హౌసింగ్ సర్వే, జీయో కోఆర్డినేట్స్ ఆఫ్ షాప్స్, రైతన్నా మీ కోసం, టీఎంఎఫ్ స్కూల్ ఇన్స్పెక్షన్ అండ్ టాయిలెట్స్, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్స్ 5 స్టెప్ వెరిఫికేషన్, రబీ సీజన్ ఈ–క్రాప్ బుకింగ్, ఐపీఎం ఫర్ చిల్లీ ప్లాంట్స్, రీ సర్వే ఆఫ్ ల్యాండ్స్ ఏపీ రీసర్వే ప్రాజెక్ట్–2025, పట్టా, ఆన్లైన్ సబ్ డివిజన్, బీఎల్ఓ డ్యూటీస్ రిగార్డింగ్ ఎస్ఐఆర్ మ్యాపింగ్ తదితర సర్వేలను చేయాల్సి ఉంది. ఏ రోజుకు ఆ రోజు నిర్దేశించిన సర్వేలను పూర్తి చేసి అప్లోడ్ చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి సచివాలయాల్లోని తీవ్ర పని ఒత్తిడిని తట్టుకోలేక ఇద్దరు ఉద్యోగులు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 11న ఓర్వకల్ మండలం నన్నూరు–3 సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ముకుందప్రియ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ● ఎమ్మిగనూరులో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రాజా రత్నంకు బీఎల్ఓ, వార్డు అడ్మిన్ సెక్రెటరీ తదితర అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో తీవ్ర ఒత్తిడితో అనారోగ్యం బారినపడి ఈ నెల 4న మృతి చెందారు. రాజా రత్నం (ఫైల్)ముకుందప్రియ (ఫైల్) సర్వేల పేరిట క్షేత్రస్థాయిలోనే ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యాలతో సతమతం కార్యాలయంలో కనిపించని సిబ్బంది సమయపాలన పాటించక అందని సేవలు ప్రజలు పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
● అలేబాదు వద్ద ఆటో బోల్తా ● ఇద్దరు మహిళలు మృతి ప్యాపిలి: దైవదర్శనం ముగించుకుని ఇంటికి వెళ్తున్న భక్త బృందంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అలేబాద్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు ఈ నెల 4వ తేదీన ఆటో అద్దెకు మాట్లాడుకుని వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి జ్యోతి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. దైవదర్శనం అనంతరం అదే ఆటోలో 5వ తేదీన తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో ప్యాపిలి మండల సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలో దైవదర్శనం చేసుకుని రాత్రి అక్కడే భోజనం చేసి కాసేపు సంతోషంగా గడిపారు. అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. అలేబాదు నుంచి బయలుదేరిన వారి ఆటో వినాయక గుడి మలుపు వద్ద అదుపు తప్పి రక్షణగోడను ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో కళావతి, నాగేంద్రమ్మ (58), బోయ దూది హనుమక్క (66), అయ్యమ్మ, సోమక్క, మద్దమ్మ, లక్ష్మమ్మకు గామాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే రాచర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బోయ హనుమక్క ఆసుపత్రికి చేరుకునేలోపే మృతి చెందగా, నాగేంద్రమ్మ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. మృతి చెందిన లింగుట్ల నాగేంద్రమ్మ అవివాహిత కాగా.. హనుమక్క భర్త కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ఆమె పుట్టినిల్లు రామకృష్ణాపురంలో ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం. తీవ్రంగా గాయపడిన సోమక్క, అయ్యమ్మలను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయ దూది హనుమక్క, నాగేంద్రమ్మ (ఫైల్) -
విద్యార్థుల భోజనం నాణ్యతలో రాజీపడం
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ, సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అందించే భోఽజనం నాణ్యత విషయంలో రాజీపడమని వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ఆచార్య వెంకట బసవరావు అన్నారు. శనివారం ఆ కాలేజీ తుంగభద్ర హాస్టల్లో నూతన డైనింగ్ హాలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తే ఆరోగ్యవంతులై చదువుపై దృష్టి సారిస్తారన్నారు. హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సీనియర్, జూనియర్ విద్యార్థులు అందరు కూడా కలిసిమెలిసి శ్రద్ధగా చదువుకోవాలన్నారు. ఇన్చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హాస్టల్ విద్యార్థుల వసతులు, మెనూ విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు వచ్చినా వార్డెన్లు అందుబాటులో ఉంటారన్నారు. నిరంతరం సీసీ టీవీ నిఘా ఉంటుందన్నారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్లు హాస్టల్లోనే భోజనం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ డీన్లు డాక్టర్ నాగరాజు శెట్టి, డాక్టర్ అక్తర్ భాను, డాక్టర్ మహమ్మద్ వాహిజ్, డిప్యూటీ వార్డెన్లు డాక్టర్ ఎం పార్వతి, డాక్టర్ స్వప్నశ్రీ, డాక్టర్ షానవాజ్ బేగం, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. -
మీ కాల్ .. చేరుకోలేక పోతుంది!
శ్రీశైలం: భక్తుల రద్దీ పెరిగితే శ్రీశైల క్షేత్రంలో సెల్ సేవలు మూగబోతాయి. ఎప్పుడు ఏ కంపెనీ నెట్వర్క్ పని చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ బాగా పని చేస్తుండగా ఇటీవల సిగ్నల్ హెచ్చుతగ్గులతో వినియోగదారులు హలో.. హలో..హలో అంటూ గొంతు చించుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్తో పాటు జియో, ఎయిర్టెల్ మొదలైన సెల్ టవర్లు ఉన్నా అవి కూడా సరిగా పని చేయడం లేదు. ఓ రోజు జియో సిగ్నల్స్ బాగుంటే మరో రోజు ఎయిర్టెల్ సిగ్నల్ ఎత్తిపోతుంది. ఇక బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ బాగా కనిపిస్తున్నా నెట్ సేవలు పూర్తిగా మందగించాయి. వాట్సాప్లో వచ్చే మెసేజ్లు, ఫొటోలు డౌన్లోడ్ కావడానికి గంటల తరబడి సమయం పడుతోంది. ఫోన్పే, గూగుల్పే పేటీఎం మొదలైన ఆన్లైన్ లావాదేవీలకు భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సెల్ ఫోన్లోని తమ అకౌంట్లో డబ్బులు ఉన్నాయని ధీమాతో కొద్దిపాటి మొత్తంతో వచ్చిన భక్తులు అవస్థలు పడుతున్నారు. స్వామివార్ల దర్శన టికెట్లకు, లడ్డు ప్రసాదాలను కొనుగోలుకు, వసతి సౌకర్యం పొందడానికి క్యాష్ రూపేనా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తమ వద్ద ఉన్న డబ్బులు అయిపోతే అకౌంట్లోని డబ్బును క్యాష్ రూపంలో మార్చుకోవడానికి స్థానిక వ్యాపారస్తులను బతిమిలాడుకోవాల్సి వస్తోంది. శ్రీశైలంకు వచ్చే యాత్రికులు భక్తులు సెల్ ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. తీరా ఇక్కడికి వచ్చాక సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేకపోవడం, ఒకవేళ ఉన్న క్యాష్ ట్రాన్స్ఫర్ జరగకపోవడంతో ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఏటా మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయా సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి టెక్నికల్ మేనేజర్లు భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకొని సెల్ టవర్ బూస్టర్లను ఏర్పాటు చేస్తారు. శివరాత్రి ముగిశాక తిరిగి యథాస్థితి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికై నా ఆయా సంస్థల ప్రతినిధులు నెట్వర్క్ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీశైలంలో భక్తులను వేధిస్తున్న సెల్ నెట్వర్క్ ఆన్లైన్ లావాదేవీలకు అంతరాయం శని, ఆది, సోమవారాల్లో కాల్ కలిసిందంటే అదృష్టమే -
‘స్క్రబ్ టైఫస్’ అంటువ్యాధి కాదు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి కర్నూలు (సెంట్రల్): స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి వైద్య బృందంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధి వ్యాప్తి గురించి కలెక్టర్ ఆరా తీశారు. నవంబర్ నెల నుంచి ఈనెల 6వ తేదీ వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని, అందరికీ చికిత్స అందించామని 39 మంది రోగులు డిశ్చార్జి అయ్యారని, ప్రస్తుతం ఐదుగురు ఆసుపత్రిలో ఉన్నారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందన్నారు. అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, దద్దుర్లు, కాటు దగ్గర నల్ల రంగు పట్టు (ఎస్కార్) లక్షణాలు ఉంటాయని, వెంటనే సమీప పీహెచ్సీ/యూపీహెచ్సీని సంప్రదించాలని సూచించారు. జీజీహెచ్ కర్నూలులో పరీక్ష చేసి నిర్ధారణ అనంతరం చికిత్స చేస్తార తెలిపారు. రైతులు పొలాల్లో, పొదల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, పూర్తిగా ఒంటిని కప్పి ఫుల్ షర్టులు, ప్యాంట్లు ధరించాలని సూచించారు. సమావేశంలో జీ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమాదేవి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ శ్రీరాములు, చిన్నపిల్లల విభాగపు హెచ్ఓడీ డాక్టర్ విజయానంద్ బాబు, పల్మనాలజీ హెచ్ఓడీ డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆదోని అర్బన్: పెద్దకడబూరు మండలం తారాపురం గ్రామానికి చెందిన సరస్వతి(22) రోడ్డు ప్రమాదంలో శనివారం మృతిచెందింది. ఇస్వీ ఎస్ఐ మహేష్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తారాపురం గ్రామానికి చెందిన సరస్వతి, భర్త గిరిస్వామి కూలీ పని కోసం, మామ ఉరుకుందప్ప పొలం పని కోసం ఆదోనికి బైక్పై వెళ్తుండగా మండలంలోని కపటి గ్రామ సమీపంలో గరుసుతోలే ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరస్వతి అక్కడికక్కడే మృతిచెందింది. భర్త గిరిస్వామి, మామ ఉరుకుందప్పకు గాయాలయ్యాయి. సరస్వతికి కుమారుడు, కుమార్తె సంతానం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎకై ్సజ్ సిబ్బంది రక్తదానం కర్నూలు: తలసీమియా వ్యాధిగ్రస్తులకు ఎకై ్సజ్ సిబ్బంది రక్తదానం చేశారు. కర్నూలు ఎకై ్సజ్ కార్యాలయ ఆవరణంలో జెమ్కేర్ కామినేని హాస్పిటల్ సహకారంతో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, కర్నూలు డీపీఈఓ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. ఎకై ్సజ్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 160 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధిగ్రస్థులకు ఈ సందర్భంగా రక్తదానం చేశారు. ఎకై ్సజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరిబాబుతో పాటు ప్రతినిధి బృందం కూడా కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. క్వార్ట్జ్ మైన్స్పై వ్యతిరేకత వెల్దుర్తి: బుక్కాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 214లో నాలుగు ఎకరాల్లో ఎంఎస్ ఇన్ఫినిటి మినరల్స్ కంపెనీ ఏర్పాటు చేయనున్న క్వార్ట్జ్ అండ్ సిలికా శ్యాండ్ మైనింగ్ ఏర్పాటుకు స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్డీఓ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొనగా కంపెనీ ఏర్పాటు తమ పంట పొలాలు దెబ్బతింటాయని, కాలుష్యం పెరుగుతుందని గ్రామ నాయకుడు శంకర్ రెడ్డి, రైతులు అధికారుల ఎదుట తమ వాదన వినిపించారు. అంతే కాకుండా గ్రామానికి 4కి.మీల దూరంలో సభ నిర్వహించడంపై రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్డీఓ పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. -
టూవీలర్ ర్యాపిడో వ్యవస్థను రద్దు చేయండి
కర్నూలు: ర్యాపిడో సంస్థలో టూ వీలర్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ అనుబంధ ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నగర కార్యద ర్శి రాధాకృష్ణ నేతృత్వంలో ప్రతినిధుల బృందం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శాంతకుమార్ను తన కార్యాలయంలో కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఓలా, ఉబేర్, ర్యాపిడో సంస్థలతో ఆటో కార్మికులు రోడ్డున పడుతున్నారన్నారు. నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలైన టూ వీలర్లలో ప్రయాణికులను చేరవేస్తూ ఆటోడ్రైవర్ల ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకున్నట్లు లేదని, ర్యాపిడో యాజమాన్యాన్ని పిలిపించి చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఎస్.హుసేన్ వలి, మాలిక్ బాషా, ఖలీల్ అహ్మద్ డీటీసీని కలసిన వారిలో ఉన్నారు. -
రెండు నెలలుగా తిరుగుతున్నా
కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నా. నాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. కొత్త రేషన్ కార్డు కోసం సచివాలయం–1 చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నా. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడంతో అక్కడి సిబ్బంది సచివాలయం–4కు వెళ్లమన్నారు. ఇక్కడ ఎంట్రీ చేసిన 21 రోజుల తర్వాత రమ్మన్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగున్నా ఫలితం లేకపోతోంది. పనులు మానుకుని కార్డు కోసం తిరగాల్సి వస్తోంది. – గోపాల్, కోసిగి సచివాలయాల్లో సిబ్బంది కొరత కారణంగా పనులు జరగడం లేదు. గతంలో వలంటీర్లు ఉండడంతో ఇంటికి వచ్చి సేవలు అందించేవారు. ఇప్పుడు ఏ పనికై నా సచివాలయానికి వెళ్లి గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. సర్వేల పేరుతో బయటకు వెళ్తున్నారు. సచివాలయం ఉద్యోగులు ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో సచివాలయ సిబ్బంది పింఛన్లు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. – కుమార స్వామి, గూళ్యం గ్రామం, హాలహర్వి మండలం సచివాలయ ఉద్యోగులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలీదు. కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా సిబ్బంది ఉండరు. ఒకరో ఇద్దరో ఉంటారు. వారిని అడిగితే సరైన సమాధానం కూడా రాదు. ఫీల్డ్కు వెళ్తుతున్నారని చెబుతారు తప్ప పనులు జరగడం లేదు. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – వీరేష్, చిన్నమరివీడు గ్రామం● -
వెటర్నేరియన్ పదాన్ని ఇతరులు వాడరాదు
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖలో వెటర్నేరియన్ అనే పదాన్ని బీవీఎస్సీ అండ్ ఏహెచ్ డాక్టర్ కోర్సు చదవిన వారు మాత్రమే వాడుకునేందుకు అర్హత ఉందని ఉమ్మడి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారుల సంఘం, వెటర్నరీ అసిస్టెంటు సర్జన్స్ అసోషియేషన్ నేతలు తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో ఇతరులు వెటర్నేరియన్ అనే పదాన్ని వాడుతున్నారని, దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెటర్నరీ అనే పదాన్ని వాడుకోవచ్చని, ఇందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, వెటర్నేరియన్ అనే పదాన్ని వాడరాదన్నారు. ఇతరులు ఈ పదాన్ని వాడితే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) సెక్షన్ 56, 1984 ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. పారా వెటర్నరీ సంఘాలు, నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్ పెడరేషన్లో వెటర్నేరియన్ అనే పదాన్ని తొలగించుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హేమంత్కుమార్కు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఆర్.నాగరాజు, కార్యవర్గసభ్యుడు వెంకటసుబ్బయ్య, పశువైద్యుల సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి మనోజ్ అరుణ్కుమార్, ఉపాధ్యక్షుడు మదన్మోహన్ తదిర తులు ఉన్నారు. -
పదిలో ఉత్తీర్ణత శాతం పెంచాలి
కోడుమూరు రూరల్: పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ శామ్యూల్పాల్ సూచించారు. శనివారం ఆయన కోడుమూరులోని బాలురు, బాలికల హైస్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా స్కూళ్లలో పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పర్యవేక్షించి విద్యార్థులతో మాట్లాడారు. డీఈఓ ఆయా సబ్జెక్టుల్లోని ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి స్వయంగా సమాధానాలు రాబట్టారు. డీఈఓ మాట్లాడు తూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఆయా హైస్కూళ్లలో ఉపాధ్యాయులంతా పదవ తరగతి విద్యార్థులకు ప్రతి రోజు ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా సైన్స్, మ్యా థ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేసి ఆయా సబ్జెక్టులపై పట్టు సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులకు అల్పాహా రం అందివ్వాలన్నారు. కార్యక్రమంలో బాలురు, బాలికల హైస్కూళ్ల హెచ్ఎంలు రామచంద్రుడు, ఇంద్రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో ఐదుగురికి పార్టీ పదవులు కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయిలో ఒకరికి, నియోజకవర్గ స్థాయిల్లో నలుగురికి పార్టీ పదవులు దక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కళాకారుల విభాగం జిల్లా అధ్యక్షులుగా కనికె మల్లిఖార్జున (ఎమ్మిగనూరు) నియమితులయ్యారు. అలాగే వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నియోజకవర్గ అధ్యక్షులుగా బి.పి.శోభలతా(ఆదోని), వి.సురేష్ బాబు(ఆలూరు), సురేంద్ర రెడ్డి(కోడుమూరు), ఎల్. నెట్టికల్(పత్తికొడ) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిగ్రీ పరీక్షలకు 93 శాతం హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో 93 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా శనివారం జరిగిన పరీక్షలకు 6,677 మందికి 6,232 మంది హాజరు కాగా 445 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు శ్రీ సాయికృష్ణ డిగ్రీ కళాశాల, పత్తికొండ విజయసాయి డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున చూచిరాతకు పాల్పడటంతో డిబార్ చేశామన్నారు. వారం రోజులైనా అందని వేతనాలు కర్నూలు(అగ్రికల్చర్): డిసెంబర్ నెల మొదలై ఏడు రోజులు గడిచినా ఉమ్మడి జిల్లాలో సగానికిపైగా ఉద్యోగులకు వేతనాలు అందని పరిస్థితి. చంద్రబాబు సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని ప్రకటిస్తోంది. అయితే వాస్తవానికి ఆ ప్రకటనల్లో నిజం లేదని ఉద్యోగులే వాపోతున్నారు. అక్టోబర్ 2వ తేదీ విజయదశిమి సందర్భంగా కూడా 1వ తేదీ వేతనాలు చెల్లించలేదు. ఆ నెలలో 7–9 తేదీల్లో వేతనాలు బ్యాంకు ఖాతాలకు జమ అయ్యాయి. నవంబర్ నెలలో 9వ తేదీ నాటికి వేతనాలు చెల్లించారు. డిసెంబర్ నెలలో కూడా వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ, వ్యవసాయం, ఉద్యానశాఖ, జిల్లా ముఖ్య ప్రణాళిక కార్యాలయం, కార్మికశాఖ, ఆర్అండ్బి, నీటిపారుదల తదితర శాఖల ఉద్యోగులకు వేతనాలు జమ కాలేదు. కొన్ని శాఖల ఉద్యోగులకు 2, 3 తేదీల్లో వేతనాలు పడ్డాయి. అత్యధిక శాఖల ఉద్యోగులు ఇప్పటికీ వేతనాల కోసం నిరీక్షిస్తుండటం గమనార్హం. -
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
కర్నూలు: కోర్టులలో పెండింగ్లోని మోటర్ యాక్సిడెంట్లు, సివిల్ కేసులు, భూసేకరణ, బ్యాంకు, చిట్ఫండ్, చెక్బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచించారు. జిల్లాస్థాయిలో డిసెంబర్ 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్పై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో శనివారం సమీక్ష నిర్వహించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఇన్సురెన్స్ న్యాయవాదులు, ఏపీఎస్ఆర్టీసీ కర్నూలు డిపో మేనేజర్, బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్ఫండ్స్, భూసేకరణ సంబంధిత అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఎక్కువ కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే విధంగా ప్రత్యేక దృష్టి సారించి విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు. కక్షిదారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు, డిపో మేనేజర్ సుధారాణి, ఇన్సురెన్స్ న్యాయవాదులు, ఇన్సురెన్స్ అధికారులు, బ్యాంకుల లీడ్ డివిజినల్ మేనేజర్ రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దా‘ఉడుమూ’తలు..
కనుక్కోండి చూద్దాం ఆటకు సరిగ్గా సరిపోతుంది ఈ చిత్రం. ఈ చిత్రంతో కంటి చూపును పరీక్షించుకోవచ్చు. ఇందులో ఓ జీవి దాగి ఉంది. ఆహారన్వేషణలో దాగుడుమూతలు ఆడుతూ ఆకలి తీర్చుకుంటోంది. ఇంకా గుర్తు పట్టలేదా.. బాగా చూడండి.. చెట్టు మొదలులో తొర్ర సమీపంలో ఉడుము ఉంది. చెట్టు రంగులో కలసిపోయి పురుగులు, కీటకాలను వేటాడుతోంది. ఈ దృశ్యం శనివారం బ్రహ్మగుండం క్షేత్రంలో కనిపించింది. – వెల్దుర్తి -
అంబేడ్కర్ వర్ధంతిని విస్మరించడం అవమానించడమే!
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికర్నూలు (టౌన్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించడం అవమానించడమే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ 69 వ వర్థంతిని పురస్కరించుకొని శనివారం పాతబస్టాండ్లోని విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో టెంకాయ కొట్టి పూలమాలు వేసి నివాళ్లు ఘనంగా అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం, పౌర హక్కుల కోసం అంబేడ్కర్ చేసిన కృషి అపారమైందన్నారు. ఆయన చూపిన మార్గమే తూచ తప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అమలు చేసిందన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని అని తెలిసి కూడా చంద్రబాబు ప్రభుత్వం కనీసం అంబేడ్కర్ విగ్రహం చుట్టూ శుభ్రం చేయించడంలో విఫలం చెందిందన్నారు. చెత్తాచెదారం నిండి ఉన్నా మున్సిపల్ అధికారులకు కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ ఆశించిన సమానత్వం, సమాజ నిర్మాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రేలంపాడు వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు కమతం పరుశరామ్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైల్వే ప్రసాద్, ఆర్టీఐ నగర అధ్యక్షుడు గద్ద రాజశేఖర్, నవీన్, ప్రభుదాస్, చందు, లాయర్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్, చెన్న, సత్యరాజు, పార్టీ దళిత నాయకులు పాల్గొన్నారు. -
పైపులు ధ్వంసం చేసి.. స్టార్టర్ అపహరించి..
● వైఎస్సార్సీపీ మద్దతుదారుడి పొలంలో దుండగుల దాష్టికంఆత్మకూరురూరల్: నల్లకాల్వ గ్రామంలో ఓ రైతు పొలంలో గుర్తు తెలియని అగంతకులు పైపులు ధ్వంసం చేసి స్టార్టర్ను ఎత్తుకు పోయారు. వెలుగోడుకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు జనార్దన్ నల్లకాల్వలో కొంత పొలం కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నాడు. కాగా ఈ పొలం విషయంలో కొందరితో ఆయనకు కోర్టులో సివిల్ వాజ్యం ఉంది. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జనార్దన్ను కోర్టుతో సంబంధం లేకుండా తమ వద్దకు వచ్చి పంచాయితీ చేసుకోవాలని పదేపదే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ట్రాక్టర్తో జనార్దన్ పొలం దున్నించే యత్నం కూడా చేశారు. ఈ అంశం అప్పట్లో పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. కాగా మరో మారు పంచాయితీకి రమ్మని టీడీపీకి చెందిన కొందరు జనార్దన్ను పిలిచారు. అయితే కోర్టులో వచ్చే తీర్పును బట్టే తాను నడుచుకుంటానని జనార్దన్ వారితో చెప్పాడు. ఈ నేపధ్యంలో శుక్రవారం రాత్రి జనార్దన్ పొలంలో ఉన్న మోటార్కు చెందిన పైపులు ధ్వంసం అయ్యాయి. అంతే కాకుండా విద్యుత్ స్తంభానికి కట్టిన స్టార్టర్ కూడా మాయమైంది. ఉదయం పొలంలో నీరు పెట్టడానికి వెళ్లిన కూలీ జనార్దన్కు జరిగిన విషయం తెలిపాడు. దీంతో బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చట ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మబడును
● అడ్వాన్స్ ఇవ్వండి.. జాబ్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ ఇవ్వండి ● నిరుద్యోగులను బురిడీ కొటిస్తున్న ఓ ఉద్యోగి ఆత్మకూరురూరల్: భలే మంచి చౌకబేరం.. అంటూ ఆత్మకూరులో ఓ ఘనుడు ప్రభుత్వ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాన ని నిరుద్యోగులను మభ్యపెట్టి అందినకాడికి దోచుకుంటున్నాడు. అందులోనూ అతను ప్రభుత్వ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కావడంతో కొందరు సులువుగా న మ్మి మోసపోతున్నారు. అర్హతను బట్టి రెవెన్యూ, అటవీ వాఖ, ఎండోమెంట్.. ఇలా ఏ శాఖ కావాలో కోరుకో.. అంటూ చెబుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లె మండలాలకు చెందిన నిరుద్యోగులు ఇతని బుట్టలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. అడ్వాన్స్గా కొంత ఇచ్చి ఉద్యోగంలో చేరిన తర్వాత మొత్తం ఇచ్చేలా ఒప్పందం అంటూ.. నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాడు. పాములపాడు, బానకచర్లకు చెందిన ఇద్దరు వ్యక్తులు అటవీ శాఖలో ఉద్యోగం కోసం రూ. లక్ష చొప్పున అతనికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల పేరుతో వ్యాపారం మొదలు పెట్టడంతో బాధితులు ఇంకా రోడ్డున పడలేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్లు తీసుకుంటూ నోటిఫికేషన్ల కోసం ఎంతో మంది యువత ఎదురు చూస్తుంటే ఆత్మకూరులో ఓ ఉద్యోగి మాత్రం జాబ్కు ఇంతా.. అంటూ బేరం పెట్టడంపై ఆత్మకూరు లో తీవ్ర చర్చ సాగుతోంది. జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిరుద్యోగులను దోచుకుంటున్న ఉద్యోగిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి
కర్నూలు : ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని హోంగార్డులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. డిసెంబర్ 6వ తేదీ హోంగార్డ్స్ 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని (రైజింగ్ డే) పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పెరేడ్ మైదానంలో అమీలియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దాదాపు 10 మంది డాక్టర్లు శిబిరంలో పాల్గొని హోంగార్డు కుటుంబాలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. జబ్బులు బయటపడిన వారు ఆరోగ్య భద్రత పథకం కింద మరోసారి వైద్యపరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని హోంగార్డు కుటుంబాలకు ఎస్పీ సూచించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు బాబు ప్రసాద్, ప్రసాద్, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతితో పాటు హోంగార్డు ఆర్ఐలు పోతల రాజు, జావిద్, నారాయణ, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో నాల్గవ తరగతి ఉద్యోగాల పేర్లు మార్చండి
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న నాల్గవ తరగతి సిబ్బంది హోదాలకు సంబంధించిన పేర్లను మార్చాలని ఆయా సంక్షేమ శాఖల నాల్గవ తరగతి ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు దిబ్బలమ్మ, అధ్యక్షులు శ్రీరాములు కోరారు. ఈ పేర్లతో సమాజంలో తాము వివక్షతకు గురవుతున్నామన్నారు. తమకు ఇళ్లను అద్దెకు ఇచ్చేందుకు కూడా యజమానులు ఆలోచిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కే చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నాగేశ్వరితో కలిసి ఆయా సంక్షేమ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలను అందించినట్లు చెప్పారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. వంట మనిషిని హాస్టల్ ఫుడ్ మేనేజర్, కమాటీని హాస్టల్ కేర్ టేకర్, వాచ్మెన్ను హాస్టల్ ప్రొటెక్షన్గా పిలిచే విధంగా మార్పు చేయాలని కోరామన్నారు. ఉన్నతాధికారులను కలిసిన వారిలో రాష్ట్ర కోశాధికారి కే పరమేశ్వరరావు, జిల్లా నేతలు మాధవ, మల్లీశ్వరి, సోమిబాయి తదితరులు ఉన్నారు. -
ఆయుష్మాన్ కళాశాల వద్ద ఆందోళన
కర్నూలు(హాస్పిటల్):కర్నూలు నగరంలోని ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల వద్ద శుక్రవారం కొందరు విద్యార్థులు తమకు హాల్టికెట్లు ఇవ్వలేదని ఆందోళన చేశారు. తాము జూలై నెలలోనే పరీక్ష ఫీజు చెల్లించినా ఇప్పటి వరకు హాల్టికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి పలు విద్యార్థి సంఘ నాయకులు భాస్కర్ నాయుడు, కటారుకొండ సాయికుమార్, కడుమూరు గిరీష్లు మద్దతు పలికారు. కళాశాల యాజ మాన్యంతో మాట్లాడేందు కు ప్రయత్నించగా ఆ సమయంలో అక్కడి సిబ్బంది వీరిని అడ్డుకుని వాగ్వాదాని కి దిగారు. కళాశాల యాజమాన్యం అవినీతి, అక్రమా లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘం నాయకు లు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నాయకులు ఖా జాహుసేన్,కురువ రంగన్న, పవన్,హరి పాల్గొన్నారు. -
బాలింత మృతితో బంధువుల ఆందోళన
కోడుమూరు రూరల్: గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి హాస్పిటల్లో బాలింత మృతితో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మీ (23)ని సి.బెళగల్ మండలంలోని సింగవరం గ్రామానికి చెందిన రాజుకు ఇచ్చి రెండేళ్ల కిందట పెద్దలు వివాహం చేశారు. కాన్పు కోసం పెంచికలపాడు విశ్వభారతి హాస్పిటల్కు వెంకటలక్ష్మి రెండు రోజుల కిందట వెళ్లారు. గురువారం వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయగా ఆడపిల్లకు జన్మనిచ్చారు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన వెంకటలక్ష్మి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే వెంకటలక్ష్మి మృతిచెందిదంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న తాలూకా సీఐ చంద్రబాబు, కె.నాగలాపురం ఎస్ఐ శరత్కుమార్రెడ్డి పోలీస్ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల ఆందోళనను విరమింపజేశారు. -
యువకుడి బలవన్మరణం
ఓర్వకల్లు: ప్రేమ వివాహానికి కుటుంబ పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు బల వన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుమ్మితం తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వేముల గ్రామానికి చెందిన జైకుమార్(25) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో నాలుగు నెలల క్రితం శకునాల గ్రామానికి వచ్చాడు. గుమ్మితం తండా సమీపాన ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్టులో దినసరి కూ లీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదని తీవ్రమనస్తాపానికి గురైన జైకుమార్ ఈ నెల 4న పని ముగించుకొని తన ఫోన్ స్విచ్చాఫ్ చేసి, గుమ్మితం తండా, బ్రాహ్మణపల్లె గ్రామాల మధ్యన ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. అటుగా వెళ్లుతున్న వ్యక్తులు బావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించారు. ఎస్ఐ సునీల్కుమార్ తన పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలుపలికి తీశారు. -
పదకొండు నెలల్లో 8 వేల కేసులు...
జిల్లాలో రోజుకు సగటున చిన్నా, పెద్దవి కలసి ఐదు రహదారి ప్రమాదాలు నమోదవుతున్నాయి. ప్రతి పది ప్రమాదాల్లో మూడింటికి మద్యం మత్తే కారణమని గణాంకాలను బట్టి తెలుస్తోంది. మద్యం మత్తు వల్ల ప్రమాదాలకు గురైతే బీమా పథకాలు వర్తించవని పోలీసులు సూచిస్తున్నారు. ఒకరు చేసే తప్పునకు వారి కుటుంబం మొత్తం బాధ పడటమే కాకుండా ఇతర వాహనదారులు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. రోడ్డు భద్రత, పోలీసు సూచనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణాలు సాధ్యం. ఈ ఏడాది జిల్లాలో పదకొండు నెలల్లో ఎనిమిది వేలకు పైగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి మద్యం మత్తులో ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య తీవ్రత అర్థమవుతోంది. కర్నూలు: మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. మత్తులో వాహనాలు నడపవద్దని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా చాలామంది దానిని పట్టించుకోవడం లేదు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి జరిమానాల కొరఢా విధిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఎంతో మంది మృతి చెందుతున్నారు. జిల్లాలో గత మూడేళ్లలో 1,650 రోడ్డు ప్రమాదాలు జరగ్గా దాదాపు 870 మంది మృత్యువాత పడ్డారు. 1,861 మంది క్షతగాత్రులుగా మిగిలిపోయి కుటుంబాలకు భారంగా జీవనం సాగిస్తున్నారు. అక్టోబర్ 24న చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద సంఘటన మొదలు జిల్లాలో వరుసగా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. 40 రోజుల వ్యవధిలో సుమారు 50 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందటం వాటి తీవ్రతకు అద్దం పడుతోంది. మద్యం కేసులను తీవ్రంగా పరిగణిస్తున్న కోర్టులు... మద్యం తాగి వాహనాలు నడపటం నేరం. ఇలాంటి కేసులను కోర్టులు సైతం తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గతంలో బ్రీత్ ఎనలైజర్లో చూపించే లెక్క ఆధారంగా రూ.2 వేల నుంచి రూ.3 వేలు జరిమానా పడేది. మోతాదుకు మించి ఉంటే జైలు శిక్ష విధించేవారు. అయినా మందుబాబుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో న్యాయ స్థానాలు భారీగా జరిమానా విధిస్తున్నాయి. కొంతకాలంగా కోర్టు మెట్లు ఎక్కిన ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. 30 శాతం మత్తే కారణం మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటున్నారు. 25 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారు ఉంటున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. మద్యం తాగి స్పృహ లేకుండా వాహనాలు నడిపి ఇతరులను ప్రమాదాల్లో పడేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు డివైడర్లకు తగిలి పడిపోయినా... ఎదురెదురు వాహనాలు ఢీకొట్టుకున్నా... ఆగిన వాహనాలను వెనుక నుంచి బలంగా ఢీకొట్టినా, ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి పడిపోయినా, పాదచారులపై దూసుకెళ్లినా... ఇలా చాలా ప్రమాదాల్లో మద్యం మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రోడ్లలో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రతి నెలా పాతికమందికి పైగానే చనిపోతున్నారు. 80 పాయింట్లు దాటితే కేసే... జాతీయ రహదారులతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న పోలీస్స్టేషన్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడిన వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు నడిపిన వ్యక్తికి భారీ జరిమానా, జైలు శిక్ష విధిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్లో 80 పాయింట్ల కంటే ఎక్కువ చూపితే వారిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారుల్లో తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య వాహనచోదకులకు స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. మద్యం తాగి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. ప్రమాదానికి గురైతే కుటుంబీకులు ఇబ్బంది పడతారనే విషయాన్ని విస్మరించవద్దు. ప్రధానంగా యువత మద్యం మత్తులో వాహనాలు నడపటం, ప్రమాదాలకు గురవడం ఆందోళనకరం. చాలా మందిలో మార్పు రావడం లేదు. వారి విలువైన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తనిఖీల సందర్భంగా సూచిస్తున్నా మార్పు కనిపించటం లేదు. – మన్సూరుద్దీన్, ట్రాఫిక్ సీఐ సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2023 509 298 568 2024 520 281 614 2025 621 291 679 అక్టోబర్ వరకు -
ఐక్యతతోనే ఆదోని జిల్లా సాధ్యం
ఆదోని టౌన్: అందరూ ఐక్యంగా ఉంటేనే ఆదోని జిల్లా సాధ్యం అవుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్రెడ్డి అన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి శుక్రవారం ఆదోనికి వచ్చారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదోని జిల్లా సాధనకు కలసికట్టుగా పోరాడుదామన్నారు. ఆదోని జిల్లా కేంద్రం అయితే కేంద్రం నుంచి నిధులు వస్తాయని, అన్ని కార్యాలయాలు ఏర్పడుతాయన్నారు. ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. ఆదోని ప్రాంతం జిల్లా అయితే 60 శాతం అభివృద్ధి జరిగినట్లేనని తెలిపారు. ఆలూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా తెలిపారు. ఈ నెల 3న అంతర్జాతీయ విభిన్న ప్రతి భావంతుల (దివ్యాంగుల) దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పలు అవకాశాలను కల్పించినట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేయాల్సి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందిస్తున్న విధంగానే దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఆయా విద్యా సంస్థల్లో పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. రూ. 22 లక్షల విలువ చేసే విత్తనాలు సీజ్ ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని రెండు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేసి రూ. 22.22 లక్షల విలువ చేసే విత్తనాలను పట్టుకున్నట్లు ఏడీఏ మహమ్మద్ఖాద్రి, ఏవో శివశంకర్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణ ట్యాంక్ బండ్ రోడ్డులో ఉన్న శివకిరణ్ ట్రేడర్స్, గంజల్లరోడ్డులోని క్రాంతి ఆగ్రో ట్రేడర్స్లో అనధికారికంగా వరి, మొక్క జొన్న విత్తనాలు ఉన్నాయని సమాచారం రావటంతో ఏడీఏ మహమ్మద్ఖాద్రి, ఏవో శివశంకర్లు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెండు దుకాణాల్లో మూడు రకాల పెన్నా సీడ్, కోర్ సీడ్ (మొక్కజొన్న), వరి (టీ స్టెయిన్స్) విత్తనాలు ఎటువంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్నారని చెప్పారు. అనధికారికంగా ఉన్న విత్తనాలు సంచులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వీటి విలువ రూ. 22,22, 2500 ఉంటుందని, 6ఏ కేసు నమోదు చేసి జిల్లా జాయింట్ కలెక్టరకు పంపనున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా విత్తనాలు, ఎరువులు విక్రయించినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, వెంటనే స్పందిస్తామని పేర్కొన్నారు. తనిఖీల్లో ఏఈవోలు నరసింహులు తదితరులు ఉన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో అప్పులా? ఆలూరు: అమరావతిని అభివృద్ధి పేరుతో అప్పు చేయడం తగదని సీపీఎం జాతీయ కార్యవర్గ మాజీ సభ్యుడు గఫూర్ అన్నారు. ఆలూరులో శుక్రవారం ఎస్ఎఫ్ఐ స్వర్ణోత్సవాల ముగింపు మహాసభ నిర్వహించారు. సభలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు అమరావతి అభివృద్ధి ఒక్కటే కనిపిస్తోందని, రాయలసీమ జిల్లాల్లో తాగు, సాగునీటి సమస్యలు కనిపించడం లేదన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రంగన్న, సీపీఎం నాయకులు హనుమంతు, నారాయణస్వామి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
టీబీ డ్యాం గేట్ల ఏర్పాటుకు పూజలు
కర్నూలు సిటీ: టీబీ డ్యాం గేట్ల ఏర్పాటుకు శుక్రవారం టీబీ బోర్డు సెక్రటరీ ఓ.రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్ పూజలు నిర్వహించారు. గతేడాది ఆగష్టు నెలలో వచ్చిన భారీ వరద నీటి ప్రవాహనికి డ్యాం 19వ క్రస్టు గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు స్థానంలో తాత్కలికంగా స్టాప్లాక్ గేటును ఏర్పాటు చేశారు. సీడబ్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్, నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీ ఆధ్వర్యంలో కమిటీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి ఇచ్చిన సూచనలు ఆధారంగా కేఎస్ఎన్డీటీ సర్వీసెస్ అనే సంస్థతో స్టడీ చేయించారు. ఆ సంస్థ సుమారుగా 15 రకాల పరీక్షలు నిర్వహించి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా డ్యాం 33 గేట్లు మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం డ్యాంలో 1621.98 అడుగులు, 67.05 టీఎంసీ నీరు ఉంది. ఈ నీటి మట్టం 1613 అడుగులకు చేరిన తరువాత సిద్ధంగా ఉంచిన 15 గేట్లను మార్చనున్నారు. ప్రస్తుతం గేట్లను 1621.98 అడుగుల వరకు ఎలిమెంట్స్ను తొలగించే పనులు ఒకటి, రెండు రోజుల్లో పనులు మొదలు పెట్టనున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఆదోని అర్బన్: కంటైనర్ ఢీకొనడంతో ఆస్పరి మండలం తురువగల్ గ్రామానికి చెందిన వెంకటేష్(38) అనే వ్యక్తి శుక్రవారం మృతిచెందారు. తాలూకా ఎస్ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటేష్ తల్లి బజారమ్మ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆదోని పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం భార్యను అమ్మ దగ్గర వదిలి తిరిగి తురువగల్లు గ్రామానికి వెంటకేష్ వెళ్తుండగా ఆస్పరి రోడ్డులో ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య పవిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
వెల్దుర్తి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఆ వేదిక చైర్ పర్సన్, రిటైర్ట్ జడ్జి శ్రీనివాస ఆంజనేయ మూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక విద్యుత్ కార్యాలయంలో కర్నూలు డివిజన్ పరిధిలోని వినియోగదారులకు డీఈ/ఈఈ శేషాద్రి ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు టౌన్, కర్నూలు, కల్లూరు రూరల్, వెల్దుర్తి, కృష్ణగిరి, ఓర్వకల్లు మండలాల వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన కార్యక్రమంలో ఇనుప విద్యుత్ స్తంభాలను మార్చాలంటూ వినియోగదారులు విన్నవించారు. వెల్దుర్తి పట్టణంలో శాశ్వత విద్యుత్ బిల్లుల చెల్లింపు సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. వెల్దుర్తి నుంచి నాలుగు, ఇతర మండలాల నుంచి నాలుగు సమస్యలు వేదిక, అధికారుల ముందుకు రాగా కార్యక్రమానికి హాజరైన కర్నూలు ఎస్ఈ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తెలిపిన సమస్యలు, అందించిన నివేదికలపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. బిల్ కలెక్టర్ నియమిస్తామన్న హామీనిచ్చారు. వినియోగదారులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీతో సోలార్ రూఫ్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక ప్రతినిధులు మధుసూదన్, శ్రీనివాసబాబు, విజయలక్ష్మి, ఎస్ఏఓ చిన్నరాఘవులు, ఏడీఏ సుబ్బన్న, ఇన్ఛార్జ్ ఏఈ వెంకటేశ్వర్లు, కర్నూలు, కల్లూరు సబ్డివిజన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘చంద్రబాబు ప్రాజెక్టులు కోసం గంప మట్టివేయలేదు’
కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల కోసం గంపమట్టివేయలేదని సీపీఎం జాతీయ నాయకులు గఫూర్ విమర్శించారు. చంద్రబాబుకు అమరావతి తప్ప వేరే అజెండా ఏమీ లేదని మండిపడ్డారు. అమరావతి కోసం లక్షల కోట్లు అప్పులు తెస్తున్నావని, చేసింది మాత్రం ఏమీ లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు రోజు ఉపన్యాసాలు చేస్తుంటావు కాని ఆలూరులో రోడ్ల పరిస్థితి ఒకసారి చూడు. జిల్లాల సమగ్రాభివృద్ధికి కొరకు నంద్యాల జిల్లా చేశారు వైఎస్ జగన్. అదే విదంగా చంద్రబాబు ఆదోని జిల్లా చేయాలి. కర్నాటక ప్రభుత్వం ఆంధ్ర నీళ్ళను జల దోపిడీ చేస్తున్నా.. చంద్రబాబుకు పట్టదు. చంద్రబాబు వేదవతి ప్రాజెక్టు కోసం ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రాజెక్టులు కోసం గంప మట్టివేయలేదు. చంద్రబాబు పోలవరం ,అమరావతి తప్ప వేరే అజెండా పట్టదు’ అని మండిపడ్డారు. -
ప్రగతి.. వెనుక‘బడి’
కర్నూలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో పాఠశాల విద్య అస్తవ్యస్తంగా తయారైంది. సమీక్షలు, నివేదికలు అంటూ విద్యాశాఖ అధికారులపై జిల్లా స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది. నేడు(శుక్రవారం)మూడోసారి మోగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించనున్నారు. విద్య సంస్కరణలు అంటూ సీబీఎస్ఈ విద్యను, ట్యాబ్ల పంపిణీ రద్దు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చి మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదిలో రూ.2 వేలు కట్ చేసి రూ.13 వేలు జమ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, 1వ తరగతిలో చేరిన పిల్లలకు ఇంత వరకు జమ కాలేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో విద్యార్థులకు ఇచ్చిన బ్యాగ్లు నెల రోజులకే పాడైపోయాయి. వీటి స్థానంలో కొత్తవి ఇస్తామని వెనక్కి తీసకొని ఇంత వరకు ఇవ్వలేదు. కొలతలు లేకుండా బూట్లు ఇవ్వడంతో చాలా మంది విద్యార్థులు చెప్పులతోనే స్కూళ్లకు వెళ్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోఽజనం పేరుతో విద్యార్థులకు సన్న బియ్యంతో పెడుతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘నాడు– నాడు’తో 60 స్కూళ్ల రూపు రేఖలు మార్చింది. అయితే చంద్రబాబు న్రభుత్వం వచ్చి ఏడాదిన్నర్ర అయినా చివరి దశలో మిగిలిన పనులను పూర్తి చేయలేకపోయింది. ఉపాధ్యాయులపై వేధింపులు జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలు 2250 ఉన్నాయి. వీటిలో 4.50 లక్షల మంది విద్యార్థులు, 15,066 మంది టీచర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేటు స్కూళ్లలోను మోగా పేరెంట్స్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం మొదలైన నాటి నుంచి జూన్ నెల 21వ తేదీ వరకు యోగాంధ్ర పేరుతో రోజు గంటల తరబడి వెబెక్స్లు..టెలీకాన్ఫరెన్స్లు..యోగాంధ్రక రిజిస్ట్రేషన్స్ అంటూ గడిపేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ప్రక్రియతో మరి కొంత సమయం పోయింది. జూలైలో వారం రోజుల పాటు, ఇప్పుడు వారం రోజుల పాటు మోగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మోగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాలను రెండు సార్లు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు సర్కార్లో చతికిలబడిన చదువులు అసంపూర్తిగా తరగతి గదుల నిర్మాణాలు నేడు మోగా పేరెంట్స్ 3.0 సమావేశం -
లక్ష గృహాలకు ‘పీఎం సూర్యఘర్’
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరికర్నూలు(సెంట్రల్): పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో లక్ష గృహాలకు పైకప్పు సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసే విధంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జెడ్పీ సీఈఓ, డీఆర్డీఏ, మెప్మా పీడీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గినట్లు వివరించాలని సూచించారు. గురువారం కలెక్టర్ తన చాంబరులో పీఎం సూర్య ఘర్కి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జిల్లాలో పీఎం సూర్య ఘర్ కింద ఇప్పటి వరకు 92,469 మంది రిజిస్టర్ అయ్యారని, ఇందులో ఎస్సీ, ఎస్టీలు 81,591 మంది, ఇతరులు 10,878 మంది ఉన్నట్లు చెప్పారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 23,077 గృహాలకు మార్చిలోపు రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పెద్దహరివాణం గ్రామంలో ఐదు రూఫ్టాప్ సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారన్నారు. ఎపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ప్రదీప్కుమార్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఎల్డీఓం రామచంద్రరావు, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి.. కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో పాలనా సౌలభ్యంలో భాగంగా గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు డివిజినల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్లో ఏర్పాటు చేసిన నూతన డీఎల్డీఓ కార్యాలయాన్ని గురువారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. కోడుమూరు, పాణ్యం ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, గౌరు చరితారెడ్డి, జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డీపీఓ జీ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు తదితర అనేక సమస్యలు ఉంటాయన్నారు. వాటి పరిష్కారం కోసం డీఎల్డీఓ కార్యాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జిల్లాలోని కర్నూలు, పత్తికొండ, ఆదోని డీఎల్డీఓ కార్యాలయాల్లో అధికారులు సమస్యలు పరిష్కరించాలన్నారు. డీఎల్డీఓ రమణారెడ్డి, డ్వామా పీడీ వెంకటరమణయ్య, డీఆర్డీఏ పీడీ రమణారెడ్డితో పాటు ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ అధికారులు పాల్గొన్నారు. -
పైసా పరిహారం అందించలేదు
ఈ ఏడాది వర్షాధారంగా 20 ఎకరాల్లో రూ.15లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టి ఉల్లి పంట సాగు చేశా. పంట చేతికొచ్చే సరికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. చేసేది లేక 20 ఎకరాల ఉల్లి పంటను పశువులకు, గొర్రెలకు మేతగా వదిలేశాను. పరిహారం ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా అందించలేదు. రైతన్న మీకోసం కార్యక్రమంతో రైతులకు ఏమి ఉపయోగమో ప్రభుత్వమే చెప్పాలి. –పాలగిరి, వెంకటగిరి, కోడుమూరు మండలం రెండేళ్లుగా నష్టపోయిన పంటలకు పరిహారం లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఏ పంట సాగు చేసినా నష్టాలే తప్ప లాభాలు లేవు. సకాలంలో మార్కెట్లో ఎరువులు, విత్తనాలు దొరకడం లేదు. పదెకరాల్లో సాగు చేసిన పత్తి పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. రైతుల నడ్డి విరిచి రైతన్న మీకోసం అంటూ కార్యక్రమాలు నిర్వహించడం సీఎం చంద్రబాబుకే చెల్లుబాటవుతుంది. – మహేశ్వరరెడ్డి, చనుగొండ్ల గ్రామం, గూడూరు మండలం -
రూ.52 వేలు నష్టాపోయాం
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. ఎకరాకు సగటున రూ.25వేల వరకు పెట్టుబడి వచ్చింది. అధిక వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతినింది. మామూలుగా అయితే ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఎకరాకు దిగుబడులు 16 క్వింటాళ్ల వరకే వచ్చింది. దళారులు క్వింటా రూ.1600 ధరతో కొన్నారు. మద్దతు ధర రూ.2400 ఉంది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రూ.52 వేలు నష్టపోయాం. – రాఘవేంద్ర, ఆలూరు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టింది. రైతులు పండించిన ఏ పంటకు కూడా ధరలు లేవు. మాకు 17 ఎకరాల భూములు ఉన్నాయి. మిర్చి, పత్తి, వరి పంటలు సాగు చేశాం. అధిక వర్షాలతో వరి, పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. వరి, పత్తిలో దిగుబడులు పడిపోయాయి. 18 నెలల పాలనలోని వైఫల్యాలను దాచిపెట్టేందుకే రైతన్నా.. మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. అన్ని రైతు సేవా కేంద్రాల్లో ధరలు పడిపోయిన విషయమై ప్రశ్నించాం. స్పందన లేకుండా పోయింది.– నాగభూషణం రెడ్డి, హెబ్బటం గ్రామం, హొళగుంద మండలం -
బీసీ హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలి
● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయి కుమార్ కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 384 గ్రేడ్ –2 వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కటారుకొండ సాయికుమార్ కోరారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గ్రేడ్ –2 వార్డెన్ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఒక్కో వార్డెన్ రెండు, మూడు హాస్టళ్లకు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో విద్యార్థుల సంక్షేమం ప్రశ్నార్థకంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1110 బీసీ వసతి గృహాల్లో 743 బాలురు, 367 బాలికల వసతి గృహాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ హాస్టళ్లలో 50 శాతానికి మించి రెగ్యులర్ వార్డెన్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రేడ్ –2 వార్డెన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడితే అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. అలాగే అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. వక్ఫ్ ఆస్తుల నమోదుకు నేడు ఆఖరు కర్నూలు(అర్బన్): వక్ఫ్ భూములు, ఇతరత్రా ఆస్తుల వివరాలను నమోదు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమీద్ పోర్టల్ను ప్రారంభించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి ఎస్ సబీహా పర్వీన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని వక్ఫ్ ఆస్తుల వివరాలను ఈ పోర్టల్లో ఈ నెల 5వ తేదీలోగా నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. పని ఒత్తిడితో సచివాలయ ఉద్యోగి మృతి ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని ఇందిరానగర్ వార్డు సచివాలయ ఉద్యోగి రాజారత్నం(41) పని ఒత్తిడితో అనారోగ్యం పాలై గురువారం మృతి చెందాడు. వార్డు సచివాలయంలో వార్డ్ వెల్ఫేర్, డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనకు అదనంగా వార్డ్ అడ్మిన్ సెక్రటరీగాను, బీఎల్ఓగా బాధ్యతలు అప్పగించారు. ఆయా పనుల ఒత్తిడితో ఐదురోజుల క్రితం అనారోగ్యం పాలైయ్యాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆయనకు మెరుగైన చికిత్స కోసం స్థానిక వార్డు సచివాలయ సిబ్బంది ఆర్థిక సాయం చేశారు. కర్నూలులోని ప్రైవేట్ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి తల్లి ఉసేనమ్మ, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం పాణ్యం: కర్నూలు నుంచి తిరుపతికి 24 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం 6గంటలకు బయలుదేరిన కర్నూల్–2 డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు వెనక చక్రం ఊడిపోయింది. దాదాపుగా 100మీటర్లు దూరం వెళ్లి ఓ హోటల్గోడను ఢీకొని కిందపడింది. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం వద్ద ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు కేకలు వేశారు. డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపారు. చక్రం ఊడిపోయి వెళ్తున్న క్రమంలో బస్సు ఒక కూరగాయ బండిని, నాగరాజు అనే వ్యక్తిని ఢీకొనింది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
ప్రభుత్వ సాయం సున్నా
నేను నాలుగు ఎకరాల్లో రూ.3లక్షలకు పైన పెట్టుబడి పెట్టి ఉల్లిపంట సాగు చేశా. వర్షానికి పంట దెబ్బతినింది. మిగిలిన పంట అమ్ముకొనేందుకు వెళదామంటే రూ.200 క్వింటం అన్నారు. అవి అమ్ముకొనేందుకు తీసుకెళితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు కూడా రావు అని గొర్రెలకు వదిలేశా. నష్టపోయిన ఉల్లికి హెక్టారుకు రూ.50వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీనిపై ప్రశ్నిస్తామనుకుంటే సమాధానం చెప్పే అధికారే లేరు.ఇప్పుడు ఆదుకోలేని ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ప్రణాళిక రూపొందించుకొని ఏమి ఆదుకొంటుంది? – హకీంబాషా ,రాళ్ల దొడ్డి గ్రామం, ఎమ్మిగనూరు మండలం -
ఆదుకుంటారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?
● జేసీ కారును అడ్డుకున్న రైతులుగోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తాము సాగుచేసుకున్న పంటలు మునిగిపోతున్నాయని, సమస్య పరిష్కరించాలని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఐరన్బండ, ఎన్నెకండ్ల గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆదుకుంటారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?’ అంటూ జేసీ నూరుల్ ఖమర్ కారును అడ్డుకున్నారు. కారు ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. తమ సమస్యను పరిష్కరించేంత వరకు కారును వెళ్లనీయబోమని జేసీతో వాదనకు దిగారు. జీడీపీలో 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉంచడంతో 200 ఎకరాల వరకు ఆయకట్టు భూమి నీట మునుగుతుందని చెప్పారు. ఈ ఏడాది వేరుశనగ, పత్తి, మిరప, ఉల్లి, మొక్కజొన్న పంటలు 160 ఎకరాలలో నీటి మునిగి రూ.2కోట్ల మేర పంట నష్టం వచ్చిందన్నారు. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీడీపీ సామర్థ్యం పెంచడం కోసం భూములిచ్చి తాము ఎలా బతకాలని, సమస్యను పరిష్కరించకపోతే అత్మహత్యలే చేసుకుంటామని పలువురు రైతులు అన్నారు. భూమి నష్టపోయిన రైతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కొందరు కోరారు. ఇందుకు జేసీ స్పందిస్తూ.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
జాయింట్ కలెక్టర్ను అడ్డుకున్న రైతులు
కర్నూలు: జిల్లాలోని గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్ను రైతులు అడ్డుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎనగండ్ల, ఐరన్బండ గ్రామాల పర్యటనకు వెళ్లారు జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్. అయితే జాయింట్ కలెక్టర్ కారుకు అడ్డుపడి తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్డుపైనే బైఠాయించాచు. గాజులదిన్నె ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ద్వారా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ను రైతులు నిలదీశారు. ప్రతీ సంవత్సరం బ్యాక్ వాటర్తో పంట పొలాలు మునిగి పోతున్నా తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నష్టపోయిన రైతులకు సరిహారం అందించాలని అదే సమయంలో భూములు కోల్పోయిని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
విద్యార్థుల సంరక్షణే లక్ష్యం
● సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంరక్షణే లక్ష్యంగా వసతి గృహ సంక్షేమాధికారితో పాటు నాల్గవ తరగతి సిబ్బంది విధులు నిర్వర్తించాలని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బీ రాధిక అన్నారు. స్థానిక సంక్షేమభవన్లోని తన చాంబర్లో జిల్లాలోని వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న కుక్, కమాటీలతో ఆమె ప్రత్యేక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వంట మనుషులు ప్రతి రోజు ఉదయం 6 గంటలకంతా వచ్చి రాత్రి 7 గంటల వరకు తమకు కేటాయించిన సమయాల్లో హాస్టల్లోనే ఉండాలన్నారు. వండిన ఆహారాన్ని వృథా చేయరాదని, విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని పెట్టాలన్నారు. కమాటీలు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తమకు కేటాయించిన సమయాల్లో హాస్టల్లో ఉండాలన్నారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలన్నారు. ఇతర నాల్గవ తరగతి సిబ్బంది సెలవులో ఉన్న సమయంలో వారి పనులను కూడా కమాటీ పంచుకోవాలన్నారు. ఆయా సందర్భాల్లో విద్యార్థులను స్కూల్కు తీసుకువెళ్లి జాగ్రత్తగా హాస్టల్కు తీసుకురావాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు జబ్బుతో ఉన్న విద్యార్థులకు హాస్పిటల్కు తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు ఎస్ లీలావతి, వెంకటరాముడు, కార్యాలయ పర్యవేక్షకులు ఆలీబాషా తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 49 స్క్రబ్ టైఫస్ కేసులు
● వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 49 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ చెప్పారు. బుధవారం ఆయన వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్తో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాధి అంత తీవ్రమైనది కాదని, తక్షణ చికిత్సతో పూర్తిగా నయం అవుతుందన్నారు. ఒరియంటియా సుట్సుగముశి అనే బ్యాక్టీరియా పొలాలు, దట్టమైన పొదలలో ఉండే చిగ్గర్ మైట్లార్వా కాటుతో వ్యాపిస్తుందని తెలిపారు. మూడు రోజులకు పైగా జ్వరం ఉంటే సమీప హెచ్సీ/యుపీహెచ్సీలో సంప్రదించాలని సూచించారు. ప్రజలు పొదల ప్రాంతాలకు వెళ్లకుండా నివారించడం, రక్షణ దుస్తులు ధరించడం, కీటకనాశిని రెపెలెంట్లు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొదల్లో బయట నిద్రించకూడదని, పొలాల్లో చెప్పులు లేకుండా పనిచేయవద్దని తెలిపారు. -
మృత్యువులోనూ వీడని భార్యాభర్తల బంధం
కోసిగి: కష్టసుఖాల్లో తోడునీడగా ఉన్న వృద్ధ దంపతులు మృత్యువులోనూ తమ బంధాన్ని వీడలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. డి.బెళగల్ గ్రామానికి చెందిన వై. వీరారెడ్డి (80). వై. పార్వతమ్మ(75) దాదాపు 60 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. వారు వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించారు. ఆ దంపతులకు ఒక కుమారుడు జనార్దన్ రెడ్డి, కుమార్తెలు మహాదేవి, గంగమ్మ ఉన్నారు. అందరికీ వివాహం చేసి మనవళ్లు, మనవరాళ్లుతో అన్యోన్యంగా జీవితం కాలం గడిపారు. వృద్ధాప్య వయస్సులో వై. వీరారెడ్డి మంగళవారం రాత్రి 9.30గంటలకు మృతి చెందగా, వై. పార్వతమ్మ బుధవారం తెల్లవారుజామున 4.25 గంటలకు కన్నుముశారు. ఇద్దరు ఒకే సారి మృతి చెందడంతో ఆ గ్రామ ప్రజలందరూ మంచి జీవితం అనుభవించి తనువు చాలించారంటూ కొనియాడారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యే తరపున వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీ మోహన్ రెడ్డి గ్రామానికి చేరుకుని ఆ దంపతులకు పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. -
చెరువులో మట్టి తవ్వకాల నిలిపివేత
బేతంచెర్ల: మండలపరిధిలోని ఎం.పేండేకల్లు గ్రామ పంచాయతీలోని వెంకటగిరి– మర్రికుంట గ్రామాల మధ్యన ఉన్న చెర్వులో జరుపుతున్న మట్టి తవ్వకాలు ఎట్టకేలకు నిలిపివేశారు. చెరువులోని నల మట్టిని జేసీబీ ద్వారా తవ్వి టిప్పర్లతో కల్లూ మండలం ఉలింద కొండ ఇటుకల బట్టీలకు అక్రమంగా తరలిస్తుండగా సోమవారం రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తర్వాత మట్టి తవ్వకం విషయం నంద్యాలకు వెళ్లి జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె చెరువులో మట్టి తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో మండల అధికారులు బుధవారం చెరువు వద్దకెళ్లి తవ్వకాలు ఆపివేశారు.


