breaking news
Kurnool
-
పాత నోట్లు ఇస్తే.. రూ. కోటి ఇస్తామంటూ..
● రూ.కోటి ఆశ పెట్టి.. రూ.1.61 లక్షలు కాజేసి● అమాయకుడిని బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు హొళగుంద: ‘పాత నాణేలు, నోట్లు ఇస్తే రూ.కోటి ఇస్తాం’ అని సైబర్ నేరగాళ్లు రూ.1.61,250 కాజేశారు. హొళగుందకు చెందిన బాధితుడు లింగాయత్ చంద్రశేఖర్ చెప్పిన వివరాల మేరకు.. ఐదు రోజుల క్రితం సెల్ నంబర్కు ఏపీకే ఫైల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసిన వెంటనే అతని మొబైల్కు 7340566937 నంబర్ నుంచి కాల్ వచ్చింది. తాము పాత నాణేలు, నోట్లు సేకరణ చేసే రిజర్వ్ బ్యాంకు శాఖకు సంబంధించిన కంపెనీ నుంచి మాట్లాతున్నామని వాటిని పంపిస్తే రూ. కోటి పొందవచ్చని నమ్మించారు. అవి లేకపోయినా లక్కీడిప్కు ఎంపికయ్యారని, డబ్బును కడితే రూ.కోటి మీకు సొంతం అని ఆశ చూపారు. అమాయకుడైన చంద్రశేఖర్ ఇది నమ్మి తన సెల్ నుంచి మొదటిగా రూ.750, ఆ తర్వాత రూ.1,250, మరుసటి రోజు రూ.16,500, రూ.42,000. రెండు రోజుల క్రితం మరో రూ.60 వేలు ఫోన్పే ద్వారా పంపించాడు. అలాగే శనివారం కూడా మరో రూ.30 వేలును ఫోన్ పే చేశాడు. ఇలా బాధితుడు డబ్బులు పంపించిన ప్రతిసారి కంపెనీ, రిజర్వ్ బ్యాంకు పేర్లతో ఇన్వాయిస్లు, రసీదులుసెల్కు పంపించారు. దీంతో బాధితుడు రూ.1,61,250 డబ్బును పంపించాడు. ఈ విషయాన్ని ఆదివారం చంద్రశేఖర్ తన స్నేహితుల వద్ద చెప్పగా వారికి అనుమానం వచ్చి ఇది సైబర్ నేరగాళ్ల పనేనంటూ నిర్ధారణకు వచ్చి హొళగుంద పోలీసులను ఆశ్రయించారు. తను, తన భార్య రోజూ కూలి పనులు చేసుకుని కూడా బెట్టుకున్న డబ్బుతో పాటు అప్పు తెచ్చి మరీ డబ్బులు పంపించి మోసపోయామని బాధితుడు లబోదిబోమంటున్నాడు. పాఠశాలలో భారీ వృక్షం నరికివేతజూపాడుబంగ్లా: మండలకేంద్రమైన జూపాడుబంగ్లా గురుకుల పాఠశాలలో 12 ఏళ్ల నాటి భారీ వృక్షాన్ని నిలువునా నరికేశారు. ప్రతి ఒక్క విద్యార్థి ఓ చెట్టును నాటి సరంక్షించాలని పాఠాలు బోధించే చోటనే ఓ వృక్షాన్ని కొట్టేయడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం అనుమతుల్లేకుండా చెట్లను తొలగించడం నిబంధనలు ఉల్లంఘించడమే. -
మిరప పంటను అమ్మడానికి వెళ్లి..
● రోడ్డు ప్రమాదంలో ఒక రైతు మృతి ● మరొక రైతు పరిస్థితి విషమం ● బంటకుంటలో విషాదఛాయలు కౌతాళం: తాము పండించిన మిరప పంటను కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్కు బొలెరోలో తీసుకుపోతుండగా వాహనం టైరు పేలడంతో ఒక రైతు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో రైతు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కౌతాళం మండలం బంటకుంట గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులు కలిసి తాము పండించిన మిరప పంటను అమ్ముకోవడానికి బ్యాడిగి మార్కెట్కు బొలెరోవాహనంలో వెళ్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గా వద్ద ముందు టైరు పేలడంతో వాహనం ఒక్కసారిగా బోల్తాపడింది. వాహనంలోని కురవ వీరనాగ (30) అక్కడికక్కడే మృతి చెందగా చాకలి ఈరన్న తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. మరో రైతు గోవర్ధన్ కాలు విరిగింది. తరసాలప్ప, వెంకటేష్, డ్రైవర్ ముల్లారు బుడ్డ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాద విషయం గ్రామంలో తెలియడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదే వాహనంలో ఉన్న మృతుడు వీరనాగ అన్న తరసాలప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతునికి భార్య హైమావతి ఉంది. ఎమ్మెల్యే పరామర్శ కురవ వీరనాగ మృతిపై మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఫోన్లో వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. గాయపడిన రైతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంఘటన అత్యంత బాధాకరం అన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ప్రహ్లాదచారి తన సంతాపాన్ని తెలిపారు. -
నిధులు కేటాయించకపోవడం అన్యాయం
కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర బడ్జెట్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించకపోవడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్ అన్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.3.32 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతుల కోసం కేటాయింపులు లేవన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్ కుడి కాలువల నిర్మాణాలకు నిధులు వస్తాయని ఆశించినా ఆశాభంగమే ఎదురైందన్నారు. ప్రస్తుతం బడ్జెట్లో కేటాయించిన రూ.479 కోట్లతో మరమ్మతులు కూడా చేయలేరన్నారు. ఆదోని మెడికల్ కాలేజీ, హైకోర్టు బెంచ్ౖపైపెగాని బడ్జెట్లో ఎలాంటి ప్రకటన రాకపోవడం అన్యాయమన్నారు. పారిశ్రామిక ప్రగతి అంటూ ఉండే టీడీపీ నాయకులు.. ఓర్వకల్ ఇండస్ట్రీయల్ హబ్కు, ఎంఎస్ఎంఈ పార్లు నిర్మాణాలకు డబ్బులు ఇవ్వకపోతే ప్రగతి ఎలా అవుతుందని ప్రశ్నించారు. సీపీఎం నాయకులు పీఎస్ రాధాకృష్ణ, జి.రామకృష్ణ, కేవీనారాయణ, టి.రాముడు, ఎండీ ఆనంద్బాబు పాల్గొన్నారు. -
గదుల కొరత.. అరకొర సౌకర్యాలు
● శ్రీశైలంలో భక్తులకు తప్పని ఇబ్బందులుఆత్మకూరు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలంలో నిర్వహించే పాగాలంకరణను చూసేందుకు ఈ ఏడాది భారీగా భక్తులు తరలివచ్చారు. వసతులు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. భక్తులకు కావాల్సిన గదులు కేటాయించలేకపోయారు. ప్రైవేట్ సత్రాల్లో ఒక గది రూ.800 నుంచి రూ.1500 ఉండగా, రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పైగానే భక్తులు చెల్లిస్తున్నారు. గదుల కొరతను దృష్టిలో ఉంచుకుని కొందరు వ్యక్తులు దీనిని వ్యాపారంగా చేసుకుంటున్నారు. గదులు లేవని, గదులు కావాలంటే రోజుకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు చెల్లిస్తేనే గదులు ఉంటాయని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సత్రాల వద్ద గదుల తాళం ఇస్తున్నారు. గదుల రశీదులను ఇవ్వడంలో తిరిగి ఖాళీ చేసే సమయంలో తిరిగి తాళం వారికే ఇవ్వడంతో రశీదులు కూడా ఉండకపోవడంతో ఇక్కడ కొందరు వ్యక్తులు ఎంత అడిగితే అంత దోచుకుంటున్నారు. భారీగా డబ్బు వెచ్చించలేక భక్తులు ఎక్కడ స్థలం దొరికితే అక్కడే నిద్రిస్తున్నారు. తాగునీరు లేక ఇబ్బందులు శ్రీశైలం దేవాలయ పరిధిలో శివారు ప్రాంతాల్లోని కొన్ని సత్రాలు, గృహాల వద్ద మంచినీరు, స్నానపు నీరు లేకపోవడంతో శ్రీశైలంకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. లీటర్ తాగే నీరు రూ.40, సీసా వాటర్ బాటిల్ అయితే రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణంగా అధికారులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని ఆదేశాలు ఉన్నా పాటించడం లేదు. -
కూరగాయలతో శివలింగాకృతులు
నందికొట్కూరు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూరగాయలను శివలింగాకృతులుగా చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు ఆదివారం తయారు చేశారు. వంకాయ చిలగడదుంప, ఉల్లిగడ్డ, టమాట, క్యారెట్, బీట్రూట్, బంగాళాదుంపలతో తయారు చేసిన శివలింగాకృతులను పూజ మందిరంలో ఉంచారు.మద్యానికి బానిసై..వెల్దుర్తి: మద్యానికి బానిసై కలుగొట్ల గ్రామానికి చెందిన ఆకుల నాగశేషు(24) ఆదివారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగశేషు, గిరిజకు నాలుగేళ్ల క్రితం వివాహం అయ్యింది. కుమారుడు మహేంద్ర ఉన్నాడు. నాగశేషు మద్యానికి బానిస కావడంతో భార్య తన పుట్టినూరు చెరుకులపాడుకు వెళ్లి తిరిగి రాలేదు. ఇదే సమయంలో నాగేశేషు తండ్రి మద్దయ్య శివదీక్షా పరుడై, దీక్ష విరమణకు తల్లి మద్దమ్మతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగశేషు గ్రామానికి ఆనుకుని ఉన్న సుంకులమ్మ గుడి పక్కన కల్లంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. అటుగా వచ్చిన వారు చూసి సమాచారమివ్వడంతో పోలీసులు మృతదేహాన్ని వెల్దుర్తి సీహెచ్సీకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. నేడు ‘డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ’ కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఈ నెల 16వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. వినియోగదారులు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కారు ఢీ కొని మహిళ దుర్మరణం బేతంచెర్ల: రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బుక్కాపురం గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్ కొత్తపల్లె గ్రామానికి చెందిన నాగలక్షమ్మ (60), బుక్కాపురం గ్రామానికి చెందిన ఈరమ్మ, మధుసుధ ముగ్గురు బేతంచెర్లకు వెళ్లి ఆటోలో తిరిగి వచ్చారు. ఆటో దిగి రోడ్డు దాటుతుండగా డోన్ నుంచి బేతంచెర్ల వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగలక్షమ్మ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు గాయాలు కావడంతో బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బోల్తా పడిన కారు ● నలుగురికి స్వల్పగాయాలు దొర్నిపాడు: కల్వర్టును ఢీకొని ఒక కారు బోల్తాపడటంతో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. దొర్నిపాడు శివారులోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. చాగలమర్రి మండలం నగళ్లపాడు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పని నిమిత్తం దొర్నిపాడుకు కారులో బయలు దేరారు. దొర్నిపాడు చేరుకోగానే అదుపు తప్పిన కారు కల్వర్టును ఢీకొని పల్టీలు కొడుతూ రెండు విద్యుత్ స్తంభాలకు కొట్టుకోవంతో విరిగి పడ్డాయి. అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరక పోవడం ఆశ్చర్యం వేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడి ఆత్మహత్య ఆళ్లగడ్డ: పట్టణంలోని పుల్లారెడ్డి వీధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన కొన్ని కుటుంబాలు పుల్లారెడ్డి వీధిలో ఉంటూ వివిధ వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నారు. ఇందులో భాగంగా సత్యనారాయణ స్వామి (25) ఐస్ వ్యాపారం చేస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ యుగంధర్ తెలిపారు. కాగా ప్రేమ విఫలమై మనస్తాపం చెంది ప్రేమికుల రోజు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. -
యూరియాను బ్లాక్మార్కెట్కు తరలిస్తున్న టీడీపీ నేతలు
కోవెలకుంట్ల: రైతులకు అందాల్సిన యూరియా బస్తాలను టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని వైఎస్సార్సీపీ పబ్లిక్ వింగ్ అధ్యక్షుడు, పార్టీ పొట్టిపాడు గ్రామ పరిశీలకుడు భోగిరెడ్డి భాస్కర్రెడ్డి, గ్రీవెన్సెల్ విభాగ అధ్యక్షుడు చిక్కేపల్లి ప్రసాదరెడ్డి ఆరోపించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కోవెలకుంట్ల మండలం వెలగటూరు సొసైటీకి సరఫరా చేస్తున్న యూరియా పంపిణీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సొసైటీ పరిధిలోని కోవెలకుంట్ల, అమడాల, సౌదరదిన్నె, పొట్టిపాడు, జోళదరాశి, గుంజలపాడు, బిజనవేముల, వెలగటూరు గ్రామాలకు సంబంధించిన రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు సొసైటీని తమ గుప్పెట్లో పెట్టుకుని యూరియాను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం బస్తాకు రూ. 270 ధర నిర్ణయించగా టీడీపీ నాయకులు బస్తాను రూ. 400 ప్రకారం ఇతర మండలాలు, నియోజకవర్గాలకు చెందిన వ్యక్తులకు అమ్ముతున్నారన్నారు. బస్తాపై రూ. 130 అదనంగా వసూలు చేస్తూ వందలాది బస్తాల యూరియాను ఇక్కడి నుంచి తరలిస్తున్నారని పేర్కొన్నారు. సొసైటీకి వచ్చే యూరియాను తమకు తెలియకుండా ఎవరికీ ఒక్క బస్తా కూడా ఇవ్వవద్దని అధికారులకు హుకూం జారీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో మొక్కజొన్న, వరి సాగు చేసిన రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకెళితే యూరియా స్టాక్ లేదని వెనక్కు పంపుతున్నారని, మరి కొందరి రైతులపై వైఎస్సాసీపీ ముద్ర వేసి యూరియా ఇవ్వకుండా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు పార్టీలతో ఏమి సంబంధం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీలో యూరియా పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ నుంచి బహిరంగంగా యూరియా పక్క మండలాలకు తరలివెళుతున్నా అధికారులు చోద్యం చేస్తున్నారన్నారు. సొసైటీలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసి రైతులకు యూరియా అందేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెలగటూరు మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘సహకార’ నిరాకరణ
● నిరవధిక సమ్మె ప్రకటించిన సహకార సంఘాల ఉద్యోగులు ● జిల్లాలోని 99 సహకార సంఘాల్లో నిలిచిపోనున్న అన్ని రకాల సేవలు కర్నూలు(అగ్రికల్చర్): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబరు 6 నుంచి వివిధ రూపాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంలో సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులను పలుసార్లు కలసినప్పటికి ఫలితం కనిపించలేదు. గుంటూరులోని సహకార శాఖ కమిషనరేట్ ఎదుట సుదీర్ఘంగా రిలే దీక్షలు చేపట్టినప్పటికీ పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లోనే నిరవధిక సమ్మె చేపట్టినట్లు ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హరీఫ్ బాషా తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉన్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపుదశకు చేరుతోంది. ఈ సమయంలో రికవరీలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. సంఘాల ఉద్యోగులు సమ్మెబాట పడితే రికవరీలు నిలిచిపోనున్నాయి. రుణాల పంపిణీ ఆగిపోయే ప్రమాదం ఉంది. సహకార సంఘాల ఉద్యోగులు సమ్మె లోకి వెళితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇవీ డిమాండ్లు.. ● జీవో 36 ప్రకారం సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ● వేతన సవరణ కార్యరూపం దాల్చేవరకు మధ్యంతర భృతి ఇవ్వాలి. ● పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి. ● రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించాలి. ● ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాలి. ● బ్యాంకు ద్వారా కాకుండా నేరుగా సంఘాల ద్వారానే రుణాలు పంపిణీ చేయాలి. ● 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. ● కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి డీఎల్ఎస్ఎఫ్ ద్వారా జీతభత్యాలు చెల్లించాలి. -
బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసే లేదు
చిప్పగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసే లేదని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు అర్హులైన లబ్ధిదారులకు సరిపడా నిధులు కేటాయించలేదని మండి పడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించలేదని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా పాలన సాగిస్తున్నామని చెప్పే సీఎం చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మార్చారని ఎద్దేవా చేశారు. సంపద సృష్టిస్తామని చెబుతూ విద్యుత్ చార్జీలు అనేక సార్లు పెంచి ప్రజలపై మోయ లేని భారం వేశారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు బుసినే శ్రీరాములు, వెంకటేష్, చంద్రశేఖర్, మహానంది, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
మయూర వాహనంపై మహానందీశ్వరుడి విహారం
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానందీశ్వరస్వామి దంపతులు ఆదివారం ఉదయం మయూర వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి మహానందీశ్వరస్వామి దంపతులు నంది వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తజనం మధ్య గ్రామోత్సవం కనులపండుగగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పూజల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, రుత్విక్కులు, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మహానందీశ్వరస్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు అందించారు. అలాగే రూ. 15 లక్షల విలువైన సూట్రూమ్ నిర్మాణంలో భాగంగా హైదరాబాద్ నగరానికి చెందిన యలమంచిలి సాంబశివరావు, సుజాత దంపతులు రూ. లక్ష విరాళం అందించారు. -
పాగా కట్టి.. పెళ్లి కుమారుడై..
లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రారంభమైంది. వివాహాల్లో పెండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. రాత్రి 10 గంటల తర్వాత బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన హస్తినాపురం వాసి ఫృధ్వి సుబ్బారావు స్వామివారికి పాగాలంకరణ చేశారు. ఈ పాగా గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉండే నవ నందులను అనుసంధానం చేస్తూ అలంకరించారు. మొత్తం సుమారు 10 పాగాలు భక్తులు స్వామివారికి సమర్పించారు. పాగాలంకరణ జరుగుతున్నంతసేపు ఆలయంలో ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ మారుమోగింది. -
గర్భగుడికి తాళం
వెల్దుర్తి: ప్రముఖ శైవ క్షేత్రమైన బ్రహ్మగుండంలో శ్రీరాముల గుడిలో పూజలు చేయడం లేదు. మహాశివరాత్రి రోజు కనీసం గుడి తలుపులు తెరవలేదు. ఏకంగా స్వామివారి గర్భగుడికి తాళం వేశారు. దేవుడికే నిత్యం తాళం వేసిన వింత పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పటికై నా ఆలయ అధికారులు, నిర్వాహకులు స్వామి వారికి పూజాది కార్యక్రమాలు జరిగేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.వార్డుల వారీగా ఓటరు జాబితా ● డీపీఓ జీ భాస్కర్ కర్నూలు(అర్బన్): రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేసే కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 2026 జనవరి 1వ తేదీ వరకు ఉన్న అసెంబ్లీ ఓటరు జాబితాలను ఇప్పించాలని ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారిని కోరామన్నారు. అలాగే ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లను కలిసి అసెంబ్లీ ఓటరు జాబితాలను ఇప్పించుకోవాలన్నారు. మండలాల వారీగా తీసుకున్న అసెంబ్లీ ఓటరు జాబితాల ఆధారంగా ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా విభజన చేయాలన్నారు. ఈ ప్రక్రియను మార్చి 9వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఇప్పటికే ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు డీపీఓ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని 10,006 వార్డులకు ఓటరు జాబితాలను విభజించి సిద్ధం చేసుకోవాల్సి ఉంది. పోలీసుల చెంత బాలిక ఆదోని టౌన్: ఆదోనికి చెందిన ఎనిమిదేళ్ల ధరణి అనే బాలిక శ్రీశైలం క్షేత్రంలో తప్పిపోయింది. ప్రస్తుతం ఆ చిన్నారి శ్రీశైలం పోలీస్ కంట్రోల్ రూమ్ రక్షణలో ఉంది. తన తల్లిదండ్రులు చౌడమ్మ, తిక్కయ్య అని, తాము ఆదోని నుంచి వచ్చామని చెబుతోంది. ధరణి తల్లిదండ్రులు గానీ, ఆ పాపను గుర్తించిన బంధుమిత్రులు వెంటనే శ్రీశైలంలోని కంట్రోల్ రూమ్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. నేటి పీజీఆర్ఎస్ రద్దు కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించే మంత్రులు, కార్యదర్శులు, బిల్స్గేట్స్ బృందంతో కాన్ఫరెన్స్ కారణంగా పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని, ఎవరూ అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావొద్దని తెలిపారు. ఫ్రీ ఆఫర్ల సందేశాలను నమ్మొద్దు ● జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి కర్నూలు: ఫ్రీ ఆఫర్ల పేరుతో వచ్చే సందేశాలను నమ్మొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ మ్యాచింగుల సందర్భంగా లైవింగ్ స్ట్రీమింగ్ చూడాలని ఆసక్తి ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఫేక్ లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ చానల్స్, ఇతర వెబ్సైట్ల ద్వారా ఫ్రీ లైవ్ మ్యాచ్, వాచ్ ఐపీఎల్ ఫ్రీ, హెచ్డీ లైవ్ స్ట్రీనింగ్ వంటి పేర్లతో లింకులు పంపించి వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు వివరాలు, ఓటీపీలు సేకరించి డబ్బులు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి లింకులను క్లిక్ చేయడంతో మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. దీని ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించారు. అధికారిక ప్రసార మాధ్యమాలు, చట్టబద్ధమైన యాప్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఎవరైనా మోసాలకు గురైనట్లైతే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
మహాదానందం
● నేడు మహాశివరాత్రి పర్వదినం ● జనసంద్రంగా మారిన శ్రీశైలం ● పాగాలంకరణకు ఏర్పాట్లు పూర్తి నిత్యం ఓంకార నాదం.. కొండలు, గుట్టలు దాటుకుని పాదయాత్రగా నల్లమల మీదుగా భారీగా వచ్చే భక్తజనం.. ధూళి దర్శనంతో ‘ధన్యోస్మి’ అంటూ నమస్కారం.. పాతాళగంగలో ‘పుణ్య’ సంకల్పం.. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో అతి ప్రాచీనం వెలుగులీనుతోంది. ‘మహా’ద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. శ్రీగిరిలో ఆదివారం నిర్వహించే పాగాలంకరణతో భారతీయ సంస్కృతి ఆవిష్కృతం కానుంది. నమక, చమకాలతో మహా రుద్రాభిషేకం, అనంతరం ఆది దంపతుల కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా సాగనుంది.శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భావకాలంలో శ్రీశైలంలో మల్లన్నకు నిర్వహించే పాగాలంకరణ వెనుక ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. పాగాలంకరుడైన మల్లన్నను చూసేందుకు భక్తుల రెండు కళ్లు చాలవు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశాన్ని పంచభూతాలు కాగా.. వీటి ప్రతీకలుగా మల్లన్న ఆలయంలోని ఐదు కలశాలు ఉన్నాయి. గర్భాలయ ముఖమండపంపై తొమ్మిది నందులు ఉండగా వీటితోపాటు ఐదు కలశాలను కలిపి పాగా చుడతారు. మొత్తం పథ్నాలుగు లోకాలకు మల్లన్న అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. మొత్తం 14 చుట్లు చుట్టిన పాగాలంకరణ దర్శనంతో ఇంద్రియాలు నిర్మలమైన బాధల నుంచి విముక్తి పొందుతాయనే విశ్వసిస్తారు. దిక్కులే వస్త్రాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైల మల్లన్న కల్యాణం, లింగోద్భావకాలం రెండు ఉత్సవాలకు కలిపి వచ్చేలా పాగాలంకరణ జరుగుతుంది. స్వామివారికి దిక్కులే వస్త్రాలు. అందుకే పాగాలంకరణ సేవ చేసేవారు దిగంబరంగానే ఉండి కార్యాన్ని పూర్తి చేస్తారు. ఆ సమయంలో ఆలయం, పరిసరాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. పాగాలంకరణ పూర్తయ్యాక విద్యుత్ వెలుగులు నింపుతారు. ఆదివారం రాత్రి 10 నుంచి 12గంటల లోపు లింగోద్భవ సమయంలో పాగాలంకరణ జరుగుతుంది. ఇందుకోసం ఫృధ్వి సుబ్బారావు పాగా వస్త్రంతో శ్రీగిరికి చేరుకున్నారు. పాగాలంకరణ సమయంలో మల్లన్నకు లింగోద్భావకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. నమో..రుద్రాయా! మహాన్యాసం చేసే ముందు అర్చకులు, పండితులు తమ దేహంలోని ఇంద్రియాలను తాకుతూ రుద్రమంత్రాలను చదువుతూ రుద్రుడిని ఆహ్వానిస్తారు. పరిపూర్ణంగా రుద్రుడి రూపాన్ని దాల్చిన తరువాత యజుర్వేదంలోని రుద్రం, నమక చమక మంత్రాలను ఉచ్ఛరిస్తూ అభిషేకం నిర్వహిస్తారు. నమక చమకాలను ఒకసారి చెప్పి చేసేది ఏకరుద్రాభిషేకం. అలాగే 11సార్లు నమకాన్ని పఠించి ఒకసారి చమకాన్ని చదివి చేసేది ఏకాదశ రుద్రాభిషేకం. ఈ ఏకాదశ రుద్రాభిషేకం ఉకదశ రుద్రులకు ప్రతీక. ఒక్కో అభిషేకంలో ఒక్కో రుద్రుడు అవిష్కృతమవుతాడు. చివరిగా స్వామివారికి నీరాజనం చూపడంతో లింగోద్భవకాల రుద్రాభిషేకం ముగుస్తుంది. తదుపరి రాత్రి 12గంటలకు భ్రమరాంబా సమేత మల్లికార్జునుడికి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు. గజవాహనంపై ఆదిదంపతులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా ఏడో రోజు శనివారం భ్రమరాంబా సమేతుడైన మల్లన్న గజవాహనంపై విహరించారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగాణంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను గజవాహనంపై అధిష్టింపజేశారు. ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక అర్చన, హారతి పూజలు చేశారు. అనంతరం గజవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదిక్షణ చేయించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. -
రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): కందులు, శనగల ధర రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. కందుల ధర ఇటీవల పెరిగినట్లే పెరిగి పడిపోతోంది. శనగల ధర రోజురోజుకు పతనమవుతోంది. కర్నూలు మార్కెట్కు కందులు 824 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.7,889 లభించింది. శనగలు మార్కెట్కు 476 క్వింటాళ్లు రాగా.. కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.5,219 లభించగా.. సగటు ధర రూ.5,169 నమోదైంది. ఇటీవల మురిపించిన వేరుశనగ ధర మళ్లీ పడిపోతోంది. రికార్డు స్థాయిలో రూ.15 వేలకు చేరిన ధర ప్రస్తుతం రూ.10 వేలలోపునకు పడిపోయింది. మార్కెట్కు వేరుశనగ 745 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.6,400, గరిష్ట ధర రూ.9,603 లభించగా.. సగటు ధర రూ.8,259కే పరిమితమైంది. మిర్చి ధరలదీ ఇదే పరిస్థితి. బ్యాడిగ రకం మిర్చికి గరిష్టంగా రూ.27,069 లభించింది. మిగిలిన రకాలకు ధరలు అంతంతమాత్రంగానే లభించాయి. మినుములు మార్కెట్కు 188 క్వింటాళ్లు రాగా.. కనిష్ట ధర రూ.2,209, గరిష్ట ధర రూ.8,200 లభించగా.. సగటు ధర రూ.7,951 పలికింది. కర్నూలు (అర్బన్) : సామాజిక సమానత్వానికి ప్రతీక దామోదరం సంజీవయ్య అని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. శనివారం దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి నంద్యాల చెక్పోస్టు వరకు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నంద్యాల చెక్పోస్టులో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులతో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎదగడం గొప్ప విషయమన్నారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆదోని పట్టణానికి చెందిన తాయప్పకు సామాజిక సంక్షేమ శాఖలో వాచ్మెన్గా నియామక పత్రాన్ని జేసీ అందజేశారు. వ్యాసరచన, క్రీడా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ముందుగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక, సంఘ నాయకులు రాధాకృష్ణ, జ్యోతి, సోమన్న, చంద్రప్ప, వెంకటేశ్వర్లు, శ్రీను, రాజశేఖర్ తదితరులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్, మెప్మా పీడీ శ్రీనివాసులు, వివిధ సంఘ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగంపై నిర్లక్ష్యం
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు నాయుడు మరోసారి నిరుద్యోగులు, మహిళలను మోసం చేశారు. మూడోసారి ప్రవేశపెట్టే బడ్జెట్లోనైనా ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయిస్తారని మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే వారి ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఇక ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా ఆ మాటే ఎత్తకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ శనివారం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఇందులో ప్రాధాన్యత రంగాలకు సరైనా కేటాయింపులు లేకపోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కేవలం కొన్ని సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్ పెట్టుకొని సంక్షేమం, అభివృద్ధిని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్, గుండ్రేవుల సాగునీటి ప్రాజెక్టు, ఎయిర్పోర్టు అభివృద్ధి, యూనివర్సిటీల పెండింగ్ పనులు, కర్నూలు స్మార్ట్సిటీ, హజ్హౌస్, ప్రతిపాదిత హైకోర్టు బెంచ్ తదితరాలను విస్మరించారు. ఇదిలాఉంటే దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రకటించినా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పకపోవడం గమనార్హం. ఆడబిడ్డ నిధి లేదు.. నిరుద్యోగ భృతి మాటెత్తరు 2024 ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్తోపాటు కూటమి పార్టీల నేతలు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఐదేళ్లపాటు అందిస్తామన్నారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వశాఖల్లో ఖాళీల భర్తీకి ప్రతియేడాది జనవరిలో జాబ్ క్యాలెండర్తోపాటు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి నాయకులు హామీ తప్పించారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరో నాలుగు నెలలు ఆగితే మూడో ఏడాదిలోకి అడుగు పెడుతున్నా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై మహిళలు, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 8.25 లక్షల మంది 18 ఏళ్లు నిండిన మహిళలు, 18 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా చంద్రబాబు ప్రభుత్వ తీరుపైఐ మండిపడుతున్నారు. చంద్రబాబు వేసిన గుండ్రేవుల శిలాఫలకం వెక్కిరిస్తోంది 2019 ఎన్నికల ముందు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు గుండ్రేవుల, వేదవతి సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికే అప్పట్లో అడుగు ముందుకేశారు. అయితే ఇప్పుడు ఆయన వేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నా నిధులు మాత్రం కేటాయించడంలేదు. ఈబడ్జెట్లోనైనా నిధులు వస్తాయని ఆశించినా ఆశలు ఆడియాశలయ్యాయి. జిల్లాలోని మొత్తం పెండింగ్ ప్రాజెక్టులకు రూ.1,420 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు మొత్తం రూ.9900 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామని ప్రకటించడంతో తీవ్ర నైరాశ్యం నెలకొంది. కర్నూలు సర్వజన ఆసుపత్రిపై చిన్నచూపు అనూహ్యంగా ఆదోని మెడికల్ కాలేజీల పనులను పూర్తి చేయడానికి బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అయితే ఆదోని మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లో ప్రైవేట్కు ఇవ్వాలని అనుకున్నా ప్రభుత్వం నిధుల కేటాయింపు ద్వారా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 1852 నుంచి ఆరు జిల్లాల పేద ప్రజలకు సంజీవనిగా నిలుస్తున్న కర్నూలు సర్వజన ఆసుపత్రిపై బడ్జెట్లో చిన్నచూపు చూశారు. ఆసుపత్రి స్థాయిని పెంచి సౌకర్యాలు కల్పించడంపై ఆసక్తి చూపని పరిస్థితి. కాగా, కర్నూలులో 30 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నట్లు పయ్యావుల కేశవ్ ప్రకటించారు. డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, క్లస్టర్ యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీల్లోని అసంపూర్ణంగా ఉన్న భవన నిర్మాణాలకు అరకొరగా నిధులు ఇచ్చారు. అయితే ఆయా యూనివర్సిటీల అభివృద్ధి, సిబ్బంది నియామకాలను విస్మరించారు. బనవాసి లైవ్ స్టాక్ రీసెర్చ్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల స్థాపన, ప్రతిపాదిత మైనారిటీ స్టడీ సర్కిల్ను పక్కనపెట్టినట్లయింది. మరోసారి మహిళలు, నిరుద్యోగులను మోసగించిన బాబు ఊసేలేని నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలు సూపర్సిక్స్లో మేజర్ పథకాలకు మరోసారి మొండిచేయి గుండ్రేవుల, రాయలసీమ ఎత్తిపోతల ప్రస్తావనే కరువు పారిశ్రామిక అభివృద్ధికి దక్కని కేటాయింపులు కర్నూలు స్మార్ట్సిటీ, హైకోర్టు బెంచ్, హజ్హౌస్ల దాటవేతహైకోర్టు బెంచ్, హజ్ హౌస్లపై దాటవేత ఏడాది క్రితమే మంత్రి టీజీ భరత్ హైకోర్టు బెంచ్ కోసం ఏబీసీ క్వార్టర్లలో ఉన్న వారిని ఖాళీ చేయించేందుకు తన అధికారాన్ని వినియోగించి నివాసం ఉంటున్న వారిని ఇబ్బంది పెట్టారు. అయితే ఇప్పుడు బడ్జెట్లో కనీసం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటన చేయకపోవడం గమనార్హం. అలాగే కర్నూలు ఎయిర్పోర్టు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఇక్కడ రాత్రి పూట కూడా విమానాల ల్యాండింగ్, ఎయిర్పోర్టు విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర ఉన్నా ఆ ఊసెత్తలేదు. కాగా, ఆళ్లగడ్డ మండలం అహోబిళం నరసింహస్వామి ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతాంగానికి అరకొర నిధులే.. అన్నదాత సుఖీభవకు నిధులతోపాటు రూ.30 వేల కోట్లతో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కుశ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి మరింత తోడ్పాటు అందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే రైతులకు సంబంధించి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇతర పథకాలకు అరకొరగా నిధులు కేటాయించడంపై అన్నదాతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
సిగ్నల్ పూర్..భక్తుల బేజారు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో సెల్ఫోన్ సిగ్నల్స్ అందక సాధారణ భక్తులు, విధులకు వచ్చిన ప్రభుత్వ సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణ రోజుల్లోనే ఈ ప్రాంతంలో సిగ్నల్స్ సరిగా అందవు. ఇక ఇంటర్నెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. బీఎస్ఎన్ఎల్కు రెండు టవర్లు ఉన్నప్పటికీ సిగ్నల్స్, ఇంటర్ నెట్ అంతంత మాత్రంగానే ఉంటోంది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుందని, సిగ్నల్ ఫ్రీక్వెన్సీ పెంచాలని కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్షెరాన్లు సర్వీస్ ప్రొవైడర్లతో గురువారం సమావేశం నిర్వహించి ఆదేశించారు. అయితే టెలికాం ప్రొవైడర్లు బూస్టర్లు పెంచినప్పటికీ ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంది. ఫోన్ మాట్లాడుతూ కదిలితే సిగ్నల్స్ జంప్ అవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఘాట్రోడ్ వెంబడి, ఇతర లొకేషన్లలో పనిచేసే పోలీస్లు కూడా సిగ్నల్, నెట్ సరిగా పనిచేయక పోవడంతో అవస్థలు పడుతున్నారు. -
శ్రీశైలం భక్తులకు ప్రత్యేక బస్సులు
ఎమ్మిగనూరురూరల్: శివరాత్రి బ్రహ్మో త్సవాల నేపథ్యంలో శైవక్షేత్రాలకు వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కడప జోన్–4 రాఘవకుమార్ అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపో, బస్టాండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప జోన్ పరిధిలోని 8 జిల్లాల్లో దాదాపు 53 శైవ క్షేత్రాలు ఉన్నాయన్నారు. శ్రీశైలానికి నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి 460 బస్సు సర్వీసులు నడుపుతున్నామన్నారు. పాదయాత్ర భక్తులను దృష్టిలో ఉంచుకొని నాలుగు రోజుల ముందు నుంచి బస్సు సర్వీసులు పెంచామన్నారు. జిల్లా అధికారుల సలహా, సూచనల మేరకు బస్సు సర్వీసులను తిప్పుతామన్నారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీ్త్రశక్తి బస్సు సేవలను కోస్తా ప్రాంతాలతో పోల్చితే కడప జోన్ పరిధిలో 60 శాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నారన్నారు. డిపొల్లో మెకానిక్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ సిరి సూచనల మేరకు ఎమ్మిగనూరు బస్టాండ్లో సౌకర్యాల కల్పనపై డిపో మేనేజర్తో చర్చిస్తామన్నారు. ఆయన వెంట డిపో మేనేజర్ మద్దిలేటినాయుడు, ఇతర ఆర్టీసీ అధికారులు తదితరులు ఉన్నారు. -
కొండంతా అక్రమాలు.. గోరంత రికవరీ
● ఉపాధి హామీ పథకం కింద రూ.14 కోట్లకు పైగా పనులు ● రూ.1,17,500 పక్కదారి పట్టినట్లు తేల్చిన అధికారులుఆలూరు రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024–25 ఏడాదిలో చేపట్టిన పనులు మండలంలోని ఉపాధి సిబ్బంది, మేటీలు కుమ్మకై ్క పనులకు రాని కూలీల పేరు మీద, పండ్ల తోటల పెంపకంలో నాటిన చెట్ల ఎండిపోయినా వాటి నిధులు పక్కదారి పట్టించి చేయని పనులకు బిల్లులు డ్రా చేసినట్లు, కొన్ని గ్రామాల్లో తూతూ మంత్రంగా సోషల్ ఆడిట్ నిర్వహంచినట్లు తెలిపారు. 2024–25లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై పీడీ మాధవీలత శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలో మొత్తం రూ.14,35,43,734 నిధులతో చేపట్టిన 1,488 పనులను గ్రామాల వారీగా సోషల్ ఆడిట్ బృందం సభ్యులు నివేదక సమర్పించారు. చేసిన పనుల కొలతల్లో తేడాలు, రోడ్ల వెంబడి మొక్కల పెంపకం, పండ్ల తోటల పెంపకం సరిగా లేని కారణంగా రూ.1,17,500 పక్కదారి పట్టినట్లు, రూ.4,140 పెనాల్టీ ఉన్నట్లు ఆడిట్ బృందం సభ్యులు లెక్కలు తేల్చారు. జిల్లా విజిలెన్స్ అధికారిణి షకీలా బేగం, పత్తికొండ డివిజన్ ఏపీడీ లక్ష్మన్న, ఎంపీడీఓ మద్దిలేటి స్వామి, ఎస్ఆర్పీ కాంతయ్య, కోర్స్ డైరెక్టర్లు ఆదినారాయణ, ప్రదీప్ నాయక్, ఏపీఓ శ్రీనివాసులు, డీఆర్పీలు బాలాజీ, మల్లికార్జున, ఉరుకుందప్ప ఉన్నారు. -
బ్రహ్మమురారి.. సురార్చితలింగం
పాతాళగంగకు పోటెత్తిన భక్తులుశ్రీశైలవాసా.. శరణు మల్లన్నా.. అంటూ భక్తకోటి మల్లన్న ముంగిట ప్రణమిల్లుతోంది. అదిగదిగో శ్రీశైలం.. అంటూ శివయ్య దండు నల్లమల మీదుగా నడిచివస్తోంది. జయ జయ మహాదేవా.. శంభో సదా శివ.. అంటూ నెత్తిన ఇరుముడులతో శివ స్వాములు శ్రీగిరిలో అడుగుపెడుతున్నారు. శివరాత్రి పర్వదినం వేళ మల్లన్న వేడుకను కనులారా చూసేందుకు భక్తులు శ్రీశైలం చేరుకోవడంతో పురవీధులు, పాతాళగంగ జనసంద్రాన్ని తలపిస్తోంది.కృష్ణమ్మ చెంత పుణ్యస్నానాలు ఆచరించి, భ్రామరీ సమేత మల్లన్న దర్శనానికి పోటెత్తారు. శివరాత్రి ఘడియలు సమీపిస్తుండటంతో శ్రీగిరిలో బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
మిర్చి రైతు కన్నీరు
సంజామల: మిర్చి సాగు చేసిన రైతులు నీటి సమస్యతో ఆందోళన చెందుతున్నారు. సంజామల మండలం ముదిగేడు గ్రామం పరిధిలోని ఎస్సార్బీసీ 10వ బ్లాక్ కింద దాదాపు వంద ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. దాదాపు 20 రోజుల నుంచి ఈ కాల్వలో నీటి ప్రవాహం తగ్గిపోతుండటంతో పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు దాదాపు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేయగా ప్రస్తుతం పూత, కాయ దశలో ఉంది. ఒక నెల ఉంటే ఎండు కాయ ఇంటికి వచ్చే సమయంలో సాగునీటి సమస్య వేధిస్తోంది. నీటి విడుదలపై అధికారులు కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్లో తెగుళ్ల బారిన పంటను దున్నేసి నష్టపోయామని వాపోయారు. రబీలో సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో నీరిచ్చి ఆదుకోవాలని ముదిగేడు రైతులు కోరుతున్నారు. ఎస్సార్బీసీ 10వ బ్లాక్లో తగ్గిన నీటి ప్రవాహం ఆందోళనలో ముదిగేడు మిర్చి రైతులు -
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. శ్రీశైలానికి వచ్చే రహదారి మార్గాల్లో కల్వర్టులు, ఘాట్ రోడ్ టర్నింగ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శివదీక్ష శిబిరాలు, చంద్రావతి కల్యాణ మండపం, ఆలయ ప్రాంగణం దర్శన క్యూలు అతిథి గృహాలు, సత్రాలు వద్ద తనిఖీలు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు. బస్సులు కిటకిట శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతు న్నా ప్రయాణికులు మాత్రం బస్సుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి దోర్నాలకు చేరుకున్న భక్తులు శ్రీశైలం వచ్చేందుకు బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అటు ఆత్మకూరు, ఇటు మార్కాపురం, విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు రద్దీగా ఉండటంతో దోర్నాల వద్ద భక్తులు ఎక్కలేకపోతున్నారు. గదుల కేటాయింపులో పర్యవేక్షణ పెంచండి శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి వచ్చే భక్తులకు వసతి గదుల కేటాయింపులో అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దేవస్థానం అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక దేవస్థానం వసతి గృహ సముదాయ కేంద్రాన్ని, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్తో కలిసి సందర్శించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం ఆధ్వర్యంలో ఆన్లైన్, డైరెక్ట్ కౌంటర్ విధానాల ద్వారా గదుల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందా లేదా అనే విషయంపై సమీక్షించారు. ముందస్తుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా గదుల కేటాయింపు చేస్తున్నారా, ప్రత్యేక కౌంటర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా అనే అంశాలను పరిశీలించారు. ఉచిత, చెల్లింపు వసతి గృహాలు, సత్రాలు, డార్మిటరీల వద్ద పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. వృద్ధులు చిన్న పిల్లలతో వచ్చే కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని గదుల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. భక్తులు మధ్యవర్తులను నమ్మరాదని, అధికారిక కౌంటర్లు, ఆన్లైన్ ద్వారా మాత్రమే గదులు పొందాలని కలెక్టర్ సూచించారు. దేవస్థానం రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి కర్నూలు(సెంట్రల్): గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శలు బి.గిడ్డయ్య, డి.గౌస్దేశాయ్ కోరారు. శనివారం సీఆర్ భవన్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న డిమాండ్తో రాజకీయ, ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2018లో వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాలువల నిర్మాణాల కోసం సీఎం చంద్రబాబునాయుడు శంకు స్థాపన చేశారన్నారు. అయితే ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నా నిధులు ఎందుకు కేటాయి ంచడంలేదని ప్రశ్నించారు. అలాగే ఓర్వకల్ ఇండస్ట్రీయల్ హబ్తోపాటు అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ నాయకులు శ్రీరాములు, శ్రీనివాసులు, బీసన్న, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బతుకన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్య దర్శి షాబీర్బాషా, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నతాధికారుల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్యమైన ఘట్టం మహాశివరాత్రి పర్వదినాన పాగాలంకరణ, కల్యాణోత్సవం. అయితే ఆయా ముఖ్యమైన ఘట్టాలను తిలకించేందుకు భక్తులు లక్షన్నర మందికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ సునీల్ షోరాన్ పాగాలంకరణ, క్యూలైన్లనపు పరిశీలించారు. దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ఉండేందుకుగాను పోలీసు శాఖ సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్యాణకట్ట ద్వారా భక్తులకు అందుతున్న సేవలను కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూం చేరుకుని సీసీటీవీ కెమెరాల ద్వారా ఆలయ ప్రాంగాణం, క్యూలైన్లు, పాతాళగంగ స్నానఘట్టాలు, వసతిగృహాలు, ప్రధాన రహదారులు తదితర ప్రాంతాల్లో పరిస్థితులను జాయింట్ కలెక్టర్ కార్తీక్తో కలిసి పరిశీలించారు. టోల్గేట్ రుసుము మినహాయింపు, 24గంటల పాటు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. -
మల్లన్న చెంత భక్తుల అవస్థలు
శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో చిరు వ్యాపారులు తిష్టవేయడంతో భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. క్షేత్ర పరిధిలో పలుచోట్ల వాహనాల కోసం పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినప్పటికీ కొంత మంది వాహనదారులు చలువ పందిళ్ల కింద వాహనాలు నిలపడంతో భక్తులకు ఉపయోగ పడటం లేదు. పుష్కరిణికి సమీపంలో భక్తుల సౌకర్యార్థం షవర్బాత్లను ఏర్పాటు చేశారు. షవర్బాత్లకు ఇరువైపులా మహిళలు దుస్తులు మార్చుకునే గదులను షామియానాల టెంట్లతో ఏర్పాటు చేశారు. అయితే ఆ షామియానాలకు పెద్ద పెద్ద రంధ్రాలు పడటంతో వాటిని ఉపయోగించుకోలేక పోతున్నారు. ప్రధాన జంక్షన్ అయినా నందిసర్కిల్ వద్ద పోలీసులు పికెట్ పేరుతో పోలీసు బూత్ ఏర్పాటు చేసినా అక్కడ ఎవరూ విధులు నిర్వర్తించకపోవడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. – శ్రీశైలంటెంపుల్ -
మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి
కర్నూలు(సెంట్రల్): రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను కల్పించి చట్టబద్ధం చేయాలని జాతీయ రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన జాతీయ కిసాన్ జాగృతి యాత్ర శుక్రవారం కర్నూలుకు చేరుకుంది. ఈ యాత్ర సుమారు 40 రోజులపాటు కొనసాగి కశ్మీర్ చేరుకుంటుంది. ఈ యాత్రలో వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ కిసాన్ నాయకులు జల్దీర్సింగ్ దలేవాలా (పంజాబ్), ఇంద్రజిత్సింగ్ పొన్నెవాలా (రాజస్థాన్), దేవరాజ్కుమార్ (కర్ణాటక), అరుణపటేల్ (మధ్యప్రదేశ్), అభిమన్యు (హర్యానా), సోముఅలక్ (పంజాబ్), పి.రామచంద్రయ్య ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యాత్ర కర్నూలు చేరిన సందర్భంగా ఎస్టీయూ భవన్లో జాగృతి సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కిసాన్ జాగృతి నాయకులు జల్దీర్సింగ్ దలేవాలా, ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. 2019లో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టబద్ధం చేయాలని భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారుసు చేసినా పెడచెవిన పెట్టారన్నారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలలు రైతుల ఉద్యమం చేస్తే అబద్ధపు హామీలు ఇచ్చి విమరమింపజేశారని, అయితే ఆ సమయంలో ఇచ్చిన ప్రధానమైన కనీస మద్దతు ధరకు చట్టబద్ధం కల్పించడంలేదని ఆరోపించారు. 2023 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, రైతులకు ఉచిత విద్యుత్ను సరఫరా చేయాలని, బ్యాంకుల్లో రైతులు తీసుకున్న క్రాప్ లోన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్ళి కె.జగన్నాథం, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వెంకటాపురంలో దొంగల హల్చల్
శిరివెళ్ల: వెంకటాపురంలో దొంగలు రెచ్చిపోయారు. గురువారం అర్ధరాత్రి ఐదు ఇళ్లల్లో చొరబడి దొరికిందంతా దోచుకెళ్లారు. దాదాపు రూ. లక్ష నగదు, రూ. 80 వేలు విలువ చేసే బంగారు కమ్మలు, ముక్కు పుడకలు చోరీకి గురయ్యాయి. ముందుగా శ్రీరామ వెంకటేశ్వర్లు ఇంటిలో దొంగలు చొరబడి బీరువాను బయటకు తెచ్చి ఇంటి సమీపంలోని ఓ దిబ్బ వద్ద పగల గొట్టారు. శబ్ధం విన్న ఇంటి యాజమాని, చుట్టు పక్కల వాళ్లు రాగా దొంగలు పరారయ్యారు. అలాగే రిటైర్డ్ వీఆర్వో అనందయ్య ఇంటిలో బీరువాలోని బంగారు కమ్మలు, ముక్కు పుడకలు అపహరించారు. గుడి నరసింహ ఇంటిలో బీరువాలోని రూ. 80 వేలు నగదును చోరీ చేశారు. వలివేటి శేషగిరి ఇంటిలో ప్రవేశించి రూ. 20 వేల నగదును ఎత్తు కెళ్లారు. అలాగే పొదిలి చిన్న కేశయ్య టీ కొట్టులో తినుబండారాలు తిని, కూల్ డ్రింక్స్ తాగారు. ఈ చోరీలకు పాల్పడిన వారిలో నలుగురు ముఖాలకు ముసుగు వేసుకోగా, ఒకరు ఖర్చీఫ్ కట్టుకుని హిందీలో మాట్లాడుకుంటున్నారని ఇద్దరు మహి ళలు గుర్తించినట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ రాము గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. గతంలో గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి గుడిలో స్వామి వారి వెండి ఆభరణాలు దుండగులు అపహరించారు. గ్రామంలో వరుస దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
బైక్ అదుపుతప్పి కిందపడి ..
ఎమ్మిగనూరురూరల్: కె.తిమ్మాపురం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. తమ బంధువుల అమ్మాయికి సంబంధం కుదుర్చుకుని సంతోషంగా తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన గిరిపోగు ఎంకప్ప(28) తమ బంధవుల అమ్మాయికి ఎమ్మిగనూరు మండలం టీఎస్ కూళ్లూరు గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. తెర్నేకల్ గ్రామం నుంచి అమ్మాయి కుటుంబ సభ్యులు శుక్రవారం అబ్బాయి ఇంటికి వచ్చారు. పెళ్లి సంబంధం కుదరటంతో అక్కడే భోజనాలు చేసి తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. ఎంకప్ప పల్సర్ బైక్పై వెళ్తుండగా కె.తిమ్మాపురం గ్రామ సమీపంలో మలుపు దగ్గర అదుపుతప్పి కాలువగట్టు ఢీకొట్టాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక వస్తున్న బంధువులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కొలిమిగుండ్ల: తిమ్మనాయినపేట జంక్షన్ సమీపంలోని వేర్హౌస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ రమేష్బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంకిరెడ్డిపల్లెకు చెందిన బండ నాగాంజనేయులు (29) పని నిమిత్తం స్నేహితులతో కలిసి జమ్మలమడుగుకు బైక్పై వెళ్లి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తిమ్మనాయినపేట జంక్షన్ వద్దకు వచ్చే సరికి బైక్లో ఉన్న ఇద్దరు స్నేహితులు టాయ్లెట్ వెళ్లేందుకు కిందకు దిగారు. నాగాంజనేయులు రోడ్డుకు అటు వైపు వెళ్లేందుకు బైక్ను తిప్పుతుండగా జమ్మలమడుగు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
నివురు గప్పిన పేరూరు
రుద్రవరం: ‘అధికారం మాది.. దేవుడి ఉత్సవమైనా మేము చెప్పినట్లు జరగాల్సిందే’నని ఓ టీడీపీ నేత హుకుం జారీ చేయడంతో పేరూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శివరాత్రి ఉత్సవాల్లో దేవుడి పల్లకీ ముందుగా తన ఇంటి వద్ద పూజలందుకున్నాకే గ్రామోత్సవం ప్రారంభించాల్సిందేనని ఏకంగా దేవదాయ శాఖ అధికారులను ఆదేశించాడు. పేరూరు గ్రామంలో ఈశ్వర, చెన్న కేశవ, రామాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆలయంలో శివరాత్రి, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఉత్సవంలో ముందుగా స్వామి అమ్మవార్లను గ్రామంలోని రెడ్డి గారి (బాలనాగిరెడ్డి) ఇంటి వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక ఆనవాయితీ ప్రకారం గ్రామోత్సవం ప్రారంభిస్తారు. అయితే బాబు సర్కారు అధికారంలో ఉండటంతో ఓ టీడీపీ నేత గతేడాది అప్పటి ఈఓ నర్సయ్యను బెదిరించి సంప్రదాయలకు గండి కొట్టాడు. అవతలి వర్గీయులను నమ్మబలికించి ఉత్సవమూర్తుల పల్లకీని తన ఇంటి వద్దకు రప్పించుకున్నాడు. దీంతో గ్రామస్తులు అడ్డుపడ్డారు. అప్పట్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే వివిధ శాఖల అధికారులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఈ సారి కూడా ఉత్సవ మూర్తుల పల్లకీ ముందుగా తన ఇంటి వద్దకు రావాల్సిందేనని టీడీపీ నేత ఆలయ ఈఓ సాయి జయచంద్రారెడ్డిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఈఓ గ్రామస్తులను విచారించిన తర్వాత టీడీపీ నాయకుడు చెప్పేది అంతా విరుద్ధమని తెలుసుకున్నారు. అయితే ఓ వైపు ఉత్సవాలకు సిద్ధం చేస్తూ.. మరో వైపు సమస్యను ఎస్ఐ జయప్పకు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం నిర్వహించే ఉత్సవం నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం -
శ్రీశైలంలో మద్యం, సారా పట్టివేత
శ్రీశైలం: స్థానిక కొత్తపేట, మేకలబండ ప్రాంతాల్లో శుక్రవారం ఎకై ్సజ్ పోలీసుల తనిఖీల్లో 85 మద్యం బాటిళ్లు, 34 లీటర్ల నాటు సారా పట్టుబడింది. సీఐ మోహన్రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడులు చేసి మేకల బండకు చెందిన పోతుల సాయి దగ్గర నుంచి 34 లీటర్ల నాటు సారా, అదే ప్రాంతానికి చెందిన నాగరాజు నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంలోని కొత్తపేటలో మంజుల లలిత ఇంటి వద్ద 45 మద్యం సీసాలు, అదే ప్రాంతానికి చెందిన సంపంగి మహేశ్వరి వద్ద నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నలు గురు నిందితులపై దేవదాయ చట్ట ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. ఘాట్ రోడ్డులో నిబంధనలు పాటించాలి ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం మీదుగా ప్రయాణించే వాహనదారులు అటవీ సంరక్షణ నిబంధనలు పాటించాలని సబ్ డీఎఫ్ఓ బబిత శుక్రవారం తెలిపారు. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాల వేల అధిక సంఖ్యలో భక్తులు వాహనాల్లో వెళ్తున్నారని, ఈ మేరకు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు అందజేస్తున్నామన్నారు. అటవీ మార్గంలో 30 కి.మీ వేగానికి మించి వెళ్ల వద్దని, రహదారిపై వన్యప్రాణులు కనిపిస్తే వాహనాలను నిలిపేయాలని సూచించారు. తీవ్రంగా హారన్లు మోగించడం, అడవిలో మల విసర్జనకు వెళ్లడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. అటవీ చట్టాలను అతిక్రమించే డ్రైవర్లకు రూ.500 – రూ.1000 వరకు అపరాధ రుసుం విధిస్తామన్నారు. చైన్స్నాచర్కు మహిళ దేహశుద్ధి ఎమ్మిగనూరురూరల్: పట్టణంలో చైన్స్నాచింగ్కు యత్నించిన దొంగకు మహిళ దేహాశుద్ధి చేశారు. కూరగాయల మార్కెట్ రోడ్డులో షరాఫ్ బజారు నుంచి వస్తున్న ఓ మహిళ మెడ నుంచి చైన్ లాక్కునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా వెంటనే తేరుకున్న మహిళ ఆ వ్యక్తి చేయిపట్టుకుంది. చొక్కా పట్టుకొని దేహాశుద్ధి చేసింది. పోలీస్స్టేషన్కు లాక్కెళ్తుండగా కొంత దూరం వెళ్లిన తర్వాత మహిళ నుంచి తప్పించుకొని దొంగ పారిపోయాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు ఆదోని అర్బన్: స్థల వివాదం నేపథ్యంలో ఓ మహిళను ధూషించిన వ్యక్తులపై ఆదోని త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామలింగమయ్య శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. స్థానిక దుర్గా రైస్ మిల్ సమీపంలో ఎరుకల జయమ్మకు 7.50 సెంట్ల స్థలం ఉంది. ఆమె తన స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంది. బుధ వారం రాత్రి ఆదోని పట్టణానికి చెందిన మహమ్మద్, ఎస్ఎండీ ఇసాక్ మరి కొంతమందితో కలిసి అక్కడికి చేరుకుని ప్రొక్లెన్తో కాంపౌండ్ వాల్ను కూల్చివేశారు. అడ్డుకోబోయిన జయమ్మ ను కులం పేరుతో దూషిస్తూ అవమానించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ధూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
‘సీమ’కు నిధులు పారేనా?
● ప్రతిపాదనల్లో ఊసే లేని గుండ్రేవుల ● రాయలసీమ లిఫ్ట్ లేనట్టే! ● నేడు రాష్ట్ర బడ్జెట్ కర్నూలు సిటీ: రాయలసీమ జిల్లాల్లోని సాగు నీటి ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయలేకపోయింది. ఈ ఏడాది భారీగా వర్షాలు కురిసినప్పటికీ సాగు విస్తీర్ణం పెరగలేదు. ఇలాంటి సమయంలో నారా చంద్రబాబు ప్రభుత్వం నేడు(శనివారం)శాసన సభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లోనైనా సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. బడ్జెట్కు ప్రతిపాదనలు ఇవీ.. వేదావతి ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడి కాలువ కింద 10 వేల ఎకరాల భూములు సేకరణ చేయాల్సింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 1.20 లక్షల ఎకరాలు సాగులోకి రానుంది. అలాగే 300కిపైగా గ్రామాల్లో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం కానుంది. తుంగభద్ర దిగువ కాలువతో పాటు వేదావతి, ఆర్డీఎస్లకు రూ.280 కోట్లు, భూసేకరణకు రూ.154 కోట్లతో బడ్జెట్కు ప్రతిపాదనలు చేశారు. గోరుకల్లు పనులు సాగేనా? రాయలసీమ జిల్లాలకు సాగు, తాగు నీటిని తరలించడంలో కీలకమైంది గోరుకల్లు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 12.4 టీఎంసీలు. 265.6 మీటర్లు ఎత్తుకుగాను, ఇప్పటి వరకు 262 మీటర్లు పని చేసి, గత ప్రభుత్వ హాయాంలో 11.2 టీఎంసీల నీటిని నిల్వ చేసి సరికొత్త రికార్డును నమోదు చేశారు. 2014–19 వరకు టీడీపీ మాయాంలో 3.66 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. పెండింగ్ పనులతో పాటు కుంటుతున్న రాతిపరుపు పనులు పూర్తి చేసేందుకు రూ.40 కోట్లకు ఈ ఏడాది బడ్జెట్కు ప్రతిపాదనలు చేశారు. కేసీ కాలువ పరిధిలోని 2.65 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఆలగనూరు రిజర్వాయకు మరమ్మతులు చేసేందుకు రూ.25 కోట్లతో ప్రతిపాదించారు. లోతు పెరిగిన ఫ్లంజ్ఫూల్ శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో వచ్చిన వరదలతో ఫ్లంజ్ఫూల్ లోతు పెరిగి ప్రమాదరంగా మారింది. అదే సమయంలో డ్యాం కుడి వైపు కొండ చరియలు జారి పడి దిగువన ఉన్న రోడ్డు కొట్టుకపోయింది. అత్యవసరంగా పనులు చేసేందుకు, డ్యాం నిర్వహణకు బడ్జెట్లో రూ.100 కోట్లకు ప్రతిపాదించారు. ఉమ్మడి జల్లాలోని సాగు నీటి ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. పెండింగ్ పనులకు, భూసేకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు పొందిన ప్రాజెక్టులకు మాత్రమే బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయి. – కబీర్ బాషా, జలవనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ ●మరమ్మతులకు నోచుకోని ఆలగనూరు రిజర్వాయర్గుండ్రేవుల.. కలేనా!రాయలసీమలోని కర్నూలు–కడప కాలువ పరిధిలోని 2.65 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగు నీటిని అందించేందుకు తుంగభద్ర నదిపై నిర్మిస్తామని చెప్పిన గుండ్రేవుల ప్రాజెక్టు బడ్జెట్లో ఎలాంటి ఊసేలేదు. దీంతో పాటు శ్రీశైలం రిజర్వాయర్లో 800 అడుగుల నుంచే నీటిని కరువు ప్రాంతాలైన రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు గత వైస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ లిఫ్ట్కు సైతం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా కీలకమైన పందికొన రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి మట్టం నిలిపేందుకు, కాలువల పనులు చేసేందుకు రూ.275 కోట్లతోను, 68 చెరువుల పథకం నిర్వహణకు రూ.35 కోట్లకు, ప్రపోజ్ చేశారు. జీడీపీలో పెండింగ్లో పనులు చేసేందుకు రూ.30 కోట్లతో ప్రతిపాదనలు చేయగా, ఇందులో పెండింగ్ బిల్లులు రూ.40 కోట్ల వరకు ఇప్పటి వరకు రాలేదు. కేసీ కాలువ హెడ్ కింద రూ.150 కోట్లతో కుందునది విస్తరణ చేపట్టేందుకు, కాల్వల మరమ్మతులకు, నిర్వహణకు రూ.145కోట్లు సుంకేసుల బ్యారేజీ కరెంట్ బిల్లులకు రూ.4 కోట్లకు బడ్జెట్లో ప్రపోజ్ చేశారు. తెలుగుగంగ కాల్వలో భాగంగా వెలుగోడు, సిద్ధాపురం లిఫ్ట్ నిర్వహణకు 89 కోట్లు, వెలుగోడు నుంచి తెలుగుగంగా కాల్వ లైనింగ్, నిర్వహణకు రూ.153 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. -
శివ..శివా.. సెలవుల్లేవు!
కర్నూలు(అర్బన్): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కలిసొచ్చిన రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలను కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిని జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 15వ తేది నాటికి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు 50 శాతానికి మించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సెలవు దినాల్లో కూడా పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని గ్రామాల్లో పన్నులను వసూలు చేయాలని సంబంధిత అధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. కుటుంబంతో కలిసి శివరాత్రి పండుగ రోజున జిల్లాలోని ఏదో ఒక శైవ క్షేత్రానికి వెళ్లాలని ముందస్తు ప్రణాళికలకు రూపొందించుకున్న పంచాయతీ కార్యదర్శులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని మొత్తం 484 గ్రామ పంచాయతీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి పన్నుల రూపేణ ఆరియర్స్ రూ.2.53 కోట్లు, ప్రస్తుత పన్నులు రూ.16.65 కోట్లు (మొత్తం రూ.19.19 కోట్లు ) వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అరియర్స్ రూ.83 లక్షలు, ప్రస్తుత పన్నులు రూ. 8.94 కోట్లు వసూలు చేశారు. ఇంకా పన్నులకు సంబంధించి రూ.10.42 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. అలాగే పన్నేతరముల కింద అరియర్స్ రూ.1.36 కోట్లు, ప్రస్తుత ఏడాది డిమాండ్ మేరకు రూ.9.14 కోట్లు ( మొత్తం రూ.10.50 కోట్లు) వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు పన్నేతరముల అరియర్స్ రూ.30 లక్షలు, డిమాండ్ పన్నుల కింద రూ.3.69 కోట్లు (మొత్తం రూ.3.99 కోట్లు) వసూలు చేశారు. ఇంకా పన్నులు, పన్నేతరముల కింద జిల్లాలో దాదాపు రూ.16 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి ఈ నెల 15వ తేది నాటికి 50 శాతానికి మించి పన్నులు వసూలు చేయాలని పీఆర్అండ్ఆర్డీ ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి పెట్టారు. గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్ –4, 5 పంచాయతీ కార్యదర్శులు అనేక రకాల సర్వేలను చేయాల్సి ఉంది. ఈ నేఫథ్యంలోనే ఆయా సర్వేలను సకాలంలో చేయడంతో పాటు పన్నుల వసూళ్లకు టార్గెట్స్ ఇవ్వడం పట్ల వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు సంబంధించి కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, చిప్పగిరి, హోళగుంద, హాలహర్వి, తుగ్గలి, దేవనకొండ, పత్తికొండ, ఆస్పరి తదితర మండలాల్లోని అనేక గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో పన్నులను వసూలు చేసేందుకు చాలా కష్టంగా ఉందనే అభిప్రాయాన్ని అక్కడి కార్యదర్శులు వ్యక్తం చేస్తున్నారు. పైగా జిల్లాలో మొత్తం 484 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో మేజర్ గ్రామ పంచాయతీల్లో బిల్ కలెక్టర్లు వన్నులను వసూలు చేస్తున్నారు. మిగిలిన మైనర్ గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులే పన్నులను వసూలు చేయాల్సి ఉంది. గ్రామ పంచాయతీలకు అనుగుణంగా కార్యదర్శులు కూడా లేకపోవడంతో పన్నుల వసూళ్లలో జాప్యం జరుగుతుందనే భావన వినిపిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో గ్రేడ్ –4 కార్యదర్శులు 150, గ్రేడ్ –5 కార్యదర్శులు 137 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారం పనిచేయాల్సిందే పన్నుల వసూళ్లపై మౌఖిక ఆదేశాలు పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి 50 శాతం కంటే తక్కువ వసూళ్లు ఉంటే దండన తప్పదని హెచ్చరికలు -
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. ఓం నమఃశివాయ, హరోం హర శంకరా అంటూ భక్తులు స్వామి, అమ్మవార
● శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ● మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు ● అరకొర ఏర్పాట్లతో అవస్థలు పుష్ప పల్లకీలో విహరిస్తున్న ఆది దంపతులుమహిళ కోలాటం పుష్పపల్లకీలో ఆదిదంపతులు బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం శ్రీ భ్రమరాంబసమేత మల్లికార్జునుడు పుష్పపల్లకీపై దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. క్షేత్ర తూర్పు, దక్షిణ మాడవీధుల్లో జరిగిన పుష్పపల్లకీ గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. పుష్పపల్లకీని వివిధ రకాల సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం పల్లకీలో శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేశారు. ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు ప్రత్యేక పూజా హారతులిచ్చారు. గంగాధర మండపం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం మీదుగా రాజగోపురం వరకు సాగింది. జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు, మేళతాళాలు, శంఖానాదాల మధ్య గ్రామోత్సవం నేత్రానందభరితంగా సాగింది. పూజా కార్యక్రమాల్లో శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీశైలం నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు శనివారం సాయంత్రం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ ఉంటుంది. పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
హామీలు విస్మరించిన చంద్రబాబు
● ఎస్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు విస్మరించడం పట్ల ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. శుక్రవారం ఎస్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు చేపట్టారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీకే జనార్ధన్, సుంకన్న అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఆ సంఘం పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న, రాష్ట్ర సహాధ్యక్షుడు ఎస్.గోకారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అడివన్న, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు మహదేవప్ప మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. వెంటనే 12వ పీఆర్సీని వేసి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. 2001 సెప్టెంబ్ 1 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన 2003 డీఎస్పీ ఉపాధ్యాయులు, పోలీసులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీని వెంటనే మంజూరు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేదంటే ఫిబ్రవరి 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కమిటీ ఎం.శ్రీధర్, జిల్లా నాయకులు వాణి, కన్వీనర్ జీసీ నరసింహుడు, సి.నాగరాజు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పనిచేయని షవర్లు, పంపులు
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, షవర్ బాత్ల వద్ద నీళ్లు రావడంలేదని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శివస్వాములు ధర్నా చేశారు. శుక్రవారం నీటి సరఫరాలో సమస్య తలెత్తుతుండటంతో స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక శివదీక్ష శిబిరాల సమీపంలో ఏర్పాటు చేసిన స్నానపు గదులు, మరుగుదొడ్ల వినియోగానికి రూ.30 చొప్పున బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, నీటి సరఫరా ఏఈలు ధర్నా చేస్తున్న శివ స్వాముల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వెనుక శివదీక్ష శిబిరాల వైపు సర్వతోభద్రవనం పక్కన ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, షవర్ బాత్లను పరిశీలించి నీటి సమస్యను పరిష్కరించారు. మరుగుదొడ్ల వినియోగానికి టెండర్ నిబంధనల మేరకు రూ.10 మాత్రమే వసూలు చేయాలని అధికారులు హెచ్చరించారు. అధికంగా వసూలు చేస్తే టెండర్ను రద్దు చేస్తామన్నారు. కాగా రెండు రోజులు క్రితం వరకు మరుగుదొడ్ల వద్ద ఉచితం అని రాసి ఉందని, ఆ తర్వాత బోర్డును తొలగించేసి డబ్బులు వసూలు చేస్తున్నారని శివ స్వాములు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఇంజనీరింగ్ అధికారులు దేవస్థానం శానిటేషన్ అధికారులను సంప్రదించి మరుగుదొడ్లను, స్నానపు గదులను టెండర్ ప్రాతిపదికన ఇచ్చారా లేక ఉచిత పద్ధతిన ఏర్పాటు చేసినవా నిర్ధారించుకొని ఎలాంటి రుసుము చెల్లించవద్దని శివ స్వాములకు సూచించడం గమనార్హం. -
ఊయలే ఉరి తాడైంది
వెల్దుర్తి: ఊయలే ఆ బాలుడికి ఉరి తాడైంది. ఏడేళ్లకే అందని లోకాలకు చేర్చింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కలుగొట్లలో గురువారం చోటు చేసుకుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన అహ్మద్బాషా, హసీనాబీలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్న కుమారుడు అఫ్రోజ్(7) రెండో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా తట్టు వ్యాధితో బాధపడుతూ ఇంట్లో ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన అఫ్రోజ్ ఇంటి ఆవరణలోని రేకుల షెడ్కు కట్టిన చీర ఊయలలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ చీర మెడకు బిగుసుకుంది. భోజనం ముగించుకుని బయటకు వచ్చిన తల్లిదండ్రులు కుమారుడి మెడకు ఊయల బిగుసుకుని కనిపించడంతో ఆందోళన చెందారు. చీరను తప్పించి చూడగా మృతి చెందినట్లు గుర్తించారు. కళ్ల ముందు విగతజీవిగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
కర్నూలు (సెంట్రల్)/ఆదోని సెంట్రల్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారాన్ని వాషింగ్టన్లోని సియోటెల్ సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారికంగా ప్రకటించారు. ‘‘జాహ్నవి మృతి మా హృదయాలను కలచివేసింది. ఈ ఆర్థికసాయమైనా ఆమె కుటుంబానికి కాస్తంత ఓదార్పు అందిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఇవాన్స్ వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన జాహ్నవి కర్నూలు జిల్లా ఆదోనిలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, విజయలక్ష్మి దంపతులు కౌతాళం మండలం కుంబళనూరు నుంచి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. మొదటి కుమార్తె జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లింది. అక్కడి నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ కోర్సులో చేరింది. అయితే 2023 జనవరి 23న జాహ్నవి రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో 100 అడుగుల దూరంలో ఎగిరిపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది. ఈ ప్రమాదానికి పోలీసు వాహనం నడుపుతున్న కెవిన్ డవే అనే అధికారి కారణమయ్యారు. అయితే ఆమె మృతిపై మరో అధికారి డేనియల్ అడరర్ అత్యంత నిర్లక్ష్యంగా జోకులు వేస్తూ మరో అధికారితో మాట్లాడడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ‘‘ఈమెకు 26 ఏళ్లు ఉంటాయేమో. అయినా సాధారణ వ్యక్తి. ఈమె మరణానికి ఎలాంటి విలువ లేదు’’ అని అడరర్ వ్యాఖ్యానించడం మరో అధికారి బాడీ కెమెరాలో రికార్డయింది. భారత విద్యార్థి మృతి, అధికారి అనుచిత వ్యాఖ్యలపై భారత్ భగ్గుమంది. అమెరికా పౌరులూ డేనియల్ అడరర్ తీరును ఖండించారు. దీంతో అతనిపై వేటు పడింది. విధుల నుంచి పోలీసు ఏజెన్సీ తప్పించింది. ఈ క్రమంలో సియాటెల్ సిటీ అధికారులే తమ కుమార్తె మరణానికి కారణమని 110 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని జాహ్నవి కుటుంబం 2024 సెప్టెంబర్లో దావా వేసింది. ఈ క్రమంలో పూర్తి స్థాయి విచారణ జరిపిన వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించి బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించారు. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్ల పరిహారం చెల్లించేలా అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే బాధిత కుటుంబానికి భారత ఎంబసీ ద్వారా ఆ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.మూడు రోజుల క్రితమే జాహ్నవి తండ్రి మృతి ఆదోనిలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్న జాహ్నవి తల్లిదండ్రులు కుమార్తె మరణంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితమే తండ్రి శ్రీకాంత్ గుండెపాటుతో మరణించారు. దీంతో తల్లి విజయలక్ష్మీ, చిన్న కూతురు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో వారికి భారీ పరిహారం అందితే ఎంతో అండగా ఉంటుంది. అయితే ఈ విషయం వారికి తెలియదు. ప్రస్తుతం వారు శ్రీకాంత్ మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నారు. -
శ్రీశైల మల్లన్నకు పాగా సిద్ధం
శ్రీశైలం టెంపుల్: మహా శివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో మల్లికార్జునుడిని పెళ్లి కొడుకుగా సిద్ధం చేసే సమయాన తలపై చుట్టేందుకు పాగా సిద్ధమైంది. దేశంలో ఏ శైవక్షేత్రంలోనూ లేని విధంగా శ్రీశైలంలో మాత్రమే మల్లన్నకు పాగా అలంకరణ ఉంటుంది. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేట హస్తినాపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం వంశపారంపర్యంగా మల్లన్న తలపాగా తయారు చేసి చుడుతోంది. గ్రామానికి చెందిన కందస్వామి, వేంకట సుబ్బారావు హయాంలో పాగా వస్త్రం తయారీకి ఒక ప్రత్యేక మగ్గాన్ని ఏర్పాటు చేసి నేసేవారు. రోజుకో మూర చొప్పున 300 రోజులు 300 మూరలు నేసేవారు. మహా శివరాత్రి పర్వదినానికి 15 రోజుల ముందు వ్రస్తాలతో శా్రస్తోక్తంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించి శ్రీశైలం బయలుదేరి మల్లన్లకు పాగా చుట్టేవారు. ప్రస్తుతం వారి వారసుడు పృ«థ్వీ సుబ్బారావు కుటుంబ సభ్యుల సహకారంతో కార్తీకమాసంలో మంచి రోజు చూసుకుని పాగా వస్త్రం నేతను ప్రారంభిస్తున్నారు. శివరాత్రికి పది రోజుల ముందు 300 మూరలు పూర్తయ్యే విధంగా ప్రణాళిక తయారు చేసుకుని స్వచ్ఛమైన తెల్లటి దారాన్ని వినియోగించి పాగా వ్రస్తాన్ని నేస్తున్నారు. పాగా నేత పూర్తయ్యే వరకూ శాకాహారమే తీసుకుంటూ నియమ నిష్టలను పాటిస్తారు. ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ... నేలపై నిద్రిస్తూ నిత్యం శివనామస్మరణ చేస్తారు. ఆలయ మర్యాదలతో స్వాగతం ఈ ఏడాది సిద్ధం చేసిన పాగాను తీసుకుని జాండ్రపేట హస్తినాపురం నుంచి పృథ్వీ సుబ్బారావు కుటుంబ సభ్యులు శ్రీశైలం బయలుదేరారు. వీరు శుక్రవారం స్వామి క్షేత్రానికి చేరుకుని ఈ నెల 15న మహా శివరాత్రిని పురస్కరించుకుని శివయ్యకు సమర్పిస్తారు. పృథ్వీ సుబ్బారావు కుటుంబానికి శ్రీశైల దేవస్థానం నుంచి ఏటా ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని దేవస్థాన అధికారులు అందజేస్తారు. పాగా వస్త్రంతో వచ్చే వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి... భోజనం, వసతి, ప్రత్యేక దర్శనాలతోపాటు ఆరి్థక ప్రోత్సాహకాన్ని కూడా అందజేస్తారు. పాగా నేసేందుకు నెలకు రూ.6వేల చొప్పున అందజేయడంతో పాటు, మహాశివరాత్రి నాడు పాగా చుట్టిన తర్వాత రూ.50వేల ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తున్నారు. -
పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు
● టెక్నాలజీ సహాయంతో సకాలంలో స్పందన నంద్యాల: భార్యతో గొడవపడి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బయటకు వెళ్లిన వ్యక్తి ఆచూకీని టూటౌన్ పోలీసులు కనుగొని పిల్లలను రక్షించారు. టూటౌన్ ఎస్ఐ సురేష్ తెలిపిన మేర కు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలో బుధవారం గిరినాథ్ సర్కిల్లో నివాసముండే శివకుమార్ ఉదయం కుటుంబ కలహాలతో భార్యతో గొడవపడి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బైక్పై వెళ్లాడు. అనంతరం పిల్లలను స్కూల్ వద్ద నుండి తీసుకొని వచ్చి తన స్కూటీపై ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో హుటాహుటిన పిల్లల తల్లి సుబ్బలక్ష్మి, ఆమె తరఫు బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు శివకుమార్ ఫోన్ను ట్రాక్ చేయగా శివకుమార్ పిల్లలను తీసుకొని గుత్తి రోడ్డులో వెళ్తున్నట్లు చూపించింది. వెంటనే స్పందించిన పోలీసులు పిల్లల తల్లిని, వారి బంధువులతో పాటు వెహికల్లో వెళ్లి శివకుమార్ గుత్తిలో వారి సోదరుని ఇంటికి వెళ్లడంతో అక్కడికి చేరుకొని కుటుంబ సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలని పిల్లలను ఇలా బెదిరించి తీసుకురావడం నేరమని మందలించి పిల్లలను నంద్యాలకు తీసుకొని వచ్చి వారి బంధువులకు అప్పగించారు. పిల్లలను కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఏదైనా చేస్తాడని భయపడిన స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పోలీసులు వెంటనే స్పందించి క్షేమంగా తన పిల్లలను నాకు అప్పగించినందుకు తల్లి సుబ్బలక్ష్మి ఈ సందర్భంగా పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జిల్లాలో కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు జరుగుతున్న క్రమంలో వెంటనే పోలీసులు స్పందించి వారిని క్షేమంగా ఇంటికి తీసుకొని రావడంతో టూ టౌన్ పోలీసులను పట్టణ ప్రజలు, అభినందిస్తున్నారు. -
ప్చ్.. ఇది చంద్రన్న మందే!
ఇది కూల్డ్రింకేనా! తాగుదామా, వద్దా..బ్రహ్మగుండంలో కోతులెక్కువ. ఏ ద్విచక్ర వాహనం ఆలయ ప్రాంతంలో పార్క్ చేసి వెళ్లినా వాహనాల బ్యాగులు చించి మరీ అందులో ఏమున్నా ఎత్తుకెళ్తుంటాయి. ప్రస్తుతం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న బ్రహ్మగుండంలో వ్యాపారులు అంగళ్లు వేసుకోవడంలో, ఉత్సవ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. గురువారం ఓ కోతికి ఏదో ఓ ద్విచక్ర వాహనం బ్యాగ్లో ఓ నైన్టీ మద్యం బాటిల్ దొరికింది. బాటిల్ తీసుకుని వెళ్లి చెట్టుపై కూర్చుంది. అలవాటైన కూల్ డ్రింక్ అనుకుందేమో బాటిల్ మూత తీసేందుకు విఫల ప్రయత్నం చేసింది. రాకపోవడంతో పళ్లతో కొరికింది. చిన్న ధారలా మద్యం చిమ్మడంతో తాగేందుకు ప్రయత్నించింది. వాసన నచ్చలేదో, లేక నాసిరకం అనుకుందో కానీ విసిరికొట్టి వెళ్లిపోయింది. – వెల్దుర్తిమూత తీసి టేస్ట్ చూద్దాం..ఇది చంద్రన్న మందులా ఉంది.. ప్చ్! -
పాణ్యం ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా విజయభాస్కర్
బొమ్మలసత్రం: పాణ్యం నియోజకవర్గం ఎస్సీ వి భాగం అధ్యక్షులుగా విజయభాస్కర్(యువరాజ్)ను నియమిస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కా ర్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కారును ఢీకొన్న ప్రైవేటు బస్సు ఆలూరు రూరల్: ప్రైవేటు ట్రావెల్ బస్సుల ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్తో హైవేల్లో ఎక్కడో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హులేబీడు గ్రామ సమీపంలో హైవే –167పై బుధవారం అర్ధారాత్రి 12.30 గంటలకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ నుంచి ఆలూరు మీదుగా మంత్రాలయం వెళ్తున్న కారును ఆదోని నుంచి బళ్లారి వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్ విజయ్ కుమార్కు స్వల్పగాయాలయ్యాయి. బస్సులో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ రంగయ్య విలేకరులకు తెలిపారు. విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి దొర్నిపాడు: విద్యుదాఘాతంతో ఓ టిప్పర్ డ్రైవర్ మృతి చెందాడు. అర్జునాపురం – నందింపల్లె గ్రా మాల మధ్య రోడ్డు నిర్మా ణ పనులు జరుగుతున్నా యి. బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామానికి చెందిన హరికృష్ణ(25) టిప్పర్లో కంకర అన్లోడ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. లిఫ్ట్ద్వారా టిప్పర్ ట్రాలీ ఎత్తే క్రమంలో పైన ఉన్న కరెంట్ తీగలను గమనించ లేదు. దీంతో విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ప్రవళ్లిక ఉన్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి వెల్దుర్తి: జాతీయ రహదారిపై మదార్పురం సమీపంలోని కోళ్ల ఫారం ఆవరణలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డోన్ పట్టణానికి చెందిన అల్లాబకాష్ మదార్పురం వద్ద కోళ్ల ఫారంలో నాటు కోళ్ల పెంపకం చేపట్టాడు. ఇతని మిత్రులు డోన్ పట్టణం సుందర్సింగ్ కాలనీకి చెందిన సురేష్(24), అమ్రేశ్ నాయక్లు బుధవా రం రాత్రి అక్కడికి చేరుకుని మద్యం సేవించారు. మద్యం అయిపోవడంతో సురేష్, నాయక్లు వెల్దుర్తికి వచ్చి మద్యం తీసుకువెళ్లి మళ్లీ తాగారు. వీరిలో అల్లాబకాష్, నాయక్ ఇద్దరు గురువారం ఉదయం 9 గంటల సమయంలో నిద్రలేచారు. ఈ సమయంలో సురేష్లో చలనం లేకపోవడంతో 108కు సమాచారమిచ్చారు. వారు సంఘట నా స్థలికి చేరుకుని సురేష్ అప్పటికే మృతి చెందినట్లు తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సీఐ యుగంధర్, ఎస్ఐ నరేశ్ సంఘటనాస్థలి కి చేరుకుని విచారించారు. ఆ సమయంలో అమ్రే శ్ నాయక్ హైవే రోడ్డు దాటే సమయంలో కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు తల్లి ఎల్లవేణమ్మ అనుమానం వ్యక్తం చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించింది. -
జిల్లాలో రెండు మద్యం దుకాణాల ఏర్పాటుకు రీనోటిఫికేషన్
● ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ● 23వ తేదీన లాటరీ ద్వారా లైసెన్స్ జారీ కర్నూలు: జిల్లాలో లైసెన్స్ ఫీజు చెల్లించకుండా ఆగిపోయిన రెండు మద్యం దుకాణాల ఏర్పాటుకు కలెక్టర్ అనుమతితో ఎకై ్సజ్ అధికారి మచ్చ సుధీర్ బాబు రీనోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలోని ఎమ్మిగనూరు రూరల్లో ఒకటి, చిప్పగిరి మండలం యూనిట్లో ఒక దుకాణాలను గతంలో నిర్వహించిన టెండర్లు దక్కించుకున్నవారు లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆదేశం మేరకు వాటి ఏర్పాటుకు గురువారం రీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఈఎస్ సుధీర్ బాబు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 21వ తేదీ సాయంత్రం లోగా ఆయా దుకాణాలకు ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కొక్క దుకాణానికి కనిష్టంగా ఒక దరఖాస్తు వస్తేనే లాటరీ ద్వారా దుకాణాన్ని కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను బట్టి ఈ నెల 23వ తేదీన రెండు దుకాణాలకు కలెక్టర్ సమక్షంలో లాటరీ తీసి లైసెన్స్ను జారీ చేయనున్నట్లు ఈఎస్ పేర్కొన్నారు. -
క్యాన్సర్ గుర్తింపు స్క్రీనింగ్తోనే సాధ్యం
మద్దికెర: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్తో క్యాన్సర్ పరీక్షలు చేయాలని జిల్లా ఎన్సీడీ, బాలస్వస్థ కార్యక్రమం నోడల్ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ అన్నారు. గురువారం స్థానిక ప్రాథమిక వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మండలంలో జరుగుతున్న ఎన్సీడీ సర్వే సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్ ప్రొవైడర్లు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు టీమ్లుగా ఏర్పడి ఇంటి వద్దనే ప్రతి ఒక్కరికీ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయాలని సూచించారు. ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ నంచి రక్షణ పొందవచ్చన్నారు. రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భశాయ, ముఖద్వారా క్యాన్సర్లపై స్క్రీనింగ్ చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలోనే ప్రసవాలు నిర్వహించాలని ఆయుష్మాన్, ఆరోగ్య మందిరాలలో సేవలు మెరుగుపరచాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు శ్రీలక్ష్మి, రాగిణి, జిలాని బాషా, సీహెచ్ఓ నిరంజన్బాబు, డీహెచ్ఈఓ అక్బర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలతో నష్టపోయాం
● జిల్లా వ్యవసాయ అధికారిణికి ఫిర్యాదు చేసిన రైతులుకర్నూలు(అగ్రికల్చర్): కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన రైతులు దళారీలను నమ్మి మొక్కజొన్నలో విత్తనోత్పత్తి చేపట్టి నష్టపోయారు. శ్రీకర్ విత్తన కంపెనీ మొక్కజొన్న ఎఫ్/ఎస్ ఎంజెడ్–1011 రకం (బ్యాచ్ నెంబరు ఎస్ఎస్ఎంజెడ్ 1011223) విత్తనాలు దళారీల ద్వారా సరఫరా అయ్యాయి. ఈ విత్తనాలతో చంద్రశేఖర్, నారాయ ణ అనే రైతులు 2.70 ఎకరాల్లో విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టారు. విత్తనోత్పత్తిలో పెట్టుబడి వ్య యం ఎక్కువగా ఉంటుంది. దాదాపు రూ.1.50 లక్ష లు పెట్టుబడి పెట్టారు. పంట బాగా వస్తే క్వింటాలుకు రూ.3 వేల ప్రకారం కంపెనీ కొనుగోలు చేస్తుందని ఆశించారు. అయితే మూడు నెలలు గడచినప్పటికీ మొక్కల్లో పెరుగుదల లేకుండా పోయింది. ఒక్కో మొక్కకు రెండు అడుగులలోపు చిన్నచిన్న పిలకలు వచ్చాయి. పంట పూర్తిగా దెబ్బతినడంతో దళారీలు పత్తా లేకుండా పోయారు. కంపెనీ ప్రతినిధులు స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. గురువారం మొక్కజొన్న మొక్కలు తీసుకొని వచ్చి జిల్లా వ్యవసాయ అధికారిణి పీఎల్ వరలక్ష్మికి ఫిర్యాదు చేశారు. నకిలీ విత్తనాలతో దెబ్బతీసిన కంపెనీపై చర్యలు తీసుకొని పరిహారం ఇప్పించాలని రైతులు కోరారు. -
శ్రీగిరిలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తజనం పోటెత్తుతున్నారు. పాదయాత్రగా నల్లమల మీదుగా భక్తులు శ్రీశైలం చేరుకుని మల్లన్నను కనులారా దర్శించుకుంటున్నారు. వందల కి.మీ నడిచి అలసిపోయిన భక్తకోటి శ్రీగిరిలో అడుగు పెట్టిన వెంటనే
అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవం కోవెలకుంట్ల: 65 ఏళ్ల మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ కామాంధుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. గురువారం కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. 2023 సెప్టెంబర్ 24వ తేదీన సంజామలకు చెందిన ఓ వృద్ధురాలు కోవెలకుంట్ల బస్టాండ్ వద్ద ఊరికి వెళ్లేందుకు వేచి ఉంది. ఇంటి వద్ద వదిలిపెడతానని అదే గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరి మద్యం మత్తులో బైక్పై ఎక్కించుకున్నాడు. స్థానిక గుంజలపాడు రహదారిలో వైపు తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ వృద్ధురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఘటన జరిగిన తర్వాత రాత్రి సమయంలో రైల్వేస్టేషన్ మీదుగా నడుచుకుంటూ వెళుతూ వృద్ధురాలు తీవ్రరక్తస్రావంతో ఓ పెట్రోల్ బంకు సమీపంలో కింద పడిపోయింది. గుర్తించిన పెట్రోల్బంకు నిర్వాహకులు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు వృద్ధురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుౖగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజి ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో నిందితుడు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో నంద్యాల మేజిస్ట్రేట్ ఎన్బీడబ్ల్యూ జారీ చేయడంతో కోవెలకుంట్ల సీఐ హనుమంతునాయక్, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నాగన్న, కానిస్టేబుల్ చాంద్బాషా నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్ ఖైదీగా ఉంచి కేసుకు సంబంధించిన సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ మేరకు అత్యాచారం చేసినట్లు రుజువు కావడంతో కర్నూలు న్యాయమూర్తి లక్ష్మిరాజ్యం నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే లా చేసిన సీఐ హనుమంతునాయక్, ఎస్ఐలు మల్లికార్జునరెడ్డి, మౌలానీ, పోలీసు సిబ్బందిని ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ అభినందిస్తూ రివార్డుకు ప్రతిపాదించారు. శ్రీగిరికి చేరుకుంటున్న పాదయాత్ర భక్తులురావణ వాహన సేవ పూజలు నిర్వహిస్తున్న అర్చకులుఆలయం .. పుష్పశోభితంఇరుముడితో పూజల్లో పాల్గొన్న మంత్రి ఆనం, కలెక్టర్, ఈఓ, చైర్మన్, ఎమ్మెల్యే తదితరులు శివ శివ శంకరా.. -
చెరువు పూడ్చుతున్నా.. కళ్లు తెరవరా?
● కబ్జా కోరల్లో గార్గేయపురం చెరువు ● వెలుగులోకి వచ్చినా అడ్డుకునే వారేరి? ● అధికారుల తీరుపై ప్రజల మండిపాటు సాక్షి నెట్వర్కు: కళ్ల ముందే గార్గేయపురం చెరువు కబ్జాకు గురవుతున్నా అధికారులకు పట్టడం లేదు. అధికార పార్టీ నేత పట్టపగలు రాళ్లు, మట్టితో చెరువును పూడ్చేస్తున్నా అడిగేవారు లేరు. దర్జాగా టిప్పర్లు, జేసీబీలతో చెరువు నామరూపాలు లేకుండా చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. చెరువు ఆక్రమణపై పతాక శీర్షికన పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారులు తెలియనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. చెరువును ఆక్రమించుకుంటున్నా చూసీచూడనట్లు ఉండడంపై తీవ్ర చర్చ సాగుతోంది. మూడేళ్ల క్రితమే కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం చెరువుకు సంబంధించిన భూమిని టీడీపీ నేత విష్ణువర్ధన్రెడ్డి తన మనువళ్ల పేరిట 3.6 ఎకరాలను అక్రమంగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉన్న అప్పటి రిజిస్ట్రేషన్ శాఖాధికారులు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ క్రమంలో 2023 ఆగస్టులోనే ఆయన చెరువులోని తన 3.6 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పటి కర్నూలు ఆర్డీఓగా ఉన్న హరిప్రసాదు అడ్డుకున్నారు. తక్షణమే పూడ్చిన చెరువు భాగాన్ని యథాస్థితికి తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు. పనులను నిలుపుదల చేయకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి రావడం, ఆయనే ప్రస్తుతం షాడో ఎమ్మెల్యే కావడం, కేడీసీసీ బ్యాంకు చైర్మన్గా ఉండడంతో మళ్లీ చెరువు ఆక్రమణకు తెరలేపారు. అయితే అప్పట్లోనే ఆర్డీఓ హరిప్రసాదు గార్గేయపురం చెరువుపై చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కొందరు మాజీ సైనికులకు కేవలం చెరువులో నీళ్లు లేని సమయంలో పంటలను సాగు చేసుకోవడానికే అనుమతులు ఇచ్చామన్నారు. వారికి ఆ భూములను అమ్ముకోవడానికి ఎలాంటి అధికారం ఉండదని, ఎవరూ కొన్నా హక్కులు చెల్లవని, చెరువును పూడ్చితే నీళ్లు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందని, ఈ భూములను డీనోటిఫై చేయడం, కన్వర్షన్ కోసం వచ్చిన అనేక వినతులను తిరస్కరించామని అప్పట్లో స్పష్టం చేశారు. చెరువును రక్షించండి..గార్గేయపురం చెరువు ఆక్రమణ వెలుగులోకి రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం చెరువు ఆక్రమణ పనులను అడ్డుకున్న అధికారులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు స్పందించి చెరువును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మరో వైపు చెరువు చుట్టూ నగర వనం ఉండటంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అలాగే గార్గేయపురం చెరువు టూరిజం స్పాట్గా మారింది. అక్కడ కర్నూలు నగర ప్రజలకు బోటింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే చెరువు ఆక్రమణకు గురవుతుండడంతో టూరిజానికి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. మరోవైపు చెరువు ఆక్రమణ పనులు రేయింబవళ్లు జరుగుతున్నా తహసీల్దార్, సంబంధిత డివిజన్ ఆర్డీఓ, వారిపై ఉండే జేసీ, కలెక్టర్తో పాటు ఇరిగేషన్ అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం అటువైపు చూడడకపోవడంతో అధికారులంతా టీడీపీ నేతకు హుజూర్ అంటున్నారా.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
జైలులో జతకట్టి.. నేరాల బాటపట్టి!
కర్నూలు: హైదరాబాద్లోని మారేడుపల్లి బిజినమైన రఘు, సికింద్రాబాద్ నివాసి టమాటార్ శివసింగ్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ అక్కడి పోలీసులకు చిక్కి చెంచల్గూడ జైలుకు వెళ్లారు. అక్కడ వారి మధ్య పరిచయం పెరిగి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత జట్టుగా ఏర్పడి పలు ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. శివసింగ్ వయస్సు 25 ఏళ్లు కాగా ఇతనిపై 28 ఇంటి దొంగతనాలు, అలాగే రఘు వయస్సు 24 కాగా 15కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసు రికార్డులకెక్కారు. పక్కా ఆధారాలతో వీరిద్దరినీ నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు శివారులోని సంతోష్ నగర్లో నివాసముంటున్న మద్దిలేటి ఇంట్లో గత జనవరి 29న పట్టపగలే దొంగలు పడి అందినకాడికి మూటకట్టుకుని ఉడాయించారు. మద్దిలేటి ఓ ప్రైవేటు ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఆయన విధులకు వెళ్లగా భార్య లక్ష్మీదేవి, కుమార్తె హేమచరిత ఇంటికి తాళం వేసి బస్టాండ్ సమీపంలోని ఓ బ్యాంకుకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలను తస్కరించారు. ఒక గంట సమయంలో తల్లీ కుమార్తె తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం తొలగించి ఉండటం, తలుపులు మూసి ఉండటంతో ఆందోళనతో తలుపులు తీయమని గట్టిగా అరిచారు. అప్పటికే బీరువాలోని సొత్తును దోచుకుని బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరు దుండగులు తలుపులు తీసి అడ్డంగా ఉన్న తల్లీ కూతుళ్లను పక్కకు నెట్టేసి పరారయ్యారు. కాస్త దూరంలో సిద్ధంగా ఉంచుకున్న ద్విచక్ర వాహనంపై దొంగలిద్దరూ పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేరం జరిగిన తీరును పరిశీలించారు. కాలనీలో ఓ చోట సీసీ కెమెరా ఫుటేజీలో దుండగులు చోరీకి ముందు ద్విచక్ర వాహనంపై కాలనీలో సంచరించిన దృశ్యాలను గుర్తించారు. సీఐ విక్రమసింహ, ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు మురళీధర్, లక్ష్మీనారాయణ ప్రత్యేక బృందంగా ఏర్పడి కర్నూలు నుంచి షాద్నగర్ వరకు సీసీ ఫుటేజిలను క్షుణ్ణంగా పరిశీలించారు. తెలంగాణ పోలీసు అధికారులతో సమాచారాన్ని పంచుకుని మారేడుపల్లి బిజినమైన రఘు, సికింద్రాబాద్ నివాసి టమాటార్ శివసింగ్లుగా గుర్తించారు. వారి కదలికలపై నిఘా ఉంచి గురువారం మునగాలపాడు గ్రామ శివారులోని సమ్మర్ స్టోరేజి ట్యాంకు సమీపాన బంజారా హిల్స్ వెంచర్లో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విక్రయించి గంజాయి వ్యాపారంలో పెట్టుబడిరఘు, శివసింగ్లపై తెలంగాణలో పోలీసుల నిఘా పెరగడంతో దృష్టి మరల్చేందుకు కర్నూలుకు వచ్చి బాలాజీ నగర్లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇకపై దొంగతనాలు మానుకుని గంజాయి వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నారు. చోరీ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి ఓ రహస్య ప్రదేశంలో దాచారు. ఈలోగా వారిపై కర్నూలు పోలీసులు నిఘా వేసి పట్టుకోవడంతో గంజాయి వ్యాపారం గుట్టు కూడా రట్టయింది. నిందితుల్లో ఒకరికి కర్నూలులో బంధువులు ఉండటంతో ఈ ఏడాది జనవరిలో కర్నూలుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శివసింగ్పై 2021లో పీడీ యాక్ట్ నమోదు కావడంతో చెంచల్గూడ జైలులో శిక్ష అనుభవించాడు. 2015లో శివసింగ్ మైనర్గా ఉన్నప్పుడు కర్నూలులో ఓ ద్విచక్ర వాహనం చోరీ చేసి పట్టుబడినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు. సీసీ ఫుటేజీ ద్వారా కేసు ఛేదింపు చోరీ సొత్తు విక్రయించి వచ్చిన సొమ్ము గంజాయి వ్యాపారానికి పెట్టుబడి ఏడు తులాల బంగారు నగలు, ద్విచక్ర వాహనం స్వాధీనం -
లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి
కర్నూలు: పది సంవత్సరాలకు పైగా పెండింగ్లోని సివిల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి/న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.కబర్ధి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి గురువారం ఆయన స్థానిక జిల్లా కోర్టులోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయమూర్తులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 14న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టులలో పెండింగ్లోని సివిల్, రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లను చేసి ఎక్కువ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. కక్షిదారులు ఈ అవకాశా న్ని వినియోగించుకుని రాజీపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవాలన్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాల న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. -
భక్తుల నిలువు దోపిడీ
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. దేవస్థానం సరిపడా సౌకర్యాలు కల్పించడం లేదు. ఫలితంగా భక్తులు ఎక్కడికి వెళ్లినా నిలువు దోపిడీ చేస్తున్నారు. కనీస సౌకర్యమైన మరుగుదొడ్లను ఉచితంగా ఏర్పాటు చేయలేదు. శివదీక్షా శిబిరాల వద్ద గతేడాది రూ.10 వసూలు చేసిన నిర్వాహకులు ఈ ఏడాది రూ.20 తీసుకుంటున్నారు. పాతాళగంగ, నందిసర్కిల్, ప్రధాన ఆలయానికి ఎదురుగా పలువురు రోడ్డుకు అడ్డంగా తోపుడు బండ్లతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి. రోజుకు వెయ్యి మంది కార్మికులతో పనులు చేపట్టకుండా కొంతమందితో తూతూమంత్రంగా సాగిస్తున్నారు. దీంతో క్షేత్ర పరధిలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. టోల్గేట్ సమీపంలో చెప్పులు, సాక్స్లను భక్తులు వదిలి వెళ్తున్నా తొలగించడం లేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం శ్రీశైలంలో వర్తించడంలేదని భక్తులు వాపోతున్నారు. ఘాట్రోడ్డు పేరుతో స్టాండింగ్ ఎక్కించుకోకపోవడం, తక్కువ బస్సులు ఉండడంతో మహిళా భక్తులు అవస్థలు పడుతున్నారు. ముక్కుపిండి వసూలు సాక్షిగణపతి ఆలయం వద్ద, మల్లికార్జున స్వామి ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద, నందిసర్కిల్ వద్ద భక్తులు టెంకాయ కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడి వారు కొబ్బరికాయ కొడితే రూ.10 ఇవ్వాల్సిందేనని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. క్షేత్రంలోని చాలా హోటళ్లలో ధరల పట్టిక ఏర్పాటు చేయకుండా అధిక రేట్లు తీసుకుంటున్నారు. శివమాలను స్వీకరించిన వారు ఇరుముడి విప్పితే రూ.100 ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు వాపోతున్నారు. టెంకాయ సమర్పిస్తే రూ.10 చెల్లించాల్సిందే ఇరుముడి విప్పితే రూ.100 ఇవ్వాల్సిందే రోడ్డుకు మధ్యలో వ్యాపారాలు -
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుదాం
కర్నూలు (టౌన్): త్వరలో నిర్వహించే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కలిసికట్టుగా పని చేద్దామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలు నియోజవర్గం పరిధిలోని 78 సచివాలయాల్లో కమిటీలను బలోపేతం చేయాలన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లోని తన చాంబర్లో గురువారం పార్టీ అనుబంధ విభాగాల కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తలకు భరోసా కల్పించడమే కమిటీల ఉద్దేశమన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. కమిటీ నాయకులకు డిజిలైజేషన్ చేసిన గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పార్టీ కల్పిస్తోందన్నారు. అధికారంలోకి వస్తే పదవులు తప్పనిసరిగా కల్పించేందుకు కేంద్ర పార్టీ ఇప్పటి నుండే చర్యలు చేపట్టిందన్నారు. కర్నూలు నియోజకవర్గ కమిటీ నాయకులు త్వరలో నిర్వహించే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో పట్టణ ప్రజలు తీవ్ర అంసతృప్తిలో ఉన్నారన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు ఇస్తామని ఆశలు కల్పించి చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కర్నూలు నియోజకవర్గంలోని 33 వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అంతకు ముందు 1 నుంచి 11 వార్డుల నాయకులతో జిల్లా అధ్యక్షుడు సమావేశం నిర్వహించి దిశనిర్దేశం చేశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి -
కనుల పండువగా
గ్రామోత్సవంశ్రీశైలంలో అశేష భక్తజనం మధ్య గ్రామోత్సవంశ్రీశైలంటెంపుల్: పరమేశ్వరుడికి అపరభక్తుడైన రావణుడు కై లాసాన్నే పెకిలించి తీసుకెళ్లే క్రమంలో స్వామివారికి వాహనుడయ్యాడు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీశైలంలో రావణవాహన సేవ నిర్వహించారు. ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో రావణవాహనాన్ని సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. ప్రధాన అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. రావణ వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించి, పరివార దేవాలయాల్లో ప్రత్యేక పూజా హారతులు ఇచ్చారు. అనంతరం గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలువీరభద్రస్వామి దేవాలయం వరకు గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. నీలకంఠుడు భ్రమరాంబా సమేతుడై దశకంఠుడి భుజస్కందాలపై ఊరేగాడు. ఉత్సవంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వామిఅమ్మవార్లను కన్నులారా దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర దేవదాయవాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కమిషనర్ కె.రామచంద్రమోహన్ పట్టువస్త్రాలు తీసుకువచ్చారు. రాజగోపురం వద్ద వీరికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. నేడు పుష్పపల్లకీ సేవ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం సాయంత్రం మల్లికార్జున స్వామికి పుష్పపల్లకీ సేవ ఉంటుంది. అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.గ్రామోత్సవంలో రావణ వాహనంపై ఆది దంపతులు -
Kurnool bus tragedy : ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
కర్నూలు సమీపంలోని జాతీయ రహదారి NH-44 పై జరిగిన భయానక బస్సు అగ్నిప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనలో 19 మంది అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, రహదారి భద్రతా అమలు లోపాలు, వాహన ఫిట్నెస్ తనిఖీల నిర్లక్ష్యం, రక్షణ చర్యల ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ తమిళనాడు తెలుగు యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కెతిరెడ్డి జగదీశ్వర రెడ్డి గత ఏడాది అక్టోబరు10వ తేదీన NHRCకి ఫిర్యాదు సమర్పించారు.ఈ ఫిర్యాదును పరిశీలించిన మానవ హక్కుల కమిషన్ 30-01-2026న దీనిని గంభీర మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి కింది అధికారులకు నోటీసులు జారీ చేసింది. రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, భారత ప్రభుత్వంరవాణా కమిషనర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంసంబంధిత శాఖలు రెండు వారాల్లోగా చర్యల నివేదిక (Action Taken Report) సమర్పించాలని ఆదేశించింది.ఈ చర్యలు బాధిత కుటుంబాలకు న్యాయం చేకూర్చడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా సంస్కరణలకు దారితీస్తాయని రెడ్డి తెలిపారు. -
మయూర వాహనాధీశా పాహిమాం
శ్రీశైలంటెంపుల్: ఇల కైలాసమైన శ్రీగిరి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజు బుధవారం శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయాల ప్రాంగణంలోని అలంకార మండపంలో మయూర వాహనాన్ని సుగంధ పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొనివచ్చి మయూర వాహనంపై ఉంచారు. ఉభయదేవాలయల ప్రధాన అర్చకులు, వేదపండితులు అర్చనలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. మయూరవాహన సేవ పూజా కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేయించారు. ఆలయంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం కనుల పండువగా సాగింది. గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మయూర వాహనంపై దర్శనమిచ్చిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. శాస్త్రోక్తంగా పట్టువస్త్రాల సమర్పణ శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవా ల్లో బుధవారం ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ది వినా యకస్వామి దేవస్థానం తరఫున ధర్మకర్తల మండలి అధ్యక్షులు మణినాయుడు, ఈఓ పెంచలకిషోర్, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు ఉదయం ఆ దేవస్థాన ఈఓ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీస్వామిఅమ్మవార్లకు సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ డీఈఓ ముద్దాడ రవిచంద్ర పట్టువస్త్రాలు తీసుకు రాగా శ్రీశైల దేవస్థాన ఈవో, అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగ తం పలికారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీశైలంలో నేడు: గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు రావణవాహన సేవ నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభు త్వం తరుఫున స్వామిఅమ్మవార్లకు దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. శ్రీగిరిలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పరవశించిన భక్తులు కాణిపాకం, టీటీడీ తరఫున మల్లన్నకు పట్టువస్త్రాల సమర్పణ నేడు రావణవాహనంపై దర్శనమివ్వనున్న స్వామిఅమ్మవార్లు -
బకాయిల వసూళ్లపై కఠినంగా వ్యవహరించాలి
కర్నూలు(సెంట్రల్): పెండింగ్ పన్ను వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా 20వ తేదీలోపు రిటర్న్స్ ఫైల్ చేయాలన్నారు. లావాదేవీలు లేకపోయినా నిల్ రిటర్న్స్ దాఖలు చేయడం మరువకూడదన్నారు. నకిలీ బిల్లులతో వ్యాపారం చేస్తూ పన్ను ఎగ్గొడుతున్న బోగస్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మైనింగ్ లైసెన్సులు ఇచ్చే ముందే రిజిస్ట్రేషన్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. బకాయిలు ఉన్న వారి ఆస్తులు బదిలీ జగరకుండా రిజిస్ట్రేషన్ శాఖ, నిధుల రికవరీకి బ్యాంకర్లు కమర్షియల్ ట్యాక్స్ శాఖ తగిన సహకారం అందించాలన్నారు. జీఎస్టీ రేట్లు తగ్గినప్పుడు ఆ ప్రయోజనం నేరుగా వినియోగదారులకు అందుతుందో లేదో లీగల్ మెట్రాలజీ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. కమర్షికల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజ మాట్లాడుతూ పన్ను వసూళ్లు, బకాయిలు తదితర అంశాలను వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శులు ‘శత’మతం
కృష్ణగిరి: ఎన్నికల ముందు తాము గద్దెనెక్కితే సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఆ ఊసేలేదు. సంపదకు బదులు అప్పులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ అప్పులు కూడా పుట్టడం కష్టమవ్వడంతో అడ్డదారులు వెతుకుతున్నారు. ఇప్పటికే మద్యం, విద్యుత్ సర్ చార్జీలు తదితరవి పెంచడం ద్వారా కోట్లలో ఆదాయం గడించిన బాబు సర్కారు ఇప్పుడు పన్నుల వసూళ్లపై దృష్టి సారించింది. ప్రజల ముక్కుపిండి వందశాతం పన్నులు వసూలు చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శులకు హుకుం జారీ చేసింది. ఈ పరిణామం వారిలో ఆందోళన కలిగిస్తోంది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రా అంటూ పేర్లు పెట్టడం తప్ప కింది స్థాయి ఉద్యోగుల బాధలు పాలకులకు పట్టడం లేదని పలువురు గ్రామ కార్యదర్శులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రెండు నెలల ముందే ఇంటి పన్ను వసూళ్లు ప్రతి ఏడాది ఇంటిపన్ను వసూళ్లకు మార్చి నెలలో నోటీసులు జారీ చేసి ఆ నెలాఖరుకుగానీ, ఏప్రిల్ చివరకుగానీ పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తుంటారు. కానీ ప్రస్తుత సర్కారు మరెక్కడా అప్పు పుట్టక తమపై పడిదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మెడపై కత్తి పెట్టి పన్నులు వసూలు చేయాలని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 14లోగా వందశాతం పన్నులు వసూలు చేయని వారిని సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగడం ఎంతవరకూ సబబు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద గోడౌల యజమాన్యాలు మార్చి నెలాఖరులో తమ పద్దులు సరి చూసుకుని పన్ను కడుతుంటారు. కానీ, ప్రభుత్వం ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి పెంచడంతో వయసు పైబడిన సీనియర్ కార్యదర్శులు బీపీలు, షుగర్లు పెంచుకుని ఆనారోగ్యం పాలవుతున్నారు. మరి కొందరైతే సెలవు ఇస్తే వెళ్లిపోదామన్న రీతితో ఇతర దారులు వెతుకున్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తామని ఆశలు పెట్టి చివరకు ఇబ్బందులకు గురిచేస్తుందని కూటమిసర్కారుపై పలువురు పంచాయతీ కార్యదర్శులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదీ లక్ష్యం.. కర్నూలు జిల్లాలోని 25 మండలాల్లో 3,56,885 గృహాలు ఉన్నాయి. జిల్లాలో నాన్ట్యాక్సీ, ట్యాక్సీ కింద పన్ను లక్ష్యం రూ. 50 కోట్లు కాగా ఇప్పటి వరకు 50శాతం దాకా వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే కృష్ణగిరి మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో 10,121 గృహాలు ఉన్నాయి. ఇక్కడ పన్ను లక్ష్యం రూ. 24,38,000లు కాగా ఇప్పటి వరకు 50శాతం వసూలు చేశారు. మిగిలిన 50 శాతం మూడు రోజుల్లోగా చేయకపోతే వేటు తప్పదనే ఆందోళన మరో వైపు వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రిళ్లు గ్రామాల్లోనే బస చేసి.. పన్ను వసూళ్లపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లాలోని చాలా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు రాత్రి పూట కూడా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు ఇంటింటా తిరుగుతూ ఇంటి, కుళాయి పన్నులు కట్టాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేక పంచాయతీ కార్యదర్శుల్లో ఎవరికై నా ఏమైనా జరిగితే వారి కుటుంబాలకు అండగా ఉండేదెవరని ప్రశ్నిస్తున్నారు. 14లోగా వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరికలు ఆందోళనలో కార్యదర్శులు ఒత్తిడి వల్ల తమకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదని ఆవేదన -
పాగాలంకరణ ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న చేపట్టనున్న పాగాలంకరణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ పరిశీలించారు. బుధవారం సాయంత్రం ఆలయానికి చేరుకుని పాగాలంకరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా, సమయానికి నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చూశారు. సంబంధిత దేవస్థాన అధికారులను పాగాలంకరణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రవేశ క్యూలైన్ నుంచి బయటకు వెళ్లే గేట్ వరకు భక్తుల రాకపోకల నిర్వహణ, భద్రతా చర్యలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, మార్గదర్శక బోర్డులు తదితర అంశాలపై దేవస్థాన సిబ్బందితో సమీక్షించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీరి వెంట శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, శ్రీశైలం సబ్ డీఎఫ్వో బబిత, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ ఉన్నారు. -
కుక్కల దాడిలో 20 గొర్రెల మృతి
ఉయ్యాలవాడ: కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందాయి. మండలంలోని అల్లూరు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. నక్క చిన్న బాలగురప్పకు 50 గొర్రెలు ఉన్నాయి. వాటిని ప్రతి రోజు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.మంగళవారం రాత్రి వాటిని గ్రామశివారులో ఉన్న రేకుల షెడ్లో రోజులాగానే ఉంచారు. బుధవారం ఉదయం షెడ్ దగ్గరికి వెళ్లి చూస్తే 20 గొర్రెలు మృత్యువాత పడి ఉన్నాయి. కుక్కల దాడితో జరిగిన ఈ ఘటన వల్ల సుమారు రూ. 2లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని ఉయ్యాలవాడ తహసీల్దార్ ప్రసాద్బాబును కలిసి విన్నవించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలను తగ్గించి వినియోగదారులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) కె.గురవయ్య ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ను అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. వినియోగదారులకు పీఎం సూర్యఘర్ స్కీం కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ బిల్లులను తగ్గించుకునే దిశగా అవగాహన కల్పించాలన్నారు. లో ఓల్టేజీ సమస్యలు లేకుండా చూడాలని, ఓవర్ లోడ్ ఉంటే 11 కేవీ ఫీడర్లను విభజించి అదనపు ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మహేశ్వరరెడ్డి, శేషాద్రి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ చిన్నరాఘవులు, టౌన్ డీఈలు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని అదృశ్యం బేతంచెర్ల: స్థానిక హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైందని తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వివిధ ప్రాంతాల్లో విచారించినా ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
న్యాయ సుధ పరీక్షలు ప్రారంభం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రంలోని శ్రీ గురు సార్వభౌమ సంస్కృత విద్యాపీఠం విద్యార్థులకు న్యాయ సుధ పరీక్షలు ప్రారంభించారు. శ్రీ మఠం ఉంజలా మండపంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, వ్యాసరాజ పీఠాఽధిపతి శ్రీవిద్యాశ్రీషాతీర్థులు దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజుల పాటు న్యాయ సుధ పరీక్షలు జరగనున్నాయి. మూల్యంకనం కోసం దేశ నలుమూలల నుంచి ప్రముఖ పండితులను పిలిపించారు. సంస్కృత విద్యార్థుల పరీక్షల ప్రతిభను లైవ్ వీడియో ద్వారా పదాల తప్పులను, ఒప్పులను గుర్తించి మూల్యంకనం చేస్తారన్నారు. మొదటి రోజు ముగ్గురు విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత గిరిరాజాచార్, వేద పాఠశాల ప్రిన్సిపాల్ రమణ్రావ్, శ్రీ మన్యాయసుధ విద్యార్థులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా..తప్పిన ప్రమాదం
నందవరం: మండలంలోని నందవరం– ఎమ్మిగనూరు ప్రధాన రహదారిలో నందవరం సమీపంలో ఇనుప కడ్డీల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి టాలీ బోల్తా పడింది. బుధవారం ఎమ్మిగనూరు నుంచి నందవరంలో కేజీబీవీ, ఎంపీపీ పాఠశాలలకు పనుల నిమిత్తం చిలకలడోణ గ్రామానికి చెందిన పాండు ట్రాక్టర్లో ఐరన్ లోడ్ చేసుకుని బయలు దేరాడు. మార్గ మధ్యలో నందవరం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిలో అదుపు తప్పి ట్రాక్టర్ టాలీ బోల్తా పడింది. డ్రైవర్ అప్రమత్తమై కిందకు దిగాడు. ఆ సమయంలో రోడ్డులో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెనూ ప్రమాదం తప్పింది. కొత్తపేటలో చోరీ హొళగుంద: కొత్తపేట గ్రామంలోని ఆటో డ్రైవర్ హంపయ్య ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు..ఆటోతో ఆలూరుకు వెళ్లగా హెల్పర్గా పనిచేస్తున్న తన భార్య దేవమ్మ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన సమయంలో దొంగలు బీరువాను పగలగొట్టి ఐదు తులాల బంగారు ఆభరణలు, రూ.67 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీరామ్నాయక్ సిబ్బందితో కలిసి ఇంటిని పరిశీలించి చుట్టుపక్కల వారిని విచారించారు. అలాగే కర్నూలు నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాల సేకరించారు. డ్రంకెన్ డ్రైవ్లో ఇద్దరికి జైలు శిక్ష ఆదోని రూరల్: మద్యం సేవించి వాహనాలు నడిపిన కర్ణాటకకు చెందిన ప్రవీణ్కుమార్, ఆదోనికి చెందిన బెస్త శివకుమార్లకు ఆదోని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లీలా సుభాష్ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఆదోని తాలూకా పోలీసులు బుధవారం తెలిపారు. ప్రవీణ్కుమార్కు 20 రోజులు జైలు శిక్ష, బెస్త శివకుమార్కు ఏడు రోజులు జైలు శిక్ష పడిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. -
నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
● ఆర్టీసీ, ఏపీఎన్జీఓలతో పాటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకుల మద్దతు ● కర్నూలు నగరంలో ఆటోల బంద్కు పిలుపు కర్నూలు(సెంట్రల్): లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ సంఘాలు సర్వం సన్నద్ధమయ్యాయి. సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా మద్దతు కూడగట్టారు. ఏపీఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, అన్ని వర్గాల కార్మికులు, కర్షకులు, పెన్షనర్లు మద్దతు ప్రకటించారు. దీంతో తెల్లావారుజామున 5 గంటల నుంచే జనజీవనం స్తంభించే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. మరోవైపు అన్ని వర్గాల ప్రజలు సమ్మెలో పాల్గొంటుండడంతో ప్రైవేట్, ప్రభుత్వ వాణిజ్య సంస్థలు స్తంభించనున్నాయి. కర్నూలు నగరంలో ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. -
వడివడిగా.. శ్రీగిరి వైపు
నల్లమల అడవుల్లో పాదయాత్ర చేస్తున్న భక్తులు కాలినడకన శ్రీగిరి చేరుకుంటున్న భక్తులుశ్రీశైలంటెంపుల్: ఇలకై లాసం భక్తుల శివనామస్మరణతో మార్మోగుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. క్షేత్ర సందర్శనకు భక్తుల సంఖ్య పెరగడంతో శ్రీగిరిలో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. క్షేత్రానికి విచ్చేసిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులుతీరారు. వేలాది మంది భక్తులు నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా తరలివస్తున్నారు. శివమాలధారణ చేసిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి జ్యోతిర్ముడి కలిగిన భక్తులకు మల్లన్న స్పర్శదర్శన భాగ్యం కల్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం ఉచిత, రూ.200, రూ.500, వృద్ధులు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు వేచి ఉండే ఉచిత కంపార్ట్మెంట్లలో తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, పాలు పంపిణీ చేస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలు నిండిపోయాయి. తరలివస్తున్న భక్తజనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు నల్లమల అటవీప్రాంతం నుంచి పాదయాత్రగా శ్రీగిరి చేరుకుంటున్నారు. భక్తిశ్రద్ధలతో ఈ పాదయాత్ర వెంకటాపురం నుంచి నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కై లాస ద్వారం మీదుగా 40 కిలోమీటర్ల మేర సాగుతుంది. కాగా భక్తుల శివనామస్మరణతో నల్లమల అటవీప్రాంతం మార్మోగుతోంది శివస్వాములకు మల్లన్న స్పర్శదర్శనం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివమాల ధరించిన భక్తులకు దేవస్థానం విస్త్రత ఏర్పాట్లు చేసింది. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు చంద్రావతి కల్యాణ మండపంలో నాలుగు కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసింది. అలాగే విడతల వారీగా జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. గురువారం సాయంత్రం 7.30 గంటల వరకు మాత్రమే స్పర్శదర్శనాన్ని కల్పిస్తారు. జ్యోతిర్ముడి సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు శివమాలధారణ ఆచరించిన భక్తులకు జ్యోతిర్ముడి సమర్పించేందుకు పాతాళగంగ మార్గంలోని శివదీక్ష శిబిరాలలో జ్యోతిర్ముడి సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా అర్చకులను ఏర్పాటు చేశారు. అలాగే శివదీక్ష శిబిరాల వద్ద శివస్వాములు సేదతీరేందుకు తాత్కాలిక వసతి, తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. మల్లన్న దర్శనానికి పోటెత్తుతున్న భక్తజనం పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనం -
కారు చౌకగా రూ.7.20 కోట్లు
కర్నూలు–విజయవాడ జాతీయ రహదారిని అనుకొని ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉంది. ఎకరా కనీసం రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన విష్ణువర్ధన్రెడ్డి మనువళ్ల పేరిట ఆక్రమించుకున్న భూముల విలువ దాదాపు 7.20 కోట్ల పైనే. రెండేళ్ల క్రితమే చెరువు స్థలాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లు పెట్టి పూడ్చివేత పనులు చేపట్టారు. ఇందుకోసం సమీపంలోని కొండలు, గుట్టలను తవ్వి చెరువులో అక్రమంగా ఎర్రమట్టి నింపేశారు. ప్రధాన రహదారిని ఆనుకుని నామరూపాలు కోల్పోతున్న చెరువుసాక్షి టాస్క్ఫోర్స్: కోడుమూరు సీనియర్ టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి భూదాహానికి గార్గేయపురం చెరువు బలైపోతోంది. రెండేళ్ల క్రితం చెరువులో తన మనవళ్ల పేరుతో భూమి ఉందని చెప్పి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. సగానికిపైగా చెరువును పూడ్చి వేయించారు. ఆ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడంతో అప్పటి ఆర్డీఓ హరిప్రసాద్, తహసీల్దార్ ఆర్.శివరాముడు చెరువు పూడ్చివేత పనులను నిలుపుదల చేయించారు. చెరువులో ఎవరికీ భూమి ఉండదని, కేవలం నీళ్లు లేని సమయంలో మాత్రమే సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఆక్రమణను పూడ్చి యథాస్థితికి తీసుకురావాలని ఆదేశించారు. అప్పట్లో ఆయన ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టారు. ప్రస్తుతం షాడో ఎమ్మెల్యేగా అధికారం చెలాయిస్తుండడంతో తిరిగి చెరువును చెరబట్టారు. ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ ఎంత అధికార పార్టీ నాయకుడైతే చెరువును నామరూపాల్లేకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారులు తాము ఏమీ చేయలేమన్నట్లు నిత్యం ఆ రోడ్డులో రాకపోకలు సాగిస్తున్నా కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అనుభవందారుల నుంచి కథ నడిపిన విష్ణు కర్నూలు రూరల్ మండలం రుద్రవరం, నందనపల్లె రెవెన్యూ గ్రామాల పరిధి 214/2, 609, 661, 672, 704 సర్వే నంబర్లలో గార్గేయపురం చెరువు విస్తరించింది. దీనికి అనుకుని 673–1ఏ1.15 ఎకరాలు, 673–1బీలో 1.15 ఎకరాలు, 673/2లో 1.39 ఎకరాలు, 673/3లో 2.26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 673–1ఏలో గద్ద దానమ్మ, 673–1బీలో గద్ద నత్తానియేల్, 673/2లో మంగళ శ్రీనివాసులు, ఎం.తిరుపాలయ్య, 673/3లో కె.పాపమ్మలు చెరువుకు నీళ్లు రాని సమయాల్లో కళింగర, పుచ్చకాయ, కర్బూజ వంటి పంటలను వేసుకొని జీవనం సాగిస్తుండటంతో అనుభవం దారులుగా గుర్తించారు. వీరికి రెవెన్యూ అధికారులు అప్పట్లో పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చారు. అయితే వీరు కేవలం అనుభవందారులే. అమ్ముకోవడానికి ఎలాంటి హక్కులు ఉండవు. ఈ క్రమంలో అనుభవం దారుల నుంచి ఆ భూములను సులభంగా కొట్టేసేందుకు టీడీపీ నేత విష్ణువర్ధన్రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వెంటనే తన బినామీ, సుంకేసులకు చెందిన రేపల్లె సుధాకర్ను రంగంలోకి తీసుకొచ్చాడు. సర్వే నంబర్లు 673/2లో అనుభవం ఉన్న మంగళి శ్రీనివాసులు, ఎం.తిరుపాలయ్య ఆధీనంలోని 1.3 ఎకరాలను రేపల్లె సుధాకర్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే 673–1ఏ, 1బీలలో అనుభవంలో గద్ద దానమ్మ, గద్ద సత్తానియేల్ ఆధీనంలోని 2.30 ఎకరాలు కూడా రేపల్లె సుధాకర్ పేరిట రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. రేపల్లె సుధాకర్ నుంచి 373–2లోని 1.3 ఎకరాలను తన మనువడు సూర్యవర్ధన్రెడ్డి(మైనర్), ఇతని తల్లి పులకుర్తి సౌజన్యను గార్డియన్గా పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే 373–1ఏ, 1బీలలోని 2.30 ఎకరాలను తన మరో మనువడు ఆదిత్యవర్ధన్రెడ్డి(మైనర్)కి అతని తల్లి పులకుర్తి సౌజన్యను గార్డియన్గా రిజిస్ట్రేషన్ చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. గతాన్ని మరచిన విష్ణుకుటుంబం కోడుమూరు టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి కుటుంబం గతాన్ని మరచి గార్గేయపురం చెరువును ఆక్రమణలోకి తెచ్చుకోవాలని చూస్తోందనే చర్చ జరుగుతోంది. గతంలో నియోజకవర్గంలోని పలు చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని స్వయంగా విష్ణువర్ధన్రెడ్డి, బతికి ఉన్న సమయంలో ఆయన కుమారుడు రాజావిష్ణువర్ధన్రెడ్డి గగ్గోలు పెట్టారు. అయితే వారు మాత్రం గార్గేయపురం చెరువును అడ్డంగా ఆక్రమించుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూడూరు మండలం నాగులాపురం చెరువుకు సమీపంలోని భూములను కొందరు ఆక్రమించారని స్థానికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు స్వయంగా విష్ణువర్ధన్రెడ్డి మద్దతు తెలిపారు. అలాగే విష్ణువర్ధన్రెడ్డి కుమారుడు రాజావర్ధన్రెడ్డి బతికున్న సమయంలో బి.తాండ్రపాడు చెరువు ఆక్రమణకు గురవుతోందని ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఆ కేసు ఇప్పటికీ ట్రిబ్యునల్లో నడుస్తోంది. అదే కుటుంబం ఐదు గ్రామాల రైతులకు సాగు, తాగునీటిని అందించే గార్గేయపురం చెరువు రూపురేఖలు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి పూనుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నీళ్లు లేని సమయంలో సాగుకు అనుమతి అనుభవం ముసుగులో రిజిస్ట్రేషన్లు ఎకరం రూ.2 కోట్ల విలువ చేసే 3.60 ఎకరాల చెరువు భూమి కబ్జా రెండేళ్ల క్రితం ‘సాక్షి’ కథనంతో అడ్డుకున్న అధికారులు అధికార పార్టీ నేత కావడంతో తిరిగి చెరువు పూడ్చివేత -
21 నుంచి గాదిలింగేశ్వరస్వామి మహోత్సవాలు
హాలహర్వి: మండలంలోని గూళ్యం గ్రామంలో కొలువైన గాదిలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 21వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో రాధాకృష్ణ, గ్రామపెద్దలు బుధవారం తెలిపారు. 22న గాదిలింగేశ్వర, సిద్ధేశ్వరస్వామి వార్ల జోడు రథోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు రథోత్సవ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. బైక్ అదుపు తప్పి వ్యక్తికి గాయాలు మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని మాధవరం గ్రామంలో జాతీయ రహదారి 167పై బుధవారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి బైక్ అదుపు తప్పి వ్యక్తికి తీవ్ర గాయాలయాయి. మాధవరం నుంచి భరత్కుమార్ బైకుపై ఎమ్మిగనూరుకు వెళ్తుండగా.. గ్రామంలోని చర్చి వద్ద మాధవరం గ్రామానికి చెందిన కురువ ఈరన్న రోడ్డు దాటుతుండగా తప్పించబోయి బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో భరత్కుమార్ తలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసు సిబ్బంది స్పందించి అంబులెన్స్లో ఎమ్మిగనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పాదయాత్రికుడికి అస్వస్థత
ఆత్మకూరురూరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీశైలానికి కాలినడకన వెళుతున్న అనంతరపురానికి చెందిన శివభక్తుడు రమేష్ భీముని కొలను వద్ద తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీశైలం రేంచ్ అటవీ సిబ్బంది వెంటనే డోలీ కట్టి అందులో కై లాస ద్వారం వద్ద ఉన్న మెడికల్ క్యాంపునకు తరలించారు. వైద్య శిబ్బంది అత్యవసర చికిత్స అందించడంతో కొద్ది సేపటికి కోలుకున్నాడు. అస్వస్థతకు గురైన వ్యక్తిని కొండకోనల్లో మోసుకుని వైద్య శిబిరానికి చేర్చిన అటవీ సిబ్బందిని పాదయాత్రికులు అభినందించారు. హెచ్ఐవీ బాధితులపై వివక్ష తగదు కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐబీ బాధితుల పట్ల వివక్ష తగదని ఏపీ శాక్స్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ చెప్పారు. ఆయన మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్, ఐసీటీసీ, మైక్రోబయాలజీ విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పరీక్షలు చేసే విధానం, నెలవారీ రిపోర్ట్లు, హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన వారికి ఇచ్చే చికిత్సలు, మందులు, వైద్యసేవలు, సదుపాయాల గురించి తెలుసుకున్నారు. గర్భిణులకు అందిస్తున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష చూపకుండా అన్ని ప్రాంతాల వారికి సమానంగా మందులు ఇవ్వాలని సూచించారు. సకాలంలో రిపోర్టులను ఆన్లైన్లో నమోదు చేయాలని, సిబ్బంది వారి పనితీరు మరింత మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్లు అలీ హైదర్, దేవిశంకర్గౌడ్ ఉన్నారు. -
మెడికల్ కౌన్సిల్ మెంబర్గా శ్రీహరి ఎన్నిక
కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్) ఎన్నికల్లో సభ్యుడిగా కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ శ్రీహరి కురువ విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం 84 మంది నమోదిత వైద్యులు అభ్యర్థులుగా పోటీ చేయగా, ఈ నెల 9వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో 30,773 మంది వైద్యులు ఆన్లైన్ విధానంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి కేవీఎన్. చక్రధర్బాబు మంగళవారం ప్రకటించారు. హెచ్ఆర్డీఏ ప్యానెల్ నుంచి 13 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 9 మంది ఘన విజయం సాధించారు. అందులో కర్నూలు జిల్లా వాసి డాక్టర్ శ్రీహరి కురువ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య మండలిని బలోపేతం చేయడానికి, వైద్యుల గౌరవం, స్వాభిమానాన్ని కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు. -
ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై విచారణ
జూపాడుబంగ్లా: కనకయ్యకొట్టాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇంగ్లిష్ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు కడుమూరు రవిపై డిప్యూటీ డీఈఓ శంకర్ప్రసాద్ విచారణ చేపట్టారు. ‘విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై నంద్యాల డీఈఓ జనార్ధన్రెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. దీంతో డిప్యూటీ డీఈఓ మంగళవారం ఉదయం 10 గంటల్లోగా కనకయ్యకొట్టాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని జూపాడుబంగ్లా ఎంఈఓ–1 చిన్నమద్దిలేటితో కలిసి విచారణ చేపట్టారు. పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, విద్యార్థినులు, తల్లిదండ్రులతో మాట్లాడి ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆరాతీశారు. పలువురు విద్యార్థినులు కడుమూరు రవి ప్రవర్తన తీరును వివరించటంతో పాటు లిఖితపూర్వకంగా డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలకు తెలియజేశారు. ఇందుకు మొదటి తప్పుగా భావించి తనను క్షమించాలని లిఖితపూర్వకంగా తెలియజేసి క్షమాపణలు కోరినట్లు ఎంఈఓ చిన్నమద్దిలేటి తెలిపారు. కాగా విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు డిప్యూటీ డీఈఓ తెలిపారు. తప్పిపోయిన బాలుడి అప్పగింత ఆత్మకూరురూరల్: బేతంచెర్ల మండలం పేరాయ పల్లె గ్రామానికి చెందిన పది సంవత్సరాల బా లుడు తన అమ్మమ్మతో కలసి శ్రీశైలానికి పాదయాత్రగా వచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున భీముని కొలను దగ్గర తన అమ్మమ్మ నుంచి విడిపో యి తప్పిపోయాడు. స్థానికంగా విధినిర్వహణలో ఉన్న అటవీ సిబ్బంది బాలుడిని గుర్తించారు. అయి తే పేరు చెప్పడానికి కూడా భయపడుతున్న ఈ బాలుడిని చివరకు అతి కష్టం మీద అతని అమ్మమ్మ నాగలక్ష్మి వద్దకు చేర్చారు అటవీ సిబ్బంది. -
ఆకలి తీరుస్తూ..సేవలో తరిస్తూ!
● పాదయాత్ర భక్తుల సేవలో దాతలు ● నల్లమలలో పలుచోట్ల అన్నదాన శిబిరాలు ● ప్రతి రోజు లక్షలాది మందికి అన్నప్రసాద వితరణ ఆత్మకూరు: శ్రీశైలమహాక్షేత్రంలో 1994లో శివదీక్షలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో మాల ధారణ చేసిన శివస్వాములు వారి గ్రామాలనుంచి పాదయాత్రగా బయల్దేరి శ్రీగిరికి చేరుకునేవారు. మార్గమధ్యంలో ఆకలిదప్పులతో ఇబ్బంది పడేవారు. నాడు దీనిని గుర్తించిన కొందరు శివస్వాములు అన్నదాన శిబిరాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అలా ప్రారంభమైన ఈ కార్యక్రమంలోకి దాతలు వచ్చారు. ఏటా శివరాత్రి, ఉగాది మహోత్సవాలకు కాలినడకన వెళ్లే భక్తులకు నల్లమలలోని ప్రధాన కూడళ్లలో అన్నదాన శిబిరాలు నిర్వహిస్తూ సేవలో తరిస్తున్నారు. ● వెంకటాపురంలో 28 ఏళ్లుగా.. శివస్వాముల పాదయాత్ర ప్రారంభమయ్యే వెంకటాపురం గ్రామంలో శ్రీమల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 28 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. సంతృప్తిగా భోజనం వడ్డించి వారి మన్ననలు పొందుతున్నారు. ● ఏటా లక్షమందికి భిక్ష నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద పెద్దదేవులాపురం గ్రామానికి చెందిన బాలవెంకటరెడ్డి అనే శివస్వామి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. 31 సంవత్సరాలుగా సాగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఆయన కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి కొనసాగిస్తున్నారు. ఏటా దాదాపు లక్షమందికి పైగానే ఇక్కడ భిక్ష స్వీకరిస్తున్నారు. ● పెచ్చెర్వు, దామర్లకుంటలో.. పెచ్చెర్వు, దామర్లకుంట ఫారెస్ట్ క్యాంపుల వద్ద అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వెంకటనారపురెడ్డి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ సహకారంతో 6 సంవత్సరాలుగా శివరాత్రి ఉత్సవాల సమయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 3 లక్షల మందికి పైగా భక్తులకు అన్నదానం చేయడంతో పాటు ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 24 గంటల వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే పెచ్చెర్వు వద్ద గూడూరుకు చెందిన శ్రీవీరభద్రస్వామి దేవస్థాన అన్నదాన కమిటీ నిర్వాహకులు 27 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ● కై లాసద్వారం వద్ద.... పత్తికొండకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, శివభక్తుడు అయిన మురళీధర్రెడ్డి 25 సంవత్సరాలుగా కై లాసద్వారం వద్ద అన్నదాన శిబిరం నిర్వహిస్తున్నారు. కాలినడకన కై లాసద్వారం చేరుకున్న భక్తులు ఇక్కడ భిక్ష స్వీకరించి శ్రీశైలమహాక్షేత్రానికి చేరుకుంటారు. అన్నం పర బ్రహ్మస్వరూపం. అందుకే అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అంటారు. ఇలాంటి మహత్తర కార్యక్రమం శ్రీశైల మహాక్షేత్రంలో 400 సంవత్సరాల కిత్రమే ప్రారంభమైందని చెబుతారు. నాటి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. పలువురు దాతలు సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైలానికి కాలినడకన వస్తున్న భక్తులకు మార్గమధ్యంలో అన్నదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆకలి తీరుస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ శిబిరాలను విరివిగా నిర్వహిస్తూ శ్రీశైలేశుడిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. -
● అధికారాన్ని అడ్డుపెట్టుకున్న టీడీపీ నాయకులు ● స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు ● పట్టించుకోని అధికారులు
దౌర్జన్యంగా కబ్జాల పర్వం సాక్షి టాస్క్ఫోర్స్: అధికారంలో ఉన్నాం.. ఏం చేసినా తమను ఎవరూ ఏమీ అనబోరని టీడీపీ నాయకులు బరితెగించారు. కోడుమూరులోని సర్వే నంబర్ 103లో ఉన్న రస్తా పరంబోకు స్థలాన్ని కబ్జా చేశారు. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ దర్జాగా కబ్జా చేసి షాపు నిర్మాణాన్ని చేపట్టాడు. గత నాలుగైదు రోజుల నుంచి స్థలాన్ని కబ్జా చేసి షాపు నిర్మాణం చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోడు మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి చిన్నబోయ వీధి లోని ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రధాన రోడ్డు వెంట రస్తా పరంబోకు స్థలం ఉంది. ప్రస్తుతం ఈ స్థలం కోట్లాది రూపాయల విలువ పలుకుతోంది. అయితే అధికారులు స్థలాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో టీడీపీకి చెందిన మాజీ సర్పంచులిద్దరితో పాటు మరికొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేశారు. ఇప్పటికే కొందరు వ్యక్తులు పరంబోకు స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టగా, మరికొందరు తాత్కలిక నిర్మాణాలు చేపట్టారు. ఇంతా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. గతంలో రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు రస్తా పరంబోకు స్థలాన్ని సర్వే చేసి కబ్జాకు పాల్పడిన వారికి నోటీసులు సైతం జారీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రస్తా స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు వ్యక్తులు ఏకంగా దుకాణాలను నిర్మించి అద్దెలకు సైతం ఇచ్చారు. ఇకనైనా అధికారులు స్పందించి కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని కబ్జాకు గురవుతున్నా రస్తా పరంబోకు స్థలాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
అరె..తెల్లకాకి
సాధారణంగా కాకులు నలుపురంగులో ఉంటాయి. అయితే, మండలంలోని సంతెకూడ్లూరు గ్రామంలో మంగళవారం తెల్ల కాకి కనిపించింది. స్థానిక మారెమ్మవ్వ దేవాలయం వద్ద తోటి నల్ల కాకుల మధ్య గింజలను తింటుండగా గ్రామస్తులు మొదట పావురమనుకున్నారు. తర్వాత తెల్ల కాకి అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆసక్తిగా సెల్ఫోన్లో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో అరుదుగా తెల్ల కాకులు ప్రత్యక్షమవుతుంటాయి. తెలుపు రంగులో ఉండటానికి జన్యుపరమైన మార్పు కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. – ఆదోని రూరల్ విద్యుత్ తీగపై కూర్చున్న తెల్ల కాకి -
అహోబిలేశుడి రాకతో నక్కలదిన్నెలో పండుగ
రుద్రవరం: పార్వేట ఉత్సవాల్లో భాగంగా అహోబిలేసుడి మండల పరిధిలోని నక్కలదిన్నెకు రావడంతో ఆ గ్రామంలో పండుగా వాతావరణం నెలకొంది. ఉత్సవమూర్తులైన శ్రీజ్వాలానరసింహ్మస్వామి, శ్రీప్రహ్లదవరద స్వామి పల్లకీ మంగళవారం గ్రామానికి చేరుకోగానే ప్రజలు ఎదురెళ్లి స్వాగతం పలికారు. తర్వాత పల్లకీ గ్రామ తెలుపులపై కొలువుదీరగా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని పూజలు చేశారు. ఉద్యాన పంటల సాగు పెంపుపై దృష్టి కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో ఉద్యాన పంటల సాగును వచ్చే మూడేళ్లలో గణనీయంగా పెంచాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. రాయలసీమ హార్టికల్చర్ హబ్ పేరిట రూపొందించిన యాక్షన్ ప్లాన్లో ఉమ్మడి కర్నూలు జిల్లాను కూడా చేర్చారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 70 వేలు, నంద్యాల జిల్లాలో 48 వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు ఉంది. కర్నూలు జిల్లాలో వచ్చే మాడేళ్లలో 60 వేలు, నంద్యాల జిల్లాలో 45 వేల హెక్టార్లలో అదనంగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ భావిస్తోంది. నీటిపారుదల శాఖ, ఏపీఎంఐపీ అనుసంధానంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇదిలాఉంటే 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25, 2025–26లో ఉద్యానశాఖ బడ్జెట్ గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఎంఐడీహెచ్, ఆర్కేవీవై పథకాలు అమలులో ఉన్నాయి. వీటి కింద ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా విడుదల కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏవిధంగా పట్టాలెక్కుతుందనేది ప్రశ్నార్థకం. 17 నుంచి జిల్లా స్థాయి శాప్ లీగ్ పోటీలునంద్యాల: ఈనెల 17 నుంచి జిల్లా స్థాయిలో శాప్ లీగ్ పోటీలు ప్రారంభం కానున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు తెలిపారు. మంగళవారం ఆయన శాప్ లీగ్స్ స్పోర్ట్స్–2026 క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో 31 ప్రాధాన్యత గల క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు శిక్షణ ఇప్పించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేస్తామన్నారు. బాక్సింగ్, చదరంగం, అథ్లెటిక్స్, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్, లాంగ్ టెన్నిస్, సాఫ్ట్ టెన్నీస్, ఆర్చరీ, బీచ్ హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, ఈత, ఫుట్బాల్, బీచ్ వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, హ్యాండ్బాల్, వాలీబాల్, జిమ్మాస్టిక్స్, బీచ్ కబడ్డీ, బ్యాట్మింటన్, జూడో, హాకీ, ఖోఖో, కబడ్డీ, రైఫిల్ షూటింగ్ తదితర క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో చెస్ పోటీలు 17వ తేదీన, సైక్లింగ్ పోటీలు 24వ తేదీన నంద్యాలలోని ఇండోర్ స్టేడియం జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయిలో ఈనెల 21, 22 తేదీల్లో తిరుపతిలో, 28 నుంచి మార్చి 1వ తేదీ వరకు విజయవాడలో జరుగుతాయని వెల్లడించారు. ఈ క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులు శాప్ వెబ్సైట్లో వ్యక్తిగత వివరాలతో నమోదు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం సెల్ : 87126 22576 నంబరును సంప్రదించాలన్నారు. 5 గ్యాస్ సిలిండర్ల సీజ్ కర్నూలు(సెంట్రల్): ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్లోని క్యాంటీన్లో వినియోగిస్తున్న 5 డొమెస్టిక్ సిలిండర్లను డీఎస్ఓ రాజారఘువీర్ ఆధ్వర్యంలోని బృందం సీజ్ చేసింది. క్యాంటీన్లలో కమర్షియల్ సిలిండర్లను వినియోగించాల్సిన సందర్భంలో డొమెస్టిక్ సిలిండర్లను వినియోగించడం నేరమని, అందుకే సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు డీఎస్ఓ వివరించారు. ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి ఆదోని అర్బన్: ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పెద్దహరివానం గ్రామంలో ఈసంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. గజ్జహళ్లి గ్రామానికి చెందిన బొజ్జప్ప(58)పెద్దహరివానంలో నివసిస్తున్నాడు. ఇక్కడ ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కంకర తీసుకురావడానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో బొజ్జప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య నాగవేణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇస్వీ పోలీసులు తెలిపారు. -
ఫుడ్ బాస్కెట్తో సురక్షిత ఆహారం
కర్నూలు (అగ్రికల్చర్): ఫుడ్ బాస్కెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ప్రకృతి వ్యవసాయ పద్ధతు ల్లో పండించిన సురక్షిత ఆహారం అందించేందుకు తగి న చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై.వి.రమణారెడ్డి తెలిపారు. మంగళవారం కర్నూలు శివారులోని టీటీడీసీ సమావేశ మందిరంలో సెర్ఫ్, ఆర్వైఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫుడ్ బాస్కెట్ కార్యాచరణ, న్యూట్రీ ఎంటర్ప్రైజెస్ స్థాపనపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫుడ్ బాస్కెట్ ద్వారా ప్రతి కుటుంబానికి నిరంతరం పోషకాలతో కూడిన సురక్షితమైన ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. గ్రామ సంఘాల ప్రతినిధులు ఫుడ్ బాస్కెట్పై పొదుపు మహిళలకు సమగ్ర అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి గ్రామానికి రూ.లక్షతో ఫుడ్ బాస్కెట్ నిధి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వైఎస్ఎస్ కోఆర్డినేటర్ అరుణ, జిల్లా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ మాధురి, డీపీఎం నరసమ్మ, వివిధ మండలాల సీసీలు, ఆర్వైఎస్ఎస్ సిబ్బంది, గ్రామైక్య సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఇల కై లాసం.. బ్రహ్మోత్సవ శోభితం
● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు శ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీభ్రమరాంబికతో కలసి మల్లికార్జునుడు హంసవాహనంపై దర్శనమివ్వగా స్వామిఅమ్మవార్లను కన్నులారా దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. శ్రీగిరి క్షేత్రం భక్తుల శివన్మామస్మరణతో మారుమోగుతోంది. శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు హంసవాహనసేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్దగల అక్కమహాదేవి అలంకార మండపంలో హంసవాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను హంసవాహనంపై అధిష్టింపజేసి ఉభయదేవాలయాల ప్రధనార్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా హారతులనిచ్చారు. మంగళవాయిద్యాలు మారుమోగగా, భక్తుల శివన్మామస్మరణతో హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం పరివార దేవతామూర్తులకు ప్రత్యేక కర్పూర నీరాజనాలు సమర్పించి గ్రామోత్సవాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ప్రారంభించారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు అక్కడి నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించి ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీశైలంలో నేడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గోరోజు బుధవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు మయూరవాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం మయూరవాహనంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. అలాగే ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక దేవస్థానం, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
ఇకపై డ్రోన్ పెట్రోలింగ్
కర్నూలు: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఇప్పటివరకు రాత్రి, పగలు ఆయా స్టేషన్ల పరిధిలో క్యూఆర్టీ, బ్లూ కోల్ట్స్ వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా మరో మూడు డ్రోన్ కెమెరాలను జిల్లాకు ఆ శాఖ ఉన్నతాధికారులు కేటాయించడంతో వీటి సేవలను పెట్రోలింగ్కు వినియోగించనున్నారు. జిల్లాలో నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన మూడు డ్రోన్ కెమెరాలతో పాటు దాతలు రెండు డ్రోన్ కెమెరాలను సమకూర్చారు. తాజాగా ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ (డీజీపీ ఆఫీస్) నుంచి మరో మూడు నూతన డ్రోన్ కెమెరాలను కేటాయించగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా స్మార్ట్ పోలీసింగ్ దిశగా జిల్లా పోలీసు శాఖ ముందడుగు వేస్తోంది. ఉత్సవాలు, పండుగలు, వేడుకలు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీగా ప్రజలు తరలివచ్చే సందర్భాల్లో పోలీసు శాఖకు సాంకేతికత మరింత దోహదపడుతోంది. ఇందులో భాగంగా కొంతకాలంగా డ్రోన్ కెమెరాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని కళాశాలలు, పాఠశాలల వద్ద డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. -
తుది ఎంపిక జాబితా విడుదల
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని స్టేట్ క్యా న్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఫిజిసిస్ట్, ఓటీ అసిస్టెంట్, అనెస్తీషియా టెక్నీషియన్ అభ్యర్థుల తుది ఎంపిక జాబితా ఫేస్–2 విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 జనవరి 29న జారీ చేసిన నియామక నోటిఫికేషన్ 01/2024కు సంబంధించి ఈ పోస్టులను 1:2 రేషియో పద్ధతిన లిస్ట్ తయారైందన్నారు. జాబితా కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్సైట్స్, కర్నూలు మెడికల్ కాలేజి వెబ్సైట్లలో (https://kurnool.ap.gov.in, https://nandyal.ap.gov.in, https://kurnoolmedicalcollege.ac.in) అప్లోడ్ చేశామన్నారు. ఎంపికై న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, నకలుతో ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కాలేజీ కార్యాలయంలో వెరిఫికేషన్కు హాజరుకావాలని పేర్కొన్నారు. ముగిసిన ప్రాక్టికల్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. గత నెల 27వ తేది నుంచి వొకేషనల్ ప్రాక్టికల్, ఈ నెల 1వ తేది నుంచి జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. చివరి రోజున 37 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు నిర్వహించగా 1,184 మందిలో 1,074 మంది పరీక్షకు హాజరయ్యారు. శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.08 కోట్లు మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠం హుండీ ఆదాయం లెక్కించగా రూ.3,08,37,571 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 21 రోజుల హుండీ కానుకలు లెక్కించారు. అందులో నగదు రూపేణా రూ.2.98,13,571, నాణేలా రూపంలో రూ.10,24,000 వచ్చినట్లు మేనేజర్ శ్రీనివాసరావు వివరించారు. అలాగే 13 గ్రాముల బంగారం, 1080 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు మేనేజర్–2 వెంటేష్ జోషి, ఏఏఓ మాధవశెట్టి తెలిపారు. పెద్దకడబూరు: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వీడి రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. మంగళవారం ఆమె పెద్దకడబూరు మండల కేంద్రంలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. గ్రామంలోని 1వ వార్డులో పర్యటించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. రోగులు కూర్చోవడానికి సరైన వసతులు లేకపోవడం, వేస్ట్(చెత్త) ఎక్కడ పడితే అక్కడ వేయడం, రోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి నేపథ్యంలో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంటికి పంపుతానని హెచ్చరించారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఎంపీడీఓ ప్రభావతిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆదోని ఇన్చార్జ్ సబ్ కలెక్టర్ అజయ్కుమార్, డీఎస్ఓ రఘువీర్, అధికారులు పాల్గొన్నారు. -
దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలా?
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుమల లడ్డూ పై సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం సిగ్గు చేటని వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాల చేయడం ఏమిటని మండిపడ్డారు. ఆలూరు లోని ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ సిట్ అధికారులు, సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట మారలేదన్నారు. జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందనే అబద్ధాన్ని నిజం చేయాలని తపనపడడం ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలసి కుట్ర చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. తిరుమల లడ్డూలో కల్తీ లేదని తేలిపోవడంతో తాజాగా శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో సైతం కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త డ్రామాకు తెలేపారన్నారు. తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండించకపోవడం చాలా దారుణమని ఎమ్మెల్యే అన్నారు. -
భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
మంత్రాలయం రూరల్ : శ్రీశైలంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే వై.బాల నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు శివమాల ధిరించి ఇరుముడితో వస్తుంటారన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రద్దీ పెరిగిపోయిందన్నారు. అటవీశాఖ, దేవస్థానం అధికారులు ముందుగానే చర్చించి ఈ నెల1వ తేదీ నుంచి శివస్వాములకు అనుమతి ఇచ్చింటే ఈ ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు. ఇటీవల ఎమ్మిగనూరు మండలం కల్లుగొట్ల గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. టీటీడీ తరహాలో క్యూలైన్లలో ఉండే భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయాలని కోరారు. భక్తులకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తిరుమల, శ్రీశైలంలో కల్తీ లడ్డూ అంటూ దుష్ప్రచారం చేస్తున్న ‘కూటమి’ నాయకులు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వై. బాలనాగిరెడ్డి -
నీచ రాజకీయాలు మానుకో
చంద్రబాబూ.. దేవుళ్ల పేరుతో కర్నూలు(టౌన్): రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేవుళ్ల పేరుతో చేస్తున్న నీచ రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి హితవు చెప్పారు. కర్నూలులో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూపై చంద్రబాబు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాడని విమర్శించారు. సీబీఐ నిగ్గుతేల్చినా ఇంకా జంతువుల కొవ్వు, పందికొవ్వు, ఫిష్ నూనె అంటూ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తిరుమల లడ్డూపై అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు శ్రీశైల శైవక్షేత్రం మల్లన్న ఆలయంలో టాయ్లెట్లు క్లీన్చేసే కెమికల్స్ వాడినట్లు చంద్రబాబునాయుడు చెప్పడం దారుణమన్నారు. ‘తిరుమల లడ్డూ, శ్రీశైలం లడ్డూ తిన్న భక్తులు ఎంతమంది ఆస్పత్రి పాలయ్యారు? అలాంటి కెమికల్స్ కలిపితే చనిపోతారు కదా.. ఎంతమంది చనిపోయారు. కనీస జ్ఞానం లేకుండా హిందువులను అవమానించడం ఏమిటి? ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అబద్ధాన్ని పదేపదే చెప్పడం చంద్రబాబు నైజం. 2024 జూన్ 21 నుంచి 25 వరకు నెయ్యి ట్యాంకర్లు తెప్పించింది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. జూలైలో 6వ తేదీ, 12వ తేదీన ట్యాంకర్లు వచ్చాయి. అనుమతులిచ్చింది మీ హయంలోనా.. జగనన్న హయంలోనా? వయసు రీత్యా చంద్రబాబుకు మతిమరపు వచ్చింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొక్కిసలాట, సింహాచలంలో తొక్కిసలాట, రెండురోజుల కిందట శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జీ వంటి ఘటనలు ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. విజయవాడలో రహదారుల విస్తరణ పేరుతో 40 ఆలయాలను కూల్చేసిన ఘనత చంద్రబాబుదే. డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలకు అర్థమైంది పవిత్ర తిరుమల, శ్రీశైలం ప్రసాదాలపై ఆరోపణలు సిగ్గుచేటు రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం చేస్తున్నా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా, మోహన్భగవత్ ఎందుకు స్పందించడం లేదో చంద్రబాబుకు అర్థం కావడం లేదా? వాస్తవాలు తెలుసు కాబట్టే వారు నోరు మెదపడం లేదు. ఇదంతా మంత్రి లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయాలనే చంద్రబాబు కుట్రగా తెలుస్తోంది. వైఎస్సార్సీపీకి, జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపైన, విద్యుత్ చార్జీల పెంపుపైన, రైతన్నను ఆదుకోవాలంటూ చేపట్టిన ప్రజా ఉద్యమాలతో చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా ప్రజా ఉద్యమాలతో మమేకమైన వైఎస్సార్సీపీని ఇబ్బందులు పెట్టా లనే ఉద్దేశంతో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. ఇవి డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలందరికి అర్థమైందని ఆయన చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు షరీఫ్, నరసింహులుయాదవ్, పాటిల్ తిరుమలేశ్వరరెడ్డి, కార్పొరేటర్లు కృష్ణకాంత్రెడ్డి, షాషావలీ, పత్తాబాషా, రాజశేఖర్ పాల్గొన్నారు. -
పాఠశాలల్లో భద్రత కరువు
కర్నూలు సిటీ: కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల భద్రతను విద్యాశాఖ అధికారులు గాలికొదిలేశారనే విమర్శలకు బలం చేకూరుస్తూ రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. కర్నూలు నగరంలోని మున్సిపల్ స్కూల్లో చిత్తుపేపర్లకు పెట్టిన మంటల వల్ల ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇదే సందర్భంలో నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఫ్యాన్ ఊడిపడటంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ రెండు ఘటలు సోమవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కర్నూలు బండిమెట్టలో ఒకే ప్రాంగణంలో మున్సిపల్ ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రంతోపాటు హైస్కూల్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్లో బాబు షేక్, హసీనా బీ దంపతుల కుమార్తె షేక్ హీనా (9) 3వ తరగతి చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో హైసూ్కల్కు నూతన భవనాన్ని నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో పనులు మొదలు పెట్టగా.. కూటమి ప్రభుత్వం పనులు నిలిపివేసింది. దీంతో పిల్లర్లకే పరిమితమైన చోట చిత్తుపేపర్లకు ఓ విద్యార్థి నిప్పంటించాడు. ఆ సమయంలో నిప్పును చిన్నపుల్లతో పైకి ఎత్తగా ఆ నిప్పుతో కూడిన మంట హీనా దుస్తులకు అంటుకున్నాయి. మంటలతో హీనా కేకలు వేసుకుంటూ స్కూల్ బయటకు పరిగెత్తడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పివేశారు. చికిత్స కోసం జనరల్ హాస్పిటల్కు తరలించారు. విషయం మంగళవారం బయటికి రావడంతో ఎంఈఓ రెహ్మాన్ స్కూల్కి వెళ్లి విచారణ జరిపారు. హీనాను డీఈఓ ఎల్.సుధాకర్ పరామర్శించారు. అనంతరం హెచ్ఎం మీనిగ ఆనందం జాన్సన్ను సస్పెండ్ చేసి, ఎంఈఓ రెహ్మాన్కు సైతం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఫ్యాన్ ఊడిపడి గాయాలు కర్నూలు మాధవనగర్లోని నారాయణ ఇంగ్లిష్ మీడియం హైసూ్కల్లో ఫ్యాన్ ఊడి 7వ తరగతి విద్యార్థులపై పడింది. ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇందులో సాయి చరణ్ కంటికిపై భాగంలో ఫ్యాన్ రెక్క తగిలింది. సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇంటికి పంపించారు. స్వల్ప గాయాలైన పిల్లలను సైతం ఇంటికి పంపించడం గమనార్హం. దీనిపై విద్యా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీసింది. -
అంగన్వాడీ స్థలం కబ్జా
● అలువాలలో టీడీపీ నాయకుడి దౌర్జన్యం ● చోద్యం చూస్తున్న అధికారులు ● పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రజలు గోనెగండ్ల: టీడీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకు పరాకాష్టకు చేరుతున్నాయి. వారి ఆక్రమణకు పంట పొలాలు, ఇళ్ల స్థలాలు, చెరువుల స్థలాలు సరిపోవడం లేదు. ఏకంగా ప్రభుత్వ భవనానికి కేటాయించిన స్థలాన్నే కబ్జా చేశారు. గోనెగండ్ల అలువాల గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు అంగన్వాడీ భవనానికి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా పిల్లర్లు వేశాడు. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో గ్రామస్తులతో కలిసి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వైస్ ఎంపీపీ అలువాల వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. గడ్డి వాములు వేసి ఆక్రమణ అలువాల గ్రామంలోని 160 సర్వేలో 25 సెంట్ల వాగు పరంబోకు భూమి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ స్థలంలో ఆర్బీకే, హెల్త్సెంటర్ను నిర్మించారు. అంగన్వాడీ భవనం కోసం 8 సెంట్ల స్థలం కేటాయించారు. ఆ స్థలంపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎస్. ఖాసీం సాహెబ్ కన్నువేశాడు. అదే స్థలంలో ముందుగా గడ్డి వాములు వేశాడు. అంతటితో ఆగకుండా పశువులు లేకున్నా గోకులంషెడ్ నిర్మాణానికి మంజూరు చేయించుకున్నాడు. నోటీసులు ఇచ్చినా.. గోకులం షెడ్ నిర్మాణానికి ఇచ్చిన స్థలాన్ని ఎంపీడీఓ క్యాన్సల్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయాలని పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. గ్రామస్తులు కోర్టులో కేసు వేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలి అధికారులు నోటీసులు ఇచ్చినా, స్థలం కోర్టు పరిధిలో ఉన్నా టీడీపీ నాయకుడు ఎవరినీ లెక్కచేయకుండా రాత్రికి రాత్రే పిల్లరు వేశారని వైస్ ఎంపీపీ అలువాల వెంకట్రామిరెడ్డి, అలువాల గ్రామస్తులు తెలిపారు. స్థలం విలువ రూ.24 లక్షలు ఉంటుందని, వెంటనే ఖాళీ చేయించాలని కోరారు. గ్రామస్తులు భాస్కర్ రెడ్డి, రాముడు, మునిస్వామి, రంజాన్ పాల్గొన్నారు. -
భృంగి వాహనాధీశా.. పాహిమాం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో శ్రీగిరి క్షేత్రం ఇల కై లాసాన్ని తలపిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా భృంగి వాహనాన్ని పలు సుగంధ పుష్పాలతో అలంకరించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై ఉంచి అలంకార మండపంలో అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛరణతో ప్రత్యేక పూజా హారతులిచ్చారు. అనంతరం భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు నారికేళాలు సమర్పించారు. పరి వార దేవతామూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటూ ఉత్సవాన్ని ఆలయం వెలుపలకి తోడ్కొనివచ్చారు. కళాకారుల ప్రదర్శనలు కొనసాగుతుండగా.. మరో వైపు భక్తుల శివన్మామస్మరణతో పరమేశ్వరుడి పరమ భక్తుడైన భృంగి పులకించిపోయారు. వేలాది మంది భక్తులు భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల దివ్య మంగళస్వరూపాన్ని దర్శించి దీవెనలిమ్మని వేడుకున్నారు. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన.. ఉత్సవంలో కళాకారుల ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారుల నృత్యాలు, కోలాటాలు, నాదస్వరం, చెక్కభజనలు, రాజభటుల వేషాలు, కేరళ చండీమేళం, కొమ్ముకొయ్య నృత్యం, ముంభాయ్ ఢోల్ థాషా, మహిళా, పురుషుల వీరగాసి కన్నడ జానపద కళా ప్రదర్శనలు అలరించాయి. కాళికా నృత్యం, జాంజ్పథక్, జానపద పగటి వేషాలు, గొరవయ్యలు, డప్పుల నృత్యాలు, బుట్టబొమ్మలు, తప్పె ట చిందు, బీరప్పడోలు, నందికోలసేవ భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీశైలంలో నేడు.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఆలయ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. అలాగే విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వారిచే శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భృంగివాహనంపై ఆదిదంపతుల విహారం స్వామిఅమ్మవార్లను దర్శించుకుని తరించిన భక్తజనం శ్రీగిరిలో వైభవంగా సాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేడు హంసవాహన సేవలో స్వామిఅమ్మవార్ల దర్శనం -
మోసగాళ్ల మాటలు నమ్మొద్దు
కర్నూలు(అర్బన్): దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు మోసపూరిత మాటలు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ జిల్లా మేనేజర్ రయిస్ఫాతిమా తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి జిల్లాలోని దివ్యాంగులు ఎవరూ మోసపోవద్దని ఆమె సోమవారం ఒక ప్రకటనలో కోరారు. మూడు చక్రాల వాహనాల(స్కూటీ) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరైన వారికి జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలోనే నియమ నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు కార్యాలయ 08518 – 277864 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. పూర్వ డీఎంహెచ్ఓకు పెన్షన్ నిలిపివేత కర్నూలు(హాస్పిటల్): కర్నూలు జిల్లా పూర్వ డీఎంహెచ్ఓ డాక్టర్ మీనాక్షి మహదేవ్కు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్తో పాటు గ్రాట్యూటీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2017 జూన్ 3వ తేదీన ఆదోనిలోని ఆదిత్య నర్సింగ్ హోమ్, స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు ఈమె రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా అప్పట్లో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కోర్టు ఒక సంవత్సరం జైలు, రూ.10వేలు జరిమానా విధించారు. తాజాగా ప్రభుత్వం ఆమెకు వచ్చే పెన్షన్ను నిలిపివేయడమే కాకుండా గ్రాట్యూటీని ఆపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెరుగైన సేవలు అందించండి కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి వచ్చే కాల్స్ పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి బిల్లింగ్, పోల్స్ తదితరాలకు సంబంధించిన సమస్యలను వివిధ ప్రాంతాల నుంచి పలువురు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ద్వారా ఎస్ఇ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సత్వరం పరిష్కరించాలని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ప్రాక్టికల్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. గత నెల 27న మొదలైన వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మూడు స్పెల్స్లో నిర్వహించారు. ఈ నెల 1వ తేది నుంచి మొదలైన జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు రెండు స్పెల్స్లో నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన పరీక్షలకు 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలకు 1,566 మందిల్లో 1546 మంది హాజరయ్యారు. మద్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,341 మందిలో 1,321 మంది హాజరైనట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు. -
తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న టీడీపీ ప్రభుత్వం.. కోర్టు తీర్పులను సైతం ధిక్కరిస్తూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా నియంత్రణ చర్యలు చేపట్టడంలో ప్రతీసారి విఫలమవుతోంది. ఇప్పటికే తిర
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శివమాల స్వీకరించి, జ్యోతిర్ముడిని కలిగిన శివస్వాములకు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. సామాన్య భక్తులకు మల్లన్న అలంకార దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లన్న స్పర్శదర్శనం కోసం భారీ సంఖ్యలో జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములు శ్రీగిరి చేరుకున్నారు. సాధారణ భక్తులు సైతం అదే స్థాయిలో మల్లన్న దర్శనానికి తరలివచ్చారు. అయితే భక్తుల రద్దీని అంచనా వేయలేకపోయిన దేవస్థానం అధికారులు సోమవారం చేతులెత్తేశారు. గంటల తరబడి క్యూలైన్లలోనే.. వీఐపీల సేవలో తరలించిన దేవస్థానం అధికారులు శివస్వాములు, సామాన్య భక్తులను పూర్తిగా విస్మరించినట్లు సోమవారం చోటు చేసుకున్న ఘటనలతో వెల్లడైంది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు, టాయిలెట్ల సౌకర్యాలు లేక నానా అవస్థలు పడ్డారు. ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద ఎండ వేడిని తట్టుకోలేక భక్తులు చుక్కలు చూడాల్సి వచ్చింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో వైఫల్యం వేలాదిగా తరలివచ్చిన భక్తులు వందల కిలోమీటర్ల దూరం కాలినడక యాత్ర ఇరుముడితో శ్రీశైలం చేరుకున్న స్వాములు దర్శన ఏర్పాట్లలో చేతులెత్తేసిన అధికార యంత్రాంగం గంటల తరబడి క్యూలైన్లలోనే భక్తులు విధిలేక దర్శనం చేసుకోకుండానే తిరుగుముఖం -
బాబూ.. ఇది మహాపాపం!
● శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలి ● మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మంత్రాలయం రూరల్: తమ రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ప్రకటనలు ఇస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహా పాపం చేశారని, శ్రీవారి భక్తులకు వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూలో కల్తీ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి సీఎం చంద్రబాబు చేసింది ఘోర అపచారం అన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే దుష్ప్రచారానికి పాల్పడ్డారన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని కోర్టు నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు అంబటి రాంబాబు పై దాడి పాల్పడి అక్రమ అరెస్టులతో తెరలేపారన్నారు. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కోసమే ఈ మహా పాపానికి ఒడిగట్టారన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని, స్వామివారి ప్రసాదాన్నే ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో దేశంలోనే ప్రముఖమైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు చేసిన పరీక్షల్లో చంద్రబాబు ఆరోపించినట్టుగా ఎలాంటి జంతువుల కొవ్వు లేదని తేలిందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో వేసిన నిందలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తిరుమల ఆలయానికి తెచ్చిన అప్రతిష్టకు ఏ మూల్యం చెల్లిస్తారన్నారు. రాజకీయాల కోసం టీడీపీ నేతలు చివరకు దేవుడినీ వదలబోరని తిరుమల లడ్డూ వ్యవహారంలో రుజువైందన్నారు. శ్రీవారి భక్తులకు సీఎం చంద్రబాబునాయుడు కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
వెట్టి చాకిరీ చట్టరీత్యా నేరం
కర్నూలు: వెట్టి చాకిరీ చట్ట రీత్యా నేరమని, బాండెడ్ లేబర్తో వెట్టి చాకిరీ చేయించుకున్న వారిపై మూడు సంవత్సరాలు కఠిన కారాగారశిక్ష, రూ.50 వేలు జరిమానా తప్పదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదరి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. సోమవారం జిల్లా న్యాయ సేవా సదన్లో బాండెడ్ లేబర్ నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. లీలా వెంకటశేషాద్రితో పాటు కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సాంబ శివరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ ఎవరైనా బాండెడ్ లేబర్ కింద పనిచేయించుకుంటే లేదా వారితో వెట్టి చాకిరీ చేయించుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సాంబ శివరావు మాట్లాడుతూ ఆర్టికల్ 23, భారతీయ శిక్షా స్మృతి 370, 370ఎ, 374 గురించి తెలియజేశారు. జిల్లా న్యాయ సేవా సదన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఎస్ఏఆర్డీఎస్ ఎన్జీఓ దామోదర్ రెడ్డి, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు ఎన్జీఓ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్పీ కార్యాలయం పక్కనే చోరీ యత్నం
ఆదోని అర్బన్: ఆదోని ఎస్కేడీ కాలనీలో డీఎస్పీ కార్యాలయం పక్కన నివాసముంటున్న ఇల్లులో దొంగలు చోరీ యత్నం చేశారు. ఇంట్లో నివాసం ఉంటున్న కృష్ణ, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గత గురువారం రోజున పని నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న దొంగలు ఆదివారం రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టారు. మెయిన్ ద్వారం రాకపోవడంతో మెల్లగా జారుకున్నారు. చుట్టుపక్కల వారు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందజేశారు. డీఎస్పీ కార్యాలయం పక్కనే దొంగలు పడితే ఇతర ప్రాంతాల్లో భద్రత ఉంటుందా అనే ఆందోళన ఆదోని ప్రజల్లో నెలకొంది. ఐదేళ్లకే నూరేళ్లు ● రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి ప్యాపిలి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై వెంగళాంపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. అనంతపురం పట్టణం సిండికేట్ నగర్కు చెందిన ధనుంజయ, చంద్రకళ దంపతులతో పాటు ధనుంజయ సోదరి యమున, ఆమె పిల్లలు లాస్యశ్రీ, శశాంక్(5)తో కలసి సొంత కారులో హైదరాబాదుకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి అనంతపురం పట్టణానికి బయలుదేరారు. మార్గమధ్యలో వెంగళాంపల్లి వద్ద వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం కారును వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో కారులో నుంచి శశాంక్ ఎగిరి కింద పడటంతో తలకు బలమైన గాయాలైన అక్కడికక్కడే మృతి చెందాడు. ధనుంజయ, చంద్రకళ, యమున లాస్యశ్రీకి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలులో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ప్యాపిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శతాధిక వృద్ధురాలి మృతి మద్దికెర: పెరవలి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు పరమేశ్వరమ్మ (110) సోమవారం మృతిచెందారు. ఈమెకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వందేళ్ల వయస్సులోనూ తన తల్లి చాలా ఽఆరోగ్యంగా ఉండేవారని, తన పనులు తనే సొంతంగా చేసుకునేవారని కుమారుడు రామిరెడ్డి తెలిపారు. మృతిచెందే ముందు రోజు మాత్రం అన్నం తినలేకపోయారని చెప్పారు. తాను చిన్నతనంలో ఉన్న సమయంలో పెరవలికి మహాత్మాగాంధీ వచ్చారని తాను చూశానని అమ్మ చెప్పేవారని గుర్తు చేశారు. పాదయాత్ర మార్గంలో నిషేధిత వస్తువులు సీజ్ ఆత్మకూరురూరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తుల నుంచి పలు నిషేధిత వస్తువులను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. నాగలూటి వద్ద ఏర్పాటు చేసిన చెక పోస్టులో యాత్రికుల బ్యాగ్లను తనిఖీ చేసి పంపుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులను అనుమతించడం లేదు. చివరకు బిస్కెట్ ప్యాకెట్ కవర్లకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. కవర్లు తీ సేసి, పేపర్లలో పెట్టి పంపుతున్నారు. రెండు లీటర్లు పైబడిన నీళ్ల బాటిళ్లకు అనుమతి ఇస్తున్నారు. పలువురు యాత్రికుల నుంచి గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం మంత్రాలయం రూరల్: ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మేకల రాఘవేంద్ర(22) అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చెట్నెహళ్ళి గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. చెట్నెహాళ్లి గ్రామ సమీపంలో 167వ జాతీయ రహదారిలో ఇసుకను తరలిస్తూ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ రాఘవేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోర్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రాఘవేంద్రకు భార్య పద్మావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు
● మూడు కేజీల గంజాయి స్వాధీనంబేతంచెర్ల: పట్టణ శివారులో ముగ్గురు గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు సీఐ వెంటేశ్వరరావు తెలిపారు. సీఐ వివరాల మేరకు బనగానపల్లె రహదారిలో ఉన్న జగనన్న కాలనీలోని పొదలలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నంద్యాల టౌన్కు చెందిన చాకలి మనోజ్ కుమార్, బేతంచెర్ల మండలం గోర్లగుట్ట గ్రామానికి చెందిన వడ్డె రత్న కుమార్, బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన గుర్రాల రామన్న గంజాయితో పట్టుబడ్డారు. డిప్యూటీ తహసీల్దార్ మారుతి, వీఆర్వోలు సురేంద్ర బాబు, విజయలక్ష్మి సమక్షంలో వారిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని వారి వద్ద మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో వీరికి గంజాయి సరఫరా చేసిన నంద్యాల టౌన్ చెందిన మహబూబ్ బాషా ఆలియాస్ ( మరాఠి) పరారీలో ఉన్నాడని, అతని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేశామన్నారు. కేసును ఛేదించిన ఎస్ఐ రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది గిరి, గురుబాబు, రాజు నాయక్, సూర్య రామరాజు, శ్రీనివాస్, వెంకటేష్లను సీఐ అభినందించారు. -
ఊరూరా బెల్ట్ షాపులు
● వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్హొళగుంద: చంద్రబాబు ప్రభుత్వంలో ఊరూరా బెల్ట్ షాపులు వెలిశాయని, మద్యం మత్తులో పేద ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్ అన్నారు. హొళగుందలో పార్టీ నాయకులతో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ తేల్చడంతో టీడీపీ నేతలకు బాధ ఎక్కువ అయ్యిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని వదిలి వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులపై దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు కొత్త పింఛన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని హితవు పలికారు. వేదావతి ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని, ఎల్లెల్సీకి తాగునీరు వదలాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ.. హొళగుంద–ఢణాపురం రోడ్డు పనులు వెంటనే చేపట్టాలన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా, నాయకులు వెంకటేష్, తావాఫ్ పాల్గొన్నారు. -
బంగారు పల్లకీలో దివ్యతేజం
మంత్రాలయం: శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు వైభవంగా విహరించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి ఆదివారం భక్తులు భారీగా వచ్చారు. తొలుత తుంగభద్రనదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందవనాన్ని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామదేవత మంచాలమ్మకు, మూల బృందవనానికి శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు మహా మంగళహారతులు చేశారు. నేటి పీజీఆర్ఎస్ రద్దు కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించే మంత్రులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధిపతుల కాన్ఫరెన్స్ కారణంగా పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని, ఎవరూ అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రాకూడదని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో.. కర్నూలు(అగ్రికల్చర్): ఈ నెల 9వ తేదీ సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సీఎం చంద్రబాబు వీడియో కాన్పరెన్స్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నేటి నుంచి ‘ఫార్మాటివ్’ పరీక్షలు కర్నూలు సిటీ: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి(సోమవారం)నుంచి నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షలు(ఫార్మాటివ్ అసెస్మెంట్)–4 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు 12వ తేదీ వరకు ఈ పరీక్షలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. వేర్వేరు సమయాల్లో 6, 7, 8, 9 తరగతులకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి 19వ తేదీ వరకు ఫ్రీపైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన విద్యార్థులు 2.70 లక్షల మంది హాజరుకానున్నారు. వణికిస్తున్న చలి కర్నూలు(అగ్రికల్చర్): రాత్రి సమయంలో ప్రజలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ప్రతి ఏటా ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 21 నుంచి 23 డిగ్రీల వరకు నమోదయ్యేవి. ప్రస్తుతం 19.2 డిగ్రీల వరకే పరిమితం అయ్యాయి. తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంటోంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో చలి ప్రభావం కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి ఎండల తీవ్రత పెరుగుతోంది. రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ప్రాక్టికల్ పరీక్షలకు 103 మంది గైర్హాజరు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఆదివారం 103 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. ఉదయం 61 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరుగగా 2,803 మందికిగాను 2,721 మంది హాజరై 82 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 54 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 1,989 మందికిగాను 1968 మంది హాజరుకాగా, 21 మంది గైర్హాజరయ్యారు. ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు. పనుల్లేక వలసబాట కోసిగి: పనుల్లేక ఆర్లబండ గ్రామం నుంచి ఆదివారం 50 కుటుంబాలు వలసబాట పట్టాయి. ఇళ్లకు తాళాలు వేసి లారీలో పిల్లపాపలతో కలిసి గుంటూరుకు వెళ్తున్నట్లు వారు తెలిపారు. గ్రామంలో ఎలాంటి పనులు లేక పోవడంతో వలస వెళ్తున్నామని చెప్పారు. పిల్లలను బడి మానిపించి తమ వెంట తీసుకెళ్తున్నట్లు తెలిపారు. గుంటూరులో నెలన్నర రోజుల పాటు పనులు చేసుకుని తిరిగి స్వగ్రామానికి వస్తామన్నారు. -
ఆదోని జిల్లా సాధనకు ఐక్య పోరాటం
ఆదోని టౌన్: ఆదోని జిల్లా సాధనకు ఐక్యంగా పోరాటం చేయాలని జేఏసీ నాయకులు కృష్ణమూర్తిగౌడ్, దస్తగిరి నాయుడు, వీరేష్, రఘురామయ్య పిలుపునిచ్చారు. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఆదోనిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 85వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్థానిక నాయకులు ఎన్.మల్లికార్జున, ఎస్.కుమార్, గాజుల రామాంజనేయులు, సుభాష్ చంద్రబోస్, ఎం.నాగరాజ్, ఎం.విజయ్, జగదీష్, కిరణ్ కూర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక కీలకమైన పట్టణంగా, చారిత్రక, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యత కలిగిన ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్నారు. ఆదోనిలో వేలాది పరిశ్రమలు ఉన్నాయన్నారు. జిల్లా అయితే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆదోని జిల్లా చేసేంతవరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు. గుండెపోటుతో విద్యుత్శాఖ ఈఈ మృతి ఆదోని అర్బన్: గుండెపోటుతో ఆదోని డివిజన్ విద్యుత్శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామ్మోహన్ ఆదివారం మృతిచెందారు. ఈయన ఐదు నెలల క్రితం కడప నుంచి ఆదోని కి బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈఈగా పదోన్నతి పొందారు. ఆదివారం ఉదయం స్వగృహంలో గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలి కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం వెంటనే 8వ వేతసంఘాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత తపాలా గ్రూపు సీ పోస్టుమ్యాన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దాపోస్టాఫీసులో అఖిల భారత తపాలా గ్రూపు సీ పోస్టుమ్యాన్అండ్ ఎంటీఎస్ యూనియన్ కర్నూలు డివిజన్ సంయుక్త ద్వైవార్షిక సమాశాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రం బిహార్ ఎన్నికల కోసం హడావుడిగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా...ఎన్నికలు ముగియగానే పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకొని జీడీఎస్లు, పెన్షర్ ఉద్యోగుల కోసం వేతన సంఘంలోకి తీసుకొని అమలు చేసేలా ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన చేపట్టే సార్వత్రిక సమ్మెకు యూనియన్ సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు కె.మురళీ, వై.మర్రెడ్డి, సీహెచ్ విద్యాసాగర్ పాల్గొన్నారు. మారథాన్లో కర్నూలు యువకుడి ప్రతిభ కర్నూలు(సెంట్రల్): ఆరోవిల్లే అంతర్జాతీయ మారథాన్లో కర్నూలుకు చెందిన గంగాధర్ తన ప్రతిభ చూపారు. కఠినమైన 42 కిలోమీటర్ల ఆరోవిల్లే మారథాన్ను 4.40 గంటలకు పూర్తి చేసి మెడల్ అందుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి సమీపంలోని ఆరోవిల్లేలో ఆదివారం ఈ పోటీలు నిర్వహించారు. గతంలో కూడా గంగాధర్ హైదరాబాద్, వైజాగ్, 2025 సెప్టెంబర్లో కేంద్రపాలిత ప్రాంతం లడక్లోని హిమాలయ పర్వతాల్లో నిర్వహించిన 21 కిలోమీటర్ల మారథాన్ పూర్తి చేసి మెడల్ సాధించారు. గల్లంతైన వ్యక్తి మృతి నంద్యాల(అర్బన్): మూడు రోజుల క్రితం కేసీ కెనాల్లో గల్లంతైన నంద్యాల మండలం చాబోలు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(43) మృతదేహం లభ్యమైనట్లు రూరల్ పోలీసులు ఆదివారం తెలిపారు. ఈనెల 6న వ్యవసాయ పనుల నిమిత్తం బైక్తో కేసీ కెనాల్ కట్టపై వెళ్తూ ప్రమాదవశాత్తు సుబ్రమణ్యం కాల్వలో పడి పోయాడు. ఎంత గాలించినా మృతదేహం ఆచూకీ దొరకలేదు. మూడు రోజుల తర్వాత గ్రామ శివారు వద్ద కాల్వలో మృతదేహం తేలియాడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం సుబ్రమణ్యం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సింగారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వైభవంగా స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమద్ అహోబిలం క్షేత్రంలో స్వాతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలు పురస్కరించుకుని ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో నల్లమల పులకించి పోయింది. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవమూర్తులైన పావన లక్ష్మీనృసింహ స్వామిని, సుదర్శనమూర్తులను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. నవకళశాలతో తిరుమంజనం నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించారు. పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలు ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
భక్తులకు ఉచిత బస్సు ప్రయాణం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీగిరి చేరుకుంటున్న వేలాది మంది భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఈ బస్సులు కై లాస ద్వారం నుంచి శ్రీశైల క్షేత్రం వరకు వెళ్లనున్నాయి. నందిసర్కిల్ నుంచి గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠ జంక్షన్, మల్లమ్మ కన్నీరు, శివాజీ స్ఫూర్తి కేంద్రం, రుద్రపార్క్, సిద్దరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేట్ సత్రాల మీదుగా మళ్లీ నందిసర్కిల్ చేరుకుంటాయి. ప్రస్తుతం నాలుగు బస్సులు ఉండగా, 10, 11న ఎనిమిది, 12 నుంచి 16వ తేదీ వరకు రోజుకు 10 బస్సులు భక్తులకు అందుబాటులో ఉంచుతామని దేవస్థాన అధికారులు తెలిపారు. -
వెదురు కర్రల వాహనం స్వాధీనం
బండిఆత్మకూరు: వెదురు కర్రలను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నామని బండి ఆత్మకూరు ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ సాసిర్జా ఆదివారం తెలిపారు. మొబైల్ పార్టీ సిబ్బంది నారాయణాపురం పరిసరాల్లో గస్తీ నిర్వనిర్వహిస్తుండగా వెదురుకర్రల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం పరమటూరు వైపు వెళ్లిందన్నారు. వాహనాన్ని వెంబడించి కొత్తకోట హైవే జంక్షన్ వద్ద శనివారం తెల్లవారు జామున పట్టుకున్నట్లు చెప్పారు. డ్రైవర్తో పాటు ఉన్న మరో వ్యక్తివాహనాన్ని వదిలి పరారయ్యారన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనా న్ని నంద్యాల ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయానికి తలరించామని తెలిపారు. అడవిలోనికి అక్రమంగా ప్రవేశించి వెదురు కలపను తరలిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బండిఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సాసిర్జా, మొబైల్పార్టీ డీఆర్ఓ నాగేంద్రయ్య, సిబ్బంది రత్నప్రభావతి పాల్గొన్నారు. -
పల్లెదారి..అధోగతి
అధ్వానంగా నిట్రవట్టి గ్రామ రహదారిగుంతలు పడిన గూళ్యం–సిద్ధాపురానికి వెళ్లే రోడ్డు కర్నూలు(అర్బన్): నాగరికతకు చిహ్నాలుగా నిలిచిన రోడ్ల అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం రోడ్లపై పడిన గుంతలను కూడా పూడ్చకపోవడం, ప్యాచ్ వర్కులు చేపట్టకపోవడవంతో గ్రామీణ రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జిల్లాలోని పలు రోడ్లకు నెలన్నర వ్యవధిలో రెండు పర్యాయాలు మంజూరు చేస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఏపీ రూరల్ రోడ్స్ స్ట్రెంగ్తనింగ్ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్ఎస్పీ) కింద జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రోడ్ల పనులను మంజూరు చేస్తూ గత ఏడాది డిసెంబర్ రెండో వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. రూ.60.09 కోట్ల అంచనా వ్యయంతో 111.110 కిలోమీటర్ల మేర రోడ్లను బలోపేతం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంజూరు చేసిన ఈ రోడ్లలో ఒక్క రోడ్డు (కటారుకొండ ఫామిన్ రోడ్ మల్యాల ఆర్ఎస్ నుంచి తెగదొడ్డి జంక్షన్) మాత్రం రూ. 8.23 కోట్లతో 14.960 కిలోమీటర్ల వేయనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన 25 రోడ్లు రూ.50 లక్షల నుంచి రూ.4 కోట్ల లోపు అంచనా వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే ఈ రోడ్లకు సంబంధించి అప్పట్లోనే పాలనా అనుమతులు మంజూరు చేసినా, ఇప్పటి వరకు ఎలాంటి టెండర్లను ఆహ్వానించ లేదు. కాగా, నెలన్నర రోజుల కాలయాపన అనంతరం ఇవే రోడ్ల పనులను రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పేరుతో ప్రభుత్వం ఈ నెల 4న తిరిగి తాజాగా మంజూరు చేస్తూ జీఓఆర్టీ నంబర్: 64ను జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీఓలో కంటే తాజాగా నాలుగు కిలోమీటర్ల మేర రో డ్డును, అంచనా వ్యయాన్ని రూ.2 కోట్లు మాత్రమే పెంచారు. అయితే ఈ పనులను ఏ పద్దు కింద విడుదల చేయనున్న నిధులతో చేపట్టాలనే అంశంపై స్ప ష్టత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాబార్డు రుణం లేదా కేంద్రం ఇచ్చే సాస్కీ (ఎస్ఏఎస్సీఐ – స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్) నిధులతో చేపట్టే అవకాశం ఉంటుందని ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సమయం మంజూరు అయిన పనులు కిలోమీటర్లు మొత్తం రూ. (కోట్లలో) 2025 డిసెంబర్ 26 111.110 రూ.60.09 4/02/2026 26 115.244 రూ.62.67 రోడ్లు వేయకుండా ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం నెలన్నర వ్యవధిలో రెండు సార్లు అవే రోడ్లు మంజూరు ఎక్కడా కనిపించని పనులు ప్రజలకు తప్పనితిప్పలు -
ఫూలే విగ్రహంపై దాడి దారుణం
కర్నూలు(అర్బన్): తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహంపై దాడి దారుణమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా ఐక్య వేదిక వ్యవస్థాక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. కర్నూలులోని ఫూలే సర్కిల్లో ఆదివారం ధర్నా నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, శేషఫణి, నంది విజయలక్ష్మి, ఖధీరుల్లా, కేవీపీఎస్ ఆంనద్బాబు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాజు మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఫూలే విగ్రహాన్ని కూలగొడుతూ కాళ్లతో తన్ని బహుజనుల మనోభావాలను కించపర్చారన్నారు. ఫూలే చరిత్ర తెలుసుకోకుండా ఆయన విగ్రహంపై దాడి చేయడం సిగ్గుచేట్టాన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మనువాదులపై చట్టపరమైన చర్యలు చేపట్టి తక్షణమే అరెస్టు చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రతినిధి జయన్న, బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు చిరంజీవి, పెరికల రంగస్వామి, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున, కంది వరుణ్ కుమార్, సత్యనారాయణ, బీఎస్పీ నాయకులు అరుణ్ కుమార్, రాజ్ కుమార్, మహిళా ఐక్యవేదిక నాయకులు ఈరమ్మ, పెద్దక్క, అమీనాబీ, రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో నిర్లక్ష్యం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించి సకాలంలో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినా.. పనులు గడువులోగా పూర్తి కాలేదు. ఓ వైపు ఉత్సవాలు ప్రారంభమైనా ఇంకా పనులు కొనసాగు తున్నాయి. దేవస్థానం ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ఉభయ దేవాలయాల్లో పెయింటింగ్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉభయ దేవాలయాల్లో ముగ్గులకు పెయింటింగ్ పనులు సైతం కొనసాగుతున్నాయి. అలాగే శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జర్మన్ షెడ్ల ఇంకా పూర్తి కాలేదు. క్యూలైన్ల ప్రవేశ మార్గాల వద్ద ఇనుప మెష్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇంకా ఏర్పాటు చేయలేదు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటికి ఏర్పాట్లు కొనసాగుతుండడంపై..ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
దశమ భాగం దేవుడి సొమ్ము
● బిషప్లు సంతోష్ ప్రసన్నరావు, ఐజక్ వరప్రసాదరావు ప్రార్థనలకు హాజరైన క్రైస్తవులుప్రదక్షిణలో పాల్గొన్న బిషప్లునంద్యాల(న్యూటౌన్): ప్రతి వ్యక్తి సంపాదనలో దశమ భాగం దేవుని సొత్తు అని, దశమ భాగం చెల్లిస్తే దేవుని మెండైన దీవెనలు లభించి వృద్ధి చెందు తారని నంద్యాల డయాసిస్ అధ్యక్షుడు ది రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు, రాయలసీమ డయాసిస్ పీఠాధిపతి ది రైట్ రెవరెండ్ ఐజక్ వరప్రసాదరావు అన్నారు. ఆదివారం పట్టణంలో అతి పురాతన దేవాలయం హోలీక్రాస్ కెథడ్రల్ చర్చి 121వ ప్రతిష్టోత్సవం, హోలీ క్రాస్ సెయింటనరీ చర్చి మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే ఏటా చేపట్టే కోతపండుగ (కృతజ్ఞతార్పణల) వేడుకలను చేపట్టారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ క్రైస్తవ సంఘాలు చర్చీల అభివృద్ధికి ఐమత్యతంతో ముందుకు వెళ్లినప్పుడూ అభివృద్ధి సాధింస్తారన్నారు. ఉదయం 7 గంలకు సెయింటినరీ చర్చి ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. హోలీక్రాస్ కెథడ్రల్ సెంటినరీ చర్చి డీనరీ చైర్మన్ కొత్తమాసి జోసెఫ్ మాట్లాడుతూ క్రైస్తవులు ఐకమత్యంతో ఉండి ఆలయాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఏసుక్రీస్తు మానవాళికి లోకరక్ష కుడై జన్మించారన్నారు. ఆయన ఆశయాలనే పాటి స్తూ క్రైస్తవులు దినదిన అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ రాజేంద్రబాబు, డీనరీ చైర్మన్లు నందం ఐజక్, గురువులు పాస్టర్ రాజు, డీనరీ చైర్మన్లు, గురువు లు, డయాసిస్ సెక్రటరీ ప్రభుదాసు, నంద్యాల డయాసిస్ సభ్యులు పాల్గొన్నారు. -
గోరుకల్లు..కనిపించని పర్యాటక పరవళ్లు
● పర్యాటక ప్రదేశంగా గుర్తించని చంద్రబాబు ప్రభుత్వం ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూమిని గుర్తించిన అధికారులు పాణ్యం: జల సోయగాలతో అలరించే గోరుకల్లు జలాశయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూమిని సేకరించినా పట్టించుకోవడం లేదు. భారీగా పర్యాటకులు వచ్చి తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని గోరుకల్లు గ్రామస్తులు ఆశించినా ఫలితం లేకుండా పోయింది. గోరుకల్లు జలాశయం వద్ద 86.43ఎకరాల భూమి అందుబాటులో ఉందని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు, యువకులు ఎంతో సంతోషించారు. అప్పట్లోనే గోరుకల్లుతో పాటు పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఐదు ఎకరాల్లో పర్యాటక అభివృద్ధి చేసేందుకు భూమిని కేటాయించారు. అయితే గత ప్రభుత్వంలో మొదలైన ప్రక్రియ ఎన్నికల కారణంగా 2024లో వాయిదా పడింది. పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం గోరుకల్లును సందర్శించేందుకు వచ్చేవారు స్వల్పదూరంలో ఉన్న శ్రీ దుర్గాభోగేశ్వర స్వామి, శ్రీవల్లి సుబ్రమణ్యం స్వామి, శ్రీచౌడేశ్వరి అమ్మవారి ఆలయాలను చూడవచ్చు. నూతన పర్యాటక ప్రాంతాలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వంలో ఇంత వరకు ఎలాంటి సమీక్షలు చేపట్టలేదు. ఫైళ్లు కదలకపోవడంతో గోరుకల్లు గ్రామస్తులు నిరాశ చెందుతున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు గోరుకల్లు వద్ద భూమి ఉందని ప్రతిపాదనలు పంపించాం. వాటికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. – శుభకుమార్ ఎస్ఈ -
బడిలో జ్ఞాపకాల జడివాన
● పండుగ వాతావరణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ● 68 ఏళ్ల క్రితం బ్యాచ్ నుంచి హాజరైన పూర్వ విద్యార్థులు పాఠశాల మ్యాగజైన్ను ఆవిష్కరిస్తున్న జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, తదితరులు హాజరైన పూర్వ విద్యార్థులుకొలిమిగుండ్ల: దశాబ్దాల తర్వాత కలుసుకున్న బాల్య మిత్రులు క్లాస్ రూమ్ల్లో అల్లరి, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, గ్రౌండ్లో ఆడుకున్న ఆట, పాటలను గుర్తు చేసుకొని మురిసిపోయారు. ‘రేయ్ ఎలా ఉన్నావ్..ఏం చేస్తున్నావు..పిల్లలు ఏం చేస్తున్నారు..పెళ్లిళ్లు అయిపోయాయా.. ఇలా ఎంతో ఆత్మీయంగా చాలా సంవత్సరాల తర్వాత కలుసు కున్న మిత్రులు సందడిగా గడిపారు. ఏడు పదుల వయస్సులోనూ హుషారుగా తమ బాల్య స్నేహితులతో చిన్న పిల్లలైపోయి సరదాగా గడిపారు. మధుర క్షణాలన్నీ ఆదివారం కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. పాఠశాల ప్రారంభమైన 1958 బ్యాచ్ మొద లు కొని ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి అయిన మైన్స్ అండ్ జియాలజీ మాజీ డైరక్టర్ వీడీ రాజగోపాల్ సహచర మిత్రులతో కలిసి ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా వ్యహరించి విజయవంతం అయ్యేలా కృషి చేశారు. పూర్వ విద్యార్థులు వెయ్యికి మందికి పైగానే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. పాఠశాల ఆవిర్భవానికి కారకులైన దివంగత గవర్నర్, కేంద్రమంత్రి పెండేకంటి వెంకటసుబ్బయ్య చిత్ర పటానికి జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అప్పట్లో పాఠశాలను నిర్మించిన మీర్జాపురం నారాయణరెడ్డిని ఘనంగా సన్మానించారు. ‘మేము మా పాఠశాల’ పేరుతో తయారు చేసిన మ్యాగజైన్ను ఆవిష్కరించి పూర్వ విద్యార్థులకు అందజేశారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. 1962లో మొదటి ఎస్సెల్సీ బ్యాచ్ విద్యార్థి అయిన రిటైర్డ్ హెచ్ఎం వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించారు. మైదుకూరు, అనంతపురంలో డీఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్రప్రసాద్, వెంకట శివారెడి పాఠశాలలో చదువుకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులంతా బ్యాచ్లు వారీగా ఏర్పడి ఇష్టాగోష్టిగా చర్చించుకున్నారు. చదువుకున్న సమయంలోని తరగతి గదుల్లో కూర్చుని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కొండప్ప, సర్పంచ్ శివరాముడు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తి దేవస్థానం పట్టువస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి మల్లన్న సమేత భ్రమరాంబ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు అందాయి. ఆదివారం శ్రీకాళహస్తి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు సాయిప్రసాద్, ఈఓ బాపిరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల ఆలయ చైర్మన్ రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావు అధికారులు, అర్చకులు, వేదపండితులు శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులకు స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు వస్త్ర సమర్పణ చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థాన ప్రధానార్చకులు కరుణాకర్ గురుకుల్, సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్వీ మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. -
పిన్నాపురం వృషభాల జయకేతనం
తుగ్గలి : మస్తానయ్యస్వామి ఉరుసు సందర్భంగా ఆదివారం ముక్కెల్లలో నిర్వహించిన రాతి దూలం లాగుడు పోటీల్లో పాణ్యొం మండలం పిన్నాపురం వృషభాలు విజేతగా నిలిచాయి. పోటీలను ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రారంభించారు. పోటీల్లో పిన్నాపురం వెంకటకృష్ణయ్య వృషభాలు 3,874 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. తర్వాత స్థానాల్లో నాగర్కర్నూలు జిల్లా రాయవరం అక్షరరెడ్డి వృషభాలు, అనంతపురం జిల్లా ఏ నారాయణపురం షేక్ మహమ్మ ద్ షరీద్ వృషభాలు, నంద్యాల జిల్లా బిల్లలాపురం గోవర్ధన్రెడ్డి వృషభాలు, వైఎస్సార్ కడప జిల్లా చెర్లోపల్లి, చిన్నరంగాపురం విష్ణువర్ధన్రెడ్డి, దనదీప్రెడ్డి, నాగర్కర్నూలు జిల్లా రాయవరం ధనుష్రెడ్డి ఎద్దులు నిలిచాయి. ఎద్దుల యజమానులకు దాతలు రూ.50 వేలు, ట్రాక్టర్స్ సంఘం రూ.40 వేలు, పెద్ద వెంకటేష్, బిజ్జె నాగప్ప, కిల్లె శ్రీనివాసులు కలిసి రూ.30 వేలు, పెద్ద మునెప్ప రూ.20 వేలు, ఎస్ రంజిత్ రూ.10 వేలు, కుర్వ శ్రీనివాసులు రూ.5వేలు అందజేశారు. -
శ్రీగిరి.. ఓంకార ఝరి
ఇలకై లాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. ఇప్పటికే ఉభయ దేవాలయాలను వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రధాన వీధుల్లో స్వాగత తోరణాలను తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా, క్షేత్ర పరిధిలో ముఖ్యమైన కూడళ్లలో విద్యుత్ వెలుగుల్లో స్వామిఅమ్మవార్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున ఆదివారం శ్రీశైల ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు సమర్పించనున్నారు. – శ్రీశైలం టెంపుల్విద్యుత్ దీపాలంకరణలో శ్రీశైల ఆలయం -
నల్లమల లోయలో బొలెరో వాహనం బోల్తా
మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడింది. బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన సద్దాం శనివారం బొలేరో వాహనంలో వరి గడ్డి కట్టలతో గిద్దలూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో సర్వనరసింహ స్వామి ఆలయ సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి లోయలో పడింది. అదృష్టవశాత్తు సద్దాం ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న రోడ్ సేఫ్టీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద ఘటన శిరివెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందని శిరివెళ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. -
బీఎస్ఎన్ఎల్ సేవలు ఉపయోగించుకోవాలి
● ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలంకర్నూలు (హాస్పిటల్): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం అన్నారు. కర్నూలు బిజినెస్ ఏరియా సాధిస్తున్న ఫలితాలను సమీక్షించేందుకు శనివారం ఆయన కర్నూలు వచ్చారు. బీఎస్ఎన్ఎల్ భవన్ కార్యాలయంలో ఉద్యోగులు, వ్యాపార భాగ స్వాముల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు బిజినెస్ ఏరియాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి తగిన టెలికాం సౌకర్యాలను బీఎస్ఎన్ఎల్ అందిస్తోందని, పారిశ్రామికవేత్తలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎఫ్టీటీహెచ్ ప్లాన్లో భాగంగా బీఎస్ఎన్ఎల్ స్పార్క్ను ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో కేవలం రూ.399కే 50 ఎంబీపీఎస్ స్పీడ్తో 3300 జీబీ డేటాను, అపరిమితమైన కాల్స్ సౌకర్యాలను సంవత్సరం పాటు అందిస్తుందన్నారు. సంవత్సరం తర్వాత నెలకు రూ.449గా ప్లాన్ మారుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రాంచైజీలు, టీఐపీల సమస్యలను తెలుసుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గడచిన మూడ త్రైమాసికాలకు మంచి ప్రతిభ చూపిన డివిజన్ ఇంజినీర్లు, బీబీఎంలు, ఫ్రాంచైజీలు, టీఐపీలకు ప్రోత్సా హాక సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్, డీజీఎం కె.రాజేశ్వరరావు, ఐఎఫ్ఏ డి.శ్రీలత, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం -
కమనీయం.. రథోత్సవం
పత్తికొండ: కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహేంద్రస్వామి రథోత్సవం కనుల పండువగా సాగింది. పత్తికొండ పట్టణంలోని తేరుబజార్లో వెలసిన వీరబ్రహేంద్రస్వామి తిరునాల సందర్భంగా శనివారం నిర్వహించిన రథోత్సవానికి భక్తజనం పోటెత్తారు. తేరుబజారు నుంచి సుంకంగేట్ వరకు పురవీధులు జనసంద్రంగా మారాయి. ముందుగా వేద పండితులు వేద మంత్రాలతో రథాంగ హోమంనిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారి ఉత్సవమూర్తిని ఉంచి భక్తుల హర్షధ్వానాల మధ్య రథాన్ని ముందుకు కదలించారు. భక్తులు స్వామి వారి రథంపైకి అరటిపండ్లును విసురుతూ భక్తిని చాటుకున్నారు. స్వామికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పేద ప్రజల కడుపు కొడితే ఊరుకునేది లేదు
ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములను దుండగులు స్వార్థంతో చదును చేస్తున్నారని కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. సరిహద్దు రాళ్లు పాతిన భూముల్లో ఎవరి సహకారం, అండదండలతో తొలగించారని మండిపడ్డారు. పేద ప్రజల కడుపు కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. టీడీపీ నేతల సహకారంతోనే ఇదంతా సాగుతోందన్నారు. ఇళ్ల స్థలాలను దౌర్జన్యంగా అక్రమించాలని తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. పేద ప్రజల తరపున న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. ఆయన వెంట గ్రామ నాయకులు కె.టైలర్ రాముడు, వేణురెడ్డి, కృష్ణారెడ్డి, విసి స్వాములు, భాస్కర్, శీను, కార్పొరేటర్ నారాయణరెడ్డి, నాయకులు శివశంకర్రెడ్డి, కేశవరెడ్డి, హనుమంతురెడ్డి, శివారెడ్డి, తదితరులు ఉన్నారు. -
పాదయాత్ర భక్తులకు పటిష్ట భద్రత
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ఆత్మకూరు: శ్రీశైలం పాదయాత్ర భక్తులకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపా రు. శివభక్తులు పాదయాత్రగా వెళ్లే వెంకటాపురం – నాగలూటి అటవీ మార్గాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అటవీ మార్గంలో ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్షలాదిగా తరలివచ్చే మల్లన్న భక్తులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాలినడకన వచ్చే భక్తులు మార్గమధ్యలో గత ఏడాది ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశామన్నారు. అటవీ మార్గంలో అస్వస్థకు గురైన భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు పెచ్చెరువు ప్రాంతంలో వైద్యశాల అందుబాటులో ఉందన్నారు. అటవీ మార్గంలో భక్తులు తప్పనిసరిగా అటవీ శాఖ నిబంధనలు పాటించాలన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్, సీఐ మహేశ్వర్రెడ్డి, పాములపాడు ఎస్ఐ తిరుపాల్, ఆత్మకూరు రేంజ్ ఆఫీసర్ ప్రణతిబాయి, డీఆర్వో జాకీర్హుసేన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కోనేటి రాయుడికి కిరణాభిషేకం
ఉయ్యాలవాడ: ఇంజేడు గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోనేటి రాయుడిని శనివారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. స్వామి వారికి ప్రీతికరమైన రోజైన శనివారం రోజున సూర్య కిరణాలు ఆలయంలోకి చేరి స్వామి వారిని తాకడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని భక్తులు స్వామి వారితో పాటు సూర్య భగవానునికి నమస్కరించుకున్నారు. అలాగే మండల పరిధిలోని ఆర్.జంబులదిన్నె, ఉయ్యాలవాడ, సుద్దమల్ల గ్రామాలలో వెలిసిన అభయాంజనేయస్వామి, శ్రీ లక్ష్మి నరసింహ కంబగిరి స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు అనంతయ్య, లక్ష్మణస్వామి, భాస్కరశర్మ, కమలేష్శర్మలు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
వ్యర్థాల నిర్వహణతోనే పర్యావరణ పరిరక్షణ
కర్నూలు(సెంట్రల్): నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిర్దేశాల ప్రకారం వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ ప్రక్రియల అంశాలపై కలెక్టర్ కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మునిసిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ముందుగా కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మునిసిపాలిటీల్లో రోజుకు ఎన్ని మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరిస్తారని, వాటిలో ఎన్ని టన్నులు పొడి, ఎన్ని టన్నులు తడి చెత్తలుగా వస్తాయన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తడి చెత్తను విండ్రో కంపోస్టింగ్ పద్ధతి ద్వారా వ్యవసాయ ఎరువుగా మార్చాలన్నారు. పొడి చెత్తలోని ప్లాస్టిక్, గాజు, పేపర్ వంటి వస్తువులను వేరు చేసి రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను క్లియర్ చేయాలన్నారు. అదేవిధంగా ఫ్యామిలీ యూనిఫైడ్ సర్వేలో పురోగతికి చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మిగనూరు, ఆదోని మునిసిపల్ కమిషనర్లు గంగిరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. -
టీడీపీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా
గ్రావెల్ కోసం చేపట్టిన తవ్వకాలతో రూపుమారిన కొండజగనన్న కాలనీలో ఎర్రమట్టిని తవ్వుతున్న పొక్లెయిన్ కల్లూరు: కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో టీడీపీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా రెచ్చిపోతుందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. శనివారం ఆయన తడకనపల్లెలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను, జగనన్న లేఅవుట్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబర్ 337లో లెవలింగ్ పేరుతో గ్రావెల్ను అక్రమంగా తవ్వేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తన హయాంలో నిరుపేదలకు భూములు పంపిణీ చేశామన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి టీడీపీ నాయకులు కొండ ప్రాంతాన్ని సాగులోకి తీసుకొచ్చే సాకుతో గ్రావెల్ దందా చేస్తున్నారన్నారు. పొలాన్ని సాగులోకి తెచ్చుకోవాలంటే మూడు, నాలుగు అడుగుల లోతులో చదును చేస్తారని, ఇక్కడ 15 అడుగుల లోతు మట్టిని అడ్డంగా తవ్వేస్తున్నారన్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎన్ని క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఇచ్చారు? ఇక్కడ ఎంత లోతు మట్టి తవ్వారో పరిశీలించాలన్నారు. అధికారం ఎప్పుడ్డూ శాశ్వతం కాదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అధికారులందరిపై విచారణ తప్పదన్నారు. తడకనపల్లె, పెద్దటేకూరు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదన్నారు. ట్రిప్పుకు రూ.500 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారని.. నియోజకవర్గంలో పూడిచెర్ల, ఉప్పులపాడు, తడకనపల్లె గ్రామాల్లో అక్రమ గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోందన్నారు. జగనన్న కాలనీలో దురాక్రమణలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి అర్హులైన పేదలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే దుండగలు దురాక్రమణకు పాల్పడుతున్నారని కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడకనపల్లెలోని 86వ సర్వే నెంబర్లో జగనన్న కాలనీ పేరిట లేఅవుట్ వేశామన్నారు. గ్రామానికి చెందిన 80 మందితో పాటు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 52 వార్డుల పేద ప్రజలకు ఇంటి పట్టాలు మంజూరు చేశామన్నారు. అయితే కొందరు దుండగలు జగనన్న కాలనీలో దురాక్రమణ చేస్తున్న విషయం తెలుసుకున్న ఆయన లేఅవుట్ను పరిశీలించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. పేద ప్రజల కోసం కేటాయించిన ప్లాట్లు కబ్జాలకు గురువుతున్నా అధికారులు మౌనం వహించడం తగదన్నారు. 15 అడుగుల లోతు మట్టి తరలింపు పత్తాలేని రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించిన వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని జగనన్న కాలనీ ప్లాట్ల ఆక్రమణపై ఆగ్రహం -
రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్సైట్లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 9 నుంచి 11 వరకు ఏపీపీఎస్సీ పరీక్షలు కర్నూలు(సెంట్రల్): అటవీ, ఎండోమెంట్ శాఖల్లోని ఫారెస్టు బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ మెయిన్స్, తండేల్(ఫారెస్టు), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడు–2(ఎండోమెంట్) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ పరీక్షలను ఫిబ్రవరి 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల సమన్వయాధికారి/డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో ఏపీపీఎస్సీ పరీక్షల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీక్షల నిర్వహణకు జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 9,958 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్తోపాటు ఒక ఫొటో ఐడెంటిటీ కార్డుతో వస్తేనే లోపలికి అనుమతిస్తామన్నారు. ఉల్లి పరిహారం అక్రమాలపై విచారణ కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి సాగు చేసిన రైతులకు పరిహారం చెల్లింపులో అక్రమాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి విచారణకు ఆదేశించారు. ‘సాక్షి’లో ఈనెల 7న ప్రచురితమైన ‘నష్టాన్ని దాచి.. కష్టాన్ని దోచి’ కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. ఇప్పటి వరకు అక్రమాలు దేవనకొండ మండలంలో వెలుగు చూశాయి. హార్టికల్చర్, రెవె న్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఒక బృందంగా ఏర్పడి దేవనకొండ మండలంలోని బేతపల్లి, బండపల్లి, బంటుపల్లి, చెల్లెలిచెలిమల గ్రామాల్లో విచారణ చేపట్టారు. మరో రెండు, మూడు రోజులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. వాయిస్ క్లోనింగ్ మోసాలతో జాగ్రత్త కర్నూలు: వాయిస్ క్లోనింగ్ ద్వారా బంధువుల గొంతుతో ఫోన్ చేసి డబ్బులు అడిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు సూచించారు. ఏఐ వాయిస్ క్లోనింగ్కు సంబంధించిన స్కామ్లు ఇటీవల చోటు చేసుకుంటున్నాయని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర ఆర్థిక సహాయం కోరితే వారి గుర్తింపును నిర్ధారించడానికి తెలిసిన, ధృవీకరించబడిన నంబర్ ద్వారా స్నేహితుడు లేదా బంధువులను సంప్రదించాలని పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కు, www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు. -
బాధితుల ప్రయోజనాలు కాపాడాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధికర్నూలు: ప్యానల్ న్యాయవాదులు ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ బాధితుల ప్రయోజనాలను కాపాడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవా సదన్లో ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు విధులు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్ తదితరులు హాజరయ్యారు. ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు వారి విధులు, విధానాలు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి మాట్లాడుతూ కోర్టు కేసుల నిర్వహణ, నిరుపేదల తరపున ట్రయల్ కోర్టు, ట్రిబ్యునల్స్, హైకోర్టు, సుప్రీం కోర్టుల వరకు కేసులు వాదించడం చేయాలని తెలిపారు. సమిష్టి పరిహారాలు, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించడానికి లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం, సయోధ్య ద్వారా కృషి చేయాలని కోరారు. లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లు సమాజంలోని సామాన్య ప్రజలకు, న్యాయ సేవా సంస్థలకు మధ్య వారధిగా వ్యవహరించాలన్నారు. -
రైస్మిల్లో కొండ చిలువలు
బండిఆత్మకూరు: మండల కేంద్రంలోని ఓ పాత రైస్ మిల్లో శనివారం అటవీ అధికారులు రెండు కొండ చిలువలను పట్టుకున్నారు. శనివారం ఉదయం రైస్మిల్ వైపు వెళ్లిన స్థానికులకు రెండు కొండ చిలువలను గమనించి వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు లింగాపురం ఎఫ్బీఓ హైమావతితో అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రత్యేక పరికరాలతో కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. ఒక కొండ చిలువ ఏడు అడుగులు, ఇంకొకటి ఆరు అడుగుల పొడవు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు అధికారులు తెలిపారు. గుండెపోటుతో అసిస్టెంట్ లైన్మన్ మృతి గడివేముల: తిరుపాడు గ్రామంలో అసిస్టెంట్ లైన్మన్గా పనిచేస్తున్న వెంకటరమణ (46) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. ఈ మేరకు విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో స్థానికులు, కుటుంబసభ్యులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గడివేముల ఏఈ ఖలీల్ పాషా, డిప్యూటీ ఎక్యూటివ్ ఇంజినీర్ సుబ్రమణ్యం, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీమన్నారాయణ, కాంట్రాక్టర్ శేషాద్రిగౌడ్, సిబ్బంది శివ, రవి, నరేంద్ర, మండల సిబ్బది, తదితరులు నివాళులర్పించారు.వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం వెల్దుర్తి: చెరుకులపాడు గ్రామంలో మతి స్థిమితం లేని ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన రంగడు, రాములమ్మ దంపతులు ఇంట్లోనే కిరాణషాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. వెల్దుర్తికి చెందిన బంధువైన ఓ వృద్ధురాలు శుక్రవారం బ్రహ్మంగుండం కోనేరులో పడి మరణించింది. వృద్ధురాలి అంత్యక్రియలకు రాములమ్మ కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. రాములమ్మకు మూడు నెలలుగా చావు కబురు విన్నా, ఇతరత్రా సందర్భాల్లో మతి స్థిమితం కోల్పోయేది. ఈ క్రమంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న రాములమ్మ తమ కిరాణ దుకాణంలో విక్రయానికి ఉంచిన పెట్రోల్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్లి శరీరంపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేసుకుంటూ ఇంటి బయటకు వచ్చింది. స్థానికులు మంటలను ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బంగారు దుకాణంలో భారీ చోరీ ● రూ. 40 లక్షల ఆభరణాలు అపహరణ బనగానపల్లె: పట్టణంలోని రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయానికి అతి సమీపంలోని ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగలు అపహరించారు. స్థానిక శ్రీని వాస జ్యువెలర్స్ దుకాణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దుకాణం షెట్టర్ తాళాలు పగులగొట్టి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. ఈ చోరీలో 18 తులాల బంగారు ఆభరణాలు, ఐదు కేజీల వెండి అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం చోరీ విషయం వెలుగు చూడటంతో ముందుగా ట్రైనీ డీఎస్పీ రాజసింహ, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ దుగ్గిరెడ్డి పరిశీలించారు. గ్యాస్ కట్టర్తో షట్టర్ తాళాలను తొలగించినట్లు గుర్తించారు. నంద్యాల నుంచి ఫింగర్ ప్రింట్స్ అధికారులు దుకాణాన్ని పరిశీలించి నిందితుల వేలిముద్రలు సేకరించారు. సాయంత్రం డోన్ డీఎస్పీ శ్రీనివాసులు దుకాణాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. చోరీ కేసును త్వరలో ఛేదిస్తామన్నారు. నిందితుడి అరెస్టు కర్నూలు: కర్నూలు శివారు బాలాజీ నగర్లో నివాసముంటున్న ఎన్.దేవరాజు (70) హత్య కేసులో నిందితుడు ఎద్దుల రవికుమార్ను తాలూకా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మృతుడు దేవరాజు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్లో స్వీపర్గా పనిచేసి 2011లో ఉద్యోగ విరమణ పొందాడు. ఇతనికి ఐదుగురు సంతానం ఉన్నారు. నాలుగో కుమారుడైన రవికుమార్ ఈనెల 5వ తేదీ డబ్బుల కోసం తండ్రితో గొడవ పడి బలంగా నెట్టడంతో తీవ్ర గాయాలతో దేవరాజు మృతిచెందాడు. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య జరిగిన గొడవ వల్లనే గాయాలకు గురై దేవరాజు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో భాగంగా శనివారం సాయంత్రం తాండ్రపాడు గ్రామ శివారులోని రింగ్ రోడ్డు బ్రిడ్జి కింద (సఫా కళాశాల వద్ద) అరెస్టు చేసినట్లు కర్నూలు అర్బన్ తాలూకా సీఐ తేజోమూర్తి తెలిపారు. -
అతి శుభ్రతా.. ఓ రోగమే!
● కర్నూలు నగరంలోని గణేష్నగర్లో ఉంటు న్న ఓ వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో ఉన్నతాధికారి. ఏ చిన్న పని చేసినా వెంటనే చేతులు కడగటం ఆయన నైజం. ఎంతగా అంటే ఎవ్వరికై నా షేక్హ్యాండ్ ఇచ్చినా సరే వెంటనే దగ్గరున్న పేపర్తో తుడుచుకోవడమో లేక శానిటైజర్తో కడుక్కోవడమో చేస్తుంటారు. ● నంద్యాలకు చెందిన రామేశ్వరమ్మ గృహిణి. ఇంటికి ఎవ్వరైనా వచ్చి వెళ్లారంటే చాలు వారు వెళ్లిన వెంటనే ఇళ్లంతా శుభ్రం చేస్తుంది. ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సైతం తాళం వేశామా లేదా, తలుపులన్నీ మూశామా లేదా, గ్యాస్ బంద్ చేశానా.. లేదా.. అని మళ్లీ మళ్లీ చెక్ చేస్తుంది. బయటకు ఎక్కడికై నా వెళ్లినా సరే ఇంటిపైనే ధ్యాస. ..సమాజంలో ఇలాంటి వారు మీకు కూడా తరచూ కనిపిస్తుంటారు కదూ. ఇదో చాదస్తమనో, అనుమానమనో లేక ఇతర పేర్లేవో పెట్టుకుని సర్దుకుంటారు. కానీ ఇది కూడా ఒక లాంటి మానసి క రోగమని వైద్యులు చెబుతున్నారు. దీనినే వైద్యపరిభాషలో ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ (ఓసీడీ) అంటారు.కర్నూలు(హాస్పిటల్): ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్(ఓసీడీ) వ్యాధి గురించి అవగాహన ఉన్న కుటుంబసభ్యులు మాత్రమే బాధితులను వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్, చికిత్స ఇస్తుంటారు. మిగిలిన వారు జీవితాంతం అలాగే బాధపడుతున్నారు. ఓసీడీ అనేది ఒక భిన్నమైన మానసిక సమస్య. ఇలాంటి వారిని చూసి సమాజంలోని చాలా మంది జాలి చూపడం, ఏహ్యభావంతో చూడటం, విస్సుక్కోవడం చేస్తుంటారు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు తమకు ఒక ఆరోగ్య సమస్య ఉందన్న విషయమూ గుర్తించలేరు. ఒకవేళ గుర్తించినా ఎవరికీ చెప్పుకుంటే ఏమనుకుంటారోనని.. మదనపడుతుంటారు. వారి సమస్యను ఇతరులతో చెప్పుకోలేరు, బయట పడే మార్గం వెతుక్కోలేక నరకం అనుభవిస్తుంటారు. ఓసీడీతో బాధపడేవారి సంఖ్య ఇటీవల కాలంలో అధికమైంది. ఎంతగా అంటే సమాజంలో 3 శాతానికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య కొందరిలో 18 ఏళ్ల నుంచే ప్రారంభం అవుతుంది. మరికొందరిలో సమస్య వచ్చిన ఐదేళ్ల తర్వాత గుర్తించి వైద్యులను కలుస్తుంటారు. ఇటీవల ఈ మానసిక సమస్య గురించి సోషల్ మీడియాలో కథనాలు వస్తుండటంతో అవగాహన పెంచుకుని వైద్యులను కలుస్తున్నారు. ఓసీడీ లక్షణాలు ● ఓసీడీతో బాధపడుతున్న వారికి ఒకే ఆలోచన పదే పదే వస్తుంది. ఈ ఆలోచన వాస్తవానికి దూరంగా ఉన్నా, అర్థంలేని ఆలోచనలను బాధితులు గుర్తించినా, వాటిని నిగ్రహించుకునే శక్తి మాత్రం వారికి ఉండదు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడలేక, అవసరమైన పనులపై శ్రద్ధ చూపలేక వారు నిరంతరం ఆందోళనకు గురవుతుంటారు. ఈ ఆలోచనలనే ఆబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అంటారు. ● అతి శుభ్రతకు వీరు ప్రాధాన్యత ఇస్తారు. చేతులకు మురికి అంటిందేమోనని భయపడుతుంటారు. చేసిన పనినే పదే పదే చేస్తుంటారు. ● అనుమానాలు, భయాలు ఎక్కువగా ఉంటాయి. అతిభయం, అతి క్రమశిక్షణ వీరికి ఉంటుంది. వీరు తమ అజాగ్రత్త కారణంగా ఇతరులకు హాని కలిగిస్తామేమోనని భయపడుతుంటారు. ● తమను ఇతరులతో పోల్చి చూసుకోవడం, ఇతరులను పరీక్షించడం చేస్తుంటారు. సెక్స్వల్ లేదా ఇతర రకాలుగా హాని కలిగిస్తాయనే ఆలోచనలు వచ్చే వారు తమ తప్పుడు ఆలోచనలకు క్షమించాలని దైవాన్ని వేడుకుంటూ ఉంటారు. ● వీరు ఇంట్లో కూడా హానికరమైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని దాచడం, బయట పారేయడం చేస్తుంటారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగానికి ప్రతి రోజూ వంద మంది దాకా వివిధ మానసిక జబ్బులతో చికిత్స కోసం వస్తారు. వారిలో 2 నుంచి 3 శాతం మందిలో ఓసీడీ లక్షణాలు ఉంటాయి. వ్యాధి తీవ్రతను బట్టి మందులు, కౌన్సిలింగ్ ద్వారా నయం చేస్తాం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అటు బాధితులకు, కుటుంబసభ్యులు, కార్యాలయంలో అయితే సహొద్యోగులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. – డాక్టర్ నాగేశ్వరరావు, మానసిక వ్యాధుల విభాగాధిపతి, జీజీహెచ్, కర్నూలుఓసీడీ సమస్యకు కారణాలు పలు కారణాలతో మెదడులో కలిగే రసాయన మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. పిల్లల్లో స్ట్రెప్టకోకస్ ఇన్ఫెక్షన్ తర్వాత ఈ వ్యాధి రావచ్చు. తలకు గాయాలు తగిలినప్పుడు, మెనింజైటిస్ వంటి వ్యాధుల తర్వాత ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఒక కుటుంబంలో ఎవరికై నా ఈ వ్యాధి ఉన్నప్పుడు కుటుంబసభ్యులకు ఎవ్వరికై నా ఈ సమస్య వచ్చే అవకాశాలు 33 శాతం ఉంటాయి. అయితే కుటుంబంలో ఒకరికి ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన అందరికీ రావాలని మాత్రం లేదు. ప్రతిదీ శుభ్రంగా ఉండాలనుకుంటున్నారా...! శుభ్రంగా లేకపోతే నచ్చడం లేదా ! ఈ లక్షణాలతో పెరుగుతున్న బాధితులు ఇది కూడా ఒక రోగమేనట వైద్యపరిభాషలో ఓసీడీగా పరిగణన -
ఓటరు జాబితాలపై ఆదేశాలు ఇచ్చాం
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మార్చి 9వ తేది నాటికి ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడతాం. రెవెన్యూ అధికారుల నుంచి అసెంబ్లీ ఓటరు జాబితాలను తీసుకొని వార్డుల వారీగా విభజించి ఓటరు జాబితాలను రూపొందించాలని క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నాం. కొత్త పంచాయతీలకు సంబంధించి 21 మండలాల నుంచి తమకు అందిన 38 ప్రతిపాదనలను సీపీఆర్కు పంపించాం. కొత్త పంచాయతీల ఏర్పాటు సీపీఆర్ పరిధిలో ఉంటుంది. – జీ భాస్కర్, కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి -
గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలి
● సినీ నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం కర్నూలు సిటీ: విద్యార్థులు గొప్ప లక్ష్యాలను ఎంచుకుని పట్టుదలతో సాధించాలని సినీ నటుడు పద్మశ్రీ డా.బ్రహ్మానందం అన్నారు. శనివారం కర్నూలు నగరంలోఓ ఫంక్షన్ హాలులో రెసోనెన్స్ స్కూల్స్, కాలేజీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందంతో పాటు, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, రాజ్యసభ మాజీ సభ్యులు టీ.జి వెంకటేష్, రెసోనెన్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్, రాగమయూరి విద్యా సంస్థల అధినేత కె.జే రెడ్డిలు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మార్కులు తక్కువ వచ్చాయని, పక్కంటి పిల్లలతో పోల్చీ తిట్టకూడదన్నారు. ఏ విషయాన్నైన ఒత్తిడితో కాకుండా ప్రేమగా చెప్పి ఒప్పించాలన్నారు. అక్కినేని నాగేశ్వరరావుకు చదువు రాకపోయినా సినీరంగంలో ఆయన ఎంతో గొప్పగా రాణించారన్నారు. రాయలసీమ ముఖ్య ద్వారం అయిన కర్నూలులో రెసోనెన్స్ విద్యా సంస్థలు 11 ఎకరాల్లో సువిశాలమైన ప్రాంతంలో సీబీఎస్ఈ సిలబస్ నర్సరీ నుంచి పదవ తరగతి వరకు డే స్కాలర్, రెసి డెన్షియల్ విధానంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రెసోనెన్స్ ఎండీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. హైదరాబాదులో ఏడేళ్లలోనే తిరుగులేని విజయాలను రెసోనెన్స్ విద్యా సంస్థలు సాధించాయన్నారు. అదే ప్రమాణాలతో ఇక్కడ కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. -
పెచ్చెరువు వద్ద అంబులెన్స్ సౌకర్యం
పాదయాత్ర భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సహాయ సహకారాలు అందిస్తాం. మార్గమధ్యలో భక్తులకు అస్వస్థతకు గురైతే వారిని హుటాహుటిన వైద్యశాలకు తరలించేందుకు పెచ్చెరువు వద్ద అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. చిన్నచిన్న దెబ్బలు, గాయాలైన కూడా అటవీ సిబ్బంది వైద్య శిబిరాల ద్వారా వారికి కావాల్సిన వైద్యసేవలు అందిస్తాం. ఈ ఏడాది తొలిసారిగా వెంకటాపురం, దామర్లకుంట వద్ద అటవీశాఖ ఉచిత మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. – విఘ్నేష్, డీఎఫ్ఓ, ఆత్మకూరు -
రోడ్డు ప్రమాదంలో శివస్వామి మృతి
కోడుమూరు రూరల్: శివరాత్రి సందర్భంగా మాల ధరించి ఇరుముడితో శ్రీశైలానికి పాద యాత్రగా బయలుదేరిన ఓ శివస్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కోడుమూరు– కర్నూలు రోడ్డులో ప్యాలకుర్తి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మిగనూరు చెందిన వీరేష్ (35) శివ మాల ధరించి శుక్రవారం ఉదయం శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరాడు. మార్గమధ్యలో కోడుమూరు దాటిన తర్వాత ప్యాలకుర్తి సమీపంలో రహదా రిపై నడుచుకుంటూ వెళుతుండగా, కోడుమూరు నుంచి కర్నూలు వైపు ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తూ పాదయాత్ర భక్తులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వీరేష్కు తీవ్ర గాయాలు కాగా పక్కనే ఉన్న వీరేంద్ర అనే యువకుడికి, బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోడుమూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరేష్ కోలుకోలేక మృతిచెందాడు. ప్రమాదంపై కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రూ. వందతో ఏమార్చిరూ. 2.60 లక్షలు అపహరణనందికొట్కూరు: బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును డ్రా చేసుకుని వెళ్తున్న ఓ వృద్ధుడిని గుర్తు తెలియని దుండగులు ఏమార్చి రూ. 2.60 లక్షలు అపహరించారు. మిడుతూరు మండలం చెరుకుచెర్ల గ్రామానికి పెద్ద పుల్లారెడ్డి శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని స్టేట్ బ్యాంకులో రూ. 2.60 లక్షలు డ్రా చేసుకొని ఇంటికి బైక్పై బయల్దేరాడు. వృద్ధుడి బైక్ను వెంబడించిన ఇద్దరు యువకులు మార్గమధ్యలో రోడ్డుపై రూ.వంద నోటు వేసి.. ‘పెద్ద య్య నీ డబ్బులు కిందపడ్డాయి’ అని చెప్పారు. పుల్లారెడ్డి బైక్ నిలిపి వంద నోటు తెచ్చుకునేందుకు వెళ్లగా.. బైక్పై ఉన్న రూ.2.60 లక్షల నగదుతో ఇద్దరు యువకులు పరారయ్యారు. బాధితుడు మిడుతూరు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఓబులేసు తెలిపారు.జగనన్న కాలనీలో గ్రావెల్ తవ్వకంకల్లూరు: పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తడకనపల్లెలో 86వ సర్వే నంబర్లో లే ఔట్ వేసింది. జగనన్న కాలనీ లో కొందరు దుండగులు ప్లాట్లను చదును చేస్తూ ఎర్ర మట్టి తవ్వుతున్నారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నీటి కోసం సచివాలయం ముట్టడి
ఆలూరు: హత్తిబెళగళ్ గ్రామంలో తాగునీటి ఎద్దడిని అధికారులు పరిష్కరించడం లేదని గ్రామస్తులు ఖాళీ బిందెలతో సచివాలయాన్ని ముట్టడించారు. శుక్రవారం ఆలూరు గ్రామ రోడ్డు సమీపంలో సచివాలయం వద్దకు పెద్ద ఎత్తున మహిళలు ఖాళీ బిందెలతో తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి ఎద్దడిని పరిష్కరించేంత వరకు ఉద్యోగులను బయటకు వెళ్లనీయమని భీష్మించారు. అనంతరం వారు ఎంపీడీఓ మద్దిలేటిస్వామి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, తదితరులకు సమాచారాన్ని చేరవేశారు. సంబంధిత అధికారులు సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన విధుల్లో ఉన్నామని, వచ్చిన తర్వాతనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. అయితే ‘వారు వచ్చే వరకు మా గొంతులు ఎండిపోవాలనా... ఇప్పటికే 20 రోజులుగా నీళ్లు లేక విలవిలాడుతున్నాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు. నీ ప్రేమ బంగారం కాను..! కొందరు పశుపోషకులు మూగజీవాల పట్ల చూపించే ప్రేమను వెలకట్టలేనిది. వాటిని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. బండలాగుడు పోటీల్లో పాల్గొనే వృషభాలను యజమానులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకు నిదర్శనం ఈ చిత్రం. మద్దికెరలో మద్దమాంబ తిరుణాల సందర్భంగా రాతి దూలం పోటీలకు పలు ప్రాంతాల నుంచి వృషభాలు వచ్చాయి. యాడికి చెందిన వీరశేఖర్ అనే వ్యక్తి వృషభాలకు దోమలు కుట్టకుండా దోమతెరలను కట్టారు. రైతు జాగ్రత్తలు చూసి స్థానికులు అభినందించారు. – మద్దికెర -
వీబీఆర్ పరిసరాల్లో చిరుత సంచారం
● భయం గుప్పిట్లో స్థానికులువెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్) పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2వ తేదీన వీబీఆర్ సమీపంలో ఓ చిరుత సంచ రిస్తూ నెమలిపై దాడి చేసిన దశ్యాలను అక్కడున్న ఓ మత్స్యకారుడు తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెలుగోడు రిజర్వాయర్ పరిసరాల్లో వ్యవసాయ పనులు నిర్వహించే రైతులు, అలాగే రిజర్వాయర్ను సందర్శించేందుకు వచ్చే యాత్రికులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అడవి జంతువుల సంచారం పెరుగుతోందని, రాత్రి వేళల్లో బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు, వెలుగోడు ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండటంతో అప్పుడప్పుడు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి అడవి జంతువులు సంచరించడం సహజమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్ పరిసరా ల్లో మత్స్యకారులు, రైతులు గుంపులుగా వెళ్లాలని, వన్యప్రాణులు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలన్నారు. -
రథవీధిలో టాయిలెట్లా..?
శ్రీశైల ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ఉన్న వీధిని రథవీధి అని అంటారు. ఈ వీధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు నిర్వహించే వాహనసేవల గ్రామోత్సవం ఈ రథవీధిలో నిర్వహిస్తారు. అయితే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా దేవస్థానం మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వాటిని ఏర్పాటు చేయడం మంచిదేకానీ.. వాటిని రఽథవీధిలో ఉంచడంపై భక్తులు మండిపడుతున్నారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవం తిరిగే ప్రదేశంలో టాయిలెట్లు ఏర్పాటు చేయడంపై దేవస్థాన అధికారుల తీరును భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వాటిని ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. – శ్రీశైలంటెంపుల్ -
శివయ్యా.. వచ్చేస్తున్నాం!
ఆత్మకూరు: శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నల్లమల మీదుగా భక్తుల అడుగులు శ్రీశైలం వైపు పడుతున్నాయి. ఏటా శివరాత్రికి 20 రోజులు ముందుగానే భక్తులు పాదయాత్రగా కదిలేవారు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో ఆత్మకూరు సమీపంలో వెంకటాపురం చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించేవారు. కొందరు సుదూర ప్రాంతాల ఉంచే పాదయాత్రగానే శ్రీశైలం చేరుకునే వారు. అయితే ఈ ఏడాది నల్లమలలో పులుల గణన కారణంగా భక్తుల పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ఈనెల 8వ తేదీ నుంచి మాత్రమే అనుమతి ఇస్తామని అటవీ అధికారులు ప్రకటించారు. అయితే పులుల గణన యుద్ధప్రాతికన పూర్తి చేసి రెండు రోజుల ముందుగానే శుక్రవారం నుంచి భక్తుల పాదయాత్రకు ఫారెస్టు అధికారులు అనుమతులిచ్చారు. దీంతో పాదయాత్ర భక్తులు వెంకటాపురం నుంచి బయలుదేరారు. నాగలూటి, పెచ్చెరువు, దామర్లకుంట, సీతమ్మభావి, కత్తులకొండ భీమునికొలను మీదుగా కైలాస ద్వారం చేరుకుని అక్కడి నుంచి హఠకేశ్వరం మీదుగా సాక్షి గణపతి చేరి మొక్కులు చెల్లించి అనంతరం శ్రీశైల మల్లన్న ను దర్శించుకుంటారు. తొలిరోజు దాదాపు 1000 మందికి పైగా భక్తులు శ్రీశైలం వైపు పాదయాత్రగా కదిలారు. ఈనెల 15వ తేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇల కైలాసమైన శ్రీశైల క్షేత్రానికి భక్తులు తరలిరానున్నారు. పాదయాత్రగా వెళ్తున్న భక్తులను వెంకటాపురం వద్ద అటవీ అధికారులు తనిఖీ చేసి పంపుతున్నారు. నిప్పు పెట్టే వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రిని అనుమతించడం లేదు. కాలినడకన శ్రీశైలయానికి అటవీమార్గంలో వెళ్లే భక్తులు అటవీశాఖ నిబంధనలను పాటించి సహ కరించాలి. ప్రతి భక్తుడి బ్యాగులు పరిశీలించి సిగరెట్లు, బీడీలు, అగ్గిపెట్టె, గుట్కా తదితర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నాం. ప్రధానంగా అటవీ మార్గంలో వెళ్లే పాదయాత్ర చేసే భక్తులు వన్యప్రాణులకు ఎటువంటి హాని కలిగించరాదు. అరణ్యంలోకి ప్లాస్టిక్ను తీసుకెళ్లడం, అడవికి నిప్పు పెట్టే అగ్నిపెట్టెలు, మద్యం తదితర వాటిని నిషేధించాం. రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించే సమయంలో శబ్దం చేయరాదు. – జాకీర్హుసేన్, ఫారెస్టు డీఆర్వో నల్లమల మీదుగా భక్తుల పాదయాత్ర ప్రారంభం పులుల గణన నేపథ్యంలో ఆలస్యంగా అనుమతి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం -
అగ్రికల్చర్ అసిస్టెంట్పై క్రిమినల్ కేసు?
ఆలూరు: హాలహర్వి మండలం నిట్రవట్టి రైతుసేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎం. విజయ్పై స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ రాజు, ఆలూరు ఏడీఏ చెంగల్రాయుడు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. శుక్రవారం ఈ విషయాన్ని ఏఓ జిలానీ బాషా తెలిపారు. అగ్రికల్చర్ అసిస్టెంట్గా నంద్యాల జిల్లాకు చెందిన ఎం. విజయ్ 2020 ఆగస్టు 17న నిట్రవట్టి రైతుసేవా కేంద్రానికి వచ్చాడు. రైతులకు అందుబాటులో ఉంటూ తొలుత రెండేళ్లు సక్రమంగా విధులు నిర్వర్తించాడు. ఎరువులు, సబ్సిడీ విత్తనాలు ఇస్తామని గ్రామ రైతుల నుంచి కొంత మొత్తం వసూలు చేసి గత ఏడాది నుంచి అదృశ్యమయ్యాడు. ఈ–క్రాప్ బుకింగ్లోనూ డబ్బులు వసూలు చేశాడు. గ్రామ రైతుల వద్ద రూ. 5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసి మార్క్ఫెడ్ అధికారులకు చెల్లించకుండా ఎగనామం పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని ఆలూరు ఏడీఏ, హాలహర్వి ఏఓకు మార్క్ఫెడ్ అధికారులు చెప్పారు. దీనిపై ఏఓ జిలానీ బాషా శుక్రవారం విచారించారు. -
మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు
● సీబీఐ తేల్చినా మళ్లీ ఏక సభ్య కమిషనా? ● తప్పు చేశారు, ఇకనైన నోరు మూసుకోండి ● ఏ ఆధారాలతో శ్రీశైలం ప్రసాదంపై ఆరోపణలు ● జగనన్నను డ్యామేజ్ చేయాలనుకోవడం మీ మూర్ఖత్వం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు(టౌన్): ‘‘అత్యున్నత సీబీఐ నిగ్గు తేల్చింది. ప్రజలందరికీ అర్థమైంది. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురూ తిరుమల లడ్డూ గురించి మాట్లాడుతున్నారు. ఇంకెన్నాళ్లీ రాజకీయం చేస్తారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంట్లో సొంత మనిషి చనిపోతే మూడు రోజుల తరువాత ముఖాలు ఎలా ఉంటాయో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిల ముఖాలు అలానే ఉన్నాయన్నారు. పవిత్ర తిరుమల లడ్డూ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఇరికించాలని చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారన్నారు. హిందూ వ్యతిరేకిగా జగనన్నను చేయాలనుకోవడం వారి మూర్ఖత్వమన్నారు. ఇప్పటికే తప్పు చేశారని, ఇకనైనా మరింత పరువు పోకుండా నోరు మూసుకోవాలని సలహా ఇచ్చారు. కింద పడినా తామే గెలిచామన్న రీతిలో మళ్లీ ఏకసభ్య కమిషన్ దర్యాప్తు అనడం సిగ్గుచేటన్నారు. తిరుమల పవిత్రను దెబ్బతీయాలనుకుంటే ఆ భగవంతుడు కూడా క్షమించబోడన్నారు. విజయవాడలో 40 గుళ్లను కూల్చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. జగనన్న హయాంలో తిరుమలలో గోవులను కాపాడేందుకు ప్రత్యేకంగా గోశాల ఏర్పాటు చేశారని, అర్చకుల జీతాలు, కార్మికుల వేతనాల పెంపు, తిరుమలలో 9వేల మందికి ఇళ్ల పట్టాలు, అమరావతి, హైదరాబాద్, వైజాగ్, జమ్ముకశ్మీర్, భువనేశ్వర్లలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనన్నారు. శ్రీశైలం ప్రసాదంపై ఆరోపణలు దారుణం పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీశైల మల్లన్న భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారుణమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఎస్వీ అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఏ ఆధారాలతో శ్రీశైలంపై ఆరోపణలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. శ్రీశైలంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో టాయిలెట్లు క్లీనింగ్ చేసే కెమికల్ వాడుతున్నారని చంద్రబాబు ఎలా ప్రకటించారన్నారు. ఏమైనా ల్యాబ్ రిపోర్టు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు వయస్సు రీత్యా మతి చెడిందన్నారు. కూటమి పాలన వైఫల్యంతోనే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
వైఎస్ జగన్ను సీఎం చేయడమే లక్ష్యం
● వైఎస్సార్సీపీ రజక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్యకర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వైఎస్సార్సీపీ రజక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పన్నీటి కాశయ్య అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక బీసీ భవన్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ రజక ముఖ్య నేతల సమావేశానికి ఆయన హాజర య్యారు. ఈ సందర్భంగా కాశయ్య మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ రజక విభాగాన్ని ఏర్పాటు చేసి తనను అధ్యక్షులుగా నియమించారన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ రజక నేతలను కలుస్తూ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పా రు. ఇప్పటి వరకు ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించామని, ఆయా జిల్లాల్లోని రజకులు, బీసీల్లో వైఎస్ జగన్ పట్ల ఎనలేని అభిమానం, ప్రేమ చెక్కు చెదరలేదన్నారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష, బలమైన పట్టుదల ఉన్న వారిని గుర్తించి వైఎస్సార్సీపీ రజక విభాగంలో జిల్లా, నియోజకవర్గ నాయకత్వ బాధ్యతలను అప్పగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో రాష్ట్రంలో రజకులతో పాటు మిగిలిన బీసీ కులాలప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు. 2024 ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల రజక జనాభా ఉందన్నారు. రజకుల ఓట్లతోనే ముఖ్యమంత్రిగా జగన్ను చూడాలనే బలమైన ఆశయంతో పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భారతీ, స్థానిక వైఎస్సార్సీపీ రజక నేతలు బలరామ్, గోల్డ్మెన్ శ్రీనివాసులు, బబ్లూ, బాబ్జీ, వెంకటేష్, సింగారం రంగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారి కర్నూలుకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్యను స్థానిక నేతలు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. -
శ్రీశైలం.. ‘మహా’ శోభితం
● రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ● 11 రోజుల పాటు నిర్వహణశ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఆదివారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు 11రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో మల్లికార్జునస్వామికి విశేష అర్చనలు చేస్తారు. శ్రీభ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు ఉంటాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్టాపన, అంకురార్పణ నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు త్రిశూలపూజ, భేరిపూజ, సకలదేవతాహ్వనపూర్వక ధ్వజారోహణ, ధ్వజపట అవిష్కరణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఆర్జితసేవల నిలుపుదల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నుంచి 18వ తేదీ వరకు ఉభయ దేవాలయంలో స్వామిఅమ్మవార్లకు జరిగే గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన, చండీహోమం, రుద్రహోమం తదితర అన్ని ఆర్జితసేవలను పూర్తిగా నిలుపుదల చేశారు. భక్తులందరికి కేవలం స్వామివారి ఆలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఈ నెల 12వ తేదీ వరకు జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులకు నిర్దిష్టవేళలో మాత్రమే స్వామివార్ల ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు దేవస్థాల తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పిస్తారు. 15న పాగాలంకరణ బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 9న భృంగి, 10న హంస, 11న మయూర, 12న రావణ వాహన సేవ, 13న స్వామిఅమ్మవార్లకు పుష్పపల్లకీసేవ, 14న గజ వాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 15న ప్రభోత్సవం ఉంటుంది. అదే రోజు నందివాహనసేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. స్వామిఅమ్మవార్లకు రథోత్సవం 16న వైభవంగా జరగనుంది. బ్రహ్మోత్సవ యాగాలకు 17న పూర్ణాహుతి చేస్తారు. అశ్వ వాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలు 18న నిర్వహిస్తారు. -
అన్నదాన శిబిరాలను ప్రారంభించాలి
శ్రీశైల మహాక్షేత్రానికి కాలినడకన వెళ్లే భక్తులు, శివస్వాములు ఇబ్బందులు పడకుండా దాతలు అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేయాలి. డివిజన్ పరిధిలోని 15 మంది తహసీల్దార్లు, అదే సంఖ్యలో డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలను విధులకు కేటాయించాం. వెంకటాపురం నుంచి హఠకేశ్వరం వరకు 13 మెడికల్ క్యాంపులు, ఒక్క శ్రీశైలంలోనే ఉచిత వైద్యశిబిరాలు 30 ఏర్పాటు చేశాం. భీమునికొలను, కై లాసద్వారం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి వసతి కల్పించారు. ఆత్మకూరు–దోర్నాల వరకు రహదారిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నాం. పాదయాత్ర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులకు సమాచారం ఇవ్వాలి. – నాగజ్యోతి, ఆర్డీఓ -
నాణ్యతతో తీసుకొస్తేనే గిట్టుబాటు ధర
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ ఉత్పత్తులను గ్రేడింగ్ చేసుకొని నాణ్యతతో తీసుకొస్తేనే గిట్టుబాటు ధరలు లభిస్తాయని కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఒక రైతు తెచ్చిన వాములో మట్టి, పొట్టు, పుల్లలు అధికంగా ఉండటంతో క్వింటాకు రూ.11 వేలు మాత్రమే ధర లభించిందన్నారు. ఆ సమయంలో తాము తనిఖీ చేయగా రైతు ఈ ధరకు అమ్మానని, క్యాన్సిల్ చేసుకుంటానని తెలుపడంతో అంగీకరించామన్నారు. వామును అక్కడే క్లీన్ చేసుకొని శుక్రవారం అమ్మకానికి పెట్టడంతో క్వింటా ధర రూ.24 వేలు పలికిందన్నారు. నేటి నుంచి టమాట విక్రయాలు నిలిపివేత పత్తికొండ: వ్యవసాయ మార్కెట్లో శనివారం నుంచి టమాట విక్రయాలను నిలిపివేస్తున్నట్లు మార్కెట్యార్డు కార్యదర్శి కార్నలిస్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో టమాట దిగుబడి ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో వ్యాపారులు ఇతర ప్రాంతాలకు వెళ్లారన్నారు. ఈ నేపథ్యంలో టమోట విక్రయాలను నిలుపుదల చేశామన్నారు. ఇతర కూరగాయల మార్కెట్ రోజూ యథావిధిగా కొనసాగుతుందన్నారు. 8న పోస్టల్ ఉద్యోగుల ద్వైవార్షిక మహాసభలు కర్నూలు(అర్బన్): కర్నూలు డివిజన్ ఎన్ఎఫ్పీఈ గ్రూప్ సీ, పోస్ట్మెన్, ఎంటీఎస్, జీడీఎస్ యూనియన్లు సంయుక్తంగా ద్వైవార్శిక మహాసభలను ఈ నెల 8న స్థానిక ప్రధాన తపాల కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు యూనియన్ నాయకులు గిరిబాబు, ఈశ్వరయ్య, శమంతకరెడ్డి, లక్ష్మికాంత్, మహ్మద్జానీ, రమేష్బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక హెడ్ పోస్టాఫీసు ప్రాంగణంలో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభలకు రాష్ట్ర నాయకులు శ్రీధర్, మురళీతో పాటు అఖిల భారత నాయకులు కూడా హాజరవుతారన్నారు. మహాసభల్లో ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తామన్నారు. అలాగే మూడు యూనియన్లకు సంబంధించి నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు నేరం మంత్రాలయం రూరల్: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అటువంటి వివాహాల సమాచారం తెలిస్తే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ అధికారి విజయ తెలిపారు. మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదిక ఆవరణలో సీడీపీవో రాజేశ్వరిదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లతో సమావేశాన్ని నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. డిస్టిక్ కో ఆర్డినేటర్ బాలు, వన్స్టాఫ్ సెంటర్ అధికారి స్వప్న, నాలుగు మండలాల ఐసీడీఎస్ సూపర్వైజర్స్, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇచ్చిన సూక్ష్మ సేద్యం లక్ష్యాలను అధిగమించేందుకు పట్టుదలతో పనిచేయాలని ఉద్యానశాఖ కమిషనరేట్ జాయింట్ డైరెక్టర్ డైరెక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలులోని ఉద్యాన భవన్లో కంపెనీల డీసీవోలు, ఎంఐ ఇంజినీర్లు తదితరులుతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరంలో 14 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 9,750 హెక్టార్లు పూర్తి చేశారన్నారు. మార్చి 15లోపు వంద శాతం లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, ఇతర రైతులకు 10 ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్య సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొ న్నారు. బిందు, స్ప్రింక్లర్ల పరికరాలపై జీఎస్టీని తగ్గిందని, యూనిట్ వ్యయంపై 7 శాతం ఆదా అవుతుందన్నారు. ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఆదనపు పీడీ ఫిరోజ్ఖాన్, నంద్యాల జిల్లా పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సీఎంకు ఆదోని జిల్లా సెగ
● కలుగొట్ల సభలో విద్యార్థి సంఘాలు, జేఏసీ నాయకుల ఆందోళన ● అదుపులో తీసుకున్న పోలీసులు ఎమ్మిగనూరు టౌన్: కలుగొట్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ గ్రామ సభలో ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో ఆదోని జిల్లా కావాలంటూ జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. సభలో ఒక్కసారిగా లేచి నినాదాలు చేశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. సీఎం చంద్రబాబు ఇలాంటి వారుంటారు డైవర్షన్ చేయడానికి అంటూ మండిపడ్డారు. సీఎం ఆదేశాలతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులో తీసుకొని ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. మరో వైపు సీఎం ప్రసంగిస్తుండగానే రైతులు, మహిళలు సభ మధ్యలోనే తిరుగుముఖం పట్టారు. జనం పలుచగా హాజరు కావడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. -
పంటకు కాపలా పులి
రబీలో సాగు చేసిన పంటలు కోతకు వస్తున్నాయి. అయితే నల్లమల అటవీ సమీపంలో ఉండటంతో పశు, పక్షాదుల నుంచి రక్షణ కరువైంది. అటవిలో నుంచి పందులు, జింకలు పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. మరో వైపు పక్షుల గుంపు పంటలపై వాలి క్షణాల్లో దిగుబడులను తినేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు రైతులు దిగుబడులను కాపాడుకునేందుకు కొందరు లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి వివిధ శబ్దాల ద్వారా తరమేస్తున్నారు. మరి కొందరు దిష్టి బొమ్మలు, పెద్ద పులి, చిరుత పులులు, కొండ ముచ్చులు వంటి వాటి బొమ్మలను ఏర్పాటు చేసి భయపెడుతున్నారు. రుద్రవరం, ఎల్లావత్తుల, ఢీకొట్టాల, హరినగరం, నర్సాపురం, ఆలమూరు, చిత్రేనిపల్లె, కొటకొండ, శ్రీరంగాపురం, పెద్దకంబలూరు, అప్పనపల్లె తదితర గ్రామాల పరిధిలోని రైతులు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. – రుద్రవరం -
సీఎం చంద్రబాబుకు నిరసన సెగ
సాక్షి,కర్నూలు: సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పర్యటనలో విద్యార్థి సంఘాలు చంద్రబాబు కాన్వాయ్ ఎదుట నిరసన చేపట్టాయి. అధికారం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదంటూ ప్రశ్నించారు.సీఎం గోబ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘం నేతలను ఈడ్చిపడేశారు. అనంతరం, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. -
కల్వర్టు గుంతలో పడి వ్యక్తి దుర్మరణం
వెల్దుర్తి/కోడుమూరు రూరల్: కోడుమూరు – వెల్దుర్తి రహదారిలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు ఆసుపత్రి పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి మండలం చెరుకులపాడుకు చెందిన రామాంజనేయులు, మద్దమ్మ ఒక్కగానొక్క కుమారుడు బోయ హరికృష్ణ (25) వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫర్టిలైజర్స్ షాప్లో పనిచేస్తున్నాడు. ఇతనికి ఇటీవల కాలు బెనికింది. కృష్ణగిరి మండలం తొగర్చేడుకు చెందిన బొల్లారం నాగమద్దయ్యతో పరిచయం ఉండటంతో ఇద్దరు కలిసి బైక్పై నాటువైద్యం చేయించుకునేందుకు గోనెగండ్ల ఆలువాల గ్రామానికి వెళ్లాడు. నాటు వైద్యం చేయించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో వెంకటగిరి, ఎర్రకత్వ గ్రామాల మధ్య కల్వర్టు కోసం తవ్విన గుంత వద్ద డైవర్షన్ రోడ్డు వేసినా అందుకు సంబంధించిన సూచికలు ఏర్పాటు చేయక పోవడంతో వేగంగా వస్తున్న వారు పది అడుగుల గుంతలో పడిపోయారు. బైక్ వెనుక కూర్చున్న చెరుకులపాడు బోయ హరికృష్ణ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, నాగమద్దయ్య గాయాలపాలయ్యాడు. రాత్రి 11 గంటల సమయంలో అటుగా వచ్చిన వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, సంఘటనా స్థలంలో సూచికలు లేకుండా నిర్మాణాలు చేపట్టిన సదరు కాంట్రాక్టరుపై సైతం చట్టపరమైన చర్యలకు విచారణ చేస్తున్నట్లు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపారు. మృతుడు బోయ హరికృష్ణకు వెల్దుర్తి పట్టణం కొండపేటకు చెందిన యువతితో రెండు నెలల క్రితమే వివాహమైంది. కల్వర్టు నిర్మాణం వద్ద సూచికలు ఏర్పాటు చేయని వైనం బైక్పై వెళ్తూ గుంతలో పడిన ఇద్దరు ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు -
ప్రతి పేజీ మోసమే!
కర్నూలు(సెంట్రల్): పట్టదారు పాసుపుస్తకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ‘రాజకీయం’ చేస్తోంది. గత ప్రభుత్వంలో జారీ చేసిన పాసు పుస్తకాలను రద్దు చేసి కొత్తగా రాజముద్రతో ఇస్తామని ఊరించింది. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా ఇప్పటికీ అరకొరగానే మంజూరు చేస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నేడు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా వీటిని రైతులకు అందించేందుకు ఎమ్మిగనూరు మండలం కలుగోట్లలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం మూడు విడతల్లో 472 గ్రామాలకు 254 గ్రామాల్లో రీసర్వేను పూర్తి చేసి 1.92,472 మంది రైతులకు జీయో కోఆర్డినేట్స్తో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల ముందు రీసర్వేపై చంద్రబాబుతో పాటు పవన్ కల్యాన్ తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల భూములు లాక్కుంటున్నారని, తాము అధికారంలోకి వస్తే రీసర్వేను నిలుపుదల చేస్తామని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే 2025 జనవరి 20 నుంచి వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు–భూరక్ష పథకం పేరు మార్చి ఏపీ రీసర్వే ప్రాజెక్టు పేరిట రీసర్వే చేపడుతుండటం చూసి రైతులు అవాక్కవుతున్నారు. రెండేళ్ల తరువాత రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలు ఇస్తున్నా జిల్లాకు అరకొరగానే మంజూరయ్యాయి. మొత్తం 1,92,472 మంది రైతుల్లో 84వేల పుస్తకాలు మాత్రమే జిల్లాకు చేరాయి. కొత్త పాసుపుస్తకాల్లో తప్పులే తప్పులు గత ప్రభుత్వం మంజూరు చేసిన జీయో కోఆర్డినేట్స్తో కూడిన పట్టదారు పాసు పుస్తకాలను రద్దు చేసిన చంద్రబాబునాయుడు.. వాటి స్థానంలో రాజముద్రదతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నారు. అయితే వాటిలో వివరాలు సక్రమంగా లేవని రైతులు గగ్గోలు పెడుతున్నారు. విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఎల్పీ నంబర్, పేరు, ఇంటి పేరు, పాసు పుస్తకం నంబరు తదితర వివరాల్లో అచ్చు తప్పులు ఎక్కువగా దొర్లడం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల తరువాత ఇస్తున్నా వాటిలో అన్నీ తప్పులే ఉండటం పట్ల అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ రీసర్వేపై టీడీపీ, జనసేన దుష్ప్రచారం అధికారంలోకి రాగానే తిరిగి రీసర్వేకు శ్రీకారం పాత పుస్తకాలను రద్దుచేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు అరకొరగానే పాసుపుస్తకాలు బ్యాంకు రుణాలు, ఇతర అవసరాలకు రైతుల అవస్థలు నేడు కలుగొట్లలో సీఎం చంద్రబాబు పర్యటన -
రికార్డుల నిర్వహణ ఇలాగేనా?
● హార్టికల్చర్పై అవగాహన ఎక్కడ కల్పించారు? ● డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యనారాయణ ఆగ్రహంకొత్తపల్లి: ఉపాధి హామీ అధికారులపై డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎంపీడీఓ మేరి అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అనుబంధ సంస్థలలో జరిగిన పనులపై 18వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనుల నిర్వహణ అంతా అస్తవ్యస్థంగా ఉందన్నారు. చేసిన పనుల ఫొటోలు లేకపోవడంతో ఎక్కడ, ఎప్పుడు పనులు చేశారో తనిఖీ అధికారులు గుర్తించలేకపోయారన్నారు. రికార్డుల నిర్వహణ పనితీరుపై మండిపడ్డారు. హార్టికల్చర్పై రైతులకు అవగాహన ఎవ్వరూ కల్పించినట్లు లేదన్నారు. తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త్తలు తీసుకోవాలన్నారు. 2024–25లో రూ.9.90 కోట్లతో జరిగిన 961 పనులపై సామాజిక తనిఖీ చేయగా 1.79 కోట్ల అవకతవకలు జరిగినట్లు గుర్తించారన్నారు. హార్టికల్చర్ కింద రైతుల పొలాల్లో మొక్కలు లేనందున మొక్కలు లేని చోట రీ ప్లాంటేషన్ చేయకపోతే రైతుల నుంచి రీప్లాంటేషన్కు రూ.96,796 రీకవరి చేయాలని ఆదేశించారు. మిగిలిన వాటిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో ఏపీడీ వెంకటరామిరెడ్డి, అడిషనల్ విజిలెన్స్ అధికారి పరమేశ్వరుడు, సామాజిక తనిఖీ ఎస్ఆర్పీ చంద్రమోహన్, ఏపీఓ విమలమ్మ, పీఆర్ఏఈ మద్దిలేటి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పాల్గొన్నారు. -
పద్మావతికే.. ఫలహారం!
శ్రీశైలంటెంపుల్: వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటి.. అన్న చందంగా తయారైంది శ్రీశైలంలో పద్మావతి ఏజెన్సీ పరిస్థితి. రాష్ట్రంలో ముఖ్యమైన నాయకుడికి బంధువు సంస్థ అని చెప్పుకుంటూ ఏడు ప్రముఖ ఆలయాల్లో పద్మావతి ఏజెన్సీ శానిటేషన్, హౌస్కీపింగ్ పనులు దక్కించుకుంది. శ్రీశైలంలో కూడా ఆ సంస్థ చేపట్టిన శానిటేషన్, హౌస్కీపింగ్పై భక్తుల్లో 40 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి కావాల్సిన వ్యక్తికి చెందిన ఏజెన్సీ కావడంతో అధికారులు ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ..నిబంధనలకు విరుద్ధగా దేవస్థాన అధికారులు వ్యవహరిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు 11రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణలో శానిటేషన్ అతి ముఖ్యమైనది. శానిటేషన్ పనుల నిర్వహణ కోసం ప్రతి ఏడాది జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టెండర్లు నిర్వహించి, 1000 మందితో 11 రోజుల పాటు శానిటేషన్ పనులు చేపడతారు. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా శ్రీశైలంలో శానిటేషన్ పనులు నిర్వహిస్తున్న పద్మావతి ఏజెన్సీకే అప్పగించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభు త్వ పెద్దలతో పద్మావతి ఎండీకి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఎవరు నో చెప్పకుండా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల శానిటేషన్ పని విలువ సుమారు రూ.45 లక్షలు వరకు ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో జిల్లా పంచాయతీ అధికారుల ద్వారానే టెండర్లు నిర్వహించి శానిటేషన్ పనులు చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం గత నిబంధనలకు భిన్నంగా పద్మావతి ఏజెన్సీకే మల్లన్న ఫలహారం అందేలా ట్రస్ట్బోర్డు, అధికారులు చక్రం తిప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఏటా జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో శానిటేషన్ టెండర్ల నిర్వహణ ఈ ఏడాది టెండర్లు నిర్వహించకుండా పద్మావతి ఏజెన్సీకే అప్పగింత -
అహోబిలేశుడికి నీరాజనం
ఆళ్లగడ్డ: అహోబిలేశుని పార్వేట పల్లకీ గురువారం చింతకుంటకు చేరింది. ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లె నుంచి తెల్లవారు జామున ఎంవీనగర్కు చేరుకుంది. అక్కడ ఎంపీడీఓ కార్యాయలయం, డీఎస్పీ, పోలీస్ సర్కిల్ కార్యాలయాల్లో విశేష పూజలు అందుకున్న అనంతరం చింతకుంట గ్రామం చేరుకుంది. గ్రామ పొలిమేరకు చేరుకున్న ఉత్సవమూర్తులకు సంప్రదాయ ప్రకారం వీఆర్వో బారెడ్డి రాజగోపాల్రెడ్డి పెద్ద ఎత్తున గ్రామస్తులతో కలిసి వెళ్లి స్వాగతం పలికారు అనంతరం పల్లకీని భుజాలపై మోస్తూ మొదటి తెలుపుపై కొలువుంచారు. ఉత్సవ మూర్తులు శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరదస్వాములను గ్రామస్తులు బారులు దీరి దర్శించుకున్నారు. గ్రామంలోని పలు తెలుపులపై కొలువుదీరిన ఉత్సవ పల్లకీకి ప్రజలు విశేష పూజలు చేశారు. ప్రధాన వీధుల్లో బొమ్మలు, గాజుల అంగళ్లు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేయడంతో గ్రామంలో తిరునాల వాతావరణం నెలకొంది. ఇద్దరు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అరెస్ట్ ● మద్యం మత్తులో బస్సు డ్రైవింగ్ ● ప్రయాణికుల ఫిర్యాదుతో అరెస్ట్ పాణ్యం: మద్యం మత్తులో ఉన్న ఇద్ద రు ప్రైవేటు ట్రావె ల్స్ బస్సు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి 26 మంది ప్రయాణికులతో కావేరి ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. మార్గమధ్య లో గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పాణ్యం సమీపంలో బస్సు డ్రైవర్ రహదారిపై ఉన్న బారికేడ్స్ను ఢీకొని, ర్యాష్ డ్రైవింగ్ చేయడాన్ని ప్రయాణికులు గమనించారు. వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బలపనూరు వద్ద బస్సును నిలిపేశారు. ఇద్దరు డ్రైవర్లను బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్లు గుర్తించారు. ప్రయాణికులను వేరే బస్సుల్లో హైదరాబాద్కు పంపించి కావేరి బస్సును స్టేషన్కు తరలించారు. హైదరాబాద్కు చెందిన డ్రైవ ర్లు ఆంజినేయులు, విశ్వనాథ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. -
గో సంరక్షణనిధికి విరాళాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిధి పథకానికి పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. గురువారం కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన దాత శ్రీరామమూర్తి రూ.1,23,456 విరాళాన్ని పర్యవేక్షకులు టి.హిమబిందుకు అందజేశారు. అలాగే అనంతపురానికి చెందిన బి.రూపేష్సింగ్ రూ.5 లక్షల విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. విరాళాలను అందించిన దాతలను దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలు, జ్ఞాపికలు అందించి సత్కరించారు. గూడూరు బార్ లైసెన్స్ కోసం లాటరీ కర్నూలు(సెంట్రల్): గూడూరులోని బార్ లైసెన్స్ కోసం దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ తీసినట్లు డీఆర్వో సి.వెంకట నారాయణ మ్మ తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో జిల్లా ప్రొమిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధి కారి ఎం.సుధీర్బాబుతో కలసి వచ్చిన నాలుగు దరఖాస్తులను పరిశీలించారు. వారి సమక్షంలోనే సక్సెస్ఫుల్ అండ్ రిజర్వ్ దరఖాస్తులను నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరిటెండెంట్ రామకృష్ణారెడ్డి, సీఐలు మంజుల, చంద్రహాస్ పాల్గొన్నారు. 105 ఏళ్ల వృద్ధురాలి మృతి కొత్తపల్లి: ఎం.లింగాపురం గ్రామంలో 105 ఏళ్ల చిమ్మె రత్న మ్మ వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. ఈమె 1921లో జన్మించినట్లు కుటుంబీకులు తెలిపారు. దాదాపు 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం వయస్సు పైబడడంతో గురువారం ఆమె మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఈమెకు నలుగురు కుమారులుగా, ప్రస్తుతం కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 40కిపైగా ఉంది. బైక్ల దొంగ అరెస్ట్ నంద్యాల: బైక్ల చోరీలకు పాల్పడుతున్న దొంగను నంద్యాల వన్టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గత నెల 25వ తేదీన కర్నూలు పట్టణానికి చెందిన నరసప్ప అనే వ్యక్తి బస్టాండ్ బయట బైక్ పార్కింగ్ చేసి బస్సు విచారణ కోసం వెళ్లి వచ్చేలోపు బైక్ కనిపించలేదు. ఈ చోరీపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నంద్యాల పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్వలి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. గురువారం పట్టణంలోని చెరువు కట్ట వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా మహమ్మద్ వలిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అతని వద్ద నుంచి స్కూటీ, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు వలిపై గతంలో కర్నూ లు, ఓర్వకల్లు, ఆత్మకూరు, బేతంచెర్ల, నంద్యాల పోలీసు స్టేషన్ల పరిధిలో 9 కేసులు నమో దు అయ్యాయన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి నంద్యాల కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా రిమాండ్కు ఆదేశించారన్నారు. పురాతన శివాలయం పరిశీలన నందవరం: రాయచోటి గ్రామంలోని పశ్చిమ చోళుల కాలం నాటి చరిత్ర కలిగిన పురాతన శివాలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. గురువారం గ్రామంలోని శివాలయంలో పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామి నాయక్ ఆదేశాల మేరకు టెక్నికల్ అసిస్టెంట్ మహేంద్రనాయుడు, సైట్ ఇంజనీర్ జి.పి శ్రీనివాసులు గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆలయాన్ని సందర్శించి కొలతలు చేపట్టారు. ఈ సందర్భంగా టెక్నికల్ అసిస్టెంట్ మాట్లాడుతూ.. రాష్ట్ర పురావస్తు శాఖ గ్రామంలో వెయ్యేళ్లు పైగా చోళుల కాలం నాటి శివాలయ పునరుర్ధణ చర్యలు చేపడుతునట్లు తెలిపారు. -
18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు
కర్నూలు సిటీ: జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్ లోయర్లో 223 మంది, హైయర్లో 85 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. వీరికి ఎస్ఏపీ క్యాంపులోని కట్టమంచి రామలింగారెడ్డి మున్సిపల్ మొమోరియల్ హైస్కూల్లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రంలో ఈ నెల 18, 19, 20, 21 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయన్నారు. టైలరింగ్ లోయర్ పరీక్షకు 141 మంది, హైయర్ పరీక్షకు 60 మంది హాజరుకానున్నారు. ఈ పరీక్షకు ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ మొమోరియల్ హైస్కూల్లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఈ నెల 18, 19 తేదీల్లో పరీక్ష జరుగనుందన్నారు. అభ్యర్థులు www.bse.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ తెలిపారు. బాలుడిపై వీధి కుక్కల దాడి ఆళ్లగడ్డ: వీధికుక్క దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డా డు. ఈ ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. తొమ్మండ్రు వీధికి చెందిన దస్తానంద, రజియా దంపతుల కుమారుడు ఆరేళ్ల దివికేశ్ ఇంటి ముంద సైకిల్తో ఆడుతుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి కుక్కల దాడి నుంచి బాలుడిని రక్షించారు. ఈ దాడిలో బాలుడి మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలున్ని కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక వైద్యశాలకు తరలించారు. -
పాసు పుస్తకాలు ఎప్పుడిస్తారో
నాకు రెండు ఎకరాల పొలం ఉంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలోనే సర్వే చేశారు. అయితే పాసు పుస్తకం ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. భూ సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే రీసర్వేను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరి గత ప్రభుత్వంలో ఎందుకు వ్యతిరేకించారో తెలియడం లేదు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. – తువ్వదొడ్డి ఆనంద్, ముక్కెళ్ల, తుగ్గలి మండలం నా పొలాన్ని గత ప్రభుత్వ హయాంలోనే రీసర్వే చేశారు. జీయో కోఆర్డినేట్స్తో కూడిన పాసుపుస్తకాన్ని ఇచ్చారు. అయితే దానిని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తది మాత్రం ఎప్పుడు ఇస్తారో చెప్పరు. బ్యాంకులో రుణం కోసం వెళ్తే పాసు పుస్తకం అడుగుతున్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం తగదు. – సోమేష్, మూగలదొడ్డి, కోసిగి మండలం -
పోరాటాలను ఉద్ధృతం చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు నంద్యాల(న్యూటౌన్): కార్మిక హక్కుల రక్షణకు పోరాటాలు ఉద్ధృతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం అధ్యక్షతన ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభల ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా గఫూర్, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, గౌరవాధ్యక్షుడిగా శాంతిరాముడు, కోశాధికారిగా ఏసురత్నం, చీఫ్ ప్యాట్రన్గా దస్తగిరిరెడ్డి, మలికిరెడ్డి రాజగోపాల్రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఇంతియాజ్ అహమ్మద్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీమెంట్ పేరుతో ఉద్యోగులకు, కార్మిక వర్గానికి పాలకులు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కనీస వేతనాలు లేక చాలీచాలని జీతాలతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి పోతుందని, కార్మికులను, కష్ట జీవులతో కారు చవకగా పని చేయిస్తూ పెట్టుబడి, కార్పోరేట్ శక్తులకు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించా రు. కార్మికుల హక్కుల కోసం లేబర్ కోడ్ల రద్దుకై ఈనెల 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో మహిళలను పని చేయాలని నిర్ణయించడం కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందన్నారు. మహిళా ఉద్యోగుల, మహిళా కార్మికులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్కుమార్, రాజశేఖర్, రామచంద్రుడు, నాగేశ్వరరావు, నరసింహనాయక్, లక్ష్మణ్, బాలవెంకట్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యేవరకు పోరాటం
పోరాట గళం: బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిసాక్షి, నంద్యాల: రాయలసీమకు సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై రైతులు కదం తొక్కారు. సొంత ప్రయోజనాల కోసం సీమకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. కన్నతల్లి లాంటి పుట్టిన ప్రాంతానికి ద్రోహం చేయాల్సిన ఆలోచన ఎలా వచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమ లిఫ్ట్ పథక నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నిలిపి వేయడాన్ని నిరశిస్తూ రైతులు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు చలో పోతిరెడ్డిపాడు సభకు భారీగా తరలివచ్చారు. ఉత్సాహంగా.. రాయలసీమకు సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై వైఎస్సార్సీపీ కన్నెర్ర చేసింది. తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుమ్మకై ్క సీమ రైతులకు, ప్రజలకు అన్యాయం చేస్తే అడ్డుకుని తీరతామని ప్రతినబూనింది. చంద్రబాబు చేస్తున్న ప్రజాకంఠక పాలనను వివరించేందుకు చలో పోతిరెడ్డిపాడు సభకు పిలుపునిచ్చింది. ఒక్క పిలుపుతో రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ప్రజలు ఉత్సాహంగా ఉరకలేస్తూ భారీగా తరలివచ్చారు. ట్రాక్టర్లు, ఆటోలు ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా తరలివచ్చారు. తమ ప్రాంతానికి అన్యాయం చేయాలని చూస్తే రాజకీయ సమాధి కడతామని హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే.. పోతిరెడ్డిపాడు సభ ఆరంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయలసీమ లిఫ్ట్ పనులను ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. పనులు ప్రారంభించకుంటే రాజకీయంగా సమాధి కడతామని హెచ్చరించారు. చంద్రబాబుకు చేతకాకుంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించి.. సభ ప్రారంభానికి ముందు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని సందర్శించారు. అక్కడ ఆగిపోయిన పనులను పరిశీలించి, ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోతులపాడు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ముందుగా దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చివరి వరకు అనుమతి ఇవ్వకుండా తాత్సారం చలో పోతిరెడ్డిపాడు సభను విజయవంతం కాకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకుండా తాత్సారం చేసింది. వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేవలం రెండు గంటల పాటే నిర్వహించాలని నిబంధన విధించారు. కేవలం ఒక రోజు ముందు అనుమతి ఇవ్వడంతో సభకు రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రాలేరని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ, ప్రభుత్వ పెద్దలు అవాక్కయ్యేలా సభ సాగింది. ఉదయం నుంచే గ్రేటర్ రాయలసీమ జిల్లాల నుంచి రైతులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. పది వేలకు పైగా వచ్చిన జనం సమయం లేకపోవడంతో కేవలం నాలుగు వేల మంది కూర్చునే సామర్థ్యంతో సభ ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకే కుర్చీలు మొత్తం ఫుల్ అయ్యాయి. సభకు అటు ఇటు దాదాపు ఐదు వేల మంది నిల్చొని తమ అభిమాన నాయకుల ప్రసంగాలను వీక్షించారు. దాదాపు మూడు గంటల పాటు సభ సాగింది. సభ పూర్తయ్యే వరకు ప్రజలు, రైతులు ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ తమ మద్దతును ప్రకటించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్తో పాటు రాయలసీమ లిఫ్ట్ పథకానికి చంద్రబాబు ఎలా దగా చేశారో నేతలు వివరించారు. సీమ అంటేనే చంద్రబాబుకు గిట్టదని.. తన రాజకీయ జీవితంలో ఏనాడూ సీమ అభివృద్ధిని, రైతుల కష్టాలను పట్టించుకున్న పాపానపోలేదని తెలిపారు. సీమ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్కు మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ తన హయాంలోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్ద పీట వేశారని గణాంకాలతో వివరించారు. వైఎస్సార్ సీపీ నేతల ప్రసంగాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సభ నామమాత్రంగా సాగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు మొదట భావించాయి. కానీ, సభ ప్రారంభమయ్యే సమయానికి వారి అంచనాలు తలకిందులయ్యాయి. సభకు ప్రజలు పోటెత్తారు. సుమారు పది వేల మందికి పైగా జనాలు తరలివచ్చి తమ మద్దతు తెలియజేశారు. దారులన్నీ పోతులపాడు వైపే... చలో పోతిరెడ్డి పాడు కార్యక్రమానికి గ్రేటర్ రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు వాహనాలలో తరలివచ్చారు. ఉదయం 10 గంటలకే ప్రాంతమంతా వాహనాలతో కిక్కిరిసిపోయింది. కర్నూలు – ఆత్మకూరు హైవే నుంచి పోతులపాడు గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో నాయకులు, ప్రజలు హైవే నుంచి నడుచుకుంటూ వచ్చారు. రైతులు పొలం గట్ల వెంబడి అడుగులో అడుగు వేసుకుంటూ సభాస్థలికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ జెండాతో సభకు వచ్చిన అభిమాని ఫ్లెక్సీల ప్రదర్శన సభకు వచ్చిన యువకులు సీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని వివరించేలా ఫ్లెక్సీలు చేతిలో పట్టుకుని ప్రదర్శించారు. ‘రాయలసీమ ద్రోహి.. తెలంగాణ పక్షపాతి.. చంద్రబాబు డౌన్ .. డౌన్’ అంటూ రాసిన ప్లెక్సీలను ప్రదర్శించడంతో పాటు భారీ ఎత్తున నినాదాలు చేశారు. పులి కథతో ఆకట్టుకున్న బైరెడ్డి సభలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడిన మాటలు ఆకట్టుకోవడంతో పాటు అందరినీ ఆలోచింపజేశాయి. చిన్నపాటి కథతో చంద్రబాబు నైజాన్ని కళ్లకు కట్టినట్లు తెలిపారు. ఒక వేటగాడు పులితో భయంకరంగా ఫైట్ చేసి చంపేసిన తర్వాత తనకు గాయాలు కావడంతో మందు తెచ్చుకోవడానికి వెళితే.. ఈ లోపు చంద్రబాబు లాంటోడు వచ్చి.. పులి గోళ్లు.. పళ్లు ఎత్తుకెళ్లి .. పులిని నేనే చంపాను అంటూ ఊరంతా టాం... టాం.. వేసుకున్నట్లు... చంద్రబాబు తీరు కూడా అంతేనని చెప్పడంతో సభ మొత్తం ఈలలు, చప్పట్లతో మార్మోగింది. కదంతొక్కిన రాయలసీమ రైతులు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపాటు తక్కువ సమయం ఉన్నా భారీగా తరలివచ్చిన కర్షకులు రాయలసీమ లిఫ్ట్ పనులను ప్రారంభించాలని వైఎస్సార్సీపీ ముఖ్య నేతల డిమాండ్ లేదంటే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిక -
సంకల్పదారులు
సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు (సెంట్రల్): ‘చలో పోతిరెడ్డిపాడు’ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో సభ ఏర్పాట్లకు కృషి చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. రాత్రంతా అక్కడే ఉండి ఏర్పాట్లను బైరెడ్డి పరిశీలించారని, ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా పార్టీలో సమన్వయంతో ముందుకు సాగుతామని చెప్పారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ఆత్మకూరులో భోజన వసతిని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. రైతుల ‘సునామీ’ ● భారీగా తరలివచ్చిన రాయలసీమ రైతులు జూపాడుబంగ్లా: ‘చలో పోతిరెడ్డిపాడు’ సభకు రైతులు సునామీలా తరలివచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టుపెట్టి సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని వివరించేందుకు చేపట్టిన సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. సభ విజయవంతం కాకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు పన్నినా ఫలితం లేకుండా పోయింది. సభ నిర్వహణకు కేవలం 18గంటల ముందు మాత్రమే అనుమతులు మంజూరైనా వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంటు బైరెడ్డి సిద్ధ్దార్థరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త దారాసుధీర్ నిర్ణీత సమయానికి సభను ముస్తాబు చేయించారు. అంచనాలను మించిపోయి రాయలసీమ జిల్లాల నుంచి 10 వేల మందికిపైగా రైతులు తరలివచ్చారు. ఉదయం 11.30గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 2.30గంటల వరకు కొనసాగింది. అప్పటిదాకా సభా ప్రాంగణానికి సుదూర ప్రాంతాల్లోని రైతులు తరలివస్తూనే ఉన్నారు. రైతులు, ప్రజలు సభాప్రాంగణం వద్దకు మినహా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, రాయలసీమ ఎత్తిపోతల పథకం చూసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో రైతులు పోలీసుల వైఖరిని తప్పుపడుతూ వెనుదిరిగారు. -
9న అప్రెంటిస్ మేళా
కర్నూలు సిటీ: ఏపీ ఉపాధి కల్పన, శిక్షణ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 9న అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ కాలేజీల జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ(బాలికలు) కాలేజీ ప్రిన్సిపాల్ ఎల్.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర శివారులోని బి.తాండ్రపాడు ప్రభుత్వ ఐటీఐ(బాలికలు)కాలేజీలో మేళా నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని పారిశ్రామికవేత్తలు మేళాలో పాల్గొంటారన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఆన్లైన్లో అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ httpr:/apprenticerhipindia.gov.in అనే పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మేళాకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు. డీఆర్సీ ఏడీఏ వెంకటేశ్వర్లు బదిలీ కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖకు సంబంధించిన జిల్లా వనరుల కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు గుంటూరులోని వ్యవసాయ శాఖ కమిషనరేట్కు బదిలీ అయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన ఇక్కడ రిలీవ్ కానున్నట్లు సమాచారం. ఖజానా శాఖలో ఇద్దరికి పదోన్నతి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ట్రెజరీ శాఖలో ఇద్దరికి పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఖజాన శాఖ డైరెక్టర్ మోహన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఎస్టీఓగా పనిచేస్తున్న విజయమ్మకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరుగా పదోన్నతి కల్పించి అనంతపురం జిల్లా ట్రెజరీ కార్యాలయానికి బదిలీ చేశారు. గూడూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న భాగ్యమ్మకు ఎస్టీఓగా పదోన్నతి లభించింది. ఈమె ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ అధికారిగా బదిలీ అయ్యారు. కర్నూలు సబ్ ట్రెజరీ ఎస్టీఓగా శ్రీనివాసరాజు కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీ అధికారిగా శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఇక్కడ ఎస్టీఓగా పనిచేస్తున్న విక్రాంత్ జనవరి 31న పదవీ విరమణ పొందారు. ఈ పోస్టులో శ్రీనివాసరాజును నియమించారు. గతంలో శ్రీశైలం ఎస్టీఓగా పనిచేసిన ఆయన ఆరు నెలలుగా సెలవుల్లో ఉన్నారు. పంటల నమోదు 52 శాతమే కర్నూలు(అగ్రికల్చర్): 2025–26 రబీ పంటల నమోదు సుదీర్ఘంగా సాగుతోంది. రబీ సీజన్లో సాగు చేసిన శనగ, జొన్న, వాము తదితర పంటల కోతలు ముగింపు దశకు చేరుకున్నాయి. పంటల నమోదు మాత్రం 50 శాతం కూడా పూర్తి కాలేదు. జిల్లాలో 8,32,213 సర్వే నెంబర్లకు సంబంధించి 13,46,416 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రతి సర్వే నెంబర్కు వెళ్లి పంట ఉన్నా.. లేకపోయినా నమోదు చేయాల్సి ఉంది. హాలహర్వి, కౌతాలం, ఆలూరు, ఓర్వకల్ మండలాలు రబీ పంటల నమోదులో పూర్తిగా వెనుకబడ్డాయి. ఇప్పటి వరకు 3,62,774 సర్వే నెంబర్లను నమోదు చేశారు. ఈ సర్వే నెంబర్లకు సంబంధించి 6,14,760 ఎకరాలను ఈ–క్రాప్లో నమోదు చేశారు. రబీ సీజన్ ముగింపు దశకు చేరినప్పటికీ 52 శాతం వరకే మాత్రమే పంటల నమోదు పూర్తయింది. తెప్పోత్సవం.. భక్తిపారవశ్యం మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలోని పరిమళ తీర్థ పుష్కరిణిలో గురువారం రాత్రి ప్రహ్లాదరాయలు తెప్పోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శ్రీ మఠం మూల బృందవనం నుంచి పల్లకీలో ప్రహ్లాదరాయలు ఉత్సమూర్తిని ఊరేగింపుగా పరిమళ తీర్థ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల చేపట్టిన తెప్పోత్సవాన్ని తిలకేంచేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. పరిమళ పుష్కరిణి మండపంలో ముందుగా పూలతో పుష్పార్చన, అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రహ్లాదరాయలకు మహా మంగళ హారతులు చేపట్టి భక్తులు హారతి ని దర్శించుకున్నారు. అనంతరం పుష్కరిణిలో మండపం చుట్టూ ప్రహ్లాదరాయలు తెప్పోత్సవంలో విహరిస్తూ భక్తులను పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీర్వదించారు. -
‘చలో పోతిరెడ్డిపాడు’ గ్రాండ్ సక్సెస్
సాక్షి ప్రతినిధి కర్నూలు: చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గురువారం ఉదయం సభ.. బుధవారం మధ్యాహ్నం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుపడ్డారు.. అనుమతి నిరాకరించి సభ జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ కుట్ర పసిగట్టిన వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ నేత కాటసాని రాంభూపాల్రెడ్డితో పిటిషన్ వేయించింది. దీంతో సభకు కొన్ని గంటల ముందు అనుమతి లభించింది. ఈ క్రమంలో గోపాల్రెడ్డి పొలంలో సభ నిర్వహించుకునేందుదు ఆత్మకూరు డీఎస్పీ అనుమతిచ్చారు. దీంతో బుధవారం మధ్యాహ్నం తర్వాత నేతలు అక్కడికి చేరుకున్నారు.కాటసాని రాంభూపాల్రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ధారా సుధీర్ తదితరులు రాత్రంతా పనులు చేయించి తెల్లవారే సరికి వేదికను సిద్ధం చేశారు. నేతలంతా చేయి చేయి కలిపి సభను గ్రాండ్ సక్సెస్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ను పూర్తి చేయిస్తామని శపథం చేశారు. అయినా చంద్రబాబు చలించకపోతే జగన్ అధికారంలోకి రాగానే తక్కిన పనులు పూర్తి చేస్తామని ప్రతినబూనారు. సభకు వచ్చిన వారే కాదు ‘గ్రేటర్ రాయలసీమ’ పరిధిలోని ప్రతి ఇంట్లో సభను లైవ్లో వీక్షించారు. గురువారం గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏ పల్లెలో, ఎక్కడ నలుగురు గుమికూడినా రాయలసీమ లిఫ్ట్పైనే చర్చ జరిగింది.ఇంత తక్కువ వ్యవధిలో ‘సీమ’ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం నేతలు, కార్యకర్తలు, రైతులు సభకు వేలాదిగా తరలి రావడం గమనార్హం. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తలు తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీమకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నేతలు వివరిస్తున్నప్పుడు రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతులు‘చలో పోతిరెడ్డిపాడు’ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్సీపీ నేతలతో పాటు రైతులు సైతం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జనాలను తరలించేందుకు ఎవరూ కూడా ఒక బస్సు, లారీ ఏర్పాటు చేయలేదు. నందికొట్కూరు, పాణ్యం, ఆత్మకూరుతో పాటు నంద్యాల జిల్లాలోని నియోజకవర్గాలు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎవరికి వారు సొంత ఖర్చులతో తరలి రావడం విశేషం. గురువారం ఉదయం 10 గంటలకే రైతులు చేరుకున్నారు. నేషనల్ హైవే నుంచి పోతిరెడ్డిపాడు వరకు ట్రాఫిక్ జాం అయితే రైతులు పొలాల గట్ల వెంట నడుస్తూ వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ సభ పూర్తయ్యే వరకూ ఓపిగ్గా నేతల ప్రసంగాలను ఆలకించారు.కుర్చీలు లేకపోతే వేదిక చుట్టూ వేల సంఖ్యలో నిల్చుని ఆద్యంతం నేతల ప్రసంగాలు విన్నారు. దీన్నిబట్టి ప్రభుత్వం ఎంతగా అణిచి వేయాలని చూసినా, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు తమకు ఎంత విలువైందో చాటి చెప్పారు. ప్రాజెక్టు కోసం ఎందాకైనా ఉద్యమించాలనే కసి, పట్టుదల స్పష్టంగా కన్పించింది. సభ నిర్వాహకులను సజ్జల, పెద్దిరెడ్డి తదితర నేతలు అభినందించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, రమేష్ బాబు, రామసుబ్బారెడ్డి, కల్పలతా రెడ్డి, కర్నూలు పార్లమెంటు పరిశీలకులు గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, బ్రిజేంద్రా రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, కేతిరెడ్డి వెంకటరావిురెడ్డి, దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, అంజద్ బాషా, రఘురామి రెడ్డి, అన్నా రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, కర్నూలు మేయర్ బీవై రామయ్య, కోడుమూరు ఇన్చార్జి ఆదిమూలపు సతీష్, కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
ఓటుకు నోటు భయం.. రాయలసీమ లిఫ్ట్ తాకట్టు: సజ్జల
సాక్షి, కర్నూలు జిల్లా: పోతిరెడ్డి పాడు నిరసన ఆరంభం మాత్రమేనని.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. సీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారంటూ మండిపడ్డారు. ఇవాళ చలో పోతిరెడ్డిపాడుకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. సీమ లిఫ్ట్ పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. చలో పోతిరెడ్డిపాడుకు ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.ముందుగా వైఎస్సార్సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పలువురు నేతలు పోతిరెడ్డిపాడును సందర్శించారు. అనంతరం పోతిరెడ్డిపాడు దగ్గర నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయలసీమ జిల్లాల నుంచి బహిరంగ సభకు రైతులు తరలివచ్చారు. ఈ సభలో వైఎస్సార్సీపీ సీమ జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ మంత్రులు శైలజానాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి, విశ్వేశ్వరరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు మంగమ్మ శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, కంగాటి శ్రీదేవి, బుట్టా రేణుక పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతలను నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేస్తోంది. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని నినదిస్తోంది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జిస్తోంది. ‘తీరుమారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్’ అంటూ హెచ్చరిస్తోంది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిజాలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు?. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేకపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు. తెలంగాణ మాదిరే రాయలసీమకు 800 అడుగుల స్థాయిలోనే శ్రీశైలం నీరు రావాలి. చంద్రబాబుకు ఓటుకు నోటు భయం ఉంది. హైదరాబాద్లో ఆస్తులను కాపాడుకునేందుకు రాయలసీమ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే కారణంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దారుణం. రైతులకు సమృద్ధిగా నీరందిస్తేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్ ఏనాడో గుర్తించారు. సీమ తాగు సాగు నీటి కష్టాలకు ఏకైక పరిష్కారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే. 80 శాతం పూర్తయిన ప్రాజెక్టును ఆపేయడం మహాపాపం అని చంద్రబాబు గుర్తించాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబుకు రాయలసీమ ప్రయోజనాలు పట్టవు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్కు తాకట్టు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల్లోనే తెలంగాణ తీసుకుంటూ ఉంటే రాయలసీమ ఎందుకు తీసుకోకూడదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఇప్పుడు అర్ధాంతరంగా పనులు నిలిపివేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ సుభిక్షంగా ఉందంటే అది ఒక్క వైఎస్సార్ వలనే.. రాయలసీమ ప్రజలు నిత్యం సుభిక్షంగా ఉండాలని వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకువచ్చారన్నారు. రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపారని సతీష్రెడ్డి మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆగలేదు. కరువు సమయంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వైఎస్ జగన్ తెచ్చిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు అపాల్సి వచ్చింది?. రేవంత్ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు సమాధానం చెప్పాలి. జీఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎంఎస్ఎస్కి పిడికెడు మట్టి తీయలేదు. రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. రాయలసీమ రైతులపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోంది. పోతిరెడ్డిపాడు నిరసన ఆరంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం’’ అని సతీష్రెడ్డి హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏనాడు రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్, హైకోర్టు తరలించుకు పోయారు.శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టాడన్నారు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో చంద్రబాబు మిగిలి పోతారన్నారు. రాయలసీమకు మేలు చేసిన ఏకైక కుటుంబం వైఎస్సార్ మాత్రమే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయాలని వైఎస్ జగన్ శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలి. సీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించాలి. -
నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో త్వరలో జన ఔషధి
నంద్యాల: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో జన ఔషధి మెడికల్ షాప్ అందుబాటులోకి రానుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి జన ఔషధి మెడికల్ షాప్ రూమును బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన మందులను తక్కువ ధరకే ప్రతి ఒక్కరికీ అందించాలనే లక్ష్యంతో ఈ షాపులను ప్రారంభిస్తోందన్నారు. రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ రాజకుమారి, జిల్లా చైర్మన్ దస్తగిరి, జిల్లా సెక్రెటరీ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జిలాని బాషా, రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్బాష, రెడ్ క్రాస్ డీఎఫ్ఓ సమీ, ఫార్మసిస్టు ఇంద్రజ, మున్సిపల్ ఇంజినీర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. -
దిగుబడి భళా..ధర డీలా!
మండల పరిధిలోని ముక్కమల్ల గ్రామంలో ఓ రైతు శనగ పంట ఇరగ్గాసింది.ఈ ఏడాది రబీ సీజన్లో వేసిన శనగ విత్తనానికి వాతవారణం అనుకులించడంతో రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చింది. ముక్కమల్ల గ్రామానికి చెందిన పోచ వెంకట రామిరెడ్డి రైతు ఐదు ఎకరాల్లో శనగ సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టాడు. నూర్పిడి చేశాక ఎకరాకు 14 క్వింటాలు దిగుబడి వచ్చింది. మంచి దిగుబడి అయినప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు దిగాలు చెందుతున్నాడు. ప్రభుత్వ స్పందించి శనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు – సంజామల -
అత్యాచార నిందితులను అరెస్టు చేయాలి
కర్నూలు(సెంట్రల్): కర్నూలు మండలం దిన్నెదేవరపాడు పరిధిలోని అంబేడ్కర్ నగర్లో మహిళపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట ఐద్వా, కేవీపీఎస్, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి.నిర్మల, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్బాబు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాఘవేంద్ర, ఐద్వా జిల్లా కార్యదర్శి కె.అరుణ, బాధితురాలి కోడళ్లు, కృషమ్మ, మేరీ మాట్లాడుతూ.. జనవరి 30వ తేదీన అంబేడ్కర్ నగర్లో 50 ఏళ్ల వృద్ధురాలిపై అత్యంత పాశవికంగా కళ్లలో కారం చల్లి.. చేతులు కట్టేసి ఇద్దరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక ఆమెను కర్రలు, రాళ్లతో కొట్టి హింసించారని, ఇది మానవ జాతికే అవమానకరమన్నారు. నిందితులకు మరో మహిళ సహకరించడం దురదృష్టకరమని, అత్యాచారం జరిగి ఆరు రోజులవుతున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం తగదన్నారు. పోలీసులే కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ జోక్యం చేసుకొని నిందితులను అరెస్టు చేయాలని లేకపోతే గ్రామస్తులతో కలసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. -
పరమేశ్వరా.. నిర్లక్ష్యం చూడవా!
శ్రీశైలంటెంపుల్: మరో మూడు రోజుల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భక్తుల రాక కూడా మొదలైంది. అయితే క్షేత్రంలో ఉత్సవ ఏర్పాట్లు ముందుకు సాగడం లేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. రెండుమూడురోజుల ముందే ఉత్సవ శోభ కనిపించేది. ప్రస్తుతం ఎక్కడ చూసినా నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీంతో పరమేశ్వరా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఏవీ అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుకు సాగని పనులు శ్రీశైలంలో జర్మన్షెడ్లతో తాత్కాలిక క్యూ కంపార్ట్మెంట్, ప్రధాన ఆలయానికి ఎదురుగా ఇరువైపులా భక్తులు సేదతీరేందుకు జర్మన్ షీట్లతో భారీ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద టెంజైల్ షెడ్తో మరో క్యూ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. అలాగే శివదీక్ష శిబిరాల వద్ద తాత్కాలిక ఏర్పాట్లు, మరుగుదొడ్లు, టాయిలెట్లు, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఆలయ గోపురాలకు, ఉభయ దేవాలయాలకు విద్యుద్దీకరణ, చలువ పందిళ్లు, షామియానాలు, ఉద్యానవనాల్లో, ఆరుబయలు ప్రదేశాల్లో షామియానాలు ఏర్పాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు, ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు ప్రధానరోడ్డుకు ఇరువైపులా గ్రావెల్తో చదును చేసే పనులు, పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పాతాళగంగ వద్ద ఇనుప మెష్తో బారికేడింగ్, ప్రధాన రోడ్లలో డివైడర్లకు పెయింటింగ్, తాత్కాలిక టాయిలెట్లు తదితర పనులు ఇంకా పూర్తి కాలేదు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు కూడా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇంకా ఇవ్వలేదు. మరో మూడు రోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అప్పటిలోగా ఈ పనులన్నీ పూర్తవుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. సమీక్షలకే సరి శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 8వ తేది నుంచి 18వ తేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం విస్తృ త ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. దేవస్థాన ఈఓ ఆధ్వర్యంలో రెండు సార్లు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సారి, ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగంతో సహా దేవస్థాన అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించి, ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలు చేశారు. క్షేత్ర పరిధిలో భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. అయినా, ఏర్పాట్లలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
ఆటోలతో విన్యాసాలు చేసి.. పోలీసులకు చిక్కి!
● ముగ్గురు యువకులు అరెస్టు.. ఆటోలు సీజ్ కర్నూలు: కర్నూలు–హైదరాబాద్ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆటోలతో ముగ్గురు యువకులు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ మూడు పోలీసు బృందాలను రంగంలోకి దింపి మమతా నగర్కు చెందిన శివ మల్లేష్, పేరపోగు అఖిల్, అశోక్ నగర్లోని శ్రీకృష్ణ కాలనీకి చెందిన గనమూరు జయసింహలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈనెల 1వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో పై ముగ్గురు నిందితులు పంచలింగాల సర్కిల్ దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఆటోలు నడుపుతూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. స్థానికుల ఫిర్యాదుతో బుధవారం వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి ఆటోలను తదుపరి చర్యల నిమిత్తం రవాణా శాఖకు అప్పగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ సరదా కోసం రోడ్లపై వాహనాలతో విన్యాసాలు చేస్తే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. -
మల్లన్న దర్శనానికి జర్మనీ దేశస్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనానికి జర్మనీ దేశస్తులు తరలి వచ్చారు. బుధవారం ఆ దేశానికి చెందిన సుమారు 20 మందితో కూడిన బృందం శ్రీశైలానికి చేరుకొని ఉచిత క్యూలైన్ ప్రవేశ ద్వారం నుంచి సాధారణ భక్తుల మాదిరిగానే దర్శనానికి వెళ్లారు. జ్యోతిర్లింగాల యాత్రలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం జరిగిందని వారు తెలిపారు. విదేశీ భక్తులను చూసిన స్థానికులు, యాత్రికులు వారితో మాటామంతి కలిపి, ఫొటోలు దిగేందుకు అసక్తి చూపారు. ప్లాస్టిక్ ప్లేట్ల వాహనాలు సీజ్ శ్రీశైలంప్రాజెక్ట్/ఆత్మకూరు రూరల్: శ్రీశైలం శిఖరేశ్వరం చెక్పోస్ట్ వద్ద బుధవారం ప్లాస్టిక్ ప్లేట్లను తరలిస్తున్న రెండు వాహనాలను శ్రీశైలం రేంజ్ అటవీ అధికారి పరమేశు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వినుకొండకు చెందిన తిరుమలశెట్టి, శ్రీకాంత్ టాటా ఇంట్రాల్ ఏపీ 39 ఏజె 4604 వాహనంలో 6,000 ప్లాస్టిక్ ప్లేట్లు శ్రీశైలంలోని భ్రామరి హోటల్కు తెస్తున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన పల్లె శివరామకృష్ణ అనే మరో వ్యక్తి శ్రీశైలంలోని రెడ్ల అన్నదాన సత్రానికి 1,30,000 ప్లాస్టిక్ ప్లేట్లను తెస్తున్నాడు. శిఖరేశ్వరం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు ఆ వాహనాలను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అటవీ అధికారి మాట్లాడుతూ నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రాంతమని తెలిపారు. ఇటువంటి ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు నిషిద్ధమని, ఎవరైనా ఇటువంటి వస్తువులు కలిగి ఉన్నా, తరలించినా అటవీ చట్టాల ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. రేపు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా కర్నూలు(సెంట్రల్): జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముథూట్, అపోలో ఫార్మసీలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఆయా ఉద్యోగాలకు పది నుంచి డిగ్రీ, ఫాం(బీడీఎం) చదివిన వారు అర్హులని, వయసు 21–35 సంవత్సరాలు ఉండాలన్నారు. అభ్యర్థులు ధ్రువ పత్రాలు, ఫొటోలతో హాజరుకావాలని పేర్కొన్నారు. వ్యక్తి బలవన్మరణం డోన్ టౌన్ : పట్టణంలోని కొండపేటకు చెంది న రామసుబ్బయ్య (41) మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈయన కొన్నేళ్ల నుంచి తాగుడుకు బానిసై ఏం పని చేసేవాడు కా దు. అయితే, ఉన్నట్టుండి మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులుఓ గదిలో నిద్రిస్తుండగా మరో గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రామసుబ్బయ్య అక్క లక్ష్మీదేవి ఫిర్యాధు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుష్టును నిర్మూలిద్దాం గోస్పాడు: కుష్టువ్యాధిపై అవగాహన పెంచుకొని నిర్మూలిద్దామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. బుధవారం నంద్యాలలో జిల్లా కుష్టు, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 13వ తేదీ వరకు స్పర్శ్ లెప్రసీ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంచార వాహనం ద్వారా ఊరూరా ప్రజలకు కుష్టుపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం నంద్యాల: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ ప్రోత్సాహం అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 491 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానం ద్వారా 474 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 17 దరఖాస్తులను సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలన్నారు. -
చైన్ స్నాచర్ల అరెస్ట్
ఆలూరు రూరల్: చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. ఆలూరు పోలీసు స్టేషన్ ఆవరణలో బుధవారం ఎస్ఐ మన్మధ విజయ్తో కలిసి సీఐ రవి శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గత నెల జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పట్టణంలోని ఎల్లార్తి రోడ్డులో నివాస ఉంటున్న సరోజమ్మ అనే మహిళ ఇంటికి ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి భర్త ఫోన్ నంబర్ అడిగి ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూడు రోజుల్లో కేసు ఛేదించారు. డోన్ మండలం తాడూరు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి, రుద్రవరం మండల నందనపల్లె గ్రామానికి చెందిన తిరుపతి సురేష్ స్నేహితులు. నేర ప్రవృత్తి కలిగిన వీరే ఆలూరు వచ్చి సరోజమ్మ మెడలోని బంగారు చైను దోచుకెళ్లినట్లు గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం ఆలూరు మండలంలోని అంగసకల్లు గ్రామ రోడ్డులో నిందితులు కనిపించడంతో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ చైన్ స్నాచర్లపై తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాలోని ఉండవల్లి పీఎస్లో రౌడీ షీటర్ ఉందని, అలాగే వివిధ పోలీసు స్టేషన్లలో 5 కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు వెల్లడించారు. -
వైద్యం వికటించి శిశువు మృతి!
నందికొట్కూరు: పట్టణంలోని ఓ వైద్యశాలలో వైద్యం వికటించి ఆరునెలల శిశువు మృతి చెందాడు. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కుమ్మరి పేటకు చెందిన షాకీర్బాషా, అజిదాబాను దంపతుల కుమారుడు అబ్దుల్ రహిమాన్ దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం బాలుడిని తల్లిదండ్రులు స్థానిక అనసూయ హాస్పటల్కు తీసుకెళ్లారు. మూడు రోజుల నుంచి డాక్టర్ శ్రీనివాసులు వైద్యం అందిస్తున్నారు. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి ఆ బాలుడు మృతి చెందాడు. వైద్యం వికటించడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. టౌన్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి జోక్యం చేసుకొని విచారించి డాక్టర్ను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
ఏటీఎం దొంగ దొరికాడు
నంద్యాల: బ్యాంకు పాసుపుస్తకంలో లావాదేవీల ప్రింటింగ్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడిని ఏ మార్చి ఏటీఎం ద్వారా రూ.1.24లక్షలు నగదు కాజేసిన దొంగ పట్టుబడ్డాడు. నంద్యాల ఏఎస్పీ మందా జావలి తెలిపిన మేరకు వివరాలు.. గత నెల 29వ తేదీన శ్రీనివాససెంటర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్దకు పట్టణంలోని వీసీ కాలనీకి చెందిన వృద్ధుడు సుబ్బరాయుడు బ్యాంకు పాసు పుస్తకంలో ప్రింటింగ్ కోసం వచ్చాడు. అక్కడే కాపుకాచి ఉన్న వెల్దూర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దండన్నగారి సిద్దేష్ ఆ వృద్ధుడిని మాటల్లో పెట్టి నగదు డ్రా చేసుకుంటే ప్రింటింగ్ వస్తుందని నమ్మబలికించాడు. దీంతో ఆ వృద్ధుడు రూ.1000 తీసి ఇవ్వమని ఏటీఎం ఇచ్చి పిన్ నంబరు చెప్పాడు. డబ్బు డ్రా తర్వాత వృద్ధుడికి నకిలీ ఏటీఎం ఇచ్చాడు. అతను ఇంటి వద్దకు వెళ్లిన కొద్ది సేపటికే బ్యాంకు ఖాతాలో రూ.1.24 లక్షలు డ్రా చేసినట్లు మెసేజ్లు వచ్చాయి. దీంతో బాధితుడు వెంటనే వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బ్యాంకు వద్ద, ఏటీఎం లోపల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడిని గుర్తించి బుధవారం నంద్యాల బస్టాండ్ సమీపంలో పట్టుకున్నారు. నిందితుడు ఇదే తరహాలో కర్నూలు, ఆదోని, అనంతపురం, చిత్తూరు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోసాలకు పాల్పడినట్లు 11 కేసులు ఉన్నాయని ఏఎస్పీ వెల్లడించారు. ఏటీఎంల వద్దకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇవ్వడం, పిన్నంబరు చెప్పడం చేయవద్దని ఆమె సూచించారు. అలాగే బ్యాంకుల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100, 112 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్, వారి సిబ్బందిని ఈ సందర్భంగా ఏఎస్పీఅభినందించారు.


