Kurnool
-
పిల్లల నుంచి జీవన భృతి పొందవచ్చు
కర్నూలు(టౌన్): వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007 ప్రకారం వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి జీవన భృతిని పొందే హక్కును వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. ఈ చట్టం ఆదేశాలను పిల్లలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష తప్పదన్నారు. సోమవారం స్థానిక బి.క్యాంప్లోని మన వృద్ధుల ఆశ్రమంలో ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం నిర్వహించారు. వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ వృద్ధుల పట్ల జరుగుతున్న వివక్ష, వేధింపులు, శారీరక, మానసిక, ఆర్థిక నిర్లక్ష్యంపై సమాజంలో అవగాహన కల్పించడం, అలాగే తగిన రక్షణ కల్పించడమే వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవ లక్ష్యమన్నారు. వృద్ధులకు కావలసిన ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100 ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. లీగల్ సర్వీసెస్ సభ్యులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, న్యాయవాది పాపా రావు, శ్రీరాములు, మురారి శంకరప్ప, బీమా ఎల్లాగౌడ్, త్రినాథ్ కుమార్ పాల్గొన్నారు. -
అదుపుతప్పిన ట్రావెల్ బస్సు
పాణ్యం: నెరవాడ మెట్ట ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన రమణ ట్రావెల్ బస్సు సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు స్థానిక ఆర్జీఎం కళాశాల వద్ద వెళ్తుండగా టైర్ ఒక్కసారిగా పగలడంతో అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్పైకి దూసుకెళ్లి ఆగింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. బస్సుల్లో 30 మంది ప్రప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హైవేపై ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. బస్సును డివైడర్ పైనుంచి పక్కకు తొలగించారు. -
వ్యక్తిని బలిగొన్న పాత కక్షలు
● తన పొలం గుండా మట్టి తరలింపును అడ్డుకోవడంతో దాడి ● తీవ్రంగా గాయపడి మృత్యువాత సి.బెళగల్: రెండు కుటుంబాల మధ్య నెలకొన్న పాతకక్షలు వ్యక్తి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఘటనపై సి.బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్రాజు సమాచారం మేరకు వివరాలు.. మండల పరిధిలోని పోలకల్ గ్రామానికి చెందిన మల్లెపోగు అమర్, పూలదాసు జగన్ (39) కుటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన పొలంగుండా మట్టిని తరలించుకుంటున్నారంటూ జగన్ వర్గం వారు అమర్ వర్గం సభ్యులకు అడ్డుపడి ఘర్షణకు దిగారు. ఆగ్రహించిన అమర్ వర్గం సభ్యులు రాళ్లు, కట్టెలతో దాడి చేయగా జగన్ తలకు తీవ్ర రక్తగాయం అయ్యింది. బాధితుడు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసే చర్యలు చేపట్టారు. గాయపడిన జగన్ను కుటుంబ సభ్యులు పెంచికలపాడు ఆసుపత్రికి తలించగా కోలుకోలేక మృతిచెందాడు. ఘటనపై మృతుడి తల్లి సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే ఒకప్పటి ఫ్యాక్షన్ గ్రామంగా పేరొందిన పోలకల్లో దాడి ఘటనలో వ్యక్తి మృతి చెందడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
గుండ్రేవుల, ఆర్డీఎస్పై సాకులు
● ‘సాక్షి’ ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఇరిగేషన్ మంత్రికర్నూలు సిటీ: రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా పశ్చిమ పల్లెలకు తాగు, సాగునీటి సదుపాయం కల్పిస్తామని ప్రతి ఎన్నికల్లో హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం మోసగిస్తోంది. రెండేళ్లు గడిచినా అమలుపై దాటవేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సోమవారం జిల్లాకు వచ్చిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ శాఖ కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ కార్యాలయంలో జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులు, ప్రతిపాదిత ప్రాజెక్టులపై సమీక్షించారు. పలు పనులను నాయకులు మంత్రి దృష్టికి తీసుకురాగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీర్లకు సూచించారు. ఆ తరువాత మంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతుండగా.. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పూర్వోదయం పథకం కింద రాయలసీమలో పురోగతిలోని ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు చేర్చలేకపోయారని ‘సాక్షి’ ప్రశ్నించగా.. పూర్వోదయం కింద ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు చేర్చామంటూ దాటవేశారు. ● డ్రీప్ కింద ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రిని డ్రీప్ కింద శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ ఫూల్ కోసం రూ.253 కోట్లతో మీ ప్రభుత్వం ఎందుకు ప్రతిపాదనలు పంపలేదని ‘సాక్షి’ ప్రశ్నించగా సమాధానం చెప్పలేక రాయలసీమ మేలుకు రాష్ట్ర బడ్జెట్లో 51 శాతం ఖర్చు చేయనున్నామని సమర్థించుకున్నారు. ● అలగనూరు, జీఆర్పీ స్కీంలకు మరమ్మతులు చేయించడం లేదని ‘సాక్షి’ మంత్రిని ప్రశ్నిస్తే.. రాయలసీమలో హార్టికల్చర్ను అభివృద్ధి చేయనున్నామన్నారు. ● రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో జిల్లాలో కేవలం వేదావతి లిఫ్ట్ మాత్రమే చేర్చారని, మిగిలినవి ఎందుకు చేర్చలేకపోయారని, కోడుమూరు నియోజకవర్గంలో పులకుర్తి లిఫ్ట్ కింద పంట కాల్వలు ఎందుకు తీయడం లేదని ‘సాక్షి’ మంత్రిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానలు చెప్పడం గమనార్హం. ● రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు, కర్నూలు పశ్చిమ పల్లెకు జీవనాడిగా చెబుతున్న గుండ్రేవుల ప్రాజెక్టుపై ‘సాక్షి’ ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పకుండానే మంత్రి మొహం చాటేశారు. -
ఫార్మాసిస్ట్ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం
● పోలీస్ పీజీఆర్ఎస్కు 119 ఫిర్యాదులుకర్నూలు(టౌన్): కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఫార్మాసిస్టు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.85 లక్షలు తీసుకుని మోసం చేసిన ఫయాజ్ బాషాపై చర్యలు తీసుకోవాలని గోనెగండ్ల మండలానికి చెందిన మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలు, వినతులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదులన్నింటినీ విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, మస్తాన్ వలి పాల్గొన్నారు. -
తుంగభద్రకు జలకళ
నందవరం: ఎగువ ప్రాంతాలైన మంత్రాలయం, నందవరం, కోసిగి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి తుంగభద్రమ్మ జలకళను సంతరించుకుంది. సోమవారం మండల పరిధిలోని నాగలదిన్నె బ్రిడ్జి వద్ద వరద నీరు ప్రవహించింది. నిన్నటి వరకు వెలవెలబోయిన తుంగభద్ర నది నేడు కనువిందు చేస్తోంది. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులను అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మలతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సరైన ఎండార్స్మెంట్తోనే రీఓపెన్ కేసులను తగ్గించవచ్చని, జిల్లా అధికారులు రోజూ పీజీఆర్ఎస్ సైట్ను ఓపెన్ చేసుకొని సరైనా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. జిల్లాలో పెండింగ్ కారుణ్య నియామకాలకు సంబంధించిన కేసులను పరిష్కరించేందు కు 15 రోజుల్లోనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు రామసుబ్బయ్య, శివప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. జీవాలకు చిటుకు వ్యాధి టీకాలు కర్నూలు(అగ్రికల్చర్): సన్న జీవాలలో చిటుకు వ్యాధి నివారణకు ముందు జాగ్రత్తగా టీకాలు వేసే కార్యక్రమం జిల్లాలో మొదలైనట్లు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు టీకాల కార్యక్రమం కొనసాగుతుందని, గొర్రెల పెంపకందారులు విధిగా జీవాలకు చిటుకు వ్యాధి(ఈటీ) టీకాలు వేయించాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకస్మాత్తుగా చనిపోవడం, మేత తినడం మానేయడం, కడుపునొప్పి/ఉబ్బరం, విరేచనాలు, నోటి నుంచి నురుగ, వణుకు/ఫిట్స్ రావడం చిటుకు వ్యాధి లక్షణాలన్నారు. ఉచితంగా వేసే టీకాలను గొర్రెల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 24న జొన్నగిరికి సీఎం చంద్రబాబు కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబు ఈనెల 24న జిలాల్లోని తుగ్గలి మండలం జొన్నగిరికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. అక్కడి జియో మైసూర్ గోల్డ్మైన్స్ను సీఎం సందర్శిస్తారన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సోమవా రం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు. -
మహానందిలో భక్తుల సందడి
మహానంది: మహానందిలో ఆదివారం భక్తుల సందడి కొనసాగింది. సెలవురోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చారు. భక్తులు ముందుగా కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయంలోని కల్యాణ మండపంలో ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శ్రీ గంగ, కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లకు కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. -
పాఠశాల బియ్యం మాయంపై విచారణ
ఆదోని: పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలలో సన్న బియ్యం మాయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. బియ్యం మాయం విషయాన్ని ఆదివారం సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సోమవారం ఉదయం 9.30 గంటలలోపు రిపోర్టు సమర్పించాల్సిందిగా ఆదోని ఎంఈఓ–2 కె.రంగన్నను ఆదేశించారు. పట్టణంలో మూడు ఉన్నత పాఠశాలలుండగా నెహ్రూ మెమోరియల్, మున్సిపల్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ఫయాజ్, సుధాకర్బాబును విచారణకు పిలిచినట్లు ఎంఈఓ వెల్లడించారు. సోమవారం ఆ ఇద్దరిని విచారించి నివేదికను కలెక్టర్, డీఈఓకు పంపుతానని తెలిపారు. -
నేటి నుంచి ఇంటింటా ‘సర్’ సర్వే
● ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్నికల సంఘంకర్నూలు(సెంట్రల్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో సోమవారం నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సర్వే ప్రారంభం కానున్నది. ఈ మేరకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ‘సర్’ సర్వేలో పాల్గొనే బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్ఓలు), బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఎన్యుమరేషన్ ఫామ్లను అన్ని నియోజకవర్గాలకు పంపింది. సర్వేలో భాగంగా ఒక్కో కుటుంబాన్ని బీఎల్ఓలు కనీసం మూడు సార్లు సందర్శించి వివరాలు సేకరించాలి. ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫా మ్ను ప్రతి ఓటరు కచ్చితంగా పూరించి ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు అందజేస్తేనే ఓటరు జాబితాలో పేరు ఉంటుంది. ఓటరుకే పరీక్ష! కర్నూలు జిల్లాలో 2026 మార్చి 31వ తేదీ నాటికి 20,83,327 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 10,25,735 మంది పురుషులు, 10,57,272 మంది మహిళలు, 320 మంది ఇతరులు, 122 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. వీరంతా ఎవరికీ వారు ఓటర్లుగా ఉన్నట్లు రుజువు చేసుకోవాల్సి ఉంది. 2002, 2025 ఓటరు జాబితాలను పోల్చి చూస్తారు. ప్రస్తుతం 2025 జాబితాలో ఓటరుగా ఉన్నా వారి ఆనవాళ్లను 2002 జాబితాలోని వారి తాతలు, అవ్వలు, అమ్మలు, నాన్నల వివరాలను పోల్చి చూస్తారు. 2002 జాబితా ఆనవాళ్లు లేకపోతే వారిని ఓటరు మ్యాపింగ్ ప్రక్రియకు దూరంగా ఉంచి తొలగించే ప్రయత్నం చేస్తారు. షెడ్యూల్.. ● జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటా తిరిగి ఎన్యుమరేషన్ ఫామ్–2ను ఇచ్చి దానిని పూరించుకొని తిరిగి తీసుకుంటారు. ● ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ కూడా జరుగుతుంది. ● జూలై 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు వివరాలను పరిశీలన చేస్తారు. ● జూలై 21న ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ● అప్పటి నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు దానిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ● జూలై21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కారం చేస్తారు. ● సెప్టెంబర్ 22న తుది ఓటరుజాబితా ప్రకటిస్తారు. జిల్లాలో జూన్ 15 నుంచి సర్ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ఫామ్–2ను పూరించి ఇవ్వాలి. దాని ఆధారంగానే ఓటరు జాబితాలో పేర్లు నమోదు అవుతాయి. 2026 జూలై 1వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. ఓటు అనేది భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కు. దానిని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ ఏ.సిరి, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి -
విత్తనాలు అందించడంలో చేతులెత్తేసిన ప్రభుత్వం
వర్షాలు కురుస్తున్నా... రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. వేరుశనగ, కంది విత్తుకోవడానికి చక్కటి అదను అయినప్పటికీ విత్తనం అందక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా అవసరాలకు వేరుశనగ విత్తనం కాయలను కడప నుంచి తెప్పిస్తున్నారు. వర్షాలతో వాగులు పొంగిపొర్లడంతో పలు మండలాలకు వేరుశనగ చేరని పరిస్థితి ఏర్పడింది. విత్తన పంపిణీపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం రైతులకు శాపంగా మారింది. వేరుశనగ, కంది విత్తనాలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే దానిపై వ్యవసాయ శాఖకు కూడా సమాచారం లేదు. యూరియా వినియోగాన్ని కట్టడి చేసేందుకు యాప్ ద్వారా అమ్మకాలు చేపట్టడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ సమస్యలు వేధిస్తున్నాయి. ఆలూరు సమీపంలో ఉప్పొంగిన కట్రవంకవాగుకర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వర్షాలు దంచికొట్టాయి. ఒక్క రోజులోనే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రధాన పట్టణాలు, గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కర్నూలు జిల్లాలో సగటున 44.8 మి.మీ., నంద్యాల జిల్లాలో 21.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగిలో రికార్డు స్థాయిలో 100.6 మి.మీ.( 10.6 సెం.మీ), సి.బెళగల్లో అత్యల్పంగా 16.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, నంద్యాల జిల్లాలో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కరిశాయి. నంద్యాల జిల్లా బేతంచెర్లలో అత్యధికంగా 77.2 మి.మీ., అత్యల్పంగా శ్రీశైలంలో 1.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రహదారులు, వంతెనలపై ప్రమాదకరంగా వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తోడు జిల్లాలోని కోసిగి, ఆలూరు, హొళగుంద, పెద్దకడుబూరు, హాలహర్వి తదితర మండలాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో వాగులు, వంకలు ఏకమయ్యాయి. ఆదోనిలో లోతట్టు ప్రాంతాలు జలమయం ఆదోనిలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లంగరుబావి వీధి, మున్సిపల్ మెయిన్ రోడ్డు, శ్రీనివాసభవన్, పరిశాముల్ల ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఆలూరు మండలంలో కురిసిన కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆలూరు–గుంతకల్ మధ్య వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. హాలహర్వి మండలంలోని గూళ్యం–సిద్ధాపురం మధ్య వాగులు పెద్ద ఎత్తున ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మిగనూరు మండలంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి కురిసిన వర్షాలకు కడివెళ్ల సమీపంలోని కప్పలవాగుకు భారీగా వరద నీరు చేరి పొంగిపొర్లడంతో ఎమ్మిగనూరు– పత్తికొండ పట్టణాల మధ్య రవాణా స్తంభించిపోయింది. గోనెగండ్ల మండలం గంజిహళ్లి, అగ్రహారం గ్రామాల మధ్య వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలూరు– చిప్పగిరి మధ్య కళ్లెవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గుంతకల్– చిప్పగిరి మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదోని–గుంతకల్ మధ్య ఉన్న వంతెనలపై ఉధృతంగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కౌతాళం మండలంలో ఒకవైపు వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలం కురిసిన వర్షం (మి.మీ.లలో) కోసిగి 100.6 ఆలూరు 95.2 బేతంచెర్ల 77.2 హొళగుంద 75.4 పెద్దకడుబూరు 70.4 ఆదోని 62.4 హాలహర్వి 57.6 డోన్ 57.0 దేవనకొండ 50.8 మంత్రాలయం 50.2 చిప్పగిరి 50.2 ఆస్పరి 50.0 మద్దికెర 48.8 అవుకు 46.2 పత్తికొండ 45.6 ఎమ్మిగనూరు 44.6 చాగలమర్రి 43.2 తుగ్గలి 42.4 నందవరం 37.4 కౌతాళం 36.0 ప్యాపిలి 35.4 వెల్దుర్తి 34.4 జిల్లాలో పొంగిపొర్లిన వాగులు, వంకలు ప్రధాన పట్టణాల మధ్య స్తంభించిన రాకపోకలు ఆదోనిలో లోతట్టు ప్రాంతాలు జలమయం పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం -
కూలిన పాత ఫ్లైఓవర్ ప్రహరీ
ఆదోని: ఆదోని పట్టణంలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రహరీ గోడ ఓ భాగం పదిహేను అడుగుల మేర కూలిపోయింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో వాహనాలు, పాదాచారుల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికుల కథనం ప్రకారం రాత్రంతా కురిసిన భారీ వర్షానికి బ్రిడ్జిపై నీరు నిల్వ ఉండటంతో పాటు ప్రహరీగోడ నిర్మాణం బలహీనపడి ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాలు కింద ఉన్న దుకాణాల ముందు పడిపోయాయి. ఉద యం ఈ దృశ్యాన్ని గమనించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గోడ కూలిన ప్రాంతంలో వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే సాంకేతిక నిపుణులతో తనిఖీలు నిర్వహించి ఫ్లైఓవర్ భద్రతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
భవిష్యత్తు వైఎస్సార్సీపీదే
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిచిప్పగిరి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అన్ని పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. భవిష్యత్ వైఎస్సార్సీపీదే అని తెలిసి పార్టీ లో చేరుతున్నారని చెప్పారు. దేవనకొండలోని 20 కుటుంబాలు, కుంకనూరు గ్రామానికి చెందిన 10 కుటుంబాలు లోక్సత్తా పార్టీ నుంచి ఆదివారం వైఎస్సార్సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా చిప్పగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుసినె విరూ పాక్షి వారిని పార్టీ కండువా వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికల్లో సుపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. కూటమి రెండేళ్ల పాలనలో స్కాములు, అప్పులు, మోసాలు తప్ప ఏమీలేదన్నారు. చివరకు డీఎస్సీలో కూడా అక్రమాలకు పాల్పడి డబ్బులు వసూలు చేసే స్థాయికి దిగజారారని మండి పడ్డారు. చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అన్ని రంగాల్లో అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందన్నారు. అధికార పార్టీ చేస్తున్న మోసాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో దేవనకొండ మండలం నుంచి లోక్సత్తా ఆదోని డివిజన్ ఇన్చార్జ్ చాకలి శేఖర్, లోక్ సత్తాపార్టీ నాయకులు ఓబులేసు, రంగన్న, నాగరాజు, వీరేష్, పెరవలయ్య, ప్రసాద్, రమేష్, బైరవకుంట చంద్రబాబు, దొర స్వామి, గుండు వీరాంజనేయ, శ్రీను తదితరులు ఉన్నారు. -
తెగిన యాటకల్లు బ్రిడ్జి
ఆస్పరి: భారీ వర్షాలకు యాటకల్లు సమీపంలో ఉన్న బ్రిడ్జి తెగిపోయింది. దీంతో యాటకల్లు, తొగలుగల్లు, దొడగొండ, తురువగల్లు, ఐనకల్లు, కై రుప్పల, కారుమంచి గ్రామాల నుంచి ఆస్పరికి ఎమ్మిగనూరు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది వర్షాలకు ఈబ్రిడ్జి తెగిపోయింది. యాటకల్లు పంచాయితీ వారు తాత్కాలికంగా గరసు వేసి రాకపోకలు వచ్చేలా చేశారు. ప్రస్తుతం భారీ వర్షానికి తెగిపోవడంతో మండల కేంద్రమైన ఆస్పరికి, ఎమ్మిగనూరుకు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి జిల్లా కలెక్టర్కు స్వయంగా వెళ్లి చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పటికై నా అధికారులు శాశ్వతంగా యాటకల్లు బ్రిడ్జి నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
సూగూరు రిజర్వాయర్కు గండి
మంత్రాలయం రూరల్: గురురాఘవేంద్ర పాజెక్ట్లో భాగంగా మంత్రాలయం మండల పరిధిలో నిర్మించిన సూగూరు రిజర్వాయర్ కట్టకు చిన్న గండి పడింది. వగరూరు గ్రామ ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుని అధికారులకు సమాచారం అందించారు. గండి పెద్దగా అయితే వగరూరు గ్రామం జలదిగ్బంధం అయ్యే అవకాశం ఉంది. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి విశ్వనాథ్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గండి పూడ్చడానికి అవసరమైన ఇటాచి, ట్రాక్టర్లను సమకూర్చారు. మరమ్మతులు చేపట్టాలని అధికారులకు, స్థానిక నాయకులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వగరూరు గ్రామ ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. కాగా.. సూగూరు ఈ రిజర్వాయర్ కింద 3000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి వగరూరు, వి.తిమ్మాపురం గ్రామాలకు తాగునీరు అందుతోంది. రిజర్వాయర్ కట్ట మరమ్మతుల కోసం రూ. 17 కోట్లతో ప్రతిపాదనలు పంపినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. ఫలితంగా వర్షానికి ఆనకట్టకు గండిపడింది. -
నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. శ్రీమఠం.. భక్తజనసంద్రం మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. రాయరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. తుంగభద్ర నదీతీరంలో భక్తుల కోలాహలం కనిపించింది. మంచాలమ్మకు ప్రత్యేకంగా పూల అలంకరణ చేశారు. మూలబృందావనానికి శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు చేపట్టి మంగళహారతులు గావించారు. ఆదివారం కురిసిన భారీ వర్షంతో భక్తుల ఇబ్బంది పడకుండా హెచ్ఆర్బీ కల్యాణ మండపంలో వసతులు కల్పించారు. నకిలీ షాపింగ్ వెబ్సైట్లపై జాగ్రత్త అవసరంకర్నూలు (టౌన్): ఇటీవల కాలంలో నకిలీ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లతో మోసం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రముఖ కంపెనీల పేర్లను పొలి ఉండే నకిలీ వెబ్సైట్లను రూపొందించారని తెలిపారు. తక్కువ ధరకు స్కూల్ యూనిఫాంలు, షూస్, ఎలక్త్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు అందిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వెబ్సైట్ల ద్వారా ముందస్తు డబ్బు తీసుకొని అనంతరం వస్తువులు పంపకుండా, లేదంటే నాసిరకం వస్తువులను పంపించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికారిక, విశ్వసనీయ వెబ్సైట్లలో మాత్రమే కోనుగోళ్లు చేయాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోకూడదని తెలిపారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడితే 1930 సైబర్ హెల్ప్లైన్ నెంబర్ను సంప్రదించాలన్నారు. రక్తదానంలో యువత ఆదర్శంగా నిలవాలి కర్నూలు(హాస్పిటల్): రక్తదానంలో యువత ఆదర్శంగా నిలవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ధన్వంతరి హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని బ్లడ్బ్యాంక్ రాష్ట్రంలోనే అత్యధిక సేవలు అందించిందని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ తెలిపారు. అనంతరం రక్తదానం చేస్తున్న యువకులు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ప్రశంసాపత్రాలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో పాథాలజీ హెచ్ఓడీ డాక్టర్ బాలీశ్వరి, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ అలీ హైదర్, రక్తకేంద్ర వైద్యులు షెహనాజ్, రవికాంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రిబాయి పాల్గొన్నారు. -
క్రైస్తవ సంఘం పవిత్రతకు ప్రతీక
● అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలి ● బిషప్ ది రైట్ రెవ.డా.పి.ఐజక్ వరప్రసాద్ ఆదోని: క్రైస్తవ సంఘం అనేది ఒక క్రమాని కి, పవిత్రతకు ప్రతీక అని సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ బిషప్ ది రైట్ రెవరెండ్ డా.పి.ఐజక్ వరప్రసాద్ తెలిపారు. చర్చీల్లో చొరబడుతున్న కొన్ని అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాయలసీమలోని ఐదు జిల్లాల్లో కొన్ని సీఎస్ఐ చర్చీల్లో కొందరు కాపరులే (పాస్టర్లు) బాధ్యతలు తప్పి ప్రవర్తించటం బాధాకరమని పేర్కొన్నారు. అటువంటి వారిపై ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొందరు డయాసిస్ చట్ట సభలు, సమావేశాల్లోకి దౌర్జన్యంగా చొరబడి, తోటి గురువులపై భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఎనిమిది మందిపై కడప వన్టౌన్లో క్రిమినల్ కేసు నమోదు చేయించామని పేర్కొన్నారు. అలాగే వాట్సాప్ ద్వారా చేస్తున్న అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూపు అడ్మిన్లపై తగు చర్యల కోసం సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశామన్నారు. ఇలాంటి వాట్సాప్ గ్రూపుల నుంచి గురువులు తక్షణమే వైదొలగాలని, ఇప్పటికే అల్లరిమూకలో ఉన్న కొందరిని డయాసిస్ నుంచి బహిష్కరించినట్లు తెలిపారు. -
కర్నూలు డీఎస్పీగా రాఘవేంద్ర బాధ్యతల స్వీకరణ
కర్నూలు(టౌన్): కర్నూలు డీఎస్పీగా కె.వి.రాఘవేంద్ర శనివారం సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన 1996 సంవత్సరంలో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. 2010 సంవత్సరంలో సీఐగా పదోన్నతి పొందారు. గత నెల మే 1న డీఎస్పీగా పదోన్నతి రావడంతో ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఎక్కువ కాలం ఎస్ఐగా, సీఐగా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో పనిచేశారు. బాధ్యతల అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ తొలిసారిగా కర్నూలు జిల్లాకు రావడం ఆనందంగా ఉందన్నారు. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. -
నమో నారసింహా
ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం శనివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావన క్షేత్రం తెల్లవారు జాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి తలనీలాలు సమ ర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి పారవశ్యంతో చేసిన గోవింద నామస్మరణతో అహోబిల క్షేత్రం మార్మోగింది. -
రక్తదాతలు..ప్రాణదాతలు
● ఐదేళ్లలో రెండున్నర లక్షల మంది రక్తదానం ● జిల్లాలో 13 బ్లడ్ బ్యాంకులు, 5 బ్లడ్ స్టోరేజ్ కేంద్రాలు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ● 18 నుంచి 60 ఏళ్లలోపు వారందరూ రక్తదానం చేయవచ్చు ● రక్తదానం చేసే వ్యక్తి కనీసం 45 కిలోల బరువు ఉండాలి. ● నిమిషానికి నాడి 60 నుంచి 100సార్లు కొట్టుకోవాలి. ● రక్తపోటు సిస్టాలిక్ 100 నుంచి 180, డయాస్టాలిక్ 50 నుంచి 100 వరకు ఉండాలి. ● హిమోగ్లోబిన్ శాతం 12.5గ్రాములపైన ఉండాలి. ● నోటి ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే అధికంగా ఉండకూడదు. ● మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. కర్నూలు(హాస్పిటల్): అత్యవసర సమయాల్లో రోగులకు కుటుంబ సభ్యులు, బంధువులే రక్తదానానికి వెనకడుగు వేస్తుండగా రక్తదాతలు ముందుకు వస్తున్నారు. ఎలాంటి సంబంధమూ లేకున్నా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారుతున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో రక్తదాతలు గ్రూపుగా ఏర్పడి, రక్తం అవసరమైన వారికి అందిస్తున్నారు. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా గ్రూపులుగా ఏర్పడి రక్తదానం చేస్తున్నారు. రక్తంలోని వివిధ గ్రూపులను కనుగొన్న నోబెల్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త కార్ల్ స్టీనర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదిన ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.. బ్లడ్బ్యాంకులు ఇవీ.. జిల్లాలో కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఆదోనిలోని ఏరియా హాస్పిటల్లో బ్లడ్బ్యాంకులు ఉన్నాయి. కర్నూలులో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి ఉంది. విశ్వభారతి, ఆర్ఆర్ హాస్పిటళ్లలో బ్లడ్ బ్యాంక్లు ఉన్నాయి. అక్షయ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్, కర్నూలు బ్లడ్ సెంటర్, కేర్ బ్లడ్ సెంటర్, మెడిప్లస్ బ్లడ్ సెంటర్, పెంచికలపాడులోని విశ్వభారతి జనరల్ హాస్పిటల్, ఆదోనిలో గోపి చారిటబుల్ బ్లడ్ సెంటర్, ఎమ్మిగనూరులో మహాత్మా గాంధి బ్లడ్ బ్యాంక్లు పనిచేస్తున్నాయి. వీటితో పాటు ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, ఓర్వకల్లు, వెల్దుర్తి, పాణ్యంలలో రక్తనిల్వ కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న రక్తదాతలు, రక్తదానానికి ప్రోత్సహించిన వారికి, యువజన సంఘాలకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 50 మందికి సన్మానం చేస్తాం. కర్నూలులో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రక్తనిధిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అనంతరం అన్ని రక్తనిధుల్లో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించనున్నాం. రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. రక్తదానం చేయడానికి యువత ముందుకు వచ్చేలా చేసేందుకు కళాశాలల్లో రెడ్రిబ్బన్ క్లబ్లు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. – డాక్టర్ ఎల్. భాస్కర్, జిల్లా అడిషనల్ డీఎంహెచ్వో, కర్నూలు మా స్వస్థలం అనంతపురం. ప్రస్తుతం కర్నూలులోని బాలాజీనగర్లో నివాసం ఉంటున్నాను. నాకు 39 సంవత్సరాల వయస్సు. బి పాజిటివ్ రక్తం గ్రూపు. మొదట్లో సీఆర్పీఎఫ్ జవాన్గా పనిచేశాను. ఇప్పుడు కర్నూలులో ఓ ప్రైవేటు సంస్థలో జాబ్ చేస్తున్నాను. నా భార్య గర్భవతిగా ఉన్న సమయంలో రక్తం అవసరమై చాలా ఇబ్బంది పడ్డాను. దీనికితోడు ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాకు 22 ఏళ్ల వయస్సున్నప్పుడు మొదటిసారి రక్తదానం చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 89 సార్లు రక్తం ఇచ్చాను. నాతో పాటు స్నేహితులనూ ప్రోత్సహిస్తున్నాను. – డి.వారాధిరెడ్డి, రక్తదాత, కర్నూలు సంవత్సరం లక్ష్యం లక్ష్యసాధన నిర్వహించిన క్యాంపులు 2021-2022 22,720 48,135 99 2022-2023 22,720 51,076 216 2023-2024 22,720 50,123 228 2024-2025 22,720 52,843 177 2025-2026 22,720 56,393 242 2026 ఇప్పటివరకు 3,786 5,165 23 -
2002లో ఓటు హక్కు లేకపోతే ఏం చేయాలి?
కర్నూలు(సెంట్రల్): రేపటి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)సర్వే ప్రారంభం కానుంది. ఈ సర్వేకు 2002 ఓటరు జాబితా అత్యంత కీలకం. ఈ జాబితా 2025 జాబితాలను పోల్చుతూ సర్వే చేస్తారు. ప్రస్తుతం జాబితాలో పేరు ఉండి.. 2002 జాబితాలో పేరు లేకపోతే ఏమి చేయాలన్నదే సందేహం. ఈ క్రమంలో ఓటర్ల సందేహాలను తీర్చేందుకు ఎన్నికల కమిషన్ ముందుకొచ్చింది. జాబితాలో పేర్లు లేని సందర్భాలు.. ● 2002లో పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్లిన ఆడవాళ్లు ● 2002లో ఓటు హక్కు వయసు రాకపోవడం ● 2002లో ఓటు హక్కు వచ్చినా ఏదైనా కారణం చేత ఓటరుగా నమోదు కాకపోవడం ● ప్రస్తుతం పైన చెప్పిన సందర్భాల ఓటర్ల వివరాలు 2025 జాబితాలో ఉంటాయి. అయితే 2002 జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో ‘సర్’ సర్వేలో సందేహాత్మక ఓటర్లుగా నిలుస్తారు. ఈ క్రమంలో వారంతా కింది నిబంధనలను ఫాలో అయితే 2002 జాబితాలో పేర్లు లేకపోయినా ఎన్నికల కమిషన్ ఓటరుగా ఆమోదిస్తుంది. ఆ నిబంధనలు ఏమిటంటే.. ● వీరు పుట్టిన ఊరికి వెళ్లాలి. ● అక్కడ 2002 జాబితాలో అమ్మ, నాన్న, తాత/అవ్వల పేరు ఉంటే వారి పేరు, సీరియల్ నంబర్ తెలుసుకోవాలి. ● ఆ సీరియల్ నంబర్ను మీరు ఇప్పుడు ఉంటున్న బీఎల్ఓకి ఇవ్వాలి. ● బీఎల్ఓ ఆ నంబర్తో సరిపోల్చుకొని జాబితాలో మ్యాపింగ్ చేస్తారు. ఇది చేయకపోతే ఏమి జరుగుతుంది? ● ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ● 2002 ఓటరు జబితా ఎక్కడ దొరుకుతుంది? ● ప్రతి ఊరి తహసీల్దార్ ఆఫీసు నుంచి 2002 ఓటరు లిస్టులను ఆ ఊరి బీఎల్ఓ/అంగన్వాడీ టీచర్కు ఇచ్చారు. ● మీరు పుట్టిన ఊరి బీఎల్ఓని కలిసి జాబితాను పొందవచ్చు. -
మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట
బేతంచెర్ల: వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. జ్యేష్ట మాసం శుభ దినాలను పుర స్కరించుకొని జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజామున ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. అభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన పూజ ల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు. -
అనాథ చెంచు యువతి పెళ్లికి సహాయం
ఆత్మకూరురూరల్: కొట్టాల చెర్వు చెంచు గూడెంకు చెందిన నాగమణికి చిన్నతనంలోనే తల్లిదండ్రి అనారోగ్యంతో మరణించారు. అనాథ అయిన నాగమణిని బంధువులు పెంచి పెద్ద చేశారే కానీ.. పెళ్లి చేసేంత స్థోమత వారికి లేదు. ఆమెకు ఇటీవల వివాహం కుదిరింది. అయితే పెళ్లికి కనీస ఖర్చులకు కూడా డబ్బుల్లేవు. ఈ విషయం తెలుసుకున్న ఇందిరేశ్వరం అటవీ సెక్షన్ ఎఫ్ఎస్ఓ మహబూబ్బాషా తన వంతుగా సహా యం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేర కు శనివారం ఆయన కొట్టాలచెర్వుకు వెళ్లి నాగమణికి రూ. 5 వేలు, ఒక బియ్యం ప్యాకెట్ ఉడతా భక్తిగా అందించారు. చెంచు యువతి వివాహానికి దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఫారెస్ట్ అధికారి మహబూబ్ బాషా కోరారు. అదుపు తప్పిన ట్రాక్టర్ సంజామల: రామభద్రునిపల్లె గ్రామ సమీపంలో శనివారం అదుపుతప్పిన ట్రాక్టర్ కల్వర్టులోకి దూసుకెళ్లింది. పేరుసోముల గ్రామానికి చెందిన షరీఫ్ ట్రాక్టర్లో నాపరాళ్ల లోడును సంజామలలో అన్లోడ్ చేశాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా రామభద్రునిపల్లె సమీపంలో అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు లారీలు ఢీ.. ఇద్దరికి గాయాలు హాలహర్వి: రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన హాలహర్వి సమీపంలోని క్షేత్రగుడి దగ్గర శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని నుంచి సిమెంట్ లోడు వేసుకుని ఒక లారీ బళ్లారికి వెళ్తోంది. బళ్లారి నుంచి ఐరన్ వేసుకుని మరొక లారీ హాలహర్వికి వస్తోంది. రెండు లారీలు హాలహర్వి సమీపంలోని క్షేత్రగుడి దగ్గర ఎదురెదురగా ఢీకొన్నాయి. ఇద్దరు లారీ డ్రైవర్లు ఉమేష్ కుమార్, జగదీష్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బళ్లారి ఆసుపత్రికి తరలించారు. హాలహర్వి ఎస్ఐ ఈశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. -
టీబీ డ్యాంకు 365 క్యూసెక్కుల ఇన్ఫ్లో
హొళగుంద: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర రిజర్వాయర్కు శనివారం 365 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. డ్యాంలో మొత్తం 9.903 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ భాగం ఆగుంబే, తీర్థన హళ్లీ, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర భాగాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఇన్ఫ్లో తొలిసారిగా శనివారం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి టీబీ డ్యాంకు 8,269 క్యూసెక్కుల ఇన్ఫ్లో, జలాశయంలో 25.589 టీఎంసీల నీరు ఉండేది. ఈ ఏడాది భారీ వర్షాలు లేకపోవడంతో ఇన్ఫ్లో మందగించింది. సకాలంలో డ్యాంలో నీరు చేరితేనే జూలై ఆఖరిలో ఎల్లెల్సీకి నీటిని విడుదల చేసే అవకాశాలుంటాయి. శనివారం టీబీ డ్యాంలో 1,633 అడుగులకు గాను 1588.60 అడుగులతో అవుట్ఫ్లో 57 క్యూసెక్కులుంది. -
ఉపాధి కూలీలకు రూ.180కోట్ల బకాయి
● మే నెల 4 నుంచి నిలిచిపోయిన చెల్లింపులు కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో వేలాది కుటుంబాలు వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి పనులనే నమ్ముకున్నారు. అయితే రోజులు, వారాలు గడుస్తున్నా వేతనాలు అందక నిరాశకు లోనవుతున్నారు. గత మే 4వ తేదీ నుంచి వేతనాలు నిలిచిపోయాయి. వేసవిని ఉపాధి పనులకు సీజన్గా వ్యవహరిస్తారు. ఉమ్మడి జిల్లాలో మే నెలలో రోజుకు 2 లక్షల మంది శ్రామికులు హాజరయ్యారు. ఉదయమే తినీతినక వెళ్లి రెక్కలు ముక్కలు చేసుకుంటే వేతనాలు దక్కక దిక్కుతు చూస్తున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం రోజుకు లక్ష మందికి పైగా శ్రామికులు మాత్రమే ఉపాధి పనులకు హాజరువుతున్నారు. వేతనాలు అందక ఆకలి బాధలతో ఉపాధి కూలీలు రోడ్డెక్కాల్సి వస్తోంది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, పెద్దకడుబూరు, హాలహర్వి, ఆలూరు, ఆదోని, కోసిగి, దేవనకొండ, హొళగుంద, ఆస్పరి, నంద్యాల జిల్లాలోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, కొలిమిగుండ్ల తదితర మండలాలకు ఉపాధి పనులే ఆధారం. కర్నూలు జిల్లాలో 1.25 లక్షల కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 75 వేల కుటుంబాలు వేసవిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకున్నాయి. అయితే దాదాపు నెలన్నర రోజుల్లో దాదాపు 60 లక్షల పని దినాలకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. రోజుకు ఉపాధి శ్రామికుల వేతనం రూ.300 వరకు లభిస్తుంది. ఈ ప్రకారం 60 లక్షల పని దినాలకు రూ.180 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. ఒక్క గ్రామానికే రూ.30 లక్షల బకాయి ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో ఉపాధి శ్రామికులు ఎక్కువ. మే నెల 4 నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఉపాధి శ్రామికులు 10,300 పని దినాలను వినియోగించుకున్నారు. ఈ ఒక్క గ్రామానికే దాదాపు రూ.35 లక్షల బకాయి ఉంది. ఫలితంగా ఇటీవల కాలంలో ఉపాధి పనులకు హాజరు తగ్గిపోయింది. -
ఉద్యోగుల ఊరు చెన్నాపురం
స్థితిగతులు మార్చిన చదువు చెన్నాపురం ఏరియల్ ఫ్యూ ఎమ్మిగనూరుసెంట్రల్: మట్టిని నమ్ముకున్న రైతులు తమ కష్టం బిడ్డలకు వద్దని వారిని బాగా చదివించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలను బిడ్డలు నిజం చేశారు. ఇప్పుడు చెన్నాపురం అంటే ఉద్యోగులపురంగా ఖ్యాతి గడించింది. ఎమ్మిగనూరు మండలంలోని చెన్నాపురం గ్రామంలో 320 కుటుంబాలు ఉన్నాయి. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ పత్తి, వరి, వేరుశనగ, మిరప పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. గ్రామంలో ప్రతి ఇంట్లో డిగ్రీ, పీజీ చేసిన విద్యావంతులున్నారు. గ్రామంలో 60 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా అధికంగా ఉపాధ్యాయ, పోలీస్ శాఖలో కొలువుదీరారు. ప్రభుత్వ పాఠశాలలోనే చదువులు గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే చదివారు. ఉత్తమ విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని గ్రామస్తుల నమ్మకం. గ్రామంలోని యువత తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి ఎటువంటి చెడు అలవాట్లకు పోకుండా చక్కగా చదువుకుని ఉన్నత విద్యావంతులుగా తయారయ్యారు. వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక వైపు చదువుతూనే ఉద్యోగాలు సాధించి కన్నవారి కలలను సాకారం చేశారు. గ్రామాభివృద్ధి పేరిట సేవా కార్యక్రమాలు గ్రామంలో ఉద్యోగాలు సాధించి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఉద్యోగులు గ్రామాభివృద్ధి కోసం కూడా పా టు పడుతున్నారు. చెన్నాపురం గ్రామాభివృద్ధి సంఘం పేరిట వివిధ సేవా కార్యక్రామాలు చేపట్టారు. పేదల కు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, పోటీ పరీక్షలకు మెటీరియల్ అందించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్లలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. నూతనంగా ఉద్యోగాలు సాధించిన వారికి సన్మానాలు చేశారు.దశాబ్దాల క్రితం చెన్నాపురంలో నిరక్షరాస్యత అధికంగా ఉండేది. సంప్రదాయ వ్యవసాయంతో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టాల రావడంతో పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదని బడిబాట పట్టించారు. ఇది ఆ ఊరి స్థితి గతులను మార్చింది. నాడు ఒక్కరితో మొదలైన ప్రభుత్వ కొలువు నేడు పదుల సంఖ్యకు చేరింది. ఉపాధ్యాయ వృత్తిలో 14 మంది, పోలీస్శాఖలో 25 మంది రాణిస్తున్నారు. పోలీస్ శాఖలో ఒకరు సీఐగా, మరొకరు ఎస్ఐగా ఉన్నారు. గ్రామంలో ఇద్దరు ఎంబీబీఎస్ చదువుతున్నారు. మరికొంతమంది సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేట్ రంగాల్లో రాణిస్తున్నారు. -
విద్యుత్ వైర్ల దొంగలు హల్చల్
● 20 మంది రైతుల బోర్ల తీగలు అపహరణ పాణ్యం: వ్యవసాయ బోర్ల మోటార్లకు ఏర్పా టు చేసిన విద్యుత్ తీగలను దొంగలు అపహరించారు. మండల కేంద్రమైన పాణ్యం – వడ్డుగండ్ల రస్తాలో శనివారం తెల్లవారు జామున దాదాపు 20 బోర్లకు చెందిన తీగలను కట్ చేసి దొంగిలించారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులకు బోర్ల తీగలు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. స్టార్టర్ నుంచి భూగర్భంలో మోటార్కు అమర్చిన ఉన్న వైర్ను దొంగలు బలవంతగా లాగడం వలన కనెక్షన్ తెగిపోవడంతో రైతులపై భారం పడుతోంది. కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు రూ. 10 –15 వేల వరకు ఖర్చు అవుతోంది. భూగర్భంలో ఉన్న మోటార్ను బయటకు తీసి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తీగల దొంగల వల్ల పాణ్యంలో 20 మందిలపై భారం పడింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగలను పట్టుకుని చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
● గతేడాది జూన్ ప్రారంభం నాటికి జీడీపీని చేరిన వరద నీరు ● ఈ ఏడాది ఇప్పటి వరకు కనిపించని వైనం
గా‘జల’దిన్నె వెలవెల! గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి నిల్వ రోజు రోజుకు తగ్గిపోతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది జూన్ నెల ప్రారంభం అయ్యే సరికి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరిది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు చుక్కనీరు రాలేదు. గతంలో జూన్ నెలలో 2 టీఎంసీలు నీరు నిల్వ ఉండి డోన్, కృష్ణగిరి, పత్తికొండ ప్రాంతాల్లో 120 గ్రామాలకు సరఫరా అయ్యేది. కర్నూలు, కోడుమూరు, లద్దగిరి, గూడూరు, బెళగల్, గుడిపాడు ప్రాంతాలకు తాగునీటి కోసం సరఫరా చేసేవారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో తాగునీటి పథకాలకు ఇబ్బంది లేదని అధికారులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది రబీలో ప్రాజెక్టు కింద దాదాపు 13 వేల ఎకరాలలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాదైన వర్షాలు కురిసి ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతుందో లేదో వేచిచూడాలి. ఇదిలా ఉండగా ప్రాజెక్టులో ఉన్న నీటిని ఇతర ప్రాంతాల వారు తమ రాజకీయ బలంతో నీటిని మళ్లించుకుని వెళ్తున్నారు. దీంతో ప్రాజెక్టు చుట్టు పక్కల గ్రామాలకు తాగునీటి సమస్య వస్తే ఎలా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. -
మాజీ కార్పొరేటర్పై అక్రమ కేసు
● అరెస్ట్, బెయిల్ మంజూరు ● అక్రమ కేసులపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే కాటసాని కర్నూలు (టౌన్): చిన్నపాటి గొడవలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 26వ వార్డు తాజా మాజీ కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే సంఘటనకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలించిన జడ్డి బెయిల్ మంజూరు చేశారు. వివరాల మేరకు.. కర్నూలు కృష్ణనగర్లోని వార్డు పరిధిలోకి వచ్చే విఠల్ నగర్ సవారి తోట వద్ద ఓ రోడ్డు విషయంలో దాదాపు నెలన్నర క్రితం స్థానిక టీడీపీ అనుచరుడుతో చిన్న పాటి గొడవ జరిగింది. రోడ్డును ఆక్రమించి ఇళ్లు కడుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న లక్ష్మీకాంత రెడ్డి పనులు నిలిపివేయాలని కోరారు. ఇదే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది జరిగి దాదాపు 48 రోజులవుతోంది. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకు అప్పట్లో కార్పొరేటర్, స్థానికుడి మల్లికార్జున ఇరువురిపై కేసులు నమోదు చేశారు. అయితే ఇన్ని రోజలు పట్టించుకోని పోలీసులు శనివారం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉదయం ఇరువురిని స్టేషన్కు పిలిపించి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని పరీక్షలు చేశారు. ఇద్దరిని జడ్జి అపర్ణ ఎదుట హాజరు పరిచారు. జడ్జి అన్నంటిని క్షుణంగా పరిశీలించి బెయిల్ మంజూరు చేశారు. అనంతరం ఇద్దరు కల్లూరులోని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిని కలిశారు. కాగా లక్ష్మీకాంత రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటసానికి ముఖ్య అనుచరుడుగా కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీలో చురుగ్గా పాల్గొంటున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతోనే టీడీపీ నేతలు అతనిపై కక్ష గట్టారని, నెలన్నర క్రితం జరిగిన సంఘటనను సాకుగా చూపుతూ పోలీసులతో అరెస్ట్ చేయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వైఎస్సార్సీపీలో బలమైన నాయకులను టార్గెట్ చేసుకొని అరెస్టులు చేయిస్తున్నారు. టీడీపీ నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతూ వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేయడం తగదు. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదని టీడీపీ నాయకులు తెలుసుకోవాలి. – మాజీ ఎమ్మెల్యే కాటసాని -
కర్నూలులో కుమ్మేసిన వర్షం
● కర్నూలు జిల్లాలో 16, నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షపాతం మండలం వర్షపాతం(మి.మీ) ఆదోని 36.4 ఓర్వకల్ 15.2 హొళగుంద 14.4 కల్లూరు 11.6 ఎమ్మిగనూరు 10 వెల్దుర్తి 9.8 మహానంది 9.6 గూడూరు 9.2 పగిడ్యాల 8.2 జూపాడుబంగ్లా 7.8కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో వర్షం తేలిక పాటికే పరిమితమైంది. అయితే కర్నూలు నగరంలో భారీ వర్షం కురిసింది. కర్నూలు రూరల్లో 56.2 మి.మీ, కర్నూలు అర్బన్లో 48.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలువలు పొంగిపొర్లాయి. జిల్లా మొత్తంగా సగటున 9 మి.మీ వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 46.1 మి.మీ వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా మొత్తంగా సగటున 1.7 మి.మీ వర్షం కురిసింది. నంద్యాల జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 77 మి.మీ కాగా ఇప్పటి వరకు 58.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తొలకరి నిరాశాజనకంగా సాగుతోంది. -
మహానందికి పోటెత్తిన భక్తులు
మహానంది: మహానంది క్షేత్రం శనివారం వీకెండ్ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటూ వివిధ ప్రాంతాలకు చెందిన వేలా ది మంది భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా దర్శన సౌకర్యం కల్పించారు.అయితే సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు మహా మంగళ హార తి సమయంలో భక్తులను అనుమతించకపోవడంతో ఆలయరాజగోపురం నుంచి అధికసంఖ్యలో వేచి ఉన్నారు. హారతి సమయం తర్వాత అందరిని ఒకేసారి అనుమతించడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అలాగే ఒక్కొక్క కొబ్బరి కాయకు విక్రయ దారులు రూ.50 తీసుకున్నట్లు భక్తులు తెలిపారు. అధికారులు స్పందించి నిబంధనల మేరకు కొబ్బరికాయల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కో రారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆలయ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, దేవస్థాన సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు. -
డూప్లికేట్ తాళాలతో బైకుల చోరీ
● నలుగురు దొంగలు అరెస్ట్ ● నాలుగు బైకులు స్వాధీనం మహానంది: దేవస్థానం ప్రాంగణంలోని ఆలయ గేటు వద్ద ఉంచిన రెండు బైకులను చోరీ చేసిన నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు నంద్యాల ఏఎస్పీ మందాజావళి ఆల్ఫోన్స్ తెలిపారు. సీఐ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహానంది దేవస్థానం సూపరింటెండెంట్ పి.సుబ్బారెడ్డి, మరో ఉద్యోగి గురుప్రసాద్కు చెందిన పల్సర్, హెచ్ఎఫ్ డీలక్స్ బైక్లు ఈ నెల 9వ తేదీన చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీఎస్ పోలీసుల సహకారంతో నిందితులను పట్టుకున్నారు. నిందితులు నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్ బర్మశాలకు చెందిన పాల్తీ గోపీనాయక్, మేనుగ రాజు (కర్నూలు) ఎన్జీఓస్ కాలనీ, డోన్ మండలం చిన్నమల్కాపురానికి చెందిన దొడ్డగాళ్ల ప్రకాష్, దేవనగర్కు చెందిన షేక్ సాబిర్ హుసేన్గా తెలిసింది. వారి నుంచి మహానందితో పాటు నంద్యాల త్రీటౌన్, ఆళ్లగడ్డ టౌన్ పరిధిలో చోరీ చేసిన నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బైకుల విలువ రూ. 2.70 లక్షలు ఉంటుందని వెల్లడించారు. డూప్లికేట్ తాళాలతో చోరీలు మద్యం, చెడు అలవాట్లకు బానిసలైన నిందితులు తప్పుదారి పట్టి బైక్ల దొంగతనాలకు పాల్పడుతున్నారని ఏఎస్పీ మందా జావళి తెలిపారు. డూప్లికేట్ తాళాలు ఉపయోగించి బైకులను చోరీ చేస్తున్నారని చెప్పారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసును చేధించిన సీసీఎస్, మహానంది పోలీసులను ఎస్పీ సునీల్ షెరాన్ అభినందించారు. -
ట్రిపుల్ఐటీ డీఎంలో జాతీయ సదస్సు
కర్నూలు సిటీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ (ట్రిపుల్ఐటీ డీఎం) సంస్థ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించారు. రెండో రోజు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రిపుల్ఐటీ డీఎం డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సులు పరిశోధకులు, విద్యార్థుల మద్య విజ్ఞాన మార్పిడి, పరస్పర సహకారం పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. శాసీ్త్రయ రంగాలల్లో పరిశోధన, ఆవిష్కరణల గురించి వివరించారు. సదస్సు చైర్మన్, సైన్సెస్ విభాగాధిపతి పాండియరాజన్ మాట్లాడారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర విశ్వవిద్యాయాలు, సీఎస్ఐఆర్ ప్రయోగశాలలకు చెందిన 15 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణులు ఆహ్వానిత ఉపన్యాసకులుగా పాల్గొని, ఆధునాతన పదార్థాల రంగంలో తాజా పరిశోధన, పురోగతులు, అభివృద్ధి చెందుతున్న ధోరణులు, స్థిరమైన సాంకేతికతలలో వాటి వినియోగాలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. కన్వీనర్లు డాక్టర్ పవన్ ప్రకాష్, డాక్టర్ కిశోర్ మాట్లాడుతూ సదస్సు నిర్వహణకు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ, సీఎస్ఐఆర్, ఐఐఐటీడీఎం నుంచి ఆర్థిక, సంస్థాగత సహకారం లభించిందన్నారు. ఆంఽధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 70 మంది పరిశోధక విద్యార్థులు, పీజీ, యూజీ విద్యార్థులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని బెలుంకు చెందిన కవిత (24) శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంజామల మండలం గిద్దలూరుకు చెందిన కవితకు బెలుంకు చెందిన బంధువు నరసింహులుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. భర్త ట్రాక్టర్ డ్రైవర్ పని చేస్తుంటాడు. ఉదయం దంపతుల మధ్య కుటుంబ సమస్యల వల్ల గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత ఇంట్లో ఉన్న పేడ రంగును నీళ్లలో కలుపుకొని తాగింది. తర్వాత వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం బనగానపల్లెకు అక్కడి నుంచి కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రైలు కిందపడి యువతి ఆత్మహత్య ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణానికి చెందిన బోగనూర్ అబ్దుల్ రఫూఫ్ కుమార్తె బోగనూర్ నజియా బాను శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని– మంత్రాలయం రైల్వే పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సి.శివరామయ్య తెలిపారు. వివరాలు.. నజియా బానుకు ఇష్టం లేని పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపం చెంది ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో రాయచూరు నుంచి గుత్తికి వెళ్లే గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని వివరించారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. -
రూ.51కే బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్
కర్నూలు(హాస్పిటల్): స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులను అతి తక్కువ ధరలో ప్రజలకు చేరువ చేయడానికి ప్లాన్ ఎఫ్ఆర్సీ 51ను ప్రవేశపెట్టినట్లు బీఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీమియం నంబర్లను ఈ–వేలం ద్వారా పొందవచ్చన్నారు. ప్రీమియం నంబర్లు పొందేందుకు http://eauction.bsnl.co.in వెబ్సైట్లో మొబైల్ నంబర్ గాని, ఈ మెయిల్ ఐడీ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకుని కావాల్సిన నంబర్ను రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపారు. పిన్ జనరేట్ అయిన తర్వాత దగ్గర్లోని వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించి బిడ్ అమౌంట్ చెల్లించి సిమ్ను పొందవచ్చన్నారు. ఈ–వేలం విండో జూన్ 15వ తేదీ వరకు ఉంటుందన్నారు. రూ.899కే అధిక స్పీడ్తో ఇంటర్నెట్ కేవలం రూ.899కే 175 ఎంబీపీఎస్తో 5 వేల జీబీ వరకు ఇంటర్నెట్,అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాలతో కొత్త ఎఫ్టీహెచ్ ప్లాన్ ఫైబర్ వాల్యూ అడ్వాన్స్ను ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇంటర్నెట్ సౌకర్యం, జియో హాట్స్టార్ సూపర్ప్లాన్, సోనీ లైవ్, జీ5, హంగామా యాప్, లయన్స్గేట్, షిమారో మీ, ఎపిక్ ఆన్ ఓటీటీలు ఉంటాయన్నారు. అతి తక్కువగా రూ.220కే ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్ ద్వారా 20 ఎంబీపీఎస్ స్పీడుతో 500 జీబీ వరకు ఇంటర్నెట్, రూ.140 రీచార్జ్ చేసుకోవడం ద్వారా టీవీ ఛానళ్లు, ఓటీటీలు వీక్షించవచ్చని వెల్లడించారు. వాహన దొంగల ముఠాలో విరుపాపురం వాసి? ఆలూరు: ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో బైక్లు, బొలెరోలు, ప్రొక్లెయినర్లను అపహరించిన ముఠాలో హాలహర్వి మండలం విరుపాపు రానికి చెందిన చెన్నబసప్పను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను 20 ఏళ్ల క్రితం కర్ణాటకలోని చెలగనూరుకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. కర్ణాటకలోని బళ్లారి, సింధనూరు, శిరుగుప్ప ప్రాంతాల్లో బైక్లు అపహరించి ఆంధ్రలోని హాలహర్వి మండలం విరుపాపురం గ్రామంలో బైక్ మెకానిక్ లతీఫ్, జీరా చెన్న తదితరుల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపిన కర్ణాటక పోలీసులు నిందితుడు చెన్నబసప్పను అరెస్టు చేసి, హాలహర్వి మండలంలోని లతీఫ్, జీరా చెన్న వద్ద విచారణ జరిపారు. స్థానికంగా వారు విక్రయించిన దాదాపు 50 బైక్లను మూడు రోజులు క్రితం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై హాలహర్వి ఎస్ఐ ఈశ్వరరావును శుక్రవారం విచారించగా మోటార్ వాహనాల అపహరణ కేసులో కర్ణాటక పోలీసులు హాలహర్వి మండలంలో విచారణ జరుపుతున్న విషయం వాస్తవమేనని వెల్లడించారు. 18న వైద్యుల పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కర్నూలు(హాస్పిటల్): డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(డీసీహెచ్ఎస్), ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు(10), సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్(6) పోస్టులకు ఈ నెల 18న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు ప్రాతిపదిక భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికై న వారికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టుకు నెలకు జీతం రూ.1,10,000, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్కు రూ.61,960జీతం ఇస్తారన్నారు. వివరాలుకు kurnool.ap.gov.in, nandyal.ap. gov.in వెబ్సైట్లలో చూడాలన్నారు. హైస్కూల్లో నాగుపాము కోడుమూరు రూరల్: పాఠశాలలు పునఃప్రారంభమైన వేళ కోడు మూరు మండలంలోని కల్లపరి హైస్కూల్లో ఆరడు గుల నాగుపాము ప్రత్యక్షమైంది. వంట ఏజెన్సీ మహిళలు భోజనం తయారు చేసేందుకు పాఠశాల వంటగదిలోకి వెళ్లగా బియ్యం సంచుల మాటున పాము తిష్ట వేసి ఉంది. గమనించిన మహిళలు పరుగున బయటకు వచ్చి విషయాన్ని హెచ్ఎం శాంతమూర్తికి తెలిపారు. పులకుర్తి గ్రామంలో పాములపట్టే వ్యక్తిని హెచ్ఎం పిలిపించి పామును పట్టించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు పీల్చుకున్నారు. ప్రహరీ లేకపోవడంతో చుట్టు పక్కల పొలాల నుంచి పాములు పాఠశాలలోకి వస్తున్నాయని, వెంటనే పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇరువర్గాల ఘర్షణ బేతంచెర్ల: మండలంలోని బుగ్గానిపల్లె సర్వే నంబర్ 827లోని రెండు ఎకరాల భూమి విషయమై తమదంటే తమదంటూ ఇరువర్గాలు ఘర్షణకు దిగిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సదరు సర్వే నంబర్ పక్కన పట్టణానికి చెందిన ఓ వ్యక్తి క్రషర్ నిర్వహిస్తున్నారు. క్రషర్ పక్కనే ఉన్న భూమికి సంబంధించి 2010లో కొలుములపల్లెకు చెందిన కొందరికి డీ–పట్టా ఇవ్వడంతో వారు అక్కడ చీని చెట్లు నాటారు. అయితే, తమ పొలంలో చెట్లు ఎలా నాటుతారంటూ 2024లో డీ–పట్టా పొందిన క్రషర్ యజమాని ఆ చెట్లను తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ విషయమై తహసీల్దార్ నాగమణిని వివరణ కోరగా.. సదరు సర్వే నంబర్లో 2010లో ఒకరికి, మళ్లీ అదే నంబర్లో 2024లో మరొకరికి పట్టా ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ పొలాన్ని ఎవరూ సాగు చేయలేదని, ఆన్లైన్లోనూ ఎవరి పేరూ లేదని పేర్కొన్నారు. రీ–సర్వేలో ఈ సర్వే నంబర్లోని 15 ఎకరాలను ప్రభుత్వ భూమిగా గుర్తించినట్లు వెల్లడించారు. -
స్వయం ఉపాధితో గౌరవం
కర్నూలు (టౌన్): స్వయం ఉపాధి ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తుందని, మహిళలు స్వయం సమృద్ధి, సాధికారత సాధించాలని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వాన్వేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు డయాసిస్ సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్లు, అల్లికలకు సంబంధించి స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 150 మంది పేద, గ్రామీణ మహిళలకు బిషప్ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా, వెన్నెముకగా ఉండాలన్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, పేద గృహిణులకు స్వయం ఉపాధి అవకాశాలు కొండంత ఆసరానిస్తాయని, జీవితాలలో భరోసా నింపుతాయన్నారు. కేడీఎస్ఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ తోట జోసెఫ్, చిన్నపరెడ్డి, సిస్టర్లు కస్తూరి, విజయ, కేడీఎస్ఎస్ఎస్ సిబ్బంది ఆరోగ్య, మేరి జోసెఫ్, మోజెస్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ సందేశాలు నమ్మవద్దు
కర్నూలు(టౌన్): వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పథకాల పేరుతో నకిలీ సందేశాలు, ఫోన్ కాల్స్, వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, లింకుల ద్వారా రైతుల వ్యక్తిగత, బ్యాంకు వివరాలను సేకరించే ప్రయత్నాలు చేస్తారన్నారు. లైసెన్స్ పొందిన డీలర్లు గుర్తింపు పొందిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాల కొనుగోలు, నమోదు ప్రక్రియకు డి–క్రిషి యాప్ను మాత్రమే వినియోగించాలని, ఎరువుల కొనుగోలుకు అమలులో ఉన్న ఏపీఏఐఎంఎస్ విధానాన్ని మాత్రమే ఉపయోగించాలన్నారు. అనధికార యాప్లు, వెబ్సైట్లు, సోషల్ మీడియా ద్వారా వచ్చే సందేశాలను నమ్మవద్దని హెచ్చరించారు. కర్నూలు(సెంట్రల్): జిల్లా అధికారులు ఒక్క రోజు ప్రచారంపై చూపుతున్న శ్రద్ధ దైనందిన జీవితంలో చూపకపోవడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంధన పొదుపు పేరిట జిల్లా అధికార యంత్రాంగం శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తుగ్గలిలో నిర్వహించిన ఒక్క నెల–ఒక్క నియోజకవర్గం–నాలుగు పర్యటలు కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు ఎవరికి వారు కార్లలో వెళ్లకుండా ఒకే ఆర్టీసీ బస్సులో వెళ్లారు. కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులంతా వెళ్లడంతో ఆర్టీసీ బస్సు కిక్కిరిసింది. ఇదిలాఉంటే అంత దూరం బస్సులో ప్రయాణించిన అధికారులు.. సమీపంలోని కలెక్టరేట్కు వెళ్లేందుకు సైతం కార్లను ఉపయోగించడం పరిపాటిగా మారింది. ప్రజలకు ఆదర్శంగా నిలవాలని భావించినప్పు డు ఏదో ఒక రోజు కాకుండా దైనందిన జీవితంలోనూ పాటించి చూపినప్పుడే పొదుపు సాధ్య మనే అభిప్రాయం వ్యక్తమైంది. కాలి నడకన వెళ్లగలిగే ప్రాంతాలకు సైతం కార్లనే ఆశ్రయిస్తున్న అధికారులను ప్రతిరోజూ గమనిస్తున్న ప్రజలు ఇదేమి చోద్యమని నవ్వుకోవడం కనిపించింది. ఆర్యూ నుంచి ఇద్దరు విద్యార్థుల బహిష్కరణ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఇద్దరు విద్యార్థులను బహిష్కరిస్తూ వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వర్సిటీ కళాశాలలో తెలుగు పీజీ నాల్గవ సెమిస్టర్ చదువుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్కుమార్ను వర్సిటీ నుంచి బహిష్కరించారు. వర్సిటీ అధికారులపై నిందలు వేయడం, వర్సిటీ కళాశాల గురించి తప్పుడు ప్రచారాలకు పాల్పడటం, ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే కారణాలతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో విద్యార్థి వర్సిటీ కళాశాలలో ఇంగ్లిష్ పీజీ నాల్గవ సెమిస్టర్ చదువుతున్న రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్(ఆర్పీఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షులు బి.నాగరాజును వర్సిటీ నుంచి బహిష్కరించారు. ఇతను క్రమశిక్షణ లేని ప్రవర్తనతో ప్రవర్తించాడని, వర్సిటీ అధికారులతో అసభ్య పదజాలం వాడుతూ వాగ్వివాదానికి దిగాడనే కారణాలతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వర్సిటీ నుంచి బహిష్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు. 150 ఎకరాల్లో మల్బరీ సాగు లక్ష్యం కర్నూలు(అగ్రికల్చర్): 2026–27లో జిల్లాలో 150 ఎకరాల్లో మల్బరీ సాగు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్బరీ మొక్కలు నాటుకోవడానికి ఎకరాకు యూనిట్ కాస్ట్ రూ.45 వేలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు రూ.40,500, ఇతరులకు రూ.33,750 సబ్సిడీ ఉంటుందన్నారు. జిల్లాకు 10 షెడ్లు మంజూరయ్యాయని, యూనిట్ కాస్ట్ రూ.4.50 లక్షలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు రూ.4.05 లక్షలు, ఇతరులకు 3,37,500 సబ్సిడీ లభిస్తుందన్నారు. రేరింగ్ ఎక్విప్మెంట్ యూనిట్ కాస్ట్ రూ.75వేలు ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు రూ.67,500, ఇతరులకు రూ.56,250 ప్రకారం సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద మల్బరీ మొక్కలు నాటుకునేందుకు ఎకరాకు రూ.87021 లభిస్తుందని, ఈ మొత్తం మూడేళ్లలో ప్రతి ఏటా రూ.29,007 ప్రకారం చెల్లిస్తామన్నారు. ఆసక్తి ఉన్న రైతులను గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
ఆర్ఎస్ఐలు బాధ్యతాయుతంగా మెలగాలి
కర్నూలు(టౌన్): ఆర్మ్డ్ రిజర్వులో ఆర్ఎస్ఐలుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల సివిల్ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన వారు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. శుక్రవారం కన్వర్షన్ కింద ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సివిల్ ఎస్ఐలు కర్నూలు రేంజ్ డీఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. డీఐజీ మాట్లాడుతూ ప్రజలకు సత్వర న్యాయం అందించే విధంగా పోలీసులు కృషి చేయాలన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, అంకిత భావంతో పనిచేస్తూ శాఖ ప్రతిష్టను పెంచాలన్నారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించే పల్స్పోలియో కార్యక్రమానికి వైద్యులు, సిబ్బంది సిద్ధం కావాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజిలోని ఆడిటోరియంలో పల్స్పోలియో కార్యక్రమంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 2003 అక్టోబర్ నెల 13న జిల్లాలో చివరి పోలియో కేసు నమోదైందన్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, అయినా ముందు జాగ్రత్త చర్యగా పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 3,52,164 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్పోలియో చుక్కలు వేస్తామన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమ మాట్లాడుతూ మొత్తం 1,630 బూత్లలో పోలియో చుక్కలు వేస్తారన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 29, 30వ తేదిల్లో ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్క పిల్లవాడికి పల్స్పోలియో చుక్కలు వేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్, సంచార చికిత్స కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి, డీపీఎంఓ డాక్టర్ శైలేష్కుమార్, డీపీఓ విజయరాజు పాల్గొన్నారు. -
బాలలతో పనిచేయించడం నిషేధం
కర్నూలు(అర్బన్): బాలలతో పనిచేయించుకోవడం, పనిలోకి అనుమంతించడం పూర్తిగా నిషేధమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. జాతీయ, రాష్ట్ర సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి సూచనల మేరకు శుక్రవారం స్థానిక న్యాయ సేవాసదన్లో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించి బాలలతో పనిచేయించుకుంటే ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష తప్పదన్నారు. పారా లీగల్ వలంటీర్లు పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా కృషి చేయాలన్నారు. కార్మిక శాఖ అధికారి కేశన్న మాట్లాడుతూ బాల బాలికలతో షాపులు, ఫ్యాక్టరీల్లో పనిచేయించుకోవడం నేరమన్నారు. డీసీపీఓ టి.శారద మాట్లాడుతూ ఎవరికై నా బాల కార్మికులు కనిపిస్తే 1098 లేదా లీగల్ సర్వీసెస్ హెల్త్ లైన్ నెంబర్ 15100కు కాల్ చేసి సమాచారాన్ని అందించాలన్నారు. ఎన్జీఓ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల అంతా నగరంలో పర్యటించి బాల కార్మికులను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలకు వెళ్లేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే న్యాయ సేవాసదన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. -
టిప్పర్ను ఢీకొన్న ట్రావెల్ బస్సు
● ఐదుగురికి గాయాలుకొలిమిగుండ్ల: స్థానిక జమ్మలమడుగు రోడ్డులో శుక్రవారం రాత్రి టిప్పర్ను ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. చాగలమర్రికి చెందిన జాకీర్ తన పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు ట్రావెల్ బస్సు అద్దెకు తీసుకొని బంధువులతో కలిసి అనంతపురం జిల్లా తలారిచెరువు సమీపంలోని హాజివలి దర్గాకు బయలుదేరారు. మార్గం మధ్యలో కొలిమిగుండ్లలోని జమ్మలమడుగు జంక్షన్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ముందు వెళుతున్న టిప్పర్ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో 35 మందికి పైగా ఉన్నారు. డోర్తో పాటు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో బయటకు వచ్చేందుకు వీలు పడలేదు. స్థానికుల సాయంతో అతి కష్టం మీద ఇరుక్కుపోయిన డోర్, ఇతర భాగాలను తొలగించడంతో బస్సులో ఉన్న వాళ్లను బయటకు పంపించారు. సీఐ రమేష్బాబు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
కుక్కల దాడిలో 44 గొర్రెలు మృతి
● రూ.4 లక్షలు నష్టంగోనెగండ్ల: మండలంలోని ఐరన్బండ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున వీధికుక్కల దాడిలో 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాలు.. ఐరన్బండ గ్రామానికి చెందిన బజారి, చంద్ర, రమేష్ గొర్రెల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండలో శని, ఆది, సోమవారాల్లో గొర్రెల వ్యాపారం చేసేందుకు ముగ్గురు వ్యాపారులు గురువారం తెలంగాణలోని పెబ్బేరు సంతకు వెళ్లి రూ.4 లక్షలతో గొర్రెలను కోనుగోలు చేసి రాత్రి ఐరన్బండ గ్రామంలో నిర్మాణంలో ఉన్న పంచాయతీ కార్యాలయం భవనంలో వాటిని ఉంచారు. కార్యాలయం నిర్మాణంలో ఉండటంతో గదులకు తలుపులు లేవు. గేటు వద్ద తడికను అడ్డంగా పెట్టి రాత్రి ఇళ్లకు వెళ్లారు. తెల్లవారుజామున గొర్రెలను గుర్తించిన దాదాపు 10 వీధికుక్కలు వాటిపై దాడి చేసి కొరికి చంపాయి. ఆ సమయంలో గొర్రెలు అరవడంతో సమీపంలోని వచ్చి చూడగా అప్పటికే గొర్రెలు మృతిచెందాయి. విషయం తెలుసుకుని వ్యాపారులు బజారి, చంద్ర, రమేష్ కన్నీటి పర్యంతం అయ్యారు. అప్పులు చేసి గొర్రెలను కొని తెచ్చామని, రూ.4 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
మాల్గోవా బలోపేతానికి కృషి
కర్నూలు(అర్బన్): జిల్లాలో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (మాల్గోవా)ను బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీపీ సోమన్న, డాక్టర్ వై. రాజశేఖర్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఇటీవల పీఆర్ డీఈఈ నుంచి ఈఈగా పదోన్నతి పొందిన భాస్కర్తో పాటు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందిన మాదన్న, నాగన్నను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ.. మాల్గోవాను రాష్ట్రంలో బలోపేతం చేసే ప్రక్రియలో ఇటీవల విజయవాడలో భారీ సభను నిర్వహించారన్నారు. ఈ సభకు విశ్రాంత ఐఏఎస్ విజయకుమార్తో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై దిశానిర్దేశం చేశారన్నారు. అందరి సలహాలు, సూచనల మేరకు మాల్గోవాను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. పీఆర్ డీఈఈలు హెచ్డీ ఈరన్న, బండారు శ్రీనివాసులు, అధ్యాపకులు ఓబులేసు, నాగన్న, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర బంధం విషాదాంతం
హాలహర్వి: వివాహేతర బంధం విషాదాంతమైంది. ఓ మహిళ, ఆమె మూడునెలల పసికందును బలితీసుకుంది. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలివీ.. గూళ్యం గ్రామానికి చెందిన మహేష్(39) కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన దివ్యాంగురాలిని రెండో పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. అదే గ్రామంలో వివాహిత లీలావతి(36)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో లీలావతిని ఆమె భర్త పలుమార్లు దండించాడు. ఈ విషయాన్ని లీలావతి తన ప్రియుడు మహేష్ తో చెప్పింది. తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని లీలావతి, మహేష్, మూడు నెలల చిన్నారితో నాలుగు రోజుల క్రితం గూళ్యం గ్రామానికి చేరుకున్నారు. వీరిని గ్రామంలో ఎవరూ చేరదీయకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున గ్రామశివారులోని వంకలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.ఘటనలో లీలావతి, మూడు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మహేష్ కొన ఊపిరితో ఉన్నాడు. పొలం పనులకు వెళ్లిన రైతులు చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. హాలహర్వి ఎస్ఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. లీలావతి, మూడు నెలల చిన్నారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి బళ్లారికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ మూక దాడులు
మంత్రాలయం: వైఎస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం విజయవంతం కావడాన్ని జీరి్ణంచుకోలేక కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ మూకలు వీరంగం వేశాయి. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెలగబడ్డాయి. ఈ దాడుల్లో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను గాయపరిచారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి ఇంటి సమీపంలో పోలీసుల ఎదుటే తుఫాను వాహనాన్ని, మోటారు సైకిల్ను తగులబెట్టారు. మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన చేపట్టారు. కోసిగి మండల కేంద్రంలో జరిగిన నిరసనకు మంత్రాలయం మండలం నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలివెళ్లారు. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలోని టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్రరెడ్డి ఇంటిముందు రహదారి మీదుగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా వెళ్లారు. కోసిగిలో జరిగిన ఈ నిరసనకు అనూహ్య స్పందన లభించింది. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక రాఘవేంద్రరెడ్డి వర్గీయులు అక్కసు వెళ్లగక్కారు. నిరసన ముగించుకుని తిరిగి వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాఘవేంద్రరెడ్డి ఇంటి ముంగిట పోలీసుల కళ్లెదుటే దాడికి పాల్పడ్డారు. ముందుగా సూగూరు గ్రామానికి చెందిన దేవదాసు, లక్ష్మీరెడ్డి బైకును అడ్డగించి దాడిచేశారు. పోలీసులు కలుగజేసుకుని టీడీపీ మూకల నుంచి తప్పించి వారిని గ్రామంలోని స్టేషన్కు తరలించారు. తరువాత టీడీపీ గూండాలు అదేదారిలో వస్తున్న వైఎస్సార్సీపీ తుఫాన్ వాహనంపై విరుచుకుపడ్డారు. అందులోని కార్యకర్తల మీద, ఆ వెనుక బైక్పై వస్తున్న మరో ఇద్దరిపైన దాడిచేశారు. ఈ దాడుల్లో బూదూరుకు చెందిన పూజారి ఈరన్న, సూగూరు వాసి గొల్ల అంజినప్ప, 52–బసాపురం గ్రామస్తుడు గొల్ల రాముడు గాయపడ్డారు. వీరు ముగ్గురు ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బసాపురం గ్రామానికి చెందిన కుమ్మరి అల్లయ్య, మోరి డొంకయ్య, మేకల ప్రహ్లాద, శివ, కురువ నవీన్ బైక్లపై వస్తుండగా టీడీపీ వర్గీయులు వెంబడించారు. బూదూరుకు చెందిన పెద్ద నాగప్ప మోటార్ సైకిల్ను, నారాయణపురానికి చెందిన చిన్నబాబు తుఫాన్ వాహనాన్ని తగులబెట్టారు. ఎమ్మిగనూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని అడ్డగించిన పోలీసులు నిరసన ముగించుకుని స్వగ్రామం రాంపురానికి బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, అనుచరుల వాహనాలను పోలీసులు కోసిగిలో అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఘటనాస్థలానికి వెళ్లకుండా ఆయన వాహనాన్ని రాంపురం అడ్డరోడ్డులో నిలిపేశారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై టీడీపీ వర్గీయుల దాడిమాచర్ల ర్యాలీకి వెళ్లినందుకే దాడి చేశారని బాధితుడి ఆవేదన బాధితుడిని పరామర్శించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు పీఆర్కే రెంటచింతల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో శుక్రవారం పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( పీఆర్కే) ఆధ్వర్యంలో చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్న మంచికల్లు వైఎస్సార్సీపీ నాయకుడు పాశం వెంకటరెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. వెంకటరెడ్డిని మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటకు తరలించారు. కాగా దాడి విషయం తెలుసుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి గౌతమ్రెడ్డి మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వెంకటరెడ్డిని పరామర్శించారు. బాధితుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ ర్యాలీకి వెళ్లి వచ్చి సెంటర్లో కూర్చున్న తనపై ర్యాలీకి ఎందుకు వెళ్లావు...నీవు గ్రామంలో ఉండటానికి వీల్లేదంటూ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు గోగుల వెంకటరామిరెడ్డి, గోగుల లక్ష్మారెడ్డి, గోగుల పున్నారెడ్డి, గోగుల మహేష్ రెడ్డి కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారని తెలిపారు. -
కర్నూలు జిల్లాలో టీడీపీ గూండాల అరాచకం
సాక్షి, కర్నూలు జిల్లా: మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై పచ్చ మూకలు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వాహనాలకు పచ్చమూక నిప్పుపెట్టారు. టీడీపీ గూండాల దాడిలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు.దారి కాసి మరి వాహనాలను అడ్డుకున్న టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. సమాచారం తెలుసుకొని మాధవరం బయల్దేరిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. -
సారూ.. జీతాలు ఇవ్వండి!
ఆదోని సెంట్రల్: తమకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, ఎలా బతకాలని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీతాలు ఇవ్వాలని అడిగితే మూడు నెలలకు ఒక సారి ఎప్పుడో ఇచ్చిన జీతాలను చూపుతున్నారన్నారు. ఎప్పుడో ఇస్తే అవి ఇప్పుడు ఇచ్చినట్లు ఎలా అవుతాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి పెండింగో ఉన్న జీతాలను ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా హనుమంతురెడ్డి కల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేర కు పార్టీ కేంద్ర కార్యా లయం పాణ్యం నియో జకవర్గ పరిధిలోని అక్కి మి హనుమంతురెడ్డిని పార్టీ రాష్ట్ర సంయుక్త కా ర్యదర్శిగా నియమించా రు. ఈ సందర్భంగా అక్కిమి హనుమంతురెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో బాధ్యతాయుతంగా పనిచేస్తానని తెలిపారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, పా ర్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట సాని శివనరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు కోడుమూరు రూరల్: రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. గూడూరులో ఎరువుల అమ్మకాలను గురువారం ఆమె పరిశీలించారు. ఎరువుల అమ్మకాల్లో యాప్లో సాంతికేతిక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రకృతి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంతో భూమి సారవంతమవుతుందని, మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి వరలక్ష్మి, ఆర్డీఓ సందీప్కుమార్, గూడూరు తహసీల్దార్ వెంకటేష్ నాయక్, ఏఓ దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు. 18002332447కర్నూలు(సెంట్రల్): పీసీ అండ్ పీఎన్డీటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 18002332 447కు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమంగా కొన్ని హాస్పిటళ్లు, ల్యాబ్ల్లో లింగ నిర్ధారణలు చేస్తున్నారని, అలాంటి సమాచా రం ఉంటే చెప్పితే వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఆడ, మగ అనే తేడా చూడ డం మంచికాదని, ఆడైనా, మగైనా ఒక్కటే అన్న భావన ప్రజల్లో కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 28న పల్స్పోలియో కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈ నెల 28వ తేదీన పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ఇందుకు సంబంధించి గత 5వ తేదీ నుంచే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అలాగే 12వ తేదీన మెడికల్ ఆఫీసర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేసి వారికి కార్యక్రమంపై శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ మీటింగ్ 22న, సిటీ/అర్బన్, మండలస్థాయి టాస్క్ఫోర్స్ మీ టింగ్ 24న నిర్వహించనున్నారు. బూత్ల వారీ గా పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా 28వ తేదీన ఐదేళ్లలోపు చిన్నారులకు వ్యాక్సిన్ చుక్కలు వేయనున్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి 29, 30వ తేదిల్లో పల్స్పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రూ.4 కోట్ల జెడ్పీ నిధులతో 110 పనులు
● పాలనా అనుమతులు మంజూరు చేసిన పాలకవర్గం కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రజలకు ఉపయోగపడే పలు రకాల మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా పరిషత్ సాధారణ నిధులు రూ.4.06 కోట్లతో 110 పనులు చేపట్టేందుకు జెడ్పీ పాలకవర్గం పాలనా అనుమతులు మంజూరు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీటికి సంబంధించిన పైప్లైన్ల విస్తరణ, మోటార్ల రిపేరి, బోర్వెల్స్, అంగన్వాడీ భవనాల మరమ్మతులు, అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లీనిక్స్ భవనాలను పూర్తి చేసేందుకు సెక్టోరియల్ ఆక్టివిటీస్ కింద ఈ నిధులను వినియోగించుకోనున్నారు. ఈ పనులకు సంబంధించి 1వ స్థాయీ సంఘ సమావేశంలో చర్చించి సభ్యులు ఆమోదం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10న జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదం తీసుకొని పాలనా అనుమతులు మంజూరు చేశారు. 23 శాతం జెడ్పీ నిధులతో రూ.96 లక్షలతో 21 పనులు 12 శాతం ఆర్డబ్ల్యూఎస్ నిధులు రూ.122.09 లక్షలతో 51 పనులు 10 శాతం సెక్టోరియల్ నిధులు రూ.69.25 లక్షలతో 16 పనులు 15 శాతం ఎస్సీ ఈఎంఎఫ్ నిధులు రూ.56.20 లక్షలతో 13 పనులు 15 శాతం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నిధులు రూ.15 లక్షలతో 03 పనులు 6 శాతం ఎస్టీ ఈఎంఎఫ్ నిధులు రూ.47.60 లక్షలతో 06 పనులు జెడ్పీ పాలనా అనుమతులు పొందిన పనుల వివరాలు.. -
చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులు
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులు పారిపాటిగా మారాయని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీఆర్ఏ, వీఆర్వో విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు ఆవేదన వ్యక్తం చేశా రు. గురువారం కర్నూలు వచ్చిన ఆయన ఇటీవల పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న వీఆర్వో టి.మహ్మద్హుస్సేన్ కుటుంబ సభ్యులను వారి ఇంట్లో పరామర్శించారు. హుస్సేన్ మరణానికి అధికారుల వేధింపులే కారణమని వారు చెప్పడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...టీడీపీ ప్రభుత్వంలో వీఆర్వోలపై దాడులు నిత్యకృత్యమమయన్నారు. ఉన్నతాధికారుల పని ఒత్తిడి కూడా పెరిగిపోయిందన్నారు. దీని కారణంగా చాలా మంది వీఆర్వోలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. వీఆర్వో టి.మహ్మద్ హుస్సేన్ కుటుంబానికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లా యీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బంగిశ్రీధర్, సురేష్రెడ్డి, టౌన్ అధ్యక్ష,కార్యదర్శు లు మురళీధర్నాయుడు, చిన్న కృష్ణ పాల్గొన్నారు. -
కేఎంసీని సందర్శించిన అకడమిక్ డీఎంఈ
కర్నూలు(హాస్పిటల్): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(అకడమిక్) డాక్టర్ సత్యనారాయణ మూర్తి గురువారం కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లను సందర్శించారు. కాలేజీలోని పెండింగ్లో ఉన్న ఎగ్జామినేషన్ సెక్షన్, ఆడిటోరియం, లెక్చరర్ గ్యాలరీ, స్కిల్ ల్యాబ్, నిర్మాణంలో ఉన్న ఐపీ బ్లాక్ పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో పారిశుధ్య, సెక్యూరిటీ గార్డుల విధులపై ఆరా తీశారు. అనంతరం కౌన్సిల్ హాలులో హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించి వారి సమస్యలు, అత్యంత ముఖ్యమైనవి, అత్యవసరంగా చేయాల్సిన పనుల గురించి చర్చించారు. లెక్చరర్ గ్యాలరీ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, ఐపీ బ్లాక్ కనీసం రెండు ఫ్లోర్లైనా అందుబాటులోకి తెస్తే అనేక విభాగాలకు మేలు చేసినట్లు అవుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ కోరారు. అనంతరం స్కిల్ల్యాబ్ వద్ద ఆయన మొక్కలు నాటారు. పీజీలకు నిర్వహిస్తున్న జీఎల్పీ, జీసీపీ, ఎథిక్స్ సమావేశంలో పాల్గొని వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఆసుపత్రిలో ముఖ్యమైన సమస్యలను సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు వివరించి చెప్పారు. -
రిషీ.. పలకవేమీ?
గోనెగండ్ల: ‘రిషీ.. పలకవేమీ’ అంటూ తల్లిదండ్రులు బోయ రాజు, అరుణమ్మ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరికి మగపిల్లవాడు లేకపోవడంతో రాజు భార్య అరుణమ్మ చెల్లెలు నాగమణి కుమారుడు రిషీనిమూడేళ్ల క్రితం దత్తత తీసుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు. అయితే విధి వక్రీకరించించి గురువారం ఉదయం బాత్రూములో ఉన్న హీటర్ను పట్టుకుని రిషీ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతో ప్రేమతో పెంచుకున్న బాలుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కర్నూలు టౌన్ డీఎస్పీగా రాఘవేంద్ర కర్నూలు (టౌన్): కర్నూలు టౌన్ డీఎస్పీగా కేవీ రాఘవేంద్ర నియమితులయ్యారు. గురువారం రాత్రి డీజీపీ కార్యాలయ వర్గాల నుంచి నియామాక ఉత్తర్వులు వచ్చాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన ఎస్ఐగా, సీఐగా గుంటూరు జిల్లా పరిధిలో పనిచేశారు. కర్నూలులో డీఎస్పీగా పనిచేస్తున్న బాబు ప్రసాద్ వారం రోజుల క్రితం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
ఆదోనిలోని ఆర్ఆర్ కాలనీలో రెండేళ్లుగా నిలిచిపోయిన హైస్కూల్ భవనం పనులు అద్భుతమైన ప్రవేశ ద్వారాలు.. ఆకర్షణీయమైన బెంచీలు.. తళుక్కున మెరిసే గ్రీన్ బోర్డులు.. ‘స్మార్ట్’ బోధన.. ఇదీ ప్రభుత్వ పాఠశాలల్లో ఒకప్పటి మాట. విద్యార్థుల కాళ్లకు బూట్లు రాలేదు.. టైలు, బెల్టులు లేవు.. యూనిఫాం ఎప్పుడు వస్తుందో తెలియదు.. నిర్మాణంలో ఉన్న తరగతి గదులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేం.. ఇదీ నేటి మాట. అర్ధంతరంగా నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణం..‘చిక్కీ’పోయిన మధ్యాహ్న భోజనం.. కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించని దౌర్భాగ్యం.. ఇలా ఎన్నో సమస్యలతో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అద్వితీయమైన అభివృద్ధి కనిపించింది. నేడు సర్కారు స్కూళ్లలో ప్రగతి తడబడి కనీస సౌకర్యాలు కరువయ్యాయి.గోనెగండ్ల మండల వీరంపల్లి గ్రామంలో మరుగుదొడ్డి దుస్థితి కర్నూలు సిటీ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులు కనిపించడమే లేదు. వాటిలో చదివే పేద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చాలీచాలని తరగతి గదులు.. శిథిలావస్థకు చేరిన భవనాలే దిక్కయ్యాయి. యూనిఫాం, బూట్లు, పాఠ్య, నోటు పుస్తకాలు అందని దుస్థితి అంతటా కనిపిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన నాడు–నేడు పనులను అర్ధంతరంగా ఆపేశారు. అదనపు తరగతి గదులు అందుబాటులోకి రాకపోగా.. డిజిటల్ విద్య దూరమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాడు ఒక్కొక్కరికి రూ.2,419 విలువైన విద్యా కానుక విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే జగనన్న విద్యాకానుకను విద్యార్థుల చేతికి అందజేసిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. ఏటా జూన్ 12వ తేదీకి ప్రతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యాకానుక పేరిట మూడు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూల్ బ్యాగ్, బెల్ట్లు ఇచ్చేవారు. అలాగే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్సనరీలు, 1 నుంచి 5 తరగతులకు పిక్టోరియల్ డిక్సనరీలు అందించేవారు. ఒక్కొక్కరికి రూ.2,419 విలువైన విద్యాకానుకను అందించేవారు. నేడు కినుక వహించిన ‘విద్యార్థి మిత్ర’ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2.64 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బెల్టులు, డిక్షనరీలు, బ్యాగులు, స్కూల్ యూనిఫాం, వర్క్ బుక్స్ ఇవ్వాల్సి ఉంది. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు మాత్రమే పునఃప్రారంభం రోజున ఇవ్వనున్నారు. మిగిలినవి ఎప్పుడు ఇస్తారో విద్యాశాఖ అధికారులకే స్పష్టత లేదు. ● నోట్ బుక్స్ 14,82,441 గాను 5,88,513, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు 28,298 వచ్చాయి. అన్నీ జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. ● బెల్టులు 1 నుంచి 10 వరకు బాలురు, 1 నుంచి 5 వరకు బాలికలకు 1,85,471 అవసరం కాగా ఇప్పటి వరకు ఒక్కటీ కూడా రాలేదు. ● వర్క్బుక్లు 1,80,153గాను 1,69,465 మాత్రమే రాగా,25 మండలాలకు పంపించారు. ● టెక్ట్స్ బుక్లు 11,90,147 రాగా వాటిలో 9,79,822 26 మండల కేంద్రాలకు పంపించారు. ఇందులో సగం కూడాస్కూల్ పాయింట్కు చేరలేదు. ● బూట్లు 2,64,885 అవసరం ఉండగా ఒక్కటి కూడా రాలేదు. ● పిక్టోరియల్ డిక్షనరీలు (ఫస్ట్ క్లాస్) 17,926 అవసరం ఉండగా 4,880 మాత్రమే జిల్లాకు వచ్చాయి. వాటిని ఎనిమిది మండలాలకు పంపిణీ చేశారు. ● యూనిఫాం 2,64,885 మందికి ఒక్కొక్కరికి మూడు జతల చొప్పున రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 44,572 మందికి మాత్రమే రావడంతో నాలుగు మండలాలకు సరఫరా చేశారు. ‘చిక్కీ’పోయి! ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుతారని భావించిన గత ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరిట విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించింది. రోజుకో మెనూతో విభిన్న వంటకాలు, వారానికి మూడు రోజులు చిక్కీ, మూడు రోజులు రాగి జావ, వారానికి ఐదు రోజులు కోడిగుడ్డు ఇచ్చేవారు. విద్యార్థులు జావ తాగేందుకు వీలుగా స్టీలు గ్లాసులు సైతం నాటి ప్రభుత్వం సమకూర్చింది. ఈ పథకం పేరును కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చింది. ఈ పథకం కింద స్కూళ్లకు కేవలం బియ్యం మాత్రమే చేరాయి. కోడిగుడ్లు, చిక్కీలు స్కూళ్లకు చేరలేదు. దీంతో పాటు రాగిపండి, బెల్లం సైతం స్కూళ్లకు పూర్తి స్థాయిలో చేరలేదు. ప్రగతిని ‘నీరు’గార్చారు! కర్నూలు కేవీఆర్ గార్డెన్లోని ఉర్దూ హైస్కూల్లో రెండేళ్లుగా నిరుపయోగంగా ఆర్వో ప్లాంట్ చంద్రబాబు ప్రభుత్వంలో పడిగాపులు‘బడి’ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనబడి నాడు– నేడు పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పేరొస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులను నిలిపివేశారు. దీనికి తోడు పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలను సైతం మార్పులు చేసి అశాసీ్త్రయంగా తొమ్మిది రకాల బడులుగా విభజించారు. విద్య వ్యవస్థలను మంత్రి లోకేష్ అస్తవ్యస్తం చేశారు. డీఎస్సీ ద్వా రా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీకి చేసి నా కూడా సర్కార్ బడుల్లో ప్రామాణికమైన విద్య పతనావస్ధకు చేరిందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. పీఎంశ్రీ పథకం కింద చేపట్టిన పనులు చేస్తున్నప్పటికీ బిల్లులు సకాలంలో రాక అగుతూ..సాగుతున్నాయి. కేజీబీవీల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల పనులు, డార్మెటరీల పనులు సైతం పూర్తి కాలేదు. జిల్లాలో అన్ని యాజమాన్యాల బడులు 2,254 ఉండగా వాటిలో 4.57 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లు 1,445 ఉండగా వాటిలో 2.49 లక్షల మంది పిల్లలు ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మన బడి నాడు–నేడు ద్వారా రెండు విడతలుగా పనులు చేపట్టింది. మొదటి విడతలో 594 పాఠశాలల్లో రూ. 166.25 కోట్లు ఖర్చు చేసి తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. రెండో విడతలో 1,051 స్కూళ్లలో రూ.504.16 కోట్లతో పనులు చేపట్టారు. కార్పొరేట్ పాఠశాలల తరహాలో ప్రవేశ ద్వారాలు, ఆర్చీలు, ఆకర్షణీయమైన బెంచీలు, విద్యుత్ సదుపాయం, తాగునీరు, రన్నింగ్ వాటర్తో టైల్స్తో కూడిన టాయిలెట్ల వంటివి ఏర్పాటు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో రూ.24.47 కోట్లు వెచ్చించి 567 పాఠశాలల్లో మొదటి విడతలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. రెండో విడతలో 709 పాఠశాలల్లో రూ.23.05 కోట్లు ఖర్చు పెట్టి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని పనులు మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ల నిర్వహణను పట్టించుకోలేదు. దీంతో జిల్లాలో వందకుపైగా ఆర్వో ప్లాంట్లు మూలకు చేరాయి. మిగిలిన వాటిలో సగానికిపైగా ఇంత వరకు ఇన్స్టాలేషన్ చేయలేదని తెలుస్తోంది. -
నేడు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు
కర్నూలు (టౌన్): చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్న డిమాండ్తో నిర్వహిస్తున్న ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పేర్కొన్నారు. కర్నూలులో ఉదయం 10:15 గంటలకు స్థానిక ఐదు రోడ్ల కూడలి నుంచి మౌర్య ఇన్ మీదుగా జిల్లా పరిషత్తు కార్యాలయం వరకు ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. దోమల నివారణ చర్యలు తీసుకోండి కొత్తపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ హుసేనమ్మ, జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర రావుఅన్నారు. గురువారం ఎరమ్రఠం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కపిలేశ్వరం గ్రామాన్ని ఆరోగ్య విస్తరణ అధికారి నిత్య పూజారి ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
వెలుగోడు: ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన బుధవారం వెలుగోడు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేల్పనూరు గ్రామానికి చెందిన కొల్ల వెంకటేశ్వర్లు (49) తన కొత్త ట్రాక్టర్తో వ్యవసాయ పనుల నిమిత్తం బయలుదేరాడు. లింగాపురం శివ (42) అనే వ్యక్తి ట్రాక్టర్ను నడుపుతున్నాడు. ఒప్పి వాగు సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో వెంకటేశ్వర్లు, శివ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేశ్వర్లకు భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శివకు భార్య వెంకటలక్ష్మమ్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. శివ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనపై వెంకటేశ్వర్లు భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
భారీగా గంజాయి పట్టివేత
● ఏడుగురు అరెస్ట్, ఆటో స్వాధీనం ● పెద్దకొత్తిలి భంభం ఆశ్రమం సమీపంలో గంజాయి సాగు ఎమ్మిగనూరు రూరల్: గంజాయిని గుట్టుగా సాగు చేస్తూ విక్రయించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకోగా ముఠా పట్టుబడింది. నందవరం మండలం పెద్దకొత్తిలి భంభం ఆశ్రమం సమీపంలో గంజాయి సాగును గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న గంజాయిని రూరల్ పోలీస్స్టేషన్ ఆవరణలో బుధవారం సీఐ చిరంజీవి, నందవరం ఎస్ఐ తిమ్మారెడ్డి మీడియా ఎదుట హాజరుపరిచారు. అనంతరం డీఎస్పీ ముర్రవాడ భార్గవి నిందితుల వివరాలను వివరించారు. కనకవీడు పోలీస్చెక్ పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న రూరల్ సీఐ చిరంజీవి, నందవరం ఎస్ఐ తిమ్మారెడ్డికి ఓ ఆటోపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా 3 కేజీల గంజాయి పట్టుబడింది. ఆటోలో ఉన్న ఎమ్మిగనూరు పట్టణం శాంతినగర్ షేక్షావలి, మైనార్టీ కాలనీ షేక్చాంద్బాషా, కటికె వీధికి చెందిన వడ్డే భీమేష్, మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు నందవరం మండలం నాగలదిన్నె గ్రామ శివారులోని మిట్టసోమపురం క్రాస్ రోడ్డు సమీపంలో అదే గ్రామానికి చెందిన బెస్త తిప్పన్న దగ్గర గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అలాగే పెద్దకొత్తిలి గ్రామంలోని భంభం ఆశ్రమం సమీపంలో చాకలి రాముడు, చాకలి నాగార్జున గంజాయి సాగుచేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరిద్దరూ గంజాయిని పండిస్తూ ఆశ్రమం దగ్గర ఆరబెట్టి పొడిచేసి ఎమ్మిగనూరు, ఇతర ప్రాంతాల వారికి విక్రయించి సొమ్ముచేసుకుంటునట్లు వెలుగు చూసింది. వెంటనే ఆశ్రమం దగ్గరకు వెళ్లి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 2.340 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులతో పాటు ఓ మైనర్ను అరెస్ట్ చేసి వారి నుంచి మొత్తం 5.340 కిలోల గంజాయి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠాను పట్టుకున్న సీఐ, ఎస్ఐ, సిబ్బందిని డీఎప్పీ ముర్రవాడ భార్గవి అభినందించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు, నందవరం పీఎస్ హెచ్సీ కోదండరాముడు, సుభాన్, పీసీలు వీరేష్, భాస్కర్, వెంకటేష్, సుధాకర్, ఏవో సరిత, డిప్యూటీ తహసీల్దార్ మహేష్ తదితరులు ఉన్నారు. గంజాయి మత్తు పదార్థాలకు యువత బానిసలు కావొద్దు. గంజాయి మత్తులో అనేక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. మాదకద్రవ్యాల మత్తులో ఏమి చేస్తున్నారో తెలియని స్థితిలోకి వెళ్తారు. ఇటీవల గంజాయి మత్తు పదార్థాలకు యువత ఎక్కువ మొగ్గుచూపుతూ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. తమ పిల్లల నడవడికను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. – ముర్రవాడ భార్గవి, డీఎస్పీ -
కుటీర పరిశ్రమలకు విద్యుత్ రాయితీ
● విద్యుత్ శాఖ ఏఏఓ ఎస్జే చంద్రబోస్రావు కర్నూలు (అర్బన్) : కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేవారికి 20 కేవీ వరకు విద్యుత్ రాయితీ వర్తిస్తుందని విద్యుత్ శాఖ ఏఏఓ ఎస్జే చంద్రబోస్రావు చెప్పారు. బుధవారం స్థానిక బీసీ భవన్లో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దేవపూజ ధనుంజయ ఆచారి అధ్యక్షతన విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం–ఆర్థిక పారిశ్రామికాభివృద్ధి అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన ఏఏఓ మల్లికార్జున మాట్లాడుతూ.. విద్యుత్ రాయితీ కోసం యూడీవైఏఎం రిజిస్ట్రేషన్ తప్పక చేసుకోవాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఏఈఓ నాగరాజు మాట్లాడుతూ ఆదరణ పథకం ద్వారా కమ్మరి, వడ్రంగి, కంచరం, శిల్పం, స్వర్ణకార వృత్తుల వారికి 90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లు అందించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమల శాఖ అధికారి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ పథకం, రాష్ట్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పథకాల ద్వారా వడ్డీ లేని రుణాలు, 35 శాతం సబ్సిడీ, నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. నూతన కమిటీల ఎన్నిక విశ్వకర్మ పరిషత్ కర్నూలు, నంద్యాల జిల్లాలకు నూతన కమిటీలను ఎన్నుకున్నారు. కర్నూలు జిల్లా అధ్యక్షులుగా కమ్మరి తిమ్మయ్య ఆచారి, ప్రధాన కార్యదర్శిగా రమేష్ ఆచారి, కోశాధికారిగా ప్రదీప్ ఆచారి, ఉపాధ్యక్షులుగా వీరన్న ఆచారి, గిడ్డయ్య ఆచారి, కార్యదర్శిగా శ్రీరాం, కార్యనిర్వాహక కార్యదర్శిగా జీకే సతీష్ ఎన్నికయ్యారు. నంద్యాల జిల్లా అధ్యక్షులుగా విరాట్ వీరబ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శిగా నాగమహేశ్వరాచారి, కోశాధికారిగా వీర మహేంద్రాచారి, కార్యదర్శిగా చిన్నపుల్లయ్య ఆచారి ఎన్నికయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఎమ్మిగనూరు రూరల్: ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు వస్తూ బైచీగేరి సమీపంలోని మలుపు దగ్గర మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన జేరుబండి ఉదయ్కుమార్ (20) అనే యువకుడు దుర్మరణం చెందాడు. వివరాలు..పట్టణంలోని సోగనూరు రోడ్డులో నివాసముండే ఈ యువకుడు ఆదోనిలో బజాజ్ ఫైనాన్స్లో పనిచేస్తాడు. ప్రతి రోజు పల్సర్ బైక్పై ఆదోని వెళ్లి జాబ్ చూసుకొని రాత్రి ఎమ్మిగనూరుకు వచ్చేవాడు. మంగళవారం రాత్రి పనిముగించుకొని ఇంటికి వస్తుండగా బైచీగేరి సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి సిమెంట్ కల్వర్ట్ను ఢీకొంది. ఈ ఘటనలో ఎగిరి కిందపడిపోయిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మోటార్ బైక్ బలంగా కల్వర్టుకు ఢీ కొట్టడంతో పెట్రోల్ లీకై ఆ వాహనం కాలిబూడిదైంది. అటుగా వెళ్తున్న వారు గమనించి అంబులెన్స్లో ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుధవారం మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించి మృతుడి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉదయ్కుమార్ తండ్రి లక్ష్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సాక్షిగణపతికి విశేష పూజలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థమై బుధవారం సాయంత్రం సాక్షిగణపతి స్వామికి అభిషేకం, ఆలయ ప్రాంగణంలోని జ్వాలా వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు. సాక్షిగణపతి స్వామికి పంచామతాలతోను, ఫలోదకాలతోను, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోధకం, శుద్ధజలంతో అభిషేకం చేసి విశేషపుష్పార్చన, నివేదన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే జ్వాలా వీరభద్రస్వామి వారికి అభిషేకం, విశేషపుష్పార్చన జరిపించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని బైకర్ మృతి ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పట్టణ శివారులో ఉన్న 340సీ జాతీయ రహదారి బైపాస్లో సిద్ధపల్లె క్రాసింగ్ వద్ద బుధవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మోపెడ్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూరు పోలీసులు తెలిపిన మేరకు వివరాల మేరకు.. ఆత్మకూరు మండలంలోని బాపనంతాపురానికి చెందిన వెంకటేశ్వర్లు (50) సిద్ధపల్లె గ్రామంలో జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నాడు. తన మోపెడ్ను హైవే నుంచి సిద్ధపల్లె రస్తాకు మరలిస్తున్న సమయంలో వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనమేదో ఢీకొంది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దోపిడీ దొంగల అరెస్ట్
కర్నూలు: దొపిడీ దొంగలను మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. చాకలి శేఖర్ బి.క్యాంప్ శివారు డాక్టర్స్ కాలనీలోని వీసీ ప్లాజా అపార్ట్మెంట్లో నివాసముంటాడు. ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాధవీనగర్లో శిల్పా క్యాటరింగ్ ముందు శేఖర్ తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా బంగారుపేటకు చెందిన దాదపోగు శివకృష్ణ, బాలాజీ నగర్కు చెందిన సయ్యద్ ఇక్బాల్ బాషా, షేక్షావలి అలియాస్ టిల్లు, కొత్తపేటకు చెందిన సయ్యద్ రహిమాన్ తదితరులు కారులో చాకలి శేఖర్ను వెంబడించి చంపుతామని బెదిరించి రూ.5 వేలు లాక్కుని ఉడాయించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను బుధవారం జొహరాపురం గ్రామ పరిధిలోని సీపీఎం కొట్టాల వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.3 వేలు నగదుతో పాటు కారును సీజ్ చేసి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు పంపినట్లు మూడో పట్టణ సీఐ శేషయ్య తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య ఆదోని సెంట్రల్: రైలు కింద పడి బుధవారం పెద్దకడబూరు మండలం నౌటేకల్ గ్రామానికి చెందిన సి. మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదోని–మంత్రాలయం రైల్వే పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య తెలిపిన వివరాల మేరకు.. సి. మల్లయ్య భార్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఒంటరి జీవితం భరించలేక మనస్తాపం చెంది సమీపంలోని ఆదోని–నగరూర్ అర్ఎస్ఎస్ మధ్యలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారానికి మెరుగు పెడతామంటూ బురిడీ
● మెరుగు పెడుతూ బంగారాన్ని కాజేసిన కేటుగాడు.. ● బాధిత మహిళలు లబోదిబో కోడుమూరు రూరల్: స్థానిక కొండపేటలో గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరు మహిళలను క్షణాల్లో బురిడీ కొట్టించి నాలుగున్నర తులాల బంగారాన్ని కాజేశాడు. బాధితుల కథనం మేరకు.. కోడుమూరులోని కొండపేటకు చెందిన శేఖర్ భార్య పద్మావతి, వెంకటేశ్వర్లు భార్య చంద్రకళలు వరుసకు వదినా మరదళ్లు. బుధవారం మధ్యాహ్నం వీరంతా ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఓ కేటుగాడు ఇంటి వద్దకు వచ్చి ‘కంపెనీ ప్రచార నిమిత్తం వచ్చాం.. బంగారు, వెండి ఆభరణాలిస్తే.. మీ ముందే ఫ్రీగా మెరుగు పెట్టించి తళతళ మెరిసేలా చేస్తాం’ అంటూ నమ్మబలికారు. అయితే ఆ మహిళలు మొదట తమకు వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఆ కేటుగాడు ‘మీ కళ్ల ముందే మెరుగు పెట్టి ఇస్తా’నంటూ పదేపదే చెప్పడంతో చంద్రకళ తన వెండి పట్టిని ఇవ్వగా, మెరుగు పెట్టి ఇచ్చాడు. దీంతో నమ్మకం కుదిరిన ఆమె తన మెడలోని రెండున్నర తులాల తాళి చైన్ను మెరుగు పట్టేందుకు ఇచ్చింది. ఆ కేటుగాడు చంద్రకళ తాళి చైన్కు మెరుగుపెడుతూనే పక్కనే ఉన్న పద్మావతి మహిళకు చెందిన రెండు తులాల తాళిచైన్కు కూడా మెరుగుపెడతానంటూ ఇప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు వివిధ రకాల కెమికల్స్, పౌడర్లు కలిపి తాళిచైన్లకు మెరుగుపెడుతున్నట్లుగా ఆ దుండగుడు నటించాడు. అనంతరం ఆ తాళి చైన్లను వారి ముందరే పసుపురంగు ద్రావణంలో వేసి కొద్ది సమయం తర్వాత తీసుకోవాలని చెప్పి ఆ కేటుగాడు అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్ది సమయం తర్వాత తాళి చైన్లను పసుపునీటి ద్రావణంలో చూసిన ఆ మహిళలు నిశ్చేష్టులయ్యారు. రెండు తాళిచైన్లు పరిమాణం సగానికి పైగా తగ్గిపోవడంతో పాటు, బంగారు చైన్లు తుంటలు తుంటలుగా తెగి ఉండడంతో లబోదిబోమంటూ ఆ మహిళలు కోడుమూరు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: ఏపీ మోడల్ స్కూళ్లలో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్.సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని తరగతుల ప్రవేశాలకు(ఇంటర్తో కలిపి)ఈ నెల 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి జాబితా 23న ప్రచురించి, 6 నుంచి 9వ తరగతులకు 24న పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితాలను 25న ప్రకటించి, 26న సర్టిఫికెట్లను పరిశీలించి ప్రవేశాలు కల్పిస్తామని డీఈఓ పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ జేడీగా రాజశేఖర్ కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ జిల్లా ఇన్చార్జ్ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ కే రాజశేఖర్ను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్ అయిన రాజశేఖర్ నాలుగేళ్లుగా ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు. ఈయనను పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా జాయింట్ డైరెక్టర్గా నియమించగా గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘మత్తు’తో యువత భవిష్యత్తు నాశనం కర్నూలు: మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి పూర్తి దూరంగా ఉండాలని హోంగార్డ్స్ సదరన్ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్ సూచించారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ టోల్ఫ్రీ నబర్ 1972కు తెలియజేయాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో బుధవారం డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన బ్రోచర్లు, వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే పోలీసు అధికారులు, సిబ్బందితో యోగాసనాలు నిర్వహించారు. హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ఈగల్ టీమ్ సిబ్బంది ఎలీషా, రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు కర్నూలు కల్చరల్: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానిగా 12 సంవత్సరాల పూర్తి చేసుకోవడంతో బీజేపీ ఓబీసీ మోర్చా ఆఽఽధ్వర్యంలో బుధవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలులోని బళ్లారి చౌరస్తాలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉల్చాల లక్ష్మణ్ నాయుడు ఆధ్వర్యంలో పూజలు చేశారు. మోదీ 12 ఏళ్ల పాలనా కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంజునాథ్, ఉపాధ్యక్షులు మస్తాన్, వీరప్ప, అనిత, రఘు, విజయ్, పాండు, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఉరుకుంద హుండీ ఆదాయం రూ. 1.27 కోట్లు కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయానికి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలకు బుధవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.1,27,68,230 వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. అలాగే వెండి14 కేజీల 420 గ్రాములు, బంగారం 46 గ్రాముల 280 మిల్లీ గ్రాములు వచ్చినట్లు చెప్పారు. లెక్కింపు కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారిగా జిల్లా ఎండోమెంట్స్ అధికారి సుధాకర్రెడ్డి వ్యవహరించారు. ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి, ఆలయ పర్యవేక్షకులు వెంకటేష్ మల్లికార్జున పాల్గొన్నారు. -
హామీల అమలుకు ఉద్యోగుల పోరాటం
● ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ కేవై కృష్ణ కర్నూలు(సెంట్రల్): ఉద్యోగుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క హామీని నెరవేర్చలేదని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ కేవై కృష్ణ విమర్శించారు. హామీల అమలు కోసం పోరాటాలకు దిగాలని ఉద్యోగులు నిర్ణయించారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగి మేలుకో–నీ భవిష్యత్ను కాపాడుకో అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అత్యవసరంగా ఏపీ జేఏసీ అమరావతి సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్ భద్రతకు సంబంధించిన ఎనిమిది ప్రధాన డిమాండ్లను అజెండాగా తీసుకుని సమావేశంలో సుధీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. గ్రామ, మండల, తాలూకా, డివిజన్, జిల్లా స్థాయిల్లోని ప్రతి ఉద్యోగి ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర నాయకత్వం చేపట్టే ఉద్యమ కార్యక్రమాలను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకత్వం భవిష్యత్లో ఎలాంటి కార్యాచరణకు పిలుపునిచ్చినా కర్నూలు జిల్లాలో విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం ఉద్యోగి మేలుకో..నీ భవిష్యత్ను కాపాడుకో పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు లక్ష్మీరాజు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కర్నూలు డివిజన్ అధ్యక్షుడు రామాంజనేయులు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు వెంకటరాజు, నాయకులు నాగరమణయ్య, శ్రీనివాసులు, సతీష్, సర్దార్, శంకరప్ప, బాను పాల్గొన్నారు. -
కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు (క్వింటాల్కు రూ.లలో)
వేరుశెనగ 6,755 7,950 ఆముదం 5,940 6,269 ఎండుమిర్చీ 8,699 10,899 శనగలు 3,119 5,601 కందులు 6,870 7,712 మొక్కజొన్న 1,754 1,940 మినుములు 2,500 1,352 కొర్రలు 1,602 1,602ఫోన్ నం : 08518–257204, 257661 -
అన్యాయం చేయొద్దు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఆదే పథకాన్ని చంద్రబాబు ఆడబిడ్డనిధి పేరుతో అమలు చేసేందుకు 2024 ఎన్నికల సమయంలో నిర్ణయించారు. 18–59 ఏళ్లలోపు మహిళలు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ నెలకు రూ.1,500 ప్రకారం బ్యాంకు అకౌంటుకు జమ చేస్తామని విస్పష్టంగా హామీ ఇచ్చారు. ఈ నెల 12 నాటికి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అవుతోంది. ఇంతవరకు ఆడబిడ్డ నిధి అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టకపోవడం అన్యాయం. – పద్మావతి, వెంకటాపురం, డోన్ మండలం -
చెరువులో అక్రమ తవ్వకాలు
సి.బెళగల్: బ్రాహ్మణదొడ్డి గ్రామ చెరువులో కొంతమంది దుండగులు అక్రమ తవ్వకాలను చేపట్టి, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులో నిబంధనలు విరుద్ధంగా జేసీబీతో తవ్వకాలు చేపట్టి, ట్రాక్టర్ల ద్వారా చెరువు మట్టిని తరలిస్తున్నారు. రైతుల పేరు చెప్పి వారి చాటున బ్రాహ్మణదొడ్డికి చెందిన కొంతమంది దుండుగులు రైతుల నుంచి ఒక్క ట్రాక్టర్ ట్రిప్పుకు అదనంగా డబ్బులు వసూళ్లు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పైగా తమకు మండల రెవెన్యూ అధికారుల అనుమతులు ఉన్నాయంటూ దగాకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత రెండు రోజులుగా దాదాపు వంద ట్రాక్టర్ల ట్రిప్పుల చెరువు మట్టి నిబంధనలు విరుద్ధంగా అక్రమార్కులు కొలుగొడుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెనరువు పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.తాము ఎవరికి చెరువులో మట్టి తరలించుకునేందుకు అనుమతి ఇవ్వలేదని ఆర్ఐ తరుణ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం ఓర్వకల్లు: మండలంలోని జాతీయ రహదారిపై గడివేముల క్రాస్రోడ్డు సమీపంలో బుధ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నన్నూరు గ్రామానికి చెందిన కురువ రంగస్వామి (50) అనే వ్యక్తి పసుపుల రుద్రవరం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సోమయాజులపల్లె గ్రామంలో సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న సన్నియాదవ్, ఆసిఫ్ యాదవ్ను బైక్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో ఆ ఇద్దరితో పాటు రంగస్వామి కిందపడ్డాడు. అదే సమయంలో గుర్తు తెలియని వాహనం అతనిపై ఎక్కి వెళ్లడంతో రంగస్వామికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్కుమార్ తెలిపారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుండ్రేవులపై పాలకులు నిర్లక్ష్యం కర్నూలు సిటీ: రాయలసీమ జిల్లాలకు జీవనాడీ లాంటిదైనా గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. బుధవారం నగరంలో రాయలసీమ విద్యార్థి సంఘాల సమావేశం నిర్వహించారు. రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవికుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు భరత్కుమార్ ఆచారి, రాయలసీమ యువజన విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రంగముని నాయుడు మాట్లాడుతూ గురువారం కోడుమూరులోని పరప్ప కాంప్లెక్స్ ఎదుట కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో జల సమరం పేరుతో దీక్ష చేపడుతున్నారని, ఉమ్మడి జిల్లా ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తుంగభద్ర నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే కేసీ కెనాల్తో పాటు, పశ్చిమ పల్లె కరువును శాశ్వతంగా తరిమేందుకు అవకాశం ఉంటుందన్నారు. గుండ్రేవుల సాధన కోసం ఎవరు ఆందోళన చేసినా రాయలసీమ విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తాయని ప్రకటించారు. -
పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి
కర్నూలు(సెంట్రల్): తక్షణమే పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఎరువులు, కరెంట్ చార్జీలను తగ్గించాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరులలో భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టి రోడ్డపైనే వంటావార్పు చేశారు. కర్నూలులో జిల్లా పరిషత్ నుంచి రాజ్విహార్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్దేశాయ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని రెండింతలుగా పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఎరువులు, కరెంట్ చార్జీలను పెంచారని విమర్శించారు. ఏప్రిల్, మే నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఉండడంతో ధరలు పెంచకుండా, ఎన్నికలు పూర్తవగానే ప్రజలపై భారాన్ని మోపారన్నారు. పక్షం రోజుల్లో ఐదారు సార్లు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం అన్యాయమన్నారు. దీని ఫలితంగా నిత్యావసర వస్తుల ధరలు పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆటో రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను కూడా పెంచడం దారుణమన్నారు. సర్దుబాటు పేరుతో రూ. 20 వేల కోట్ల భారాన్ని కరెంట్ చార్జీల రూపంలో చంద్రబాబు ప్రభుత్వం పెంచిందని, తగ్గించకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, సీఎం నగర కార్యదర్శి రాముడు, ఎస్యూసీఐ జిల్లా నాయకులు హరీస్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
ఆగమపాఠశాలకు 22 మంది ఎంపిక
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహించిన వీరశైవ ఆగమపాఠశాలకు 22 మంది ఎంపికయ్యారు. స్థానిక చంద్రవతి కల్యాణ మండపంలో మంగళవారం వీరశైవ ఆగమ కోర్సులో ప్రవేశానికి పరీక్ష నిర్వహించారు. మొత్తం 25 మంది అభ్యర్ధుల దరఖాస్తు చేసుకోగా 22 మంది హాజరయ్యారు. వీరంతా ప్రవేశ అర్హతను పొందారు. కోర్సులో ప్రవేశ అర్హతను పొందిన వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఆగమ కోర్సు కాలపరిమితి 6 సంవత్సరాలు కాగా విద్యాభ్యాస సమయంలో విద్యార్థులందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. ఈ పరీక్ష నిర్వహణలో స్వామివారి ఆలయ ఉప ప్రధానార్చకులు, ఆగమ పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.శివశంకరయ్య స్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాము లు, పాఠశాల పర్యవేక్షకులు డి.రంగన్న, సంబంధిత గుమాస్తా, పాఠశాల వార్డన్ జి.శ్రీనివాసులు, ఆగమ పండితులు ఎం.శివయ్య, ఆంగ్ల ఉపాధ్యాయులు డి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
సారా నేరస్తులను బైండోవర్ చేయాలి
● నేర సమీక్షలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి కర్నూలు: మద్యం, సారా పాత నేరస్తులను బైండోవర్ చేయాలని, అవసరమైన పక్షంలో పీడీ చట్టాన్ని ప్రయోగించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆదేశించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల ఎకై ్సజ్ అధికారులతో తన కార్యాలయంలో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ నేరాల స్థితిగతులు, వాటి నియంత్రణ, తద్వారా ప్రభుత్వ రాబడికి లక్ష్యాలను సాధించడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మద్యం సరఫరా దుకాణాల వారీగా మే నెలలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ, పెండింగ్ కేసులు తదితర అంశాలపై చర్చించారు. నాటుసారా ప్రభావిత గ్రామాల్లో సారా తయారీ, అమ్మకాలు పునఃప్రారంభం కాకుండా తరచూ దాడులు నిర్వహించాలని సూచించారు. ఏపీ సురక్ష యాప్ ద్వారా మద్యం అమ్మకాలను పర్యవేక్షించాలని, మద్యం షాపులు, బార్లు వ్యాపార పనివేళలను నిరంతరం తనిఖీ చేయాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రాయపాటి హనుమంతరావు, కర్నూలు, నంద్యాల ఈఎస్లు సుధీర్ బాబు, రవికుమార్, ఏఈఎస్లు రామకృష్ణారెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడ్, ఉమ్మడి జిల్లాల సీఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
తినడానికి తిండిలేక
నటుడు కావాలనే ఆసక్తితో అమ్మమ్మ బీబీ, మామయ్య గౌస్ అనుమతి తీసుకొని హైదరాబాద్లో చదువుకుంటానని చెప్పి వచ్చాను. వారి వద్ద నుంచి రూ.2వేలతో 15 ఏళ్ల వయసులో వచ్చేశాను. అవకాశం కోసం చాలా తిరిగాను. ఉన్న రెండువేలు అయిపోయాయి. దీంతో మెట్రో, ఫుట్పాత్లో ఉంటూ కడుపు మాడ్చుకున్నాను. ఒక్కోసారి తిండికి డబ్బులు లేక మామయ్యలను అడుగుదామనుకున్నాను. కానీ ఏమంటారో అని భయపడేవాడిని. పెద్ది సినిమా ట్రైలర్లో నా డైలాగ్ విని మామయ్య, నానమ్మ సంబర పడ్డారు. మంచి నటుడిగా ఎదగాలన్నదే నా కోరిక. –గఫూర్ -
తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా.. పోరాటం ఆగదు!
● వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కర్నూలు: తప్పుడు కేసులు ఎన్ని బనాయించినా ప్రశ్నించడం, పోరాటం చేయడం ఆగబోదని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. పోలీసుల వేధింపులు భరించలేక వైఎస్సార్సీపీ యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలు చెయ్యిపై కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను నిరసిస్తూ మే 14న కలెక్టరేట్ ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ.45 కోట్లు దండుకున్నాడని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి భరత్ ఫిర్యాదు మేరకు కర్నూలు మూడో పట్టణ పోలీసులు సిద్ధార్థ రెడ్డిపై క్రిమినల్, పరువు నష్ట దావా కేసు నమోదు చేశారు. ఈ విషయంపై విచారించేందుకు పోలీసులు సిద్ధార్థ రెడ్డిని మంగళవారం స్టేషన్కు పిలిపించి 41 సీఆర్పీసీ నోటీసు ఇచ్చి మంత్రిపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని కోరారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ బయట సిద్ధార్థ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను మంత్రిపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలతో కోర్టుకు సమర్పిస్తానని స్పష్టం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో 40 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అలాగే యువగళం పాదయాత్ర సందర్భంగా అప్పటి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రూ.600 కోట్లు అవినీతికి పాల్పడినట్లు మంత్రి లోకేష్ ఆరోపించారు. ఇప్పటివరకు వారు వాటికి తగిన ఆధారాలు ఎందుకు చూపలేదని నిలదీశారు. మంత్రి భరత్కు సంబంధించిన పరిశ్రమతో ఆ ప్రాంతమంతా కలుషితమవుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే మొత్తం రౌడీలతో దౌర్జన్యం చేయించిన సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. తనపై గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులు నమోదు చేశారని, వాటన్నింటినీ తప్పుడు కేసులుగా న్యాయస్థానం కొట్టేసిందన్నారు. మంత్రి భరత్ను ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు నమోదు చేసి పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున ప్రశ్నించడం, పోరాటం చేయడం ఆపే ప్రసక్తే లేదన్నారు. తమ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశిస్తే ఏ సమస్యలౖపైనెనా ఏ ప్రాంతంలోనైనా తాను పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం
పాణ్యం: మండల పరిధిలోని సుగాలిమెట్ట వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు అండర్ బ్రిడ్జి ద్వారా శాశ్వత పరిష్కారం చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. మంగళవారం ఆయన అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు, ఎస్డీపీఓ మందాజావళితో కలిసి బ్లాక్ స్పాట్ను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నేషనల్ హైవే, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో అండర్ బ్రిడ్జి కింద రోడ్డు వేసి పిన్నాపురం వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశామన్నారు. కార్యక్రమంలో పాణ్యం సీఐ కిరణ్కుమార్రెడ్డి, ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు(సెంట్రల్) : కర్నూలు జిల్లా జీవనాడి గుండ్రేవుల ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నట్లు కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 11వ తేదీన కోడుమూరులో జల సమరదీక్షను చేపడుతున్నట్లు చెప్పారు. మంగళవారం బిర్లా కంపౌండ్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండ్రేవుల ప్రాజెక్టు హామీలకే పరిమితమైందన్నారు. ఈ నేపథ్యంలో చేపటే దీక్ష కార్యక్రమంలో జిల్లాలోని రైతులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు పులకుర్తి భాస్కర్, గూడూరు నాగిరెడ్డి, కేపీఎస్ సభ్యులు హరినాథ్, భార్గవ్, రామాంజనేయులు పాల్గొన్నారు. -
పల్లెల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
● డిప్యూటీ ఎంపీడీఓలతో డీపీఓ జి. భాస్కర్ కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ కోరారు. మంగళవారం తన చాంబర్లో జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీఓలతో ఆయ న సమావేశం నిర్వహించారు. చెత్త సేకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథం పలు గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం వెళ్లడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కోసిగి, సి. బెళగల్, గోనెగండ్ల మండలాల్లోని గ్రామాల నుంచి స్వచ్ఛరథం నిర్వహణకు సంబంధించి ఐవీఆర్ కాల్స్లో ప్రజలు అధిక సంఖ్యలో నెగిటివ్గా సమాధానాలు ఇచ్చారన్నారు. ఇక నుంచి నిర్ణయించిన షెడ్యూల్ మేరకు అన్ని గ్రామాలకు స్వచ్ఛరథం వెళ్లేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అలాగే పన్నుల వసూళ్లపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించాలని, 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.28 కోట్లు వసూలు చేయా ల్సి ఉందన్నారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాని, తాగునీటి సరఫరాకు సంబంధించిన పైప్లు ఎక్కడైనా లీకేజీ ఉంటే వెంటనే ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో సమన్వయం చేసుకొని పైపులను మార్చాలన్నారు. అలాగే ట్యాంకులను ఎప్పటికప్పు డు శుభ్రం చేయాలన్నారు. సమావేశంలో కర్నూలు డీఎల్పీఓ టి. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రీసర్వేలో జాయింట్ ఎల్పీఎంలు లేకుండా చూడాలి
కర్నూలు(సెంట్రల్): రీసర్వేలో జాయింల్ ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్ )లు లేకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, ప్లాంటేషన్, హౌసింగ్, జలధార–జలహారతి, అక్షరాంధ్ర కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రీసర్వే ప్రక్రియలో జాయింట్ ఎల్పీలు ఒక గ్రామంలో రెండు శాతం కన్నా ఎక్కువగా ఉండకూడదన్నారు. పట్టాదారు పాసు బుక్కుల జారీ, ఈకేవైసీ ప్రక్రియ, డ్రాఫ్ట్, తుది ఆర్ఓఆర్ తయారీలో 95 శాతం కచ్చితత్వం ఉండాలన్నారు. మ్యూటేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. సరైన పరిశీలన లేకుండా పట్టా భూములను ప్రభుత్వం భూములుగా, 22ఏ కింద, డాటెడ్ ల్యాండ్లుగా నమోదు చేస్తే ఇబ్బందులు వస్తాయన్నారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంపై పూర్తి స్థాయి దృష్టి సారించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జేసీ నూ రుల్ ఖమర్,డీఆర్వో సి.వెంకట నారాయణ మ్మ ,డీఎఫ్ఓ శ్యామల, హౌసింగ్ పీడీ నరసింహారెడ్డి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, డీఆర్డీఏ పీడీ రమణా రెడ్డి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ పాల్గొన్నారు. -
నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్
బనగానపల్లె : నాణ్యతకు, నమ్మకానికి మారు పేరు భారతి సిమెంట్ అని కంపెనీ టెక్నికల్ ఇంజినీర్ కిరణ్కుమార్, సేల్స్ ఆఫీసర్ జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని నందవరం గ్రామంలో మౌలాలి సిమెంట్ దుకాణంలో తాపీ మేసీ్త్రలకు సిమెంట్ నాణ్యత, వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కిరణ్కుమార్, జీవన్రెడ్డి మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటిక్ టెక్నాలజీతో తయారవుతుందని, అల్ట్రాఫాస్ట్ నాణ్యత కలిగి ఉంటుందన్నారు. ఇతర కంపెనీల సిమెంట్ ఐదు గంటల్లో సెట్ అవుతుందని, భారతీ అల్ట్రాఫాస్ట్ రెండు గంటల్లోనే సెట్ అవుతుందని తెలిపారు. ఈ సిమెంట్ ఎంతో దృఢత్వం కలిగి ఉండటంతో నిర్మాణాలు త్వరగా పూర్తవుతాయని పేర్కొన్నారు. అనంతరం భవన నిర్మాణాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి తాపీ మేసీ్త్రలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కంపెనీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య చాగలమర్రి: మండల కేంద్రం చాగలమర్రిలోని భూమా నగర్కు చెందిన మల్లుగాళ్ల హరికృష్ణ(32) మంగళవారం ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాయీబ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవించే హరికృష్ణకు భార్యతో మనస్పర్థలు తలెత్తాయి. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుడి తల్లి మల్లుగాళ్ల నరసమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ ఎం. రాజారెడ్డి తెలిపారు. -
ఆధునిక సాంకేతికతతో కచ్చితమైన చికిత్స
కర్నూలు(హాస్పిటల్): ఆధునిక సాంకేతిక విధానాలతో రోగులకు కచ్చితమైన చికిత్స అందించగలుగుతున్నట్లు కర్నూలు మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్, ఏఎస్ఐ చైర్మన్ డాక్టర్ పి.హరిచరణ్ చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు మెడికల్ కాలేజీ ఆవరణలో సర్జికల్ వైద్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిచరణ్ మాట్లాడుతూ.. కర్నూలులో ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు సర్జన్స్ వీక్ వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా సర్జన్స్ వీక్ను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజల్లో శస్త్రచికిత్సలపై అవగాహన పెంపొందించడం, ఆధునిక వైద్య సాంకేతికలపై చర్చలు, వైద్య విద్యార్థులు, యువ వైద్యుల కోసం శాసీ్త్రయ సమావేశాలు, ప్రజలకు ఆరోగ్య సూచనలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సెంట్రల్ ఈసీ మెంబర్లు డాక్టర్ ఎస్వీ రామమోహన్రెడ్డి, డాక్టర్ రామచంద్రనాయుడు, ప్రొఫెసర్లు డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ మాధవిశ్యామల, డాక్టర్ జయరామ్, సెక్రటరి డాక్టర్ బిజి. రాహుల్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయబాబు, అసిస్టెంట్లు, పీజీలు పాల్గొన్నారు. -
నా ఫేవరేట్ రెజ్లర్ పెద్ది సార్!
● దొర్నిపాడు యువకుడు గఫూర్ దొర్నిపాడు: ఇటీవల విడుదలైన పెద్ది సినిమాలో ‘అదే నాఫెవరేట్ రెజ్లర్ పెద్దిసార్’ అంటూ డైలాగ్ చెప్పి ఓ యువకుడు వెలుగులోకి వచ్చాడు. పెద్ది సినిమాలో డైలాగ్ చెప్పిన గఫూర్ సొంతూరు దొర్నిపాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో అవ్వాతాత బీబీ, సత్తార్ మీరాంసా వద్ద ఉంటూ దొర్నిపాడు ప్రభుత్వ పాఠశాలలో 7వ వరకు చదివాడు. సినిమా నటుడు కావాలనే ఆసక్తితో హైదరాబాద్ వెళ్లి మెట్రోస్టేషనల్లో ఉంటూ అవకాశం కోసం ఎదురు చూశాడు. మధ్యవర్తుల ద్వారా తొలిసారిగా టీవీ సీరియల్ రంగులరాట్నంలో అవకాశం పొందాడు. చాలా మందికి దొర్నిపాడు యువకుడిగా తెలియదు. ఎవరా అని వెతికేసరికి మన ఊరి మనవడే అంటూ ప్రాచుర్యం పొందాడు. నటించిన చిత్రాలు అఖండ–2, పెద్ది చలన చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో ఒక పా త్ర పోషిస్తున్నాడు. అలాగే కార్తీకదీపం, గృహలక్ష్మి, మా అత్త బంగారం, ఇంటికి దీపం ఇల్లాలు, స్రవంతి, మట్టిగాజులు, పాపేమా జీవనజ్యోతి, రంగులరాట్నం వంటి సీరియల్స్లో నటించాడు. -
పులి చర్మాల కేసులో నిందితులకు జైలు
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని దోర్నాల మండలం ఐనముక్కలలో స్వాధీనమైన రెండు పెద్దపులి చర్మాల స్వాధీనం కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డీడీ విగ్నేష్ అపావ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 2014లో ఎన్ఎస్టీఆర్ పరిధిలోని పెద్దదోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలో చిట్టిబాబు అనే వ్యక్తి ఇంటిలో రెండు పెద్ద పులి చర్మాలు, గోర్లను ఆత్మకూరు ప్లయింగ్ స్క్వాడ్ అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే క్రమంలో ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన వన్యప్రాణి వేటగాడు వేముల నాగేశ్వరరావు, సున్నిపెంట నివాసి విజయ్ బాబు మార్కాపురం అటవీ డివిజన్ ప్రాంతంలో రెండు పెద్ద పులులను తుపాకీతో కాల్చి చంపి వాటి చర్మాలను, గోర్లను చిట్టిబాబు ఇంటిలో భధ్రపరిచి విక్రయించడానికి సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో నిందితులపై అధికారులు కేసు నమోదు చేసి చార్జ్ షీట్ వేసి కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం 2020లో మార్కాపురం జూనియర్ సివిల్ జడ్జి నిందితులు ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా ఖరారు చేశారు. అయితే ఈ తీర్పుపై నిందితులు జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. కాగా ఈ కేసును సమీక్షించిన మార్కాపురం జిల్లా జడ్జి కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనని భావించి అదే తీర్పును ఖరారు చేశారు. దీంతో ముద్దాయిలను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. సాధారణంగా వన్యప్రాణి వేట కేసుల్లో సాక్షాధారాల సమర్పణ లోపాల కారణంగా అటవీ అధికారుల శ్రమ ఫలించదు. కాని ఈ కేసులో శాసీ్త్రయ, సాంకేతిక సాక్ష్యాలతో నేరాన్ని నిర్ధారించినట్లు తెలుస్తోంది. -
డీఆర్డీఏ పీడీ వైపీ రమణారెడ్డి బదిలీ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వైపీ రమణారెడ్డి బదిలీ అయ్యారు. ఈయనను అనంతపురం జిల్లా టూరిజం, సాంస్కృతి క శాఖ అధికారిగా నియమించారు. పంచాయతీ రాజ్లో డివిజినల్ డెవలఫ్మెంటు అధికారి(డీఎల్డీవో) అయిన రమణారెడ్డి దాదాపు రెండేళ్లుగా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈయన రిక్వెస్ట్పైనే అనంతపురం జిల్లా పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారిగా డిప్యుటేషన్పై నియమితులయ్యారు. ఈ పోస్టులో ఈయన ఏడాది పాటు కొనసాగుతారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్స్పల్ సెక్రటరీ కాంతిలాల్ దండే జీవో మంగళవారం ఆర్టీ నెంబరు 545 జారీ చేశారు. పీఆర్ ఈఈగా శివ సాగర్రెడ్డి కర్నూలు(అర్బన్): వైఎస్సార్ కడప జిల్లాలో డీఈఈగా విధులు నిర్వహిస్తున్న జీ శివసాగర్రెడ్డికి పదోన్నతి కల్పించి కర్నూలు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఈగా నియమించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ స్పెష ల్ చీఫ్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్త ర్వులు జారీ చేశారు. కర్నూలు పీఆర్ ఈఈగా విధులు నిర్వహించిన ఎస్ మహేశ్వరరెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేశారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు పాణ్యం డీఈఈ నాగిరెడ్డి ఇన్చార్జ్ ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఐదుగురికి పదోన్నతి రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది డీఈఈలకు ఈఈ లుగా పదోన్నతి కల్పించి వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఈఈలుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి ఈఈలుగా పదోన్నతి కల్పించారు. ఈఈలుగా పదోన్నతి పొందిన వారిలో ఈ అశ్వత్థామను తాడేపల్లిలోని ఆర్డీ కమిషనర్ కార్యాలయానికి డిప్యూటేషన్పై నియమించారు. అలాగే కే నాగరాజును కందుకూరుకు, డీ లక్ష్మినారాయణను మచిలీపట్నానికి, కేఎస్ఆర్ మోహన్రావును జమ్మలమడుగుకు, ఈ భాస్కర్ను భీమవరానికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తేనెటీగల దాడి మహానంది: మహానంది సమీపంలోని ఎంసీ ఫారంలో ఉన్న వ్యవసాయ కళాశాల వద్ద మంగళవారం తేనెటీగలు దాడి చేయడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కళాశాల వద్ద విద్యార్థులు ఫేర్వెల్ పార్టీకి సంబంఽధించి బ్యానర్ విడుదల చేస్తున్న సమయంలో టపాసులు పేల్చడంతో కళాశాల ప్రాంగణంలోని చెట్టుపై ఉన్న తేనె తుట్టె నుంచి తేనెటీగలు చెల్లాచెదురై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఎంసీ ఫారం గ్రామానికి చెందిన జయమ్మ, శేఖర్తో పాటు మరికొందరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించినట్లు స్థానికులు వెల్లడించారు. గంజాయి పట్టివేత నందవరం : పెద్దకొత్తిలి పంచాయతీ పరిధిలోని సంజీవపురం గ్రామ సమీపంలో ఉన్న కొత్త కాలనీలో గంజాయి పట్టుబడింది. సమాచారం మేరకు భం భం స్వామి ఆశ్రమం వద్ద ఉన్న ఇంటిలో పోలీసులు తనిఖీ చేసి 5.300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని చాకలి రాముడు, చాకలి నాగరాజుతో పాటు మిట్టసోమపురం గ్రామానికి చెందిన తిప్పన్నను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, ఎస్ఐ తిమ్మారెడ్డి, ఆర్ఎస్డీటీ మహేష్కుమార్, మండల వ్యవసాయ అధికారిణి సరిత పంచనామా నిర్వహించారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి కర్నూలు: మద్యం అతిగా సేవించి అనారోగ్యానికి గురైన గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. బళ్లారి చౌరస్తా ఆటోస్టాండ్ సమీపంలో గల కాలువలో గుర్తు తెలియని వ్యక్తిని డ్రైవర్లు గుర్తించి రెండు రోజుల క్రితం 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. సుమారు 50 సంవత్సరాల వయస్సు గల ఈ వ్యక్తి నీలం, బూడిద రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. పొట్టకు ఎడమ వైపు, కుడివైపున పుట్టుమచ్చలు ఉన్నాయి. మృతదేహం ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు 91211 01062కు ఫోన్ చేసి సమాచారం అందించాలని నాలుగో పట్టణ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కర్నూలు: కర్నూలు లక్ష్మీనగర్లోని గ్రీన్ పార్కు బార్ అండ్ రెస్టారెంట్ ముందు కేసీ కెనాల్ గట్టుపై అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉండి 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. మంగళవారం ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహం కుడి ఎదపైన, కుడి తొడకు నల్లటి పుట్టుమచ్చలు ఉన్నాయి. నీలపు గీతలు గల నలుపు రంగు ఫుల్ షర్టు, నలుపు జీన్స్ ప్యాంటు ధరించాడు. ఆచూకీ తెలిసిన వారు 9121101061కు ఫోన్ చేసి సమాచారం అందించాలని మూడో పట్టణ సీఐ శేషయ్య కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
● బైక్పై వెళ్తూ ముందు ఉన్న కారును ఢీకొన్న వైనం ● మానవత్వం చాటుకున్న వెల్దుర్తి ఎంపీడీఓ, ఈఓఆర్డీ, సచివాలయ సిబ్బంది కల్లూరు/వెల్దుర్తి: కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారిపై ఉలిందకొండ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం కె. మార్కాపురానికి చెందిన కురువ మల్లికార్జున తన కుమార్తె మౌనికను వెల్దుర్తి బీసీ బాలికల హాస్టల్లో చేర్పించాలనుకున్నా డు. దరఖాస్తు చేసేందుకు గతంలో అదే పాఠశాలలో చదివిన తన అన్న గణేశ్ కుమార్తె మంజుతో కలిసి సోమవారం బైక్పై వెల్దుర్తికి బయలుదేరాడు. మార్గమధ్యలో నాయకల్లు బ్రిడ్జి వద్దకు రాగానే ముందు వెళ్తున్న కారును ప్రమాదవశాత్తూ మల్లికార్జున వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బైక్పై నుంచి కింద పడ టంతో బాబాయి, అమ్మాయికి తీవ్ర గాయాలయ్యా యి. అదే సమయంలో విధి నిర్వహణకు కారులో కర్నూలు నుంచి వస్తున్న వెల్దుర్తి ఎంపీడీఓ చంద్రశేఖర్ రెడ్డి, ఈఓఆర్డీ రవికిశోర్, సచివాలయాల సిబ్బంది క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అంబులెన్స్కు సమాచారమిచ్చారు. హైవే పోలీసులతో కలిసి క్షతగాత్రుల ఆచూకీ గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఎంపీడీఓ, ఈఓఆర్డీ స్వయంగా క్షతగాత్రులను అంబులెన్స్లోకి చేర్చగా, వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వైద్య విద్యార్థులకు మోత
కర్నూలు(హాస్పిటల్): వైద్య విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం మోత మోగిస్తోంది. క్రీడల అభివృద్ధి పేరుతో వారి నుంచి బలవంతపు వసూళ్లు చేస్తోంది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ ద్వారా ఆయా మెడికల్ కాలేజీలకు ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల మేరకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి వైద్య విద్యార్థులకు ఉత్తర్వులు వెళ్లాయి. ఈ మేరకు వైద్య విద్యార్థులు తప్పనిసరిగా క్రీడల కోసం తమ వంతు వాటా చెల్లిస్తున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో 250 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ మేరకు మొత్తం 1,250 మంది యూజీ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అలాగే వివిధ విభాగాల నుంచి మూడేళ్లకు కలిపి 538 మంది పోసు్ట్రగాడ్యుయేట్ (పీజీ) విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఈ కళాశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ బాగా రాణిస్తున్నారు. ఈ మేరకు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో ఆయా క్రీడాంశాల్లో పలు పతకాలు, ప్రశంసాపత్రాలు సాధిస్తున్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను మరింత ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం క్రీడల అభివృద్ధి పేరుతో వారి నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. ఆయా మెడికల్ కాలేజీలకు హెల్త్ యూనివర్సిటీ రూ.10 లక్షలు ఇస్తుందని, మరో రూ.10 లక్షలను విద్యార్థుల నుంచి వసూలు చేయాలని ఆయా కళాశాలలకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు కర్నూలు మెడికల్ కాలేజిలోనూ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ పేరుతో వైద్య విద్యార్థులకు ఉత్తర్వులు వెళ్లాయి. రూ.12 లక్షలకు పైగా వసూళ్లు క్రీడా మైదానం అభివృద్ధి, క్రీడా పరికరాల కొనుగోళ్లకు గాను వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయాలని యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు పీజీ, యూజీ విద్యార్థులు డబ్బులు కళాశాల అకౌంట్లో జమ చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 1250 మంది యూజీ విద్యార్థుల నుంచి ఒక్కొక్కరు రూ.500ల చొప్పున రూ.6,25,000లు, 538 మంది పీజీ విద్యార్థుల నుంచి రూ.5,38,000లను వసూలు చేస్తున్నారు. ఈ మేరకు మొత్తం రూ.12,63,000ల ను విద్యార్థుల నుంచి వసూలు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధిక శాతం విద్యార్థుల నుంచి డబ్బులను కళాశాల బ్యాంక్ ఖాతాలో జమ చేయించారు. ఈ మొత్తాన్ని క్రికెట్ ఫీల్డ్స్, వాలీబాల్ కోర్టులు, బాల్బాడ్మింటన్ కోర్టులు, కబడ్డీ కోర్టులు, త్రోబాల్ కోర్టులు, ఫుట్బాల్ ఫీల్డ్స్, అథ్లెటిక్ ట్రాక్ల ఏర్పాటుకు వినియోగించనునున్నారు. క్రీడా మైదానాల అభివృద్ధి చేసి హెల్త్ యూనివర్సిటీ టోర్నమెంట్స్/నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా విద్యార్థుల నుంచి ఇప్పటికే ఫీజు రూపంలో వసూలు చేసిన మొత్తం కళాశాలలో రూ.8కోట్లకు పైగా నిధులు ఉన్నాయి. క్రీడా మైదానం అభివృద్ధికి, పరికరాల కొనుగోలుకు ఈ నిధులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. లేదా రాష్ట్ర ప్రభుత్వమే క్రీడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ రెండు గాకుండా వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. క్రీడల నిర్వహణ పేరుతో వసూళ్లు పీజీ విద్యార్థికి రూ.వెయ్యి, యూజీ విద్యార్థికి రూ.500 చొప్పున బలవంతపు వసూళ్లు హెల్త్ యూనివర్సిటీ ఆదేశాల మేరకు వసూలు చేస్తున్న అధికారులు -
పెద్దాసుపత్రిలో యువతికి అరుదైన ఆపరేషన్
● ప్లీహం వద్ద ఏర్పడిన కణితి ● ఆపరేషన్ ద్వారా తొలగింపు కర్నూలు(హాస్పిటల్): ఆమెకు 50 లక్షల మందిలో ఒకరికి వచ్చే ఆరోగ్య సమస్య వచ్చింది. అనారోగ్య సమస్యతో ఆమె తిరగని ఆసుపత్రి లేదు. చివరకు పెద్దాసుపత్రిని నమ్ముకుని ఇక్కడికి వచ్చి చేరింది. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతి క్లిష్టమైన ఆపరేషన్ను వైద్యులు విజయవంతంగా చేశారు. సోమవారం ఈ వివరాలను ఆసుపత్రిలోని ధన్వంతరి హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లుతో కలిసి జనరల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ హరిచరణ్, ప్రొఫెసర్ డాక్టర్ జయరామ్ వివరించారు. డోన్ మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన శ్రావణి (18)కు ఏడాది క్రితం వివాహం అయ్యింది. కొంత కాలానికే ఆమెకు కడుపునొప్పి, కడుపు ఉబ్బరం సమస్య ప్రారంభమైంది. క్రమంగా నొప్పి తీవ్రం కావడంతో చికిత్స కోసం ఆమె ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించింది. కడుపులో నీటి బుడగలు ఉన్నాయని తేల్చి మందులు ఇచ్చి పంపినా తగ్గలేదు. దీంతో ఆమె చివరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జనరల్ సర్జరీ విభాగంలో గత నెల 9వ తేదీన చేరింది. ఆమెకు ప్రొఫెసర్ డాక్టర్ జయరామ్ అవసరమైన వైద్యపరీక్షలు చేయించారు. పొత్తి కడుపులో కుడివైపున ప్లీహము వద్ద అరుదైన కణితి ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు, అనెస్తీషియా వైద్యుల సహకారంతో ఆరు గంటల పాటు శ్రమించి జనరల్ సర్జరీ వైద్యులు ప్లీహము వద్ద ఏర్పడ్డ కణితిని పూర్తిగా తొలగించారు. ఆపరేషన్లో ప్రొఫెసర్ డాక్టర్ జె.జయరామ్తో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయశంకర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ బీసన్న, డాక్టర్ చైతన్యవాణి, డాక్టర్ ఎన్.దీప్తి, డాక్టర్ జగన్, అనెస్తీషియా వైద్యులు డాక్టర్ రామశివనాయక్, డాక్టర్ జయదేవ్ రాథోడ్, డాక్టర్ సురేఖ ఉన్నారు. శ్రావణి కోలుకోవడంతో 18వ రోజున ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ ఆపరేషన్ను డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవలో ఉచితంగా నిర్వహించినట్లు వారు తెలిపారు. ఇదే ఆపరేషన్ను ప్రైవేటులో నిర్వహిస్తే రూ.20 లక్షల వరకు వసూలు చేస్తారని చెప్పారు. ఆపరేషన్ను విజయవంతం చేసి, సమస్య పరిష్కరించి ప్రాణం పోసిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులను శ్రావణి కుటుంబసభ్యులు స్వగ్రామం నుంచి వచ్చి ఘనంగా సన్మానించారు. -
మహిళ మృతి
గోస్పాడు: బాబానగర్ గ్రామం వద్ద సోమవారం లక్ష్మీనిషాద్ (28) అనే మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన కబీర్దాస్ జిల్లా బందర్ గ్రామానికి చెందిన దంపతులు లక్ష్మినిషాద్, పవన్లు ఏడాదిన్నర నుంచి బాబానగర్ వద్ద గురురాజ స్కూల్లో బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో వారికి కేటాయించిన గదిలో ఆమె నిద్రించేందుకు ఉపక్రమించింది. అయితే బయటకు వెళ్లిన భర్త పవన్ తిరిగి వచ్చి చూడగా ఎటువంటి కదలిక లేకుండా పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే చికిత్స నిమిత్తం 108లో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్రెడ్డి తెలిపారు. -
సాంకేతికతను వినియోగించుకోండి
● కోర్టు కానిస్టేబుళ్లతో అడిషనల్ ఎస్పీ సమీక్షకర్నూలు: కేసుల దర్యాప్తులో న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరముందని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా అన్నారు. జూలై 11న లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో ఈ–సమన్లు, ఈ–ప్రాసిక్యూషన్, ఏపీఓఎల్ఐఎస్ యాప్ వినియోగంపై పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కోర్టు కానిస్టేబుళ్లు, పోలీసు అధికారులతో ఏఎస్పీ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులకు సంబంధించిన ఈ–సమన్ల జారీ, వాటిని సకాలంలో అమలు, డిజిటల్ విధానంలో నివేదికల వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రాసిక్యూషన్ వ్యవస్థ ద్వారా కేసుల వివరాలు, చార్జిషీట్లు, కోర్టు విచారణ సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సహాయంతో ఆన్లైన్లో సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరముందని వివరించారు. కోర్టు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పెండింగ్ అంశాలను తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మెగా లోక్ అదాలత్లో పెండింగ్ కేసులలో రాజీ పరిష్కారమయ్యే కేసులను గుర్తించి సంబంధిత పక్షాలకు సహకారం అందించాలన్నారు. డీసీఆర్బీ సీఐ గుణశేఖర్ బాబు, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్య నాయుడుతో పాటు కోర్టు కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దర్జాగా గ్రావెల్ దందా
● చెరువులు, గుట్టల్లో అక్రమ తవ్వకాలు ● చోద్యం చూస్తున్న అధికారులు డోన్ రూరల్: అధికార పార్టీ అండదండలతో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. చెరువులు, వంకలు, వాగులు, గుట్టల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతులు లేకుండా యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. వెంకటనాయునిపల్లె, రేకులకుంట, లక్ష్మింపల్లె, ఓబులాపురం మెట్ట, జగదుర్తి గ్రామ పరిసర ప్రాంతాల్లో గ్రావెల్ దందా దర్జాగా సాగుతోంది. ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ, వే బిల్లుల రూపంలో రుసుం చెల్లించకుండా రెండు చేతులా జేబులు నింపుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో రేయింబవళ్లు జేసీబీలతో గ్రావెల్ను తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా అధికారులు ఏమి తెలియనట్లు వ్యహరిస్తుండటంతో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు జగదుర్తి, కొచెర్వు చెరువుల్లో మట్టిని అక్రమంగా తవ్వి రైతుల పొలాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పలు చెరువుల్లో ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నా మైనర్ ఇరిగేషన్ అధికారులు సైతం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. చెరువులు ఉనికిని కోల్పోతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పల్లెల్లో టిప్పర్లు, ట్రాక్టర్లు అధిక లోడుతో వెళ్తుండటంతో రహదారులు దెబ్బతింటున్నాయి. గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ఆదోని: ఉదయాన్నే రోజు వారి కూలీ పనికి వెళ్లిన ఓ యువకుడు విద్యుదాఘాతానికి బలయ్యాడు. దిబ్బన్కల్ గ్రామానికి చెందిన గుజ్జుల రంగన్న నాలుగో కుమారుడు గోవిందు (23) గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిర్మిస్తున్న ఇంటికి క్యూరింగ్ చేయడానికి సోమవారం ఉదయం వెళ్లాడు. మోటార్ ఆన్ చేసి గోడలకు వాటర్ క్యూరింగ్ చేస్తుండగా మోటారు వద్ద పైపు ఊడిపోయింది. ఆ క్రమంలో పైపును తిరిగి అమర్చుతుండగా గోవిందు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబానికి అండ గా నిలవాల్సిన కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, అక్క కన్నీరుమున్నీరు గా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గోవిందు మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం ● కుడి ఎదపై గజ్జన్న పేరుతో పచ్చ బొట్టు పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం ఎస్సార్బీసీ కాల్వ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపారు. ఎస్సార్బీసీ కాల్వ నుంచి రాంగ్రూట్లో బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు లభించలేదు. మృతుడు 35 – 40 ఏళ్లు వయస్సులోపు ఉండొచ్చని, నలుపు, తెలుపు రంగు గళ్ల చొక్కా, తెల్లటి ప్యాంట్ ధరించారని ఎస్ఐ తెలిపారు. కుడి ఎదపై గజ్జన్న, కుడి చేయిపై సాయి సంతోష్, ఎడమ చేయిపై డి. నాగేంద్ర భూపతి పేర్లపై పచ్చ బొట్లు ఉన్నాయన్నారు. మృతదేహాన్ని నంద్యాల జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు 9121101096కు సంప్రదించాలని కోరారు. ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృత్యువాత బేతంచెర్ల: అంబాపురం గ్రామంలో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ కంసలి లింగన్న (42) ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం సేద్యం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా లోయ ప్రాంతంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది. సాయంత్రమైనా లింగన్న ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఆచూకీ తెలియలేదు. అయితే సోమవారం ఉదయం గ్రామానికి వచ్చే రహదారిలో లోయ ప్రాంతంలో ట్రాక్టర్ కింద పడి ఉన్న లింగన్నను గ్రామస్తులు గుర్తించి బయటకు తీశారు. కాగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతునికి భార్య లక్ష్మీదేవితో పాటు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు శెట్టి తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
కర్నూలు: నగరంలో కొత్తబస్టాండ్లో ప్రయాణికుల తరహాలో బస్సు ఎక్కుతూ చోరీకి పాల్పడిన హర్యానా రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు విఠల్ నగర్కు చెందిన సావిత్రమ్మ, శ్రీలతలు హైదరాబాదుకు వెళ్లేందుకు గత నెల 14వ తేదీన కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో బస్సు కోసం వేచి ఉండగా అదే సమయంలో నలుగురు వ్యక్తులు వారికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ లగేజీ, బ్యాగులను బస్సులో పెడుతున్నట్లు నమ్మించారు. బ్యాగులో ఉన్న 6.5 తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలు అపహరించి బస్సు దిగి పరారయ్యారు. జడ్చర్ల వద్దకు చేరుకున్న తర్వాత బాధితులు లగేజీ బ్యాగును తెరిచి చూడగా అందులో ఉన్న ఆభరణాలు కనిపించలేదు. ఈ మేరకు బాధితురాలు సావిత్రమ్మ నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీని పరిశీలించగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా గుర్తించి వారి వివరాలను సేకరించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన వారీగా గుర్తించి నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్ఐలు శరత్కుమార్, గోపితో కలసి సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి సీఐ విక్రమసింహ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో సీసీ ఫుటేజీ ఆధారంగా నలుగురు దొంగలను గుర్తించి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. ప్రయాణ సమయంలో అపరిచిత వ్యక్తులను నమ్మి బ్యాగులను అప్పగించవద్దని, అప్రమత్తంగా ఉండాలంటూ సీఐ సూచించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరచిన క్రైం పార్టీ సిబ్బంది సుబ్బరాయుడు, మురళి, జీనస్, ఈశ్వర్, గోవింద్ తదితరులను సీఐ అభినందించారు. -
గోల్డ్ మైనింగ్ ప్లాంట్ సందర్శన
తుగ్గలి: జొన్నగిరి సమీపంలోని గోల్డ్ మైనింగ్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ మైనింగ్శాఖ చీఫ్ సెక్రటరీ ముఖేష్కుమార్ మీనా సోమవారం సందర్శించారు. జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిట్డ్ ఇండియా గోల్డ్ మైనింగ్ కంపెనీ అధ్వర్యంలో జొన్నగిరి సమీపంలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు చాలా ఏళ్ల క్రితం గుర్తించారు. వివిధ పరిశోధనలు అనంతరం అక్కడ దాదాపు రూ. 500 కోట్లతో నూతనంగా ప్లాంట్ ఏర్పాటు చేశారు. గోల్డ్ మైనింగ్ కంపెనీలో బంగారం ఉత్పత్తి కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ ప్రారంభం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో వచ్చే అవకా శం ఉండటంతో చీఫ్ సెక్రటరీగా పర్యటించినట్లు తె లుస్తోంది. ఈ సందర్భంగా ఆయన కంపెనీ ప్రతినిధులు, ఉద్యోగులతో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యం, పని చేస్తున్న సిబ్బంది వివరాలును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ ఓబులేష్, డీఎస్పీ వెంకటరామయ్య, తహసీల్దార్ రవి, కంపెనీ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. -
హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలి
● సర్ సమీక్షలో సచివాలయాల ఉద్యోగుల ఆందోళన ● అధికారులను చుట్టుముట్టి నిరసన కర్నూలు (టౌన్): అధికారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆనంద్కుమార్, శివ ప్రసాద్ తదితరులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో సర్ సర్వేపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు, అడిషనల్ కమిషనర్ ఆర్జీవీ. కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎన్నికల తహసీల్దార్లు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే సచివాలయాల వీఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వీఆర్ఓ హుస్సేన్ అమర్ హై.. అంటూ నినాదాలు చేశారు. ఆయనకు మద్దతుగా అన్ని విభాగాల సచివాలయాల ఉద్యోగులు మద్దతు పలకడంతో సమావేశంలో ఉద్రిక్తతత చోటు చేసుకుంది. సచివాలయాల ఉద్యోగులంతా పోడియం వద్దకు వెళ్లి అధికారులను నిలదీశారు. సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం సర్ సర్వేలో 14 డిపార్టుమెంట్లకు సంబంధించిన ఉద్యోగులను వినియోగించుకోవాలని ఉందన్నారు. సచివాలయాల ఉద్యోగులు 18వ స్థానంలో ఉన్న తమపై ఒత్తిడి చేయడం తగదన్నారు. పండుగ రోజుల్లో, సెలవు దినాల్లో పని చేయాలంటూ ఒత్తిడి చేయడం మానుకోవాలని, టెలికాన్ఫరెన్స్ల పేరుతో వేధించడం, డెడ్లైన్ విధించడం వంటివి ఆపాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హుస్సేన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేయడంతో 10 రోజుల వ్యవధిలో మృతుని కుటుంబానికి టిడ్కో గృహం మంజూరు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. అలాగే సచివాలయాల ఉద్యోగులు అడిగిన డిమాండ్లను పరిశీలిస్తామని, ఒత్తిడి లేకుండా పని చేయించుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కాగా సర్పై నిర్వహించే సమావేశంలో వాగ్వావాదం, గొడవలు జరిగే అవకాశం ఉంటుందన్న సమాచారంతో పోలీసులు ముందుగానే అక్కడ పర్యవేక్షించారు. -
యూరియా, డీఏపీ వినియోగంపై ఆంక్షలు
కర్నూలు(అగ్రికల్చర్): యూరియా వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియూ, డీఏపీ పంపిణీకి శ్రీకారం చుట్టింది. మొదటి రోజునే సర్వర్ సమస్యలు ఉత్పన్నం కావడం గమనార్హం. యాప్ ద్వారా యూరియా, డీఏపీ అమ్మకాలను జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి పలు చోట్ల పరిశీలించారు. కర్నూలు నగరంలోని మన గ్రోమర్ సెంటర్, శివరామకృష్ణ ఫర్టిలైజర్, కల్లూరు మండలంలోని లక్ష్మిపురం గ్రామాల్లో యాప్ ద్వారా యూరియా. డీఏపీ అమ్మకాలను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి ఏపీఏఐఎంఎస్ యాప్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు సబ్ డివిజన్ ఇన్చార్జీ ఏడీఏ దస్తగిరిరెడ్డి, కల్లూరు, కర్నూలు మండల వ్యవసాయ అధికారులు విష్ణువర్ధన్రెడ్డి, రూఫస్ రొనాల్డ్ తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లుగా అరాచక పాలన
● అభివృద్ధి, సంక్షేమం లేదు ● ఆలూరులో నల్లబెలూన్లు ఎగరేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యే విరూపాక్షిఆలూరు రూరల్: రాష్ట్రంలో రెండేళ్లుగా అరాచక పాలన సాగుతోందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ఆలూరులో సోమవారం వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి నల్లబెలూన్లు ఎమ్మెల్యే ఎగురవేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయాలు, మోసాలు, దగాపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. ఈ నెల 12న నిర్వహించే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దోచుకొని..దాచుకోవడమే! రెండేళ్ల చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు దోచుకొని..దాచుకోవడమే లక్ష్యంగా పనిచేశారని ఎమ్మెల్యే విమర్శించారు. సంక్షేమ పథకాలు అటకెక్కాయన్నారు. ఎక్కడా అభివృద్ధి పనులు కనిపించడం లేదన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను, ఉద్యోగులను.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రూ.కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. హామీ లు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని అప్పులాంధ్రగా మార్చేశారన్నారు. గడిచిన రెండేళ్లలో ఏకంగా రూ.3.50 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపారన్నారు. కార్యక్రమంలో నాయకులు మండల కన్వీనర్ మల్లికార్జున, భాస్కర్, గుండయ్య, నాగప్ప, వెంకటేషులు, దానాల రాజు, శేఖర్, వరుణ్, సాయి, కొట్టాల రాజు, హనుమంతప్ప, గజ్జలప్ప, మల్లయ్య, గౌస్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బెదిరింపు రాజకీయాలకు భయపడం
● టీడీపీ నేతల అక్రమ ఇళ్ల నిర్మాణాలపై చర్యలు తీసుకోరేం?కర్నూలు(టౌన్): నగరంలోని తన ఎస్వీ కాంప్లెక్స్లో డీవియేషన్ పేరిట విజిలెన్స్, టౌన్ప్లానింగ్ అధికారులు కొలతలు వేస్తూ హడావుడి చేశారని, ఇదంతా అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకే చేస్తున్నారని, రాజకీయంగా వేధిస్తే భయపడేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎస్వీ కాంప్లెక్స్లోని తన చాంబర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2005 సంవత్సరంలోనే ఎస్వీ కాంప్లెక్స్ వాణిజ్య భవనానికి సంబంధించి అన్ని అనుమతులు, రూ.12 లక్షల ఫీజులు చెల్లించి బీఆర్ఎస్ అనుమతి తీసుకున్నామన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. కర్నూలులో అధికార పార్టీ నేతలకు చెందిన ఇళ్లు, వాణిజ్య భవనాలు, హోటళ్లు, రాజసౌధాలు, ఫ్యాక్టరీల్లో డీవియేషన్లు లేవా అని ప్రశ్నించారు. అనధికార ఫ్లోర్లు లేవా..? అన్ని అనుమతులు సక్రమమేనా? అధికారం మారితే పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతల ఆస్తులపై మాత్రమే తనిఖీలు చేయడం వెనుక రాజకీయ కక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కక్ష సాధింపు రాజకీయాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వానికి చేతనైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపాలన్నారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
కర్నూలు: తన కుమారుడు సూర్యనారాయణకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఇద్దరు మహిళలు రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశారని పత్తికొండకు చెందిన షేకమ్మ, ఒకేషనల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కడపకు చెందిన గంజికుంట సురేఖ దేవి రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశారని కర్నూలు శ్రీరాం నగర్కు చెందిన చిన్నపుల్లయ్య, కర్నూలు రిజిస్టర్ కార్యాలయంలో తన కుమారునికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఇద్దరు వ్యక్తులు రూ.80 వేలు తీసుకుని మోసం చేశారని కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన మద్దిలేటి తదితరులు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 112 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామయ్య నాయుడు, రామాంజులు తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. -
‘పది’ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం
కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజు సిబ్బంది విధుల్లో చేరడం, తదితర కారణాలతో పాటు మూల్యాంకనం చేసిన తరువాత వచ్చిన మార్కులను ఆన్లైన్లో ట్యాబ్ల ద్వారా నమోదు చేసేందుకు వెబ్సైట్లో సాంకేతిక సమస్యలతో మధ్యాహ్నం స్పాట్ మొదలైంది. జిల్లాకు మొత్తం 9,568 సమాధాన పత్రాలు రాగా, మొదటి రోజు 3,283 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేశారు. ఇందుకోసం చీఫ్ ఎగ్జామినర్లుగా 25 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 90 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 45 మందిలో 32 మంది స్పాట్లో పాల్గొన్నారు. నేడు మూల్యాంకనం పూర్తి చేయనున్నారు. విధుల్లో చేరిన కర్నూలు డీఎఫ్ఓ కర్నూలు కల్చరల్: కర్నూలు జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల సోమవారం విధుల్లో చేరారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్స్కు మే 11 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు డెహ్రాడూన్ ఐజీఎన్ఎఫ్ఏలో నిర్వహించిన మిడ్ కెరీర్ ట్రైనింగ్లో ఆమె పాల్గొన్నారు. మేనేజ్మెంట్ మాడ్యూల్, థెమాటిక్ టూర్, లైన్ మినిస్ట్రీ మాడ్యుల్ , ఫారెస్ట్రీ మాడ్యుల్లో నాలుగు వారాల పాటు శిక్షణ పొందారు. ఈ శిక్షణ కాలంలో నంద్యాల డీఎఫ్ఓ నాగమునేశ్వరి కర్నూలు ఇన్ఛార్జి డీఎఫ్ఓ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె నుంచి శ్యామల బాధ్యతలు స్వీకరించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీరాఘవేంద్ర స్వామి కొలువైన మంత్రాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని శ్రీమఠం పీఠాఽధిపతి సుబుధేంద్ర తీర్థులు తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం శ్రీరాఘవేంద్ర సర్కిల్లో సిఆర్ఓ ఆఫీసు ముందు భక్తులకు వసతి గృహాల లభ్యత తాజా సమాచారం తెలిపే అధునాతన ఎల్ఈడీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఠాఽధిపతి మట్లాడుతూ భక్తులకు ఇబ్బంది లేకుండా శ్రీమఠం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లోని వసతి గృహాల సమాచారం భక్తులకు ఎప్పటికప్పుడు తెలియాలనే ఉద్దేశంతో ఈ ఎల్ఈడీ స్క్రీన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. శ్రీమఠం వసతి గృహాల్లో ఽభక్తులందరూ స్వచ్ఛత పాటించాలన్నారు. కార్యక్రమంలో శ్రీమఠం మేనేజర్ ఎస్కె.శ్రీనివాసులు, ఇంజనీర్ సురేష్ కోనాపూర్ పాల్గొన్నారు. అధ్యాపక నియామకాల దరఖాస్తు గడువు పొడిగింపు కర్నూలు కల్చరల్: విశ్వ విద్యాలయాల్లో అధ్యాపక నియామకాల దరఖాస్తు గడువు పొడిగించినట్లు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి.వెంకట బసవరావు, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వ విద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ షావలి ఖాన్ సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ‘ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2026’ ప్రక్రియకు సంబంధించిన గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారన్నారు. https://apuniversitiesrecruitment.apcfss.in వెబ్సైట్లోని కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించటానికి, రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించడానికి ఈనెల 8వ తేదీకి బదులు ఈనెల 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. అన్ని అనుబంధ పత్రాలతో దరఖాస్తు హార్డ్ కాపీని రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా ఈనెల 22వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. అర్హులు, అనర్హుల జాబితా 22వ తేదీన ప్రదర్శిస్తామని, 29వ తేదీ వరకు ప్రాథమిక అర్హతపై ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానంనంద్యాల(అర్బన్): ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్స్ల్లో చేరేందుకు దరఖాస్తు గడువు జూన్ 22 వరకు పొడిగించినట్లు ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కోర్స్ల్లో చేరేందుకు పదో తరగతి, ఇంటర్మీడియెట్ పాస్ అయిన వారు అర్హులన్నారు. దరఖాస్తులు www.angrau.ac.in వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 9966505285 నంబరును సంప్రదించాలన్నారు. -
సోలార్ ప్రాజెక్టులకు భూములను గుర్తించండి
కర్నూలు(సెంట్రల్): పశ్చిమ ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములను గుర్తించాలని ఎకై ్సజ్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తిరుపతి ఎకనామిక్ రీజియన్ శాఖ సీఈఓ ముఖేష్కుమార్ మీనా ఆదేశించారు. సోమవరం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి, దార్శనికతపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులోని మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని తిరుపతి ఎకనామిక్ రీజియన్ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జేసీ నూరుల్ ఖమర్, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, పరిశ్రల శాఖ జీఎం అశోక్కుమార్, ఏపీఐఐసీ అధికారి సందీప్, ఎయిర్పోర్టు డైరక్టర్ విద్యా సాగర్, సీపీఓ భారతి, విద్యుత్ ఎస్ఈ ప్రదీప్కుమార్, డీడీ మైన్స్ నాగిని పాల్గొన్నారు. -
సర్కారు బడా.. వద్దులే సారూ!
‘సర్కారు బడా.. వద్దులే సార్’ అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం గుండుపాపల ఎంపీపీ మెయిన్ స్కూల్లో 2026–2027 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంత వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేకపోవడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. మీ పిల్లలను మా స్కూళ్లో చేర్పించండి ప్లీజ్.. అంటూ ఇంటింటికీ తిరుగుతున్నా ఫలితం లేదని చెబుతున్నారు. పైగా ప్రైవేట్ స్కూళ్లకే పంపుదామనుకుంటున్నామని చెబుతున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్లో 2 నుంచి 5వ తరగతి వరకు 19 మంది పిల్లలు ఉన్నారు. ఆ స్కూల్కు సంబంధించి అంగన్వాడీ కేంద్రంలో ఒకటో తరగతికి ప్రమోట్ అయ్యేందుకు నలుగురు ఉన్నారు. కానీ వారిలో ముగ్గురిని ప్రైవేటు స్కూల్కు పంపేందుకు వారి తల్లిదండ్రులు సిద్ధం అయ్యారు. ఒకరు మాత్రం స్కూల్ తెరచిన తర్వాత చూద్దాంలే అంటున్నారు. ఈ విషయమై ఎంఈఓ–2 రామచంద్రయ్య మాట్లాడుతూ.. గుండుపాపల ఎంపీపీ మెయిన్ స్కూల్లో ఇప్పటి వరకు ఒకటో తరగతిలో ఒక్కరూ చేరని మాట వాస్తవమేనన్నారు. – దొర్నిపాడు -
ఐక్యతతోనే కురువల అభివృద్ధి
ఆదోని అర్బన్: జిల్లాలో కురువలందరూ ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలని కురువ సంఘం నాయకులు అన్నారు. ఆదోని పట్టణంలోని భీరప్పనగర్లో వెలసిన బీరప్ప దేవాలయంలో ఆదివారం కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కె.మల్లికార్జున, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, సంఘం పెద్దలు కుబేర్నాథ్, జయరామ్, నాయకులు నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో కురువ సంఘం సమ్మేళనం జరిగింది. ముందుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కనకదాసు చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కురువ సంఘం పెద్దలు, నాయకులు మాట్లాడుతూ.. ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అభివృద్ధి చెందాలన్నారు. ప్రతిఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. అనంతరం ఆదోని పట్టణాధ్యక్షుడిగా గోల్డ్ రఘును, మండలాధ్యక్షుడిగా చాగి మల్లికార్జునను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా అరవింద ప్రసాద్
నంద్యాల(వ్యవసాయం): బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా అరవింద ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం స్థానిక రామకృష్ణ స్కూల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యుల ఆమోదం మేరకు ప్రస్తుత అధ్యక్షుడైన వెంకట రామరాజును అనివార్య కారణాల వలన తొలగించి, నూతన అధ్యక్షుడిగా చొపురాల అరవింద ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ.. సంఘ సభ్యుల సహకారంతో బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సభ్యుల సహకారంతో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నా రు. సమావేశంలో సంఘ నాయకులు నివర్తి వెంకట మొహన్కుమార్, బాలమురళీ, ప్రభాకర శర్మ, రాజశేఖర్, శశికళ, విజయ్ కుమార్ శర్మ, కృష్ణమోహన్, లక్ష్మీ నరసింహ, ఆదినారాయణ, సుధీర్, మల్లిక, స్వర్ణలత, ప్రశాంతి, లక్ష్మీ కళ్యాణి, చెంచయ్య తదితర బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
‘సెస్సా’ దియ్యా!
● గ్రంథాలయాలకు బకాయి భారం ● అభివృద్ధికి ఆటంకంగా మారిన వైనంకర్నూలు కల్చరల్: దశాబ్దాలుగా పేరుకు పోయిన పన్నులు స్థానిక సంస్థల నుంచి రాక అక్షర జ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల అభివృద్ధి అటకెక్కింది. కర్నూలు నగర పాలక సంస్థతో పాటు మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీలు, పంచాయతీల నుంచి సెస్సు వసూలు కావడం లేదనేది గ్రంథాలయాధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 60 గ్రంథాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి కేంద్ర గ్రంథాలయం, ఒకటి గ్రామీణ గ్రంథాలయం, 58 గ్రంథాలయ శాఖలు ఉన్నాయి. 39 సొంత గ్రంథాలయాలు ఉండగా 8 గ్రంథాలయాలు రెంట్ ఫ్రీ, 12 గ్రంథాలయాలకు అద్దె చెల్లిస్తున్నారు. వీటితో పాటు పుస్తక నిక్షిప్త కేంద్రాలు (బీడీసీ) ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సుమారు 15 వేల మంది సభ్యులు ఉండగా మిగతా శాఖల్లో 70 వేల మంది ఉన్నారు. కేంద్ర గ్రంథాలయానికి రోజుకు 400 మంది వరకు పాఠకులు హాజరవుతుంటారు. మిగతా వాటికి సుమారు 12 వేల మంది పాఠకులు వస్తుంటారు. రూ. 20 కోట్ల మేర బకాయిలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు రూ. 20 కోట్ల వరకు బకాయి ఉంది. ఇందులో కర్నూలు జిల్లాకు సంబంధించి రూ. 8.67 కోట్లు, కర్నూలు కార్పొరేషన్, మున్సిపాలిటీలు రూ. 5.32 కోట్లు, గ్రామ పంచాయితీలు రూ. 3.35 కోట్లు రావాల్సి ఉంది. నంద్యాల జిల్లాకు సంబంధించి మొత్తం రూ. 11.53 కోట్లు, మున్సిపాలిటీలు రూ. 10.01 కోట్లు, గ్రామ పంచాయతీలు రూ. 1.50 కోట్లు బకాయి రావాల్సి ఉంది. వీటిని చెల్లించాలని జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులకు విన్నవిస్తునే ఉన్నారు. ఆ మొత్తం వస్తే అభివృద్ధి పనులు, పుస్తకాల కొనుగోలు, నిర్వహణ, పేపర్ బిల్లులు, జీతభత్యాలు చెల్లింపులకు ఉపయోగ పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. రెగ్యులర్గా సెస్సు చెల్లించే గ్రామ పంచాయతీలు ● మొలగవెల్లి, ఉయ్యాలవాడ, వెలుగోడు, గోస్పాడు, కోవెలకుంట్ల, ఆలూరు. సెస్సుచెల్లింపులో నిర్లక్ష్యంగా ఉన్న పంచాయతీలు ● వెల్దుర్తి, తుగ్గలి, రుద్రవరం, ప్యాపిలి, ఓర్వకల్, కల్లూరు, మంత్రాలయం, కొత్తపల్లి, కోడుమూరు, గడివేముల. గ్రంథాలయాలకు చెల్లించాల్సిన పన్నును స్థానిక సంస్థలు చెల్లించక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు రూ. 23.50 కోట్లు సెస్సు బకాయి ఉండేది. ఇటీవలే కర్నూలు నగర పాలక సంస్థ నుంచి రూ. 2 కోట్లు, నంద్యాల మున్సిపాలిటీ నుంచి రూ. 1.50 కోటి వసూలు అయింది. దీంతో కొంత ఉపశమనం కలిగింది. నిధుల లేమితో మరమ్మతులు చేయించడం, మౌలిక వసతుల కల్పన కష్టంగా మారింది. సెస్సు వసూలై పరిపాలన అనుమతులు లభిస్తే పనులు మొదలు పెడతాం. – కె. ప్రకాష్, కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ -
వృద్ధురాలి మృతిపై విచారణ
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెలో విద్యుదాఘాతంతో వృద్ధురాలు కాశింశెట్టి లక్ష్మీదేవి మృతి చెందడంతో ఆదివారం ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. చింత చిగురు కోసేందుకు వెళ్తున్న ఆమె అప్పటికే కొద్ది రోజులు ముందు గాలి వానకు పడిపోయిన విద్యుత్ స్తంభం వద్ద దాటుకునే క్రమంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారించేందుకు డీఎస్పీ అంకిరెడ్డిపల్లె చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. స్తంభం పడిపోయిన విషయాన్ని సిబ్బంది దృష్టికి ఎవరైనా తీసుకెళ్లారా.. అని ఆరా తీశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులతో సమావేశమై ప్రమాదం చోటు చేసుకున్న తీరుతో పాటు పలు అంశాలపై చర్చించారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా గ్రామాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట సీఐ రమేష్బాబు, కోవెలకుంట్ల విద్యుత్ శాఖ ఏడీ సతీష్కుమార్రెడ్డి,అవుకు ఏఈ ఫక్కీరయ్య తదితరులు పాల్గొన్నారు. క్వింటా వేరుశనగ రూ.7,620 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఆదివారం క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.7,620 ధర పలికింది.మార్కెట్కు 88 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటం కనిష్ట ధర రూ.5,280, మధ్యస్థ ధర రూ.6,600 ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఆముదాలు మార్కెట్కు 6 క్వింటాళ్లు రాగా క్వింటం కనిష్ట ధర రూ,4,670, గరిష్ట ధర రూ.5,510 పలికింది. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి ఆళ్లగడ్డ: క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా శిల్పకళా కూలీ మృతి చెందిన విషాద సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం గూబగుండం గ్రామానికి చెందిన మునెయ్య (55) పట్టణంలోని శిల్పకళా మందిరాల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్న సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా పెద్ద రాయి ఎత్తుకుని వెళ్తున్న క్రేన్ తగిలి కిందపడియాడు. అతనిపై క్రేన్ టైర్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధం శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంట డిగ్రీ కళాశాల సమీపంలోని ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కారు దగ్ధమైంది. మార్కాపురం జిల్లా కనిగిరికి చెందిన నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం శ్రీశైలం చేరుకున్నారు. ఆదివారం స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం సైట్సీయింగ్కు బయలు దేరారు. మార్గమధ్యలో సున్నిపెంట డిగ్రీ కళాశాల సమీపంలో కారులో నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన ఏడుగురు కుటుంబ సభ్యులు కారు దిగిపోయారు. క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. జింక మాంసం స్వాధీనం ఆదోని సెంట్రల్: చాగి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు జింక మాంసం స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారిణి తేజశ్విని సిబ్బందితో ఆదివారం గ్రామానికి చేరుకుని తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన చంద్రశేఖర్, హరికృష్ణ, గూళప్ప, శంకర్ జింక మాంసాన్ని వండేందుకు సిద్ధం చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. జింక మాంసం స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారైనట్లు తెలిసింది. మాంసం కృష్ణ జింకదిగా గుర్తించారు. అయితే కుక్కలు వెంబడించి జింకను చంపేశాయని పట్టుబడిన వారు చెబుతుండగా, వేటాడి చంపారా అనేది విచారణలో తేలుతుందని ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎఫ్బీఓ బాలకృష్ణ, షఫిఉల్లా, ఏబీఓ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో కర్నూలు వాసి మృతి
చీరాల: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి గుండె ఆగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలా డు. అందిన వివరాల మేరకు.. కర్నూలులోని ప్రకాష్నగర్కు నగర్ చెందిన కుమ్మరి కిరణ్ (38)కొద్ది రోజులు క్రితం కూలి పనుల నిమిత్తం వేటపాలెం మండలానికి ఐదుగురితో కలిసి వచ్చారు. గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉండడంతో శనివారం గుంటూరు హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో చీరాల వస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి వస్తూ బాపట్లలో దిగి మరో బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. బస్సు చీరాల ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి తిరిగి ఒంగోలుకు వెళ్తుండగా కండక్టర్కు అనుమానం వచ్చి నిద్రపోతున్నాడనుకుని కిరణ్ను పలుమార్లు లేపినా ఎటువంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి బస్సును చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్ పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఔట్ పోస్టు పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ వద్ద నుంచి వివరాలు నమోదు చేశారు. అలానే చీరాల వన్టౌన్ పోలీసుస్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించి వేశారు. కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు వచ్చి పరిశీలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
భక్తుల ప్రాణాలకు ముప్పు!
మహానంది: మహానంది – గాజులపల్లె మార్గంలో రహదారికి ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో గాజులపల్లె రైల్వేస్టేషన్, వ్యవసాయ కళాశాల, ఉ ద్యాన పరిశోధనా స్థానం, శ్రీ వెంకటేశ్వర ఒంగోలు జాతి పశు పరిశోధనా స్థానం ఉన్నాయి. దీంతో నిత్యం వందలాది వాహనాల్లో రాకపోకలు సాగుతుంటాయి. దారికి ఇరువైపులా అక్కడక్కడ స్తంభాలు ఒరిగి పడిపోతాయేమో అన్నట్లు భయపెడు తున్నాయి. అసలే ఈదురు గాలులు అధికంగా వీస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికారులు చర్యలు తీసుకుని ఒరిగిన విద్యుత్ స్తంభాలను సరి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మహానందిలో సండే సందడి
మహానంది: వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు ఆదివారం కావడంతో మహానంది ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో భక్తజన సంద్రంగా మారింది. రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, శీఘ్రదర్శనం, మహా మంగళ హారతుల ఆర్జిత సేవా టికెట్ల ద్వారా భక్తులు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండ రామాలయం, వినాయకనంది, ఆంజనేయస్వామి, గరుడనంది ఆలయాలను సందర్శించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా దర్శనం ఏర్పాటు చేశారు. యువకుడి బలవన్మరణం ఓర్వకల్లు: నన్నూరు గ్రామంలో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మంగలి మద్దిలేటి కుమారుడు బజారు (26) ఇంట్లోనే ఉరేసుకుని మృతి చెందాడు. కొంతకాలంగా అతని మానసిక పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తల్లికి వందనం పేరుతో నకిలీ లింకులు
● ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): తల్లికి వందనం పథకం పేరుతో వచ్చే నకిలీ లింకులపై విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పథకానికి సంబంధించిన దరఖాస్తులు, అర్హత వివరాలు నగదు, జమ తదితర అంశాల పేరుతో వాట్సప్, ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, ఎవరికి పంపించకూడదని సూచించారు. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని తెలిపారు. -
పొలంబడి.. వెనుకబడి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజారోగ్యం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (గ్యాప్) పద్ధతులకు పెద్దపీట వేసింది. పొలంబడులు నిర్వస్తూ పంటల సాగు పూర్తిగా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో జరిగేలా చర్యలు తీసుకుంది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఆర్బీకేల వారీగా నిర్వహించే పొలంబడి కార్యక్రమాలను నామమాత్రానికి పరిమితం చేసింది. ఈ ఏడాది ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో 13, నంద్యాల జిల్లాలో 14 పొలంబడి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించేందుకు ఆదేశాలు వచ్చాయి. ఇందులో జిల్లాకు ఒకటి ప్రకారం ‘గ్యాప్’ పొలంబడులు నిర్వహిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ‘గ్యాప్’ పద్ధతులకు మంగళం పలకడంతో ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు పెరుగుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇదీ దుస్థితి.. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం దండగ అయిపోయింది. రెండేళ్లలో అన్నదాత సుఖీభవ అమలు చేసింది ఒక్క ఏడాది మాత్రమే. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలే కాలేదు. ఉచిత పంటల బీమాకు స్వస్తి పలికారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రైతులకు ఏటేటా వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచే పొలంబడి కార్యక్రమానికి స్వస్తి పలికారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించేందుకు నిర్వహించే ‘గ్యాప్’ పొలంబడి కార్యక్రమాలను జిల్లాకు ఒక్కటి మాత్రమే పరిమితం చేసింది. ఒకవైపు డిమాండ్కు తగ్గట్టుగా యూరియా పంపిణీలో చేతులెత్తేసి మరోవైపు కెమికల్స్ వ్యవసాయానికి గేట్లు ఎత్తుతోంది. చంద్రబాబు ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో అధికారులు గ్యాప్ పద్ధతుల అమలుకు చొరవ తీసుకోలేదు. దీంతో రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని పెంచారు. పండించిన పంట ఉత్పత్తులను సర్టిఫికేషన్ కోసం శ్యాంపుల్స్ తీసి ల్యాబ్కు పంపితే కెమికల్స్ మోతాదుకు మించి ఉన్నట్లు తెలిసింది. ‘గ్యాప్’కు మంగళం పలుకడం వల్లనే మిర్చిలో మోతాదుకు మించి కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లు తేలింది. ‘పొలంబడు’లను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ పొలంబడి ఒక్కటి మాత్రమే ఇక ప్రజలకు కెమికల్స్ అవశేషాలు కలిగిన ఆహారమే దిక్కు! -
పడిపోయిన నీటి నిల్వలు
శ్రీశైలం మినహా ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లలో 9.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో లైవ్ స్టోరేజీ 5.365 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ నీటిని మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. తాగు నీటికి కూడా సరిపోని పరిస్థితులు ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురిస్తే...అక్కడి ప్రాజెక్టులు నిండుకున్న తరువాతే శ్రీశైలానికి వస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు లేకుంటే ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లకు తరలిస్తారు. అయితే జూలై నుంచి సెప్టెంబరు, అక్టోబరు నెలల వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే నీరు లేక రిజయర్వాయర్లు వెలవెలబోతాయి. -
మెదడులో కణితి కల్లోలం!
మానవ శరీరం పనితీరు మొత్తం మెదడు మీదే ఆధారపడి పనిచేస్తుంది. అలాంటి మెదడులో ఏ మాత్రం తేడా వచ్చినా కల్లోలంగా మారుతుంది జీవితం. శరీరం మొత్తం స్తంభించి పోతుంది. ఇక మెదడులో వచ్చే కణితులు ఇంకా ప్రమాదం. ఈ సమస్య పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతులు. ప్రజలకు ఈ కణితులపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక అవగాహన కథనం.కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రాంతంలో ఇటీవల కాలంలో మెదడు కణితులుండే బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ సమస్యతో పక్క రాష్ట్రమైన తెలంగాణ, కర్ణాటకకు చెందిన వారు కూడా కర్నూలుకే వస్తున్నారు. చికిత్స చేయించుకునేందుకు గతంలో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కర్నూలు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు చికిత్స కోసం వస్తున్నారు. ఇక్కడే ఆధునిక పరికరాలు, వసతులు, సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో చికిత్స సులభమవుతోంది. ఇక్కడి వైద్యుల వద్దకు నరాలు, మెదడు చికిత్సల కోసం వచ్చే వారిలో 10 నుంచి 15 శాతం మంది బ్రెయిన్ ట్యూమర్ కేసులే ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మెదడు కణితులు, రకాలు మెదడులోని కణజాలాల్లో ఏర్పడే ముద్దను మెదడు కణితి అంటారు. ఇవి రెండు రకాలు. ప్రైమరీ ట్యూమర్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ను నాలుగు విభాగాలుగా విభజించారు. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్లు శరీరంలో వివిధ భాగాల్లో సోకుతాయి. అవి రక్తంలో ప్రవేశించి మెదడుకు చేరతాయి. దీని ద్వారా మెదడులో కణితులు ఏర్పడతాయి. సాధారణంగా ఇవి జన్యుపర లోపాలతో, వంశపారంపర్యంగా వస్తాయి. మెదడుకు రేడియేషన్ సోకడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. సెల్ఫోన్ విపరీతంగా వాడటం వల్ల రేడియేషన్ సోకి మెదడులో గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారికీ ఈ సమస్య వస్తోంది. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలుమెదడు కణితుల లక్షణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటిది జనరల్ లక్షణాలు. రెండవది ప్రత్యేకమైనది. జనరల్ లక్షణాలు కణితి పరిమాణాన్ని బట్టి వస్తాయి. తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం, ఒత్తిడి పెరగడం, స్పృహ కోల్పోవడం వంటివి. ఇక రెండోది మెదడులో కణితి ఏర్పడిన స్థానాన్ని బట్టి వస్తాయి. మెదడు ముందు భాగం, మధ్యభాగం, వెనుక భాగంలో ఆయా స్థానాలను బట్టి లక్షణాలు ఉంటాయి. అందులో మాట తడబడటం, చూపు మబ్బుగా కనిపించడం, చెవులు వినిపించకపోవడం, మూతి వంకరపోవడం, ఫిట్స్ రావడం, పక్షవాతం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి తలనొప్పిని కణితికి కారణం అని చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులను తప్పనిసరిగా కలిసి చికిత్స తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. పెరుగుతున్న బ్రెయిన్ ట్యూమర్ బాధితులు ఆధునిక పద్ధతిలో ట్యూమర్ల తొలగింపు జీజీహెచ్లో ప్రతి ఓపీకి 30 మంది బాధితుల రాక నేడు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే -
‘బెల్ట్’ తీసేవారెవరు?
● గ్రామాల్లో జోరుగా బెల్ట్ షాపులు ● చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ శాఖ అధికారులు ఎమ్మిగనూరుసెంట్రల్: జిల్లాలోని కొన్ని గ్రామాల్లో తాగడానికి గుక్కెడు మంచి నీరు దొరకదేమో కానీ మద్యం మాత్రం లభిస్తోంది. టీడీపీ నాయకుల అండతో గ్రామగ్రామానా బెల్టుషాపులు వెలిశాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న మద్యం పాలసీని రద్దు చేశారు. ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం షాపుల నిర్వహణను ప్రెవేట్ వ్యక్తులకు అప్పగించారు. దీంతో మద్యం షాపులను దక్కించుకున్న వ్యక్తులు కాసులు దండుకోవడం కోసం గ్రామానికి రెండు నుంచి ఎనిమిది వరకు బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. లైసెన్స్డ్ మద్యం షాపులను దక్కించుకున్న టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో ఊరూరా బెల్ట్షాపులు పుట్టగొడుగులా వెలిశాయి. దీనికితోడు లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లో ఒక వ్యక్తికి మూడు మద్యం సీసాల కంటే ఎక్కువ ఇవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఎక్కడా అమలుకావడం లేదు. ఎంత అడిగితే అన్ని మద్యం సీసాలు ఇచ్చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ అమ్మకాలు టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో బెల్ట్ షాపులు దక్కించుకున్న అధికార పార్టీ కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గుడి, బడి అనే తేడా లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ద్విచక్రవాహనాల్లోనే ఎక్కడ ఉంటే అక్కడికే మద్యం సీసాలు తెచ్చి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని గ్రామాల్లో మినీ డాబాలను తలిపించేలా కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం, గ్లాసులు, వాటర్ బాటిళ్లు, తినుబండారాలు అందిస్తున్నారు. ఇందుకు ఒక సీసాకు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. గత రెండేళ్లుగా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తుండటం, మద్యంబాబుల అరాచకాలు ఎక్కువ కావడంతో మహిళలు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికై నా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామాల్లో ఎక్కడైనా బెల్ట్షాపులు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాం. అక్రమంగా బెల్ట్షాపుల నుంచి మద్యం అమ్మే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. – రమేష్రెడ్డి, ఎకై ్సజ్ సీఐ -
16 ఏళ్ల తర్వాత..
● ఘనంగా ఆకుమల్లలో దేవర ● అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులుపెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఊరేగిస్తున్న దృశ్యం సంజామల: 16 ఏళ్ల తర్వాత ఆకుమల్లలో దేవర ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల కార్యక్రమం ఆదివారం ముగిసింది. శనివారం రాత్రి ప్రారంభమైన పెద్దమ్మతల్లి విగ్రహం ఊరేగింపు ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. కుమ్మరాం కట్ట వద్ద నుంచి ఊరువాకిలి పెద్దమ్మ గుడి వద్దకు మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. కులమతాలు అతీతంగా దేవర నిర్వహించారు. గ్రామంలో దాదాపు 1,100 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం బంధువులతో కళకళలాడింది. గ్రామం మొత్తం దాదాపు రూ. 4 కోట్లు ఖర్చు అయ్యింటుందని అంచనా వేస్తున్నారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్య ప్రకాష్రెడ్డి, అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, నాయకులు చల్లా విక్రాంత్ రెడ్డి, గౌరిగారి నాగేశ్వర్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఐ హనుమంత్ నాయక్, ఎస్ఐ రమణయ్య ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో భారీ పోలీస్ బందో బస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా చర్యలు తీసుకున్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ప్రారంభం
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ఆదివారం ప్రారంభం అయ్యింది. ప్రభుత్వ(టౌన్ మోడల్)జూనియర్ కాలేజీలో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, చరిత్ర, గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, మైనర్ లాంగ్వేజెస్, మైనర్ మీడియ మూల్యాంకనం ప్రారంభమైంది. ఇందుకు ఏసీఓలుగా 32 మంది, ఛీఫ్ ఎగ్జామినర్లుగా 153 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా 1446 మంది, స్క్రూటీనైజర్లుగా 188 మందిని నియమించారు. మొదటి రోజున 450 మందికిగాను 385 మంది విధుల్లో చేరి 5,745 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేశారు. రేపటి(మంగళవారం)నుంచి కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం జరుగనుంది. ఈ నెల 13వ తేదీ వరకు స్పాట్ క్యాంపు జరుగనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. నేడు డయల్ యువర్ సీఎండీ, ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడా సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. 22 మండలాల్లో వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు 22 మండలాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హాలహర్విలో 92.6, హొళగుందలో 53.2, చిప్పగిరిలో 30.2, పత్తికొండలో 27.4, కౌతాళంలో 26.4, గోనెగండ్లలో 14.4, ఎమ్మిగనూరులో 14.2, కోడుమూరులో 13.8, ఆదోనిలో 12.6, ఓర్వకల్లులో 11.4 మి.మీ. ప్రకారం వర్షాలు కురిశాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మిమీ ఉండగా.. ఇప్పటి వరకు 33.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దివ్యాంగుల హాస్టల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): సీ క్యాంప్లోని దివ్యాంగుల వసతి గృహంలో ప్రవేశం పొందేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ వసతి గృహంలో 2026–27 విద్యా సంవత్సరానికి వంద మంది వరకు ఉచిత వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రవేశం పొందే విద్యార్థులు సదరం, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, మూడు పాస్పోర్టు సైజు ఫోటోలు, తల్లిదండ్రుల అంగీకార పత్రం, బ్యాంకు అకౌంట్ నంబర్ ఉన్న మొదటి పేజీ జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జత చేయాలన్నారు. వసతి గృహంలో 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులు చేసే వారు కూడా ప్రవేశం పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 08518– 277864, 8985547169 నంబర్లను సంప్రదించాలన్నారు. కర్నూలు (టౌన్): నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు, నేర చరిత కలిగిన వారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటమాని హెచ్చరించారు. -
జ్ఞాపకాల జడివాన
గోస్పాడు: దాదాపు 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళన కార్యక్రమంలో కలుసుకోవడంతో జ్ఞాపకాల జడివాన కురిసింది. 2001–2002 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వపు విద్యార్థుల సమ్మేళనం ఆదివారం దీబగుంట్ల హైస్కూల్లో నిర్వహించారు. అప్పట్లో 90 మంది విద్యార్థులు ఉండగా 65 మంది పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు గా విద్యాభ్యాసం చేసి ఒక్కొక్కరు ఒక్కోచోట ఉన్న అందరూ ఈ వేదికపై కలసి జ్ఞాపకాలను పంచుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు. అప్పట్లో గురువులుగా ఉన్న వేమారెడ్డి, రఘురామిరెడ్డి, బ్రహ్మం నాయక్, నాగలక్ష్మి, రాజు, శాస్త్రి, గోపాల్, వజీదున్ని సా బీబీ, షఫీ, శ్రీనివాసులను సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ గురువులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరూ ఒకచోట కలవడం మరవలేనిది అన్నారు. అలాగే అప్పటి విద్యా చైర్మన్ చిన్ననాగి రెడ్డి పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్న భోజనాలతో విందు చేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు గురువులను సన్మానించారు. -
త్వరగా గుర్తించి చికిత్స చేస్తే మేలు
మెదడులో ఏర్పడే కణితులను గ్రేడ్ 1, 2, 3,4 విభాగాలుగా విభజించి చికిత్స అందిస్తారు. కణితుల స్థానంపై కూడా చికిత్స ఆధారపడి ఉంటుంది. గ్రేడ్ 1, 2లలో ఉన్న కణితులు మూడు సెంటిమీటర్ల కంటే తక్కువగా ఉంటే రేడియేషన్ ద్వారా తగ్గించవచ్చు. ఈ చికిత్స ద్వారా రోగులు తమ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే గ్రేడ్ 3, 4 కణితులు ఉంటే జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణితులను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే మేలు. –డాక్టర్ ఎన్.సుమంత్కుమార్, న్యూరోసర్జన్, కర్నూలు ఇటీవల కాలంలో చిన్న వయస్సు వారికి కూడా బ్రెయిన్ ట్యూమర్లు బయటపడుతున్నాయి. మా వద్దకు 20 ఏళ్ల యువకుడు తలనొప్పిగా ఉందని వచ్చాడు. పరీక్షలు చేయిస్తే అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. చాలా మంది తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో పాటు మూర్ఛ, కంటిచూపులో మార్పు, మాట తడబడటం, ప్రవర్తనలో మార్పు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్లను నిర్లక్ష్యం చేయరాదు. –డాక్టర్ కె.హేమంత్కుమార్, న్యూరోఫిజీషియన్, కర్నూలు ● -
మూగజీవుల ఆపద్బాంధవుడు
● కష్టంలో ఉన్నాయని తెలిస్తే చాలు సాయం చేస్తాడు ● ఆదుకుని అక్కున చేర్చుకుని వైద్యం చేయిస్తాడు ● అవి కోలుకున్నాక యథా స్థానంలో వదిలేస్తాడు ● సంరక్షణ కోసం ప్రత్యేక షెల్టర్ ఏర్పాటు కర్నూలు(హాస్పిటల్): ఆపదొస్తే మనుషులకు సాటి మనుషులు ఎవరో ఒకరు సాయం చేస్తారు. కానీ మూగజీవులకు ఎవరు సాయం చేస్తారు. అయితే ఇలాంటి జీవుల కోసం మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు వాక్ సంస్థ ప్రతినిధులు. ఏ మూగ జీవైనా కష్టంలో ఉందని తెలిస్తే చాలు వెంటనే దాని వద్దకు చేరుకుంటారు. దానిని రక్షించడం/వైద్యం చేయించడం చేసి అది కోలుకునేంత వరకు తన వద్దే ఉంచుకుంటారు. బాగయ్యాక తిరిగి అది ఎక్కడ దొరికిందో అక్కడికే వెళ్లి వదిలేస్తారు. ఆ జీవి వైకల్యం చెంది ఎక్కడికి వెళ్లలేకపోని పరిస్థితిలో ఉంటే తన వద్దే ఉంచుకుని ఆలనాపాలనా చూసుకుని పోషిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సంఘాన్ని కూడా రిజిస్టర్ చేయించి ఆదుకుంటున్నాడు ఈ సంస్థ సృష్టికర్త, మూగజీవుల ఆపద్బాందవుడు శివకుమార్. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ పి.తిరుపాల్ కుమారుడైన పి.శివశంకర్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత డిగ్రీలో చేరినా ఇతర కారణాల వల్ల మధ్యలోనే చదువు మానేశాడు. ప్రభుత్వ వసతి గృహాలకు అవసరమైన స్నాక్స్ను సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మూగజీవులపై ఉన్న మమకారం అతనికి సరికొత్త దారి చూపింది. ఎక్కడైనా ఏ మూగజీవైనా సరే ఆపదలో ఉన్నట్లు తెలిసిందంటే వెంటనే ఆ ప్రాంతంలో వాలిపోతాడు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆ జీవిని రక్షిస్తాడు. రోడ్డు ప్రమాదాల్లో, ఇతర ప్రమాదాల్లో గాయపడిన, అనారోగ్యం బారిన పడిన జీవులేవైనా సరే వాటిని అక్కున చేర్చుకుంటాడు. వాటికి దగ్గరుండి సపర్యలు చేస్తూ ప్రభుత్వ జంతువుల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తాడు. అవి బాగయ్యేంత వరకు వాటి ఆలనాపాలనా చూస్తాడు. వాటిని బంధీఖానాలో ఉంచకుండా అవి ఎక్కడ లభించాయో అక్కడే తెచ్చి వదిలేసి వాటికి స్వేచ్ఛావాయువులు ప్రసాదిస్తాడు. వాక్ సంస్థ స్థాపన.. మూగజీవులకు సేవలందించేందుకు అతను ఓ ప్రత్యేక సంస్థను స్థాపించాడు. 2021లో వెల్ఫేర్ ఆఫ్ యానిమల్స్ అండ్ లిబరేషన్ కర్నూలు(వాక్) అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన షెల్టర్ను స్థానిక కర్నూలు నగర శివారులోని పంచలింగాల చెక్పోస్ట్ సమీపం నుంచి మామిదాలపాడు గ్రామానికి వెళ్లేదారిలో ఏర్పాటు చేశాడు. గాయపడిన, అనారోగ్యం బారిన పడిన జంతువులు, పక్షులను ఆ కేంద్రానికి తీసుకెళ్లి సపర్యలు చేస్తాడు. ఇందులో వైకల్యం చెందిన వాటిని తన వద్దే ఉంచుకుని జీవితాంతం చూసుకుంటాడు. ఎక్కడైనా ఏదైనా మూగజీవి ప్రమాదంలో ఉందని, అనారోగ్యంలో ఉందని సమాచారం (వాక్ సంస్థ 99668 64428)కు చెబితే చాలు వెంటనే ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి ఆ జీవిని కాపాడే ప్రయత్నం చేస్తారు. సొంత నిధులతో షెల్టర్.. ఒకవైపు ప్రభుత్వ వసతి గృహాలకు అవసరమైన స్నాక్స్ను సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్న శివకుమార్ మరోవైపు మూగజీవుల ఆదరణకు సంపాదించిన సొమ్మును ఖర్చు చేస్తున్నాడు. మూగజీవులకు చికిత్స అందించడమే గాక వాటి ఆలనాపాలనా చూడటం, ఆహారం అందించడం, వైద్య ఖర్చులు, షెల్టర్ నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఈ మేరకు అతనికి ప్రతి నెలా రూ.40 వేల నుంచి రూ.60 వేల దాకా వెచ్చిస్తున్నాడు. ఇతని సేవా కార్యక్రమాలు చూసి ఎవ్వరైనా దాతలు స్పందించి విరాళం ఇస్తే తీసుకుంటాడు. లేకపోతే సొంత నిధులతోనే వాటిని సంరక్షిస్తాడు. ఈ యజ్ఞంలో అతనికి కొందరు స్వచ్ఛంద సేవకులు సహకరించారు. ప్రస్తుతం అతనితో పాటు ఇద్దరు సేవకులు సహాయం చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన కర్నూలు నగర పరిసర ప్రాంతాల్లో 2 వేలకు పైగా జంతువులు, పక్షులను సంరక్షించాడు. ఇందులో కుక్కలు, కోతులు, ఆవులు, ఇతర జంతువులతో పాటు కాకులు, గద్దలు, చిలుకలు, ఇతర పక్షులు, పాములు సైతం ఉన్నాయి. గుత్తిలో ఒక శునానికి తల వద్ద పెద్ద రంధ్రం పడి తీవ్ర అనారోగ్యం ఉండి అనాథగా ఉందని తెలిసి అక్కడికి వెళ్లి దానిని తీసుకొచ్చి సంరక్షించాడు. ఓ కోతి కళ్లకు గాయం తగిలి గుడ్డిదై పోయింది. దానినీ ఆయనే ఆలనాపాలనా చూసుకుంటున్నాడు. ఇలాంటి జీవులు ఆయన వద్ద ఎన్నో ఉన్నాయి. షెల్టర్ నిర్వహణను చూసి అవసరమైన వస్తువులు, సరుకులు సహాయం చేసినా చాలని శివకుమార్ కోరుతున్నాడు. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని బీఎల్ఓలను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శనివారం ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు ‘ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం’పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్యుమరేషన్ ఫారమ్లను పూరించి ఓటరు లేదంటే ఇంటి పెద్దల సంతకం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వాటిని డిజిటలైజ్ చేసి డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారమ్లు తిరిగి రాని సందర్భాల్లో కేవలం నాలుగు కారణాలైన ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ అనే వివరాలను మాత్రమే నమోదు చేయాలన్నారు. ఈ వివరాల ఆధారంగా బూత్ వారీగా ప్రత్యేక జాబితాలు తయారు చేసి ప్రజల అభ్యంతరాల కోసం అందుబాటులో ఉంచాలన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తారన్నారు. జిల్లాలో మొత్తం 14 లక్షల మంది ఓటర్లలో ఇప్పటికే 10 లక్షల మందికి పైగా మ్యాపింగ్ పూర్తయిందన్నారు. మ్యాపింగ్ సక్రమంగా జరగకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగవద్దని సిబ్బందికి సూచించారు. ప్రత్యేక సర్వే, మ్యాపింగ్, ఫారమ్ల డిజిటలైజేషన్ తదితర పనులను జూన్ 14లోపు వంద శాతం పూర్తి చేసి నివేదికలు సమర్పించాలన్నారు. అనంతరం బీఎల్ఓలకు గొడుగు, క్యాప్ తదితర వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. డీఆర్ఓ రామునాయక్, నంద్యాల ఆర్డీఓ, ఈఆర్ఓ విశ్వనాధ్, ఆరు మండలాల తహసీల్దార్లు, అన్ని పోలింగ్ స్టేషన్ల బీఎల్ఓలు పాల్గొన్నారు. -
అధికారులైనా.. ఆట బొమ్మలే!
శేషఫణి రజినీకాంత్ రెడ్డి అబ్దుల్ వాహబ్ ఆదోని: కూటమి పాలనలో అధికారులకు విలువ లేకుండా పోతోంది. నాయకులకు నచ్చినట్లు మెలగకపోయినా, ఆ పార్టీలోని ఏ ఒక్కరికి ఎదురుచెప్పినా మరో ప్రాంతానికి బదిలీపై వెళ్లక తప్పని పరిస్థితి. చిరుద్యోగులకే కాదు, మండల మేజిస్ట్రేట్ స్థాయి తహసీల్దారులైనా తమ స్థానాన్ని కాపాడుకునేందుకు జీ హుజూర్ అనక తప్పడం లేదు. ఇక కూటమి పాలనలో మూడు పార్టీల్లో ఏ ఒక్కరికి నచ్చకపోయినా ఆ అధికారి జీవితం ఆటబొమ్మగా మారిపోతోంది. గతంలో అతను నాతో సరిగా మెలగలేదని ఒకరు.. ఇతను ప్రతిపక్ష పార్టీ అని ఇంకొకరు.. కొత్త వ్యక్తి మాకొద్దని మరొకరు.. ఇలా అధికారులను ఎవరికి తోచిన రీతిలో వాళ్లు అక్కడా ఇక్కడ తిప్పడం పరిపాటిగా మారింది. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారా, లేదా అనేది పక్కనపెట్టి మన చెప్పుచేతల్లో ఉంటున్నాడా లేదా అనే విషయానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో అధికారులు రాజకీయ ఛట్రంలో కంటి మీద కునుకు లేకుండా ఉద్యోగాలను నెట్టుకొస్తున్నారు. తాజాగా ఆదోని తహసీల్దార్ పోస్టు విషయంలో చోటు చేసుకున్న ‘రాజకీయం’ అధికారుల దీనావస్థకు అద్దం పట్టింది. డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించడంతో కొందరికి స్థానచలనం కలిగింది. ఈ కోవలోనే ఆదోని తహసీల్దార్గా పనిచేస్తున్న శేషఫణిపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో కౌతాళం డిప్యూటీ తహసీల్దార్ రజనీకాంత్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే రజనీకాంత్ రెడ్డి నియామకం కూటమిలోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు వర్గానికి మింగుడుపడలేదు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే ఆ ఉత్తర్వులు మారిపోయాయి. కౌతాళం డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న ఆయనను పదోన్నతిపై అక్కడే తహసీల్దార్గా కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నందవరం తహసీల్దార్ అబ్దుల్ వాహబ్ను ఆదోని తహసీల్దార్గా బదిలీ చేశారు. ఈసారి బీజేపీ నేతలు తెరపైకి వచ్చారు. అబ్దుల్వాహబ్ నియామకం కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వర్గానికి నచ్చకపోవడంతో ఆయనను కూడా తిరిగి పాత స్థానమైనా నందవరానికే డిప్యూటేషన్పై పంపించేశారు. ఈ పరిణామాల మధ్య ప్రస్తుతం ఆదోని తహసీల్దార్గా శేషఫణినే కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. ఎనిమిది నెలల క్రితం ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు బలమైన రాజకీయ మద్దతు ఉండటంతోనే స్థానం పదిలం చేసుకోగలిగారనే చర్చ జరుగుతోంది. శేషఫణి తన సర్వీసులో సస్పెండ్ అయినప్పటికీ అధికార పార్టీ అండదండలతోనే తిరిగి పోస్టింగ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఒక్క పోస్టుకు ముగ్గురు అధికారుల మధ్య జరిగిన ‘రాజకీయ’ పోరు అధికార వర్గాల్లో చర్చకు తావిస్తోంది. నేతల సిఫార్సులతో సీటు పదిలం చేసుకుంటున్న అధికారులు పారదర్శక సేవలు ఎంత మేరకు అందించగలరనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. కూటమి నేతల సిఫారసుతో మూడుముక్కలాట నాయకులను మెప్పించలేక అధికారుల పాట్లు ఇద్దరు తహసీల్దార్ల ఉత్తర్వులు అప్పటికప్పుడు మార్పు ఎట్టకేలకు పాత తహసీల్దారే కొనసాగింపు -
పని ఒత్తిడి తగ్గించాలి
ప్రభుత్వం మాపై కక్ష గట్టినట్లు కనిపిస్తోంది. ఏ పని చేయాలన్నా మాపైనే వేస్తోంది. ఎన్ని సర్వేలు చేస్తున్నాం. రోజుకు ఎంతమంది ప్రజలను కలుస్తున్నాం. అయినా పట్టించుకోవడంలేదు. సచివాలయాల పనులన్నీ చేస్తూనే జనగణన, ఎస్ఐఆర్, సర్వేలు చేయాలి. వాటి కోసం బయటకు వెళ్లితే ఎందుకు సచివాలయంలో లేరని ప్రశ్నిస్తున్నారు. పని ఒత్తిడితో దిక్కుతోచడంలేదు. రాత్రి 10 గంటల వరకు టీసీ పెడుతున్నారు. కుటుంబ సభ్యులతో కూడా గడపడానికి సమయం లేకుండా పోతుంది. – మహేష్, సచివాలయ ఉద్యోగి, కర్నూలు -
పిడుగు పడి చీలిన చెట్టు
కొలిమిగుండ్ల: పిడుగు పడటంతో పొలంలోని వేప చెట్టు చీలి పోయింది. కొలి మిగుండ్ల మండలం హనుమంతుగుండం సొ సైటీ సమీపంలో ఈ ఘటన శనివారం సాయంత్రం ఆరు గంట ల సమయంలో జరిగింది. ఒక్క సారిగా మెరుపులు, ఉరుము లు రావడంతో చెట్టు కింద ఉన్న రైతులు ఇళ్లకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. పిడుగు పాటుకు చెట్టు రెండు భాగాలుగా మారడంతోపాటు బెరడు పూర్తిగా ఊడిపోయింది. కర్నూలు (అర్బన్) : కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో శనివారం అధ్యక్షుడు గోల్కొండ అజ్మత్ బీ ఆధ్వర్యంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మార్కెట్ యార్డులో సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ను వినియోగించాలని పాలకవర్గ సభ్యులు చర్చించి తీర్మానించారు. సమావేశంలో కార్యదర్శి ఆర్ జయలక్ష్మి, ఉపాధ్యక్షులు శేషగిరి శెట్టి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మంత్రాలయంలో 4.4 సెం.మీ వర్షపాతం మంత్రాలయం రూరల్: మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. బూదూరు, సూగూరు, మంత్రాలయం, మాధవరం, రాంపురం, కల్లుదేవకుంట, చెట్నిహళ్లి గ్రామాల్లో వంకలు, వాగులు పొంగిపొర్లాయి. మండలంలో 4.4 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు రెవె న్యూ అధికారులు తెలిపారు. మాధవరం గ్రామానికి చెందిన జగన్నాథ రైతుకు చెందిన పొలం భారీగా కోతకు గురైంది. పొలాన్ని సాధారణ సిత్థికి చేర్చాలంటే రూ. లక్ష ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. -
భారమైనా.. ‘సాగా’ల్సిందే
వ్యవసాయం రోజురోజుకు భారమవుతోంది. కష్టంతో పాటు ఖర్చు పెట్టిన ప్రతి పైసా తిరిగి రావాలని రైతులు దేవుడిపై భారం వేస్తారు. విత్తు మొదలు పంట అమ్మే వరకు ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ ముందకెళ్తారు. అన్నీ అనుకూలిస్తే గట్టెక్కుతారు.. లేదంటే నష్టాలు మూటగట్టుకుంటారు. కుటుంబమంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా ఒక్కోసారి మిగిలేది అప్పులే. అయినా రైతులు పట్టువదలని విక్రమార్కుల్లా వ్యవసాయం చేస్తూనే ఉంటారు. మద్దికెర మండలం పెరవలికి చెందిన రైతు రామాంజినేయులు తనకున్న మూడెకరాల తోటలో మిరప పంట సాగు చేశారు. బాడుగ ట్రాక్టర్తో పొలం దుక్కిదున్ని పంట సాగు చేశారు. పంటలో కలుపు తీసేందుకు కాడెద్దులు పెట్టాలంటే ఎక్కువ ఖర్చువుతుంది. ప్రతి చిన్న పనికి కాడెద్దులు పెడితే పంట నుంచి వచ్చే కాస్తో కూస్తో ఆదాయం కూడా మిగలకుండా పోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాడెద్దులు పోషణ భారమైంది. ఈ క్రమంలో ఇలా తన కొడుకు, కూతురు కాడెద్దులుగా మారగా తండ్రి దంతెతో మిరప పంటలో కలుపు తొలగించారు. – తుగ్గలి -
విద్యుదాఘాతానికి వృద్ధురాలి బలి
● విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమమని బంధువుల ఆరోపణ కొలిమిగుండ్ల: చింత చిగురు కోసం వెళుతున్న ఓ వృద్ధురాలిని మృత్యువు విద్యుత్ రూపంలో బలితీసుకుంది. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. అంకిరెడ్డిపల్లెకు చెందిన కాశింశెట్టి లక్ష్మీదేవి (63) కుమారుడు నాగేంద్రతో కలిసి ఉంటుంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో పనులు పూర్తి చేసు కొని సమీపంలో ఉన్న చింత చెట్ల వద్దకు చిగురు కోసుకునేందుకు వెళ్లింది. ఇటీవలనే గాలి వానకు విద్యుత్ స్తంభం తీగతో పాటు నేలకొరిగింది. చెట్టు వద్దకు వెళ్లే క్రమంలో తీగ తగలడంతో మంటలు వ్యాపించి అక్కడికక్కడే మృత్యువాత పడింది. కుమారుడు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలోకి డ్యూటీకి వెళ్లాడు. శనివారం ఉదయం బంధువులు ఇంటి వద్దకు వచ్చి చూడగా కనిపించక పోవడంతో కుమారునికి సమాచారం ఇచ్చారు. డ్యూటీ నుంచి ఇంటికి చేరుకొని బంధువుల సాయంతో ఊర్లో అక్కడక్కడ వెతికారు. చుట్టు పక్కల గ్రామాల్లో ఆచూకీ కోసం వెతికినా కనిపించ లేదు. చివరకు విరిగిపడిన విద్యుత్ స్తంభం వద్ద పడి ఉన్న వృద్దురాలిని స్థానికులు చూసి లక్ష్మీదేవిగా గుర్తించారు. వారం, పది రోజుల క్రితం గాలి వానకు స్తంభం పడిపోయినా విద్యుత్ సిబ్బంది పట్టించుకోక పోవడంతో నిండు ప్రాణం బలైందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఇప్పుడు వృద్ధురాలి మృతికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి
కర్నూలు(అర్బన్): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, గుంటూరు వ్యవసాయ డైరెక్టరేట్ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు కోరారు. శనివారం వారు జాతీయ ఆహార భద్రత మిషన్, జాతీయ నూనెగింజల అండ్ ఆయిల్ పామ్ మిషన్ పథకాల కింద రైతులకు సరఫరా చేస్తున్న విత్తనాల నాణ్యత, పరిమాణం, ప్యాకింగ్ విధానాలపై విత్తన సరఫరా సంస్థలైన ఏపీ సీడ్స్, ఎన్ఎస్సీ, హెచ్ఐఎల్ గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీడ్ ట్రీట్మెంట్, రసాయనాలు, సంబంధిత పంటల సాగు విధానాల బ్రోచర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్తి విత్తన ప్యాక్తో పాటు సీడ్ ట్రీట్మెంట్ కెమికల్, సంబంధిత పంట సాగు విధానాల బ్రోచర్ను తప్పనిసరిగా జత చేయాలన్నారు. నాణ్యమైన విత్తనాల ప్యాకింగ్ పూర్తి చేసి సంబంధిత ప్రాంతాలు, రైతు సేవా కేంద్రాలు, మండలాలకు తక్షణమే డిస్పాచ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అల్లీపీర, మండల వ్యవసాయ అధికారి విష్ణువర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతా.. మజాకా!
పెద్దకడబూరు: పేదల సమస్యలను పరిష్కరించాల్సిన అధికార పార్టీ నేత డబ్బులకు కక్కుర్తి పడి పేదలను కష్టాల పాలుజేశాడు. అధికారులు సైతం టీడీపీ నేతకే మద్దతు ఇచ్చి నోటీసులు ఇవ్వడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకుడు, కోసిగి మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్నకు మామూళ్లు ఇవ్వలేదని తమపై అన్యాయంగా ఫిర్యాదు చేశారని పెద్దకడబూరు ఎస్సీ కాలనీకి చెందిన బొగ్గుల నరసన్న, శివయ్య, మడ్రి అనిల్ తదితరులు వాపోతున్నారు. ఈ మేరకు శనివారం వారంతా తహసీల్దారు వలిబాషాను కలసి తమ ఒరిజినల్ పట్టాలను చూపించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడబూరు మండల కేంద్రం పరిధిలోని సర్వే నెంబర్ 262ఏ3లో 3.30 సెంట్లు భూమిలో దాదాపు వందేళ్లకు పైగా నివాసం ఉంటున్నారు. 2005 – 2006లో అధికారులు ఆ గుడిసెలకు పట్టాలు ఇచ్చారు. 2016లో రెవెన్యూ డివిజినల్ అధికారి ఇచ్చిన నివేదిక మేరకు 262/ఏ1లో 1.16 ఎకరాలు శాన వాటిక, 262/ఏ2ఏలో 2.30 ఎకరాలు పోలీస్స్టేషన్, 262/ఏ3లో 2.50 ఎకరాలలో ఎస్సీ కాలనీ, 262/ఏ3లో 0.88 ఎకరాలలో ఓపెన్ సైట్, 262/బిలో 1.54 ఎకరాలలో ఎస్సీ కాలనీ, 262/సిలో 0.09 సెంట్లు ఎస్సీ కాలనీ మొత్తం 8.47 ఎకరాలు ఉంది. పైన కనబరిచిన ఓపెన్ సైట్లో గతంలో టీడీపీ నాయకుడు, కోసిగి మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న నకిలీ పట్టాలు సృష్టించి ఒక్కొక్కరితో రూ. 20 వేల వరకు వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు. ప్రస్తుతం 262/ఏ3లో 3.30 ఎకరాలలో నివాసం ఉంటున్న వారితో డబ్బులు డిమాండ్ చేశాడని, తమకు గతంలోనే పట్టాలు ఉన్నాయని డబ్బుల ఇవ్వమని నిరాకరించడంతో టీడీపీ నాయకుడు అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమ నోటీసులు ఇప్పించారని మండిపడ్డారు. తహసీల్దార్ను కలసిన వారిలో ఎస్సీ కాలనీ వాసులు మేకల నరసన్న, మేకల షడ్రక్, జె.కుమార్, కాకి సుందరం, జె.తిమ్మక్క, మంచోది బొడ్డన్న, మేరమ్మ, జోతమ్మ, తదితరులు ఉన్నారు. మామూళ్లు ఇవ్వలేదని పేదల స్థలాలపై ఫిర్యాదు అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆందోళన ఒరిజినల్ పట్టాలతో తహసీల్దార్ను కలసిన బాధితులు -
రోడ్లపై చెత్త వేస్తే జరిమానా
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలోని రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె మీడియా ప్రతినిధులతో సుహృద్భావ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని కేసీ కెనాల్లో చెత్త వేసినా కూడా వదిలిపెట్టబోమన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా చెత్తను బాధ్యతా రాహిత్యంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, కాలువల్లో వేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కర్నూలు నగరంలో పరిశుభ్రతను పాటించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సీజనల్ హాస్టళ్లను ముందుగానే ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. డ్రిప్ ఇరిగేషన్కు ప్రాధాన్యం ఇవ్వడానికి ఈ యేడాది 20వేల హెక్టార్లో పండ్ల తోటలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు. కొత్త బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు మినహాయింపు కర్నూలు(అర్బన్): ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎస్సీ విద్యార్థులు తల్లికి వందనం ప్రయోజనం పొందేందుకు కొత్తగా ఓపెన్ చేసే బ్యాంకు ఖాతాకు పాన్కార్డు అవసరం లేదని జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరంలో ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు సమీపంలోని యూనియన్ బ్యాంకు లేదా కెనరా బ్యాంకులో విద్యార్థి పేరు మీద ఆధార్ కార్డు, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నెంబర్తో కొత్త ఖాతాను ప్రారంభించవచ్చన్నారు. ఈ ఖాతాను తప్పనిసరిగా ఎన్పీసీఐతో అనుసంధానం చేయాలన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 10లోగా పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,960 మంది అర్హులైన ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు ఎన్పీసీఐ లింకు ప్రక్రియ పెండింగ్లో ఉందన్నారు. ఆధార్కార్డు, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్తో సమీపంలోని స్వర్ణ గ్రామ /స్వర్ణ వార్డు సచివాయాలను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు కర్నూలు(అర్బన్): జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన పనుల్లో వేగాన్ని పెంచి నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు సీహెచ్ మనోహర్ చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాగునీటి అవసరాలకు ప్రభుత్వం ఒక్కో జిల్లా రూ.కోటి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అందులో మొదటి విడతగా రూ.50 లక్షలతో జిల్లాలోని 19 మండలాల్లో 24 పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారన్నారు. ఈ నిధులతో ముఖ్యంగా బోర్ల డీపెనింగ్, ఫ్లష్షింగ్, పంపు సెట్ల రిపేర్లు, పైప్లైన్ల మార్పు, విస్తరణ, లీకేజీలను అరికట్టడం తదితర పనులు చేపడతామన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల పనులను వేగవంతం చేయాలని ఇప్పటికే ఈఈ, డీఈఈలను ఆదేశించామరు. జిల్లాలో ఎక్కడ నీటి ఎద్దడి తలెత్తినా, వెంటనే అక్కడికి వెళ్లి సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. ఉదయం 9.30కే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే meekosam.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
బీఎల్ఓ విధుల నుంచి మినహాయించాలి
సచివాలయ ఉద్యోగులకు బీఎల్ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. బీఎల్ఓ విధులను ఇతర శాఖలకు చెందిన ఉద్యోగుల ద్వారా చేయించుకోవాలి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు కల్పిస్తున్న ప్రయోజనాలను సచివాలయ ఉద్యోగులకు కూడా కల్పించాలి. ముఖ్యంగా ఉన్నతాధికారుల వేధింపులు ఆపాలి. స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. – బి.భాస్కర్రెడ్డి, కార్యదర్శి, సచివాలయ ఉద్యోగుల సంఘం -
ఉద్యోగుల ప్రాణాల కంటే పనులే ముఖ్యమా ?
సచివాలయల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రాణాల కంటే పనులే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా వరుస మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. గత ఆరు నెలల కాలంలోనే జిల్లాలో ఐదుగురు ఉద్యోగులు మృతి చెందారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రత్యేక సర్వేలు, ఇతర శాఖల అదనపు విధులను ఒకే సారి నిర్వహించమనడంతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. – ఎం.రవికుమార్, స్వర్ణ గ్రామ/ స్వర్ణ వార్డు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ సచివాలయ ఉద్యోగులకు నిర్దిష్టమైన పనిగంటలు ఉండేలా చూడాలి. తమకు సంబంధం లేని అనేక రకాల పనులను పురమాయించడం వల్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ రకమైన ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడుతుంటే, మరికొందరు అనారోగ్యాలతో మరణిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడరు కానీ, వారితో వెట్టి చాకిరీ మాత్రం చేయిస్తున్నారు. – శివప్రసాద్, సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి -
గిరిజన విద్యాలయాల్లో సమస్యలు ఉత్పన్నం కారాదు
● జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బి.సురేష్ కర్నూలు (అర్బన్): విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్న దృష్ట్యా జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ/గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి.సురేష్ ఆదేశించారు. శనివారం సాయంత్రం సంక్షేమ భవన్లోని తన కార్యాలయంలో గిరిజన విద్యాసంస్థలకు చెందిన ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాల్గో తరగతి సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా పాఠశాలలు, వసతి గృహాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే వంట పాత్రలు, తరగతి గదులు, డైనింగ్ హాల్స్ను కూడా శుభ్రం చేసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర వాటిపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులు పాఠశాలలకు వచ్చే నాటికి వారి అవసరాలకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. -
కస్టోడియల్ డెత్పై ఆర్డీఓ విచారణ
కొలిమిగుండ్ల: స్థానిక పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన కస్టోడియల్ డెత్పై విచారణ చేపట్టినట్లు బనగానపల్లె ఆర్డీఓ నరేంద్రనాథ్రెడ్డి శనివారం తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెలుం శింగవరానికి చెందిన దొమ్మరి వెంకటసుబ్బయ్యను ట్రాక్టర్ చోరీ కేసులో ఏప్రిల్ 18న పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. పోలీస్ స్టేషన్లోని బాత్రూంలో ఉరివేసుకొని వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. దీనిపై జిల్లా కలెక్టర్ మెజిస్ట్రీరియల్ విచారణ చేయమని ఆదేశించారన్నారు. ఇందులో భాగంగానే మృతునికి చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు, పోలీస్, రెవెన్యూకు చెందిన మొత్తం 16 మందిని విచారించామన్నారు. విచారణ నిర్వహణపై వారం రోజుల క్రితం బహిరంగ నోటీసు ఇచ్చామని, ఈ ఘటనపై బయట వ్యక్తులకు ఎవరికై నా అభ్యంతరాలుంటే ఫిర్యాదు ఇవ్వవచ్చని పేర్కొన్నామన్నారు. విచారణలో భాగంగా ఇంకా కొంత మంది వైద్యులతో పాటు సంఘటన జరిగిన సమయంలో ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ను విచారించాల్సి ఉందన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ ముగించి నివేదికలను కలెక్టర్కు అందజేస్తామని చెప్పారు. -
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
కర్నూలు(సెంట్రల్): మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి సి.సెల్వం అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగిన ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, అందువల్ల ప్లాస్టిక్ని తమ జీవనశైలి నుంచి తొలగించడం మంచిదన్నారు. సముద్రం, భూమి, చివరకు మనిషి శరీరంలోకి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు చేరిపోతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఫలితంగా క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోందన్నారు. ఇప్పటికై నా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయాధికారి పి.వి.కిశోర్కుమార్రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిక్షణకు జిల్లా యంత్రాంగం వారం రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కళాజాతాల ద్వారా పాటలు, నృత్యాలతో ప్రజల్లో చైతన్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, సీనియర్ సైంటిస్టు ఎంబీఎస్ శంకరరావు, పీసీబీ అధికారి స్వామి వివేకానంద, అటవీ అధికారిని తేజస్వి, ప్రియాంక, పి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
శ్రీగిరి.. ప్రగతి అధోగతి!
శ్రీశైలంటెంపుల్: తిరుమల తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం.. శ్రీశైలం పర్యటనకు వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబు చెప్పే మాటలు కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా శ్రీశైల క్షేత్రంలో అభివృద్ధి కనిపించడం లేదు. క్యూ కాంప్లెక్స్, సరిపడినన్ని వసతి గదులు లేక.. అరకొర సౌకర్యాలతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఉత్సవాల్లో భక్తుల అవస్థలు వర్ణనాతీతం. మాటల్లోనే అభివృద్ధి! రాష్ట్రంలో తిరుమల తరువాత రెండో పెద్ద పుణ్యక్షేత్రం శ్రీశైలం. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధిపై పలుమార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇంతవరకు ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా సీఎం హోదాలో చంద్రబాబు శ్రీశైల క్షేత్రాన్ని మూడుసార్లు సందర్శించారు. శ్రీశైల క్షేత్రాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పినా ఆచరణలో కనిపించలేదు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధి కోసం టూరిజం, రెవెన్యూ, దేవదాయ, అటవీశాఖ, ఆర్అండ్బీ శాఖల మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కూడా అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు మాటల్లో మాత్రమే అభివృద్ధి ఉంటుందని, చేతల్లో ఉండదని ప్రజలు విమర్శిస్తున్నారు. సమావేశాలకే పరిమితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడు పార్టీలకు చెందిన 26 మందితో జంబో ట్రస్ట్బోర్డును నియమించారు. ట్రస్ట్బోర్డు ఏర్పాటై ఎనిమిది సమావేశాలు నిర్వహించినా ఇంతవరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. జంబో ట్రస్ట్బోర్డు సభ్యులు తమ దర్శనాలు, తమ సిఫార్స్ లేఖలకు ప్రాధాన్యత ఇవ్వలేదని దేవస్థాన అధికారులపై ఆగ్రహించడం తప్ప క్షేత్రాభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ట్రస్ట్బోర్డుకు స్వయంప్రతిపత్తి లేకపోవడంతో తీర్మానాలన్నింటినీ దేవదాయశాఖ కమిషనర్కు పంపుతున్నారు. అక్కడి నుంచి ఇంతవరకు అనుమతులు రావడం లేదు. భక్తుల అసంతృప్తి శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తున్న భక్తుల సంతృప్తిస్థాయిని తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఐబీఆర్ఎస్ కాల్స్ చేస్తోంది. సమయానుకూలంగా దర్శనాలు జరగకపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడం తదితర విషయాలపై భక్తులు అసంతృప్తి చెందుతున్నారు. దీంతో భక్తుల సంతృప్తి స్థాయిలో శ్రీశైల క్షేత్రం అట్టడుగు స్థాయికి చేరుకుంటోంది. శ్రీశైల క్షేత్ర అభివృద్ధిని మరచిన చంద్రబాబు ప్రభుత్వం సమావేశాలు, చర్చలకే పరిమితమైన జంబో ట్రస్ట్బోర్డు సౌకర్యాలు లేక భక్తులకు తప్పని తిప్పలు మెరుగుపడని సౌకర్యాలు శ్రీశైల క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడడం లేదు. ప్రస్తుతం దేవస్థానంలో రేకుల షెడ్డులతో క్యూకంపార్ట్మెంట్లు ఉన్నాయి. అలాగే ఈ క్యూ కంపార్ట్మెంట్లలో సుమారు 10 వేల మంది మాత్రమే భక్తులు వేచి ఉండేలా ఉన్నాయి. దీంతో సాధారణ రోజుల్లోనే భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే భక్తుల అవస్థలు వర్ణానాతీతం. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా అధునాతన టెక్నాలజీతో కూడిన నూతన క్యూకాంప్లెక్స్ నిర్మిస్తామని చెబుతునప్పటికీ ఇంతరవకు ఒక్క అడుగు ముందుకు సాగలేదు. అలాగే భక్తులకు సరిపడా వసతి సౌకర్యాలు లేవు. శ్రీశైల క్షేత్రంలో వసతి సౌకర్యాలు మెరుగుపడాల్సిన ఉంది. అయితే ఆ దిశగా ఒక్క అడగు కూడా పడలేదు. -
ఏడాదిగా పెండింగ్
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. నిర్ణీత సమయంలోగా విడుదల చేయాల్సిన ఫీజులను ఏడాదిగా పెండింగ్ పెట్టింది. మొత్తం రూ.10,700 కోట్లను బకాయి పెట్టింది. కళాశాలల యాజమాన్యాలు మాత్రం విద్యార్థుల ముక్కుపిండి ఫీజులను వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ వర్సిటీల నుంచి ఏకంగా రూ.1500 కోట్ల నిధులు దారి మళ్లాయి. – కటికె గౌతం, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్సీసీ విద్యార్థి విభాగం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఘోష కూటమి ప్రభుత్వానికి పట్టనట్టు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పుల బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ నేటికి నేరవేరలేదు. కేవలం అరకొరగానే ఫీజులను విడుదల చేస్తున్నారు. వెంటనే ఫీజులను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం. – ఎస్ శరత్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం. గత విద్యా సంవత్సరానికి సంబంధించి 34,427 మంది విద్యార్థులకు రూ.77.76 కోట్లు విడుదల అయ్యాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. – బీ రాధిక, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి -
వసతిగృహ విద్యార్థులకు నాణ్యమైన సేవలు
కర్నూలు(అర్బన్): వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన సేవలు అందించాలని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయంతో పాటు బీసీ కార్పొరేషన్, కల్లూరులోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయాల్లోని రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సాధికరత అధికారిణి కె.ప్రసూన, బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుసేన్, సహాయ సంక్షేమ అధికారులు శ్రీనివాసులు, ఆంజినేయులు నాయక్, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షులు పాలేగార్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు(టౌన్): రెండేళ్ల ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక గిప్సన్ కాలనీలోని ఆయన స్వగృహంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని 25వ వార్డు నుంచి 46వ వార్డు వరకు బూత్ ఏజెంట్లు, వార్డు నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, బూత్ స్థాయిలో కార్యకర్తల సమన్వయం, ఎస్ఐఆర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసగిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. కర్నూలు నియోజకవర్గంలో ఈనెల 14 నుంచి వచ్చే నెల 15 వరకు నిర్వహించే ఎస్ఐఆర్ సర్వే కీలకమని, పార్టీ పరంగా ప్రభుత్వం నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించాలన్నారు. కూటమి నేతలు ఓట్లు తొలగించడం, బోగస్ ఓట్లు చేర్చడం వంటి అనైతిక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు మహిళలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేకపోయాడన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో అరకొర బస్సులు ఏర్పాటు చేసి మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అబద్ధాలు చెప్పిన ఈ ప్రభుత్వానికి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. -
ముగిసిన సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. గత నెల 28న బక్రీద్ పండుగ సందర్భంగా వాయిదా పడిన పరీక్షను శుక్రవారం నిర్వహించారు. చివరి రోజున ఇంగ్లిష్ పరీక్షకు 916 మంది విద్యార్థుల్లో 692 మంది హాజరయ్యారు. డీఈఓ ఎల్.సుధాకర్ రెండు కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రెండు కేంద్రాలు, స్క్వాడ్ బృందాలు 15 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మూల్యాంకనం ఈ నెల 8, 9, 10 తేదిల్లో చేపట్టనున్నారు. ● ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ముగియడంతో ఈ నెల 7వ తేది నుంచి మూల్యాంకనం నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి జి.లాలెప్ప తెలిపారు. ప్రభుత్వ(టౌన్ మోడల్) జూనియర్ కాలేజీలో నిర్వహించే మూల్యాంకనానికి ఎంపిక చేసిన సిబ్బందికి నేడు(శనివారం) స్పాట్పై అవగాహన కల్పించనున్నారు. సుమారుగా లక్ష సమాధాన పత్రాలు జిల్లాకు వచ్చినట్లు తెలిసింది. రైతులను వెక్కిరిస్తున్న ధరలు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిరాశాజనకంగా ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు వేరుశశనగ 173 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.5,400, గరిష్ట ధర రూ.7,831 లభించింది. సగటు ధర రూ.6520 మాత్రమే నమోదైంది. ఎక్కువ లాట్లకు కేవలం రూ.6వేల నుంచి రూ.6500 మాత్రమే ధర లభించినట్లు తెలుస్తోంది. ● వాము మార్కెట్కు 310 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.4,450, గరిష్ట ధర రూ.24,288 లభించగా.. సగటు ధర రూ.19,050 నమోదైంది. వాముకు ఇటీవల గరిష్ట ధర రూ.30 వేల వరకు పలికింది. ● మిర్చి(రెడ్) ధరలు దయనీయంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనిష్ట ధర రూ.5,555, గరిష్ట ధర రూ.13,639 లభించింది. సగటు ధర రూ.9,619 నమోదైంది. మార్చి, ఏప్రిల్ నెలలో లభించిన ధరలతో పోలిస్తే 60 శాతం వరకు ధరలు పడిపోవడం గమనార్హం. ఆర్ఆర్బీ పరీక్షలకు ఉచిత శిక్షణ కర్నూలు(అర్బన్): రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు–అసిస్టెంట్ లోకో పైలెట్, గ్రూపు – డీ – 2026 పరీక్షలకు స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఈ నెల 11లోగా బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం, అబ్బాస్నగర్, కల్లూరు తహసీల్దార్ కార్యాలయం, కర్నూలు అనే చిరునామాలో దరఖాస్తులను అందజేయాలన్నారు. వంద మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. ఇతర వివరాలకు 08518 – 236076, 9652093661 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. అక్రమంగా ఐరన్ ఓర్ తవ్వకాలు టాస్క్ఫోర్స్: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా సంపాదించుకోవడానికి పలు మార్గాలను ఎంచుకున్నారు. గ్రామాల్లో విచ్చల విడిగా బెల్టుషాపులు ఏర్పాటు చేసుకున్నారు. అదీ చాలక ఇసుక వ్యాపారం చేస్తున్నారు. వీటికి అదనంగా ఐరన్ ఓర్ తవ్వకాలు చేపడుతున్నారు. బేతంచెర్ల మండలంలోని గూటుపల్లె, హుసేనాపురం, తవిసికొండ, పాపాసాని కొట్టాల, రేపల్లె, వీరాయపల్లె పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఐరన్ ఓర్ తవ్వుతున్నారు. ఇందుకోసం జేసీబీ, హిటాచీ వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ, భూగర్భ గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ నాయకుల తవ్వకాలకు సహకరించడంతోపాటు వారు అనుకున్న ప్రాంతాలకు ఐరన్ఓర్ను తరలించే ప్రకియలో కొందరు అధికారులు పాలు పంచుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
దొర్నిపాడు: డబ్ల్యూ కొత్తపల్లె గ్రామానికి చెంది న ఉపాఽధి కూలీ బాలయ్య (34) వడదెబ్బతో అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. బాలయ్య రోజులాగే పనులకు వెళ్లి కాలువ పూడికతీత పనుల వద్ద రెండు ఫొటోలు కూడా దిగాడు. 020587 నంబర్గల జాబ్కార్డు కల్గి ఉన్నాడు. ఇంతలో ఎండతీవ్రతకు తట్టుకోలేక పని ప్రదేశంలోనే అస్వస్థతకు గురై కుప్పకూలాడు. వెంటనే డబ్ల్యూ గోవిందిన్నెలోని ఓ వైద్యుడి దగ్గరకు చికిత్స నిమిత్త తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య సరోజ ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బరాయుడు వెంటనే ఎంపీడీఓ సావిత్రి, ఏపీఎం హనీఫాకు విషయం చెప్పగా అనంతరం వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబానికి అధికారులు ఆర్థిక సాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని డీసీ ప్రెసిడెంట్ ప్రసాద్రెడ్డి కోరారు. గుండెపోటుతో ఏఎస్ఐ శంకర్ మృతి మద్దికెర: మద్దికెర పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆరిపల్లి శంకర్ (58) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. విధులకు ఇంటి నుండి బయలుదేరే సమయంలో గుండెపోటు రావడంతో వెంటనే 108 సమాచారం అందించగా వైద్యపరీక్షల కోసం గుంతకల్లు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. విద్యుదాఘాతంతో ఎలక్ట్రిషన్ మృత్యువాతఎమ్మిగనూరురూరల్: గార్లదిన్నె గ్రామంలో బోరు మరమ్మతు చేసేందుకు వెళ్లిన ఓ ఎలక్ట్రిషన్ ప్రమాదవశాత్తూ విద్యుత్ఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామానికి చెందిన కురవ లక్ష్మన్న(36) చుట్టుపక్కల గ్రామాల్లో ప్రైవేట్ ఎలక్ట్రిషన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం గ్రామానికి చెందిన కౌలు రైతు లాజర్ పొలంలో బోరు మరమ్మతు చేసేందుకు ఎలక్ట్రిషన్ కురవ లక్ష్మన్నను తీసుకెళ్లాడు. విద్యుత్ సరఫరా లేదు అనుకొని ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజు వేసేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీనరసమ్మ, కుమారులు శ్రీకాంత్(10), హరికృష్ణ(8)లు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. చలనచిత్ర రంగానికి ఘంటసాల, ఎస్పీ రెండు కళ్లు కర్నూలు కల్చరల్: వందేళ్ల తెలుగు చలన చిత్ర రంగానికి నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రెండు కళ్లు అని వక్తలు కొనియాడారు. గురువారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎస్పీ బాలు పాడిన పాటలను గాయకులు చంద్రకంటి మద్దయ్య, రమణ తదితరులు ఆలపించారు. ఈ సందర్భంగా ఏపీ తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కరణ్ మాట్లాడుతూ తెలుగు సినిమా రంగంలో బాలుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రేక్షకులను అలరించారన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కరోనా మన జాతికి తీరని నష్టం కలిగించిందన్నారు. ఆయన గాయకుడు మాత్రమే కాక ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ విశ్రాంత మేనేజర్ చిన్నరాముడు, కళాక్షేత్రం కార్యదర్శి యాగంటీశ్వరప్ప, సభ్యులు ఈశ్వర్, కేవీ రమణ, వివేక్, మహేష్, గోపిశెట్టి, సామ్యూల్, సందడి మహేశ్ పాల్గొన్నారు. ఖరీఫ్కు సరిపడా ఎరువులు అందిస్తాం కోవెలకుంట్ల: ప్రస్తుత ఖరీప్ సీజన్కు రైతులకు కొరత లేకుండా రసాయన ఎరువులను సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం కోవెలకుంట్ల ఏడీఏ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల రైతు సేవా కేంద్రాల సిబ్బంది, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది యూరియా, డీఏపీ తదితర ఎరువులను ’ఏపీఏఐఎంఎస్’ యాప్ ద్వారా పంటల విస్తీర్ణాన్ని బట్టి మూడు విడతలుగా కేటాయిస్తామన్నారు. అధిక యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలు, ఎలినినో ప్రభావం, కౌలు కార్డుల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీడీఏ గంగాధర్, ఏడీఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని మహిళ మృతి
కర్నూలు: నగరంలో కిడ్స్ వరల్డ్ సమీపంలోని యునానీ హాస్పిటల్ వద్ద బైక్ ఢీకొన్న ప్రమాదంలో బి.నాగేశ్వరమ్మ (51) మృతిచెందారు. కల్లూరు మండలం గోకులపాడు గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ, చిన్నసుంకన్న దంపతులు కొంతకాలంగా పాతబస్తీలోని రాధాకృష్ణ టాకీస్ వెనుక ఉన్న డబరా వీధిలో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు. ఎగ్జిబిషన్ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల్లో నాగేశ్వరమ్మ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. గురువారం ఉదయం ఇంటి వద్ద నుంచి మనవరాలు శాంతిప్రియతో కలసి షాపుల్లో పనిచేయటానికి వెళ్తుండగా స్థానిక యునానీ హాస్పిటల్ వద్ద వెనుకనుంచి బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరమ్మ తల వెనుకభాగంలో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో పడిపోయింది. మనవరాలి తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎదురుగా గోశాల వద్ద అరటి పండ్ల బండితో ఉన్న నాగేశ్వరమ్మ భర్త చిన్నసుంకన్న గమనించి భార్యను ఆటోలో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. క్యాజువాలిటీలో వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆసుపత్రి ఆవరణలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. శాంతిప్రియ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతురాలి భర్త చిన్నసుంకన్న ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని మునెప్ప నగర్లో అక్రమంగా ఓ రేకుల షెడ్లో నిల్వ ఉంచిన 56 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని బుధవారం రాత్రి విజిలెన్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అధికార పార్టీ నాయకుడికి చెందిన రేకుల షెడ్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారంతో విజిలెన్స్ పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గురువారం విజిలెన్స్ సీఐ పవన్కుమార్ మాట్లాడుతూ.. నందవరం మండలం సోమలగూడూరు మహబుబ్బాషాకు చెందిన రేకుల షెడ్లో 56 బస్తాలు (24 క్వింటాళ్ల) రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు దాడి చేసి బియ్యంతో పాటు, రవాణాకు ఉపయోగించే ఆటోను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించి, నిందితుడు మహబుబ్బాషాపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజలకు అందించే బియ్యాన్ని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. సమావేశంలో ఆర్ఐ హఫీజ్, విజిలెన్స్ కానిస్టేబుళ్లు అశోక్కుమార్, ప్రతాప్రెడ్డి ఉన్నారు. -
చట్టాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలి
కోడుమూరు రూరల్: మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. గురువారం కోడుమూరులోని శ్రీవాసవి కల్యాణ మండపంలో మహిళల భద్రత–నేరాల నివారణ మరియు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఏ చిన్న సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలన్నారు. కుటుంబ కలహాలు తలెత్తినప్పుడు పోలీసులను ఆశ్రయిస్తే కౌన్సెలింగ్ ద్వారానే 90శాతం సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన ’ఆపరేషన్ దండయాన్’ పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను, వాలీబాల్ క్రీడలో గెలుపొందిన విద్యార్థులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బాబు ప్రసాద్, కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్ఐ ఎర్రిస్వామి, సి.బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్, కోడుమూరు ఇంచార్జీ ఎంపీడీఓ క్రిష్ణారెడ్డి, ఎంఈఓ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణ పల్లకోత్సవం
మంత్రాలయం: పవిత్ర తుంగభద్ర నదీ తీరాన వెలసిన సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ పల్లకోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం మఠం ప్రాంగణంలో దివాన్ సుజయింద్ర ఆచార్, బృందావనం, అర్చకులు శ్రీకాంత్ స్వామి, సహాయ పీఆర్వో హొన్నళ్లి వ్యాసరాజచార్ ఆద్వర్యంలో మృతికా బృందావనాన్ని బంగారు పల్లకిలో ఉంచి అశేష జనవాహిని నడుమ భజా భంత్రీల నడుమ, మంగళ వాయిద్యాలతో నమో రాఘవేంద్ర నామస్మరణంతో ఊరేగించారు. ప్రవచన మండపంలో బంగారు పల్లకి సేవ చేయించి భక్తులకు విశేష దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భక్తులకు ఆశీర్వచనాలు గావించారు. కార్యక్రమంలో మఠం అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా సిట్రా సత్యనారాయణమ్మ కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి(కర్నూలు పార్లమెంట్)గా మాజీ జిల్లా అధ్యక్షురాలు, తాజా మాజీ కార్పొరేటర్ సిట్రా సత్యనారయణమ్మ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. 10న జెడ్పీ సర్వసభ్య సమావేశం కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 10న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.వి.రమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ భవనంలో నిర్వహించనున్న సమావేశంలో వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పాఠశాల విద్యా శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశానికి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, జెడ్పీటీసీ, కోఆప్షన్ సభ్యులు, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఎంపీపీ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన చైర్మన్లు హాజరు కావాలని ఆయన కోరారు. ఒకవైపు ఎండలు, మరోవైపు వానలు కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు ఉష్ణోగ్రతలు కొనసాగుతుండగా.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు 14 మండలాల్లో వర్షం కురిసింది. రెండు, మూడు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. దేవనకొండలో అత్యధికంగా 85.4 మి.మీ వర్షపాతం నమోదైంది. చిప్పగిరిలో 66.6, పత్తికొండలో 36.6, మద్దికెరలో 10, కల్లూరులో 8.8 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. ఇదిలాఉంటే ఉష్ణోగ్రతలు కూడా తగ్గడం లేదు. పాణ్యంలో 40.3, గోస్పాడులో 40.3, చాగలమర్రిలో 39.9, ఆళ్లగడ్డలో 39.4, కల్లూరులో 38.8 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు లక్షల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యం కర్నూలు కల్చరల్: అటవీ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు, ఆదోని రేంజ్లలో రెండు లక్షల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని కర్నూలు ఇన్ఛార్జి స్క్వాడ్ డీఎఫ్వో స్వామి వివేకానంద తెలిపారు. కర్నూలు విజయవనం పుల్లయ్య పార్క్లో సీడ్ బాల్స్ను తయారు చేయిస్తున్నామన్నారు. ఈనెల 20వ తేదీ తరువాత వాటిని వివిధ ప్రాంతాలకు చేరవేస్తామన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జెడ్పీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సీడ్ బాల్స్ తయారీపై అవగాహన కల్పించడంతో పాటు మొక్కలు నాటుతామన్నారు.అనంతరం జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపడతామన్నారు. కార్యక్రమంలో కర్నూలు, ఆదోని రేంజ్ ఆఫీసర్లు ప్రియాంక, తేజశ్వి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు ఓబులేష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో మహిళా దొంగ అరెస్ట్
కర్నూలు: కర్నూలులోని శ్రీరాం నగర్, ఫోర్త్క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఇళ్లలో చోరీలకు పాల్పడి తప్పించుకుతిరుగుతున్న మహిళా దొంగను మూడో పట్టణ పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు శ్రీరాం నగర్కు చెందిన దాసరి శిరీష, పెద్దమాల్ ప్రవీణ్ కుమార్ దంపతులు ఇంటికి తాళం వేసి ఈ ఏడాది మే 19వ తేదీన రాఘవేంద్రస్వామి దర్శనం నిమిత్తం మంత్రాలయం వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్లో ఉంచిన 25 గ్రాముల బంగారు ఆభరణాలు మూటగట్టుకుని ఉడాయించారు. మరుసటి రోజు తిరిగి వచ్చిన దంపతులు ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధారించుకుని మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. గురువారం నంద్యాల చెక్పోస్టు వద్ద అరుంధతి నగర్కు వెళ్లే రోడ్డులో టీవీ టవర్ వద్ద జెగ్గిలి నాగమల్లేశ్వరి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసు కుని విచారించగా ఆమె నేరాల చిట్టా బయటపడింది. సాయిబాబా సంజీవ య్య నగర్కు చెందిన ఈమె ప్రస్తుతం శ్రీరాం నగర్లో నివాసముంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన కూడా ఈమె ఫోర్త్క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలోని (గణేష్ నగర్2) నివాసముంటున్న బెస్త నాగరాజు ఇంట్లో కూడా చోరీకి పాల్పడినట్లు విచారణలో అంగీకరించింది. దీంతో ఆమె వద్ద నుంచి ఈ కేసుకు సంబంధించి కూడా బంగారు, వెండి ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తికి విక్రయించగా వచ్చిన నగదు రూ.55 వేలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శేషయ్య తెలిపారు. కేసుల దర్యాప్తులో ప్రతిభ కనపరచిన ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు క్రైం పార్టీ సిబ్బందిని సీఐ అభినందించారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. -
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
చాగలమర్రి: మండలంలోని మద్దూరు పరిశుద్ధ యోహాను ఆలయ 22వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన ఆరు పళ్ల విభాగం ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. చర్చి ఫాదర్ రెవ. సంపత్ సౌందర్యరాజ్, గ్రామ పెద్ద దస్తగిరి పోటీలను ప్రారంభించారు. నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి ఎనిమిది జతల ఎద్దులు పాల్గొన్న ఈ పోటీలకు సదాశివ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ● ప్రథమ బహుమతి (రూ.30వేలు): దొర్నిపాడుకు చెందిన బత్తుల మనోహర్ యాదవ్, పెద్దకొట్టాల బోరెడ్డి నారాయణరెడ్డికి చెందిన ఎ ద్దులు కంబైన్డ్ విజేతగా నిలిచాయి. ● ద్వితీయ, తృతీయ బహుమతులు (రూ.20వేలు, రూ.10 వేలు): గోస్పాడు మండలం సాంబవరానికి చెందిన జుపల్లె ప్రభాకరరెడ్డికి చెందిన ఎద్దులు (బీరం బుల్స్) కై వసం చేసుకున్నాయి. ● నాల్గో బహుమతి (రూ.7వేలు): ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన పలాస వినీతాగౌడ్ ఎద్దులు గెలుచుకున్నాయి. -
తక్కువ మెరిట్ ఉన్న వారికి ఉద్యోగం
నా కంటే తక్కువగా మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులు ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టుకు అర్హత ఉందని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని 2025 సెప్టంబర్ 9న సమాచారం ఇచ్చారు. ఎండీఎస్సీలో నా హల్టికెట్ 033915, ర్యాంకు 12,004, నాకు 54.4 మార్కులు వచ్చాయి. దివ్యాంగుల కోటా కింద 7 శాతం ఉద్యోగాలును భర్తీ చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. వీటన్నీంటి తుంగలో తొక్కి 47.72 మార్కులు ఉన్న అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు సెలెక్ట్ చేశారు. నాకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లాను. – జెట్టప్పగారి వీరేష్, కమ్మరచేడు, ఆలూరు ●దగా డీఎస్సీ -
సూక్ష్మ చిత్రం.. పర్యావరణ హితం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ వినూత్నంగా టెంకాయ చుట్టూ 620 సూక్ష్మ చిత్రాలను గీచి అందరినీ ఆలోచింప చేశారు. పచ్చని చెట్లు ప్రశాంత వాతావరణం, కొండలు, కోనలు, ఎగిరే గువ్వలు, పక్షులు, జంతవులు స్వేచ్ఛగా ఉన్నట్లు నది జలాలు, నీటిలో నివసించే జలచరాలు ప్రకృతి సోయగాన్ని చూసి వన దేవత సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఒక వైపు.. పర్యావరణ కాలుష్యంతో పచ్చదనం ఎండి వన్యప్రాణులకు నీరు లేక అలమటించి పోయి వన దేవతకు మొరపెట్టుకున్నట్లు చనిపోయిన వన్యప్రాణులు, మనుషుల మృతదేహాలు చూసి వనదేవత కన్నీరు పెడుతూ చేతులు జోడించి మనుషుల్లారా ఇకనైనా మారండి అంటూ వేడుకుంటున్నట్లు మరో వైపు చిత్రాలు వేశారు. – నంద్యాల(అర్బన్) -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● 15 రోజుల క్రితం కుమారుడి మృతి కోసిగి: డి.బెళగల్ గ్రామానికి చెందిన గుడిసె లక్ష్మన్న(41) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మాధవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మన్నకు భార్య శారద, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడు గుడిసె నాని (12) అనారోగ్యంతో 15 రోజుల క్రితం మృతి చెందాడు. ఈ మేరకు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో నిద్ర చేసేందుకు బైక్పై బుధవారం సాయంత్రం లక్ష్మన్న బయలు దేరాడు. మార్గమధ్యలో మాధవరం బ్రిడ్జ్ సమీపంలో మంత్రాలయం నుంచి ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో లక్ష్మన్న తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అంబులెన్స్లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ కోలుకోలేక గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు మాధవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 15 రోజుల వ్యవధిలో ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
10 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, రోడ్లుకు ఇరువైపుల, వివిధ కార్యాలయాల ఆవరణల్లో 10 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వెల్దుర్తిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 7 గంటలకు రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉంటుంది. విద్యార్థులకు ముందుగానే నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజేతలకు త్వరలో బహుమతులు ప్రదానం చేస్తాం. – కిశోర్కుమార్రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి -
ఇలా చేద్దాం..
● ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ వినియోగం అధికమైంది. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమల్లో ఉంది. రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ● ప్రస్తుతం కర్నూలు జిల్లాలో వాయు కాలుష్యమే అధికం. కర్నూలు జిల్లాలో 42 లక్షల జనాభా ఉంది. ఇందులో 70 శాతం జనాభా వాహనాలను వినియోగిస్తోంది. ఈ సంఖ్య ఏటా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీని నివారణకు ప్రజలకు వీలైనంత వరకు వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ విద్యుత్ను వినియోగించాలి. ● కర్నూలుతోపాటు ఇతర పట్టణాల్లో దాదాపు లక్ష వరకు ఆటోలు ఉన్నాయి. వీటిలో కాలం తీరిన వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటోలు చేసే ధ్వని శబ్ధాలు 140 డెసిబుల్స్ వరకు ఉండడంతో శబ్ధకాలుష్యం అధికమవుతోంది. ప్రభుత్వం స్పందించి సిటీ బస్సులను ప్రవేశపెడితే కాలుష్య నియంత్రణకు ఒక పరిష్కారం లభిస్తుంది. ● కర్నూలు, నంద్యాల, ఆదోని మునిసిపాలిటీతో పాటు నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడే పారబోసి నిప్పు బెడుతున్నారు. కల్లూరు ఎస్టేట్లోని పారిశ్రామిక వాడలో పరిశ్రమల కోసం వినియోగించిన వ్యర్థ ప్లాస్టిక్ను రోడ్లపైనే కాల్చి వేస్తున్నారు. గార్గేయపురంలోని డంప్యార్డులో చెత్తకు నిప్పు పెడుతున్నారు. ఈ విషయంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ● హంద్రీ, తుంగభద్ర, కుందూ నదిలో మురుగు నీరు కలుస్తున్నా అధికారుల చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. నదులు, వాగులు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాలుష్య కారకాల నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం, అధికారుల సమన్వయం ముఖ్యం. కాలుష్య నియంత్రణ మండలితో పాటు పోలీసు, రవాణాశాఖ, మునిసిపల్, పంచాయతీ అధికారుల బాధ్యత ఉంటుంది. ఎవరి విధులు వారు పాటిస్తే కాలుష్య నియంత్రణానికి మేలు చేసిన వారవుతారు. పర్యావరణ సంరక్షణ బాధ్యతలో మొక్కల పెంపకం అతి ముఖ్యమైనది. మొక్కల పెంపకంపై ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఎవరైతే మొక్కను నాటుతారో వారే సంరక్షణ బాధ్యతను తీసుకుంటే మొక్కలు చెట్లవుతాయి. -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మృతి
కర్నూలు సిటీ: విద్యావేత్తగా, ఐకానిక్ హెచ్ఎంగా పేరొంది, జాతీయ ఉత్తమ అవార్డు పొందిన రిటైర్డ్ హెచ్ఎం ఎస్పీ కనకలింగం (95) అనారోగ్యంతో బుధవారం నగరంలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఏపీటీఎఫ్ నాయకులు కనకలింగం పార్థివదేహాన్ని సందర్శించి, పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఏపీటీఎఫ్ మహిళా ప్రతినిధి ఎస్పీ మంగళలక్ష్మీని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కనకలింగం ఎంతో కృషి చేశారన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారని, ఆ తరువాత ఆయన చేసిన కృషికి రెండోసారి సైతం అవార్డు వచ్చినా.. తాను ఒకసారి అవార్డు స్వీకరించానని, మరోసారి అవసరం లేదని తిరస్కరించి గొప్ప హెచ్ఎంగా నిలిచారన్నారు. నివాళులర్పించిన వారిలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు ఐ.మరియానందం, సీనియర్ నాయకులు కమలాకర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్లో కృత్రిమ మేధస్సును అమలు చేయాలి
● ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కర్నూలు(అర్బన్): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో కృత్రిమ మేధస్సును అమలు చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక ఉర్దూఘర్ షాదీఖానాలో ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీస్ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ మహ్మూద్ పీర్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మైనారిటీ శాఖకు చెందిన కేయూపీఎస్ ట్రైనింగ్ అకాడమీ కోఆర్డినేటర్ సయ్యద్ ఏజాజ్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ఏపీ ముతవల్లీల సంఘం అధ్యక్షులు షకీల్షఫీ, ఐఎంసీ టీం వ్యవస్థాపకులు రహ్మత్పాషా, సామాజిక కార్యకర్త జమీల్ అహ్మద్, డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేర్లు కొనసాగేందుకు ప్రతి ఓటరు తమ వివరాలను ధ్రువీకరించుకోవాలన్నారు. ఏఐ ఆధారిత వ్యవస్థల ద్వారా అర్హులైన ఓటర్లను సులభంగా గుర్తించడం, పొరపాట్లను తగ్గించడం జరుగుతుందన్నారు. అలాగే దరఖాస్తుల స్థితిగతులు, అవసరమైన చర్యల గురించి ఓటర్లకు ఆటోమేటిక్గా ఎస్ఎంఎస్లు, డిజిటల్ నోటిఫికేషన్లను పంపించడం సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఓటరు ధ్రువీకరణ మరింత పారదర్శకంగా సమర్థవంతంగా ప్రజలకు అనుకూలంగా మారుతుందన్నారు. కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ మహ్మూద్ పీర్ మాట్లాడుతూ.. ఓటరు చైతన్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సమాచారం లేమి కారణంగా ఒక్క నిజమైన ఓటు కూడా కోల్పోకూడదన్నారు. అర్హత కలిగిన పౌరులందరూ ఓటరు జాబితాలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉలేమా, పలు సామాజిక సంస్థల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో రూ. 7 కోట్ల టోకరా!
● ఎస్పీని ఆశ్రయించిన బాధితులుబొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్లో మెడికల్ సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో దాదాపు 700 మంది నుంచి రూ. 7 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పద్మావతినగర్లో పట్టణానికి చెందిన ముల్లా ఇమ్రాన్, వెంకట మధుసాయి, విఘ్నేష్లు ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారు. సీఆర్ కాలింగ్ సంస్థ పేరుతో మెడికల్ సంబంధిత సాఫ్ట్వేర్ కంపెనీని ఏడాది క్రితం ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 700 మంది నిరుద్యోగులను చేర్చుకున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ వసూలు చేశారు. మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం మానేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బాధితులు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీని కలిసి తమగోడును చెప్పుకుని, కంపెనీ నిర్వాహకులకు తాము ఇచ్చిన నగదు ఇప్పించాలని కోరారు. -
నార్మలైజేషన్తో ఉద్యోగం రాలేదు
నార్మలైజేషన్ పద్ధతితో నాకు ఉద్యోగం రాలేదు. ఎస్జీటీలో 75.35 మార్కులు వచ్చినా ఉద్యోగం రాకపోవడానికి కారణం నార్మలైజేషన్. పదేళ్లు కష్టపడి చదివినా నార్మలైజేషన్తో 0. 4 పాయింట్లతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. పాత పద్ధతిలో ఒకే రోజు ఒకే పేపర్ విధానంలో డీఎస్సీ పరీక్ష పెట్టింటే నాకు ఉద్యోగం తప్పని సరిగా వచ్చేది. – శ్రీనివాసులు, నందికొట్కూరు నేను ఎంఏ, బీఈడ్ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో డీఎస్సీ–2025 పరీఓలు రాసినా చివరకు ఎంపిక కాలేకపోయా. ప్రస్తుతం డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో నేను బాధపడుతున్నా. ప్రతిభ, కష్టానికి గుర్తింపు దక్కాల్సిన చోట అవకతవకలు జరగడం అన్యాయం. పారదర్శకంగా విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నా. – జీ.సాదిక్ బాషా (ఎంఏ., బీఈడ్), వెలుగోడు ●దగా డీఎస్సీ -
ఐదారు వేల ఖర్చు అధికం
మా కుటుంబంలో ఆరుగురు సభ్యులం ఉన్నాం. మాది మధ్య తరగతి కుటుంబం. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం ఉంది. 30కిలోలకు పైగా బియ్యం, వంట నూనెలు 6–7 లీటర్లు అవసరం. కొద్ది రోజులుగా అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఆదాయం రూపాయి పెరగలేదు. ధరల పెరుగుదలతో ఖర్చు నెలకు రూ.25 వేలకు పైగానే వస్తోంది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో దాదాపు ఐదారు వేల వరకు ఖర్చు అధికమైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. – కె.రత్నమ్మ, కృష్ణానగర్, కర్నూలు మా కుటుంబానికి నెలకు రూ.15వేల వరకు ఆదాయం ఉంది. సొంత ఇల్లు ఉంది. మిగిలిన ఖర్చు నెలకు రూ.20 వేలకు పైగా వస్తోంది. ప్రతినెలా రూ.5వేలు చేబదులు తీసుకుంటున్నాం. రెండు నెలల క్రితం సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్ ధర రూ.160. ఇప్పుడు రూ.180లకు విక్రయిస్తున్నారు. మాకు నెలకు 10 లీటర్ల ఆయిల్ అవసరమవుతుంది. ఈ లెక్కన ఆయిల్పైనే రూ.200 అదనంగా ఖర్చు అవుతోంది. పెరిగిన ఖర్చులకు సమానంగా ఆదాయం ఉండటం లేదు. ధరల మోతతో బతుకు భారమవుతోంది. – కతిజాబి, గీతానగర్, కర్నూలు చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలకు మంగళం పలికింది. ఈ కారణంగా ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం తగ్గిపోయింది. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. మహిళా సంక్షేమం ఊసే లేకుండా పోయింది. ఖర్చులు చాలా వరకు పెరిగిపోయాయి. ప్రభుత్వం పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూర్చినప్పుడే జీవనం సాఫీగా సాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు చేసి నెట్టుకురావాల్సి వస్తోంది. – లక్ష్మీదేవి, పొదుపు మహిళ, ఆర్ఎస్ రంగాపురం, బేతంచెర్ల మండలం -
అడ్మిషన్ల పేరిట సైబర్ మోసాలు
కర్నూలు: ప్రస్తుత విద్యా సంవత్సరానికి స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. కొంతమంది మోసగాళ్లు ప్రముఖ పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులమని నమ్మబలికి ఫోన్ కాల్స్, వాట్సప్ సందేశాలు లేదా సోషల్ మీడియా ప్రకటనల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రూ.10 వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించి సీటు రిజర్వు చేసుకోండని తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు. అపరిచిత వ్యక్తులు పంపిన బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలు లేదా క్యూఆర్ కోడ్లకు డబ్బులకు పంపవద్దని సూచించారు. సైబర్ మోసాలపై 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠానికి హుండీ ఆదా యం రూ.4,35,25,136 సమకూరింది. బుధవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మే నెల నుంచి జూన్ వరకు 22 రోజులకు సంబంధించి హుండీ కానుకలు శ్రీమఠం అధికారులు లెక్కగట్టారు. నగదు రూపంలో రూ 4,19,97,861, నాణేల రూపంలో రూ.15,27,275 వచ్చిందన్నారు. అలాగే 46 గ్రాముల బంగారం,750 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు మేనేజర్ ఎస్.కె శ్రీనివాసరావు తెలిపారు. హుండీ లెక్కింపును దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్రెడ్డి తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్–2 వెంటేష్ జోషి, ఇంజినీర్ సురేష్ కోనాపూర్ పాల్గొన్నారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలే
కర్నూలు: ఎల్నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు తేలికపాటికే పరిమితమవుతున్నాయి. ఆకాశం మేఘావృతమై భారీ ఉరుములు, మెరుపులు ఉంటున్నా వర్షాలు నామమాత్రంగా పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కల్లూరులో 16.2 మి.మీ, కర్నూలు అర్బన్లో 11.4, కర్నూలు రూరల్లో 6.8, దేవనకొండలో 6.8, ఆస్పరిలో 5.8, పత్తికొండలో 5.2 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. కాగా బుధవారం సాయంత్రం నుంచి కర్నూలు, కల్లూరు, వెల్దుర్తి తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇకపోతే జిల్లాలోని గోస్పాడు, పాణ్యంలో 40.3 డిగ్రీలు, నంద్యాల రూరల్, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడలో 39.5, ఆళ్లగడ్డలో 39.4, బనగానపల్లెలో 39, కల్లూరులో 38.8, కర్నూలులో 38.5 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు
● రెండు నెలల్లోనే ధరల్లో భారీగా వ్యత్యాసం ● ప్రజల్లో తగ్గిపోయిన కొనుగోలు సామర్థ్యం ● గత వైఎస్సార్సీపీ హయాంలో సంక్షేమ పథకాలతో ఆర్థిక లబ్ధి ● సూపర్–6 హామీలను విస్మరించిన టీడీపీ ప్రభుత్వం ● ప్రతి కుటుంబంపై సగటున రూ.6వేల అదనపు భారంకర్నూలు(అగ్రికల్చర్): నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించింది. ఒకటి, రెండు హామీలతోనే సూపర్–6 విజయవంతమైనట్లు ప్రచారం చేసుకోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలు లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజల్లో కొనుగోలు సామర్ధ్యం పడిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయనేందుకు జిల్లా యంత్రాంగం ప్రతి 15 రోజులకు పంపుతున్న నివేదికనే నిదర్శనం. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీతో పోలిస్తే ప్రస్తుతం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు కూడా చేపట్టని పరిస్థితి. 2024 జూన్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర నెలల్లోనే ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులైంది. ఈ రెండు నెలల వ్యవధిలో ధరల పెరుగుదల లేని నిత్యావసర వస్తువు ఒక్కటీ లేదు. నిత్యావసర వస్తువుల ధరలకు తోడు కూరగాయల ధరలు కూడా ముట్టుకుంటే మండిపోతున్నాయి. ప్రతి నెలా అప్పులే.. ధరల పెరుగుదల కారణంగా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు, చిరుద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. చిరుద్యోగుల వేతనాలు రూ.20వేల లోపే ఉండటం, ధరలు అడ్డగోలుగా పెరుగుతుండటంతో ఖర్చులను తట్టుకునేందుకు అప్పులు చేయక తప్పని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో అవుట్సోర్సింగ్పై దాదాపు 3వేల మంది వరకు పని చేస్తున్నారు. వీరి వేతనాలు రూ.15 వేల నుంచి రూ.20వేల లోపే ఉంటున్నాయి. పెరిగిన ధరల ప్రకారం పరిశీలిస్తే వీరి నెల ఖర్చులు రూ.30 వేల వరకు చేరుతున్నాయి. అంటే ప్రతి నెలా రూ.10 వేల వరకు అప్పు చేయాల్సి వస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక లబ్ధితో ఊరట 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసింది. 2019 మే నెలలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే చెప్పిన మాట ప్రకారం హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. ఒక్కో కుటుంబానికి మూడు, నాలుగు పథకాల కింద సగటున ఏడాదికి రూ.75 వేల నుంచి లక్ష వరకు నగదు ప్రయోజనం లభించింది. ఉమ్మడి జిల్లాలో ఏడాదికి రూ.4,500 కోట్ల వరకు నగదు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు జమ అయ్యింది. అప్పట్లో ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. సరుకులు ఖర్చులు (రూపాయల్లో) సరుకు ఏప్రిల్ జూన్ కందిపప్పు 115 135 బియ్యం పాతవి 52 62 చక్కెర 40 49 శనగపప్పు 65 80 ఇడ్లీరవ్వ 38 42 పామాయిల్(లీటరు) 120 145 సన్ప్లవర్ అయిల్ 160 175 గోధుమ పండి 38 45 వెల్లుల్లి 160 220


