కర్నూలు: ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై కర్నూలులో ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్టేషన్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ప్రొజెక్షర్ ద్వారా ఆటోడ్రైవర్లకు చూపించి అవగాహన కల్పించారు. వేగంగా వాహనం నడపటం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటివి చేయరాదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని సీఐ సూచించారు. మద్యం సేవించి వాహ నం నడపరాదని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు.


