Lifestyle
-
ఆలుమగలకు 5 కారణాలే విలన్లు
పెళ్లి భార్యాభర్తలను దగ్గరకు చేయాలి. రోజులు గడిచే కొద్ది అనుబంధం పెరగాలి. ఆకర్షణ నిలవాలి. ‘కాని నేడు చాలా పెళ్లిళ్లలో ఆలుమగల మధ్య నిర్లిప్తత చోటు చేసుకుంటోంది’ అంటున్నారు డాక్టర్ సప్నా శర్మ. పూణెలో చాలా గుర్తింపు పొందిన ఈ మేరేజీ కౌన్సిలర్ ఆలుమగల మధ్య ఆకర్షణ నశించడానికి ఐదు ముఖ్యకారణాలను తెలియచేస్తున్నారు అవి...‘గతంలో మనకున్న ఉమ్మడి కుటుంబాలు పిల్లలకు పాఠశాలలుగా ఉండేవి. పెద్దవాళ్లు కష్టసుఖాల్లో ఎలా సర్దుకుపోయేవారో, ఒకరికి ఒకరు సపోర్ట్ ఎలా ఇచ్చేవారో గమనించి పిల్లలు నేర్చుకునేవారు. కాని ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉన్నాయి. పైగా పిల్లలకు తల్లిదండ్రులు చదువు తప్ప వేరే ఏ విషయం మీద ధ్యాస పెట్టనీకుండా చేస్తున్నారు. చదువు పూర్తయ్యి ఉద్యోగం రాగానే పెళ్లి చేస్తున్నారు. పెళ్లి గురించి, భార్యాభర్తలు ఉండవలసిన తీరు గురించి, పెళ్లి డిమాండ్ చేసే బాధ్యతల గురించి, అత్తమామలు ఇతర అనుబంధాలు తెచ్చే ఒత్తిడి గురించి ఏమాత్రం తెలియచేయకుండా సంసారంలో పడేస్తే వాళ్లు కన్ఫ్యూజ్ కారా?’ అంటున్నారు డాక్టర్ సప్న శర్మ.నాగపూర్లో జన్మించి ఐ సర్జన్గా పని చేసి తర్వాతి రోజుల్లో పర్సనాలిటీ కోచ్గా, మోటివేషనల్ స్పీకర్గా, మేరేజ్ కౌన్సిలర్గా గుర్తింపు పొందిన సప్న శర్మ భారతీయ ఆలుమగల మధ్య వస్తున్న ఘర్షణలకు కారణాలను అర్థం చేసుకుంటూ వాటిని తిరిగి సమాజానికి చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు. ఆలుమగల మధ్య జీవితం నిస్సారం అనిపించడానికి ఐదు కారణాలను ఆమె తెలియ చేస్తున్నారు. అవి ఇవి:1. అనురాగానికి ఆటంకాలు పెళ్లయిన స్త్రీ, పురుషులు ఒకరితో మరొకరు ప్రేమగా బహిరంగంగా కనిపించడంపై మన సమాజంలో కనపడని నిషేధాజ్ఞలు ఉన్నాయి. పెళ్లయి జీవితం మొదలుపెట్టాక ఇంట్లో అత్తామామలో తల్లిదండ్రులో ఉంటే భార్యాభర్తలు సరదా భాషణం చేయడం, ఒకరినొకరు తాకడం తప్పు అనే భావన ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ప్రేమగా ఉండటం ఏ అర్దరాత్రో తలుపు చాటున చేయవలసిన పనిగా మారుతుంది. అసలు భార్యభర్తలు తమ ప్రేమను ప్రదర్శించడానికి అవకాశమే లేనప్పుడు ప్రేమ జనించే అవకాశం ఎక్కడ? ఇది ఒక పెద్ద సమస్య.2. దొరకని ఏకాంతంభారతదేశంలో పెళ్లయ్యాక యువ జంట ఎక్కడికి ఆఖరుకు సినిమాకు వెళ్లాలన్నా ఎవరో ఒకరు తోడు ఉంటారు. కలిసి ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సిందే తప్ప వీరు తమ మానామ తాము వెళ్లడం దోషంగా చెప్పబడుతుంది. ఇక ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు ఆ పిల్లల్ని ఎక్కడైనా వదిలి నాలుగు రోజులు విహారంగా వెళ్లడం దాదాపు చోద్యంగా, పాపంగా పరిగణించబడుతుంది. భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకునే, ప్రేమను పెంచుకునే అవకాశాలే లేని కుటుంబ వ్యవస్థ వల్ల వారి మధ్య బంధం తప్ప ప్రేమతో కూడిన బంధం ఉండటం లేదు.3. ఆసక్తి లేకపోవడంవీటన్నింటి దరిమిలా భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి ఆసక్తి పోతోంది. చక్కగా తయారవడం అనేది బయటకు వెళ్లేటప్పటి సంగతిగా భావిస్తారు. మంచి బట్టలు, నగలు అన్నీ బయట వారికి చూపించడానికే. ఇంట్లో ఉన్నప్పుడు దారుణమైన బట్టలతో, సింగారం లేకుండా భార్య భర్తకు కనపడుతుంటుంది. భర్త కూడా ఏ పైజామో వేసుకుని తిరుగుతుంటాడు. ఇలాంటి అవతారాల్లో భార్యాభర్తలు ఒకరి ఎదుట మరొకరు ఉంటే ఎందుకు ఆకర్షణ కలుగుతుంది?4. ఫిట్నెస్ను పట్టించుకోకపోవడంపెళ్లి అయ్యే వరకు అబ్బాయి, అమ్మాయి ఎంతో కొంత ఫిట్నెస్ గురించి దృష్టి పెట్టినా మన దేశంలో పెళ్లయ్యాక ఆకారాలు ఎలా ఉన్నా పర్లేదులే అనే నిర్ణయానికి వస్తారు. ఫిట్నెస్ను పూర్తిగా వదిలేస్తారు. స్త్రీలు పిల్లలు పుట్టాక తిరిగి శరీరాన్ని ఫిట్గా మార్చుకుందాం అనుకోరు. పురుషులు బరువు పెరిగి, బొజ్జలు పెంచి వికారంగా ఉన్నామని తెలిసినా వ్యాయామం మాట ఎత్తకుండా ఉంటారు. ఇలా ఉండటం వల్ల భార్యాభర్తలు లోలోపల ఒకరిపై మరొకరు అసంతృప్తిని పెంచుకుంటారు.5. ఒకరి ఆసక్తులు మరొకరివైభార్యాభర్తలు భౌతిక ఆకర్షణను కోల్పోయినా మానసికంగా దగ్గరగా ఉంటే చాలా సమస్యలు పోతాయి. భర్త ఆసక్తులు భార్యకు పట్టకపోవడం భార్య ఇష్టాలు భర్తకు రుచించకపోవడం ఇద్దరూ కలిసి మాట్లాడుకునే ఉమ్మడి అభిరుచులే లేకపోతే వారి మధ్య అనుబంధం పెనవేసుకోవడం కష్టమవుతుంది. భర్తను భార్య మెచ్చుకోకపోగా సూటిపోటి మాటలు అనడం, భార్యను కాంప్లిమెంట్ చేయడం... హగ్ చేసుకోవడం భర్త ‘అహాని’కి అడ్డుగా మారడం... ఇవి మానసిక బంధానికి విఘాతంగా మారుతున్నాయి.భార్యాభర్తలే కాదు ఇంటి పెద్దలు కూడా ఈ కారణాలను కొడుకు కోడలు, కూతురు అల్లుళ్ల మధ్య గమనిస్తూ సరి చేయడానికి చేసుకోవడానికి ప్రయత్నించాలి.అప్పుడే వివాహం నూరేళ్ల బంధం అవుతుంది. -
లాస్ట్ మీల్ ఎన్నింటికి తింటున్నారు..? నటి కరీనా కపూర్ ఏకంగా..
సాయంత్రం కాస్త ఎర్లీగా భోజనం తినేయమని చెబుతుంటారు నిపుణులు. అదే ఆరోగ్యకరమని పదే పదే నొక్కి చెబుతుంటారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ సైతం అదే మాట అన్నారు. తాను కూడా అలానే తింటానని చెప్పారు కూడా. పైగాఅదే తన ఫిట్నెస్ సీక్రెట్ అని చెప్పారామె. ఆరోగ్యప్రదాత సూర్యుడి గమనం ఆధారంగానే మన జీవక్రియ పనిచేస్తుందని..దానికనుగుణంగా తింటేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు కూడా. సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్న ఈ హెల్దీ ట్రిక్ గురించి సవివరంగా చూద్దామా..!.నాలుగు పదుల వయసులో ఉన్న కరీనా కపూర్ సైతం సౌందర్యపరంగానే కాకుండా ఫిట్నెస్ పరంగా చాలా మంచి జీవశైలికి పేరుగాంచిన నటి. ఈ ఏజ్లో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా కట్టిపడేసే గ్లామర్ కరీనా సొంతం. ఆమె చాలా క్రమశిక్షణాయతమైన జీవనశైలిని ఫాలో అవుతానని పలు ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారామె. పోషకాహారంతో కూడిన డైట్, బాడీకి తగిన వర్కౌట్లు, త్వరిత గతిన నిద్రకు ఉపక్రమించడం వంటి మంచి అలవాట్లనే అనుసరిస్తారామె. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన చివరి మీల్ కచ్చితంగా సాయంత్రం 6.30 కల్లా పూర్తి అయిపోయేలా చూసుకుంటానన్నారామె. ఈ విషయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంత త్వరగానే అని అనుకున్నారు కూడా. కానీ కరీనా మాత్రం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇది తప్పనిసరని చెబుతోంది.అలానే మంచిదా అంటే.. సూర్యదోయం వేళ మన శరీరం చాలా చురుకుగా ఉంటుందట. ఆ సమయంలోనే మన జీవక్రియలు యాక్టివ్గా ఉంటాయట. అంటే పగలు మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా..సులభంగా అరిగిపోతుందట. పైగా మనం మేల్కోనే ఉంటాం కాబట్టి సులభంగా ఆ ఎనర్జీ అంతా బర్న్ అయిపోతుందట. ఇక సూర్యాస్తమయ వేళ్లకు మన శరీరంలోని జీవక్రియలు నెమ్మదిస్తాయి. కాబట్టి ఆ టైంలో జీర్ణమవ్వడానికి అధిక సమయం తీసుకునే ఫుడ్కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పైగా అది కూడా సూర్యస్తమయంలోపే ఫినిష్ చేస్తే మంచిదట. దానివల్ల మనం పడుకునే సమయానికి అరిగిపోయి..త్వరితగతిన మేల్కొనడానికి ఉపకరిస్తుంది. మన శరీరధర్మానికి అత్యంత అనువైన జీవన విధానం ఇదేనని నిపుణులు నొక్కి చెబుతున్నారు. మన పూర్వీకులు దీన్ని బాగా అనుసరించేవారని చెబుతున్నారు. ఇలా సాయంత్రం 6.30 కల్లా భోజనం తినేస్తామో..అప్పుడు మనం దాదాపు 12 నుంచి 14 గంటలు అడదడపా ఉపవాసం ఉన్నట్లువతుంది. పైగా ఉదయమే చక్కటి లెమన్ విత్ హనీ వాటర్తో రోజుని మొదలుపెట్టి, నచ్చిన ప్రూట్ సలాడ్ వంటి పోషకాహారాలను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మంచిదట. ఈ విధానంలో మనం సాయంత్రం సమయాల్లో స్నాక్స్ దూరంగా ఉండటం జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్య ప్రయోజనాలు..జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందికడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య ఉండదుఇలా ముందుగా తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది కూడాదీనివల్ల విశ్రాంతి సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయిబరువు అదుపులో ఉంటుందినిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందటరోజంతా చురుగ్గా ఉంటారట మరీ అంత తొందరగా తినలేకపోయినా..కనీసం సాయంత్రం 7.30 గంటల లోపు భోజనం ఫినిష్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి..సత్ఫలితాలను పొందండి మరి..గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: జస్ట్ 10 నిమిషాలు ఆ వ్యాయామం చేస్తే చాలట! నాసా స్టడీ) -
జస్ట్ 10 నిమిషాలు అదొక్కటి చాలు! నాసా స్టడీ
అందరూ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలి అనుకుంటారు. కానీ మధ్యలోనే వదిలేసేవాళ్లు కొందరైతే, మరికొంతమంది మన వల్ల కాదు అని చేతులేత్తుస్తుంటారు. అస్సలు హెల్దీగా ఉండాలంటే..అది చాలా తేలిగ్గా తెలివిగా చేసే పని అంటోంది నాసా. అందరూ బిజీ షెడ్యూల్తో శారీర ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కష్టంగా మారింది. పైగా వర్కౌట్లు కొన్ని రోజుల తర్వాత విపరీతమైన వొళ్లు నొప్పులుగా అనిపించి స్కిప్ చేసేస్తుంటారు. దాంతో చాలామంది కంటిన్యూ లేదా దైనందిన జీవితంలో ఆ వ్యాయామాలను భాగం చేసుకోలేక విఫలమవుతుంటారు. అలాంటివాళ్లు ఒక్క పదినిమిషాలు ఈ వ్యాయమానికి కేటాయించండి చాలు అని చెబుతోంది నాసా పరిశోధన. ఇది ఎంత ప్రభావవంతమైన ప్రయోజనాలందిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారని అంటోంది. పైగా మధ్యలో వదిలేయరు, అది మీ జీవితంలో ఓ భాగమైపోతుందని నమ్మకంగా చెబుతోంది. మరీ ఆ వ్యాయామం ఏంటంటే..ఎక్కువ పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే వారికి ఈ వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతోంది నాసా. ఇది ఒక చిన్న ట్రాంపోలిన్పై చేసే జంపింగ్ లాంటి వ్యాయామం. పిల్లలు అమిత ఇష్టంగా చేసే జంపింగ్ క్రీడ. ఇది గనుక చేస్తుంటే తెలియకుండానే ఒక విధమైన ఆనందం..పైగా అమితోత్సాహంతో మరింతగా చేస్తారట కూడా. ఇది తెలియకుండానే బాడీలోని కేలరీలను తగ్గిస్తుందట. ఇందుకోసం కావాల్సిందల్లా..మినీ-ట్రాంపోలిన్ ఉంటే చాలు. దీంతో జంపింగ్ జాక్లు చేస్తుంటే..బరువు అదుపులో ఉండటమేగాక..బాడీ కూడా ఫిట్గా ఉంటుందని చెబుతున్నారు. పోనీ ఈ జంపింగ్ కుదరకపోతే..ఓ 30 నిమిషాలు మీకు నచ్చిన మ్యూజిక్తో నచ్చినట్లుగా గంతులు వేయండి. ఓ పద్ధతి అవసరం లేదు బాడీ అంతా ఊగేలా ఎంజాయ చేస్తూ నచ్చినట్లుగా డ్యాన్స్ చేయండి. దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి చాలు అని చెబుతోంది నాసా. ఇది పరుగు, జాగింగ్ కంటే కూడా అత్యంత ప్రభావవంతంగా ఉంటుందట. కచ్చితంగా మెరుగైన ఫలితాలు పొందగలరని చెబుతోంది నాసా పరిశోధన. ఇది శరీరంపై అధిక ఒత్తడిని కలిగించదు. అదీగాక ఎవ్వరైనా హాయిగా సులభంగా చేయగలిగేవే ఈ వ్యాయమాలని పేర్కొంది నాసా. ఆరోగ్య లాభాలు..సరదాగా ఉండే ఈ వ్యాయమాం కిల్లర్ ఫుల్ బాడీ వ్యాయామంకీళ్లపై సున్నితంగా ఉంటుంది. అయితే మోకాళ్లు, చీలమండలంపై కఠినంగా ఉంటుంది. శోషరస వ్యవస్థ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. పైగా ఇది మంచి కార్డియో వర్కౌట్ల పనిచేస్తుంది. ఆరోగ్యానికి బెస్ట్ వ్యాయామం కూడా.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్టాపిక్గా హర్ష్గోయెంకా ప్రసంగం) -
మరోసారి హాట్టాపిక్గా పని జీవిత సమతుల్యత..! వైరల్గా హర్ష్గోయెంకా ప్రసంగం
పని జీవిత సమతుల్యత అనే టాపిక్ మాత్రం ప్రతిసారి రసవత్తరమైన అంశంగా మారిపోతోంది. దీనిపై ఒక్కొక్కరిలో ఒక్కో అభిప్రాయం ఉంది. ఇది వారి వారి హోదాల రీత్యా సరైనది కావొచ్చు. అందరికీ వర్తించాలంటే మాత్రం కష్టమే. ఉద్యోగి శరీర తత్వం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు తదితరాల దృష్ట్యా మారుతూ ఉంటుందనేది నిపుణుల వాదన. అంగీకరించక తప్పని వాస్తవం కూడా. బహుశా ఈ విషయాన్నే సూటిగా చెప్పే ఉద్దేశ్యంతో మరోసారి వివరణ ఇచ్చినట్లుగా ఉంది నెట్టింట వైరల్ అవుతున్న హర్ష్ గోయెంకా ప్రసంగం. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఎప్పటికప్పుడూ నెటిజన్లతో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంటుంటారు. అలానే ఈసారి తన ఉద్యోగుల నుద్దేశించి ప్రసంగించిన వీడియోని షేర్ చేసుకుని..నెటిజన్ల మనసును దోచుకున్నారు. ఆ వీడియోలో హర్ష్ గోయెంకా..తాను ఆదివారాల్లో పనిచేయడం గురించి, జీవిత భాగస్వాములను చూస్తుండటం గురించి మాట్లాడటం లేదు. అందువల్ల కాసేపు శ్రద్ధతో నా మాటలు ఆలకించండి అన్నారు. అంతే ఆ సభా ప్రాంగణంలో నవ్వులు విరిశాయి. ఉద్యోగులంతా ఆయన ప్రసంగానికి కడుపుబ్బా నవ్వుతున్నట్లు కనిపిస్తోంది ఆ వీడియోలో. నెటిజన్లు కూడా ఆ వీడియోని చూసి మీ సంస్థలో ప్రతి ఉద్యోగి పనిలో సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఐతే ఇంతకమునుపు ఇదే హాలులో ఎల్ అండ్ టి అనే కంపెనీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడిన మాటలతో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. నిజానికి సుబ్రహ్మణ్యన్ మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగుల పోటీతత్వం గురించి చెబుతూ ఆయన..వారానికి 90 గంటలు పనిచేయాలని అన్నారు. అయినా ఎంత సేపు భార్యను చూస్తుంటారు, ఆదివారం కూడా ఆఫీసులకు వచ్చి పనిచేయాలన్నారు. ఎందుకంటే తాను కూడా ఆదివారాల్లో పనిచేస్తానని చెప్పారు. పైగా అలా చేయడం వల్ల తాను మరింత సంతోషంగా ఉన్నానని సుబ్రహ్మణ్యన్ అన్నారు. అంతే ఒక్కసారి పనిజీవిత సమతుల్యతకు ఆస్కారం ఏముందని న్యూట్రిషన్లు, ప్రముఖులు భగ్గుమన్నారు. ఇది సరైనది కాదంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. పైగా ఈ అంశం హాట్టాపిక్గా మారి చర్చలకు దారితీసింది. ఇక మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ..తాను పని నాణ్యతను నమ్ముతానని, ఎని గంటలు చేశామన్నది లెక్కలోకి తీసుకోనని చెప్పారు. అలాగే పనినాణ్యతపై దృష్టి పెట్టాలే గానీ, పరిమాణంపై కాదని తేల్చి చెప్పారు. ఆఖరికి బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ సైతం పని గంటలు కాదు, నాణ్యతే ముఖ్యం అని చెప్పారు. ఇక వ్యాపరవేత్త హర్ష్ గోయెంకా కూడా గతంలో వారానికి 90 గంటల పనా? అని ఖండించారు. సండే అనేది సూర్యుడి డ్యూటీగా భావించి డే ఆఫ్గా ఎందుకు భావించకూదని అన్నారు. అయినా జీవితాన్ని శాశ్వతమైన ఆఫీస్ పనిగా మార్చేస్తే విజయం మాట దేవుడెరగు..అనర్థాలే తెచ్చిపెడుతుందన్నారు. ఆయన కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది అస్సలు ఆప్షన్ కాదు, అది మన అవసరం అని నొక్కి చెప్పారు. వర్క్ని చాలా తెలివిగా స్మార్ట్గా చేసేందుకు ప్రాముఖ్యత ఇస్తానన్నారాయన. సో పనిజీవిత సముతుల్యత అన్నది ఎంత ముఖ్యమో అర్థమైంది కదా..కాబట్టి బిజీకి ఛాన్స్ ఇవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుందామా మరీ..!.Concluding part of my annual RPG townhall address to all my colleagues 😀 pic.twitter.com/sIbC34dqU2— Harsh Goenka (@hvgoenka) June 3, 2025 (చదవండి: నావికాదళంలో అత్యున్నత అధికారిగా భాగ్యనగరం కుర్రాడు..!) -
పుస్తకాలతో మరోసారి..! ఆ అభిరుచిని అస్సలు వదులుకోవద్దు
ఒకప్పుడు పుస్తకాలు తెగ చదివేవాడిని. ఇప్పుడు సంవత్సరానికి ఒక పుస్తకం చదవడం కూడా కష్టమైంది’ అనే మాట వింటుంటాం. పుస్తకం పఠనం అనేది విలువైన అభిరుచి. ఆ అభిరుచిని ఎప్పటిలాగే కొనసాగించడానికి...ఎప్పటినుంచో చదవాలనుకుంటున్న పుస్తకంతో మీ రెండో ప్రయాణం ప్రారంభించండి. టీవిలో మీకు యాక్షన్ మూవీస్ ఇష్టమైతే ‘థ్రిల్లర్’ నవలతో రంభించండి. పెద్దపెద్ద పుస్తకాలతో కాకుండా చాలా చిన్న పుస్తకాలతో చదవడం మొదలుపెట్టండి. ‘రోజుకు ఇన్ని పేజీలు’ అని నిర్ణయించుకొని వాటిని మెల్లగా పెంచుతూ పోవాలి.మీతో పాటు ఎప్పుడూ ఒక పుస్తకం ఉండాలి. బయట ఎక్కడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు, వెయిటింగ్లో ఉన్నప్పుడు సెల్ఫోన్ చూడడం కాకుండా పుస్తకంలో కొన్ని పేజీలైనా చదవాలి. పుస్తక పఠనం అనేది సోలో హాబీ మాత్రమే కాదు. ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. రెండు మూడు రోజులు కావచ్చు. వారం కావచ్చు...‘రీడింగ్ టైమ్’ అని ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. కాస్త మార్పు కోసం, ఆసక్తి కోసం కొంత టైమ్ ఫిజికల్ బుక్స్ నుంచి ఇ–బుక్స్కు మారండి. -
చిన్నారులను కంటికి రెప్పలమై కాపాడుకుందాం..!
ఇవి..అవి..అని కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిత్యం పిల్లలు అనేక రూపాల్లో శారీరక, లైంగిక, మానసిక హింసను ఎదుర్కొంటున్నారు.వారిని రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? వారి హక్కులను ఎలా కాపాడుకోవాలి... మొదలైన విషయాలను అవగాహన పరిచే రోజు... సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునే రోజు...ఐక్యరాజ్య సమితి ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రేషన్’...పద్నాలుగు సంవత్సరాల వయసులో రోషిణి పర్వీన్కు వివాహం జరిగింది. పదిహేను సంవత్సరాలకే తల్లి అయ్యింది. చిన్న వయసులోనే పెళ్లి కావడంతో రోషిణి పడిన బాధలు, ఎదుర్కొన్న ఇబ్బందులు ఇన్నీ అన్నీ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తనలా ఏ అమ్మాయీ బాధ పడకూడదు అనుకొని ముందుకు కదిలింది.ఇప్పటివరకు అరవైకి పైగా బాల్య వివాహాలు జరగకుండా అడ్డుకుంది.ఆ పిల్లలను మళ్లీ బడి బాట పట్టించి వారి భవిష్యత్ను వెలుగుమయం చేసింది. ఒకప్పుడు ‘నేను ఒంటరిని’ అనుకున్న బిహార్లోని సిమల్బరీ గ్రామానికి చెందిన రోషిణి ‘చైల్డ్లైన్ ఇండియా ఫౌండేషన్’లో చేరడంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ‘నేను ఒంటరిని కాదు. నాతో మరెంతోమంది ఉన్నారు’ అనే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే ప్రాణాలకు తెగించి బాల్య వివాహాలను, పిల్లల అక్రమ రవాణాను అడ్డుకుంది.‘సేవ్ ది చిల్డ్రన్’లాంటి సంస్థలలో పని చేసిన రోషిణి ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల కలిగే సమస్యల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నో స్కూల్స్లో ‘గర్ల్స్ గ్రూప్’లను ఏర్పాటు చేసింది. బిహార్లోని రోషిణి పర్వీన్ నుంచి శ్రీకాళహస్తిలోని వైశాలి వరకు ఎంతోమంది మహిళలు పిల్లల హక్కులు, భద్రత గురించి క్రియాశీలంగా పనిచేస్తున్నారు.క్షేత్రస్థాయిలోకి...‘కొంతమంది స్నేహితులు, న్యాయవాదుల సహాయంతో బుక్లెట్ రూపొందించాను. మా అబ్బాయితో మొదట దీని గురించి మాట్లాడాను. సేఫ్ ఇండియా, హ్యాపీ ఇండియా క్యాంపెయిన్ మొదలు పెట్టి పిల్లల భద్రత గురించి ప్రచారం చేశాం. కరపత్రాలు పంచాం’ అంటుంది వైశాలి కోలా.పిల్లలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి శ్రీకాళహస్తిలో‘తేజోభారత్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది వైశాలి. ‘ఏదైనా నేరం జరిగితే దానిగురించి కాసేపు మాట్లాడుకొని బాధ పడతారు. ఆ తరువాత మరచి పోతుంటారు. కొందరు మాత్రం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిద్ర లేని రాత్రులు గడుపుతుంటారు. అలాంటి వారు కూడా ఏదైనా చేద్దాం అంటే ముందుకు రారు. పిల్లలు ఎదుర్కొంటున్న వివిధ రకాల ప్రమాదాల గురించి అవగాహన కలిగించడానికి స్వరక్ష ఏర్పాటు చేశాం’ అంటుంది కేరళలోని కోచికి చెందిన అనూ సూరజ్. ‘స్వరక్ష చారిటబుల్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ పిల్లలపై జరిగే భౌతిక, లైంగిక, మానసిక హింస గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలకు తెలియజేయడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.ఎందుకు ఈరోజు?ప్రతి సంవత్సరం జూన్ 4న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రేషన్’ జరుపుకుంటారు. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆగస్ట్ 19, 1982లో మొదలైంది. మొదట్లో యుద్ధ బాధితులైన లెబనాన్, పాలస్తీనా పిల్లలపై దృష్టి పెట్టినప్పటికీ తరువాత దీని ఉద్దేశాన్ని విస్తృతీకరించారు. పిల్లలు రకరకాల రూపాల్లో ఎదుర్కొంటున్న హింసను నిరోధించడానికి, వారి హక్కులను కాపాడడానికి పరిష్కార మార్గాలు, కార్యాచరణ ప్రణాళిక గురించి ఆలోచించడమే ఈ రోజు ఉద్దేశం.ఫన్నీగానే సీరియస్ విషయాలుబ్యాడ్ టచ్, గుడ్ టచ్ పిల్లలు గుర్తించేలా చేయడానికి, ఆన్లైన్లో సురక్షితంగా ఉండడానికి, అంతర్గత శక్తిని పెంచడానికి ఆడియో–విజువల్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాం. ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహిస్తున్నాం. కథలు, ఫన్ వీడియోల ద్వారా చిన్న పిల్లలకు సీరియస్ విషయాల గురించి తెలియజేస్తున్నాం. ‘మాయ’ అనే షార్ట్ ఫిల్మ్ను కూడా రూపొందించాం. పేరెంట్స్, టీచర్స్తో సమావేశాలు నిర్వహిస్తున్నాం. రకరకాల ఏజ్ గ్రూపుల ఆధారంగా పిల్లలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం,– అనూ సూరజ్, స్వరక్ష చారిటబుల్ ట్రస్ట్చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు‘చైల్డ్ మ్యారేజ్–ఫ్రీ ఇండియా’ అనేది నా లక్ష్యం. నాది బాల్య వివాహం కావడంతో ఎన్నో కష్టాలు పడ్డాను. సమస్యలు ఎదుర్కొన్నాను. నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికీ రాకూడదనుకున్నాను. గ్రామాల్లో ‘చైల్డ్ ప్రొటెక్షన్’ కమిటీలు ఏర్పాటు చేశాం. అవి మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ‘మీ హక్కులు ఇవి’ అంటూ పిల్లలకు అవగాహన తరగతులు నిర్వహించాం.– రోషిణి, సామాజిక కార్యకర్తఎన్నెన్నో రూపాల్లో..పిల్లల్ని పనిలో పెట్టుకొని వారి భవిష్యత్ను చీకటిమయం చేసే, పిల్లల్ని అపహరించి అమ్ముకునే, పిల్లల్ని అపహరించి వ్యభిచార కూపాల్లోకి దింపే సంఘటనలు ఒకవైపు... మరోవైపు యుద్ధాలలో చని΄ోతున్న పిల్లలు. యుద్ధ భీభత్సానికి బా«ధితులు అవుతున్న పిల్లలు. ఇంట్లో తల్లిదండ్రుల తగాదాలకు మానసికంగా దెబ్బతింటున్న, అయిన వారి చేతిలోనే లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు.(చదవండి: వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరేం కాదు!) -
టర్మరిక్ క్యూబ్స్తో.. మిలమిలలాడే అందం
ఇది అటు ఎండా... ఇటూ వానా రెండూ కలగలిసిన వింత వాతావరణం. ఈ సీజన్లో ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ముఖ చర్మం జిడ్డుగా, మొటిమలు, బ్లాక్, వైట్ హెడ్స్ వల్ల కమిలినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ పసుపు ఐస్క్యూబ్లతో మంచి పరిష్కారం లభిస్తుంది. టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్పొడి, కప్పు రోజ్వాటర్, టీస్పూను కొబ్బరి పాలు, ఆరు చుక్కల నిమ్మ నూనెను తీసుకుని ఒకగిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్క్యూబ్స్ ట్రేలో పోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ క్యూబ్లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్క్యూబ్స్తో ఇరవై నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలిఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగి తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ను రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్పోయి ముఖం ఫ్రెష్గా మెరుపులీనుతూ కనిపిస్తుంది.అంతేకాదు, చర్మం జిడ్డు కారడం ఆగిపోయి దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య చాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.(చదవండి: వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరేం కాదు!) -
వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరేం కాదు!
1999లో మా తాతగారు చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు వీలునామా రాశారు. అందులో నాకు నా కజిన్ (పెద్దమ్మ కూతురు)కి సమానమైన వాటా రావాలి అని చెప్తూనే ఆ వీలునామా మేము ఇద్దరం మేజర్లు అయిన తర్వాత మాత్రమే చెల్లుతుంది అని కూడా రాశారు. నేను, మా కజిన్ దాదాపు ఒకటే వయసు వాళ్ళం. 2007లో మేజర్లం అయ్యాం. సమస్య ఏమిటంటే, ఆ వీలునామా రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే ఇది చాలా పాతది – ఈ వీలునామా చెల్లదు, కోర్టును ఆశ్రయించాలి అంటున్నారు. మా మేనమామకు – ఇంకొక పిన్నిగారికి కూడా సంతానం ఉంది కానీ వారికి ఈ ఆస్తిలో మా తాతగారు ఏమీ వాటా ఇవ్వలేదు. ఈ విషయాలు అన్నీ తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు మేము కోర్టుకు వెళితే వాళ్లు పేచీ పెడతారని భావిస్తున్నాము. ఏం చేయమంటారు? – సరళ, విశాఖపట్నంవీలునామా రిజిస్టర్ చేసుకోవడం మంచిది అయినప్పటికీ రిజిస్టర్ చేయాలి అనే ఖచ్చితమైన నియమం ఎక్కడా లేదు! రిజిస్టర్ చేయని వీలునామా అయినా చట్టబద్ధంగా చెల్లుతుంది. ఈ విషయాన్ని ఇదివరకే చాలాసార్లు తెలియజేశాను. చాలా పాత వీలునామా కాబట్టి ఇది చెల్లదు అనడం సరికాదు. వీలునామాను అమలుపరచుటకు (ఎగ్జిక్యూట్ చేయుటకు) ఎటువంటి కాలపరిమితీ లేదు. మీరు తీసుకువెళ్లిన వీలునామా ఆధారంగా రిజిస్ట్రార్ గారు ఖచ్చితంగా మీ పేరున ఆస్తి బదిలీ చేయవలసి ఉంటుంది. పైగా ఈ ఆస్తిపై, సదరు వీలునామాపై అభ్యంతరాలు ఉన్నాయి అంటూ ఎవరు ఎటువంటి ఫిర్యాదులు వాళ్లకు అందనప్పుడు రిజిస్ట్రేషన్ను ఆపే హక్కు వారికి లేదు. ఇక్కడ మరో విషయం... కోర్టులో దావా వేస్తే మీరు అనుమానం వ్యక్తపరచిన విధంగా మీ తాత గారి సంతానం అయిన వేరే కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ఇప్పుడు పేచీ పెట్టే అవకాశం లేకపోలేదు. సివిల్ కోర్టుకు వెళ్తే మీరు డిక్లరేషన్ సూట్ వేయవలసి ఉంటుంది. అయితే సివిల్ కోర్టుకు వెళ్లే ముందు, మరొక దరఖాస్తు సదరు రిజిస్ట్రార్ గారికి సమర్పించి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. వారు అప్పటికీ వినను అంటే దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లుగా లిఖితపూర్వకంగా వ్రాసి ఇమ్మని అడగండి. అలా ఇచ్చినా ఇవ్వక΄ోయినా, హైకోర్టు లాయర్ గారిని సంప్రదించి రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించి రిజిస్ట్రార్ గారి నిర్ణయాన్ని (లేదా మీ దరఖాస్తుపై జాప్యాన్ని) చాలెంజ్ చేయండి. హైకోర్టు ద్వారా మీకు అనుకూలమైన ఆర్డర్ రావడానికి అవకాశాలు బాగానే ఉన్నాయి. అప్పుడు సివిల్ కోర్టుకు వెళ్లవలసిన అవసరం రాదు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )( -
అందరూ ఆమె బతకదన్నారు..! కానీ ఇవాళ ఆమె లుక్ చూస్తే..
కొందరు చావు అంచులు దాక వెళ్లొచ్చి..బతికొస్తుంటారు. అలా ఆయురారోగ్యాలతో ఉన్నావారెందరో. ఒకరకంగా వారంతా ఆ అనారోగ్యం మేల్కొలుపుతో ఆరోగ్యవంతమైన జీవితం గడిపి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ డాక్టర్. అంతటి భయానక పరిస్థితి నుంచి బయటపడ్డ ఆమె లుక్ను చూస్తే కంగుతింటారు. ఈమెనే అనారోగ్యం బారినపడింది అనే సందేహం కలుగమానదు. ప్రస్తుతం ఆమె వృద్ధాప్యాన్ని తిప్పికొట్టి.. దీర్ఘాయువుతో ఎలా ఉండాలో చిట్కాలు చెబుతున్నారామె. మరీ ఆ డాక్టర్ ఆసక్తికర గాథ ఏంటో చూద్దామా..!.లండన్కి చెందిన 53 ఏళ్ల లైఫ్స్టైల్ వైద్య నిపుణురాలు డాక్టర్ అల్కా పటేల్ని చూస్తే 23 ఏళ్ల అమ్మాయిలా ఉంటుంది. ఆమె జీవ సంబంధమైన వయసు కేవలం 23 ఏళ్లేనని ఆమెనే స్వయంగా చెబుతున్నారు. మనలో కొందరూ ఏజ్ పరంగా చాలా పెద్దవాళ్లైన లుక్చూస్తే చిన్నవాళ్లలా ఉంటారు. అలా మనం కూడా ఉండొచ్చని అల్కా అంటున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలితో ఆరోగ్యాన్నే కాదు మన ఏజ్ని కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారామె. ఒకప్పుడామె..ఆమె రెంబు దశాబ్దాలకు పైగా జనరల్ ప్రాక్టీషనర్ సేవలందించిన డాక్టర్ ఆమె. ఎక్కువ సమయం తన పేషెంట్ల బాగోగుల, కుటుంబ బాధ్యతలకు కేటాయించి తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారామె. దాంతో సడెన్గా తన 39వ పుట్టనరోజున ఎడతెరగని జ్వరం బారినపడింది. సాధారణ జ్వరం కాస్త సివియర్ అయిపోయింది. నెమ్మదిగా అవయవాలన్నీ పనిచేయడం మానేశాయి. అసలు ఆమె ఏ వ్యాధితో బాధపడుతుందో వైద్యులకే అంతు చిక్కలేదు. ఇక లాభం లేదని అవయవాలు పనిచేసేలా కొన్ని శస్త్ర చికిత్సలు కూడా చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిదంటే..తన పిల్లలకు అమ్మగా తానేం చేయకుండానే చనిపోతాననే బెంగతో జీవచ్ఛవంలా అయిపోయింది. ఒకరకంగా ఆ అనారోగ్యం అల్కాకు తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టేలా చేసింది. ఎలాగైన తన పిల్లల కోసం ఈ అంతుచిక్కని వ్యాధిని ఎలాగైనా జయించాలనే ధైర్యాన్ని కూడగట్టుకుంది. అలా నెమ్మదిగా..తగినంత విశ్రాంతి, పోషకాహారంపై దృష్టిపెట్టి తనను తాను బాగుచేసుకుంది. ఆ తర్వాత మరింత ఆరోగ్యంగా ఉండేలా..వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఆహారంపై ఫోకస్ పెట్టారు అలా ఆమె యవ్వనంగా మారడమే గాక పూర్తి ఆరోగ్యవంతమైన వ్యక్తిగా జీవించడం ప్రారంభించారు. ఆ అనారోగ్యమే తన కళ్లు తెరిపించిందని అంటారామె. పైగా ఇవాళ ఆమె దీర్గాయువు నిపుణురాలిగా సేవలందిస్తున్నారు కూడా. ఇక ఆమె ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని నిర్వహించడం కోసం ఆరింటిని తప్పనిసరిగా పాలోకండని సూచిస్తున్నారామె. అవేంటంటే..సూర్యకాంతిలో గడపటం: ప్రతిరోజు ఉదయం కనీసం ఒక్క నిమిషం సూర్యకాంతిలో గడపటం. ఓ పదిసెకన్లు కళ్లు మూసుకుని మీకోసం మీతో గడపాలట.వాకింగ్: గుండె ఆరోగ్యం, శక్తిని పెంచడానికి ఓ 20 సెకన్ల పాటు నడవాలట. హైడ్రేటెడ్ ఉండటం: ప్రతి 30 నిమిషాలకు నీళ్లు తాగేలా శ్రద్ధ పెట్టడంపొగడ్తలు, గర్వంగా ఫీలైన క్షణాలు: మిమ్మల్ని మెచ్చకున్న వ్యక్తులను గుర్తుచేసుకోండి. అలాగే మీకు మద్దతు, సహయం చేసేవారిని ప్రశంసించడం అలవాటు చేసుకోవాలటవర్కౌట్లు: శరీరంలో మంచి కదలికలు ఉండటం కోసం ఓం 50 సెకన్ల పాటు వాటికి సంబంధించిన వ్యాయామాలు చేయలటబ్రీథింగ్ వ్యాయామాలు: నాడీ వ్యవస్థను శాంతపరిచేలా ప్రతి రోజు ఒక గంట శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం తదితరాలతో వ్యాయమాన్ని తిప్పికొట్టి ఆరోగ్యవంతంగానే కాకుండా నిత్య యవ్వనాన్ని సొంత చేసుకోగలమని చెబుతున్నారు డాక్టర్ అల్కా పటేల్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్) -
వయసు 70 ఏళ్లు..ఇప్పటికీ 40 కి.మీ సైకిల్పైనే..
చిన్న వ్యాపారమే నడుపుతున్నా..రయ్రయ్మని..బైక్ లేదా కార్లలలోన వెళ్తుంటారు. పైగా అది స్టేటస్ ఆఫ్ సింబల్గా పలువురి అభిప్రాయం కూడా. అలాంటి ఈ రోజుల్లో ఓ తాతా గారు బడా వ్యాపారవేత్తగా చెలామణి అవుతున్నా..ఇప్పటికీ సాధారణ సైకిల్పైనే తన ఫ్యాక్టరీకి వెళ్తుంటాడు. అది కూడా ఏకంగా 30 కి.మీ పైనే తొక్కుతూ వెళ్లడం విశేషం. ఇవాళ వరల్డ్ సైక్లింగ్ డే సందర్భరంగా అంతలా ఫిట్నెస్ ప్రాముఖ్యత ఇచ్చి సైక్లిల్పైనే రాకపోకలు సాగిస్తున్న ఆ తాతగారు గురించి తెలుసుకుందామా..!.అతడే 70 ఏళ్ల సురేష్ జరివాలా. ఆయన్ను సైక్లింగ్ లెజెండ్గా పేర్కొన్నవచ్చు. ఆయన రోజు ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. స్వతహాగా వస్త్ర వ్యాపరావేత్త అయినా ఆయన ఫిట్నెస్కి వీరాభిమాని. ఆయన వ్యాపారిగా తన కెరీర్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సైకిల్పైనే రాకపోకలు సాగిస్తున్నాడు. మెరిసే కార్లు, బైక్లు ఆయన దరిచేరలేకపోయాయి లేదా ఆయన్ను ఆకర్షించడంలో విఫలమయ్యాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే సూరత్లో ఫ్యాక్టరీ ఉన్నప్పుడూ..సైకిల్పైనే వెళ్లేవాడు. ఆ తర్వాత 1982లో ఫ్యాక్టరీ అంక్లేశ్వర్కు మారినా.. అతని తీరు మారకపోవడం విశేషం. నిజానికి సూరత్ని సలాబత్పురా నుంచి అంకలేశ్వర్ రావాలంటే కచ్చితంగా కారు లేదా బైక్ ఉంటేనే వెళ్లడం సాధ్యం. ఎందుకంటే ఈ తాతగారు సూరత్లోని తన ఇంటి నుంచి స్టేషన్కి మూడు కి.మీ సైకిల్పై ప్రయాణించి.. అక్కడ నుంచి రైలులో ప్రయాణించి అంకలేశ్వర్కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ స్టేషన్ నుంచి ఫ్యాక్టరీకి మరో నాలుగు కి.మీ సైకిల్ తొక్కాల్సి ఉంటుంది. అయినా సరే ఆయన సైక్లింగ్ వదిలేయలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన ఇదే జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎప్పుడో 1990లలో రూ. 2000 పెట్లి అట్లాస్ కంపెనీ సైకిల్ కొనుకున్నారు. ఇప్పటికీ దానిపైనే ప్రయాణించడం చూస్తే..ఆ సైకిల్ని ఆయన ఎంతలా అపురూపంగా చూసుకుంటున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆయనది ఉమ్మడి కుటుంబం. మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. జరివాలాకు నలుగురు సోదరులు. వారిలో చిన్నవాడు ఆయనే. పెద్ద అన్న వయసు 80 ఏళ్లు. చిన్న మనవడికి మూడేళ్లు. ఆయన క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవిన విధానం తమకు స్ఫూర్తి, ఆరాధ్యనీయమైనదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆయనలా అనుసరించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ మావల్ల సాధ్యం కావడం లేదని అంటున్నారు వారంతా. ఇంత బిజీ లైఫ్లో కూడా ఆయన రోజూ పదివేల అడుగులపైగా వాకింగ్ చేస్తాడట. మారథాన్, రన్నింగ్ రేస్ వంటి అన్నింటిల్లోనూ పాల్గొటాడట. మరో విశేషం ఏంటంటే..మహారాష్ట్రలోని షిర్డీకి సుమారు 300 కి.మీ. సైకిల్పైనే వెళ్తాడట సురేష్ జరివాలా. ఆయన జీవిన విధానం పర్యావరణ హితంగానూ ఆరోగ్యప్రదంగానూ ఉంది. చెప్పాలంటే క్రమశిక్షణాయూతంగా జీవించడానికి ఉదాహరణ సురేష్ జరివాలా జీవన విధానం. కనీసం ఆయనలా అంతలా చేయలేకపోయినా..పర్యావరణానికి మేలు కలిగించేలా, ఆరోగ్యగా ఉండేలా జీవించడానికి కొద్ది ప్రయత్నమైనా చేద్దామా..!..(చదవండి: 'డయాబెటిక్ రైస్' అంటే..? బాలీవుడ్ నటుడు గోవింద్ వైఫ్ సైతం..) -
'డయాబెటిక్ రైస్' అంటే..? ఇది మధుమేహాన్ని నియంత్రించగలదా..
ఇటీవల కాలంలో అందరిని వేధిస్తున్న తీపి వ్యాధి మధుమేహం. దీని కారణంగా ఏం తినాలన్నా..బాబోయ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయేమో అన్న అనుమానం వెంటాడుతుంటుంది చాలామందిలో. దాన్ని క్యాష్ చేసుకునేలా మార్కెట్ డయాబెటిస్ వాళ్లకు ఉపయోగపడే రైస్, కూరగాయాలు, స్వీట్లు అంటూ మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నాయి. వాస్తవానికి చాలామందికి కూడా రైస్తో భోజనం కానిస్తే కానీ కడుపునిండిన ఫీల్ రాదు. ఇలానే అంటున్నారు బాలీవుడ్ ప్రముఖ హీరో గోవింద్ భార్య సునీతా అహుజా సైతం. ఆమె కూడా హాయిగా అన్నం తింటేనే ఆ అనుభూతే వేరు అంటున్నారు. కానీ తాను కూడా డయాబెటిస్తో పేషెంటేనని, అందుకని రైస్ని ఇలా తీసుకుంటానంటూ తన డైట్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. అంతేగాదు మనకిష్టమైన రైస్నే వదులకోకుండా ఆరోగ్యకరంగా ఎలా తీసుకోవాలో కూడా చెప్పారామె. మరి నిపుణులు దీని గురించి ఏమంటున్నారో సవివరంగా చూద్దామా..!.సెలబ్రిటీ సునీతా ఆహుజా తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ..తాను నేపాలీగా ఎక్కువ వైట్రైస్ తినేందుకే ఇష్టపడతానని అన్నారు. అయితే మధుమేహం ఉంది కాబట్టి డయాబెటిక్ రైస్కి ప్రాధాన్యత ఇస్తానన్నారామె. దాంతోపాటు రోటీలు కూడా తీసుకుంటానని అన్నారు. ‘డయాబెటిక్ రైస్’ అంటే..ఈ ‘డయాబెటిక్ రైస్’ఇటీవలకాలంలో బాగా ప్రజాదరణ పొందింది. ఇది మధుమేహంతో బాధపడుతున్న వారికి ప్రత్యామ్నాయమైన రైస్ అని చెప్పొచ్చు. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఉపయోగిస్తారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. సాదారణ బియ్యం కంటే..వీటిలోనే గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదిగా పెరుతాయి. అందువల్ల వీటికే మొగ్గు చూపుతున్నారు చాలామంది. అవేంటంటే..నల్ల బియ్యంఎర్ర బియ్యంగోధుమ బియ్యందంపుడు బియ్యంతక్కువ GI బాస్మతి బియ్యంమిల్లెట్ ఆధారిత బియ్యంప్రాసెస్ చేసిన తక్కువ-కార్బ్ బియ్యంవాటిల్లో గ్లైసెమిక్ సూచిక..తెల్ల బియ్యం: GI 70–89 (ఎక్కువ)గోధుమ బియ్యం: GI 50–60 (తక్కువ)ఎర్ర బియ్యం: GI దాదాపు 55 (తక్కువ)దంపుడు బియ్యం: GI 38–50 (అత్యల్పం )మిల్లెట్స్: GI దాదాపు 40–55 (అత్యల్పం)డయాబెటిక్ బియ్యంతో కలిగే లాభాలు..భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల తక్కువగా ఉంటుంది. సంతృప్తిని పెంచడం, భాగం నియంత్రణకు సహాయపడుతుందిదీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరగలదుశుద్ధి చేయబడిన తెల్ల బియ్యంతో పోలిస్తే, తృణధాన్యాలు లేదా తక్కువ GI బియ్యం గ్లూకోజ్ ప్రతిస్పందనను మాడ్యులేట్ చేయడంలో బెస్ట్నిపుణులు ఏమంటున్నారంటే..ఇక వైద్య నిపుణులు సైతం "డయాబెటిక్ బియ్యం"లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ అని చెబుతున్నారు. అదే సమయంలో ఇది ఆరోగ్యకరమని అతిగా తీసుకుంటే మాత్రం.. దీనివల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరించారుగ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ స్టార్చ్ లేని కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిసి తీసుకోవాలని అన్నారు. దీంతోపాటు ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా నివారించాలని సూచించారు. చివరగా తక్కువ-GI, అధిక-ఫైబర్ బియ్యం రకాలు చక్కెర నిర్వహణను గణనీయంగా మెరుగుపరుస్తాయని నమ్మకంగా చెప్పారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి. (చదవండి: ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే..? ఈ చికిత్స ఎందుకోసం అంటే..) -
‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే ..?
సినిమాల్లో ఈ థెరపీని భయంకరంగా చూపిస్తారు. ఎవరినైనా హింసించడానికి దాన్ని వాడుకుంటున్నట్టుగా చూపుతారు. అంతేకాదు... కొన్ని హాస్య సన్నివేశాల్లోనూ నవ్వించడానికీ దాంతో కామెడీ యాక్టర్లకు షాక్ ఇస్తున్నట్టు చూపి, నవ్వు తెప్పించడానికి వాడతారు. ఇక వార్తా కథనాల్లో ఎదుటి పార్టీవారికీ, ప్రత్యర్థులకు షాక్ ఇచ్చినప్పుడు ‘షాక్ ట్రీట్మెంట్’ అనే పదాన్ని విచ్చలవిడిగా వాడుతుంటారు. అలా దానిపై ఎన్నో అనుమానాలూ, అపోహాలూ కల్పిస్తారు. కానీ నిజానికి అదో మంచి ట్రీట్మెంట్. బాధితులకు షాక్ తగినట్లుగా తెలియనివ్వని చికిత్స. మరెంతో మందికి మానసిక చికిత్సల కోసం, అనేక మందికి ప్రాణరక్షణ కోసం వాడే థెరపీ. దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి అనేక మందికి ప్రాణరక్షణ ఇచ్చిన చికిత్సా ప్రక్రియ. ఎంతో మందిని రక్షించిన ఆ చికిత్స పేరే ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్. వైద్య పరిభాషలో ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’అని పిలుస్తూ సంక్షిప్తంగా ‘ఈసీటీ’ అనే ఈ చికిత్సపై ఉండే అపోహలూ, అపార్థాలు తొలగించి, ఈ చికిత్స ప్రక్రియపై మంచి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. సినిమాల్లో, అలాగే కొన్ని టీవీ సీరియల్స్లో ఎంతగానో భయంగొలిపేలా చూపే ఈ షాక్ ట్రీట్మెంట్ నిజజీవితంలో ఎంత మాత్రమూ భయం గొలిపే చికిత్స కాదు. దీనిపై ఎంతగా అపార్థాలు నెలకొన్నాయంటే బాధితుడికి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాలంటూ డాక్టర్లు చెబితే... అతడి బంధువులూ, స్నేహితులూ ఆందోళనకు గురయ్యేంతగా ఇది అపోహలకు గురయ్యింది. కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న అనేకమందిని తిరిగి సాధారణ స్థితికి రావడానికి ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ ఎంతగానో ఉపయోగపడింది. ప్రతి ఏటా దాదాపు లక్షల సంఖ్యలోని బాధితులకు వారి సమస్యలను నయం చేస్తూ, అనేక రకాలుగా స్వస్థత చేకూర్చే ఈ చికిత్స ప్రక్రియ అందుబాటులోకి రావడమూ చాలా నాటికీయంగా జరిగింది. అది సివియర్ డిప్రెషన్, కెటటోనియా లాంటి ఎన్ని రకాల సమస్యలనుంచి విముక్తి కల్పిస్తుందనే విషయంతోపాటు అసలు అది ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరుతెన్నులూ... ఈ విశేషాలన్నింటి గురించీ తెలుసుకుందాం...షాక్ ట్రీట్మెంట్ ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరిది... అసలు కరెంటు షాక్ ద్వారా కొన్ని మానసిక వ్యాధులను నయం చేయవచ్చని ఎలా తెలిసిందన్నదే అబ్బురాన్ని కలిగించే విషయం. తొలుత 1934లో డాక్టర్ మెడూనా అనే శాస్త్రవేత్త మానసిక సమస్యలు ఉన్న బాధితులకు క్యాంఫర్ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాడు. అలా ఇవ్వడం ద్వారా బాధితుడికి మూర్చ (ఫిట్స్ / కన్వల్సెన్స్)ను కలిగించి, మానసిక సమస్యలను నయం చేయడానికి ప్రయత్నించాడు.ఇప్పుడు మరింత సమర్థంగా మాడిఫైడ్ ఈసీటీ రూపంలో ... ఇటీవల పెరిగిన వైద్యవిజ్ఞానంతో చాలా తక్కువ డోసులో మత్తు మందుతోపాటు తక్కువ మోతాదులో కరెంట్ ఇవ్వడం ఆధునిక మాడిఫైడ్ ఈసీటీలో జరుగుతుంది. శాస్త్రవిజ్ఞానం ఎంతో పెరిగిన ఇటీవల కాలంలో బాధితులకు ఇప్పుడు మత్తు కూడా చాలా తక్కువ మోతాదులో (షార్ట్ యాక్టింగ్) అలాగే చాలా సురక్షితంగా కూడా ఇస్తున్నారు. కండరాలుకు తగినంత విశ్రాంతి కలిగించే మందులు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రో కన్వల్సివ్ చికిత్స (ఈసీటీ) చేయడం జరుగుతుంది. ఇందులో బాధితులకు తమకు కరెంట్ షాక్ ఇస్తున్న విషయమూ తెలికుండానే... వారికి అసలేమీ జరగదలేదని అనిపించేలా... కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయడం సాధ్యమవుతోంది. నిద్రలోకి వెళ్లి మళ్లీ లేచినప్పుడు మాత్రమే బాధితులకు తమకేదో చికిత్స చేశారనే విషయం తెలుస్తుందిగానీ.... ఇందులో నిజానికి ఎలాంటి బాధా ఉండదు. ఈసీటీ ఇచ్చిన తర్వాత సుమారు 2 గంటల పాటు వైద్యులు సదరు మానసిక సమస్యల బాధితుల్ని తమ పర్యవేక్షణలోనే ఉంచుకుని (తాము వాడిన మందుల ప్రభావం తగ్గేంతవరకు) ఆ తర్వాత ఇంటికి పంపిస్తారు. అంటే ఈసీటీకి ప్రస్తుతం అత్యంత సులువైన, ప్రమాదరహితమైన ఔట్పేషెంట్ పద్ధతిలోనే చికిత్స జరుగుతుందన్నమాట. మన సమాజంలో నిజానికి మానసిక సమస్యలు వాటి కారణాలు గురించి చాలా తక్కువ అవగాహనే ఉంది. ఇప్పటికీ చాలా కుటుంబాల్లోని సభ్యులకు ఏదైనా మానసిక సమస్య ఉందంటే... వారు దాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచడానికే మొగ్గుచూపుతారు. ఇది సరైన పద్ధతి కాక΄ోయినా... దురదృష్టవశాత్తు ఇంకా ఇప్పటికీ ఇలాంటి ఆలోచన ధోరణే ప్రజల్లో / సమాజంలో కొనసాగుతోంది. నిజానికి మన దేహంలో ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానానికి ఇంకా పూర్తి స్థాయిలో అంతుచిక్కనిదీ లేదా చాలా తక్కువగా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే అది మన మెదడు గురించే. మెదడు నిర్మాణం, జీవక్రియలూ అత్యంత సంక్లిష్టంగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ... ఈ అంశం మన మెదడు తాలూకు సంక్లిష్టతను తెలియజేస్తుంది. అందుకే మానసిక సమస్యల తాలూకు కారణాలు తెలుసుకోవడం చాలా సంక్లిష్టమైన కఠినమైన విషయంగా మారింది. ఇప్పుడిప్పుడు మెదడుకు సంబంధించిన చాలా రహస్యాలు మెల్లమెల్లగా తెలిసివస్తున్నాయి. ఈసీటీ ప్రక్రియ... మెదడులోని అనేక స్థాయుల్లో చాలారకాల మాలిక్యులార్ బయోకెమికల్, ఎండోక్రైన్, స్ట్రక్చరల్, జెనెటిక్ మార్పులను కలగజేస్తుంది. తద్వారా ఈ ప్రక్రియ వ్యాధిని నయం చేయడానికి కారణమవుతోంది. ఎలక్ట్రో కన్వల్సివ్ ప్రక్రియ(ఈసీటీ) ఎలా పనిచేస్తుందంటే...నిజానికి ఈసీటీ చికిత్స ఎంత సురక్షితమైనదో చెప్పడానికి తార్కాణమేమిటంటే... గర్భవతుల్లో (ప్రెగ్నెన్సీలో)అలాగే ప్రసవం అయ్యాకకొత్తగా తల్లులైన మహిళల్లో వచ్చే పోస్ట్పార్టమ్ సైకోసిస్కు చికిత్సఇచ్చేటప్పుడు ఆ బాలెంతకూ...అంతేకాదు...గర్భంలో ఉన్నశిశువుకుసైతం ఈసీటీఅనేది చాలాసురక్షితమైన ప్రక్రియ అనితేలింది. ఈ నేపథ్యంలోసమాజంలో ఈ చికిత్సపై ఉన్న అపోహలు తొలగించుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం.ఈసీటీతో ఏయే సమస్యలుఉన్నవారికి చికిత్స అందిస్తారంటే...తీవ్రమైన వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్) వంటి సమస్యలు ఉన్నవారికి. ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా అనుకుంటున్నవారికీ, ఆత్మహత్యలకు ప్రయత్నించేవారికీ (సూసైడల్ టెండెన్సీస్ ఉన్నవారికీ) ఆహారాన్ని తిరస్కరించేవారికి. బైపోలార్ డిప్రెషన్ ఉన్న బాధితులకు మందులతో పైన పేర్కొన్న వ్యాధులు నయంకాని సందర్భాల్లో... స్కీజోఫ్రీనియా వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి. కెటటోనియా అనే మానసిక సమస్యలో (ఈ పరిస్థితిలో బాధితులు పూర్తిగా ఓ శిలాప్రతిమలా బిగుసుకుని ఉండిపోతారు. నిజానికి ఈ స్థితి అనేక మానసిక వ్యాధుల కారణంగా కలుగుతుంది. కెటటోనియా స్థితి నుంచి బాధితులను మామూలు స్థితికి తీసుకురావడానికి షాక్థెరపీ బాగా ఉపయోగపడుతుంది. తొలినాళ్లలో కాస్త ముతకగా... ఆ తర్వాతమెరుగ్గాతొలినాళ్లలో బాధితులకు మత్తు మందు ఇవ్వకుండానే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఈసీటీ)ని ఇచ్చేవారు. దాంతో బాధితుల్లో మూర్చలు కలిగినప్పుడు వారికి గాయాలు కావడం, ఒళ్లు నొప్పులు రావడం, ఎముకలు గాడితప్పడం (డిస్ లొకేట్ కావడం), ముఖ్యంగా దవడ ఎముక (జా డిజ్లొకేషన్) వంటివి ఎక్కువగా కనిపించేవి. అయితే తొలిసారిగా 1940లో బెనెట్ అనే శాస్త్రవేత్త మత్తుమందు ఇచ్చి ఈ చికిత్స ఇవ్వడం వల్ల పైన పేర్కొన్న సమస్యలేవీ రావనీ, దాంతో కొద్దిగా మత్తు ఇవ్వడం ద్వారా ఇతరత్రా సమస్యలేమీ లేకుండా చాలా సురక్షితంగా ఈ చికిత్సను అందించడం సాధ్యమేనని కనుగొన్నాడు.ఈసీటీపై అపోహలూ వాస్తవాలు అపోహ:ఈసీటీ ప్రక్రియ మెదడును గాయపరుస్తుంది. వాస్తవం : ఈసీటీ వల్ల మెదడు నిర్మాణానికి గానీ, లేదా ఇతరత్రాగానీ ఎలాంటి గాయాలూ కావనీ, మెదడులో ఏ రకమైన ప్రమాదకరమైన మార్పులూ కలగవంటూ అనేక పరిశోధనల్లో స్పష్టంగా తేలింది. అపోహ:ఈసీటీ వల్ల మతిమరపు వస్తుంది.వాస్తవం : ఈసీటీ వల్ల బాధితుల జ్ఞాపపశక్తిపై దాదాపుగా ఎలాంటి ప్రభావమూ పడదని చెప్పవచ్చు. ఒకవేళ పడినా అది చాలా చాలా తక్కువ. ఈసీటీ ఇచ్చే ముందు తాత్కాలికంగా ఇచ్చే మందు మోతాదు కూడా చాలా తక్కువ. అయితే ఈ మత్తు నుంచి బయటకు వచ్చే ముందర బాధితుల్లో కాస్త అయోమయ స్థితి కనిపించవచ్చు. ఇదే ఇలాంటి దురభిప్రాయానికి కారణమవుతోంది. అంతేతప్ప జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గదు. అయితే చాలా కొద్దిమందిలో మాత్రం ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినప్పుడు తాత్కాలికంగా జ్ఞాపకశక్తి తగ్గినప్పటికీ అది కేవలం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు మాత్రమే. ఈసీటీ వల్ల శాశ్వతమైన జ్ఞాపకశక్తి లోపం దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు. అపోహ: ఈసీటీ వల్ల మెదడులోనికి ఒక్కోసారి ప్రమాదకరమైన రీతిలో కరెంట్ ప్రవహించవచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. అప్పుడున్న అత్యాధునిక పరికరాల వల్ల కరెంట్ ఇచ్చే ప్రక్రియ పూర్తిగా సురక్షితం. దాంతో ఇది పూర్తిగా ప్రమాదరహితమైన వైద్యం ప్రక్రియ అని చెప్పవచ్చు. పైగా ఈసీటీలకు వాడే వోల్టేజీ కూడా చాలా తక్కువ. అపోహ: ఈసీటీకి వల్ల మెదడు దెబ్బతిని కొన్ని మానసిక వ్యాధులు రావచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. ఈసీటీతో కొన్ని మానసిక సమస్యలు తగ్గడమే తప్ప కొత్తగా ఎలాంటి మానసిక వ్యాధులూ రావని స్పష్టంగా చెప్పవచ్చు. అపోహ: కరెంట్ షాక్ ఇస్తారు కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. వాస్తవం : ఇది పూర్తిగా ప్రమాదరహితం. అయితే ఎలక్ట్రో కన్వల్సివ్ ట్రీట్మెంట్లో ఇచ్చే మత్తుమందు (అనస్థీషియా) వల్ల ఇతరత్రా శస్త్రచికిత్సలో ఉండే రిస్క్ మాత్రమే ఇందులోనూ ఉంటుంది. అంతేతప్ప ఇందులో ఎలాంటి అదనపు ముప్పూ ఉండదు. అయితే అనస్థీషియా ఇచ్చేందుకు ఇతరత్రా జబ్బుల్లో ఇచ్చినప్పుడు చూసినట్టుగానే బాధితులకు దాన్ని తట్టుకునే ఫిట్నెస్ ఉందే లేదో చూసుకోవాలి. గుండెజబ్బులు, ఇతర శారీరక సమస్యలు ఉన్నాయేమో గమనించాలి. అప్పుడే అనస్థీషియాతో వచ్చే సమస్యలను గుర్తించి వాటిని నివారించవచ్చు. ఈసీటీ ఇచ్చే సమయంలో పల్స్ ఆక్సీమీటర్ అనే సాధనంతో గుండె, ఊపిరితిత్తులు మొదలైన శారీరక వ్యవస్థలను గమనిసూ ఉంటే ఇరత శరీరక సమస్యలపై పడే ప్రమాదాలను నివారించవచ్చు.ఈసీటీ ఇవ్వడం ఎప్పుడు సరికాదంటే...నిజానికి కొన్ని రకాల సమస్యలు ఎంతకీ తగ్గకుండా ఉన్నప్పుడు... ఒకవేళ అవి ఈసీటీ ఇవ్వడం వల్ల తగ్గేవైతే... అలాంటి సందర్భాల్లో మందులు మార్చి చూడటం కంటే ఈసీటీతోనే మంచి ఫలితాలు ఉంటాయంటూ వైద్యపరిశోధకులు, వైద్యులు గుర్తించారు. అయితే ఈసీటీ అన్నది పూర్తిగా ప్రమాదరహితమైన ప్రక్రియే అయినప్పటికీ ఈ చికిత్సకూ కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేమిటంటే... మెదడులో సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్ కలిగించే ఒత్తిడి ఉన్నప్పుడు ఈసీటీ వాడకూడదు. ఇటీవల ట్రాన్స్క్రేనియల్ మాగ్నెటిక్ స్టిమ్యులైజేషన్ అనే ప్రక్రియ వల్ల కూడా ఈసీటీతో ఉండే ప్రయోజనాలే కలుగుతాయని కొత్త పరిశోధనలతో తేలింది. కాబట్టి ఇదే ఈసీటీనే ఇంకాస్త అధునాతంగా ఇవ్వడంపై కూడా ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వైహెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..) -
ఇదేం ఫ్యాషన్..? ఏకంగా దుప్పటినే లెహంగాలా..
‘ఫ్యాషన్ అనేది ఫ్యాబ్రిక్ స్టోర్ నుంచి కాదు మన ఊహాల నుంచి మొదలవుతుంది’ అంటారు. సిమ్రాన్ క్రియేటివిటీని చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ సిమ్రాన్ ఆనంద్ ఇరవై కిలోల బెడ్ షీట్ను ఆకట్టుకునే లెహంగాగా మార్చి ఔరా..! అనిపించుకుంది. చక్కటి ఎంబ్రాయిడిరీతో అందంగా ఉన్న ఈ బెడ్షీట్ని ఇలా కూడా ఉపయోగించొచ్చు అనే ట్రెండ్కి తెరతీసింది. అదేనండి మనసుంటే మార్గం ఉంటుంది. అన్నట్లుగా ఈ అమ్మడు తన సృజనాత్మకతకు పదునుపెట్టి మరీ మనకు సరికొత్త ఫ్యాషన్ని పరిచేయం చేసింది సిమ్రాన్‘ఔట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్’ కాప్షన్తో ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది సిమ్రాన్.‘ఎందుకు ఇలా?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు... ‘బెడ్ షీట్లలో నాకు ఫ్యాషన్ కనిపించింది’ ‘లెహంగాగా మార్చడం ద్వారా దుప్పట్లకు సెకండ్ లైఫ్ కూడా ఇవ్వవచ్చు’ అంటుంది సిమ్రాన్. ఇక నెటిజనుల స్పందన విషయానికి వస్తే... ‘దుప్పటితో లేహంగా ఏమిటీ!’ అనే వెక్కిరింపుల కంటే.. ‘క్రియేటివ్ ఐడియా’ అనే ప్రశంసలే ఎక్కువగా కనిపించాయి. View this post on Instagram A post shared by Simran Anand (@simrananand21) (చదవండి: ‘పేరెంట్ షాలా’: పేరెంటింగ్కు సరికొత్త దిక్సూచి..!) -
పేరెంటింగ్కు సరికొత్త దిక్సూచి..!
ప్రస్తుత కాలంలో పిల్లల్ని పెంచడం ఒక ఛాలెంజింగ్గా మారిందని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, లైఫ్ స్టైల్ ఇందుకు ముఖ్య కారణాలని ప్రముఖ మనస్తత్వవేత్త సుదీర్ సండ్రా తెలిపారు. సుధీర్ ఆధ్వర్యంలో నగరంలోని శిల్పకళా వేదికగా నిర్వహించిన సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్ ఈవెంట్లో 1,300 మందికి పైగా తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు ఉపయోగపడే అధునాతన యాప్ ‘పేరెంట్ షాలా’ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదీర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు చిన్నారులకు సరైన గైడెన్స్ ఇచ్చే వేదిక కోసం వెతుకుతున్నారని, దీనికి అనువైన వేదిక ‘పేరెంట్ షాలా’ అని పేర్కొన్నారు. వారికి ఇదొక మెంటార్ లా సాయపడుతుందని చెప్పారు. నిపుణుల మార్గదర్శకత్వంతో పాటు కమ్యూనిటీ పరంగా సహాయం అందిస్తుందని, భారతీయ సంప్రదాయాలకు, ఆధునిక పేరెంటింగ్ పద్ధతులను జతచేసి అనుబంధాలను పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. మొబైల్ ఫోన్లకు అతుక్కుపోకుండా చిన్నారుల దృష్టిని మళ్లిస్తుందని, అలాగే తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచి పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఇదే వేదికపై సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్లో భాగంగా నలుగురు మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత స్టోరీ టెల్లర్ రమా రావి, డాక్టర్ ఇప్పలపల్లి రమేశ్, నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ (ఎన్హెచ్ఏ) డైరెక్టర్ మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (చదవండి: చల్ మేరే దిల్..! క్రేజ్ సంతరించుకుంటున్న సైకిల్) -
చల్ మేరే దిల్..! క్రేజ్ సంతరించుకుంటున్న సైకిల్
ఇప్పుడంటే మోటారు సైకిల్, కార్లు సర్వసాధారణం అయ్యాయిగాని.. ఒక జనరేషన్ వెనక్కి వెళితే సైకిల్ అనేది స్టేటస్ సింబల్గా ఉండేది. ఊర్లో అక్కడక్కడా కనిపించేవి. పెళ్లిళ్లలో మగ పెళ్లివారు సైకిల్ బహుమానంగా ఇవ్వాల్సిందేనని అడిగి మరీ తీసుకునేవారు. ఆ పరిస్థితుల నుంచి మధ్యలో కొంత కాలం విరామం వచ్చింది. ప్రస్తుతం మళ్లీ సైకిల్కు క్రేజ్ పెరుగుతోంది. ఆరోగ్యం, శారీరక వ్యాయామం, ఒత్తిడి నుంచి రిలాక్సేషన్, కాలుష్య నివారణ, పెట్రోల్ వినియోగం తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించిన పట్టణ యువత తిరిగి సైక్లింగ్ వైపు మొగ్గుచూపుతోంది. జూన్ 3 ప్రపంచ సైక్లింగ్ డే సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. ఆకారంలో మార్పు.. ధరల్లో వ్యత్యాసం..సైకిల్ తయారు చేసిన తొలినాళ్లలో దాని ఆకారం ఇప్పుడున్నట్లు లేదు. ముందు చక్రం పెద్దదిగాను, వెనుక చక్రం చిన్నదిగాను ఉండేది. కాలక్రమేణా దాని రూపం మారుతూ వచ్చింది. సైకిల్ ధర అప్పట్లో రూ.వందల్లో ఉండేది. ప్రస్తుతం మోడల్ బట్టి వేలల్లో అమ్మకాలు చేస్తున్నారు. 1980లో సుమారు రూ.500 నుంచి రూ.800 మధ్యలో లభించేది. అది కాస్త 2000 సంవత్సరం వచ్చే సరికి సుమారుగా రూ.3 వేల నుంచి రూ.4500 వరకూ పెరిగింది. ప్రస్తుతం పాత తరం వినియోగించే మోడల్స్ ఉత్పత్తి నిలిచిపోయింది. 1950 నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు సైకిల్ విరివిగా వినియోగించేవారు. హెర్క్యులస్, హీరో, అట్లాస్ వంటి సైకిల్ కంపెనీలు భారత దేశంలో గుర్తింపు పొందిన కంపెనీలు. దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు దీని వినియోగానికి విరామం ఏర్పడింది. అనంతరం కొత్త మోడళ్ల సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యులు తొక్కే సైకిల్ ప్రారంభ ధర రూ.5 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. చిన్న పిల్లల సైకిళ్లు సుమారు రూ.3 వేల నుంచి రూ.పది వేలకుపైబడిన ధరల్లో అమ్ముడుపోతున్నాయి. చిన్న పిల్లలు, మహిళలు, పురుషులు, సైక్లింగ్ చేసేవాళ్లు, ఇలా వేర్వేరు కేటగిరీలు, విభిన్నమైన మోడళ్లలో సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ఉపయోగాలు.. సైకిల్ తొక్కువడం వల్ల ఆరోగ్య పరంగా, పర్యావరణ పరంగానూ అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ప్రజలు అన్నిటికంటే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. క్యాన్సర్, మధుమేహం, స్థూలకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఒత్తిడి, దీర్ఘకాలిక రోగాలకు సైక్లింగ్తో చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నగరవాసులు బిజీ లైఫ్లో ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణిలు, ఇతర రంగాల వారికి తమతమ పనుల్లో శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీంతో సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మోటారు సైకిళ్లు, కార్లకు బదులుగా సైకిళ్లను వినియోగిస్తే కాలుష్య నివారణతో పాటు, ఆర్థికంగానూ, ఆరోగ్య పరంగానూ ఉపయోగకరంగా ఉంటుంది. నగరంలో సైక్లింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేకించి ఓఆర్ఆర్, కేబీఆర్ పార్క్, తదితర ప్రదేశాల్లో సైకిల్ ట్రాక్స్ నిర్మించింది. దేశంలో సైకిల్ చరిత్ర ఇలా.. భారత దేశంలో 1890ల్లో యూరోపియన్ దేశస్తులు సైకిల్ తొక్కడం ప్రారంభించారు. ఉన్నత, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు స్టేటస్ సింబల్గా వినియోగించేవారు. 1920–1935 మధ్య కాలంలో ప్రపంచ సైకిల్ యాత్రలు ప్రారంభమ్యాయి. బ్రిటిష్, నవాబుల పరిపాలనలో సమాచార సరఫరా, తపాలా, పోలీసులు, సైన్యం సైతం వివిధ అవసరాలకు సైకిళ్లనే వినియోగించేవారు. తొలి నాళ్లలో కార్మికులు హెర్క్యులస్ సైకిళ్లు వినియోగిస్తే.. ఉన్నత వర్గాలు రాలీ, జేమ్స్ సైకిళ్లను వినియోగించేవారట. ఫిట్నెస్ మోటివేట్ అవుతుంది.. సైక్లింగ్ చేయడం వల్ల ఫిట్నెస్ మోటివేట్ అవుతుంది. వీలు చిక్కినప్పుడల్లా స్నేహితులంతా కలసి సైక్లింగ్ చేస్తాం. ఫలితంగా రొటీన్ లైఫ్కు భిన్నంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ లభిస్తుంది. కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలను నియంత్రించవచ్చు. – నేహ, మణికొండ పర్సనల్ టైం సైక్లింగ్.. తొమ్మిదేళ్ల నుంచి సైక్లింగ్ చేస్తున్నాను. ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకూ సైక్లింగ్ చేస్తాం. ఇంటికి చేరుకుని కుటుంబం, పిల్లలు ఇతర పనుల్లో బిజీ అయిపోతాం. నాకంటూ దొరికే పర్సనల్ టైం సైక్లింగ్. ఔట్ సైడ్ నేచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది. 70 కిలోమీటర్ల వరకూ వెళ్తుంటాను. 500 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలన్నది నా లక్ష్యం. 35 మంది మహిళలు కలిసి వెళ్తుంటాం. అంతా మంచి మిత్రులైపోయాం. – వందన లోకేష్ యుగంధర్, మణికొండ (చదవండి: womens safety: ఆపదలో అండగా...!ఈ స్మార్ట్ డివైజ్తో భద్రంగా ఉండొచ్చు..) -
ఉమెన్ సేఫ్టీ: ఆపదలో అండగా..!
బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మైసూర్కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కరణ్ సరికొత్త పరికరాన్ని తయారుచేశాడు. ఐజీడబ్ల్యూఎస్(ఇన్నోవేటివ్ ఇంటెలిజెంట్ జీయోఫెన్స్–ఎనేబుల్డ్ వేరుబుల్స్ సిస్టమ్స్) అనే పరికరం మహిళలు ఆపదలో ఉంటే వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ను ఎలార్ట్ చేస్తుంది.‘డివైజ్లోని ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి...జియోఫెన్స్–బేస్డ్ డిటెక్టర్. ఒక మహిళని ఎవరైనా మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాలో అవుతున్నప్పుడు ఈ డివైజ్ సందేహాస్పద వ్యక్తి మొబైల్ ఫోన్ను గాని, బ్లూటూత్ డివైజ్ అడ్రస్ గుర్తించడానికి ఉపయోగపడుతుంది’ అంటున్నాడు కరణ్.ఈ డివైజ్లో జియోఫెన్స్–బేస్డ్ సేఫ్టీ టైమర్ కూడా ఉంటుంది. యూజర్ ఒక డెస్టినేషన్ చేరుకోవడానికి టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి షాపింగ్కు వెళ్తూ 30 నిమిషాలలో ఇంటికి వస్తానని చెబితే సిస్టమ్ ఆమె జియోలోకేషన్ని మానిటర్ చేస్తుంది. సెట్ చేసిన టైమ్ లోపు ఇంటి జియోఫెన్స్లోకి రాకపోతే డివైజ్ ఆటోమెటిక్గా ఆమె లోకేషన్ని ఎమర్జెనీ కాంటాక్ట్కి పంపిస్తుంది. డివైజ్లో ‘రిటర్న్ హోమ్ సేఫ్టీ రిమైండర్’ కూడా ఉంటుంది. డివైజ్లో మరో సేఫ్టీ ఫీచర్...డేంజర్–జోన్ నోటీఫైయర్. ఇది హై–రిస్క్ జీపీఎస్ లొకేషన్స్ ప్రీలోడెడ్ జాబితాను ఉపయోగిస్తుంది. యూజర్ ఈ ప్రాంతాలలోకి వెళ్లినప్పుడు వేరబుల్ బజర్ యాక్టివేట్ అవుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్కి తెలియజేస్తుంది. (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..) -
ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్బీకి కూడా నచ్చవట..
కొన్ని రకాల కూరగాయలు అందరు ఇష్టపడరు. దాని రుచి రీత్యా తినేందుకు మక్కువ చూపించరు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఓ షోలో తనకు కూడా కొన్ని కూరగాయలు నచ్చవని చెప్పారు. పైగా ఆయన చాలా చమత్కారంగా ఆ కూరగాయలను తినదగినవి కావు..కానీ తింటేనే ఆరోగ్యం అని అన్నారు. మరీ బిగ్ బీ సైతం ఇష్టపడి ఆ కూరగాయాలు ఏవి..?. వాటివల్ల కలిగే లాభాలేంటి తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తనకు కూడా కొన్ని కూరగాయలంటే అస్సలు ఇష్టం ఉండదని అన్నారు. అవేంటో షేర్ చేసుకున్నారు కూడా. అయితే వాటిని అందరూ తప్పక తీసుకోవాల్సిందేనని, ఆరోగ్యంగా ఉండాలంటే తప్పదు మరీ అని నవ్వేశారు. ఆ కూరగాయలే పనస, గుమ్మడి కాయ, కాకరకాయ. పనస: దీన్ని కూరగానూ, పండుగానూ కూడా తీసుకుంటారు. ఇందులో పోటాషియం సమృద్ధిగా ఉంటుందట. గుండె కండరాలతో సహా మొత్తం కండరాల పనితీరుని నిర్వహించడంలో కీలకంగా ఉంటుంది. అంతేగాదు శరీరంలోని సోడియం నియంత్రణను నిర్థారిస్తుంది. అలాగే ఆర్థరైటిస్ ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇందులో ఎముకలకు అవసరమైన కాల్షియం కూడా అధికంగా ఉంటుందట. ఐరన్ మూలం కూడా.ముఖ్యంగా రక్తహీనతతో పోరాడటానికి, జీవక్రియను పెంచడానికి ఉపకరిస్తుందట. ఇందులో మెగ్నీషియం, విటమిన్ సీ, రాగి వంటివి కూడా ఉంటాయట. ఇవి రక్త నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.గుమ్మడికాయగుమ్మడికాయలలో కేలరీలు తక్కువ, పోషకాలు పుష్కలం, ఇందులో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయట. ఇది బీటా-కెరోటిన్కి అద్భుతమైన మూలం. కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతిస్తుంది. పొటాషియం, సోడియం ప్రభావాలను సమతుల్యం చేసి రక్తపోటుని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆహారం కూడా. దీనిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుందట. కాకరకాయఇందులో విటమిన్ ఏ,సీలు, ఫోలేట్, పొటాషియం, ఐరన్ తదితర కీలకమైన పోషకాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలోనూ, మధుమేహ నిర్వహణలో సహాయపడుతుంది. దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది., ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.అలాగే ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడేలా చేసి కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందేలా చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఫైబర్ అధికంగా ఉంటుంది, సంతృప్తిని ప్రోత్సహించి, బరువుని అదుపులో ఉంచుతుంది. దాంతోపాటు కాలేయ పనితీరుకు మద్దతు ఇచ్చి..శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చప్పట్లు కొడితే శబ్దం ఎందుకొస్తుందో తెలుసా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
చప్పట్లు కొడితే శబ్దం ఎందుకొస్తుందో తెలుసా..?
చప్పట్లు కొట్టినప్పుడు శబ్దం ఎందుకొస్తుంది అని ఆలోచించారా ఎప్పుడైనా..?. వాట్ ఇదేం కామెడీ ప్రశ్న అనుకోకండి. ఎందుకంటే చప్పట్లు కొడితే శబ్దం ఆటోమేటిగ్గా రాకుండా ఉండదు కదా అని చెప్పేయొద్దు. చూడటానికి గమ్మత్తుగా అనిపించే ఈ చిన్న విషయాన్ని కనుగొంటే.. శబ్దం ఎలా జనిస్తుందో అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరికినట్లువుతుంది. రెండు గట్టిపదార్థాలను ఒకదానికొకటి తాకిస్తే శబ్దం వస్తుది. అదే ప్లాస్టిక్, చెక్క వంటి వాటి నుంచి రాదుగా. మరీ రక్తం, కండరాలతో నిర్మితమైన చేతుల నుంచి ఎలా వచ్చేస్తోందన్న సందేహం కొందరి శాస్త్రవేత్తల బుర్రలను తొలిచింది. దాని పర్యవసానంగా..అవాక్కయ్యే విషయం వెలుగులోకి వచ్చిందిఇన్నాళ్లుగా మనమంతా అనుకున్నట్లుగా..రెండు చేతుల దగ్గరకు చరచడం వల్ల కానేకాదట. ఒక చిన్న స్థలంలో గాలి కుదించబడి బయటకు నెట్టడం వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. కుదించబడిన గాలి హెల్మ్హోల్ట్జ్ రెసొనేటర్ లాగా ప్రవర్తిస్తుందట. అందుకు ఉదాహరణే బాటిల్ గుండా గాలిని ఊదితే వచ్చే శబ్దమేనని వివరించారు. అరచేతులు ఒక కుహరాన్ని సృష్టిస్తాయి. అంటే ఒక చిన్న స్వరంగం మాదిరి అన్నమాట. ఇక్కడ బొటన వేలు, చూపుడు వేలు కారణంగా కుదించబడిన కుహరంలా(చిన్న బాటిల్ మూతిలా) ఏర్పడుతుందట. సరిగ్గా గాలి ఆ కుహరం నుంచే బయటకు నెట్టబడటంతో ధ్వని తరంగాలను సృష్టిస్తుందట. దాంతో టప టప అని సౌండ్ ఉత్ఫన్నమవుతుందని చెప్పుకొచ్చారు. చప్పట్ల వేగాన్ని అనుసరించే వచ్చే శబ్దాలపై అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైందని అన్నారు. అలాగే ప్రతి వ్యక్తి చప్పట్లు కుహరం ఆకారం, చర్మ స్థితిస్థాకత వంటి వాటిని బట్టి వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఉంటుందని.. ఏ ఒక్కరిది ఒకేలా ఉండదని తేల్చి చెప్పారు. ఇది మనకు మనషుల గుర్తింపులో ఉపయోగపడే మరో కొత్త అంశమని చెప్పుకొచ్చారు కార్నెల్ అండ్ మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ అధ్యయనం ఫిజికల్ రివ్యూ జర్నల్లో ప్రచురితమైంది. (చదవండి: Kerala Teacher: ఆ మాస్టార్ అంకితభావానికి మాటల్లేవ్ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..) -
ఘనంగా 'తెలంగాణ కథలు'ను ప్రారంభించిన ఓనమాలు..!
ప్రాంతీయ పాక వారసత్వం, సాంస్కృతిక వారసత్వాన్ని ఉత్సవంగా జరుపుకోవాలనే ఆశయంతో తెలంగాణ కథలు’ను ఘనంగా ప్రారంభించింది ’ఓనమాలు‘. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)కి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం, తెలంగాణ ప్రాంత వంటకాలు, కళలు, కథలను పండుగలా నిర్వహించింది. చిత్రనిర్మాతలు, కవులు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు , ఆహార ప్రియులను ఒకచోటకు చేర్చి, వారికి అద్భుతమైన అనుభవాన్ని అందించింది అనడంలో సందేహం లేదు.ఈ వేడుకలో కరీంనగర్ మహిళలు తయారుచేసిన సర్వపిండి, బక్షాలు, జొన్న రొట్టె, కామారెడ్డి నుంచి మక్క పేలాలు, వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు స్థానికంగా లభించే పండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి గోండులు, మహువా సమాజానికిచెందిన గుస్సాడి నృత్యం సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఈ వేడుకకు ఉత్సాహభరితమైన ప్రాంతీయ సౌరభాలను సమరకూర్చాయి. “తెలుగును ఒకమాటలో వర్ణించలేం. ఒకే ఒక్క సాధారణ స్వరంలో చెప్పలేం. ఇది వెయ్యి సూక్ష్మ కథలతో, అనేక ఉప-ప్రాంతీయ వైవిధ్యాలతో జమిలిగా అల్లిన కథ. దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, వినడానికి, కనుమరుగవుతున్న వాటిని సంరక్షించడానికి మేము ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, హైదరాబాద్ కోసం సూక్ష్మ-ప్రాంతీయ సంఘాలను నిర్మిస్తున్నాము, ”అని ది క్యులినరీ లాంజ్ CEO , ఓనమాలు ఉద్యమంలో కీలక సూత్రధారి గోపి బైలుప్పల అన్నారు. “ఈసారి, ప్రయాణం ఎప్పుడూ లేనంతగా ఇంటికి దగ్గరగా ఉంది.” అని పేర్కొన్నారు.ఈ ప్రాంతీయ సంఘాలు నెలవారీ మాస్టర్క్లాస్లు, సాంస్కృతిక చర్చలను నిర్వహిస్తాయి, ఔత్సాహికులకు స్థానిక ఆహారం, సాహిత్యం, సంప్రదాయాలను అన్వేషించడానికి ఒక వేదికను అందిస్తాయన్నారు. ఈ దృష్టి కేంద్రీకృత సమాజ కార్యక్రమాల శ్రేణిలో తెలంగాణ కథలు మొదటి అధ్యాయం. ఈ కార్యక్రమంలో అన్విక్షికి పబ్లిషర్స్ వ్యవస్థాపకుడు వెంకట్ సిద్ధా రెడ్డి కూడా పాల్గొన్నారు.ఆయన పాక పునరుజ్జీవనం, సాహిత్య పునరుజ్జీవనం మధ్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు “అన్విక్షికి తెలుగు సాహిత్యాన్ని పునరుద్ధరించే దృక్పథంతో స్థాపించారు. స్థానిక వ్యాపారాలలో చిన్న స్వయం-సేవ పుస్తక దుకాణాలు, చలనచిత్ర నిర్మాణ కార్యాలయాలలో లైబ్రరీల ద్వారా తాము తమ పరిధిని విస్తరిస్తున్నామని వెంకట్ తెలిపారు. ఈ చొరవ పాఠకుల సంఖ్యను, ఆదాయాన్ని అందిస్తూనే ఆయా ప్రదేశాలకు సాంస్కృతిక విలువను జోడిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం ’బలగం‘తో అవార్డు గెలుచుకున్న దర్శకుడు వేణు యెల్దండి, మరో అవార్డు గ్రహీత, తెలుగు రచయిత పెద్దింటి అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ది క్యులినరీ లాంజ్లో అన్విక్షికి ప్రత్యేక పుస్తకాల షెల్ఫ్ను ప్రారంభించారు.ప్రముఖ విద్యావేత్త, నటీ గీతా భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ అమర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ వంటలను ఆస్వాదించి, నిర్వహకులను అభినందించారు.బలగం డైరెక్టర్ వేణు మాట్లాడుతూ సర్వపిండి, బక్షాలను గురించి ఈతరం పిల్లలకు తెలియదనీ, భవిష్యత్ తరానికి తెలంగాణ పురాతన వంటకాల గురించి తెలియజేయడానికి ఓనమాలు చేస్తున్న ప్రయత్నం గొప్పదనీ ప్రస్తుతించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.ఓనమాలు గురించితెలుగు మాట్లాడే రాష్ట్రాలలోని వైవిధ్యమైన పాక వారసత్వాన్ని సంరక్షించడం, డాక్యుమెంట్ చేయడం, వాటిని ముందుతరాలకు అందించే లక్ష్యంతో 2024లో లాంచ్ అయింది ’ఓనమాలు‘ అనే కమ్యూనిటీ ఇనీషియేటివ్. సూక్ష్మ వంటకాలను అన్వేషించడం, పురాతన వంటకాలను పునరుద్ధరించడం, పరిశోధన, వాటి గురించి సవివరంగా చెప్పడం, ఆచరణాత్మక అనుభవాల ద్వారా కమ్యూనిటీలను నిమగ్నం చేయడమే ఓనమాలు లక్ష్యం. డాక్టర్ ఎ.వి. గురవా రెడ్డి KIMS-SUNSHINE హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ (ITEC), పరిశ్రమలు అండ్ వాణిజ్య విభాగాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణలో సీనియర్ IAS అధికారి జయేష్ రంజన్ ’ఓనమాలు‘ను ప్రారంభించారు. గత సంవత్సరంలో ఓనమాలు 27,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, పెద్దలు, రైతులు, గృహ వంటవారు. ఇతర నిపుణులను కలిసి, కనుమరుగవుతున్న రుచులను, మరచిపోయిన పాక పద్ధతులను తిరిగి గుర్తించారు. ఈ వేదిక ఫ్లూట్ రిసిటల్స్, పాక థియేటర్ ప్రదర్శనలు, సాంప్రదాయ రుచికరమైన వంటకాలను అందించే లైవ్ ఫుడ్ స్టేషన్ల నిర్వహణతో రుచి, సంప్రదాయం ద్వారా తరాల అంతరాలను తగ్గిస్తోంది. తెలుగు పాక పరి జ్ఞానాన్ని సంరక్షించి, గర్వంగా అందించేలా వంట మ్యూజియంను స్థాపించడం, ట్రైనింగ్ వర్క్షాప్లను నిర్వహించడంతోపాటు, గృహిణులు, చెఫ్లు, ఆహార చరిత్రకారులు, సాంస్కృతిక నిపుణులతో సహకారాన్ని పెంపొందించడం అనేవి ఓనమాలు భవిష్యత్ ప్రణాళికలు.(చదవండి: Kerala Teacher: ఆ మాస్టార్ అంకితభావానికి మాటల్లేవ్ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..) -
పదహారేళ్ల పడుచు పిల్లలా 85 ఏళ్ల బామ్మ..!
బాలీవుడ్లో ప్రఖ్యాత నటి, నాట్యకళాకారిణిగా ఒక ప్రత్యేక గుర్తింపుని కలిగి ఉన్న హీరోయిన హెలెన్. 80లలో ప్రసిద్ధ ఐకానిక్ పాటల్లో నర్తించి ప్రేకక్షకులను మంత్రముగ్దులను చేసేది. ఇప్పటికి ఆ పాటలు చెవిన పడగానే..నాటి కుర్రకారుని ఉర్రూతలూగించిన అందాల నటి హెలెన్ కళ్లముందు కదలాడుతుంది. అంతలా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుందామే. ఇప్పుడామె ఎనిమిది పదుల వయసుకి చేరుకుని బామ్మలా ఉన్నా కూడా..అంతే జోష్ హుషారుతో ఉంటారామె. అచ్చం 85 ఏళ్ల అమ్మాయి అనేలా ఉంటుంది ఆమె ఉత్సాహం చూస్తే. కాలక్రమేణ వచ్చే వృద్ధాప్యానికి చెక్పెట్టి..యవ్వనంగా బతకడం ఎలా అనేందుకు ఆమెనే ఓ ఉదాహరణ. మరి అంతలా ఆమె ఎవర్గ్రీన్ ఎనర్జీ వెనకున్న ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా నటి హెలెన్కి సంబంధించిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దాంతో ఒక్కసారిగా హెలెన్ మరింత ఫేమస్ అయ్యిపోయారు. ఆ ఏజ్లో కూడా ఇంత ఎనర్జీనా అని నెటిజన్లు విస్తుపోతున్నారు. 85 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా చెంగుచెంగుమని తిరుగుతున్న ఆమె యాక్టివిటీని చూసి.. వృద్ధాప్యం చిన్నబుచ్చికుని దూరంగా వెళ్లిపోయాందా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో ..నటి హెలెన్ తనను తాను పరిచయం చేసుకుంటూ..బలంగా, చరుగ్గా ఉండాలంటే పైలేట్స్ వ్యాయామాలు మన దినచర్యలో భాగం కావాలని చెబుతున్నట్లు కనిపిస్తుంది. తాను 85 ఏళ్ల అమ్మాయినే బామ్మను మాత్రం కాను అని నవ్వుతూ చెబుతున్నారామె. ఇప్పుడు కూడా మీరు ఈ కఠినతరమైన పైలేట్స్ వ్యాయామాలు చేస్తారా అని ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ ప్రశ్నించగా..ఓ చేద్దాం అని నటి హెలెన్ అన్నారు. వెంటనే పైలేట్స్ బాల్ మీద పడుకుని..శ్వాసను సమన్వయం చేస్తూ వ్యాయామాలు ఈజీగా చేశారామె. అలాగే ఎవరి సాయం లేకుండా ఈజీగా లేవడం, నిలబడటం వంటివి చేయగలరు. ఆఖరికి స్టెప్స్పై కూడా చకచక నడిచేస్తారామె. అంతేగాదు హాయిగా జంపింగ్, రన్నింగ్ కూడా చేస్తారామె. తన ఈ ఉత్సాహానికి కారణం పైలేట్స్ తన దినచర్యలో భాగమవ్వడమేనని అన్నారు. అంతేగాదు ఆ వీడియో చివరలో ఓ మై డార్లింగ్ అనే పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం హైలెట్గా నిలిచింది. ఆమె వృద్ధాప్యాన్ని ఆరోగ్యకరంగా నిర్వచించడానికి స్ఫూర్తిగా నిలిచారు . View this post on Instagram A post shared by We The Women Asia (@wethewomenasia) వృద్ధులు తప్పకుండా చేయాల్సిన పైలేట్స్ వ్యాయామాలు..సింగిల్ లెగ్ పుల్ అండ్ డబుల్ లెగ్ పుల్ - ఈ వ్యాయామాలు కోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. శరీరం సమతుల్యత, స్థిరత్వానికి చాలా అవసరం.సైడ్-లైయింగ్ సిరీస్ - ఇది మన కదలికలను మెరుగుపరుస్తుందిమోడిఫైడ్ ప్లాంక్ - కీళ్లపై ఒత్తిడి పెట్టకుండా బలాన్ని పెంచుతుంది.వాల్ పైలేట్స్ - ఈ వ్యాయామాలను గోడ సాయంతో చేయవచ్చు.తొడ మడతలు - ఈ వ్యాయామాన్ని కుర్చీ సహాయంతో చేయవచ్చు . పైగా వృద్ధులు ఈజీగా నడిచేందుకు హెల్ప్ అయ్యే మంచి వ్యాయామం ఇది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఇలాంటి వ్యాయామాలు చేసే ముందు ఫిట్నెస్ నిపుణుల సలహాలు, సూచనలతో చేయడం ఉత్తమం.(చదవండి: వందేళ్ల అందాల బామ్మ..మేకప్ పాఠాలు! క్యూకడుతున్న ప్రసిద్ధ బ్రాండ్లు) -
ఈ రోజు క్రియేటివ్ థియేటర్ ప్రదర్శన ..!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, క్రియేటివ్ థియేటర్, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో సోమవారం సాయంత్రం 6:45 గంటలకు ‘గొల్ల రామవ్వ’ నాటికను ప్రదర్శించనున్నారు. ఈ నాటికకు మూలకథ స్వర్గీయ భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాసిన ప్రసిద్ధ కథ ‘గొల్ల రామవ్వ’. గ్రామీణ నేపథ్య జీవితాల విశిష్టతను ప్రతిబింబించేఈ కథను నాటికగా మలచి ప్రదర్శిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి వేదికగా ఈ కార్యక్రమం జరుగనుంది. క్రియేటివ్ థియేటర్ వ్యవస్థాపకులు అజయ్ మంకెనపల్లి ఆధ్వర్యంలో దీనిని ప్రదర్శించనున్నారు. నాటకరంగ అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ విలక్షణ నాటికను ఆస్వాదించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ నాటికలో తమ సంస్థ నుంచి పలువురు యువ థియేటర్ ఆరి్టస్టులు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: క్రేజ్ ఫుల్.. బోబా బబుల్ టీ..! స్పెషాల్టీ ఇదే..) -
క్రేజ్ ఫుల్.. బోబా బబుల్ టీ..! స్పెషాల్టీ ఇదే..
ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకట్టుకుంటున్న తాజా డ్రింక్ సంచలనం.. బోబా టీ, లేదా బబుల్ టీ. తైవాన్లో పుట్టిన ఈ పానీయం ఇప్పుడు భాగ్యనగరంలోనూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. ఇటీవల బోబా టీ షాప్స్ ముంబయి, బెంగళూరు వంటి నగరాలతో పాటు హైదరాబాద్ వంటి నగరంలోనూ పెరుగుతున్నాయి. కాలేజీ యువత, వర్కింగ్ ప్రొఫెషనల్స్ దీనిని చల్లదనాన్నిచ్చే ఆహ్లాదకరమైన డ్రింక్గా ఎంజాయ్ చేస్తున్నారు. బోబా టీ అనేది టీ ఆధారిత పానీయం. అదే దీనికి ప్రత్యేకతను చేకూర్చే అంశం. టాపియోకా పెరల్స్ లేదా బోబా బాల్స్. ఇవి చిన్న గోళాకార బంతుల్లా ఉంటాయి. తీపిగా, కొద్దిగా చిక్కదనం ఉండే ఈ బంతులు టీతో కలిసినపుడు ఒక వినూత్న రుచిని జత చేస్తాయి. బోబా టీ కూడా బ్లాక్ టీ, గ్రీన్ టీ లేదా మిల్క్ టీ తరహాలోనూ వినియోగించవచ్చు. లేదా దీనికి పండ్ల ఫ్లేవర్స్, సిరప్లు, పాలు లేదా క్రీమ్లను కూడా కలుపుతారు. బోబా టీలో భాగంగా టాపియోకా బాల్స్ కాకుండా జెల్లీ, ఫ్రూట్ బిట్స్ వంటి వేరే రకాల టాపింగ్స్ కూడా వినియోగిస్తారు. ఎన్నెన్నో.. వెరై‘టీ’లు బోబా టీ వివిధ రుచుల్లో మ్యాంగో, స్ట్రాబెర్రీ, చెరకు, కొబ్బరి వంటి అనేక ఫ్లేవర్లలో లభ్యమవుతోంది. ప్రత్యేకమైన టేక్–అవే గ్లాస్లు, స్టైలిష్ స్ట్రా, బాల్స్ వల్ల యువత ఈ పానీయం పట్ల అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆకట్టుకునే కలర్ కాంబినేషన్లు, ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్ వల్ల బోబా టీ ఇన్స్టా, ఇతర సామాజిక మాధ్యమాల్లో రీల్స్ల ద్వారా బాగా పాపులర్ అయిపోయింది. పోషక విలువలు.. కాసావా స్టార్చ్ లేదా సముద్రపు పాచి సారం నుండి తయారు చేసిన ఈ ముత్యాలు సహజంగా గ్లూటెన్ రహితమైనవి. పైగా పూర్తి శాకాహారం. కాసావా అనేది విటమిన్ ‘సి’ మంచి మూలం. ఇది వాపును తగ్గించే, కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇచ్చే యాంటీఆక్సిడెంట్. దీంతోపాటు ఫైబర్, విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తుంది. ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాదు నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ మెరుగుదలకు సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం సంగతేం ‘టీ’.. బోబా టీ కాస్త అధికంగా తీపి పదార్థాలతో కూడినందున దీనిని అప్రమత్తంగా వినియోగించాలి. ఎందుకంటే దీనిలో అధిక క్యాలరీలు ఉంటాయి. అయితే కొంతమంది టాపియోకా బాల్స్ను, చక్కెరను తగ్గించి ఆరోగ్యకరమైన రీతిలో కూడా తయారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా, నగరంలోనూ ఉన్న ప్రముఖ కేఫ్ చైన్ యమ్మీ బీ, బోబా టీకి కొత్త వెర్షన్ను తాజాగా మార్కెట్లోకి తెచ్చింది. ఆరోగ్యాభిలాషులను దృష్టిలో పెట్టుకుని షుగర్–ఫ్రీ బోబా టీని ఆన్లైన్ ద్వారా అందిస్తోంది. మ్యాంగో బోబా టీ, థాయ్ బోబా టీ, మాచా బోబా టీ.. వంటి పేర్లతో ఈ బోబా/బబుల్ టీ నగర ఆహార ప్రియుల అభి‘రుచుల్లో’ ఒకటిగా మారింది. (చదవండి: ఈ సండే వెరైటీగా విదేశీ వంటకాలు ట్రై చేయండిలా..) -
ఛత్రపతి విజయ విహారం..! ఆరో రోజుల టూర్..
ఈ టూర్లో గిరిదుర్గాలే ప్రధానం. ఛత్రపతి శివాజీ శౌర్యానికి ప్రతీకలు. తిరుమల కొండలంత ఎత్తులో ఉన్నాయి. ఇక... ఓ వనాలయం... మరో నగరాలయం. అవి... దట్టమైన వనాల్లో విస్తరించిన జ్యోతిర్లింగం.మరోటి... ప్రాచీన నగరంలో విలసిల్లిన లక్ష్మీదేవి ఆలయం.1వ రోజుఉదయం ఆరున్నరకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, దాదర్, థానేలలో ఎక్కడైనా రైలెక్కవచ్చు. రైలు రాయగఢ్ వైపు సాగుతుంది. రైల్లో బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. పదిన్నరకు రైలు మాన్గోవ్ స్టేషన్కు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన రాయగఢ్ కోటకు చేరాలి. మధ్యాహ్న భోజనం ఎక్కడ అనేది సమయాన్ని బట్టి నిర్ధారిస్తారు. రాయగఢ్ పర్యటన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు మాన్గోవ్ స్టేషన్కు వచ్చి రైలెక్కాలి. రైలు ఆరు గంటలకు పూనే వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే. పది గంటలకు రైలు పూనేకు చేరుతుంది. హోటల్కు చేరడం, పూనేలో రాత్రి బస.పట్టాభిషేక దుర్గంరాయిగఢ్ కోట ఉన్న పట్టణం పేరు మహద్. మహారాష్ట్ర, రాయగఢ్ జిల్లాలో ఉంది. ఇది మహాదుర్గం. సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని ఈ కొండమీదకు చేరడానికి రోప్వే, ఏరియల్ ట్రామ్వే ఉన్నాయి. కోట లోపల శివాజీ సింహాసనం, పట్టాభిషేకం జరిగిన ప్రదేశం, చెక్కతో నిర్మించిన రాణి ప్యాలెస్, శివాజీ తల్లి జిజాబాయి సమాధి, శివాజీ సమాధి ఉన్నాయి. కోటగోడలు, దర్వాజాల మీదకు అల్లుకున్న పిచ్చి చెట్లుతీగలనుచూస్తే ఈ కోట పరిరక్షణ పట్ల ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని తెలుస్తుంది. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి బాధ్యత అప్పగించడంతో పునరుద్ధరణ చర్యలు జరుగుతున్నాయి. ఈ కోట మీద నుంచి చూస్తే చుట్టూ ప్రకృతి సౌందర్యం అంతా దండగా అల్లి అమర్చినట్లుంటుంది. ఇది ఒక ఫీల్గుడ్ టూరిస్ట్ డెస్టినేషన్.2వ రోజుహోటల్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత పూనాలోని లాల్ మహల్, కాస్బా గణపతి ఆలయాల సందర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత శివ్శ్రుతి వీక్షణం. రాత్రి భోజనం తర్వాత హోటల్ గదికి చేరడం. ఆ రాత్రి బస కూడా పూనేలోనే.లాల్ మహల్ అంటే శివాజీ బాల్యం గడిచిన ΄్యాలెస్. శివాజీ తండ్రి షాహాజీ భోసాలే తన కొడుకు, భార్య కోసం కట్టించిన ప్యాలెస్ ఇది. నిజానికి షాహాజీ కట్టించిన నిర్మాణం నిర్వహణ సరిలేక శిథిలమైంది. ఇప్పుడు కనిపిస్తున్న ప్యాలెస్ అదే నమూనాలో చేసిన పునర్నిర్మాణం. ఇక నగరంలో చూడాల్సిన మరో ప్రదేశం కాస్బా గణపతి. ఇది శివాజీ తల్లి రాజమాత జిజాబాయి ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం. పూనే వాసులు గ్రామదేవతగా కొలుస్తారు. ఈఈ గణపతికి ఉన్న చారిత్రక ప్రత్యేకత ఏమిటంటే జాతీయోద్యమంలో భాగంగా బాలగంగాధర తిలక్ సామూహిక గణపతి ఉత్సవాలు మొదలు పెట్టింది ఈ ఆలయంలోనే. ప్రజలను ఒక చోటకు చేర్చడానికి, వారిని జాతీయోద్యమ బాట పట్టించడానికి ఈ ధార్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు తిలక్. 3వ రోజుశివనేరి కోట సందర్శనకు ఉదయాన్నే ఆరు గంటలకు టీ తాగిన తర్వాత హోటల్ నుంచి బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ ΄్యాక్ చేసి ఇస్తారు. పూనే నుంచి శివనేరి కోటకు రెండు గంటల ప్రయాణం. మధ్యాహ్న భోజనం తర్వాత భీమశంకర్ దర్శనానికి వెళ్లాలి. ఈ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత పూనేకి వచ్చి రాత్రికి హోటల్లో బస చేయాలి.మరాఠా రాజ్యం పుట్టింది!శివ్నేరి కోట ఛత్రపతి శివాజీ పుట్టిన ప్రదేశం. మరాఠా రాజ్య నిర్మాత పుట్టిన నేల అంటే మరాఠా రాజ్యం పుట్టిన నేల కూడా. శివాజీ తాత మాలోజీ భోసాలే నివసించిన కోట ఇది. బహమనీ సుల్తానులు, మొఘలులు, బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధాలకు కేంద్ర బిందువు కూడా. ఈ కోట లోపల గంగ, యమున పేరుతో రెండు నీటి గుండాలున్నాయి. ఏడాది పొడవునా వీటిలో నీరు ఉంటుంది. ఈ కోట పై అంతస్థు నుంచి చూస్తే నారాయణగఢ్, హద్సార్, చావాంద్, నీమ్గిరి కోటలు కనిపిస్తాయి. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉండడంతో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఈ కోటను వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. శివ్నేరి కోట నుంచి 70 కిమీల దూరంలో ఉంది భీమశంకర్. చిక్కటి పచ్చదనంతో విస్తరించిన సహ్యాద్రి శ్రేణుల్లో ఉంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవ జ్యోతిర్లింగ క్షేత్రం. మహారాష్ట్రలో భీమనది తీరాన ఉంది. 4వ రోజుఉదయం పూనేలో హోటల్ గది చెక్ అవుట్ చేసి రైలెక్కాలి. ఏడు గంటలకు రైలు బయలు దేరుతుంది. బ్రేక్ఫాస్ట్ రైల్లో ఇస్తారు. రైలు పది గంటలకు సతారా స్టేషన్కు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన ప్రతాప్గఢ్ కోటకు వెళ్లాలి. మధ్యాహ్న భోజనం, కోట సందర్శనం, రాత్రి భోజనం తర్వాత పదిన్నరకు రైలెక్కాలి. పదకొండున్నరకు రైలు కొల్హాపూర్ వైపు బయలుదేరుతుంది.మరాఠ విజయంమరాఠా సామ్రాజ్య స్థాపనలో కీలకమైన కోట ప్రజాప్గఢ్. మరాఠా సామ్రాజ్యాధినేత శివాజీకి బహమనీ సుల్తాన్ అజమ్ఖాన్కు మధ్య జరిగిన భీకర యుద్ధంలో శివాజీ గెలిచాడు. శివాజీ కొలిచిన తుల్జా భవానీ మాత ఆలయం ఈ కోటలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కోట అందమైన ప్రకృతి సౌందర్యవీక్షణానికి వేదిక కూడా. 5వ రోజుతెల్లవారు జామున ఐదు గంలకు రైలు కొల్హాపూర్లోని షాహూ మహారాజ్ టెర్మినస్కు చేరుతుంది. రైలు దిగి హోటల్కు వెళ్లి రిఫ్రెష్ అయిన తర్వాత కొల్హాపూర్లోని మహాలక్ష్మి ఆలయ దర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత పన్హాల ఫోర్ట్ సందర్శనం. ఆ తర్వాత కొల్హాపూర్లోని రైల్వేస్టేషన్కు వచ్చి రైలెక్కాలి. రైలు రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి ముంబయి వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే.కొల్హాపూర్ మహారాష్ట్ర కాశీభారతీయులు జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలని కోరుకునే ప్రదేశం కొల్హాపూర్. ఇక్కడి లక్ష్మీదేవిని దర్శించుకోవడానికి ఉత్తర– దక్షిణ భారతాల వాళ్లు వస్తారు. ఈ ఆలయ నిర్మాణం గురించి కూడా విశేషంగా చెప్పుకోవాలి. దక్షిణాది ఆలయాల్లాగ విగ్రహాల సుమహారంగా ఉండదు. ఉత్తరాది నిర్మాణాల్లాగానూ ఉండదు. స్థూలంగా నిర్మాణం రెండింటి కలయికగా ఉంటుంది. సునిశితంగా శిల్పనైపుణ్యాన్ని గమనిస్తే జామెట్రికల్ డిజైన్స్తో ఆచ్చెరువు కలిగిస్తుంది. దక్షిణ కాశిగా చెప్పుకుంటారు. పెద్ద పట్టణం, మరాఠీ సినిమా పరిశ్రమ కేంద్రం. ఈ పర్యటనలో కొల్హాపూర్ లక్ష్మీదేవి దర్శనం తర్వాత న్యూ ప్యాలెస్ వీక్షణం. ఆ తర్వాత కొల్హాపురి చెప్పులు ఒక జత కొనుక్కోవడం మర్చి΄ోవద్దు. ఎందుకంటే పనితనం రీత్యా వీటికి జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ కూడా వచ్చింది.పన్హల ఫోర్ట్శివాజీ ఈ కోటను బీజాపూర్ సుల్తానులతో యుద్ధం చేసి సాధించాడు. ఆ తర్వాత మరికొన్ని నిర్మాణాలు చేశాడు. శివాజీ వారసులు ఈ కోట నుంచి మొఘల్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో యుద్ధాలు చేశారు. ఈ కోట నిర్మాణపరంగా పెద్దది కాదు, కానీ మరాఠాల పాలన ముందుచూపుకు నిదర్శనం. కోట లోపల ధాన్యాగారం ఉంది. అందులో నిల్వ చేసిన ధాన్యం కోట లోపల ఉన్న వారికి మాత్రమే కాదు, రాజ్యంలో కరువు సంభవిస్తే ప్రజల ఆకలి తీర్చడానికి ఒక ఏడాదికి సరిపడినంత ధాన్యాన్ని నిల్వ చేసేవారు. కోట లోపల ఒక దిగుడు బావి ఉంది. స్టెప్వెల్లు గుజరాత్లో ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీలోనూ ఉన్నాయి. హైదరాబాద్లోనూ ఉంది. తెలంగాణ జిల్లాల్లో కూడా ఉండేవి. ఆర్కియలాజికల్ సర్వే విభాగం తవ్వకాల్లో ఇటీవల కొన్ని స్టెప్వెల్లు బయటపడ్డాయి. భారతీయ శాస్త్రీయత నిర్మాణాలకు ఇవి తార్కాణాలు. 6వ రోజుఉదయం ఆరు గంటలకు రైలు ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది. దాదర్, థానేల్లో కూడా దిగవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సర్క్యూట్ ప్రతాప్గఢ్... ఇది ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్న ఆరు రోజుల టూర్ ప్యాకేజ్. జూన్ 9వ తేదీన మొదలవుతుంది. ముంబయిలో మొదలయ్యే ఈ టూర్లో రాయగఢ్ ఫోర్ట్, పూనే, శివనేరీ ఫోర్ట్, భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం, ప్రతాప్గఢ్ ఫోర్ట్, కొల్హాపూర్, పన్హలా ఫోర్ట్ కవర్ అవుతాయి.కొంకణ్ రైల్వేస్ ట్రైన్ ముంబయిలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి టూర్ మొదలవుతుంది. మాన్గోవ్, పూనే, సతారా, ఛత్రపతి షాహూ మహారాజ్ టెర్మినస్ కొల్హాపూర్ మీదుగా తిరిగి ముంబయికి చేరుతుంది.టికెట్ ధరలు స్లీపర్ క్లాస్ (ఎకానమీ)లో ఒకరికి 13,155 రూపాయలు, ధర్డ్ ఏసీ (కంఫర్ట్)లో దాదాపుగా 20వేలు, సెకండ్ ఏసీ (సుపీరియర్)లో 27 వేలకు పైగా అవుతుంది. రాత్రి బసకు ఎకానమీ క్లాస్కు నాన్ ఏసీ గదులు డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్లో ఇస్తారు. రైలు దిగిన తరవాత రోడ్డు ప్రయాణానికి నాన్ ఏసీ వాహనంలో ప్రయాణం. కంఫర్ట్, సుపీరియర్ ΄్యాకేజ్లో బస ఏసీ గదుల్లో. ఒక్కరుగా బుక్ చేసుకున్న వారు ఇతర ప్రయాణికులతో రూమ్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి ఏసీ వాహనాలు. ప్యాకేజ్లో చెప్పిన టికెట్ ధరలకు ట్యాక్స్ అదనం. ప్యాకేజ్లో ట్రావెల్ ఇన్సూ్యరెన్స్, సెక్యూరిటీ ఉంటుంది. భోజనం శాకాహారం ఇస్తారు. పర్యాటక ప్రదేశాల్లో బోటింగ్ వంటి ఎంటర్టైన్మెంట్ ఖర్చులు ప్యాకేజ్లో వర్తించవు.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: Krishna's Butterball: కృష్ణుడి వెన్నబంతి: సైన్స్కే అందని మిస్టరీ..!) -
కీలు మారాక 'ఫీల్ ఎలా ఉంది'?
చాలా ఏళ్ల కిందట ఇటీవల మోకాలి దగ్గర ఉన్న కీళ్లు అరిగితే... తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు. పాత నొప్పులంటూ చెబుతూ జీవితాంతం బాధపడేవారు. కదలడానికి కూడా కష్టపడుతూ, నడవడానికి నానా యాతన పడుతూ జీవితాన్ని వెళ్లబుచ్చేవారు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చాలా వేగంగా ప్రాచుర్యం పొందడంతో ఈ శస్త్రచికిత్సలు చేయించుకునేవారు ఎక్కువగా ఉంటున్నారు. నిజానికి మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఒక ఎత్తైతే... ఆ తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలూ, సూచనలూ మరో ఎత్తు. వీటిని ఎంత సమర్థంగా అమలు చేస్తే... నడక అంత వేగంగానూ అంత మెరుగ్గానూ జరుగుతుంది. మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, పాటించాల్సిన సూచనలపై అవగాహన కోసం ఈ కథనం.మోకాలి కీళ్ల మార్పిడి చికిత్సలో భాగంగా డాక్టర్లు సాధారణంగా బాధితులకు రెండు రకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. మొదటిది పూర్తి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (కంప్లీట్ నీ– రీప్లేస్మెంట్ సర్జరీ), రెండోది... పాక్షిక మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (పార్షియల్ నీ – రీప్లేస్మెంట్ సర్జరీ). వీటిల్లో పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో కోలుకోవడం అన్నది చాలా త్వరితంగా... అంటే రెండు నుంచి నాలుగు వారాల్లో జరుగుతుంది. అదే పూర్తి మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకోడానికి నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధి అవసరం. బాధితుల అవసరాన్ని బట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని డాక్టర్లు సూచిస్తారు. ఈ రెండింటి ప్రభావాలూ, మన్నిక ఒకేలా ఉంటాయి. పోలికలు వద్దు... పైన పేర్కొన్న కాల వ్యవధులను చాలామంది వ్యక్తులను పరిశీలించి... ఓ సగటు సమయాన్ని పేర్కొనడం కోసం చెప్పేవి మాత్రమే. వారి వారి శరీర తత్త్వాన్ని బట్టీ, అలాగే రోగనిరోధక వ్యవస్థ తాలూకు చురుకుదనం, వారి సాధారణం ఆరోగ్యం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలూ వీటన్నింటి ఆధారంగా కోలుకునే సమయం ఒకరి నుంచి మరొకరికి మారవచ్చు. శస్త్రచికిత్స తర్వాత నొప్పి వస్తుండే వ్యవధి కూడా ఒకరి నుంచి మరొకరికి వేరుగా ఉండవచ్చు. అందుకే మోకాలి కీలు మార్పిడి జరిగిన ఇతర వ్యక్తులతో ΄ోల్చుకోవడం సరికాదు. దీనివల్ల మానసిక ఆందోళన పెరగడం, దాంతో వ్యాధి నిరోధక వ్యవస్థ మందగించడం వల్ల గాయం తగ్గడానికి పట్టే సమయం పెరగవచ్చు. అందుకే మరొకరితో ΄ోల్చుకోవడం ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దు. శస్త్రచికిత్సకు ముందున్న స్టిఫ్నెస్ : శస్త్రచికిత్సకు ముందు మోకాలి దగ్గర కదలికలు చాలా పరిమితంగా మాత్రమే ఉన్నవారికి ఆ తర్వాత కదలికలు పెరుగుతాయి. అయితే మునుపు అంతగా స్టిఫ్గా లేనివారితో పోలిస్తే ఇలా స్టిఫ్గా ఉన్నవారిలో కదలికలు అంతగా పెరగకపోవచ్చు. నొప్పి తీవ్రత ఎక్కువ తక్కువలు : నొప్పి తక్కువగా ఉన్నవారు ఫిజియో వ్యాయామాలను సమర్థంగా చేయగలుగుతారు అందుకే వారిలో మెరుగదల గణనీయంగా ఉండవచ్చు. నొప్పి విపరీతంగా ఉన్నవారిలోనూ, వ్యాయామల సమయంలో నొప్పిని అంతగా భరించలేనివారిలో వ్యాయామాలు అంత ఎక్కువగా లేకపోవడం వల్ల పూర్తిస్థాయి నార్మల్ కదలికలు రాకుండా కేవలం పరిమితంగా మాత్రమే మెరుగుదల కనిపించవచ్చు. ఇలా నొప్పి ఎక్కువగా ఉండేవారు దాన్ని భరించాల్సిన అవసరం లేదు. డాక్టర్ను సంప్రదించి నొప్పి వాళ్ల ఆధ్వర్యంలో నివారణ మందులు వాడుతూ వ్యాయామాలు చేస్తూ తాము కోరుకున్న స్థాయి మెరుగుదలను పొందవచ్చు.మెరుగుదల ఆధారపడే అంశాలివే... శస్త్రచికిత్స తర్వాత కాలి కదలికలు మామూలుగా మారడం లేదా మోకాలి దగ్గర నార్మల్గా ఉండటం అన్నవి కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో ప్రధానమైనవి... శస్త్రచికిత్సలో ఏ టెక్నిక్ వాడారనే అంశం : శస్త్రచికిత్సలో ఏ తరహా టెక్నిక్ వాడారనే అంశంతో పాటు శస్త్రచికిత్స సమయంలోనే లోపల ఉన్న అవరోధాలనూ, వైకల్యాలను, ఇతరత్రా సమస్యలను ఏ మేరకు రిపేర్ చేశారనే అంశాలపై కూడా శస్త్రచికిత్స తర్వాతి మెరుగుదల ఆధారపడి ఉంటుంది. కృత్రిమ మోకాలు తాలూకు డిజైన్ : కృత్రిమంగా లోపల అమర్చే భాగాన్ని ప్రోస్థెసిస్’ అంటారు. ఈ ప్రోస్థెటిక్ డిజైన్ను బట్టి కూడా మెరుగుదల ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న డిజైన్లు మోకాలి కీళ్ల దగ్గర కదలికలు ఫుల్ రేంజ్లో చాలా ఎక్కువగా (గరిష్ఠంగా) ఉండేలా డిజైన్ చేసినవి అందుబాటులోకి వస్తున్నాయి.ఈ జాగ్రత్తలు తప్పనిసరి... శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వకపోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. దాని గురించి ఇతర బాధితుల లేదా శస్త్రచికిత్స జరిగినవారితో మీ భావాలు పంచుకోకుండా కేవలం మీ డాక్టర్తో మాట్లాడటమే మంచిది. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతో పాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది.మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత... చేయాల్సినవీ... చేయకూడనివి... మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత గాయం నయం కావడం గానీ లేదా మెరుగుదల గానీ, కృత్రిమ కీలు చాలా రోజులు మన్నికతో ఉండటానికి గానీ పాటించాల్సిన సూచనలలో ప్రధానమైవి...చేయాల్సినవి... బరువు అదుపులో ఉంచుకోవడం (స్థూలకాయం వల్ల కృత్రిమ కీలుపై బరువు పడటం వల్ల మన్నిక తగ్గే అవకాశమున్నందున బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం). కృత్రిమ కీలు వద్ద తగినంత కదలికలూ, కీలుకు అవసరమైన బలం సమకూరడంతో పాటు అది చాలాకాలం మన్నికతో ఉండటం కోసం క్వాడ్రసెప్, హ్యామ్స్ట్రింగ్ కండరాలకు బలం చేకూరే వ్యాయామాలు చేయడం. క్రమం తప్పకుండా ఈత (స్విమ్మింగ్), సైక్లింగ్, నడక (వాకింగ్) వ్యాయామాలు. ఇక్కడ పేర్కొన్న వ్యాయామాల్లో బాధితులకు అనువుగా ఉన్నవాటిని రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఆరు రోజుల పాటు చేస్తుండాలి.చేయకూడనివి... పరుగు (రన్నింగ్), ఆటలాడటం వంటి వ్యాయామాలు వద్దు. దీనివల్ల అమర్చిన కృత్రిమ కీలుపై భారం ఎక్కువగా పడి అక్కడ గాయం రేగవచ్చు. మోకాళ్లు పూర్తిగా ముడుచుకునేలా గుంజీళ్లు తీయడం వంటి వ్యాయామాలూ, అలాగే గొంతుక్కూర్చోవడం, బాసిపట్లు వేసి కూర్చోవడం వద్దు. కృత్రిమ కీలు ప్రోస్థెసిస్)లోని పాలీ ఇథిలీన్ / ప్లాస్టిక్ స్పేసర్ భాగం కొంత సున్నితమైనది. కాబట్టి నడక, కఠిన వ్యాయామాలు, రఫ్గా ఉపయోగించడం వంటి సందర్భాల్లో కొంత విచక్షణ పాటించి జాగ్రత్తగా చూసుకోవడం మేలు.నరాలకు సంబంధించిన సమస్యలుగానీ లేదా నడకలో నొప్పిగాని ఉంటే వాకర్ లేదా వాకింగ్ స్టిక్ వంటి ఉపకరణాల సహాయం తీసుకోవడం మంచిది. చివరగా... కృత్రిమ కీలు కొత్తగా శరీరంలోకి వచ్చి చేరిన భాగమైనందువల్ల మిగతా అవయవాల లాగే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఈలోపు జ్వరం, గాయం దగ్గర తీవ్రమైన నొప్పి రావడం లేదా ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం డాక్టర్ను సంప్రదించాలి. అలాగే చెవి, గొంతు, మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు కనిపించినా వెంటనే డాక్టర్ను కలవాలి. అంతే తప్ప సొంత చికిత్స రూపంలో యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. పైన పేర్కొన్న సూచనలతో కృత్రిమ కీలును దాదాపు 15 నుంచి 20 ఏళ్లు మన్నేలా జాగ్రత్త పడవచ్చు. శస్త్రచికిత్స సమయంలో పెట్టే గాటు వద్ద కొందరికి స్పర్శ తెలియకపోవడం (నంబ్నెస్) లాంటి లక్షణాలు కనిపిస్తే మరికొందరిలో అక్కడ ముట్టుకోనివ్వక΄ోవడం (హైపర్సెన్సిటివిటీ) లాంటి లక్షణం కనిపించవచ్చు. అందుకే బాధితులలో కనిపించే లక్షణం ఏదైనా దాని గురించి ఆందోళన వద్దు. శస్త్రచికిత్స గాయం దగ్గర ఇలా స్పర్శ తెలికుండా ఉన్న కొందరిలో గాటు పెట్టిన భాగం పొడిగా ఉండటంతోపాటు అక్కడ దురద వస్తుండటం జరగవచ్చు. ఇలాంటప్పడు అక్కడ పైపూతగా రాసే మాయిష్చరైజర్ (టాపికల్ మాయిష్చరైజర్) రాయడం మంచిది. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి,సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ఇంటర్ తర్వాత వాట్ నెక్స్ట్..? టెన్షన్ వద్దు..
ఇంటర్మీడియట్ పూర్తవగానే విద్యార్థి జీవితంలో మొదలయ్యే అసలైన టెన్షన్– ‘ఇప్పుడేం చేయాలి?’ పేరెంట్స్, టీచర్స్, బంధువులు, ఫ్రెండ్స్ రకరకాల సలహాలిస్తుంటారు. ‘‘ఇంజినీరింగ్ చెయ్, ఫ్యూచర్ బాగుంటుంది.’’‘‘నీట్ రాయి, ఎంబీబీఎస్ అయిపోతే జీవితం సెట్ అవుతుంది.’’‘‘బీకామ్ తీసుకుని సీఏ చెయ్యి, ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు.’’ఈ సలహాలు విని గుడ్డిగా ఒకదాన్ని ఎంచుకోవడం కాదు. మీకు సరిపోయే దారి కనిపెట్టడమే అసలైన విజయం.మీ మనసేం చెప్తోంది? ఇంటర్ తర్వాత ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదంటే అది మీ తప్పు కాదు. ఎవరూ సరైన ప్రశ్నలు అడగలేదని మాత్రమే. అందుకే మీ మనసేం చెప్తుందో అడగండి. ఇది నిజంగా నా దారేనా? నేను నేనుగా ఉండే దారేది? నాలోని విజేతను వెలికితీసే కోర్సు ఏది? నాలో నిద్రిస్తున్న టాలెంట్ను తట్టి లేపే దిశ ఏది? వీటికి సమాధానం దొరకలేదా, కెరీర్ కౌన్సెలింగ్ మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని మెప్పించే దారి కాకుండా, మీరు గర్వపడే దారిని చూపిస్తుంది. కొత్త దారిలో నడవండి...ఇంటర్ తర్వాత అనేక ప్రవేశపరీక్షలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో జయాపజయాలు మీ జీవితాన్ని నిర్ణయించలేవు. పరీక్షలు ఆటల్లాంటివి. మీ గెలుపు ఆటలో కాకుండా, మీ ఆట మీరే రాసుకున్నప్పుడు వస్తుందని గుర్తించండి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ తీసుకోకుంటే జీవితం వృథా అనే సలహాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి. సంప్రదాయ కోర్సులు కాకుండా, కొత్త దారిలో నడిచేందుకు ధైర్యం చేయండి. బైపీసీ తర్వాత మెడిసిన్ తప్ప మరేం చేసినా వేస్ట్. బైపీసీ తర్వాత మెడిసిన్ ఒక మార్గం మాత్రమే. మెడిసిన్ సీటు రాకుంటే జీవితం ఆగిపోయినట్లేం కాదు. న్యూట్రిషన్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రిటెక్లాంటి రంగాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంపీసీ అంటే బీటెక్, లెక్కలే!ఎంపీసీ తర్వాత ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో సీటు రాకపోతే కొంపలేం మునిగిపోవు. ఆర్కిటెక్చర్, డేటాసైన్స్, డిఫెన్స్ (ఎన్డీఏ), రోబోటిక్స్, ఏఐ వంటి మోడర్న్, ఫ్యూచరిస్టిక్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కామర్స్ అంటే సీఏ తప్ప దారిలేదుకామర్స్ స్ట్రీమ్లో సీఏ ఒక్కటే కాదు. మరెన్నో కోర్సులు, అవకాశాలు ఉన్నాయి. ఫిన్ టెక్, బిజినెస్ అనలిటిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్రాండింగ్, క్రిప్టో స్ట్రాటజీ వంటి అధునాతన కెరీర్స్ ఇప్పుడు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నాయి. ఆర్ట్స్ తీసుకుంటే స్కోప్ ఉండదు.. ఇది ఒక పెద్ద అపోహ. ఏ స్ట్రీమ్ చదువుతున్నామనే దానికంటే అందులో ఏ స్థాయిలో చదువుతున్నామనేది ముఖ్యం. సైకాలజీ, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, మీడియా, కాగ్నిటివ్ సైన్స్ లాంటి సృజనాత్మత, మేధా రంగాలు కొత్త దారులు చూపిస్తున్నాయి. దారి చూపించే మూడు ప్రశ్నలు...ముఖ్యమైన విషయమేమిటంటే, నిజానికి ఇది కోర్సు ఎంచుకునే దశ కాదు. ఇది జీవితాన్ని డిజైన్ చేసుకునే దశ. వందల కోర్సులు ఉన్నా, మీకు సూటయ్యే కోర్సు ఒక్కటే. అది మీకు ప్యాషన్ కలిగించాలి.అది మీకు పర్పస్ నేర్పించాలి.అది మీకు అవకాశాలను తెచ్చిపెట్టాలి.అందుకే ఈ దశలో సమాజం చూపించే మార్గాల కన్నా, మీ లోపల ఉన్న ఓపిక, ఊహ, ఉత్సాహం ఏ దిశ చూపుతుందో వినాలి. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అందుకోసం మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. నాకు నచ్చేది ఏంటి? ఏ పని చేస్తుంటే కాలం తెలియకుండానే గడిచిపోతుంది? అదే మీ ఫ్యాషన్. నాకు బాగా వచ్చేది ఏంటి? ఇంకొకరికి వదలకుండా చేయగలిగే పని ఏది? అదే మీ బలం. నాకు ఎలాంటి జీవితం కావాలి? స్వేచ్ఛా? గౌరవమా? సృజనాత్మకతా? ప్రభావమా? అదే మీ విజన్. ఈ మూడు సమాధానాలు కలిసి మీలోని గందరగోళాన్ని తుడిచేసి స్పష్టమైన వ్యూహంగా మార్చుతాయి. సెల్ఫ్ అండ్ అవేర్నెస్ + స్కిల్ అండ్ మ్యాపింగ్ + ఫ్యూచర్ విజన్= రైట్ కెరీర్. ఈ ఫార్ములాతో నడిస్తే కోర్సు మాత్రమే కాదు, జీవితం మారుతుంది. డిగ్రీ కాకుండా డైరెక్షన్ వస్తుంది. కేవలం ఉద్యోగం కాకుండా ఊపిరిలాంటి పని వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్!సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: జస్ట్ వాడిపడేసిన వాటితో అద్భుతమైన తోట..! మరింత అందంగా ఇల్లు..) -
జస్ట్ వాడిపడేసిన వాటితో అద్భుతమైన తోట..!
వ్యర్థాలతో కళాత్మక వస్తువుల తయారీ గురించి మనకు తెలిసిందే! కేరళ వాసి అంజలి పవన్ అప్సైకిల్డ్ వ్యర్థాలతో తన ఇంటి ఆవరణలో ఓ తోటను ఏర్పాటు చేసింది. దానికి తన తల్లితో కలిసి వాడేసిన డబ్బాలు, సీసాలు, టైర్లు, పాత బట్టలు వంటి వ్యర్థాలను ఉపయోగించి, అప్సైక్లింగ్ చేయడం ద్వారా వాటి రూపు రేఖలనే మార్చేసింది.తల్లీ కూతుళ్ల వినూత్న ప్రయోగం‘‘మా అమ్మ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ జపనీస్ కళ కోకెడామా చూశాను. కోకెడామా అనేది జపనీస్ తోటపని పద్ధతి. ఇక్కడ మొక్కల వేళ్లను నాచుపట్టిన బంతిలో చుట్టి, వేలాడే తోటలను సృష్టిస్తారు. నేను కోకెడామాను చాలా ఇష్టపడ్డాను. సొంతంగా అలాంటి తోటను నేను సృష్టించుకోవాలనుకున్నాను. ఆన్లైన్లోను, యూట్యూబ్లోను శోధించిన తర్వాత, ఈ గార్డెన్ క్రియేషన్ను అమల్లో పెట్టాను. ఒకదాని నుంచి మరిన్ని మొక్కలను నాటడం ప్రారంభించాను. దీంతో మా తోట వికసించడం మొదలైంది. దానిని మరింత పెంచడానికి మరిన్ని కొత్త పద్ధతులను కనిపెట్టాం. పడేసే వస్తువులతో పర్యావరణ అనుకూలమైన ప్లాంటర్లుగా మార్చాను. దీనికి మా అమ్మ కూడా సాయం చేసింది. పెయింట్ డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పొట్టు, ప్లాస్టిక్ సీసాలు, పాత కుట్టు మిషన్లు, డ్రమ్స్ వంటి వాటిని ఉపయోగించాం. ఇప్పుడు మా తోట మొత్తం వ్యర్థ పదార్థాలతో నిండి ఉంది. కానీ, అవి అత్యంత అందంగా మారిపోయాయి’’ అని చెబుతుంది అంజలి. మాక్రేమ్ ఆర్ట్ ఉపయోగించి వీరు ప్లాంట్ హ్యాంగర్లను కూడా తయారు చేశారు. అంజలి తల్లి పాత దుస్తులను ఉపయోగించి, మొక్కల కుండీలను తయారు చేస్తుంది. వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా, ఈ తల్లీ కూతుళ్లు పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా మార్కెట్ నుంచి ప్లాంటర్లను కొనుగోలు చేయడానికి ఖర్చు చేసే డబ్బును కూడా ఆదా చేసే మార్గాన్ని కనిపెట్టారు. ఇప్పుడు వీరి ఇంటి ఆవరణ పచ్చదనంతో అత్యంత ఆహ్లాదంగా మారిపోయింది. ఎన్.ఆర్ (చదవండి: Jamai Sasthi: కొత్త అల్లుడికి కొసరి..కొసరి..) -
నటి మడోన్నా సెబాస్టియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
చక్కని చిరునవ్వుతో మనసు గెలుచుకునే నటి మడోన్నా సెబాస్టియన్. తెరమీద కనిపిస్తే ఆ ఫ్రేమ్కే అందం తెచ్చిపెట్టగలిగేంత అందంగా ఉంటారు. అలా తెరమీదనే కాదు, తెరవెనుక కూడా కనులవిందుగా ఉంటుంది ఆమె స్టయిలింగ్. ఇందుకోసం ఆమె సెలెక్ట్ చేసుకున్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్సే ఇవి.చెవి దగ్గర మొదలై మెడ చుట్టూ తిరిగి జడలో ముగిసే అందమైన కథే చెంపసరాలు. ఇవి కేవలం ఆభరణాలే కాదు. జడలోకి దిగి వచ్చే పూల గొలుసులు. ఇవి పెట్టుకున్న అమ్మాయి ఎక్కడ కనిపించినా ఆ ఫ్రేమ్ మొత్తం అందంగా మెరిసిపోతుంది. చెంపసరాల ట్రెండ్ కొత్తేమీ కాదు. కాని, ఇప్పుడు వీటి ప్రెజెంటేషన్, స్టయిలిష్గా మారడంతో మళ్లీ వీటికి రీబర్త్ వచ్చింది. మోడర్న్ వన్ పీస్ డ్రెస్స్ల్లోకి కూడా అమ్మాయిలు స్టేట్మెంట్ లుక్గా వీటిని వేసుకుంటున్నారు. ముత్యాలు, కుందన్, రుబీ, టెంపుల్ ఇలా రకరకాల డిజైన్లలో లభించే చెంపసరాలను వేసుకుంటే, చుట్టూ ఉన్నవాళ్ల చూపులన్నీ మీ చెవులవైపు తిప్పేలా చేస్తాయి. చీర, లెహంగా, లాంగ్ ఫ్రాక్ డ్రెస్ ఏదైనా, వీటిని వేసుకోవడానికి కమ్మలను మాత్రం పెద్దవిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, బోసిగా ఉంచిన మెడ, చెంపసరాలకు తగ్గట్టుగా ఉండే హెయిర్ స్టయిల్, సింపుల్ గాజులు ఇవన్నీ కలిస్తేనే అందం. అప్పుడే చెంపసరాలకు, వాటిని వేసుకున్న మీకు పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అచ్చం నటి మడోన్నా లుక్లాగా.అందం అందులో ఉండదు..అందం అంతా క్రీమ్స్, మేకప్స్లో ఉండదు. మంచి స్కిన్ కేర్లోనే ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్ మసాజ్, నేచురల్ ప్రాడక్ట్స్, హైడ్రేటింగ్ స్కిన్ కేరే నా బ్యూటీ సీక్రెట్. దుస్తుల్లో కూడా ‘ఇది నాకు నప్పుతుందా?’ అని కాకుండా ‘ఇది నేను కంఫర్ట్గా వాడతానా?’ అని ఆలోచించి సెలక్ట్ చేస్తానని చెబుతోంది మడోన్నా సెబాస్టియన్. -దీపిక కొండి(చదవండి: ఘనంగా ముగిసిన మిస్ వరల్డ్ అందాల పోటీలు) -
కొత్త అల్లుడికి కొసరి..కొసరి..
తెలుగు నాట సంక్రాంతి అల్లుళ్లకు ఎలాంటి ఆదరాభిమానాలు అందుతాయో పశ్చిమబెంగాల్కు చెందిన బెంగాలీలకు కూడా అల్లుళ్లను గౌరవించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి యేటా తిథి, నక్షత్రం ప్రకారం అల్లుళ్లను గౌరవంగా ఇంటికి ఆనించి సత్కరిస్తారు. జమై షష్టి అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించే బెంగాలీలు అమ్మవారికి అందించే సకల గౌరవ మర్యాదలు, సత్కారాలను అల్లుళ్లకు సమర్పిస్తారు. కొత్త బట్టలు పెట్టి ఇష్టమైన వంటకాలను వడ్డిస్తారు. జేష్ట మాసంలో జరిగే ఈ పండుగను జూన్ ఒకటో తేదీన జమై షష్టి మహోత్సవం పేరుతో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే బెంగాలీలు పూర్తి చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో దశాబ్దాలుగా స్థిరపడిన బెంగాలీలు ఏడానికోసారి కన్నులు పండుగగా దీనిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అల్లుడు అత్తారింటికి వచ్చిన రోజు జరిగే హంగు ఆర్భాటాలు, అందుకు అయ్యే ఖర్చులను అత్తగారి భరిస్తారు. ఇక మరుసటి రోజు అల్లుడి వంతు ఉంటుంది.అల్లుళ్ళకు రాజభోగం.. అమ్మవారి కరుణ కటాక్షం మా కుటుంబంతో పాటు అల్లుళ్లపై ఉండాలని కోరుతూ జమై షష్టి నిర్వహిస్తాం. ఒకరికొకరు కొత్త బట్టలతో, బహుమతులతో గౌరవించుకుంటాం. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. – మౌసమీ– బెంగాలీ మహిళఖర్చంతా అల్లుడిదే.. అత్తారింటికి చేరిన అల్లుడు మరుసటి రోజు జరిగే ఉత్సవానికి ఆయనే ప్రధాన బాధ్యుడిగా ఉంటారు. అంటే ఆ రోజు జరిగే ఖర్చంతా అల్లుడు భరించాల్సి ఉంటుంది. ఇంట్లోని వారందరికీ బహుమతులతో పాటు అత్తగారికి చీరను బహూకరిస్తారు. ఇతర కుటుంబ సభ్యులకు మర్యాదపూర్వకంగా గిఫ్ట్లు అందజేస్తారు. ఈ ఖర్చంతా అల్లుడు చూసుకుంటాడు. జమై షష్టి.. బెంగాలీల ఆచారం.. జమై షష్టి..అనేది బెంగాలీ ప్రజల సంప్రదాయ, సాంస్కృతిక ఆచారం. ఈ ఆచారాన్ని జైష్ట మాసం శుక్ల పక్ష ఆరవ తిథి నాడు నిర్వహిస్తారు. జమై అంటే అల్లుడు. షష్టి అంటే చంద్ర పక్షంలోని ఆరో రోజు. జమైషష్టి అనేది అల్లుళ్లను గౌరవించడానికి అంకితం చేసే పండుగ. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో అత్తగారు వారి శ్రేయస్సు కోసం దుర్గా దేవిని పూజిస్తారు. (చదవండి: మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్కాస్ట్..) -
మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్కాస్ట్..
సోషల్మీడియాలో యుగంలో ప్రతి ఒక్కటీ వింతే.. అన్నట్లు ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏఐ ఏఐ హవా నడుస్తోంది. రెండు నెలల క్రితం గిబ్లీ ఆర్ట్ ఫొటోలతో హోరెత్తిన సోషల్మీడియా.. తాజాగా బేబీ పాడ్కాస్ట్, బేబీ ఏఐ వీడియోలతో హల్చల్ చేస్తోంది. నెటిజన్లు బేబీ రూపంలో చేసిన వీడియోలు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు ప్రతి ఒక్కరూ దీనిని ట్రెండ్గా ఫాలో అవుతున్నారు. సోషల్మీడియాలోని ఇన్స్టా, ఫేస్బుక్లతో పాటు అన్ని యాప్లలో బేబీ పాడ్కాస్ట్ విడియోలే దర్శనమిస్తున్నాయి. సినిమాల్లోని వైరల్ సీన్లను బేబీ పాడ్ కాస్ట్ రూపంలోకి తీసుకొచ్చి సందడి చేస్తున్నారు. చాట్జీపీటీ ఏఐతో ఈ బేబీ పాడ్కాస్ట్ వీడియోలు చేస్తున్నారు. సినిమా, పొలిటికల్, నెటిజన్లు చేసిన వీడియోలు దీనికి కేంద్రబిందువుగా మారుతున్నాయి. గిబ్లీ ఆర్ట్ చేసిన రచ్చను మించి బేబీ పాడ్కాస్ట్ చేస్తుందని నెటిజన్ల అభిప్రాయం. (చదవండి: ఆసియాలో అతిపెద్ద భూగర్భ లైబ్రరీ..! పైన దేవాలయం..కింద గ్రంథాలయం) -
మొఘులుల కాలం నాటి ఖుర్బానీ కా కహానీ..!
విందు భోజనం తినే ముందు ఆకలిగా అనిపించడం సహజమే. కానీ సిటీలోని వేడుకల్లో పాల్గొనేవారికి విందు దాదాపు ముగింపునకు వచ్చేటప్పుడు కూడా కొత్త ఆకలి పుట్టుకొస్తుంది. కారణం ఖుర్బానీ కా మీఠా. ఈ డెజర్ట్ లేకుండా నగరంలో ఏ విందూ పూర్తి కాదు. తినకుండా ఏ జిహ్వా శాంతించదు. ఇంతగా సిటిజనుల అభి‘రుచి’లో అల్లుకుపోయిన ఈ ఖుర్బానీ కా మీఠా కహాని దాని తియ్యదనమంత గొప్పది. కునాఫా చాక్లెట్లు, చీజ్కేక్లు, మాకరూన్లు వంటి కొత్త కొత్తవి సిటీ డెజర్ట్స్ మెనూలోకి రావడానికి చాలా కాలం ముందు నుంచే ఓ మిఠాయి రాజదర్పంతో కింగ్ ఆఫ్ డెజర్ట్స్గా నగరంలో వర్థిల్లుతోంది. నిజాం వంశాల వంటగదుల్లో జచిన ఈ మిఠాయి, హైదరాబాద్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకల భోజనాలు ఈ డెజర్ట్తో ముగిస్తేనే.. అది సంపూర్ణ విందుగా పరిగణిస్తారు. రాత్రంతా నానబెట్టిన డ్రై ఆప్రికాట్లను చక్కెరతో మగ్గించి, బాదం లేదా ఆప్రికాట్ గింజలతో అలంకరించడంతో ఇది స్వీట్ రూపం దాల్చుతుంది. ఈ రుచికరమైన డెజర్ట్ను మలాయ్, వెనిల్లా ఐస్క్రీమ్ లేదా కస్టర్డ్తో కలిపి కాంబినేషన్గా అందిస్తున్నారు.మొఘలుల కాలం నుంచే.. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్కు ఫెర్గానా లోయ (ఉజ్బెకిస్తాన్)లో పండే ఆప్రికాట్లు బాగా నచ్చేవట. భారతదేశపు వేడిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు తన స్వదేశ పండ్లను బాగా మిస్ అయ్యేవాడట. ఆ తర్వాత భారత ఉపఖండంలోకి అలా వచ్చిన ఆప్రికాట్లు నాటి చక్రవర్తుల పుణ్యమాని మొఘల్ వంటల్లో కూడా ప్రాధాన్యం పొందాయి. నగరాన్ని పాలించిన ఆసఫ్ జాహీ రాజవంశం హయాంలో ఈ మిఠాయి హైదరాబాద్ క్యుజిన్లో ప్రాముఖ్యం పొందింది.నగరం నలువైపులా..హైదరాబాద్ వంటకాలకు పేరొందిన ప్రతి రెస్టారెంట్ ఖుర్బానీ కా మీఠాను ప్రత్యేకంగా అందిస్తుంది. బిర్యానీకి పేరొందిన ప్యారడైజ్ రెస్టారెంట్, షాదాబ్ హోటల్, బావర్చీ హోటల్, నవాబ్స్ రెస్టారెంట్, సర్వీ, నానీస్ ప్యూర్ వెజ్, కబూల్ దర్బార్ వంటివన్నీ ఈ డెజర్ట్ను సర్వ్ చేస్తున్నాయి. అలాగే మినర్వా కాఫీ షాప్స్, చట్నీస్లో క్లాసిక్ ఖుర్బానీ కా మిఠాను ఐస్క్రీమ్తో కలిపి అందిస్తారు. కరాచీ బేకరి, ఆల్మండ్ హౌజ్ వంటి కొన్ని మిఠాయి దుకాణాల్లో ప్యాకింగ్స్లో కూడా దొరుకుతుంది. దీని ధరలు రూ.70 నుంచి రూ.600 వరకూ ఉన్నాయి. సితార ఫుడ్స్ వంటివి కిలోల లెక్కన విక్రయిస్తున్నాయి. చైనాలో పుట్టి.. చరిత్రకెక్కి.. ఖుర్బానీ కా మిఠా కేవలం ఒక మిఠాయి కాదు. తరాలుగా మనతో పాటు అల్లుకున్న చారిత్రక, సాంస్కృతిక సంపద. ఖుర్బానీ అంటే ఉర్దూలో ఆప్రికాట్. చైనాలో జన్మించిన ఈ పండు, క్రీ.పూ.4వ శతాబ్దంలోనే అలెగ్జాండర్ సైనికుల ద్వారా భారతదేశం మీదుగా యూరప్కు ప్రయాణించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.ఆధునిక రూపం.. ఆప్రికాట్ డిలైట్.. ఈ మధ్య కాలంలో ఖుర్బానీ కా మిఠాకు సరికొత్త అవతారం దాల్చింది. అదే ఆప్రికాట్ డిలైట్. ఇందులో అసలు మిఠాయి రుచిని అలా ఉంచుతూనే కేక్, కస్టర్డ్, విప్డ్ క్రీమ్ వంటి కొత్త రుచులు జోడించి ట్రైఫిల్ లాగా తయారు చేస్తారు. ఈ కొత్త వెర్షన్ జూబ్లీహిల్స్లోని ది స్పైసీ వెన్యూ హోటల్కి చెందిన ఎల్.రవీందర్ కుమార్ రూపొందించారు. ఈ డెజర్ట్ సోషల్ మీడియా, ఫుడ్ బ్లాగర్ల ద్వారా మరింత ప్రజాదరణ పొందింది. పారంపర్యానికంటే భిన్నంగా ఉందని కొన్ని వర్గాలు విమర్శిస్తున్నా మరికొందరు దీనిని పాత మిఠాయికి కొత్త జీవం పోసే ప్రయత్నంగా స్వీకరిస్తున్నారు. (చదవండి: ఈ సాలీడు టాలెంట్కి సాటిలేరెవ్వరూ..! కటౌట్తో పనిలేదు బ్రదర్..) -
Miss World 2025: ఘనంగా ముగిసిన గ్రాండ్ ఫినాలే..
ప్రపంచ వేదికపై హైదరాబాద్ నగర ప్రశస్తి మరోసారి అత్యంత వైభవంగా మారుమోగింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. 108 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో మిస్ థాయిలాండ్ ప్రపంచ సుందరిగా నిలిచింది. నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై కళ్లు చెదిరే హంగులతో లైటింగ్తో ప్రతిష్టాత్మకంగా ఈ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఈ వేదిక పై భారతీయ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోడియంపై తెలుగు సెలబ్రిటీలు సందడి చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు క్యాట్ వాక్ చేసే పోడియం ప్యానెల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ రానా దగ్గుబాటి, మరో సినీతార నమ్రత శిరోద్కర్ ఆశీనులయ్యారు. ఇదే వరుసలో ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్, సామాజికవేత్త, మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ విభాగానికి గ్లోబల్ అంబాసిడర్గా ఎన్నికైన తెలుగు మహిళ సుధారెడ్డి ఉన్నారు. మెగా హంగామా.. ఈ పోటీలను వీక్షించడానికి మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చారు. ఈ మెగా వేదికపై ప్రముఖ సెలబ్రిటీ ఇషాన్ కట్టర్ చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా తను ఆస్కార్ విన్నింగ్ పాట నాటు నాటు సాంగ్కు అదిరిపోయే స్టెప్పులేస్తుంటే.. చిరంజీవి సంతోషంగా చప్పట్లు కొట్టారు. స్టేజ్ పైన వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహపరిచిన సోనూసూద్ తెలుగు సినిమాలతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు తెలిపారు.ఆతిథ్యం అద్భుతం.. ఈ పోటీల నేపథ్యంలో తెలంగాణ అందించిన ఆతిథ్యం అద్భుతమని టాప్ 4లో నిలిచిన పోలండ్ కాంటెస్టెంట్ కొనియాడారు. ఇక్కడి మర్యాదలు ఆత్మీయత తనను కట్టిపడేశాయని.. భాగ్యనగరాన్ని తన రెండో ఇంటిగా అనుభూతి చెందానని సంతోషం వ్యక్తం చేశారు. ప్యానలిస్టుల్లో రానా, నమ్రత.. అంతే కాకుండా ఈ గ్రాండ్ ఫినాలేలో టాప్ 4 మార్టినిక్, ఇథియోఫియా, పోలెండ్, థాయిలాండ్ కాంటెస్టెంట్ లను చివరి ప్రశ్నలు అడిగిన నలుగురు ప్యానలిస్టుల్లో రానా, నమ్రత ఇద్దరూ తెలుగు వారే కావడం గమనార్హం. మరో రెండు ప్రశ్నలు అడిగిన ఇద్దరిలో సోనూ సూద్ కూడా హైదరాబాద్కు సుపరిచితుడే. ( చదవండి: ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా) -
చూడటానికి అదొక దేవాలయం..! కానీ కింద చూస్తే..
అదొక పుస్తక నిలయం. లక్షల సంఖ్యలో గ్రంథాలతో కళకళలాడే జ్ఞానభాండాగారం. కాని, అక్కడికి వెళితే, అక్కడ ఒక దేవాలయం మాత్రమే గోచరిస్తుంది. గుడిలోకి ప్రవేశించాక నేలమాళిగలోకి వెళ్లేందుకు భూగర్భమార్గం కనిపిస్తుంది. అలా మెట్ల మార్గంలో కిందికిపోతే, అరుదైన భూగర్భ గ్రంథాలయం ఆశ్చర్యపరుస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ గ్రంథాలయమది. అత్యంత అరుదైన ఈ భూగర్భ గ్రంథాలయం కథా కమామిషు తెలుసుకుందాం...పదహారడుగుల లోతులో...రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లా భడారియా గ్రామం చుట్టూ ఎడారి వాతావరణం. ఊరిలో భడారియా దేవాలయం ప్రత్యేక ఆకర్షణ కేంద్రం. కారణం ఈ ఆలయం భూ ఉపరితలానికి పదహారడుగుల కింద కొలువైన భూగర్భ గ్రంథాలయం. విశాలమైన వరండాలు, గాజు అలమరాలలో భద్రపరచిన పుస్తకాలు, పెద్దపెద్ద ర్యాకులు, ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం ప్రత్యేకతలు. భడారియా గ్రంథాలయాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు. ఒకటి అధ్యయన భవన్, మరొకటి సంగ్రహణ భవన్. అధ్యయన భవన్లో వందలాది మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా విశాలమైన గదులను నిర్మించారు. సంగ్రహణ భవన్లో పలు అరుదైన గ్రంథాలను అందుబాటులో ఉంచారు. వీటికోసం 562 అలమరాలు, 16వేల అడుగుల పొడవులో ర్యాక్స్ ఏర్పాటు చేశారు. ఏటా ఈ గ్రంథాలయానికి వచ్చేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ప్రాచీన ప్రతులు, రాష్ట్రపతులు, ప్రధానుల ప్రసంగాలు లభిస్తాయి. భడారియా మహారాజు కృషి ఫలితంభడారియా మహారాజు 1960లో శక్తిపీఠమైన భడారియామాత మందిరాన్ని సందర్శించి. అక్కడే స్థిరపడిపోయారు. ఆయన అసలు పేరు హరివంశ్సింగ్ నిర్మల్. ఇక్కడి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడ గ్రంథాలయాన్ని నెలకొల్పాలని అనుకున్నారు. 1983లో నిర్మాణానికి సంకల్పించారు. బయట ఎడారి వాతావరణం కాబట్టి పాఠకులకు, సందర్శకులకు ఇబ్బంది లేకుండా దీనిని నేలమాళిగలో నిర్మించారు. దీనివల్ల లోపల చల్లని వాతావరణం ఉంటుంది. ఎలాంటి అసౌకర్యానికి గురికారు. మహారాజు పదిహేనేళ్ల కృషికి ఫలితంగా 1998లో ఈ గ్రంథాలయం అందుబాటులోకి వచ్చింది. దీని నిర్మాణం ప్రారంభం నుంచే పుస్తకాల సేకరణ ప్రారంభించారు. అలా ఇప్పటికి తొమ్మిది లక్షల పుస్తకాలను ఇందులో అందుబాటులో ఉంచారు. వీటిలో ప్రపంచస్థాయిలోని పలు మత గ్రంథాలు, చారిత్రక, భాషా, న్యాయ శాస్త్రాలకు సంబంధించిన అనేక పుస్తకాలున్నాయి. వీటితోపాటు వినోద, విజ్ఞానాలను పంచే పుస్తకాలనూ ఉంచారు. ఇక్కడికి వచ్చే పరిశోధకులు, విజ్ఞానార్థులు వేరేచోట అన్వేషించాల్సిన అవసరం లేకుండా సకల గ్రంథాలూ లభించేలా సమకూర్చారు. విశాలమైన భోజనశాలలుపలు అంశాలపై అధ్యయనం చేయడానికి వచ్చే వారికోసం పద్దెనిమిది గదులు నిర్మించారు. అలాగే విశాలమైన భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఎడారి ప్రాంతమైనా, ఈ గ్రంథాలయంలో ఎక్కడా వేడి వాతావరణం కనిపించదు. పాలరాతి గోడలతో చుట్టూ చల్లటి వాతావరణం ఉండేలా దీనిని నిర్మించారు. ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుంచే కాదు, యూరోప్ నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి కూడా అధికంగా ఉంటుందని గ్రంథాలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్దదిఆసియాలో పేరున్న భూగర్భ గ్రంథాలయాల రెండే ఉన్నాయి. వాటిలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని స్టార్ ఫీల్డ్ లైబ్రరీ ఒకటి కాగా రెండోది మన భడారియా గ్రంథాలయం. ఈ రెండిటిలో భడారీయా పుస్తక నిలయమే పెద్దది కావడం విశేషం. తిరుమలరావు కరుకోల(చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!) -
రాచ సాలీడు..! టాలెంట్కి ఫిదా అవ్వాల్సిందే..
‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే సినిమా డైలాగ్లా కాదు. కొన్నిసార్లు కటౌట్తో పనిలేకుండా కూడా కొన్ని కొన్ని నమ్మేయాలి. ఎందుకంటే, ఫొటోలో చిన్నగా బొద్దుగా ఉండే ఈ సాలీడు టాలెంట్ తెలిస్తే అలాగే అనిపిస్తుంది. ఇది సాలీడు జాతికే రారాజులాంటిది. పేరు ‘డార్విన్ బార్క్ స్పైడర్’. కేవలం ఇరవై రెండు మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. కాని, అది అల్లే సాలెగూడు పరిమాణం ముందు సినిమాల్లోని స్పైడర్ మాన్ కూడా తలదించుకోవాల్సిందే! గాలిలోకి దాని జిగురు దారాలను వదిలి, ఎక్కడో ఓ చెట్టుకి అంటుకునేలా చేస్తుంది. అలా మొదలైన దాని సాలెగూడు ఏకంగా ఇరవై ఐదు మీటర్ల దూరం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన గూడు నిర్మించుకునే సాలీడుగా ఇది రికార్డులకెక్కింది. గూడు ఎంత పెద్దదైతేనేం అంత బలంగా ఉండదనుకోకండి. దాని జిగురు దారాల బలం, పట్టుదారం కంటే పదిరెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది. దాని సాలెగూడులో పడి, ఒకేసారి దాదాపు ఇరవై దోమలు, ఈగలు బ్రేక్ఫాస్ట్ బఫేగా మారిపోగలవు. దీని గురించి తెలిస్తే స్పైడర్మాన్ కంటే ఈ నిజమైన వెబ్ హీరోకే ఫిదా అయిపోతారు. (చదవండి: కింగులా బతికాడు సింగిల్గా..!) -
పాలిచ్చే తల్లులూ..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...!
నాకు త్వరలో తొమ్మిదో నెల నిండుతుంది. మొదటి ప్రెగ్నెన్సీ కావటంతో చాలా భయంగా ఉంది. మా ఊరి నుంచి దగ్గర్లో ఉన్న మంచి ఆసుపత్రికి వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుంది. అందుకే, ముందుగానే ఆసుపత్రికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లాలి?– రమణి, శ్రీకాకుళం. మొదటి ప్రెగ్నెన్సీలో కొంచెం గందరగోళం ఉంటుంది. ఏ సమయంలో నొప్పులు వస్తాయో తెలియదు కాబట్టి, తొమ్మిదో నెల వచ్చినప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్స్, బ్యాగ్ ఎప్పుడూ సిద్ధంగా ఒక చోట పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. మీకు వెన్నునొప్పి లేదా కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నా, బ్లీడింగ్ అవుతున్నా, ఉమ్మనీరు పోతున్నా వెంటనే ఆసుపత్రికి బయలు దేరాలి. నొప్పులు మొదటి డెలివరీలో అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. కొంతమందికి టైమర్ పెట్టుకొని పది నిమిషాల్లో ఎన్నిసార్లు పొట్ట గట్టిగా అవుతుందో నోట్ చెయ్యమని చెప్తాం. పది నిమిషాల్లో మూడుసార్లు టైట్గా అయినా, నొప్పి ఎక్కువ అయినా, అవి డెలివరీ పెయిన్స్ అని అర్థం. ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు ముప్పయి సెకండ్ల నుంచి ఒక నిమిషం ఉంటుంది. కొంతమందికి నొప్పులు ప్రతి అర్ధగంటకొకసారి ఎక్కువ అవుతుంటాయి. అంటే కాన్పు సమయం దగ్గరకు వచ్చిందని అర్థం. కేవలం నొప్పి ప్రతి అర్ధగంటకొకసారి వస్తుంటే రెండు నుంచి మూడు గంటలు చెక్ చేసుకొని, నొప్పి ఎక్కువ అవుతుంటే ఆసుపత్రికి వెళ్లండి. కొంతమందికి నొప్పి వచ్చి ఒక గంటలో తగ్గిపోతుంది. అంటే అది ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని అర్థం. అందుకే నొప్పి అనిపించిన తరువాత రెండు నుంచి మూడు గంటలు ఆగాలి. మొదటి ప్రెగ్నెన్సీలో నొప్పి మొదలైన పన్నెండు నుంచి ఇరవైనాలుగు గంటలకు కాని, కాన్పు కాదు. అందుకే, హడావిడి పడనవసరం లేదు. కాని, బ్లీడింగ్ లేదా వాటర్ లీక్ అవుతుంటే మాత్రం, నొప్పి లేకపోయినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్ మొత్తం తీసుకొని వెళ్లాలి. మీరు ఆసుపత్రికి వెళ్లినప్పుడు మీ పల్స్, బీపీ, బేబీ హార్ట్బీట్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తారు. వాటిని బట్టే ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు. ఫాల్స్ లేబర్ అయితే కొన్ని పరీక్షలు చేసి ఇంటికి పంపిచేస్తారు.నాకు డెలివరీ అయి రెండు నెలలు అవుతోంది. చాలాసార్లు నిపుల్ క్రాక్స్ వస్తున్నాయి. బ్లడ్ కూడా వస్తోంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – లావణ్య, తిరుపతి. బేబీకి ఒక సంవత్సరం వచ్చేవరకు తల్లిపాలు చాలా అవసరం. అందుకే, బ్రెస్ట్ ఫీడింగ్లో వచ్చే సమస్యలకు చాలా త్వరగా చికిత్స తీసుకోవాలి. పాలు తగ్గినా, నిపుల్ క్రాక్స్ ఉన్నా బేబీకి పాలు తాగటం కష్టం అవుతుంది. మీకు కూడా చాలా నొప్పి ఉంటుంది. పుండు లేదా పగిలిన చనుమొనలకు చికిత్స తీసుకోవడానికి ముందు చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఇందుకు మాయిశ్చరైజర్ సబ్బులని మాత్రమే స్నానానికి ఉపయోగించాలి. కాటన్ లోదుస్తులను వేసుకోవాలి. దానితో రొమ్ములకు మంచి ఎయిర్ సర్కులేషన్ వస్తుంది. వ్యాసలిన్ లేదా పారాఫిన్ లేదా ప్యూరిఫైడ్ లోషన్తో నిపుల్ మీద మసాజ్ చెయ్యాలి. ఇలా ప్రతి ఫీడ్ తరువాత చెయ్యండి. మళ్లీ ఫీడ్కి ముందు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, ఫీడింగ్ ఇవ్వండి. బ్రెస్ట్ ప్యాడ్స్ వాడుతున్నవారు, వాటిని ప్రతి ఫీడ్ తరువాత మార్చుకోవాలి. ఇలా క్రాక్స్ కాకుండా ప్రివెంట్ చెయ్యడానికి ఫీడ్ అయిన వెంటనే కొంచెం బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి నిపుల్ మీద రాసి, తరువాత కవర్ చేసుకోవాలి. ఇలా ప్రతిసారి చేస్తే అసలు క్రాక్స్ రాకుండా ఉంటాయి. నిపుల్ షీల్డ్ అని మెడికల్ షాప్స్లో రబ్బర్ కవరింగ్స్ దొరుకుతాయి. ఒకవేళ క్రాక్స్ ఎక్కువ ఉండి, బ్లీడింగ్ అవుతుంటే క్రీమ్స్ రాసి దాని తరువాత సరైన సైజ్లోని షీల్డ్ పెట్టి ఫీడింగ్ ఇస్తే నిపుల్కి విశ్రాంతి దొరికి, బ్లీడింగ్ అవకుండా ఉంటుంది. బేబీకి నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, నిపుల్ క్రాక్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి, ఒకసారి పిల్లల డాక్టర్కి బేబీని చూపించండి. తరచు క్రాక్స్కి ఇది కారణం కావచ్చు. బేబీ సకింగ్ పొజిషన్ కూడా చాలా ముఖ్యం. రొమ్ముల ఐరోలా, నిపుల్ మొత్తం నోటిలో పెట్టుకొని బేబీ సక్ చెయ్యాలి. అప్పుడే పాలు బాగా వస్తాయి. నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. నిపుల్ ఒక్కటే పట్టుకొని సక్ చేస్తే క్రాక్స్ ఎక్కువ అవుతాయి. ఒకసారి లాక్టేషన్ కన్సలెంట్ని కలసి మీకు పొజిషన్స్ ఫర్ ఫీడింగ్ గురించి తెలుసుకోండి. ఇవి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఫీడింగ్ బాగా వస్తుంది, నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: '2 పర్ 20 వాకింగ్ రూల్' అంటే..! వ్యాయామాలు చేయకుండానే..) -
వందేళ్ల అందాల బామ్మ..మేకప్ పాఠాలు! నెటిజన్లు ఫిదా
వందేళ్లు దాటిన అందాలబామ్మ ఆమె. ‘ఆన్లైన్’లో ఈ బామ్మ పేల్చే బ్లష్ బ్లాస్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. తర్వాత ఆమె చెప్పే పాఠాలు వింటే వెంటనే మీరు కూడా మేకప్ బ్రష్ పట్టుకొని అద్దం ముందుకు వెళ్తారు. బామ్మలు అంటే కుకీస్ చేయటం, కథలు చెప్పడమే కాదు; సౌందర్య పోషణతో సోషల్ మీడియాను షేక్ చేయవచ్చని నిరూపించింది ఇంగ్లండ్కు చెందిన జోన్ పార్ట్రిడ్జ్. ఈమె వయసు 103.సరదా సరదాగా బ్యూటీ పాఠాలురోజూ ఉదయం కాఫీ కప్పు చేతిలో పట్టుకోవడం కంటే ముందు ఈ బామ్మ మేకప్ బ్రష్ పట్టుకుంటుంది. ఆపై మొబైల్ కెమెరా ఆన్ చేసి, టిక్టాక్లో మేకప్ ట్యూటోరియల్ వీడియోలు చేస్తుంది. బామ్మ చెప్పే పాఠాలు బోరింగ్ అనుకోకుండా సుమారు రెండున్నర లక్షల మంది చాలా శ్రద్ధగా వింటారు. ఒకరోజు బ్లష్ బ్రష్ తీసుకొని చెంప మీద మెల్లగా తిప్పుతూ ‘బ్లష్ ఎప్పుడూ నవ్వుతూ వేయమంటారు. కాని, నేను నవ్వితే ముడతలే కనిపిస్తాయి.’ అనే పంచ్ వేసింది. ఈ మాట వినగానే స్క్రీన్ ముందు ఉన్న జనాలంతా నవ్వుల వర్షం కురిపించేశారు. ఈ ఒక్క వీడియోకి లక్షల్లో లైక్స్, కామెంట్లు, షేర్లు! ఇక అప్పటి నుంచి ఆమె మేకప్ టెక్నిక్స్ చూసి కొంతమంది ఫిదా అయితే, బామ్మ కామెడీకి చాలామంది డబుల్ ఫిదా అయ్యారు. ‘ఇలా కాజల్ వేయాలి, ఇలా బ్రష్ తిప్పాలి, ఇలా బ్లష్ టచప్ చేయాలి’ అని అందరికీ అర్థమయ్యేలా చక్కగా బోధపరుస్తుందీ బామ్మ. ఏ టిప్ అయినా, సీరియస్గా చెప్పదు, చెణుకులు వేస్తూ సరదాగా చెప్తుంది. ‘టిక్టాక్’లో ఈ బామ్మ హవా తెలుసుకున్న టీవీ చానళ్లు కూడా ఇంటర్వ్యూల కోసం ఈమె ముందు క్యూ కడుతున్నాయి. బీబీసీ సహా పలు అంతర్జాతీయ చానళ్లు ఈమెను ఇప్పటికే ఇంటర్వ్యూ చేశాయి.వరుస గిఫ్ట్ హ్యాంపర్లు దీనికి తోడు, ఆమె ఉపయోగించే మేకప్ ఐటమ్స్ను కొంతమంది ఫాలోవర్స్ ఫ్యాషన్ బ్రాండ్స్కు ట్యాగ్ చేశారు. బ్రాండ్స్ వాళ్లు కూడా బామ్మ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయి, వెంటనే గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించారు. ఇక ఆ హ్యాంపర్స్ వచ్చాకే అసలు మజా మొదలైంది. బామ్మ మేకప్ ప్రాడక్ట్స్ ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. వందేళ్ల వయసులోనూ బామ్మ టిక్టాక్లో వైరల్ స్టార్, మేకప్ గురు, బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది. ఈ బామ్మని చూసిన తర్వాత ‘మా అమ్మమ్మకు, బామ్మకు ఫేస్బుక్ ఖాతా లేదని సిగ్గేస్తోంది’ అని అనిపించకుండా ఉండదు. కొంతమంది యువత వాళ్ల అమ్మమ్మలకూ, బామ్మలకు ఈ బామ్మ వీడియోలను షేర్ చేస్తున్నారు. బ్లష్ ఎలా వేయాలో నేర్చుకోవటానికి కాదు, వాళ్ల అమ్మమ్మలు, బామ్మలు కూడా టిక్టాక్ స్టార్లుగా రెడీ అవ్వడానికి! (చదవండి: ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..) -
కాంతిమంతమైన ముఖం కోసం..
ముఖం కాంతిమంతంగా, ఆకర్షణీయం కనిపించడం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే సహజసిద్ధంగా ఇంట్లో లభించేవే మంచివంటున్నారు నిపుణులు. మన ప్రతి నిత్యం చూసే వాటితో చాలా సింపుల్గా మన సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో చూద్దామా..!.టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ రోజ్వాటర్ను తీసుకుని చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల చర్మానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అంది మొటిమలు తగ్గుముఖం పట్టడంతోపాటు, చర్మం మృదువుగా తయారయి నిగారింపు సంతరించుకుంటుంది. బాగా మగ్గిన అరటిపండు తొక్క తీసుకుని టేబుల్ స్పూన్ తేనె వేసి పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసుకుని పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. ఈప్యాక్ను రెండురోజులకొకసారి వేసుకోవడం వల్ల చర్మానికి తేమ అంది, మెరుపులీనుతుంది. ట్యాన్ను తరిమేస్తుంది..మూడుస్పూన్ల ముల్తాని మట్టిలో రెండు టీస్పూన్ల రోజ్వాటర్, మూడు టీస్పూన్ల పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్లలోకి పోకుండా ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ట్యాన్ క్రమంగా పోతుంది. చర్మానికి విటమిన్ ఏ, తేమ అంది ఆరోగ్యంగా ఉంటుంది. (చదవండి: పాలీవర్కింగ్ గురించి విన్నారా..?) -
పాలీవర్కింగ్ గురించి విన్నారా..?
ముంబైకి చెందిన సారా ఒక టెక్ కంపెనీలో టాలెంటెడ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్. యోగా ఇన్స్ట్రక్టర్, ఫ్రీలాన్స్ కాపీరైటర్గా కూడా పనిచేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన ప్రైమరీ జాబ్ చేసే సారా సాయంత్రం తరువాత లోకల్ స్టూడియోలో యోగా పాఠాలు చెబుతుంది. వీకెండ్స్లో ఫ్రీలాన్స్ రైటింగ్ ప్రాజెక్ట్లు చేస్తుంటుంది.పాలీవర్కింగ్ వల్ల ఆర్థికస్థిరత్వం తోపాటు తన పాషన్ను కూడా కొనసాగించే వీలు కలుగుతోంది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడం...పాలీవర్కింగ్. కోవిడ్ మహమ్మారి తరువాత ఈ ధోరణి బాగా పెరిగింది. అస్థిరమైన ఉద్యోగాల కారణంగా యువ ఉద్యోగులు మునుపెన్నడూ లేనంతగా కష్టపడుతున్నారు.‘వోల్ ల్యాబ్స్’ సర్వే ప్రకారం 46 శాతం మంది ఉద్యోగులు సెకండరీ జాబ్ చేస్తున్నారు. అమెరికన్ ఉద్యోగుల్లో అత్యధికంగా ఉన్న మిలీనియల్స్లో 52 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో 24 శాతం మంది మూడు ఉద్యోగాలు చేస్తున్నారు. 33 శాతం మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పనులు చేస్తున్నారు. ఇక జెన్ జెడ్లో సగం మంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఫ్లెక్సిబుల్ వర్క్ పాలసీలు పాలీవర్కింగ్’ ట్రెండ్కు కారణం. ‘ఆదాయం పెంచుకోవడం మాత్రమే కాదు, అనేక రకాల నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ఈ ట్రెండ్ ఉపకరిస్తుంది’ అంటుంది సారా. (చదవండి: ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..) -
ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..
‘ది సెకండ్ విండ్’ చిత్రానికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు, ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘ఎవరీ మయూర శివల్కర్?’ అనే ప్రశ్న ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముగ్గురు మహిళల నిజజీవిత సంఘటనల ఆధారంగా ఇందిర బైరికర్ ‘ది సెకండ్ విండ్’ చిత్రాన్ని రూపొదించారు. ఆ చిత్రంలో మయూర శివల్కర్ జీవితం కూడా ఉంది...కర్నాటకలోని బెల్గావికి చెందిన మయూర శివల్కర్ మారథానర్, అథ్లెట్, బ్రెస్ట్ కేన్సర్ సర్వైవర్. ‘ది సెకండ్ విండ్’లో మయూర శివల్కర్ పాత్ర భావోద్వేగాలకు పరిమితమైనదే కాదు ప్రభావం వంతమైనది.ధైర్యమిచ్చేది... దారి చూపేది.ముప్పైలలో తనకు బ్రెస్ట్ కాన్సర్ అని నిర్ధారణ అయినప్పుడు ఆమె కాసేపు విచారపడి ఉండొచ్చుగానీ కష్టాలు, ప్రతికూలతలకు తలవొగ్గకూడదని నిర్ణయించుకుంది. పోరాట బాటను ఎంచుకుంది. ఎన్నో మారథాన్లలో ఉత్సాహంగా పాల్గొంది. ఆమె పేరు ఆశావాదానికి అరుదైన ప్రతీకగా మారింది. మయూర ఆశావాదమే, అరుదైన ధైర్యమే ‘ది సెకండ్ విండ్’ కథలోకి వచ్చింది. కాస్త వెనక్కి వెళితే... మయూర రేసులలో పాల్గొన్నప్పుడల్లా... ‘ఈ పరిస్థితుల్లో ఎందుకు?’ అన్నవారు లేకపోలేదు.ఆ సందేహానికి ఆమె చిరునవ్వే... సమాధానం. 36 నుంచి 37 డిగ్రీల టెంపరేచర్లోనూ రేస్ను పూర్తి చేసింది. తాను యావరేజ్ స్విమ్మర్ అయినా తొలి సీ–స్విమ్ను విజయవంతంగా పూర్తి చేసింది. బైకింగ్లోనూ ‘వావ్’ అనేలా చేసింది. ‘ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తావు! ఇది ఎలా సాధ్యం?’ అని మయూరను అడిగేవారు. ఉత్సాహం కొని తెచ్చుకునేది కాదు కదా!అది ఆమె రక్తంలోనే ఉంది. మయూర తల్లిదండ్రులు ఆమెకు తల్లిదండ్రులు మాత్రమే కాదు స్నేహితులు, మార్గదర్శకులు. ‘నా తల్లిదండ్రులు ఒకమాట చెప్పే వారు... మొదటి నుంచి నీదైన ఒక మార్గాన్ని ఎంచుకున్నావు. ఆ మార్గం నుంచి బయటకు రావద్దు. మంచి రోజులను ఎంజాయ్ చేసినట్లే, చెడు అనుకునే రోజులను ఎంజాయ్ చెయ్. ఫుల్స్టాప్ కంటే కామా బెటర్’ అని గతాన్ని గుర్తు చేసుకుంది మయూర శివల్కర్. (చదవండి: S Jaishankar: చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై జైశంకర్ మాట) -
ఆద్యకళను అడ్డుకోవడమా?
‘ఆద్యకళ’ పేరిట ప్రొ‘‘ జయధీర్ తిరుమలరావు గత కొన్నేళ్లుగా వివిధకేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న పురావస్తు ప్రదర్శనలు విశేష ఆదరణ పొందు తున్నాయి. జానపద పరిశోధకుడిగా ఆయన దశాబ్దాలుగా సేకరిస్తూ, ప్రద ర్శిస్తున్న వేలాది ఆదివాసీ కళాఖండాలు, పనిముట్లు, సంగీత వాద్యాలు, లోహ ప్రతిమలు, సాంస్కృతిక చిహ్నాలు వెలకట్టలేనివి. అయితే వీటిసంరక్షణ తన శక్తికి మించిన పని అవుతోందనీ, వాటి కోసం ఒక ప్రత్యేక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలనీ తిరుమలరావు ఎంతో కాలంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వాటిలో కొన్నింటి భద్రత, ప్రదర్శన నిమిత్తం హైదరాబాద్, నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో కొంత స్థలాన్ని కేటాయించింది. అదేవిధంగా ఉస్మా నియా యూనివర్సిటీ ఆవరణలో ఉన్న అధ్యాప కుల నివాస స్థలాల్లో రెండు గృహాలను ఈ పురా వస్తు సంరక్షణ, ప్రదర్శన, భద్రత కోసం అధికారికంగా అప్పగించారు. అయితే ఆ నివాసాలు శిథిలావస్థలో ఉన్నందున వాటికి ప్రభుత్వం మరమ్మతు పనులు చేయిస్తుండగా విద్యార్థి సంఘాలకు చెందినవారు ‘ప్రయివేటు వ్యక్తులకు ప్రొఫెసర్ క్వార్టర్లు కేటాయించడం కుదరదు. తక్కువ రెంటుతో లబ్ధి పొందుతున్నారు’ అని అభ్యంతరం చెబుతూ నిర్మాణ సామగ్రిని కూలదోసి, చిందరవందర చేశా’రని తిరుమలరావు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆయన ఇదే విశ్వవిద్యాలయంలో చాలా కాలం పని చేసినవారే. ఆదివాసీ సంస్కృతిని కాపాడేందుకు ఎవరితోనైనా చేతులు కలిపి పని చేసేందుకు తాను సిద్ధమే అనేది ఆయన ప్రతిపాదన. రెండేళ్ల క్రితం పురాతత్త్వ ప్రదర్శనశాల వారి ఆహ్వానంపై తిరుమల రావు ప్యారిస్ వెళ్లారు. అప్పుడు జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల ప్రతి నిధులు వాటిలో కొన్నింటిని తమ మ్యూజియాలలో భద్రపరుస్తామని ముందుకు వచ్చారు. అయితే ఇది భారతదేశ సంపద అని వారి ప్రతిపాదనను ఆయన ఒప్పుకోలేదు. గత ఏడాది ఢిల్లీలోని రాష్ట్రపతి నివాసంలో నిర్వహించిన గిరిజన సాంస్కృతిక ప్రదర్శనలో వీటికి గౌరవం దక్కింది. ఇక్కడ చూస్తే పరిస్థితి ఇలా ఉంది! కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ చాలా కాలంగా తిరుమలరావుకు బాసటగా నిలబడి, ఆద్యకళ మ్యూజియం ఏర్పాటుకై ప్రభుత్వాలకు ఎన్నో వినతులను సమ ర్పించారు. చివరకు ప్రదర్శనశాల ఒక కొలిక్కి వస్తున్న దశలో అశని పాతంలా వచ్చి పడిన ఈ విద్యార్థి సంఘాల వారి బెదిరింపు ఖండనార్హం. – బద్రి నర్సన్ -
నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?
ప్రఖ్యాత పులుల సంరక్షణకారుడు, రచయిత వాల్మీక్ థాపర్ (Valmik Thapar) ఇకలేరు. టైగర్ మ్యాన్గా ప్రసిద్ది చెందిన 73 ఏళ్ల వయసులో శనివారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. ప్రకృతి పరిశోధకుడు, శాస్త్రవేత్త అయిన థాపర్ తన జీవితకాలంలో 32 పుస్తకాలు రాశారు. వాటిలో నాలుగు ఆఫ్రికన్ వన్యప్రాణులపై ఉన్నాయి. థాపర్ మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.సాంక్చువరీ నేచర్ ఫౌండేషన్ ప్రకారం, వాల్మీక్ థాపర్ 1970ల మధ్యకాలం నుండి భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా రాజస్థాన్లోని రాంథంబోర్ జాతీయ ఉద్యానవనంలో పులుల పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా 150కి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్యానెల్స్తో కలిసి పనిచేశారు. Valmik Thapar, a legendary figure in the world of conservation over the past four decades - especially tigers - has just passed away. It is a great loss. Today's Ranthambore, particularly, is a testimony to his deep commitment and indefatigable zeal. He was uncommonly… pic.twitter.com/6TP60wMleo— Jairam Ramesh (@Jairam_Ramesh) May 31, 2025వాల్మిక్ థాపర్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి సోషియాలజీలో గోల్డ్మెడల్ సాధించారు. లివింగ్ విత్ టైగర్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్ "Land of the Tiger" , "Tiger Fire" వంటి 30కి పైగా పుస్తకాలు రచించారు...(Land of the Tiger)ల్యాండ్ ఆఫ్ ది టైగర్: ఎ నేచురల్ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ (1997) టైగర్ ఫైర్: 500 ఇయర్స్ ఆఫ్ ది టైగర్ ఇన్ ఇండియాలాంటి పుస్తకాలునురచించారు. ఇంకా ఆయన సహనిర్మాతగా వన్యప్రాణులపై రూపొందించిన వీడియోలుయ చిత్రాలు అనేక ప్రశంసలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఆరు భాగాల BBC సిరీస్ ల్యాండ్ ఆఫ్ ది టైగర్ (1997) బాగా పాపులర్. 2024లో, ఆయన మై టైగర్ ఫ్యామిలీ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. థాపర్ ప్రాజెక్ట్ చీతాను విమర్శించారు కూడా. భారతదేశంలో స్వేచ్ఛగా తిరిగే ఆఫ్రికన్ చిరుతలను నిలబెట్టడానికి అవసరమైన ఆవాసాలు, ఆహారం, నైపుణ్యం లేవని ఆవేదనవ్యక్తం చేసేవారు. పర్యాటకం వన్యప్రాణులకు హాని కలిగిస్తుందనే నమ్మకాన్ని ఆయన తోసి పుచ్చేవారు. స్థిరమైన పరిరక్షణ నమూనాలను రూపొందించడానికి సమాజం శాస్త్రవేత్తలు, అటవీ సిబ్బంది, అధికారులు, మీడియా మధ్య సహకారాన్ని పెంపొందించే వినూత్న విధానాలను ప్రోత్సహించే వారు వాల్మీక్ థాపర్ఎవరీ వాల్మీక్ థాపర్వాల్మీక్ థాపర్ బొంబాయిలో రాజ్-రోమేష్ థాపర్ దంపతులకు జన్మించారు. ప్రముఖ భారతీయ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ సమీప బంధువు. నటుడు శశి కపూర్ కుమార్తె, నాటక కళాకారిణి, నటి సంజన కపూర్ను వివాహం చేసుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వన్యప్రాణుల సంరక్షణలో, ముఖ్యంగా పులుల రక్షణలో వాల్మిక్ థాపర్ ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కాంగ్రెస్ నాయకుడు, యు మాజీ పర్యావరణ మంత్రి జైరాం రమేష్ అభివర్ణించారు. ప్రస్తుతం రణతంబోర్ థాపర్ అభివృద్దికి ఆయన అవిశ్రాంత అంకితభావం, నిబద్ధతకు నిదర్శనమంటూ ట్విటర్ ద్వారా నివాళి అర్పించారు. ఇంకా పలువురు పర్యావరణ వేత్తలు, విద్యార్థులు ఆయన మరణంపై సంతాపం వెలిబుచ్చారు.Rest in Peace, Valmik Thapar, the international voice of Indian tigers for many many years.As a tribute to him, do read the many books he penned on tigers: ‘Tiger Fire’, ‘Living with Tigers’ and others. pic.twitter.com/SJJzZeELYn— Neha Sinha (@nehaa_sinha) May 31, 2025ఫియర్లెస్ టైగర్ ఛాంపియన్ అంటూ పరిరక్షణ జీవశాస్త్రవేత్త నేహా సిన్హా వాల్మీక్ థాపర్ మృతిపై నివాళి అర్పించారు. తనకోసం తాను మాట్లాడలేని ఒక మూగ జీవికి స్వరాన్చిచ్చిన గొప్ప మనిషిగా ఆయన కలకాలం నిలిచిపోతారన్నారు. -
చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా శునక రాజా... ఆకట్టుకుంటున్న హైదరాబాద్ కంపెనీ
పెట్స్ పేరుకే పెంపుడు జంతువులు కానీ వాటిని సొంత మనుషుల్లా చూసుకునే వాళ్లే ఎక్కువ. వాటికి పేర్లు పెట్టి, పుట్టినరోజులు చేసి ఎంతో ప్రేమగా చూసుకుంటారు చాలామంది. ఇంటిలో పెట్స్ను పెంచుకోవడం మామూలే కానీ ఒక ఆఫీసులో స్ట్రెస్ రిలీవర్గా.. చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా ఒక ఉత్తమజాతికి చెందిన శునకాన్ని నియమించింది ఒక స్టార్టప్ కంపెనీ. అది ఎక్కడో కాదు... హైదరాబాద్లోనే. ఆఫీసులో పని ఒత్తిడి సర్వసాధారణం. ఆ ఒత్తిడి నుంచి ఉద్యోగులను బయట పడేయడం ఎలా? ఆఫీస్లో రిక్రియేషన్ క్లబ్ పెట్టడం కన్నా ఓ మేలుజాతి శునకాన్ని రిక్రియేషన్ ఆఫీసర్గా నియమిస్తే కాస్త వెరయిటీగా ఉంటుంది కదా అని ఆలోచించింది ఆ స్టార్టప్ కంపెనీ. ఇంకెందుకాలస్యం.... వెంటనే డెన్వర్ అనే ఒక శునకాన్ని కంపెనీలో చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా నియమించేసింది. ఇంతకూ ఈ డెన్వర్ ఉద్యోగుల ఒత్తిడిని ఎలా తొలగించగలదు? సంతోషాన్ని ఎలా ఇవ్వగలదనే కదా సందేహం? అక్కడికే వద్దాం... ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలుఉద్యోగులందరి దగ్గరకూ వరసబెట్టి వస్తారు ఈ ఆఫీసర్గారు... అందరినీ ప్రేమగా పలకరిస్తారు. స్నేహపూరితంగా షేక్ హ్యాండ్ (సారీ... ఇక్కడ లెగ్ అనాలి కాబోలు) ఇస్తారు. వీలయితే తనతో ఆడుకోవడానికి రమ్మని బాల్ తెచ్చి ఇస్తారు. ఆడుకున్న వారికి ఆడుకున్నంత సంతోషం. అన్నట్టు గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్ కూడా తన స్ట్రెస్ బస్టర్ అయిన పెంపుడు శునకాన్ని తనతో పాటు ఆఫీసుకు తీసుకువస్తారట. ఒత్తిడిగా అనిపించినప్పుడు దానితో ఆడుకుంటారట. మరో విషయం... డెన్వర్కు లింక్డ్ ఇన్లో ప్రొఫైల్ కూడా ఉంది.. ఫలానా కంపెనీలో చీఫ్ హ్యానీనెస్ ఆఫీసర్గా పని చేస్తున్నట్లుగా.. బాగుంది కదూ...ఇంట్లో పెట్స్ ఉన్నవాళ్లు ఒత్తిడి లేకుండా.. సంతోషంగా ఉంటారని, ఎక్కువ పని చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. దానిని వాకింగ్కి తీసుకెళ్లడం, ఫుడ్ పెట్టడం వంటి వాటివల్ల బీపీ, షుగర్ వంటివి దరిచేరవట. అందుకే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను వారి పెట్స్తో సహా ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తున్నాయట! బాగుంది కదూ..చదవండి: కొత్త పుస్తకాలు ఎందుకు సువాసన వెదజల్లుతాయి? -
Moral Story: ఆ పక్షులు నవ్వాయి.. పెద్దల మాట వినాలి!
అనగా అనగా ఒక అడవిలో పక్కపక్కనే రెండు రావిచెట్లు ఉండేవి. వాటి మీద పక్షులు గూళ్లు కట్టుకొని నివసిస్తున్నాయి. వాటిల్లో ఒక గుడ్లగూబ కూడా ఉండేది. అక్కడున్న పక్షుల్లో అదే పెద్ద వయసున్న పక్షి కావడంతో అప్పుడప్పుడూ మిగిలినవాటికి సలహాలు, సూచనలు ఇచ్చేది. ఆ మాటల్ని కొన్ని పక్షులు వినేవి. మరికొన్ని మాత్రం లక్ష్యపెట్టేవికావు. రెండు రావిచెట్లు గుబురుగా పెరగడంతో ఒకదాని కొమ్మలు మరొక చెట్టుతో రాసుకుంటూ ఉండేవి. భారీ గాలివానలొచ్చినప్పుడు చెట్లు కూలిపోతాయేమో అన్నంతగా కదిలి΄ోయేవి. ఆ పరిస్థితి చూసిన గుడ్లగూబ ‘ఈ చెట్లు చాలా ఏళ్ల నాటివి. ఎప్పుడైనా ఇవి కూలి΄ోయే ప్రమాదం ఉంది. మనందరం కొత్త చెట్టు చూసుకోవాలి’ అని చెప్పేది. కొన్ని పక్షులు బద్దకంతో ‘తర్వాత చూసుకుందాం’ అన్నాయి. మరికొన్ని పక్షులు ‘నీదంతా చాదస్తం. మరో వందేళ్లయినా ఈ చెట్టుకు ఏమీ కాదు’ అని చెప్పాయి. వానాకాలం మొదలైంది. కొద్దిగా జల్లులు కురుస్తున్న సమయంలో గుడ్లగూబ మరోసారి రెండు చెట్ల మీదున్న పక్షుల వద్దకు వెళ్లి–‘వానలు మొదలయ్యాయి. ఈ రెండు చెట్లు ఇప్పటికే బలహీనంగా తయారయ్యాయి. వాటి వేర్లు భూమిలోనుంచి బయటకు వచ్చేశాయి. వెంటనే మనమంతా మరో చెట్టు చూసుకుందాం’ అని చెప్పింది. కానీ ఎవరూ ఆ మాట లక్ష్యపెట్టలేదు. దీంతో చేసేదిలేక గుడ్లగూబ దగ్గర్లో ఉన్న మరో చెట్టు మీద కొత్తగా గూడు కట్టుకుని అక్కడికి వెళ్లిపోయింది. గుడ్లగూబ కొత్తగూడును చూసి కొన్ని పక్షులు నవ్వుకున్నాయి.మరో నెల రోజుల తర్వాత వానలు ఉధృతంగా కురిశాయి. పక్షులు గూళ్లు వదిలి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. హోరుగాలికి రావిచెట్లు బలంగా ఊగి, వేర్లతో సహా కూలిపోయాయి. దీంతో చెట్టు మీదున్న పక్షుల గూళ్లన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఆ కొమ్మల కిందపడి ఎన్నో పక్షులు మరణించాయి. మిగిలిన పక్షులు గూడ్లగూబ ఉన్న చెట్టు మీదకు చేరాయి. ఆ వర్షంలో గూడు కట్టుకునే వీలు లేక వానకు తడుస్తూ ఇబ్బంది పడ్డాయి. ముందే గుడ్లగూబ మాటలు విని ఉంటే తమకు ఈ అవస్థ వచ్చి ఉండేది కాదని, తమ మిత్రులు బతికేవారని అనుకొని బాధపడ్డాయి. -
Fitness: '2 పర్ 20 వాకింగ్ రూల్' అంటే..?
మనదేశంలో ఏటా మధుమేహంతో పడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు. షుగర్ నియంత్రణలో ఉండాలంటే వర్కౌట్లు తప్పనిసరి కానీ ఈ బిజీ లైఫ్లో వ్యాయమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. మరీ అలాంటప్పడు వ్యాయమాలు చేయకుండానే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ఈ ‘2 పర్ 20’ రూల్ని పాటిస్తే చాలని చెబుతున్నారు నిపుణులు. మరీ ఆ రూల్ ఏంటి, ఎలా షుగర్ని నియంత్రిస్తుందో చూద్దామా..మనం ఎక్కువసేపు కూర్చొని ఉండటంతో కాళ్లలోని కండరాలు నిరుపయోగంగా మారతాయి. ఎందుకంటే రక్తం గ్లూకోజ్ని శోషించడం నెమ్మదిస్తుంది. అదే భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. అందువల్ల ప్రతి 20 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడి నడిస్తే..కండరాల కార్యకలాపాలు బలోపేతంగా ఉండి, గ్లూకోజ్ శోషణ రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా ఇన్సులిన్ స్థాయిలు 25% తగ్గుతాయని, ఇన్సులిన్ సమస్యలు ఉత్ఫన్నం కావని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఎవరికి మంచిదంటే..ఈ విధానం ప్రీడయాబెటిక్ వ్యక్తులు లేదా డయాబెటిస్ ప్రారంభ దశలో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కార్యాలయాల్లో కూర్చొని ఉద్యోగాలు చేసేవాళ్లే గాక వ్యాయమానికి తగినంత సమయం కేటాయించలేనేవారే. అందువల్ల ఆయా వ్యక్తలకు ఈ రూల్ని అనుసరిస్తే మంచి పలితాలను పొందుతారని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. అలాగే రోజులో చిన్నపాటి కదలికలు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. కనీసం 30 సెకన్లు కూర్చోవడానికి విరామం ఇచ్చి..అటు ఇటు నాలుగు అడుగుల వేస్తేనే మంచి ప్రభావాన్ని పొందగలమని అన్నారు. అయితే ఇది మెరుగైన హృదయ ఆరోగ్యం, కండరాల బలం వంటి నిర్మాణాత్మక వ్యాయామ ప్రయోజనాలను అందించకపోయినా..2 పర్ 20 వాకింగ్ రూల్' బిజీగా ఉండే వ్యక్తులకు, వ్యాయామం చేయడం కుదరదు అనుకున్న వ్యక్తులకు ఇది బెస్ట్ అని చెబుతున్నారు. దాంతోపాటు సమతుల్య ఆహారం, హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు కూడా పాటించాలని చెబుతున్నారు. మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణకు ఇది బెస్ట్ అని ధీమాగా చెబుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: S Jaishankar: చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై జైశంకర్ మాట) -
1, 2, 3 కేన్సర్ దాకా అవసరమా మిత్రమా!
దేహం ఎంత ధృఢంగా ఉన్నా.. సిగరెట్, బీడీ అలవాటు ఉంటే చాలు పొగాకు దండయాత్రకు గేట్ తీసినట్టే. పొగాకుతో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి, తెలుసుకోవటానికి వైద్యం చదవనవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది. ఈ మధ్య వచ్చిన మైదాన్ హిందీ సినిమాలో హీరో పాత్రలో అజయ్ దేవగన్ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు. కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్ పొగాకు, ధూమపానం అలవాటుకు ఎలా బలయ్యాడని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది. అలాగే తెలుగు సినిమాకు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని, సమ"కూర్చిన" రచయితలు, కవులు, కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్లనే చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు.ఒక్కటి చాలు అంటూ మెల్లిగా మొదలెట్టి 2, 3, 4 అలా రోజూ డబ్బా, ఇలా పర్సు ఖాళీ చేసుకున్న అభాగ్యులు ఉన్నారు. సిగరెట్, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే.. దమ్ము కొట్టినపుడు సిగరెట్లో పొగాకుతో పెనవేసుకున్న రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కణాల డీఎన్ఏను నాశనం చేసే పనిలో పడతాయి. సరళంగా చెప్పాలంటే ఓ వ్యక్తి జాతకాన్ని.. ధూమపానికి ముందు, తర్వాత అని చెప్పొచ్చు.అమ్మా, నాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో గుట్టుగా సిగరెట్కు అలవాటయ్యే కుర్రాళ్లు లేకపోలేదు. జేబులో దండిగా పైసలున్నా సద్వినియోగం చేసే వారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటుకు "దగ్గర" అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతేగాక కొన్ని సినిమాల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్లు సైతం యువతను అటువైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయి. అందుకే పాఠశాలల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు. "బాబు ఆ అలవాటు మంచిది కాదు మానేయ్" అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.సిగరెట్, బీడీ కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఉక్కు లాంటి కండరాల్ని తుప్పు పట్టించే పనిలో ఉంటాయి. పటిష్టమైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బ తీస్తాయి. కణాలు(సెల్స్) అడ్డగోలుగా పెరగడానికి కారకం అవుతాయి. తద్వారా కేన్సర్కు దారి తీస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాల డిఎన్ఏను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకృతి ఇచ్చే కణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో, మనిషి ఆరోగ్యానికి కూడా కణాల ఆరోగ్యం అవశ్యం.చదవండి: NDA శిక్షణ పూర్తిచేసుకున్న 17 మంది మహిళా క్యాడెట్లుసిగరెట్, బీడీ అలవాటు వల్ల కణాల డీఎన్ఏను రూటు మార్చే పొగాకు ఉత్పత్తుల రసాయనాలు.. రోగ నిరోధక శక్తిని దారుణంగా దెబ్బ తీస్తాయి. దేహ పోరాట పటిమను సమాధి చేస్తాయి. వెరసి కణాలపై రాక్షసంగా దండయాత్ర చేసి.. దేహాన్ని జబ్బులతో అష్ట దిగ్బంధనం చేసేస్తాయి. రొంపిలో దిగబడ్డ ప్రాణిలా.. ఊపిరి ఆడకుండా చేస్తాయి.మరి ఊపిరి ఆడకుండా నరకం చూపించే పొగాకుతో దోస్తీ దేనికి?ధూమపానానికి దూరంగా ఉంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా మన దగ్గరే ఉంటుంది.- మాచన రఘునందన్పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీతతెలంగాణ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ -
Jeff Bezos మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికి ముందే జాగ్రత్తపడుతున్న బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు, భూమిపై అత్యంత ధనవంతులలో ఒకరైన జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఇది బిజినెస్ వ్యవహారమో, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించో కాదు. ప్రియురాలితో రెండో పెళ్లికి ముందే బిలియన్ డాలర్ల తన సంపదను కాపాడుకునేందుకు న్యాయపరంగా ఒక కీలకమైన చర్య తీసుకోబోతున్నాడు. అమెరికన్ టీవీ, రిపోర్టర్ లారెన్ సాంచెజ్ (Lauren Sánchez)తో 2023లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వచ్చే నెలలో గ్రాండ్ వెడ్డింగ్కు ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు నెట్టింట్ హల్ చల్ చేస్తున్నాయి. మొదటి భార్యతో విడాకులు, భారీ భరణం నేపథ్యంలో బెజోస్ తాజా ఏర్పాట్టు మరింత ఆసక్తి కరంగా మారాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తమ వివాహం ఇప్పటికే చాలా అలస్యమైన కారణంగా వీలైనంత త్వరగా తమ వివాహాన్ని చేసుకోవాలని 61 ఏళ్ల జెఫ్ బెజోస్ (Jeff Bezos) ప్లాన్ చేస్తున్నాడట. అయితే జెఫ్ 220 బిలియన్ డాలర్ల సంపదను ( సుమారు 18.84 లక్షల కోట్ల రూపాయలు) భద్రపరచడానికి ఐరన్ క్లాడ్ ప్రెనప్కు సన్నాహాలు చేసుకున్నాడని అంతర్జాతీయ మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. వివాహానికిముందే చేసుకోబోయే ఈ పటిష్ఠ ఒప్పందాన్ని సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నందున పెళ్లికి సమయం తీసుకుంటున్నాడట. అటు గ్లోబల్ న్యాయనిపుణులు దీనిపై భారీ కసరత్తే చేస్తున్నారు.అసలేంటీ ప్రెనప్వివాహానికి ముందు ఒక జంట వ్రాతపూర్వకంగా చేసుకునే ఒప్పందం. విడాకులు లేదా మరణానికి సంబంధించిన సంభావ్య ఆర్థిక సంక్లిష్టతలను నిర్వహించడానికి ఇది ఒక మార్గం, విడాకుల సందర్భంలో ఆస్తులు , అప్పులు ఎలా విభజించబడతాయో ఇందులో పొందుపరుస్తారు. ముఖ్యంగా ఆయా జంటలు రాష్ట్రం లేదా దేశంలోని నియమ నిబంధనలపై ఆధారపడకుండా వారి స్వంత నిబంధనలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తుంది.సర్టిఫైడ్ ఫ్యామిలీ లా అటార్నీ ఆల్ఫోన్స్ ప్రొవిన్జియానోను సంప్రదించిన జెఫ్ త్వరలోనే దీనిపై సంతకం చేయనున్నాడు. ప్రస్తుత ఆస్తులు, ఆస్తులు, హోల్డింగ్ పెట్టుబడులు మొదలైన వాటి జాబితా ఉండవచ్చని , వాటిని ప్రత్యేక సంస్థలుగా లేబుల్ చేయవచ్చని వివరించారు. కాబట్టి, భవిష్యత్తులో లారెన్ సాంచెజ్ జెఫ్ వ్యాపార సంస్థల వృద్ధికి తోడ్పడటానికి ముందుకు వచ్చినప్పటికీ, ఒక వేళ విడిపోతే, ఆ సందర్భంలో వాటి యాజమాన్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త. అయితే, వ్యాపారవేత్త తన ఆర్థిక , ఆస్తులన్నింటినీ బహిర్గతం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ లీగల్ అగ్రిమంట్ డ్రాఫ్టింగ్ కష్టతరంగా మారిందట. ముఖ్యంగా అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, ఆర్థిక సలహాదారుల బృందంతో సంప్రదింపులు జరగాల్సి ఉంటుందని అంచనా. అంతేకాదు ఇది సాధారణంగా రెండు వైపులా న్యాయవాదుల బృందాలను కలిగి ఉండే సుదీర్ఘ ప్రక్రియ. దీనికి చెల్లింపులు కూడా భారీ మొత్తంలోనే ఉంటాయి. ఇరు పార్టీల అంగీకారంతో జరిగే ఈ ముందస్తు ఒప్పందానికి చర్చోపచర్చలు, అంగీకారాలు అవసరమంటున్నారు నిపుణులు. కేన్స్ సమీపంలో 500 మిలియన్ డాలర్ల సూపర్యాచ్లో లారెన్కు జెఫ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఈ జంట 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుండి, ఈ జంట అనేక ఈవెంట్లకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రూ. 5 వేల కోట్లు ఖర్చుతో అత్యంత ఘనంగా జెఫ్ రెండోపెళ్లి జరగనుందని సమాచారం.ఇదీ చదవండి: అమెరికా నుంచి 1,080 మంది భారతీయుల బహిష్కరణఅమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ 1993లో మెకంజీ స్కాట్ను పెళ్లి చేసుకున్నాడు.. వీరికి నలుగురు పిల్లలు పుట్టారు. అయితే 25 ఏళ్ల దాంపత్యం జీవితం తరువాత 2019లో విడాకుల ప్రకటన చేయడం యావత్ ప్రపంచాన్ని విస్మయపర్చింది. అయితే మెంకజీతో విడాకులకు ముందు (2018) నుంచే జెబోస్, 54 ఏళ్ల మహిళా జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్తో డేటింగ్లో ఉన్నాడు. కొన్నాళ్లకు విలాసవంతమైన నౌకలో 2.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.21 కోట్ల) డైమండ్ రింగ్తో ఆమెకు ప్రపోజ్ చేశాడు. అటు లారెన్ శాంచెజ్కు ఇప్పటికే రెండుసార్లు వివాహమైంది. పాట్రిక్ వైట్ సెల్ తో, పెళ్లి ఇద్దరు పిల్లలు తరువాత విడాకులు తీసుకుంది. ఆ తరువాత మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు టోనీ గోంజెలెజ్ను పెళ్ళాడింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా! మెకెంజీతో జెఫ్ బెజోస్ ఖరీదైన విడాకులుచరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులు అంటే జెఫ్, మెకంజీదే. అమెజాన్ కేవలం ఆన్లైన్ పుస్తక రిటైలర్గా ఉన్నప్పుడు వివాహం, అమెజాన్ విజయంలో అండగా నిలిచిన అతని మాజీ భార్యకు కంపెనీలో నాలుగు శాతం వాటా లభించింది. దీంతో ఆమె అత్యంత ధనవంతురాలైన మహిళల జాబితాలో చేరింది. -
'చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై జైశంకర్ మాట
భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్కు ఉన్న కుటుంబ నేపథ్యం ఏ మంత్రికీ ఉండకపోవచ్చు. ఆయన తండ్రి కే.సుబ్రహ్మణ్యం.. 1951 ఐఏఎస్ బ్యాచ్ టాపర్. ఆయన్ను చాలామంది కె.ఎస్ అని, సుబ్బు అని పిలుస్తుంటారు. అంతేగాదు భారత దౌత్య రంగానికి గురువు అని కూడా పిలుస్తారు. ఆ నేపథ్యం నుంచి వచ్చిన జై శంకర్ కూడా అంతే చురుకుగా ఉంటూ.. దూకుడుతో నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసా?.. వృత్తిపరంగా అత్యంత బిజీగా ఉండే జైశంకర్ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే మొదలైపోతుందట. ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ కాల్స్, వార్తపత్రికలు సమాచారం తెలుసుకోవడం, ఆ రోజు ఉన్న ఈవెంట్లు, హాజరుకావల్సిన కార్యక్రమాలు షెడ్యూల్ చూసుకోడం వంటి గందరగోళంతో ఉంటుందట. అంత ఫుల్బిజీలో కూడా తనకున్న ఒక్క అలవాటే తన ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందట. అదే తన ఆరోగ్య రహస్యమని అంటున్నారు జైశంకర్. ఎప్పుడే ఏ దేశంలో ఉంటామన్నది తెలియని పరిస్థతి కాబట్టి కచ్చితంగా వ్యాయామాలు, యోగా వంటివి చేయడం కుదరదని చెబుతున్నారు. అందువల్ల ఆయన దినచర్య తానున్న ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటుందట. సాధారణ రోజుల్లో మాత్రం చాలామటుకు తన రోజు.. ఉదయం ఆరుగంటల నుంచి మొదలవ్వుతుందట. అయితే కచ్చితంగా ఉదయం స్క్వాష్ గేమ్ ఆడతారట. ఎంత బిజీ షెడ్యూల్ అయినా..ఓ అరగంట అది ఆడాల్సిందేనని చెబుతున్నారు. అలాగే తప భార్యతో కలిసి ఓ అరగంట వాక్ చేస్తానన్నారు. ఎందుకంటే తన భార్యతో స్పెండ్ చేసేందుకు అదే తనకు తగిన సమయమని చెబుతున్నారు. అదీగాక నిత్యం పర్యటించే జై శంకర్కు కుటుంబంతో గడపడం, ఫిట్నెస్పై దృష్టిసారించడం అనేవి అత్యంత సవాలుతో కూడినవి. కాబట్టి తన లైఫ్స్టైల్కి అనుగుణంగా ఆరోగ్యకరమైన అలవాట్లకు సంబంధించి కనీసం రెండు అలవాట్లను తప్పనిసరిగా తన దినచర్యలో భాగం చేసుకుంటారట. అలాగే కుటుంబంతో గడపటం కోసం..భార్యతో సంభాషిస్తూ చేసే వాకింగ్ అనేది కూడా తప్పనిసరి అని అన్నారు. పర్యటనలో లేకపోతే..తన భాగస్వామితో గడపటానికి తప్పనిసరిగా అరగంట సమాయాన్ని కేటాయిస్తానని చెప్పారు. అలాగే తన వర్క్ లైఫ్ ఉదయం 9.30 గంటలకు మొదలవుతుందట. ఇక అక్కడ నుంచి ఉన్నత స్థాయి సమావేశాలు, సమీక్షలు, మంత్రిత్వ శాఖ ఫైళ్లను క్లియర్ చేయడం, పాశ్చాత్య దేశాలతో ఫోన్లో దౌత్య సంభాషణలు జరపడం వంటి కార్యక్రమాల్లో మునిగిపోతానని చెప్పారు. ఇక సినిమాలు చూసే ఛాన్సే లేదని అన్నారు. ఎందుకంటే.. రెండు గంటల్లో అయిపోయే సినిమా ఉండదు కదా అని నవ్వేశారు. చివరగా ఆయన విదేశాంగ మంత్రిగా వర్క్కి సంబంధించి..24/7 అత్యంత బిజీగా ఉండాల్సిన పరిస్థితి అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యానికి సంబంధించిన ఆ అలవాట్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో మిస్ అవ్వనని చెప్పారు. అంతేగాదు ఎంత పని గందరగోళంతో ఉన్నా..జీవితాన్ని అందంగా ఓ నిర్షిష్ట పద్ధతిలో నిర్మించుకోవడంలో విఫలమవ్వకూడదని అన్నారు జైశంకర్. బిజీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే కానీ, జీవితాన్ని అందంగా మలుచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుందని తేల్చి చెప్పారు విదేశాంగ మంత్రి జైశంకర్. చెప్పాలంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే అసలైన అర్థం మన విదేశాంగ మంత్రి లైఫ్స్టైలే కదూ..! సో.. మనం కూడా పని జీవితం తోపాటు..మన కుటుంబ జీవితానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇద్దాం..ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకుందాం. (చదవండి: మహిళా సైనికులకు ఇన్ని ఆరోగ్య సవాళ్లు ఉంటాయా..? అందుకే ఇజ్రాయెల్..) -
స్టడీ అండ్ సర్వీస్ : గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో యువత సేవలు
చదువులు, ఉద్యోగాలు ఆ తర్వాత జీవితపు బాధ్యతలలో తలమునకలవడంతోనే సరిపెట్టుకోకూడదు అనుకుంటుంది నవతరం. సమాజసేవను బాధ్యతగా తీసుకుంటూ చదువు–సేవ రెండింటీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ద్వారా దాదాపు తొంభై మంది యువ విద్యార్థులు నగరంలోని స్లమ్స్తో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని వారికి సేవలు అందిస్తూ ‘మేమున్నాం’ అని బాసటగా నిలుస్తున్నారు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.గ్రామీణ ప్రాంతాలు బాగుపడినప్పుడే దేశం అభివృద్ధిలో ముందంజలో ఉంటుందన్నది మహాత్ముని మాట. ఇప్పుడు ఆ మాటలు నిజం చేస్తూ యువత ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలను హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ద్వారా నిర్వహిస్తున్నారు. తమ సేవాకార్యక్రమాలతో మారుమూలస్థాయి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నగరంలోని వివిధ కాలేజీల నుంచి 90 మందికి పైగా విద్యార్థులు తమ సేవలను అందిస్తున్నారు. ‘యువతలో సాధికారత, సామాజిక మార్పు’ అనే నినాదంతో వీరు చేస్తున్న సేవాకార్యక్రమాలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఇరువైపులా అవగాహనఇప్పుడు మేం చేస్తున్నది రెవల్యూషనరీ సీజన్. దీనిలో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సోలార్ పవర్, శుభ్రత పట్ల అవగాహన, మంచినీటి సౌకర్యం, ఆహార వ్యర్ధాన్ని నిరోధించడం, వాటర్ వీల్ డిస్ట్రిబ్యూషన్... మొదలైన వాటి మీద వర్క్ చేస్తున్నాం. ఇందులో దాదాపు 90 మంది కాలేజీ విద్యార్థులు పాల్గొంటున్నారు. హైదరాబాద్తోపాటు తెలంగాణలోని మారు మూల ప్రాంతాలకు వెళ్లి స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నాం. నగరంలోని స్లమ్స్, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని సమస్యలను గుర్తించడం, పరిష్కార దిశగా చేసిన ఆలోచలను మూడు నెలలకు ఒకసారి అందరం కలిసి, చర్చిస్తాం. ఎక్కడ ముందస్తు సేవ అవసరం అవుతుందో దానిని ప్రధానంగా తీసుకుంటాం. వీటి ద్వారా చదువొక్కటే కాకుండా సమాజంలో ఉన్న సమస్యలపై అవగాహన కూడా కలుగుతుంది. బాధ్యత పెరుగుతుంది. – లాస్య వంకదారి,ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్, హైదరాబాద్ యూత్ అసెంబ్లీ చైర్ పర్సన్ప్రాజెక్ట్ రిపోర్ట్తో: ప్రతి సీజన్లో ఎనిమిది ప్రధాన సమస్యలపై వర్క్ చేస్తుంటాం. ముందుగా అందరం కలిసి, చర్చించుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసుకుంటాం. మెంబర్స్ అందరం అమ్మానాన్నలు, స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఫండ్ సేకరిస్తాం. ఆ మొత్తాన్ని యూత్ అసెంబ్లీ ద్వారా ఒక మంచి పనికోసం కేటాయించి, సేవలో పాల్గొనడం సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను కలిగిస్తుంది. ఈ నెల 31న భద్రాద్రి కొత్తగూడెంలో స్కూల్కి సంబంధించి ఈవెంట్ చేస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న తాండాల వారికి, గర్భవతులకు, పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చేలా ప్లాలాన్ చేస్తున్నాం. నవజాత శిశువులకు అవసరమయ్యే వస్తువులను కూడా అందిస్తున్నాం. కిందటిసారి ములుగులో చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. – విజయ్, బిటెక్ ఫస్టియర్, కరియర్ గైడెన్స్లో అవగాహన: హైదరాబాద్స్ట్రీట్ కాజ్ ఆర్గనైజేషన్లో మూడేళ్ల పాటు వర్క్ చేశాను. ఇప్పుడు యూత్ అసెంబ్లీ నుంచి సేవలు అందిస్తున్నాను. పట్టణాల్లో ఉన్న నిరుపేదల జీవనశైలిని మార్చే ప్రయత్నం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, స్కూల్స్కు వెళ్లి కెరియర్ గైడెన్స్ వంటివి చేస్తున్నాం. సిద్దిపేటలోని కిష్టాపూర్, ములుగు ప్రాంతంలోని తక్కెళ్లగూడెంలో సోలార్ ΄్యానెల్స్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ స్కూల్లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు, డిజిటల్ అవేర్నెస్... వంటివి చేశాం. – చంద్రశేఖర్, బీటెక్ థర్డ్ ఇయర్, ఇంబ్రహీంపట్నం -
అలరించిన మహా నృత్యోత్సవం..
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ నాట్య శిల్పి ఆర్ట్స్ అకాడమీ 35వ ఉచిత నాట్య శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు రవీంద్రభారతిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత శిక్షణ పొందిన వంద మంది చిన్నారులు మహా నృత్యోత్సవం పేరిట కూచిపూడి, జానపద, దాండియా నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ.. చిన్నారులకు ఉచితంగా శాస్త్రీయ సంగీత కళలపై శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. అంతకు ముందు అకాడమీ వ్యవస్థాపకులు వాసుకి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రదర్శించిన లైట్ ఆఫ్ బుద్ద నాటకం హైలెట్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు లయన్ సర్దార్ హర్బీందర్ సింగ్, సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్రెడ్డి, అకాడమీ డైరెక్టర్ పుష్పలత పాల్గొన్నారు. (చదవండి: విశ్వ వేదికపై.. నాటు పాట..! వైరల్గా తెలుగు పాటలు..) -
బాధ్యతను గుర్తుచేసేలా.. అబ్బురపరుస్తున్న వన్యప్రాణుల చిత్రాలు..!
వన్య ప్రాణులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తుచేస్తూ తెలంగాణ రాష్ట్రం బేగంపేట ప్రకాశ్నగర్ ఫ్లైఓవర్ పిల్లర్స్ను వన్యప్రాణుల చిత్రాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులను వన్య ప్రాణుల బొమ్మలు కట్టిపడేస్తున్నాయి. జీవకళ ఉట్టిపడే రీతిలో చిత్రకారులు గీసిన బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిరుతలు, పులులు, ఏనుగులు, ఎగులుబంట్లు, జాతీయ పక్షి నెమళ్లు, జింకలు, సింహాలు.. ఇలా రకరకాల వన్యప్రాణుల చిత్రాలు చూస్తే వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యతను అటుగా వెళ్లే ప్రయాణికులకు గుర్తుచేస్తున్నాయి. భారత జులాజికల్ సర్వే(జెడ్ఎస్ఐ) ప్రకారం దేశంలో మొత్తం 89 వేలకు పైగా జంతు జాతులు ఉన్నాయి. వీటిలో కూడా అనేకం అంతరించిపోయే ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. అలాంటి వన్య ప్రాణులను సంరక్షించుకోవడం ద్వారా అటవీ సంపదను కాపాడిన వారమవుతామని, దీని ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని ప్రభుత్వాలు, ఎన్జీవోలు, పర్యావరణ వేత్తలు నిత్యం పలు రూపాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే వస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా ఉన్న ఫ్లైఓవర్ల సుందరీకరణలో భాగంగా బేగంపేట ప్రకాష్నగర్(ఎయిర్పోర్ట్ ఎదురుగా) ఫ్లైఓవర్ పిల్లర్స్కు వేసిన చిత్రాలను చూస్తే అద్భుతమనిపిస్తోంది. సందేశాత్మక థీమ్తో అబ్బురపడేలా వేసిన చిత్రాలు ఒక దానికి మించి మరొకటి ఉంది. (చదవండి: డీఎన్డీ మోడ్..! ఈజీగా నోటిఫికేషన్స్, ఫోన్కాల్స్ మ్యూట్ చెయ్యొచ్చు..) -
కొబ్బరి చిప్పలతో వాటర్ బాటిల్స్..!
వ్యర్థానికి కూడా అర్థాలు చెప్పవచ్చంటూ ఓ విద్యార్థి తనదైన శైలిలో కొబ్బరి చిప్పలతో ‘కోకోనట్ షెల్ వాటర్ బాటిల్’ తయారు చేసి తన సత్తాను చాటారు. ఏదైనా వినూత్నంగా వెదురుబొంగు, కొబ్బరి, బనానా ఫైబర్, తాటాకుల సహాయంతో నూతనంగా ప్రజావసరానికి అనుగుణంగా వినియోగించే వాటిని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా కోకోనట్ షెల్తో ఈ వాటర్ బాటిల్ రూపొందించినట్లు విద్యార్థి స్పష్టం చేశారు. రాయదుర్గంలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్–హైదరాబాద్ (ఎఫ్డీడీఐ–హైదరాబాద్) బి.డెస్ (లైఫ్ స్టైల్ అండ్ యాక్సెసరీస్ డిజైన్)ఎల్ఎల్పీడీ విభాగం కోర్సులో మూడో ఏడాది చదివే మత్తగుంజ అనిరుద్ ప్యాకేజ్ డిజైన్ రూపకల్పనలో భాగంగా ఈ వాటర్ బాటిల్ను తయారు చేయడం విశేషం. (చదవండి: ఫ్యాషన్కి సరికొత్త అర్థం..! 'సంస్కృత శ్లోకాల సంస్కృతి'..) -
Miss World 2025: విశ్వ వేదికపై.. నాటు పాట..
అంతర్జాతీయంగా ప్రపంచ సుందరి పోటీలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు మిస్ వరల్డ్గా భారతీయులు కిరీటం గెలిస్తే గొప్పగా కీర్తించుకున్నాం.. కానీ గతేడాది 71వ మిస్ వరల్డ్ ముంబైలో, ఈ సారి 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ (హైదరాబాద్)లో నిర్వహించడంతో ఇండియా విశిష్టత విశ్వవ్యాప్తమైంది. అయితే ఈ సారి నగరంలో జరుగుతున్న పోటీల నేపథ్యంలో హైదరాబాద్కు మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు తెలుగు పాటలు సైతం వైరల్గా మారాయి. ఏ దేశంలో ఈ పోటీలు జరిగినా ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు రావడం సహజమే. అయితే వినూత్నంగా ఈ సారి తెలుగు పాటలు వైరల్గా మారాయి. దీనికి కారణం.. ఈ సారి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలుగు పాటలకు అభిమానులుగా మారడం చెప్పుకోవాల్సిన విషయం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బసచేస్తున్న ట్రైడెంట్ హోటల్ వేదికగా మిస్ నైజీరియా పాడిన ‘రానూ.. బొంబైకి రానూ’ అనే పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో జానపద సాహిత్యంతో రూపొందించిన ప్రైవేట్ సాంగ్ రాను బొంబైకి రాను..!! తెలంగాణతో పాటు దక్షినాది వరకూ ఫేమస్ కావడం ఓకే.. కానీ ఏకంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఈ పాటను పాడటం, దీనికి స్టెప్పులేయం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ పాట వైరల్ అవ్వడమో లేదా మిస్ నైజీరియాకు తెగ నచ్చేసిందో తెలియదు కానీ.. మిస్ వరల్డ్ పోటీల్లో ముఖ్యమైన టాలెంట్ రౌండ్లోనూ ఈ ముద్దుగుమ్మ ఇదే పాటకు డ్యాన్స్ వేశారు. వినూత్నంగా ఇండో ఆఫ్రికన్ డ్యాన్స్ అంటూ ఈ తెలుగు పాట, తమ దేశానికి చెందిన పాటలతో తన టాలెంట్ రౌండ్ను ప్రదర్శించారు. ఐతే ఇదే రౌండ్ చివరలో 20 దేశాలకు చెందిన టాలెంట్ రౌండ్ ఫైనలిస్టులు మళ్లీ ఇదే పాటకు స్టెప్పులేయడం మరోసారి వైరల్గా మారింది. ఇందులో మిస్ ఇండియా నందినీ గుప్తా అదిరిపోయే స్టెప్పులేశారు.. మార్ఫా స్పెషల్.. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో మిస్ తారలతో నగరంలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ‘హెరిటేజ్ వాక్’ నిర్వహించిన విషయం విధితమే. ఐతే ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన మార్ఫా సంగీతానికి ఈ సుందరీమణులు డ్యాన్స్ వేసి సందడి చేశారు. ఈ వీడియోలు తమ సోషల్ మీడియా యాప్స్లో పోస్ట్ చేయగా ప్రపంచవ్యాప్తంగా తిలకించారు.కుర్చీ మడత పెట్టి.. అందరూ తెలుగు పాటలతో అదరగొడితే.. మిస్ ఇండియా నందినీ గుప్తా మాత్రం సూపర్ స్టార్ మహేష్బాబు ‘కుర్చీ మడత పెట్టి...’ అనే డైలాగ్ కం పాటతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.ఎలా ఉన్నారూ..?? మరో కార్యక్రమంలో భాగంగా ఈ ముద్దుగుమ్మలంతా తెలంగాణ వారసత్వ వైభవాన్ని, విశిష్టతను తిలకించడానికి వరంగల్ వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిస్ కెనడా.. తెలుగులో ‘నమస్తే.. ఎలా ఉన్నారు’ అని సందడి చేయగా, మిస్ యూఎస్ఏ.. ‘అందరూ బాగున్నారా’ అంటూ పలకరించారు. మిస్ అర్జెంటీనా ఐతే పాన్ ఇండియా ఫేమస్ తెలుగు డైలాగ్ ‘తగ్గేదే లే’ అంటూ అలరించారు. ఈ అందాల తారల నోటి వెంట ముచ్చటగొలిపే ఈ మాటలు సైతం యూట్యూబ్లో, సోషల్ యాప్స్లో చక్కర్లు కొడుతున్నాయి.బాలీవుడ్ స్వరాలు సైతం.. ఇవే కాకుండా జిలేబి బేబీ, ఓం శాంతి ఓం, ధూమచాలే వంటి బాలీవుడ్ ఇండియన్ బాలీవుడ్ పాటలతోనూ పలువురు మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు.తీన్మార్.. నగరంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ప్రపంచ సుందరీమణులతో నిర్వహించిన స్పోర్ట్ ఈవెంట్లో కూడా తెలుగు పాటలకు, తీన్మార్ బ్యాండ్కు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. హోర్ట్ ఆఫ్ గోల్డ్ పేరుతో ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో సైతం అనాథ చిన్నారులను ఉత్సాహపరచడానికి తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చిన నాటు నాటు పాటతో పాటు డీజే టిల్లూ, ఇడియట్, అద్దాలా మేడలున్నవే అనే తెలుగు పాటలకు డ్యాన్సులు చేసి మరో సారి తెలుగు సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదించారు.అందాల బొమ్మ నోట.. బుట్టబొమ్మా పాట..మిస్ వరల్డ్ కంటెస్టెంట్, మిస్ జర్మనీ సైతం మరో తెలుగు పాటతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందాలొలికే ఈ ముద్దుగుమ్మ క్యూట్ క్యూట్ వాయిస్తో బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా నను చుట్టూకుంటివే అనే అల్లూ అర్జున్ టాప్ హిట్ సాంగ్ పాడి అందరి మనసులూ దోచుకున్నారు. ఈ పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ చేసిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతేకాకుండా చుమ్కా కీరా హోయ్ అనే మరో బాలీవుడ్ పాటను సైతం పాడారు. (చదవండి: Miss World 2025: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..! అత్యధిక టైటిల్స్ గెలిచిన ఏకైక దేశంగా..) -
డీఎన్డీ మోడ్..! ఈజీగా నోటిఫికేషన్స్, ఫోన్కాల్స్ మ్యూట్ చెయ్యొచ్చు..
పనిచేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్ఫోన్ల నుంచి తరచుగా వచ్చే నోటిఫికేషన్లు దృష్టిని మరల్చుతుంటాయి. అలా అని ఫోన్ను ఏరోప్లేన్ మోడ్లో ఉంచడం మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎన్డీ మోడ్గా ప్రసిద్ధి చెందిన ‘డూ నాట్ డిస్టర్బ్ మోడ్’ అవసరం. అప్లికేషన్ల నుండి నోటిఫికేషన్లను బ్లాక్ చేయడానికి, ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు దృష్టిని మరల్చే ఫోన్కాల్లను మ్యూట్ చేయడానికి డీఎన్డీ ఉపయోగపడుతుంది. డీఎన్డీ సెట్టింగ్ బ్రాండ్ నుంచి బ్రాండ్కు భిన్నంగా ఉంటుంది. కానీ బేసిక్స్ మాత్రం అలాగే ఉంటాయి.డీన్డీ సెట్ చేయడానికి...ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చెయ్యాలి ∙ ‘డోన్ట్ డిస్టర్బ్’ అని సెర్చ్బార్లో టైప్ చేయాలి. ∙ఆండ్రాయిడ్ ఫోన్లోని క్విక్ సెట్టింగ్ ప్యానెల్లో కూడా డీఎన్డీ కనిపిస్తుంది. ∙ఇప్పుడు డీఎన్డీ మోడ్ ఆన్ చేయవచ్చు డీఎన్డీని షెడ్యూల్డ్ చేయడానికి ‘షెడ్యూల్డ్’ను క్లిక్ చేయాలి ప్లస్(+) సైన్లోకి వెళ్లి యాక్టివిటీని ఎంపిక చేసుకోవాలి. ఉదా: వర్కింగ్, స్లీపింగ్, స్టడీ... మొదలైనవి డీఎన్డీ మోడ్ టైమింగ్స్ ఎంపిక చేసుకోవచ్చు ∙ఎక్సెప్షెన్స్ను యాడ్ చేసుకోవచ్చు. ఉదా: బాస్, వైఫ్, ఫాదర్, మదర్... మొదలైనవి ∙నోటిఫికేషన్ రిసీవ్ చేసుకోవాలనుకునే యాప్లను కూడా యాడ్ చేసుకోవచ్చు.(చదవండి: డైట్ సెన్స్ ఉంటే చాలు..! ఆరోగ్యం మన చేతిలోనే..) -
డైట్ సెన్స్ ఉంటే చాలు..! ఆరోగ్యం మన చేతిలోనే..
ఇన్స్టాగ్రామ్లో 1.5 మిలియన్ల (15 లక్షలమంది) ఫాలోవర్స్ ఉన్న ఫిట్నెస్, న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్ తన పుస్తకాల ద్వారా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం ‘డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్’ పుస్తకంతో పాపులర్ అయింది. ఆమె తాజా పుస్తకం...కామన్సెన్స్ డైట్. మన ఆహారం, ఆహారపు నియమాలు, ఉపవాసాలు... ఇలా అనేక అంశాలపై తలెత్తే సందేహాలకు సమాధానం ఇస్తుందామె.‘ఏది తినాలి... ఏది తినకూడదు అని తెలుసుకోవడానికి ఇబ్బంది పడనక్కర్లేదు. అదేమీ రాకెట్ సైన్స్ కాదు. కామన్ సెన్స్ మాత్రమే. హెల్త్ అంటే సిక్స్–ప్యాక్ మెయింటైన్ చేయడం. బరువు తగ్గడమే పనిగా పెట్టుకోవడం కాదు’ అంటుంది రుజుత.‘మంచి ఆరోగ్యం గురించి ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. బేసిక్స్ను చెక్ చేసుకుంటే సరిపోతుంది. సమయానికి భోజనం చేస్తున్నామా? వ్యాయామాలు మరీ ఎక్కువగా చేస్తున్నామా? అసలే చేయడం లేదా? రాత్రి లేటుగా నిద్ర΄ోతున్నామా?... మొదట ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి’‘ఆరోగ్యానికి సంబంధించి ఏది సరిౖయెన సమాచారమో, కాదో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సోషల్ మీడియా ద్వారా హెల్త్కు సంబంధించిన సమాచారం కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’‘తినే ఆహారం మనకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. అలా కాని పక్షంలో జాగ్రత్త పడాల్సిందే’... ఇలాంటి విషయాలెన్నో ‘కామన్ సెన్స్ డైట్’ పుస్తకంలో ఉన్నాయి. (చదవండి: కెమిస్ట్రీ ప్రొఫెసర్నా.. మజాకా! ఆమె వాదనకు కోర్టే కంగుతింది!) -
ఎవరీ జోనాస్ మాసెట్టి ..? అలవోకగా వేదాలు, భగవద్గీత..
భారతీయ సంప్రదాయాలకు ఆకర్షతులై ఆ జీవన విధానంతో బతికే విదేశీయలు ఎందరో ఉన్నారు. మన దేశ సంస్కృతి గొప్పతనం ప్రపంచానికి తెలియడానికి ఒక రకంగా ఇలాంటి విదేశీయులు కూడా కారణమని చెప్పొచ్చు. అలానే బ్రెజిల్కి చెందిన జోనాస్ మాసెట్టి మన దేశ సంప్రదాయాలకు ఆకర్షితులై వేదాన్ని నేర్చుకోవడమే గాక తన దేశంలో వాటి గురించి ప్రచారం చేసి..సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మన ప్రధాని మోదీ సైతం ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. మనకీ బాత్లో కూడా ఆయన గురించి ప్రస్తావించించారు. ఇంతకీ ఎవరీ జోనాస్ అంటే..బ్రెజిల్లోని రియో డిజెనిరియోలో జన్మించిన జోనాస్ మాసెట్టి మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (IME) నుచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రెజిలియన్ ఆర్మీలో ఐదేళ్లు పనిచేశారు. అలాగే కొన్నాళ్లు కన్సల్టింగ్ స్టాక్ కంపెనీల్లో కూడా పనిచేశాడు. భారతీయ సంప్రదాయాలకు, వేదాలకు ఆకర్షితుడై, చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇండియాకు వచ్చాడు. కోయంబత్తూర్లోని అర్ష వైద్య గురుకులంలో 4 సంవత్సరాల పాటు వేదాలను అభ్యసించాడు. ఆ తర్వాత బ్రెజిల్ వెళ్లి అక్కడ ‘విశ్వ వైద్య’ అనే ఆర్గనైజేషన్ను నెలకొల్పి.. వేదాలు వాటి విలువను, సారాంశాన్ని తన దేశ ప్రజలకు బోధిస్తున్నారు. అలాగే అవి మరింతమంది ప్రజలకు చేరువయ్యేలా ‘వేదాంత.లైఫ్’ అనే వెబ్సైట్ సాంకేతికతను వాడుకూంటూ.. వేదాల గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు. అంతేకాదు జోనస్ తన పేరు చివరన ‘విశ్వనాథ్’ను యాడ్ చేసుకోవడం విశేషం. అలాగే మన ప్రధాని మోదీ సైతం ఆయన చేస్తున్న పని అభినందనీయమైనదని కొనియాడారు. అంతేగాదు జోనస్ తన 'ఫ్రీ ఓపెన్ కోర్సు' ద్వారా ఏడేళ్లలో సుమారు 1.5 లక్షలకు పైగా విద్యార్థులకు వేద విలువలను బోధించారని మన్కీ బాత్ కార్యక్రమంలో చెప్పారు మోదీ. అంతేగాదు ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక కృషికి గానూ భారత ప్రభుత్వ పద్మ శ్రీ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. మరో విశేషమేమిటంటే వేద గురువు జోనాస్ చెప్పుల్లేకుండా తెల్లటి ధోతి, నుదుటన తిలకంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. కాగా ఆయన గతేడాది జీ20 శిఖరాగ్ర సమవేశానికి హాజరై అతని బృందంతో సంస్కృతంలో రామాయణాన్ని ప్రదర్శించి అలరించారు కూడా. (చదవండి: కెమిస్ట్రీ ప్రొఫెసర్నా.. మజాకా! ఆమె వాదనకు కోర్టే కంగుతింది!) -
పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల కాలంలో అందిరిలోనూ ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ పోషకాహారంపై దృష్టి పెడుతున్నారు. అలాగే బరువు అదుపులో ఉంచుకునే యత్రం చేస్తున్నారు. అందులో భాగంగా మార్నింగ్ సమయంలో పచ్చి కూరగాయ సలాడ్లు, స్మూతీలు వంటివి తీసుకుంటున్నారు. అలానే ఇక్కడొక మహిళ బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా సలాడ్లు తీసుకునేది. ఆ తర్వాత కొద్దిరోజులకే అనారోగ్య పాలైంది. ఆమె ఎందికిలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని..పరీక్షించగా అసలు విషయం తెలిసి వైద్యలు కంగుతిన్నారు. అంతేగాదు దయ చేసి పచ్చి కూరగాయలు తినేందుకు ప్రయత్నించొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలా పచ్చిగా తీసుకోవడం వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి సవివరంగా వెల్లడించారు. మరీ అవేంటో సవివరంగా తెలుసుకుందామా..!.35 ఏళ్ల మహిళ తరుచుగా తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నానంటూ ఆస్పత్రికి వచ్చింది. బరువు తగ్గే క్రమంలో స్ట్రిక్టడైట్ ఫాలో అయ్యి ఇలా ఇబ్బంది పడుతుందా అనే దిశగా ఆ మహిళను విచారించారు. అయితే ఆ మహిళ స్ప్రుహతప్పి పడిపోవడం, మూర్చ వంటి పలు సమస్యలను ఎదుర్కొనడంతో రక్త పరీక్షలు వంటి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమె మెదులో గాయంతో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. దానికి కారణమేంటని..చూసిన వైద్యుడి ఆరోగ్య చరిత్రలో తలకు గాయమైన దాఖాలాలు లేవు. దీంతో ఆమె ప్రతి రోజు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారని ప్రశ్నించగా..ఆమె పచ్చి క్యాబేజీ, పాలకూర వంటి కూరగాయలను తీసుకుంటానని చెప్పింది. దీని కారణంగానే ఆమె బ్రెయిన్ సిస్ట్తో బాధపడుతుందని వైద్యులు నిర్థారణకు వచ్చి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలా జరగడానికి కారణం..ఈ పరిస్థితిని న్యూరోసిస్టిసెర్కోసిస్ లేదా బ్రెయిన్ వార్మ్ అని పిలుస్తారు. దీనికారణంగా పిల్లలు, పెద్దలు తరుచుగా మూర్చ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. మరీ ఈ మహిళ ఈ పరిస్థితి బారిన పడటానికి ప్రధాన కారణం బ్రేక్ ఫాస్ట్గా సలాడ్లో తీసుకునే పచ్చి కాయగూరలేనని చెప్పారు. పచ్చి కాయగూరలు తీసుకోవడం మంచిది కాదా..? అంటే..ముమ్మాటికి మంచిది కాదనే అంటున్నారు వైద్యులు. వీటిల్లో బద్దె పురుగులు(టేప్వార్మ్ ) ఉంటాయట. మన నీటితో చక్కగా వాష్ చేశాం అనుకుంటాం గానీ.. అవి ఆకు మడతల్లో ఉండిపోతాయి. అంటే వాటికి సంబంధించిన లార్వాలు వంటివి పచ్చి కూరగాయల్లో ఉండిపోతాయట. ఎప్పుడైతే సలాడ్ పేరుతో పచ్చిగా తింటామో అవి నేరుగా మన కడుపులోకి నేరుగా వెళ్లిపోతాయి. దీంతో బ్రెయిన్ సిస్ట్ వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. మనం ఇలా పచ్చి కూరగాయలు తినగానే ఆ టేప్వార్మ్ సంబంధిత లార్వాలు రక్తప్రవాహంలోకి వెళ్లి..అక్కడ నుంచి మెదడు ప్రయాణించి తిత్తులుగా ఏర్పడతాయన్నారు. అంటే వాపు లేదా ద్రవం రూపంలో పేరుకుపోతాయట. దీంతో సదరు వ్యక్తికి తర్చుగా మూర్చలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.చికిత్స..యాంటీబయాటిక్, స్టిరాయిడ్లతో ఈ సమస్యను నివారిస్తామని తెలిపారు వైద్యులు. అయితే ఒక్కోసారి ఈ లార్వా గనుక చనిపోయినా..సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయని అన్నారు. బాధితుడు తలనొప్పి వంటి వాటిని తేలిగ్గా తీసుకోకుండా..సకాలంలో వైద్యుడిని సంప్రదిస్తే..ఈ సమస్య నుంచి త్వరితగతిని బయటపడగలరని చెప్పారు. అలాగే ఒక్కోసారి ఈ టేప్ వార్మ్ లార్వా ప్రేగులలో కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. తద్వారా చేతులు, కాళ్లలో వాపు వంటి సమస్యలు వస్తాయట.క్యాబేజీలోనే ఎక్కువ..!క్యాబేజీ బ్యాక్టీరియాకు నిలయమా..? అంటే..అది పెరిగే నేల, కడగడానికి ఉపయోగించే నీరు తదితరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే క్యాబేజ్ని నీటితో వాష్ చేసినప్పటికీ టేప్ వార్మ్ లార్వాలు ఆకుమడతల్లో ఉండిపోతాయి. అందువల్ల వీటిని వేడినీటిలో కొద్దిసేపు ఉడికించి.. సలాడ్గా తీసుకుంటే ప్రమాదం ఉండదని చెబుతున్నారు వైద్యుల. ఈ టేప్ వార్మ్ లార్వాలు తక్కువ ఉడికించే కూరగాయలు, మాంసంలో అలానే ఉండిపోతాయట. అందుకని తగు మోతాదులో ఉడికిస్తే ఎటువంటి సమయం ఉండదని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్..! వీడియో వైరల్) -
అందాల తారలు.. అందమైన హృదయాలు..
అందాన్ని దాటి అద్భుతమైన హృదయాన్ని చూడగలిగితే స్ఫూర్తినిచ్చే మనసులెన్నో, మనుషులెందరో..! దీనికి నిదర్శనంగా నిలిచింది నగరంలో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ వేదిక. రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నగరంలో నిర్వహించిన హార్ట్ ఆఫ్ గోల్డ్ చారిటీ ఈవెంట్ దీనికి నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ బాలసదన్ అనాథ పిల్లలకు సహకారం అందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఈ అనాథ చిన్నారులకు మేమున్నామంటూ పలకరించారు. ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ చిన్నారుల చిట్టి పొట్టి పలుకులను ఆస్వాదించారు. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)వారితో ఆడారు, పాడారు, గుండెకు హత్తుకుని ఆతీ్మయత పంచారు. తారలు దిగివచ్చిన వేళ అంటూ సాగిన ఈ కార్యక్రమంలో దృష్టి లోపం ఉన్న, హెచ్ఐవీతో జీవిస్తున్న పలువురు చిన్నారులు కష్టాలను మర్చిపోయి మధుర స్మృతులను పొందారు. సిస్టర్ సిస్టర్ ఈ తెలుగు పాటకు అలా స్టెప్ వేయొద్దు, నన్ను చూడు ఇలా వెయ్యు అంటూ పసితనాన్ని, స్వచ్ఛతను మిస్ తారలకు చూపించారు. కార్యక్రమంలో మాజీ మిస్ వరల్డ్ క్రిస్టీనాతో పాటు మిస్ ఇండియా నందిని గుప్తా, వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. (చదవండి: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..! అత్యధిక టైటిల్స్ గెలిచిన ఏకైక దేశంగా..) -
క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'
ఒకప్పుడు షూటింగుల్లో పాల్గొనడం అంటే అది నటీనటులకు మాత్రమే అనుకునేవారు. ఇప్పుడు షూట్స్ అంటే పలువురికి రోజువారీ వ్యాపకం కూడా అంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా వేదికగా పాపులారిటీ పెంచుకోవాలనుకుంటున్న అనేక మందికి తమ ఫాలోవర్లను మెప్పించే క్రమంలో తరచూ కొత్త గెటప్స్లో కనిపించాల్సి వస్తోంది. అలాంటి వారికి ఈ అద్దె దుస్తులు బాగా అక్కరకొస్తున్నాయి. మరోవైపు పెళ్లికి ముందు సర్వసాధారణంగా మారిన ప్రీ వెడ్డింగ్ షూట్స్తో పాటు అనేక రకాల స్వీయ చిత్రీకరణలు కూడా బాగా పెరిగాయి. ఇవి కూడా అద్దె దుస్తుల డిమాండ్ను పెంచేస్తున్నాయి.పార్టీల జోరు.. ధరల బేజారు.. నగరంలో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగింది. వారానికి కనీసం రెండు మూడు పారీ్టలకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి సిటీలో బిగ్ సర్కిల్ ఉన్న ప్రతీ వ్యక్తికీ సర్వసాధారణంగా మారింది. అయితే పారీ్టకి వెళ్లే ప్రతిసారి కొత్త డ్రెస్ కొనడం అనేది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొంతమంది ప్రస్తుతం రెంటల్ వార్డ్డోబ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. వీటి వల్ల బ్రాండెడ్వి, అత్యంత ఖరీదైన దుస్తుల్ని ధరించే అవకాశం కూడా ఉంటుంది. గత కొన్నేళ్లలో ‘నేను రెంట్ డ్రెస్ వేశాను’ అని చెప్పడం కొంతమందికి ఇబ్బంది, సిగ్గు కలిగించేది. కానీ ఇప్పుడు అది ‘కూల్’ ట్రెండ్గా మారిపోయింది.ట్రెండ్ వయసు టెన్ ఇయర్స్.. నగరంలో ఈ ట్రెండ్కి శ్రీకారం చుట్టింది ‘ర్యాప్డ్’ అనే రెంటల్ సరీ్వస్ అని చెప్పొచ్చు. ‘నేను ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టినప్పుడు చాలామంది ఇది మంచి ఐడియా కాదు, ఎవరూ డ్రెస్లను రెంట్కు తీసుకోరని వారించారు. కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారిని మా స్టోర్లో చూడవచ్చు’ అంటూ చెప్పారు ర్యాప్డ్ నిర్వాహకులు రితూ మల్హోత్రా. ‘నేటి ఫ్యాషన్ వేగంగా మారుతుంది ప్రతి కొత్త ట్రెండ్ను కొనుగోలు చేయడం ఖరీదైనదే కాక, వాటిని ఉంచడానికి అవసరమైన ప్రదేశం కూడా పెద్ద సమస్య అవుతుంది. అందుకే.. రెంటల్ సర్వీసు ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఈ ట్రెండ్ను ప్రోత్సహించడం అంటే కేవలం మన జేబుకు మాత్రమే కాదు.. పర్యావరణానికి కూడా మంచిది’ అన్నారామె. కొన్ని సంవత్సరాలుగా రెంట్ డ్రెస్లు వేసుకుంటున్నాను. చాలా గొప్ప డిజైన్లు, ఎంపికలు ఉన్నాయి. పైగా, చాలా మంచి క్వాలిటీని కూడా అందిస్తున్నారు’ అంటున్నారు సైకాలజీ విద్యార్థిని వైష్ణవి. సూచనలు.. అడ్వాన్స్ బుకింగ్: ప్రత్యేక సందర్భాలకు ముందుగానే బుకింగ్ చేయడం మంచిది. పలు సంస్థలు ఫ్రీ అల్టరేషన్లు అందిస్తాయి. దుస్తులు డబుల్ డ్రైక్లీన్ చేస్తున్నారా లేదా అని తనిఖీ చేసుకోవాలి. ఒక రోజు, 36 గంటలు.. ఇలా విభిన్న కాలవ్యవధులు ఉన్నాయి కాబట్టి సరిగా ధ్రువీకరించుకోవాలి. సందర్భోచితంగా.. అందుబాటు ధరల్లో..నగరంలో అద్దెకు తీసుకునేందుకు పార్టీ వేర్కి ఒక రోజుకు అద్దె సుమారు రూ.1,500 నుంచి రూ.3,500 వరకూ.. సంప్రదాయ దుస్తులైతే రూ.2,500 నుంచి రూ.6,000 వరకూ, వెస్టర్న్ ఫ్యాషన్ (డ్రెసెస్, సూట్స్) రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు(ఒక రోజు అద్దె) వరకూ మగవాళ్ల దుస్తులు(షర్ట్స్, టీ–షర్ట్స్, బ్లేజర్స్): రూ.800 నుంచి రూ.2 వేల వరకూ ఉన్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. మహిళల లెహంగాలు, షేర్వానీలు, గౌన్లు, పాశ్చాత్య దుస్తులు అందించేందుకు ర్యాప్డ్ మదాపూర్ – బేగంపేట్ పరిసరాల్లో సేవలు అందిస్తుండగా, వీరి దగ్గర దుస్తుల అద్దెలు రూ.3 వేల నుంచి, రూ.16,500 వరకు లభిస్తున్నాయి. అలాగే ఈసీఐఎల్ ప్రాంతంలోని తారా డిజైనర్స్ సంస్థ ప్రీ–వెడ్డింగ్ గౌన్లు, మ్యాటరి్నటీ ఫొటోషూట్ దుస్తులు, కపుల్ అవుట్ఫిట్స్కు పేరొందింది. కూకట్పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లోని సైలీజింగ్ అనే సంస్థ లాంగ్ ట్రెయిల్ గౌన్లు, లెహంగాలు, మ్యాటరి్నటీ గౌన్లుకు పేరొందింది. అమీర్పేట్లోని ప్రీ వెడ్డింగ్ గౌన్స్ రెంటల్ బాల్ గౌన్లు, లెహంగాలు, శెర్వానీలు అందిస్తుంది. ఇక మగవాళ్ల దుస్తులకు ప్రత్యేకించిన కేపీహెచ్బీ ప్రాంతంలోని స్టైల్ హిమ్లో బ్లేజర్లు, శెర్వానీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్లైరోబ్ సంస్థ శెర్వానీలు, జోద్పురి సూట్లు, నెహ్రూ జాకెట్లు, పాశ్చాత్య దుస్తులు అందిస్తోంది. ఆన్లైన్ బుకింగ్ నుంచి ఆల్టరేషన్స్ దాకా ఈ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. అలాగే కస్టమ్ ఫిట్టింగ్, హోమ్ డెలివరీ. హైజీన్ గ్యారెంటీ, డిపాజిట్ రిఫండబుల్.. ఆఫర్ చేస్తున్నాయి. (చదవండి: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..! అత్యధిక టైటిల్స్ గెలిచిన ఏకైక దేశంగా..) -
Miss World 2025: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..!
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో కీలక ఘట్టాలకు తెరలేచింది. మరో వారం రోజుల్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. నగరంలో తొలిసారి జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ సారి భారతీయ సుందరి నందిని గుప్తా గెలిస్తే.. అది మరో కిరీటాన్ని భారత్కు అందించడం మాత్రమే కాదు అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న దేశం అనే రికార్డ్ని కూడా అందిస్తుంది. ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉన్నా.. మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైన 15ఏళ్ల తర్వాత తొలిసారిగా మన దేశం నుంచి 1966లో రీటా ఫరియా టైటిల్ గెలిచారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఈ టైటిల్స్ను సాధించి దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారు. అదే విధంగా వెనిజులా 1955, 1981, 1984, 1991, 1995, 2011లలో ప్రపంచ సుందరి కిరీటాల్ని దక్కించుకుంది. తద్వారా ఇండియా, వెనిజులా – రెండూ సమానంగా 6 టైటిల్స్ గెలుచుకుని నెంబర్ వన్ స్థానాన్ని పంచుకుంటున్నాయి. మన తర్వాత యునైటెడ్ కింగ్డమ్ (యుకె) 5 టైటిల్స్, జమైకా, ఐస్లాండ్ – రెండూ చెరో 3 టైటిల్స్ గెలుచుకున్నాయి.నగరంపై నజర్ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్లామర్ ప్రపంచం దృష్టి మొత్తం నందిని గుప్తాపైనా, హైదరాబాద్ నగరంపైనే ఉంది. ఈ దఫా టైటిల్ను నందిని గెలిస్తే అది భారత్ను ప్రపంచ సుందరి పోటీల్లో నెం.1 స్థానానికి చేరుస్తుంది. కాబట్టి ఆ ఘనత నగరం వేదికగా సాకారం కావాలని గ్లామర్ రంగ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. (చదవండి: అమెరికా వేదికపై మెరిసిన తెలుగు అందం..! ఎవరీ చూర్ణికా ప్రియ..?) -
మణికట్టుపై పల్స్ లేకపోవడం ప్రమాదకరమా!.. బిగ్బీకి సైతం..
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్బీ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించిని గొప్ప నటుడు. ఏ పాత్రలోనే ఇట్టే ఒదిగిపోయి..ప్రేక్షకుల, విమర్శల ప్రశంసలు అందుకున్న దిగ్గజ నటుడు. అయితే ఆయకు మణికట్టుపై పల్స్ అస్సలు ఉండదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా కౌన్ బనేగా కరోడ్పతి ఎపిసోడ్లో చెప్పారు. ఆ సీజన్ ఎపిసోడ్లో ‘సాధారణంగా హార్ట్ బీట్ తెలుసుకోవడానికి రెండు వేళ్లను శరీరంలో ఏ భాగంపై ఉంచి చూస్తారు?’ అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు మణికట్టు సమాధానం. ఆ నేపథ్యంలో బిగ్బీ తన మణికట్టుపై వేళ్లు పెట్టినా నాడి దొరకదని చెప్పుకొచ్చారు. దానికి గల కారణాన్ని కూడా వివరించారు. మరీ ఇలా పల్స్ ఉండకపోవడం ఏదైనా అనారోగ్యానికి సంకేతమా..?, ఎందువల్ల ఇలా జరుగుతుంది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.1982లో కూలీ సినిమా సమయంలో అమితాబ్ ప్రమాదం బారినపడ్డారు. ఆ ప్రమాదం కారణంగా చాలా రోజులు ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. అదీగాక ఆస్పత్రి సిబ్బంది ప్రతి అరగంటకొకసారి రక్తం తీసుకోవడానికి సూదులు గుచ్చేవారని అన్నారు. దాంతో మణికట్టుపై పల్స్ పనిచేయడం ఆగిపోయిందని అన్నారు. ప్రస్తుతం తన మెడపై మాత్రమే పల్స్ ఉంటుందని అన్నారు. ఇది సర్వసాధారణమా లేక ప్రమాదమా..?ఇది సర్వసాధారణంగా గాయం, శస్త్ర చికిత్స లేదా రక్తనాళాలను ప్రభావితం చేసే వైద్య పరిస్థితులు వంటి వాటి కారణంగా సంభవిస్తుంది. వాస్తవానికి ఆరోగ్యవంతమైన వ్యక్తుల మణికట్టు వంటి ప్రామాణిక పాయింట్లలో పల్స్ సులభంగా తెలుస్తుంది, గుర్తించగలం కూడా. అయితే గాయం లేదా ధమనులకు సంబంధించిన సమస్యల కారణంగా కొత్తమందికి బలహీనమైన పల్స్ ఉండొచ్చని అన్నారు వైద్యులు. అయితే ఇలా లేకపోవడం మాత్రం మొత్త ఆరోగ్యానికి అంత ప్రమాదకరమేమి కాకపోయినా..కారణమేంటన్నది తెలుసుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు.మన హార్ట్ బీట్ని గుర్తించడానికి ఉపకరించేవి శరీరంలోని పల్స్ పాయింట్లేనని అన్నారు. మన శరీరంలో ఎక్కడెక్కర్ పల్స్ ఉంటాయంటే..రేడియల్ పల్స్: బొటనవేలు బేస్ దగ్గర మణికట్టు మీదకరోటిడ్ పల్స్: మెడకు ఇరువైపులా, వాయునాళం పక్కనఫెమోరల్ పల్స్: గజ్జ ప్రాంతంలోపాప్లిటియల్ పల్స్: మోకాలి వెనుకడోర్సాలిస్ పెడిస్ పల్స్: పాదం పైభాగంలోపోస్టీరియర్ టిబియల్ పల్స్: చీలమండ ఎముక వెనుకఇలా శరీరంలోని ఈ విభిన్న ప్రాంతాల్లోని నాడీ స్పర్శ సాయంతో హృదయ స్పందనని అంచనా వేస్తారు ఆరోగ్య సంరక్షణ నిపుణులు.పల్స్ తెలుసుకోవడం ఎలా అంటే..పల్స్ను తనిఖీ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. పైగా సింపుల్ తెలుసుకునే క్లినకల్ అంచనా. అందుకోసం మన చూపుడు, మధ్య వేళ్లను పల్స్ పాయిట్లపై ఉంచి.. వారి హృదయస్పందన రేటు ఎంత వేగంగా లేదా నెమ్మదిగా ఉందనేది అంచనావేస్తారని చెబుతున్నారు నిపుణులు. అలా అని నిర్లక్ష్యం చెయ్యొద్దు..మణికట్టులో పల్స్ లేకపోతే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే..ఆ వ్యక్తికి గాయం లేదా ఎలాంటి శస్త్ర చికిత్సలు జరిగిన ఆరోగ్య చరిత్ర లేకపోతే ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. ఇది రక్తప్రసరణ సరిగా లేకపోవడం లేదా ధమని అడ్డంకి లేదా నరాల సంబంధిత సమస్యని సూచిస్తుంది. దీన్ని గనుక నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యుడిని సంప్రదించనట్లయితే అంతర్లీనంగా ఉన్న వైద్య పరిస్థితిని ముందుగా గుర్తించి అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by ❤🔥Magic_or_fun😆 (@magic_or_fun) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: భారతీయుల దంతాలు బాగుంటాయ్..! జర్మన్ వ్యక్తి ప్రశంసల జల్లు) -
భారతీయుల దంతాలు బాగుంటాయ్..!
ఇంతవరకు భారతదేశంలోని ప్రాంతాలు, వివిధ ప్రజల సంస్కృతులు, ఆచార వ్యవహారాలపై ప్రశంసల జల్లు కురిపించారు కొందరు విదేశీయలు. ఇంకొందురు ఓ అడుగు ముందుకేసి మరీ..ఈ దేశంలోనే తమ పిల్లల బాల్యం గడవాలని..ఇక్కడైతేనే విలువలతో పెరుగుతారంటూ భారతదేశంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ విదేశీయడు భారతీయుల దంత పరిశుభ్రతను మెచ్చుకుంటూ ఓ పోస్టు పెట్టారు. ఇది నెట్టింట వైరల్గా మారడమే గాక.. ఇది ఎంత వరకు సబబు అంటూ వివిధ చర్చలకు దారితీసింది. ఇంతకీ ఆ వ్యక్తి పోస్ట్లో ఏం పేర్కొన్నాడు..? నెటిజన్లు ఏమంటున్నారు..? అంటే..జర్మన్కి చెందని ఓ ఉద్యోగి తన భారతీయ సహోద్యోగుల దంత పరిశుభ్రతపై చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన పోస్ట్లో ఆయన తన భారతీయలు సహోద్యోగులందరి దంతాలు చాలా బాగున్నాయని, వాళ్లందరివి తెల్లగా మెరుస్తూ ఉంటాయని అన్నాడు. పైగా వారి నోటి నుంచి దుర్వాసన అనేది రాదని, వారందరికి చాలా చక్కటి దంత సంరక్షణ అలవాట్లు ఉన్నాయని పేర్కొన్నాడు. వాళ్ల దంతాలే అంతలా తెల్లగా ఎలా ఉన్నాయని తెగ ఆలోచించానని అన్నారు. బహుశా వారు తీసుకునే ఆహారంలోని వ్యత్యాసమా లేక దంత పరిశుభ్రతకు సంబధించి సంప్రదాయ అలవాట్ల అందుకు కారణమా అనేది మిస్టరీగా ఉందని రాసుకొచ్చాడు. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని చాలా కుతుహలంగా ఉందని పోస్ట్లో పేర్కొన్నాడు. అయితే ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించడమే గాక..కొందరూ అందుకు కారణాన్ని వివరించారు. మరికొందరు తాము ఫేస్ చేసిన కొందరు వ్యక్తుల దంత అపరిశుభ్రత గురించి షేర్ చేసుకున్నారు. కానీ ఒక నెటిజన్ వైద్యుడిగా.. అందుకు గల రీజన్ని చాలా వివరంగా చెప్పుకొచ్చారు పోస్ట్లో. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం తోపాటు..పరగడుపునే బ్రష్ చేయకుండా ఏం తీసుకోని భారతీయుల అలవాటే అందుకు కారణమని అన్నారు. అలాగే భారతీయులు ఏ ఆహారం తిన్నా..వెంటనే పుక్కిలించడం వంటివి చేస్తారు. అయితే పాశ్చాత్య దేశాల్లో అంతగా పట్టించుకోరు..లైట్ తీసుకుంటారు. ముఖ్యంగా పాలు తాగడం, వివిధ మాంసాహారాలు తిన్నప్పుడు కచ్చితంగా దంత సంరక్షణ పాటిస్తారని అన్నారు. అలాగే చాలామంది భారతీయ పేషెంట్లలో దంత అపరిశుభ్రత ఉండటాన్ని గమనించానన్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో పోగాకు, గుట్కా వంటి చెడు అలవాట్ల కారణంగా దంతాలు పసుపు వర్ణంలో ఉండి, దుర్వాసనతో ఉన్న చాలామంది వ్యక్తులకు ట్రీట్మెంట్ చేశానని అన్నారు. ఏదీఏమైనా..ఈ పోస్ట్ వల్ల అనాదిగా మన పెద్దల నుంచి వచ్చిన అలవాట్లే మన భారతీయుల దంత పరిశుభ్రతకు ప్రధాన కారణమనే విషయంల హైలెట్ అయ్యింది. మనమే చెత్త అలవాట్లతో చేజేతులారా మన ఆరోగ్యాన్ని, దంతాలను పాడు చేసుకుంటున్నామనే విషయం కూడా వెల్లడైంది. కాబట్టి..మన అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పే మంచి అలవాట్లను వినే ప్రయత్నం చేద్దాం.. అందరం ఆరోగ్యంగా ఉందాం.!.(చదవండి: డిష్ వాష్బార్లతో చేతులు పాడవ్వుతున్నాయా..? ఇవిగో చిట్కాలు..) -
అమ్మా..నాకు జీతం వచ్చిందోచ్..!
తొలి వేతనం.. జీవిత ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ఆర్థిక స్వాతంత్య్రం, ఒక బాధ్యత, కుటుంబ సమిష్టి ప్రయాణానికీ సూచిక. అంతటి ప్రత్యేకత ఉన్న తొలి జీతం అందుకున్న రోజు కోట్లాది మందికి భావోద్వేగ ఘట్టం. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఈ వేడుకను జరుపుకొంటారు. ఇంట్లో వాళ్లకు, బంధువులు, స్నేహితులు, సహచరులకు స్వీట్లు పంచేవారు కొందరైతే తొలి సంపాదనతో తమ వాళ్లకు బహుమతులను అందించేవారు మరి కొందరు. తొలి వేతనం రాగానే ‘అమ్మా.. జీతం పడింది’ అంటూ జన్మనిచ్చిన తల్లితో సంతోషం పంచుకునేవారే ఎక్కువని యాడ్ ఏజెన్సీ ‘రీడిఫ్యూజన్, లక్నో యూనివర్సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘భారత్ ల్యాబ్’ తాజా సర్వేలో వెల్లడించింది. చిన్న నగరాల నుంచి..‘నా తొలి వేతనం’ పేరుతో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 2,125 మంది యువ ఉద్యోగులు పాలుపంచుకున్నారు. 1997–2012 మధ్య జన్మించిన ఈ జెన్–జీ తరం వాళ్లు.. మొదటి నెల జీతాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎలా ఆదా చేస్తున్నారు అన్న అంశాలను లోతుగా అధ్యయనం చేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో కొందరు ప్రధానంగా కుటుంబ సభ్యులకు గిఫ్టులు అందించి తమ కృతజ్ఞతను చూపారు.కొంత మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా.. పెరుగుతున్న ఆర్థిక దూరదృష్టికి నిదర్శనంగా నిలిచారు మరికొందరు. విరాళాలు ఇచ్చి తమలో స్వార్థం లేదని ఇంకొందరు నిరూపించారు. ప్రతి రూపాయి లెక్కించే కుటుంబాలకు ఇవన్నీ భావోద్వేగాలతో ముడిపడిన అంశాలే. ‘మొదటి జీతం.. ఒక స్వాతంత్య్ర ప్రకటన. ముఖ్యంగా మహిళలకు ఒక నిశ్శబ్ద విప్లవం’ అంటారు భారత్ ల్యాబ్ కో–చైర్మన్, రీడిఫ్యూజన్ చైర్మన్ సందీప్ గోయల్. ముందుగా అమ్మకు..తొలి వేతనం అందుకున్న మరుక్షణమే 44.6% మంది ఆ సంతోషాన్ని తొలుత అమ్మతో పంచుకుంటున్నారు. 28.6% మంది తండ్రికి, 16.1% మంది జీవిత భాగస్వామికి, 10.7% మంది తోబుట్టువులకు సమాచారం ఇస్తున్నారు. తరాలు మారుతున్నా.. సామాజిక పరిస్థితులు మారుతున్నా.. కుటుంబ బంధాలకు ఇచ్చే విలువను ఇది సూచిస్తుందని నివేదిక వివరించింది. ఇంటికి తమవంతు ఆర్థిక సహకారంగా గత తరాలు భావిస్తే.. నేటి జెన్జీ తరం మహిళల్లో 88.5% మంది తమ మొదటి జీతాన్ని స్వాతంత్య్రంగా అభివర్ణించారు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. స్వాతంత్య్రంతో పాటు ఇంటికి అందించాల్సిన బాధ్యత అని 41.2% మంది పురుషులు భావించారు. దానంలోనూ, పొదుపులోనూ మహిళలే మొదటి జీతాన్ని పొదుపు, దానం చేయడంలో.. రెండింటిలోనూ పురుషుల కంటే మహిళలే ముందుండటం విశేషం. మొత్తంగా 24.5% మంది తొలి జీతాన్ని జాగ్రత్తగా పొదుపు చేశారు. అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం, తదుపరి విద్యకు సిద్ధం కావడం లేదా కష్ట సమయాల్లో కుటుంబాన్ని పోషించడం వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చారు. విడివిడిగా చూసినప్పుడు.. 50% మంది మహిళలు పొదుపు చేస్తే, పురుషుల్లో ఈ సంఖ్య 32.3% మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..20.4% మంది తొలి జీతాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించారు. మతపర సంస్థలు, ఎన్జీఓలు లేదా నేరుగా అవసరంలో ఉన్నవారికి విరాళంగా ఇచ్చారు. భారత్లోని యువ సంపాదకులు సమాజ అభ్యున్నతి, శ్రేయస్సును అర్థం చేసుకుంటారని నిరూపించారు. దానంలో మహిళలు 41.6% కాగా, పురుషుల్లో ఈ సంఖ్య 27.7% ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతుల్లో ఆర్థిక వివేకం, సామాజిక బాధ్యత పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. తమవారికి కృతజ్ఞతగా..తొలి వేతనం పొందిన సంబరాన్ని 38.8% మంది బహుమతుల ద్వారా పంచుకుంటున్నారు. గుర్తుండిపోయే రోజున తల్లుల కోసం ఆభరణాల నుండి తోబుట్టువులకు గ్యాడ్జెట్స్ వరకు.. తమ ప్రయాణానికి మద్దతుగా నిలిచిన వారికి గిఫ్టులతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కిరాణా సామాగ్రి, ఫ్యాన్లు, యుటిలిటీ బిల్లుల వంటి వాటికి 12.2% మంది ఖర్చు చేశారు. తల్లిదండ్రుల అవసరాలకు 4.1% మంది తమ తొలి జీతాన్ని వెచ్చించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 88.3% మంది తమ మొదటి జీతం అవసర ఖర్చులకు సరిపోతుందని చెబితే.. 11.7% మంది ఇబ్బందులు పడ్డట్టు తెలిపారు.బంగారం కొంటున్నారు..పుత్తడి మన జీవితాల్లో భాగం.. అదొక ఆర్థిక భరోసా. అందుకే, ఆభరణాలకు బదులుగా యువ మహిళా ఉద్యోగులు పసిడి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో మూడింట ఒక వంతు మహిళలు తమ తొలి జీతంతో బంగారం కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలోని 76% యువత నెలవారీ పొదుపు (సిస్టమాటక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ సిప్) కంటే సౌకర్యవంత పెట్టుబడి విధానాలను ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. అదనపు ఆదాయం, పండుగ బోనస్లు వచ్చినప్పుడు టూర్స్ లేదా తమ కలల బైక్ కొనుగోలు వంటి వ్యక్తిగత లక్ష్యాలకు ఖర్చు చేస్తున్నారు. సంకెళ్ళు లేకుండా జెన్ –జీ తరం పొదుపుచేయాలనుకుంటున్నారు.(చదవండి: అమ్మలకు ఆదాయ పన్ను మినహాయింపు..!) -
ఈ సమ్మర్ కలర్ఫుల్ జ్ఞాపకంగా ఉండాలంటే..బొమ్మలు వేయాల్సిందే..!
వేసవి సెలవుల్లో చేయాల్సిన పనులెన్నో చెప్పుకున్నాం. ఇంకా కొన్నే మిగిలాయి. ముఖ్యమైనది పెయింటింగ్. పిల్లలూ... మీరు నేచురల్ పెయింటర్స్. అంటే మీరు బ్రష్ తీసుకుని ఏది గీసినా అందులో అందం ఉంటుంది. బొమ్మలు వేయడంలో చాలా విధానాలున్నాయి. బొమ్మలు వేయకుండా పిల్లలు ఉండకూడదు. ఈ సమ్మర్ను కలర్ఫుల్ జ్ఞాపకంగా మిగుల్చుకోవాలంటే కాసిన్ని బొమ్మలేసి దాచుకోవాల్సిందే.రంగులకు ఏ విలువా లేదు. కాని వాటితో వేసే రూపాలకు విలువ. పిల్లలూ... బొమ్మలు వేయడం మనిషి పుట్టుకతో వచ్చే ఒక కుతూహలం. బొమ్మలు ఎప్పటికీ రాని వాళ్లు కూడా పెన్నూ పేపర్ దొరికితే పిట్ట బొమ్మో పిల్లి బొమ్మో గీస్తారు. మన చేతుల్లో నుంచి ఒక రూపం పుట్టడం మనిషికి ఆనందం. చెట్టు వేసి దాని మీద గూడు వేసి ఆ గూటిలో పిల్లల్ని వేసి ఆ బొమ్మను చూసుకుంటే సంతోషం కలుగుతుంది. మనం బొమ్మలు ఎందుకు వేస్తామంటే మనం చూసింది, ఊహించింది రంగుల్లో నిక్షిప్తం చేసుకోవడానికి. బొమ్మలు వేయడం మంచి హాబీ. కాలక్షేపం. మీరు మంచి పెయింటర్లుగా ఎదిగితే ఆ బొమ్మలను కొనేవాళ్లు కూడా ఉంటారు. నిజం. మన దేశంలో త్యాబ్ మెహతా అనే ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆయన బొమ్మలు ఇప్పటికీ కొంటారు. ఎంతకు తెలుసా? ముప్పై కోట్లు... నలభై కోట్లు... చిన్న బొమ్మ. అంత డబ్బు. అయితే ఆ బొమ్మల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. మీ బొమ్మల్లో కూడా ప్రత్యేకత ఉండాలి. అది సాధన చేస్తే వస్తుంది. బొమ్మలు వేయకుండా సెలవుల్ని ముగించకూడదు. అసలు మీ అందరి దగ్గర కలర్స్, కలర్ పెన్సిల్స్, చార్కోల్స్, బ్రష్షులు తప్పకుండా ఉండాలి. వాటర్ కలర్స్తో వండర్స్ సృష్టించొచ్చు తెలుసా?చిత్రలేఖనంలో రకాలు..బొమ్మలు గీయడమంటే మీకు చాలా ఇష్టం. తెల్ల కాగితం, రంగుల పెన్సిళ్లు కనిపిస్తే ఏదో ఒకటి తోచింది గీస్తూ ఉంటారు కదా. దాన్నే మరింత నైపుణ్యంగా గీస్తే చిత్రలేఖనం మీ చేతికి వచ్చేసినట్లే. చిత్రలేఖనంలో అనేక రకాలున్నాయి. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్, ఫిగరెటివ్ పెయింటింగ్స్, ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్, యానిమల్స్ పెయింటింగ్స్, గాడ్ పెయింటింగ్స్... ఇలా. వాటి గురించి మీరు బొమ్మలు గీసేకొద్దీ తెలుసుకుంటారు. ఇవి కాకుండా కార్టూన్లు, క్యారికేచర్లు... కూడా గీయొచ్చు. లైన్ ఆర్ట్ సాధన చేయొచ్చు. రాజా రవివర్మ, దామెర్ల రామారావు, పాకాల తిరుపతిరెడ్డి, ఎం.ఎఫ్.హుస్సేన్, ఆర్.కె.లక్ష్మణ్, బాపు, మోహన్, బాలి, చంద్ర, ఏలే లక్ష్మణ్ లాంటి అనేక మంది చిత్రకారుల బొమ్మలు మీకు నెట్లో దొరుకుతాయి. వాటిని చూసి వారిలా వేయడానికి సాధన చేస్తూ కూడా బొమ్మలు నేర్చుకోవచ్చు.చిత్రలేఖనం వల్ల లాభాలు..ఏకాగ్రత: చిత్రలేఖనమంటే రంగులతో మాత్రమే పూర్తయ్యే పని కాదు. బొమ్మ గీయాలంటే ఎంతో ఏకాగ్రత కావాలి. మనసులోని భావాలను కాగింతపై బొమ్మగా మారేందుకు ఆలోచించాలి, నిదానం పాటించాలి. అప్పుడే బొమ్మ అందంగా వస్తుంది. చిత్రలేఖనం సాధన చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతను అందించడంతో పాటు చదువు మీద దృష్టి నిలిపేందుకు తోడ్పడుతుంది.మానసికోల్లాసం: రంగులతో బొమ్మలేయడం వల్ల మానసికోల్లాసం లభిస్తుంది. ఖాళీ కాగితం మన చేతిలో రంగులమయం మారుతున్నకొద్దీ మనలో కొత్త ఉత్తేజం కలుగుతుంది. మన చేతివేళ్లు చకచకా కదిలి, బొమ్మగా రూపుదిద్దుకుంటే ఎంతో తృప్తి కలుగుతుంది. ఇదంతా చిత్రలేఖనం వల్ల సాధ్యపడుతుంది.క్రియేటివిటి: సమాజంలో రోజూ మీరు చూసే అంశాలను బొమ్మలుగా గీయాలనుకునే క్రమంలో మీలో క్రియేటివిటి పెరుగుతుంది. బొమ్మల్ని గీసే పద్ధతిలో మీదైన కొత్త విధానం ఒంటబడుతుంది. ఇది మీ మెదడును మరింత చురుగ్గా చేస్తుంది. కొత్త విషయాలు ఆలోచించేందుకు, కొత్తగా నేర్చుకునేందుకు ఉపకరిస్తుంది.గుర్తింపు: చిత్రలేఖనం లలిలకళల్లో ఒకటి. అనేకమంది చిత్రకారులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వారి చిత్రాలు నేటికీ మనకు స్ఫూర్తిని అందిస్తున్నాయి. వారి పేరును చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. మీరు చిత్రలేఖనం సాధన చేయడం ద్వారా అందరిలో గుర్తింపు పొందుతారు. మరింత పట్టు సాధించడం ద్వారా గొప్ప చిత్రకారులుగా పేరు పొందుతారు. అది మంచి భవిష్యత్తుకు తోడ్పడుతుంది. చిత్రలేఖనం ఎక్కడ నేర్చుకోవాలి?పిల్లలకు చిత్రలేఖనం నేర్పడానికి ప్రత్యేకంగా కొన్ని పాఠశాలలు, సంస్థలు ఉన్నాయి. రోజూ కొంత సమయం అక్కడికి వెళ్లి, వారి చెప్పిన పద్ధతిలో బొమ్మలు గీయడం సాధన చేయవచ్చు. చిత్రలేఖనం నేర్పేందుకు ఈ వేసవిలో కొన్ని క్యాంపులు నిర్వహిస్తుంటారు. వాటిలో చేరొచ్చు. ఆన్లైన్ ద్వారా చిత్రలేఖనం నేర్పేవారు కూడా అందుబాటులో ఉంటారు. ఆ పద్ధతిలో రోజూ సాధన చేయవచ్చు. మీకు మరింత ఆసక్తి ఉంటే సెలవుల తర్వాత కూడా దాన్ని కొనసాగించవచ్చు. (చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!) -
డిష్ వాష్బార్లతో చేతులు పాడవ్వుతున్నాయా..?
మార్కెట్లో దొరికే డిష్ వాష్బార్లు, లిక్విడ్లు మన చేతులకు హాని చేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఈ వాష్బార్లు మన చర్మంలోని తేమని హరించి వేసి వివిధ రకాల చర్మసమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయంగా గంజినీళ్లు, బేకింగ్ సోడా, నిమ్మరసాన్ని గిన్నెలు తోమడానికి వాడుకోవచ్చు. అవేంటో చూద్దాం...వెనిగర్లో పదినిమిషాలు గిన్నెలను నానబెట్టి తరువాత కొబ్బరిపీచుతో బేకింగ్ సోడాని అద్దుకుని తోమితే చక్కగా శుభ్రపడతాయి.గంజినీళ్లలో బేకింగ్ సోడా వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత ఈ నీటితో గిన్నెలను తొమితే మురికితోటు, జిడ్డు కూడా పూర్తిగా పోతుంది.బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో గిన్నెలు తోమితే మురికి వదలడమే గాక మంచి వాసన కూడా వస్తాయి.గోరంత అందం..గోళ్ల రంగుని శుభ్రంగా తొలగించి.. గోరువెచ్చని జొజోబా నూనెను గోళ్లమీద, చుట్టూ్ట ఉన్న చర్మంపైన వేసి గుండ్రంగా మర్దన చేయాలి. దీనివల్ల గోళ్లకు రక్త సరఫరా జరిగి చక్కగా పెరుగుతాయి. రాత్రి పడుకునే ముందు మర్ధన చేసి ఉదయం కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల గోళ్లు అందంగా పెరుగుతాయి. (చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!) -
ఉద్యోగం మాన్పించడం కూడా గృహహింసే..!
ఉద్యోగం మానేయమని చెప్పానని నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇది జరిగి తొమ్మిది నెలలు అవుతోంది! తను ఉద్యోగం చేస్తే ఎవరిమాటా వినడం లేదనే ఉద్యోగం మానిపించాం. మళ్లీ తిరిగి వచ్చాక ఎలాగోలా మానిపిద్దాము అనుకుంటే నేను తాగుతున్నాను అనే వంకతో తిరిగి రానంటోంది. ఇప్పుడు నాకు కూడా తనంటే ఇష్టం పోయింది. ఏం చేయమంటారు? – పవన్ కుమార్, రాజమండ్రిమీరు వెంటనే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. మీలాంటి పురుషాధిక్య భావజాలం ఉన్న వ్యక్తితో ఎవరూ ఉండకూడదు. మీ నుంచి ఆవిడకి విముక్తి అవసరం. భర్తని తన తల్లిదండ్రుల నుంచి విడదీయాలి అనుకోవడం క్రూరత్వం అని చాలా సందర్భాలలో కోర్టులు ఎలాగైతే చెప్పాయో, భార్య చేస్తున్న ఉద్యోగం మాన్పించి ఇంట్లోనే కూర్చోబెట్టాలి అనుకోవటం, భర్త – అత్తామామల ఆజ్ఞలు మాత్రమే పాటించాలి అనుకోవడం కూడా అలాగే ‘గృహ హింస’ కిందకి వస్తాయి. ఆవిడా మీరు వద్దని అంటోంది కాబట్టి సామరస్యంగా మాట్లాడుకొని మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ (పరస్పర అంగీకార విడాకులు) తీసుకుని మిమ్మల్ని మీరు కేసులనుండి కాడుకోవటం మంచిది.నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు నెలసరి వడ్డీకి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు మీద సంతకాలు, సాక్షుల సంతకాలు తీసుకున్నాను. అయితే అతను అసలు వడ్డీ కట్టకపోగా అసలు కూడా ఇవ్వడం లేదు. అతనికి, అతని భార్యకి, పిల్లలకి కూడా ఆస్తులు ఉన్నాయి. ఎంత అడిగినా ‘నేను చెక్కులు కూడా ఇవ్వలేదు కదా ఏం చేసుకుంటావో చేసుకో’ అంటున్నాడు. నా డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారమే లేదా? – ఎస్డీ. జహంగీర్, హైద్రాబాద్మీరు డబ్బులు ఇచ్చి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయింది అని చెప్తున్నారు కాబట్టి మీరు సివిల్ కోర్టును ఆశ్రయించి అతనిపై దావా వేయవచ్చు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతను మిమ్మల్ని మోసం చేశాడు అనడానికి ఏదైనా ఆధారం లేదా రుజువు చేసే పత్రాలు ఉంటే ΄ోలీసులను ఆశ్రయించి క్రిమినల్ కేసు కూడా నమోదు చేసే వీలు ఉంది. మీ లేఖలో రాసిన దాని ప్రకారం మీ డబ్బులు మీకు తిరిగి రావు అని చెప్పలేము. అలాగే కచ్చితంగా వస్తాయి అని కూడా చెప్పలేము. మీ దగ్గర ఉన్న పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, మీ ఆర్థిక స్థితిగతులు చూపించడానికి వీలు ఉండే ఏదైనా ఆధారాలు తీసుకొని ఒక లాయర్ గారిని కలవండి. అన్నీ పరిశీలించిన తర్వాత మీ కేసులో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. (చదవండి: ఒక ముద్దు.. ఓ పాట..అద్భుతమే చేశాయ్..! బతకదు అనుకున్న భార్యను..) -
ఆ చిన్నారి ప్రతిభకి బ్రిటన్స్ గాట్ టాలెంట్ ఫిదా..!
బ్రిటన్స్ గాట్ టాలెంట్ (బీజీటీ) అనేది బ్రిటన్ టెలివిజన్ టాలెంట్ షో. ఈ వేదికపై తమ ప్రతిభను చూపించుకునేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తుంది యువత. ఈ ప్రపంచ వేదికపై ఫేమస్ అయిన ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఈ షోకి ఉన్న ఆదరణ, క్రేజ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఈ షోలో మన భారతదేశం నుంచి చాలామంది తమ టాలెంట్ చూపించి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కూడా. అయితే ఈ సీజన్ ఎపిసోడ్లోలో ఈశాన్య భారతదేశం నుంచి తొమ్మిదేళ్ల బినితా చెట్రి ఫైనల్కి చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ టాలెంట్ షో సెమీ ఫెనల్స్లో బినితా అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శన ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే గాక బినితాకి అధిక ఓట్లు పడ్డాయి. ఈ మేరకు ఇన్స్టాలో ఆ చిన్నారి బినితా.."ఆ ప్రోగ్రామ్ తాలుకా ఫోటోలను షేర్ చేస్తూ..ప్రతి క్షణం గొప్పగా ఉంది. మీ అందరి సపోర్టు లేకుండా ఇదంతా చేయలేను." అని పోస్టులో రాసుకొచ్చింది. కాగా, అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన ఇవ్వాలనే తన కలను సాకారం చేసుకోవడానికి తన తండ్రితో కలిసి యూకేకి వెళ్లింది. అక్కడ ప్రదర్శన ఇచ్చే ముందు జడ్డీలతో ఇచ్చిన సంభాషణలో అమాయకంగా మాట్లాడిన ఆ చిన్నారి మాటలు అందర్నీ విస్మయానికి గురి చేశాయి. ఈ పోటీలో గెలిచి.. పింక్ ప్రిన్సెస్ హౌస్ కొనాలనేది తన కోరికని అత్యంత అమాయకంగా చెప్పడం విశేషం.ఆ ముద్దు మాటలు అందరి మనసులను దోచుకున్నాయి. ఈ మేరకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెట్రీ ప్రదర్శనకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఆమె ప్రతిభను ప్రశంసించారు. "యూకేలో అస్సాం ప్రతిభ ప్రకాశిస్తోంది. ఈ లిటిల్ బినితా న్యాయనిర్ణేతలు అందరూ ఆహా అనేలా శక్తిమంతమైన ప్రదర్శన ఇచ్చింది.ఆ చిన్నారి కచ్చితంగా తదుపరి రౌండ్కి వెళ్తుంది. అలాగే ఆమె కోరుకున్నట్లుగా పింక్ ప్రిన్సెస్ ఇంటిని కొనుగోలు చేయగలదని ఆశిస్తున్నా. "అని పోస్టులో పేర్కొన్నారు ముఖ్యమంత్రి హిమంత. ఇక చెట్రి తదుపరి పోటీలో దాదాపు తొమ్మిది మంది ఫైనలిస్ట్లో పోటీ పడనుంది. (చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!) -
ఈతరం నేర్చుకోలేకపోతున్న లైఫ్ స్కిల్స్ ఇవే..!
ప్రస్తుతం జనరేషన్ అంత ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల టెక్నాలజీ యుగంలో పెరుగుతోంది. అలా అని టెక్నాలజీ మీద మంచి పట్టు ఉంది అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే.. దానికంటే..కనీస ప్రాథమి జీవిత నైపుణ్యాలపై అవగాహన ఉండాలి. అత్యంత కీలకమైనది ఇదే అంటున్నారు నిపుణుల. మరీ ఈ తరం నేర్చుకోలేకపోతున్న ఆ జీవన నైపుణ్యాలేంటో తెలుసా..!.టొరంటో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో చాలామంది యువకులకు కారు టైర్ మార్చడం, కుట్టడం వంటి చిన్న చిన్న పనులపై కనీస అవగాహన లేదంటున్నారు. చెప్పాలంటే ఈ జెన్ జెడ్ తరం అధికంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతోందని, ముఖ్యంగా ఊబకాయంతో బాధపడుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. ఇంకొందరికి కనీసం చెల్లింపులు, డబ్బు ఖర్చు పెట్టే విషయం, వడ్డీరేట్లు గురించి అస్సలు సరిగా తెలియదని అన్నారు. ఇక్కడ పిల్లలు నేర్చుకుంటున్న చదువు వారి జీవన గమనానికి ఉపయోగపడకపోవటం బాధకరమని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత తప్పక నేర్పించాలని చెబుతున్నారు నిపుణులు. అలాగే తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడూ ఎలా ఇంటిని నిర్వహించాలి, ప్రమాదాలు వాటిల్లకుండా ఎలా వంట చేసుకోవాలి తదితరాలపై కొంచెం కూడా అవగాహన లేదని చెప్పారు. ముందు వాళ్లకు కనీస ప్రాథమిక జీవిత నైపుణ్యాలను నేర్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇప్పటికే కొన్ని విద్యాసంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తూ..క్లాస్లో దీనిపై సెషన్లు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. ఇక మానసిక నిపుణులు ఆ నేపథ్యంలోనే 'అడల్టింగ్ 101' ఆన్లైన్ కోర్సు రూపొందించాయి. ఈ కోర్సులో ఏం నేర్చుకుంటారంటే..పోషకాహారం అంటే ఏంటీ, గృహ నిర్వహణ, కిరాణ దుకాణానికి ఎలా వెళ్లాలి, ఎలా కొనుగోళ్లు చేయాలి వంటి అంశాలపై యువతకు తర్ఫీదు ఇస్తారు. నిజానికి ఈ తరం జనరేషన్ ఇవి తెలుసుకోకపోవడానికి ప్రధాన కారణం తగిన స్వేచ్ఛ లేకపోవడమేనని అంటున్నారు. అన్ని అమర్చిపెట్టేయడం, ఏదైనా చెయ్యబోతుంటే..అమ్మో..! వద్దు ఏదో అవుతుందంటూ పేరెంట్స్ అతి ప్రేమ ఒలకపోయడంతో ఈ జెన్ జెడ్ జీవిన విధానానికి సంబంధించిన పరిజ్ఞానం లేకుండా పోయిందని చెబుతున్నారు నిపుణులు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన యువతరానికి ప్రాథమిక జీవన నైపుణ్యాలు తెలియదని అన్నారు. ఇలా 'అడల్టింగ్ 101' క్రాష్ కోర్సుల సాయంతో వాళ్లు తెలుసుకునేలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు నిపుణులు.(చదవండి: కల్చర్ మారింది సామీ..! అడవి బిడ్డల వివాహాల్లో 'పెళ్లి సందడి'..!) -
టెర్రస్ గార్డెన్స్ : ఇచ్చిపుచ్చుకోవడం ఓ ట్రెండ్
నగరంలో టెర్రస్ గార్డెనింగ్(మిద్దె పంట) ఒక ట్రెండ్గా, సరికొత్త జీవనశైలిగా మారిన విషయం విధితమే. ఇందులో భాగంగానే నగరంలోని భవనాలు పచ్చదనం అల్లుకుంటున్నాయి. అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్ అనే తేడా లేకుండా అవకాశం ఉన్న ప్రతీ ఇంటిపై చిన్న తోట ఉండాలనే ఆకాంక్ష ఒక్కొక్కరి హృదయంలోనూ నాటు వేస్తోంది. ప్రస్తుతం నగరంలోని మిద్దె తోటల ప్రేమికులువర్షాకాలాన్ని స్వాగతించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కాస్త ముందుగానే కురవడం, ఈ తొలకరి జల్లులు వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. ఈ సందర్భంగా మొక్కలు నాటడానికి అనువైన ఈ సమయాన్ని వినియోగించుకోవడానికి విత్తన సేకరణ మొదలుపెట్టారు. -సాక్షి, సిటీబ్యూరో వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా విత్తనాల సేకరణ మొదలైంది. పాత కాలపు ‘నువ్వు ఇస్తే.. నేను ఇస్తా‘ పద్ధతిలో విత్తనాల మారి్పడి జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ విత్తన మారి్పడికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ యాప్స్లో వందలు, వేల మందితో ఉన్న మిద్దెపంట గ్రూపులు ఈ విత్తన సేకరణపై దృష్టి సారించాయి. ప్రముఖ సోషల్ మీడియా గ్రూపులు వాట్సప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి వాటిల్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఈ విత్తనాల మారి్పడి సంస్కృతి మొక్కల కోసం మానవ సంబంధాలు పెరిగే సూచికగా మారాయి. ఈ గ్రూపుల సభ్యులు తమ వద్ద ఉన్న హెయిర్లూమ్ సీడ్స్, దేశీ విత్తనాలను ఇతరులకు పంచిపెడుతున్నారు. అయితే హైబ్రిడ్ విత్తనాలకు బదులుగా జెనెటిక్ డైవర్సిటీని నిలబెట్టే పద్ధతుల వైపు మొగ్గుచూపుతుండటం విశేషం. సిటీలో పచ్చదనపు స్పర్శ టెర్రస్ గార్డెనింగ్ నగరానికి కొత్త కాకపోయినా, కోవిడ్ తర్వాత ఈ సంస్కృతి విస్తృతమైంది. ఇంటింటా పిల్లలకు మొక్కల తాలూకు పరిచయం కలిగిస్తూ, విత్తనాలు నాటే పద్ధతులపై అవగాహన పెరుగుతోంది. కొన్ని గ్రూపులు ప్రత్యేకంగా కిడ్స్ సీడ్ స్వాప్ సెగ్మెంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇది పాత తరం జీవితానికి దగ్గరగా చేరే ఒక మార్గం కావడంలో సందేహం లేదు.‘‘ఇది మాకు ఆహారం కోసం మాత్రమే కాదు, మనశ్శాంతి కోసం కూడా’’ అని అంటున్నారు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మిద్దె పంట ప్రేమికురాలు సూర్యప్రభ. శ్రమకోర్చి నాటిన విత్తనాలు తర్వాత మొలక వేసిన మొక్కను చూడటం, తన చేతులతో పండించిన కూరగాయలను ఇంట్లో వండుకోవడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిదని ఆమె పేర్కొన్నారు. మీట్స్తో పాటు అవగాహన ఈ నెలాఖరులో నగరంలోని బేగంపేటలో ఒక సీడ్ స్వాప్ మీట్ను నిర్వహించనుంది. ఇక్కడ ఎటువంటి డబ్బు లావాదేవీలు ఉండవు. ఇది పూర్తిగా మార్పిడి పద్ధతిపై ఆధారపడిన సదస్సు. దీనితో పాటు జూబ్లీహిల్స్, హిమాయత్నగర్, ఎస్ఆర్ నగర్, ఈసీఐఎల్ వంటి ప్రాంతాల్లో విత్తన మార్పిడి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు గ్రూపుల్లో ప్రణాళికలు రూపొందించారు. ఈ మీట్లో విత్తనాల మార్పిడితో పాటు విత్తన భద్రతా పద్ధతులు, కంపోస్టింగ్ టెక్నిక్స్, ఇండోర్ ప్లాంట్స్ గురించి అవగాహన, జీరో వేస్ట్ గార్డెనింగ్ వంటి అంశాలపై చిన్న చిన్న సెషన్లు కూడా నిర్వహిస్తారు. విత్తనాల మార్పిడి ద్వారా కేవలం మొక్కలు మాత్రమే కాదు, ఆత్మీయ సంబంధాలు కూడా నాటుతున్నారు. ఇంటికి అనువైన మొక్కలు ఈ వర్షాకాలంలో మిద్దె తోటల ప్రేమికులు ప్రధానంగా కూరగాయలు, పూల మొక్కలు, హెర్బ్స్ను నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా గోంగూర, బీరకాయ, దోసకాయ, ముల్లంగి, మిరపకాయ, టమోటా వంటి కూరగాయలు పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జూహీ, చామంతి, గులాబీ, హిబిస్కస్ వంటి పూల మొక్కలతో పాటు తులసి, కరివేపాకు, వెల్లుల్లి కాడ, ధనియాల మొక్క, అలవేరా వంటి హెర్బ్స్ పెంచడానికి ఇష్టపడుతున్నారు. తక్కువ స్థలంలో, కంటైనర్లలో సులభంగా పెరగడం ఈ మొక్కల ప్రత్యేకత. అలాగే ఈ మొక్కల వాసన, ఆకృతి, వండినప్పుడు వచ్చే రుచి, ఆరోగ్య ప్రయోజనాలు మిద్దె తోటల ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. -
కల్చర్ మారింది సామీ..! అడవి బిడ్డల వివాహాల్లో 'పెళ్లి సందడి'..
కొండ కొనల్లో నివసించి..అడవి తల్లిని నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగించే డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలు వారి సంప్రదాయాలను గౌరవిస్తు ఆధునిక పద్ధతిలో వివాహాలు చేసుకుని తమదంటూ నాగరికతను చాటుకుంటున్నారు. ఒకప్పుడు వివాహాలు వారి సంప్రదాయాల ప్రకారం గుట్టు చప్పుడు లేకుండా జరిగేవి. నచ్చిన యువతిని తీసుకువచ్చిన వరుడు తమ పెద్దల సమక్షంలో వివాహం చేసుకునే వారు. ఆచార వ్యవహారాల ప్రకారం వారి ఇద్దరిని వివాహం చేసేవారు పెద్దలు. కాని అందుకు భిన్నంగా నేటి యువత వివాహాలను ఆర్భాటంగా కొనసాగిస్తున్నాయి. వివాహాల్లొ ఆధునికత ఊరేగింపులు విందు, వినోదాలతో పాటు సంప్రదాయ నృత్యాలతో వివాహాలు కొనసాగుతున్నాయి. వధువు, వరుని తరఫున పెండ్లి కి ఆహ్వానించే కార్డులను ముద్రించి వారి బంధువులను ఆత్మీయులను ఆహ్వానించడం కనిపిస్తుంది. జిల్లాలొని బిసంకటక్ సమితి కుర్లి గ్రామంలొ డ్రేకు జకసిక కొడకు సేతు జకసిక అదే గ్రామానికి చెందిన బండీ వడక కూతురు వనిత వడకతొ వివాహం నిశ్చయమయ్యింది . ఈ క్రమంలో వివాహం సొమవారం నాడు జరిగింది. వరుడుకి ముకుటం ధరించి డిజే సౌండ్ ల మధ్య వరుడి ఊరేగింపు కార్యక్రమం అందరిని ఆకర్షించింది. యువత నృత్యాలతో కొనసాగిన ఊరేగింపులో భాగంగా సాంప్రదాయమైన ఆదివాసీ నృత్యా లు కూడా చోటు చేసుకున్నాయి. సుమారు 5 వేల మంది బంధువుల మధ్య వివాహాం జరిగింది. ఇంతటి ఆర్భాటంగా వివాహం జరగడంతో డొంగిరియా తెగన్లో ఇదే ప్రధమమని చెప్పాలి. (చదవండి: ఒక ముద్దు.. ఓ పాట..అద్భుతమే చేశాయ్..! బతకదు అనుకున్న భార్యను..) -
World Marketing Day: ఆన్లైన్ షాపింగ్ మంచిదేనా..?
స్కూటీపై కూర్చున్న ఇతను పవన్. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అనంత్నగర్కు చెందిన పవన్ బీకాం చదివాడు. సిరిసిల్లలో ఓ మల్టీనేషనల్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. నిత్యం 35 నుంచి 40 పార్సిళ్లు డోర్ డెలివరీ చేస్తుంటాడు. కంపెనీ స్కూటీపైనే వస్తువులు ఇంటింటికీ అందిస్తూ నెలకు రూ.12,500 జీతం పొందుతున్నాడు. షాపింగ్.. ఒకప్పుడు ఒకరిద్దరిని తోడుగా తీసుకొని వెళ్లి.. నచ్చింది చూసి.. ధర ఆరా తీసి.. బేరం చేసి తెచ్చుకునేవాళ్లం. నేడు అంతా మారిపోయింది. ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో గుమ్మంలోకి వచ్చి చేరుతోంది. జీవితం ఉరుకుల..పరుగులమయం కావడంతో ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ ఆప్షన్గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు సుమారు 50 నుంచి 60 వేల ఆర్డర్లు వెళ్తుండగా, కోట్లలో వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. ఈ ఆన్లైన్ షాపింగ్ డెలివరీబాయ్స్కు ఉపాధినిస్తుండగా.. ప్రజలకు ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే శ్రమ లేకుండా పోతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం.. బీపీ.. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితమే టైమ్ మెషిన్లా మారిన నేటి కాలంలో ఆన్లైన్ షాపింగ్.. పరిణామాలపై మంగళవారం ప్రపంచ మార్కెటింగ్ దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ.. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్కు చెందిన రమేశ్ గతంలో కూరగాయల మార్కెట్కు నడిచి వెళ్లి కూరగాయలు, ఇతర వస్తువులు కొని తెచ్చేవాడు. కూరగాయల మార్కెట్లో వ్యాపారులను పలకరిస్తూ బేరం చేసి మరీ కొనేవాడు. కాలం మారిపోయింది. ఇప్పుడు ప్రైవేటు హోం డెలివరీ ఏజెన్సీలు రావడంతో ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాడు. ఎక్కువ సేపు కదలకుండా ఉండడంతో శారీరక శ్రమ కరువైంది. ఇప్పుడు రమేశ్కు సయాటిక సమస్య వచ్చింది.జగిత్యాలకు చెందిన నవీన్, అనిత దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఉరుకులు.. పరుగుల జీవితం. ఇలాంటి పని ఒత్తిడిలో షాపింగ్కు వెళ్లి వస్తువులు కొనే సమయం, తీరికలేక ఆన్లైన్లో ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంట్లోకి, పిల్లలకు ఏ సామగ్రి అవసరమున్నా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. ఫలితంగా శారీరక శ్రమ తగ్గింది. ఈ మధ్య నవీన్ తీవ్రంగా అలసిపోవడంతో డాక్టర్ వద్దకు వెళ్తే షుగర్ వచ్చిందని నిర్ధారించారు.ఒక చేతిలో కిరాణ సామగ్రి, మరో చేతిలో సెల్ఫోన్లో మాట్లాడుతున్న ఇతను అంబ దాస్. సిరిసిల్లకు చెందిన అంబదాస్ డిగ్రీ వరకు చదివి ఓ ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. సిరిసిల్ల పట్టణంలో ఎవరు కిరాణ సామగ్రి, ఇతర వస్తువులు ఆర్డర్ చేసినా ఇంటి వరకు వెళ్లి డోర్ డెలివరీ చేశాడు. ఇలా పనిచేస్తూ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. మంచినూనె.. వాటర్ విులన్.. టీషర్ట్.. చెప్పులు.. మందులు.. బిర్యానీ.. ఇలా ఏది కొనాలన్నా సెల్ఫోన్ ఉంటే చాలు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తే నిమిషాల్లో డెలివరీ చేస్తారు. ఆన్లైన్ వ్యాపారం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఇరుగు పొరుగు.. కుటుంబ సభ్యులతో బజారుకు వెళ్లి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేవారు. దుకాణాలకు వెళ్లడం ద్వారా వ్యాపారులు, వినియోగదారుల మధ్య అనుబంధం పెరిగేది. నేడు ఆ పరిస్థితులు లేవు. చాలామంది అడుగు తీసి బయట వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడ్డ నేటి జనం ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే మధుమేహం.. రక్తపోటు.. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. విస్తరిస్తున్న వ్యాపారంఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతోపాటు మేజర్ గ్రామాల్లోనూ ఆన్లైన్ వ్యాపారం విస్తరిస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు వ్యాపారాన్ని గల్లీ వరకు విస్తరించేశాయి. డోర్ డెలివరీ విధానంతో స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. సిరిసిల్లకు చెందిన ఓ యువకుడు అన్నీ ఇంటికే అందిస్తామని వ్యాపారం ప్రారంభించి విస్తరిస్తున్నారు. ఇలా వ్యాపారాభివృది్ధతోపాటు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లాలో ఆన్లైన్ సేవల్లో మూడు వేల మంది డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. కనీస శ్రమ లేక ఆరోగ్య సమస్యలుమనిషి సగటున నిత్యం 6వేల అడుగులు వేయాలని వైద్యులు చెబుతున్నారు. కనీస శారీరక శ్రమ లేక అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. నిత్యం నడకతో జీవితాన్ని ప్రారంభించే వారు ఒక్క శాతం ఉంటే.. అసలు శారీరక శ్రమ లేకుండానే జీవించే వారు 99 శాతం మంది ఉన్నారు. అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మనకు తెలియకుండానే జబ్బులతో జీవిస్తూ.. ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాలో వైద్యవ్యాపారం ఇప్పటికే చాలా వరకు విస్తరించింది. దీనికి కనీస శ్రమ లేక పోవడంతో ప్రధాన కారణం.కొత్తగా ప్రారంభించాంసిరిసిల్లలో కొత్తగా ‘వీఆర్ విత్ యూ’ పేరుతో ఆన్లైన్ డెలివరీ సర్వీసులను ప్రారంభించాం. బిజీ లైఫ్లో ఉన్న వారికి ఏది కావాలన్నా 15 నిమిషాల్లో ఇంటికి చేర్చుతున్నాం. – గాజుల రాకేశ్, సుభాష్నగర్, సిరిసిల్లరోజూ 35 డెలివరీలు నేను ఈ మధ్యే డెలివరీ బాయ్గా చేరాను. ఇప్పుడు రోజూ 35 డెలివరీలు ఇస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలోని అన్ని ప్రాంతాలతోపాటు శివారు గ్రామాల వరకు వెళ్తుంటాను. ఆన్లైన్ ఆర్డర్లు చాలా పెరిగాయి. నాలాగే అనేక మంది ఉపాధి పొందుతున్నారు. – సంగెం తరుణ్, డెలివరీ బాయ్, సిరిసిల్ల టైం లేకే ఆర్డర్లుమార్కెట్కు వెళ్లి తెచ్చుకునే టైం లేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఆర్డర్లే ఎక్కువ. సెల్ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత వేగం పెరిగింది. ఆన్లైన్ వ్యాపారం పెరిగింది. సమయం ఆదా అవుతుంది. బయటకు వెళ్లి వచ్చే టైంలో ఇంకో పని చేసుకోవచ్చు. ఆర్డర్ 15 నిమిషాల్లో ఇంటికే చేరుతుంది. ఇలాంటి సౌకర్యం ఉండగా షాపింగ్కు బయటకు ఎవరూ వెళ్తారు. – మామిడాల శ్యాం, సిరిసిల్లశారీరక శ్రమ ఉండాలి నిత్యం శారీరక శ్రమ ఉంటేనే ఉల్లాసంగా ఉంటారు. ఎలాంటి వ్యాయామం లేకుండా చాలామంది గడిపేస్తున్నారు. షుగర్ పెరగడానికి శారీరకశ్రమ లేకపోవడమే కారణం. మారిన జీవన శైలి కూడా కారణం. నిత్యం కొంత దూరమైన వాకింగ్ చేస్తే ఆరోగ్య సమస్యలు దగ్గరికి రావు. – డాక్టర్ వంగ మురళీకృష్ణ, ఎండీ ఫిజీషియన్, సిరిసిల్ల (చదవండి: పియానోలో తల్లి కూతుళ్ల అరుదైన రికార్డు..!) -
అమెరికా వేదికపై మెరిసిన తెలుగు అందం..! ఎవరీ చూర్ణికా ప్రియ..?
అగ్రరాజ్యం వేదికపై తెలంగాణ తేజం మెరిసింది. అమెరికా మెచి్చన అందం మన హైదరాబాద్ ఏఎస్రావునగర్కు చెందిన చూరి్నకా ప్రియ కొత్తపల్లి సొంతం. ఓ వైపు చదువులో రాణిస్తూనే.. మరోవైపు అందాల పోటీల్లో దూసుకెళ్లింది. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన చూర్ణికా ప్రియ డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో రన్నరప్గా నిలిచింది. ఎవరీ చూర్ణికా ప్రియ..పుట్టింది పశ్చిమగోదావరి భీమవరం. పెరిగింది హైదరాబాద్ ఏఎస్రావునగర్ డివిజన్లోని భవానీనగర్లో.. తల్లిదండ్రులు కొత్తపల్లి రాంబాబు, వనజ ప్రోత్సాహంతో హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్ కోసం అమెరికా వెళ్లింది. సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్న ఆమె ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబర్చాలని నిర్ణయించుకుంది. డల్లాస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025లో పాల్గొంది.ఈ పోటీల్లో మొత్తం 5,300 మంది పాల్గొన్నారు. ఇందులో ఫైనల్కు 20 మంది యువతులు ఎంపికయ్యారు. ఆ తర్వాత టాప్–5, టాప్–3లో చోటు దక్కించుకుని సోమవారం తెల్లవారుజున(అమెరికాలో ఆదివారం అర్ధరాత్రి) జరిగిన గ్రాండ్ ఫైనల్లో రన్నరప్గా నిలిచింది. ఫైనల్ పోటీలకు ప్రముఖ సింగర్ గీతామాధురితో పాటు మరొకరు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అంతేకాదు.. ప్రతిష్టాత్మకమైన పీపుల్స్ చాయిస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మోడలింగ్పై ఆసక్తి పెంచుకుంది. చాలా సంతోషంగా ఉంది తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై చాటాలనే లక్ష్యంతో చూర్ణికా ప్రియ ఈ పోటీల్లో పాల్గొంది. మిస్ తెలుగు యూఎస్ఏ–2025లో పాల్గొన్నట్లు మొదట మాకు తెలియదు. టాప్–20లో సెలక్ట్ అయిన తర్వాత మాకు చెప్పింది. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. తర్వాత మోడలింగ్పై ఆసక్తి పెంచుకుంది. తన ఇష్టాలను ఎప్పుడూ కాదనలేదు. తనకు నచ్చిన రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నాం. టాప్–3లో ఉన్నాను ఫైనల్కు సెలక్ట్ అయ్యాను చెప్పింది. తర్వాత ఫోన్ చేసి ఫైనల్లో రన్నరప్గా నిలిచాను అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. – కొత్తపల్లి రాంబాబు, తండ్రి(చదవండి: కాన్స్ ముగింపు వేడుకలో గూచీ చీరలో మెరిసిన అలియా..! పాపం నాలుగు గంటలు) -
నడుము నొప్పి ఎందుకు వస్తుందంటే..
ప్రతి వ్యక్తి జీవిత కాలంలో అతడు / ఆమె ఏదో ఓ సమయంలో నడుము నొప్పితో బాధపడతారు. అందునా జనాభాలోని 75 – 85 శాతం మందిలో... ఒక వయసు తర్వాత...మరీ ముఖ్యంగా నడి వయసు తర్వాత నడుము నొప్పి తప్పక కనిపించే అవకాశాలే ఎక్కువ.దీనికి అనేక కారణాలున్నప్పటికీ అందులో ఒక కారణమేమిటంటే... వెన్నుపూసల మధ్య భాగంలో ఉండే స్థలం సన్నబడటం.వైద్య పరిభాషలో దీన్నే ‘లంబార్ కెనాల్ స్టెనోసిస్’ అంటారు. ఇటీవల ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే మొదట్లోనే ఈ నొప్పి గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసుకుంటే సమస్యను అదుపులో పెట్టవచ్చు. ఇంత విస్తృతంగా వచ్చే ఈ నొప్పి గురించి అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం. ప్రతి వ్యక్తిని నిటారుగా నిలబెట్టే వెన్నెముక నిర్మాణమే ఓ అద్భుతం. ఇందులో 32 నుంచి 34 పూసలు వరసగా ఉంటాయి. ఇంగ్లిష్ అక్షరమైన ‘ఎస్’ను దాదాపుగా ΄ోలి ఉంటే ఈ వరస పూసలు ఇంత సమన్వయం తో ఉంటాయంటే... దారం దండలోని పూసల్లా... ఈ ఎముకలన్నీ వరస లో కలిసి ఉంటాయి కాబట్టి వాటిని పూసలుగా చెబుతుంటారు. ఇక పూసల్లోని మధ్యనుండే ఖాళీ స్థలంలోంచి దారం ఉన్నట్టే... ఈ వెన్నుపూసల ఖాళీ స్థలంలోంచి ‘వెన్నుపాము’ ఒక తాడులా వెళ్తుంది. అయితే ఇది తాడు కాదు.... అనేక నరాలు పెనవేసుకున్న సంక్లిష్ట నిర్మాణం. ఆయా నరాలన్నీ వెన్నుపూసల మధ్యనుండే ఖాళీల నుంచి బయటకు వస్తూ... ఆయా అవయవాలకు వెళ్తూ వాటిని పనిచేయిస్తూ ఉంటాయి. ఈ నరాల ఆదేశాలతో పనిచేసే ఆ అవయవాలు... చేతులూ, కాళ్లూ, వేళ్తూ, కీళ్లూ కాగా... ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తుండటంతోపాటు... మరికొన్ని ఇతర అవయవాలనూ సమన్వయ పరుస్తూ, వాటినీ పనిచేయిస్తాయి. ఈ 32 నుంచి 34 పూసలన్నింటితో పాటు... లోపల ఉన్న వెన్నుపాము మొత్తం నిర్మాణమంతటినీ కలుపుకుని దాన్ని ‘వెన్ను’ (స్పైన్)గా చెబుతారు. ఈ స్పైన్లోని... మెడ దగ్గర ఉండే భాగంలో ఏడు (సర్వేకల్ ఎముకలు) పూసలుండగా, ఛాతి, కడుపు భాగంలో పన్నెండూ (థోరాసిక్), అలాగే నడుం భాగంలో ఉండేవి ఐదు (లంబార్), ఇక మిగతావి ఒకదానితో మరోటి కలిసి΄ోయి ఉండే శాక్రల్ ఎముకలన్నీ కలిసి వెన్ను నిర్మాణాన్ని పూర్తి చేస్తాయి. కాక్సిక్ అనేది చివరన తోకలాగా ఉండే ఎముక. సంక్లిష్టమైన ఈ వెన్ను నిర్మాణంలోని మరో అద్భుతమైన నిర్మాణ ప్రక్రియ ఏమిటంటే... వెన్నుపూసలోని ఎముకకూ ఎముకకూ మధ్య నుంచి ఒక్కోనరం చొప్పున మొత్తం 31 నరాలు బయటకు వస్తాయి. ఈ నరాలే కాళ్లూ, చేతులతోపాటు వివిధ అవయవాలను కదిలిస్తూ, వాటితో పనులు చేయిస్తూ ఉంటాయి.నిర్ధారణకు ఉపయోగపడే ప్రధాన లక్షణం ఏమిటంటే... కదులుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కాళ్లు అకస్మాత్తుగా పట్టేస్తాయి. అటు తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ నడవగలుగుతారు. వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇలా నడవగలిగే దూరాలు క్రమంగా తగ్గుతూపోతాయి. విశ్రాంతి వ్యవధులు క్రమంగా పెరుగుతాయి. ఉదాహరణకు తొలుత 600 మీటర్ల తర్వాత కాళ్లు బిగుసుకుపోతే అటు తర్వాత అలా బిగుసుకుపోవడం అన్నది 400 మీటర్లకే జరగవచ్చు. అటు పిమ్మట 200 మీటర్లకే బిగుసుకుపోవచ్చు. ఇలా దూరాలు తగ్గుతూ... విశ్రాంతి సమయపు వ్యవధి పెరుగుతూ ΄ోతుంది. ఇలా జరగడాన్ని ‘క్లాడియేషన్ డిస్టాన్సెస్’ అంటారు. ఇది లాంబార్ కెనాల్ స్టెనోసిస్ తాలూకు అత్యంత ప్రధాన లక్షణమని చెప్పవచ్చు. నిర్ధారణ ఇలా... బయటికి (క్లినికల్గా) కనిపించే నొప్పి లక్షణాలతో ‘లంబార్ కెనాల్ స్టెనసిస్’ను స్పష్టంగా అనుమానించవచ్చు, కొంతవరకు గుర్తించవచ్చు. అయితే దీని నిర్ధారణ కోసం ఎక్స్రే, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి ఇమేజింగ్ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. ఈ సమస్యతో పాటు ఒకవేళ వెన్నుపూసకీ వెన్నుపూసకీ మధ్యనున్న డిస్క్లు అటు ఇటు జరిగితే... అలాంటి డిస్ప్లేస్మెంట్ కూడా సీటీ స్కాన్, ఎమ్మారై వంటి ఇమేజింగ్ ప్రక్రియల్లో కనిపిస్తుంది. డిస్క్లు ఇలా స్థానభ్రంశమై కదలి΄ోవడాన్ని ‘హెర్నియేటెడ్ డిస్క్’ అని కూడా పిలుస్తారు. సీటీ స్కాన్ కంటే ఎమ్మారై చాలా ముఖ్యం.వెన్ను నొప్పికి ఒక ప్రధాన కారణం లంబార్ స్టెనోసిస్... నడుము భాగంలోని వెన్నుపూసల మధ్య స్థలం తగ్గడంతో నడుము నొప్పి వస్తుంటుంది. ఇలా ఖాళీ తగ్గినప్పుడు ఈ పూసలు... వాటి మధ్యనుంచి బయటకు వచ్చే నరాలను నొక్కేస్తుంటాయి. నరం తీవ్రంగా నొక్కుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. అయితే నొప్పికి కారణమయ్యేలా వెన్నుపాము ఉండే ‘లంబార్ కెనాల్’లో ఖాళీ తగ్గడాన్ని, తత్ఫలితంగా లంబార్ కెనాల్ ఇరుకుగా మారడాన్ని వైద్య పరిభాషలో ‘లంబార్ కెనాల్ స్టెనోసిస్’ అంటారు. లంబార్ అనేది నడుము దగ్గర ఉండే పూసలు కాబట్టి... అక్కడి ఖాళీ తగ్గింది కాబట్టి నొప్పి ‘నడుము ప్రాంతం’లో వస్తుంటుంది. అయితే ఇది కేవలం నడుము వరకే పరిమితం కాదు. కొన్ని సందర్భాల్లో నడుముకు ఇరువైపులా పిరుదులు, తొడలు, కాళ్లలోనూ నొప్పి కనిపిస్తుంది. చాలాసేపు నడిచినా లేదా ఒకేచోట చాలాసేపు నిలబడ్డా నొప్పి, అలసట ఎక్కువవుతాయి. గతంలో చాలా దూరాలు శ్రమలేకుండా నడిచేవారు కూడా ఇప్పుడు అంతగా నడవలేకపోతున్నామనీ, నడుము లేదా పిరుదులు, తొడలు, కాళ్లలో నొప్పి వస్తుందంటూ కంప్లెయింట్ చేస్తుంటారు. ఇక నడుముతో పాటు కొందరికి నేరుగా వెన్నులోనే నొప్పి కనిపించవచ్చు.వెన్నుపూస సన్నబడ్డట్టు తెలిసేదిలా... వెన్నుపాముని కలిగి ఉండే వెన్నుపూసల మధ్యనుండే ఖాళీ స్థలం ఒకే గది ఉన్న ఇంటి స్థలంలా ఉంటుంది. కిందనుండే డిస్క్ ఫ్లోరింగ్ అనుకుందాం. అప్పుడు పైన ఉండేది కప్పు అవుతుంది. వెన్నుపూస ఖాళీ తగ్గుతున్న కొద్దీ పైనా కిందా ఉండే ఎముక భాగాలు ఉబ్బుకొచ్చినట్లుగా బయటికి వస్తాయి. వీటినే ‘ఆస్టియోఫైట్స్’ అంటారు. ఇవి ఇలా ఉబ్బుకుని వచ్చి లోపలికి పెరుగుతాయి కానీ... ఒకసారి పెరిగినవి మళ్లీ తగ్గే అవకాశం దాదాపుగా ఉండదు. ఇలా పొడుచుకొచ్చినట్లుగా ఉండే ఎముకభాగాల (బోనీ స్ట్రక్చర్స్)కు తోడుగా అక్కడి కణజాలం, మెత్తటి ఎముక (మృదులాస్థి) భాగాలు, లిగమెంట్లు... ఇవన్నీ వాపునకు (అంటే ఇన్ఫ్లమేషన్కు) గురవుతాయి. కేవలం ఎముక మధ్యలో ఉండే ఖాళీ స్థలమే కాకుండా... ఎముకకూ, ఎముకకూ మధ్యన ఉండే రంధ్రం (దీన్ని ఫొరామెన్ అంటారు) కూడా సన్నబారుతుంది. ఎముక మధ్య భాగం ఇంటి ఖాళీ స్థలం అనుకుంటే... దీన్ని ప్రవేశద్వారం అనుకోవచ్చు. అంటే ఇంటి మధ్యభాగంలో ఉన్న స్థలమే కాకుండా... ఇంట్లోకి వచ్చే ప్రదేశద్వారం కూడా సన్నబారిపోతుంది.సన్నగా అవడంతో జరిగేది ఇదీ...ఎముకలోని ఖాళీ భాగాలూ, ఎముక ప్రవేశద్వారం లాంటి ఫొరామెన్ అన్నీ సన్నబడటంతో... ఎన్నెన్నో నరాలు పెనవేసుకుని΄ోయి ఉండే వెన్నుపాము ఒత్తిడికి గురవుతుంది. నడుము భాగం (లంబార్) ప్రాంతం నుంచి కిందికి అంటే శాక్రల్, కాకిక్స్ అనే ప్రాంతాల నుంచి దాదాపు కనీసం 11 నరాల వరకు ఒత్తిడికి గురికావడంతో ఆయా భాగాలకు సప్లై అయ్యే నరాలు బాగా ఒత్తుకు΄ోయి నడుము వెనక భాగం, నడుము కిందిభాగం, పిరుదులు, వెన్ను కిందిభాగం పరిసరాల్లో నొప్పి వస్తుంటుంది. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ నొప్పి తీవ్రతరమవుతుంటుంది. అందుకే ఈ నరాలు ఒత్తిడికి గురయ్యేందుకు అవకాశమున్న కదలికల్లో... అంటే వ్యక్తులు అకస్మాత్తుగా ముందుకు ఒంగినా, కుర్చీ నుంచి ఒక్కసారిగా లేచినా, అకస్మాత్తుగా కదిలినా తీవ్రమైన నొప్పి వస్తుంది. అంతేకాదు... ఆ నొప్పి... అక్కడికే పరిమితమైపోకుండా... పక్కనుండే పరిసరాల్లోకి పాకినట్లుగా అవుతుంది. దాంతో అవయవం చుట్టుపక్కల ప్రాంతాలూ నొప్పికి గురవుతాయి. అంటే అసలు భాగంలోని కాకుండా ఇలా పక్కలకు నొప్పి పాకడాన్ని ‘రిఫర్డ్ పెయిన్’ అంటారు. ఇలాంటి రిఫర్డ్ పెయిన్ కారణంగా ఈ నొప్పులు ఒక్కోసారి ‘సయాటికా నొప్పి’లాగానే అనిపించవచ్చు. ఇది నొప్పిని అనుకరిస్తున్నట్లుగా ఉండటంతో దీన్ని ‘సయాటికా మిమికింగ్ పెయిన్’ అని కూడా అంటారు. పుట్టుకతో వచ్చే... కంజెనిటల్ స్టెనోసిస్...కొంతమందికి పుట్టుకతోనే వెన్నుపూసల్లోని ఖాళీ స్థలం ఇరుగ్గా ఉండవచ్చు. అయితే వారు పెద్దయ్యాక వెన్నుపూసల మధ్యభాగం ఇరుగ్గా మారి... ఆ వయసులో లక్షణాలు బయటపడవచ్చు. ఇలా పుట్టుకతోనే వెన్నుపూసల మధ్యభాగం సన్నగా ఉండటాన్ని ‘కంజెనిటల్ స్టెనోసిస్’గా పేర్కొంటారు. వీళ్లలోనూ నొప్పి, ఇతర లక్షణాలన్నీ మామూలుగా లంబార్ స్టెనోసిస్తో బాధపడేవారిలాగే ఉంటాయి. కాక΄ోతే వీళ్లది చాలావరకు అనువంశీకంగా వచ్చే సమస్య. కొన్ని అసాధారణమైన ఇతర రకాల నడుము నొప్పులు...ఓ వయస్సు దాటాక (ముఖ్యంగా మధ్యవయస్కుల్లో) నడుం నొప్పి రావడం చాలా సాధారణం. అయితే మరి కొంతమందిలో అసాధారణంగా నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనేక కారణాలుంటాయి. అవి... పుట్టుకతోనే వెన్నెముకలో లోపాల వల్ల, వెన్నుకు అయ్యే గాయాల వల్ల, ఇన్ఫెక్షన్లు, గడ్డలు, మహిళల్లో మెనోపాజ్, వృద్ధుల్లో ఆస్టియోపోరోసిస్ వల్ల,స్టెరాయిడ్స్ వాడేవారిలో ఎముకలు మెత్తగా అయిపోవడం వల్ల, కొందరిలో స్పైన్ విరగడం, డిస్క్ పక్కకు తొలగడం వల్ల... ఇలా వెన్నుకు వచ్చే నొప్పులకు కారణాలు ఎన్నెన్నో ఉంటాయి. నివారించుకోవడమిలా...స్ట్రెచింగ్తో బాలెన్స్నూ, ఇతర ఎక్సర్సైజ్లతో శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం. రోజూ ఉదయాన్నే వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం.వార్మప్ తర్వాతనే ఎక్సర్సైజ్ మొదలుపెట్టడం. (అకస్మాత్తుగా మొదలుపెడితే నడుము పట్టేయడం వంటి అనర్థాలతో వెన్నునొప్పులు మరింత పెరిగే అవకాశం. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త తీసుకోవడం. (తరచూ అంటే... ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు ఓసారి కాసేపటి కోసమైనా సరే... పొజిషన్ మారుస్తూ ఉండటం. నిల్చున్నప్పుడు అవకాశం ఉంటే... స్టూలు వంటి చిన్న ఎత్తుపైనో– కాసేపు ఓ కాలు, ఇంకాసేపు మరో కాలు ఆనిస్తూ నిలబడటం. యోగా వంటివి చేస్తున్నప్పుడు శిక్షణ పొందిన ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో మాత్రమే చేయడం. (తమ బరువుకు తగని ఆసనాలు సొంతంగా వేయడం మంచిది కాదు). ఏదైనా వస్తువును ఎత్తేప్పుడు దానికి సాధ్యమైనంత దగ్గరగా వెళ్లి కూర్చుని ఎత్తడం. (కేవలం నడుం మాత్రమే వంచి, తానే వంగి ఎత్తకుండా మోకాళ్లు కూడా వంచి కూర్చున్న భంగిమలోకి వెళ్లి ఎత్తడం మంచిది. కింది వస్తువులు ఎత్తేటప్పుడు నడుము మీద కాకుండా... తుంటి, మోకాలు భాగాలను వంచి వాటిమీద మాత్రమే ఒత్తిడి పడేలా ఎత్తడం మంచిది. అంతే తప్ప నిలబడ్డవారు ముందుకు ఒంగి ఏదైనా ఎత్తడం సరికాదు)అపోహవెన్నునొప్పి వచ్చినప్పుడు గట్టిగా ఉండే ఉపరితలంపైన పడుకోవాలన్నది ఇప్పటివరకూ ఉన్న ఓ అపోహ. వాస్తవం మరీ మెత్తగా ఉండే పరుపు మీద తప్ప...సౌకర్యంగా(కంఫర్టబుల్)గా ఉన్న ఏ పరుపు మీదైనా పడుకోవచ్చు.చికిత్స...నడుము నొప్పి ఏదైనా మొదట డాక్టర్లు ఫిజియోథెరపీ వ్యాయామాలను సూచిస్తారు. ఇక నొప్పి ఉపశమనం కోసం వేణ్ణీళ్ల కాపడం లేదా ఐస్తో కాపడం పెట్టడంతోపాటు అల్ట్రాసౌండ్ తరంగాల చికిత్స, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ థెరపీ ఇస్తారు. వెన్నుపూసల్లో స్థలం తగ్గి ఆ ఒత్తిడి నరంపై పడుతున్నప్పుడు ఆ నొప్పి భరించలేనిదిగా ఉన్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు ఇస్తారు. తట్టుకోలేనంత నొప్పి ఉన్నవారికి కొద్దికాలంపాటు నొప్పినివారణ మందులూ ఇవ్వవచ్చు. (ఇది డాక్టర్లు సూచించిన నిర్ణీత వ్యవధి మేరకే వాడాలి. ఆ తర్వాత కూడా అలా కొనసాగించడం సరికాదు). ఇక తప్పని సందర్భాల్లో చివరి ప్రయత్నంగా శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. అయితే ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలతో ఈ తరహా శస్త్రచికిత్సలు మరింత తేలిగ్గా, సులువుగా చేయడం సాధ్యమవుతోంది. -
జస్ట్ వ్యాయమాలతోనే బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుందా..?
మహిళల్లో కొందరు డెలివరీ తర్వాత బెల్లీఫ్యాట్తో ఇబ్బందిపడుతుంటారు. అలాగే కొందరు మగవాళ్లు కూడా ఈ సమస్యను ఎదర్కొంటుంటారు. దీన్ని తగ్గించుకోవడం గురించి పలు డైట్లు, వ్యాయామాల వర్కౌట్ల సమాచారం నెట్టింట ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులో ఉన్నాయి కూడా. అయితే దీన్ని జస్ట్ వ్యాయామాలతోనే కరిగించేసుకోగలమా అంటే..ఇటీవల ఒక ఇన్ఫ్లుయెన్సర్ తాను ఒక వర్కౌట్ ప్రాక్టీస్ చేశానని అది బాగా వర్కౌట్ అయ్యి బెల్లీఫ్యాట్ తగ్గిందని చెప్పుకొచ్చింది. ఆ వ్యాయామం వల్లే తన బెల్లీఫ్యాట్ ఎనిమిది అంగుళాల వరకు తగ్గిందని తెలిపింది. ఆర్యోకరంగా ఉండటానికి వ్యాయమాలు అవసరమే కానీ అదొక్కటి చేసి బరువు తగ్గించుకోగలమా అంటే కాదనే అంటున్నారు నిపుణులు. అలాగే బెల్లీఫ్యాట్ కూడా ఒక్క ఆ వ్యాయమంతోనే తగ్గిపోతుందని నిర్థారించలేమని అంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరకమైన ఆహారం, బ్రీథింగ్ ఎక్సర్సైజ్ల తోపాటు సరైన వ్యాయమాలతోనే దీన్ని తగ్గించుకోవడం సాధ్యమని చెబుతున్నారు. సాధారణంగా వ్యాయమాలు చేయగానే వేలాడే పొట్ట తగ్గిన అనుభూతి వస్తుంది. ఎందుకంటే కేలరీలు బర్న్ అవ్వడమే గాక పొట్ట తగ్గడమే లక్ష్యంగా వ్యాయమాలు చేస్తారు కాబట్టి తగ్గినట్లు అనిపిస్తుంది గానీ..కొన్నిరోజుల తర్వాత యథావిధిగా వేలాడే పొట్ట ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. బొడ్డుకొవ్వు తగ్గించుకోవడం తోపాటు బరువు కూడా అదుపులో ఉండాలని వ్యాయమాలు, చక్కటి డైట్ పాటిస్తేనే మంచి ఫలితం పొందగలరని నిపుణులు వెల్లడించారు. మనం తీసుకునే కేలరీలకు అనుగుణంగా ఎనర్జీ బర్న్ అయ్యేలా మన వర్కౌట్లు ఉండేలా ఫిట్నెస్ నిపుణుల సలహాలు తీసుకోవాలని అన్నారు.కండరాలు బలోపేతం అయ్యేలా బరువు తగ్గే ప్రయత్నం చేస్తే..ఆటోమేటిగ్గా బెల్లీఫ్యాట్ మాయం అవుతుందని అన్నారు. ఇక్కడ పోషకాహార, సరైన వర్కౌట్లు కీలకమనే విషయం గుర్తెరగాలని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Deepti dhakar (@ultimatefitness_with_deepti) (చదవండి: మస్తుమజా ‘మష్రూమ్స్’..! ఆదివాసులు మెచ్చే ఆహారం..) -
కాన్స్ ముగింపు వేడుకలో గూచీ చీరలో మెరిసిన అలియా..! పాపం నాలుగు గంటలు
సినీ ప్రముఖుల, ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 అంగరంగా వైభవంగా జరిగింది. ఈ నెల 13న మొదలైన ఈ వేడుక శనివారంతో ముగిసింది. ఈ ఫ్యాషన్ వేడుకలో మనదేశం తరఫున ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. వారంతా విలాసవంతమైన దుస్తులు, బ్రాండెడ్ ఆభరణాలతో రెడ్కార్పెట్పై మెరిశారు. అయితే ఈ కాన్స్ ముగింపు వేడుకల్లో బాలీవుడ్ నటి అలియా భట్ హైలెట్గా నిలిచారు. ఆమె ఈ కేన్స్లో పాల్గొనడం తొలిసారి. పైగా అలియా లోరియల్ పారిస్కు బ్రాండ్ అంబాసిడర్గా ఈ వేడుకలో ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ ముగింపు వేడుకల్లో అలియా గూచీ చీర లుక్ అందర్నీ మిస్మరైజ్ చేసింది. స్ఫటికాలు, ఐకానిక్ జీజీ మోనోగ్రామ్తో అలంకరించబడిన కస్టమ్-మేడ్, వెండి రంగు గూచీ చీర ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకర్షించింది. ఈ మేరకు వోగ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఆ చీరలో రెడీ అవ్వడానికి ఎంతలా పాట్లు పడ్డానో వివరించారు అలియా. కాన్స్ ముగింపు వేడుక కోసం ప్రిపేర్ అవ్వుతుండగా..ఒక రకమైన గందరగోళం ఎదురైంది. తాను ముగింపు వేడుకల కోసం ఎంతో ఉత్సాహంగా ఆత్రుతగా ఉంటే..సరిగ్గా రెడీ అయ్యే టైంకి కరెంట్ లేదు. దాదాపు నాలుగు గంటల నుంచి కరెంట్ లేదు. విద్యుత్ లేకపోతే మేకప్ దగ్గర నుంచి చీర కట్టుకునేంతవరకు ఏ పని సవ్వంగా అవ్వదు. ఏంటో టెన్షన్ నన్నువెతుక్కుంటూ వస్తుందా అనే ఫీలింగ్ వచ్చిందంట అలియాకి. హెయిర్ స్టైలిస్ట్లు, మేకప్ మ్యాన్లు తమ సౌందర్య పరికరాలను పనిచేసేలా ఎండలో ఉంచి..తనని రెడీ చేసేందుకు ట్రై చేస్తుండగా.. కరెంట్ వచ్చేసిందంటా. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటూ ఆఘమేఘాలపై అలియాని రెడీ చేశారట. థ్యాంక్ గాడ్..ఉత్కంఠ రేపేలా టెన్షన్కి గురిచేసినా..గూచి బ్రాండ్ తయారు చేసిన ఈ చీరలుక్ అందరి మదిని దోచుకోవడం సంతోషాన్నిచిందని అంటోంది. అలాగే ఈ ఆనందం అతకముందుకు అనుభవించిన హైరానా మొత్తం ఉఫ్మని ఎగిరిపోయేలా చేసిందిని చెబుతోంది అలియా. ఇక గూచీ బ్రాండ్ రూపొందించిన ఈ చీరకు బ్యాక్లెస్ బ్లౌజ్, ప్లంగింగ్ నెక్లైన్, ఫ్లోర్-గ్రేజింగ్ స్కర్ట్ ఎంత సూటబుల్గా ఉంది. చెప్పాలంటే అలియా లుక్ భారతీయ సంప్రదాయాన్ని సమకాలీన అంశాలతో మిళితం చేసినట్లుగా ఉంది. పైగా కాన్స్ 2025లో చిరస్మరణీయమైన సైలిష్ లుక్గా నిలిచింది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) (చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాళిని బ్యూటీ రహస్యం ఇదే..!) -
Mysore Pak: అలానే పిలవాలి..మార్చకూడదు..! ఎందుకంటే..
గత నెలలో జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తదనంతరం భారత్ పాక్ల మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ చాలా చోట్ల దుకాణలో ఐకానిక్ స్వీట్ మైసూర్ పాక్ పేరుని మార్చేశారు కొందరు దుకాణాదారులు. దాంతోపాటు పాక్ పేరు వినిపించేలా ఉన్న కొన్ని రకాల ప్రసిద్ధ వస్తువుల పేర్లను కూడా మార్చేశారు. అయితే ఆ స్వీట్ని మైసూర్ శ్రీగా మార్చి.. అమ్మడం వివాదాలకు దారితీసింది. మైసూర్ రాజు కృష్ణరాజ వడియార్ IV పాలనలో మైసూర్ ప్యాలెస్ వంటగదిలో తయారైంది ఈ స్వీట్. ఆ రాజు వంటవాడి ఘనతకు నిదర్శనం ఆ స్వీట్. దాంతో ఆ వంటవాడి వారుసులు ఇలా పేరు మార్చడంపై మండిపడుతున్నాడు. ఇప్పటికీ మైసూర్ ప్యాలెస్లోనే తయారయ్యే ఆ స్వీట్ సృష్టికర్త కాకాసుర మాడప్ప మునిమనవడు ఎస్ నటరాజ్ అలా పేరు మార్చడాన్ని అస్సలు అంగీకరించటం లేదు. అలానే పిలవండి..ఆ స్వీట్ని మైసూర్ పాక్ అనే పిలవండి. ఎందుకంటే మా పూర్వీకులు అందించిన ఈ పాక ఆవిష్కరణకు మరో పేరు ఉండకూదని అన్నారు. ప్రతి స్మారక చిహ్నం లేదా సంప్రదాయానికి ఒక ప్రత్యేక పేరు ఉన్నట్టే..ఈ స్వీట్కి ఓ ప్రత్యేక పేరు ఏర్పడింది. దాన్ని తప్పుగా సూచించకూడదు..అలాగే మార్చకూడదు కూడా అని వ్యాఖ్యానించారు నటరాజ్.'పాక్' అనే పదం ఎందుకు వచ్చిందంటే..కన్నడలో 'పాక్' అనే పదం చక్కెర సిరప్ను సూచిస్తుంది. అలాగే ఈ స్వీట్ని మైసూర్ ప్యాలెస్లో తయారు చేయడంతో ..ఈ రెండు పేర్ల కలయికతో ఆ స్వీట్ని అలా పిలవడం జరగిందని అని వివరించారు నటరాజ్. అందువల్ల దీన్ని వేరే పేరుతో పిలిచే ప్రశ్నే లేదు అని తెగేసి చెప్పారు. అంతేగాదు..ఆ పేరే ఎందుకు ఉండాలంటే..ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా..ఆ స్వీట్ని చూసినా..దాన్ని చూడగానే ఎలా తయారైందని కథ గుర్తొచ్చేలా ఆ పేరులో ఉండాలి. అప్పుడే ఆ స్వీట్కి ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దాని పేరు మార్చే హక్కులేదని నొక్కి చెప్పారు నటరాజ్. కర్ణాటకలో మైసూరు ప్రసిద్ధ గురు స్వీట్స్ కుటుంబం దీన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు దాని ఐదవతరం స్వీట్లో రారాజుగా పేరొందిన ఈ మిఠాయిని ప్రజాక్షేత్రంలో మరింత ప్రాచుర్యం కల్పించేలా నటరాజ్ ముత్తాత దుకాణాలను ప్రారంభించారు. అలా దీని గురించి దేశమంతటా తెలిసిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు. అంతేగాదు ఆ కుటుంబం నాల్గోతరం సభ్యుడు సుమేఘ్..వైసూర్, కర్ణాటక సాంస్కృతిక చారిత్రకలతో ముడిపడి ఉన్న స్వీట్ అని చెబుతున్నారు. ఇది తమ కన్నడిగ సమాజానికే గర్వకారణమని అన్నారు. ఇది మా ప్రజల మాధుర్యాన్ని కన్నడ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించేలా మధురంగా ఉంటుందన్నారు. అంతేగాదు ఈ స్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యింది కాబట్టి దీన్ని అనవసర వివాదాల్లోకి లాగొద్దని కోరుతున్నారు ఆ స్వీట్ సృష్టించిన కుటుంబ వారసులు. నోటిలో ఈజీగా కరిగిపోయే ఈ స్వీట్ భారతదేశం అంతటా వివిధ వేడుకలకు, పండుగల్లో తప్పనిసరిగా ఉండే ప్రముఖ స్వీట్ ఇది.(చదవండి: ‘మైసూర్’లో ‘పాక్’ మాయం! ) -
అడవి అందాల మధ్య వాక్
అడవి అందాలు, పక్షుల కిలకిల రావాలు, అనేక రకాల క్షీర జాతుల వీక్షణలతో ప్రకృతి ప్రేమికులు సందడిగా గడిపారు. మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకూ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన ఎకో టూరిజం బ్రాండ్ డెక్కన్ ఉడ్స్, ట్రయల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాక్టర్నల్ వాక్, బర్డ్ వాక్ కార్యక్రమంలో 22 మంది ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాత్రి సమయంలో టార్చ్లైట్ల వెలుగులో నేచరలిస్టులు అఖిల్, సుమన్, అపరంజని పర్యవేక్షణలో నాగార్జునసాగర్ రేసర్ పాము, రెండు కట్ల పాములు, పాడ్డీ ఫీల్డ్ ఫ్రాగ్స్, ఒర్నేట్ నారో మౌత్డ్ ఫ్రాగ్లు, బుల్ ఫ్రాగ్లను వీక్షించారు. ఉదయం బర్డ్ వాక్లో గ్రే బెల్డీ కుక్కూ, బ్లూ ఫస్త్రస్ట్ మాల్కోకా, ఒరియంటల్ హనీ బజార్డ్, శిఖర, ల్యాంప్ వింగ్స్, నైట్జార్, బాక్ షోల్డర్ కైట్స్ వంటి అరుదైన పక్షులను వీక్షించారు. ఔత్సాహిక ప్రకృతి ప్రేమిలకుల కోసం నేచర్క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తిగలవారు తమను సంప్రదించాలని ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్.రంజిత్నాయక్ సూచించారు. (చదవండి: కాస్మో'టెక్' సిటీ..మేకప్ రంగానికి పెరుగుతున్న ఆదరణ..) -
పంచ్ కొడితే..పతకాలే..
బాక్సింగ్.. ఈ పేరు వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి! బాక్సర్లు విసిరే పవర్ పంచ్లు కళ్లముందు కదలాడతాయి. అలాంటి ఎందరో బాక్సర్లను తయారు చేస్తోంది హైదరాబాద్లోని గోల్కొండ బాక్సింగ్ అసోసియేషన్. గత ఐదు దశాబ్దాలుగా ఎందరో జాతీయ స్థాయి బాక్సర్లను తయారు చేసింది. తొమ్మిది సార్లు సర్వీసెస్ ఛాంపియన్, ఐదు సార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచిన దివంగత ఘణీచాంద్ గోల్కొండ బాక్సింగ్ క్లబ్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ క్లబ్ను ఏజాజ్ అహ్మద్ నిర్వహిస్తున్నాడు. ఈయన సమక్షంలో పలువురు చిన్నారు, ఔత్సాహికులు బాక్సింగ్ నేర్చుకుంటూ వివిధ వయసుల్లోని గ్రూప్లలో పాల్గొని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో బాక్సింగ్ క్రీడకు రాను రాను క్రేజ్ పెరుగుతోంది. కాగా బాక్సింగ్లో స్వయంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చాపియన్గా నిలిచిన ఏజాజ్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఆయన వద్ద ఎనిమిది సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలలోపు బాలబాలికలు శిక్షణ పొందుతున్నారు. అత్యుత్తమ స్థాయి బాక్సింగ్ పరికరాలతో ఇప్పటి వరకూ ఏజాజ్ పలువురు రాష్ట్రస్థాయి ఛాంపియన్లను తీర్చిదిద్దారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అండర్–19, అండర్–15, అండర్–12 విభాగాల బాక్సింగ్ పోటీల్లో సత్తాచాటారు. కఠోర శ్రమతో పాటు, మంచి శారీరక ధృడత్వం బాక్సింగ్కు కోటలు లాంటివి. నియంత్రిత ఆహారం, క్రమశిక్షణతో మెలిగేవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రత్యర్థి కదలికలు గమనిస్తూ.. ప్రత్యర్థి వేసే పంచ్లు ఏవైపు నుంచి వస్తాయో గమనించి మరుక్షణమే పిడుగులాంటి పంచ్తో కూల్చగలిగిన వారే బాక్సింగ్లో ముందుకు సాగుతారు. కాగా శిక్షణ సమయంలో బాక్సింగ్ నిబంధనలను పాటించడం తప్పనిసరి. తూత్ సేవర్, హెల్మట్తోపాటు అనుమతించిన డ్రెస్ కోడ్, నిబంధనలకు లోబడి వాడే గ్లౌజ్ తప్పనిసరి. ఎందరో ఛాంపియన్లు.. వరుసగా తొమ్మిదేళ్లు సర్వీసెస్ చాంపియన్ బాక్సింగ్గా నిలిచిన ఘణీచాంద్ను ఇక్కడి బాక్సర్లు తమ ఐడియల్గా భావిస్తారు. బలమైన పంచ్లు విసరడం, కనుసన్నలతోనే ప్రత్యర్థి కదలికలను గమనించడం వంటటి అంశాలపై శిక్షణ అనంతరం జరిగే కౌన్సిలింగ్ కార్యక్రమంలో బాక్సర్లకు వివరిస్తారు. అంతేకాక వయసు కేటగిరిలో బరువు ఎంత ఉండాలి అనే విషయంపై కూడా నిరి్థష్ట అవగాహన కల్పిస్తారు. వర్థమాన బాక్సర్ నిఖత్జరీన్ను అమ్మాయిలు తమ ఐడియల్గా భావిస్తున్నారని కోచ్ ఏజాజ్ అంటున్నారు. బాలికలను మరింత ప్రోత్సహించేందుకు నిఖత్జరీన్తో పాటు రాష్ట్రస్థాయి మహిళా బాక్సర్లను తమ బాక్సింగ్ క్లబ్కు రప్పించామని చెబుతున్నారు. తమ వద్ద శిక్షణ పొందిన నేహా, రమ్య, రుబీనా, అహ్మదీ తదితరులు అండర్–15 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో రాష్ట్రస్థాయి బాక్సర్లుగా ఎదిగారని తెలిపారు. అండర్–19 విభాగంలో గత నెల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో షేక్ అబ్దుల్ రెహమాన్ రన్నరప్గా నిలిచారు. జూనియర్ విభాగంలో పలువురు క్రీడాకారులు గోల్కొండ బాక్సింగ్ క్లబ్ నుంచి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. -
కాస్మో'టెక్' సిటీ..మేకప్ రంగానికి పెరుగుతున్న ఆదరణ..
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో జీవనశైలి వేగంగా మారిపోతోంది. ఫ్యాషన్, సినిమా, టెలివిజన్, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగాల పెరుగుదలతో మేకప్ రంగం కూడా భారీగా విస్తరిస్తోంది. వ్యక్తిత్వాన్ని మెరుగుపరచాలనే ఆవశ్యకత, సోషల్ మీడియా ప్రభావం, వివిధ వేదికలపై కనిపించే అవకాశం పెరిగినకొద్దీ మేకప్ సర్వీస్కు డిమాండ్ అధికమవుతోంది. ఒక కాలంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లకే పరిమితమైన మేకప్ ఇప్పుడు సినిమాలు, యాడ్స్, మోడలింగ్, థియేటర్, ఫ్యాషన్ షోలు, ఫొటోషూట్లు, వర్క్ ప్రెజెంటేషన్లు, డిజిటల్ క్రియేటివిటీ లాంటి అనేక రంగాల్లో సౌందర్య సాధనాల అవసరాన్ని గుర్తుచేస్తోంది.. మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ ఎంచుకునే వారికి నగరంలో అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. నగరంలో జరిగే వివాహ వేడుకలు, సినిమా షూటింగులు, సోషల్ మీడియా షూట్స్, బ్రాండ్ ప్రమోషన్స్ వంటివి మేకప్ ఆరి్టస్టులకు రెగ్యులర్ పని కల్పిస్తున్నాయి. ఇందులో కొంతమంది సెలబ్రిటీ మేకప్ ఆరి్టస్టులుగా ఎదుగుతుంటే, మరికొందరు ఫ్రీలాన్సర్లుగా, స్వతంత్ర సెలూన్లు లేదా స్టూడియోస్ స్థాపిస్తూ సొంత బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకుంటున్నారు. తమ సొంత బ్రాండ్ డెవలప్ చేస్తూ కొంత మంది బ్యూటీషియన్లు సోషల్ సెలబ్రిటీలుగా మారుతున్నారు. డిజిటల్ మీడియాలో మేకప్ ట్యుటోరియల్స్, ట్రెండ్ లుక్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావంతో యువత ఈ రంగంలో భవిష్యత్తును మెరుగుపరుచుకుంటోంది. డిజిటల్ పోర్ట్ఫోలియో, బ్రాండ్ భాగస్వామ్యాలతో ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. నిబద్దతతో శిక్షణ, సృజనాత్మకత, అప్డేటెడ్ ట్రెండ్స్కి అనుగుణంగా మెళకువలు పెంచుకుంటే, ఈ రంగంలో విజయానికి ఎలాంటి అవరోధాలు ఉండవు.వెలుగులు నింపే వెడ్డింగ్.. ఇది అత్యధిక డిమాండ్ ఉన్న విభాగం. వధూవరులకు ప్రీ–వెడ్డింగ్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ లుక్స్ కోసం ప్రత్యేక మేకప్ అవసరం. వెడ్డింగ్ మేకప్ అనేది మేకప్ రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న విభాగం. ప్రతి వధువు తన వివాహం రోజున గ్లోవింగ్, ఫొటోజెనిక్ లుక్ను కోరుకుంటుంది. ఇది కేవలం మేకప్ మాత్రమే కాదు, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా మేకప్ చేయాల్సి ఉంటుంది. వెడ్డింగ్ మేకప్లో ప్రధానంగా ఫొటోషూట్ల కోసం లైట్, నేచురల్ లుక్స్తో ప్రీ–వెడ్డింగ్ మేకప్, సంప్రదాయ, గ్లామరస్ లుక్ కోసం హెవీ ఫౌండేషన్, కాంటూరింగ్, ఐ మేకప్, హెయిర్ స్టైలింగ్తో వెడ్డింగ్ డే మేకప్, ఫ్యూజన్ స్టైల్, స్మోకీ ఐస్తో ఆధునిక, ట్రెండీ రిసెప్షన్/పోస్ట్ వెడ్డింగ్ మేకప్ వంటివి ఉన్నాయి.సినిమాటిక్ లుక్ కోసం.. నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్కి మేకప్ కీలకం. ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీకి పని చేసే మేకప్ ఆరి్టస్టులు ఉంటారు. సినిమా, టీవీ రంగాల్లో మేకప్ అనేది కేవలం అందాన్ని కాకుండా, పాత్ర స్వభావాన్ని, వయసును, కాలప్రమాణాన్ని ప్రదర్శించే ఓ సాధనం. ఈ విభాగంలో బేసిక్ స్క్రీన్ మేకప్, పీరియడ్ డ్రామా మేకప్, గాయాలు, వృద్ధాప్య మేకప్, ఫాంటసీ పాత్రలు కోసం ఉపయోగించే స్పెషల్ ఎఫెక్ట్స్ మేకప్ వంటి విధానాలుంటాయి. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో సినిమాటిక్ మేకప్ ఆరి్టస్టులకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని సంస్థలు ఈ రంగంలో స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కూడా అందిస్తున్నాయి.కార్పొరేట్, గ్లామర్ ఈవెంట్స్ప్రొఫెషనల్ లుక్స్ అవసరం అయ్యే ఈవెంట్స్లో కూడా మేకప్ సర్వీసులు ఆశ్రయిస్తున్నారు. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఫస్ట్ ఇంప్రెషన్ కీలకం. మహిళలే కాకుండా, పురుషులు కూడా గ్లామర్, కాని్ఫడెన్స్ కోసం మేకప్ సేవలు ఆశ్రయిస్తున్నారు. ఇందులో తక్కువ మేకప్తో చక్కటి స్కిన్ టోన్, క్లీన్అప్, గ్లో ఫినిష్, నేచురల్ లుక్, ఈవెంట్ స్పెసిఫిక్ మేకప్, మ్యాట్ ఫినిష్, లాంగ్ లాస్టింగ్ లుక్స్ వంటి మేకప్లు ఉన్నాయి. ఇవన్నీ టైమ్ మేనేజ్మెంట్, కస్టమైజేషన్ మీద ఆధారపడి ఉంటాయి. కొంతమంది బిజినెస్ కస్టమర్లకు రెగ్యులర్ మేకప్ సపోర్ట్ కూడా అవసరం అవుతోంది.శిక్షణలో టాప్..మేకప్ శిక్షణ అందించే అనేక ప్రైవేట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు నగరంలో ఉన్నాయి. వీఎల్సీసీ, లాక్మే అకాడమీ, నేచురల్ టఐనింగ్ అకాడమీ, జావీద్ హబీబ్ అకాడమీ, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ వంటి సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. ఈ సంస్థలు ప్రాథమిక స్థాయి నుంచి ప్రొఫెషనల్ కోర్సులు వరకూ అందిస్తున్నాయి. కొన్నింటిలో ఇంటర్న్షిప్ అవకాశాలు ఉన్నాయి. ఇవి పరిశ్రమ అనుభవాన్ని ఇచ్చే మార్గంగా నిలుస్తున్నాయి. అనేక ఏళ్లుగా మేకప్ రంగంలో మహిళలు ఆధిపత్యంలో ఉన్నప్పటికీ, ఇటీవల పురుషులు కూడా ఈ రంగంలో సత్తా చాటుతున్నారు. ప్రత్యేకంగా సినిమా, ఫ్యాషన్ ఇండస్ట్రీలో పురుష మేకప్ ఆరి్టస్టులు ఎక్కువగా కనిపిస్తున్నారు. లింగపరమైన పరిమితులు లేకుండా, టాలెంట్కు గౌరవం దక్కే రంగంగా మేకప్ రంగం రూపుదిద్దుకుంటోంది. (చదవండి: బ్యూటీకి కేరాఫ్గా భాగ్యనగరం..!) -
పుణ్యకార్యం... పాపకార్యం
అర్థం తెలిసినా తెలియకపోయినా ఈమాటలని మాత్రం అందరూ తరచు వాడుతూనే ఉంటారు. ‘‘నీకు పుణ్యం ఉంటుంది బాబూ ఈ పని చేసి పెట్టు.’’ ‘‘పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు’’, ‘‘ఏ పూర్వ పుణ్యమో’’ ‘‘పాపం పుణ్యం దేవుడికే ఎరుక’’ ‘‘పాపం పండింది’’. ‘‘ఎవడి పాపాన వాడే పోతాడు.’’ ఇటువంటి సామెతలు, నానుడులు అందరి నోళ్లలోనూ నానుతూ ఉంటాయి. పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి? అన్నది ఎంతమందికి తెలుసు? ఏదో వ్రతం చేస్తే, పూజ చేస్తే, పుణ్యం వస్తుందిట! వ్రతం అవగానే ఇతరులని బాధ పెట్టినా కూడా పుణ్యం వస్తుందా? ఆలోచించాలి. పాప పుణ్యాలకు వ్యాసభగవానుడు చక్కని నిర్వచనం ఇచ్చాడు.‘‘అష్టాదశ పురాణసారం శ్లోకార్థేన ప్రవక్ష్యామిపరోపకారాయ పుణ్యం, పాపాయ పరపీడనం’’ ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం, అపకారం చేస్తే పాపం. పైగా ఇది పదునెనిమిది పురాణాల సారం అని కూడా చె΄్పాడు. ఏవేవో మహత్కార్యాలు చేయనవసరం లేదు. శక్తిమేరకు ఎవరికైనా సహాయం చేయటం, వీలైనంత వరకు ఎవరినీ బాధ పెట్టకుండా ఉండటం చేస్తే చాలు. మొదటి దానివల్ల పుణ్యం వస్తుంది. రెండవ దాని వల్ల పాపం రాకుండా ఉంటుంది. ఇవి ఎంత తేలిక అంటే చేయాలి అనిపించదు. మనిషికి పుణ్యం కావాలి. కాని, పుణ్యకార్యాలు చేయడు. ‘‘సత్కర్మంబు లెవ్వియు చేయ జాలరు కలియుగంబున మానవుల్’’ అంటాడు వ్యాసభగవానుడు భాగవతంప్రారంభంలో. పాపం వద్దు అనుకుంటాడు. కాని చెడ్డ పనులు మానలేడు. ఈ ఒక్కసారికే అని తనకి తాను సద్ది చెప్పుకుంటాడు. దీనికి దుర్యోధనుడు ఉదాహరణ. ‘‘నాకు ధర్మం తెలుసు. కాని, నా మనసు దానిమీదకి పోదు. నాకు అధర్మమూ తెలుసు. కాని, నా మనసు దాని నుండి మళ్లించలేను.’’ అంటాడు. ఈ లక్షణం అందరిలోనూ ఇంతో అంతో ఉంటుంది. కాని, ఆ సంగతి పైకి ధైర్యంగా చెప్పలేరు. కొంతమంది ఈ గుణం తమలో ఉన్నట్టు గుర్తించరు కూడా. తాము చేసేది ధర్మమే అని నమ్మేవారు కొంతమంది. మరికొంతమంది ధర్మం కాదని తెలిసినా సమర్థించుకుంటూ ఆత్మవంచన చేసుకునే వారు కూడా ఉన్నారు. వైద్యుడు దుష్టాంగాన్ని కత్తితో కోస్తాడు. అది పాపకార్యం అవుతుందా? యుద్ధంలో సైనికుడు శత్రువుని సంహరిస్తే, అది పుణ్యకార్యమే కాని, పాపం కాదు. చేసే పని ఉద్దేశం, దానివల్ల కలిగే ప్రయోజనం పాపమా? పుణ్యమా? అన్న దానిని నిర్ధారిస్తుంది. ఏ పనీ దాని అంతట అది మంచిది కాని, చెడ్డది కాని కాదు. ఫలితం మేలు కలిగిస్తుందా? హాని కలిగిస్తుందా అన్న దాని మీద ఆధార పడి ఉంటుంది. నవ్వి, పాటలు పాడి, బాధించే వారు లేరా? అది పాపమే కదా! భావనకేప్రాధాన్యం. కొన్నిసార్లు కఠినంగా మాట్లాడటం, ప్రవర్తించటం అవసరమే. దాని వల్ల పాపం చుట్టుకోదు. తమ్ముడు భ్రష్టుడై ఇల్లు గుల్ల చేసి వెళ్ళిపోయాడని తెలిసి పుట్టింటికి వచ్చిన నిగమశర్మ అక్క తల్లితండ్రులను ‘‘తీండ్ర గల వచన రచనా చమత్కారంబుల కొంత కొంత వంతకుం తొలంగించుచు ..’’ అంటాడు తెనాలి రామకృష్ణుడు. ఓదార్పు దుఃఖాన్ని, ఆత్మన్యూనతాభావాన్ని పెంచే అవకాశం ఉంది. తిక్కగా ఏడుస్తున్న పిల్లవాడిని తిక్క నుండి బయటకు తీసుకు రావటానికి చిన్న దెబ్బ వేయటం క్రూరకృత్యం అనలేము కదా! అప్పుడు స్పృహలోకి వచ్చి మామూలు ఏడుపు ఏడుస్తాడు. – డా.ఎన్. అనంతలక్ష్మి -
సెలవుల వేళ..సరికొత్త యాత్రల ట్రెండ్..
ఒకప్పుడు ఎండను తప్పించుకోవడమే వేసవి విహారాల లక్ష్యంగా ప్రయాణాలు ప్లాన్ చేసేవారు. అయితే ఇప్పుడు దీంతో పాటే వైవిధ్యభరిత జ్ఞాపకాలను కూడా అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా విభిన్న రకాల హాలిడే స్పాట్స్ను అన్వేషిస్తున్నారు. వేసవి సీజన్ ముగింపునకు వస్తున్న నేపథ్యంలో.. ఈ సీజన్లో బుకింగ్స్ అనుసరించి ప్రముఖ ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్న లెక్కల ప్రకారం.. మారిన హైదరాబాద్ నగరవాసుల విహార యాత్రాభిరుచులు ఇలా ఉన్నాయి. చాలా మంది సిటిజనులు ప్రశాంతతనే అత్యంత ప్రధాన గమ్యంగా మార్చుకుంటున్నారు. అందుకే అర్థవంతమైన ప్రయాణం కోసం ఆఫ్–సీజన్ గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు. అంతగా పర్యాటకుల రద్దీ కనబడని ప్రాంతాలను కోరుకుంటున్నారు. ‘ఈశాన్య ప్రాంతాలకు, ముఖ్యంగా మేఘాలయకు బుకింగ్స్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. అని ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్న ట్రావెల్ ఎక్స్పర్ట్ లక్ష్మి చెప్పారు. ‘ఈశాన్య, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ తరహా టూర్స్కి ప్రసిద్ధి చెందినప్పటికీ రాజస్థాన్, వారణాసి వంటి ఆధ్యాతి్మక పట్టణాలు ఆఫ్–సీజలో అనూహ్య డిమాండ్ను చవిచూస్తున్నాయని మరొక ఆపరేటర్ సృజన చెప్పారు. ప్రకృతి అందాలకు నిలయమైన ఉత్తరాఖండ్లోని ఔలీ, మేఘాలయలోని షిల్లాంగ్కు ఈ ఏడాది డిమాండ్ అధికంగా ఉందని చెప్పారు. ఇప్పటికీ మానసిక ప్రశాంతత కోరుకునే వారిని లద్దాఖ్ పాక్షిక సాహస యాత్రికులను కేదార్నాథ్ ఆకర్షిస్తున్నాయి.ట్రెక్కింగ్కు జై.. సమ్మర్లో వెనుకంజలో ఉండే ట్రెక్కింగ్ సరదా..ఇప్పుడు ఊపందుకుంటోంది. ముఖ్యంగా పూర్తిస్థాయిలో తమకు వెన్నుదన్నుగా ఉండే సంస్థలు నిర్వహించే ఆర్గనైజ్డ్ ట్రెక్కింగ్కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. హంప్టా పాస్, భంగు సరస్సు చంద్రఖని ట్రెక్ ట్రయిల్స్కు బృందాలు బుక్ చేస్తున్నాయి. భద్రత, వసతి సౌకర్యాలతో పాటు అన్ని రకాల మద్ధతు అందించే ఇండియాహైక్స్ మోక్స్టైన్ వంటి ఏజెన్సీల సారథ్యంలో నిర్వహించే ట్రెక్లకు బుకింగ్స్ బాగా పెరిగాయి.మండే ఎడారిపై మనసు.. ‘ఇప్పుడు సిటిజనులు కేవలం చల్లని ప్రదేశాలను మాత్రమే సందర్శించాలని కోరుకోవడం లేదు. వాతావరణం అనుకూలించకున్నా రాజస్థాన్ను సైతం ఎంచుకుంటున్నారు. ‘ఈ సమయంలో అసలైన డిసర్ట్ బ్యూటీని ఎంజాయ్ చేయాలని మాత్రమే కాదు ఈ సమయంలో అక్కడ హోటల్ ధరలు కూడా తక్కువగా ఉంటాయి’ అని సిటీలో ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న అబ్దుల్ హుస్సేన్ అన్నారు. సిటిజనుల డిమాండ్ వల్ల మౌంట్ అబూకి బుకింగ్స్ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం సీజన్ కానప్పటికీ వారణాసి కూడా డిమాండ్లోనే ఉంది. అంతర్జాతీయం.. వ్యూహాత్మకం.. సిటీ నుంచి సమ్మర్లో చేసే అంతర్జాతీయ ప్రయాణం రెండు రకాలుగా మారిందని ఆపరేటర్లు చెబుతున్నారు. ఒకటి భారీ బడ్జెట్ కాగా రెండోది వ్యూహాత్మకం. విదేశాలకు వెళ్లాలి కానీ వ్యయప్రయాసలు తక్కువ ఉండాలి అనే ఆలోచన కలిగిన వారు వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేసవిలో ఖర్చుకు వెనుకాడని నగరవాసులు స్విట్జర్లాండ్, పారిస్, ఇటలీ, ఉత్తర ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్, కజకిస్తాన్, ఉరుమ్కియిన్ చైనా, ప్యాకేజీ టూర్లను బుక్ చేస్తున్నారు. వీసా సమస్యలు తక్కువగా ఉండడం.. ప్రత్యక్ష విమానాలు చౌకైన మారి్పడుల కారణంగా థాయిలాండ్, ఈజిప్ట్ కూడా సిటిజనుల ఆదరణ పొందుతున్నాయి. టర్కీ, కైరో–ఇస్తాంబుల్కు కూడా బుకింగ్స్ ఉన్నప్పటికీ తర్వాతి పరిణామాల నేపథ్యంలో టరీ్కకి అత్యధిక క్యాన్సిలేషన్స్ వచ్చాయని బుకింగ్ ఏజెంట్ రియాజ్ అహ్మద్ అంటున్నారు.మే మధ్య నుంచే ప్రారంభం.. ‘తక్కువ దూరంలో ఉండి, తరచూ వెళ్లే ప్రాంతాలనే కుటుంబ సమేతంగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సోలో యాత్రికులు, కొన్ని ప్రత్యేక బృందాలు మాత్రం కొత్తరకం టూర్లకు సై అంటున్నారు. ఏప్రిల్ చివరి నుంచి మే మధ్యలో సమ్మర్ ్చు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మే మొదటి రెండు వారార్లో భారీ రద్దీని చవిచూశామని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. (చదవండి: శృంగేశ్వర్పూర్..రాముని వనపథం..) -
బ్యూటీకి కేరాఫ్గా భాగ్యనగరం..!
ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ నగరం పాతికేళ్లకు ముందే ఈ పోటీల్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది. దేశానికి విశ్వసుందరి, ప్రపంచ సుందరి రెండు కిరీటాలనూ అందించిన తొలి నగరంగా చరిత్ర సృష్టించింది. హేడెన్ హైదరాబాదీయే.. నగరానికి చెందిన ఆంగ్లో–ఇండియన్ కుటుంబంలో 1973వ సంవత్సరం మే 13న జని్మంచిన డయానా హేడెన్.. సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ హైసూ్కల్లో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు. పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆమె 13 సంవత్సరాల వయసులోనే తన భృతి కోసం పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది. నగరంలో ఆమె మోడలింగ్ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఎన్ కోర్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేశారు. అనంతరం గ్లామర్ రంగంలో అడుగుపెట్టి నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని ఐశ్వర్యారాయ్ దక్కించుకున్న తర్వాత 3వ సారి దేశానికి అందించిన ఘనత డయానా హేడెన్ దక్కించుకున్నారు. అంతేకాదు హైదరాబాద్ను కూడా చరిత్రకు ఎక్కించారు. ఈ 1997 మిస్ వరల్డ్ పోటీ విజేత మెయిన్ టైటిల్తో పాటు మూడు సబ్–టైటిళ్లను కూడా గెలుచుకున్నారు. అలా గెలిచిన ఏకైక మిస్ వరల్డ్ టైటిల్ హోల్డర్గా నిలిచారు. ఆ తర్వాత సినిమా, టీవీ రంగంలో ఆమె స్థిరపడ్డారు.విశ్వసుందరిని అందించిందీ మనమే..మిస్ యూనివర్స్ కిరీటాన్ని దేశానికి అందించిన సుషి్మతాసేన్ కూడా హైదరాబాదీనే. ఆమె 1975వ సంవత్సరంలో నవంబర్ 19న నగరంలోని బెంగాలీ బైద్య కుటుంబంలో జన్మించారు. భారత వైమానిక దళం మాజీ వింగ్ కమాండర్ షుబీర్ సేన్, ఆభరణాల డిజైనర్ అయిన సుబ్ర సేన్లు ఆమె తల్లిదండ్రులు. సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. అనంతరం 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచి, బాలీవుడ్లో స్థిరపడి పలు హిందీ చిత్రాల్లో పనిచేశారు. నగరంలో తాను స్థాపించిన ఐయామ్ షి పోటీల సందర్భంగా పలుమార్లు ఆమె నగరాన్ని సందర్శించారు. (చదవండి: 44 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కూతురు..! ట్విస్ట్ ఏంటంటే..) -
44 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కూతురు..! ట్విస్ట్ ఏంటంటే..
ఇక కనపడదు అనుకున్న కూతురు కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఆ తల్లి ఆనందం మాటలకందనిది. ఏ దేవుడి ఇచ్చిన వరం అనే భావన కచ్చితంగా కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది ఈ తల్లికి.దక్షిణకొరియాకి చెందిన హాన్ టే మే 1975లో ఆరేళ్ల కూతురుని ఇంటి వద్ద వదిలేసి మార్కెట్కి వెళ్లింది. పని ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే కూతురు క్యుంగ్-హా అదృశ్యమై ఉంది. దాంతో ఆమె కూతురు కోసం గాలించిన ప్రాంతం అంటూ లేకుండా కళ్లు కాయలు కాచేలా వెతికింది. అయితే ప్రయోజనం శూన్యం. ఇక విసిగి వేసిరిపోయినా ఆమె ..ఇక తన కూతురు కనిపించిదనుకుని ఆశలు వదులేసుకుంది. అయితే 2019లో అనూహ్యంగా కమ్రా అనే డీఎన్ఏ మ్యాచ్ ద్వారా తన కూతురుని తిరిగి పొందగలిగింది. ఇది విదేశీ కొరియన్ దత్తత తీసుకున్న వారి డీఎన్ఏతో జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనుసంధానం చేసే కమ్యూనిటీ. దీని సాయంతో తన బిడ్డను కలుసుకుంది. కాలిఫోర్నియాలో నర్పుగా పనిచేస్తున్న బెండర్తో హెన్ టే డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది. గుర్తింపు నిర్థారించుకోవడానికి బెండర్, హాన్టే ఫోన్ కాల్లో ఇరువురు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బెండర్ సియోల్కి వెళ్లి తన తల్లి హాన్ టేని కలవగానే భావోద్వేగానికి గురయ్యారు. కానీ హాన్ టేకి అదంతా సభ్రమాశ్చర్యంగా ఉంది. నిజమేనా..? కాదా అనే సందిగ్ధంలో ఉండిపోయింది. అయితే బెండర్ జుట్టుని తాకి అది తన కూతురే అని నిర్థారణ చేసుకుని ఆలింగనం చేసుకుంది. 30 ఏళ్లుగా హెయిర్ డ్రస్సర్గా పనిచేస్తున్న హాన్ టే ఆ అనుభవంతోనే కూతురు జుట్టుని తాకి తన బిడ్డే అని నిర్థారించుకుంది. ఈ మేరకు హాన్ టే కూతురు క్యుంగ్ మాట్లాడుతూ..ఒక వింత మహిళ తన వద్దకు వచ్చి నీ తల్లికి ఇక నీ అవసరం లేదంటూ..తనను రైల్వేస్టేషన్కి తీసుకువెళ్లిపోయిట్లు తెలిపింది. అక్కడ పోలీసు అధికారులు తనను ఎత్తుకుని ఒక అనాథశ్రమంలో ఉంచారని, అక్కడ నుంచి అమెరికాకు తరలించారని తెలిపింది. అయితే అక్కడ వర్జీనియాలో ఒక జంట తనను దత్తత తీసుకుందని చెప్పుకొచ్చారామె. ఇక హాన్ టే ఇన్నాళ్ల తన మనో వేదనకు గానూ..దక్షిణ కొరియాలో కొనసాగుతున్న విదేశీ దత్తత కార్యక్రమాన్ని సవాలు చేస్తూ.. ప్రభుత్వంపై దావా వేసింది. అలాగే తన కుమార్తె కనపడక ఎంత నరకయాతన అనుభవించానో చెప్పలేను, ఓ పిచ్చిపట్టినదానిలో క్షోభను అనుభించానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో వరుసగా వచ్చిన దక్షిణ కొరియా ప్రభుత్వాలు పారిశ్రామిక లబ్ధి కోసం ఇలా పిల్లలను పెద్ద ఎత్తున సామూహికంగా ఎగుమతి చేసినట్లు ఆరోపణలు రావడమేగాక విచారణలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతునట్లు తేలింది. (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
మస్తుమజా ‘మష్రూమ్స్’..! ఆదివాసులు మెచ్చే ఆహారం..
అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీలు తినే ఆహారంలో ప్రతీ ఒక్కటి.. ఏదో ఒక ప్రత్యేకత, ఔషధ విలువలు కలిగి ఉంటాయి. అందుకే ఆదివాసీల్లో రోగనిరోధక శక్తి అధికం. వారు తీసుకునే అటవీ ఉత్పత్తుల్లో.. వర్షాకాలం ప్రారంభంలో మాత్రమే లభించే పుట్ట గొడుగులు (మష్రూమ్స్) ప్రత్యేకం. ఇవి ఎక్కువగా పుట్టపైనే పుడతాయి. విప్పుకున్న తర్వాత గొడుగు ఆకారంలో ఉండటంతో.. వాటికి పుట్టగొడుగు అని పేరు వచ్చింది. వీటిని ఆదివాసీలు ఎంతో ఇష్టపడి తింటారు. శుభ్రం చేసిన పుట్టగొడుగులను నేరుగా లేదా కూర వండుకుని తినడం వీరి ఆనవాయితీ. వీటిలోని పోషకాలను గుర్తించిన నాగరికులు కృత్రిమంగా ఇంట్లో పెంచే విధానంతో లక్షలు సంపాదిస్తున్నారు. మార్కెట్లో కిలోకు రూ.350 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. పోషక విలువలు అధికం.. కప్పు పుట్టగొడుగుల్లో 15 కేలరీల శక్తి, 2.2 గ్రాముల ప్రొటీన్, 2.3 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 0.7 గ్రాముల ఫైబర్, విటమిన్ బి, బి2, బి9, బి3లు, పొటాషియం, రైబోఫ్లావిన్, నియాసిన్లతో పాటు విటమిన్ ఈ, ఇర్గొథియోనైన్, సెలీనియంలు పుష్కలంగా ఉంటాయి. ఇతర ఆహార పదార్థాల్లో లభించని విటమిన్ డి పుట్టగొడుగుల్లో ఉండటం ప్రత్యేకం. కేన్సర్, మధుమేహానికి చెక్.. పుట్టగొడుగుల్లో ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. ఇవి తినడం వల్ల కేన్సర్, మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధ వ్యాధులు రాకుండా కట్టడి చేయవచ్చు. ఉన్నవారు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడతాయి. రక్తపోటు (బీపీ)ను అద్భుతంగా నియంత్రిస్తుంది. పుట్టగొడుగుల్లోని కాపర్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి, వాటి సామర్థ్యం పెంచి మెదడు, ఇతర కండరాలకు ఆక్సిజన్ అందించడానికి దోహదపడతాయి. అన్నీ తినేవి కావు.. ఫంగీ జాతికి చెందిన మొక్కల్నే పుట్టగొడుగులుగా పిలుస్తారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అన్ని రకాల పుట్టగొడుగులు తినడానికి ఉపయోగపడవు. కొన్ని రకాలు విషపూరితంగా ఉంటాయి. వీటి గురించి తెలిసిన వారు మాత్రమే అడవుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఆదివాసీలకు మాత్రం ఏవి తినాలో, ఏవి తినకూడదో తెలుసు.ఇష్టంగా తింటాం ఆదివాసీలకు.. అడవికి ఉన్న సంబంధానికి ప్రతీకలు పుట్టగొడుగులు. వాటిని ఎంతో ఇష్టంగా తింటాం. ఆదివాసీల ఆహార నియమాలపై జరిగిన పరిశోధనలో.. పుట్టగొడుగుల ప్రాధాన్యం తెలుసుకుని ఆధునిక ప్రజలు ఆహారంలో ఉపయోగిస్తున్నారు. పంటగా సాగు చేసి పండిస్తున్నారు. – పుల్సం సాంబయ్య, విలువైన ప్రొటీన్లు పుష్కలం పుట్టగొడుగుల్లో ఎంతో విలువైన ప్రొటీన్లు, విటమిన్లు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అనుదినం ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవడం ఎంతో మంచిది. గర్భిణులకు చాలా ఉపయోగం. జనప్రేమి వనప్రేమి అవార్డు గ్రహీత, ఉపాధ్యాయుడు.– డాక్టర్ రవీందర్నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహబూబాబాద్ మెడికల్ కళాశాల(చదవండి: గుండెదడ ఎందుకొస్తుంది..? ఆరోగ్యానికి ప్రమాదకరమా..?) -
ఫ్యాట్ పెరిగిందా..?
కొంత వయసు దాటాక పొట్ట కాస్త ముందుకొచ్చి కనిపిస్తుంది. దీనికి కారణం వయసు పెరుగుతున్న కొద్దీ దేహంతో పాటు మిగతా శరీర భాగాల్లో కొవ్వు కణాలు పేరుకుపోతూ ఉండటం. మధ్యవయసు దాటాక వయసుతో పాటు దేహంలో కొవ్వు కూడా ఇలా పెరుగుతూ, పేరుకుపోతూ ఉంటుంది. ఇది కేవలం బయటకు కనిపించే పొట్ట భాగంలోనే కాదు... ఇలా కొవ్వు కాలేయంలోని నార్మల్ కణాల్లో కూడా పేరుకుపోతూ ఉండవచ్చు. ఇలా జరగడాన్ని ఫ్యాటీ లివర్గా పేర్కొంటారు. అప్పుడు కాలేయం తాలూకు సహజ ఆకృతి, దాని స్వాభావికమైన రంగులో మార్పురావచ్చు. క్రమంగా అది కాస్త గట్టిగాగానీ లేదా జిగురుజిగురుగా, పచ్చరంగుకు మారవచ్చు. ఆ కండిషన్నే సిర్రోసిస్ అంటారు. కొన్నిసార్లు దేహంలోకి చాలా ప్రమాదకరమైన విషాలు (టాక్సిన్స్) ప్రవేశించడం వల్ల గానీ, కొన్ని వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్స్ వల్లగానీ లేదా తగినంత ఆహారం తీసుకోకుండా ప్రతిరోజూ మితిమీరిన ఆల్కహాల్ తాగుతుండటం వల్ల కూడా సిర్రోసిస్ రావచ్చు. రక్తనాళాలు సాలీడు ఆకృతిలో ఎందుకు కనిపిస్తాయంటే... ఇలా కాలేయంలో కొవ్వు పేరుకుంటూ, దాని సహజ ఆకృతి, రంగు దెబ్బతింటున్నప్పుడు చర్మంలోంచి రక్తనాళాలు సాలీడు ఆకృతిలో బయటకు కనిపించవచ్చు. అంతేకాదు... ఆకలి లేక΄ోవడం, నీరసం, నిస్సత్తువ, పొట్టలో నీరు చేరడం, కళ్లు పసుపురంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు తప్పక డాక్టర్ను సంప్రదించాలి. నిర్ధారణ ఇలా.... పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తుంటే డాక్టర్లు లివర్ ఫంక్షన్ టెస్ట్ వంటి కొన్ని పరీక్షలు చేసి కాలేయం పనితీరు తెలుసుకుంటారు. కాలేయం పనితీరు బాగుంటే ఆందోళన అక్కర్లేదు. ఫ్యాటీలివర్ ప్రాథమిక దశలో ఉన్నా అంతగా ప్రమాదం ఉండదు. ఇలా పొట్ట ముందుకు వస్తున్నవారు స్థూలకాయాన్ని, బరువు పెరగడాన్ని నియంత్రించుకోవాలి. మద్యం పూర్తిగా మానేయాలి. అన్ని రకాల పోషకాలు అందేలా... ముఖ్యంగా విటమిన్ బి లాంటి పోషకాలు అందేలా మంచి ఆహార నియమాలు పాటించాలి. రోజూ కొద్దిగా వ్యాయామం చేయాలి. ఇలా ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ ఉంటే కొద్దిపాటి మందులతోనే కాలేయం ఆరోగ్యం మెరుగవుతుంది. సాధారణంగా కాలేయం తనలో దెబ్బతిన్న భాగాన్ని తానే బాగుచేసుకుంటుంది. అలా ఒకసారి అది తనను రిపేర్ చేసుకోలేనంతగా దెబ్బతింటే మాత్రం కాలేయ మార్పిడి తప్ప మరొక ప్రత్యామ్నాయం ఉండదు. అందుకే మధ్యవయసు వాళ్లు కాలేయంపై శ్రద్ధ చూపడం అవసరం. డాక్టర్ చలపతిరావు ఆచంట, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ (చదవండి: గుండెదడ ఎందుకొస్తుంది..? ఆరోగ్యానికి ప్రమాదకరమా..?) -
గుండెదడ ఎందుకొస్తుంది..? ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
నిజానికి గుండెదడ ఒక జబ్బు కాదు. కాకతే కొన్ని సాధారణ లేదా తీవ్రమైన గుండె సమస్యల తాలూకు ఓ లక్షణంగా భావించవచ్చు. ఒక్కోసారి గుండె దడదడలాడుతున్న విషయం బాధితులకు ఏ ఉపకరణం లేదా ఏ టెస్ట్ సహాయం లేకుండానే తెలిసిపోతుంటుంది. ఆందోళనతో కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంది. అయితే అరుదుగా కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్రమైన గుండె జబ్బులకు అదో సూచన కావచ్చు. అందుకే గుండెదడ గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం. అలాంటి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. గుండెదడను వైద్యపరిభాషలో పాల్పిటేషన్ అంటారు. చాలామంది జీవితకాలంలో ఏదో ఒకసారి అనుభవించే సాధారణ లక్షణం ఇది. చాలా సందర్భాల్లో ఏదో ఒక మానసిక ఆందోళన లేదా ఉద్విగ్నత వంటి కారణాలతో కనిపించే అత్యంత మామూలు సమస్య ఇది. చాలా వరకు తీవ్రమైన సమస్య కాకపోయేందుకే అవకాశాలెక్కువ. కాకపోతే చాలా అరుదుగానే ఏదైనా తీవ్రమైన గుండె సమస్యకు సూచన అయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు.పాల్పిటేషన్స్ అంటే...? గుండె నిత్యం స్పందిస్తున్నప్పటికీ... అది కొట్టుకుంటున్న తీరు సాధారణంగా మన అనుభవంలోకి రాదు. కానీ కొన్నిసార్లు వేగంగా స్పందించే ఆ స్పందనలు వ్యక్తుల అనుభవంలోకి వస్తాయి. కొట్టుకుంటున్న వేగాన్ని బట్టి వాటిని ఇంగ్లిష్లో సాధారణంగా ఫ్లట్టరింగ్, పౌండింగ్ లేదా రేసింగ్గా చెబుతుంటారు. కొన్నిసార్లు వ్యక్తులు వేగంగా పరిగెత్తడం, తీవ్రమైన భావోద్వేగాలకు గురికావడం, ఉద్విగ్నతకూ, తీవ్రమైన ఆందోళనకూ గురికావడం, అలాగే తీవ్రమైన జ్వరం లేదా గర్భధారణ సమయంలో గుండెదడ (పాల్పిటేషన్స్) అనుభవంలోకి వచ్చేందుకు అవకాశాలెక్కువ. అలాగే కొన్ని సందర్భాల్లో ఎక్కువసార్లు కాఫీ తాగడం, కొన్ని సందర్భాల్లో పొగతాగడం, మద్యం తీసుకోవడం లేదా నిద్రలేమి వంటి జీవనశైలి అలవాట్లు కూడా పాల్పిటేషన్స్కు దారితీయవచ్చు. సాధారణ జీవక్రియల్లో భాగంగానే ఇలా గుండెదడ రావచ్చు. అలాంటప్పుడు గుండెదడ పెద్దగా హానికరం కాదు.మరి పట్టించుకోవాల్సిందెప్పుడంటే... గుండెదడ (పాల్పిటేషన్ ) అకస్మాత్తుగా స్పష్టమైన కారణం లేకుండా వచ్చినప్పడు. తలతిరుగుతుండటం, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, స్పృహ తప్పడం వంటివి జరిగినప్పుడు.గుండె లయ తప్పడం (అబ్నార్మల్ రిథమ్ లేదా అరిథ్మియా) వంటి లక్షణాలు కనిపించినప్పుడు...పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని కొంత సీరియస్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ గుండె లయతప్పడంలో ఒక ప్రత్యేకమైన రకం గురించి చెప్పుకోవాలి. గుండె లయబద్ధంగా స్పందించడానికి వీలుగా సయనో ఏట్రియల్ నోడ్ అనే చోట ఎలక్ట్రిక్ సంకేతాలు వెలువడుతుంటాయి. వీటి కారణంగానే గుండె ఒకే రకమైన లయతో స్పందిస్తుంటుంది. ఒకవేళ అలా కాకుండా ఆ ఎలక్ట్రిక్ స్పందనలు అసాధారణంగా ఎక్కడపడితే అక్కడ (అంటే నిర్దిష్టమైన ట్రాక్లో కాకుండా ఒకదానిని మరొకటి బైపాస్ చేస్తూ) వెలువడుతున్నప్పుడు... గుండె తన నిర్దిష్టమైన లయతో... లయబద్ధంగా కాకుండా ఎలా పడితే అలా కొట్టుకుంటూ ఉండేందుకు అవకాశముంది. దాంతో గుండె రిథమ్ దెబ్బతినడం వల్ల అరిథ్మియా వచ్చే అవకాశముంది. అయితే ఇలా జరిగినప్పుడు అదృష్టవశాత్తు శస్త్రచికిత్స వంటి సంక్లిష్టమైన ప్రక్రియలు అవసరం లేకుండానే ‘రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (ఆర్ఎఫ్ఏ)’ అని పిలిచే రక్తనాళాల్లోకి పైప్ను పంపే క్యాథెటర్ ప్రోసిజర్స్తోనే ‘ఎలక్ట్రో ఫిజియాలిస్ట్లు’ అనే నిపుణులు ఈ సమస్యను చక్కదిద్దే అవకాశం ఉంది.గుండెదడతో ఎవరెవరికి ముప్పు...?స్థూలకాయం (ఒబేసిటీ), అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ లేదా గుండె జబ్బులున్నవారు గుండెదడ లక్షణాన్ని కాస్త సీరియస్గానే పరిగణించాలి. అందునా మరీ ముఖ్యంగా వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా అనే ‘అరిథ్మియా’ (గుండె లయ తప్పడం) లేదా ఆర్టీరియల్ ఫిబ్రిలేషన్ వంటి సమస్యలు ఉన్నవారిలో గుండెదడ ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకెళ్లి కార్డియాక్ అరెస్ట్ లేదా పక్షవాతం (స్ట్రోక్) వంటి ప్రాణహాని కలిగించేంత తీవ్రమైన ముప్పునకు కారణమయ్యే అవకాశాలుంటాయి. అందుకే ఇక్కడ పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు గుండెదడ విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇక మరో రకమైన ముప్పు ఎవరిలోనంటే... కొందరి కుటుంబాల్లో అకస్మాత్తుగా గుండె΄ోటు వచ్చి మరణించిన (సడన్ కార్డియాక్ డెత్) దాఖలాలు ఉన్న వైద్య చరిత్ర గలవారైతే... అలాంటి కుటుంబాల్లోని వ్యక్తులు గుండెదడను అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఇక కార్డియో మయోపతి (గుండె కండరానికి సంబంధించిన ఆరోగ్య సమస్య) లేదా వంశపారంపర్యంగా గుండె ఎలక్ట్రిక్ స్పందనల్లో తేడాలు కనిపించే ఛానెలోపతీస్) వంటి వారిలోగుండెదడ ముప్పుగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివారు ఎలక్ట్రోఫిజియాలజిస్టుల ఆధ్వర్యంలో తరచూ వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.ఆధునిక కార్డియాక్ ఎలెక్ట్రోఫిజియాలజీ భూమిక... కార్డియాక్ ఎలెక్ట్రోఫిజియాలజీ అనేది గుండె లయ (హార్ట్ రిథమ్) సమస్యలను గుర్తించడం, నిర్ధారణలతో పాటు ఆ సమస్యలకు తగిన చికిత్స అందించడానికి రూపొందిన గుండె చికిత్స విభాగం. గుండె సమస్యల నిర్ధారణ కోసం ఈసీజీ, హోల్టర్ మానిటరింగ్, ఎలక్ట్రో ఫిజియోలాజికల్ స్టడీస్, అత్యాధునిక ఇమేజింగ్ వంటి ప్రక్రియల సహాయం తీసుకుంటారు. వాటి సాయంతో ఎలక్ట్రోఫిజియాలజిస్టులు ఈ తరహా సమస్యలను గుర్తిస్తారు. ఇక అత్యధికంగా ముప్పు ఉన్న బాధితులకు ముందుగానే ప్రమాదాలను నివారించేందుకు దేహంలో అమర్చే ఇంప్లాంటబుల్ కార్డియో–వెర్టర్ డీఫిబ్రిలేటర్స్ (ఐసీడీ) వంటి ఉపకరణాలను అమర్చుతారు. ఈ ఉపకరణాలు గుండె లయతప్పినప్పుడుల్లా చిన్న ఎలక్ట్రిక్ షాక్ను వెలువరించడం ద్వారా గుండె లయను మళ్లీ క్రమబద్ధీకరిస్తాయి. దాంతో గుండెనొటు వంటి ప్రాణాంతక పరిస్థితులు నివారితమవుతాయి. చివరగా... సాధారణగా గుండెదడ అన్నది అంత హానికరం కాదనే చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ముప్పు ఉన్నవారిలో అవి కొంత ప్రమాద హెచ్చరికలు (వార్నింగ్ సిగ్నల్స్)గా పరిగణించవచ్చు. కాబట్టి ఆ హెచ్చరికల ఆధారంగా వైద్యులను సంప్రదించడం వల్ల ఒక రకంగా గుండెదడ మేలే చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య ప్రక్రియలూ, ఆధునిక చికిత్సల వల్ల ప్రమాదాలను నివారించుకునేందుకు, చికిత్సతో నయం చేసుకునేందుకు వీలుంది కాబట్టి ఆందోళన అక్కర్లేదు. కాకతే తగిన జాగ్రత్త మాత్రం అవసరమంటూ గుండెదడ ఓ వార్నింగ్ బెల్లా పనిచేస్తుందని చెప్పవచ్చు. డాక్టర్ ఏ సురేశ్, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్, హైదరాబాద్(చదవండి: బొడ్డు తాడుని ఆలస్యంగా ఎందుకు కట్ చేస్తారంటే..?) -
ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..
కొన్ని పండుగలు ప్రాణాలకే ప్రమాదం అన్నట్లుగా హడలెత్తిస్తాయి. కానీ సంప్రదాయం పేరుతో వాటిని కొనసాగిస్తూనే ఉంటారు. వాటికి అధికారిక మద్దతు కూడా లభిస్తుంటుంది. అలాంటి విచిత్రమైన పండుగే ‘కూపర్స్ హిల్ చీజ్ రోలింగ్ ఫెస్టివల్’. ఈ వేడుక ఇంగ్లాండ్లోని గ్లాస్టర్షైర్లోని బ్రాక్వర్త్ సమీపంలోని కూపర్స్ హిల్పై ప్రతి ఏడాది మే చివరి సోమవారం రోజున జరుగుతుంది. ఈ లెక్కన ఈ ఏడాది మే 26న జరుగుతుంది. ఇది ముందు చెప్పుకున్నట్లు కాస్త ప్రమాదకరమైన సంప్రదాయం. ఈ ఉత్సవంలో జరిగే పోటీలో పాల్గొనేవారు దాదాపు 200 గజాల ఎత్తుగల నిటారైన కొండపై నుంచి దొర్లుతున్న డబుల్ గ్లాస్టర్ చీజ్ వీల్ (గుండ్రంగా చక్రంలా ఉంటుంది) వెనుక పరుగుపెట్టాల్సి ఉంటుంది. ఆ చక్రాన్ని కింద వరకూ వెళ్లి ఎవరు అందుకుంటారో వారే విజేత. అసలు ఈ సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో కచ్చితంగా తెలియదు, కానీ ఇది 1826లో మొదటిసారిగా లిఖితపూర్వకంగా ప్రస్తావించారు. అయితే, ఇది కనీసం 600 సంవత్సరాల నాటి సంప్రదాయమని నమ్ముతారు. ప్రస్తుతం, వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలు ఈ పోటీలో పాల్గొంటున్నారు. 18 ఏళ్లు నిండితే చాలు ఈ పోటీలో పాల్గొనొచ్చు. కొండ చాలా నిటారుగా ఉండటం వల్ల, చాలామంది బ్యాలెన్స్ కోల్పోయి దొర్లుకుంటూ పడిపోతూ ఉంటారు. అయినప్పటికీ, విజేతగా నిలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కొండ దిగువన స్థానిక రగ్బీ జట్టు సభ్యులు గాయపడిన వారికి సహాయం చేయడానికి వేచి ఉంటారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది వస్తుంటారు. (చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..! ) -
ఈ చికిత్సతో..పుట్టుమచ్చలకు చెక్..!
పుట్టుమచ్చ అంటే జీవితాంతం ఉండే మచ్చ అన్నట్లుగా ఫీలవుతుంటాం. కానీ పుట్టుమచ్చ నచ్చకుంటే ‘సర్జికల్ ఎక్సిషన్ ట్రీట్మెంట్’తో తొలగించవచ్చు. నిజానికి ఈ ట్రీట్మెంట్ సాధారణంగా వైద్య ప్రక్రియలో చర్మ క్యాన్సర్లకు వినియోగించే చికిత్స. అయితే దీన్ని సౌందర్య కారణాల కోసం కూడా వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో, మొదట తొలగించాల్సిన పుట్టుమచ్చ దగ్గర మత్తు ఇంజెక్షన్ చేస్తారు. దాంతో ఆ భాగం తిమ్మిరిగా మారి, నొప్పి తెలియకుండా అవుతుంది. తర్వాత, ప్రత్యేకమైన శస్త్రచికిత్స పరికరాన్ని ఉపయోగించి పుట్టుమచ్చను, దాని చుట్టూ ఉన్న కొద్ది చర్మాన్ని తొలగిస్తారు. ఇలా చేయడంతో పుట్టుమచ్చ పూర్తిగా పోతుంది. తిరిగి వచ్చే అవకాశం 99 శాతం తగ్గుతుంది. తొలగించిన చర్మానికి కుట్లు వేస్తారు. చికిత్స జరిగిన ప్రదేశాన్ని బట్టి కొన్ని రోజుల నుంచి వారాల వరకు ఆ కుట్లు ఉంచుతారు. శస్త్రచికిత్స తర్వాత, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచు కోవడం, వైద్యుడు ఇచ్చిన సూచనలను పాటించడం చాలాముఖ్యం. (చదవండి: ఈ డివైజ్తో అవాంఛిత రోమాలు మాయం..!) -
ఈ డివైజ్తో అవాంఛిత రోమాలు మాయం..!
ముఖం, మెడపై అవాంఛిత రోమాలుంటే ఏ మేకప్ వేసుకున్నా వృథానే అనిపిస్తుంది. ఇక కాళ్లు, చేతుల మీద వెంట్రుకలు పెరిగితే నచ్చిన డ్రెస్లు కూడా వేసుకోలేం. అన్నింటికీ ఒకటే పరిష్కారం అవాంఛిత రోమాలను తొలగించడం. అందుకోసం హెయిర్ రిమూవల్ క్రీమ్ వాడుకోవడం లేదా వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు చాలామంది. అలాంటి వారికి చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఈ డివైస్.నిమిషానికి 120 ఫ్లాష్లతో ఈ మెషిన్ పని చేస్తుంది. 12 వారాల పాటు దీనితో ట్రీట్మెంట్ అందుకుంటే తర్వాత మంచి ఫలితాలుంటాయి. దీనికి పవర్ కేబుల్తో పాటు నాలుగు ప్లగ్ అడాప్టర్స్ లభిస్తాయి. మొదటిగా వెంట్రుకలను ట్రిమ్ చేసుకుని, అనంతరం ఈ డివైస్ లైట్ ఫ్లాష్లను తీసుకుంటే ఆ భాగంలో రోమాలు మటుమాయం అవుతాయి.ఈ గాడ్జెట్ వెంట్రుకలను లోతుగా తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీని లైట్ టెక్నాలజీ వెంట్రుకల కుదుళ్లను లక్ష్యంగా చేసుకుని, వాటి పెరుగుదలను తగ్గిస్తుంది. ఈ ఎపిలేటర్ చర్మానికి ఎటువంటి హాని కలిగించదు. దీనిలో చర్మాన్ని చల్లబరిచే వ్యవస్థ ఉంటుంది. ఈ మెషిన్ సున్నితంగా ఉండేలా సిలికాన్ రక్షక కవచంతో రూపొందింది. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఈ డివైస్ల్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే మోడల్లో ఫ్లాష్ ఫ్రీక్వెన్సీని బట్టి, ఎక్స్ట్రా ఆప్షన్స్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు. (చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..!) -
చేపల టీచర్..!
అక్వేరియం చేపల పెంపకంలో ఉన్న పార్వతి నెలకు రు.50 వేలకు పైగానే సంపాదిస్తారు. కానీ అంతకు మించిన సంతోషం ఆమెకు వేరే ఉంది! చేపల పెంపకంలో శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చే కొల్లమ్లోని ‘కాలేజ్ అండ్ ఫిషరీస్ స్కూలు’ విద్యార్థులు తనను ‘‘టీచర్.. టీచర్..’’ అంటూ సందేహాలు అడుగుతుండటం మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెబుతారామె.పార్వతి సోషియాలజీ గ్రాడ్యుయేట్. 18 ఏళ్ల క్రితం – పెళ్లయే వరకు ఆమెకు అక్వేరియం చేపల పెంపకం అనే ఆలోచనే లేదు. మెట్టినింటి వాళ్లకు చేపల వ్యాపారం ఉంది. ఎనిమిది చేపల చెరువులు ఉన్నాయి. వాటిల్లో వేటికవిగా... తినే చేపల్ని, అక్వేరియం చేపల్ని పెంచుతుంటారు. భర్తతో కలిసి చేపల చెరువులకు వెళ్లొస్తుండటం, వాటిని మార్కెట్ చేయటం వంటివి చూస్తూ క్రమంగా తనూ చేపల పెంపకంపై ఆసక్తి పెంచుకున్నారు పార్వతి. అయితే పార్వతి కేవలం అక్వేరియం చేపల పెంపకాన్ని మాత్రమే ఎంచుకున్నారు. వీటినే ఆర్నమెంట్ చేపలనీ, రంగు చేపలనీ అంటారు. ఇప్పుడంటే ఆమె తన ‘దేవూస్ ఆక్వా ఫామ్’ నిర్వహణతో పూర్తిగా మెలకువల్ని తెలుసుకోగలిగారు కానీ, మొదట్లో ఆ చేపల్ని పెంచటం చాలా కష్టంగా ఉండేదట! ‘‘కొన్నిసార్లు కుంటలోని అక్వేరియం చేపలు మొత్తం చనిపోయి కనిపించేవి. నష్టం మాట ఎలా ఉన్నా ఆ చిన్ని ప్రాణులు విగతజీవులై నీటి పైన తేలియాడుతూ ఉండటం చూసి మనసుకు ఎంతో బాధ కలిగేది’’ అంటారు పార్వతి. దాచుకున్న డబ్బుతో..!వివిధ సైజులలోని 21 సిమెంటు కుంటలలో అక్వేరియం చేపల్ని పెంచుతున్నారు పార్వతి. ఈ బ్రీడింగ్ ట్యాంకులు పెద్దవిగా ఉంటాయి. బేబీ ఫిష్లను ఆ పెద్దవాటికి దూరంగా ఉంచటం కోసం ప్రత్యేకంగా మరి కొన్ని చిన్న ట్యాంకులు ఉంటాయి. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకం కింద రుణంగా తీసుకున్న డబ్బు కొంత, తన దగ్గరున్న దాచుకున్న డబ్బు కొంత కలిపి రు.15 లక్షల పెట్టుబడితో ఈ అక్వేరియం చేపల (ఆర్నమెంట్ ఫిష్) బిజినెస్ను ప్రారంభించారామె. పార్వతికి కొల్లమ్, అలెప్పి, కొట్టాయం, తిరువనంతపురం, పఠనంతిట్ట, ఇంకా ఉత్తర కేరళలోని కొన్ని ప్రాంతాలలో క్లయింట్లు ఉన్నారు. చిన్న దుకాణాల వాళ్లు కూడా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. నెలకు తక్కువలో తక్కువగా రు.15 వేలు, ఎక్కువలో ఎక్కువగా లక్ష వరకు రాబడి ఉంటోంది. ప్రస్తుతం కాయ్ కార్ప్, మార్ఫ్, క్రిబెన్సిస్, జులిడోక్రోమిస్, బ్యూటికాఫ్యూరి, ఫ్రంటోసా, జెబ్రా డేనియోస్, రెయిన్ బో సిక్లిడ్, హెకెల్లి, మూన్ లైట్ గోరమి రకం రంగు చేపల్ని తన ఫామ్లో ఉత్పత్తి చేస్తున్నారు పార్వతి. మొదట్లో అన్ని చోట్లా దొరికే ఏంజెల్, గుప్పి, ఫైటర్, గోల్డ్ఫిష్ రకాల్ని మాత్రమే పెంచేవారు. చేప రకాన్ని బట్టి బ్రీడింగ్ ఉంటుంది. ‘‘మార్ఫ్ వెరైటీలో ఆడ చేపలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లను మగ చేపలు తమ నోటిలో పొదుగుతాయి. అది మాకు తెలుస్తుంది. అప్పుడు ఆ మగ చేపల్ని వేరే కుంటలోకి మారుస్తాం’’ అని ఎంతో ఆసక్తికరంగా వివరిస్తారు పార్వతి. ప్రస్తుతం ఆమె తన బిజినెస్ను మరింతగా విస్తృతపరచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. దాచుకోని విద్యతో...!అక్వేరియం చేపల పెంపకంలోని ఈ అనుభవం అంతా కేవలం నేర్చుకోవటం ద్వారానే పార్వతికి లభించలేదు. పనగఢ్లోని ‘కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్డడీస్’లో రీసెర్చర్గా ఉన్న యానా మెర్సీతో కలిసి కొంతకాలం పని చేశారామె. ‘‘ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. రాబడిలో ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ ముందుకు సాగిపోవాలి. మనకు తెలిసిన విద్యను దాచుకోకుండా, రాబోయే తరాల వారికి పంచాలి.. ’’ అంటారు పార్వతి.కొన్ని విశేషాలుప్రపంచంలో స్టాంప్ కలెక్షన్ తర్వాత అతి పెద్ద హాబీ ఇంట్లో అక్వేరియం ఉంచుకోవటమే!అక్వేరియంలోని రంగురంగుల చేపల్ని చూస్తుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో రూఢి అయింది.రంగు చేపల అమ్మకానికి, పెంపకానికి చెన్నైలోని కొళత్తూరు ప్రసిద్ధి.ఆసియాలోని అతి పెద్ద ‘రంగు చేపల మార్కెట్’గా కొళత్తూరు గుర్తింపు సంపాదించింది.అక్వేరియంలో ఉండే చేపలు చాలా సున్నితమైనవి. వాటికి సమపాళ్లలో రెండు పూటలా ఆహారం అందించాలి.అక్వేరియంలో అధిక సంఖ్యలో చేపల్ని ఉంచితే, వాటి విసర్జితాలు ఎక్కువై నీటిలో అమోనియం అధికమౌతుంది. చేపలకు హానికరంగా మారుతుంది. అక్వేరియంలో నీటిని తరచు మారుస్తుండాలి. పెద్ద తొట్టె అయితే వారానికోసారి, చిన్నదైతే రెండు రోజులకోసారి నీటిని మార్చాలి. అక్వేరియంలో నీటికి మార్చకపోతే బాక్టీరియా చేరి చేపలు చనిపోయే అవకాశం ఉంది. చేపలకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ప్రత్యేక మోతాదుల్లో ఇవ్వాలి. ఈ వివరాలను షాపు వాళ్ల నుంచి తెలుసుకోవచ్చు. సాక్షి, స్పెషల్ డెస్క్ (చదవండి: మన ముచ్చట: పుస్తకానికి గుడి) -
కలలో కూడా చూడని ఇల్లు..! చూశాక మాత్రం..
ధనవంతుడైన ఒక దొంగకు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఒక ఇంటిని చూపిస్తూ ఇలా అంటున్నాడు.. ‘‘ఇంటి ముందు ‘మా జైలుకు స్వాగతం’ అనే బోర్డు పెట్టుకుంటే భలే ఉంటుంది సార్. అలాగే, కాలింగ్ బెల్లుకు బదులు ఇక్కడ ఒక జైల్ అలారం పెట్టించుకుంటే ఇంకా సూపర్. అలాగే మీకోసం ఒక పెద్ద సెల్లో మాస్టర్ బెడ్రూమ్ను డిజైన్ చేసుకోవచ్చు. అతిథులు వస్తే, వాళ్లకోసం నెంబర్ వైజ్డ్ రిమాండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అతిథులతో మీకు ఇబ్బంది రాకుండా, వారిని వెంటనే ఇంటి నుంచి వెళ్లగొట్టగలిగేలా రూమ్స్లో అద్భుతమైన చెక్క మంచాలు ఉన్నాయి. వాటిని మీకు స్పెషల్ డిస్కౌంట్ కింద ఫ్రీగా ఇస్తాం. ఎప్పుడైనా పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటే, క్రమశిక్షణలో పెట్టడానికే పక్కనే సిద్ధంగా ఒక లాకప్ రూమ్ కూడా ఉంది’’ అని వివరిస్తున్నాడు. ఇదంతా ఆ రిచ్ చోర్, తనను మెప్పించడానికే ఇలా చెప్తున్నాడేమో అనుకున్నాడు. కాని, అతను వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇలాగే వివరిస్తున్నాడు. ఎందుకంటే, ఆ ఇల్లు నిజంగానే ఒక జైలు కాబట్టి. ఈ అద్భుతమైన జైలును సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే, ఇంగ్లండ్లోని డోర్సెట్కు వెళ్లాలి. 1899లో నిర్మించిన స్వానేజ్ పోలీస్ స్టేషన్ ప్లస్ జైలును, అక్కడి ప్రభుత్వం 1.2 మిలియన్ పౌండ్స్ (అంటే రూ. 13 కోట్లు )కు వేలానికి పెట్టింది. లైఫ్లాంగ్ లాకప్కు సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరపడండి! (చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్ తెలిస్తే షాకవ్వుతారు..) -
అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాళిని బ్యూటీ రహస్యం ఇదే..!
అందమంతా పోతపోసుకున్నట్లు కనువిందు చేసే మాయ పేరే మృణాళిని రవి. సోషల్ మీడియాలో రీల్స్ నుంచి సిల్వర్ స్క్రీన్పై రియల్గా కనిపించడంలోనే కాదు, ఫ్యాషన్లోనూ స్టయిలిష్గా ఉంటుంది. ఆరోగ్యకరమైన అలవాటు ఒక్కటి చాలు మీ అందాన్ని మరింత పెంచడానికి. రోజూ పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని, మాయిశ్చరైజర్ రాసుకుంటా. ఆ అలవాటే నా అందానికి సహజత్వాన్ని ఇస్తుందని చెబుతోంది మృణాళిని రవి.రాయల్ రింగ్..సాధారణ దుస్తుల్లో కూడా రాయల్గా కనిపించాలంటే.. మీ దగ్గర తప్పకుండా ఒక్కటైనా స్టేట్మెంట్ రింగ్ ఉండాల్సిందే! అది చిన్నదైనా, పెద్దదైనా సరే, మొత్తం మీ లుక్కే ఒక ప్రత్యేకమైన ఎలిగెన్స్ను ఇవ్వగలదు. ఇవి ఎక్కువగా వివిధ ఆకారాలు, రంగులు, స్టోన్స్తో ప్రత్యేకమైన డిజైన్స్లో ఉంటాయి. స్టేట్మెంట్ రింగ్ వేసుకున్నప్పుడు చేతికి వేరే ఏ ఇతర ఆభరణాలతోనూ స్టయిలింగ్ చేయొద్దు. ఎక్కువ రింగ్స్ వేసుకుంటే ఫోకస్ చెదిరిపోతుంది. మంచి నెయిల్ పాలిష్తో జత కలిపితే ఉంగరం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. మ్యూట్ షేడ్స్ లేదా డ్రెస్కు మ్యాచ్ అయ్యే కలర్స్ ఉపయోగించండి. లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్లు, టాప్లు అసలు వేసుకోవద్దు. అలాగే హ్యాండ్బ్యాగ్కు బదులు క్లచ్ తీసుకెళ్లడం ఉత్తమం. (చదవండి: ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!)ఇక కాంప్లిమెంటరీ జ్యూలరీగా కమ్మలను చూజ్ చేసుకోండి. అవికూడా మితంగా, సేమ్ టోన్ జ్యూలరీలో సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోషూట్స్, వివాహాది శుభకార్యాలకు సింపుల్ అండ్ గ్రేట్ ఆప్షన్ ఇది. అప్పుడు అక్కడ మీరు మాట్లాడకపోయినా సరే, మీ స్టయిల్ మాట్లాడుతుంది. ఇక మృణాళిని ధరించే జ్యూలరీ బ్రాండ్: కర్ణిక, ఇయర్ రింగ్స్ ధర: రూ. 33,200, ఉంగరం ధర: రూ. 2,200, చీర బ్రాండ్: ఆలివ్ హ్యాండ్ప్రింట్స్ రూ. 3,850/-.బ్లౌజ్ ధర: రూ. 1,050/-.(చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!) -
టెక్నో బ్రదర్స్ ‘169పై. ఏఐ’ స్టార్టప్! తొలి యూజర్..
ఈ అన్నదమ్ములు... సినిమాల గురించి మాట్లాడుకున్నంత ఇష్టంగా ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటారు. అవి కాలక్షేప కబుర్లు కావు. ఈ కాలానికి అవసరమైన కబుర్లు. ‘ఏఐ టెక్నాలజీలో మనం ఎక్కడ ఉన్నాం? మనం చేయాల్సింది ఏమిటి?’ అనేది వారి మాటల సారాంశం. కేవలం మాటలకే పరిమితం కాకుండా ‘169పై. ఏఐ’ స్టార్టప్తో ఏఐ స్టార్స్గా పేరు తెచ్చుకున్నారు రజత్, చిరాగ్... మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన రజత్ ఆర్య, అతని తమ్ముడు చిరాగ్ ఆర్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఆ రంగంలో వస్తున్న మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ఆ ఆసక్తే వారిని ఏఐ స్టార్టప్ కంపెనీ ‘169పై. ఏఐ’ స్థాపించేలా చేసింది. అమెరికాలో కస్టమర్ల కోసం కొన్ని బ్లాక్చైన్ సొల్యూషన్స్ను డెవలప్ చేసి, చిన్నపాటి సాఫ్ట్వేర్ బిజినెస్ నిర్మించడంలో ఈ సోదరులకు కొంత అనుభవం ఉంది. రెండు సంవత్సరాల క్రితం ప్రసిద్ధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’ సీయివో సామ్ ఆల్ట్మాన్ మన దేశానికి వచ్చినప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ బిల్డ్ చేయడం గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ‘మనం కొత్తగా ఏంచేయవచ్చు’ అని ఆలోచించారు ఆర్య బ్రదర్స్. ఇంటర్నెట్లో వెస్ట్–ఒరియెంటెడ్ సమాచారానికి బదులుగా మరింత దేశీయంగా ఏదైనా చేయడానికి ఒక అవకాశం ఉందని గ్రహించారు. అలా....‘169పై. ఏఐ’ స్టార్టప్ మొదలైంది. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.ఈ స్టారప్కు తొలి యూజర్....ఇస్రో!‘169పై. ఏఐ’ క్రియేట్ చేసిన పీడీఎఫ్ ఏజెంట్ను ‘ఇస్రో’ పరీక్షించి పచ్చ జెండా ఊపింది. టన్నుల కొద్దీ డేటా ఉన్న ‘ఇస్రో’కి ఉపయోగపడేలా పీడీఎఫ్ ఏజెంట్ను క్రియేట్ చేశారు. తాము సృష్టించిన ప్రోగ్రామ్ టేబుల్స్, డాక్యుమెంట్లు, చార్ట్లు జనరేట్ చేయడానికి ఇది యూజర్లకు ఉపయోగపడుతుంది. పదకొండు మందితో కూడిన ‘169పై. ఏఐ’ బృందం ఎడ్యుకేషనల్ సోల్యూషన్లను డెవలప్ చేస్తోంది. బిహార్లోని ప్రభుత్వ బడుల కోసం ఎడ్యుకేషనల్ మెటీరియల్ను క్రియేట్ చేయడానికి ఎన్సీఈఆర్టీ టెక్ట్స్బుక్స్ డేటాను ఉపయోగిస్తున్నారు. ‘ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఖరీదు అనే భావన ఉంది. ఈ సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలి. రైతు నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించాలి. ఎందుకంటే ఏఐ వారి పనిని సులభతరం చేస్తుంది. మా ఏఐ మోడల్ విదేశీ ఏఐ మోడల్స్లాగా డబ్బు తీసుకునేది కాదు. ఇది అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇక స్టార్టప్ పేరు విషయానికి వస్తే 13 సంఖ్య స్క్వేర్, పై కన్స్టంట్ నుంచి స్ఫూర్తి పొందాం’ అంటున్నాడు కంపెనీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ చిరాగ్ ఆర్య. పాతదారిలో నడవడం విశేషమేమీ కాదు. అయితే పాత దారిలో నడుస్తూనే కొత్త దారి గురించి ఆలోచించడం, అన్వేషించడమే విశేషం. అప్పుడే ‘169పై. ఏఐ’ రూపంలో కొత్త ఆవిష్కరణలు ప్రజలకు పరిచయం అవుతాయి.మన దేశానికి తనదైన ఏఐ మోడల్ లేకపోవడం నన్ను ఎప్పుడూ నిరాశకు గురి చేసేది. మనం విదేశీ ఏఐ మోడల్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఏఐ సాంకేతికతకు సంబంధించి విదేశాలపై ఎక్కువగా ఆధారపడకూడదు అనే ఆలోచన నుంచే స్టార్టప్ ఆలోచన వచ్చింది. మన ఫోన్లో ఉన్న అత్యధిక యాప్స్ విదేశాల నుంచి వచ్చినవే. మనకంటూ స్వంతమైన ΄్లాట్ఫామ్ లేదు. భవిష్యత్తులో మనం ఏ దేశం మీద ఆధారపడకుండా ఉండడానికి మా స్టార్టప్ ఒక ప్రయత్నం.– రజత్ ఆర్య, 169పై. ఏఐ ఫౌండర్, సీయివో(చదవండి: మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్చేస్తే ఏకంగా వందేళ్లకు పైగా..) -
ఫాస్ట్ ఫుడ్ అడిక్షన్తో ఏకంగా 222 కిలోలు బరువు..! వాకింగ్ చేయలేక..
భరించలేని భారం అధిక బరువు. ఏటా చాలామంది యువత ఊబకాయం సమస్యలతో సతమతమవుతున్నారు. కొందరూ పట్టుదలతో బరువు తగ్గి స్ఫూర్తిగా నిలవగా మరికొందరూ సాధించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు వందలు లేదా అంతకు మించి బరువు ఉన్నవారిని చూశాం. కానీ వాటన్నింటిని తలదన్నేలా ఏకంగా 222 కిలోల బరువు అంటే వామ్మో అనేస్తాం. పైగా అంత భారీకాయం ఉన్న వ్యక్తి తగ్గడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి సింపుల్గా తనికిష్టమైన హాబీతో తగ్గి చూపించి..శెభాష్ అనిపించుకుంటున్నాడు. అంత బరువు ఉండే వ్యక్తి ఎలా స్లిమ్గా మారాడో చూద్దామా..!.అమెరికాలోని ఒహియోకు చెందిన 36 ఏళ్ల ర్యాన్ గ్రూవెల్ దాదాపు 222 కిలోల బరవు ఉండేవాడు. ఎన్ని కేలరీలు తీసుకుంటున్నాను అనేది పట్టించుకోకుండా నచ్చిన ఫుడ్ అమాంతం లాగించేసేవాడు. తనకిష్టమైనది ప్రతీది తినేయడం దానికి తోడు శారీరక శ్రమ లేకపోవడం కారణంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నాడు. తెలియకుండానే అలా ఫాస్ట్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవడంతో..అంత ఈజీగా దాన్ని వదిలించుకోలేకపోయాడు. ఫలితంగా తానే విస్తుపోయేలా లావైపోయాడు. ఇక లాభం లేదనుకుని బరువు తగ్గే కార్యక్రమాలకు ఉపక్రమించాడు. వాకింగ్ చేయాలనుకుంటే..తన అధిక బరువు కారణంగా విపరితీమైన మోకాళ్ల నొప్పులు వేధించేవి. ఇక ఇలా కాదని..మే 6, 2023న సైకిల్ కొనుగోలు చేసి..సైక్లింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ హాబీ జీవితాన్నే మార్చేసింది..ర్యాన్కి చిన్నప్పటి నుంచి సైక్లింగ్ మంచి హాబీ. సరదా..సరదాగా.. చేసే హాబీతో ఊహించని విధంగా 124 కిలోలకు తగ్గిపోయాడు. ర్యాన్ గణనీయమైన బరువు కోల్పోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దాంతోపాటు స్వీట్లు, ఆల్కహాల్, ఫాస్ట్ఫుడ్కి పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఈ మేకి 90 కిలోలకు చేరాడు. ర్యాన్ కూడా ఇంతలా బరువు తగ్గుతానని అస్సలు ఊహించలేదంటూ సంబరపడుతున్నాడు. అయితే తాను అనుకున్న లక్ష్యం ఇంకా చేరుకోలేదని..ఆరోగ్యకరమైన వ్యక్తిలా మంచి బరువు చేరుకునేదాక..తన వెయిట్ లాస్ జర్నీ ఆగదని ధీమాగా చెబుతున్నాడు. ఇక్కడ ర్యాన్ కథ చూస్తే..అసాధారణ బరువుని..జస్ట్ మనకు నచ్చిన అభిరుచితో ఎలా మాయం చేయొచ్చొ చెబుతోంది. అలానే అందరూ కూడా తాము చేయగలిగే వర్కౌట్లతో వెయిట్ లాస్కి ప్రయత్నిస్తే..విజయం తథ్యం అని నొక్కి చెప్పొచ్చు కదూ..!. View this post on Instagram A post shared by Ryan Grewell (@ryan_grewell) (చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!) -
మూడు నెలలకు మించి బతకడన్నారు.. కట్చేస్తే..
ఆరుపదుల వయసులో కేన్సర్ నిర్థారణ అయ్యింది. మూడు నెలలకు మించి బతికే అవకాశం లేదన్నారు. అలాంటి వ్యక్తి ఏకంగా 102 ఏళ్లు బతకడమేగాక మారథాన్లలో రికార్డులు సృష్టించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతేగాదు తన దీర్ఘాయువు రహస్యం గురించి చెప్పడమే పర్యావరణ పరిరక్షకుడి తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అతడెవరు..? ఎలా అన్నేళ్లు బతికి బట్టగట్టగలిగాడంటే..ఫ్లోరిడాకు చెందిన 102 ఏళ్ల మైక్ ఫ్రీమాంట్ మారథాన్లో ఎన్నో వరల్డ్ రికార్డులు సాధించాడు. అంతేగాదు వేగంగా మారథాన్ చేసిన 91 ఏళ్ల వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా మారథాన్, హాఫ్ మారథాన్, కనోయింగ్ క్రీడా తదితరాలకు సంబంధించి అనేక ప్రపంచ రికార్డులు కలిగి ఉన్నాడు. నిజానికి మైక్ 60 ఏళ్ల వయసులో కేన్సర్ బారినపడ్డాడు. మహా అయితే మూడు నెలలకు మించి బతకడని తేల్చి చెప్పేశారు వైద్యులు. మరోవైపు ఆర్థరైటీస్ సమస్యలు కూడా ఉన్నాయతనికి. అప్పడే మైక్ తన ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని స్ట్రాంగ్ డిసైడయ్యాడు. ఆ నేపథ్యంలో కేన్సర్ని నివారించే ఆహారాల గురించి సవివరంగా తెలుసుకున్నాడు. దీర్ఘాయువుకి కీలకం ఆహారమే..అలా మైక్ పూర్తిగా మొక్కల ఆధారిత డైట్కి మారాడు. పూర్తిగా తాజా కూరగాయాలు, ఓట్మీల్ సిరప్, బ్లూబెర్రీస్, బీన్స్, బ్రోకలీ, తాజా పండ్లు తదితరాలను తీసుకునేవాడు. దాంతో రెండున్నర సంవత్సరాల తర్వాత అతడి శరీరంలో ఎలాంటి కేన్సర్ కణాలు లేవని వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడే అతనికి తెలిసింది ఆరోగ్యానికి కీలకమైనది తీసుకునే పోషకవంతమైన ఆహరమని. ఒత్తిడి మత్యు ఒడికి చేర్చేది..ఒత్తిడి మనల్ని మరణం అంచులకు తీసుకువెళ్తుందని అంటాడు. అందుకే తాను ఒత్తిడి దరిచేరనివ్వని జీవితాన్ని ఆస్వాదిస్తానన్నాడు. అంతేగాదు ఒత్తిడి సంబంధిత రుగ్మతలు ఎలా మరణ ప్రమాదాన్ని పెంచుతాయో కూడా చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఒత్తిడి లేని ప్రశాంత జీవితానికే ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు మైక్. కసరత్తులు..మైక్ మునుపటి వ్యాయామ నియమావళి ప్రకారం.. వారానికి మూడు సార్లు 10 మైళ్లు పరిగెత్తేవాడు. కానీ ఇప్పుడు..వారానికి మూడు సార్లు 5 మైళ్లు పరిగెత్తేలా కుదించాడు. బాగా వేడిగా వాతావరణం ఉంటే..కనోయింగ్ వంటివి చేస్తాడు..అంటే బోటింగ్ లాంటి ప్రక్రియ ఇది కూడా ఒకవిధమైన క్రీడ, పైగా వ్యాయామానికి ఒక కసరత్తులాంటిది. దుఃఖాన్ని అధిగమించేందుకు..తన మొదటి భార్య రక్తస్రావం కారణంగా చనిపోయిందట. ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు 36 ఏళ్ల వయసులో పరుగుని ప్రారంభించాడట. దుఃఖాన్ని ఎదుర్కోవడానికి వ్యాయామం మంచి మార్గం అని అంటాడు. అకాల మరణాలతో ..అలాగే కాలేయ కేన్సర్తో 69 ఏళ్ల తండ్రి, 70 ఏళ్ల వయసులో గుండెపోటుతో తల్లి మరణించటంతో ఆహారం, వ్యాయామాల్లో మార్పులు చేసుకున్నాని..అదే ఇన్నేళ్లు ఆరోగ్యంగా బతికేందుకు దోహదపడిందని అన్నారు. దీర్ఘాయువుకి కారణం..తాను వాతావరణ కార్యకర్తగా పనిచేస్తుంటానని అన్నారు మైక్. భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత భూమిని అందించడమే లక్ష్యంగా కృషిచేస్తున్నానని అన్నారు. ఆ ఆకాంక్ష వందేళ్లు పైగా ఆరోగ్యంగా బతికేందుకు కారణమైందని అన్నారు. సత్సంబంధాలను కలిగి ఉండటం..మైక్ వారానికి మూడుసార్లు తన స్నేహితులతో కలిసి మారథాన్కి వెళ్తుంటాడట. అలాగే వృద్ధుల కమ్యూనిటీ గ్రూప్లో కూడా ఒక మెంబర్. అప్పుడప్పుడూ వారితో కలిసి సంభాషిస్తూ ఉంటాడట. దీంతోపాటు తన భార్య, బంధువులతో కూడ కొంత టైం స్పెండ్ చేస్తాడట. ఈ సత్సంబంధాలే మనల్ని మరింత కాలం భూమిపై జీవించేలా చేస్తాయని అంటాడు మైక్.(చదవండి: అమీర్ఖాన్ స్ట్రిక్ట్ డైట్ రూల్స్..! విస్తుపోయిన్ షారుఖ్ దంపతులు..) -
స్మార్ట్గా ఉండాలంటే..అమీర్ఖాన్లా డైట్ స్ట్రిక్ట్గా ఉండాల్సిందే..!
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్. పాత్ర కోసం ఏం చేసేందుకైనా వెనుకాడని వ్యక్తిత్వం అమీర్ది. అందుకే ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పొచ్చు. ఆయన ఆరు పదుల వయసులోనూ యువ హీరోలకు తీసిపోని విధంగా స్టైలిష్ లుక్ కనిపిస్తుంటాడు. అతని ఫిట్నెస్ బాడీ చూస్తే..అంత ఏజ్ ఉంటుందని అనిపించదు. అంతలా ఎలా మెయింటైన్ చేస్తారనే సందేహం కలగకమానదు. అంతేగాదు డైట్ విషయంలో అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే ఆయనే స్వయంగా డైట్ విషయంలో ఎంతలా కమిట్మెంట్గా ఉంటారో ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆ నిబద్ధత చూసి..షారుఖ్ తన భార్య గౌరి ఇద్దరూ కూడా విస్తుపోయారని అంటూ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు కూడా.సరిగ్గా దంగల్ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయం. అయితే ఆ టైంలోనే షారుఖ్ ఇంటికి ఆపిల్కు చెందిన టిమ్ కుక్ తోపాటు అమెరికా నుంచి నలుగురు ప్రముఖులు వచ్చారు. ఆ నేపథ్యంలో మమ్మల్ని అందరిని విందుకు ఆహ్వానించాడు షారుఖ్. విందు చేయకుండా వెళ్లవద్దని గౌరీ మరీ మరీ చెప్పిందట అమీర్కి. అందుకు అమీర్ కూడా కచ్చితంగా తినే వెళ్తానని అన్నారట. సరిగ్గా అంతా విందుకు కూర్చొన్నప్పుడు..ఆహారం సిద్ధం చేశామని, తినమని చెప్పగా..వెంటనే అమీర్ తన దగ్గర టిఫిన్ బాక్స్ ఉంది వద్దని చెప్పారట. అదేంటి మా ఇంటికి వచ్చి..టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నావా..అని ఆశ్యర్యపోతూ అడిగారట షారుఖ్ దంపతులు. అందుకు అమీర్ మనలో మనకి ఫార్మాలిటీ ఏముంది..ప్రస్తుతం తాను దంగల్ మూవీ కోసం డైట్లో ఉన్నానంటూ..తాను తెచ్చుకున్న బాక్సే తిన్నానని ఒక ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. దీని గురించి షారుక్ని అడిగినా కచ్చితంగా చెబుతాడంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు అమీర్. అలాంటి కమిట్మెంట్ తప్పక ఉండాలి..స్మార్ట్గా ఆరోగ్యంగా ఉండాలంటే..ఏ పార్టీలకి అటెండైనా..మీ బాక్స్ తెచ్చుకుంటే..ఫుడ్పై కంట్రోల్ ఉంటుందట. అనుకున్న విధంగా బరువు అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు దీనివల్ల అనారోగ్యకరమైన చక్కెరలు, కొవ్వులకు దూరంగా ఉంటామట. అలాగే మన బరువు తగ్గించే లక్ష్యానికి ఆటంకం రాదు అని చెబుతున్నారు నిపుణులు.మైండ్ఫుల్నెస్గా తినడానికి సరైన ఉదాహారణ ఈ విధానమేనని అంటున్నారు. ఇది సమతుల్య జీవనశైలి తోపాటు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవాడానికి ఉపకరిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా మీరు ఉండాల్సిన ఆకృతిలో బాడీ మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం స్లిమ్గా ఆరోగ్యంగా కనిపించేలా అమీర్ ఖాన్ స్ట్రిట్ డైట్ని ఫాలో అయిపోండి. అమీర్ఖాన్ స్ట్రిక్ట్ డైట్ రూల్స్..! విస్తుపోయిన్ షారుఖ్ దంపతులు..(చదవండి: లైట్ తీస్కో భయ్యా..!) -
మిస్ వరల్డ్ 2025: అందమొక్కటే కాదు..అందమైన మనసు కూడా..
మిస్ వరల్డ్ అంటే అందమొక్కటే కాదు, అందమైన మసను కూడా..!! మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సామాజిక సేవ అంశాన్ని, లక్ష్యాన్ని కొనసాగిస్తున్న వారే. ఇందులో భాగంగానే నగరంలోని సరూర్ నగర్ విక్టోరియా హోమ్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించి అక్కడి విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని చేరుకోవడానికి అవసరమైన సూచనలిచ్చారు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీదారులు విక్టోరియా హోమ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులతో గురువారం ముచ్చటించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 107 మంది పోటీదారులతో పాటు మాజీ మిస్ వరల్డ్ క్రిస్టినా కలసి విక్టోరియా హోమ్ను సందర్శించి ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. కష్టపడే తత్వం, విజ్ఞాన సముపార్జనతో పాటు విద్యలో రాణిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని చిన్నారులకు వివరించారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే పటిష్టమైన కలలు ఉంటేనే తమ లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. అనంతరం విక్టోరియా హోమ్ విద్యార్థినులకు బహుమతులతో పాటు వారికి నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులను మిస్ వరల్డ్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా విక్టోరియా హోమ్ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అలకించి అభినందించారు. అందాల తారలు.. ముచ్చటపడి ఆ చిన్నారులతో కలిసి ఆడారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ చైర్మన్ మోర్లే, పర్యాటక శాఖ డైరెక్టర్ హనుమంతు, రాచకొండ సీపీ, ఎస్సీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: రానూ.. బొంబైకి రానూ.. విభిన్న కళలతో అలరించిన సుందరీమణులు) -
రానూ.. బొంబైకి రానూ.. !
హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికగా గురువారం నిర్వహించిన ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 వేదిక పై మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు విభిన్నకళారూపాలతో ఆకట్టుకున్నారు. ఈ టాలెంట్ కాంపిటీషన్ ఫినాలేలో తెలుగు సాంగ్ రాను బొంబైకి రాను అనే సాంగ్తో పలువురు ఉర్రూతలూగించారు. 24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు వారి దేశాలకు చెందిన విభిన్న కళలతో అలరించారు. దీంతో పాటు పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక అంశాలు, ఐస్ స్కేటింగ్, డ్యాన్సింగ్, డీజే ప్లేయింగ్ వంటి ప్రదర్శనలిచ్చారు. ఈ టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా (పియానో) మొదటి స్థానంలో నిలవగా, మిస్ కామెరూన్ (సింగింగ్) రెండో స్థానంలో, మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) మూడో స్థానంలో నిలిచారు. సంప్రదాయ శ్రీలంక సింహళీ నృత్యంతో అలరించారు మిస్ శ్రీలంక. ఒక్క రోజులో తన కోసం సంప్రదాయ డ్రెస్ను తన తల్లి డిజైన్ చేసి ఇచ్చినందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో భారతీయ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా బాలీవుడ్ హిట్ సాంగ్ రామ్ లీలా సినిమాలోని దోల్ భాజే సాంగ్ ప్రేక్షకులు, జ్యూరీ సభ్యుల ప్రశంసలు అందుకున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో నందినీ గుప్తా చేసిన నృత్యం ఆద్యాంతం ఆక్టట్టుకుంది. చివరగా 24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు అద్దాల మేడలున్నవే, రాను బొంబైకి రానూ.. అనే తెలుగు పాటలకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టారు. (చదవండి: అమేజింగ్ అమ్మాయిలు) -
లైట్ తీస్కో భయ్యా..!
‘ఇదిగోండి సార్ మీ ఫుడ్...’ ‘ఏమిటిది?’ ‘అదే సార్.. మీరు బాగా ఎంజాయ్ చేసే టర్కిష్ డిలైట్’ ‘సారీ.. నేనిప్పుడు టర్కీ ఫుడ్ తినడం లేదు.. ప్లీజ్ క్యాన్సిల్’ ‘అదేంటి మీకు ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం కద సార్..’ ‘లైట్ తీస్కో భయ్యా..!’ ప్రస్తుతం ఇలాంటి సన్నివేశాలు హైదరాబాద్నగరంలోని రెస్టారెంట్స్లో సర్వసాధారణంగా మారాయి. ఒకప్పుడు టర్కీ వంటకాలంటే లొట్టలేసుకుని తినే సిటీ ఫుడ్ లవర్స్ ఇప్పుడు టర్కీ ఫుడ్ అంటే పీచే ముడ్ అంటున్నారు. దీంతో గత కొంత కాలంగా టర్కిష్ రుచులపైనే ఆధారపడి వ్యాపారం చేస్తున్న పలు రెస్టారెంట్స్ వెలవెలబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో గత కొంత కాలంగా టర్కీ వంటకాలకు ఫుల్ డిమాండ్. అత్యంత ఆదరణ పొందుతున్న సిటీలోని విదేశీ క్యుజిన్స్లో ఇటలీ వంటకాల తరహాలోనే టర్కీ వెరైటీస్కి కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో గత కొన్నేళ్లుగా ప్రత్యేకించి టర్కీ వంటకాలను అందించే రెస్టారెంట్లు నగరమంతా విస్తరించాయి. అయితే తాజాగా సరిహద్దుల్లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో బాయ్ కాట్ టర్కీ ఉద్యమంలో నగరంలోని టర్కీ ఫుడ్ లవర్స్ కూడా మేము సైతం అంటున్నారు. టర్కీ పేరుతో ఉన్న వంటకాలను తినబోం అంటూ వారు తెగేసి చెబుతుండడంతో నగరంలో సదరు వంటకాలకు డిమాండ్ సగానికి పడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన సాన్ సెబాస్టియన్ చీజ్కేక్ నుంచి టర్కీ టీ దాకా పేరు వింటనే సై అనే నగరవాసులు ఇప్పుడ నై అంటుండడంతో రెస్టారెంట్ల నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.. ఎన్నో కేఫ్స్, రెస్టారెంట్స్.. నగరంలో అత్యంత తొలిగా తుర్కీ వంటకాలు అందించడం ప్రారంభించిన రెస్టారెంట్ బంజారాహిల్స్లోని లెవంట్గా చెప్పొచ్చు. ఇక్కడి లెవంట్ మషావీ ముషక్కల్, బుర్జ్ దజాజ్, మనకీష్, తజీన్ దజాజ్ వంటివన్నీ నగరవాసుల ఆదరణకు నోచుకున్నవే. అదే విధంగా బెంగళూరు నుంచి వచ్చిన మరో టర్కీ రెస్టారెంట్ కెబెప్సీ సైతం వెరైటీల మెనూతో టర్కీ ఫుడ్ లవర్స్కు చిరునామాగా ఉండేది. ఇక్కడి బెయ్తీ చికెన్, లాంబ్ మండీ, జిహాన్ కబాబ్ వంటివి బాగా ఫేమస్. ఇక టోలీచౌకిలోని కెబాబ్జాదెహ్ సంప్రదాయ టర్కీ వంటకాలకు పేరొందింది. చీజ్ ఖీమా నాన్, గ్రీక్ చికెన్, ఇజి్మర్ చికెన్, లాంబ్ చాప్స్తో నోరురిస్తుంది. టర్కీ టీ, రెడ్ సెంటిల్ సూప్లకు పేరొందిన జౌక్, పిలాఫ్ ప్లాటర్, లహ్మకున్ తదితర టర్కీ స్ట్రీట్ ఫుడ్కి బెస్ట్గా పేరొందింది. వివిధ వెరైటీలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇస్తాంబుల్, టర్కిష్ డిలైట్, టర్కీ మిల్క్ కేక్స్ తదితర టర్కీ స్వీట్స్కి కేరాఫ్గా నిలిచిన గోర్మేట్ బక్లావా, టర్కీ బ్రేక్ ఫాస్ట్ అందించే జూబ్లీహిల్స్లోని కార్డ్ యార్డ్ కేఫ్.. టర్కీ డెజర్ట్ కునాఫాలకు పేరొందిన కెపె్టన్ కునాఫా, టర్కీ షావర్మాతో ఆకట్టుకునే మల్లేపల్లిలోని టర్కిష్ సెంట్రల్.. కెబాబ్ క్రాలిక్ తదితర రెస్టారెంట్స్, కేఫ్స్ గత కొంత కాలంగా టర్కీ వంటకాలకు పేరొందాయి.రణ వేళ.. రుచుల వెలవెల.. ‘టర్కీ వంటకాలు అంటే అక్కడ నుంచి దిగుమతి అయినవి కాదు. కేవలం అక్కడి స్టైల్ను అనుసరించి మేము సొంతంగా తయారు చేసేవి మాత్రమే’ అంటూ పలు రెస్టారెంట్స్ అతిథులకు, భోజన ప్రియులకు సర్థి చెప్పాల్సిన పరిస్థితి నగరంలో ఏర్పడిందని ఓ చెఫ్ ‘సాక్షి’కి వివరించారు. అంతేకాకుండా మెనూలోని వంటకం పేరు ముందు టర్కీ తొలగించడం వంటి మార్పు చేర్పులు కూడా చేసుకుంటున్నామని పలువురు రెస్టారెంట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఏదేమైనా.. వంటకాల పట్ల అనూహ్యంగా ఏర్పడిన ఈ వ్యతిరేక ధోరణి కొన్ని రోజులకు సద్ధుమణిగిపోతుందని, టర్కీ ఫుడ్కి డిమాండ్ ఎప్పటిలా పుంజుకుంటుందని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! చివరికి గంటకు పైగా..) -
పిల్లలూ..ఈ సమ్మర్ ఈ సినిమాలు చూస్తున్నారా..?
పిల్లలూ...భారతం తెలుసా మీకు? రామాయణ, మహాభారతాలుమన తొలి పాఠ్యపుస్తకాలు. మీకు పదేళ్లు దాటితే ఈ రెండూ ఏదో ఒక మేరకు తెలిసుండాలి. వినడం, చదవడం ద్వారా మాత్రమే కాక చూడటం వల్ల కూడా భారతం తెలుసుకోవచ్చు. స్కూళ్లు తెరవడానికి ఇంకా రెండు వారాలుంది. భారతం మీద వచ్చిన సినిమాలు వరుసపెట్టి చూడండి చాలు. ఆ లిస్టు ఇవాళ ఇస్తున్నాం. రేపు రామాయణం సినిమాల లిస్ట్ ఇస్తాం. పిల్లలూ...మహాభారతం అంటే పాండవులకు కౌరవులకు మధ్య వార్ అని మాత్రమే అనుకుంటున్నారా మీరు? మహాభారతంలో ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి, వీరత్వాలూ శూరత్వాలూ ఉన్నాయి, చీటింగ్ ఉంది, నిజాయితీ ఉంది, ట్రూత్ కోసం నిలబడిన వారు ఉన్నారు, గొప్ప విమెన్ ఉన్నారు, ఆటవిక వీరులున్నారు... వీరందరినీ మీరు తెలుసుకోవాలి.మహాభారతంలో పాండవులు రాజ్యం కోల్పోయి అరణ్యవాసం చేస్తారు. అజ్ఞాతవాసం కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో లైఫ్లో ఇలాంటి సవాళ్లు వస్తాయి. పాండవులు భయపడలేదు. అరణ్యవాసం చేసి, అజ్ఞాతవాసం చేసి మళ్లీ యుద్ధం చేసి గెలిచారు. అరణ్యవాసం అంటే అడవుల్లో ఉండటం, అజ్ఞాతవాసం అంటే ఐడెంటిటీని దాచి బతకడం.ఇవాళ ప్రపంచంలో చాలా చోట్ల వార్స్ జరుగుతున్నాయి. వార్ను ప్రజలు కోరుకోరు. పాలకులే కోరుకుంటారు. వాళ్లకు కావాల్సినదాని కోసం కొట్లాడుకుంటారు. కాని వార్ని ఆపడానికి కొంతమంది ట్రై చేస్తారు. పీస్ అంబాసిడర్స్గా మారి వార్ వద్దని మంచి మాటలు చెబుతారు. భారతంలో కృష్ణుడు అలా పాండవులకు, కౌరవులకు రాయబారం చేయాలని చూశాడు. కాని కుదరలేదు. మహాభారతంలో ద్రోణుడు వంటి గొప్ప టీచర్ ఉన్నాడు. శకుని వంటి విలన్ ఉన్నాడు. మాట వినని, మొండికేసే దుర్యోధనుడున్నాడు. వీళ్లందరి నుంచి మనం నేర్చుకోదగ్గ లెసన్స్ ఉంటాయి. అలాగే మహాభారతంలో కుంతి, ద్రౌపది, సుభద్ర... వంటి గొప్ప స్త్రీ పాత్రలను మనం తెలుసుకోవాలి.మహాభారతాన్ని పిల్లల కోసం సులభంగా అర్థమయ్యేలా కొన్ని పుస్తకాలు రాశారు. అవి తెప్పించుకుని చదవండి. లేదా సినిమాలు చూసి కూడా భారతాన్ని తెలుసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. సెలవులు కొన్నాళ్లే మిగిలాయి. ఈ సినిమాలు చూసేయండి మరి. అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి.1. బాలభారతం: ఇది 1972లో వచ్చిన తెలుగు సినిమా. పాండవుల, కౌరవుల చైల్డ్హుడ్ ఇందులో ఉంటుంది. అందరూ పిల్లలే నటించారు.2. మాయాబజార్: ఇది తప్పకుండా చూడాల్సిన క్లాసిక్. ఇందులో ఘటోత్కచుడు స్పెషల్ అట్రాక్షన్. ఈ కథ భారతంలో లేదుగానీ ఇందులో ఉన్నవన్నీ భారతంలోని క్యారెక్టర్లే. దుష్ట చతుష్టయం అనే నలుగురు ఎవరో ఈ సినిమాలో చూడొచ్చు. చెడు ఆలోచనలు చేస్తే చెడు ఫలితమే వస్తుందని తెలుసుకుంటారు.3. భీష్మ: మహా భారతంలో భీష్ముడు చాలా ముఖ్యమైన పాత్ర. మహాభారతంలో ఆది నుంచి అంతం వరకూ ఆయన ఉంటాడు. ఆయన మీద తీసిన సినిమా ఇది. పెద్దవాళ్లను తోడు చేసుకుని డౌట్స్ అడుగుతూ ఈ సినిమా చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి.4. నర్తన శాల: ఇది పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు జరిగిన కథ. పాండవుల్లో భీముడు ఎంత బలం కలిగినవాడో ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే కీచకుడు అనే క్యారెక్టర్ ఉంటుంది. బ్యాడ్ క్యారెక్టర్. ఉమెన్తో మిస్ బిహేవ్ చేసి తగిన పనిష్మెంట్ పొందుతాడు. తప్పకుండా చూడండి.5. వీరాభిమన్యు: భారతంలో అభిమన్యుడు అద్భుతమైన పాత్ర. పద్మవ్యూహంలోకి చొచ్చుకు వెళ్లి గొప్పగా పోరాడుతాడు. కాని తిరిగి రావడం తెలియక మరణిస్తాడు. అతని మీద తీసిన సినిమా ఇది.6. పాండవ వనవాసము: పాండవులు వనవాసం చేసినప్పుడు అంటే అడవుల్లో ఉన్నప్పుడు ఏమేమి ఘటనలు జరిగాయో ఈ సినిమా చూపిస్తుంది.7. దానవీరశూర కర్ణ: మహాభారతాన్ని ఒక్కొక్కరు ఒక్కో పర్స్పెక్టివ్లో చూస్తారు. ఈ సినిమా కర్ణున్ని ఒక వీరుడుగా, శూరుడుగా చూపుతుంది. అతను దానం ఇవ్వడంలో మేటి అట. అలాగే అతను పొందిన అవమానాలను ఎలా తట్టుకున్నాడో కూడా ఈ సినిమా చూపుతుంది. కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేస్తాడు. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. యుద్ధ సమయంలో ఫ్రెండ్ పక్షాన నిలవడం అతని ధర్మం. ఈ సినిమా తప్పక చూడండి.8. ఏకలవ్య: ఏకలవ్య శిష్యరికం అని మీరు సామెత వింటూనే ఉంటారు కదా... ద్రోణుడి బొమ్మ పెట్టుకుని విలువిద్య నేర్చుకుంటాడితను. అర్జునుడిని మించిన విలుకాడితను. ద్రోణుడు గురుదక్షిణ అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా బొటనవేలు కోసి ఇచ్చేస్తాడు. అన్నట్టు పిల్లలూ... ఈ సినిమాల్లో భాష మీకు పూర్తిగా అర్థం కాక΄ోవచ్చు. ఇందులో గ్రాంథిక తెలుగు ఉంటుంది. అయినా సరే చూస్తూ ఉంటే భాష కూడా మీకు తెలుస్తుంది. తెలుగు గొప్ప భాష. అందులో ఎన్నో స్థాయులు ఉన్నాయి. అన్నింటితో మనకు పరిచయం ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం. మీ అమ్మతోనో నానమ్మతోనో కలిసి భారతం సినిమాలు చూడటం మొదలుపెట్టండి. (చదవండి: చిన్నారులు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా..!) -
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంత ప్రమాదకరమైనదా..? పాపం ఆ వ్యక్తి..
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో లుక్ మార్చుకోవాలనుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు కొందరు. అనుభవజ్ఞులైన నిపుణుల సమక్షంలో చేయించకోకపోతే జీవితాలే అల్లకల్లోలమవుతాయనే ఉదంతాలు ఎన్నో జరిగాయి. అందులోనూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్.. ఏదైనా తేడాకొడితే..నేరుగా మన బ్రెయిన్పై ఎఫెక్ట్ పడుతుంది. కోలుకుంటామా లేదా అనేది చెప్పడం కూడా కష్టమే. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాడు కేరళలోని ఎర్నాకుళంకి చెందిన సనీల్. అందంగా ఉండాలని చేయించుకున్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అతడి జీవితాన్ని ఎంతలా నరకప్రాయంగా చేసిందో వింటే..నోటమాట రాదు. ఇంత ప్రమాదరకరమైనదా.. ?హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనిపిస్తుంది.49 ఏళ్ల సనీల్ తన లుక్ అందంగా మార్చుకోవాలనుకుని కొచ్చిలోని పనంపిల్లి నగర్లోని ఇన్సైట్ డెర్మా క్లినిక్ని సంప్రదించాడు. ఆ ఆస్పత్రి గురించి పూర్తిగా తెలుసుకునే యత్నం చేయకుండానే కేవలం ప్రకటనల ఆధారంగా సంప్రదించాడు. అయితే అక్కడ వైద్యులు అతడిని పరిశీలించి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. అలా అతడికి సదరు ఆస్పత్రి వైద్యులు చేద్దాం అనుకున్నా..నాలుగుసార్లు అనుకోని అవాంతరాలతో వాయిదా పడింది. అప్పుడైనా ఇలా ఎందుకు జరగుతుందని ఆలోచించినా బావుండేదేమో అంటున్నాడు సనీల్ బాధగా. చివరికి ఫిబ్రవరి 2025లో ఒకరోజు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సమయాత్తమయ్యాడు. రెండు రోజుల అనంతరం డిశ్చార్జ్ అయినా తర్వాత నుంచి ఇన్ఫెక్షన్ల బారినపడ్డాడు. మార్చి 1 నాటికి, అతడి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. తలపై పసుపు రంగుమచ్చలు, ఒక విధమైన స్రావాలు కారడం మొదలైంది. అయితే సదరు క్లినిక్ ఇవన్నీ సాధారణ సమస్యలే అని, ఆస్పత్రికి రావాల్సిందిగా తెలిపారు సనీల్కి. దీంతో ఆస్పత్రికి వచ్చినా..పరిస్థితి మెరుగుపడలేదు కదా..మరింతగా పరిస్థితి దిగజారిపోయింది. నొప్పి తగ్గించే స్టెరాయిడ్లు, యాంటీబయోటిక్ మందులు ఇచ్చారు. దాంతో సనీల్ శరీరంలో బీపీ, చక్కెరస్థాయిలు ప్రమాదకర స్థాయిలో అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ నరకయాతన భరించలేక అక్కడే సమీపంలో ఉన్న సనీల్ లౌర్డ్స్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నవ్య మేరీ కురియన్ వెంటనే అతన్ని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చాకో సిరియాక్ వద్దకు పంపారు. అక్కడ ఆయన సనీల్ పరిస్థితిని చూసి..మాంసం తినే ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారినపడ్డట్లు నిర్థారించారు. తక్షణమే సనీల్ని సర్జరీకి సిద్ధం కావాలని చెప్పారు. అలా సనీల్ ఇప్పటివరకు పదమూడు సర్జరీలకు పైగా చేయించుకున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఈ ఇన్ఫెక్షన్ని నెక్రోటైజింగ్ ఫాసిటిస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. దీనికి శక్తిమంతమైన యాంటీబయాటిక్స్, అత్యవసర శస్త్ర చికిత్స వంటి వాటితో పోరాడటమే ఏకైక మార్గం. ఈ ఇన్ఫెక్షన్ ఎముక కనిపించేంత వరకు కణజాలాన్ని తినేస్తుందట. తన తలలో ఒక రంధ్ర ఏర్పడిందని..ప్రస్తుతం తనకు ఇంకా చికిత్స కొనసాగుతుందని అన్నారు. అంతేగాదు ఆ ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతమంతా..ఒక విధమైన స్రావాలు కారడంతో వాక్యూమ్-అసిస్టెడ్ డ్రైనేజ్ పంప్ను అమర్చారు. ఆయన ఎక్కడకు వెళ్లినా.. దాన్ని కూడా తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను ఆర్థికంగా, మానసికంగా వేదనకు గురయ్యేలా చేసిన సదరు క్లినిక్పై ఫిర్యాదు చేయడమే గాక మూతపడేలా చేశాడు. అలాగే అందుకు బాధ్యులైన సదరు వైద్యులకు శిక్ష పడేదాక వదలనని, తనలా మరెవరూ ఇలాంటి బాధను అనుభవించకూడదని కన్నీటి పర్యంతమయ్యాడు సనీల్. అతడిగాథ వింటే..అందానికి సంబంధించిన శస్త్రచికిత్సల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో చెప్పడమే గాక మనోగత అందానికే ప్రాధాన్యం ఇవ్వాలనే విషయం చెప్పకనే చెబుతోంది.(చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! చివరికి గంటకు పైగా..) -
అప్పడాలు ఇలా తింటే ఆరోగ్యమే..!
భోజనంలో సైడ్ డిష్గా కరకరలాడే అప్పడాలు ఉంటే అబ్బో ఆ భోజనం పొట్ట ఫుల్గా మనసు నిండుగా ఉంటుంది. అబ్బా.. తలుచుకుంటేనే నోరూరిపోయే ఈ అప్పడాలను ఇష్టపడని వారంటూ ఉండరు. చిన్నాపెద్ద అనే తేడాలేకుండా ఎంతో ఇష్టంగా తినే అప్పడాలు వాస్తవానికి అంత ఆరోగ్యకరమైనవి కాదు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ రోగులు అస్సలు తినకూడదు. అయితే అప్పడాలు వేయించిన ఘుమఘమకి నోరూరిపోతుంటుంది. తినకుండా ఉండాలంటే చాలా కష్టమే. అలాంటివాళ్లు వాటిని మిస్ చేసుకుంటున్నాం అనే బాధ లేకుండా హాయిగా తినే చక్కటి మార్గం ఏంటో.. పోషకాహార నిపుణుల మాటల్లో తెలుసుకుందామా..!.మెటబాలిక్ హెల్త్ కోచ్ కరణ్ సారిన్ అప్పడాలంటే ఇష్టపడని వారెవరుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆరోగ్యకరంగా తినడం తెలిస్తే చాలు..అని అంటున్నారు. సాధారణంగా మినపప్పుతో చేసే ఈ అప్పడాలు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారని అన్నారు. అయితే మినపప్పు ఆరోగ్యానికి మంచిదే అయినా..ఇందులో వినియోగించే మసాలా, సోడియం, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ. అందువల్ల ఇది ఆరోగ్యానికి అంత మంచికాదని తేల్చి చెప్పారు. అదీగాక దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల తీసుకుంటే రక్తంలో చక్కెర స్తాయిలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుందట. అయితే కాస్త తెలివిగా పరిమిత ప్రమాణంలో ఆరోగ్యకరంగా తింటే ఎలాంటి సమస్య ఉండదని నమ్మకంగా చెబుతున్నారు న్యూటిషనిస్ట్ కరణ్. అంతేగాదు అదెలాగా ప్రయోగాత్మకంగా వీడియో రూపంలో చూపించారు కూడా. ఇది శుద్ధి చేసిన పిండే అయినప్పటికీ దీనిలో చక్కెర శాతం ఉండదు. కానీ ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్(GI) మాత్రం ఎక్కువే. అందుకని దీన్ని కూరగాయలు, సలాడ్ల రూపంలో తీసుకుంటే హెల్దీగా ఉంటుందట. అలా ఆయన స్వయంగా తిని చూపించారు. అంతేగాదు రెండు గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా సమస్థాయిలో ఉన్నాయో స్పష్టంగా చూపించారు. దీన్ని చిరుతిండిలా ఉల్లిపాయలు, టమోటాలు, దోసకాయ, వంటి అధిక ఫైబర్ టాపింగ్స్తో జత చేసి హాయిగా తినేయొచ్చని అంటున్నారు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా అప్పడాలను ఇలా హెల్దీగా తినేయండి. View this post on Instagram A post shared by Karan Sarin (@sweetreactions) (చదవండి: 900 Egg Diet: బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! చివరికి గంటకు పైగా..) -
బాడీ బిల్డర్స్ 900 ఎగ్స్ డైట్..! ఆరోగ్యానికి మంచిదేనా?
ఇటీవల హెల్దీగా ఉందాం అనే నినాదం ప్రజల్లో బాగా వళ్తోంది. అందురూ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకునేందుకే ఇష్టపడుతున్నారు. పైగా తమ శరీరానికి సరిపోయే డైట్ని ఫాలోఅయ్యి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడొక కంటెంట్ క్రియేటర్, మాజీ బాడీబిల్డర్ తనపైన అధిక ప్రోటీన్ ఫుడ్ ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం అని రోజుకి 30 గుడ్లు చొప్పున నెలకు 900 గుడ్లు తింటే త్వరితగతిన కండరాలు ఏర్పడి బాడీబిల్డర్గా మారడానికి తోడ్పడుతుందో లేదా తెలుసుకోవాలని తనమీదే స్వయంగా ప్రయోగం చేసుకున్నాడు. చివరికి ఏమైందంటే..యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, మాజీ బాడీ బిల్డర్ జోసెఫ్ ఎవెరెట్ ప్రముఖ బాడీబిల్డింగ్ లెజెండ్ విన్స్ గిరోండా చెప్పే 900 ఎగ్స్ డైట్ని పరీక్షించాలనుకున్నాడు. గిరోండా తాను రోజు 30 గుడ్డు తింటానని, అదే తన కండల తిరిగిన దేహం రహస్యమని చెబుతుంటారు. అది ఎంతవరకు నిజం అని తెలుసకునేందుకు ఈ యూట్యూబర్ తనమీద ప్రయోగం చేసుకున్నాడు. అందుకోసం రోజుకి 30కి పైగా గుడ్లను డైట్లో తీసుకునేవాడు. అతను గుడ్డు తెల్లసొన ఆమ్లెట్లు, పచ్చసొన స్మూతీలు ఆహారంతో చేర్చుకునేవాడు. వాటితో పాటు రైస్, మాంసం, పెరుగు, పండ్లు, తేనె తదితరాలు తీసుకున్నాడు. ఈ ఆహారం తోపాటు వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన అన్ని వ్యాయామాలు చేశాడు. ఆ తర్వాత తన బాడీలో జరిగిన మార్పులపై వైద్య పరీక్షలు జరిపించగా..మంచికొలస్ట్రాల్ స్థాయిలు పెరగడం తోపాటు, రక్తంలో చెడు కొలస్ట్రాల్కి సంబంధించి గణనీయమైన మార్పులు కనిపించాయి.ఈ డైట్ మంచిదేనా..? ప్రముఖ డైటీషియన్ కనిక మల్హోత్రా ఇలాంటి డైట్తో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డులోని పచ్చసొనలో ఉండే అధిక కొలస్ట్రాల్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందన్నారు. ఇది గుడ్డు జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని అన్నారు. అంతేగాదు అధికంగా గుడ్లు తీసుకోవడం వల్ల.. కొంతమంది వ్యక్తుల్లో పొట్ట ఉబ్బరం, గ్యాస్, విరేచనలు వంటి జీర్ణ సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అన్నారు. అంతేగాదు ఇలా గుడ్లు అధికంగా తీసుకుంటే పోష అసమతుల్యత వస్తుందన్నారు. అలాగే పచ్చిగా లేదా తక్కువగా ఉడికించి తీసుకుంటే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కండరాల పెరుగుదల కోసం గుడ్డు అధికంగా తీసుకోవాల్సిందేనా..గుడ్డు కండరాల పెరుగుదలకు ఉపయోగపడినప్పటికీ..అధికంగా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని తేల్చి చెప్పారు. గుడ్డులోని పచ్చసొన కండరాల ప్రోటీన్ సంశ్లేషణను సమర్థవంతంగా పెంచుతుందన్నారు. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఇతర వాటిలో కంటే ఎక్కువ. పైగా దీన్ని ఉడకించి తింటేనే సులభంగా అరుగుతుంది లేదంటే శరీరం దాన్ని అరిగించుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందన్నారు. చెప్పాలంటే సోయా లేదా గోధుమలు, పాలు తదితరాల కంటే గుడ్డులో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కువ కాబట్టి దీన్ని తగు మోతాదులో తీసుకుంటే కండరాల పెరుగుదలకు, బాడీ బిల్డింగ్కి ఉపయోగపడుతుందని తెలిపారు. అంతకు మించి అంటే..మరిన్ని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స) -
'టాకింగ్ ట్రీ'..నిజంగానే మొక్కతో మాట్లాడే టెక్నాలజీ..!
చిన్నప్పుడు సరదాగా చెట్టు వెనుకదాక్కుని దాంతో మాట్లాడటం వంటివి చేసేవాళ్లం. ఆ సరదా అల్లరే వేరు. కొందరు ప్రకృతి ప్రేమికులు చెట్లనే తమ ఆత్మీయులుగా వాటితోనే మాట్లాడటం, పెళ్లి చేసుకోవడం వంటివి చేసిన ఘటనలు చూశాం. అలాగే పరిశోధకులు చెట్టుకు ప్రాణం, ఉంది అవి కూడా స్పందిస్తాయని చెప్పారు. అది ఎంత వరకు నిజం అనేది కూడా ప్రయోగాత్మకంగా ప్రూవ్ చేశారు. అవి ఎలా తన పక్క చెట్లతో సంభాషిస్తుందో కూడా వివరించారు. ఇప్పుడూ ఏకంగా చెట్టుతో నేరుగా మాట్లాడే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధిపరచడమే కాదు..మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందాం..!.ఐర్లాండ్ రాజధానిలలోని ట్రినిటి కాలేజ్లో 'టాకింగ్ ట్రీ' అనే టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఏఐ సాంకేతికతతో చెట్టుకు స్వరాన్ని అందిస్తారు. అందుకోసం పర్యావరణ సెన్సార్లు ఉపయోగించుకుంటుంది. అంటే ఇక్కడ సెన్సార్లుగా నేల తేమ, నేల pH, గాలి ఉష్ణోగ్రత, తేమ, సూర్యకాంతి, గాలి నాణ్యత' తదితరాల ఆధారంగా 'బయోఎలక్ట్రికల్ సిగ్నల్స్'ని తీసుకుంటుంది. ఆ సిగ్నల్స్ని ఏఐ సాంకేతికత మానవులకు అర్థమయ్యే భాషలా మారుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు లక్ష్యం కేవలం ప్రకృతి ప్రయోజనార్థమే చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకృతితో మనం అనుసంధానమై ఉంటే..అకస్మాత్తుగా అంటుకుని కార్చిచ్చులను సకాలంలో నివారించడం సాధ్య పడుతుందని చెబుతున్నారు. అంతేగాదండోయ్ తాము చెట్టుతో ఎలా సంభాషిస్తున్నామో వీడియో రూపంలో సవివరంగా చూపించారు. అక్కడ ట్రినిటీ కాలేజ్లో దాదాపు 200 ఏళ్ల నాటి లండన్ ప్లేన్ ట్రీ వేర్లకు వైర్లకు టెక్నాలజీని అనుసంధానించి మాట్లాడుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఆ పురాతన చెట్టుతో ఏవిధంగా సంభాషిస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. View this post on Instagram A post shared by RTÉ News (@rtenews) (చదవండి: డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స) -
డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స
అద్భుతమా, అసంబద్ధమా? ఏమిటిది! నియంత్రణ లేని కదలికలకు నియమబద్ధమైన కదలికలతో చికిత్సా?! ‘పార్కిన్సన్స్’ డిసీజ్ అంటే నడక అదుపు తప్పటం, చేతులు కదలకపోవటం, కాళ్లు మెదలకపోవటం, తల వణకడం, ఉన్నట్లుండి అదిరి పడటం, నాడీ వ్యవస్థకు, ఇంద్రియాలకు మధ్య సమన్వయం గాడి తప్పటం!! దేహం ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు నృత్యం చెయ్యటం ఎంత దుర్లభం! పైగా దుర్లభమే దుర్భరానికి చికిత్స అవటం ఇంకెంత విడ్డూరం! అయితే ఇది విడ్డూరమేమీ కాదు, ప్రయోగాత్మకంగా నిర్థారణ అయిన విషయమే అంటోంది ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డ్యాన్స్ మూవ్మెంట్ థెరపీ’ (ఐ.ఎ.డి.ఎం.టి). పార్కిన్సన్లో ఏ కదలికా లయబద్ధంగా ఉండదు. డాన్స్లో లయబద్ధంగా లేని ఒక్క కదలికా ఉండదు. కానీ ఐ.ఎ.డి.ఎం.టి. పార్కిన్సన్స్ వ్యాధిని నయం చేయటానికి, వ్యాధిగ్రస్తుల్ని శక్తిమంతం చేయటానికి భారతీయ నృత్య రీతుల్ని ఒక చికిత్సా విధానంగా ఉపయోగిస్తోంది. విశాలమైన ఒక నిశ్శబ్దపు గది, వెనుక నుంచి మంద్రస్థాయిలో వినిపించే తబలా బీట్ వంటి ఒక సంగీత వాద్యం ఈ చికిత్సలో ముఖ్య భాగంగా ఉంటాయి. స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా వృద్ధులు అంతా కలిసి ఆ గదిలో ఉంటారు. అందరూ కూడా పార్కిన్సన్స్ బాధితులే. మనసును తాకుతున్న నేపథ్య ధ్వనికి అనుగుణంగా వాళ్ల చేతులు మబ్బుల్లా తేలుతాయి. చేతి వేళ్లు మృదువైన హావభావాలు అవుతాయి. పాదాలు లయకు అనుగుణంగా కదులుతాయి. గొప్ప పారవశ్యంతో మదిలోంచి జనించే ఉద్దేశపూర్వకమైన ఆంగికం (అవయవాల కదలిక)తో వారు ఒక మహా విజయాన్ని సాధిస్తారు. పార్కిన్సన్స్లో ప్రమేయం లేని కదలికలు మాత్రమే ఉంటాయి కనుక ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని కదలించటం అన్నది మహా విజయమే. తప్పిన పట్టు తిరిగి వచ్చేస్తోంది‘‘ఇక్కడికి వచ్చిన వారు కొన్ని నెలల క్రితం వరకు కూడా పడిపోతామేమో అనే భయం లేకుండా నడవలేకపోయిన వారే. కానీ వారిని ఈ నృత్య చికిత్స ఎంతగానో మెరుగు పరిచింది’’ అంటారు ఐ.ఎ.డి.ఎం.టి. అధ్యక్షురాలు, ‘డ్రామా థెరపీ ఇండియా’ వ్యవస్థాపకురాలు అన్షుమా క్షేత్రపాల్. పార్కిన్సన్స్లో నాడీ వ్యవస్థ–శరీరావయవాల పరస్పర చర్యల మధ్య సమన్వయం (మోటార్ కంట్రోల్) దెబ్బతింటుంది. మానసికంగానూ పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు పట్టుతప్పుతారు. ఈ స్థితిలో వారికొక ఉనికిని, వ్యక్తీకరణ శక్తిని, మునుపటి ఆనందకరమైన జీవితంలోకి మార్గాన్ని నృత్య చికిత్స ఏర్పరుస్తుందని అన్షుమా చెబుతున్నారు. ఈ సంస్థల శాఖలు ముంబై, పుణే, బెంగళూరులలో ఉన్నాయి.నృత్యం తెచ్చే మార్పేమిటి?పార్కిన్సన్స్ మెదడు క్రియాశీలతను, డోపమైన్ కేంద్రమైన ‘బేసల్ గాంగ్లియా’ను ప్రభావితం చేస్తుంది. దాంతో స్వచ్ఛంద కదలికలు కష్టతరం అవుతాయి. కానీ మెదడు మాత్రం ‘లయ’లకు స్పందిస్తుందని అన్షుమా అంటున్నారు. ‘‘సంగీతాన్ని వింటున్నప్పుడు మెదడులో దెబ్బతినని సర్క్యూట్లు (పార్కిన్సన్స్ వల్ల దెబ్బతిన్నవి కాకుండా) వేర్వేరు నాడీ రహదారుల ద్వారా కదలికలను తెస్తాయి. నాడీ శాస్త్రపరంగా, ఈ నృత్య చికిత్స బలాల్లో ఒకటి రిథమిక్ ఆడిటరీ స్టిమ్యులేషన్ (ఆర్.ఎ.ఎస్.) ఉద్దీపన చెందటం. దీనివల్ల అవయవ సమన్వయం ఏర్పడుతుంది. డోపమైన్, ఎండార్ఫిన్లు, సెరోటోనిన్ల వంటి న్యూరో ట్రాన్సిమీటర్ హార్మోన్లు పెరుగుతాయి. దాంతో కదలికలు మాత్రమే కాదు, మానసిక స్థితీ మెరుగుపడుతుంది’’ అని ఆమె అంటున్నారు.గర్బా నృత్యంపై తొలి ప్రయోగంగుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్బా’పై 2024లో ప్రయోగాత్మకంగా జరిగిన అధ్యయనంలో పార్కిన్సన్స్ రోగులపై ఈ డ్యాన్స్ చక్కటి ప్రభావం చూపినట్లు వెల్లడైంది. పార్కిన్సన్స్కు చికిత్సగా నృత్య రీతుల్ని ఆశ్రయించటం 2009లో ముంబైలోని ‘పార్కిన్సన్స్ డిసీ జ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ సొసైటీ ’ ప్రయత్నాలతో మొదలైంది. అదే సమయంలో ఆర్జెంటీనాలో టాంగో, సల్సా డ్యాన్సులు పార్కిన్సన్స్కు చికిత్స గా ఉపయోగపడతాయా అన్న దానిపై అధ్యయనం జరుగుతోంది. ఆ స్ఫూర్తితో 2010లో మన దగ్గర శా స్త్రీయ నృత్యాల చికిత్సా తరగతులు వారానికి రెండుసార్లు 3 నెలల పాటు ముంబైలో జరిగాయి. ప్రస్తుతం దేశంలోని అనేక కమ్యూనిటీ సెంటర్లు భరతనాట్యం, గర్బా, కూడియట్టంలతో చికిత్స చేస్తున్నాయి.పార్కిన్సన్స్ లక్షణాలు – కారణాలుప్రధానంగా ఇవి శారీరకమైనవి. వణుకు, బిగదీసుకుపోవటం, కదలికలు నెమ్మదించటం, భంగిమలో అస్థిరత వంటివి కనిపిస్తాయి. క్రమంగా ఆందోళన, కుంగుబాటు మొదలౌతుంది. ఎవ్వరితోనూ కలవలేక, ఆత్మ విశ్వాసం సన్నగిల్లి అపారమైన దుఃఖం మిగులుతుంది. మెదడులో డోపమైన్ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు సక్రమంగా పని చెయ్యకపోవటం లేదా నశించటం పార్కిన్సన్స్కు ప్రధాన కారణం. మనిషి తను కదలాలనుకున్నట్లు కదలటానికి డోపమైన్ అవసరం. డోపమైన్ లోపించటం వల్ల కదలికలు అస్తవ్యస్తం అవుతాయి. మెదడులో డోపమైన్ ఉత్పత్తి తగ్గటానికి గల కారణాలపై పరిశోధకులింకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. ఒక కారణం మాత్రం వృద్ధాప్యం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లలో సుమారు ఒక శాతం మందికి పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలున్నాయని అంచనా. డోపమైన్ను భర్తీ చేసే మందులు, మెదడు ఉద్దీపన వంటి వైద్య చికిత్సలలో పురోగతి సాధించినప్పటికీ ఫలితాలైతే అనుకున్నంతగా లేవు.రోగులు తమకు తామే వైద్యులుసాధారణ వైద్యంలా ఈ ‘డ్యాన్స్ మూవ్మెంట్ థెరపీ’ ఎవరో సూచించేది కాదు. ఎవరికి వారుగా అనుసరించేది. ఎలా కదలాలన్నదీ ఎవరూ చెప్పరు. కదిలే మార్గాలను ఎవరికి వారే అన్వేషించేలా మాత్రం ప్రోత్సహిస్తారు. నడక లేదా భంగిమను సరిదిద్దుతారు. శ్వాసపై నియంత్రణ కల్పిస్తారు. ఊహాశక్తిని, వ్యక్తీకరణను లయబద్ధం చేస్తారు. చికిత్సలో పాల్గొనే వారిలో కొంతమంది కూర్చుని నృత్యం చేస్తారు. మరికొందరు స్థిరంగా నిలబడతారు. కొందరు మరింత స్వేచ్ఛగా కదులుతారు. మొత్తానికి వాళ్లంతా రోగుల్లా కాకుండా, దేన్నో సృష్టిస్తున్నట్లుగా ఉంటారు.సాక్షి నేషనల్ డెస్క్(చదవండి: హీరో శింబు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..) -
ఇంటర్వ్యూకెళ్ళాలంటే భయం!
నేను బీటెక్, ఎం. బి.ఎ. చేశాను. చదువులో మొదట్నుంచి టాప్! ఈ మధ్య చాలా చోట్ల నుండి – ఇంటర్వ్యూలు వస్తున్నాయి. కానీ ఇంటర్వ్యూ కెళ్ళాలంటేనే దడ పుట్టుకొస్తుంది. ఆ మధ్య హైద్రాబాద్లో ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకెళితే, వెయిటింగ్ హాల్లో వొళ్ళంతా వణుకుడు, చెమటలు పట్టి విపరీతమైన భయం వేసి శ్వాస కూడా ఆడలేదు. చివరికి లోపలికి వెళ్ళిన తరువాత వారడిగే ప్రశ్నలకు సమాధానాలు తెల్సినా, టెన్షన్, మాట తడబడటం, మైండ్ల్బ్లాక్ కావడంతోఒక్క ప్రశ్నకు కూడా సరిగా ఆన్సర్ చెప్పలేక పోయాను. చదువులో అంత టాప్లో ఉన్న నాకు ఇంటర్వ్యూ విషయానికొచ్చేసరికి ఎందుకిలా అవుతోందో అర్థం కావడం లేదు. ఈ భయం వల్ల మంచి ఆఫర్స్ కూడా చేతులారా పోగొట్టుకుంటున్నాను. అందరి లాగా నేను కూడా ఇంటర్వ్యూలు ధైర్యంగా ఫేస్ చేయగలనంటారా?– రవిచంద్ర, కాకినాడ చదువులో టాప్లో ఉండి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న మీరు కేవలం ఈ ఇంటర్వ్యూ భయం వల్ల వచ్చిన ఆఫర్స్ పోగొట్టుకుంటున్నారన్న విషయం బాధాకరమైందే. మంచి తెలివి తేటలు, క్వాలిఫికేషన్స్ ఉండి కూడా కేవలం ఈ ఇంటర్వ్యూ భయం వల్ల ఇలా వెనకబడిపోతున్నారు. ‘సోషల్ యాంక్సైటీ డిజార్డర్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనయిన వారిలో ఇలాంటి భయాలుంటాయి. కొందరికి నలుగురిలో కలవాలంటే భయం. మరికొందరికి స్టేజి మీద మాట్లాడాలన్నా, గుంపులో కలవాలన్నా అమితమైన భయం, సిగ్గు, మొహమాటం. ముడుచుకు΄ోయి ఒక మూలగా ఒంటరిగా ఉండటం ఇవన్నీ ఈ సోషల్ యాంక్సైటీ లక్షణాలే! వారసత్వం వల్ల కొందరు, కుటుంబ వాతావరణం వల్ల మరి కొందరు ఈ మానసిక రుగ్మతకు లోనయ్యే అవకాశముంది. దీనివల్ల ఎంత మెరిట్ ఉన్నా, ఉద్యోగంలో, జీవితంలో నెగ్గుకు రాలేరు. మరికొందరు అన్నింటిలో యావరేజ్లో ఉన్నా ఇలాంటి భయాలేం లేకుండా ఆత్మవిశ్వాసంతో అన్నింటిలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇది కూడా ఒక మానసిక రుగ్మత అన్న విషయం తెలియక చాలామంది అలాగే ఉండిపోతున్నారు. ఈ సమస్యను కొన్ని మానసిక చికిత్స పద్ధతుల ద్వారా, మరి కొన్ని మంచి మందుల ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు. జాకబ్సక్సెస్ రిలాక్సేషన్, ‘డీసెన్సిటైజేషన్, మైండ్ ఫుల్ నెస్, ‘వర్చువల్ రియాలిటీ’ అనే ఆధునిక పద్ధతుల ద్వారా ఇలాంటి వారిని పూర్తిగా ఈ సమస్య నుండి పూర్తి బయట పడవేయవచ్చు. వెంటనే సైకియాట్రిస్టుని సంప్రదించండి. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైక్రియాట్రిస్ట్, విజయవాడ, మీ సమస్యలు, సందేహాల కోసం పంపవల్సిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com(చదవండి: హీరో శింబు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..) -
హృదయ విదారక ఘటన: పాపం నడిరోడ్డుపై ఓ తల్లి ఆక్రందన..
ముగ్గురు పసికందులు.. నాలుగేళ్లు, రెండేళ్లు, నాలుగు నెలల వయసు.. తండ్రి వదిలి పోయాడు. కానీ, అమ్మ అలా చేయలేదు. రక్తం పంచి ఇచ్చింది కదా.. వివాహేతర సంబంధాల అడ్డదారిలో వెళ్లిపోయిన భర్తలా.. పేగు బంధాన్ని తెంచేసుకోలేకపోయింది. నాలుగేళ్ల కొడుక్కి కాళ్లు లేవు.. నాలుగు నెలల పాపకు పాలిద్దామన్నా దేహం సహకరించడం లేదు. అవిటితనం అంటిన బిడ్డ చచ్చుబడిన కాళ్లతో పాకుతూంటే పుండ్లు పడ్డాయి. వర్షం నీటిలో తడిసి పచ్చిబడ్డాయి. నొప్పితో అరిచేందుకైనా గొంతు దాటి బాధ బయటకు రానంత నిస్సత్తువ.. ఆ స్థితిని కన్నతల్లి చూడలేకపోయింది. తినడానికి తిండి లేదు. హోరు వానలో నడిరోడ్డులో నరక యాతన అనుభవిస్తున్న పేగుబంధాలను రోడ్డు మీదే పడుకోబెట్టి గుండెలు బాదుకుంటోంది. వర్షంలో కన్నీళ్లు కలిసి పోవడం వల్లనేమో.. పిచ్చిదనుకున్నారు. కానీ, బిడ్డల కోసం ఏడుస్తోందని తెలుసుకునేందుకు అక్కడి వారికి గంట పైగా సమయం పట్టింది.. ఈ హృదయ విదారక సంఘటనల ఆంధ్రప్రదేశ్ కాకినాడ బస్టాండ్ ఆవరణలో మంగళవారం చోటు చేసుకుంది. ఐసీడీఎస్ అధికారుల కథనం ప్రకారం... ఏ దిక్కూ లేక.. కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలి, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు. చుట్టుపక్కల వారు స్పందించకపోయినా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి వనుము పరమేశ్వర్, మత్స్యకారుడు రాజు మానవత్వాన్ని చాటుకోవడంతో ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.విజయ తన బృందంతో అక్కడకు చేరుకున్నారు. రోదిస్తున్న తల్లికి ధైర్యం చెప్పి, ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. వాన నీటిలో తడిసి, నానిపోయి చిగురుటాకుల్లా వణికిపోతున్న పిల్లల్ని కాపాడి, సపర్యలు చేశారు. తల్లి నుంచి వివరాలు సేకరించారు. భర్త వదిలేయడంతో తాను ముగ్గురు పిల్లలతో రోడ్డున పడ్డానని ఆ మహిళ తన కష్టాన్ని విజయ బృందం వద్ద చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. తనకు ఇద్దరు నాలుగు, రెండేళ్ల మగపిల్లలతో పాటు నాలుగు నెలల వయసు బిడ్డ కూడా ఉందని చెబుతూ గుండెలకు హత్తుకున్న శిశువును చూపింది. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావని వారు ప్రశ్నించగా.. తన నాలుగేళ్ల కుమారుడికి పోలియో వల్ల కాళ్లు చచ్చుబడి నడవలేకపోతున్నాడని, పాకడం వల్ల రెండు కాళ్లు పుండ్లు పడ్డాయని, చూసి తట్టుకోలేక ఏడ్చానని విలపించింది. తన బిడ్డల్ని కాపాడాలని వేడుకుంది. కన్నబిడ్డల దుస్థితి చూసి తాళలేక ఆ తల్లి మానసిక వేదనకు గురైందని గుర్తించిన విజయ, ఆమె బృందం వారిని కాకినాడ జీజీహెచ్లోని దిశ వన్స్టాప్ సెంటర్కు పరమేశ్వర్, రాజుల సాయంతో తరలించింది. కాళ్లు చచ్చుబడిన నాలుగేళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతకు ముందు పిల్లల్ని రాజమహేంద్రవరంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వర్చువల్గా హాజరుపరిచారు. కమిటీ ఆదేశాల మేరకు ముగ్గురు పిల్లలతో పాటు తల్లిని వన్స్టాప్ సెంటర్ పర్యవేక్షణలో ఉంచి సంరక్షిస్తున్నారు. తల్లీబిడ్డలను రక్షించిన వారిలో విజయతో పాటు కౌన్సిలర్ దుర్గారాణి, సోషల్ వర్కర్ ఎస్.చినబాబు కూడా ఉన్నారు.(చదవండి: ఆధ్యాత్మికత నుంచి.. ఏకంగా కంపెనీ సీఈవోగా ప్రస్థానం..) -
హీరో శింబు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..
తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, దర్శకుడిగా, సింగర్గా తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శింబు అసలు పేరు సిలంబరసన్. అయితే అంతా ముద్దుగా శింబుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన కమల్హాసన్ థగ్ మూవీ షూటింగ్ ప్రమోషన్లతో బిజిగా ఉన్నాడు శింబు. ఒకప్పుడు ఆయన ఫుడ్స్టైల్ అంత ఆరోగ్యకరమైన రీతీలో ఉండేది కాదని అంటున్నారు శింబు ఫిట్నెస్ ట్రైనర్. ఆయన ఎంతో పట్టుదలతో ఆరోగ్యకరమైన అలవాట్లును అనుసరిస్తూ దాదాపు 30 కిలోలు బరువు తగ్గారని అన్నారు. మంచి ఆహారపు అలవాట్లను అనుసరించిన విధానం..ఆయన పాటించిన నియామాలు వింటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుందంటున్నారు. ఎందుకంటే తాము ఇచ్చే డైట్లోని ఆహారాలు శింబుకి అస్సలు నచ్చనవి అట. అయినా సరే అతడు పట్టుదలతో మంచి పోషకాహారాన్ని ఎలా ఇష్టంగా తినేవాడో వివరించారు. మరీ అంతలా బరువు తగ్గేందుకు అనుసరించిన ఫిట్నెస్ మంత్ర ఏంటో ఆయన ఫిట్నెస్ ట్రైనర్ మాటల్లో విందామా..!.స్మార్ట్గా కనిపిస్తూ..యుంగ్ హీరోలకు తీసిపోని దూకుడుతో కనిపించే శింబు(42) పిట్నెస్ సీక్రెట్ గురించి ఓ ఇంటర్యూలో ప్రశ్నించగా..స్థిరత్వం, మితంగా ఆహారం తీసుకోవడమేనని సమాధానమిచ్చారు. ఆయన వెయిట్లాస్ జర్నీ ఎందిరికో స్ఫూర్తిగా నిలిచింది కూడా. 2020 నుంచి మంచి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించి బరువు తగ్గానని ఆయన చెప్పారు. ఇక ఆయన ఫిట్నెస్ ట్రైనర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ..శింబు ప్రతి ఉదయం 4.30 గంటలకు నడకతో తన రోజుని ప్రారంభిస్తాడని అన్నారు. ప్రారంభంలో వారానికి నాలుగురోజులు వ్యాయామాలు చేసేవాడని, ఆ తర్వాత ఐదు రోజులకు మార్చుకున్నాడని అన్నారు. అంతేగాదు “ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు” ప్రాధాన్యత ఇచ్చేలా తన డైట్ని మార్చుకున్నాడని అన్నారు. కేలరీలు తక్కువుగా ఉండే సలాడ్లు, జ్యూస్లు ఎలా ఇష్టంగా తీసుకునేందుకు యత్నించాడో కూడా తెలిపారు. అలాగే రాత్రిపూట తేలికపాటి ఆహారమే తీసుకుని కొద్దిపాటి ఆకలితో నిద్రపోవడం వంటివి పాటించారట శింబు. ఇలా రాత్రిపూట కొంచెం ఆకలితో నిద్రపోవడం మంచిదేనా..ఇది సరైనదేనని న్యూట్రిషనిస్ట్ ఆశ్లేషా జోషి అంటున్నారు. కొంచెం ఆకలితో పడుకోవడం జీర్ణాశయానికి ఎంతో మంచిదని అంటున్నారు. ఎందుకంటే రాత్రిపూట మన జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల రాత్రిపూట అధిక కేలరీలతో కూడిన ఆహారం అధిక బరువు, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రాత్రిపూట అదిక కేలరీలను నివారించడమే అన్ని విధాల శ్రేయస్కరమని అంటున్నారు. అలాగని ఆకలితో కాకుండా పోషకాహారంతో కూడిన ఆహారం మితంగా శరీరానికి అనుగుణంగా తీసుకోవడం ముఖ్యమని సూచించారు. ఇక్కడ అందరి ఆకలి సంకేతాలు ఒకేలా ఉండవు కాబట్టి ఆయా వ్యక్తుల వారి శరీర సంకేతానికి అనుగుణంగా తీసుకోవాలని అన్నారు. ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఫుడ్..పండ్లు కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు, ఆల్కలీన్ అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిపెట్టడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా అందుతుంది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: అతనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే..! వైరల్గా కొబ్బరిబోండాల వ్యాపారి) -
ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు..! ఐడియా మాములుగా లేదుగా..
ఇప్పడంతా ఆన్లైన్ పుణ్యామా అని డోర్డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహారం, షాపింగ్, కిరాణ సరుకులు వరకు అన్ని ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవడం..నేరుగా ఇంటికే డెలివరీ అవ్వడం టకటక జరిగిపోతోంది. చెప్పాంలటే..పెద్దపెద్ద బడా కంపెనీలన్నీ ఇంటివద్దకే వచ్చి సేవలందించే బాటలోకి వచ్చేశాయి. ఆ కోవలోకి టైలరింగ్ వంటి సేవలు కూడా వస్తే..ఇక పని మరింత సులవు కదూ..!. అలాంటి వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి..హాయిగా జీవనం సాగిస్తూ..అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఆంద్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకు చెందిన 58 ఏళ్ల దర్జీ ఎస్.కె. కలీషా. అతడికి ఈ ఆలోచన ఎలా వచ్చింది..?. ఈ ఆలోచనతో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడా అంటే..ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో నివాసం ఉండే ఎస్.కె. కలీషా తొలుత గ్రామంలో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని టైలరింగ్ చేసేవారు. దశాబ్ద కాలం వరకూ కుటుంబ పోషణకు ఏ మాత్రం ఇబ్బంది పడేవారు కాదు. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవించారు. అలాగే అక్కడ గ్రామస్థులు కూడా కాలేషా దుకాణం వద్దకు వచ్చి బట్టలు కుట్టించుకునేవారు. అయితే కాలం మారి రెడీమేడ్ ట్రెండ్ కావడం, యువత ఆ దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వడంతో కలిషాకి బతుకుదెరువు భారంగా మారింది. ఇలా లాభం లేదనుకుని ఎలాగైనా తనకు తెలిసిన ఈ వృత్తి ద్వారానే అధిక ఆధాయం ఆర్జించాలని స్ట్రాంగ్గా డిసైడయ్యారు కలిషా. అలా పుట్టుకొచ్చింది ఇంటివద్దకే టైలరింగ్ సేవలందించాలనే ఆలోచన. ఎందుకంటే ప్రస్తుతం పలు రకాల సేవలూ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటం తోపాటు కొన్ని సంస్థలు ఈ తరహాలో లాభాలను ఆర్జిస్తున్న విధానాన్ని తెలుసుకుని ఆ పంథాలోకే తన వృత్తిని పట్టాలెక్కించారు కలీషా. ఇక తాను కూడా ఇంటి వద్దకే సేవలందించి ఆదాయాన్ని మరింతగా పెంచుకోవాలనుకున్నారు. అందుకు నాలుగు చక్రాల వాహనం అవసరమవుతుంది. కానీ అదికొనే స్థోమత లేకపోవడంతో ఓ రిక్షాను కొని దానికి కుట్టుమిషన్ను అనుసంధానించారు. ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు అనుగుణంగా మార్పులు చేశారు. తొలుత తన గ్రామంలోని కాలనీల్లో తిరిగి ఇంటివద్దకే వెళ్లి పాత, చిరిగిన బట్టలు కుట్టడం ప్రారంభించారు. దీంతో అతని ఆదాయం కూడా పెరిగింది, కుటుంబ పోషణ కూడా హాయిగా సాగిపోయింది. అయితే రానురాను ఆ రిక్షా తొక్కుకుంటూ వెళ్లడం కష్టమైపోవడంతో..కుటుంబ సన్నిహితులు, స్నేహితుల సాయంతో టీవీఎస్ కస్టమ్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి, దానికి మొబైల్ టైలరింగ్ దుకాణంగా సవరించి సేవలందించడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. పెనమలూరు మండలంలో రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. అవసరం ఉన్న వాళ్లు నేరుగా కాలేషాకు ఫోన్ చేసి మరీ పిలింపించుకుని బట్టలు కుట్టించుకుంటారట. అలా రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ టైలరింగ్ వల్ల అప్పులు బాధలు ఉండవని, ఆదాయం నేరుగా జేబులోకి వస్తోందని అంటున్నారు షేక్ కాలేషా. ప్రస్తుతం ఆయన పెనమలూరు, పోరంకి, వనకూరు ప్రాంతాల వరకే తన టైలరింగ్ సేవలు పరిమితం చేశానని అన్నారు. ఎందుకంటే ఈ వయసులో ఈ ప్రాంతాలను దాటి వెళ్లడం తనకు కష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. చివరగా ఆయన.. ఎవ్వరూ కూడా తాము చేపట్టిన వృత్తిని ఆదరించడం లేదని ఆందోళన చెందకూడదని, వినూత్నంగా ఆలోచించి సేవలందిస్తే.. సత్ఫలితాలు వస్తాయని యువతకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు కలేషా. అదే బాటలో మరో జంట..తిరువనంతపురంకు చెందిన అనిష్ ఉన్నికృష్ణన్ గాయత్రి కృష్ణ దంపతులు తమ "సీవ్ ఆన్ వీల్జ్" అనే వెంచర్తో మొబైల్ టైలరింగ్ సేవలందిస్తున్నారు. ఆ దంపతులు దీన్ని టెంపో ట్రావెలర్ సాయంతో నిర్వహిస్తున్నారు. వాళ్లు పెళ్లికూతురు దుస్తుల నుంచి అల్టరేషన్ వరకు అన్ని రకాల సేవలందిస్తారు. సాధారణంగా టైలర్లు ఆల్టరేషన్ పనులు చేపట్టడానికి ఇష్టపడరు , అయితే ఈ దంపతులు ఆల్టరేషన్ పనే ప్రధానంగా.. సేవలందించి కస్టమర్ల మన్ననలను అందుకుంటున్నారు.ఇదంతా చూస్తుంటే ముందు ముందు..ఇంటి వద్ద టైలరింగ్ సేవలు పొందొచ్చన్నమాట. అటు వారికి ఆదాయం, మనకు సమయం ఆదా అవ్వడమేగాక, నచ్చిన విధానంగా కుట్టించుకునే వెసులబాటు దొరుకుతుందన్న మాట. అంతేగాదు పరిస్థితులు సవాలుగా మారినప్పుడూ.. అవకాశాలను దొరకబుచ్చుకోవటం అంటే ఈ కలీషా, ఉన్ని కృష్ణన్ దంపతుల సక్సెస్ని చూస్తుంటో తెలుస్తోంది కదూ..!.(చదవండి: ఆధ్యాత్మికత నుంచి.. ఏకంగా కంపెనీ సీఈవోగా ప్రస్థానం..) -
నాడు సన్యాసి.. ఇవాళ కంపెనీ సీఈవోగా..!
ఎందరో మేధావులు, ప్రముఖులు జీవితంలో అనుభవించాల్సిన ఆనందమంతా పొంది, బాధ్యతలు కూడా నెరవేర్చి.. చరమాంకంలో ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేస్తుంటారు. ఇక వారి శేష జీవితాన్ని ఆ దేవుని సేవకు అంకితం చేసిన ఎందరో భక్తాగ్రేసులను చూశాం. అలా కాకుండా వారందరికంటే భిన్నంగా..ఓ వ్యక్తి ఆధ్యాత్మికత నుంచి ఆధునిక జీవన విధానంలోకి వచ్చాడు. ఆయన ఆధ్యాత్మికంగా పరిపక్వత చెంది..చివరికి ప్రాంపించిక జీవితంలోకి రావడమే గాక..కోట్లు టర్నోవర్ చేసే కంపెనీకి సీఈవోగా ఎదిగారాయన. అంతేగాదు కుటుంబ జీవనంలో బతుకుతూనే ఆధ్యాత్మికంగా బతకొచ్చు అని నిరూపించాడు. పైగా అది మన జీవితంలో భాగమే గానీ ఎక్కడో దేవాలయాల్లో, మఠాల్లోనూ పొందే సిద్ధాంతం కాదని అంటారాయన. అది మన జీవన విధానానికే పునాది..అదే కేంద్రం బిందువని చెప్పకనే చెప్పాడు.ఆయనే స్టోన్ సఫైర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శోభిత్ సింగ్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జన్మించిన సింగ్ చిన్నప్పటి నుంచి తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతవైపు ఆకర్షితుడయ్యాడు. అలా తన చదువు పూర్తి చేసుకున్న వెంటనే..కేవలం 26 ఏళ్లకే రిషికేశ్లోని ఒక ఆశ్రమంలో ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు. అక్కడే వేద అధ్యయనం చేశాడు. ఇక పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోనే నడవాలని భావించాడు. అలా ఆ రిషికేశ్ ఆశ్రమం మహర్షి సంస్థలో సభ్యుడిగా కూడా మారాడు. పూర్తి సన్యాసి జీవితం గడుపుతున్న శోభిత్ సింగ్ మఠాన్ని విడిచి పెట్టి..ప్రాపంచిక జీవితంలో గడుపుతూ ఆధ్యాత్మికంగా ఉండొచ్చు అని విశ్విసించడం మొదలుపెట్టాడు. ఆయనకు ఆ ఆశ్రమంలో ఉండగానే ఆధ్యాత్మికత అంటే కేవలం ఆచారాలు లేదా ఏకాంతం లేదా 'సంసారం' నుంచి నిష్క్రమించడం కాదని బోధపడింది. మన దైనందిన జీవితంలో ప్రతిపాత్రలో దీన్ని విలీనం చేసి బతికే జీవన విధానమే అది అని తెలుసుకున్నానని చెబుతున్నాడు శోభిత్. అప్పుడే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యా..అందరిలా జనజీవన స్రవంతిలో చేరి కార్పొరేట్ ప్రంపంచలో బతుకుతూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా బతకచ్చో ఆచరించి చూపాలని నిర్ణయించుకున్నారట శోభిత్ సింగ్ఆ నేపథ్యంలోనే కొత్తమంది స్నేహితులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా విజయాలను అందుకున్నానని అన్నారు. ఈ పోటీతత్వంతో కూడిన కార్పొరేట్ వరల్డ్లో కూడా తన ఆలోచన విధానంలో ఎట్టి మర్పు రాలేదని ధీమాగా చెబుతున్నారు శోభిత సింగ్. ఆశ్రమంలో లేదా వ్యాపారంలో అయినా..తాను ఆధ్యాత్మికత విద్యార్థినే అంటారు. ఇక్కడ ఆధ్యాత్మికత..వినయం, సానుకూలత, సానుభూతి, గ్రహణశక్తి తదితరాలను ప్రతిబింబిస్తే..వ్యాపారంలో రాణించాలంటే కూడా ఇవన్నీ అవసరం..అదే నన్ను వ్యవస్థాపక జీవితంలోకి తీసుకొచ్చాయని నవ్వుతూ చెబుతారాయన. అదే వ్యాపార సూత్రం..ఆధ్యాత్మికత ప్రాథమిక విలువలైనా..బహిరంగత, వినయం, సానుకూలత, సానుభూతి, ఆత్మపరిశీలన, గ్రహణశక్తి తదితరాలే నా వ్యాపార సూత్రాలంటారు ఆయన. వాటితోనే తాను అందరితో సంబంధాలు నెరపీ..వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. అలాగే ప్రతి వ్యక్తికి 200% జీవితం ఉంటుందట. అంటే 100% అంతర్గత (ఆధ్యాత్మిక), ఇంకో 100% బాహ్య జీవతానికి కేటాయించి ఉంటుందంటారు సింగ్. ఈ ఆధ్యాత్మికత ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా స్పష్టమైన వైఖరితో ఉండటం నేర్పిస్తుందట. పైగా అన్నివేళల మంచి స్పృహతో ఉంటారట. ఈ ఆధ్యాత్మికతలో మనల్ని మనం పరిశీలించటంతో జర్నీ మొదలవుతుంది..అక్కడ నుంచి మన దృక్కోణం మారుతుది..దాంతోపాటు జీవితం కూడా మారుతుంది. అలాగే ఏ విషయాలకు ఎలా స్పందించాలనే విషయంపై పూర్తి అవగాహన ఉంటుంది. అది ఈ ప్రాపంచిక జీవన విధానంలో ఎలా మసులుకోవాలో నేర్పించడమే గాక జీవితంలో ఉన్నతంగా బతకడం వైపుకు మార్గం వేస్తుందని చెబుతున్నారు శోభిత్ సింగ్. కాగా, ఆయన కంపెనీ గుజరాత్కు చెందిన కాగితపు ఉత్పత్తుల సరఫరాదారు. దీని టర్నోవర్ కోట్లలో ఉంటుందట. అంతేగాదు ఇది ఆసియాలో అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సరఫరాదారులలో ఒకటి, పైగా US రిటైలర్ల కాగితపు ఉత్పత్తి అవసరాలను కూడా తీరుస్తుంది. ముఖ్యంగా చిన్నారుల ఆర్ట్ సామాగ్రి, క్రాఫ్ట్ మెటీరియల్, పర్యావరణ అనుకూల స్టేషనరీ తదితర ఉత్పత్తులను అందిస్తుంది. (చదవండి: International Tea Day: 'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!) -
'కమ్యూనిటీ' ఆవకాయ..! ఒక్కరోజులోనే ఏకంగా..
ఆవకాయ.. ఇది తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. విస్తర్లో ఎన్ని వంటకాలు ఉన్నా.. ఏదో ఒక మూల ఆవకాయ టేస్ట్ తగలకపోతే ఏదో వెలితి. ఆఖరికి పెరుగులో టచింగ్కైనా సరే. తెలుగు విందు భోజనాల్లో అంతటి స్థానాన్ని సంపాదించుకుంది ఆవకాయ. అంతెందుకు దేశం దాటి వెళ్తున్న తమ వారి లగేజీల్లో ఆవకాయ పచ్చడి ఉండి తీరాల్సిందే. ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డ కుటుంబీకులకు పచ్చళ్లు పంపడానికి ఏకంగా కొరియర్ సర్వీసులు లెక్కకుమించి పుట్టుకొస్తున్నాయంటే తెలుగు ఆవకాయకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వేసవి విహారంలో విలేజీకి వెళ్లినప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు చుట్టుపక్కల అమ్మలక్కలతో కలిసి ఆవకాయ పట్టడం ఇప్పటికీ చూస్తునే ఉంటాం. అలాంటి మధుర జ్ఞాపకాలు పాత తరం వారి ప్రతిఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి. ఆ జ్ఞాపకాలను తిరగేసుకుని మళ్లీ అలాగే అందరం కలిసి ఆవకాయ పడితే ఎలా ఉంటుందని ఆ అపార్ట్మెంట్ మహిళల మదిలో ఆలోచన తళుక్కుమనడమే కాదు..ఏకంగా పట్టాలెక్కించారు. ఆవకాయ పచ్చడి పట్టడానికి ఒక వేడుకగా మలచుకున్నారు. హైదరాబాద్ సనత్నగర్లోని మోతీనగర్ సమీపంలో కొత్తగా నిర్మితమైన బ్రిగేడ్ సిటాడెల్ హైరైజ్డ్ అపార్ట్మెంట్ అది. 1300 ప్లాట్లు కలిగిన ఈ అపార్ట్మెంట్స్లో ఇప్పుడిప్పుడే కుటుంబాలు గృహప్రవేశాలు చేస్తున్నాయి. అలా దిగిన కుటుంబాలకు చెందిన 800 మంది మహిళలంతా ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మనమందరం కలిసి ఆవకాయ పచ్చడి పట్టుకుంటే బాగుంటుందని స్వాతి జ్యోతులకు వచ్చిన ఆలోచనను వాట్సప్ గ్రూపులో పంచుకుంది. దీనికి మిగతా మహిళల నుంచి కూడా ఆమోదం వచ్చింది. ఒక వంద కుటుంబాలు కలసికట్టుగా ఆవకాయ పచ్చడి పట్టుకుందామని ముందుకువచ్చాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవకాయ పచ్చడి పట్టడాన్ని ఒక పండుగలా, ఒక జాతరలా జరుపుకుని మహానగరంలో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారనే చెప్పవచ్చు.ఒక్కరోజులో 150 కిలోల పచ్చడి.. దాదాపు 100 కుటుంబాల డబ్బులు వేసుకుని సామూహిక ఆవకాయ పచ్చడికి సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్కడే ఒక హాల్ను బుక్ చేసుకున్నారు. పచ్చడి పెట్టుకునేందుకు ముందుకు వచ్చిన కుటుంబాలతో పాటు చూడడానికి వచ్చిన వారితో ఈ ఈవెంట్ ఒక వేడుకగా మారింది. శంషాబాద్ శివారుల నుంచి 300 దాకా ఆర్గానిక్ మామిడి కాయలను ప్రత్యేకంగా కోసుకుని తీసుకువచ్చారు. గుంటూరు కారాన్ని తెప్పించారు. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పసుపు ఇలా అన్ని పదార్థాలూ సరిపడా సమకూర్చుకున్నారు. ఒక్కరోజులో 150 కిలోల పచ్చడిని పట్టి ఔరా అనిపించారు. తొలిసారి ప్రయత్నమే సక్సెస్ అందరం ఒకచోట చేరి ఒక పండుగలా ఆవకాయ ఈవెంట్ను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుక ద్వారా ఐక్యత పెరుగుతోంది. బతుకమ్మ, సంక్రాంతి, దసరా పండుగలప్పుడు కలవడం సాధారణమే అయినా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో అందరూ తలో చేయి వేసి సమిష్టిగా పచ్చడిని పెట్టుకోవడం నిజంగా అద్భుతమనిపించింది. మరుపురాని అనుభూతి మిగిల్చింది. – దీప్తి ధరణిప్రగడమధురానుభూతి.. కొత్తగా చేరిన కుటుంబాలంతా కలిసి తొలిసారిగా ఆవకాయ ఈవెంట్ను జరుపుకోవడం ఎంతో మధురానుభూతిని కలిగించింది. ఒక కుటుంబమో, లేక ఆ కుటుంబంలోని బంధువులో కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం మామూలే. కానీ అపార్ట్మెంట్లోని మహిళలంతా కలిసి ఒక వేడుకగా జరుపుకోవడం ద్వారా అందరి మధ్య ఒక ఆత్మీయ బంధాన్ని ఆవకాయ ఏర్పరిచింది. – స్వాతి జ్యోతుల (చదవండి: Asli Mango 2.0: అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..) -
అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..
ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ పురస్కరించుకుని ప్రముఖ కేఫ్ చైన్ బ్రాండ్ యమ్మీ బీ మామిడితో తయారైన డిసర్ట్స్ రూపొందించి అస్లీ మామిడి 2.0 కలెక్షన్ పేరిట నగరంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా యమ్మీ బీ వ్యవస్థాపకుడు మాజీ ఇండియన్ అండర్–19 క్రికెటర్ కూడా అయిన సందీప్ జంగాల మాట్లాడుతూ ఇవి చక్కెర రహిత, గ్లూటెన్ రహితంగా ఉంటాయని, శుద్ధి చేసిన పిండి వంటివి వినియోగించకుండా సహజ పదార్థాలతో తయారైనవని తెలిపారు. ఈ కలెక్షన్లో మ్యాంగో ఫ్లోరిడా పేస్ట్రీ, మ్యాంగో చీజ్కేక్ తదితర వెరైటీలు ఉన్నాయని వివరించారు. ఇవి నగరంలోని తమ అవుట్లెట్స్లో అందుబాటులో ఉంటాయన్నారు. (చదవండి: జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..?) -
చిన్నారులు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా..!
పరీక్షల్లో మీ మార్కులు బెస్ట్గా వచ్చే ఉంటాయి. అయితే పజిల్స్ చేయడంలో తెలుస్తుంది అసలైన చురుకుదనం. ఈ పజిల్స్ను స్పీడ్గాచేయగలరా? అసలు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా?పిల్లలూ.. పజిల్స్ మన మెదడుకు మేత పెడతాయి. వీటికి సమయం కేటాయించడం వల్ల మీ ఏకాగ్రత, ఓర్పు పెరగడంతోపాటు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పజిల్స్లో ఎన్ని రకాలున్నాయో, వాటివల్ల ఉపయోగాలేమిటో చూద్దామా?పద వినోదం: దీనినే గళ్ల నుడికట్టు అని కూడా అంటారు. ఇది పదాలతో ఆడే సరదా ఆట. ఇది భాష మీద పట్టును పెంచుతుంది. దినపత్రికల్లో తెలుగు, ఇంగ్లిషుల్లో మీకు ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఖాళీ గళ్లలో పదాలు నింపే ప్రక్రియ ఇది. అందుకోసం పక్కనే మీకు కొన్ని క్లూస్ ఇస్తారు. వీటివల్ల కొత్త కొత్త పదాలు, వాటి అర్థాలు తెలుస్తాయి.సుడోకు: ఇది జపాన్ దేశంలో పుట్టిన పజిల్. నిలువు తొమ్మిది, అడ్డం తొమ్మిది చొప్పున మొత్తం 81 గడులు ఉంటే సుడోకులో కొన్ని గడుల్లో అంకెలు వేసి ఉంటాయి. మిగిలిన వాటిని మనం పూర్తి చేయాలి. అయితే అడ్డంగా, నిలువుగా, తొమ్మిది గడులలో ఒకసారి వేసిన అంకె మరోసారి వేయకూడదు. సుడోకు పూర్తి చేయాలంటే చాలా ఏకాగ్రత అవసరం. పైగా సుడోకు పూర్తి చేయడం వల్ల అంకెల మీద ఇష్టం ఏర్పడుతుంది. లెక్కలంటే భయం ఉన్న పిల్లలు సుడోకు చేయడం వల్ల లెక్కల మీదున్న భయం పోతుంది.జిగ్సా: ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన పజిల్ ఇది. 1760లో దీన్ని కనిపెట్టారు. ఒక అట్ట ముక్కపై ఓ ఆకారాన్ని గీసి, ఆపైన దాన్ని రకరకాలుగా ఆకృతులుగా కత్తిరిస్తారు. మనం ఆ కత్తిరించిన ముక్కల్ని కలిపి ఆ ఆకారాన్ని తిరిగి తీసుకురావాలి. ఇది ఒకరికంటే ఎక్కువమంది కూడా ఆడొచ్చు. ఆడుతున్నంతసేపూ ఏకాగ్రత చాలా అవసరం. మార్కెట్లో అనేక జిగ్సా పజిల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు కొని ఆడుకోవచ్చు.కొత్తగా ఆలోచించు (Lateral Thinking): ఇవి మనందరికీ తెలిసిన పజిల్స్. రకరకాల ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడమే ఇందులో కీలకం. ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడంలో భలే సరదాగా ఉంటుంది. పొడుపు కథలు, ప్రాచీన గాథలు, పదాలతో చేసే చిక్కుప్రశ్నలు వీటిలో కీలకం అవుతాయి. ఈ ప్రశ్నల కోసం మార్కెట్లో ప్రత్యేకమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ‘ఫలానా సందర్భంలో మీరైతే ఏం చేస్తారు? ఫలానా అంశం ఇలాగే ఎందుకు జరుగుతుంది?’ అంటూ ప్రశ్నలు వేసి పిల్లల చేత సమాధానాలు రాబట్టడం ఇందులో ముఖ్యమైన విషయం.లెక్కల పజిల్స్: ఇది మనందరికీ తెలిసినవే. లెక్కలతో తయారైన పజిల్స్. వీటిని పూర్తి చేయడం వల్ల గణితశాస్త్రంలోని పలు అంశాలపై అవగాహన పెరుగుతుంది. కూడికలు, తీసివేతలు, గుణించడం, భాగించడం వంటి అంశాలతో కూడిన ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు పిల్లల చేత రాబడతారు. సరదాగా సాగుతూ పిల్లలకు లెక్కల మీద అవగాహన పెంచడం వీటిలో కీలకం. (చదవండి: పాడ్కాస్ట్ చేద్దామా?) -
'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!
రోజులో తేనీటి ప్రాముఖ్యత ఎంతటిదో మనకు తెలిసిందే. అంతటి ముఖ్యమైన టీ వ్యాపార ప్రపంచంలోనూ తమ సత్తా చాటుతున్నారు భారతీయ మహిళలు. ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా వారి ప్రయాణ విజయాలు...భారతదేశ తేయాకు పరిశ్రమలో 50 శాతానికి పైగా పైగా మహిళలు ఉన్నట్టు నివేదికలు చూపుతున్నాయి. టీ ఎస్టేట్ నిర్వహణలోనూ, ఎగ్జిక్యూటివ్ పదవుల్లోనూ గణనీయమైన సంఖ్యలో మహిళలు ఉన్నారు. తేనీటి పరిశ్రమల్లోనూ మహిళల పాత్ర పెరుగుతున్నట్లు నవతరమూ తన విజయాల ద్వారా నిరూపిస్తోంది. ఇక తేయాకు తోటలలో కార్మికులుగా మహిళల శాతమే ఎక్కువ. సవాళ్లను అధిగమించడానికి, విజయవంతమైన వ్యాపార నిర్వహణలో సానుకూల మార్పును సృష్టించేలా తేనీటి రంగంలో ఈ మహిళలు తమ సామర్థ్యాన్ని చూపుతున్నారు. కెఫిన్ లేని టీ ఇండియాలో మొట్టమొదటి సర్టిఫైడ్ టీ సొమెలియర్గా స్నిగ్ధ మంచంద తన పేరును సుస్థిరం చేసుకుంది. ముంబై వాసి అయిన స్నిగ్ధ ‘టీ ట్రంక్’ కంపెనీ ద్వారా 2000 వేల రకాల టీ స్పెషల్స్ను అందిస్తోంది. ‘టీ వ్యాపారం గురించి ప్రొఫెషనల్గా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏ విద్యాసంస్థా నాకు కనిపించలేదు. దీంతో భారతదేశంలో టీ స్కూల్ను ప్రారంభించాలనుకున్నాను. 2013లో కేవలం ఆరు టీ మిశ్రమాలతో టీ ట్రంక్ను ప్రారంభించాను. వాటి తయారీలో పరిపూర్ణత సాధించడానికి రెండేళ్ల సమయం పట్టింది. ప్రారంభ దశలో లిస్టింగ్, పంపిణీదారుల వైఖరి చాలా కష్టంగా ఉండేది. దీంతో దృష్టిని ఈ–కామర్స్ వైపు మళ్లించి, నేరుగా టీ ప్రియుల వద్దకు చేరుకున్నాను. సీజన్కు తగినట్టు టీలను మార్చుకోవాలని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తాను. వేసవిలో శరీరానికి చల్లదనాన్నిచ్చే హై బిస్కస్ గ్రీన్ టీ బాగుంటుంది. మందార పూల రేకలతో టీ సాంత్వనను ఇస్తుంది. కాలానికి తగినట్టు టీ తయారీ స్పెషల్స్ మా వద్ద లభిస్తాయి. వీటిలో ఎలాంటి కెఫిన్ ఉండదు. – స్నిగ్ధ మంచంద, టీ ట్రంక్ఇమ్యూనిటీలు‘చాయ్ డైరీస్’ పేరుతో తన లైఫ్ డైరీని కొత్తగా ఆవిష్కరించింది అమీ భన్సాలీ. న్యూయార్క్ బిజినెస్ స్కూల్లో బిజినెస్ కోర్సు చేస్తున్నప్పుడు చాయ్ కేఫ్ను ప్రారంభించాలనుకుంది అమీ. ‘మేనేజ్మెంట్, కస్టమ్స్, షిప్పింగ్, అమ్మకాల డేటా వంటివి... ఇందులో ప్రతిదీ నేర్చుకోవాల్సి వచ్చింది. 2011లో ఇండియాలో 2013లో అమెరికాలో ఎటువంటి బ్యాకప్ లేకుండా చాయ్ డైరీస్ ప్రారంభించాను. కుటుంబం నుంచి, బయటి నుంచి ఎలాంటి పెట్టుబడి సహకారమూ లేదు. అప్పు చేసి మరీ ఈ వ్యాపారంలోకి దిగాను. అనుకున్నది సాధించగలిగాను. ఇప్పుడు మా దగ్గర తులసి గ్రీన్, మోరింగా వంటి రోగనిరోధక శక్తిని పెంచే టీలు కూడా ఉన్నాయి. కోవిడ్ టైమ్లో పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం ‘మామా’ అనే టీ ని సృష్టించాను. ఆర్గానిక్ బాంబే మసాలా టీ లోపాలు, చక్కెర లేకున్నా రుచికరంగా ఉంటుంది. కాక్టెయిల్, ఐస్డ్ టీ వంటివి సలాడ్ డ్రెస్సింగ్గా కూడా ఉపయోగించవచ్చు.’– అమీ భన్సాలీ, చాయ్ డైరీస్ తయారీలో సమయం తెలియదుతండ్రి నుంచి టీ కంపెనీని తీసుకొని, ఆనందిని పేరుతో విజయవంతంగా నడుపుతోంది డార్జిలింగ్ వాసి అనామికా సింగ్. ‘ఒక కప్పు టీ కోసం ఉదయకాంతితో పాటు పోటీ పడుతూ 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. 2014లో ‘ఆనందిని’ బ్రాండ్ని సృష్టించాను. ఇది కచ్చితంగా పురుషాధిక్య పరిశ్రమ. ప్రతి రంగంలో మహిళ తల చుట్టూ ఒక గాజు సీలింగ్ ఉంటుంది. దానిని అధిగమిస్తేనే అనుకున్నది సాధిస్తాం. పారదర్శకంగా ఉండటం, మూలంపై దృష్టిపెట్టడం మా సక్సెస్ మంత్ర. టీ మిశ్రమాలకు జోడించే పదార్థాలలో పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉంటాయి. కానీ, కృత్రిమ రుచులు ఉండవు. నాకు ఇష్టమైనవి ఫిర్దౌస్, గోల్డెన్ నీడిల్, ఫైన్వుడ్ స్మోక్డ్ టీ లు. కొత్త రుచుల టీ తయారీల కోసం గంటల తరబడి పనిచేస్తాను. సమయం గురించి కూడా ఆలోచించను.’– అనామికా సింగ్, ఆనందిని హిమాలయ టీకచ్చితమైన సమయపాలనలండన్లో ఒక గ్లోబల్ అడ్వైజరీ సంస్థలో లక్షల్లో జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి 2016లో ఆసమ్ టీ పేరుతో బెంగళూరులో టీ వ్యాపార ప్రారంభించి రాణిస్తోంది మయూర రావు. ‘ఉదయం 5 గంటలకు ముందే నా రోజు ప్రారంభం అవుతుంది. ఒక కప్పు వేడి తేనీటితో మొదలయ్యే ప్రయాణంలో అన్నింటినీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే. బృందాన్ని సమీక్షించడం, టీ తయారీపై దృష్టి పెట్టడం, ఈ–కామర్స్, డిస్ట్రిబ్యూషన్ ప్రతిదీ కీలకమే. మేం మా వృద్ధిని గడిచిన 12 వారాల రన్రేట్ను పరిశీలించి తెలుసుకుంటాం. ప్రస్తుతం 4 గిడ్డంగులను నిర్వహిస్తున్నాం. ఆర్డర్ ప్రకారం ప్రతి కస్టమర్కి సకాలంలో డెలివరీ చేస్తాం. కచ్చితమైన సమయపాలన మా విజయానికి పునాది.– మయూర రావు, ఆసమ్ టీ (చదవండి: -
ఆ వివాహం ఇక్కడా చెల్లుతుంది..
నేను పోలాండ్ లో నివసిస్తున్న భారతీయుడిని. ఇటలీలో ఉంటున్న మరొక భారతీయ మహిళను అక్కడే పెళ్లి చేసుకున్నాను. మా మతాలు వేరు. తనకోసం ఇక్కడ వీసా దరఖాస్తు చేస్తుండగా ఇటలీలో పొందిన మ్యారేజ్ సర్టిఫికెట్ భారతదేశంలో కూడా చెల్లుతుంది అని భారతదేశ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా కోర్టు ఆర్డరు ఏవైనా ఉంటే తేవాలి అని సూచించారు. మేము ఇంకా భారతదేశ పౌరులమే కాబట్టి ఈ ధ్రువీకరణ తప్పనిసరి అని చె΄్పారు. మా పెళ్లి భారత దేశంలో చెల్లుతుందా? లేక అక్కడికి వచ్చి ఇంకొకసారి పెళ్లి చేసుకోవాలా? సరైన సలహా ఇవ్వగలరు.– భరద్వాజ్, పోలాండ్ విదేశాలలో ఉంటున్న భారతీయులు పెళ్లి చేసుకుంటే (లేదా పెళ్లి చేసుకోబోతున్న వారిలో కనీసం ఒకరు భారతీయులు అయి ఉంటే) ఆ వివాహం భారతదేశంలో కూడా ‘ది ఫారిన్ మ్యారేజ్ యాక్ట్, 1969 ప్రకారం చట్టబద్ధమే. అయితే మీరు అదే విధమైన పెళ్లి భారతదేశంలో చేసుకుని ఉంటే ఆ పెళ్లికి ‘స్పెషల్ మ్యారేజ్ యాక్ట్’ నిబంధనలు అన్నీ వర్తిస్తాయి. ఉదాహరణకు (1) మీకు ఇదివరకే పెళ్లి అయ్యి మీ భార్య/భర్త జీవిస్తూ (విడాకులు లేకుండా) ఉండకూడదు.(2) మీరు ఉంటున్న దేశంలో కూడా మీ పెళ్లి చట్టబద్ధమైనది అయి ఉండాలి (3) మీరు పెళ్లి చేసుకున్న దేశంలోని అధికారులు మీ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని అపాస్టిల్ చేయాలి. ఇటలీ దేశం కూడా భారతదేశంతోపాటు హేగ్ కన్వెన్షన్ ఒప్పందం లో సంతకం చేసింది కాబట్టి, మీ వీసా దరఖాస్తుకు – భారత దేశంలో ఎవిడెన్స్ ఇవ్వడానికి కూడా అపాస్టిల్ చేసిన ఆ దేశ వివాహ ధ్రువీకరణ పత్రం చట్టబద్ధమైనదే!అలాంటి వివాహాలను రిజిస్టర్ చేయడానికి మీరు పెళ్లి చేసుకున్న దేశంలో ఉన్న ఇండియన్ ఎంబసీ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రతి ఇండియన్ ఎంబసీ లో కూడా వివాహాలను రిజిస్టర్ చేయడానికి ఒక ఆఫీసర్ ఉంటారు. ఇటలీలో మీరు పొందిన సర్టిఫికెట్ తీసుకొని ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అవసరమైన అప్లికేషన్ నింపి దరఖాస్తు చేసుకోండి. మీ దంపతులు – సాక్షులు కూడా వ్యక్తిగతంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇండియన్ ఎంబసీ వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం మీకు సరిపోతుంది. (శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయండి) (చదవండి: ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!) -
జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..?
జాన్వీకపూర్, సారా అలీఖాన్లు, ప్రముఖ సెలబ్రిటీలు IV డ్రిప్ థెరపీలు చేయించుకున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. వారి ప్రకాశవంతమైన చర్మ రహస్యం ఆ థెరపీనే అని పలువురు నిపుణులు చెబుతున్నారు కూడా. ప్రస్తుతం ఈ కొత్త ఇన్ఫ్యూషన్ థెరపీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు ఇదేంటి..?. ఆరోగ్యానికి మంచిదేనా తదితర విశేషాలు గురించి సవివరంగా చూద్దాం. ఇది ఒక కొత్త ఇన్ఫ్యూషన్ థెరఫీ. దీని సాయంతో హీరోయిన్, సెలబ్రిటీలు మిలమిలాడే నవయవ్వన శరీరంతో మెరిసిపోతుంటారట. ఈ థెరపీలో పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు నేరుగా రక్తప్రవాహంలోకి వెళ్లేలా ఇంజెక్ట్ చేయించుకుంటారట. తద్వారా శరీర రోగనిరోధక వ్యవస్థను, శక్తిని పెంచి..చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే గాక వృద్ధాప్య ప్రభావాలని తగ్గిస్తుందట. ఇందులో ఏముంటాయంటే..ఈ డ్రిప్స్లో విటమిన్ సీ, జింక్, మెగ్నీషియంతో పాటు కొల్లాజెన్ వంటి ప్రోటీన్లు, గ్లూటాతియోన్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు తదితరాలు ఉంటాయని చెబుతున్నారు చర్మ వ్యాధి నిపుణులు. దీన్ని ఒక్కోసారి కొద్దిమొత్తంలో నోటి ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ✨ Revitalize Your Health with Our IV Drip Therapy! ✨Feeling drained or need a boost? Our private clinic offers premium IV drips tailored just for YOU!Why IV Therapy? 🌟 Immediate Absorption 🌟 Enhanced Immunity 🌟 Glowing Skin 🌟 Increased Vitality pic.twitter.com/7ICKp3ouXM— Eskulap Clinic (@polskaklinika) February 11, 2025 ఎలా పనిచేస్తుందంటే..నిజానికి గ్లూటాథియోన్ అనేది మన శరీరం సహజంగా ఉత్పత్తి చేసే యాంటీఆక్సిడెంటే. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. కణాల నష్టంతో పోరాడటమే గాక, చర్మ రంగుకు కారణమైన మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. దీన్ని మూడు అమైనా ఆమ్లాలు సిస్టీన్, గ్లూటామిక్ , గ్లైసిన్ అనే ఆమ్లాలతో రూపొందిస్తారు. శరీరంలోని ప్రతికణంలో ఇది కనిపిస్తుంది, కానీ వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు తక్కువ గ్లూటాథియోన్ను ఉత్పత్తి చేస్తాయట. ఫలితంగా అనేక రకాల ఆరోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందట. అందువల్ల ఇలా IV డ్రిప్ థెరపీ రూపంలో తీసుకుంటారట సెలబ్రిటీలు. ఇవి నేరుగా రక్తప్రవహంలోకి వెళ్లి శరీరం త్వరగా గ్రహించడానికి అనుమతిస్తుందట. ఇది ఇచ్చిన మోతాదుని అనుసరించి వారాలు లేదా నెలలు వరకు ఆ థెరపీ సమర్థవంతమైన ప్రభావం ఉంటుందట. సాధారణంగా ఇది ఒక ఏడాదికి పైగా ప్రభావవంతంగా ఉంటుందట.సురక్షితమేనా?వాస్తవానికి కాస్మెటిక్ స్కిన్ లైటనింగ్ కోసం US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) దీనిని ఉపయోగించడాన్ని ఆమోదించదు. దీర్ఘకాలికంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవనేందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో దీన్ని యూఎస్ ఆరోగ్య అధికారులు అనుమతించరట. అలాగే కౌమర దశలో ఉన్న అమ్మాయిలకు ఇవ్వకూడదు కూడా. సౌందర్యాన్ని ప్రతిష్టగా భావించేవారు..తెరపై కనిపించే కొందరు సెలబ్రిటీలు తప్పసరి అయ్యి ఈ అనారోగ్యకరమైన పద్ధతికి వెళ్తారని చెబుతున్నారు నిపుణులు. కానీ వాళ్లంతా నిపుణులైన వైద్యుల సమక్షంలోనే చేయించుకుంటారు కాబట్టి కాస్త ప్రమాదం తక్కువనే చెప్పొచ్చు. ఇక ఆరోగ్యవంతులైన యువతకు ఈ గ్లూటాథియోన్ అనేది సహజసిద్ధంగానే శరీరంలో తయారవుతుంది కాబట్టి ఆ అవసరం ఏర్పడదని అంటున్నారు నిపుణులు. దీన్ని 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారెవ్వరూ తీసుకోకూడదట. చర్మం కాంతిగా నవయవ్వనంగా ఉండాలనుకునే వారంతా..యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం, పుష్కలంగా నీరు త్రాగడం, మంచి నిద్ర తదితరాలను మెయింటైన్ చేస్తే చాలని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!) -
ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!
వైద్యవిధానం విప్లవాత్మక మార్పులతో పురోగమిస్తుంది. నయం కానీ వ్యాధులను సరికొత్త చికిత్సా విధానంతో నయంచేసి రోగుల్లో సరికొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి. తాజాగా వైద్య విధానంలో అలాంటి పరిణామామే చోటు చేసుకుంది. అంతేగాదు మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిలో కొత్త ఆశలను అందిస్తోంది. ఈ ఘనత సాదించింది లాస్ ఏంజిల్స్లోని యూఎస్ సర్జన్లు. అసలేం జరిగిందంటే..నలుగురు పిల్లల తండ్రి ఆస్కార్ లారైన్జార్ కేన్సర్ కారణంగా రెండు మూత్రపిండాలు, మూత్రశయంలోని దాదాపు సగ భాగాన్ని కోల్పోయాడు. దాంతో అప్పటి నుంచి అతడు డయాలసిస్పైనే ఆధారపడుతున్నాడు. అతడి సమస్యను నయం చేసేలా అమెరికన్ యూరాలజిస్ట్లు అవయవా దాత నుంచి సేకరించిన మూత్రపిండాలు, మూత్రశయంని మార్పిడి చేశారు. ఈ సంక్లిష్టమైన సర్జరీ దాదాపు ఎనిమిది గంటలు పైనే పట్టింది. 41 ఏళ్ల ఆస్కార్ లారైన్జార్కి ఈ శస్త్రిచికిత్స పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అలాగే మార్పిడి చేసి కొత్త మూత్రపిండాల సాయంతో మూత్ర విసర్జన చేయగలిగాడు కూడా. అతనికి ప్రస్తుతం మూత్రపిండాల పనితీరు మెరుగ్గానే ఉండటంతో డయాలసిస్ అవసరం తగ్గింది కూడా. ఈ సర్జరీ జరిగిన కొన్ని గంటల అనంతరమే..అతడు సాధారణ మూత్ర విసర్జన చేయగలిగాడు. పాపం ఆ వ్యక్తి గత ఏడేళ్లుగా ఈ మూత్ర విసర్జన చేయలేకపోయాడు. ఈ శస్త్ర చికిత్స అతడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ మేరకు సదరు వైద్య బృందం మాట్లాడుతూ..మూత్రాశయ మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్సల గురించి గత నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే క్లినికల్ ట్రయల్ కోసం మరో నాలుగు శస్త్ర చికిత్సలు చేసేలే ప్లాన్లు ఉన్నాయి. నిజానికి ఈ పద్ధతిలో అవయవ తిరస్కరణకు అడ్డుకట్ట వసేలా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి అణిచివేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే ఇంతవరకు బలహీనమైన మూత్రాశయాలతో బాధపడుతున్న చాలామంది బాధితులకు ప్రేగులోని భాగంతో తిరిగి మూత్రశయం తయారు చేయడం వంటి పరిమిత ఎంపికలే గతంలో ఉండేవని అన్నారు. దీంతో ఆయా వ్యక్తుల్లో తరుచుగా ఈ సమస్యల తిరగబెట్టడమే లేదా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నమవ్వడమో జరిగేదన్నారు. కానీ ప్రస్తుతం తాము చేసిన ఆధునిక మూత్రాశయ మార్పిడి చికిత్సతో అంతకుముందు ఉత్ఫన్నమైన ప్రమాదాలకు తెరపడినట్లయ్యిందన్నారు. అలాగే కేన్సర్ వంటి మహమ్మారి వ్యాధులతో బాధపడే వారిలో కొత్త ఆశలను నింపింది. సదరు బాధితుడు లారైన్జార్ చేసిన శస్త్రచికిత్స వైద్యశాస్త్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచించడమే గాక అతను పూర్తిస్థాయిలో కోలుకుంటే గనుక చాలామంది రోగులకు జీవితంపై కొత్త ఆశను అందిస్తుంది.(చదవండి: ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్ ) -
ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్
ఇటీవల కాలంలో చేతిలో మొబైల్ లేనిదే మన ప్రపంచమే ఆగినంతగా మారిపోయింది జీవితం. అది లేకపోతే మన గమనం లేదు అని చెప్పొచ్చు. అంతలా ప్రతిదానికి ఆ స్మార్ట్ఫోన్ పైనే ఆధారపడిపోతున్నారు అందరూ. ఏం కావాలన్న ఠక్కున జేబులోంచి ఫోన్ తీసి చెక్ చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. అలా ఫోన్ చూడనిదే పూట గడవదు అన్నంతగా యువత, పెద్దలు అడిక్ట్ అవుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. తాజాగా తమిళ హీరో మాధవన్ కూడా ఫోన్ వాడకం గురించి ఆసక్తికర విషయాలు చెప్పడమే కాదు చక్కటి హెల్త్ టిప్స్ని కూడా పంచుకున్నారు.ఎన్నో వైవిధ్యభరితమైన మూవీలతో కుర్రకారుని ఉర్రూతలూగించిన నటుడు మాధవుడు. అమ్మాయి కలల రాకుమారుడిగా మంచి క్రేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న నటుడు. ప్రతి మూవీ అత్యంత విలక్షణంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవడమే గాక, విలన్ పాత్రలతో కూడా మెప్పించి, విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఆయన ఎప్పటికప్పుడూ ఫిట్నెస్, పోషకాహారం తదితరాల గురించి సోషల్మీడియాలో నెటిజన్లతో షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఈసారి ఒక సెమినార్లో ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి మాట్లాడారు మాధవన్. ఈ డిజటల్ పరికరాలకు అలా అంకితమైపోతే..మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడమేగాక మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒక్కసారి ఫోన్కి బ్రేక్ ఇచ్చి..మనతో మనం మమేకమైతే భావోద్వేగ పరంగా మెరుగవ్వడమే కాకుండా మంచి సంబధాలను నెరపగలుగుతామని అన్నారు. అంతేగాదు ఎప్పుడైనా.. మొబైల్ని పట్టుకోని చేతికి..వినియోగించే చేతికి తేడాని గమనించారా...? అని అడిగారు. సింపుల్గా చెప్పాలంటే మీ చేతి వేళ్లను బట్టి మీరెంతలా ఫోన్ వినియోగిస్తున్నారో చెప్పేయొచ్చని అంటున్నారు మాధవన్. వేళ్లల్లో గుంతలు కనిపిస్తున్నాయా..వేళ్ల ఎముకలు పక్కటెముకలు మాదిరిగా వంకర తిరిగి ఉన్నాయా..?.. గమనిస్తున్నారా అని ప్రశ్నించారు. అలా మారిన వేళ్లను మొబైల్ ఫోన్ ఫింగర్స్(mobile phone fingers) అంటారని, అవి మితిమీరిన ఫోన్ వాడకాన్ని చెప్పకనే చెప్పేస్తాయని అంటున్నారు. అంతేగాదు ఆ రక్తసికమైన ఫోన్ మీ శరీరం తీరుని పూర్తిగా మార్చేస్తోందని అన్నారు. అందువల్ల ఫోన్ వాడకాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం అని పిలుపునిచ్చారు నటుడు మాధవన్మొబైల్ ఫోన్ ఫింగర్స్ అంటే..చేతి వేళ్లు సహజసిద్ధంగా లేకుండా..మారిపోవడాన్ని మొబైల్ ఫోన్ వేళ్లు అంటారు. అంటే అధికంగా మొబైల్ ఫోన్ వినియోగించే వారి చేతి వేళ్లు తిమ్మిర్లు వచ్చి.. జాయింట్లు తప్పడం లేదా గ్యాప్ రావడం జరగుతుందని చెబుతున్నారు నిపుణులు. వాటినే మొబైల్ ఫింగర్స్ అటారట. ఎక్కువసేపు పోన్ని వినియోగించేవారి చేతిలో కండరాలు దృఢత్వం కోల్పోయి తిమ్మిర్లు, మణికట్టు నొప్పి వంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తరుచుగా స్క్రోలింగ్, టైప్ చేయడం, ఎక్కువసేపు పట్టుకోవడం తదితర కదలికలు వల్ల ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు నిపుణులు. దీన్ని తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు.ఎలా నిరోధించాలంటే..సాధ్యమైనంతవరకు మొబైల్ వాడకాన్ని పరిమితం చేయాలి. పనిచేయడం, వీడియోలు చూడటం, చదవటం వంటి కార్యకలాపాలకు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లను ప్రత్యామ్నాయంగా వినియోగించాలి. ఎందుకంటే ఈ పరికరాలు తగిన సెటప్ని అందిస్తాయి..పైగా చేతులు, వేళ్లపై తగిన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే వినియోగించక తప్పదు.. అనుకునేవారు..క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవడం, చేతులు సాగదీయడం లేదా రెండు చేతులతో ఫోన్ పట్టుకోవడం వంటివి చేస్తే..చేతులపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఒకరకంగా మీ కళ్ల ఆరోగ్యానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలే చేకూరుస్తుందని అన్నారు. మెదడుపై కూడా మితిమీరిన స్మార్ట్ఫోన్ వినియోగం అధిక ప్రభావం చూపిస్తుందని అన్నారు. నెమ్మదిగా ఫోన్ వాడకాన్ని తగ్గించడం వల్ల గణనీయమైన ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు నిపుణులు.నిర్ణిత వేళలో ఫోన్ రహిత సమయంగా పెట్టుకోవడం వంటివి చేయాలి. సోషల్ మీడియా వినియోగం తగ్గించడం తోపాటు యాప్ల వినియోగాన్ని తగ్గించాలి. దీనివల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: Joe Biden: సివియర్ కేన్సర్ స్టేజ్..! ఏకంగా ఎముకలకు.. ) -
Joe Biden: సివియర్ కేన్సర్ స్టేజ్..! ఏకంగా ఎముకలకు..
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)కు కేన్సర్ తీవ్రతరమైన స్థాయిలో ఉందని ఆయన కార్యాలయం వెల్లడించింది. వైద్య పరీక్షల్లో బైడెన్కు తీవ్రమైన ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అది ఎముకలకు వ్యాపించిందని చెబుతున్నారు. 82 ఏళ్ల బైడెన్ గత కొన్ని రోజులుగా మూత్ర విసర్జన సంబంధిత సమస్యలతో బాధపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా..ఈ విషయం వెల్లడైందని వైద్యులు చెబుతున్నారు. చెప్పాలంటే బైడెన్ సివియర్ కేన్సర్ స్టేజ్తో పోరాడుతున్నారు. త్రీవతరమైన దశలో ఉన్న ఈ కేన్సర్ని నిర్వహించడం సులభమేనని త్వరితగతిని ఆయన ఈ వ్యాధి నుంచి కోలుకుంటారని బైడెన్ కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే ఈ కేన్సర్ ఏవిధంగా ప్రాణాంతకంగా మారుతుందా..? ఆ కేన్సర్ కణాలు ఎముకలకు వ్యాపించడం అంటే..ప్రోస్టేట్ కేన్సర్(Prostate cancer)ని వైద్యులు మొదటగా ఏ స్థాయిలో ఉందో నిర్థారిస్తారు. ఇక్కడ బైడెన్కు 9 స్కోరుతో అత్యంత తీవ్ర స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉందని వెల్లడైంది. పైగా ఆ కేన్సర్ ఎముకల వరకు వ్యాపించిందని తెలిపారు. అదెలా జరుగుతుందంటే..ప్రోస్టేట్ కేన్సర్ పురుష పునరుత్పత్తి వ్యవస్థలో భాగమైన ప్రోస్టేట్ గ్రంథిలో ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా నెమ్మదిగా పెరుతుంది. ఒక్కోసారి శరీరంలోని ఇతర భాగాలకు అంటే..ప్రధానంగా ఎముకలకు వ్యాపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అంటే ఇక్కడ వెన్నెముక, తుంటి, పెల్విస్ వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుందట. ఈ దశని క్రిటికల్ స్టేజ్గా పేర్కొన్నారు వైద్యులు. దీనివల్ల రోగికి తీవ్రమైన నొప్పి, వెన్నుపాము కుదింపు, చలశీలతకు సంబంధించిన సమస్యలు ఉత్ఫన్నమవుతాయిని చెబుతున్నారు. అంతేగాదు ప్రోస్టేట్ కేన్సర్ ఎముక నిర్మాణాన్ని ప్రేరేపిస్తుందట. ఎముకను పెళుసుగా మార్చి విరిగిపోయేలా చేస్తుందట. అందువల్ల ఆయా బాధితులకు రాత్రిపూట ఎముక సంబంధిత నొప్పులు తీవ్రతరమవుతాయట. అందులోనూ 80 ఏళ్లు పైబడిన వారిలో, ఎముకలకు వ్యాపించే ప్రోస్టేట్ కేన్సర్ అనేది అత్యంత ప్రాణాంతకమైదిగా పేర్కొన్నారు నిపుణులు. ముందస్తుగా ఎలా గుర్తించాలంటే..బాడీ వెనుక లేదా తుంటిలో నిరంతర ఎముక నొప్పి. నాడీ సంబంధిత సమస్యలను అలక్ష్యం చేయకూడదు. బయాప్సీ ఫలితాల ఆధారంగా ప్రోస్టేట్ కేన్సర్ స్టేజ్ని నిర్థారిస్తారు.చికిత్స: హార్మోన్ థెరపీ, రేడియేషన్, కీమోథెరపీ, ఎముకలను లక్ష్యంగా చేసుకునే శస్త్రచికిత్సలతో నయం చేస్తారు. ఇంత ప్రాణాంతక స్థాయిలో ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నప్పుడూ..పూర్తినివారణ సాధ్యం కాదని చెబుతున్నారు నిపుణులు. కేవలం దాన్ని నిర్వహించగలం.. అంతే అన్నారు. ఇక్కడ రోగి జీవన నాణ్యత మెరుగుపరిచేలా చికిత్స అందిస్తారు. కేవలం ఆయా బాధితులు మూత్ర సంబంధిత సమస్యలకు, ఎముకల బలం కోసం విటమిన్ డి స్లపిమెంట్స్ వంటి వాటితో చికిత్స అందించి పరిస్థితి మెరుగుపడేలా చేయగలరే తప్ప పూర్తి స్థాయిలో ఈ సమస్య నుంచి బయటపడటం జరగదని తెలిపారు. అలాగే కొన్ని రకాల కేన్సర్లను మొదటి స్టేజ్లో ఉంటేనే పూర్తి స్థాయిలో నివారించడం సాధ్యపడుతుందని నొక్కి చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: చిన్న వయసులో చూపు కోల్పోయినా.. ప్రతిభతో జ్వలిస్తోంది..! ) -
'ఐ' లవ్ యు అండ్ ప్లీజ్ టేక్ కేర్..!
చూసే ప్రక్రియలో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు ఆ సమస్యలను వైద్యపరిభాషలో ‘విజువల్డిస్టర్బెన్సెస్’ అంటారు. అంటే... చూపులో కలిగే అంతరాయాలని అర్థం. ఇవి చాలా కారణాలతో వస్తాయి. అనేక సమస్యల వల్ల ఇలా జరుగుతుంది. ఇందులో కొన్ని తాత్కాలికమైనవి. మరికొన్ని శాశ్వతంగా చూపును పోగొట్టేవి. అయితే తాత్కాలికమైనవే ఎక్కువ. కాకపోతే కొన్ని తాత్కాలికమైన వాటిని నిర్లక్ష్యం చేస్తే అది శాశ్వత అంధత్వానికి దారితీసే ముప్పు ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలూ, చికిత్సలతో అంతా మామూలైపోయే ఈ అంతరాయాల గురించి తెలుసుకుందాం...అన్ని అవయవాల్లోకీ చూపు వల్లనే దాదాపు 80% సమాచారం మనకు తెలుస్తుంది. అందుకే సర్వేంద్రియాణాంనయనం ప్రధానమనీ, కన్నుంటేనే కలికాలమనీ... ఇలాంటి ఎన్నో సామెతలూ,జాతీయాలూ, నుడికారాలూ ఉన్నాయి. అంతటి దృష్టిజ్ఞానానికి కలిగే అవరోధాలనూ, వాటిని పరిష్కరించుకునేమార్గాలను తెలుసుకోవడం అవసరం. ఆ అవరోధాలేమిటో, వాటిని అధిగమించే మార్గాలేమిటో చూద్దాం...అంతరాయాలను గుర్తించే లక్షణాలు చూపునకు కలిగే అంతరాయాలు (దృష్టిదోషాలు) తాత్కాలికమైనవా లేదా దీర్ఘకాలికమైనవా అనేది కొన్ని సాధారణ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఆ లక్షణాలు ఎలా వ్యక్తమవుతాయంటే... ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా), ఒకే వస్తువు అనేక వస్తువులుగా కనిపించడం (పాలియోపియా), మనం చూసే వస్తువు మసగ్గా కనిపించడం (బ్లర్రింగ్ ఆఫ్ విజన్), కళ్ల ముందు నల్లటి చుక్కలు లేదా మెరుపు తీగలు తేలిపోతున్నట్టు కనిపించడం (ఫ్లాషెస్ అండ్ ఫ్లోటర్స్), మనకు కనిపించే దృశ్యం మధ్యలో నల్లమచ్చ కనిపించడం లేదా కొంత భాగం అదృశ్యమైనట్టు కనపడకుండా పోవడం జరగవచ్చు. దీన్ని వైద్యపరిభాషలో ‘స్కోటోమాస్’ అంటారు. ఫీల్స్ డిఫెక్ట్స్ : మనం చూసే ప్రాంతపు వైశాల్యమంతటా అంతా ఒకేలా కనిపించకపోవచ్చు. ఇలాంటి సమస్యలను ఫీల్డ్ డిఫెక్ట్స్ అంటారు. ఉదాహరణకు...హెమీ అనోపియా...దృశ్యంలో సగభాగం స్పష్టంగా ఉండి, మరో సగభాగం స్పష్టంగా లేకపోవడం. క్వాడ్రాంటనోపియా : మనం చూసే ప్రాంతంలో పావు భాగం స్పష్టంగా లేకపోవడం. కన్స్ట్రిక్షన్ : మనం చూసే దృశ్య వైశాల్యం రానురాను క్రమంగా తగ్గిపోవడం. టన్నెల్ విజన్ : కన్స్ట్రిక్షన్ సమస్య వచ్చాక ఒక సొరంగంలోంచి లేదా ట్యూబ్లోంచి ఎదుటి వస్తువును చూస్తున్నట్లు ఉండటాన్ని ‘టన్నెల్ విజన్’ అంటారు. కలర్డ్ హ్యాలోస్ : టన్నెల్ విజన్ కాకుండా ఒకవేళ రంగురంగుల వలయాలు ఉన్నట్లు భ్రమ కలగడమే ‘కలర్డ్ హ్యాలోస్’. లాస్ ఆఫ్ కలర్ విజన్ : ఒకవేళ కొందరిలో ఎదుటనున్న దృశ్యం రంగుల్లో గాక నలుపు–తెలుపుల్లో కనిపించడాన్ని ‘లాస్ ఆఫ్ కలర్ విజన్’గా చెబుతారు. పైన పేర్కొన్న ఈ లోపాలన్నీ రకరకాల తాత్కాలిక, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మనకు కనిపించే లక్షణాలుగా చెప్పవచ్చు.తాత్కాలిక అంతరాయాలను కలిగించే కొన్ని కంటి సమస్యలు మైగ్రేన్ : ఇది తీవ్రమైన తలనొప్పితో తాత్కాలికంగా కంటి చూపు కనిపించకుండా చేసే సమస్య. యువతలోనే ఎక్కువ. ఒకవైపు కంటిలోగాని లేదా తలలో ఒక పక్క గాని వచ్చే నొప్పి ఇది. అందుకే మామూలు వ్యక్తులు దీన్ని పార్శ్వపు నొప్పి అంటారు. ఈ నొప్పి వస్తున్నప్పుడు వికారంగా ఉండటం లేదా కొందరిలో వాంతులు కావడం జరుగుతుంది. కొందరిలో వాంతి తర్వాత పరిస్థితి చక్కబడుతుంది. మరికొందరిలో ఏదో కాంతి ఆవరించినట్లుగా కనిపిస్తుంటుంది. దీన్నే ‘విజువల్ ఆరా’ అంటారు. మరికొందరిలో ‘స్కోటోమాస్’ రూపంలో కనిపించవచ్చు. అంటే ఎదురుగా కనిపించే దృశ్యం మధ్యలో నల్లమచ్చ కనిపించడం లేదా కొంత భాగం అదృశ్యమైనట్టు కనపడకుండా పోవడం. ఇక మరికొందరిలో కళ్ల ముందు మిరిమిట్లు గొలిపే వెలుగు దివ్వెలు, మెరుపులూ కనిపించవచ్చు. చికిత్స : నొప్పిని తక్షణం తగ్గించే మందులతోపాటు... భవిష్యత్తులో ఈ తరహా తలనొప్పి రాకుండా నివారించే మందులు... ఇలా రెండు రకాల మందులను ఏడాది నుంచి రెండేళ్ల పాటు వాడాలి. ట్రామా (గాయాలు): కంటికి దెబ్బతగిలినప్పుడు తక్షణం కనిపించే లక్షణాలు, ఆ తర్వాత కనిపించే లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చు. చూపు మసకబారవచ్చు. కంటిముందు మెరుపులు కనిపించడం, వెలుగు రేకలు తేలుతున్నట్లు ఉండటం, కంటిలోని ద్రవం (విట్రియల్) బయటకు రావడం, దీర్ఘకాలంలో గ్లకోమా, రెటీనా పొరలు విడిపోవడం, కంటి నరం దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. చికిత్స : కంటికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు (ట్రామా కేసుల్లో) అత్యవసరంగా తగిన చికిత్స చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం తక్కువ. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా దీర్ఘకాలం ΄ాటు ఫాలో అప్లో ఉండాలి. పొగతాగడం వల్ల: దీని వల్ల వచ్చే తాత్కాలిక అంధత్వం (టొబాకో ఆంబ్లోపియా) అన్నది ఆ అలవాటును మానివేయడం వల్ల తగ్గిపోతుంది. రే–చీకటి (నైట్ బ్లైండ్నెస్): ఇది ఆహారంలో విటమిన్–ఏ మోతాదులు తగ్గడం వల్ల కలిగే కంటి సమస్య. మరికొందరిలో ఇది రెటీనాకు వచ్చే ఆరోగ్య సమస్యలు అంటే... రెటినైటిస్ పిగ్మెంటోజా వంటి వాటి వల్ల రావచ్చు. కొందరిలో హై మయోపియా (తీవ్రమైన దగ్గరి దృష్టి... అంటే చాలా దగ్గర్నుంచి చూస్తేగానీ స్పష్టంగా కనిపించకపోవడం) వల్ల లేదా గ్లకోమా వల్లగానీ ఈ సమస్య రావచ్చు.లక్షణాలు : ఈ సమస్య వచ్చినవారిలో రాత్రిపూట సరిగా కనిపించకపోవచ్చు. ఇక విటమిన్–ఏ లోపం తీవ్రంగా ఉన్నవారిలో కార్నియా కరిగిపోయే పరిస్థితి వస్తుంది. వైద్యపరిభాషలో దీన్నే ‘కెరటోమలేసియా’ అంటారు. ఇది పిల్లల్లో ఎక్కువ. దీన్ని అత్యవసరమైన పరిస్థితిగా గుర్తించి చికిత్స అందించాలి. చికిత్స : ఆహారంలో తగినంత విటమిన్ ఏ ఉన్న పదార్థాలు ఇవ్వడం, విటమిన్–ఏ మాత్రలు వాడటం, ముందస్తు నివారణగా (్ర΄÷ఫిలాక్టిక్ చికిత్సగా) విటమిన్–ఏ ఇస్తారు.డ్రగ్స్ : కార్టికోస్టెరాయిడ్స్, కీళ్లనొప్పుల కోసం దీర్ఘకాలం పాటు వాడే కొన్ని రకాల మందులు, క్షయవ్యాధికి వాడే కొన్ని మందుల వల్ల స్కోటోమాస్ వచ్చి క్రమంగా చూపు తగ్గుతూ పోవచ్చు. ఒక్కోసారి ఇది శాశ్వత అంధత్వానికి దారితీసే ముప్పు ఉంటుంది. అందుకే చూపు తగ్గుతున్నట్లు గ్రహించగానే డాక్టర్ను సంప్రదించి, వాడుతున్న మందులను వివరించి, తగిన చికిత్స తీసుకోవాలి. దాంతో కోల్పోయిన చూపు తిరిగి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. పక్షవాతం (స్ట్రోక్ ): పక్షవాతం వచ్చినవారిలో మెదడులోని కొన్ని భాగాలకు రక్తసరఫరా తగ్గడం వల్ల ఆ భాగాలు చచ్చుబడిపోతాయి. మెదడులో చూపునకు సంబంధించిన ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గితే తాత్కాలికంగా చూపునకు అంతరాయం కలగవచ్చు. మామూలుగానైతే ఇది తాత్కాలిక సమస్య. అయితే అతి కొద్ది సందర్భాల్లో మాత్రం ఇది శాశ్వత అంధత్వానికీ దారితీయవచ్చు. చికిత్స : ఇందులో నివారణే చికిత్సతో సమానం. డయాబెటిస్ను, రక్త΄ోటును అదుపులో ఉంచుకోవడం వల్ల ఈ ముప్పును తప్పించుకోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ : మెదడులో వచ్చే గడ్డలు... చూపును మెదడుకు చేరవేసే ‘ఆప్టిక్ నర్వ్’ను నొక్కివేయడం వల్ల గానీ లేదా కంటికీ, నరానికీ రక్తప్రసరణనిచ్చే రక్తనాళాన్ని నొక్కివేయడం వల్ల గానీ అంతరాయం కలగవచ్చు. దాంతో ఒక్కోసారి ΄ాక్షిక అంధత్వం రావచ్చు. లేదా మొత్తం దృశ్యం కాకుండా సగమే కనిపించవచ్చు. ఇలాంటప్పుడు తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ఒకవేళ గడ్డలుంటే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగింపజేసుకోవాలి. అప్పుడు చూపు చాలావరకు మళ్లీ రావచ్చు.డయాబెటిక్ రెటినోపతి : డయాబెటిస్ ఉన్నవారిలో కంటికి రక్తాన్ని అందించే అత్యంత సూక్ష్షా్మతి సూక్ష్మమైన రక్తనాళాల్లోని లోపలి ΄÷ర ఎండోథీయమ్ కణాలు మృతిచెందడం వల్ల రెటీనాకు ఆక్సిజన్, పోషకాలు సరిగా అందవు. దాంతో రెటీనా దెబ్బతినే అవకాశాలెక్కువ. ఇది చూపు కోల్పోయే పరిస్థితిని తెచ్చిపెట్టవచ్చు. లక్షణాలు : చిన్న అక్షరాలు చదవడం కష్టం కావచ్చు. క్రమంగా లేదా అకస్మాత్తుగా చూపు తగ్గవచ్చు. కళ్ల ముందు ఏవో కాంతిపుంజాలు తేలుతున్నట్లు (ఫ్లోటర్స్) కనిపించవచ్చు. చికిత్స : తక్షణ లేజర్ చికిత్సతోగానీ లేదా కంటిలో ఇచ్చే ఇంజెక్షన్లతో గాని లేదా శస్త్రచికిత్స ప్రక్రియల ద్వారాగాని చూపు మరింత దిగజారకుండా ఆపే అవకాశాలుంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా తమ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటరాక్ట్ (తెల్ల ముత్యం ): వయసు పెరుగుతున్న కొద్దీ కంటిలో ఉండే లెన్స్ తన పారదర్శకతను కోల్పోతుంది. ఫలితంగా దృష్టి మసకబారడం, ఒక వస్తువు రెండుగా కనిపించడం, చూపు సన్నగిల్లడం, రాత్రివేళ చూడటం కష్టమైపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స : అత్యంత సాధారణమైన శస్త్రచికిత్స ద్వారా కంటిలోని లెన్స్ను మార్చి మరో పారదర్శకమైన లెన్స్ అమర్చడం వల్ల మళ్లీ మామూలుగానే చూడటం సాధ్యపడుతుంది. చూపు అంతరాయాల్లో తాత్కాలికం... దీర్ఘకాలికం... వివిధ వ్యాధులు, రుగ్మతలు చూపునకు అంతరాయం కలిగించవచ్చు. అయితే అందులో కొన్ని తాత్కాలికమైనవి. చికిత్స తీసుకుంటే నయమై చూపు మామూలుగా వచ్చేస్తుంది. అయితే కొన్ని అవరోధాలు మాత్రం కాస్తంత దీర్ఘకాలిక చికిత్స అవసరమైనవి. చూపునకు కలిగే కొన్ని రకాల సమస్యలు లేదా అంతరాయాలు క్రమంగా పెరుగుతూ΄ోయి, వాటి కారణంగా దీర్ఘకాలికంగా ముప్పు కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకే వీటి విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని... గ్లకోమా : కంటిలో ఉన్న ద్రవాలు కొంత ఒత్తిడిని కలగజేస్తుంటాయి. ఈ ఒత్తిడినే ‘ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్’ అంటారు. అయితే కొందరిలో ఈ ఒత్తిడి క్రమంగా పెరిగిపోతూ ఉండటం వల్ల వారికి కనిపించే దృష్టి వైశాల్యం (ఫీల్డ్ ఆఫ్ విజన్) క్రమంగా కుంచించుకుపోతూ / తగ్గిపోతూ ఉంటుంది. ఇలా క్రమంగా తగ్గిపోవడాన్ని / కుంచించుకుపోతూ ఉండటాన్ని ‘కన్స్ట్రిక్షన్ ఆఫ్ ఫీల్డ్’ అంటారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి చికిత్స తీసుకోకపోతే అతడి చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇలా కంటిలోని ద్రవాల ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే వ్యాధిని గ్లకోమా అంటారు. లక్షణాలు : గ్లకోమా ఉన్నవారిలో చూసే వైశాల్యం (ఫీల్డ్) క్రమంగా కుదించుకుపోతుంది. ఇది ఒక్కోసారి క్రమంగా జరగవచ్చు లేదా కొందరిలో అకస్మాత్తుగానూ జరగవచ్చు. ఇక కంటిముందు నల్లమచ్చలాంటి వెలుగు, దగ్గరి వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం, లోతైన సొరంగంలోకి చూస్తున్న ఫీలింగ్ (టన్నెల్ విజన్) ఉండవచ్చు. ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అదుపులో ఉండేలా చికిత్స తీసుకోకపోతే ఈ లక్షణాలు క్రమంగా పెరుగుతూ పోయి చివరకు శాశ్వతంగా దృష్టి కోల్పోయే ముప్పు ఉంటుంది. చికిత్స : గ్లకోమాకు చికిత్స మూడు విధాలుగా జరుగుతుంది. మొదటిది మందులతో ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ను పెరగకుండా అదుపులో ఉంచడం. రెండోది లేజర్ చికిత్స. దీని తర్వాత కూడా ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అదుపులోకి రాకపోతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. హైపర్టెన్సివ్ రెటినోపతి : మన దేహంలోని అన్ని అవయవాలతో ΄ాటు కంటికీ నిత్యం రక్తప్రసరణ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే రక్త΄ోటు ఉన్నవారిలో రక్తనాళాలపై కలిగే ఒత్తిడి తీవ్రంగా పెరిగినప్పుడు అత్యంత సన్నటి రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్) ఆ ఒత్తిడికి చిట్లి΄ోయే ప్రమాదం ఉంది. ఫలితంగా చూపు కోల్పోయే ముప్పు ఉంటుంది. లక్షణాలు : చూపు మసకబారడం, ఒకవైపు సక్రమంగా కనిపించక΄ోవడం లేదా చూసే ఏరియా (వైశాల్యం) తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. చికిత్స : ఈ సమస్య వల్ల చూపు కోల్పోకుండా ఉండేందుకు రక్తపోటును అదుపులో ఉంచుకోవడమే మంచి నివారణ చర్య. ఇలాంటి సమస్య ఉన్న కొందరిలో లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. ఏఆర్ఎమ్డీ : ఇది వయసుతో పాటు వచ్చే కంటి సమస్య. ‘ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్’ అనే ఇంగ్లిష్ పదాల సంక్షిప్త రూపమే ఈ ‘ఏఆర్ఎమ్డీ’. కంటి రెటీనాలోని ‘మాక్యులా’ అని పిలిచే మధ్యభాగం తీవ్రంగా ప్రభావితమైపోవడంతో ఈ సమస్య వస్తుంది. లక్షణాలు : ఈ సమస్య ఉన్నవారిలో ‘స్కోటోమాస్’ రావచ్చు. ఇక వస్తువు – రూపం ఉన్నది ఉన్నట్లు గాక తీవ్రంగా మారి (డిస్టార్షన్) కనిపించవచ్చు. ఉన్న వస్తువు కంటే కనిపించేది చిన్నదిగా ఉంటే దాన్ని ‘మైక్రోప్సియా’ అంటారు. ఉన్న వస్తువు పరిమాణం కంటే కనిపించేది పెద్దదిగా ఉంటే దాన్ని ‘మ్యాక్రోప్సియా’ అంటారు. వస్తువు రూపం పూర్తిగా మారిపోతే దాన్ని ‘మెటామార్ఫోప్సియా’ అంటారు. చికిత్స : ఈ సమస్య ఉన్నవారికి కంటి డాక్టర్లు లేజర్ చికిత్స ద్వారాగానీ లేదా కంటిలోని విట్రియల్ ఛేంబర్ అనే ప్రాంతంలో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్లగానీ లేదా శస్త్రచికిత్సతో గాని సమస్యను మరింతగా పెరగకుండా నిలువరించేందుకు అవకాశాలెక్కువ. కెరటోకోనస్ వ్యాధి : సాధారణంగా గమనించి చూస్తే మన కంటి నల్ల గుడ్డు ప్రాంతం ఒకింత ఉబ్బెత్తుగా కనిపిస్తూ గుండ్రం (స్ఫెరికల్)గా ఉంటుంది. కానీ కెరటోకోనస్ అనే కండిషన్ ఉన్నవారిలో ఈ ఉబ్బెత్తుగా ఉండేభాగం కోణం (కోన్) ఆకృతిని సంతరించుకుంటుంది. ఈ కండిషన్నే ‘కెరటోకోనస్’ అంటారు. లక్షణాలు : ఈ కండిషన్ ఉన్నవారు సౌకర్యంగా చూడలేరు. అంతా మసగ్గా కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు తాము చూసే దృశ్యం కదిలిపోతున్నట్లు, వణుకుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. చికిత్స : కాంటాక్ట్లెన్స్లతో చికిత్స చేయవచ్చు. ‘కొలాజెన్ క్రాస్ లింకింగ్’ ప్రక్రియ అవసరపడవచ్చు.‘కెరటోప్లాస్టీ’ అనే చికిత్స చేయాల్సి రావచ్చు. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ (దృష్టిలోపాలు) : సరైన అద్దాలు వాడటం ద్వారా తరహా కంటి సమస్యలను అధిగమించవచ్చు. వీటినే రిఫ్రాక్టివ్ లోపాలు అంటారు. కొందరికి చాలా దగ్గరి నుంచి చూస్తేగాని వస్తువులు స్పష్టంగా కనిపించవు. దీన్నే ‘మయోపియా’ లేదా ‘నియర్సైటెడ్నెస్’ అంటారు. ఇక కొందరు ఆ వస్తువులను మరింత దూరంగా ఉంటే తప్ప స్పష్టంగా చూడలేరు. ఈ కండిషన్ను ‘హైపరోపియా’ లేదా ‘ఫార్సైటెడ్నెస్’ అంటారు. ఇక కొందరిలో గ్రాఫ్లో ఉన్న అడ్డు, నిలువు రేఖలు ఒకేసారి కనిపించవు. ఈ సమస్యను ‘ఆస్టిగ్మాటిజమ్’ అంటారు. సరిదిద్దడమిలా : ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ను తగిన అద్దాలను ఉపయోగించి సరిచేయవచ్చు. కేవలం ఈ అద్దాలతోనే వాళ్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. కాబట్టి దీని గురించి అంతగా ఆందోళన అవసరం లేదు. అలాగని చికిత్స తీసుకోకుండా ఉన్నా, తగిన అద్దాలు వాడకపోయినా సమస్య మరింత తీవ్రం కావచ్చు. మెల్లకన్ను : ఇంగ్లిష్లో ‘స్క్వింట్’ అనే ఈ కండిషన్ను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఈ కండిషన్లో కుడి, ఎడమ కనుగుడ్లలో ఏదో ఒకటి లోపలివైపునకో, బయటికో చూస్తుంటుంది. సాధారణంగా మెల్లకన్ను ఉన్నవారికి ఒకే వస్తువు రెండుగా కనిపించడం, మసకగా కనిపించడం, తలనొప్పి, వాంతులు ఉండవచ్చు. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కొందరు దీన్ని అదృష్టంగా కూడా పరిగణిస్తుంటారు. కానీ దీర్ఘకాలంలో చూపు పూర్తిగా పోయే ముప్పు కూడా ఉంటుంది. చికిత్స : మెల్లకన్నుకు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఇవే కాకుండా... డబుల్ విజన్, ఫ్లాషెస్, స్కోటోమాస్, హాఫ్ ఫీల్డ్ లాస్, ప్రాప్టోసిస్, రంగుల వలయాల వంటివి కనిపిస్తే వీలైనంత త్వరగా కంటి వైద్య నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాల్సిందే. లేకపోతే చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. (చదవండి: -
ఐ డ్రాప్స్, ఇన్హేలర్లు ఎక్కువగా వాడుతున్నారా..! నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా కన్ను ఎర్రబారిన, దురదపుడుతున్నా..డాక్టర్ని సంప్రదించకుండానే ఐడ్రాప్స్ తెచ్చుకుని వేసేసుకుంటాం. అలాగే కాస్త ముక్కుదిబ్బడగా ఉన్న వెంటనే నాసల్ ఇన్హేలర్లను వాడేస్తాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణ రిలీఫ్ కోసం తరుచుగా వీటిని వాడేస్తుంటాం. ఇలా అస్సలు చేయొద్దని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే ఆ సమస్య తప్పదని చెబుతున్నారు.ఢిల్లీలోని ఎయిమ్స్లో పదేళ్ల వయసున్న పిల్లలు గ్లాకోమా( Glaucoma)తో బాధపడుతున్న కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇలా ఎందుకు జరగుతుందని వైద్యులు క్షణ్ణంగా పరిశీలించగా..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్దిపాటి అలెర్జీలకైనా వెంటనే స్టెరాయిడ్ ఆధారిత కంటి చుక్కలను వాడుస్తుండటమే దీనికి కారణమని పరిశోధనలో తేలింది. ఎయిమ్స్లో నమోదైన దాదాపు చాలా కేసులు ఇలాంటి కోవకు చెందినవేనని వైద్యులు చెబుతున్నారు. ఇలా వైద్యుడిని సంప్రదించకుండా పదేపదే ఐ డ్రాప్స్ ఉపయోగిస్తే గ్లాకోమా బారినపడి అంధత్వంతో బాధపడతారని చెబుతున్నారు. ఇలా స్టైరాయిడ్ ఆధారిత కంటి చుక్కలు, ఇన్హేలర్లు లేదా స్టెరాయిడ్లను మాత్రలు లేదా ఇంజెక్షన్ రూపంలో ఉపయోగిస్తే..అవి కంటిలోపల ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు. ఫలితంగా కంటి లోపలి ఆప్టిక్ నరాలు దెబ్బతినడానికి దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కండ్లకలక కోసం ఈ ఐడ్రాప్స్ వినియోగించి గ్లాకోమా బారిన పడిన కేసులు రాజస్థాన్, హర్యానా వంటి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా నమోదయ్యాయని తెలిపారు వైద్యులు. అదీగాక ఈ గ్లాకోమా లక్షణాలను ప్రారంభంలో గుర్తించకుండా చివరిదశలో రావడంతో చాలామంది పిల్లలు అంధత్వం బారినపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే చాలామంది గ్లాకోమా రోగుల్లో ఇన్హేలర్ వాడకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పిల్లల్లో అంతగా కనబడని ఈవ్యాధి..స్టెరాయిడ్ ఆధారిత ఐడ్రాప్స్, ఇన్హేలర్లు వాడటం వల్లనే అని పరిశోధనలో తేలింది. సాధారణంగా వయోజన గ్లాకోమా 40 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందుతుందట. ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా ఈ వ్యాధి బారినపడిన చరిత్ర, డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బులు, కంటి గాయం తదితరాల వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే అథ్లెట్లు చర్మ సంబంధమైన స్టెరాయిడ్ క్రీమ్లు, కండరాల నిర్మాణానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్లను వాడొద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇవి గ్లాకోమాకు దారితీస్తాయని అంటున్నారు. అంతేగాదు ముఖం మీద, కళ్ల చుట్టూ స్టెరాయిడ్లు ఉన్న క్రీములు వినియోగిస్తే..గ్లాకోమాకు దారితీయవచ్చని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ ఆధారిత కంటి చుక్కలు, క్రీమ్లు వినియోగిచొద్దని నొక్కి చెప్పారు. ఇక కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుదల కూడా కంటిలోపలి ఒత్తిడిని పెంచుతుందని, ఇది కంటిలోపలి రక్తపోటుకు దారితీస్తుందని అన్నారు. ఏదైనా కారణం చేత ఆరు వారాలకు పైగా స్టెరాయిడ్లు తీసుకునే రోగులు తప్పనిసరిగా వైద్యులు చేత గ్లాకోమా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. గ్లాకోమా అనేది లక్షణాలు లేకుండా మన కను దృష్టిని అదృశ్యం చేసే వ్యాధి. అందువల్ల క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అత్యంత కీలకం. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారికి లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా గ్లాకోమా వ్యాది వచ్చిన చరిత్ర ఉన్న వారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువని వెల్లడించారు. అంతేగాదు చాలామందికి తమకు గ్లాకోమా ఉందని తెలియదట. ప్రాథమిక స్థాయిలోనే దీన్ని గుర్తించేలా.. కంటి స్క్రీనింగ్పరీక్షలు అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. దీన్ని ముందుగానే గుర్తిస్తేనే అంధత్వం బారినపడకుండా ఉండగలమని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: 'అంధురాలైన అమ్మమ్మ సాధించిన విజయం'..! పోస్ట్ వైరల్ ) -
భారతీయ వంటకాలు అమోఘం..! విదేశీ జంట ప్రశంసల జల్లు
భారతదేశంలోని పలు ప్రదేశాలు..వాతావరణం తదితరాలను ఎందరో విదేశీయలు మెచ్చుకున్నారు. ఇక్కడ సాంస్కృతి సంప్రదాయాలు ఎంతగానో నచ్చాయని ఇక్కడే నా పిల్లలను పెంచుతానని ఒక విదేశీ తల్లి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఇవన్నీ మరువక ముందే ఇప్పుడు మరో విదేశీ జంట ఇక్కడ వంటకాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారతీయులు వంటకాలు వండే పద్ధతి గురించి ఏం చెబుతున్నారో ఆ జంట మాటల్లోనే విందామా..భారతీయు రోజువారీ వంటల్లో ఆకుపచ్చని పదార్థాలను విరివిగా వినియోగిస్తారని అన్నారు. ఇక్కడ పచ్చిగా ఉన్నవాటిని చక్కగా పచ్చళ్లు పట్టేస్తారు లేదా ఘుమ ఘుమలాడే కూరల్లా మార్చేస్తారు. అదే పండిన వాటిని పండ్లు మాదిరిగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. పండని కూరగాయలు, పండ్లతో చేసే వంటకాలని అసాధారణ ఆవిష్కరణలుగా అభివర్ణించారు. ముఖ్యంగా ఆకుపచ్చని మామిడిపండ్లతో పట్టే ఊరగాయ, పనపండుతో చేసే వంటకాలు అమోఘం అని ప్రశంసించారు. భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు. వాళ్ల చేతిమహిమతో అద్భుతమైన రుచిగా మార్చేస్తారు. పువ్వులను పకోడాలుగా మార్చేయడంలో వారి పాక నైపుణ్యం ఊహకందనిదని అన్నారు. పచ్చిగా ఉండే సబ్జీలో ఉడికించి తినడం మరింత అద్భుతమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోకి 'భారతదేశంలో తినడానికి ఏది పచ్చిగా ఉండదు' అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. అయితే నెటిజన్లు..భారతీయులుగా మేము చాలా వాటిని పచ్చిగా తింటున్నామనే విషయాన్ని గమనించలేదు. అయినా మా ఆహార సంస్కృతి ప్రాంతాల వారీగా మారుతుందని అది కూడా తెలుసుకోండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Life in India with Guru and Lila (@guru_laila) (చదవండి: గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ'..! ధర ఎంతంటే.. ) -
అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్బర్డ్స్ వీడియో వైరల్
బాల్య ప్రేమికులు,గత ఏడాది జూలైలో వివాహం బంధంలోకి అడుగపెట్టిన లవ్బర్డ్స్ అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ షాపింగ్లో సందడిగా కనిపించారు. జియో ప్లాజాలో భార్య రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ ఆదివారం షాపింగ్ చేయడం సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. అంబానీ అప్డేట్ పేజీ ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.అనంత్ , రాధిక జియో వరల్డ్ ప్లాజా ప్రాంగణంలో షాపింగ్ చేశశారు. జియో వరల్డ్ ప్లాజాలోని భద్రతా సిబ్బంది వెంటరాగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి అయ్యి దాదాపు ఏడాది కావస్తున్నా కొత్తజంటలా జియో షాపింగ్ మాల్లో సందడి చేశారు. అనంత్ కాల్లో బిజీగా ఉండగా, రాధిక చేయి పట్టుకుని ఉల్లాసంగా నడుస్తు, విలాసంగా కనిపించింది. అనంత్ నేవీ బ్లూ షర్ట్, త్రీ-ఫోర్త్స్ బ్లాక్ షార్ట్స్, బ్లాక్ సాక్స్, బ్లూ షూస్ ధరించాడు. ఇక అంబానీ చోటీ బహూ ఎప్పటిలాగానే తన సింపుల్ స్టైల్ను చాటుకుంది. రాధిక తెల్లటి స్లీవ్లెస్ క్రాప్ టాప్ ధరించి, గిరిజాలజుట్టును అలా వదిలేసి సైడ్ బ్యాగ్ వేసుకుని చాలా క్యాజువల్ స్టైల్లో కనిపించింది.అయితే జంట దేని కోసం షాపింగ్ చేశారో స్పష్టంగా తెలియదు. ఫ్యాన్స్కి మాత్రం అనంత్-రాధిక షాపింగ్ వీడియో తెగ నచ్చేసింది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ తన చిన్ని నాటి స్నేహితురాలు రాధిక మర్చంట్ను గత ఏడాది జైలూ12న పెళ్లాడాడు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో వివాహ వేడుకలు జరిగాయి. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బిలియనీర్లు హాజరైన సంగతి తెలిసిందే. -
ఆ ఫుడ్..నాట్ గుడ్..!
ఉరుకుల పరుగుల జీవనయానంలో ప్రజల జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఆహారపు అలవాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. సామాజిక స్థాయిలు మారాయి. నగరాలు, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కిట్టీ పార్టీ కల్చర్ వచ్చింది. బర్త్డేలు, మ్యారేజ్ డేలు, నిశ్చితార్థాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు.. సందర్భం ఏదైనా స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి హోటళ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఆ ఆహారమే అనారోగ్యమని గుర్తించలేపోతున్నారు. మురికి కాలువ గట్ల మీద ఉండే చిన్నపాటి తినుబండారాల తోపుడుబండి నుంచి పెద్దపెద్ద భవనాల్లో ఉండే ఖరీదైన హోటళ్ల వరకు అన్ని వేళలా ఆహార ప్రియులతో కిటకిటలాడుతుంటాయి. శుభకార్యాల నుంచి అశుభకార్యాల వరకు అన్ని సందర్భాల్లోనూ వడ్డించే ఫుడ్ కోసం హోటల్స్కు ఆర్డర్లు ఇస్తున్నారు. ఇంటి భోజనం కంటే హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, బేకరీ ఫుడ్కు బాగా ప్రాధాన్యత పెరిగింది. అయితే ఇక్కడ తయారయ్యే ఆహారాలు, నిల్వ ఉన్న పదార్థాలు, పలు రసాయనాలతో చేసినవి కావడంతో ఆ వంటకాలు తిని పలువురు రోగాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ రోగుల్లో 53 «శాతం మంది హోటల్స్ ఆహారంతోనే సమస్య తెచ్చుకుంటున్నారని పలు సర్వేలు వెల్లడించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఆహారాల్లో ప్రమాదకర రసాయనాలు హోటళ్లల్లో ఆహారాలు కలర్ ఫుల్, రుచికరంగా ఉండేందుకు ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తుండడంతో అనేక రోగాలకు కారణమవుతున్నాయి. మెటానియల్ ఎల్లో వాడకం నిషేధించినప్పటికీ చాలా హోటళ్లలో వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై వెంటనే దుష్ప్రభావం చూపించదు. నెమ్మదిగా క్యాన్సర్కు కారకమవుతోంది. చిన్నారుల్లో నిద్రలేమి, నరాల సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. వంటకాల్లో రంగు కోసం వాడే నిషేధిత టార్ట్రాజిన్ చాలా ప్రమాదకరం. దీంతో మానసిక వ్యాధితోపాటు థైరాయిడ్, క్యాన్సర్, ఎలర్జీ, దద్దుర్లు, తామర, రక్తకణ జాలంలో హానికర కణ జాలల వృద్ధి చెందడం, డీఎన్ఏ నష్టపోవడం, నిద్రలేమి, నీరసం వస్తాయి. స్వీట్లు, బిస్కెట్లలో ఆరెంజ్ రంగు కోసం వాడే సన్సెటన్, పసుపు రంగు కోసం వాడే కాటారజ్, గ్రీన్ కలర్ కోసం వాడే బ్రిలియంట్ బ్లూ, టారా్ట్రాజీన్లు ప్రమాదకరమే. చాకెట్లలో వాడే రోడ్మన్–బీ కూడా ప్రాణాంతకమే. అయినా చాక్లెట్లు, చిన్న పిల్లలు తినే రంగుల ఆహార పదార్థాల్లో వీటిని వినియోగిస్తున్నారు. పార్టీ కల్చర్.. ప్రమాదకరం కొన్నేళ్ల క్రితం వరకు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లినా.. సమయానికి ఇంటికి రాలేని పరిస్థితుల్లో కొందరు హోటళ్లలో తినేవారు. కొందరైతే ఎంత సమయమైనా ఇంటికి వచ్చే భోజనం చేసేవారు. ఇప్పుడు కల్చర్ మారింది. సామాజిక నడతలో మార్పు వచ్చింది. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కల్చర్ వచ్చింది. నలుగురు స్నేహితులు కలిస్తేనే కాదు.. వీకెండ్ ఫ్యామిలీస్తో కలిసి లంచ్, డిన్నర్ బయటే చేస్తున్నారు. ఖరీదైన ఆహారం తింటున్నామనే భ్రమలో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రహించలేకపోతున్నారు. నిల్వ ఉంచిన ఆహారం, ప్రమాదకర రసాయనాలు కలిపిన ఆహారాలతో అప్పటికప్పుడు నష్టం లేకపోయినా దీర్ఘకాలంలో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.నిబంధనలు బేఖాతర్ జిల్లాలో చిన్నా, పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలు, చాట్ బండార్లు, నూడిల్స్ షాపులు, అన్ని కలుపుకుని 5 వేలకు పైగా ఉంటాయి. ఒక్క నగరంలోనే 3 వందల వరకు హోటల్స్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి హోటల్స్ యజమానులు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది. ఆ శాఖ నిబంధనల మేరకు ఆహారం తయారు చేయాలి. ఈ చట్టం 2006 నుంచి అమల్లో ఉంది. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితోపాటు ఓ గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరు నెలకు 12 శాంపిల్స్ సేకరించాలి. శాంపిల్స్ను ప్రయోగశాలకు పంపి, పరిశీలన తర్వాత అవి ప్రమాణాల మేరకు లేకపోతే కేసులు నమోదు చేయాల్సి ఉంది. కల్తీని బట్టి క్రిమినల్ లేదా సివిల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించే వీలుంది. కానీ ఇవి జరగడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని తమ వద్దకు ఎవరూ రారన్న ధీమాతో వ్యాపారులు చెలరేగిపోతున్నారు. విచ్చలవిడిగా ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు.నాసిరకం.. రంగుల మయం హోటళ్లల్లో తయారయ్యే ఆహార పదార్థాలు నాసిరకం.. రంగుల మయంగా ఉంటాయి. పశువుల ఎముకలను సేకరించి వాటిని బట్టీలో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీస్తున్నారు. ఆ ద్రావణాన్ని సాధారణ నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీని వల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మిరప కాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్ రంగులు వాడుతుంటారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారాన్ని వండే సమయంలో వాడిన నూనెనే మళ్లీ మళ్లీ కాచి వినియోగిస్తున్నారు. దీని వల్ల క్యాన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాద మున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చికెన్, మటన్ బిర్యానీలు, తందూరిలో ఆకట్టుకునేందుకు ఎక్కువగా హానికరమైన రంగులను వాడుతున్నారు. అనారోగ్యానికి గురైన, ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతోపాటు అనారోగ్యానికి గురైన వాటిని వధించి వినియోగదారులకు విక్రయిస్తున్నారు.చిన్న చిన్న హోటళ్లు, కర్రీస్ పాయింట్లలో వేడి వేడి కూరలు, పప్పు, సాంబారు వంటి ఆహార పదార్థాలు పల్చటి పాలిథిన్ కవర్లలో వేసి ఇస్తున్నారు. పదార్థాల వేడికి ప్లాస్టిక్ కరిగి వాటిని తినే వారికి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. ∙నిషేధిత క్యాట్ ఫిష్లను సైతం కొర్రమీనుగా విక్రయిస్తున్నారు. జిల్లాలో వీటిని చికెన్, మటన్ వ్యర్థాలతో గుంతల్లో పెంచుతున్నారు.అల్లం, వెల్లుల్లి పేస్టులను సైతం కల్తీ చేస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉండడంతో అందులో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పేస్ట్ను కలుపుతున్నారు.నిత్యం తనిఖీలు చేస్తున్నాంహోటల్స్, ఐస్క్రీం పార్లర్లు, రెస్టారెంట్లు, పండ్ల దుకాణాలను నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నాం. పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలా వరకు కాలం చెల్లినవి, ఉంటున్నాయి. 2024–25లో పలు హోటల్స్ను తనిఖీ చేసి 296 శ్యాంపిల్స్ను సేకరించగా 20 శాంపిల్స్లో నాణ్యత తక్కువగా ఉన్నట్లు, 18 శాంపిల్స్ ప్యాకెట్స్పై వివరాలు లేకుండా ఉన్నట్లు గుర్తించాం.– వెంకటేశ్వరరావు, జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ కల్తీ వల్ల ఆరోగ్య సమస్యలుకల్తీ ఆహారం తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కల్తీ వల్ల జీవనక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీలైనంత వరకు బయట ఫుడ్కు స్వస్తి చెప్పి ఇంటి ఆహారాన్ని తీసుకోవడం శ్రేయస్కరం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. – డాక్టర్ ఎంవీ రమణయ్య, రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల(చదవండి: ప్లీజ్..నో సప్లిమెంట్స్..! ) -
మెరిసిన చేనేత.. మురిసిన భామలు
పోచంపల్లి ఇక్కత్ చీరలు, ఇక్కత్ వస్త్రాలు, విశ్వవ్యాప్తంగా తరలివచ్చిన సుందరాంగుల మనసు దోచుకున్నాయి. చేనేత కళాకారుల వస్త్ర డిజైన్లను చూసి వారు ముగ్ధులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రపంచ సిల్క్ సిటీ భూదాన్ పోచంపల్లిలో.. ప్రపంచ సుందరీమణుల పోటీదారుల పర్యటనలో అడుగడుగునా చేనేత వస్త్ర కళా వైభవం కళ్లకు కట్టింది. చేనేత చీరలు, వస్త్రాలను చూసి విదేశీ వనితలు మురిసిపోయారు. ఈ సందర్భంగా కొన్ని వస్త్రాలను ధరించి ఇక్కత్ చీరల తయారీ ప్రక్రియ, డిజైన్ల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి మరోసారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. తెలంగాణ పర్యాటక శాఖ.. చేనేతను మరింత ప్రచారంలోకి తీసుకురావడంలో విజయవంతమైంది.అందగత్తెలతో ప్రపంచం దృష్టికి..పోచంపల్లిలో అందాల భామల పర్యటనతో చేనేత, ఇక్కత్ వస్త్రాలు ప్రపంచానికి మరోసారి పరిచయమైనట్లయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చేనేత కళాకారుల ప్రతిభకు గుర్తింపు దక్కేలా ప్రభుత్వం కృషి చేసింది. పోచంపల్లికి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు.. పోచంపల్లి చీరల తయారీ, డిజైన్, అద్దకం ఇక్కత్ వస్త్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క చీర తయారీకి కళాకారులు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత.. పోటీదారుల మనస్సును హత్తుకున్నాయి. చీరలపై భిన్న డిజైన్లను తిలకించిన అందగత్తెలు పరవశించిపోయారు. రంగు రంగుల డిజైన్లతో ఉన్న ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరలు, శాలువాలు, డ్రెస్ మెటీరియల్, కాటన్, పట్టు చీరలను చేతితో తడిమి మరీ చూశారు. పోచంపల్లి, వెంకటగిరి ,గొల్లభామ, నారాయణపేట చీరలు, వస్త్రాల ప్రదర్శన సుందరీమణులను ఆకట్టుకుంది.ర్యాంప్ వాక్తో మెరుగులు దిద్ది..అందగత్తెలకే అసూయ పుట్టేలా నిర్వహించిన ఫ్యాషన్ షో.. పోచంపల్లి సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ అందగత్తెలే అచ్చెరువొందేలా హైదరాబాద్, ఢిల్లీకి చెందిన భారతీయ మోడల్స్.. ఇక్కత్ చీరలు, వస్త్రాల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది. సంప్రదాయం, ఆధునికత ఉట్టిపడేలా రూపొందించిన డిజైన్లు ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో యువతీ యువకులు ప్రపంచానికి ఆధునికత జోడించిన చేనేత దుస్తులను పరిచయం చేశారు. ర్యాంప్వాక్ అదుర్స్ర్యాంప్వాక్లో చేనేత డిజైన్లతో మోడల్స్ ధరించిన దుస్తులను..ప్రపంచ అందగత్తెలు కళ్లార్పకుండా చూ స్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు. ప్రపంచ సుందరీమణులు, స్థానిక మోడల్స్ ధరించిన చేనేత వస్త్రాలతో వేదిక చేనేతను విశ్వవ్యాప్తం చేసింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పోచంపల్లి టైఅండ్డై ఇక్కత్ చేనేత కళారంగం ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. 1956లో పోచంపల్లిలో పట్టు పరిశ్రమకు బీజం పడింది. మొదటిసారిగా పోచంపల్లికి చెందిన కర్నాటి అనంతరాములు, తడక పెద్దయాదగిరిలు నిలువు, పేక పద్ధతిలో సహజరంగులతో పట్టు చీరలను నేశారు. నాటి నుంచి ఎందరో చేనేత కళాకారులు ప్రయోగాలు చేస్తూ నూతన డిజైన్లు సృష్టిస్తూ చేనేత కళను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ప్రపంచాధినేతల ఆకట్టుకునేలా ఇక్కత్ వస్త్రాలుపోచంపల్లి ఇక్కత్ కళ ప్రపంచ వ్యాప్తమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగ్గేట్టే మెక్రాన్కు.. ఇక్కడి నేతన్నలు నేసిన ఇక్కత్ చీరను బహూకరించారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ పర్యాటక సంస్థ.. 2021లో పోచంపల్లికి ‘అంతర్జాతీయ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు’ బహూకరించడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చేనేత కుటీర పరిశ్రమ ద్వారా సంప్రదాయ వృత్తి, వారసత్వ సంపదను కాపాడుకుంటూనే పలువురు ఉపా«ధి పొందుతున్నందుకు ఈ గుర్తింపు ఇచ్చారు. పోచంపల్లి వస్త్రాలు తప్పనిసరి.. దేశ, విదేశాల్లో జరిగే అంతర్జాతీయ సదస్సుల్లో అతిథులకు పోచంపల్లి శాలువాను కప్పడం సంప్రదాయంగా మారింది. ఇక్కత్ చేనేత వస్త్రాలను సిల్క్, కాటన్, సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కార్ప్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టెన్లు, పిల్లో కవర్లు తదితర వెరైటీలు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్, అమెరికాలకు వెళ్తున్నాయి. ముస్లిం దేశాలలో మహిళలు ముఖానికి ధరించే స్కార్ఫ్కు మంచి డిమాండ్ ఉంది. ఇక అపెరల్ ఫ్యాబ్రిక్, హోమ్ ఫర్నిషింగ్, డ్రెస్ మెటీరియల్స్ను యూరప్ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.పేటెంట్ హక్కులతో ముందుకు..పోచంపల్లి వస్త్రాలకు మొట్టమొదటిసారిగా 2003లో కేంద్ర ప్రభుత్వం జియొగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ (పేటెంట్) సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక్కత్ కళ దేశంలో మరెక్కడా లేదు. మారుతున్న కాలానుగుణంగా ఇక్కడి చేనేత కళాకారులు పోచంపల్లి ఇక్కత్ డిజైన్లలో గద్వాల, కంచి, ధర్మవరంతో పాటు కొత్త కొత్త డిజైన్లు వచ్చేలా వినూత్న ప్రయోగాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. కాగా పేటెంట్ హక్కులు పొందినప్పటికీ.. నకిలీ వస్త్రాల తయారీ చేనేత వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇక్కత్ యూనివర్సల్ బ్రాండ్ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పోచంపల్లి టై అండ్ డైలోనే ఇక్కత్ ఉంది. ఇక్కత్ అనేది ఒక యూనివర్సల్ బ్రాండ్. చేనేత చీరలు పూర్తిగా చేతితో మగ్గంపై ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సంప్రదాయ కళ. నూలు ఉడకబెట్టడం, రంగుల అద్దకం వంటి చేతి వృత్తి. ఎంతో మంది మహిళలు ఇక్కత్ చీరల పనితో జీవనోపాధి పొందుతున్నారు. పోచంపల్లి చీరల డిజైన్ కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయి. – ఎం.హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లాచేనేతకు ప్రభుత్వం చేయూత తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ సుందరీమణుల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అందాల భామలు పోచంపల్లి చీరలు, వస్త్రాలకు ముగ్ధులయ్యారు. ప్రపంచ పటంలో పోచంపల్లి కళాకారులు రూపొందించిన వస్త్రం సంపద వెల కట్టలేనిది. సీఎం రేవంత్ అధ్వర్యంలోని ప్రభుత్వం చేనేతకు చేయూత నిస్తోంది. – కుంభం అనిల్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి(చదవండి: మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా! ) -
హైబీపీని అదుపులో ఉంచుకుందాం ఇలా..!
హైబీపీ అనేది జీవనశైలికి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య. ఇది ఒకసారి కనిపించాక ఇక దాదాపు బాధితుల జీవితకాలమంతా హైబీపీ వాళ్ల జీవనాన్నీ, అలవాట్లను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా నార్మల్గా 120 / 80 ఉండాల్సిన బీపీ కొలత అంతకంటే ఎక్కువగా ఉండటాన్ని హైబీపీ లేదా హైపర్టెన్షన్గా చెబుతారు.హైబీపీ ప్రధానంగా జన్యు కారణాల వల్లనే వస్తుంది. అయితే వాళ్ల జీవనశైలిలో భాగంగా వాళ్లు తీసుకునే ఆహారం, దేహానికి దొరికే వ్యాయామం అలాగే వాళ్లు అనుభవించే ఒత్తిడి... ఇవన్నీ హైబీపీ వచ్చేందుకు కారణమవుతుంటాయి. నివారణ ఇలా... ఆరోగ్యకరమైన జీవనశైలితో హైబీపీని చాలావరకు నివారించవచ్చు. అదెలాగో చూద్దాం. ఆహార పరంగా: ఆహారంలో సోడియమ్ మోతాదులు ఎక్కువగా తీసుకోవడం నేరుగా బీపీని పెంచుతుంది. అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఆహారాలు, క్యాన్డ్ ఫుడ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే శ్నాక్స్ వంటివి తగ్గించాలి. పొటాషియమ్ ఉండే ఆహారాలతో బీపీ నియంత్రణలో ఉంటుంది. అందుకే పొటాషియమ్ మోతాదులు ఎక్కువగా ఉండే అరటిపండ్లు, చిలగడదుంపలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆహారంతో హైబీపీని నియంత్రించడాన్ని ‘డయటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్టెన్షన్’గా చెబుతారు. ఇందులోని మొదటి అక్షరాలను తీసుకుని సంక్షిప్తంగా ఈ పద్ధతిని ‘డ్యాష్’గా పేర్కొంటారు. డ్యాష్ ఆహారాల్లో భాగంగా తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లతో హైబీపీని నియంత్రించవచ్చు. వ్యాయామం ఇలా... ప్రతివారం కనీసం 150 నిమిషాలకు తగ్గకుండా ఏదో ఒక వ్యాయామం చేస్తుండటం మంచిది. మానసిక ఒత్తిడి... దీర్ఘకాలిక ఒత్తిడి హైబీపీకి కారణమవుతుంది. అందుకే ఒత్తిడిని అదుపు చేసేందుకు యోగా, ధ్యానం, శ్వాసవ్యాయామాల వంటి ప్రక్రియలు అనుసరించడం మేలు. మద్యం, పొగతాగడానికి దూరంగా... మద్యం, పొగతాగే అలవాట్లు హైబీపీని మరింత ప్రేరేపిస్తాయి. అందుకే ఆ అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. అంతేకాదు... పొగతాగని వారితో పోలిస్తే పొగతాగేవారిలో... రక్తనాళాల్ని పెళుసుగా మార్చే ‘అథెరో స్కిప్లోరోసిస్’ అనే సమస్య 10 ఏళ్ల ముందుగా వస్తుందని అనేక అధ్యయనాల్లో తేలింది. మరికొన్ని ఇతర సూచనలు...స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి. దాంతో బీపీ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. ∙రోజూ కనీసం 7 – 9 గంటలు కంటినిండా నిద్రపోవాలి. ఇక క్రమం తప్పకుండా బీపీ పరీక్షించుకుంటూ ఉంటూ దాన్ని బట్టి జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. ∙హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా డాక్టర్ సూచించిన మోతాదులో మందులు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్కు చెప్పకుండా మానేయడం సరికాదు. చివరగా... బీపీ రీడింగ్ను క్రమం తప్పకుండా ఖచ్చితమైన రీతిలో చూసుకుంటూ, దాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా సుదీర్ఘకాలం పాటు మామూలుగానే జీవించడం సాధ్యమవుతుంది. డాక్టర్ అంజని ద్వారంపూడికన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ (చదవండి: ప్లీజ్..నో సప్లిమెంట్స్..! మై ప్లేట్ ఫర్ ది డే మెనూ..)∙ -
కొత్త 'అమ్మ'లూ.. కొన్ని సమస్యలు!
ఓ మహిళ తల్లి అయ్యాక ఆ మాతృమూర్తి ఎదుర్కొనే సమస్యలు ఎన్నెన్నో. ఓ తల్లి ఎదుర్కొనే సాధారణ సమస్యలూ, వాటికి సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ... ఇవి ఆ తల్లులకు ఉపయోగపడతాయని ఆశిస్తూ... ఓ తల్లి అమ్మగా మారాక బిడ్డ పాలు తాగకపోయినా లేదా పాలు తాగాక ఆ చిన్నారికి విరేచనాలవుతున్నా, బిడ్డకు కడుపునొప్పి వచ్చినా... ఇలా ఏం జరిగినా తల్లికి ఆందోళనే. తల్లులు ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలనూ, సమాధానాల్నీ చూద్దాం. పాలు సరిగా పడుతున్నామా అనే సందేహమా? కొత్తగా తల్లిగా మారిన మహిళల్లో చాలామందికి తాము సరిగానే ΄ాలుపడుతున్నామా లేదా అనే సందేహం వస్తుంటుంది. ఒక రొమ్ము ఫీడ్ చేస్తున్నప్పుడు దానిలో ΄ాలు అయిపోయేవరకు బిడ్డ తాగుతున్నాడా అని డౌటొస్తుంటుంది. రొమ్ము మార్చడమెప్పుడో తెలియక కంగారొస్తుంటుంది. ఇలాంటి సందేహాలకు కొన్ని సూచనలివి... సాధారణంగా పిల్లలు పాలు తాగే ప్రక్రియ 10–15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలు పాలుతాగడానికి అలవాటు పడటానికి కాస్త టైమ్ పట్టవచ్చు. చాలామంది పిల్లలు ఒక పక్క పాలు తాగి సంతృప్తిపడతారు. కానీ కొందరు ఒక పక్క తాగి మళ్లీ మరో పక్క కూడా తాగుతారు. పాలు పట్టేటప్పుడు చివరలో వచ్చేవాటిని హైండ్ మిల్క్ అంటారు. ఈ పాలలో ఎక్కువ క్యాలరీస్ ఉండి, బిడ్డ బరువును పెంచడానికి ఎక్కువగా సహాయపడతాయి. బిడ్డ మామూలుగా రోజుకు ఐదారుసార్లు మూత్ర విసర్జన చేస్తూ, బరువు పెరుగుతుంటే ఆ బిడ్డకు తల్లిపాలు సరిపోతున్నాయని అర్థం. తల్లిలో బిడ్డకు సరిపోయినన్ని పాలు పడాలంటే... బిడ్డకు తగినన్ని పాలు పడాలంటే తల్లులు అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. పాలిచ్చే తల్లుల ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. రోజూ తాము తీసుకునే ఆహారంలో ఆకుకూరల్ని మార్చుతుండటం వల్ల పాల ఫ్లేవర్ మారుతూ బిడ్డ పాలు తాగడానికి ఉత్సాహం చూపుతుంది. తల్లులకు ఉండకూడనిది మానసిక ఆందోళన. బిడ్డకు పాలు సరిపోతాయా లేదా అని ఆందోళన చెందకుండా, మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండంటం వల్ల పాలు ఉత్పత్తి అయ్యే హార్మోన్లు కూడా బాగాస్రవించి పాలు పెరగడానికి అవకాశమెక్కువ. బిడ్డలకు వచ్చే కడుపునొప్పి... కొందరు చిన్నారి బిడ్డలు ఎప్పుడూ ఏడుస్తుంటారు. కారణం చెప్పడానికి నెలల చిన్నారికి మాటలురావు. బిడ్డ అలా ఏడుస్తుంటే తల్లికి ఏమీ పాలుపోదు. నెలల పిల్లలు అలా ఏడుస్తున్నారంటే కారణం వాళ్ల తొలి సమస్య కడుపునొప్పి. వైద్యపరిభాషలో దాన్ని ‘ఇన్ఫ్యాంటైల్ కోలిక్’ అంటారు. అందుకే ఈ కంప్లెయింట్తో వెళ్లిన పిల్లలకు కడుపునొప్పి తగ్గే మందు ఇస్తుంటారు చిన్న పిల్లల వైద్యులు. పిల్లలు ఏడుస్తున్నప్పడు ఆందోళన పడకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లి ఇన్ఫ్యాంటైల్ కోలిక్కు మందు తీసుకోవడం తల్లి చేయాల్సిన మొదటి పని. నెలల బిడ్డకు విరేచనాలవుతుంటే... కొన్నిసార్లు పాలు తాగగానే నెలల పిల్లలకు విరేచనాలు అవుతుంటాయి. తల్లికి పెద్ద సందేహం... తన పాలు సరిపడక పోవడం వల్లనే అలా జరుగుతుందేమోనని. నెలల వయసప్పుడు ఆలు తాగగానే విరేచనాలు కావడం పిల్లల్లో చాలా మామూలుగా జరిగేదే. పాలు సరిపడకసెవడం అన్నది చాలా తక్కువమంది పిల్లల్లోనే జరుగుతుంది. విరేచనాలు అవుతున్నప్పటికీ పిల్లలకు తల్లిపాలు పట్టిస్తూ ఉండాలి. కాకపోతే గమనించాల్సిందేమిటంటే... బిడ్డ బరువు ఏమైనా తగ్గుతుందేమో చూడాలి. బరువు తగ్గనంతవరకు బిడ్డకు ఎలాంటి సమస్యా ఉండదు. విరేచనాలు అవుతున్నాయనే కారణంతో తల్లి΄ాలు ఇవ్వడాన్ని ఆపడం ఎంతమాత్రమూ మంచిది కాదు. అలా ఆపితే వాళ్లు మరింత డీ–హైడ్రేషన్కు లోనవుతారు. అది చిన్నారులకు మరింత ముప్పు తెచ్చిపెట్టవచ్చు. బిడ్డ తాలూకు ప్రతి అవయవం ఎదుగులకు, చిన్నారి వికాసానికి (మైల్స్టోన్స్కు) తల్లిపాలకు మించిన ఆహారం లేదు. దానికి మించిన ప్రత్యామ్నాయమూ లేదు. అందుకే బిడ్డకు తల్లిపాలు పట్టడమే చాలా ఉత్తమం. ఒకవేళ ఇలా ΄ాలుపడుతునప్పటికీ బరువు పెరగడం లేదని గమనిస్తే అప్పుడు వెంటనే పిల్లల వైద్యుని సంప్రదించాలి. అప్పుడు వాళ్లు విరేచనాలకు వేరే కారణాలైమైనా ఉన్నాయా అని చూసి, దానికి తగిన చికిత్స అందిస్తారు. బాబు / పాప సరిగా అన్నం తినడం లేదా? చిన్నారి పుట్టాక వాళ్లకు ఘనాహారం అలవాటు చేశాక... వాళ్లు పెరిగి పెద్దయ్యే వరకూ దాదాపుగా ప్రతి తల్లీ చేసే ఫిర్యాదు ఇదే. అన్నం పెడితే బిడ్డ సరిగా తినడం లేదంటూ ప్రతి తల్లీ తమ డాక్టర్ను ఏదో ఒక సందర్భంలో అడిగి తీరుతుంది. బిడ్డకు అన్ని పోషకాలూ అందేలా ఆరోగ్యకరమైన ఆహారం పెడుతున్నప్పుడు వాళ్లు తిన్నంత తినిపించాలి. వాళ్లు వద్దన్న తర్వాత ఒకటి రెండుసార్లు తినిపించాక ఇక తినమంటూ మారాం చేస్తే ఆపేయాలి. అంతేతప్ప వాళ్లను బతిమాలి, బెదిరించి, బలవంతంగా తినిపించకూడదు. ఇలాంటి పిల్లల్లో చూడాల్సిందేమిటంటే వాళ్లేమైనా చురుగ్గా ఉండటంలేదా, బరువు తగ్గుతున్నారా అని గమనించాలి. ఇక వాళ్లు చురుగ్గా ఆడుకుంటూ, తమ వికాసానికి తగిన తెలివితేటలను చూపుతూ, మునపటి కంటే బరువు తగ్గకుండా క్రమంగా పెరుగుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వారు బరువు పెరగకపోయినా లేదా తగ్గుతున్నా వాళ్లకు లోపల ఏదైనా సమస్య ఉండవచ్చు. ముఖ్యంగా కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం... ఈ నాలుగు ప్రధాన అవయవాలకు సంబంధించిన కారణాలు ఏవైనా అయి ఉండవచ్చు. కొన్నిసార్లు జన్యుపరమైన అంశాల వల్ల లేదా వంశ పారంపర్యంగా తల్లిదండ్రుల ఎత్తు/ఆకృతిని బట్టి కూడా బరువు పెరగకపోవచ్చు. లేదా తినిపిస్తున్నప్పటికీ పౌష్టికాహార లోపం వల్ల కూడా బరువు పెరగకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మాత్రం తప్పనిసరిగా డాక్టర్కు చూపించి, తగిన చికిత్స అందించాలి. (చదవండి: -
వారాంతంలో సరదా సరదాగా ఈ స్కిల్స్ నేర్చుకుందాం..!
వారం రోజుల పాటు ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలతో బిజీగా గడిపేస్తున్న హైదరాబాద నగర ప్రజలు వారాంతంలో మాత్రం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనే ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి వారిని ఆకట్టుకోవడానికి వివిధ సంస్థల ఆధ్వర్యంలో మట్టి పాత్రల తయారీ, పెయింటింగ్స్, బేకింగ్, క్యాండిల్ తయారీ, రెసిన్ ఆర్ట్ తదితర రంగాల్లో వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కొంత సమయం కేటాయిస్తున్నారు. ప్రవేశ రుసుముగా కొంత నామమాత్రపు ఫీజు సైతం వసూలు చేస్తారు. కొన్ని చోట్ల నిర్వాహకులే వస్తువుల తయారీకి అవసరమైన ముడి సరుకులు అందిస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో మనమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ వర్క్షాప్లు నడుస్తాయి. మట్టి పాత్రల తయారీమట్టి పాతల్ర తయారీపై హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున ఆదివారం వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి గచ్చిబౌలి హార్ట్కప్ కాఫీ, లాస్ట్ హౌస్ కాఫీ, హౌస్ ఆఫ్ గౌర్మెట్, తదతర ప్రాంతాల్లో లైవ్ వర్క్షాప్లు ప్రారంభమవుతాయి. మట్టితో మమేకం కావడం, ప్రకృతితో కలిసిపోవడం, ప్రశాంమైన వాతావరణంలో మట్టితో పాత్రలు తయారు చేయడం అనేది ప్రత్యేక అనుభూతినిస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఒక్కో వ్యక్తికి గంట నుంచి 3 గంటల పాటు పాత్రలు తయారు చేయడానికి అవకాశం కల్పిస్తారు. తయారు చేసిన కుండలు, ఇతర పాత్రలు ఏవైనా మన వెంట తీసుకెళ్లిపోవచ్చు. ఇవి తీపి జ్ఞాపకాలుగా గుర్తుంటాయి. మట్టి, యంత్రాలు, అన్నీ నిర్వాహకులే సమకూర్చుతారు.కొవ్వొత్తుల తయారీలో శిక్షణజూబ్లీహిల్స్లోని మకావు కిచెన్ అండ్ బార్లో హేండ్ మేడ్ కొవ్వుత్తుల తయారీపై వర్క్షాప్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మనకు నచి్చన డిజైన్, మోడల్స్లో కొవ్వుత్తులు తయారు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్షాప్ ఉంటుంది. రెసిన్ ఆర్ట్రంగులు కలపడం, కొత్త డిజైన్లకు అంకురార్పన చేయడం, ఆర్ట్తో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం, అద్భుతమైన, మెస్మరైజింగ్ రెసిన్ ఆర్ట్ వర్క్షాప్ను మాకోబ్రూ వరల్డ్ కాఫీ బార్, అమోరోసో హైదరాబాద్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాలు కొనసాగుతుంది. 8 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. కేక్ తయారీపై.. నార్సింగిలోని మైథూస్ బ్రేవ్ పబ్ అండ్ కిచెన్ ఆధ్వర్యంలో కేక్ తయారీపై ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. తయారీ విధానంలో మెలుకువల నేర్చుకోవచ్చు. తదుపరిఇంటోనే కొత్త రుచులను పర్ఫెక్ట్గా సిద్ధంచేసుకునే కాని్ఫడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. (చదవండి: -
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
భారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన తుర్కియే, అజర్ బైజాన్లపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్తో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు టూర్లను రద్దు చేసుకున్నారు. ఈ రెండు రోజుల్లోనే భారీ ఎత్తున బుకింగ్స్ రద్దయినట్లు నగరానికి చెందిన టూర్ ఆపరేటర్లు, ట్రావెల్స్ సంస్థల నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలోనే పర్యాటకులు తరలివెళ్తారు. ఈ సంవత్సరం కూడా సుమారు లక్ష మందికి పైగా పర్యాటకులు తుర్కియే, అజర్బైజాన్ల సందర్శనకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు అంచనా. తుర్కియే, అజర్బైజాన్ దేశాల్లో అందమైన పర్యాటక ప్రదేశాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల చాలామంది కుటుంబాలతో సహా టూర్లకు వెళ్తుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగానే ఈ రెండు దేశాల పర్యటనలను రద్దు చేసుకోవడం విశేషం. మరోవైపు ట్రావెల్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సైతం తుర్కియే, అజర్బైజాన్ల బుకింగ్లను రద్దు చేయాలని అన్ని ప్రాంతాలకు చెందిన టూర్ ఆపరేటర్లకు సర్క్యూలర్ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టూర్ ఆపరేటర్లు తమ వద్దకు వచ్చే బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు నగరానికి చెందిన వాల్మీకి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు హరికిషన్ తెలిపారు. రెండు, మూడు రోజులుగా నగరం నుంచి సుమారు 10 వేల మందికిపైగా పర్యాటకులు తమ టూర్లను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఆ రెండు దేశాలకే ఎందుకు.. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది దుబాయ్, సింగపూర్, మలేíÙయా, శ్రీలంక, థాయ్లాండ్ పర్యటనలను ఎంపిక చేసుకుంటారు. కానీ కొంతకాలంగా తుర్కియే, అజర్బైజాన్లకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ చారిత్రక ప్రదేశాలు, వైల్డ్ లైఫ్ టూర్లు, సాంస్కృతిక కేంద్రాలు, ఆకట్టుకొనే అందమైన పార్కులు ఉన్నాయి. తుర్కియేలో కేవలం సినిమా షూటింగ్లకే కాకుండా ప్రీ వెడ్డింగ్ షూట్లకు ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే చారిత్రక ఇస్తాంబుల్ నగరం పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న బ్లూ రివర్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. హగీష్ సోఫియా చారిత్రక మ్యూజియం కూడా పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది. పురాతన కట్టడాలు, కోటలు, గొప్ప ఆర్కిటెక్చర్తో నిర్మించిన భవనాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అజర్బైజాన్లోని పాతనగరం బాకు మరో ప్రముఖ పర్యాటక కేంద్రం. వందల సంవత్సరాల నాటి చారిత్రక, సాంస్కృతిక విశేషాలకు ఇది నిలయం. హైదర్ అలియేవ్ కల్చరల్ సెంటర్, జొరాస్ట్రియన్ల చారిత్రక ఫైర్ టెంపుల్ వంటివి ఆకట్టుకొనే ప్రదేశాలు.షాపింగ్ సెంటర్.. మినీ చైనాగా పేరొందిన తుర్కియో నుంచి పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మార్బుల్స్, ఫర్నీచర్, యాపిల్స్ దిగుమతి ఎక్కువగా ఉంది. అలాగే ఈ దేశానికి వెళ్లిన పర్యాటకులు కూడా తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసేందుకు చాలా షాపింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇస్తాంబుల్లోని గ్రాండ్ బజార్ అతి పెద్ద స్ట్రీట్ మార్కెట్. సుమారు 4 వేలకుపైగా షాపింగ్ మాల్స్ ఇక్కడ ఉన్నాయి. దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. దుస్తులు, ఆభరణాలు, టర్కి, పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే కళాత్మక వస్తువులు, కార్పెట్లు, డ్రైఫ్రూట్స్ లభిస్తాయి. అలాగే అంకారాలోని అంకామాల్, కెనెరాలోని ఆస్కార్బజార్ వంటి మార్కెట్లు, షాపింగ్ సెంటర్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.ఉందిగా.. ప్రత్యామ్నాయం.. తుర్కియే, అజర్బైజాన్ టూర్లను స్వచ్ఛందంగా రద్దు చేసుకుంటున్న పర్యాటకులు ప్రత్యామ్నాయంగా వియత్నాం, దుబాయ్, మలేసియా, బ్యాంకాక్, ఇండోనేషియా తదితర దేశాలను సందర్శించేందుకు వెళ్తున్నారు. ‘ఆ రెండు దేశాల బుకింగ్స్ రద్దు చేసుకుంటున్న వారు ఎక్కువ మంది వియత్నాంను ఎంపిక చేసుకుంటున్నారు.’ కూకట్పల్లికి చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. (చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర) -
ప్లీజ్..నో సప్లిమెంట్స్..!
మీకు విటమిన్ ఇ లోపం ఉంది.. మీకు ప్రోటీన్స్ సరిపోవడం లేదు.. ఈ సప్లిమెంట్స్ తీసుకోండి.. అంటూ సూచించే వైద్యులు, పోషకాహార నిపుణులతో పాటు వాటిని వినియోగించే నగరవాసులూ పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో సప్లిమెంట్స్ను అతిగా వినియోగించవద్దని హైదరాబాద్ నగరానికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధన ఫలితం ఆధారంగా సూచిస్తోంది. అధిక సప్లిమెంట్స్ వాడకం హానికరం అంటున్న ఎన్ఐఎన్.. దానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తోంది. బలవర్థకమైన ఆహారాల నుంచి దొరకని పోషకాలను సప్లిమెంట్లు/మాత్రలు/క్యాప్సూల్స్ అందిస్తాయి అనేది నిజమే అయినా కొన్ని పోషకాలను సప్లిమెంట్లుగా తీసుకోవడం వల్ల ఇతర పోషకాల సహజ శోషణకు ఆటంకం కలుగుతుందని ఎన్ఐఎన్ హెచ్చరిస్తోంది. రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చడానికి సప్లిమెంట్లపై అధికంగా ఆధారపడటం ఆరోగ్యానికి హానికరం అని స్పష్టం చేస్తోంది. తాము సూచించిన ‘మై ప్లేట్ ఫర్ ది డే’లో సూచించిన సమతుల ఆహారం ద్వారా అందేవి మరే ఏ విటమిన్ లేదా మినరల్ సప్లిమెంట్లు అందించలేవని స్పష్టం చేస్తోంది. ’మై ప్లేట్ ఫర్ ది డే’ మన రోజువారీ అవసరాలకు అనుగుణంగా అన్ని పోషకాలు మన శరీరానికి అందేందుకు మై ప్లేట్ ఫర్ ది డే అనే ఆసక్తికరమైన మెనూను ఎన్ఐఎన్ రూపొందించింది. ఇది మన ఆహారంలో అవసరమైన పోషకాహార స్పష్టతను అందిస్తుంది. రోజువారీ ఆహారం కోసం వివిధ ఆహార సమూహాల ఖచ్చితమైన నిష్పత్తులను అర్థం చేసుకోవడానికి ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడానికి ‘భారతీయుల పోషక అవసరాలు’ ఆధారంగా దీన్ని డిజైన్ చేశారు. రోజుకు 2వేల కేలరీలు.. అదే ఆరోగ్యానికి మేలు వ్యక్తులు(చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాకుండా) తమ పోషక అవసరాలను తీర్చుకునేందుకు రోజుకి 2 వేల కిలో కేలరీలు/ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ‘మై ప్లేట్ ఫర్ ది డే’ చెబుతోంది. అయితే ఇది కేవలం కేలరీలు అందించే ఆహారం మాత్రమే కాకూడదని, దీనిలో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, ప్రొటీన్లు, విటమిన్లు ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు.. ఇలా ఆరోగ్యపరమైన అవసరాలను తీర్చడానికి సరైన నిష్పత్తిలో ఉండాలని సూచిస్తోంది. రోజుకి 2వేల కిలో కేలరీల ఆహారం కోసం.. కూరగాయలు ఆకు కూరలు: 400 గ్రాములు(ముడి బరువు), మిల్లెట్లతో సహా తృణధాన్యాలు: 260 గ్రాములు, పండ్లు: 100 గ్రాములు, పప్పులు/గుడ్లు/మాంసపు ఆహారాలు: 85 గ్రాములు, గింజలు విత్తనాలు: 30 గ్రాములు, కొవ్వులు నూనె: 27 గ్రాములు, పాలు/పెరుగు: 300 మి.లీ.శోషించే ఆహారమే.. మేలు ఆరోగ్యకరమైన సహజ ఆహారాలను శరీరం బాగా గ్రహిస్తుంది. అంతేకాకుండా అవి ఎక్కువ జీవ లభ్యతను కలిగి ఉంటాయి. విటమిన్లు ఖనిజాల తీవ్రమైన కొరతతో బాధపడుతున్న వ్యక్తుల కోసం, అన్ని సూక్ష్మపోషకాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు, ఫంక్షనల్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన వాటిని తగినంతగా తీసుకోవడం మంచిదని ఎన్ఐఎన్ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పోషకాలతో కూడిన ‘మై ప్లేట్ ఫర్ ది డే’ ఎలా ఉండాలో డిజైన్ చేసి అందిస్తోంది. స్నాక్స్.. ఆరోగ్యకరంగా.. అవసరమైన కేలరీలకు మించకుండా స్నాక్స్ తినడం వల్ల నష్టం లేదు. కొన్ని రకాల స్నాక్స్ బరువు తగ్గడానికి సహకరిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్. స్నాక్స్గా ఆయన గుప్పెడు కాలిఫోరి్నయా ఆల్మండ్స్ సూచిస్తున్నారు. ఈ బాదంలో ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ ఇ జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఇవి బెస్ట్, అలాగే నూనె లేకుండా వండిన మూంగ్ దాల్ చిల్లా బరువు తగ్గడానికి అనుకూలమైనమరొక చిరుతిండి. మూంగ్ దాల్(పెసర పప్పు)లో పొటాషీయం, మెగ్నీషియం, ఇనుము, రాగి పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం రెండింటికీ మంచిది. పెసర శనగల మొలకలతో తయారైన భేల్లో రుచికరమైన స్నాక్. దోసకాయ, టమోటాలు, పచ్చి మామిడి, నిమ్మరసంతో కలిపిన మొలకలు, భేల్ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. (చదవండి: చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!) -
టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!
రొయ్యల పాప్కార్న్కావలసినవి: రొయ్యలు– 25 పైనే (మరీ చిన్నవి కాకుండా, నచ్చిన సైజ్ ఎంచుకోవచ్చు. తల, తోక తీసి, శుభ్రం చేసుకోవాలి)అల్లం–వెల్లుల్లి పేస్ట్– 2 టేబుల్ స్పూన్లుకారం– ఒక టీ స్పూన్ గరం మసాలా– ఒక టేబుల్ స్పూన్+ఒక టీ స్పూన్నిమ్మరసం– ఒక చెక్కమైదా, జీలకర్ర పొడి– ఒక టేబుల్ స్పూన్ చొప్పునబ్రెడ్ పౌడర్– పావు కప్పుపైనేగుడ్డు– 2 (2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు కలుపుకుని పక్కనపెట్టుకోవాలి)ఉప్పు– తగినంతనూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా రొయ్యలు ఒక గిన్నెలో తీసుకుని, అందులో అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె, నిమ్మరసం వేసి, ఆ మిశ్రమం రొయ్యలకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక చిన్న బౌల్లో బ్రెడ్ పౌడర్, జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసుకుని, ఒక్కో రొయ్యను మొదట గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి, ఆపై బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది.ట్రినిడాడ్ అండ్ టొబాగో మ్యాంగో కేక్కావలసినవి: గోధుమ పిండి– ఒకటిన్నర కప్పులుబేకింగ్ పౌడర్– ఒక టీ స్పూన్బేకింగ్ సోడా– అర టీ స్పూన్ఉప్పు– చిటికెడు గడ్డ పెరుగు– ఒక కప్పుపంచదార– ముప్పావు కప్పుపాలు, నూనె– అర కప్పు చొప్పునవెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్మామిడి పండ్లు– 2 (బాగా పండి, తియ్యగా ఉండాలి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)నీళ్లు– కొద్దిగానిమ్మరసం– ఒక టేబుల్ స్పూన్మీగడ– అర కప్పువైట్ చాక్లెట్– 200 గ్రాములు (మార్కెట్లో దొరుకుతుంది)మ్యాంగో ఐస్క్రీమ్– పావు కప్పు పైనేతయారీ: ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని బాగా కలిపి, జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు మరో గిన్నెలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి. అనంతరం అందులో నూనె, వెనీలా ఎసెన్స్ వేసి మరోసారి కలపాలి. కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు గోధుమ మిశ్రమాన్ని, పెరుగు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి, నెయ్యి పూసిన వెడల్పాటి పాత్రలో వేసుకుని, రెండు అంగుళాల మందంలో, సమానంగా ఉండేలా చూసుకోవాలి. దాన్ని ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకుని, చల్లారాక, çముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను మిక్సీలో వేసుకుని, వాటిలో నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసుకుని జ్యూస్లా చేసుకోవాలి. ఆ జ్యూస్ని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీగడను కరిగించి, దానిలో కరిగించిన వైట్ చాక్లెట్ను కలపాలి. దానిలో మామిడిపండు గుజ్జు వేసుకుని, క్రీమ్లా అయ్యే వరకూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ముక్క తీసుకుని, దానిపై పెరుగు మిశ్రమాన్ని అర అంగుళం మందంలో పూసుకుని, దానిపైన కొద్దిగా ఐస్క్రీమ్ పావు అంగుళం మందంలో పరుచుకోవాలి. మరో కేక్ ముక్కను దానిపై పెట్టుకోవాలి. ఇదే మాదిరి అన్ని ముక్కలు పెట్టుకుని.. వాటిపై మరోసారి పెరుగు మిశ్రమం, ఐస్క్రీమ్తో నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.అసోమీయా తిల్ పిఠాకావలసినవి: బియ్యం– ఒక కప్పుబెల్లం తురుము, నల్ల నువ్వులు– అర కప్పు చొప్పుననీళ్లు, నూనె, ఉప్పు– సరిపడాతయారీ: ముందుగా బియ్యాన్ని 3 లేదా 4 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి, ఒక గంట పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని మిక్సీలో మెత్తని పిండిలా చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు నల్ల నువ్వులను దోరగా వేయించి, కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఆ నువ్వుల మిశ్రమాన్ని బెల్లం తురుములో వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యప్పిండిలో సరిపడా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా దోసెల పిండిలా కలుపుకోవాలి. ఆపై పాన్ మీద కొద్దికొద్దిగా నూనె వేడి చేసుకుని, చిన్న చిన్న అట్లు వేసుకోవాలి. అట్టు కొద్దిగా ఉడుకుతుండగా, మధ్యలో నువ్వులు–బెల్లం మిశ్రమాన్ని ఉంచి నచ్చిన విధంగా రోల్ చేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. -
మనమంతా ఒక్కటే... శాంతే మార్గం!
పోప్ లియో–14 ఈస్టర్ ఆది వారం రోజు ప్రసంగిస్తూ చెప్పిన ‘మనమంతా ఒక్కటే’ అనే మాటలు ప్రపంచంలో శాంతి నెలకొనడానికి ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలియ చేస్తున్నాయి. మే 8న 267వ అగస్టినియన్ పోప్గా, సెయింట్ పీటర్ వారసుడిగా ఎన్నికైన పోప్ లియో మే 18న ఆ సర్వోన్నత చర్చి పదవిని స్వీకరించనున్నారు. రెండు వేల ఏళ్ల క్యాథలిక్ చర్చి చరిత్రలో ఆయన తొలి అమెరికన్ పోప్ కావడం విశేషం. అంతే కాదు ద్వంద్వ పౌరసత్వాలు (అమెరికన్, పెరువియన్) కలిగిన తొలి పోప్ కూడా ఆయనే. పారిశ్రామిక యుగం తొలి నాళ్లలో సామాజిక న్యాయం కోసం, కార్మికుల హక్కుల కోసం గళమెత్తి నిరసన తెలిపిన పోప్ లియో–13 గౌర వార్థం ఆయనకు ‘లియో–14’ అనే పాపల్ పేరు (పోప్ అయ్యాక పెట్టే పేరు) పెట్టారు. ఆయన అసలు పేరు రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివస్ట్.పోప్ లియోది అమెరికాలోని చికాగో. కానీ జీవితంలో ఎక్కువ భాగం పెరూలోని చిక్లాయోలో గడిపారు. పెరువి యన్ జీవనశైలిలో ఆయన మమేకమై వారితో కలిసి పోయారు. కేవలం ఆ భాష నేర్చుకోవడంతోనే ఆగిపో కుండా వారి జీవితాల్లోని పలు పార్శా్వలను పరిశీలించారు. వారి బాధల్నీ, వేదనల్నీ గమనించారు. అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడుతూ మారుమూల పల్లెల్లో సైతం ఆయన ప్రయాణించారు. ఎల్లవేళలా శాంతి, న్యాయం, మతస్వేచ్ఛ, సమానత్వం, దేశభక్తి, మనిషిని మనిషిగా గౌరవించడం వంటి అంశాల కోసం పని చేశారు. అందుకే పెరువియన్లు ఆయనను తమ కొత్త నాయకుడని పిలుస్తారు. ఇక పోప్ పదవిని ఓ అమెరికన్ స్వీకరిస్తాడన్న నమ్మకం చాలా మందికి చాలా కాలంపాటు లేదు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు పోప్ లియో ఆ పదవిలోకి వచ్చి అమెరికన్ల ఆధ్యాత్మిక అంతస్తును పెంచారు.1982లో ప్రీస్ట్గా మారిన పోప్ లియోకు చర్చి చదు వులో పలు డిగ్రీలు ఉన్నాయి. ఇతరుల మాటలు ఆలకించడంలో, వారి అభిప్రాయాలను గౌరవించడంలో పోప్ లియోది అందె వేసిన చెయ్యి. ఈ గుణమే ఆయనను తోటి వారికి, అంతర్జాతీయ నేతలకు దగ్గర చేశాయి. ఆంగ్లం, స్పానిష్, ఇటాలియన్, ఫ్రెంచ్, పోర్చుగీస్ భాషలు అనర్గ ళంగా మాట్లాడగలిగిన పోప్ లియో ఈ బహుభాషలను ఆడంబరం కోసం కాక, ప్రపంచంలోని అనేకులతో నేరుగా సంభాషించి, వారితో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఉపయోగిస్తున్నారు. 2004, 2006లలో రెండుసార్లు లియో భారతదేశాన్ని సందర్శించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ సమయంలో ఆయన ఎటువంటి ప్రత్యేక వసతులూ కోరలేదు. చాలా నిరాడంబరంగా ఉన్నారు. ఆయన పద్ధతి, సామాన్య జీవనశైలి భారతీయులను ఆకట్టుకుంది.పోప్ లియో రాబోయే రోజులలో ఎటువంటి ప్రభావం చూపబోతున్నారో ఆయన వెల్లడి చేస్తున్న భావాల ద్వారా అర్థం చేసుకునేందుకు ప్రపంచం ప్రయత్ని స్తున్నది. ఈస్టర్ ఆదివారం నాడు ఆయన చేసిన తొలి ప్రసంగంలో ‘మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని దేశాధి నేతలను అభ్యర్థిస్తున్నాను’ అన్నారు. ఇప్పటికే రెండు మహా యుద్ధాలను చూసిన ప్రపంచం మరో భారీ యుద్ధా నికి సిద్ధంగా లేదని వివరించారు. తన ముందు పోప్గా ఉన్న ఫ్రాన్సిస్ సందేశమే తన సందేశమని ఆయన పేర్కొన్నారు. గాజాలో శాంతి నెలకొనాలని పిలుపునిచ్చారు. భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అభి నందించారు. చేతిలో ఆయుధం పెట్టుకొని ఎవరూ ప్రేమను పంచలేరని, యుద్ధాల నిరోధానికి ఐక్యరాజ్య సమితి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పోప్ లియో తన ప్రసంగంలో సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు దాని వెనకే ఉన్న దుష్పరిణామాల గురించి వివరించడం గమనార్హం. సాంకేతిక పరిజ్ఞానం ఎల్లప్పుడూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలనీ, సర్వమానవాళి శ్రేయస్సును కాంక్షించాలనీ అంటున్న ఆయన మాటల్ని బట్టి చూస్తే, ఈ ఏఐ యుగంలో ఆధునిక సాధువులా కనిపిస్తున్నారాయన.ఇటీవల అంతర్జాతీయ మీడియాతో పోప్ లియో మాట్లాడుతూ ‘మీడియాను నియంత్రిస్తే కొంతమేర ప్రజల ఆలోచనా విధానాన్ని నియంత్రించినట్లు అవుతుంది’ అన్నారు. క్రైస్తవులు సార్వజనీన మానవులని పోప్ మాట. అందర్నీ సమానంగా సోదరభావంతో చూడలేనివారు క్రైస్త వులు కారనేది ఆయన మాట.ప్రపంచంలోని అనేక దేశాల మధ్య యుద్ధాలు నడు స్తున్నాయి. దాయాది దేశాల మధ్య సమస్యలు నెల కొన్నాయి. ఇవి ప్రస్తుతం పోప్ ముందున్న సవాళ్లు. తన తొలి ప్రసంగంలోనే శాంతి కోసం ఆయన పడిన తపనను బట్టి తప్పకుండా ఆయన ఈ సమస్యలకు పరిష్కారం చూపుతారని చాలామంది విశ్వసిస్తున్నారు. దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు వారి మధ్య సయో ధ్యను కుదిర్చి, యుద్ధాన్ని నివారించే పెద్దలు ఈ సమాజా నికి చాలా అవసరం. అటువంటివారే పోప్. ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోప్ ఏర్పరిచే శాంతిబాటలకు ఎంతో ప్రాధాన్యం ఉందని అందరూ భావిస్తున్నారు.జహారా బేగం, - వ్యాసకర్త సామాజిక కార్యకర్త, అమెరికా -
ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
గ్లామర్, గ్రేస్, క్లాస్, క్యూట్... ఇలా అందాన్ని పొగిడే ఎన్ని పదాలున్నా, అన్నింటినీ కలిపి ఒకేసారి వాడినా కూడా నటి రాశీ ఖన్నా ఫ్యాషన్ లుక్స్ని నిర్వచించలేం. ట్రెడిషనల్ నుంచి జెండర్ ఫ్లూయిడ్ ఫ్యాషన్ వరకు ప్రతి స్టయిలింగ్లోనూ తన ఫ్యాషన్ స్టేట్మెంట్ స్కోర్ సెంచరీనే! అలాంటి ఒక ఫస్ట్క్లాస్ లుక్, ఇందుకోసం తను ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ అండ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూసేయండి. చెవి కప్పేస్తే కళ్లకందం దుద్దులు, బుట్టకమ్మలు, జూకాలు– ఇలా ఎన్ని రకాల కర్ణాభరణాలున్నా, వేటి గొప్ప వాటికే ఉంటుంది. అలా ఒకప్పటి గొప్ప ఆభరణం. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది. అదే ఫుల్ కవర్డ్ ఇయర్ కఫ్స్. ఇవి సాధారణ ఇయర్ కఫ్స్లాగా సపరేట్గా ఉండవు. కింద కమ్మలతోపాటే, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్లో ఉంటాయి. వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్తో తగిలించుకుంటే చాలు. సంప్రదాయ దుస్తులకు ఇది సరైన జోడీ. వేడుకల్లో వీటిని ధరిస్తే ప్రత్యేక ఆకర్షణగా మీరే నిలుస్తారు. అయితే, ఇలాంటి ఇయర్ కఫ్స్ వేసుకునేటప్పుడు మెడను బోసిగా ఉంచుకోవాలి. అప్పుడే వీటి లుక్ ఎలివేట్ అవుతుంది. హెయిర్ స్టయిల్ కూడా బన్ లేదా సెంటర్ బన్ వేసుకోవాలి. వేవీ లేదా లూస్ హెయిర్ స్టయిల్ అస్సలు నప్పదు దీనికి. అలాగే మరో చిన్న టిప్ ఏంటంటే, మొత్తం ఎఫర్ట్ చెవులకే కాకుండా, కాస్త చేతులకు కూడా ఇవ్వండి. అంటే చేతికి మీ డ్రెస్కు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుని లుక్ని కాస్త బ్రైట్ చేయండి. అచ్చం నటి రాశీ ఖన్నా లాగా.. "ఫ్యాషన్లో లెస్ ఈజ్ మోర్ అనే ఫిలాసఫీని నమ్ముతా. అలాగని, ఫ్యాషన్లో ప్రయోగాలు చేయడానికి భయపడను. ఎలాంటి దుస్తులనైనా ఆత్మవిశ్వాసంతో ధరిస్తే, అందంగా కనిపిస్తారు." అంటోంది రాశీ ఖన్న. ఇక్కడ రాశీ కన్నా ధరించిన ఇయర్ రింగ్స్ బ్రాండ్: కోహర్ బై కనికాధర రూ. 6,500/-.(చదవండి: 'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..) -
షుగర్ ఉంటే..ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా?
నాకు ఇప్పుడు మూడోనెల. గతంలో గర్భస్రావం కావడం వలన చాలా డిస్టర్బ్ అయ్యాను. నన్ను ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. మళ్లీ ప్రెగ్నెన్సీ కోసం సిద్ధంగా లేను. చాలా బాధగా ఉంది. ఈ సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి?– రమ్య, హైదరాబాద్ మీ పరిస్థితిని అర్థం చేసుకోగలం. ప్రెగ్నెన్సీ మానసికంగా చాలా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు. దీంతో బాధ, కోపం, అసహనం, ఆందోళన ఎవరికైనా వస్తాయి. మళ్లీ ప్రెగ్నెన్సీ మీద భయం ఉంటుంది. ఇలాంటప్పుడే మీరు ధైర్యంగా ఉండాలి. సహాయం తీసుకోవాలి. డాక్టర్ని సంప్రదించి మీ భావాలను వివరంగా వారితో పంచుకోవాలి. టాకింగ్ థెరపీ ద్వారా మనసులో ఉండే బాధను తొలగించుకోవచ్చు. అలా ఎందుకు అయింది, ఏమి చేస్తే మళ్లీ అలా జరగకుండా ఉంటుంది. ఏ పరీక్షలు చేయించుకోవాలి. ఇలా అన్ని కోణాల్లో మాట్లాడుతూ మీ మనసులోని అనుమానాలను తొలగించుకోవచ్చు. దీంతో డాక్టర్ అవసరమైన పరీక్షలు చేసి సమస్య తీవ్రతను అంచనా వేస్తారు. అవసరమైతే మానసిక నిపుణుడిని సంప్రదించమని చెప్తారు. ఇది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (పీటీఎస్డీ) కావచ్చు. దీనికి కౌన్సెలింగ్, థెరపీ అవసరం. సాధారణంగా నాలుగు నుంచి ఐదు వారాల్లో ఉపశమనం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో రెండు వారాల్లోనే తేడా కనిపిస్తుంది. ఎలాంటి మందులూ వీళ్లకి అవసరం ఉండదు. అందుకే, భయపడకుండా ఒకసారి డాక్టర్ని కలవండి. కొంతమందికి ఈ సమస్య ఎక్కువగా ఉండచ్చు. వీరికి లాంగ్ టర్మ్ కౌన్సెలింగ్ సెషన్స్తోపాటు కొన్ని మందులు సూచిస్తాం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) అనేది ఒక రకమైన టాకింగ్ థెరపీ. దీనిలో మీ మనస్సులోని ఆలోచనలు మేనేజ్ చేసే ఫోకస్డ్ కౌన్సెలింగ్ చేస్తారు. మీకు రొటీన్గా కొన్ని పనులు చెయ్యమని చెప్తారు. రెండు నుంచి మూడు నెలల సీబీటీ చికిత్సతో ఉపశమనం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో సెర్ట్రాలిన్ మాత్రలను తాత్కాలికంగా ఉపయోగిస్తారు. ఇది కొన్ని వారాలు మాత్రమే. ఈ లోపల కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల వలన మానసిక స్థితి మెరుగవుతుంది. నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. నాకు మధుమేహం ఉంది. మందులు వాడుతున్నాను. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – శారద, వరంగల్. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. అప్పుడు వారు కొన్ని పరీక్షలను ముందే చేయించి, దాదాపు అన్నీ కంట్రోల్లో ఉంటేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తున్నారు. వీటిలో మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, మూర్ఛ, ఆస్తమా లాంటివి ఉంటాయి. ముందే డాక్టర్ని సంప్రదించినప్పుడు , మీ సమస్య ఎంతవరకు కంట్రోల్లో ఉందో తెలుసుకోవచ్చు. దీని వలన తల్లికి, బిడ్డకి భవిష్యత్తులో ఏ సమస్యలు ఉండవు. డయాబెటిక్ క్లినిక్స్లో వెంటనే సంప్రదించి, హెచ్బీ1సీ పరీక్ష చేయించుకోండి. ఇందులో చక్కెర స్థాయి 5.5 నుంచి 6. 5 శాతం మధ్యలో ఉండాలి. ఒకవేళ మీ షుగర్ కంట్రోల్లో ఉంటే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం తగ్గుతుంది. షుగర్ ఎక్కువ ఉంటే కొన్ని నెలలు స్ట్రిక్ట్ డైట్, వ్యాయామం చేయాలి. మందులు అవసరమైతే మార్చాలి. కొన్ని రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్జీ మాత్రలు రోజూ తీసుకోవటం ప్రారంభించండి. ఈ సమయానికి డాక్టర్ సూచించిన మందులు మాత్రమే వాడాలి. ఇన్సులిన్ వాడటం సురక్షితమే. ఐ స్క్రీనింగ్, మూత్రపిండాలు, కాలేయం, హార్మోన్ పరీక్షలు కూడా చేయించాలి. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఏ ఇబ్బందులు రాకుండా చూస్తాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: మంచుకొండల్లో మహిళారాజ్యం..! ఆ ఒక్క జిల్లాలో పాలనాధికారులంతా..) -
మంచుకొండల్లో మహిళారాజ్యం..!
మంచుపర్వత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్లో 12 జిల్లాలు ఉన్నాయి. ‘లాహౌల్ స్పితి’ జిల్లా వాటిల్లో ఒకటి. లాహౌల్ స్పితి జిల్లాలోని ప్రత్యేకతలన్నీ ఆ రాష్ట్రంలోని మిగతా జిల్లాలన్నిటికీ ఉన్నప్పటికీ, దేశంలోని దాదాపు 800 జిల్లాల్లో లేని ఒక ప్రత్యేకత ఇప్పుడు లాహౌల్ స్పితికి మాత్రమే ఉంది! ఆ జిల్లా పాలనాధికారులంతా మహిళలే కావటమే ఆ ప్రత్యేకత.ముఖ్యమంత్రి ఆకాంక్ష!కిరణ్ భదానా ఇటీవలే, ఏప్రిల్ 27న లాహౌల్ స్పితి జిల్లాకు డిప్యూటీ కమిషనర్గా వచ్చారు. 2017 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. (జిల్లా కలెక్టర్ను కొన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ కమిషనర్ అంటారు). హిమాచల్ప్రదేశ్లో 3 ఆదివాసీ జిల్లాలు ఉన్నాయి. కిన్నర్, చంబా, మూడవది: లాహౌల్ స్పితి. పాలనా యంత్రాంగానికంతా మహిళలే అధికారులవటంతో లాహౌల్ స్పితి జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ గత అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడుతూ రాష్ట్రంలో కనీసం ఒక్క జిల్లాలోనైనా పాలన, రాజకీయ నాయకత్వం పూర్తిగా మహిళల చేతుల్లో ఉండాలన్న తన ఆకాంక్షను వెల్లడించటం విశేషం. తాజాగా కిరణ్ భదానా నియామకంతో ఆయన ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరిన ట్లైంది. మహిళా ఎంపీఅందరూ మహిళలే అధికారులుగా ఉన్న లాహౌల్ స్పితి జిల్లా ‘మండీ’ లోక్సభ నియోజకర్గం పరిధిలోకి వస్తుంది. ఆ నియోజకవర్గానికి కంగనా రనౌత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండీ ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటికి నెల ముందు మాత్రమే కంగనా రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ తరఫున మండీలో పోటీకి దిగారు. 5 లక్షల, 37 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. మహిళా ఎమ్మెల్యే2024 లోనే జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో లాహౌల్ స్పితి శాసనసభ నియోజకర్గం నుంచి అనురాధా రాణా ఎన్నికవటం మరొక విశేషం. అనురాధ ఎం.ఎ. ఇంగ్లిష్, ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ చదివారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలిచారు. కలెక్టరు, ఎస్పీ, కమిషనర్..! లాహౌల్ స్పితి జిల్లాకు డిప్యూటీ కమిషనర్గా వచ్చిన కిరణ్ భదానా రాజస్థాన్కు చెందిన వారు. ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్లో డిగ్రీ చదివారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. మూడు ప్రయత్నాల తర్వాత యూపీఎస్సీ పరీక్షలలో 120 ర్యాంకు సాధించి ఐఏఎస్ అఫీసర్ అయ్యారు. ఇక బీనాదేవి 2024 జూన్ నుండి లాహౌల్ స్పితికి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఆమె ఎస్సీ వర్గానికి చెందిన వారు. జిల్లాలోని అట్టడుగు వర్గం వారికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.జిల్లా ఎస్పీ ఇల్మా అఫ్రోజ్. 2018–2019 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆమె. 2025 మార్చిలోనే లాహౌల్ స్పితి జిల్లాకు ఎస్పీగా వచ్చారు. ఆకాంక్ష శర్మ కెలాంగ్ సబ్–డివిజినల్ మేజిస్ట్రేట్. 2023లో పదవీ బాధ్యతలు చేపట్టారు. కెలాంగ్ రెవిన్యూ డివిజన్కు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్గా కూడా ఆకాంక్ష పని చేశారు. శిఖా సిమ్టియా– కాజా డివిజన్కు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కూడా. 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. హిమాచల్ ప్రదేశ్లోని చంబా పట్టణం ఆమె జన్మస్థలం. చౌరీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి పట్టభద్రురాలయ్యారు. సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ‘‘మహిళలు అధికారులుగా ఉంటే, సాధారణ మహిళలు చొరవగా ముందుకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోగలుగుతారు. పురుష అధికారులంటే ఉండే సంకోచం ఉండదు. కీలక పదవులలో, రాజకీయాలలో మహిళలు ఉండటం వల్ల పాలన మెరుగ్గా ఉంటుంది, పరిష్కారాలు సాఫీగా జరిగిపోతాయి..’’ అని లాహౌల్ స్పితికి ఎమ్మెల్యే అనురాధా రాణా అంటారు. అది నిజమే కదా! నాలుగేళ్ల క్రితం ‘నల్బరి’ ఫస్ట్అస్సాంలోని గువాహటికి 60 కి.మీ. దూరంలో ఉంటుంది నల్బరి జిల్లా. నాలుగేళ్ల క్రితమే ఈ జిల్లా తొలి ‘మహిళా అధికారుల జిల్లా’గా వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో ఆ జిల్లాలోని అత్యున్నత స్థాయి అధికారులంతా దాదాపుగా మహిళలే కావటం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. జిల్లా కలెక్టర్ మహిళ, జిల్లా ఎస్పీ మహిళ, ముగ్గురు అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు మహిళలు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్... అందరూ మహిళలే. జిల్లాలోని ఐదుగురు జడ్జిలు, నలుగురు సర్కిల్ ఆఫీసర్లు, సబ్–రిజిస్ట్రార్, ఇంకా... డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, సబ్–డివిజినల్ అగ్రికల్చర్ ఆఫీసర్, సాయిల్ సైంటిస్ట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు... అంతా మహిళలే. ఇప్పుడు వీరిలో చాలామంది బదలీపై వెళ్లారు. దాంతో ‘నల్బరి’ జిల్లా ప్రత్యేకతలు ‘లాహౌల్ స్పితి’ జిల్లాకు వచ్చాయి. సాక్షి, స్పెషల్ డెస్క్(చదవండి: చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!) -
చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!
‘ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్/ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్’ అనే సినీగీతం చాలామందికి తెలిసినదే! చాయ్ చమక్కులు చాలానే ఉన్నాయి. చాయ్ చరిత్ర కూడా చాలానే ఉంది. మే 21న ప్రపంచ తేనీటి దినోత్సవం సందర్భంగా కొన్ని చాయ్ చమక్కులు మీ కోసం...చాయ్, టీ అనే పదాలతో పిలుచుకునే తేనీరు చాలామందికి అభిమాన పానీయం. చాయ్, టీ– ఈ రెండు పదాలూ తేయాకుకు పుట్టినిల్లయిన చైనాలోనే పుట్టాయి. ఓడమార్గం వర్తకుల ద్వారా ‘టీ’ అనే మాట పాశ్చాత్య ప్రపంచంలో ప్రాచుర్యం పొందింది. ‘చాయ్’ అనే మాట సిల్క్రూట్ ద్వారా భారత్ సహా పలు ఆసియన్ దేశాలకు వ్యాపించింది. తొలి రోజుల్లో డచ్ వర్తకులు చైనాతో నౌకా వాణిజ్యం సాగించేవారు. వారు ఎక్కువగా చైనా తీర ప్రాంతంలోని ఫుజియన్ మాండలికం మాట్లాడే వర్తకులతో లావాదేవీలు జరిపేవారు. వారు తేయాకుకు, తేనీటికి ‘టీ’ అనే మాటను ఉపయోగించేవారు. వారి ద్వారా ఈ మాట ఇంగ్లిష్ సహా పలు యూరోపియన్ భాషలకు చేరింది. భూమార్గంలో సిల్క్రూట్ గుండా చైనాకు వచ్చే విదేశీ వర్తకులు ఎక్కువగా చైనాలో మాండరిన్ చైనీస్ భాష మాట్లాడే వర్తకులతో లావాదేవీలు సాగించేవారు. వారి ద్వారా ‘చాయ్’ మాట భారత్ సహా పలు ఆసియా దేశాలకు, అరబ్ దేశాలకు వ్యాపించింది. ఎన్నో రకాలు.. ఎన్నో రుచులుప్రపంచవ్యాప్తంగా మూడువేలకు పైగా తేయాకు రకాలు ఉన్నాయి. వీటిలో ఆరు రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఉలాంగ్ టీ, వైట్ టీ, పూఎయిర్ టీ, యెల్లో టీ రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఈ ఆరురకాలు మాత్రమే కాకుండా, రకరకాల తేయాకుల నుంచి రకరకాల రుచులతో తయారు చేసే తేనీటి పానీయాలు కూడా వాడుకలో ఉన్నాయి. ప్రపంచంలో విస్తృత ప్రాచుర్యం పొందిన రకాలు, అరుదైన రకాల తేనీటి పానీయాలు కొన్నింటి గురించి తెలుసుకుందాం...పూఎయిర్ టీచైనాలో దొరికే అరుదైన తేయాకుతో దీనిని తయారు చేస్తారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నుంచి ఇది వాడుకలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ రకం తేయాకు ఎంత పాతబడితే దీనితో తయారు చేసే టీ అంత రుచిగా ఉంటుందని చైనీయుల నమ్మకం. పూఎయిర్ టీని ‘గోంగ్ఫు చా’ అని కూడా అంటారు. వేడి నీటితో శుభ్రం చేసిన పాత్రలో ముందుగా ఈ రకం తేయాకును వేసి, అందులో మరుగుతున్న నీటిని పోస్తారు. తేయాకు మరుగునీటిలో ఐదు నిమిషాలు నానిన తర్వాత వడగట్టి, కప్పుల్లో పోసుకుని తాగుతారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్లో ఈ రకం తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. యునాన్ ప్రావిన్స్లో ఈ తేనీటిని పులియబెట్టి, తాగే ముందు మరిగించి సేవించే పద్ధతి కూడా ఉంది. ఇది జీర్ణసమస్యలకు విరుగుడుగా పనిచేస్తుందని చైనీయుల నమ్మకం.బటర్ టీఇది టిబెట్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో పొందిన సంప్రదాయ పానీయం. జడలబర్రె వెన్నకు, కొద్దిగా బార్లీ పొడి, ఉప్పు జోడించి, వెన్నను బాగా చిలికి, మరుగుతున్న బ్లాక్ టీలో వేస్తారు. కొందరు ఇందులో పాలు, పంచదార కూడా జోడిస్తారు. పొద్దున్నే ఈ బటర్ టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, ఒంట్లోని శక్తి తరిగిపోకుండా ఉంటుందని చెబుతారు. ఇటీవలి కాలంలో డెయిరీ ఫామ్స్లో దొరికే వెన్నను ఉపయోగించి కూడా బటర్ టీని తయారు చేస్తున్నారు.చా యెన్ఇది థాయ్లాండ్లో ప్రసిద్ధి పొందిన పానీయం. గాఢంగా తయారు చేసిన బ్లాక్టీలో చక్కెర, పాలు కలిపి, అనాసపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలను జోడించి మరిగిస్తారు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మంచుముక్కలు వేసుకుని శీతల పానీయంలా సేవిస్తారు. కొందరు దీనికి పసుపు, నారింజ ఫుడ్కలర్స్ను కూడా జత చేస్తారు.చాయ్ఇది మన భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం. చాయ్ అన్నా, టీ అన్నా మనకు తెలిసిన పద్ధతి ఒకటే! తేయాకు పొడివేసి మరిగించిన నీటిలో పాలు, పంచదార కలిపి తయారు చేస్తారు. కొన్ని చోట్ల ఈ తేనీటికి బాగా దంచిన అల్లం జోడించి అల్లం టీ తయారు చేస్తారు. ఇంకొన్ని చోట్ల సుగంధ ద్రవ్యాల పొడులు జోడించి, మసాలా చాయ్ తయారు చేస్తారు. చాయ్ ఒకరకంగా మన జాతీయ పానీయం అనే చెప్పుకోవాలి!రూయిబోస్నిజానికి ఇది తేయాకుతో తయారు చేసే టీ కాదు. ‘రూయిబోస్’ అంటే ఎర్రని పొద అని అర్థం. దక్షిణాఫ్రికాలో పెరిగే రూయిబోస్ ఆకులతో దీనిని తయారు చేస్తారు. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి, మరికాసేపు మరిగిన తర్వాత వడగట్టి కప్పుల్లో పోసుకుని వేడి వేడిగా సేవిస్తారు. ఇందులో కెఫీన్ ఉండదు. కెఫీన్ వద్దనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అని చెబుతారు. రూయిబోస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతారు.వైట్ టీఇది చాలా అరుదైన రకం పానీయం. తేయాకు మొక్కల్లో అత్యంత అరుదైన ‘కేమెలియా సైనెసిస్’ అనే మొక్క నుంచి లేత చిగురుటాకులను, మొగ్గలను సేకరించి, వాటితో వైట్ టీ తయారు చేస్తారు. వైట్ టీ కోసం లేత చిగురుటాకులను, మొగ్గలను వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో సేకరిస్తారు. బ్లాక్ టీ, గ్రీన్ టీల కంటే వైట్ టీ గాఢత చాలా తక్కువగా ఉంటుంది. చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్లో ఈ అరుదైన తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, వాపులను తగ్గించే ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.యెల్లో టీతేయాకు మొక్కల నుంచి సేకరించిన లేత ఆకులను ప్రత్యేకమైన పద్ధతిలో ఆరబెట్టి యెల్లో టీకి తగిన తేయాకును తయారు చేస్తారు. కొరియాలో యెల్లో టీ వినియోగం ఎక్కువ. కొరియన్లు దీనిని ‘హ్వాంగ్ చా’ అని, చైనీయులు దీనిని ‘హువాంగ్ చా’ అని అంటారు. తయారీ పద్ధతిలోని కష్టనష్టాల కారణంగా దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి తేనీటిని తయారు చేస్తారు. ఇది పారదర్శకమైన లేత పసుపు రంగులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు.∙∙ పురాతన చరిత్రటీ ఆధునిక పానీయమని చాలామంది పొరబడతారు. ఇలా పొరబడటానికి కారణం లేకపోలేదు. మధ్యయుగాల వరకు తేయాకు వినియోగం కేవలం చైనాకు మాత్రమే పరిమితమైంది. డచ్ వర్తకులు, పోర్చుగీసు వర్తకులు క్రీస్తుశకం పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో తేయాకును యూరోప్కు పరిచయం చేశారు. క్రమంగా ఇది ఇంగ్లండ్కు, అక్కడి నుంచి బ్రిటిష్ వలస రాజ్యాలకు చేరింది. అయితే, తేనీటి వినియోగం క్రీస్తుపూర్వం 2732 నాటికే చైనాలో మొదలైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఒక అనుకోని సంఘటన వల్ల ఆనాటి చైనా చక్రవర్తి షెన్ నుంగ్కు తేయాకు మహిమ తెలిసివచ్చిందట! ఒకనాడు ఆయన ఆరుబయట కూర్చుని, నీరు మరిగిస్తున్నప్పుడు ఆ నీటిలో ఒక చెట్టు నుంచి రాలిన ఆకులు పడ్డాయి. ఆ నీటిని ఆయన సేవించాడు. దాని రుచి, పరిమళం ఆయనకు తెగ నచ్చాయి. అంతేకాదు, ఆ పానీయం తన శరీరంలోని అణువణువును శోధిస్తున్న అనుభూతి కూడా కలిగిందట! అందుకే ఆయన ఈ పానీయానికి ‘చా’ అని పేరుపెట్టాడు. చైనీస్ భాషలో ‘చా’ అంటే శోధించడం లేదా తనిఖీ చేయడం అని అర్థం. క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దిలో బౌద్ధ గురువు డెంగ్యో దైషీ తొలిసారిగా జపాన్కు తేయాకును పరిచయం చేశాడు. ఆయన ద్వారా అనతికాలంలోనే తేనీరు జపనీయుల అభిమాన పానీయంగా మారింది. మిగిలిన ప్రపంచానికి ఇది పరిచయం కావడానికి మాత్రం మరికొన్ని శతాబ్దాల కాలం పట్టింది. ఇరవయ్యో శతాబ్ది నాటికి తేనీటి మహిమ ప్రపంచమంతటికీ తెలిసివచ్చింది. తేయాకు మొక్కలు సాధారణంగా పొదలుగా పెరగడమే చూస్తుంటాం. నిజానికి ఇవి మొక్కలు కావు, చెట్లు. ఇవి వంద అడుగుల ఎత్తువరకు పెరగగలవు. వీటి జీవితకాలం యాభైఏళ్లకు పైగానే ఉంటుంది.గ్రీన్ టీ కోసం సాధారణంగా ఆరబెట్టిన తేయాకునే వాడతారు. జపాన్లో అత్యంత అరుదుగా కొందరు తాజా తేయాకును నేరుగా మరిగించి, గ్రీన్ టీ తయారు చేస్తారు. దీనిని ‘టెన్చా’ అంటారు.చైనాలో తడిపి ఆరబెట్టిన తేయాకును ఒత్తిడికి గురిచేసి, కేకుల్లా మార్చి నిల్వచేసేవారు. వీటిని రెండేళ్ల నుంచి యాభయ్యేళ్ల వరకు నిల్వ ఉంచి, తేనీటి తయారీకి వినియోగించేవారు. వీటితో తయారు చేసిన తేనీటిని ‘కొంబూచా’ అంటారు. అలాగే, ఈ తేయాకు కేకులను నగదుగా కూడా ఉపయోగించే వారు.తేయాకు యూరోప్కు పరిచయమైన కొత్తరోజుల్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. ఇంగ్లండ్లో తేనీటి సేవనం రాచవంశీకులకు, సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేది. పద్దెనిమిదో శతాబ్దిలో తేయాకు తోటల్లో విందులు జరుపుకోవడం సంపన్నుల వేడుకగా ఉండేది.తేయాకు కోసం బ్రిటన్కు, చైనాకు యుద్ధం కూడా జరిగింది. బ్రిటన్లో తేయాకుకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దిగుమతి చేసుకోవాలంటే, చైనా మాత్రమే ఆధారం. తేయాకు కోసం వెండి రూపంలోనే చెల్లింపులు జరపాలని చైనా బిగదీసుకుంది. బ్రిటిష్ ఖజానాలోని వెండి నిల్వలన్నీ తేయాకుకే ఖర్చవుతుండటంతో బ్రిటిష్ సైన్యం చైనాతో యుద్ధం చేసింది. ‘మొదటి నల్లమందు యుద్ధం’ పేరుతో 1839–42 వరకు చరిత్రలో నమోదైన ఈ యుద్ధానికి అసలు కారణం తేయాకు గిరాకీనే! (చదవండి: వ్యోమయాత్రకు భారతీయుడు) -
ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్బాస్ ఫేం
మలయాళ టీవీ నటి, యాంకర్ బిగ్బాస్ ఫేం ఆర్య బాబు (ఆర్య బదై) తన జీవితంలో సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఎట్టకేలకు తన ప్రేమ రెండో పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆర్య బడై బంగ్లా ఫేమ్, ప్రాణ స్నేహితుడు, వెడ్డింగ్ డిజైనర్ సిబిన్ బెంజమిన్తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ఇద్దరూ ఇన్స్ట పోస్ట్ ద్వారా వెల్లడించారు. అలాగే ప్రేమపూర్వక సందశాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో పంచుకున్నారు. దీంతో ఇద్దరికీ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. 'ది బెస్ట్ అన్ ప్లాన్డ్ థింగ్' అంటూ ఆర్య తన ఎంగేజ్మెంట్ వార్తను అభిమానులతో షేర్చేసింది. మలయాళం బిగ్ బాస్ 2 లో ఆర్య, సిబిన్ కలిసి పాల్గొన్నారు. ఆర్య తన కాబోయే భర్తతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!‘‘సిబిన్ సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాను. ప్రాణ స్నేహితుల నుండి జీవితాంతం సహచరులుగా... జీవితం ఒకే ఒక సాధారణ ప్రశ్నతో , నా మొత్తం జీవితంలో నేను తీసుకున్న వేగవంతమైన నిర్ణయంతో అత్యంత నమ్మశక్యం కాని, అందమైన మలుపు తీసుకుంది. ఇది అస్సలు ప్లాన్ చేసుకోని విషయం... ఆనందంలో, బాధలో తోడుంటే వ్యక్తిగా, నా కూతురు ఖుషీకి ఉత్తమ తండ్రిగా, స్నేహితుడిగా,మా మొత్తం కుటుంబానికి బలమైన సపోర్ట్గా ఉన్నందుకు ధన్యవాదాలు. చివరకు నేను సంపూర్ణం.. నా గృహం నీచేతుల్లో..’’ అని పోస్ట్ పెట్టింది ఆర్య.ఇదీ చదవండి: బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!అటు సిబిన్ కూడా ఆర్య కోసం ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఫోటోను షేర్ చేశాడు. ఆర్యను ముద్దుగా 'చోక్కి' అని పిలుస్తాడు. ఆర్య లాగే,. ర్యాన్ , ఖుషీ ఇద్దరికీ తండ్రిగా ఉన్నందుకు సంతోషిస్తూ, సిబిన్ ఇలా వ్రాశాడు: "నేను జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను - అవి తరచుగా నన్ను కోల్పోయేలా, విచ్ఛిన్నం చేసేలా చేశాయి. కానీ ప్రతి తుఫానులో, ఎలాంటి శషబిషలు లేకూడా నాతో నిలిచిన వ్యక్తి. అదే ఆమె - నా ప్రాణ స్నేహితురాలు. గందరగోళంలో నాకు ప్రశాంతత, నిశ్శబ్దంలో నా నవ్వు, నా ఓదార్పు - నా చోక్కీ... నా చోక్కీ, నా కొడుకు ర్యాన్ ,నా కుమార్తె ఖుషీతో హృదయపూర్వకంగా, ఎప్పటికీ అంతం జీవితం ప్రారంభించబోతున్నాను. దేవా, నాకు నా శాశ్వతత్వాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.కాగా కాంచీవరం.ఇన్కు ఫౌండర్ సీఈవోగా ఉంది ఆర్యం. ఆర్య గతంలో రోహిత్ సుశీలన్ను వివాహం చేసుకుంది. వీరికి ఖుషీ (13) అనే కుమార్తె ఉంది. పెళ్లైన పదేళ్లకు 2018లో ఆర్య, రోహిత్ విడిపోయారు. ఆ తరువాత ప్రముఖ వివాహ డీజే సిబిన్తో ప్రేమలో పడింది. వీరు చాలా సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు. తమ సంబంధాన్ని చాలావరకు గోప్యంగా ఉంచారు, ఎట్టకేలకు తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సిబిన్కు కూడా మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు ర్యాన్ ఉన్నాడు. -
'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..
ఇటీవల కాలంలో సీజేరియన్ డెలివరీల కంటే..నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు పలువురు మహిళలు, సెలబ్రిటీలు. ఆ దిశగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుని మరీ ప్రసవిస్తున్నారు. అయితే ఇటీవల ఎక్కువగా ట్రెండ్ అవుతోంది 'వాటర్ బర్త్'. చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు దీని గురించే సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్. అంతేగాదు ఈ నీటి ప్రసవం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పొకొచ్చారామె. ఇంతకీ ఏంటా ప్రసవం.. ? అందరూ దీన్ని ఎంచుకోవచ్చా..? తదితర విషయాలు గురించి తెలుసుకుందామా..కల్కి కొచ్లిన్ ఫ్రెంచ్ దేశానికి చెందిన బాలీవుడ్ నటి. తన విలక్షణమైన నటనతో ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందిన నటి. ఆమె పియానిస్ట్ గయ్ని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె అందరిలాంటి నార్మల్ డెలివరీ కాకుండా..నీటి ప్రసవాన్ని ఎంచుకుంది. సంప్రదాయ నార్మల్ డెలివరీలలో ఇది కూడా ఒకటి. బిడ్డను స్వాగతించడానికి ఈ పద్ధతి అద్బుతమైనదని అంటోంది నటి కల్కి. శరీరానికి చాలా సులభమైన ప్రక్రియని చెబుతోందామె. కానీ భారతీయ మహిళలు దీన్ని ఎందుకు ఎంచుకురో తెలియడం లేదన్నారు. బహుశా ఇది ఖర్చుతో కూడిన ప్రక్రియనే ఉద్దేశ్యంతో కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారామె. ఇటీవల అలీనా డిసెక్ట్స్తో జరిగిన సంభాషణలో నటి కల్కి ఈ విషయాలు వెల్లడించారు. ఇదేమి ఆశ్చర్యపోవాల్సిన ప్రవాస ప్రక్రియ కాదంటున్నారామె. శిశువు అల్రెడీ ఉమ్మనీరులో ఉంటుంది కాబట్టి ఇలా నీటిలో ప్రసవిస్తే శిశువుకి మరింత సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు కల్కి. ఆస్పత్రిలో కూడా అందుకు సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయని చెబుతోంది కల్కి. సహజ సిద్ధమైన కాన్పులలో ఇది ఒకటని..ఇటీవలే నెమ్మదిగా వెలుగులోకి వస్తోందని చెబుతున్నారామె. ముఖ్యంగా తనలాంటి సెలబ్రిటీల అనుభవాలతోనే ప్రజలకు తెలుస్తోందని చెబుతోంది. అసలేంటి ప్రసవం..వాటర్ బర్త్ అంటే ..సింపుల్గా చెప్పాలంటే..వాటర్ బర్త్ అంటే.. ఒక రకమైన ప్రసవం. దీనిలో కాబోయే తల్లి డెలివరీ టైంలో ప్రవహించే కొలను లేదా వెచ్చని నీటి తొట్టిలో గడుపుతారు. అలా విశ్రాంతి తీసుకున్నప్పుడూ..డెలివరీ సంక్లిష్టంగా కాకుండా సులభంగా అయిపోతుంది. సాధారణ ప్రసవంతో పోలిస్తే..ఈ ప్రసవం చాలా సౌకర్యవంతగంగా, తేలికపాటి కష్టంతో కూడుకున్నదని చెబుతున్నారు వైద్యులు. ఇది ఎందుకు ప్రజాదరణ పొందుతోందంటే..తల్లి శరీర బరువుని తగ్గించి స్వేచ్ఛగా కదలడానికి అనుమతిస్తుంది. అలాగే సమర్ధవంతమైన గర్భాశయ సంకోచాలను ప్రోత్సహిస్తుంది. పైగా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా గర్భాశయ కండరాలు తక్కువ నొప్పితోనే ప్రసవం అయ్యేలా చేస్తాయి. అలాగే శిశువుకి మంచి ఆక్సిజన్ కూడా అందుతుందట. అంతేగాదు డెలివరీ టైంలో ఉండే ఆందోళన కూడా నీటిలో మునిగి ఉండటం వల్ల తగ్గుతుందట. ఒత్తిడికి సంబధించిన హార్మోన్లు తగ్గించి..నొప్పులు వచ్చేలా ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా వీలు కల్పిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల నీటిలో తక్కువ పురిట నొప్పులతోనే ప్రసవం సులభంగా అయిపోతుందట.అందరూ ఈ ప్రక్రియ ఎంచుకోవచ్చా.?క్రిటికల్ కానీ గర్భణిలు మాత్రమే ఈ పద్ధతిని ఎంచుకోగలరని చెబుతున్నారు నిపుణులు. అలాగే పిండం 37 నుండి 41 వారాల మధ్య ఉంటేనే ఈ పద్ధతికి అనుమతిస్తారట. అలాగే తల్లిలో అమ్నియోటిక్ ద్రవం(ఉమ్మనీరు) తగిన మోతాదులో ఉండాలని చెబుతున్నారు. అలాగే నెలలు నిండక ముందు అయ్యే కాన్పులకు ఈ పద్ధతి పనికిరాదని చెబుతున్నారు. అదీగాక గతంలో సీజేరియన్ అయ్యిన మహిళలు కూడా ఈ ప్రక్రియని ఎంచుకోకూడదని వెల్లడించారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'టీ బ్యాగులు' తింటే ఏమవుతుందో తెలుసా..!) -
'టీ బ్యాగులు' తినడం గురించి విన్నారా..?
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాట్లు ఉంటాయి. కానీ కొందరికి చాలా వెరైటీ అభిరుచులు ఉంటాయి. అది తినడం లేదా స్కిల్ పరంగా ఏదైనా.. ఆ అలవాట్లు చాలా చిత్రంగా ఉంటాయి. అలానే ఇక్కడొక అమ్మాయికి ఉన్న విచిత్రమైన అలవాటు వింటే..ఇదేం అభిరుచి అనిపిస్తుంది.సైప్రస్లోని లిమాసోల్కు చెందిన లియుబోవ్ సిరిక్ అనే 20 ఏళ్ల అమ్మాయికి ఓ వింత ఆహారపు అలవాటు ఉంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ అభిరుచి నెట్టింట హాట్టాపిక్గా మారింది. 'టీ' అంటే ఇష్టపడే ఆహార ప్రియులు ఆమె అలవాటు వింటే..వామ్మో అని నోరెళ్లబెడతారు. మార్కెటింగ్ బ్రాండ్ మేనేజర్ అయిన లియుబోవ్కి టీ బ్యాగులు తినడం అంటే ఇష్టమట. టీ తాగిన తర్వాతా ఆ టీ బ్యాగ్ని పడేయకుండా మొత్తంగా తినేస్తుందట. ఇలా ఆమె రోజుకు రెండుసార్లు తినేస్తానని చెబుతోందామె. వారానికి కనీసం మూడుసార్లు పేపర్ టీ బ్యాగ్లు ఫినిష్ చేస్తానని అంటోంది. ఈ అలవాటు 14 ఏళ్ల అప్పుడు ప్రారంభమైందట. వాళ్ల అమ్మమ్మ పుదీనా ఆకులు తినమని చెప్పినప్పుడూ ..ఈ టీ ఆకులు రుచి చూడాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే టేస్ట్ నచ్చి..అది క్రమంగా అలవాటుగా మారిందని అంటోంది లియుబోవ్. ఆమె ఆర్గానిక్ టీ బ్యాగులను మాత్రమే తింటుందట. ప్లాస్టిక్ లేదా నైలాన్తో ఉన్న వాటిని టచ్ చేయనని చెబుతోంది. అయితే కొన్ని టీ బ్యాగుల్లో ఫాబ్రిక్ ఉంటుంది కాబట్టి తినడానికి కష్టంగా ఉంటుందని అంటోంది. అయితే ఆమె ఈ అలవాటుని వదిలేద్దాం అనుకుందట గానీ సాధ్యం కాలేదని చెబుతోంది. ఇది ప్రమాదకరమా..?అయితే ఇదిప్రమాదకరమా అంటే..ఒక్కోసారి ఆ టీ వేస్ట్ గొంతులో అడ్డుపడటం లాంటిది జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గొంతు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల వాదన. కానీ ఈ అమ్మాయి లియుబోవ్ మాత్రం ఈ అలవాటు మంచిదేనా? కాదా? అని గూగుల్లో సర్చ్ చేసిందట. చివరికి ఇది హానికరం కాదని నిర్థారించుకున్నాకే ధీమాగా తింటున్నానని చెబుతోంది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యంగానే ఉన్నానంటోంది. ధూమపానం, మద్యం వంటి అలవాట్ల కంటే ప్రమాదకరమైనది కాకపోయినా..సాద్యమైనంత వరకు ఈ అలవాటుని దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తానంటోంది. అయినా ఏ అలవాటుకైనా అడిక్ట్ అయ్యిపోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే 'అతి సర్వత్ర వర్జయేత్' అని పెద్దలు ఊరికే అనలేదు కదా..! ఆరోగ్యానికి హానికరం కాకపోయినా..తగు జాగ్రత్తలో ఉండటమే మంచిది కదూ..!. View this post on Instagram A post shared by Newsflare (@newsflare) (చదవండి: 70 ఏళ్ల వ్యక్తి కాలినడకతో కేదార్నాథ్కు..! వీడియో వైరల్) -
మామిడి తొక్కే కదా అని పారేయొద్దు.. లాభాలెన్నో తెలుసా?
ఇది మామిడి సీజన్ – ఎండల వేడితో పాటూ దక్కే తీపి రుచులు మామిడి పండ్లు. ఈ సీజన్లో మామిడి పండ్లు తింటాం కానీ.. తొక్క మాత్రం తీసి విసిరేస్తాం. కానీ మీకు తెలుసా? మామిడి తొక్క కూడా ఓ పోషకవంతమైన ఆహారం కావచ్చు. అవును – మామిడి తొక్క తినదగినదే, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి మంచిది కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు..తొక్క తినడం సురక్షితమేనా?సాంకేతికంగా చూస్తే, అవును. మామిడి తొక్క విషమేమీ కాదు. ఇది ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగిఫెరిన్, క్వెర్సిటిన్, కెరోటినాయిడ్లు వంటి బయోయాక్టివ్ పదార్థాలతో నిండివుంది. అయితే మామిడి తొక్క మందంగా, కొద్దిగా చేదుగా, కొన్నిసార్లు కొబ్బరి తరహాల ఉంటుంది. అందువల్ల చాలా మందికి నచ్చదు.అంతేకాదు కొంత మందికి మామిడి తొక్కలోని కొన్ని పదార్థాలు అలెర్జీ కలిగించొచ్చు మామిడిని తీసేటప్పుడు మురికితో పాటు చర్మంపై మంట వచ్చినట్లయితే, తొక్క తినకుండా ఉండటమే మంచిది.తొక్కలో పోషకాలు...ఇందులోని ఫైబర్: జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మాంగిఫెరిన్ వంటి పదార్థాలు శరీరంలో అలర్జీలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే కెరోటినాయిడ్లు, విటమిన్ ఇ చర్మాన్ని కాంతి వంతం చేస్తుంది. అలాగే కొన్ని పరిశోధనలు మామిడి తొక్క బ్లడ్ షుగర్ను నియంత్రించడంలో సహాయపడవచ్చని చెబుతున్నాయి. రుచికరంగా తినే విధాలు:మామిడి తొక్క చట్నీ:2 మామిడిల తొక్క (శుభ్రంగా కడగాలి)ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరిఅల్లం చిన్న ముక్క, తగినంత ఉప్పు,కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో కొద్దిగా మిక్స్ చేయండి. కావాలంటే మస్టర్డ్ గింజలు, కరివేపాకు టాంపర్ చేయొచ్చు.ఎండబెట్టి పొడి తయారు చేయడం:మామిడి తొక్కని ఎండలో లేదా ఓవెన్ లో బాగా ఎండబెట్టి పొడి చేసి, స్మూతీల్లో లేదా మసాలా మిశ్రమాలలో కలుపుకోవచ్చు. ఒక చిన్న ముక్క మామిడి తొక్క పండిన మామిడి, అరటిపండు, యోగర్ట్తో కలిపి మేళవిస్తే.. తీపి, చేదు మధ్య బ్యాలెన్స్ అవుతుంది. తొక్కని తరిగి, నీళ్ళలో నానబెట్టి, కొన్ని రోజులు ఫెర్మెంటేషన్కు ఉంచండి. స్వచ్చమైన వెనిగర్ లాగా తయారవుతుంది. సలాడ్ డ్రెస్సింగ్కు బాగా సరిపోతుంది.శుభ్రంగా కడిగిన మామిడి తొక్కని వేడి నీటిలో లేదా గ్రీన్ టీ లో వేసి మరిగించండి. హల్కా రుచి, యాంటీ ఆక్సిడెంట్ల తేలికపాటి పౌష్టికత మీకు లభిస్తుంది.జాగ్రత్తలు...పండే మామిడి తొక్కపై పురుగుమందుల శేషాలు ఉండొచ్చు. తొక్క తినాలంటే ఆర్గానిక్ మామిడిని మాత్రమే ఎంచుకోవాలి. అలా దొరకని పక్షంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అవేంటంటే..నీళ్ళలో 1 టీస్పూన్ ఉప్పు, టీస్పూన్ పసుపు కలిపి 10–15 నిమిషాలు నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగడం ద్వారా కాయపై అలుముకున్న పెస్టిసైడ్స్ ఏవైనా ఉంటే తొలగించవచ్చు. అలాగే ఒక బౌల్ నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 15 నిమిషాలు నానబెట్టి, తరువాత మంచి నీటితో కడగడం 1:3 నిష్పత్తిలో వెనిగర్ : నీటిలో కలిపి 15–20 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి. అలాగే తినాలనుకుంటే మామిడి తొక్కని మృదువైన బ్రష్ లేదా గుడ్డతో సున్నితంగా తోమి శుభ్రం చేయాలి.(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అంతర్జాతీయ వంటకాలు..) -
ట్రావెల్ ఎక్స్పీరియన్స్: ఎందుకు రాయాలో తెలుసా..?
బస్సెక్కినా రైలెక్కినా విమానం ఎక్కినా మనకు కావలసింది ఏది? కిటికీ పక్కన సీటు? ఎందుకు? బయటకు చూస్తుంటే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? కొత్త ప్రాంతాలు కాబట్టి. పిల్లలూ... మనిషి పుట్టింది ఉన్న చోట ఉండటానికి కాదు. ప్రయాణించడానికి. తిరిగి లోకం చూడాలి. కొత్త మనుషులను కలవాలి. ప్రయాణాల్లో ఏం చూశారో, ఏం తెలుసుకున్నారో రాయాలి. అప్పుడు మీరు ‘ట్రావెల్ రైటర్’ అవుతారు. ‘యాత్రికుడు’ అనిపించుకుంటారు.పిల్లలూ! వేసవి సెలవుల్లో అమ్మా నాన్నలు మిమ్మల్ని ఏదో ఒక ఊరు తీసుకెళతారు. కొత్త ప్రదేశాలు చూపిస్తారు. మీరు అక్కడి వింతలు, విశేషాలు చూసి ఆనందిస్తారు. కొన్ని ఫొటోలు దిగి, తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అక్కడితో ఆ పర్యటన ఓ గుర్తుగా మారుతుంది. అంతటితో సరేనా? దాన్ని మరింత పదిలం చేసుకోవాలని మీకు ఉండదా? మరి దానికేంటి మార్గం? ఒక్కటే. మీ పర్యటనలో మీకు ఎదురైన అనుభవాలను రాయడం. వాటిని రికార్డు చేసి పదిలంగా దాచుకోవడం.ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు రాయాలి?ట్రావెలర్స్ ట్రావెల్ చేసి పొందిన అనుభవాలను రాయడం కొత్త విషయమేమీ కాదు. గతంలో ఎంతోమంది తాము చేసిన యాత్రల వివరాలు, విశేషాలను పుస్తకాల రూపంలో రాశారు. వాటిని ‘యాత్రా కథనాలు’ అంటారు. వాటిని చదవడం వల్ల అక్కడకు పోలేని వారికి ఆ ప్రాంతాల చరిత్ర, విశిష్టత, కల్చర్, లైఫ్స్టైల్ గురించి అవగాహన ఏర్పడుతుంది. కొత్త ప్రదేశాల్లో ఉండే వైవిధ్యం తెలుస్తుంది. ఇదే మీరూ చేయొచ్చు. మీరు చూసిన ప్రదేశాల తాలూకు విశేషాలను వ్యాసంగా రాయొచ్చు. దాన్ని మీ స్నేహితులకు, టీచర్లకు చూపించొచ్చు. దీనివల్ల మీ అనుభవాలకు విలువ ఏర్పడుతుంది. అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు.యాత్రాకథనాలు రాయడం వల్ల కలిగే లాభాలుయాత్రాకథనాలు రాయడంలో మీ ఎక్స్ప్రెషన్దీ లాంగ్వేజ్దీ కీలకమైన పాత్ర. కొత్త ప్రాంతంలో మనకు ఎదురైన అనుభవాలను మన మాటల్లో పెట్టడం వల్ల మనసులోని భావాలను ఎలా వ్యక్తీకరించాలో తెలుస్తుంది. దీనివల్ల స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది. నచ్చింది నచ్చనిది చెప్పడం చేతనవుతుంది. ఉదాహరణకు మీరు ఊటీ వెళ్లారనుకోండి. క్యాబ్డ్రైవర్ మీతో మంచిగా వ్యవహరిస్తే ఆ సంగతి రాస్తారు. ర్యాష్గా ఉంటే ‘ఊటి వెళ్లినప్పుడు మీరు సరైన డ్రైవర్ను ఎంచుకోండి. లేకుంటే ఇబ్బంది పడతారు’ అని రాస్తారు. అది చదివి మిగిలిన వారు అలర్ట్ అవుతారు.జ్ఞాపకశక్తి పెరుగుతుందిమీరు ట్రావెలింగ్లో చూసిన విషయాలు అప్పటికప్పుడు పుస్తకంలో రాసుకోవచ్చు లేదా వాటిని గుర్తు పెట్టుకొని ఇంటికి వచ్చాక రాసుకోవచ్చు. లేదా అక్కడే చిన్నచిన్న పాయింట్ల రూపంలో రాసుకొని, ఇంటికి వచ్చాక విస్తరించి రాయొచ్చు. ఇలా చేయడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీ ఆలోచనాధోరణి పదునెక్కుతుంది.చారిత్రక, సాంస్కృతిక అవగాహనమీరు చూసిన ప్రదేశాల గురించి రాయాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ ప్రదేశాల గురించి గూగుల్ చేస్తారు. మీరు చూసిన చోటు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. ఉదాహరణకు రెండు రోజులు హంపీ చూసి వస్తారు. ఆ ప్లేస్ మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. గూగుల్ చేసి యూట్యూబ్ ద్వారా హంపి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారు. దీనివల్ల ఆ ప్రదేశాల చరిత్ర, సాంస్కృతిక విశేషాలు తెలుసుకుంటారు. ఇది మీకెంతో మేలు చేస్తుంది. నేరుగా తెలుస్తుందిఎప్పుడూ స్వీట్ తినని వారికి ఎంత చెప్పినా స్వీట్ అంటే ఏంటో తెలియదు. కేరళ ఎలా ఉంటుందో ఎన్ని వీడియోలు చూసినా నేరుగా చూడటంలోని మజా రాదు. కేరళ వెళితే హౌస్బోట్లో తిరుగుతున్నప్పుడు ఆ బ్యాక్వాటర్స్లో ఎంత బాగుంటుందో అనుభవించి రాస్తే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. ప్రపంచంలో గొప్ప వారంతా నెలలో, మూడు నెలలకోసారి ఏదో ఒక కొత్త ప్రాంతానికి వెళతారు. ఎందుకంటే తిరిగితే నాలుగు విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ ట్రావెలర్స్ ఎందరో తిరుగుతూ వీడియోలు చేస్తూ సంపాదిస్తున్నారు కూడా. వేసవి సెలవులన్నీ నెక్స్ట్ క్లాస్ సబ్జెక్ట్స్ చదువుతూ వృథా చేయకండి. కిటికీ పక్కన ఒక్కసారైనా కూచోండి. కదలండి.– కె. (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..) -
జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు..ట్రెండ్కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!
చక్కటి ఆభరణాలు వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం, ఇది దుస్తులను మెరిపించడం మాత్రమే కాదు డ్రెస్సింగ్ వెలవెల పోయేలా చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. మెరవాలంటే ట్రెండ్కు అనుగుణంగా ఉంటే మాత్రమే సాధ్యం. అయితే ప్రతి సీజన్లో రకరకాల ట్రెండ్లు వస్తుండటంతో, ఏది అనుసరించాలో, ఏది వదిలివేయాలో ? అనే గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో సిటీ జ్యువెలరీ డిజైనర్లు అందిస్తున్న సూచనలివి.. లేయరింగ్, స్టాకింగ్.. పలు రకాల లెంగ్త్ ఉన్న చైన్ పెండెంట్లను లేయర్లాగా ధరించవచ్చు. లేదా ఒకే వైపు పలు బ్రేస్లెట్లను ఒకటిగా పేర్చవచ్చు. ఆల్ పీసెస్ రంగులు కలిసి కనబడేలా చూసుకోవడమే ఖచి్చతమైన స్టాక్కు కీలకం. ఇవి ఒక సాధారణ బైండింగ్ కారకంగా ఉండాలి. షాండ్లియర్ చెవిపోగులు.. ఈ షాండ్లియర్ శైలి చెవిపోగులు అత్యధికంగా మహిళల్ని ఆకట్టుకుంటాయి. దుస్తులకు నప్పేలా అలంకరణకు ఇది సరైన మార్గం. వీటిని మరే ఇతర ఆభరణాలూ లేకుండా ధరించవచ్చు. డైమండ్ షాండ్లియర్స్ కావచ్చు లేదా జడౌ చంద్బాలిస్ కావచ్చు చెవిపోగులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బోల్డ్ రింగులు.. ఒక పెద్ద డేరింగ్ రింగ్ ధరించడం రూపానికి అత్యాధునికతను జోడిస్తుంది. దీని కోసం ఓ అసాధారణమైన డిజైన్లను ఎంచుకోవాలి. రత్నం, సిగ్నెట్ పెద్ద వాస్తవిక పువ్వులు వంటివి మరింత అందాన్నిస్తాయి. జడౌ..జతగా.. ఏదైనా భారతీయ ఆభరణాల శైలిలో జడౌ నెక్లెస్ ధారణ తరతరాల వారసత్వంగా వస్తోంది. పూర్వ కాలంలో చాలా ఆభరణాలు మొఘల్ ఇతివృత్తంతో ప్రభావితమయ్యాయి, అయితే ప్రస్తుతం ఆధునిక ఆభరణాల తయారీలో పురాతన పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని జత కలపడం ఒక ప్రత్యేకమైన కొత్త సంప్రదాయంగా మారింది. ఆ విధంగా జడౌ నెక్లెస్కు ఆదరణ పెరిగింది. ఆమె..ఆభరణం.. కాబోయే వధువు అయితే, పెళ్లి రోజు లుక్లో ఆభరణాలు అతి ముఖ్యమైన భాగం. పెళ్లి ఆభరణాలు, అవి ఏ వధువునైనా యువరాణిగా చూపించగలవు. పెళ్లి వేడుకల్లో భారీ నెక్పీస్ ఎంచుకుంటారు. అయితే ఇవి విడదీసి, ధరించగలిగేలా ప్రత్యేకంగా రూపొందుతాయి. అన్నీ కలిపినప్పుడు అవి గ్రాండ్లుక్ని సంతరించుకుంటాయి. అలాగే వివాహానంతరం కూడా వాటిని సందర్భానుసారం ధరించవచ్చు. ఆఫీస్..డైమండ్ పీస్.. పని విధానాలకు అనుగుణంగా అలాగే సాయంత్రం సమావేశాల్లో సమర్థవంతంగా మమేకమయ్యే అందమైన పీసెస్, సెన్సిటివ్ డైమండ్ హగ్గీలు లేదా సాలిటైర్ స్టడ్లు రోజువారీ డ్రెస్సింగ్కు సరైన ఎంపిక. ఆఫీసుకు ఇండియన్ ఫార్మల్స్ ధరించడం ఇష్టపడితే, డైమండ్ సరౌండ్తో లేదా ఒక జత సింగిల్ పోల్కీ ఇయర్ స్టడ్తో సరిపెట్టొచ్చు. (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..) -
కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..
హైదరాబాద్ నగరంలో బ్లైండ్ ఫోల్డ్ వర్క్షాప్స్ ఊపందుకుంటున్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని కుంచెకు పనిచెప్పే చిత్రకారులు సృష్టిస్తున్న చిత్రాలు కళాభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో ఆ తరహా చిత్రకళా నైపుణ్యం అందించే వర్క్షాప్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా నగరంలోని మాదాపూర్లో ఉన్న ట్రైలింగ్ ఐవీ కేఫ్ ఆధ్వర్యంలో ఒక వర్క్షాప్ జరగనుంది. ఔత్సాహికులకు బ్లైండ్ ఫోల్డ్ ఆర్ట్ మెళకువలను నేర్పేందుకు శనివారం మధ్యాహ్నం 12.గంటలకు ఈ వర్క్షాప్ ప్రారంభం కానుంది. దాదాపు 2గంటల పాటు కొనసాగే ఈ కళాశిక్షణపై ఆసక్తి కలిగినవారు బుక్ మై షో ద్వారా ఎంట్రీలు పొందవచ్చు. (చదవండి: Araku Aroma : హైదరాబాద్ టు యూఎస్..తొలి బ్రాండ్గా అరుకు అరోమా..!) -
అమెరికాలో అరకు రుచులు..
అరకు కాఫీ రుచిని యునైటెడ్ స్టేట్స్కు పరిచయం చేసిన మొదటి బ్రాండ్గా అరకు అరోమా నిలిచిందని, హైదరాబాద్ నగరంతో పాటు స్థానిక రుచులను విశ్వవ్యాప్తం చేయడంలో తాము వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అరకు అరోమా వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య తెలిపారు. క్రిష్ ఫుడ్ అండ్ ఫన్ ఇండియా ఆధ్వర్యంలో అరకు అరోమా కొత్త కాఫీ బ్లెండ్లను ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రుచి, నాణ్యతకు ప్రసిద్ధి చెందిన ఈ ఆఫర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఔత్సాహికులకు సరికొత్త అనుభవాలను అందిస్తాయని అన్నారు. ఈ కొత్త బ్లెండ్లలో అరకు అరోమా గ్రీన్ కాఫీ, అరబికా రీగేల్, ఫిల్టర్ కాఫీ, అరబికా ప్రైమ్ ఉన్నాయన్నారు. యూఎస్ఏలో రిజిస్టర్డ్ బ్రాండ్ ఉనికితో ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులకు సేవలు అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అందర్జాతీయ వంటకాలు.. ) -
మెక్సికన్ 'మే'నూ..! ఫుడ్ లవర్స్కు పసందు..
వేసవి సెలవుల్లో అలా విదేశాలు తిరుగుతూ మెక్సికన్ ఫుడ్ తినాలనుకుంటున్నారా..! అవసరం లేదు, తామే మెక్సికన్ రుచులను నగరానికి తీసుకొస్తున్నామని ప్రముఖ చెఫ్ అమన్నా రాజు అంటున్నారు. మే నెల వేసవిలో వారాంతాలను అలా మెక్సికన్ స్మోకీ మెరినేడ్ రుచులను ఆస్వాదించాలనే వారికి తాము ప్రత్యేక వంటలను అందిస్తున్నట్లు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని నోవోటెల్ ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. మెక్సికోలోని ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన విభిన్న రుచులను మెక్సికన్ గ్రిల్ నైట్స్తో నగరానికి పరిచయం చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతి శనివారం ఈ మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ అలరించనుంది. ఓ వైపు భాగ్యనగరం వేదికగా ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మెక్సికన్ ఫుడ్ వెరైటీలు నగర వాసులను, నగరానికి విచ్చేస్తున్న విదేశీ అతిథులను ఆతీ్మయ విందుకు ఆహ్వానిస్తోంది. అంతేకాకుండా ఈ ఫెస్ట్ నగరంలోని ఆహార వైవిధ్యానికి, విభిన్న సంస్కృతులకు చెందిన రుచుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని నోవోటెల్ ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ సుఖ్బీర్ సింగ్ పేర్కొన్నారు. గ్యాస్ట్రోనమిక్ సంతృప్తి.. అంతర్జాతీయంగా మెక్సికన్ వంటలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఫ్లేమ్–గ్రిల్డ్ మాంసాహారాలు, స్మోకీ మెరినేడ్లు, అరుదైన సుగంధ ద్రవ్యాల కలయికే ఈ వంటల ప్రత్యేకత. ఈ గ్యాస్ట్రోనమిక్ రుచుల వైవిధ్యాన్ని వేసవి ప్రత్యేకంగా నగరంలో ఆవిష్కరిస్తున్నారు. ఈ ఫుడ్ ఫెస్ట్లో అతిథులు వెజిటబుల్ బౌల్, బీన్ ఎన్చిలాడా సూప్తో ప్రారంభిస్తారు. అనంతరం మినీ కార్న్ డాగ్స్ వంటి ఆహ్లాదకరమైన స్టార్టర్స్ను పచ్చి మిరపకాయ, ఆవాలు, రుచికరమైన గుమ్మడికాయ ఎంపనాడాస్తో కలిపి వడ్డిస్తారు. ప్రత్యేకంగా అందించే సలాడ్ టెక్స్చర్స్, వినూత్న రుచుల మిశ్రమంతో అలరిస్తుంది. ప్రత్యేక దినుసులు.. ఫెస్ట్లో భాగంగా సీఫుడ్ సెవిచే, శ్రీరాచా డ్రెస్సింగ్తో స్పైసీ మెక్సికన్ చికెన్ సలాడ్, చిపోటిల్ డ్రెస్సింగ్లో కలిపి కాల్చిన బెల్ పెప్పర్ సలాడ్ జిహ్వకు సరికొత్త రుచిని అందిస్తుంది. గ్వాకామోల్, పైనాపిల్ సల్సా, టొమాటో సల్సా వంటి క్లాసిక్ మెక్సికన్ రుచులు ఈ మెనూలో మరో ప్రత్యేకం. మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని మసాలాలు దక్షిణాది మసాల రుచులకు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. చికెన్ క్యూసాడిల్లాస్, కాలాబాసిటాస్ కాన్ క్వెసో – చీజ్, వెజిటబుల్ చీజ్ ఎన్చిలాడాస్తో వండిన గుమ్మడికాయ, రుచికరమైన మొక్కజొన్న మిశ్రమాల్లో మసాల పరిమళం నగరవాసులను ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాలకు తీసుకెళుతుంది. సీ ఫుడ్ లవర్స్ కోసం మెక్సికన్ రొయ్యలు, చేపల బిస్క్యూ పిసికాడో, కామరాన్ పోజోల్ను ఆస్వాదిస్తారు. (చదవండి: మిస్ వరల్డ్ మధురమైన పాట) -
మిస్ వరల్డ్ మధురమైన పాట
అందంలోనే కాదు అద్భుతమైన గానంలోనూ ‘భేష్’ అనిపించుకున్నారు మిస్ వరల్డ్ అందాల తారలు...మిస్ వరల్డ్ (2019) టోని–అన్ సింగ్, వైట్నీ హ్యూస్టన్ పాట ‘ఐ హ్యావ్ నథింగ్’ను మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్లో అద్భుతంగా ఆలపించింది.మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా తన సినిమాల్లోని పాటలను మ్యూజిక్ లేకుండానే పాడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.మిస్ వరల్డ్(1997) డయాన హేడెన్ ప్రొఫెషనల్ సింగర్. కాలేజీ రోజుల్లో ఎన్నో పోటీల్లో పాల్గొంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేసింది.మిస్ వరల్డ్ (1999) యుక్తా ముఖీ మోడలింగ్, నటనలోనే కాదు గానంలోనూ ‘భేష్’ అనిపించుకుంది. హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్లో మూడు సంవత్సరాల కోర్సు చేసింది.మిస్ వరల్డ్ (2017) మానుషి చిల్లర్ కూచిపూడి డ్యాన్సర్ మాత్రమే కాదు మంచి సింగర్ కూడా.మిస్ వరల్డ్ (1994) ఐశ్వర్య రాయ్ టెలివిజన్ షోలతో సహా ఎన్నో కార్యక్రమాలలో తన మధుర గాత్రాన్ని వినిపించింది. (చదవండి: ఎవరీ అవధేష్ కుమార్ భారతి? ఏకంగా రాష్ట్రపతి ఆయన సేవలకు..) -
ఎవరీ అవధేష్ కుమార్ భారతి? ఏకంగా రాష్ట్రపతి ఆయన సేవలకు..
పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్తో గట్టి బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్తో ఉగ్రమూకల్ని, వారి స్థావరాల్ని, మౌలిక సదుపాయాలను నేలమట్టం చేసింది. అంతేగాదు ఈ చర్యతో భారత్ ఉగ్రవాదాన్ని సహించేదే లేదని పాక్కి గట్టి సంకేతాలనే పంపించింది. ఇక ఆపరేషన్ అత్యంత కీలకపాత్ర పోషించింది భారత ఎయిర్ఫోర్స్. ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా కలిసి మరీ వారిని అభినందించారు. అయితే ఈ వైమానిక దాడుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి. ఆయనే వైమానిక దాడుల గురించి మీడియాకు వివరించారు. ముఖ్యంగా ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన తరుణంలో మరీంతగా హాట్టాపిక్గా మారారు ఎయిర్ మార్షల్ భారతీ. అలాగే ఆయన తల్లిదండ్రులు సైతం ప్రతిష్టాత్మకమన ఈ ఆపరేషన్లో తమ కొడుకు భాగం అయ్యినందు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఎవరు..? ఆ ఆపరేషన్ ఆయన పాత్ర ఏంటి తదితరాలు గురించి సవివరంగా చూద్దాం.వైమానిక దాడుల విరమణ అనంతరం..వాటి గురించి మీడియాకు వివరిస్తూ వార్తల్లో నిలిచారు ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అవదేష్ కుమార్ భారతి. ఆయన ఇతర సాయుధ సైనికులతో కలిసి నిర్వహించిన దాడుల గురించి సవివరంగా వివరించారు. ఈ ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడులలో కీలకపాత్ర పోషించారాయన. చిన్నప్పటి నుంచి భారతి తెలివైన విద్యార్థి అని చెబుతున్నారు తల్లిదండ్రులు.ఆయన తండ్రి నీటిపారుదల శాఖలో గుమస్తా కాగా, తల్లి గృహిణి. ఎయిర్ మార్షల్ భారతికి ఎడ్యుకేషన్ పరంగా మంచి రికార్డు ఉంది. ఆయన జార్ఖండ్లోని తిలైయాలోని సైనిక్ స్కూల్లో విద్యను అభ్యసించాడు. తల్లి ఊర్మిళ మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి భారతి నిరాడంబరంగా ఉండేవాడని, ఇప్పటికీ అలానే ఉంటాడని అన్నారు. చిన్నతనంలో ఎక్కువగా సాయుధ దళాల్లో చేరాలని చెబుతూ ఉండేవాడని, చివరికి దాన్ని సాధించాడని అన్నారు.వరించిన పదొన్నతులు.. ఎయిర్ మార్షల్ భారతి 1987లో భారత వైమానిక దళం ఫైటర్ స్ట్రీమ్లో చేరారు. 2008లో రాష్ట్రపతి వైమానిక దళ పతకాన్ని పొందారు. 2023లో ఎయిర్ మార్షల్గా పదోన్నతి పొందారు. ఆయన సుఖోయ్-30 స్క్వాడ్రన్కు కమాండింగ్ ఆఫీసర్గా కూడా పని చేశారు. దీనికంటే ముందు ప్రయాగ్రాజ్లోని సెంట్రల్ ఎయిర్ కమాండ్లో సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ (SASO)గా నియమించారు. అంతేగాదు ఇటీవలే ఆయనను రాష్ట్రపతి దౌప్రతి ముర్ము సత్కరించారు కూడా. పూర్ణిమ చంద్రుడిలా వెలుగులోకి.. తల్లిదండ్రులు మాట్లాడుతూ..ఈ ఆపరేషన్ సిందూర్ కారణంగా తమ కొడుకు పూర్ణిమ చంద్రుడి మాదిరిగా వెలుగులోకి వచ్చాడని అన్నారు. అతన ఉద్యోగంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. తన పిల్లలను కూడా అలానే ఉన్నతంగా తీర్చిదిద్దాడు. భారతి కశ్మీర్కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తమ కొడుకుని చూసి తామెంతో గర్వపడుతున్నామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ప్రపంచానికి తెలుస్తుందన్నారు.(చదవండి: 1971 Bhuj Airbase Story: ఆ 300 మంది మహిళలు 72 గంటల్లోనే..! ఎలాంటి రక్షణ ఆయుధాలు, శిక్షణ లేకుండానే..) -
తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన
బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ లేబుల్ బుర్బెర్రీ అమ్మకాలు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమవుతోంది. 2027 నాటికి ఖర్చులను తగ్గించే ప్రణాళికలలో భాగంగా తన సిబ్బందిలో 1700 మందిని తొలగించే అవకాశం ఉందని ప్రకటించింది. 2025 మే 14 న తమ బడ్జెట్లో కాస్ట్ కటింగ్ వివరాలను వెల్లడించింది. తాజా నివేదికల ప్రకారం భారీ నష్టాలను చవిచూసిన తర్వాత బుర్బెర్రీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ కోతలు కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను ఐదో వంతు తగ్గించుకోనుంది. ఇది వెస్ట్ యార్క్షైర్లోని ఇంగ్లీష్ బ్రాండ్, కాజిల్ఫోర్డ్ ఫ్యాక్టరీలో సంభావ్య తొలగింపులకు కూడా కారణమవుతుంది. కోతలు ఎక్కువగా యూకేలోని ఉద్యోగులను ప్రభావితం చేయనున్నాయని తెలుస్తోంది.చదవండి: Miss World 2025 నమస్తే నేర్చుకున్నాను : లెబనాన్ బ్యూటీ నదబుర్బెర్రీ అమ్మకాల విషయంలో ఎక్కువగా నష్టపోతోంది. చైనా, అమెరికాలో విలాసవంతమైన విభాగంలోని వస్తువులకు డిమాండ్ బాగా క్షీణించింది. మార్చి 29తో ముగిసిన సంవత్సరానికి పోల్చదగిన స్టోర్ అమ్మకాలలో 12శాతం తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది వార్షిక ఆదాయం 17 శాతం క్షీణించింది. ఖర్చు తగ్గించే చర్యల ఫలితంగా 2027 నాటికి నాటికి 100 మిలియన్ల పౌండ్ల ఆదా అవుతాయని కంపెనీ చెబుతోంది.ఇదీ చదవండి: కోవిడ్ మహమ్మారి : పెరుగుతున్న కేసులు, మరణాలు అధికారుల హెచ్చరికలుకాగా లగ్జరీ ఫ్యాషన్ హౌస్ బుర్బెర్రీని 1856లో థామస్ బుర్బెర్రీ స్థాపించారు. ఇది ట్రెంచ్ కోట్లు, లెదర్ ఉత్పత్తులు, వాచెస్, పాదరక్షలతో సహా వివిధ రకాల విలాసవంతైన ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేస్తుంది. ఐకానిక్ డిజైన్, నాణ్యత , లగ్జరీ ఫ్యాషన్కు బాగా ప్రసిద్ధి చెందింది. గబార్డిన్ అనే వస్త్రంతో రూపొందించే వాటర్ప్రూఫ్ దుస్తులు మరీ ప్రత్యేకం.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా? -
'గారాబం చేస్తే ఇలా అవుతుందా'..? థైరోకేర్ వ్యవస్థాపకుడి అద్భుతమైన పేరెంటింగ్ పాఠం
అతిగారాబం ఎన్నటికీ అనర్థమే అని మన పెద్దలు చెబుతుంటారు. పిల్లల్ని ముద్దు చేయాల్సినప్పుడూ ముద్దు చేయాలి, బాధ్యతయుతంగా ప్రవర్తించకపోతే గట్టిగా మందలించాలి కూడా. రెండూ సమతూకంలో ఉండాలి లేదంటే..ఎందుకు పనికిరానివారుగా తయారవుతారని హెచ్చరిస్తున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు. గారాబం వల్ల చిన్నారులు పాడైపోవడమే గాక అది మొత్తం కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో..తెలియజేసే అద్భుతమైన రియల్ స్టోరీని షేర్ చేసుకున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ. వేలుమణి. మంచి పేరేంటింగ్ కుటుంబానికి ఎలా శ్రీరామరక్షలా ఉంటుందో హైలెట్ చేసి మరీ చెప్పారు. మరీ కథేంటో చూద్దామా..!1980ల ప్రారంభంలో, డాక్టర్ వేలుమణి BARC(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో ఉద్యోగం చేసేవారట. ఆ సంపాదనతో తన కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేదట. దాంతో మరోవైపు ట్యూషన్లు కూగా చెప్పేవారట వేలుమణి. తన ఇంటికి సమీపంలో శివాజీ పార్క్లో నివసిస్తున్న ఒక ధనవంతురాలైన మార్వారీ మహిళ ద్వారా ఆయనకు ట్యూషన్ చెప్పే అవకాశం లభించింది. ఆమె తన కొడుకు నాల్గవ తరగతి చదువుతున్నాడని, అతనికి ట్యూషన్ చెప్పాల్సిందిగా వేలుమణిని కోరారట. తన కొడుకుకి చదువు రావడమే ముఖ్యం అని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని వేలుమణికి చెప్పారామె. ఇప్పటికే నలుగురు ట్యూటర్ల మార్చామని అయినా మా అబ్బాయికి చదువు మాత్రం అబ్బలేదని కూడా వాపోయిందట. చదువు వచ్చేలా చేయాలిగానీ, మా అబ్బాయి సంతోషానికి ఆటంకం ఉండకూడదనే షరతు విధించిందట ఆ తల్లి. అయితే వేలుమణి మంచి జీతం వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఆ అబ్బాయికి ట్యూషన్ చెప్పేందుకు అంగీకరించారట. కానీ ఆ పిల్లవాడి సంతోషంగా ఉంచేలా పాఠాలు చెప్పడం అనేది కష్టం. ఎందుకంటే..చదువు రావాలంటే ఒక్కొసారి కష్టపెట్టక తప్పదు. అయితే ఆ తల్లి షరతు మేరకు ఆ కుర్రాడికి అలరించేలా కథలు చెబుతూ పాఠాలు చెప్పే యత్నం చేసేవారు వేలుమణి. సంతోషంగా ఉండేలా చూడాలి కాబట్టి ఏవిధంగా బలవంతం చేయడానికి వీలులేదు. అందువల్ల వేలుమణి హాస్యభరితమైన కథలతో చదువుపై ఆసక్తికలిగేలా చేశారు. అది చూసి ఆ పిల్లాడి తల్లి వేలుమణి జీతాన్ని నెలకు రూ. 300 నుంచి రూ. 600లకు పెంచేసింది. బార్క్లో సంపాదించిన దానికంటే అధిక జీవితం, పైగా ప్రయాణపు ఛార్జీలు కూడా ఆ తల్లే చెల్లించేదట. అయితే అతడికి నేర్పించాల్సిన చదువును నేర్పించలేకపోతున్న అనే అపరాధభావం కలిగి మానేయాలనుకున్నారట వేలుమణి. కానీ ఆ కుటుంబం మరింత జీతం పెంచి తన పిల్లాడికి చదువు చెప్పాల్సిందిగా బలవంతం చేశారు. దీంతో ఆయన అలా 1983 నుంచి 1984 వరకు అతడికి ట్యూసన్ చెప్పడం కొనసాగించారు. అంతేగాదు ఆ అదనపు డబ్బుతో తన ఆరోగ్యానికి, ఆంగ్లంలో పట్టు సాధించడానికి వినియోగించుకున్నాడట. అయితే ఆ బాలుడికి శతవిధాల చదువు నేర్పించే యత్నం చేసినా..ఏం నేర్చుకోలేకపోయాడట. చివరికీ..కనీసం ఇంటర్మీడియట్ కూడా ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఆ తర్వాత వేలుమణి కూడా ట్యూటర్గా కొనసాగడం మానేయడం వంటివి జరిగాయి. అలా దశాబ్దాలు గడిచాక.. అనూహ్యమైన మలుపు తిరిగింది. ఆ సంపన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అనుకోని విధంగా డాక్టర్ వేలుమణి భార్య చివరికి అదే బాలుడికి థైరోకేర్లో హార్డ్వేర్ టెక్నీషియన్గా ఉద్యోగం ఇచ్చింది. ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ..ఆ తల్లి తన కొడుకు ఏ కష్టం తెలియకుండా పెరగాలనుకుంది..అదే చివరికి కుటుంబానికి శాపంగా మారిపోయింది. అంతేగాదు కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడూ.. కొడుకు ఆసరాగా నిలవలేని దుస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చిందామెకు. గారం తెచ్చిపెట్టే అనర్థం ఇలా ఉంటుంది. పరిస్థితులు తారుమారైనప్పుడూ..కష్టపడక తప్పదని ఆ తల్లి చెప్పలేకపోయింది, పైగా ఆ పిల్లాడు తెలుసుకోలేడు కూడా. ఇక్కడ పిల్లల్ని క్రమశిక్షణాయుతంగా పెంచడం అనేది గొప్ప పేరేంటింగ్కి సంకేతం. దాన్ని చాలా జాగురకతతో నిర్వహించాలి. అదే భవిష్యత్తులో కుటుంబ ఉన్నతికి దోహదపడుతుందని నొక్కి చెప్పారు వేలుమణి. నెట్టింట షేర్ చేసిన ఈ పోస్ట్ ..ప్రతి నెటిజన్ మనసుని దోచుకుంది. సార్ ఇది మంచి స్ఫూర్తిదాయకమైన కథ అని డాక్టర్ వేలుమణిని ప్రశంసించారు. చివరగా వేలుమణి తల్లిదండ్రుబంగా పెంచకండి, విలాసవంతంగా పెరగాలని కోరుకోవద్దని..నేటి కాలానికి అస్సలు పనికిరాదని వ్యాఖ్యానించారు.This tweet and the pics reminded me my luck in early 80s. Thanks to @howto9to5 I had a BARC job, good salary but was not enough to support my big family back home. I wanted to send more money home and wanted to earn more by doing tuitions while working in BARC. A filthy rich… https://t.co/Mi5mkR6ocT pic.twitter.com/mkAgrqVXtz— Dr. A. Velumani.PhD. (@velumania) May 6, 2025(చదవండి: Parenting Tips: చిన్నారులకు ఈ వేసవిలో సేవ చేయడం నేర్పిద్దాం ఇలా..!) -
ఆంధ్రా రుచుల పండుగ..ఆ టేస్టే వేరేలెవల్..!
హైదరాబాద్ నగరంలో ఎన్ని కాంటినెంటల్ వంటకాలున్నా తెలుగు రుచులకున్న ప్రత్యేకతే వేరు. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి నగరానికి వచ్చే అతిథులు ప్రత్యేకంగా ఆంధ్రా వంటకాలను రుచి చూసే వెళతారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా నగరంలోని లీలా వేదికగా వివిధ సంస్కృతుల రుచులను నగరవాసులకు, అతిథులకు రుచి చూపిస్తు్తన్న ‘రీన్ – ది చెఫ్స్ స్టూడియో’ ఈ సారి ఆంధ్రా వంటకాలను ప్రదర్శిస్తోంది. ఎకోస్ ఆఫ్ ఆంధ్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫుడ్ ఫెస్ట్ ఈ నెల 18వ తేదీ వరకూ ఆంధ్రా పసందైన రుచులను చేరువచేస్తోంది. అంతేకాకుండా ప్రముఖ చెఫ్ ‘మీరా’ ఈ ఎకోస్ ఆఫ్ ఆంధ్ర ఫెస్ట్లో తన పాకశాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత వేసవి నేపథ్యంలో తెలుగు రుచులతో విడదీయరాని అనుబంధమున్న మామిడి వంటకాలను సైతం ప్రత్యేకంగా వండివారుస్తున్నారు. ‘ఎకోస్ ఆఫ్ ఆంధ్ర అనేది నా చిన్ననాటి ఆహారానికి నా ప్రేమలేఖ’..!! ఇవి నన్ను పెంచిన, లాలించిన రుచులు, తరతరాలుగా వారసత్వంగా వచ్చిన వంటకాలు. ప్రస్తుత తరుణంలో విభిన్న, వినూత్న రుచులుగా మోడ్రన్ డైనింగ్ టేబుల్ పైకి రావడం మళ్లీ ఇంటికి వెళ్లిన అనుభూతిని తీసుకువస్తుంది. ఆంధ్రా గొప్ప పాక సంప్రదాయాలకు గుర్తుగా రూపొందించిన క్యూరేటెడ్ థాలీని ఇక్కడ ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఇది ప్రతిష్టాత్మకమైన వారసత్వ వంటకాలను పునరుజ్జీవింపజేస్తుంది. ఈ ప్రాంతం ఆహార సంస్కృతిని ఇక్కడికి విచ్చేసే అతిథులకు చేరువ చేస్తూ ఆ ఘుమఘుమలను విశ్వవ్యాప్తం చేస్తున్నాం. ముఖ్యంగా మామిడి అంటే ఒక నోస్టాల్జిక్ అనుభూతి. ఈ వారసత్వ థాలీ కుటుంబాలు, పండుగలు భూమి లయల కథను చెబుతుంది. ఆనాటి పచ్చడి మొదలు నేటి కూరలు ఆధునిక రుచుల వరకూ సృషిస్తుంది ఈ వేదిక. ఈ పాప్–అప్ ద్వారా కాంటినెంటల్ వంటకాలను మైమరపించే రుచలను అందంచడమే లక్ష్యంగా రీన్ చెఫ్స్ స్టూడియో సిద్ధమైంది అని చెబుతున్నారు ప్రముఖ చెఫ్ మీరా (చదవండి: Parenting Tips: చిన్నారులకు ఈ వేసవిలో సేవ చేయడం నేర్పిద్దాం ఇలా..!) -
మహిళలు తప్పక చదవాల్సిన పుస్తకం..!
మహిళల హక్కుల గురించి అస్పష్టత ఉన్నచోట, అంతగా అవగాహన లేని చోట ఉపయోగపడే పుస్తకం లీగల్లీ యువర్స్: ఎవ్రీ ఉమెన్స్ గైడ్ టు హర్ లీగల్ రైట్స్. లాయర్, రైట్స్ అడ్వకేట్ మానసి చౌదురి రాసిన ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ హార్పర్కాలిన్స్ ప్రచురించింది. భారతీయ మహిళల న్యాయ హక్కులపై సమగ్రమైన స్పష్టతను అందించే పుస్తకం ఇది. మన దేశ న్యాయవ్యవస్థను అర్థమయ్యేలా చేస్తూ, సంక్లిష్ట చట్టాల గురించి సులువైన రీతిలో పరిచయం చేస్తుంది.వారస్వత హక్కులు, ఉద్యోగ ప్రదేశంలో వేధింపులు, రీప్రొడిక్టివ్ రైట్స్...మొదలైన వాటి గురించి వివరిస్తుంది.‘జ్ఞానం అనేది ఎంపవర్మెంట్కు తొలి అడుగు’ అంటున్న మానసి చౌదురి ‘పింక్ లీగల్’ వ్యవస్థాపకురాలు.‘ఈ పుస్తకం మహిళలకు మాత్రమే కాకుండా, మహిళల హక్కులను అర్థం చేసుకోవడంలో పురుషులకు కూడా ఉపకరిస్తుంది’ అంటుంది హార్పర్కాలిన్స్ ఇండియా ఎడిటర్ హిమాకుమార్.(చదవండి: Miss world 2025: అతడు.. ఆమె... మిస్ వరల్డ్) -
ఒళ్ళంతా పురుగులు పాకుతున్నాయంటుంది!
మా అమ్మ గారికి 78 సంవత్సరాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాంటిది ఆమె ఒక 6–7 నెలల నుండి ఒళ్ళంతా చిన్న చిన్న పురుగులు పాకుతున్నాయని, దురదగా ఉందని వళ్లంతా గోక్కుంటోంది. స్కిన్ ఇన్ఫెక్షన్ అనుకుని చర్మం డాక్టర్ గారి దగ్గరికి తీస్కుని వెళ్ళాము. పరీక్ష చేసి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని దురద తగ్గడానికి కొన్ని మందులు ఆయింట్మెంట్ ఇచ్చారు. అవి వాడిన తర్వాత కూడా ఆమెకు ఉపశమనం లేదు. పురుగులు చర్మంలోకి చొచ్చుకు పోతున్నాయని గొడవ చేస్తుంది. పుండ్లు పుట్టేలా చర్మాన్ని గోకుతుంది. ఒక చిన్న ఖాళీ డబ్బా తీస్కుని దాంట్లో పురుగులు వేశానని మమ్మల్ని కూడా చూడమని చెప్తుంది. ఆ డబ్బాలో ఆమె బట్టలవి చిన్న చిన్న దారపు పోగులు తప్ప ఏమి లేవు అంటే ఒప్పుకోదు. ఆవిడ బాధ తట్టుకోలేక ఇంకో స్కిన్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళ్ళాము. ఆయన తల స్కాన్ చేసి ఒకసారి మానసిక వైద్యునికి చూపించమని చెప్పారు. ఆమె అన్ని రకాలుగా బాగుంది. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. జ్ఞాపక శక్తి బాగుంది. ఈ పురుగులు పాకుతున్నాయిని ఒక్క కంప్లెట్ తప్ప! ఆమెకు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ అవసరం అంటారా?– పద్మావతి, బళ్ళారిమీరు మీ అమ్మగారిలో చూస్తున్న లక్షణాలు క్లాసికల్గా ‘డెల్యూజనల్ పారా సైటోసిస్‘ లేదా ‘ఎక్బామ్ సిండ్రోమ్‘ అనే మానసిక సమస్య వచ్చిన వారిలో కనబడతాయి. ఇది ఒక అరుదైన మానసిక సమస్య. దీనిని ఎక్కువగా స్త్రీలలో చూస్తాము. మెదడు రసాయనాల్లో వచ్చే మార్పులు ఈ జబ్బు రావడానికి ప్రధాన కారణం. రక్త హీనత, విటమిన్ లోపాలు, థైరాయిడ్ సమస్యలు లాంటివి ఉండే వారిలో కూడా జబ్బు వచ్చే ఆవకాశాలు ఎక్కువ. కొన్ని సార్లు పెద్దవయసులో వచ్చే ‘ఆల్జీమర్స్ డిమెన్షియా‘ ఈ లక్షణంతోనే ప్రారంభం అవ్వొచ్చు. అలాగే అత్యంత అరుదుగా మెదడులో కణుతులు లాంటివి ఉన్నా డెల్యూజన్లో పారా సైటోసిస్ లక్షణాలు కనపడే అవకాశముంది. తమ వంటిమీది లేదా చర్మం కింద పురుగులు పాకుతున్నాయనే సందేహం తప్ప ఇతర లక్షణాలు ఏమి కనపడవు. దురద తట్టుకోలేక కొంతమంది చర్మానికి క్రిమి సంహారక మందులు పూసుకొని ప్రాణం మీదికి కూడా తెచ్చుకుంటారు. యాంటీ సైకోటిక్ మందుల ద్వారా ఈ జబ్బు లక్షణాలని పూర్తిగా తగ్గించవచ్చు. మీరు దగ్గర్లోని మానసిక వైద్యుని వెంటనే కలిసి వాళ్ళు చెప్పిన ప్రకారం మందులు వాడితే త్వరగా ఆమె సమస్య తగ్గుతుంది. ఇది మానసిక జబ్బు లక్షణమే తప్ప శారీరక అనారోగ్యం ఏమాత్రం కాదనేది అందరూ గుర్తించాలి! (డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com) (చదవండి: Miss worl 2025: అతడు.. ఆమె... మిస్ వరల్డ్)