breaking news
Lifestyle
-
బరువు తగ్గడానికి ఏది బెస్ట్?
ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గుడ్డు! రకరకాల పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్ ఉండే ఎగ్ని కొందరు ఉడకబెట్టుకుని తింటే.. మరికొందరు వేడివేడిగా ఆమ్లెట్ వేసికుని లాగించేస్తుంటారు. ఈ రెండు రకాలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బరువు తగ్గడానికి, శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? అనే విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు.కొందరు ఆమ్లెట్ తింటే కడుపు నిండుగా ఉంటుందని నమ్మితే, మరికొందరు ఉడకబెట్టిన గుడ్డే ఉత్తమం అని వాదిస్తారు. మనం గుడ్డును వండే విధానం, అందులో కలిపే ఇతర పదార్థాల వల్ల దాని పోషక విలువలు ఎలా మారిపోతాయో తెలిస్తే.. మన ఫిట్నెస్ లక్ష్యాలకు ఏది సరైనదో సులభంగా ఎంచుకోవచ్చు.మీరు క్యాలరీలను చాలా ఖచ్చితంగా లెక్కబెడుతూ డైట్ ఫాలో అవుతుంటే, నిస్సందేహంగా ఉడకబెట్టిన గుడ్డుకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో దాగి ఉన్న కొవ్వులు లేదా అదనపు క్యాలరీలు ఉండే అవకాశం అస్సలు లేదు. అయితే, కూరగాయలతో పక్కాగా తయారుచేసిన ఆమ్లెట్కు మరో ప్రత్యేకమైన ప్లస్ పాయింట్ ఉంది. రెండు గుడ్లకు ఎక్కువ కూరగాయలు కలిపి వేసుకునే ఆమ్లెట్ ఎక్కువ క్వాంటిటీని ఇస్తుంది. ఇది మీ ఆకలిని సమర్థవంతంగా అణిచివేసి, జంక్ ఫుడ్స్ తినకుండా నియంత్రిస్తుంది. ఇందుకే చాలా మంది న్యూట్రిషనిస్టులు మీ డైట్ అవసరాలను బట్టి రోజు మార్చి రోజు ఈ రెండింటినీ మార్చుకుంటూ తినాలని సలహా ఇస్తుంటారు.చివరగా చెప్పాలంటే.. బరువు తగ్గాలనుకునే వారి హెల్తీ డైట్లో ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ రెండూ కూడా అద్భుతమైన భాగాలే. మీ జీవనశైలికి, మీ రుచికి ఏది కంఫర్ట్గా ఉంటే దానిని సరైన పద్ధతిలో వండుకుని తినడమే అత్యుత్తమం. -
సానుకూల శక్తికి విపరీత కరణి ఆసనం..
విపరీత కరణి ఆసనం ఒక సరళమైన కానీ అత్యంత ప్రభావవంత మైన ఆసనం. రోజుకు కేవలం 10–15 నిమిషాలు ఈ ఆసనం సాధన చేస్తే శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత, జీవితానికి సానుకూల శక్తి లభిస్తాయి. విపరీత కరణి అనే సంస్కృత పదంలో ‘విపరీత’ అంటే తలకిందులైన లేదా వ్యతిరేకమైన, ‘కరణి’ అంటే చర్య లేదా స్థితి. ఈ ఆసనంలో శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి, కాళ్లను గోడకు ఆనించి పైకి ఎత్తుతారు. ఇది శరీరానికి, మనసుకు ప్రశాంతతను అందించే యోగాసనం.ప్రయోజనాలు...ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ ను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.కాళ్లలో నిలిచిన రక్తం గుండె వైపు సులభంగా ప్రవహించడానికి సహాయపడుతుంది.ఎక్కువసేపు నిలబడే వారు, నడిచే వారికి కాళ్ల నొప్పి, వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.నిద్రలేమి సమస్యలను తగ్గించి ప్రశాంతమైన నిద్రకు తోడ్పడుతుంది.పెల్విక్ ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడటానికి సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతకు పరోక్షంగా ఉపయోగపడవచ్చు.పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను ఉత్తేజపరిచి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.అలసటను తగ్గించి శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నియంత్రించడానికి సహాయపడుతుంది.జాగ్రత్తలు....తీవ్రమైన మెడ, వెన్నెముక గాయాలు ఉన్నవారు, అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు యోగా నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.ఆసనం చేస్తూ ఎటువంటి ఒత్తిడి లేదా నొప్పి కలిగితే వెంటనే ఆపాలి.భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 2–3 గంటల విరామం ఉండాలి.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
90 డేస్ టీ చాలెంజ్! ఏం‘టీ’ నిజమా?
రోజూ ఉదయం నిద్రలేవగానే గుర్తొచ్చేది తాజా టీ. ఆఫీసు టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, ఇంకేవో గందరగోళాలు.. ఇలా హడావిడిగా సాగే జీవితంలో ఎన్ని అగచాట్లున్నా చక్కని, చిక్కని ఓ టీ కప్పు సిప్పు చేస్తే తప్ప వాటన్నింటికీ పరిష్కారం దొరకదు. మనదేశంలో టీతోనే రోజు మొదలెట్టేవారు కోట్లలో ఉంటారు. భాషాభేదం లేకుండా, నార్త్, సౌత్ అనకుండా అందరినీ మమేకం చేసి అదో రకం మైకంలో ముంచేసే టీ నిజంగా ఓ రకం డ్రగ్.. అయితే ఇలాంటి టీని ఓ తొంభై రోజులు తాగడం మానేస్తే ఏమవుతుంది?మొదటివారంలో..టీలో ఉండే కెఫీన్కు శరీరం అలవాటు పడుతుంది. అందుకే ఉన్నట్టుంటి టీ తాగడం మానేస్తే మొదటివారం రోజులు చికాకు, దేనిమీద ఏకాగ్రత లేకపోవడం, తలనొప్పి, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరానికి అలవాటైన కెఫీన్ ఒక్కసారిగా దూరమైతే వచ్చే ప్రతి స్పందన ఇది.2–4 వారాల్లో...టీ తాగడం తగ్గించాక తర్వాత చాలామందిలో రాత్రి పూట తొందరగా నిద్రపట్టడం, మధ్యలో మెలకువలు తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు. అలాగే ఉదయం కూడా తాజాగా నిద్రలేవడం ఉషారుగా ఉండడం జరుగుతుంది. ఈ మార్పులు రాత్రిళ్లు టీ తాగే అలవాటు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.ఆందోళనకి దూరంటీలోని కెఫీన్ శరీరంలో గుండె వేగాన్ని పెంచుతుంది. సాధారణంగా టీ గ్యాప్ వస్తే కొందరిలో ఆందోళన కనిపించడం, చేతులు వణుకుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఆల్కహాల్ అలవాటున్నవారిలో ఈ లక్షణాలు ఇంకా అధికం. గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీతో కొందరు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు టీ మానేస్తే సగానికి సగం సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చక్కెర వినియోగం కూడా తగ్గడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.ఏం‘టీ’ నిజమా?ప్రపంచవ్యాప్తంగా నీరు తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ.టీ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.ప్రపంచంలో ప్రతి రోజూ మూడు బిలియన్ల కప్పులకు పైనే టీని తాగేస్తున్నారు.బ్రిటీషర్లు భారత్కి టీ పరిచయం చేస్తే భారతీయులు అందులో పాలు, పంచదార కలిపి కొత్త రూపాన్నిచ్చారు. ఆ తర్వాత ఏలకులు, లవంగాలు, అల్లం కలిపి మసాల టీగా రూపాంతరం చెందింది.ఎంతోప్రాచుర్యం పొందిన టీ పుట్టిన ప్రదేశం మాత్రం చైనానే. క్రీస్తు పూర్వం 2737లో అప్పటి ప్రజలు తొలిసారిగా టీ రుచి చూశారు.వైట్ టీ తెలుసా?బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ గురించి విన్నాం. మనలో చాలామంది వాటిని రుచి చూశాం కాని వైట్ టీ ఏంటి? అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పొడి. అత్యంత స్వచ్ఛమైన సహజమైన టీ రకాలలో ఈ వైట్ టీ ఒకటి. ఈ టీ పొడి కోసం కేమెలియా సినెన్సిస్ అనే మొక్కకు వచ్చే లేత మొగ్గలను, చిన్న ఆకులను మాత్రమే కోస్తారు. దీని డికాషన్ ముదురు రంగులో కాకుండా చాలా తేలికపాటి పసుపు లేదా వెండి రంగులో ఉంటుంది. రుచి కూడా కాస్త తియ్యగా పూల వాసనతో ఉంటుంది. కేవలం వసంత కాలంలో మాత్రమే దొరికే ఈ టీ ఆకులను చాలా జాగ్రత్తగా కోసి ప్రాసెస్ చేస్తారు. రకాన్ని బట్టి దీని రేటు కిలోకి ఐదు వేల నుంచి నాణ్యతను బట్టి లక్షల రూపాయల వరకు ఉంటుంది. -
వయసు 25.. వొంటికి 35.. కారణమేంటి?
‘వయసు కేవలం ఒక సంఖ్య’ అంటారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్నది మాత్రం అందుకు భిన్నం. క్యాలెండర్ మీ వయసు 25 లేదా 30 ఏళ్లు అయినా... మీ శరీరం మాత్రం 35 లేదా 40 ఏళ్ల వ్యక్తిలా పని చేస్తుండచ్చట! తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఈ సంచలన విషయాన్ని వెల్లడించింది.అమెరికాలోని పరిశోధకులు లక్షలాది మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించగా.. నేటి తరం యువత శరీరాలు గత తరాలతో పోలిస్తే మరింత వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్తున్నట్లు గుర్తించారు. దీనినే ‘బయోలాజికల్ ఏజింగ్’ అంటారు. అంటే పుట్టిన తేదీ ప్రకారం వచ్చే వయసు కన్నా శరీరం లోపల జరిగే మార్పుల వల్ల ఎంత వేగంగా ముసలితనం వస్తుందనేదే అసలు విషయం.వయసుదేముందిలే అని సరిపెట్టుకోవచ్చు అనుకుంటారేమో కానీ ఈ అకాల, అనూహ్య, వేగవంతమైన వృద్ధాప్యం వల్ల 50 ఏళ్లలోపే క్యాన్సర్ బారినపడే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణాశయం, ఊపిరితిత్తులు, గర్భాశయం వంటి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం కనిపిస్తోందని తెలి΄ారు.అయితే దీనికి ఇతమిత్థంగా ఇదీ కారణం అని చెప్పలేమనీ, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం వంటి అనేక అంశాలు కలిసి శరీరాన్ని వయసు కంటే ముందే బలహీనపరుస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అలాగని ఇది అంత భయపడాల్సిన విషయం కూడా కాదని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతులాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా శరీర వృద్ధాప్య వేగాన్ని కొంతవరకు నియంత్రించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.తరచు నీరు తాగడం వల్ల కూడా వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు. వాటర్ తాగడం పెరిగితే, మూత్రవిసర్జన, చెమట, పేగు కదలికలతో శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. మనం సాధారణంగా విటమిన్ డిని సూర్యరశ్మి ద్వారా పొందుతాం. ఇది వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.– నిర్వహణ: డి.వి.ఆర్ -
మీ పాప టీనేజ్లోకి అడుగు పెట్టిందా? ఈ సూచనలు మీకోసమే!
చిన్నారులు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెడుతున్న కౌమార దశ లేదా టీనేజ్ ఎంతో కీలకం. ఆ సమయంలో వారు చేసుకునే అలవాట్లు, జీవనశైలి సూత్రాలే వాళ్ల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. అందువల్ల తల్లిదండ్రులు కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం!సరిగ్గా చెప్పాలంటే, టీనేజ్లోనే భావోద్వేగాల పరిణతి వస్తుందట. ప్రతిదీ ఈ దశలోనే నేర్చుకుంటారట. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు అయినదానికీ కానిదానికీ పిల్లలను విమర్శిస్తూ, కఠినంగా వ్యవహరిస్తే కుటుంబంతోనూ, తోటి పిల్లలతోనూ వాళ్లు ఎమోషనల్గా దూరమవుతారని, తమ సమస్యలను చెప్పడానికి భయపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వారి తప్పు సరిచేసే ముందు వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దేనని చెబుతున్నారు. టీనేజీ పిల్లలను కుటుంబ సభ్యులను, టీచర్లు మరింతగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.శుభ్రతా ముఖ్యమే... ఇక పీరియడ్స్ మొదలయ్యాక మరో కొత్త సవాలు ఎదురైవుతాయి. ముఖ్యంగా, పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే, క్రమం తప్పకుండా స్నానం, దుస్తులు, లోదుస్తులు మార్చుకోవడం అలవాటు చేయాలని సూచిస్తున్నారు.తగ్గ ఆహారం... ఎదిగే వయసులో అమ్మాయిలకు పోషకాహారం తప్పనిసరంటున్నారు నిపుణులు. ఎంత బిజీగా ఉన్నా సరే, మంచి ఆహారం అందించడం మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నారు. అధి కప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, లో–ఫ్యాట్, లో–కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం ఇవ్వాలి.క్లాస్, చదువుల్లో పడి స్కూల్లో నీళ్లు తాగడం మర్చిపోతారు కాబట్టి, మీ పాప రోజుకి కనీసం 12 గ్లాసుల నీళ్లు తాగేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, చక్కెర లేని పండ్ల రసాలూ మంచివేని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో కాఫీ, టీ, కార్బొనేటెడ్ డ్రింక్లు, కృత్రిమ తీపి కలిగిన పానీయాలకూ దూరంగా ఉంచాలని తెలియజేస్తున్నారు.ప్రశాంతంగా: ఓ వైపు శరీరంలో మార్పులు, మరోవైపు చదువు ఇవన్నీ పిల్లల్లో ఒత్తిడి కలిగిస్తాయి కాబట్టి రోజుకి ఒక గంటైనా వాళ్లు ప్రశాంతంగా కూర్చొనేలా సమయమివ్వడం వల్ల తమ గురించి తాము ఆలోచించుకునేందుకు సాయపడుతుంది. డ్రాయింగ్, పెయింటింగ్, కథల పుస్తకాలు, క్రియేటివ్ క్రాఫ్ట్వర్క్ వంటివి చేసేలాగాప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. అప్పుడే మానసికంగా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారు.అంతేకాకుండా, టీనేజ్ పిల్లలకు వారి పరిధి మేరకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు. గుడ్టచ్, బ్యాడ్టచ్ లాంటి వాటి గురించి తెలియజేయాలని చెబుతున్నారు. అప్పుడే వాళ్లు చైల్డ్ అబ్యూజింగ్ లాంటివి ఎదుర్కోకుండా ఉంటారని సూచిస్తున్నారు.హార్మోన్లలో మార్పులు...టీనేజ్లో అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే మరో సమస్య మొటిమలు ఒకటి. ఇవే వారిలో ఆత్మన్యూనతకూ దారితీస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి, ఇందుకు కారణం హార్మోనుల్లో మార్పులే అని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూనే వాటి గురించి జాగ్రత్తలూ చెప్పాలంటున్నారు. వాటిని గిల్లడం, వత్తడం లాంటివి చేయనీయకూడదు.అర్థం అయేలా చెప్పాలి...రుతుక్రమం... శారీరకంగా, మానసికంగా అమ్మాయిల్లో చాలా మార్పులే వస్తాయి. కాబట్టి, వాటి గురించి పీరియడ్స్ మొదలవక ముందే పిల్లలకు అర్థమయ్యేలా వారి మనసు నొప్పించకుండా సున్నితంగా చెప్పాలనీ, అప్పుడే, మనసులో ఉన్న భయాలూ, అపోహలూ తొలగిపోయి, తమలో వస్తోన్న మార్పులను అర్థం చేసుకుంటారని చెబుతున్నారు.వ్యాయామంతో...సిగ్గు, బిడియం లాంటి వాటి వల్ల టీనేజ్ అమ్మాయిలు ఆటలకు దూరం అవుతున్నారనీ, కాబట్టి, ఆ ఫీలింగ్స్ను పోగొట్టి వాళ్లు బయటకు వచ్చేలా ప్రోత్సహించాలంటున్నారు నిపుణులు. స్విమ్మింగ్, బాస్కెట్బాల్, వాకింగ్, రన్నింగ్ ఇలా ఏదో ఒకదాన్లో భాగమయ్యేలా చూడాలి. వ్యాయామం అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు జీవనశైలి వ్యాధులు రాకుండా ఉంటాయి. -
ఇన్స్టంట్ జనరేషన్ డిలీట్.. సొల్యూషన్!
ఈ కథనం రాయాలని లేదు. కానీ రాయక తప్పడం లేదు. రెండు రోజుల్లో రెండు వార్తలు. ఇద్దరు ఆడపిల్లల చేతులకు అంటిన నెత్తురు. ఒకమ్మాయి కాబోయే భర్తను కోట అంచు నుంచి తోసేస్తే... ఇంకో అమ్మాయి కుటుంబాన్నే కడతేర్చింది. కారణం ఒక్కటే... ‘నాకు కావాలి’... ‘అడ్డొస్తే అంతే’. ఈ ఘటనలు విన్న వెంటనే గుండె లోపల ఏదో తెగిపోయింది. ఆ తెగిపోయిన చోటు నుంచే ఈ అక్షరాలు... ఇది నింద కోసం రాస్తున్న కథనం కాదు. ‘అయ్యో అయ్యో’ అంటూ ఆందోళన చెందుతున్న కుటుంబాలతో పాటు చేస్తున్న హెచ్చరిక. వేస్తున్న వెర్రికేక.ఒకప్పుడు ఆడపిల్ల ఏడిస్తే ఇల్లంతా కదిలిపోయేది. ‘ఎందుకు ఏడుస్తున్నావ్ తల్లీ?’ అని పదిమంది పరుగెత్తుకు వచ్చేవాళ్లు. ఇప్పుడు ఆడపిల్ల ఏడుపు అందరినీ ఏడిపిస్తోంది. ఎన్నో దశాబ్దాల పాటు పోరాడి ప్రేమకు సమాజంలో అర్హత పొందిన అమ్మాయి నేడు ఇంకా దానిని పూర్తిగా పొందలేక మరుగుజ్జు ఆలోచనలు చేస్తోంది. మరింత చీకటిదారిలో నడుస్తోంది.ఏమిటా ఘటనలు... వింటుంటే గుండెలు అవిసిపోతున్నాయి. లోహగఢ్ కోట మీద ఆ కుర్రాడు కేతన్ చివరి క్షణంలో ‘సియా’ అని ఆర్తనాదం చేసి ఉంటాడా? బెంగళూరు ఫ్లాట్లో శ్వేత పొడిచిన కత్తిపోట్లకు తల్లి ‘అమ్మా’ అని షాక్లో గుడ్లు తేలేసి ఉంటుందా?దీనిని బట్టి అర్థమవుతున్నది ఒక్కటే. మన ఇళ్లల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మౌనం. పిల్లల కోరికలకు, పెద్దల భయాలకు మధ్య ఉన్న అగాధం. ఆ అగాధాన్ని హింసతో పూడ్చుకోవాలని పిల్లలు అనుకుంటే ప్రతి ఇల్లూ శ్మశానమే. ఈ ఉత్పాతం మన ఇంటి గుమ్మం దాకా రాకముందే ఒక్కసారి ఆగి ఆలోచిద్దాం.రెండు ఘటనలు, ఒకే గాయంమన ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని మురిసిపోతాం. ఆ పాప పెరిగి పెద్దదై, తన కలలు తాను ఎంచుకునే వయసుకు వచ్చేసరికి మాత్రం ఏదో తెలియని భయం. ‘ఏం చేస్తుందో, ఎవరిని చేసుకుంటుందో’ అని. కానీ ఇప్పుడు భయం మరో మలుపు తిరిగింది. ఆడపిల్ల తమకు కావలసినది దక్కించుకోవడానికి ప్రాణం తీసే స్థాయికి వెళ్లిపోతోంది. ఆ చేతులు నెత్తురుకు భయపడటం లేదు.అటు చూడండి... పుణె లోహగఢ్ కోట అంచున నిలబడి ఉన్నాడు కేతన్. 26 ఏళ్ల వ్యాపారవేత్త. తన కాబోయే భార్య సియా పుట్టినరోజు వేడుక సంబరంలో ఉన్నాడు. ఆమెతో పెళ్లి కోసం రూ.17 కోట్ల ప్యాలెస్ బుక్ చేశాడు. కానీ ఆ అంచు నుంచి అతన్ని తోసేసింది ఆ సియా. తన ప్రియుడు చేతన్ తో కలిసి మరీ. ఆమెకు చేతన్ కావాలి. చేతన్ ప్రేమ కావాలి. అంత ప్రేమ ఉన్న అమ్మాయి అతన్ని పొందడానికి ఎంచుకున్న దారి నేరం. చేసింది ప్రేమ పేరుతో కుట్ర. మొదటిసారి విఫలమై, రెండోసారి మళ్లీ కోటకు రప్పించి 400 అడుగుల లోయలోకి తోసేశారు కేతన్ని. శవాన్ని చూసినా సియా కళ్లలో కన్నీరు లేదు, బాధ లేదు.ఇక బెంగళూరు. 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్వేత. తల్లిదండ్రులను, చెల్లి సుప్రియను సొంత చేతులతో పొడిచి చంపింది. కారణం? ప్రియుడు కెన్నెత్తో సహజీవనానికి ఒప్పుకోలేదని, రూ.30 లక్షల అప్పు తాలూకా నోటీసులు ఇంటికి వచ్చాయని. ‘మా అమ్మ మాకు కావలసిన స్వేచ్ఛ ఇవ్వలేదు. నేను ఖైదీలా బతికాను. అందుకే ద్వేషం పెంచుకున్నా’ అని ఆమె పోలీసులకు చెప్పింది. ఒక్క రాత్రిలో ముగ్గురి ప్రాణాలు, 50కి పైగా కత్తిపోట్లు.ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికీ కావలసింది ‘తను కోరుకున్న అబ్బాయి’. కాని అందుకు నేరమార్గమే పరిష్కారం అనుకున్నారు.మనం పెంచిన ఆడపిల్ల ఇలా ఎందుకు?1. ‘నాకు కావాలి అంటే ఇప్పుడే కావాలి’ తత్వం: పెంపకంలో ఓపిక నేర్పలేదు. ఎదురుచూపు ఈ తరం పిల్లలకు చేతకాదు. ఇన్ స్టంట్ నూడుల్స్ యుగంలో బంధాలూ ఇన్ స్టంట్ అయిపోయాయి. అడ్డు వస్తే ‘డిలీట్’ కొట్టేయడం అలవాటై పోయింది.2. ప్రేమా, మోహానికి లేదు తేడా: సియాకు చేతన్తో ఏడు నెలల ప్రేమ. శ్వేతకు కెన్నెత్తో రెండు నెలల సహజీవనం. రెండూ షార్ట్టైమ్ ప్రేమలే. మోహదశలే. ప్రేమ అంటే సహనం. మోహం అంటే స్వార్థం. ‘నా మాట వినకపోతే నువ్వు బతకకూడదు’ అనే అహం పుట్టిందంటే అది ప్రేమ కాదు. హంతక లక్షణం. మోహంతో కళ్లు మూసుకుపోయిన మనిషి ప్రాణం తీయడానికి కూడా వెనకాడడు. 3. ఇంట్లో మాట కరువు: శ్వేత ‘ఇంట్లో ఖైదీలా ఫీలయ్యా’ అంది. సియా పెళ్లి ఇష్టం లేదని గట్టిగా చెప్పలేకపోయింది. ఇంట్లో మాట వినే దిక్కు లేకపోతే బయట తారసపడినవాడే దేవుడు అయిపోతాడు. వాడు చెప్పేది, వాడితో చెప్పేది వేదం అయిపోతుంది. ఇద్దరి మాటలూ కలిసి మెల్లగా ఎదుటివారికి ఉరితాడవుతాయి.4. సోషల్ మీడియా మెహర్బానీ: నేరం చేసిన తర్వాత కూడా సియా రీల్స్ పెట్టింది, పోస్టులు వేసింది. చంపి కూడా ‘నేనే బాధితురాలిని’ అని ప్రపంచానికి చూపించాలనే తాపత్రయపడింది. లైకులు, కామెంట్లు వస్తే చాలు. పాపం అనే స్పృహ చచ్చిపోతుంది. ‘నా ఫీలింగ్స్ ఎవరూ అర్థం చేసుకోలేదు’ అనే సాకుతో హత్యను జస్టిఫై చేసుకుంటున్నారు. ఫోన్ స్క్రీన్ మీద సింపతీ కోసం నిజ జీవితంలో ప్రాణాలు తీస్తున్నారు.సమాజం ఇలా ఎందుకు మారింది?వేలు ఒక్కరివైపు చూపించలేం. ఇది ముక్కోణపు వైఫల్యం. ఒకటి: ఇల్లు. ‘ఆడపిల్ల అణిగిమణిగి ఉండాలి’ అని పెద్ద తరం. ‘నా ఇష్టం నా హక్కు’ అని యువతరం. ఈ రెండింటి మధ్య నలిగి ‘ఎవరూ నన్ను అర్థం చేసుకోరు’ అనే అగాధం. శ్వేత తల్లి కఠినంగా ప్రవర్తించింది నిజమే. కానీ ఆ కఠినత్వానికి కూతురు చేజారిపోతుందనే భయం. ఆ భయాన్ని ప్రేమగా చెప్పడం ఆమెకు చేతకాలేదు.రెండు: బయటి ప్రపంచం. ‘నచ్చితే ఉంచుకో, నచ్చకపోతే వదిలేయ్’ అని చెప్పే వెబ్ సిరీస్లు. ‘పేరెంట్స్ టాక్సిక్’ అని ముద్ర వేసే రీల్స్. సంబంధం కంటే స్వేచ్ఛ గొప్పది అని నూరి పోసే కంటెంట్. దాని ఫలితమే సియా ‘కూల్’గా హత్యకు ΄్లాన్ చేసే దశకు చేరగలగడం.మూడు: ‘ఆడది అంటే సహనం, త్యాగం’ అని శతాబ్దాలుగా విన్నాం. దానిని ఇంకా పట్టుకుని రుద్దుతూ ఆమె న్యాయమైన కోరిక తీర్చకపోతూ ఉండటం వల్ల రియాక్షన్ గా ‘ఇక నేను భరించను, నరికేస్తా’ అనే అంచుకు వెళ్లిపోయారు.దీన్ని సరిదిద్దడం ఎలా? 1. ఇల్లు తీర్పు చెప్పే కోర్టు కాకూడదు: కూతురు ‘నాకు ఇతను నచ్చాడు’ అంటే, ‘ఛీ’ అని మొహం తిప్పుకోకుండా ‘ఎందుకు నచ్చాడో చెప్పు తల్లీ’ అని కూర్చోబెట్టుకోవాలి. నచ్చకపోతే కారణం వివరించాలి. శ్వేత తల్లిదండ్రులు సహజీవనాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకత తప్పు కాదు. కానీ ఆ వ్యతిరేకతను ‘నువ్వు చెడిపోయావ్’ అనే నిందగా కాకుండా ‘మాకు భయంగా ఉంది, మాట్లాడుకుందాం’ అనే వంతెనగా మార్చాలి.2. ‘కాదు’ అనే మాట నేర్పాలి: కోరికలన్నీ తీరవు. ప్రేమించిన ప్రతి ఒక్కరూ దక్కరు. దక్కలేదని ప్రపంచం ముగిసిపోదు. ఈ పాఠం ఇంట్లోనే మొదలవ్వాలి. సియాకు కేతన్ వద్దు అనుకుంటే ‘వద్దు’ అని తెగేసి చెప్పే ధైర్యం ఇవ్వలేదు. అందుకే ‘చంపేద్దాం’ అనే పిరికిపంద పని చేసింది.3. ఆడపిల్లలకు ‘ఎమోషనల్ లిటరసీ’ నేర్పాలి: కోపం వచ్చినప్పుడు చంపడం కాదు, నిరసన తెలపడం పరిష్కారం అని చె΄్పాలి. బాధను, అహాన్ని, వ్యామోహాన్ని విడదీసి చూపించాలి. కౌన్సెలింగ్కి తీసుకెళ్లాలి. 4. మగపిల్లలకు ‘నో’ అంటే ‘నో’ అనే గౌరవం నేర్పాలి: చేతన్, కెన్నెత్ లాంటి వాళ్లు ‘ఆమె కోసం ఎవరినైనా చంపుతా’ అనుకునే ధోరణి మగవాళ్లది. అది వీరత్వంగా అనుకుంటున్నారు. వారికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ ఘటన మన ఇంటి అబ్బాయిలకు మేల్కొలుపు కావాలి.ప్రాణాలు కాపాడే పది నిమిషాలుసియా, శ్వేత... వీళ్లు రాక్షసులు కాదు. మన ఇళ్లల్లో పెరిగిన ఆడపిల్లలే. వాళ్ల చేతులకు రక్తం అంటింది అంటే ఆ రక్తపు మరక మన సమాజపు అద్దం మీద కూడా పడినట్టే. ప్రేమ పేరుతో ప్రాణం తీయడం తెగింపు కాదు అది ఓటమి అనే ఎరుక ఇల్లు, విద్యాసంస్థలు, సంఘం నేటి యువతరానికి పదేపదే చె΄్పాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఆడపిల్లతో రోజూ పది నిమిషాలు మాట్లాడాలి. ‘ఏం కావాలి?’ అని కాదు, ‘ఏం ఫీల్ అవుతున్నావ్?’ అని అడగాలి. ఆ పది నిమిషాలు ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు.కోరిక తప్పు కాదు. దాన్ని తీర్చుకునే దారి తప్పు కాకూడదు. అహింసతో సాధించలేనిది, హింసతో అసలే సాధించలేం. ఇది శ్వేతలకు, సియాలకు మాత్రమే చెప్పే మాట కాదు. రేపటి మన బిడ్డలకు చేర్చాల్సిన జీవనసందేశం.‘నా మాట వినకపోతే నువ్వు బతకకూడదు’ అనే అహం పుట్టిందంటే అది ప్రేమ కాదు. హంతక లక్షణంవిరుద్ధ భావనల సంఘర్షణఈ జెనరేషన్ తమకు ఏం కావాలో ముందే డిసైడ్ చేసుకుంటోంది. మంచి చెడులు చెప్పి, కౌన్సెలర్స్ సాయంతో వాస్తవాలను తెలియజేసి, వారికి నచ్చినట్టుగా జీవించే వెసులుబాటు కల్పించడమే మేలు. డబ్బు, అందం, హోదా.. ఇవేవీ జీవించడానికి పనికిరావనే నైజం ఒకవైపు, ఇవే సమాజంలో అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయని మరోవైపు .. ఈ విరుద్ధభావనల సంఘర్షణలతో ఇలాంటివి పుట్టుకువస్తున్నాయి. ఏదైనా దారుణం జరిగాక గానీ తాము చేస్తున్నట్టు తప్పేమిటో తెలిసి రావడం లేదు. – డాక్టర్ కుమార్, సంజీవని రిలేషన్షిప్ అండ్ మ్యారేజీ కౌన్సెలర్ఏది మంచిదో తెలిసేలా చేయాలిఅమ్మాయి లేదా అబ్బాయి పెళ్లికి ముందు సంబంధాన్ని కుదిర్చేటప్పుడు తమ వ్యక్తిగత జీవితంలో ఎవరు ఉన్నారో.. తల్లిదండ్రులకు చెబుతారు. తల్లిదండ్రులు డబ్బు, పరువు, సామాజిక హోదా.. గురించి ఆలోచించి ‘ఏ వ్యక్తి తమ పిల్లల జీవితానికి మంచిదో’ నిర్ణయిస్తారు. అప్పుడు పిల్లలను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో పెద్దలను కాదనలేకనో, వారు చెప్పినది సబబుగానే అనిపించి చెప్పింది వినడానికి సిద్ధపడతారు. కానీ, ప్రేమించానని చెబుతున్న అబ్బాయి ఆ అమ్మాయిని బెదిరించడమో, లేకపోతే మరిన్ని ప్రేమ కబుర్లు చెప్పడమో, తన మాటలతో రకరకాలుగా ప్రేరేపించడమో చేస్తారు. ఇలాంటప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్స్ క్షణికావేశంలోనో లేదా ఎవరికీ దొరకకుండా తప్పులు చేయడం ఎలా.. అనే విషయాల మీద దృష్టి పెడుతున్నాయి. చాలా కేసుల్లో పరోక్షంగా ఒక అబ్బాయిని చంపడానికి మరొక అబ్బాయే కారణం అవుతున్నాడు. – డాక్టర్ జ్యోతిరాజ, సైకాలజిస్ట్– కె. -
అమ్మాయిలూ ఎల్లప్పుడూ ‘మంచి’గా వద్దు..! పరిశోధనలు సైతం..
చిన్నప్పటి నుంచి ఆడిపిల్లలకు సర్దుకుపోవడం, అందరికి చేదోడు వాదోడుగా, మంచిగా వ్యవహరించేలా పెంచుతారు. పైగా వాళ్ల భావోద్వేగాలను బయటకు వ్యక్తం చేయనివ్వరు పెద్దలు. దాని కారణంగానే మహిళలు ఆ వ్యాధి బారిన పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఆ కారణంగానే ఈ వ్యాధి అని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అందుకు సంబంధించిన ఓ మహిళా సంభాషణ వీడియో నెట్టిటంట తెగ వైరల్గా మారింది. ఇంతకీ ఇందులో వాస్తవమెంత? వైద్య నిపుణులు ఏమంటున్నారు?ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మహిళలకు ఆ కారణంగానే ఆటోఇమ్యూన్ వ్యాధి వస్తోందంటూ పోస్టులు వైరల్ అయ్యాయి. అందుకు లక్షలాదిమంది మహిళలు మద్దతు తెలపడం విశేషం. ప్రతి ఒక్కరు అది వాస్తవమని, ఇప్పటికైన మనమంతా మేల్కొందాం అంటూ పిలుపునివ్వడం విశేషం. అంతేగాదు అమ్మాయిలూ సదా ‘మంచిగా’ ఉండొద్దు అది మన ఆరోగ్యానికే హానికరం అనే నినాదం మొదలైంది. ఇతరులను సంతోషపెట్టే అలవాటు మనల్ని మానసికంగా కుంగదీయడమే కాదు, చివరికీ శారీరక అనారోగ్యానికి గురిచేస్తుందని వాదన మొదలైంది నెట్టింట. ఇలా ఎందుకు అంటున్నారంటే..ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతోంది అధికంగా మహిళలే కావడంతో ఈ వాదన ఊపందుకుంది నెట్టింట. ఇటీవల ఒక ఇన్ఫ్లుయెన్సర్ హర్పిందర్ కౌర్ ఈ ట్రెండీ వాదన గురించి షేర్ చేస్తూ..'మంచి' అమ్మాయి అంటే అందరితో ఏకీభవించే, నిస్వార్థపరురాలైన సర్దుకుపోయే అమ్మాయిగా నాకు నేర్పించారు. ఇదే ఆ అనారోగ్య సమస్యకు కారణం అని అంటోందామె. ఆ కారణంగానే మహిళల్లో ఈ సమస్య ఎక్కువని. అందుకు ప్రధాన కారణాలు సాంస్కృతిక అలవాట్లు, దీర్ఘకాలిక ఒత్తిడి, వ్యక్తపరచని భావోద్వేగాలు, తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడం తదితరాలేనని తేల్చి చెప్పింది. అంతేగాదు ఏళ్ల తరబడి చాలామంది తమ బావోద్వేగాలను అణిచివేసి, నిరంతర సంరక్షణ, ఇతరులను సంతోషపెట్టే తపనతో జీవిస్తారు. దాంతో శరీరం దీర్ఘకాలిక ఒత్తిడికి గురై చివరిక దీర్ఘాకాలిక అనారోగ్యానికి బలి అవుతోందంటూ అవేదన వ్యక్తం చేసింది. ఆఖరికి పరిశోధనలు కూడా ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది మహిళలేనని పేర్కొంది. View this post on Instagram A post shared by Harpinder Kaur Mann Yoga 🌕 (@harpindermannyoga) లూపస్, స్జోగ్రెన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు పురుషుల కంటే మహిళలల్లో ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో గణనీయంగా అధిక రేట్లలో ప్రభావం చూపుతోందని చెప్పింది. నిజానికి ఈ వైరల్ పోస్టులన్నీ మహిళలు తీవ్ర నిరాశనిస్ప్రహలకు లోనవ్వడంతోనే ఈ వ్యాధులు బాధపడుతున్నారనే విషయాన్ని వ్యక్తం చేశాయి. అలాగే ఇది ఒత్తిడి రుగ్మతలకు సంబంధించిందేనని శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా. అయితే దృఢంగా ఉన్నంత మాత్రాన ఈ సమస్యను తిప్పికొట్టగలమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా ఆటోఇమ్యూన్ వ్యాధికి అవే కారణమని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు కానీ మహిళలు ఏ విధంగా ఒత్తిడికి లోనవ్వుతున్నారనేది వెల్లడైందంటున్నారు నిఫుణులు. అతేగాదు అమ్మాయిలూ..వద్దు అని చెప్పడం నేర్చుకోవడం, కోపాన్ని వ్యక్తపరచగలగడం, మనకోసం మనం నిలబడటం వంటివి చేస్తే ఈ సమస్య బారిన పడమని ముక్తకంఠంతో నినదించారు. అంతేగాదు ఇలా వ్యవహరించాలంటే మనకు యోగా ఉపకరిస్తుందని, స్వతంత్రంగా, ధైర్యంగా బతకడం ఎలాగో నేర్పిస్తుందని అన్నారు. మానసిక నిపుణులు కూడా ఇవన్నీ సరైనా కారణాలే అయినా..శాస్త్రీయంగా నిర్థారించలేమని అన్నారు. View this post on Instagram A post shared by Tochi Angel (@tochithangel) (చదవండి: కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక! 94 ఏళ్ల బామ్మ విజ్ఞప్తి..) -
యువతే మత్తును చిత్తు చేయాలి
మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి హాని కలిగించే కొన్ని పదార్ధాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనము (ఆడిక్షన్ ). ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి . ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాఇ 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి.వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు. మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టాన్ని చేసింది. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్నవారు చట్టపరంగా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది.హాలుసినోజెన్లు తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించాలా చేస్తాయి. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి, పగటికి తేడా తెలియదు. ఉదాహరణకు చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలని భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.డిస్అస్సోసియేటివ్ అనస్థెటిక్స్ లాంటివి తీసుకోవడం వల్ల నొప్పి తెలియకుండా చేస్తాయి. నార్కోటిక్ అనాల్జెసిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి.ఓపియం (నల్ల మందు), కొకైన్, హెరాయిన్, డెమెరాల్, డార్వోన్, మార్ఫిన్, మేథాడోన్, వికోడిన్, ఆక్సీకోన్టిన్ ఈ తరహా మాదక ద్రవ్యాల కిందకు వస్తాయి.మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల ఆకలి తగ్గిపోతుంది. నిద్ర పట్టదు. అల్సర్లు, క్రామ్ప్స్ వస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.నిద్రలో సమస్యలు, మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, అందరితో పోట్లాటలు చేస్తారు. చేతులు, కాళ్ళు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జుట్టు ఎండిపోతుంది, వయసు మీరిపోయినట్లు కనిపిస్తారు. మాటలో తడబాటు కలుగుతుంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. కొంత మంది డ్రగ్స్ కొనుక్కోవడం కోసం దొంగతనాలు చేయడం కూడా మొదలుపెడతారని వైద్యులు చెబుతున్నారు.డ్రగ్ వినియోగం వల్ల జరిగే నష్టాలను వివరించేందుకు ప్రతి ఏటా జూన్ 26న మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుతున్నారు. ప్రస్తుతం గంజాయి వినియోగం కూడా ఎక్కువ అయింది. సిటీల్లో రేవ్ పార్టీల సంస్కృతి పెరుగుతుంది. పిల్లలు తల్లి తండ్రుల వద్ద ఉండకుండా చిన్న తనం నుంచి వారికి దూరం ఉండి చదువుకోవడం, ఒత్తిడిని తట్టుకునేందుకు డ్రగ్స్ వినియోగం పెరిగినట్లు వివిధ నివేదికలు చెబుతున్నాయి. గట్టి కార్యాచరణ ద్వారానే వీటిని నియంత్రణ చేయవచ్చు.మాచన రఘునందన్ టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత (చదవండి: ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!) -
ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!
చదువులో రాణించలేకోపోయాడు..అడగడుగునా అవమానం, వైఫల్యమే. ఛీ ఈ బతుకు వద్దనుకున్నాడు..చివరికి దేవుడి స్రిప్ట్ మరోలా ఉంది. పాటే నీగమ్యం అంటూ అందులో రాణించేలా చేసింది. అక్కడితో ఆగక ప్రపంచ పర్యాటకుడిలా మారి మొత్తం ప్రపంచాన్నే చుట్టేశాడు. అది కూడా జస్ట్ ఆరేళ్లలోనే ఈ ఘనత సృష్టించిన తొలి పర్యాటకుడిగా నిలిచాడు. మనం ఒకటనుకుంటే..జీవితం మరోలా నడిపించి..విజేతగా నిలుపుతుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ సంగీత కారుడు. బెంగళూరుకి చెందిన సంగీతకారుడు బెన్నీ ప్రసాద్ తన జీవితకాలంలోనే ఒక గొప్ప ప్రయాణ రికార్డుని ప్రదర్శించి నెట్టింట వైరల్గా మారాడు. మొత్తం 245 దేశాలు సందర్శించాడు. అందుకు నిదర్శనంగా ఆయా దేశాల స్టాంపులు, వీసాలతో సహా మొత్తం 16 భారతీయ పాస్పోర్ట్లను చూపించడం విశేషం. అందుకు సంబంధించిన సేకరణను రికార్డు చేసి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.ఆ వీడియోలో తన పాస్పోర్ట్ల జాబితా, అంటార్కిటికాతో సహా ఆరు ఖండాల ప్రవేశ స్టాంపులు, వాటిలోని వీసాల ముద్రలతో నిండిన పేజీలతో సహా విపులంగా చూపించాడు. తాను భారత దేశానికి చెందిన వాడినని, అతి తక్కువ సమయంలోనే ప్రతి దేశానికి వెళ్లానని చెబుతుండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. కేవలం ఆరేళ్ల, ఆరు నెలల, 22 రోజుల అంటార్కిటికాతో సహా సార్వభౌమ ఆధారిత 245 దేశాలకు వెళ్లాను అని వీడియో క్లిప్లో వెల్లడించాడు ప్రసాద్. అంతేగాదు కొన్ని దేశాలకు వీసా తోపాటు ఇతర పత్రాలు, అందుకోసం ఎదురైన సవాళ్ల గురించి కూడా సవివరంగా వివరించారు ప్రసాద్. స్వతహాగా సంగీతకారుడు కావడంతో సంగీత ప్రదర్శనలు ఇస్తూ మొత్తం 16 పాస్పోర్ట్లను వీసాలు, స్టాంపులు సునాయాసంగా సంపాదించాడు. అయితే ఇందుకు కొంత ఓపిక కూడా అవసరమని అన్నారు. నెటిజన్లు కూడా ఆ 16 పాస్పోర్ట్ల కట్టను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..ఇందుకు ఎన్ని పత్రాలు అవసరమయ్యాయో అని తలుచుకుంటేనే గుండెల్లో వణుకుపుడుతోందంటూ కామెంట్ చేస్తూ పోస్టుల పెట్టారు.ఎవరీ బెన్నీ ప్రసాద్..బెన్నీ ప్రసాద్ గిటారిస్ట్ కమ్ ప్రపంచ యాత్రికుడు. ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్ల గురించి తన అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. తాను 1975 ఆగస్టు 6న బెంగళూరులో జన్మించినట్లు పేర్కొన్నారు. కుటుంబంలో తన తరంలో అతనే మొదటివాడు కావడంతో, అతని భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుందట అతడి ఫ్యామిలీ. అయితే తన జీవితారంభం అంత బాగాలేదని, తను తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డానని, అందుకోసం కార్టిసోన్ స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దాని కారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, 60% ఊపిరితిత్తుల నష్టం, నిరంతరం బలహీనపడే రోగనిరోధక వ్యవస్థ వంటి ఆరోగ్య సమస్యలు ఎదర్కొన్నానని అన్నారు. ఆ సమస్యలు ఇప్పటికీ తన ప్రాణానికి ముప్పుగానే ఉన్నాయన్నారు. అతడి పేరెంట్స్ తనను చదువులో బాగా రాణించాలని ఆశించారు. ఆ నేపథ్యంలోనే తనకు గణితం, సైన్సు నేర్పించే ప్రయత్నం చేశారని, కానీ అవన్నీ వృధా అయ్యాయని తెలిపారు. దాంతో అవమానం తట్టుకోలేక 16 ఏళ్ల వయసులో చనిపోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే తాను సంగీతం వైపుకి మళ్లడంతో తన జీవితమే మారిపోయిందన్నారు. అలా బెన్నీ సంగీత ద్వారా ప్రతి ఏడాది మొత్తం 40 నుంచి 50 దేశాలకు ప్రయాణిస్తూ వేలాది మందికి జీవితంపై ఆశను కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు తన వెబ్సైట్లో పేర్కొన్నాడు. అంతేగాదు నాలాంటి వాడినే ఉపయోగపడేలా జీవితం మారేస్తే..మీ జీవితాలు ఎందుకు మారవు అని ప్రశ్నిస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో భగవంతుడే మార్చలేనంత చెడ్డవారు లేదా పాపాత్ములు కూడా ఎప్పటికీ ఉండరు అని గుర్తించుకోండి అని చెబుతుంటాడు బెన్నీ ప్రసాద్. View this post on Instagram A post shared by MTP - Most Traveled People (@mosttraveledpeople) (చదవండి: రూ. 4 కోట్ల జీతం వదిలేశాడు.. కట్ చేస్తే రూ. 21 కోట్లు సంపాదనతో..) -
రూ. 4 కోట్ల జీతం వదిలేశాడు.. కట్ చేస్తే రూ. 21 కోట్లు సంపాదనతో..
అధిక వేతనం అందుకునే ఉద్యోగి లైఫ్ బిందాస్గా ఉంటుంది. కానీ కొందరు ఆ లగ్జీర లైఫ్ని వద్దనుకుని మరి తనకు తానే బాస్గా ఉండాలంటూ ఎంటర్ప్రెన్యూర్లుగా మారతారు. కొందరు ఆ క్రమంలో సక్సెస్ని అందుకుంటే మరికొందరు చతికిలపడతారు. అయినా సరే తగ్గేదేలే అంటూ సక్సెస్ని ఒడిసిపట్టుకుంటారు. ఇప్పుడిదంతా ఎందుకుంటే..ఓ టెకీ ఏకంగా కోట్లు ఆర్జించే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి మరి బార్బెక్యూ రెస్టారెంట్ మొదలుపెట్టాడు. మరి అన్ని కోట్లలో సక్సెస్ అందుకున్నాడా అంటే..?అతడే కాలిఫోర్నియాకు చెందిన అబ్దుల్ కపీ. ప్రముఖ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యూట్యూబ్, క్రూయిజ్ వంటి సంస్థలలో సుమారు 14 ఏళ్ల పాటు పనిచేసిన టెకీ ఇక ఉద్యోగంలో కొనసాగకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి అతడు టెకీగా రూ. 4.25 కోట్ల వార్షిక వేతనం అందుకునేవాడు. అందరూ అంత మొత్తంతో ఎంతో కొంత డభ్బైనా.. వెనకేసే ప్రయత్నం చేస్తే..అదేమి వద్దంటూ సొంతంగా రెస్టారెంట్ వ్యాపారం చేసేందుకు సన్నద్ధమయ్యాడు. అలా 50 శాతానికి పైగా వేతన కోతను అంగీకరించి, శాన్ ఫ్రాన్సిస్కోను విడిచిపెట్టి అబ్దుల్ కఫీ ఒక మతపరమైన స్వచ్ఛంద సంస్థలో చేరాడు. ఆ ఉద్యోగంతో పాటు, అబ్దుల్-కాఫీ తన స్నేహితుల కోసం విందులు ఏర్పాటు చేయడం, బార్బెక్యూ వంటకాలు చేయడం ప్రారంభించారు. ఆయన వంటశైలికి స్నేహితులు ఫిదా అవ్వుతూ.. చాలా రుచిగా ఉందని ప్రశంసించారు. దాంతోనే తనకు టెక్సాస్ బార్బెక్యూలో ఇంకా ఏమైనా కొత్తగా చేయడానికి అవకాశం ఉందా అని ఆలోచించడం ప్రారంభించాడు. అలా డిసెంబర్ 2024లో కఫీ ‘హలాల్ బార్బెక్యూ’ రెస్టారెంట్ని ప్రారంభించాడు. జస్ట్ మూడు రోజుల పాటు సరిపోయేంత బార్బెక్యూను సిద్దం చేయగా, ఊహించని విధంగా మొత్తం ఒక్కరోజులోనే అమ్ముడుపోయింది. దాంతో రాత్రిళ్లు వంట చేయడం ప్రారంభించారు. అలా చాలా తక్కువటైంలోనే చాలా వేగవంతంగా ప్రజాదరణ పొందడం ప్రారంభమైంది. గతేడాది దాదాపు రూ. 21 కోట్లు ఆదాయం ఆర్జించగా, ఈ ఏడాది రూ. 37.8 కోట్లు ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. అయితే, రెస్టారెంట్ ప్రారంభించినప్పటి నుంచి తాను ఒక్క డాలర్ కూడా వేతనంగా తీసుకోలేదని, తన పొదుపు డబ్బుతోనే జీవనం సాగించినట్లు తెలిపారు. కానీ అధిక వ్యయం..రెస్టారెంట్ అద్భుతమైన విజయం సాధించినప్పటికీ..భవిష్యత్తులో చాలా జాగురుకతతో వ్యవహరించాలని అంటున్నాడు. ఈ వ్యాపారం మంచి లాభాల బాట పట్టినప్పటికీ..సుమారు 1 మిలియన్ డాలర్ల మేర ఉన్న ప్రారంభ పెట్టుబడిని ఇంకా పూర్తిగా తిరిగి చెల్లించలేదని అన్నారు. అంతేగాదు ఈ రెస్టారెంట్ని నడపడానికి అయ్యే అధిక ఖర్చు గురించి కూడా ప్రస్తావించారు. నెలవారీ ఖర్చులు 215,000 (రూ. 2 కోట్లు)డాలర్లకు పైగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఆహారం కోసం 125,000 డాలర్లు(రూ. 1 కోటి), కార్మికుల కోసం 50,000 డాలర్లు(రూ. 47 లక్షలు), అద్దె కోసం 15,000 డాలర్లు (రూ. 14 లక్షలు)ఉన్నాయన్నారు. అలాగే మార్కెటింగ్ ఇతర కార్యకలాపాలపై వేల డాలర్లు అదనంగా ఖర్చు అవుతోందన్నారు.(చదవండి: సాహిత్యంలో డిగ్రీ... వ్యవసాయంలో జీవితం) -
మామ్ వెయిట్లాస్ స్టోరీ..! జస్ట్ 11 నెలల్లో 32 కిలోలు..
ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత ఈజీ కాదు.ముఖ్యంగా సీ సెక్షన్ నుంచి కోలుకుంటున్న తల్లులకు మరింత కష్టం. నిలకడ, సులభమైన వ్యాయామాలు, శ్వాసవ్యాయమాలతో ఓ పిల్లల తల్లి సునాయాసం 32 కిలోలు పైనే తగ్గింది. అది కూడా జస్ట్ 11 నెలల్లోనే. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!.కంటెంట్ క్రియేటర్ దీప్తి హర్షనా ఇద్దరు పిల్లల తల్లి. అదులోనూ సీసెక్షన్ చేయించుకుందామె. అలాంటప్పుడు పొట్ట భాగం దగ్గర నుంచి మిగతా శరీర భాగం అంతా షేప్ అవుట్గా ఉంటుంది. పైగా బరువు తగ్గడం కూడా అంత ఈజీ కాదు. అయితే ఆమెకు కూడా ఎలా తన అధిక బరువుని తగ్గించుకోవాలో తెలియలేదట. కానీ ప్రసవానంతరం బరువు తగ్గాలంటే తప్పనిసరిగా వ్యాయామాలు ముఖ్యం. అయితే ఎలా ప్రారంభించాలో తెలియలేదని, దాంతో యూట్యూబ్లో పొట్ట భాగం తగ్గాలంటే ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది అని సర్చ్ చేసి మరి ప్రారభించినట్లు తెలిపింది. తాను చేసిన వ్యాయమాలు గురించి కూడా వివరించింది.వర్కౌట్ 1: ప్రారంభకులకు అనువైన చేతి వ్యాయామాలుదీప్తి, తక్కువ పరికరాలు అవసరమయ్యే సులభమైన నిలబడి చేసే వ్యాయామాలతో ప్రారంభించాలని సిఫార్సు చేస్తోంది. ఎక్కడైనా నిలబడి, అందుబాటులో ఉన్న వాటర్ బాటిల్ లేదా డంబెల్ ఏదైనా తీసుకుని, ప్రతి వైపు 15 సార్లు చొప్పున మూడు సెట్లు చేయాలని ఆమె సలహా ఇస్తోంది.వర్కౌట్ 2: డంబెల్ ఆర్మ్ రైజెస్5 కేజీల డంబెల్ను ఉపయోగించి, దీప్తి చేతులను బలోపేతం చేసే తేలికపాటి వ్యాయామాలు చేసినట్లు తెలిపింది. ముందుగా 5 కేజీల డంబెల్ను పట్టుకుని, చేతులను నిటారుగా ఉంచి ప్రారంభించాలని చెప్పింది. దీన్ని ప్రతివైపు 15 సార్లు చొప్పున మూడు సార్లు చేయాలని చెప్పిందామె.వర్కౌట్ 3: స్క్వాట్స్స్క్వాట్స్ ఆమె దినచర్యలో మరొక ముఖ్యమైన వ్యాయామం. కొత్తగా చేసేవారైతే డంబెల్ లేకుండా వీటిని చేయవచ్చు. లేకపోతే, డంబెల్ పట్టుకుని సాధారణ స్క్వాట్స్ చేయాలని పేర్కొంది. ఇలా మొత్తం15 రిపిటీషన్లు చొప్పున మూడు సెట్లు చేయమని సూచిస్తుంది.వర్కౌట్ 4: స్టాండింగ్ కిక్స్అలాగే ఆమె తన దినచర్యలో స్టాండింగ్ కిక్ వ్యాయామాలను కూడా చేర్చుకుంటుంది. కేవలం తన్నడం లేదా తాకేలా చేసే వ్యాయామం. ఇక్కడ ఏది సౌకర్యంగా ఉంటే అది చేయవచ్చు. ఇక్కడ ప్రతి వ్యాయామాన్ని 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు చేయాలని ఆమె వివరించారు.వర్కౌట్ 5: తలపైన చేతులతో చప్పట్లుఇది కూడా ఒక సులభమైన కదలిక. చేతులను తల పైకి ఎత్తి, పదేపదే చప్పట్లు కొట్టాలి. ఈ వ్యాయామం చాలా సులభం. చేతులు పైకి, అదే పనిగా చప్పట్లు కొట్టాలి.వర్కౌట్ 6: వెనుకకు కాలును చాచడంతన చివరి వ్యాయామం కోసం, దీప్తి తన చేతులను తలపైన జోడించి, ఒక కాలును వెనుకకు చాచాలి. ఇక్కడ కాలును వీలైనంత వెనుకకు తీసుకువెళ్లి, ఆ తర్వాత ముందుకు తీసుకురండి. ప్రతి వైపు 15 సార్లు పునరావృతం చేస్తూ, మూడు సెట్లు పూర్తి చేయాలిన చెప్పిందామె.గమనిక: ప్రసవానంతర వ్యాయామ దినచర్యలను ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి, ముఖ్యంగా సి-సెక్షన్ తర్వాత, ఎందుకంటే కోలుకోవడానికి పట్టే సమయం వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. View this post on Instagram A post shared by Deepti | Mom • Fitness • Lifestyle (@deepti_harshana) (చదవండి: ఆరు నెలల్లో పదికిలోలు..కానీ అనుహ్యంగా యథావిధి ఎందుకిలా అంటే..!) -
ఏఐ ఫీచర్... ఆస్క్ డోర్ డాష్!
సంవత్సరాలుగా ఫుడ్ డెలివరీ యాప్లు ఒకేరకంగా ఉంటున్నాయి. యాప్ను ఓపెన్ చేసి, రకరకాల రెస్టారెంట్లను బ్రౌజ్ చేసి, మెనూలను పోల్చి, సిఫారసులను స్క్రోల్ చేసి, చివరికి ఒక ఆప్షన్ను ఖరారు చేసుకుంటారు. ఈ మోడల్కు మంచి స్పందన వచ్చినప్పటికీ చిన్న చిన్న నిర్ణయాలను కూడా సుదీర్ఘమైన ప్రక్రియగా మారుస్తుంది.ఈ నేపథ్యంలో క్విక్ రికమెండేషన్ కోసం వచ్చింది ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, ఫుడ్ డెలివరీ కంపెనీ డోర్ డాష్. ఇంక్ వారి సరికొత్త ఏఐ ఫీచర్... ఆస్క్ డోర్ డాష్ రెస్టారెంట్ జాబితాలు, మెనూలు, ఫిల్టర్లను స్క్రోల్ చేయడానికి బదులుగా, తాము ఏమి కోరుకుంటున్నారో కస్టమర్లు చాట్బాట్కు సరళమైన భాషలో చెప్పవచ్చు.యాప్లో ఆర్డర్ చేయడాన్ని నావిగేట్ చేయడంలా కాకుండా, సహజమైన సంభాషణలా అనిపించేలా రూపొందించబడింది. ఫుడ్ ఆర్డర్ చేయడం, కిరాణా సామాను కొనడం, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకోవడం లాంటి పనికైనా మన అభ్యర్థనను ఏఐ అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఆప్షన్ చూపిస్తుంది. చిత్రాలను అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా చిత్రాల ద్వారా కూడా మన అభ్యర్థనను అర్థం చేసుకోగలుగుతుంది. కస్టమర్లు వేగంగా నిర్ణయం తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది.ఒక నిర్దిష్ట రెస్టారెంట్ కోసం వెదకడం, వందలాది ఆప్షన్లను స్క్రోల్ చేయడం వంటివి చేయకుండా, కస్టమర్లు తాము ఏమి కోరుకుంటున్నారో సులభంగా వివరించి, వారి ప్రాధాన్యతను ఆధారంగా సలహాలు తీసుకోవచ్చు. -
Julia Usmanova: మది పులకించెను... మల్లెలు విరిసెను...
పేరుకు రష్యన్ ఆర్టిస్ట్ అయినప్పటికీ జూలియా ఉస్మానోవాకు మన దేశంలోని ఎన్నో నగరాలు సుపరిచితం. తాజా విషయానికి వస్తే... దిల్లీలోని బికనీర్ హౌస్లో తన పెయింటింగ్లతో ప్రదర్శన ఏర్పాటు చేసింది.ఇంతకీ ఆమె కళాకృతులలో ఉన్నదేమిటి? ఒక్క ముక్కలో చెప్పాలంటే... భారతీయ ఆత్మ! మహిళల అలంకరణ, ప్రకృతి, జీవన అనుభవాలు జూలియ చిత్ర ఇతివృత్తాలు. ఈ ఇతివృత్తాలను తన రష్యన్ మూలాలతో కలపడం ఆమె ప్రత్యేకత.జూలియ తాజా సిరీస్ ‘బైలేటరల్ లేయరింగ్స్’ కు కళాభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, యువ భారతీయ మహిళల వస్త్రధారణ... ఆమె గీసిన చిత్రాలలో కనువిందు చేస్తాయి. మల్లెపువ్వులు, పక్షులు, సంప్రదాయ ఆభరణాలు, నేత వస్త్రాలు... ఇలా ఎన్నో అంశాలు జూలియ ఉస్మానోవ చిత్రాలలో కనిపిస్తాయి. స్త్రీలలోని విప్లవాత్మక స్వభావానికి పులిని ప్రతీకగా వాడుకుంది జూలియా. ఇలాంటి ప్రతీకలెన్నో ఆమె చిత్రాలలో కనిపిస్తాయి. -
రియల్ టు రీల్.. 'ఎవరీ విఠాబాయి'?
సినిమా నటులు ఎన్నో పాత్రలు పోషిస్తుంటారు. అయితే నిజజీవిత పాత్రలు పోషించడం అనేది వారికి నిజంగానే సవాలు. అలాంటి సవాలు ఇప్పుడు బాలీవుడ్ అందాల నటి శ్రద్ధా కపూర్కు ఎదురైంది. ‘ఈథా’ అనే బయోగ్రాఫికల్ డ్రామా ఫిల్మ్లో విఠాబాయి నారాయణ్ గావ్కర్ పాత్రను శ్రద్ధా కపూర్ పోషిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయిన నేపథ్యంలో...‘ఎవరీ విఠాబాయి?’ అనే ఆసక్తి మొదలైంది. విఠాబాయి నారాయణ్ గావ్కర్ మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని పండర్పూర్లో జన్మించిన ప్రసిద్ధ జానపద కళాకారిణి. చిన్న వయసులోనే నాటకరంగంలోకి వచ్చింది. రెండుసార్లు రాష్ట్రపతి పురస్కారాలను అందుకుంది. తమాషా, లావణి కళాకారిణిగా తన గానం, నృత్యంతో ప్రేక్షకులను అలరించింది. మరాఠీ జానపదకళలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తిగా నిలిచింది.ఉత్సాహానికి, పట్టుదలకు మారుపేరు అయిన విఠాబాయి ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్న రోజుల్లో కూడా వేదికపై ప్రదర్శన ఇచ్చింది. ‘తమాషా సామ్రాజ్ఞి’గా ప్రసిద్ధురాలైన విఠాబాయిపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. -
రూ. 70 కోట్ల ఇల్లు ప్రశాంతతకు నిలయం, మరో స్పెషల్ ఎట్రాక్షన్
బాలీవుడ్ స్టార్ నటీనటులు అక్షయ్ కుమార్, రవీనా టాండన్ దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం 'వెల్కమ్ టు ది జంగిల్' (Welcome To The Jungle). ఈ సినిమా జూన్ 26న విడుదలవుతున్న నేపథ్యంలో, ముంబైలో ఉన్న రవీనా టాండన్ లగ్జరీ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముంబైలోని ఈ విలాసవంతమైన ఇంటి విలువ 2025 నాటికి సుమారు రూ. 70 కోట్లు. పదండి ఆ ఇంటి ప్రత్యేకలేంటో తెలుసుకుందాం.'నీలయ' - ప్రశాంతతకు నిలయంముంబైలోని అత్యంత రద్దీగా ఉండే బాంద్రా (Bandra) ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా (Sea-facing) ఈ ఇల్లు ఉంది. 'నీలయ' అంటే సంస్కృతంలో 'ఆశ్రయం' అని అర్థం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా పక్షుల కిలకిలరావాలు, పచ్చని చెట్లతో ఈ ఇల్లు ఒక ప్రశాంతమైన ప్రపంచంలా ఉంటుందని రవీనా ఒక సందర్భంలొ పేర్కొన్నారు. అలాగే ఇంట్లో దాదాపు అన్ని వస్తువులను రవీనా స్వయంగా సెలక్ట్ చేసుకొని కొనుక్కున్నారట. ఇంట్లో భర్త అనిల్ థడానీ, అత్తమామలు, తన ఇద్దరు పిల్లలు - కుమార్తె రాషా, కుమారుడు రణ్బీర్లతో కలిసి నివసిస్తున్నారు. ఈ ఇల్లు చక్కటి వాస్తు, కేరళ సంప్రదాయ శైలి, మొరాకన్ (Moroccan) ఆర్కిటెక్చర్ల అద్భుత కలయికగా ఉంటుంది. ఇల్లంతా ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్, శిల్పాలతో నిండి ఉంటుంది. ప్రసిద్ధ కళాకారులు పరేష్ మైతీ, తోట వైకుంఠం వంటి వారు సృష్టించిన కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి. ఇంటి ప్రవేశద్వారం వద్ద వినాయకుడి శిల్పం స్వాగతం పలుకుతుంది.శివాలయం స్పెషల్ ఎట్రాక్షన్ ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన శివాలయం ఉండటం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ దీపావళి వంటి పండుగలకు కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు చేస్తారు. ఆలయం వెలుపల దక్షిణ భారతదేశం నుండి తెచ్చిన 50 ఏళ్ల నాటి నంది విగ్రహం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానించేలా పార్వతీ దేవి విగ్రహాన్ని కూడా అమర్చారు.ఇదీ చదవండి: మీ నాన్న ఎక్కడ? సీఎం విజయ్ ఎద్దేవా, స్టాలిన్ గట్టి కౌంటర్లివింగ్ రూమ్లో మార్బుల్ ఫ్లోరింగ్, ఎర్రటి ఇటుకల గోడలు ఆధునికతను, విలాసాన్ని ప్రతిబింబిస్తాయి. డైనింగ్ రూమ్లో ఫారెస్ట్ గ్రీన్ కలర్ 3D ఉడెన్ ప్యానెల్ గోడ, అద్భుతమైన డిజైన్ గల టేకు టేబుల్, విలాసవంతమైన షాండ్లియర్ (ఝుమర్) ఉన్నాయి. నివేదికల ప్రకారం ఇక్కడ రూ. 10 లక్షల విలువైన బార్ కౌంటర్ కూడా ఉంది. ఇంటి వెనుక భాగంలో కేరళ సంప్రదాయ ఇళ్ల తరహాలో చెక్కబడిన స్తంభాలు, మొరాకన్ శైలి పోర్చ్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఇది పార్టీలు, గెట్-టుగెదర్లకు చక్కగా సరిపోతుంది.ఇదీ చదవండి: అందుకే చంపేశాం, ప్రియుడు చేతన్ చెప్పిన షాకింగ్ నిజాలుచాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, డైరెక్టర్ అహ్మద్లతో కలిసి పని చేయడం పాత స్నేహితులను మళ్లీ కలుసుకున్నట్లు ఉందని రవీనా ఆనందం వ్యక్తం చేశారు. అక్షయ్ కుమార్ గురించి చెబుతూ.. "అప్పట్లో మేమంతా యువకులం, నేర్చుకునే దశలో ఉన్నాం. కానీ ఇప్పుడు అక్షయ్ తన నటనలో పరిపూర్ణత సాధించాడు. సినిమా కోసం ఆయన పెట్టే శ్రమ ఇప్పుడు రెట్టింపు అయ్యింది" అని ఆమె కొనియాడారు.ఇదీ చదవండి: షాకింగ్ : ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది.. ప్రియుడు తోసేశాడు! -
Padma Shri ceremony: మాధవన్ చేతికి ధరించిన వాచ్ అంత ఖరీదా..!
రెండోవిడత ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం గత మంగళవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన దాదాపు 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పురస్కారాలు అందజేశారు. వారిలో కోలీవుడ్ నటుడు మాధవన్ కూడా ఉన్నారు. ఈ వేడుకలో మాధవన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు. ఈ వేడుకలో ఆయన చేతికి ధరించి వాచ్ అత్యంత హైలెట్గా నిలిచింది. ఇది జైపూర్ కళాఖండం. అత్యంత విలువైన టైటాన్ నెబ్యులా జల్సా ఫ్లయింగ్ టోర్బిలాన్ వాచ్ ఇది. 2025లో ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ని ఆవిష్కరించారు. ఇది గడియారాల తయారీలో అత్యంత శ్రేష్టతనుకలిగి ఉన్నది. ఆ బ్రాండ్ అధికారిక వైబైస్ట్ప్రకారం..నెబ్యులా వారి 'జల్సా' అనేది జైపూర్కు ఒక ధైర్యమైన నివాళి . - ఆ నగరం విజయాల కోసం నిర్మించబడలేదు, కానీ ఒక దివ్యదృష్టితో రూపుదిద్దుకుంది అని పేర్కొంది. ఈ వాచ్ డయాల్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంది. జ్యామితిని కవిత్వంగా మార్చి, వాస్తుశిల్పాన్ని పునర్నిర్వచించి తన విశిష్టమైన, క్లిష్టమైన పనితనంలో ఇప్పటికీ మంత్ర ముగ్ధుల్ని హవామహల్ ఉంటుంది. అంతేగాదు ఈ డయల్పై పద్మశ్రీ షకీర్ అలీ చేత పాలరాయిపై చేతితో చిత్రించిన ఒక సూక్ష్మచిత్రం ఉంది. ప్రతి డయల్ ప్రకాశవంతమైన రంగులలో ఊహించిన ఒక క్షణాన్ని బంధిస్తుంది. హవా మహల్ ముందు ఒక రాజ ఊరేగింపు, విజయం, గౌరవం, వైభవానికి నివాళి. దీన్ని ఒకే వెంట్రుక గల ఉడుత కుంచెతో ఒక్కో గీత ఉపయోగించి చిత్రించిన చారిత్రక దృశ్యమట ఆ మహల్ చిత్రం. అంతేగాదు ప్రపంచంలో ఇలాంటి వాచ్లు కేవలం పది మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కటీ ఒక వారసత్వ సంపద. వాచ్లోపల శిల్ప కళతో చెక్కిన 18k రోజ్ గోల్డ్ టోర్బిలాన్, జైపూర్ఎర్ర ఇసుకరాయి వాస్తు శిల్పాన్ని ప్రతిబింబించే సహజమైన ఎర్ర అగేట్ రత్నం వలయం చుట్టూ చుట్టబడి ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ వాచ్ ధర వచ్చేసి దాదాపు రూ. 40 లక్షలు పైనే ఉంటుందట. ఈ మేరకు మాధవన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. "పద్మశ్రీ పురస్కారం అందుకున్నందుకు నేను ఎంతో వినమ్రతతో, అత్యంత కృతజ్ఞతతో దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన దీనిని నాకు ప్రదానం చేసినందుకు భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.నా పేరును సిఫార్సు చేసి, నా ప్రయాణంపై నమ్మకం ఉంచిన మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను అంతే కృతజ్ఞుడను. ఈ గుర్తింపును నా జీవితాంతం ఎంతో విలువైనదిగా భావిస్తాను." ఈ గౌరవాన్ని సినిమా అనే అద్భుత ప్రపంచానికి, నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి కళాకారుడికి, సాంకేతిక నిపుణుడికి, అలాగే నాకు అండగా నిలిచిన నా కుటుంబానికి అంకితం చేస్తున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు," అని పోస్ట్ని ముగించారు.(చదవండి: సాహిత్యంలో డిగ్రీ... వ్యవసాయంలో జీవితం) -
సాహిత్యంలో డిగ్రీ... వ్యవసాయంలో జీవితం
అతడు చదువుకున్న మేథావి. ఆంగ్ల సాహిత్య పిపాసి. కానీ అతని మనసు భూమాతకే అంకితం అన్నది. పుస్తకాలు మేథస్సును తీర్చిదిద్దినా..హృదయాన్ని గెలుచుకుంది మాత్రం వ్యవసాయమే. అందుకే ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేసినా వ్యవసాయం వైపుకే మళ్లీ రైతుగా మారి..ఎన్ని పంటలు పండించాడో వింటే విస్తుపోతారు. వేసిన ప్రతిపంట లాభాలే తెచ్చిపెట్టింది. నేలమ్మకు మించిన బంగారం ఏముంది అని నిరూపించాడు.అతడే అరుణాచల్ప్రదేశ్కు చెందిన కళింగ్ సిరామ్ . అతడు ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. అయితే అందరిలా వైట్ కాలర్ జాబ్లు కాకుండా వ్యవసాయం వైపుకి మళ్లాడు. తన నిజమైన అభిరుచి వ్యవసాయమే అంటూ రైతుగా మారాడు. అందుకు తన తల్లే స్ఫూర్తి అని చెబుతాడు. అరుణాచల్ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లాలోని సిల్లే అనే సుందరమైన గ్రామంలో వైవిధ్యభరితమైన పంటలు పండించి మంచి రైతుగా పేరుతెచ్చుకున్నాడాయన. అమ్మనాన్నల కారణంగానే ఇలా..!తన బాల్యంలో స్వగ్రామమైన దేబింగ్లో అరవై ఏళ్ల వయసులో ఉన్న తన తల్లి పెద్ద ఎత్తున రబ్బరు, నారింజ, పసుపు, అల్లం పండించడాన్ని చూశానని చెప్పాడు. అదే సమయంలో చనిపోయిన తన తండ్రి, ఒక పాఠశాల ఉపాధ్యాయుడు, అయినప్పటికీ వ్యవసాయంతోనే ఎక్కువ గడిపేవాడని చెప్పుకొచ్చాడు. అలా తనకు వ్యవసాయంపై ఆసక్తి కలిగిందని అంటాడు సిరమ్. అందువల్లే మాస్టర్ డిగ్రీ పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించలేదని అంటాడు. తాను కాంట్రాక్టర్గా పనిచేసి ఆదా చేసిన సొమ్ముతో 2017లో సిల్లేలో దాదాపు 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అక్కడే ఫామ్ హౌస్ నిర్మించుకుని పాడి వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. పాల అమ్మకం ద్వారా నెలకు 15 వేల నుంచి 20 వేలు వరకు లాభం పొందాడు. ఆ తర్వాత చేపల చెరువుల, కోళ్లు, మేకల పెంపకంతో ప్రయోగాలు చేశాడు. వాటిల్లోనూ లక్షల్లో లాభాలు ఆర్జించాడు. ఆ తర్వాత వరి తోపాటు, ఆవాలు, నువ్వులను పండించాడు. అలాగే అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, మాంగోస్టీన్, లాంగన, మాకాడమియా వంటి అరుదైన పంటలను కూడా పండించినట్లు వెల్లడించాడు. ఈ ఏడాది డ్రాగన్ ఫ్రూట్ లాభదాయకమైన పంట అవుతుందని..వీటితో టోకు ధరల ప్రకారం సుమారు రూ. 12 లక్షల వరకు ఆదాయం రావొచ్చని అంటున్నాడు. ఇక తన తదుపరి ఆశయం, తేయాకు, పామాయిల్ సాగులోకి ప్రవేశించడమేనని చెబుతున్నాడు. ఆయన పంటలన్నింటి శాస్త్రియ పద్ధతుల్లోనే పండించి లాభలు గడించడం విశేషం. అంతేగాదు ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఏడాది పొడవునా సుమారు పది మంది కార్మికులు పనిచేస్తుంటారు. వాళ్లకు నెలకు సుమారు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు జీతాలు ఇస్తానని అన్నాడు. ఉద్యోగం కన్నా వ్యవసాయమే బెటర్..చివరగా ఆయన యువతను వ్యవసాయం వైపు మళ్లండి, సొంత భూమి ఉన్నప్పటికీ..ప్రభుత్వం ఉద్యోగాల వైపుకి వెళ్తున్నారు, కానీ అవి పరిమితంగానే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు వ్యవసాయం చేపడితే నువ్వే స్వయంగా యజమనిగా ఉంటావు, పైగా నీపై ఎవరి ఒత్తిడి ఉండదని పిలుపునిస్తున్నాడు సిరామ్. రైతుగా పనిచేస్తున్నా.. తన సాహిత్య అభిలాషను మాత్రం వదలుకోడు సిరామ్. ఏ కాస్త సమయం దొరికిన షేక్స్పియర్, మిల్టన్, చార్లెస్ డికెన్స్ రచయితల పుస్తకాలు చదివేస్తుంటాడట. నిజంగా గ్రేట్ కదా..! ఇతడి కథ మహర్షి మూవీలోని మహేశ్ బాబు స్టోరీలా ఉంది కదూ..!.(చదవండి: ఆ మెటర్నిటీ డ్రెస్ అంత ధర పలకదు..!: ఇచ్చిపడేసిన ఉషా వాన్స్) -
శాటిన్ హాల్టర్ డ్రెస్లో పుత్తడి బొమ్మలా ప్రియాంక చోప్రా..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాషన్ ఐకాన్గా తనదైన శైలిలో అలరిస్తుంటుంది. అది క్యాజువల్ అయినా..ఖరీదైన డిజైనర్వేర్ అయినా..సందర్భానుగుణంగా తన లుక్తో అక్కడున్న వారందర్నీ ఆకర్షించడంలో ప్రియాంకకు సాటిరారెవ్వరూ. ఈసారి అలానే కేన్స్ లయన్స్ వేడుకలో తన క్యాజువల్తో పవర్ డ్రెసింగ్తో అద్భుతమైన ఫ్యాషన్ పాఠం చెప్పకనే చెప్పింది. బహిరంగ కార్యక్రమాల్లో అందరి దృష్టిని ఆకర్షించేలా రెడి అవ్వడం ఆమెకు మాత్రమే తెలుసు. మనం ఎంచుకునే దుస్తులే మన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిసిస్తుంది అనే మాటకునిలువెత్తు నిదర్శనం ప్రియాంక. ఎందుకుంటే ఈ గ్లోబల్ స్టార్ కేన్స్ లయన్స్కు హాజరయ్యారు. ఇది ఐదు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సృజనాత్మక ఉత్సవం. ఈ కార్యక్రమానికి కథ చెప్పడం, మౌలికత, ఒకరి దృక్పథాన్ని చెక్కుచెదరకుండా ఎలా ఉంచుకోవాలి అనే అంశంపై డెబస్సీ థియేటర్లో మాట్లాడాలనే ఆహ్వానంపై వచ్చారామె. ఇటాలియన్ ఫ్యాబ్రిక్తో తయారు చేయబడిన ఈ మ్యాక్సీ డ్రెస్, కాలమ్ సిల్హౌట్తో ఉంటుంది. ఇది ప్రియాంకకు స్టైలిష్ లుక్ని అందించింది. వెనుక భాగంలో టై డీటైలింగ్తో కూడిన హాల్టర్ నెక్లైన్ ప్రియంకా లుక్ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఈ డ్రెస్ ధర వచ్చేసి రూ. 1,81,000 ధర పలుకుతుందట. దీన్ని సిల్వియా టెరాస్సీ రూపిందించారు. ఈ డ్రెస్ లుక్కి అనుగుణంగా రూ. 35,574 విలువైన ఫ్రెడా సాల్వడార్ లెదర్ థాంగ్ చెప్పులను జత చేశారు. ఈ వేడుకలో ప్రియాంక ప్రసంగించాల్సి ఉండటంతోనే ఇలా తన క్యాజువల్ డ్రెసింగ్ ఫ్యాషన్తో అద్భుతమైన పాఠం చెబుతున్నట్లుగా సింపుల్ లుక్లో రావడం విశేషం. ఈ డ్రెస్కు ఆమె పింక్ నెక్లెస్, రోలెక్స్ డే-డేట్ 40 చాక్లెట్ డయల్ వాచ్ను యాక్సెసరైజ్గా ధరించింది. చాలా లైట్వైట్ మేకప్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ కార్యక్రమంలో ప్రియాంక ఇలా మాట్లాడారు. తాను కథాంశాన్ని ఎంచుకునేటప్పుడు అంతరాత్మ చెప్పే మాటకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాను ట్రెండ్స్ను అనుసరించడానికి ప్రయత్నించనన్నారు. ఎందుకంటే ట్రెండ్ ఇప్పటికే ఆసక్తికరం..వారానికి అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. ఇక్కడ ఒక సినిమా పూర్తవ్వడానికి ఏడాది పడుతుంది. ఏడాది గడిచినా..ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా ఉండాలే తప్ప దాని క్రేజ్ ఎన్నేళ్లు గడిచిని తగ్గకూడదని కోరుకుంటానంటోంది. థియేటర్ నుంచి బయటకి రాగానే ఆ మూవీ నుంచి చెప్పడానికి ఏదో ఒక విషయం చెప్పేలా ఉండాలి, అలాంటివే తను చేస్తానని చెబుతోంది. అందుకే తాను సినిమా స్క్రిప్ట్లు చదివేటప్పుడు ఈ సినిమా చూస్తే నాకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది?' అని ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటానని చాలా చక్కగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది ప్రియాంక. View this post on Instagram A post shared by LIONS | The Home of Creativity (@cannes_lions) (చదవండి: Isha Ambani: ఎరుపు రంగు డిజైనర్వేర్లో ఇషా స్టైలిష్ గర్ల్ లుక్..!) -
కు.ని. పనీ.. స్త్రీలదే!
కుటుంబ నిర్వహణ భారమే కాదు.. కుటుంబ నియంత్రణ భారం కూడా మహిళలే మోయాల్సి వస్తోందని తాజా గణాంకాలు రుజువు చేస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, భారతదేశంలో ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలు 36.5 శాతం మంది ఉండగా, వాసెక్టమీ పద్ధతిని ఎంచుకుంటున్న పురుషులు కేవలం 0.5 శాతం మాత్రమే. శాస్త్రీయత లేని అపోహలు, లోతుగా పాతుకుపోయిన పురుషాధిక్య ధోరణులు కుటుంబ నియంత్రణ వ్యవస్థలో లింగ అసమానతలకు కారణంగా నిలుస్తున్నాయి. మహిళలనే బాధితులుగా నిలుపుతున్నాయి.దేశంలో కుటుంబ నియంత్రణ సేవల వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, ఆ బాధ్యత భారం మాత్రం ఇంకా మహిళల పైనే సాగుతోంది. అందుకు సాక్ష్యమే ఈ నివేదికలు. మహిళలకు సంబంధించిన ట్యూబెక్టమీ ఆపరేషన్ చాలా క్లిష్టమైనదయినప్పటికీ, దేశంలో 36.5% మంది మహిళలు దీనిని చేయించుకుంటున్నారు. కానీ ఎంతో సులువైన, సురక్షితమైన వాసెక్టమీ చేయించుకునే పురుషుల శాతం కేవలం 0.5% మాత్రమే ఉంది. అంటే కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.శాస్త్రీయత లేని అపోహలు...కుటుంబ నియంత్రణ భారమంతా మహిళలపైనే పడటానికి పురుషుల్లో ఉన్న అవగాహనా లోపం, లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందనే సామాజిక, మానసిక భయాలే ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. లైంగిక విజ్ఞానం పెరిగినప్పటికీ ఇప్పటికీ చాలా మంది పురుషులు వాసెక్టమీని లైంగిక సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే ప్రక్రియగానే భావిస్తున్నారు. వాసెక్టమీ అనేది కేవలం శుక్రకణాలను తీసుకెళ్లే నాళాలను మూసివేసే ఒక చిన్న ప్రక్రియ మాత్రమే. దీనివల్ల పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి గానీ, వారి శృంగార సామర్థ్యానికి గానీ, శారీరక శ్రమ చేసే శక్తికి గానీ ఎలాంటి నష్టం వాటిల్లదు. ఈ ఆపరేషన్ చేయించుకుంటే శరీరం బలహీనపడిపోతుందని భావించడం వల్ల, ముఖ్యంగా రోజువారీ కూలీలు, కష్టపడి పనిచేసే కార్మికులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఈ ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు.మహిళలకే పరిమితం...దేశంలో దశాబ్దాలుగా సాగుతున్న కుటుంబ నియంత్రణ ప్రచారాలు, ఆరోగ్య పథకాలు కూడా ఈ బాధ్యతను మహిళల పైనే నెట్టేలా రూపుదిద్దుకున్నాయి. ప్రభుత్వ కుటుంబ నియంత్రణ ప్రచారాలన్నీ కూడా ఎక్కువగా మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణులు, తల్లుల చుట్టూనే తిరుగుతున్నాయి. అలాగే మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రసవాల కోసం నిరంతరం ఆసుపత్రులను సందర్శిస్తుంటారు. ఆ సందర్భాల్లో వైద్యులకు, గర్భిణులకు మధ్య శాశ్వత కుటుంబ నియంత్రణపై జరిగే చర్చలు సైతం కుటుంబ నియంత్రణ అనేది కేవలం మహిళల బాధ్యత అనే భావనను బలపరిచాయి.కమ్యూనికేషన్ గ్యాప్...గతంలో దేశంలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల తాలూకు చేదు జ్ఞాపకాలు, భయాలు ఇప్పటికీ పురుషుల్లో ఒక రకమైన అపనమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ లోపం కూడా ఇందుకు ఒక కారణం. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న కుటుంబాలలో భార్యాభర్తల మధ్య కుటుంబ నియంత్రణపై సరైన చర్చలు జరగడం లేదు. ఈ కమ్యూనికేషన్ లోపం కారణంగా, మహిళలు తమ భర్తలకు తెలియకుండా రహస్యంగా గర్భనిరోధక మాత్రలు, కాపర్–టి వంటి పద్ధతులను వాడుతున్నారు. గతంలో 15% గా ఉన్న ఈ రహస్య వినియోగం ఇప్పుడు 27% కి పెరగడం గమనార్హం.మార్పు దిశగా...కుటుంబ నియంత్రణ అనేది ఇద్దరు భాగస్వాములకు సమాన బాధ్యత అయినప్పటికీ, ఈ భారాన్ని మహిళలే మోయాల్సి రావడం వల్ల వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. సమాజంలో ఉన్న ఈ భారీ లింగ వ్యత్యాసాన్ని తొలగించాలంటే కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రమే సరిపోవని, పురుషుల ఆలోచనా విధానంలోనూ మార్పు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వైద్యులు కుటుంబ నియంత్రణపై దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించాలి. వాసెక్టమీ సురక్షితమైనదనే అవగాహన కల్పించాలి. ఇప్పటికే వాసెక్టమీ చేయించుకుని ఆరోగ్యంగా ఉన్న పురుషులను, పురుష ఆరోగ్య కార్యకర్తలను బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చి, ఇతరులలో ఉన్న సామాజిక భయాలను పోగొట్టాలి. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ అనేది కేవలం మహిళలకు సంబంధించిన విషయమనే భావనని సమాజం నుంచి తొలగించినపుడు మార్పు సాధ్యమవుతుంది. -
థానా రామయ్య... నువ్వు చాలా గ్రేటయ్యా!
నీళ్లు కూడా వ్యాపారంగా మారిన ఈరోజుల్లో డెబ్బై ఏడేళ్ల థానా రామ్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది. రాజస్థాన్కు చెందిన థానా రామ్ గత రెండు దశాబ్దాలుగా బాటసారులకు ఉచిత నీరు అందిస్తున్నాడు. బార్మర్లోని రద్దీ రహదారి వెంబడి రోడ్డు దాటుతున్న ప్రజలకు చల్లటి తాగు నీరు బాటిళ్లను అందిస్తుంటాడు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది.బార్మర్–బటాడు మార్గంలో బస్సు ప్రయాణీకులు, ట్యాక్సీ డ్రైవర్లు, బాటసారుల కోసం ప్రతిరోజూ ఖాళీ బాటిల్స్లో చల్లటి తాగునీరు నింపుతూ కనిపిస్తాడు థానా రామ్. వేసవిలో ఉష్ణోగ్రతలు రోజూ 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ చేరుకునే ఈ ప్రాంతంలో థానా రామ్ చేసే సహాయం ఎంతోమందికి ఉపశమనాన్ని ఇస్తోంది. ఈ పని కోసం ఆయన విరాళాల సేకరించడం లేదు. తాను చేస్తున్న పనికి ప్రచారం రావాలని కూడా అనుకోలేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో చాలామందికి థానా రామ్ గురించి తెలిసింది. -
బాహ్య సౌందర్యం.. ఆత్మ సౌందర్యం.. ఏది మిన్న?
చాలామంది సౌందర్యానికి ప్రతీక ఏమిటంటే ‘మోనాలిసా‘ అని చె΄్తారు. మోనాలిసా చిత్ర పటాన్ని తయారు చేసిన కళాకారుడు లియోనార్డో డావిన్సీ. అతను ఫ్రాన్స్కు చెందిన కళాకారుడు, శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి.అతను గీసిన మోనాలిసా చిత్రపటం, నిజానికి ఒక బిడ్డను కోల్పోయిన తల్లిది. ఆమె తన బిడ్డ చనిపోవడం వలన చాలా కాలం΄ాటు దుఃఖంతో బాధ పడుతుంది. ఒకరోజు తన బిడ్డ పోలికలున్న మరొకరి బిడ్డను చూసినప్పుడు, ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు ఉదయిస్తుంది. ఆ సమయంలో ఆమె ముఖంలో వెలిగిన చిరునవ్వును డావిన్సీ యథాతథంగా చిత్రించారు. ఎన్ని తరాలు గడిచినా ఇప్పటికీ, ఆమె ముఖంలో విరిసిన చిరునవ్వు సౌందర్యానికి ప్రతీకగా నిలిచిపోయింది.నేటి ఆధునిక కాలంలో అందానికి ఉన్న నిర్వచనాల ప్రకారం మోనాలిసా పెద్ద అందగత్తె కాదు. అయినప్పటికీ కొన్ని తరాలుగా, ఆమె చిత్రపటం అందరినీ ఆకర్షిస్తూనే ఉంది. సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూనే ఉంది. దానికి కారణం ఏమిటి? ఆ చిత్రపటం నుండి వచ్చే చైతన్య తరంగాలు, వైబ్రేషన్స్, మానవులలో గల అంతరాత్మను స్పృశిస్తాయి. అది ఆత్మసౌందర్యాన్ని ప్రతిబింబించే చిత్రపటం.ఒక స్త్రీ ముఖంలో మాతృప్రేమ ప్రతిఫలిస్తున్నప్పుడు, ఆమె అత్యంత సుందరంగా కనిపిస్తుంది. మానవుల దృష్టిని అథోముఖంగా తీసుకొని వెళ్ళే భౌతికమైన శరీర ఆకర్షణ అంత ముఖ్యమైనది కాదు. మన శరీర ప్రతిభాగం నుండి చైతన్య తరంగాలు ప్రవహించేలా మనం ఉండాలి. మన శరీరంలో అన్ని భాగాలు శుభప్రదంగా ఉండాలి.మనం దేనినైనా తాకినట్లయితే, దాని నుండి చైతన్య తరంగాలు ప్రవహించడం ్ర΄ారంభించాలి. అటువంటి శరీర సౌందర్యం దైవికమైన సౌందర్యం. బాహ్య సౌందర్యం వెంట కృత్రిమమైన ఆకర్షణల వెంట పరుగెత్తడం మంచిది కాదు.మనం శ్రద్ధ వహించవలసిన విషయమేమిటంటే – మన శరీరం మన ప్రతి భాగంలో పవిత్రత ప్రవహించే విధంగా ఉందా? మనల్ని చూస్తే ప్రజలు పవిత్రమైన భావనలు పొందుతున్నారా లేదా అపవిత్రమైన భావనలు పొందుతున్నారా? వేల సంవత్సరాల నుండీ వారసత్వంగా పొందిన సంస్కృతీ సంప్రదాయాలు మన భారతీయుల దగ్గర ఉన్నాయి. ఆ సంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. – డా. ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులు (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల ఆధారంగా) -
మనమే క్షమించే ధోరణితో ఉంటే.. అదెంత గొప్ప గుణం!
మనం తప్పులు చేసి క్షమించమని దేవుణ్ణి మనసారా కోరుకుంటాం. ప్రతి మత విశ్వాసం ప్రకారం అలా కోరుకుంటే దేవుడు మనల్ని క్షమించి కరుణించుతాడని నమ్మకం... మానవ జీవితంలో మనం అలవరచుకోవలసిన గొప్ప అలవాటు.. క్షమించడం. ఆదిశంకరాచార్యులు వారు రాసిన ఎన్నో శ్లోకాల్లో పూజావిధానంలో జరిగే తప్పులను క్షమించమని అర్థిస్తాం. ఇంకా ‘కరచరణ కృతం వాక్కాయజం వా... సర్వమేతమస్వ’లో భావం అదే.. క్షమాప్రార్థనతోనే పూజ ముగుస్తుంది. ఇదంతా వేడుకోవడం.. కాని మనమే క్షమించే ధోరణితో ఉంటే, అదెంత గొప్ప గుణం! మన శతకాల్లో క్షమాగుణాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించారు..‘ఓర్పు లేని వాడు ఊరకే చిక్కునుక్షమయా ధరిత్రిగాదె క్షమయే భూషణము’ అంటాడు వేమన. క్షమాగుణమే ఆభరణం...సుమతీ శతకంలో క్షమాగుణం లేని వాడు పశువంటాడు, బద్దెన..‘క్షమ లేనివాడు పశువు, క్షమయే సర్వోత్తమ గుణము’భాస్కర శతకంలో ...‘క్షమ గలవాడే ధన్యుడు, క్షమ లేని వాడు దరిద్రుండు క్షమచే జయింపరానిది లేదు మూడు లోకములందు’.. మూడు లోకాల్లోను గెలవవచ్చు క్షమ అనే గుణంతో అన్నాడు.భర్తృహరి ‘క్షమా బలం అబలానాం’ అని సెలవిచ్చాడు.. దెబ్బ సహించటమే గొప్ప శక్తి...రామదాసుగా శాశ్వత కీర్తి గడించిన కంచెర్ల గోపన్న తాను రాసిన దాశర థీ శతకంలో ‘క్షమ లేని చదువు గుణహీన విద్యయు క్షమ లేని తపము వ్యర్థ తపంబు క్షమ లేని దానము కల్మష దానంబు క్షమ లేని మాన్యత కపట మాన్యత’..క్షమ లేనిదే విద్య, తపం, దానం, గౌరవం తగవని చెప్పాడు.కుమార శతకంలో ‘క్షమయే పరమధర్మము క్షమయే పరమ సుఖము క్షమయే పరమవిద్యయు క్షమయే పరమ గతి క్షమలేని యోగము, భోగము పనికిరాదు క్షమయే ముక్తికి మార్గము సుమ్ము కుమారా’ అని చెప్పారు.సారంగధర శతకంలో ఓర్పు ఉన్నవాడిదే గెలుపని, ఓర్పు ఉన్నవాడే యోగి అని అర్థం వచ్చే పద్యం ఉంది.నారాయణ శతకంలో ‘క్షమయే విష్ణురూపంబు క్షమయే పరబ్రహ్మము క్షమయే జగతికి ఆధారము క్షమయే నిజమైన భక్తి క్షమించేవాడు నరుడు మిగిలిన వారెల్ల పశువులు’...చూశారా... క్షమకి ఎంతప్రాముఖ్యత ఇచ్చేరో... మానవ సంబంధాలు బల పడాలంటే అందరం క్షమాగుణం అలవర్చుకోవాలి. – డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
అంతా ఆచార్యుడి నిర్ణయమే..!
‘నాకు రాజ్యమూవద్దు, రాజ్యాధికారమూ వద్దు. నన్ను పట్టాభిషిక్తుని చేయనక్కర లేదు. నేను ఆచార్యుని చేతిలో కీలుబొమ్మలా వున్నాను. నాకు ఒక స్వేచ్ఛలేదు, సుఖం లేదు, స్వంత నిర్ణయం తీసుకోలేను. చివరకు నా వివాహం కూడా ఆచార్యుడి నిర్ణయమే. అందులోనూ ఆయన రాజకీయ కోణం చూస్తున్నారు .’’ అన్నాడు చంద్రగుప్తుడు వార్తాహరునితో. ఆ వార్త ఆచార్య విష్ణుగుప్తుని చేరింది. ఆచార్యులు చంద్రగుప్తుని వద్దకు వచ్చి ‘‘నేను విన్నది నిజమేనా?’’ అని అడిగారు.‘‘అవును’’ చంద్రగుప్తుని సమాధానం .‘‘ఎందుకు ?’’ ఆచార్యుని ప్రశ్న .‘‘నాకు స్వేచ్ఛ లేదు, సుఖంలేదు, ఏం, చక్రవర్తి సుఖాన్ని కోరకూడదా? నేను మీ చేతిలో జీతం తీసుకుంటున్న పెద్దనౌకరు లా వున్నాను.’’ అన్నాడు.‘‘అవును రాజు, రాజ్యంలో ప్రజాసేవచేసే పెద్దనౌకరే. చక్రవర్తికి సుఖం ఉండదు. ఉండకూడదు. ప్రజాసుఖమే చక్రవర్తి సుఖం. ప్రజాహితమే రాజుకి హితం.నేను నీకు రాజ్యాన్ని అప్పగిస్తానన్నాను గాని, సుఖాన్ని కాదు. దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితోబాధపడుతున్నా చక్రవర్తికి సుఖమెలావుంటుంది? సుఖానికి మూలం అర్థం. అర్థ, కామాలు ధర్మం మీద ఆధార పడి వుంటాయి. సంపాదన సక్రమ మార్గంలో వుండాలి. అక్రమ మార్గమైతే అర్థం, అనర్థమౌతుంది. రాజ్య సంక్షేమం, ప్రజల సుఖంకోసం అర్థం ఎంత అవసరమో, అది ఎందుకు ధర్మబద్ధం కావాలో వివరించారు ఆచార్య చాణక్యులు.చంద్రగుప్తుని చివరి రోజుల్లో దేశంలో కరువు తాండవించింది. ప్రజలు ఆకలికి అలమటించారు. అప్పుడు చంద్రగుప్తుడు కూడా ఆహారం తీసుకోలేదు. ప్రజాహితమే తమ హితంగా భావించిన ఆ ఇద్దరూ ధన్యులే. – విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
సక్సెస్ అంటే సంపాదన, పెళ్లి, మాృతత్వం కాదు..!
సాధరణంగా అమ్మాయిలు చక్కగా పెళ్లి చేసుకోవడం, మాతృత్వం స్వీకరించడం, ధనవంతుడైన భర్త రావడం, మంచి ఉద్యోగం సంపాదించడం తదితరాలను సక్సెస్గా భావిస్తారు. కానీ అది కాదు విజయం అంటూ సరికొత్త అర్థాన్ని ఇచ్చింది ఈ పోషకాహార నిపుణురాలు. ప్రతి మహిళ తనను తాను ఎలా అనుకుంటుందో..ఎప్పటి నుంచో మనపై రుద్దినట్టుగా మనం ఎలా జీవిస్తూ ఉండిపోతున్నామో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారామె. ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడమే కాదు అమ్మాయిల దృక్పథం ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉండటంతో అందరు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతుండటం విశేషం.దుబాయ్కు చెందిన పోషకాహార నిపుణురాలు రాశి చౌదరి ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ని షేర్ చేశారు. "మనం విజయం అనగానే మంచి ఉద్యోగం, మంచి జీతం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటి ప్లాన్లు వేసేసుకుంటాం. కానీ జీవితం మన ప్రణాళికలను చెత్తబుట్టలో పడేసి వాస్తవ ప్రపంచాన్ని పరిచయం చేసేలా విచిత్ర మార్గాన్ని ఇస్తుంది. సరిగ్గా ఇలానే తనకు జరిగిందంటూ తన కథను పంచుకుంది. తాను 21 ఏళ్ల వయసున్నప్పుడూ ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలని, అందమైన గృహిణిగా ఉండాలని, ఇద్దరు పిల్లలను కనాలని అనుకున్నాను. కానీ అవేమి జరగలేదు ప్రస్తుతం తనకు 41 ఏళ్లు అని, సుమారు 40 మందికి పైగా ఉద్యోగులతో రెండు వేర్వేరు వ్యాపారాలను నడుపుతున్నా. అయితే ఈ జర్నీలో నేనే ధనవంతురాలినయ్యానని, తన కెరీర్ ప్లాన్ ప్రకారం ఒకటి నిజమైంది. ఎందుకంటే 25 ఏళ్ల వయసు వచ్చేసరికి, ధనవంతురాలినయ్యా, అలాగే దుబాయ్లో ఒక అపార్ట్మెంట్ ఉంది. బంధువులకు అసూయ కలిగించే విలాసవంతమైన జీవితం నాది. అయినా ఇది నాజీవితంలో ఎందుకు అనిపించడం లేదు. అసలు నా విజయాలను నేను ఎందుకు ఆస్వాదించలేకపోతున్నా. ఎందుకంటే అందరి అమ్మాయిల్లానే నన్ను ఎవరో శక్తిమంతమైన వ్యక్తి ఎంపిక చేసుకునే వ్యక్తిగా భావించడం లేదా నాకు ఏ శక్తిమంతమైన వ్యక్తి అవసరం రానంతగా సక్సెస్ అదుకోవడం. అనే రెండు ఆలోచనలతో పోరాడుతూ ఉండిపోయా. ఈ సందిగ్ధంలో అస్సలు మనకేం కావాలన్నిది మర్చిపోతాం అందువల్ల మన సాధించిన విజయాలను ఆస్వాదించడం మర్చిపోతుంటాం. ఇప్పుడు సక్సెస్ పట్ల నా దృక్పథం మారింది. నీకు ఏం కావాలో నిర్ణయించుకునే ధైర్యం కలిగి ఉండటమే అతి పెద్ద గెలుపు. అదే స్వేచ్ఛకు అసలైన అర్థం. కేవలం కెరీర్లో సక్సెస్ లేదా డబ్బు సంపాదన విజయం కాదని, అది అసలైన స్వేచ్ఛ కూడా కాదని చెప్పుకొచ్చింది రాశి చౌదరి." నెటిజన్లు కూడా నిజం మేడం మీరు చెప్పేది ముమ్మాటికీ కరెక్ట్ అంటూ మద్దతిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rashi Chowdhary (@rashichowdhary) (చదవండి: ఆమె దృఢ సంకల్పం ముందు అనారోగ్యమే చిన్నబోయింది!) -
అల్కా యాగ్నిక్కి అరుదైన వినికిడి సమస్య..ఎందువల్ల వస్తుందంటే..
రెండోవిడత ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన దాదాపు 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకకు ప్రముఖ బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్ కూడా హాజరయ్యారు. ఆమెకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ్ను ప్రదానం చేశారు. ఆమెకు లభించిన ఈ గుర్తింపును చూసి యాగ్నిక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో ఆమె చాలా బలహీనంగా కనిపించారు. పైగా ఆమెను సిబ్బంది చాలా జాగ్రత్తగా తీసుకురావడం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆమె అప్పటి నుంచి ఇంకా కోలుకోలేదా అన్న అనుమానాల లేవనెత్తాయి అభిమానుల్లో. యాగ్నిక్ 2024లో తాను అరుదైన వినికిడి సమస్యతో బాధపడుతున్నట్లు ప్రకటించగానే..ఒక్కసారిగా వినికిడి ఆరోగ్యంపై చర్చలు మొదలవ్వడమే గాదు అవగాహన ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఇంతకీ యాగ్నిక్ ఫేస్ చేస్తున్న వినికిడి సమస్య ఏంటంటే..60 ఏళ్ల గాయని అల్కా యాగ్నిక్ అత్యంత అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్(SNHL)తో బాధపడుతోంది. ఆమె కారణంగానే ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఈ సమస్యను ఏదో ఒక దశలో ఎదుర్కొంటున్నట్లు నివేదికల్లో వెల్లడైంది. అసలేంటి సమస్య అంటే..#WATCH | Delhi | Eminent playback singer Alka Yagnik conferred with Padma Bhushan by President Droupadi Murmu(Video source: Rashtrapati Bhavan) pic.twitter.com/ui2U9koEMy— ANI (@ANI) June 23, 2026సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ అంటే?లోపలి చెవి (కోక్లియా) లేదా మెదడుకు ధ్వని సంకేతాలను పంపే శ్రవణ నాడి మార్గాలకు నష్టం జరిగినప్పుడు సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ (SNHL) సంభవిస్తుంది.చెవిలో గులిమి పేరుకుపోవడం లేదా ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే తాత్కాలిక వినికిడి సమస్యల వలె కాకుండా, SNHL తరచుగా శాశ్వతంగా ఉంటుంది. ఇది ఒక మనిషి వినగల, మాట్లాడగల సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇక గాయని యాగ్నిక్కిఒక ఆకస్మిక వైరల్ దాడి కారణంగా ఈ వినికిడి లోపం మొదలైందట. దీని కారణంగా ఆమె వినికిడి సామర్థ్యం ఊహించని విధంగా తీవ్రంగా క్షీణించింది.సెన్సోరిన్యూరల్ వినికిడి లోపం లక్షణాలుసెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ లక్షణాలు తీవ్రతను బట్టి మారవచ్చని అంటున్నారు వైద్యులు.ఆకస్మిక లేదా క్రమమైన వినికిడి లోపంసంభాషణలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందిచెవులలో రింగుమని శబ్దం (టిన్నిటస్)మసకగా వినిపించే శబ్దాలుశబ్దాలతో కూడిన వాతావరణంలో వినడంలో ఇబ్బందిఇతరులు అస్పష్టంగా మాట్లాడుతున్నారని అనిపించడంకొన్ని సందర్భాల్లో, వినికిడి లోపం అకస్మాత్తుగా సంభవించవచ్చు, తక్షణ వైద్య సహాయం అవసరం కావచ్చు.SNHLకి కారణం..సెన్సోరిన్యూరల్ వినికిడి లోపానికి అనేక కారకాలు దోహదం చేస్తాయి, వాటిలో ఇవి ఉన్నాయి:వైరల్ ఇన్ఫెక్షన్లుకొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు వినికిడికి బాధ్యత వహించే లోపలి చెవి నిర్మాణాలను దెబ్బతీస్తాయి.పెద్ద శబ్దానికి గురికావడంపెద్ద సంగీతం, కచేరీలు, హెడ్ఫోన్లు లేదా వృత్తిపరమైన శబ్దానికి దీర్ఘకాలం పాటు గురికావడం వల్ల కోక్లియా లోపల ఉన్న సున్నితమైన హెయిర్ సెల్స్ శాశ్వతంగా దెబ్బతినవచ్చు.వయసు పైబడటంవయసు సంబంధిత వినికిడి లోపం అనేది సెన్సోరిన్యూరల్ వినికిడి లోపం (SNHL) అత్యంత సాధారణ రూపాలలో ఒకటి.కొన్ని రకాల మందులుఓటోటాక్సిక్గా పిలిచే కొన్ని రకాల మందులను దీర్ఘకాలం పాటు వాడినప్పుడు, అవి వినికిడిని దెబ్బతీయవచ్చు.వైద్య పరిస్థితులుఆటోఇమ్యూన్ రుగ్మతలు, తల గాయాలు, కణితులు, రక్తప్రసరణ సమస్యలు కూడా వినికిడిని ప్రభావితం చేయగలవు.వినికిడి ఆరోగ్యం ఎందుకు ముఖ్యం?వినికిడి లోపం కేవలం చెవులను మాత్రమే ప్రభావితం చేయదు. చికిత్స చేయని వినికిడి సమస్యలు మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, సంభాషణ, మొత్తం జీవన నాణ్యతపై ప్రభావం చూపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. వినికిడి లోపం ఉన్నవారు సామాజిక ఒంటరితనం, ఆందోళన, నిరాశ, పని ప్రదేశంలో ఉత్పాదకత తగ్గడం, సంభాషణలో ఇబ్బందులు,కొన్ని సందర్భాల్లో మతిమరుపు సంబంధిత సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. ముంచికిత్స చేయవచ్చా?చికిత్స అనేది వినికిడి లోపం కారణం,తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.వినికిడి పరికరాలు (హెయిరింగ్ ఎయిడ్స్)కాక్లియర్ ఇంప్లాంట్లుసహాయక వినికిడి పరికరాలుశ్రవణ పునరావాసంఅంతర్లీన వైద్య పరిస్థితులకు చికిత్సఅకస్మాత్తుగా వినికిడి లోపం సంభవించిన సందర్భాలలో తక్షణ వైద్య మూల్యాంకనం చాలా కీలకం. ఎందుకంటే ముందస్తు జోక్యం కోలుకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..వినికిడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణులు కొన్ని సులభమైన చర్యలను సూచించారు. అవేంటంటే..హెడ్ఫోన్ వాల్యూమ్ను 60 శాతం కంటే తక్కువగా ఉంచండిబిగ్గరగా ఉండే పరిసరాలలో ఎక్కువసేపు ఉండటాన్ని పరిమితం చేయండిఅవసరమైనప్పుడు చెవి రక్షణను ఉపయోగించండిఅకస్మాత్తుగా వినికిడిలో మార్పులు వస్తే వైద్యుడిని సంప్రదించండిక్రమం తప్పకుండా వినికిడి పరీక్షలను చేయించుకోవడం(చదవండి: ఆరు నెలల్లో పదికిలోలు..కానీ అనుహ్యంగా యథావిధి ఎందుకిలా అంటే..!) -
ఎరుపు రంగు డిజైనర్వేర్లో ఇషా స్టైలిష్ గర్ల్ లుక్..!
ఫ్యాషన్, హస్తకళలను ఇష్టపడే అంబానీ కుటుంబానికి చెందిన ఇషా అంబానీ ఎప్పటికప్పుడు తన దుస్తులతో భారతీయ వారసత్వ సంప్రదాయాన్ని చాటుతుంటుందామె. విలాసవంతమైన ఆభరణాలు, పర్యావరణ థీమ్తో కూడిన నగలతో సదా ఆకర్షణీయమైన లుక్లో కనిపిస్తారామె. ఈసారి మాత్రం ఇషా గ్లామరస్ లుక్లో అత్యంత స్టైలిష్గా కనిపించారు. ఆధునిక అమ్మాయిలా ఆమె లగ్జరీయస్ లుక్ అందర్నీ కట్టిపడేసింది. జూన్24న జరిగిన సెర్పెంటైన్ సమ్మర్ పార్టీకి ఇషా అందరి దృష్టిని ఆకర్షించారు. సరికొత్త గ్లామరస్ లుక్లో ఆకట్టుకున్నారామె. తన డిజైనర్స్టీవ్ ఓ స్మిత్ రూపొందించిన ఎరుపు రంగు ఎంబెల్లిష్డ్ దుస్తులలో మెరిశారామె. ఆ డ్రెస్కి అనుగుణమైన బ్లానిక్ హీల్స్, తల్లి నీతా అంబానీ ఆభరణాల కలెక్షన్కి చెందిన చెవిపోగులను జత చేశారు. ఈ సెర్పెంటైన్ సమ్మర్ పార్టీకి ఇషా అంబానీ ధరించిన స్టీవ్ ఓ స్మిత్ డ్రెస్, ఫ్లాపర్-గర్ల్ గ్లామర్ అండ్ ఆధునిక పార్టీ గర్ల్ సమ్మర్ సౌందర్యాల అద్భుతమైన కలయిక. ఈ ప్రకాశవంతమైన ఎరుపు రంగు డ్రెస్పై పారదర్శకమైన నల్లటి ట్యూల్ ఓవర్లే ఉంది, ఇది డ్రెస్కు ఒక ప్రత్యేకమైన సొబగులు అందించింది. ఈ నల్లటి ట్యూల్ ఓవర్లే యానిమల్ ప్రింట్ను పోలి ఉండే అడ్డ వరుస ఎంబ్రాయిడరీ నమూనాపై నల్లటి మెరిసే పూసలను చేతితో అల్లారు. చేతులు లేని డిజైన్, క్రూ నెక్లైన్, శరీరానికి అతుక్కుపోయే సిల్హౌట్, అసమానమైన అంచు అలాగే గాలికి తేలికగా కదిలే స్కర్ట్ ఇషాని మెడ్రన్గా కనిపించేలా చేసింది. ఆభరణాల పరంగా..ఆమె చెవులకు యాషర్-కట్ మల్టీ-క్యారెట్ వజ్రం పొదిగిన నాజూకైన వేలాడే చెవిపోగులను ఎంచుకుంది. అదే సమయంలో, ఆమె చేతులకు కాక్టెయిల్ రింగులు, ఒక ప్రత్యేకమైన బటర్ఫ్లై రింగ్తో సహా వజ్రాలు, కెంపులతో చేసిన ఆభరణాలను ధరించింది. అలాగే ఆహార్యం పరంగా చక్కటి హెయిర్స్టైల్తో తేలికపాటి మేకప్ టచ్తో ఆధునిక అమ్మాయిలా అందరి దృష్టిని ఆకర్షించింది. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) (చదవండి: Janhvi Kapoor: అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్..! మత్స్యకారుల..) -
తగ్గినట్టే తగ్గి..మళ్లీ యథావిధిగా! స్ట్రిక్ట్ డైటింగ్ చేసినా ఎందుకిలా అంటే..
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న చాలామంది మొదట ధనాధన్ బరువు తగ్గిపోతారు. కానీ ఆ తర్వాత మళ్లీ యథావిధిగా బరువు పెరగకుండా కాపాడుకోవడమే అత్యంత ముఖ్యం. అయితే ఇది చాలా కష్టం. ఇక్కడొక నలభైఏళ్లు పైబడిన మహిళ ఈ సమస్యనే ఎదుర్కొంటోంది. ఆరు నెలలపాటు క్రమశిక్షణతో కూడిన ఆహారం, రోజువారీ నడక తర్వాత దాదాపు పది కిలోల బరువుని విజయవంతంగా తగ్గించుకుంది. కానీ అదే దినచర్యను కొనసాగించినా..మరింత బరువు తగ్గకపోగా..మళ్లీ యథావిధిగా పెరుగుతున్నట్లు అనిపించిందామెకు. ఎందుకంటే ఆకలి కోరికలు పెరగడం, ఎక్కువ కేలరీలు ఖర్చు చేయలేకపోయినట్లు వాపోయింది. ఇది చాలామందికి ఎదురయ్యే పెనుసమస్యే. ఎందుకిలా అంటే..ప్రపంచవ్యాప్తంగా ఇలా డైటింగ్ చేస్తున్నా లక్షలాదిమందికి ఎదురైన అనుభవమే ఇది. మనం వెయిట్లాస్ అవ్వాలనుకున్నప్పుడు మానవశరీరం జీవశాస్త్రపరంగా సిద్దంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హార్మోనల్, న్యూరోలాజికల్, మెటబాలిక్ అనుసరణ కలయిక ద్వారా శరీరం కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అందువల్లే దీర్ఘాకాలిక బరువు నిర్వహణ సవాలుగా మారిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలా బరువు తగ్గినట్టే తగ్గి యథావిధిగా పెరగడాన్ని 'వెయిట్-లాస్ ప్లాటో'గా పిలుస్తారని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే..శరీరం బరువు తగ్గే కొద్దీ శక్తిని ఆదా చేసి, మరింత బరువు తగ్గకుండా నిరోధించడం మొదలుపెడుతుందట. దీనిలో బ్రెయిన్ పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకుంటామో..అందుకు అనుగుణంగా మన బ్రెయిన్ కడపు నిండిన భావన, శక్తి సమతుల్యతకు సంబంధించిన సంకేతాలను శరీరానికి అందిస్తుందట. దాంతో మనం అమాంతం బరువు తగ్గుతూ వస్తూ ఉంటామని అన్నారు. అయితే..కాలక్రమేణ శరీరం ఒక ప్రాధాన్య బరువు పరిధిని ఏర్పరచుకుంటుందట. దీనిని 'సెట్ పాయింట్' అని అంటారని అన్నారు. శరీర బరువు ఈ పరిధి కంటే తక్కువకు పడిపోయినప్పుడూ..మెదడు ఆ మార్పును ఒక సంభావ్య ముప్పుగా భావించి, కోల్పోయిన బరువును తిరిగి పొందడానికి ఉద్దేశించిన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుందట. ఇక్కడ మెదడు తరుచుగా గణనీయమైన బరువు తగ్గడాన్ని ఆకలితో అలమటించే సంకేతంగా పరిగణిస్తుంది, తద్వారా కోల్పోయిన శక్తి నిల్వలను తిరిగి పొందడంలో సహాయపడటానికి రూపొందించిన యంత్రాంగాలను ప్రేరేపిస్తుంది. దాంతో కేలరీలను తక్కువగా ఖర్చు చేస్తాం. పైగా ఆకలి కోరికలు ఎక్కువవ్వడం మొదలవుతాయట. ఫలితంగా యథావిధాగా బరువు పెరుగుతామని అన్నారు. అలాగే బరువు తగ్గాక రోజువారీ శక్తి వ్యయం ఆటోమేటిగ్గా తగ్గుతుందట. దాంతో మొదట ఏ ఆహారం అయితే బరువు తగ్గడానికి సహాయపడిందో అదే మరింత బరువు తగ్గడానికి సరిపడకపోవచ్చని అన్నారు. అలాగే బరువు తగ్గాక హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు నిపుణులు. కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే కొవ్వు కణజాలం ద్వారా ఉత్పత్తి అయ్యే లెప్టిన్ అనే హార్మోన్ స్థాయిలు బరువు తగ్గిన తర్వాత తగ్గుతాయి. అదే సమయంలో, ఆకలితో సంబంధం ఉన్న గ్రెలిన్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆకలి ఎక్కువగా అనిపించి.. ఎక్కువ లాగించడం తోపాటు ఖర్చు చేసే కేలరీల సంఖ్య కూడా తగ్గిపోతుందట. ఈ జీవసంబంధమైన కలయికే ఎక్కువగా తినేలా చేయడానికి, కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి కారణమవుతుందని అన్నారు. అందువల్ల బరువు తగ్గడం అనేది మెదడు, హార్మోన్లు, జీవక్రియలు మధ్య ఉన్న సంక్లిష్టసంబంధంగా పరిగణించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ తోపాటు శరీరం సహజ నిరోధకతను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలు తమ ఫిట్నెస్ జర్నీని సహనంతో వాస్తవిక అంచనాలతో జాగురుకతతో చేపట్టాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: డెలివరి బాయ్ నుంచి ఏకంగా మెసేజింగ్ ప్లాట్ఫామ్కు గ్లోబల్ హెడ్ రేంజ్కు!) -
చిప్పలు చెప్పే కథ
వేసవొస్తే కొబ్బరి నీళ్లకు యమగిరాకీ ఉంటుంది. వీధి చివరన, హైవే రోడ్ల మీద, మార్కెట్ యార్డుల దగ్గర.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బోండాలు ఎడాపెడా తాగేసి ఖాళీ చేసి పడేస్తాం. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. అయితే తాగి పడేసిన ఖాళీ బోండాల గురించి మాత్రం ఆలోచించం. కాని కేరళకి చెందిన ఓ అమ్మాయి ఆలోచించింది. పనికిరాని చెత్త అనుకున్న కొబ్బరి చిప్పలను కళాకృతులుగా మలిచింది. ఉపయోగం లేదనుకున్నవాటినే ఉపాధిగా ఎంచుకుంది. బ్యాక్ టు హోం...కేరళలోని పాలక్కాడ్కు చెందిన మరియా కురియాకోస్ ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేయడానికి ముంబై వెళ్లింది. ఆ తర్వాత స్పెయిన్లో ఎంబీఏ చేసింది. కార్పొరేట్ రంగంలో రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత ఆమెకు ఏదైనా భిన్నంగా చేయాలి, ఏం చేసినా సొంతంగా గుర్తింపు పొందేలా ఉండాలి అని నిర్ణయించుకుంది. ప్రకృతి జీవవైవిధ్యాన్ని దెబ్బతీయకుండా సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా వ్యాపారం చేయాలని తన స్వస్థలానికి చేరుకుంది.‘తేంగా కోకో’ ప్రారంభం...తొలుత మరియా కొబ్బరి ఆకులతో చిన్నచిన్న ఉత్పత్తులను మొదలుపెట్టింది. అయితే ఆ వ్యాపారం ఆశించినంతగా ప్రాచుర్యం పొందలేదు. కాని ఒకరోజు ఇంట్లో కొబ్బరి చిప్పలను చూసి ఒకదానిని తీసుకుని శుభ్రం చేసింది. సాల్ట్ పేపర్తో బ్రష్ చేసి దానిపై కాస్త ఆయిల్ వేసి రబ్ చేయగా ఆ కొబ్బరి చిప్ప ఓ కళాకృతిలా మరియాకి అనిపించింది. తన తండ్రికి చూపించగా ఆయన కూడా ‘వావ్’అనడంతో కొబ్బరి చిప్పల కళాకృతుల కోసం ‘తేంగా కోకో’ అనే సంస్థను 2019లో ప్రారంభించింది.విదేశాలకు ఎగుమతి...ప్రస్తుతం తేంగా కోకో ఉత్పత్తులు ఇటలీ, స్పెయిన్, బల్గేరియా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి అవుతున్నాయి. హోటళ్లు, రీసార్టులు, కార్పొరేట్ గిఫ్టింగ్ సంస్థలు, రెస్టారెంట్లు ఈ కంపెనీ చెందిన సుమారు 110 రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ వార్షిక ఆదాయం రూ.3.5 కోట్లకు పెరిగింది. వచ్చే ఏడాదికి ఈ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మరియ పేర్కొంది. చిన్న ఆలోచనతో ప్రకృతికి ఏమాత్రం హాని కలగకుండా... పర్యావరణానికి మేలు చేసే వ్యాపారం ఒకవైపు, సంప్రదాయ కళావృత్తులకు జీవం పోసిన వైనం మరోవైపు... రెండింటినీ సాధించి చూపించిన మరియ ప్రతిభ ప్రశంసనీయమని సోషల్ మీడియా సాక్షిగా దేశవిదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలకు ఉపాధికొబ్బరి చిప్పలతో కళాకృతులు తయారుచేసే సంప్రదాయ కళాకారులు కేరళలో ఉన్నప్పటికీ, ప్లాస్టిక్, మెటల్ వస్తువుల రాకతో వారికి సరైన మార్కెట్ లేదు. దీంతో మరియా అలాంటివారిని వెతికి పట్టుకుంది. టీ కప్పులు, స్మూతీ బౌల్స్, సర్వింగ్ స్పూన్లు, ఇతర అలంకరణ వస్తువులను తయారుచేసేలా వారికి అవగాహన కల్పించింది. మెల్లగా తెంగా కోకో ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండడంతో మరింతమంది కళాకారులను చేరదీసి 2024లోపాలక్కాడ్ జిల్లా సరిహద్దులో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. విషయమేమిటంటే ఇక్కడ పని చేసేవారంతా మహిళలే. -
ఒకప్పుడు డెలివరీ బాయ్..ఇవాళ మెసేజింగ్ ప్లాట్ఫామ్కు గ్లోబల్ హెడ్గా!
చిన్నప్పుడే కష్టాలు, ఆర్థిక కష్టాలు కొందర్ని దృఢంగా ఎదిగేలా చేస్తాయి. పైగా ఆ సవాళ్లను తమ అభ్యున్నతికి బాటలుగా మలుచుకుని అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. హాయిగా చదువు సాగించిన వారికంటే..టాప్ పొజిషన్లో సెటిల్ అయ్యి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వాడే క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా కథ. అతడి స్టోరీ సినిమాని తలపించే కథలా ఉంటుంది. కునాల్ షా అరుదైన స్టార్టప్ వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన చిన్న వయసులోనే ఉద్యోగ కెరీర్ని ప్రారంభించారు. తండ్రి వ్యాపారం కుప్పకూలడంతో ఒక్కసారిగా కుటుంబం రోడ్డున పడిపోయింది. దాంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక చిన్నా చితక పనులు చేశారు. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి డెలివరీ బాయ్గా, డేటా ఆపరేటర్గా, మెహందీ కోన్ల అమ్మకందారుడిగా, సైబర్ కేఫ్ ఆపరేటర్గా, పైరేటెడ్ సీడీల అమ్మకందారుడిగా, కంప్యూటర్ ట్యూటర్గా పనిచేస్తూ ఆర్థిక స్వేచ్ఛను సాధించారు. అలాగే ఆయన ఐఐటీ ఐఐఎం డిగ్రీలు లేదా కనీసం సాంకేతిక ఎడ్యుకేషన్ కాకుండా..ముంబైలోని విల్సన్ కాలేజీలో ఫిలాసఫీని ఎంచుకున్నారు. ఆ సబ్జెక్టుని ఆయన ఎంచుకోవడానికి రీజన్ ఉదయం 8 నుండి 10 గంటల వరకు మాత్రమే తరగతులు ఉండే ఏకైక కోర్సు కావడంతోటే అది ఎంచుకున్నారట కునాల్. మిగిలిన సమయంలో ఉపాధి చూసుకోవడం కోసం ఇలా చేశారు. ఆ తర్వాత ఎంబిఏలో చేరారు. కానీ దాన్ని పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేశారు. అలాంటి వ్యక్తి భారతదేశపు తొలి డిజిటల్ చెల్లింపుల స్టార్టప్లలో ఒకటైన ఫ్రీఛార్జ్ను నిర్మించారు. దీనిని 2017లో యాక్సిస్ బ్యాంకుకు సుమారు $60 మిలియన్లకు(రూ.56.68 కోట్లు) విక్రయించారు. 2018లో $1 మిలియన్ (రూ. 9.46 కోట్లు) వ్యక్తిగత పెట్టుబడితో క్రెడ్ను ప్రారంభించారు. క్రెడ్కు ప్రస్తుతం నెలకు 1.7 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కేవలం క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించే వినియోగదారులకు రివార్డులు అందించడం కోసం మాత్రమే ఉద్దేశించిన ప్లాట్ఫామ్గా రూపొందించిన యాప్ ఇది. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ ఈ క్రెడ్ కంపెనీపై ప్రశంసల వర్షం కురిపించారు. షా దీనిని భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దారని కొనియాడారు. అంతేగాదు ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ను నడపడానికి అవసరమైన నిర్మాణ దృక్పథం, ప్రపంచ దృష్టికోణాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. క్రెడ్లో మెటా 20% వాటాను కొనుగోలు చేయడంతో, ఇప్పుడు ఆ కంపెనీ విలువ $4.5 బిలియన్లుగా(రూ.4 వేల కోట్లు) ఉంది. ప్రస్తుతం షా AI-ఆధారిత వినియోగదారు ఉత్పత్తులపై దృష్టి పెట్టడానికి మెటాలో ప్రస్తుత వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ క్యాత్కార్ట్ స్థానంలో షా బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక క్రెడ్లో వ్యూహం, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించిన మిధున్ సంపత్ తాత్కాలిక సీఈఓ పాత్రను చేపట్టనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఉద్యోగ నియామకాల సమయంలో డిగ్రీలకు ప్రాధాన్యత ఇవ్వని బహుముఖ ప్రజ్ఞాశాలి కునాల్. లింక్డ్ఇన్ (LinkedIn)లో షాను నేరుగా ట్యాగ్ చేయడం ద్వారా క్రెడ్లో ఇంటర్న్షిప్లు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేగాదు తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎల్లప్పుడూ సీరియస్గా ఉండనివ్వరూ..అక్కడ అంతర్గత మీమ్ ఛానెల్స్ ఉంటాయి. వాటి సాయంతో అక్కడ షాతో సహా ఉద్యోగులు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారని కునాల్ సన్నిహితులు చెబుతున్నారు. అలాగే అక్కడ సీరియస్నెస్గా పనిచేసే వారిని కంపెనీ మెచ్చదట. కేవలం ఉద్యోగులు ఆహ్లాదభరితంగా పనిచేసే సంస్కృతికి పెద్దపీట వేయడం కునాల్ ప్రత్యేకతని సన్నిహిత వర్గాలు చెబుతుండటం విశేషం.(చదవండి: రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్కు బదులుగా చీర..! బ్రిటన్ పౌరురాలేనే ఐనా..) -
అతిగా పాలు తాగడం ఎముకలకు హానికరమా? వైద్యులు ఏమంటున్నారంటే..
పాలు ఆరోగ్యానికి మంచిదని, దానిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుందని విన్నాం. అయితే అతిగా తాగితే అవే పాలు హానికరమై ఎముకలు పెళుసుగా మారిపోయి విరిగిపోతాయనే అపోహ కూడా ప్రబలంగా ఉంది. ముఖ్యంగా మాంసం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువ అంటూ సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. కానీ ఇందులో ఏమంత వాస్తవం లేదని తేల్చి చెబుతున్నారు వైద్యులు. చాలామంది పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వస్తుందని చెబుతుంటారు.. ఇది కూడా ఎంతమాత్రం నిజం కాదని అంటున్నారు ఆర్ధోపెడిక్ సర్జన్లు. అసలు ఈ అపోహ ఎందుకు వచ్చింది?, నిజంగానే పాలు అధికంగా తీసుకోకూడదా అంటే..?మాంసం, పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే శరీరంలో ఆమ్లత్వం పెరిగి దానిని తటస్థీకరించడానికి ఎముకల నుంచి కాల్షియం గ్రహించాల్సి వస్తుందని, తత్ఫలితంగా ఎముకల సంబంధిత సమస్యలు అధికమవుతాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజం కాదని పరిశోధనల్లో ఇలా జరుగుతుందని నిర్థారితం కాలేదని అన్నారు. ఆహారంలోని ప్రోటీన్ ముఖ్యం, సరైన మోతాదులో కాల్షియం తీసుకుంటే ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా ఎముకలు విరగకుండా కాపాడతాయని చెబుతున్నారు. పాలు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్ వస్తుందనే వాదనకు శాస్త్రియ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. అలాగే ఆమ్లీకరణం సమస్య వస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు. ఆస్టియోపొరోసిస్ అంటే..ఎముకల ఖనిజ సాంద్రత తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడి, సులభంగా విరిగిపోయే పరిస్థితి. ఇది అనేక జన్యు, జీవ, జీవనశైలి కారకల వల్ల ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వృద్ధాప్యం, హార్మోన్ల స్థితిలో మార్పులు, విటమిన్ డి లోపం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, సరైన పోషకాహారం లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందని అన్నారు. అయితే పాలల్లో కాల్షియం, ప్రోటీన్లు, ఫాస్ఫరస్ (బలవర్ధకమైన) విటమిన్ డి ఉంటాయి. ఇవి శరీరంలో ఎముకల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. కానీ అతిగా తీసుకుంటే అసమతుల్యత ఏర్పడి పోషకాహార లేమికి దారితీస్తుందే తప్ప..ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని పెంచదన్నారు. ఎప్పుడైతే పాలను ఎక్కువగా తీసుకుంటామో ఫలితంగా ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందకుండా పోతాయన్నారు. అలాగే అజీర్ణం, పాలు పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎముకల బలం కోసం బేషుగ్గా పాలు తీసుకోవచ్చని అన్నారు. కానీ మితంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని చెప్పారు. పైగా ఆస్టియోపొరోసిస్ను నివారిస్తుందన్నారు. చాలామటుకు సమతుల్యతకు పెద్దపీట వేస్తూ..అన్ని రకాల పోషకాలు అందేలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. (చదవండి: రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్కు బదులుగా చీర..! బ్రిటన్ పౌరురాలేనే ఐనా..) -
రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్కు బదులుగా చీర..!
భారతీయ చీరకు ఎప్పటికీ వన్నెతరగని గౌరవం ఉందని మరోసారి రుజువైంది. బ్రిటన్లో ప్రతిష్టాత్మకమైన రాయల్ కార్యక్రమంలో తప్పనిసరిగా డ్రెస్లు, టోపీలే ధరించాలి..కానీ ఆమె భారత సంప్రదాయ చీరనే ఎంచుకుని అందర్నీ ఆకర్షించడమే కాదు..అందురూ పనిగట్టుకుని ఆమెను పలకరించడం విశేషం. ఎవరామె అంటే..ఆ మహిళే భారత సంతతి రచయిత్రి కామిని బంగా. స్వతహాగా బ్రిటన్ పౌరురాలే అయినా..ఆమె భారత సాంప్రదాయ చీరలోనే ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరవ్వడం విశేషం. పైగా తన మూలాలతో ఉన్న బంధాలు ఎన్నటికీ మారవని సగర్వంగా చెబుతోందామె. రాయల్ ఆస్కాట్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ఈ రచయిత్రి ఇలా సాంప్రదాయ చందేరి చీరలో తళక్కుమంది. ఇంతకీ ఏంటి రాయల్ ఆస్కట్ అంటే..రాయల్ ఆస్కట్ అంటే..రాయల్ ఆస్కట్ అనేది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్రపు పందెం కార్యక్రమాలలో ఒకటి. ఇది ప్రతి ఏడాది బెర్క్షైర్లోని ఆస్కట్ రేస్కోర్స్లో జరుగుతుంది. బ్రిటిష్ రాజకుటుంబంతో ఉన్న అనుబంధానికి ప్రసిద్ధి చెందిన ఐదు రోజుల కార్యక్రమం ఇది. దీనికి హాజరయ్యే వారంతా ఆడంబరమైన దుస్తుల, ప్రత్యేమైన టోపీలు ధరించి వస్తారు. సింపుల్గా చెప్పాలంటే రాయల్ ఎన్క్లోజర్లో జరిగే ఈ కార్యక్రమానికి కఠినమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. అక్కడ మహిళలు ఫార్మల్ దుస్తులతో పాటు టోపీలు లేదా ఫ్యాసినేటర్లను ధరించాలి, లేదా తగిన జాతీయ దుస్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ రచయిత్రి కామిని బంగా సాంప్రదాయ చీరనే ఎంచుకున్నారు. చీరనే ఎందుకంటే..తాను ఆస్కట్లో సాధారణంగా కనిపించే ఆకర్షణీయమైన దుస్తులే ధరించాలనుకుందట. తనకు రాయల్ ఆస్కట్ ఆహ్వానం అందగానే..తన బ్రిటన్ స్నేహతులతో షాపింగ్ కూడా చేశారట. ఆస్కట్ కోసం అందమైన మహిళలు ధరించే వేసవి దుస్తులు ప్రయత్నించి చూశానని, కానీ అవి తనకు సహజంగా అనిపించలేదన్నారు. తనెందుకో ఇంగ్లీష్ డ్రెస్, టోపీ తనకు ఎప్పటికీ సరిపోవని అనిపించిందన్నారు. తన స్నేహితులు ఆ డ్రెస్ తనకు బాగానే ఉందని చెప్పినా.. తనకే ఎందుకో సహజంగా అనిపించలేదన్నారు. చివరికి ఇలా బంగా రాయల్ ఆస్కట్కు వింటేజ్ ఆభరణాలతో కూడిన చందేరి చీరలో హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను 20 ఏళ్లుగా యూకేలో నివశిస్తున్నానని, ఐనా ఈ దేశ పౌరురాలిగా కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పటికీ మారవని అంటోంది. అదీగాక తన వారసత్వాన్ని స్వీకరించడం వల్లే ఆస్కాట్లో ప్రత్యేకంగా కనిపిస్తావని స్నేహితులు కూడా అనడంతో ఇలా ఈ ఆహార్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యానని అన్నారు. అయితే అక్కడకు వచ్చిన వారిందరి నుంచి, అలాగే భద్రతా సిబ్బంది, అక్కడున్న యువతుల నుంచి విశేషస్పందన వచ్చిందని లింక్డ్ఇన్ పోస్ట్లో రాసుకొచ్చారామె. పైగా ప్రతి ఒక్కరూ తనను ఆపి మరి అభినందించారని చెప్పుకొచ్చింది. ఎక్కడైన భారతీయ చీరకు మించిన ఫ్యాషన్ లేదు కదా..!.(చదవండి: Janhvi Kapoor: అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్..! మత్స్యకారుల..) -
అలా మధుమేహాన్ని తగ్గించుకున్నా: హోంమంత్రి అమిత్షా
కేంద్ర హోంమంత్రి అమిత్షా ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. తాను మే 2020 నుంచి ఇప్పటివరకు తన జీవనశైలిలో భారీ మార్పులు చేసుకున్నట్లు తెలిపారు. ఫలితంగా మధుమేహం సమస్య నుంచి బయటపడ్డానన్నారు. తాను గతంలో షుగర్ వ్యాధితో బాధపడ్డానని, అందుకోసం అధిక మొత్తంలో మందులు, ఇన్సులిన్ వాడకం నుంచి విముక్తి పొందాలని అనుకున్నాని అన్నారు. ఆ నేపథ్యంలోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించి..బరువు తగ్గడమే గాక మధుమేహం సమస్యను అధిగమించానన్నారు. అందుకోసం తాను ఏం చేశానో, అలాగే యువత ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటారో తదితరాల గురించి అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు అమిత్షా. అవేంటంటే..అమిత్ షా ఆరోగ్య అనుభవంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో తన ఫిట్నెస్ జర్నీ గురించి గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు. గతంలో తాను మధుమేహంతో బాధపడ్డానని, మే 2020లో ఎలాగైన ఈ సమస్యను అధిగమించాలనే కృతనిశ్చయంతో భారీ మార్పులు చేశానని అన్నారు. అందుకోసం తాను తగినంత నీళ్లు తాగడం, వేళకు భోజనం, క్రమం తప్పని వ్యాయామాలు చేసేలా కేర్ తీసుకున్నానన్నారు. అవి తనకెంతో మేలు చేస్తాయన్నారు. అన్నింటికంటే నిలకడగా ఆ అలవాట్లను భాగం చేసుకుంటే మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. పైగా తనకు మందులపై ఆధారపడటం నుంచి విముక్తి లభించిందని చెప్పారు. ఆ జీవనశైలి మార్పులను అవలంభించి ఇవాల్టికి ఐదేళ్లవుతుందని, పైగా 20 కిలోల బరువు కూడా తగ్గానన్నారు. ముఖ్యంగా తాను వాడే అల్లోపతి మందులు, ఇన్సులిన్ వాడకం నుంచి బయటపడ్డానన్నారు. ఈ ప్రయోజనాలు శారీరక ఆరోగ్యానికి మించినవని అన్నారు. అంతేగాదు తన జీవనశైలిలో మార్పులు తన మానసిక చురుకుదనాన్ని, పని సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచాయన్నారు. ముఖ్యంగా పనిచేసే, ఆలోచించే విధానంలో మంచి మార్పుని తీసుకువచ్చిన చక్కటి నిర్ణయాలు తీసుకునేలా మెరుగుపరిచిందన్నారు. యువతకు సందేశం..తన అనుభవం ఫ్యాడ్ డైట్లు, తక్షణ పరిష్కారాల కంటే రోజువారి స్థిరమైన అలవాట్లు ఎంతటి గణనీయమైన మెరుగుదలకు దారితీస్తాయనేది చెబుతోందన్నారు. అందువల్ల యువత తమ ఆరోగ్యం కోసం వారే శ్రద్ధ తీసుకోవాలని కోరారు. శారీరక శ్రమకు, విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలని నొక్కి చెప్పారు. దాంతోపాటు రోజుకు రెండు గంటల వ్యాయాయమం, బ్రెయిన్కి ఆరుగంటల నిద్ర కేటాయించమని కోరారు. తగినంత నిద్ర శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మెరుగైన ఏకాగ్రత, మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి దోహదపడుతుందని చెప్పారు.#WATCH | Delhi: At the event organised by ILBS (Institute of Liver and Biliary Sciences) on World Liver Day, Union Home Minister Amit Shah says, "... I made a huge change in my life since May 2020 till today. The required amount of sleep, water and diet, and routine exercise has… pic.twitter.com/HxDZgv0YGh— ANI (@ANI) April 19, 2025 (చదవండి: weight loss: 72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..) -
అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్..!
బాలీవుడ్ నటి, దివంగత టాలీవుడ్ నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడూ తనదైన శైలిలో ఫ్యాషన్తో అలరిస్తుంటుంది. టాలీవుడ్ హీరో రామచరణ్ మూవీ పెద్దితో మంచి హిట్ని అందుకుంది. ఇటీవల తన అక్క అన్షులా కపూర్ వివాహ వేడుకల్లో అత్యంత అరుదైన చేనేత చీర ధరించి అందర్నీ ఆకర్షించారు. ఈ చీర ఎంత ప్రత్యేకమైనదంటే..నేయడమే అత్యంత విలక్షణం, కష్టతరమైన కళాత్మక పని కూడా. ఆ నేతను నేసే కళాకారులు కూడా ఇప్పుడంతగా లేరు. అంత పురాతనమైన చేనేత చీర ఇది. మరి ఆ చీర విశిష్టత గురించి సవివరంగా తెలుసుకుందామా..!.జాన్వీ కపూర్ ధరించిన బనారసి చీర, క్లిష్టమైన కడియల్ నేత గొప్పతనానికి చెందింది. దీన్ని సౌరవ్ దాస్ రూపొందించారు. మేగాన్ కాన్సెసియో స్టైలింగ్లో ఆమె తన చీరను "మత్స్యకారుల భార్యల చోళీ"ల మాదిరి బ్లౌజ్ని జత చేశారు. తన చీర లుక్కికి అనుగుణంగా జుమ్కాలు, కడాతో కలిగిన సాంప్రదాయ దేవాలయ ఆభరణాలను ఎంచుకున్నారామె. కురులను వదులుగా వదిలేసి..సింపుల్ మేకప్తో అట్రాక్టివ్ లుక్తో కనిపించారామె. ఆమె ధరించిన బనారసీ చీర తరతరాలుగా నిలిచిపోయేంత విలువైన కడియల్ నేతతో నేసిన శారీ. ప్రత్యేకత..ఈ చీర వారణాసిలో అత్యంత ప్రజాదరణ పొందిన చేనేత చీరలలో ఒకటి. అక్కడ తంచోయ్, జాంగ్లా, మీనాకారి, గ్యాసర్, రంగకాట్, ఏక్తారా, కధ్వా, కడియల్ తదిత ప్రసిద్ధ చేనేత చీరలు ఉన్నాయి. కోర్వాయిగా పిలిచే ఈ కడియల్ నేత మూడి షటిల్స్తో నేస్తారు. ఈ పద్ధతిలో నేయడానికి అత్యంత నైపుణ్యం గల కళాకారులు అవసరం. కాబట్టి ఇది చాలా అరుదైనది. జాన్వి చీరలో కనిపించే విధంగా..విభిన్నమైన అంచును రూపొందించడానికి ఈ విధమైన పద్ధతిని ఉపయోగిస్తారు. చీర పై, క్రింది అంచులను రూపొందించడాని ఈ మూడు షటిల్స్ పద్ధతిలో నేస్తారు. అలాగే అంచులను కలపడానికి ఇంటర్లాకింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో అల్లిక పద్ధతినే కడియల్ అని అంటారు. ఈ పద్ధతిని పైఠానీ చీరలలో కూడా ఉపయోగిస్తారు. ఈ విధానంలో నేయడానికి ఎక్కువ శ్రమ అవసరం. అందుకే పవర్ లూమ్స్ ఈ చీరలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతోంది. అదీగాక దీని వాడకం కూడా తగ్గిపోవడంతో ఈ చీరల కొరత అధికంగా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్లీ కడియల్ బ్రోకేడ్ చీరలకు ఆదరణ పెరుగుతుండటం విశేషం. ఈ చీర భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన విలువైన చేనేత వస్త్రంగా పేరుగాంచింది కూడా. (చదవండి: 72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..) -
72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..
వెయిట్లాస్ జర్నీలో ఒక్కోక్కరిది ఒక్కో విధానం. వారి శరీరానికి అనుగుణమైన విధంగా..భారంగా కాకుండా నిలకడగా చేసేలా హెల్దీగా అధిక బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు చాలామంది. తాజాగా ఆ కోవలోకి మరో ఫిట్నెస్ ట్రైనర్ చేరారు. ఆమె తాను చేస్తున్న తప్పిదాలను సరిచేసుకుంటూ బరువు తగ్గి స్ఫూర్తిగా నిలిచారామె. అధిక బరువుని తగ్గించుకోవడానికి ఆంటకంగా ఉన్న అలవాట్లకు స్వస్తి పలికి మరీ ఏకంగా 23 కిలోలు తగ్గారు. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా అందుకోసం ఎలాంటి క్రాష్ డైట్లు, డిటాక్స్ టీలను తీసుకోలేదు. కేవలం తన వెయిట్లాస్ జర్నీలో చేస్తున్న తప్పులను సరిచేసుకుని మంచి ఫలితాలను అందుకున్నట్లు చెబుతోంది ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా. ఆమె ఏ అలవాట్లను వదులుకున్నారు..ఏ తప్పిదాలను పునరావృతం కానివ్వలేదంటే..అల్పాహారం మానేయడం..బరువు తగ్గాలనే ఉద్దేశంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసేదాన్ని దాంతో విపరీతమైన ఆకలితో ఉండేదాన్ని అన్నారు. ఫలితంగా జీవక్రియ మందగించేది. అదీగాక నేరుగా రాత్రిపటే తినేదాన్ని అన్నారు. దీని వల్ల తెలియకుండానే ఎక్కువ తినేయడం, బరువులో పెద్దగా మార్పులు కనిపించకపోవడం గమనించి ఆ విధానాన్ని పూర్తిగా మానేశానని చెప్పారు. ఆ తర్వాత నుంచి నిద్రలేచిని గంటలోపే తినడం మొదలు పెట్టానని అన్నారు. చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం..జ్యూస్లు, చక్కెరతో కూడిన టీ, కోల్డ్ కాఫీ వంటి ద్రవాలు ఆరోగ్యకరమైనవిగా అనిపించినా..అవి ఎంతమంది మంచివి కావని అన్నారు. అందుకు బదులుగా నీళ్లు, బ్లాక్ కాఫీ, చక్కెర లేని సాధారణ టీ తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఫుడ్స్ మోతాదు మేరకే..మఖానా, డ్రై ఫ్రూట్స్, పీనట్ బటర్ వంటివి ఆరోగ్యకరమైనవే అయినా..మోతాదు మేరకు తీసుకుంటేనే మంచివని అన్నారు. ఎంత పోషకవంతమైనదైనా..కేలరీల లెక్క మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి అదనపు మోతాదులు త్వరగా కేలరీలను పెంచేస్తాయన్నారు. వెయిట్ ట్రైనింగ్ అస్సలు చేయకపోవడం..తాను బరువులు ఎత్తడం మొదలు పెట్టాకే శరీరంలో నిజమైన మార్పు రావడం కనిపించింది. ట్రెడ్మీల్ మీద గంటల తరబడి ఉండటం కంటే..ఇలాంటివి మంచివని తెలుసుకున్నానని అన్నారు. తక్కువ నిద్ర, ఎక్కువ ఒత్తిడిరాత్రిపూట ఆలస్యంగా నిత్రపోవడం, కార్డిసాల్ స్థాయిలు అధికంగా ఉండటం తదితరాల వల్ల తెలియకుండానే అధికంగా తినాలేన కోరక కలుగుతుందని అన్నారు. మంచి ఆరోగ్యానికి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరని అన్నారు. బయట తినడం మానేయడం..రెస్టారెంట్ భోజనం అప్పడప్పుడు పర్లేదనే భావన తప్పుడు ఆలోచన అని అంటోంది. ఇంటి భోజనమే మంచిదని, వెయిట్లాస్ కోసం ప్రయత్నించేవారికి ఇది అత్యంత ముఖ్యమని పేర్కొంది. చీట్ మీల్ వద్దు..పోనీలే సరదాగా పిజ్జా, కేక్ చిన్న ముక్కే కదా వంటివి వద్దు. ఏది చేసినా..పరిపూర్ణత కంటే..నిలకడగా చేయడం అనేది అత్యంత ప్రధానం అని గ్రహించండని నొక్కి చెబుతోంది. మంచి సమయం లేదా..అనుకూలమైన రోజు అంటూ గడపడం ఏ దినచర్య పాటించడానికి అయినా..క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. ఏ మార్పు చేసినా..సరైన సమయం కోసం కాకుడం వెంటనే ఆచరించడండని అన్నారు.ప్రతీరోజు ఆలోచనాత్మకంగా ఆరోగ్యదాయకమైనవి ఎంచుకుంటూ స్థిరంగా బరువు తగ్గడం కీలకం. అదే మిమ్మల్ని నాజూకుగా మారుస్తుందని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఫిట్నెస్ కోచ్ శిఖా సురానా నెట్టింట షేర్ చేశారు.గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి. View this post on Instagram A post shared by Shikha Surana (@coachshikhasurana) (చదవండి: Weight Loss: 144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..) -
అడవి ఆమెను సీఈఓ చేసింది...
20 ఏళ్లకే అమెరికా మీడియా సంస్థ ‘అన్ టేమ్డ్ ప్లానెట్’ సీఈఓ అయ్యింది మలైకా వాజ్. గోవా తీరంలో అలలతో ఆడుకున్న అమ్మాయి నేడు అడవుల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపిస్తోంది. ‘వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకింగ్తో అడవిని రక్షించవచ్చు’ అని చదువు మానేసి అడవినే యూనివర్సిటీ చేసుకుంది. 21 ఏళ్లకే నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్ప్లోరర్గా ఎంపికైంది. ‘అవకాశాలు ఎదురుచూడవు, దూకెయ్యాలి’ అంటున్న మలైకా వాజ్ పరిచయం ఇది.‘టీవీ అడవికీ, నిజమైన అడవికీ తేడా ఉంది. నేను టీవీలో జనం లేని అడవిని చూశాను. కానీ నిజమైన అడవిలో ఎక్కడ చూసినా మనిషి పాదముద్రలే. జనం ప్రమేయం ఇంతగా ఉంటే అడవి, అటవీ జంతువులు ఏం కావాలి?’ అంటుంది మలైకా. అడవిని నిజరూపంలో చూపిస్తేనే మనిషి దాని పట్ల వివేకంతో వ్యవహరిస్తాడని ఆమె నమ్మకం.పచ్చటి బాల్యం...గోవాలోని సలిగావ్లో 1997లో పుట్టిన మలైక ఇంటి పక్కనే సముద్రం... పచ్చటి చెట్ల మధ్య ఉన్న స్కూలుతో పచ్చటి బాల్యాన్ని చూసింది . ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే మలైక పాముల కోసం చెట్లు ఎక్కేది. గాయపడిన జంతువులను రక్షించేది. స్కూబా డైవింగ్, విండ్సర్ఫింగ్, సెయిలింగ్ నేర్చుకుంటూ సముద్రాన్నే ప్లేగ్రౌండ్ చేసుకుంది. తండ్రి మాక్ వాజ్, తల్లి మరుషా వాజ్లది గోవాలో ప్రముఖ వ్యాపార కుటుంబం. వారు కూతురిని వ్యాపారంలోకి కాని, అకడెమిక్స్ వైపుగాని ఒత్తిడి చేయలేదు. నచ్చింది చేయనిచ్చారు. ఆ స్వేచ్ఛే మలైకాకు రెక్కలు తొడిగింది.జీవితంలో మలుపు...మలైకా ఈ దారిలోకి రావడానికి కారణం వైల్డ్లైఫ్ ఫిల్మ్మేకర్ మైక్ పాండేను కలవడం. అప్పటికి ఆమె వయసు 14. ఆయన డాక్యుమెంటరీలు ప్రభుత్వాల పర్యావరణ నిర్ణయాలను ప్రభావితం చేశాయని తెలుసుకుంది. ‘అంటే మన కథలతో మార్పు సాధ్యం’ అని గ్రహించింది. ‘పర్యావరణం గురించి ఆలోచించడానికి నా వయసు చిన్నదేం కాదు’ అనుకుని హైస్కూల్ తర్వాత కాలేజీకి వెళ్లలేదు. డైరెక్ట్గా ప్రొడక్షన్ హౌస్లలో చేరింది. షార్ట్ ఫిల్మ్స్ తీసింది. 18 ఏళ్లకే ఆర్కిటిక్, అంటార్కిటికా రెండు చోట్లకు వెళ్లిన అతి పిన్న భారతీయురాలిగా లిమ్కా బుక్ రికార్డ్ కొట్టింది. 21 ఏళ్లకే నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్ప్లోరర్గా ఎంపికైంది. ‘లివింగ్ విత్ ప్రిడేటర్స్’ అనే సిరీస్ను ప్రొడ్యూస్ చేసి, హోస్ట్ చేసింది. భారత్లో చిరుత, పులి, ఎలుగుబంట్లతో మనుషులు ఎలా కలిసి బతుకుతున్నారో చూపించింది. డిస్కవరీ, యానిమల్ ప్లానెట్లో ‘ఆన్ ది బ్రింక్’ ఎనిమిది భాగాల సిరీస్ చేసింది.మంటా రేస్ రక్షకురాలు...సముద్రంలో ఏడు మీటర్ల రెక్కలతో తిరిగే ‘మంటా రేస్’ చేపల అక్రమ రవాణాపై సాహసోపేతమైన ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ చేస్తోంది మలైకా. మంటా రేస్ మొప్పలకు ఔషధ గుణాలున్నాయనే మూఢనమ్మకంతో వాటిని క్రూరంగా వేటాడుతున్నారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ నుంచి చైనా మార్కెట్కు అవి ఎలా స్మగుల్ అవుతున్నాయో అండర్కవర్గా షూట్ చేసింది. కెమెరాను ఆయుధంగా మార్చి మాఫియాను ఎక్స్పోజ్ చేస్తోంది. రువాండా వాల్కానోస్ నేషనల్ పార్క్లో మౌంటెన్ గొరిల్లాలపై విలువైన డాక్యుమెంటరీ చేసింది. ‘వాటి ఫ్యామిలీ డైనమిక్స్ చూస్తే అద్దంలో మనల్ని చూసుకున్నట్టే ఉంటుంది’ అంటుంది.20 ఏళ్లకే సీఈఓ...‘అన్ టేమ్డ్ ప్లానెట్’ మీడియా సంస్థను 2017లో స్టార్ట్ చేసి సీఈఓ అయ్యింది మలైక. న్యూయార్క్, బెంగళూరులో ఆఫీసులు నడుపుతూ బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్, అల్ జజీరా, డిస్కవరీకి కంటెంట్ ఇస్తోంది. ఆమె ‘నగర ఆఫీసు’ల్లో ఉండేకన్నా ‘అడవి ఆఫీసు’లో ఉండటమే ఎక్కువ. ‘అమ్మాయిలను బయటకు పంపొద్దు’ అనేవాళ్లకు మలైకా సమాధానం– ‘వారి చేతికి కెమెరా ఇవ్వండి, ప్రపంచాన్ని మారుస్తారు’. ‘నీకు భయం వేయదా? అడవిలో అంత రిస్క్ ఎందుకు అని అందరూ అడుగుతారు. భయం వేస్తుంది. కానీ ఏమీ చేయకుండా కూర్చుంటే అంతకన్నా బోర్ కొడుతుంది’ అని నవ్వుతుంది మలైకా.‘నా కంఫర్ట్ జోన్ అడవే. నా ఆఫీస్ జీప్, బోట్, కెమెరా... ఇవి ఉంటే చాలు’ అంటోందామె. -
రాఖీ సావంత్ అందం కోసం అంత ఖర్చు పెడుతుందా..? జస్ట్ జుట్టు కోసమే రూ. 12 లక్షలు..
బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన స్పెషల్ పాటలతో ఫేమస్ అయ్యింది. అంతేగాదు ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాస్పదురాలిగా ముద్రవేయించుకుంది. ఎవరేమన్నా..తన ఆలోచన, తనదైన నిర్ణయం ఫైనల్ అని కరాఖండీగా చెప్పేస్తుందామె. కెరీర్లో ఎన్నో విమర్శలు, ఒడిదుడుకులు ఎదురైనా..అధిగమించి నిలబడిన వ్యక్తి రాఖీ సావంత్. అయితే ఆమె ఇటీవల క్వీనీ సింగ్ పోడ్కాస్ట్లో తాను అందం కోసం ఎంతలా ఖర్చు చేసిందో బయటపెట్టింది. అన్నింట్లకంటే డబ్బే ముఖ్యమని, అది లేకుండా జీవితంలో ఏ ఒక్క పని జరగదని నర్మగర్భంగా చెప్పి అందర్ని విస్తుపోయాలా చేసింది. ఆమె అందం కోసం డబ్బుని ఎలా ఖర్చు పెడుతుందో వింటే నోటమాటరాదు.బ్యూటీ బ్రాండ్ BiE వ్యవస్థాపకురాలు, సీఈవో అయిన రాఖీ పేదరికాన్ని ద్వేషిస్తానని అంటోంది. ప్రతీదానికి డబ్బే పరిష్కారమని అంటోంది. ఆమె డబ్బు ఎంత కావాలని కోరుకుంటుందంటే..తన బెడ్పై పరచినంత డబ్బు సంపాదించాలని ఉందట ఆమెకు. పైగా ఆ డబ్బుని స్టైలింగ్ కోసం ఖర్చు చేస్తానని తేల్చి చెప్పింది. తన యాక్సెసరీలను చూపిస్తూ..తన జుట్టుని పట్టుకుని ఇది రష్యన్ హెయిర్ అని ఒక్కసారికే రూ. 12 లక్షలు ఖర్చు అవుతాయని అంటోంది. దీన్నిదుబాయ్, లండన్, కెనడా, అమెరికాలో మాత్రమే చేస్తారని అంటోంది. గోళ్లు, కనురెప్పల అందం కోసం ఆఫ్రికా వెళ్తానని, ఆఖరికి దవడ, బుగ్గలు, పెదవులు వీటన్నింటికీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టానంటోంది. తాను ఎన్నటికీ పేదరికంలోకి రానంతగా డబ్బు సంపాదిస్తానని..అదంతా కూడా తన ఫ్యాషన్ కోసమే ఖర్చు చేస్తానని పేర్కొంది. ఆఖరికి మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా డబ్బే పరిష్కారం అని చెబుతుండటం విశేషం. తనకు నిరాశ కలిగినప్పుడూ కూడా మనీ టన్, మనీ సెటమాల్, మనీ సింగ్ అనే మందులు తన దగ్గర ఉంటాయని నవ్వుతూ చెబుతోంది. తాను డబ్బు సంపాదించడానికి చేయగలిగిందంతా చేస్తానని, కేవలం జీవనోపాధి కోసం కెమెరా ముందు ధైర్యంగా మారిన ఒక అమాయక బాలికనని ఆవేదనగా చెప్పుకొచ్చింది. కాగా, గతంలో రాఖీ తన తల్లి అనారోగ్యానికి వైద్యం చేయించడానికి, అలాగే తన గర్భాశయంలో కణితిని తొలగించుకోవడానికి పడ్డ ఆర్థిక కష్టాలే ఆమె ఆలోచన తీరుకి కారణమని తెలుస్తోంది. అయితే ఒక మనిషి తాను ఎదుర్కొనే పరిస్థితి అతడిని ఎంతలా మార్చేస్తుందనడానికి రాఖీనే నిదర్శనం కదూ..!. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) (చదవండి: Weight Loss: 144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..) -
144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..
ఒక పారిశ్రామిక వేత్త అత్యంత అధిక బరువుతో నరకం చూశాడు. బరువు తగ్గేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. చివరికి ఒక రోజు తీవ్ర అనారోగ్యం పాలవ్వడమే మేల్కోలుపుగా మారి..అతడి వెయిట్లాస్ పరివర్తను నాంది పలకింది. అలా ఓపికతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు ప్రయత్నించి సఫలమవ్వడమే గాక తనలా ఇబ్బంది పడుతున్నవాళ్లు కూడా స్లిమ్గా మారాలని '3ఈ' ఫిట్నెస్ సెంటర్ని కూడా స్థాపించాడు. అంతేగాదు అందరు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అంటూ తన వెయిట్లాస్ స్టోరీని షేర్ చేస్తూ..ఆరోగ్య స్పృహ కలిగిస్తున్నాడు.అతడే 'ADSMITH' వ్యవస్థాపకుడు నీరజ్ ఝూ. తన సంస్థ బాధ్యతలతో తలామునకలవ్వుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. దాంతో అతడు ఏకంగా 144 కిలోల బరువుతో ఊబకాయంతో ఇబ్బందిపడేవాడు. అలాంటి వ్యక్తి కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 65 కిలోలు తగ్గి.. సుమారు 79 కిలోల బరువుకు చేరుకున్నాడు. అయితే దీని కోసం ఎలాంటి వెయిట్లాస్ మందులు, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్, జిమ్ వంటి వాటి జోలికి పోకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తన బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలిచాడు. అతడు తన పాత అలవాట్లకు స్వస్తి పలకాలనే దృఢమైన సంకల్పంతోనే స్లిమ్గా మారానని చెబుతున్నాడు. తాను వృత్తిపరంగా సక్సెస్ అందుకున్నా..అందుకు మూల్యం తన శరీరం చెల్లించాల్సి వచ్చిందంటాడు. తనకు ఆ అధిక బరువుతో అస్సలు నిద్ర పట్టేది కాదని, పైగా వొంట్లో అస్సలు శక్తి ఉండేది కాదని, చాలా ఆయాసంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. అయితే తాను కూడా అందరిలా బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసేవాడినని చెప్పుకొచ్చాడు. శరీరం బాగా అలిసిపోయినట్లుగా అనిపించి, మధ్యలో స్కిప్ చేసేవాడినని అన్నాడు. కానీ బయట వాళ్ల నుంచి వచ్చే ఛీత్కారాలకు భయపడి మళ్లీ బరువు తగ్గే ప్రయత్నాలు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. ఐసీయూ తెచ్చిన మేల్కొలుపు..ఒకరోజు తీవ్రం అనారోగ్య బారినపడి, ఆస్పత్రిలో చేరినప్పుడు నరకం చూశానని, నాటి సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు. చాలాసార్లు ఆస్పత్రిలో చేరాను కానీ ఆవేళ మాత్రం తన పరిస్థితి ఘెరంగా ఉందని, తీవ్రమైన ఎల్ఆర్టీఐ(దిగువ శ్వాసకోశ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) కారణంగా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. వైద్యులు బైపాప్ యంత్రాన్ని అమర్చారు. అది తనకు ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలనే కనువిప్పుని కలగజేసిందన్నారు. అంతేగాదు చాలా ఏళ్ల తర్వాత హాయిగా నిద్రపోయినట్లు పేర్కొన్నారు. అప్పుడే తెలిసింది ఏళ్లుగా తాను ఊపిరాడక సతమతమయ్యాననని తెలుసుకున్నానని అన్నాడు. అసలు బరువు తగ్గించుకుంటే తనకు ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదని తెలిసి వచ్చిందని అంటాడు నీరజ్. అయితే అందరిలా జిమ్, ట్రైనర్ల జోలికిపోకుండా ..చాలామందిలా జిమ్లో జాయినవ్వడం, ఫిట్నెస్ ట్రైనర్లను పెట్టుకోవడం వంటివి చేయకుండా..ప్రాథమికంగా తాను చేయగలిగే వాటిపై దృష్టిపెట్టాడు. ముందు నిలకడగా వ్యాయామాలు చేసేలా చిన్నగా ప్రారంభించాడు. అలాగే ఆహారపరంగా కేలరీలోటు మంత్రని అనుసరించాడు. చిన్నగా వాకింగ్ మొదలుపెట్టి..నెమ్మదిగా అధిక దూరాలకు నడిచేలా కేర్ తీసుకున్నాడు. అలాగే పదే పదే వెయిట్ చెక్ చేయడం వంటివి కూడా చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఒత్తిడి మనల్ని ఆహారం తినేలా ప్రోత్సహిస్తుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేసినట్లు తెలిపాడు. మంచి లేదా చెడు జరిగినా కూడా..నిశబ్దంగా పరిస్థితిని అంగీకరిస్తూ..ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు దూరంగా ఉన్నట్లు తెలిపాడు. దాంతో దాదాపు 120 కిలోలు తగ్గానని చెప్పుకొచ్చాడు నీరజ్. అయితే ఆ తర్వాత మాత్రం తన శరీరంలో అంగుళం కడా మార్పు రాకపోవడంతో షుగర్కి సంబంధించిన వాటన్నింటిని దూరం పెట్టి, అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకున్నట్లు తెలిపాడు. అలా గుడ్లు, చికెన్, చేపలు, పనీర్, గ్రీక్ యోగర్ట్, కూరగాయలు తీసుకోవడం వంటి మార్పులు చేసినట్లు తెలిపాడు. అలాగే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించి రెండు పుల్కాలు వంటివి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే బిస్కెట్లు, అధిక చక్కెర ఉండే పండ్లకు, మద్యంకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. అలా 18 నెలలు కష్టపడగా చివరకు 79 కేజీల బరువుకి చేరుకున్నట్లు తెలిపారు. తాను పూర్తిగా ఇదివరకటి నీరజ్లా రూపుదిద్దుకున్నట్లు చెప్పుకొచ్చారు ఆ మూడు సూత్రాల ఆధారంగా..అలా తనలా మరింత మంది చక్కగా స్లిమ్గా అవ్వాలనే ఉద్దేశ్యంతో 3E ఫిట్నెస్ను స్థాపించాడు. తన జీవితాన్ని మార్చిన మూడు సూత్రాలపై ఈ వెల్నెస్ ఫ్లాట్ఫామ్ని ప్రారంభించాడు. ఆ మూడు Eలు – చెప్పేది..సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసికంగా స్ట్రాంగ్గా ఉండటం. వైద్యులు సైతం ఆయన అనుసరించిన వెయిట్లాస్ జర్పీపై ప్రశంసల జల్లులు కురిపించారు. నెమ్మదిగా, స్థిరంగా బరువు తగ్గడం వల్ల శరీరం జీవక్రియ, హార్మోన్ల స్థాయి మెరుగ్గా ఉండటమే కాకుండా కండర ద్రవ్యరాశిని నిలుపుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అలాగే మళ్లీ తిరిగి బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. ఎప్పుడైనా బరువు తగ్గడం అనేది మానసిక భారంలా కాకుండా..చిన్నగా వాకింగ్, తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెడితే సునాయాసం బరువు తగ్గగలరని చెబుతున్నాడు నీరజ్. ఇక్కడ కేవలం వదులుకోకుండా నిలకడతో క్రమం తప్పకుండా చేస్తే.. తప్పక సత్ఫలితాలను అందుకోగలమని, అందుకు నిదర్శనం తానేనని చెబుతున్నాడు. -
ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..?
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ రీటా సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట ఆడవాళ్ల బట్టలపై చర్చను లేవనెత్తింది. భారతీయ మహిళలు బీచ్కు వెళ్లి, స్విమ్సూట్ లేదా బికినీలో వేలకొద్దీ ఫోటోలు తీసుకున్నా, వాటిని ఫోన్ మెమోరీలోదాచుకోవడం తప్ప, సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయరు. ఎందుకంటే సమాజం ఏమనుకుంటుంది? పక్కింటి ఆంటీ ఎలా కామెంట్ చేస్తుంది? ఆ వీడియో లేదా ఫోటో చూసి మిమ్మల్ని అవమానకరమైన పేర్లతో పిలిస్తే? అని భయం వెంటాడుతుంది అంటూనే కొన్ని ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేయడం అగ్గి రాజేసింది.తాను కూడా బికీనీలు వేసుకుని ఫోటోలు దిగినా, వాటిని ఇన్స్టాగ్రామ్లో పెట్టనని రీటా గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే భారత్లో ఉన్న 24 ఏళ్ల జీవితం తనకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో,దుస్తుల విషయంలోఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పించిందన్నారు. కానీ భయపడుతూ, ఎన్నాళ్లుంటాం అని ప్రశ్నించింది. అందుకే తన మైండ్ సెట్ మార్చుకుని ఈ ఫోటోలను పోస్ట్ చేస్తున్నా అన్నారు.‘‘ఒక భారతీయ మహిళగా ఇలాంటి వీడియోను పోస్ట్ చేస్తానని తానెపుడూ అనుకోలేదు. అలా అని నేనెపుడూ బికినీ వేసుకోలేదని కాదు. థాయ్లాండ్ , ఇండోనేషియాలో చాలాసార్లు బికినీ ధరించా. అక్కడ బీచ్లలో ఇది చాలా కామన్. అయితే పూర్తిగా దుస్తులు కప్పుకున్నప్పుడు కూడా, ఏదో ఒకటి విమర్శిస్తారు. కళ్లార్పకుండా తదేకంగా చూస్తూనే ఉంటారు. సో.. జనం ఏదో అంటారనే రెండో ఆలోచన కూడా చేయకుండా తాను ఆ వీడియోను పోస్ట్ చేస్తున్నా’’ అని చెప్పింది. View this post on Instagram A post shared by Rita | Travel & Itineraries (@travelwith.rita) బికీనీలో ఫోటో పెడితే ఏమవుతుందని చాలా కాలం ఆలోచించాను. కానీ ఏ దేశమేగినా అక్కడ తగ్గట్టు ఉండాలని గ్రహించాను. నేను ఫరీదాబాద్లో బికీనీ వేసుకోను కదా, బీచ్లోనే వేసుకుంటాను. అలాగే బీచ్కి వెళ్లి ఒళ్లంతా కప్పేసే బట్టలు వేసుకోలేము కదా అని రాసుకొచ్చారు. అంతేకాదు ఇండియన్ అంకుల్స్ కేవలం షార్ట్స్ వేసుకుని, సరిగ్గా స్విమ్సూట్ కూడా లేకుండానే సముద్రాలు, పూల్స్లోకి దిగుతుంటారని గుర్తు చేశారు. చాలా దేశాల్లో తాను బికీనీ వేసుకున్నప్పుడు అక్కడెవరూ తనను వింతగా చూడలేదని, ఎవరి పని వారు చూసుకుంటారని రీటా చెప్పారు. నిజానికి మన భయమంతా సమాజం గురించే. చిన్నప్పటి నుండి మనకు అలవాటు చేసిన ఆలోచనా విధానం వల్లే వస్తుందని ఆమె స్పష్టం చేశారు. అయితే తాను మాట్లాడేది కేవలం బికీనీల గురించి కాదు, మన బాడీతో కంఫర్టబుల్గా ఉండటం, భయంతో మన ఫీలింగ్స్ను అనుభవాలను కోల్పోకపోవడం గురించి అని చెప్పారు.ఈ వీడియోపై నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే, మరికొంతమంది ఆమెను జడ్జ్ చేస్తూ, నానా మాటలు అన్నారు. ‘నీ బాడీ. నీ యిష్టం’ అని కొందరు మహిళలు ఆమెను సమర్ధించారు. థాయిలాండ్లో గుడ్లప్పగించి చూడకపోవడం వల్ల స్వేచ్ఛగా ఫీలవుతాం అంటూ చాలా మంది మహిళలు ఆమెకు మద్దతు తెలిపారు. ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లుమహిళల దుస్తుల ఎంపికను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే సంకుచిత స్వభావం ఇంకా సమాజంలో కొనసాగుతూనే ఉంది. మహిళలు ఏం వేసుకోవాలో నియంత్రించే కంటే,ఇలాంటి పురుషాధిక్య, వివక్షతోకూడిన ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ పడ్డారు.రీటాను విమర్శించిన వారిలో ఎక్కువమంది పురుషులే ఉన్నారు. ఈమెకు దూరంగా ఉండండి అని కొందరంటే, పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా కాపీ కొడుతూ, మళ్లీ దానికి సమర్థన ఒకటి అని మండిపడ్డారు. పద్ధతిగా బట్టలు వేసుకోవడం అంటే స్వేచ్ఛను వదులకున్నట్టు కాదు మరికొరు విమర్శించారు. ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం -
అన్నం పెట్టే అందరి ఇల్లు
హైదరాబాద్లోని కొత్తపేటలో ఎస్బీఐ కాలనీకి వెళ్లి ‘అందరి ఇల్లు’ ఎక్కడా అని అడిగితే రోడ్ నంబర్ 2లో ‘మీ సేవ’ ఎదురుగా ఉంటుందని ఎవరైనా చెబుతారు. అటువైపు వెళితే గ్రౌండ్ ఫ్లోర్లో ఓ నాలుగు గదుల ఇంటికి ‘అందరి ఇల్లు’ అని బోర్డు ఉంటుంది. తలుపులు తెరిచే ఉంటాయి. లోపలికి వెళితే ఆకలిగొన్నవారు వండుకుంటూ కనబడతారు. వండింది ఉంటే తినేవారు కనిపిస్తారు. పక్కనే బియ్యం, నూనె, పప్పు, ఉప్పు, అన్ని దినుసులు ఉంటాయి. కిచెన్లో స్టవ్, వంట పాత్రలు, ప్లేట్లు ఉంటాయి. ఈ ఇంటిలోకి వచ్చినవారు వండుకొని తినడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏవి తక్కువ పడినా వెంటనే సమకూరు తాయి. అంతా ఉచితమే. మీ ఇల్లే అనుకోవచ్చు. దీనిని పిల్లల డాక్టరు వింజమూరి సూర్యప్రకాష్, గైనకాలజిస్టు సామవేదం కామేశ్వరి దంపతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీతో అందరి ఇల్లు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.నిరాటంకంగా సాగుతున్న ఈ అన్న వసతికి వారు ఒకరి దగ్గర చేయి చాపలేదు, తామేదో ఘనకార్యం చేస్తున్నట్లు ప్రచారాన్ని కోరుకోలేదు. ఈ భోజన వసతి గురించి తెలిసిన గ్రామీణ పేద యువత అందరి ఇల్లుకు రావడం మొదలైంది. వారిలో ఎక్కువ మంది పోటీ పరీక్షల తయారీకి ఇల్లు వదిలి వచ్చినవారని తెలుసుకొని వారికోసం మరిన్ని వసతులు కల్పించారు. 2011లో వారు చదువుకోవడానికి లైబ్రరీ, కుర్చీ బల్లలు సమకూర్చారు. రాత్రుళ్లు ఇక్కడే ఉండిపోవడానికి కొన్ని బెడ్స్ కూడా వేశారు. ఇందులో ఆరు నెలలు, ఏడాది పాటు ఉండి ఉద్యోగ ప్రయత్నం కొనసాగించినవారు ఎందరో! పై అంతస్తులో కామేశ్వరి క్లినిక్ ఉంటుంది. వైద్యం కోసం వచ్చిన పేదలకు ఆహారానికి, నివాసానికి బెంగ అక్కర లేదు. పేద మహిళలు ప్రసూతి అయ్యే దాకా ఇక్కడే గడిపిన సందర్భాలు ఉన్నాయి. సూర్యప్రకాష్ రోజు ఉదయమే స్వయంగా వచ్చి సరుకులు, సదుపాయాలు సరిపడా ఉన్నాయా అని చూసుకుంటారు. ఈ ఆలోచన (Andari Illu) ఎలా వచ్చిందని అడిగితే ‘సృష్టిలో ప్రతి జీవికి ప్రకృతి ఏదో రూపంలో ఆహారాన్ని అందిస్తోంది. మనుషులు మాత్రమే డబ్బులు వెచ్చించి తిండిని సమకూర్చు కోవాలి. దినమంతా ఏమి తినకుండా రాత్రి గడిపేవారి పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉంటుంది. అందుకే ఇలా ఆరంభించాం’ అంటారు.చదవండి: మా నాన్న ఎవరో తెలుసా?ఎలాగైనా ఖాళీ కడుపు నింపాలి అనే ఆలోచన ఈ వైద్య దంపతులకు 2001లో వచ్చింది. ముందుగా తోపుడు బండిలో అరటిపండ్లు పంచడం మొదలు పెట్టారు. కొన్నాళ్ళు రాత్రి భోజనాన్ని అందించారు. ఇవేవీ తృప్తి నీయక 2006 జూన్ 15న ‘అందరి ఇల్లు’ను ఆరంభించారు. ఎలాంటి ప్రారంభోత్సవ హంగామాలు చేయకుండా స్వయంగా వారే పేదలు ఉండే అడ్డాల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. 24 గంటలు ఇక్కడ సేవలు లభిస్తాయి. తమలాగే ఎవరైనా ముందుకొస్తే ఆ ఆలోచన కార్యరూపం అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ దంపతులు చెబుతున్నారు.– బద్రి నర్సన్ కవి, కథకుడు -
అందాల కిరీటం గెలుపొందడం వెనుక ఇంత బాధ ఉంది..!
మిస్ యూనివర్స్ ఇండియా ఆర్గనైజేషన్ ఇటీవల అనీ శర్మను మిస్ యూనివర్స్ 2026కి అధికారిక జాతీయ ఫైనలిస్ట్గా ప్రకటించింది. దాంతో ఆమె జాతీయ కిరీటం గెలుపొందే ప్రయాణంలో చేరి.. మిస్ యూనివర్స్ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది అని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించింది. అయితే ఇంత పెద్ద విజయం తనకు అంత సులభంగా రాలేదంటూ దాని వెనుకున్న బాధను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పంచుకుంది అనీ శర్మ. తాను మిస్ యూనివర్స్ ఢిల్లీ పోటీల్లోకి వెళ్లేముందుకు కాలు విరగొట్టుకున్నట్టు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..తాను మిస్ యూనివర్స్ ఢిల్లీగా వేదికపై ఎంతో ఆత్మవిశ్వాసంగా నడవడమే చూశారు. దాని వెనుక మాటల్లో చెప్పలేనంత బాధను చవిచూశానని పేర్కొంది. ఇది అందరు చూడనిది, తెలియని నిజం అని చెప్పింది. అస్సలు నడవగలనా తెలియని బాధ..పోటీల్లో పాల్గొనలా? మానేయాలో తెలియని గందరగోళం మధ్య నరకం చూశానని చెప్పుకొచ్చింది. పోటీల్లో పాల్గొనడానికి కొద్ది రోజుల ముందే ఇలా జరగడంతో చాలా భయపడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తాను చేతులెత్తేయడం కంటే ఓపికతో ఎలాగోలా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకే ప్రయత్నించినట్లు వెల్లడించింది. అందుకోసం ఆ విరిగిన కాలుతోనే కసరత్తులు చేశా. ఆ క్రమంలో తన కోచ్ డైసీ ఎంతో చక్కగా మార్గనిర్దేశం చేసి..ధైర్యంగా పాల్గొనేలా ప్రోత్సహించారంటూ ఆమెకు ధన్యవాదాలు చెప్పింది. అంతేగాదు నొప్పితో ఉన్న పాదాన్ని స్ట్రాంగ్గా మార్చుకునేలా వ్యాయామాలు చేస్తూ..భరించలేని నొప్పిని పంటికింద ఎలా అదిమిపట్టిందో వివరించింది. అలాగే ఆ హైహీల్స్ ధరించేందుకు ఎంతో ఇబ్బంది పడిందో ఆ తాలుక వీడియోలను పంచుకుంది. చివరకు మిస్ యూనివర్స్ ఢిల్లీ 2026 గ్రాండ్ ఫినాలేలో కూడా ఎంతో హుందాగా నడుస్తూ రన్నరప్గా కిరీటం గెలుచుకున్న వీడియోలను కూడా షేర్ చేసిందామె. నెటిజన్లు శర్మ కథను పట్టుదల, కఠోర శ్రమకు నిదర్శనం అని అన్నారు. అడ్డంకులు అధిగమించడమే విజయానికి కీలకం అని మీ కథ ద్వారా చూపించారని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Annie Sharma (@anniesharmaaa) (చదవండి: చికంకారీ చీరలో నీతా.. బనారసీ స్టైలిష్ శారీలో నటాషా..! హస్తకళే..) -
చికంకారీ చీరలో నీతా.. బనారసీ స్టైలిష్ శారీలో నటాషా..!
బిలియనీర్లు అంటే హై ష్యాషన్ బ్రాండెడ్ దుస్తులు..లగ్జరీయస్ ఆభరణాలు మాత్రమే కాదు అని నిరూపిస్తున్నారు నీతా అంబానీ, నటాషా పూనవాలాలు. ఈ ఇద్దరూ అసాధారణమైన హస్తకళా నైపుణ్యం, వస్త్ర వారసత్వం, శతాబ్దాల నాటి పద్ధతులకు సజీవంగా ఉంచేలా కళకారుల ప్రతిభను ప్రదర్శించడం విశేషం. తాజాగా ఈ ఇద్దరూ అందమైన చీరలుక్స్తో అందర్నీ విస్తుపోయేలా చేశారు. ఇక్కడ నీతా అంబానీ లక్నో చికంకారి చీరను ఎంచుకోగా, నటాషా పూనావాలా బనారసీ నేతలోని గొప్పతనాన్ని చాటిచెప్పేలా పురాతన హై ఫ్యాషన్తో మేళవించింది. ఈ రెండు చీరలు సమకాలీన శైలి నిరంతరం ఎలా పరిణామం చెందుతోంది ప్రపంచానికి చాటిచెప్పేలా ధరించి చూపారు. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఎంబ్రాయిడరీ చేసిన యాంటీక్ మావ్ రంగు చికంకారి చీరలో అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ చీర గురించి ఇలా వివరించారు. పలుచని వస్త్రంపై సున్నితమైన పూల జాలీలు మొత్తం అలిమేయగా..ఇందులో క్లిష్టమైన జాలీ, ముర్రీ, షూస్ పట్టి, బద్లా వంటి వర్క్లు ఉన్నాయని చెప్పారు. అంతేగాదు ఈ చీరకు మనీష్ మల్హోత్రా ఆర్గాంజా లేస్ బ్లౌజ్ని జత చేశారు. ఇక బిలియనీర్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈ అదర్ పూనావాలా భార్య నటాషా పూనావాలా సంప్రదాయాన్ని ఉన్నత ఫ్యాషన్ మేళవింపుతో కూడిన లుక్లో మెరిశారు. ఫ్యాషన్కే ఐకాన్గా తన రూపాన్ని మలుచుకునే పూనావాలా సందర్భోచిన వస్త్రాధారణలో సరిహద్దులను విస్తరిస్తూ..ఆడంబరానికి కేరాఫ్గా ఉంటారామె. ఈసారి కూడా అలానే ఆకర్షణీయమైన లుక్లో కనిపించారు. అద్భుతమైన రియల్ వెండి జరీ బనారసీ రంగకట్ చీరను ధరించారు. రియా కపూర్ స్టైల్ చేసిన ఈ చీరను, య్వెస్ సెయింట్ లారెంట్ వారి 1988 నాటి క్యూబిస్ట్ జాకెట్తో జత చేశారు.ఇది సాంప్రదాయ భారతీయ వస్త్ర కళానైపుణ్యం వింటేజ్ శైలుల అద్భుతమైన కలయిక. అంతేగాదు ఆమె తన ఆహార్యాన్ని భారీ ఝుమ్కాలు, చోకర్ నెక్లెస్ వంటి ప్రత్యేకమైన ఆభరణాలతో పూర్తి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) (చదవండి: భారత్ నుంచి అమ్మ పెంపకం గురించి తెలుసుకున్నా..!: విదేశీ మహిళ) -
అందాల మయూరం.. అంతులేని వయ్యారం!
ప్రకృతి సృష్టించిన పక్షి జాతులలో అత్యంత సుందరమైన రూపం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ‘నెమలి’ మాత్రమే. నీలిరంగు గొంతు, వయ్యారాల నడక, పురివిప్పిన పించపు అందాలతో అడవి తల్లి ఒడిలో తిరుగాడే ఈ జాతీయ పక్షి సొగసులను వరి్ణంచడానికి మాటలు చాలవు.వర్షం వచ్చే ముందు ‘క్యావ్.. క్యావ్..’ అంటూ వినసొంపైన స్వరంతో కూస్తూ, పించం విప్పి ఆ నెమలి చేసే నాట్యం ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది.సరిగ్గా ఫొటోలో చూస్తున్నారే.. ఇదీ ఆ సుందర దృశ్యం!సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో, చెట్ల పొదల చాటున దాగుండే ఈ లక్ష్మీదేవి వాహనం.. కడప జిల్లా సిద్ధవటం పరిధిలోని లంకమల అభయారణ్యం ప్రధాన రహదారి సమీపంలో హఠాత్తుగా ప్రత్యక్షమైంది.రాతి గోడపై రాజసం ఉట్టిపడేలా నిలబడి, పొడవైన పించాన్ని కిందకు వాల్చి, తలపై కిరీటం లాంటి నెమలి సిగతో పరిసరాలను ఎంతో గంభీరంగా వీక్షిస్తోంది. తన హావభావాలతో అడవి అందాలను మరింత రెట్టింపు చేస్తూ వయ్యారంగా నడుస్తున్న ఈ అద్భుతమైన సుందర దృశ్యాన్ని మన ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించి పత్రికా పేజీల్లో బంధించింది. రహదారి వెంట వెళ్తున్న ప్రయాణికులు సైతం ఈ జాతీయ పక్షి వంపుసొంపులను చూసి కాసేపు మైమరచిపోయారు. - ఫొటోలు : ఎస్.కె.మొహమ్మద్ రఫీ, సాక్షి ఫోటో గ్రాఫర్, కడప -
భారత్ నుంచి అమ్మ పెంపకం గురించి తెలుసుకున్నా..!
భారత్ సంసృతి సంప్రదాయాలను ఇష్టపడి ఇక్కడే ఉండిపోయారు ఎందరో విదేశీయలు. వాళ్లంతా ఈ నేలపై నచ్చిన అంశాలను కళ్లకు కట్టినట్లుగా వివరించి భారతీయులనే ఫిదా చేశారు. తాజాగా మరో మహిళ భారత్ నుంచి ఆ నాలుగు పేరెంటింగ్ పాఠాలు నేర్చుకున్నానంటూ షేర్ చేసిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇక్కడ పిల్లల పెంపకం విషయంలో ఆ నాలుగు విధానాలు తనకు ఎంతగానో నచ్చాయని, అమ్మ పెంపకం ఇంత గొప్పగా ఉంటుందని తెలుసుకున్నా అంటూ వాటి గురించి పూసగుచ్చినట్లు వివరించింది. మరి ఆ విదేశీ మహిళ మెచ్చిన ఆ పేరెంటింగ్ పాఠాలేంటో చూద్దామా!.భారతదేశం నుంచి పిల్లల పెంపకానికి సంబంధించి ఆ నాలుగు అలవాట్లను తనలో భాగం చేసుకున్నాననంటూ యూరోపియన్ మహిళ క్సేనియా ఇన్స్టాగ్రామ్ వేదిక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో భారత్ నుంచి నేర్చుకున్న పెంపకపు అలవాట్లు తన పిల్లలను పెంచే విధానంను ఎలా మార్చాయో తెలిపింది. మొదట్లో తనకు మాతృత్వం చాలా కొత్తగా ఏదో అపరిచితంగా అనిపించింది. కానీ భారత్కు వచ్చాక అది ఇష్టమైన కుటుంబ బాధ్యతలుగా అనిపించాయని అంటోంది. కొత్త దేశంలో స్థానిక సంప్రదాయలకు అనుగుణంగా పిల్లలను పెంచడం కాస్తా సవాలుగా ఉంటుందని కానీ, భారతీయ సంస్కృతి మాతృత్వాన్ని మధురంగా మార్చి సులభంగా మమేకమయ్యేలా చేస్తుందని చెబుతోంది. అలాగే పిల్లల పెంపకానికి సంబంధించి తను మెచ్చిన భారత మాతృత్వ విధానాలు ఏంటంటే..పిల్లలతో కలిసి నిద్రపోవడం..పిల్లల చెంత పడుకోవడం తల్లి బిడ్డల మధ్య అనుబంధానికి వేదిక అని అంటోంది. బెడ్ షేర్ చేసుకోవడంలో భద్రంగా ఉన్నాననే భరోసా పిల్లల్లో కలుగుతుంది..తన బిడ్డతో పూర్తిగా గడుపుతున్నా అనే భావన తల్లిలోనూ కలుగుతుంది. ఇద్దరి మధ్య గాఢంగా పెనవేసుకునే బంధానికి ఇదే ప్రధానం అంటోంది. రోజువారీ నూనె మర్దనలు..భారత్ నుంచి స్వీకరించిన సంప్రదాయం..రోజువారి నూనె మర్దన. దీనిని మాలిష్ అని పిలుస్తారు. శిశు సంరక్షణకు సంబంధించింది..ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడే అంశం కూడా. ఇదొక అందమైన ఆచారంగా అభివర్ణించింది. ముఖ్యంగా తాతమయ్య నానమ్మలు ఈ పనిచేస్తూ తల్లికి చేదుడువాదోడుగా ఉంటారని అంటోంది. ఇది కుటుంబ అనుబంధానికి దోహదపడే అంశం కూడా అంటోందామె. అర్థవంతమైన పేర్లుభారత్లో పిల్లల పేర్లు అర్థం, ఉద్దేశ్యం, గుర్తింపుని దృష్టిలో ఉంచుకుని ఎంచుకుంటారని అంటోంది. ఒక పేరును ఎంచుకోవడంలో ఎంతో ఆలోచన ఉంటుందో..అలాగే ఆ పేరు వెనుక సంస్కృతి, చరిత్ర విలువలతో లోతుగా ముడిపడి ఉంటుందని..అది తనకెంతో నచ్చిందని పేర్కొంది. మాతృత్వాన్ని వేడుకగా జరుపుకోవడంభారత్లో పిల్లల పుట్టిన రోజున తల్లి ఎంతో అందంగా రెడీ అవుతుంది. నిజానికి ఇది తల్లిగా మారడానికి సంబంధించిన వేడుక కూడా. అందుకే ఇక్కడ పిల్లల పుట్టిన రోజు వేడుకలకు తల్లులు చక్కటి చీర కట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తారు. తాను కూడా అలానే అందమైన చీర కట్టుకుని పిల్లల పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ పోస్ట్ నెటిజన్ల మనసుని తాకడమే కాదు.."అమ్మ మనకు ఎన్నో విషయాలను అందిస్తుంది... మా దేశంలో(భారత్) ఒక స్త్రీ తల్లి అయ్యాక, ఆమెకు తన బిడ్డ కంటే ముఖ్యమైనది ఏదీ ఉండదు. భర్తను కూడా పక్కన పెట్టేంతగా ఆమె బిడ్డపై శ్రద్ధ చూపిస్తుంది... మనకు అమ్మే సర్వస్వం. ఆమె దేవుడి కంటే గొప్పది, ఆమె ఒక సూపర్ ఉమెన్, జీవితంలో మనకు లభించే అంతులేని ప్రేమకు నిదర్శనం అంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ksenia | Family & Ambition (@kseniakala) (చదవండి: ప్రాణాంతక వ్యాధి లాస్ట్ స్టేజ్..ఐనా రోజుకు 12 గంటలు..!) -
ట్రావెలర్స్ వద్ద ఉండాల్సిన 3 గ్యాడ్జెట్స్ ఇవే..
ప్రపంచం ఎంత వేగంగా మారుతోందో అంతే వేగంగా ప్రయాణికులు స్మార్ట్ అవుతున్నారు. నిత్యం కొత్త కొత్త పరికరాలు, సాంకేతికను వాడుతున్నారు. మీరు కూడా స్మార్ట్ ట్రావెలర్ అవ్వాలంటే ఈ 5 పరికరాల గురించి తెలుసుకోండి.1. ట్రాకిబుల్ పాస్పోర్ట్ వ్యాలెట్విదేశాల్లో ఉన్నప్పుడు పాస్పోర్ట్ను గుండెకాయలా చూసుకోవాలి. ఒక వేళ అది మిస్ అయితే సగం ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీకు ట్రాకిబుల్ పాస్పోర్ట్ వ్యాలెట్ ఉపయోగపడుతుంది. పాస్పోర్ట్ భద్రంగా ఉండాలి అంటే ఈ పాస్పోర్ట్ ట్రాకర్ మీకు ఉపయోగపడుతుంది.ఇందులో ఉన్న బ్లూటూత్ ట్రాకింగ్ టెక్నాలజీ వల్ల మీ పాస్పోర్ట్ ఉన్న వ్యాలెట్ మిస్ అయినా మీ ఫోన్ వాడి దాని లొకేషన్ ట్రాక్ చేయవచ్చు. ఈ వ్యాలెట్లో క్రెడిట్, డెబిట్ కార్డులు, బోర్డింగ్ పాస్, ఇతర డాక్యుమెంట్స్ దాచుకునే సదుపాయం కూడా ఉంటుంది.2. హ్యాండ్ ఫ్రీ ఫోన్ హోల్డర్ ఈ డిజైజ్ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ పాపులర్ అవుతోంది. దీనికి కారణం మీరు ఏదైనా కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు హోటల్స్లో, వాహనాల్లో దీనిని సులభంగా వాడుకోవచ్చు. ఫోనును చేతితో పట్టుకోకుండా డెస్కుకు, సీటుకు ఒక క్లిప్పులా పెట్టేసి వీడియోలు, ఫోటోలు, మ్యాప్స్ చూడవచ్చు. కార్లు, బైకు, విమానం బస్సులో కూడా వీటిని వినియోగించవచ్చు. ఆన్ లైన్లో మీకు వందల రకాలు మొబైల్ హోల్డర్స్ లభిస్తాయి.3. సోలార్ పవర్ బ్యాంక్ఈ రోజుల్లో మన ఫోన్ తో పాటు ఇతర పరికరాలను చార్జ్ చేసి పెట్టడం అనేది చిన్న ఛాలెంజ్ లాంటిదే. మరీ ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు మరీ ఈ ఛాలెంజ్ కాస్త కష్టంగా మారిపోతుంది. దీని కోసం మీరు మల్టి కేబుల్ సోలార్ పవర్ బ్యాంక్ వినియోగించవచ్చు. ఇది ఇకో ఫ్రెండ్లీ అయిన చార్జింగ్ విధానం.ఈ ఆర్టికల్లో ప్రస్తావించిన గ్యాడ్జెట్స్ వినియోగించి మీరు ప్రయాణాన్ని ప్రశాంతంగా కొనసాగింవచ్చు. ఇవే కాకుండా మీకు తెలిసిన, మీరు వాడుతున్న స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు. -
ప్రయాణంలో సరైన బ్యాగ్ ఎంపిక..
చాలామంది తెలుగువారు భారతదేశం అంతటా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. తిరుపతి, అరకు, శ్రీశైలం నుంచి ఢిల్లీ, జైపూర్, కేరళ వరకు.. అది ఆధ్యాత్మిక యాత్ర అయినా, కుటుంబ పర్యటన అయినా లేదా సోలో ట్రిప్ అయినా, సరైన బ్యాక్ప్యాక్ మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, సురక్షితంగా చేస్తుంది. భారతీయ పరిస్థితులకు, తెలుగు ప్రయాణ శైలికి సరిపోయే బ్యాగ్ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం.సరైన సైజును సెలక్ట్ చేసుకోండి..మీరు తిరుపతి లేదా విజయవాడ నుంచి షిర్డీ వంటి ప్రాంతాలకు వీకెండ్ యాత్రకు వెళుతున్నట్లయితే 30–40 లీటర్ల బ్యాగ్ సరిపోతుంది. ఉత్తర భారతదేశ యాత్రలకు లేదా చార్ ధామ్ యాత్రలకు 45–60 లీటర్ల బ్యాగ్ తీసుకెళ్లండి. అతిపెద్ద బ్యాగ్ను ఎంచుకోకండి. ఎందుకంటే రైల్వే ప్లాట్ఫారమ్లు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, రద్దీగా ఉండే ఆలయాల్లో దానిని మోయడం కష్టం.ఇండియన్ ట్రావెల్కు మల్టిపుల్ కంపార్ట్మెంట్లుతెలుగు కుటుంబాలు తరచుగా అదనపు బట్టలు, ప్రసాదం, టిఫిన్ బాక్సులు, బహుమతులు తీసుకువెళ్తుంటాయి. బట్టలు, ఆహారం, చెప్పులు, గ్యాడ్జెట్ల కోసం ప్రత్యేక విభాగాలు ఉన్న బ్యాక్ప్యాక్ను సెలక్ట్ చేసుకోండి. ఇది ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఆలయ ప్రవేశ ద్వారాల వద్ద జరిగే సెక్యూరిటీ చెకింగ్స్లో ఈజీగా ఉంటుంది.సుదీర్ఘ ప్రయాణాలకు సౌకర్యంతెలుగు వారి ప్రయాణాలు సుదీర్ఘ రైలు ప్రయాణాలు, రాత్రిపూట బస్సు ప్రయాణాలు, ఆలయ క్యూలను కలిగి ఉంటాయి. ప్యాడెడ్ పట్టీలు, వెనుక భాగానికి సపోర్ట్, నడుము బెల్టులు ఉన్న బ్యాగ్ను తీసుకోండి. బ్యాగ్ను పూర్తిగా నింపి ఇంట్లో టెస్ట్ చేయండి. అది సౌకర్యంగా ఉందో లేదో తెలుస్తుంది.వాతావరణాన్ని తట్టుకునేదివిజయవాడలో వర్షాకాలం నుంచి రాజస్థాన్ లోని పొడి వేడి వరకు, భారతదేశ వాతావరణం చాలా వేగంగా మారుతుంది. వర్షం నుంచి రక్షణ కోసం రెయిన్ కవర్, వాటర్ రెసిస్టెంట్ మెటీరియల్తో చేసిన బ్యాగ్ను సెలక్ట్ చేసుకోండి.రద్దీలో సేఫ్టీఆలయ పట్టణాలు, రైల్వే స్టేషన్లు చాలా రద్దీగా ఉంటాయి. లాక్ చేయగల జిప్లు, నగదు లేదా ఆభరణాల కోసం దాచిన పాకెట్లు, కార్డుల కోసం ఆర్ఎఫ్ఐడీ రక్షణ ఉన్న బ్యాగ్ను సెలక్ట్ చేసుకోండి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు లేదా కుంభమేళా వంటి పండుగల సమయంలో ప్రయాణించేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.ఈజీ యాక్సెస్ఫ్రంట్–లోడింగ్ బ్యాక్ప్యాక్లు (సూట్కేస్లాగా) భారతీయ పరిస్థితులకు చాలా మంచివి. మీ టవల్ లేదా రైలు టికెట్ కోసం మొత్తం లగేజీని బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. ఐడీ, స్నాక్స్ లేదా దర్శనం టికెట్ల కోసం అదనపు చిన్న పాకెట్లు ప్రయాణ రోజుల్లో చాలా సహాయపడతాయి.తేలికైనది కానీ దృఢమెనదిబరువుగా ఉండే ఖాళీ బ్యాగ్ ప్లాట్ఫారమ్లు లేదా బస్ బేల మధ్య సుదీర్ఘ నడకలో మరింత భారంగా అనిపిస్తుంది. తేలికైన కానీ బలమైన బ్యాగ్ను ఎంచుకోండి. వైల్డ్క్రాఫ్ట్, క్వెచువా, సఫారీ వంటి బ్రాండ్లు హైదరాబాద్, విజయవాడ స్టోర్లలో సులభంగా దొరుకుతాయి.బడ్జెట్, నాణ్యతమీరు అత్యంత ఖరీదైన బ్యాగ్ను కొనాల్సిన అవసరం లేదు. కానీ కుట్టు, జిప్లు, పట్టీల నాణ్యతలో రాజీ పడకండి. రూ.3,000–రూ.5,000 మధ్య ధర కలిగిన మంచి భారతీయ బ్రాండ్ బ్యాక్ప్యాక్ సాధారణంగా సంవత్సరాల తరబడి తిరుపతి, కేరళ వంటి యాత్రలకు సరిపోతుంది. -
మాన్సూన్ మజిలీకి కేరాఫ్ అడ్రస్..
అక్కడి వర్షపు చినుకులు ప్రకృతి రంగులను మరింత గాఢంగా మార్చేస్తాయి. ప్రతి అడుగులో పచ్చని వనాలు, మేఘాల చాటున కనిపించే కొండలు, అలల మధ్య నవ్వే తీరాలు.. కల కలిసిన దేశం శ్రీలంక. భారత దేశానికి దగ్గరగా ఉన్న ఈ చిన్న ద్వీప దేశం, మాన్ సూన్ సీజన్ లో ఒక కొత్త రూపం ధరిస్తుంది. ఒక వైపు సముద్ర అలలు, మరో వైపు టీ ప్లాంటేషన్స్, ఇంకొక వైపు ప్రాచీన దేవాలయాలు, కొలనియల్ వీధులు అన్నీ కలిసి ప్రయాణాన్ని గుర్తిండిపోయే అనుభవంగా మారుస్తాయి..శ్రీలంక అనేది దక్షిణ ఆసియాలో హిందూ మహా సముద్రం మధ్య ఉన్న అందమైన ద్వీపదేశం. రాజధాని శ్రీ జయవర్ధనపుర కొట్టే కాగా, ఆ దేశ ఆర్థిక రాజధాని కొలంబో. వర్షాకాలంలో ముఖ్యంగా నైరుతీ, దేశ మధ్య భాగాలు పచ్చదనంతో మెరిసిపోతాయి. చిన్న దూరం ప్రయాణం చేస్తే బీచుల నుంచి హిల్ స్టేషన్ కి, అక్కడి నుంచి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ వరకు సీనరీ మారిపోవడం శ్రీలంక ప్రయాణంలో ఉన్న ప్రత్యేకత.గాలే ఫేస్ గ్రీన్..కొలంబోలో ప్రయాణం మొదలైతే సముద్ర గాలి, మోడరన్ సిటీ రిథమ్ రెండూ కలిసి ఒక ఆహ్లాదకరమైన ఆరంభాన్ని ఇస్తాయి. గాలే ఫేస్ గ్రీన్ ప్రాంతంలో సాయంత్రం సమయంలో అలల మధ్య నడుస్తుంటే సమయం మెల్లగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి గాలే ఫేస్ గ్రీన్ దిశలో వెళ్లినప్పుడు డచ్ ఫోర్ట్ మధ్య నడిచే ప్రతి వీధి చరిత్రని గుర్తుచేయడం మొదలు పెడుతుంది. ఓల్డ్ బిల్డింగ్స్, స్టోన్ రోడ్స్, సముద్ర అలల మధ్య ఈ ప్రదేశం ఒక పెయింటింగ్లా ఉంటుంది.కేండీ చేరిన వెంటనే పరిసరాలు పూర్తిగా మారిపోతాయి. కొండల మధ్య ఉన్న ఈ నగరంలో మేఘాలు దిగివచ్చినట్టు ఉంటాయి. టెంపుల్ ఆఫ్ టూత్ చుట్టూ ఉన్న ప్రశాంతత యాత్రకు మరో అర్థం ఇస్తుంది. సరస్సు పక్కన సాయంత్రం నడిచే సమయం చాలా మధురంగా అనిపిస్తుంది.నువారా ఎలియాకి చేరిన తరువాత టీ ప్లాంటేషన్స్ మధ్య వెళ్తున్న రైల్ జర్నీ ఒక సినిమా సీన్ లా ఉంటుంది. పచ్చని టీ తోటలు, చిన్న చిన్న జల΄ాతాలు, మేఘాల మధ్య కనిపించే స్టేషన్స్ ప్రతి నిమిషం కెమెరాలో కాకుండా మనసులో నిలిచిపోయే దృశ్యాలుగా మిగిలిపోతాయి.ఎల్లాలో నైన్ ఆర్చ్ బ్రిడ్జి దగ్గర రైలు మెల్లగా వెళ్తుంటే ఈ శబ్దం మధ్య ప్రకృతి ఒక సంగీతం వినిపిస్తున్నట్టు ఉంటుంది. లిటిల్ ఆడమ్స్ పీక్పై గాలి నిలబడి చూస్తే మేఘాల కింద ప్రపంచం వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. యాలా నేషనల్ ΄ార్క్లో ప్రకృతి ఇంకో రూపం కనిపిస్తుంది. అడవి మధ్య సఫారీ చేస్తూ జింకలు, ఏనుగులు, పక్షులను చూడటం ప్రయాణానికి ఇంకో అనుభవం కలిగిస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి కొలంబోకి డైరెక్ట్ ఫ్లైట్స్, వన్ స్టాప్ ఫ్లైట్స్ రెగ్యులర్గా ఉంటాయి. సుమారు రెండు నుండి నాలుగు గంటల ప్రయాణం తరువాత సముద్రం మధ్య ఉన్న ఈ ఐలాండ్ని చేరుకుంటారు. ఎయిర్పోర్టు నుండి బయటకి వచ్చిన వెంటనే తేమతో కూడుకున్న గాలి, కొబ్బరి చెట్లు, సముద్ర వాసనలు లంకకి స్వాగతం చెబుతాయి.విజయవాడ నుంచి ప్రయాణం చేయాలి అనుకునే వారు హైదరాబాద్ లేదా చెన్నై నుంచి కొలంబోకి విమానంలో చేరుకోవచ్చు. ఫ్లైట్ జర్నీ చిన్నదిగా ఉండటం వల్ల వీకెండ్ హాలిడేస్ని కలుపుకుని కూడా మంచి మాన్ సూన్ వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు.శ్రీలంకలో రైల్ జర్నీలు కూడా ఈ యాత్రలో ఒక ముఖ్యమైన భాగం. కేండీ నుంచి ఎల్లా వరకు వెళ్లే ట్రైన్ రూట్ ప్రపంచంలో అందమైన రైల్వే జర్నీస్లో ఒకటిగా అనిపిస్తుంది. విండో పక్కన కూర్చొని బయటి ప్రకృతిని చూస్తూ వెళ్తే దూరం అనేది పెద్ద భాగంగా అనిపించదు.ఎక్కడ ఉండాలి?కొలంబోలో బీచ్ ఫేసింగ్ హోటల్స్ నుంచి బోటీక్ స్టేస్ వరకు అనేక ఆప్షన్స్ ఉంటాయి. గాలేలో కాలనియల్ స్టైల్ హెరిటేజ్ హోటల్స్ అనేవి ఓల్డ్ వరల్డ్ చార్మ్ని అందిస్తాయి. కేండీలో లేక్ వ్యూ రిసార్ట్స్ ప్రశాంతతని కలిగిస్తాయి. నువారా ఎలియాలో బ్రిటిష్ స్టైల్ కాటేజీలు, టీ ఎస్టేట్ బంగ్లాల్లో ఉండటం ఒక నాస్టాల్జిక్ ఎక్స్పీరియెన్స్లా ఉంటుంది. ఎల్లాలో కొండల మధ్య ఉన్న ఎకో స్టేస్లో ప్రతి ఉదయం మేఘాల మధ్య కాఫీ తాగడం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఏం తినాలి?శ్రీలంక రుచులు మన సౌత్ ఇండియా ఫ్లేవర్స్కి దగ్గరగా ఉన్నా వాటి స్పెషాలిటీ వాటిదే. రైస్, కర్రీ ప్రతి భోజనంలో ఒక కొత్త కాంబినేషన్ ఇస్తుంది. హాపర్స్, స్ట్రింగ్ హాపర్స్, కొట్టు రోటి, పోల్ సంభోల్, ఫిష్ కర్రీ, కోకోనట్ కర్రీస్ రుచులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సాయంత్రం ఒక హాట్ సిలోన్ టీతో మేఘాలు చూస్తూ గడిపే నిమిషాలు ప్రయాణంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.ఆసక్తికరమైన విషయాలు..శ్రీలంకని పర్ల్ ఆఫ్ ది ఓషియన్, భారత దేశపు కన్నీటి బిందువు అని కూడా పిలుస్తారు.కేండీ నుంచి ఎల్లా రైల్వే జర్నీ ప్రపంచంలో అత్యంత అందమైన ట్రైన్ జర్నీ రూట్స్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.సీలోన్ టీ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక టీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేక సంఖ్యలో ఉన్న దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి.మాన్ సూన్ సీజన్ లో టీ ప్లాంటేషన్స్, వాటర్ఫాల్స్, అడవులు మరింత పచ్చగా కనిపిస్తాయి.యాత్ర బడ్జెట్ వివరాలు..హైదరాబాద్ నుండి 5 రోజుల శ్రీలంక మాన్ సూన్ ట్రిప్కి బడ్జెట్ ప్యాకేజీ సుమారు రూ.45,000 నుండి రూ.60 వేల మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ రూ.65 వేల నుండి రూ.90 వేల వరకు ఉంటుంది. ప్రీమియం ఎక్స్పీరియెన్స్ రిసార్టులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కలిపి రూ.1.10 లక్షల వరకు పైకి వెళ్లవచ్చు.విజయవాడ నుండి ప్రయాణం చేస్తే హైదరాబాద్ లేదా చెన్నై కనెక్టింగ్ ఫ్లైట్ బట్టి కొంచెం ట్రావెల్ కాస్ట్ మారవచ్చు. స్టే చార్జీలు బడ్జెట్ హోటల్స్లో రాత్రికి రూ.2,500 నుండి మొదలై ప్రీమియం రిసార్టులు రూ.15 వేలు లేదా దానికన్నా ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ రోజుకు సుమారు రూ.1,000 నుంచి రూ.2,000 మధ్య సరిపోతుంది. లోకల్ సైట్ సీయింగ్ ప్యాకేజీలు, సీనిక్ ట్రైన్ జర్నీలు, వైల్డ్ లైఫ్ సఫారీ, టీ ఎస్టేట్స్ ఎక్స్పీరియెన్స్ని కలిపి కంప్లీట్ ప్లాన్ చేసుకోవచ్చు.ఇండియన్ ΄ాస్పోర్ట్ హోల్డర్స్కి శ్రీలంక ఎంట్రీ కోసం వీసా అవసరం లేదు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ద్వారా ముందుగా అప్లై చేసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవడం సులభం.ఏం చూడాలి?శ్రీలంకాలో ప్రతి రోజు ఒక కొత్త రంగులో ప్రారంభం అవుతుంది. ఒక రోజు సన్ రైజ్ బీచ్పై కనిపిస్తుంది. మరొక రోజు టీ ప్లాంటేషన్స్ మధ్య మేఘాలు దిగివస్తాయి. ఇంకొక రోజు పురాతన ఆలయాల గంటల నాదం వినిపిస్తుంది. సముద్రంపై సాయంత్రం సూర్యాస్తమయం చూస్తుంటే ఆ వెలుగు నీళ్లపై పడిన ప్రతి నిమిషం ఒక పెయింటింగ్లా మారిపోతుంది.వేల్ వాచింగ్ సీజన్ లో మిరిస్సా దగ్గర సముద్రంపై వెళ్తుంటే ప్రకృతి విస్తృత రూపం కనిపిస్తుంది. టీ ఫ్యాక్టరీ విజిట్లో ఒక కప్ సిలోన్ టీ వెనుక ఉన్న కష్టం తెలుస్తుంది.లోకల్ మార్కెట్లో రంగురంగుల పండ్లు, మసాలాలు, హ్యాండీక్రాఫ్ట్స్ మధ్య నడుస్తుంటే లంక జీవనశైలిని పూర్తిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆయుర్వేద వెల్నెస్ ఎక్స్పీరియెన్సెస్, సీనిక్ ట్రైన్ రైడ్, బీచ్ వాక్స్, వైల్డ్ లైఫ్ సఫారీలు, టీ ఎస్టేట్ మార్నింగ్ వాక్స్ ఇవన్నీ ఈ యాత్రని పూర్తి చేస్తాయి. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
కోరికల పరుగు
ఈ అనంత విశ్వంలో మానవ జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణానికి ఇంధనం, వేగం, దిశ అన్నీ ఇచ్చేది ఒక్కటే ‘కోరిక’. పుట్టుకతో మొదలైన ఈ కోరికల పరుగు, మనిషి చివరి శ్వాస విడిచే వరకు సాగుతూనే ఉంటుంది. నది సముద్రంలో కలవాలని పరిగెత్తినట్లు, మనిషి కోరికల వెనుక పరిగెడుతుంటాడు. కానీ నదికి గమ్యం దొరుకుతుంది, మనిషి కోరికల పరుగుకు గమ్యం దొరకడం లేదు. ఆధ్యాత్మిక కోణంలో ఈ ‘కోరికల పరుగు’ వెనుక ఉన్న రహస్యాన్ని, దాని ప్రమాదాలను, దాన్ని అధిగమించే మార్గాన్ని విశ్లేషిస్తే ఎన్నో ఆసక్తికరమైన నిజాలు కనిపిస్తాయి. హిందూ తత్వశాస్త్రంలో కోరికను ‘తృష్ణ’ అంటారు. తృష్ణ అంటే కేవలం దాహం కాదు, ఎంత తాగినా తీరని విచిత్రమైన దాహం. ఒక కోరిక నెరవేరగానే, ఆ సంతోషం కొద్దిసేపట్లోనే ఆవిరైపోతుంది. ఆ స్థానంలో మరో కొత్తకోరిక మొలకెత్తుతుంది. సైకిల్ ఉన్నవాడు బైక్ కావాలంటాడు, బైక్ ఉన్నవాడు కారు కావాలంటాడు, కారు ఉన్నవాడు విమానం కావాలంటాడు. ఈ పరుగు వస్తువుల దగ్గరే ఆగిపోదు; కీర్తి, అధికారం, పదవుల వైపు విస్తరిస్తుంది. ఈ పరుగులో మనిషి ’వర్తమానాన్ని’ (జీవితాన్ని) పూర్తిగా కోల్పోతున్నాడు. మన జీవితాల్లో కూడా ‘ఈ ఒక్క కోరిక తీరితే నేను ప్రశాంతంగా ఉంటాను’ అని అనుకుంటాం. కానీ ఆ కోరిక తీరిన తర్వాత కూడా ప్రశాంతత దొరకదు. సుఖం అనేది వస్తువుల్లో లేదు, మన అంతరంగంలో ఉందనే సత్యాన్ని గ్రహించకుండా బాహ్య ప్రపంచంలో వెతకడమే ఈ మృగతృష్ణ. ప్రాపంచిక విషయాల వైపు పరిగెత్తే మనస్సును – సేవ, కరుణ, భక్తి, ఆత్మవిచారణ వైపు మళ్ళించడం. నది ప్రవాహాన్ని మళ్ళించి పంటలు పండించినట్లు, కోరికల శక్తిని ఆధ్యాత్మిక ప్రగతికి వాడుకోవచ్చు.కోరికల పరుగులో అలసిపోవడం కాదు, ఆ పరుగును ఆపి ‘నేను ఎటు పరిగెడుతున్నాను? ఎందుకు పరిగెడుతున్నాను?’ అని ఒక్క క్షణం ఆగి ఆలోచించడమే వివేకం. పరుగు ఆగిన చోటే ప్రశాంతత మొదలవుతుంది. ఆ ప్రశాంతతే పరమాత్మ స్థితి. మనస్సు అనే అశ్వాన్ని కోరికల వైపు కాకుండా, అంతిమ సత్యం వైపు నడిపించినప్పుడే ఈ జీవన ప్రయాణానికి సార్థకత లభిస్తుంది.కోరికలు ఉండటం సహజం, కానీ కోరికలే మనల్ని నడపడం ప్రమాదకరం. ఈ పరుగును అదుపు చేయడానికి ఆధ్యాత్మికత కొన్ని మార్గాలను చూపుతోంది.‘నాకు ఏది లభించిందో అది భగవత్ ప్రసాదం’ అనే భావన అలవడినప్పుడు పరుగు వేగం తగ్గుతుంది. కోరిక పుట్టినప్పుడు దాంతో పాటు పరిగెత్తకుండా, ‘నా మనస్సులో ఈ కోరిక పుట్టింది‘ అని ఒక మూడోవ్యక్తిలా గమనించడం ఒక్కటే పరిష్కారం.శ్రీ శంకరాచార్యులు భజగోవింద శ్లోకాల్లో కోరికల తీవ్రతను హెచ్చరించారు. అగ్నిలో నెయ్యి పోస్తే అగ్ని చల్లారదు, ఇంకా ఎక్కువ రగులుకుంటుంది. అలాగే, కోరికలను తీర్చుకుంటూ పోతే అవి శాంతించవు, మరింత బలీయంగా తయారవుతాయి. శరీరం ముసలిదైపోయినా, పళ్ళు రాలిపోయినా, చేతికి కర్ర వచ్చినా... మనస్సులో ఉన్న ఆశ/కోరిక మాత్రం ముసలిది కాదు, అది పరిగెడుతూనే ఉంటుంది.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
దానం చేసే మనసు!
ప్రతి ΄పౌర్ణమికీ ఆ ఊరిలో సత్సంగం జరుగుతుంది. ఒక ΄పౌర్ణమి నాడు ప్రవచన కర్త దానం గురించి వివరిస్తున్నారు. ఆయన దానం విశిష్టతను తెలియజేస్తూ, ‘దానం చేయని చేయి, కాయలు కాయని చెట్టు ఒకటే’ అని చెప్పారు. దానాలన్నింటిలోనూ అన్నదానం, విద్యాదానం, గోదానాలు చాలా గొప్పవని, దానం చేసేటప్పుడు కలిగే అలౌకిక ఆనందం వర్ణనాతీతమని వివరించారు. ఆ ప్రవచనానికి వచ్చిన ఒక యువకుడు అక్కడి నుంచి నిరాశతో... కోపంతో వెళ్ళిపోవడానికి లేచాడు. ప్రవచనకర్త అతడిని బుజ్జగిస్తూ, ‘ఎందుకు నాయనా, వెళ్ళిపోతున్నావు?’ అని అడిగారు.దానికి ఆ యువకుడు, ‘చెప్పడం సులభం, చేయడం కష్టం. మీరేమో దానం గొప్పదని చెబుతున్నారు. నాలాంటి వాడికి దానం చేయడం ఎలా కుదురుతుంది? అన్నదానం చేయాలంటే డబ్బు ఉండాలి, నా దగ్గర డబ్బు లేదు. చిన్న రైతునైన నా ఆదాయం చాలా తక్కువ. పోనీ విద్యాదానం చేద్దామంటే నేను అంతగా చదువుకోలేదు. అలాగే మా ఇంట్లో పశువులు లేవు, కాబట్టి గోదానం చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి మీరు చెప్పేవేవీ ఆచరణకు యోగ్యం కావని నిరాశతో వెళ్ళిపోతున్నాను’ అన్నాడు.ప్రవచనకర్త చిరునవ్వు నవ్వి, ‘దానమంటే అవే కాదు నాయనా! నీవు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి, పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి రక్తదానం చేయి. అది మరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది’ అని సూచించారు. ‘నిజమే కదా’ అనిపించింది ఆ యువకుడికి. మరుసటి వారమే పట్టణానికి వెళ్ళి రక్తనిధి కేంద్రంలో రక్తమిచ్చి వచ్చాడు. అయితే, రక్తదానం చేసిన అతడికి ప్రవచనకర్త చెప్పినంత గొప్ప అనుభూతి ఏదీ కలగలేదు. మరలా వచ్చే ΄పౌర్ణమి రోజున ప్రవచనకర్త ఊరి రచ్చబండ వద్దకు వచ్చారు. ‘రక్తమిచ్చాను కానీ అందులో నాకు ప్రత్యేకమైన ఆనందమేదీ కలగలేదు’ అని చెప్పాలని ఆ యువకుడు అక్కడికి వెళ్ళాడు. అయితే, అక్కడ ఆ యువకుడి కోసం ఒక వృద్ధ జంట ఎదురుచూస్తోంది.వారు ఎంతో గౌరవంగా ఆ యువకుడికి మిఠాయిలు, పండ్లు ఇచ్చి చేతులెత్తి దణ్ణం పెట్టారు. ఆశ్చర్యంగా వారివైపు చూశాడు ఆ యువకుడు. ‘ఈ మధ్య మా అబ్బాయి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పుడు మీరు ఇచ్చిన రక్తం అతడి ప్రాణాన్ని కాపాడింది. అందుకే మీకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చాం’ అని వారు చెప్పారు. ఆ మాటలతో యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దానం చేయడానికి సంపద కన్నా గొప్ప మనసు ఉంటే చాలని అతడికి అర్థమైంది. వెంటనే ప్రవచనకర్త వైపు తిరిగి తలవంచి నమస్కరించాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
యోగాసనం.. ఆరోగ్యశాసనం
యోగా.. ఈ పదం నేడు అంతర్జాతీయ తారకమంత్రంగా మారిపోయింది. కులమతాలకు అతీతంగా చక్కని ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా గొప్ప సాధనంగా మారింది. దేశంలో పుట్టి ఖండాతరాల్లో వ్యాపించి 2014లో అంతర్జాతీయ పేటెంట్ పొందింది భారత్. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 2015 నుంచి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. చక్కటి ఆరోగ్య అలవాట్లు, సానుకూల దృక్పథంతోపాటు సామాజిక బాధ్యత కూడా మిళితమై ఉండడం మరో ప్రత్యేకత. అందుకే పేదవాడి దగ్గర్నుంచి ఉన్నత వర్గాలు, విద్యాంతులు, వైద్యులు కూడా యోగా సాధన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గుంటూరులో సుమారు 40 వరకు యోగా కేంద్రాలు వారి స్థాయిలో శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని స్వల్ప ఫీజులతో ఉంటే మరికొన్ని ఏసీ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి కొంత మొత్తం తీసుకుంటున్నాయి. ఆన్లైన్ క్లాసులు కూడా చెబుతున్నారు. నా వయస్సు 52 సంవత్సరాలు. యోగా నన్ను నిత్యం నూతనంగా ఉంచుతుంది. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు. శరీరం, మనస్సులను సంధానించే గొప్ప భారతీయ జీవన విధానం. నా వృత్తికి ఏకాగ్రత చాలా అవసరం. అందుకే ప్రతి రోజూ యోగా, మెడిటేషన్ చేస్తాను. రోజూ కొద్దిసేపు యోగాభ్యాసం చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, ఎంతో ప్రభావం చూపుతుంది. – డాక్టర్ చైతన్య, నేత్ర వైద్య నిపుణురాలు, గుంటూరు. యోగాలో వినూత్న ప్రకియ..సంప్రదాయ నృత్యాన్ని, ప్రాచీన యోగాను కలిపి నాట్య యోగామృతంలా మలిచి శిక్షణ ఇస్తున్నాను. మన సంప్రదాయాన్ని ఆరోగ్యం కోసం మిళితం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం జుంబా వంటి ఆధునిక నృత్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది అందరికీ నప్పదు. కొందరు ఇబ్బందులకు గురవడం చూస్తున్నాను. అదే యోగా అయితే అందరికీ ఉల్లాసం, ఉత్సాహంతోపాటు చక్కని ఫలితాలు సాధిస్తున్నాను. ఇది వయస్సును బట్టి కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. నా వద్ద వందల మంది శిక్షణ పొందుతున్నారు. మంచి ఫలితాలు సాధిస్తున్నాను. – విజయ గౌరి, నేషనల్ యోగా రిఫరీ, గుంటూరు పాఠశాల స్థాయి నుంచి నేర్పాలి..యోగా సాధనకు దేశం అంతర్జాతీయ వేదికైంది. అంటే దీని ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. ఈ విద్యను పాఠశాలల స్థాయి నుంచే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్యానికి రాగిజావ, ఫోర్టిఫైడ్ బియ్యం, బలవర్ధకమైనా ఆహారం అందిస్తుంది. కనీసం యోగా సాధనకు గంటైనా కేటాయించాలని మనవి. నేటి యువత మొబైల్ ఫోన్లతో బిజీగా గడుపుతున్నారు. దీనివల్ల సోమరితనంతోపాటు మానసిక ఇబ్బందులు తప్పడం లేదు. యువత నిత్యం యోగా చేయడం ద్వారా చాలా రుగ్మతల నుంచి విముక్తి పొందవచ్చు. దీనికి అద్భుతమైన యోగాసనాలు ఉన్నాయి. – బి.మల్లికార్జునరావు, యోగా శిక్షకులు మీ జీవితం..మీ చేతుల్లోనే..చాలా సమస్యలు మన నిర్లక్ష్యంతోనే తెచ్చుకుంటాం. పిల్లలు, యువత మొబైల్స్కు ఎక్కువగా బానిసలై శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి అద్భుత పరిష్కారం యోగాలో ఉంది. అనుభవజ్జులైన గురువుల వద్ద తొలి దశలో శిక్షణ పొందాలి. ప్రస్తుతం సమాజంలో మధుమేహం, రక్తపోటు, హార్మోన్ల అసమతుల్యత తరచుగా చూస్తున్నా. చాలా మంది మంచి మెడిసిన్ రాయండి అని అంటుంటారు. ముందుగా కొంత సేపు నడిచి, తర్వాత కాసేపు యోగా చేయాలి. మందులు వాడాల్సిన పరిస్థితి వస్తే తప్పదు. జీవన శైలి మార్చుకుని యోగా సాధన చేస్తే నూటికి 90 శాతం రోగాల నుంచి బయటపడవచ్చు. – డాక్టర్ కె.సుబ్బారావు, ఎండో క్రైనాలజిస్ట్ యువతకు ఇబ్బందులు పోతాయి ప్రస్తుతం అమ్మాయిల్లో చాలా శారీరక ఇబ్బందులు ఉంటాయి. పీసీవోడీ వంటి కారణాలకు యోగాసనాల ద్వారా అద్భుత పరిష్కారం లభిస్తుంది. శరీరాన్ని నిత్యం ఉత్సాహంగా ఉంచడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మూడు నెలల నుంచి గురువు వద్ద సాధన చేస్తున్నా. చిన్న సమస్యలకు మనం చాలా తీవ్రంగా ఆలోచిస్తుంటాం. చాలా ఇబ్బందులకు యోగాలో పరిష్కారం ఉంటుంది. -
ప్రాణాంతక వ్యాధి లాస్ట్ స్టేజ్..ఐనా రోజుకు 12 గంటలు..!
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మంచి పని కోసం తపించడం అంటే..మాటలకందని గొప్ప విషయం. అలా చేయాలంటే ఎంతో స్థైర్యం కావాలి. అంతేగాదు అతడు ఆ వ్యాధి చివరిదశలో ఉండి కూడా.. తనలా మరొకరు ఈ వ్యాధికి బలి కాకూడదని తపిస్తుండటం విశేషం. చిన్నపాటి కదలికలకు కూడా నలుగురు వ్యక్తులపై ఆధారపడాల్సిందే..ఐనా 12 గంటలు పనిచేస్తున్నాడు. అంతలా తగ్గేదేలా అంటూ మనోధైర్యంతో సాగుతున్న అతడి గుండె ధైర్యానికి చేతులెత్తి నమస్కరించాల్సిందే. అతడెవరంటే..ఆ వ్యక్తే ఈ కామర్స్ దిగ్గజం JD.com లో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన 48 ఏళ్ల కైలే. చైనాకు చెందిన కైలే ఏడేళ్లుగా మోటార్ న్యూరాన్ వ్యాధి (ALS) తో పోరాడుతున్నాడు. నయంకాని ఈ వ్యాధి అతడిని పూర్తిగా కదలలేని, మాట్లాడలేని స్థితికి తీసుకువచ్చింది. ప్రస్తుతం టైప్ చేయడానికి, మాట్లాడటానికి పూర్తిగా కంటి ట్రాకింగ్ టెక్నాలజీపై ఆధారపడిన కై, రోజుకు దాదాపు 12 గంటలు పనిచేస్తూ..ఏఎల్ఎస్ ఔషధాల తయారీకి తనను తాను అంకితం చేసుకుంటున్నాడు. తనలా మరెవ్వరూ ఈ వ్యాధికి బలికాకూడదని.. శాస్త్రవేత్తలు, వైద్యులతో కలసి నిర్విరామంగా పనిచేస్తున్నాడుమరణం ఒక్కటే నన్ను ఆపగలదు ఇంకేది కాదంటూ..ఆ స్థితిలో కూడా ఓపికతో పరిశోధనకు తన వంతు సహకారం అందిస్తున్న అతడిని శెభాష్ అని అభినందించకుండా ఉండలేరెవ్వరూ. కై ఇప్పుడు బీజింగ్ ఐసికాంగ్ మెడికల్ టెక్నాలజీకి ఛైర్మన్గా ఉన్నారు. ఆయన మోటార్ న్యూరాన్ వ్యాధి (ALS) పరిశోధన కోసం దాదాపు రూ. 13 కోట్లు వరకు విరాళం ఇచ్చినట్లు సమాచారం. ఆయన ఈ వ్యాధికి అంకితమైన నాలుగు స్వచ్ఛంద సంస్థలను కూడా స్థాపించారు. అలాగే అనేక ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ శాస్త్రవేత్తలు, వైద్యులతో కలిసి పనిచేస్తున్నారు. బాధకరం ఏంటంటే ఏఎల్ఎస్ను తొలిసారి గుర్తించిన దాదాపు రెండు శతాబ్దాల తర్వాత కూడా ఏ ఔషధం కూడా దాని పురోగతిని ఆపలేకపోయింది. ఆయన బృందం ప్రస్తుతం 300కు పైగా ఔషధ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తోంది. ఒక జన్యు-లక్షిత చికిత్స అనేక మంది రోగులను కాపాడినప్పటికీ, కైకిలా స్పోరాడిక్ ALS ఉన్న చాలా మందికి సహాయం చేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలో RAG-17 అనే ప్రయోగాత్మక ఔషధంతో ఒక పురోగతిని ప్రకటించారు. ట్రయల్స్లో కూడా చక్కటి ఫలితాలు వచ్చాయి. కాగా కై లే బృందం ఏజెన్సీ రుసుములు లేకుండా రోగులను నేరుగా సంరక్షకులతో అనుసంధానించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ను సృష్టించింది. స్వతహాగా ఫార్మసీ గ్రాడ్యుయేట్లు అయిన కై , అతని భార్య డువాన్ రుయ్లకు ఒక కుమారుడు ఉన్నాడు. భార్య డువాన్ తన "బ్రేకింగ్ ది ఐస్ స్టేషన్" అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా పరిశోధన కోసం నిధులను సేకరిస్తుంది. కైకి ALS వ్యాధిపై పోరాటంలో సహాయం చేయడం కేవలం కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడం కంటే ఎక్కువ అని, అతనితో గడిపే ప్రతి క్షణాన్ని తాను ఎంతో విలువైనదిగా భావిస్తానని కై భార్య చెప్పడం విశేషం. అంతేగాదు కై దృఢ సంకల్పానికి ఫిదా అవ్వతూ ప్రశంసలు వెల్లువెత్తాయి.(చదవండి: 25 వేల ఈకలు, నాలుగు లక్షల పూసలు..ఏకంగా రూ. 1,155 గంటల ఎంబ్రాయిడరీ!) -
25 వేల ఈకలు, నాలుగు లక్షల పూసలు..ఏకంగా రూ. 1,155 గంటల ఎంబ్రాయిడరీ!
అంబానీ ఇంట పెళ్లి సందడి వేడుకలో నీతా అంబానీ నుంచి కోడళ్లు వరకు అందరూ అత్యంత విలాసవంతమైన దుస్తులు, ముఖ్యంగా కళాఖండాలకు నిలువెత్తు నిదర్శనమైన డిజైనర్వేర్లలో తళుక్కుమన్నారు. అంతేగాదు కళ్లు చెదిరిపోయే ధర పలికే ఆభరణాలతో మెరిసిపోయారు. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నేలా ఈ పెళ్లికూతురు దుస్తులను ధరించింది ఈ ప్రముఖ గాయని. కళాఖండమే ఆమె దుస్తులుగా మారిందా అన్నంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ వధువు దుస్తులు ఎంత ప్రత్యేకం అంటే..ప్రతిదీ ఓ కళాఖండం..ఓ అద్భుతం.బ్రిటన్ గాయని దువాలిపా నటుడు క్యాలమ్ టర్నర్ని జూన్ 20న సిసిలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసుకున్నారు. ఈ దంపతులు మొదట లండన్లో దగ్గరి బంధువుల సమక్షంలో ఒక్కటవ్వగా..ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. అక్కడ ఆమె అద్భుతమైన పెళ్లి దుస్తులతో ఫోటోలకు పోజులిచ్చారామె. ఈ దుస్తులను రూపొందించడానికి కళాకారులకు ఏకంగా నాలుగు వేల గంటలపైనే పట్టిందని గాయని దువాలిపా ఇన్స్టా పోస్ట్లో పేర్కొంది. ఆ దుస్తుల ప్రత్యేకతను వివరిస్తూ..అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకునింది. దానికి "మిస్టర్ & మిసెస్" అని క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేసింది.ఆమె దుస్తుల స్పెషాల్టీ..ఫ్రెంచ్ లేబుల్ చానెల్ రూపొందించిన ఈ పెళ్లి దుస్తులు వివరాల గురించి అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇలా పేర్కొంది. ఈ హాట్ కౌచర్ దుస్తులు పారిస్లోని హస్తకళా కేంద్రంలో రూపుదిద్దుకున్నాయని తెలిపింది. వాటిపై ప్రత్యేకమైన డిజైన్ కోసం మైసన్స్ డి'ఆర్ట్ అటెలియర్ మాంటెక్స్, లెమరీ , లెసేజ్ వంటి ఫ్యాషన్ స్టూడియోల క్లిష్టమైన అలంకరణలు ఉన్నాయి. అందుకోసం తెల్లటి శాటిన్ వంపులను షానెల్ బ్రాండ్కి చెందిన మస్సారో హస్తకళల బృందం ప్రత్యేకంగా తయారు చేసింది. ఇక ఈ ఫ్రెంచ్ లేబుల్ గౌను, ముసుగుని డిజైన్ చేసిన విధానం గురించి కూడా సవివరంగా తెలిపింది. ఈ హాట్ కౌచర్ దుస్తులను అటెలియర్ మాంటెక్స్ ఫ్యాషన్ స్టూడియో నాలుగు లక్షల పైగా పూసలతో పూర్తిగా చేతితో ఎంబ్రాయిడరీ చేయగా, లెసాజ్ ఏకంగా 1,155 గంటల సూదితో ట్రోంప్ లొయిల్ ఆభరణాలను అమర్చింది. అంతేగాదు లెమరీ ఫ్యాషన్ స్టూడియో ఏకంగా 25 వేల ఈకలతో సులన్నితమైన అలంకరణ చేసింది. పెళ్లి కూతురు ధరించే ముసుగు, ఆరు మీటర్లలో ట్యూట్ ముసుగు పక్షులు, పువ్వులు కవితాత్మక చిత్రాన్ని ఆవిష్కరించింది. దీన్ని పూసలు, ఈకలతో ఎండ్రాయిడరీ చేశారు. ఈ హాట్ కౌచర్ ముసుగు డిజైన్ కోసం ఏకంగా మూడుగంటలకు పైగా చేతిపని అవసరమైందట. సింపుల్గా చెప్పాలంటే ఈ వస్త్రధారణ ఓ కళఖండం, పైగా రాబోయే ఏళ్లలో నవ వధువులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇక నటుడు క్యాలమ్ టర్నర్ కస్టమ్ లూయిస్ విట్టన్ సూట్లో ఆకర్షణీయంగా కనిపించాడు. ఈ ఇటాలియన్ వివాహానికి జో అల్విన్, డొనాటెల్లా వెర్సాచే, గ్రేస్ గమ్మర్, ఒలివియా డీన్, మార్క్ రాన్సన్తో పాటు మరికొందరు హాజరైనట్లు సమాచారం. View this post on Instagram A post shared by CHANEL (@chanelofficial) (చదవండి: ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! ఆ ఐదు జపనీస్ ఫుడ్ రూల్స్..) -
ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!
మీ మాటలు వినే, మీతో సరదాగా కబుర్లు చెప్పే ఓ చిన్న స్నేహితుడు ఉంటే బాగుండేదనిపిస్తోందా? అయితే ‘ఏఐపీఐ–లైట్ ఏఐ రోబో’ మీకోసమే!ఇది సాధారణ బొమ్మ కాదు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే స్మార్ట్ రోబో! ఈ చిన్న రోబోతో మాట్లాడితే సహజంగా స్పందిస్తుంది. ప్రశ్నలకు జవాబులు చెప్పడమే కాదు, మీతో సరదాగా చాట్ చేస్తూ స్నేహితుడిలా మెలుగుతుంది.వాయిస్ క్లోనింగ్ సదుపాయంతో మీకు నచ్చిన స్వరాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, మీతో జరిగిన సంభాషణలను గుర్తుంచుకునే మెమరీ ఫీచర్ కూడా ఉంది. రియల్టైమ్లో స్పందిస్తూ నవ్వులు, సరదా వ్యాఖ్యలతో సంభాషణను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. డెస్క్పై అందంగా పెట్టుకునే ఈ స్మార్ట్ రోబో ధర సుమారు రూ. 4,500. -
ఆన్ చేస్తే టీవీ.. ఆఫ్ చేస్తే ఆర్ట్ గ్యాలరీ.. అద్భుతం!
కొన్ని గాడ్జెట్స్ను చూస్తే ఆశ్చర్యం, కొన్ని చూస్తే ఆనందం, మరికొన్ని చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది! అలాంటి స్టయిల్, సౌకర్యం, సాంకేతికత కలయికగా వచ్చిన ఈ గాడ్జెట్స్ మీకోసం..హాల్లో టీవీ పెట్టాలా? లేక ఖరీదైన పెయింటింగ్ తగిలించాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే రెండింటి పనీ చేసే ఈ ‘ఆర్ట్లై¯Œ టీవీ’ మీ కోసం! ఇది ఆన్ చే స్తే టీవీలా, ఆఫ్ చేస్తే గోడపై వేలాడే కళాఖండంలా పనిచేస్తుంది. మ్యాట్ 4కే క్యూఎల్ఈడీ డిస్ప్లేతో వచ్చే ఈ టీవీని చూడనప్పుడు ఇందులో అందుబాటులో ఉన్న రెండు వేలకుపైగా కళాఖండాలను ప్రదర్శించుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల చిత్రాల నుంచి ఆధునిక కళాఖండాల వరకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి. అంతేకాదు, మీ గది అలంకరణకు సరిపోయే చిత్రాలను కృత్రిమ మేధస్సే సూచిస్తుంది. కుటుంబ ఫొటోలను కూడా ఇందులో ప్రదర్శించుకోవచ్చు. ‘లాస్ట్ ట్రిప్ ఫొటోలు చూపించు’ అని చెప్పగానే వాటిని తెరపై చూపించే సౌకర్యం కూడా ఉంది. గోడపై నిజమైన ఫొటో ఫ్రేమ్లా కనిపించే ఈ స్మార్ట్ టీవీ ధర సుమారు రూ. 77 వేల నుంచి ప్రారంభమవుతుంది.బ్యాగ్లో మడత కుర్చీ..!ఎక్కడికైనా వెళ్లినా కూర్చోవడానికి చోటు దొరకక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ మినీ ఫోల్డింగ్ క్యాంపింగ్ స్టూల్! చూడటానికి చిన్నగా ఉన్నా, అవసరమైనప్పుడు వెంటనే ఓ కుర్చీగా మారిపోతుంది.కేవలం కొన్ని సెకన్లలో దీనిని పూర్తిగా తెరిచి వాడుకోవచ్చు, పని అయిపోయాక మడిచి బ్యాగ్లో వేసుకోవచ్చు. బలమైన కార్బ¯Œ స్టీల్ ఫ్రేమ్, వాటర్ప్రూఫ్ ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్తో తయారైన ఈ స్టూల్ 150 కిలోల వరకు బరువు తట్టుకోగలదు. క్యాంపింగ్, ఫిషింగ్, పిక్నిక్లు, బీచ్ ట్రిప్స్, ట్రెక్కింగ్ లేదా గార్డెన్లో కూర్చోవడానికి ఇది బెస్ట్ ఆప్ష¯Œ . పైగా ప్రత్యేక క్యారీ బ్యాగ్ కూడా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ధర కేవలం రూ. 530 మాత్రమే! -
ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్ 21 రోజుల్లోనే..
ప్రసవానంతరం చాలామంది మహిళలకు నార్మల్ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. చాలామందికి ఆ సమయంలో ఉన్నంత లావు తదనంతర కొనసాగుతుంది. పైగా బిడ్డకు పాలివ్వాల్సి ఉంటుంది కాబట్టి బరువు తగ్గడం అన్నది కష్టసాధ్యమైనదే. కానీ ఈ మామ్ 21 రోజుల పాటు జపనీస్ ఆహారపు అలవాట్లను పాటించి ఏకంగా 14 కిలోలు బరువు తగ్గింది. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.జపనీయులు ఆహార విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఆలోచనాత్మకంగా తినడం, సమతుల్య పరిమాణంలో తీసుకోవడం, అతిగా తినకుండా ఆహారాన్ని ఆస్వాదించడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ భారతీయ తల్లి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాన్సీ ఆ ఆహారపు అలవాట్లును ప్రయత్నించి చూసి సత్ఫలితాలను అందుకుంది. ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ఈ జపనీస్ ఆహారపు అలవాట్లు నిజంగానే మంచి మార్పు తీసుకువస్తాయా? లేదా? అనే కుతూహలంతో ఈ ప్రయోగాన్ని ప్రయత్నించి చూసినట్లు తెలిపింది. ఆ నేపథ్యంలోనే 21 రోజుల పాటు జపనీసులు తినే ఆహారపద్ధతిని యథతథంగా పాటించినట్లు తెలిపింది. ఇందులో ఎలాంటి ఆహార మార్పులు, షార్ట్కట్లు ఉండవు. జపాన్ వాళ్లు సరిగ్గా ఎలా తింటారో అలానే తింటే చాలు అంటోంది. ఆ ఐదు జపాన్ రూల్స్..ముందుగా కళ్లతో తినండి..భోజనం తినే ముందు అది చూడటానికి అందంగా ఉండాలని జపనీయులు నమ్ముతారు. చిన్న చిన్న భాగాలు, రకరకాల రంగులు..ఇలా ప్రతిదీ శ్రద్ధగా అమర్చి ఉండాలి అని ఆ ఇన్ఫ్లుయెన్సర్ వివరించారు. ఇది ఒక్కటే తినే వేగాన్ని తగ్గించి, అతిగా తినడాన్ని నివారిస్తుందని చెబుతోందామె.హరా హచి బు..ఇది ఒక సాంప్రదాయ జపనీస్, కన్ఫ్యూషియన్-ప్రేరిత పద్ధతి. దీని అర్థం కడుపు 80% నిండే వరకు తినాలి. ఇది శ్రద్ధగా ఆహార పరిమాణాన్ని నియంత్రించడానికి ఒక సున్నితమైన విధానంగా పనిచేస్తుంది. అలాగే శరీరానికి కడుపు నిండినట్లు గ్రహించడానికి సమయం ఇవ్వడం ద్వారా అతిగా తినడాన్ని నివారిస్తూ జీర్ణక్రియకు సహాయపడవచ్చు. ఇలా ప్రతి భోజనంలో దీనిని పాటిస్తూ.. ఏమీ కోల్పోతున్నాననే భావన కలగకుండా ఆహార పరిమాణాలు సహజంగానే తగ్గుతాయట.ప్రతి భోజనంలో అన్నం.. కానీ చిన్న చిన్న భాగాలుగా!తెల్ల అన్నమే చిన్న చిన్న భాగాలుగా తీసుకుంటానంటోంది. అయితే ప్రోటీన్ ఉండేలా..కూరగాయలు, మిసోసూప్తో కలిపి తింటానని మాన్సీ తెలిపారు. ఈ కలయిక రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుందని ఇన్ఫ్లుయెన్సర్ తెలిపారు.భోజనానికి ముందు మిసో సూప్మిసో సూప్లో పులియబెట్టిన పదార్థాలు ఉంటాయి. ఇది పేగుల ఆరోగ్యానికి మంచిదని పేర్కొంది. మాన్సీ ప్రకారం, ఇది ఆమె దినచర్యలో ఒక భాగంగా మారిందని చెప్పుకొచ్చింది.భోజనం మధ్యలో చిరుతిండ్లు..మాన్సీ ప్రకారం, జపాన్లో భోజనాల మధ్య తినడం అనేది ఒక సాధారణ అలవాటు కాదు. దానికి బదులుగా, మధ్యలో ఏమీ తినకుండా రోజుకు మూడు పూటలా సరిగ్గా భోజనం చేయడంపై దృష్టి పెడతారు. ఇది జీర్ణవ్యవస్థకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇస్తుందని, అలాగే ఆకలి సంకేతాల పట్ల శ్రద్ధ వహించడానికి సహాయపడుతుందని పేర్కొంది మాన్సీ.ఇక్కడ ఈ తల్లి మాన్సీ వెయిట్లాస్ స్టోరీ.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలంటే.. మన ప్లేట్లో ఉండే భోజనం ఎంత ముఖ్యమో అంతే విధంగా ఆలోచనాత్మకంగా తినడం, పరిమాణంపై శ్రద్ధ పెట్టడం అంతే ముఖ్యమని చెప్పకనే చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by Mansi (@mommytoivaan_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..) -
కంఫర్ట్ ఫుల్... స్టయిల్ డబుల్!
ఎక్కువ కష్టపడకుండానే స్టయిల్గా కనిపించాలంటే, కొరియన్ ఫ్యాషన్ ను ఫాలో అవ్వాల్సిందే! ముఖ్యంగా కొరియన్ డ్రామాల ప్రభావంతో ఇప్పుడు ట్రెండ్ మొత్తం కంఫర్ట్ అండ్ క్లాస్ కలిసిన రిలాక్స్డ్ ఫిట్ ప్యాంట్స్వైపు మళ్లింది. అందుకే, ఈ కొరియన్ ప్యాంట్స్ గైడ్ మీ కోసం!ప్లీటెడ్ ప్యాంట్స్కి క్లాస్ వేరుప్లీటెడ్ డిజైన్స్ ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఫుల్ డిమాండ్లో ఉన్నాయి. ముందు భాగంలో చిన్న కుచ్చులు ఉండే ప్లీటెడ్ ప్యాంట్స్కు, ఒక ప్లెయిన్ షర్ట్ లేదా పోలో టీషర్ట్తో జత చేస్తే చాలు... ‘ఈయనకి ఫ్యాషన్ గురించి తెలుసు’ అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.యాంకిల్ లెంగ్త్ కిక్చీలమండ దగ్గర ముగిసే కొరియన్ ప్యాంట్స్ చాలా స్టయిల్గా కనిపిస్తాయి. ముఖ్యంగా వైట్ స్నీకర్స్తో వేసుకుంటే లుక్ మరింత షార్ప్గా మారుతుంది.న్యూట్రల్ కలర్స్నే హీరోలుబీజ్, క్రీమ్, గ్రే, ఆలివ్, బ్లాక్, నేవీ... ఇవే కొరియన్ ఫ్యాషన్ లో ఎక్కువగా కనిపించే కలర్స్. వీటిని మ్యాచ్ చేయడం కూడా చాలా ఈజీ. అందుకే స్టయిల్ చేయడంలో టెన్షన్ తక్కువ.ఓవర్సైజ్డ్ టీషర్ట్తో బెస్ట్ ఫ్రెండ్స్కొరియన్ ప్యాంట్స్కి ఓవర్సైజ్డ్ టీషర్ట్తో వేసుకుంటే కొరియన్ స్ట్రీట్ స్టార్లా, షర్ట్ను టక్ చేసి బెల్ట్ జోడిస్తే డ్రామా హీరోలా కనిపించడం మాత్రం గ్యారంటీ!అసలు స్పెషాలిటీ ఏంటంటే?కొరియన్ ప్యాంట్స్ అంటే కాళ్లకు ఫ్రీడమ్, లుక్కి క్లాస్! ఇవి మరీ స్కిన్నీగా అతుక్కుపోవు, అలాగని గాలికి బెలూన్లా ఊగిపోవు. నడుము దగ్గర నీట్గా ఫిట్ అవుతూ, కిందికి వెళ్లేకొద్దీ రిలాక్స్డ్గా ఫ్లో అవుతాయి. నడుస్తుంటే గాలి కూడా హ్యాపీగా ఆడుతుంది, స్టయిల్ కూడా తగ్గదు. అలా కంఫర్ట్ ఫుల్... స్టయిల్ డబుల్!ఈ 3 రూల్స్ గుర్తుంచుకోండి!కింద వేసుకునే ప్యాంటు లూజ్గా ఉన్నప్పుడు, పైన వేసుకునే షర్ట్ లేదా టీ–షర్ట్ను ఇన్–షర్ట్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ బాడీ షేప్ కరెక్ట్గా ఎలివేట్ అవుతుంది. లేదంటే మీరు బట్టల మూటలా కనిపిస్తారు.కొరియన్ లుక్ సీక్రెట్ సింప్లిసిటీ. ఎక్కువ ప్రింట్స్, ఎక్కువ కలర్స్ కంటే క్లీన్ అండ్ మినిమల్ లుక్కే ప్రాధాన్యం ఇవ్వండి..ఈ ప్యాంట్స్ సాఫ్ట్ అండ్ ఫ్లోయీగా ఉంటేనే బాగుంటాయి. అందుకే కాటన్ బ్లెండ్స్, రేయాన్ లేదా లైట్–వెయిట్ సూటింగ్ ఫ్యాబ్రిక్స్ను ఎంచుకోండి. -
రోకటిపాట కాదు రహస్య గీతం!
‘ప్రతి మనిషీ ఓరవాకిలిగా తెరిచిన ఓ తలుపే! అందులోంచి ముందుకు పోతే– ఒక్కొక్కరి కోసం, ఒక్కో ద్వారం తెరుచుకుంటుంది!’ –అన్నారు స్వీడిష్ కవి, మనఃశాస్త్రజ్ఞుడు, సంగీతజ్ఞుడు తోమస్ యోస్తా ట్రాన్స్ట్రామర్. ఏ భాషలోనైనా, మనఃశాస్త్రజ్ఞులు కవులూ, రచయితలూ, సంగీతజ్ఞులుగా మారిన ప్రతి సందర్భంలోనూ పాఠకులకు ఇలాంటి భావచిత్రాలు అడుగడుగునా ఎదురవుతుంటాయి. ఉదాహరణకు మన చలం, కుటుంబరావు, పద్మరాజు, గోపీచంద్, బుచ్చిబాబు, రావిశాస్త్రి, ఆర్ఎస్ సుదర్శనం, త్రిపుర, ‘అంపశయ్య’ నవీన్, పతంజలి శాస్త్రి, కె.ఎన్.వై పతంజలి, వడ్డెర చండీదాస్ తదితరుల రచనల్లోనూ అలాంటి దృశ్యాలు మనం చూసినవేగా!ఇక పాశ్చాత్య సాహిత్యంలో ఇలాంటి రచయితలు కోకొల్లలుగా కనిపిస్తారు– కాఫ్కా, వూల్ఫ్, లారెన్స్, సిల్వియా ప్లాత్, థామస్ మాన్, హెమింగ్వే అలాంటివాళ్ళే! ‘కనిపించీ కనిపించని దృశ్యాల్లాంటి సంక్షిప్త పదచిత్రాల ద్వారా ఈ కవి (ట్రాన్స్ట్రామర్) వాస్తవదృశ్యాన్ని సరికొత్త కోణంలోంచి మన కళ్ళకు కట్టిస్తార’ని 2011లో ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంలో పేర్కొన్నారు, స్వీడిష్ ఎకాడెమీ ప్రతినిధి.ఆ ‘కనిపించీ కనిపించని’తనాన్నే ట్రాన్స్ట్రామర్లోని మార్మికతగా అభివర్ణించారు విశ్లేషకులు. మరికొందరు ఆయన్ను ‘ఆధునిక కవి’గా పరిగణించగా, వేరే కొందరైతే ‘ట్రాన్స్ట్రామర్ ఓ ఎక్స్ప్రెషనిస్టు కవి’ అన్నారు.గెయార్గ్ హైం, అగస్ట్ స్ట్రాం, గాట్ఫ్రైడ్ బెన్ తదితరులనూ అదే కోవకు చెందిన కవులంటారు. ఇంకొందరు, ‘ట్రాన్స్ట్రామర్ ఓ అధివాస్తవిక కవి’ అనేశారు. దైనందిన జీవనంలోనూ, మనల్ని ఆవరించుకుని వున్న చరాచర ప్రకృతిలోనూ లోపలి పొరల్లో దాగిన నిగూఢతను ట్రాన్స్ట్రామర్ ప్రముఖంగా చిత్రించే మాట నిజం! అందుకే, ఆయన్ని ‘క్రైస్తవ కవి’గా లెక్కించారు మరికొందరు.ఈ నిర్వచనాలూ ప్రవచనాల మాటెలావున్నా, జీవన గీతం రోకటిపాట కాదనీ, అదో రహస్యగానమనీ ట్రాన్స్ట్రామర్ లాంటి మార్మిక కవులు నిరూపించిన మాటైతే వాస్తవం! ఈ మార్మికత ఎక్కడినుంచో ఎరువుతెచ్చుకున్నదేం కాదు. అది ఆధునిక జీవన విధానంలో భాగమే. మన మర్యాదల్లోనూ పలకరింపుల్లోనూ మొదలుపెట్టి ఒంటరిగా వున్నప్పుడు ముసురుకునే ఆలోచనల వరకూ అన్నింటా ఈ మార్మికత ఆవరించుకుని వుంటుంది. విషయమేమిటంటే, ఆధునిక మానవాళికి మార్మికత పనిగట్టుకుని నేర్పించనవసరం లేదు! బహుశా అందుకేనేమో, ట్రాన్స్ట్రామర్ కవిత్వం 60 భాషల్లోకి అనువాదమై, పాఠకుల ఆదరణకు పాత్రమైంది.ట్రాన్స్ట్రామర్ రాణించిన మరో రంగం సంగీతం. 1990లో పక్షవాతం వచ్చి కుడి చెయ్యి పడిపోయేంత వరకూ, ఆయన పూర్తిస్థాయి పియానో వాద్యగాడిగా ఔననిపించుకున్నవాడే! ఆ తర్వాత కూడా ఒంటిచేత్తోనే పియానో వాదనం అభ్యసించాడు ట్రాన్స్ట్రామర్. అలా తన విశిష్టతను మరోసారి నిరూపించుకున్నాడు. సంగీత రంగంలో ట్రాన్స్ట్రామర్ వారసత్వాన్ని ఆయన కుమార్తె కొనసాగించారు. గానకళలో ఆమె పూర్తిస్థాయి ప్రదర్శకురాలు! 2011లో ట్రాన్స్ట్రామర్కు నోబెల్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో తండ్రి కవితలు పద్దెనిమిదింటికి బాణీలు కట్టి ఆలపించారామె. నార్వీజియన్ శాక్సఫోనిస్ట్ యాన్ గబారెక్, స్వీడిష్– అమెరికన్ సంగీతకర్త ఊల్ఫ్ గ్రాన్, స్వీడిష్–ఫ్రెంచ్ సంగీతకారిణి మెడిలిన్ ఇసాక్సన్ తదితరులెందరో ట్రాన్స్ట్రామర్ గీతాలకు బాణీలు కట్టి శ్రోతలను అలరించారు.సాహిత్య ప్రక్రియలను– స్థూలంగా– కవిత్వం, వచనంగా విభజించి చూసుకుంటే, నోబెల్ సాహిత్య పురస్కారాల వరకూ కవిత్వానికి పూర్తి న్యాయం జరగలేదనే చెప్పాలి. గత నూట పాతికేళ్ళుగా ఈ పురస్కారాలు అందుకున్నవాళ్ళలో కవులూ, వాగ్గేయకారుల సంఖ్య మూడు పదులకు కొంచెం ఎక్కువ. (అక్షరాలా ముప్పైమూడు మాత్రమే!) మరీ ముఖ్యంగా ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ కోవకు చెందిన పురస్కార గ్రహీతలు ముగ్గురంటే ముగ్గురే! 2011లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ట్రాన్స్ట్రామర్తోనే ఈ ‘జాబితా’ మొదలవుతుంది! అయితే ఆయన కవిత్వానికే ఈ పురస్కారం ప్రకటిస్తున్నామని స్వీడిష్ ఎకాడెమీ ఎక్కడా పేర్కొనక పోవడం గమనార్హం.జర్మన్ కవయిత్రి లూయిజ్ గ్లూక్ ఒక్కరికే– 2020లో– కవిత్వానికి గానూ ఈ పురస్కారం ప్రకటించింది స్వీడిష్ ఎకాడెమీ. మరో నాలుగేళ్ళకు ఇదే పురస్కారం అందుకున్న దక్షిణ కొరియన్ రచయిత్రి హాన్ కాంగ్ రాసింది వచనమే– అయితే దాన్ని కవిత్వంతో వేరుచెయ్యడం దాదాపు అసాధ్యం! తెలుగులో ఇలాంటి పోలిక చెప్పాలంటే రావిశాస్త్రి, కె.ఎన్.వై.పతంజలి లాంటి పేర్లు కొన్ని చూపించవచ్చు. ట్రాన్స్ట్రామర్ వచనం కూడా అలాంటిదే! దాన్ని మూసకట్టు వచనమనో, కవిత్వమనో జమకట్టడం కష్టం. ట్రాన్స్ట్రామర్ కవితల్లో ‘నీలి ఇల్లు’ సుప్రసిద్ధం. దాని ఆంగ్లానువాదం (ద బ్లూ హౌస్) నెట్లో దొరుకుతోంది– చదవండి! - మందలపర్తి కిషోర్ -
నాన్నే... దేవర ఆయనే కొండ!
నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఆనంద్ దేవరకొండ తన తండ్రి గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ‘ఆయన దేవుడిలాంటివాడు... మాకు కొండంత అండ’ అన్నట్లుగా చెప్పారు. ‘ఆయనే దేవర... ఆయనే కొండ’ అనే తరహాలో తన తండ్రి గురించి ఈ హీరో చెప్పిన విశేషాల్లో ఆసక్తికరమైనవి.‘తప్పు చేస్తేనే ఒప్పు ఏంటో తెలుస్తుంది’... తన పిల్లలకు గోవర్ధన్ రావు దేవరకొండ ఇచ్చిన స్వేచ్ఛ ఇది. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఇద్దరూ తండ్రి చెప్పిన మాటలు వింటూ జీవితాన్ని నేర్చుకున్నారు. విజయ్ దేవరకొండ ‘సెన్సేషనల్ స్టార్’, విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ‘స్పేస్’ సృష్టించుకున్న స్టార్ ఆనంద్ దేవరకొండ. → నాన్నతో ఫ్రెండ్షిప్చిన్నప్పటి నుంచే... అంటే నా ఫస్ట్ స్టాండర్డ్ నుంచే నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. మా తల్లిదండ్రులు నెలకు ఒకటి లేదా రెండుసార్లు చూడ్డానికి వచ్చేవారు. సో... హాస్టల్లో గడిపిన ఆ పది నెలల సమయంలో మా అమ్మానాన్న వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించేది. అందుకే వేసవి సెలవుల్లో వారితో పూర్తిగా గడిపేవాడిని. అది ఎంతో విలువైన సమయం. ఆ సమయంలోనే స్నేహంలాంటి అనుబంధం బలపడింది. అలా మా నాన్నతో నా ఫ్రెండ్షిప్ మొదలైంది. మా ఇంటి ముందు క్రికెట్ ఆడిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఉదయం 7 గంటలకు నాన్నను లేపేవాణ్ణి. నేను బ్యాటింగ్ చేస్తుంటే ఆయన గంటల తరబడి బౌలింగ్ చేసేవారు. నా జీవితంలో ఒక దశలో నేనేం చేయాలనుకుంటున్నాననే విషయంపై నాకు స్పష్టత లేదు. అప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, తమ సామర్థ్యానికి మించిన మొత్తాన్ని సమకూర్చి మాస్టర్స్ చదవడానికి నన్ను అమెరికా పంపించారు. ఆ అనుభవాలు, అక్కడ గడిపిన కాలం నన్ను వ్యక్తిగా పూర్తిగా మార్చేశాయని నేను నమ్ముతాను.→ కొండంత ధైర్యంమా నాన్న అన్ని విషయాల్లోనూ నాకు కొండంత ధైర్యం ఇస్తుంటారు. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉన్నారు. అవసరమైనప్పుడు తన సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్లొచ్చనే నమ్మకాన్ని ఇచ్చారు. మా నాన్న ఆత్మవిశ్వాసాన్ని నింపే వ్యక్తి. ‘విజయాన్ని కాకుండా ఎదుగుదలను లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని ఆయన చెప్పిన మాటలు మా మనసులో నాటుకుపోయాయి. చిన్నప్పటి నుంచే మేము తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చారు. నేను, నా అన్న తప్పులు చేసినందుకు ఎప్పుడూ శిక్ష పడలేదు. కానీ ఆ తప్పు గురించి మా నాన్న మాతో మాట్లాడేవారు. ఆ మాటలు మమ్మల్ని బాగా ప్రభావితం చేసేవి. దాంతో ఎలాంటి సవాళ్లనైనా, ఎదురు దెబ్బలనైనా ఎలా అధిగమించాలనే విషయంలో మాకు అవగాహన వచ్చింది. మామూలుగా నాన్నంటే భయం ఉండటం సహజం. అయితే మా ఇద్దరిలో ఎవరికీ ఆయనంటే భయం లేదు. నాన్నపై అపారమైన గౌరవం, ప్రేమ మాత్రమే ఉన్నాయి.→ మా నాన్న మంచి విశ్లేషకుడుమా వర్క్ గురించి, సినిమా ఎడిట్స్ గురించి తరచూ మాట్లాడుకుంటుంటాం. ఒక సినిమా ఎలా వర్కవుట్ అవుతుంది? వర్కవుట్ కాదనే విషయాలను అంచనా వేయడంలో మా నాన్నకు మంచి అవగాహన ఉంది. అందుకే సినిమా ఎడిటింగ్ దశలో ఉన్నప్పుడు ఆయన అభి్రపాయాన్ని, విశ్లేషణను తప్పకుండా అడుగుతుంటాను.→ పెద్ద హగ్తల్లిదండ్రుల ప్రేమకు వెలకట్టలేం. వారు కనబరిచే ప్రేమకు ఏం చేసినా తక్కువే. మా నాన్న ఎంతో ఇష్టపడే ‘ఫార్మ్’ని, మా విలేజ్లో ముచ్చటపడి కట్టించుకున్న ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా నా ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. డబ్బుతో కొనిచ్చే బహుమతులకన్నా ప్రేమతో ఇచ్చే ‘హగ్’ చాలా పెద్దది. అందుకే ఈ ఫాదర్స్ డేకి మా నాన్నకు ఒక పెద్ద హగ్ రూపంలో బహుమతి ఇవ్వబోతున్నాను. అలాగే ఈ ఏడాది చివర్లో కుటుంబంతో కలిసి ఒక ట్రిప్ ΄్లాన్ చేయాలనుకుంటున్నాను. ఆ విషయంలోఆయనే స్ఫూర్తిమా ఇంట్లో అందరం ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తాం. మా నాన్న కాస్త ఎక్కువ. నేను, అన్న ఏం చెప్పకుండానే తన వ్యాయామం, ఆహారం, జీవనశైలిని ఎంతో క్రమశిక్షణతో పాటి స్తారు. ఈ విషయంలోనూ ఆయన మాకు స్ఫూర్తిగా ఉంటారు.నా ఫస్ట్ హిట్కి హ్యాపీమా నాన్న సంతోషపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పుడు, విదేశాల్లో ఉద్యోగం సంపాదించినప్పుడు, నా మొదటి లైవ్ థియేటర్ ప్రదర్శన సమయంలో, అలాగే నా ఫస్ట్ సినిమా ‘బేబి’ సక్సెస్ అయినప్పుడు ఆయన చాలా ఆనందపడ్డారు. మా నాన్నకు చిరంజీవిగారంటే ఎంతో అభిమానం. ‘బేబి’ సినిమాలో నా నటన గురించి ఆయన ప్రశంసించినప్పుడు మా నాన్న గర్వంగా, ఆనందంగా ఫీలయ్యారు.గర్వంగా ఫీలవుతారు..అన్న పెళ్లి మా నాన్నకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. చిన్నప్పుడు ఆయనకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. అయితే అది నెరవేరలేదు. అన్న, నేను యాక్టర్స్గా ఉన్నందుకు ఆయనకు ఆనందంగా, గర్వంగా ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురం (విజయ్ భార్య, హీరోయిన్ రష్మికని ఉద్దేశించి) సినీ పరిశ్రమలో ఉన్నాం. ఇంటికి వచ్చేవారికి ఆయన ఈ విషయం గర్వంగా చెబుతుంటారు. అంతేకాదు, వదినకు కూడా ఆయన ఫాదర్ ఫిగర్లా మారిపోయారు.– ఆనంద్ దేవరకొండ– డి.జి. భవాని -
కప్ప బావ.. మ్యూజిక్ బ్యాండ్!
టపటప వాన మొదలవగానే చింతచెట్టు కింద కప్ప బావ గొంతు సవరించుకున్నాడు. ‘బెక బెక బేక్’ అని పాట అందుకున్నాడు. ఆ శబ్దానికి నిద్రపోతున్న చీమల దండు ఉలిక్కిపడి బయటకొచ్చింది.‘ఏంటి బావా ఈ గోల? అసలుకే మా పుట్టలోకి నీళ్లు ఎక్కడ వస్తాయోనని భయపడి చస్తుంటేను’ అని విసుక్కున్నాయి.కప్ప బావ సిగ్గుపడ్డాడు. ‘సారీ చీమ పిల్లలూ. వాన వస్తే నాకు పాడాలనిపిస్తుంది’ అన్నాడు.అప్పుడే నత్త గారు నెమ్మదిగా వచ్చారు. ‘బావా, నీ పాట బాగుంది కానీ ఒక్కడివే పాడితే ఎలా? మనమంతా కలిసి పాడుదాం’ అన్నారు.వాన జోరందుకుంది. కప్ప బావ ‘బెక బెక’ డ్రమ్స్ వాయించాడు. నత్తగారి షెల్ మీద టపటపా పడ్డ వాన చినుకులు రిథమ్ ఇచ్చాయి. చీమలు క్యూ కట్టి ‘టిక్ టిక్’ అని చప్పట్లు కొట్టాయి. మిణుగురు పురుగులు లైటింగ్ ఇచ్చాయి. ఆ మ్యూజిక్ విని ఊరి పిల్లలంతా కిటికీల్లోంచి తొంగి చూశారు.‘అరే, వానలో బ్యాండ్’ అని చప్పట్లు కొట్టారు. కాసేపటికి వాన తగ్గింది. చీమల పుట్ట సేఫ్. అందరూ హ్యాపీ. కప్ప బావ అన్నాడు, ‘చూశారా, ఒక్కడి గోల అందరికీ విసుగు. అందరూ కలిస్తేనే అది పండగ.’ఆ రోజు నుంచి చింతకుంట పల్లెలో వాన పడిందంటే చాలు కప్ప బావ బ్యాండ్ మొదలయ్యేది. పిల్లలంతా కిటికీ దగ్గర కూర్చుని వింటూ కబుర్లు చెప్పుకునేవారు.నీతి: కలిసి చేస్తే ఏ పనైనా పండగే, కష్టమైనా ఇష్టమవుతుంది. -
గొర్రెల కాపరి నుంచి దేశ నాయకుడు..
‘రోలిహ్లాహ్లా మండేలా’ చిన్నప్పుడు దక్షిణాఫ్రికాలోని ‘కును’ అనే పల్లెటూరిలో పెరిగాడు. చిన్నతనంలో రోజంతా పొలాల్లో గొర్రెలను, పశువులను మేపుతూ, చెప్పులు లేకుండా ఎండలో తిరుగుతూ తోటి పిల్లలతో కలిసి మట్టితో ఆడుకునేవాడు. మండేలాకు ఏడేళ్లు వచ్చాక వాళ్ల అమ్మ స్కూల్కి పంపింది. అక్కడే ఒక టీచర్ అతనికి ‘నెల్సన్’ అని పేరు పెట్టారు.తొమ్మిదేళ్ల వయసులో తండ్రి చనిపోయాక, ఒక రాజప్రతినిధి ఆశ్రయంలో పెరిగి పెద్ద చదువులు చదివాడు. పశువులు కాసే రోజుల్లోనే ఆకాశం వైపు చూస్తూ ‘మా జాతి ప్రజలు ఎందుకు బానిసల్లా బతకాలి?’ అని ఆలోచించేవాడు. చిన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న ఆ పిల్లాడే, పెద్దయ్యాక వర్ణవివక్షపై పోరాడి 27 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడై, ప్రపంచానికే ‘స్వేచ్ఛ’ అంటే ఏంటో చూపించాడు. ఆలోచన గట్టిగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదని దీనిని బట్టి అర్థమవుతోంది. -
వర్షాకాలం వచ్చేసింది.. పాదరక్షలతో పదిలం!
వర్షాకాలం వచ్చేసింది. ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లే వేసుకునే చెప్పుల విషయంలోనూ జాగ్రత్తలు ముఖ్యమే. లేదంటే కొద్దిపాటి అజాగ్రత్తగా ఉన్నా జారిపడటమో, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడమో జరుగవచ్చు. అందుకోసం ఈ చిన్నచిన్న టిప్స్...మంచి గ్రిప్ ముఖ్యం: వర్షాకాలంలో అడుగు భాగంలో అరిగిపోయిన ఫ్లాట్ చెప్పులను అస్సలు వాడకూడదు. తడి నేలపై నడిచేటప్పుడు జారిపడకుండా ఉండటానికి గరుకుగా, గట్టిగా నేలను పట్టుకునే గ్రిప్ ఉన్న చెప్పులను మాత్రమే ఎంచుకోవాలి.వాటర్ ప్రూఫ్వి: లెదర్, కాన్వాస్ లేదా బట్టతో చేసిన చెప్పులు నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇవి త్వరగా ఆరకపోవడమే కాకుండా దుర్వాసనకు, బ్యాక్టీరియాకు నిలయంగా మారుతాయి. కాబట్టి రబ్బర్, సిలికాన్ లేదా ప్లాస్టిక్తో తయారైన వాటర్ ప్రూఫ్ చెప్పులను వాడటం ఉత్తమం.సరైన సైజ్: చెప్పులు మరీ లూజ్గా గానీ, మరీ టైట్గా గానీ ఉండకూడదు. బురదలో నడిచేటప్పుడు కాళ్ళు బెణకకుండా ఉండేందుకు యాంకిల్ సపోర్ట్ ఉన్న చెప్పులు మరింత సురక్షితం. -
లైవ్ ఆల్బమ్తో శ్రేయా ఘోషల్ రికార్డు..
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ సరికొత్త రికార్డుకు సిద్ధమయ్యారు. తన సుదీర్ఘ కెరీర్లో మొట్టమొదటిసారిగా ఒక ‘లైవ్ కాన్సర్ట్ ఆల్బమ్’ను విడుదల చేయబోతున్నట్లు సోనీ మ్యూజిక్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే ఆమె ప్రపంచవ్యాప్తంగా పూర్తి చేసిన ‘ఆల్ హార్ట్స్’మ్యూజికల్ టూర్ విశేషాలతో ఈ ఆల్బమ్ను రూపొందించారు.ప్రపంచవ్యాప్తంగా 44 నగరాల్లో జరిగిన ఈ మ్యూజికల్ టూర్లో.. ముంబై, లండన్, న్యూయార్క్, ఆమ్స్టర్డామ్ వంటి ప్రముఖ నగరాల కాన్సర్ట్ స్టేజీలపై శ్రేయ లైవ్గా పాడిన ఐకానిక్ సాంగ్స్ను ఇందులో చేర్చారు. ఈ ఆల్బమ్లో శ్రేయా ఘోషల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన బాలీవుడ్ పాటలు ఉండబోతున్నాయి.ఈ మ్యూజికల్ టూర్లో భాగంగా లండన్ లోని ప్రఖ్యాత ఓవో ఎరీనా వెంబ్లీ, కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఎరీనాల్లో శ్రేయ ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా డెట్రాయిట్లోని ‘ఫాక్స్ థియేటర్’లో గానకోకిల లతా మంగేష్కర్ తర్వాత ప్రదర్శన ఇచ్చిన రెండో భారతీయ కళాకారిణిగా శ్రేయా ఘోషల్ చరిత్ర సృష్టించారు. అలాగే లాస్ ఏంజిల్స్లోని ప్రసిద్ధ డాల్బీ థియేటర్ స్టేజ్పై పెర్ఫామ్ చేసిన ఏకైక భారతీయ సింగర్గా ఆమె రికార్డు సాధించారు. -
ఈ స్టార్స్ నాన్నచెమట చుక్కలే!
కొడుకు సూపర్ స్టార్ కావచ్చు. కూతురు సి.ఇ.ఓ. కావచ్చు. పిల్లలు వరల్డ్ ఛాంపియన్స్ కావచ్చు. కానీ ఆ శిఖరాల కింద ఒక పునాది ఉంటుంది. అది నాన్న. ఆయన కానిస్టేబుల్ అయినా, వ్యవసాయదారు అయినా బిడ్డల కలలకి రెక్కలు కడతాడు. రేపు ‘ఫాదర్స్ డే’ రోజున మన గెలుపుగాథల వెనక ఉన్న చెమట చుక్కల్ని గుర్తు చేసుకుందాం. కొంతమంది సెలబ్రిటీలు చెప్పిన నాన్న కథల్లో మనందరి ఇళ్లలోని నాన్నను చూద్దాం. – కెఏడాది జీతంతో ఫ్లయిట్టికెట్రఘునాథ పిచాయ్ చెన్నైలో ఎలక్ట్రికల్ ఇంజనీర్. అశోక్నగర్లో రెండు రూముల ఇల్లు వారిది. ఏసీ లేదు, ఫ్రిజ్ లేదు, స్కూటర్ కూడా లేదు. ఫోన్ కనెక్షన్ రావడానికి ఐదేళ్లు వెయిట్ చేశాడు. ఇద్దరు కొడుకులు హాల్లోనే పడుకునేవారు. కొడుకు సుందర్కి స్టాన్ ఫర్డ్లో ఎం.ఎస్. సీట్ వస్తే అమెరికా ఫ్లైట్ టికెట్ కొనడానికి ఆ తండ్రి వద్ద డబ్బు లేదు. రఘునాథ చివరికి తన ఏడాది జీతం మొత్తం పెట్టి టికెట్ కొన్నాడు. అది సుందర్ జీవితంలో మొదటి ఫ్లైట్. తర్వాత ఆ కొడుకు గూగుల్ సి.ఇ.ఓ. అయ్యాడు. అయినా సరే రఘునాథ సామాన్యంగానే ఉన్నాడు. చెన్నైలోని ఇల్లు 2023లో అమ్మేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గంటల తరబడి లైన్ లో నిలబడ్డాడు. పన్నులు కట్టాడు. ‘తన కొడుకు ఎవరో చెప్పి పని చేయించుకోలేదు’ అని అందరూ చెప్పుకున్నారు. ‘మా నాన్న నమ్మింది చదువు ఒక్కటే. ‘చదువు ఒక్కటే నిన్ను కాపాడుతుంది’ అనేవాడు. ఈరోజు నేను గూగుల్ నడుపుతున్నాను. కానీ ఆ ఆఫీస్ కంటే ఉన్నతమైనది నాన్న త్యాగం. ఆయన నాకు ఇంటర్నెట్ ఇవ్వలేదు, కానీ ఇంటరెస్ట్ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ పవర్ తెలిసిన నాన్న, క్లౌడ్ నడిపే కొడుకుని తయారు చేశాడు.’– సుందర్ పిచాయ్ గూగుల్ సి.ఇ.ఒ.60 కిలోమీటర్లు తిరిగిన కోచ్!పి.వి. రమణ ఇండియన్ వాలీబాల్ టీమ్ ప్లేయర్. ఏషియన్ గేమ్స్లో మెడల్ తెచ్చాడు. రైల్వేలో ఉద్యోగం. కూతురు సింధుకి బ్యాడ్మింటన్ పిచ్చి. కాని గోపీచంద్ అకాడమీ ఇంటికి 30 కి.మీ. దూరం. అయితే ఏంటట? నాన్న ఉన్నాడుగా. రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకు కూతుర్ని లేపి కార్లో అకాడమీకి తీసుకెళ్లేవాడు. ప్రాక్టీస్ అయ్యాక మళ్లీ 30 కి.మీ. వెనక్కు తెచ్చేవాడు. అలా ఎనిమిదేళ్లు. రోజూ డ్రైవింగ్. ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. బ్యాడ్మింటన్ నేర్చుకుని కూతురితో ఆడి ప్రాక్టీస్ చేయించాడు. ‘నాన్న నా ఫస్ట్ కోచ్. నా కోసం వాలీబాల్ పక్కనపెట్టి బ్యాడ్మింటన్ బ్యాట్ పట్టుకున్నాడు. ఫిట్గా ఎలా ఉండాలో ఆయనే తర్ఫీదు ఇచ్చాడు. నేను రియో ఒలింపిక్స్లో సిల్వర్ గెలిచాక నాన్నని చూసి ఏడ్చేశా. అది నా మెడల్ కాదు. నాన్న రోజూ చేసిన 60 కి.మీ. డ్రైవ్కి దక్కిన గౌరవం. నేను మ్యాచ్ ఓడిపోతే నాన్న నన్ను తిట్టలేదు. తప్పు ఎక్కడ జరిగింది అని మాత్రమే చర్చించేవాడు. ఆయన నాకు గెలవడం నేర్పలేదు, నేర్చుకోవడం నేర్పాడు.’– పి.వి. సింధుబ్యాడ్మింటన్ ఛాంపియన్అవార్డ్ వచ్చినా చదువు అన్నాడుడి. శ్రీనివాసన్ క్రిమినల్ లాయర్. బ్రిటిష్ కాలంలో స్వతంత్రం కోసం పోరాడిన మనిషి. కోర్టులో కేసులు వాదించేవాడు. ఇంట్లో స్ట్రిక్ట్. కొడుకు కమల్ ఆరేళ్లకే ‘కలత్తూర్ కన్నమ్మ’ సినిమాకి నేషనల్ అవార్డ్ తెచ్చుకుంటే అందరూ పొగిడారు. కానీ తండ్రి భయపడ్డాడు. ‘ఇది ఆఖరి సినిమా అయితే బెటర్’ అన్నాడు. చదువు అయిపోయేదాకా సినిమా వద్దన్నాడు. కొడుకు తర్వాత ప్రపంచం మెచ్చిన నటుడు అయ్యాడు.‘నాన్నకి నేను అవార్డ్ తెచ్చినా భయమే. ‘చదువు ముఖ్యం’ అన్నాడు. సినిమా అవకాశాలు వస్తున్నా నన్ను స్కూల్కి పంపించేశాడు. ఆ క్రమశిక్షణ వల్లే నేను ప్రతీ సినిమాని స్కూల్ ఎగ్జామ్లా తీసుకున్నా. నాన్న లాయర్. వాదన గెలవడం నేర్పాడు. కానీ జీవితంలో ఓడిపోకూడదని కూడా చెప్పాడు. ఆయన వేసిన కళ్లెం వల్లే నేను ఈరోజు దారి తప్పకుండా ఉన్నా. సినిమాల్లో వేషాలు వేశా కానీ జీవితంలో వేషాలు వెయ్యనివ్వలేదు నాన్న.’– కమల్ హాసన్ జాతీయ ఉత్తమ నటుడుఆపరేటర్ కొడుకు కెప్టెన్ అయ్యాడుపాన్ సింగ్ ధోని ‘మెకాన్ ’ సంస్థలో పంప్ ఆపరేటర్. మధ్య తరగతి జీవితం. కొడుకు మహికి రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం వస్తే హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. జీతం వస్తుంది, రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది అనుకున్నాడు. కానీ కొడుకు బ్యాట్ పట్టుకుని ‘క్రికెట్ ఆడతా’ అంటే వణికిపోయాడు. ‘ఉద్యోగం వదిలేయకు, క్రికెట్ రిస్క్’ అని వారించాడు. కాని కొడుకు మాత్రం ఖరగ్పూర్ స్టేషన్ లో టికెట్లు చింపుతూ సెంచరీల గురించి కలలు కన్నాడు. తండ్రి భయానికి వైఫల్యం లేని ప్రయాణమే జవాబు అని అనుకున్నాడు. ‘నాన్న నాతో ‘ఉద్యోగం వదలకు’ అన్నాడు. ఆయన భయం నాకు అర్థమైంది. అందుకే క్రికెట్లో అడుగు పెడితే వెనక్కు రాకూడదు అనుకున్నాను. నేను కెప్టెన్ అయ్యాక కూడా నాన్న టీవీ ముందు కూర్చోవడం మానేశాడు. ‘టెన్షన్’ అనేవాడు. వరల్డ్ కప్ గెలిచినా ఇంటికి ఫోన్ చేస్తే ‘సరిగా భోం చేశావా’ అని మాత్రమే అడిగాడు. నా సిక్సర్ల కంటే నా ఆరోగ్యం ఆయనకు ఎక్కువ. నాన్న పంప్ ఆపరేటర్. నీళ్లు సమంగా ఎలా ఇవ్వాలో తెలుసు. నేను టీమ్ని సమంగా అలాగే తీర్చిదిద్దడం నేర్పాడు.’’– ఎం.ఎస్. ధోని క్రికెట్ దిగ్గజంకూలి తండ్రి కూతుర్ని ఛాంపియన్ చేశాడుమంగ్టే తోన్పా కోమ్ మణిపూర్లో ఒక పేద వ్యవసాయ కూలీ. రోజు సంపాదనతోనే ఇల్లు గడిచేది. కూతురు మేరీ కోమ్ బాక్సింగ్ రింగ్లోకి వెళ్తుంటే మొదట భయపడ్డాడు. దెబ్బలు తగిలితే భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళన చెందాడు. కానీ కూతురిలోని పట్టుదల చూసి తన కష్టాన్ని మర్చిపోయాడు. ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా, కిట్ కొనడానికి డబ్బుల్లేకపోయినా అప్పులు చేసి మరీ ఆమెను ప్రోత్సహించాడు. కూతురు ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్ అయ్యింది. ఒలింపిక్ మెడల్ తెచ్చింది. ‘నేను పంచ్ కొడితే నాన్న పొలంలో చెమట కార్చాడు. ఆడపిల్ల బాక్సింగ్ ఏంటి అన్న సమాజంతో నా కోసం పోరాడాడు. నా గెలుపు కోసం ఆయన పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. నాన్న నాకు బాక్సింగ్ నేర్పలేదు, బతకడం నేర్పాడు. రింగ్లో దెబ్బలు తిన్నా లేచి నిలబడడం ఆయన కష్టాన్ని చూసే నేర్చుకున్నా.’– మేరీ కోమ్, బాక్సింగ్ ఛాంపియన్సూపర్ స్టార్ వెనుక సామాన్య కానిస్టేబుల్రామోజీరావ్ గైక్వాడ్ బెంగళూరు పోలీస్ శాఖలో ఒక సాధారణ కానిస్టేబుల్. ఖాకీ యూనిఫామ్ వేసుకుని, నిబద్ధతతో డ్యూటీ చేస్తూ సాదాసీదా జీతంతోనే నలుగురు పిల్లల ఇంటి బరువును మోశాడు. కొడుకు శివాజీరావ్ (రజనీకాంత్) చదువు పూర్తి కాకుండానే కుటుంబ పరిస్థితుల వల్ల బస్సు కండక్టర్గా చేరాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి ప్రపంచం మెచ్చిన ’సూపర్ స్టార్’ అయ్యాడు. కోట్ల రూపాయల సంపాదన, కీర్తి తలుపు తట్టినా.. ఆ తండ్రి మాత్రం జీవితాంతం ఎంతో సాదాసీదాగా, ఒక సాధారణ కానిస్టేబుల్లానే బతికాడు. కొడుకు స్టార్డమ్ని చూసి మురిసిపోయాడే తప్ప, ఎప్పుడూ ఆ గ్లామర్ లోకంలోకి అడుగుపెట్టలేదు. ‘నాన్న ఒక నిజాయితీ గల కానిస్టేబుల్. నేను ఈరోజు ప్రపంచం మెచ్చిన నటుడిని కావచ్చు, కానీ నా దృష్టిలో నాన్నే రియల్ హీరో. ఎందుకంటే ఆయన జీవితంలో ఒక్క సీన్ కూడా యాక్టింగ్ లేదు, అంతా నిజాయితీ. నేను ఎంత ఎదిగినా ఆ కానిస్టేబుల్ కొడుకుననే క్రమశిక్షణే నన్ను దారి తప్పకుండా ఉంచింది. నా మొదటి అభిమాని, నా చివరి గురువు మా నాన్నే.’– రజనీకాంత్, ఫాల్కే గ్రహీతఆయనే ఆదర్శంమా నాన్న గారితో నాకు అనేక జ్ఞాపకాలున్నాయి కానీ అన్నింటికన్నా ఈ జ్ఞాపకమే ఇప్పుడు తలచుకున్నా ఆయనని మహోన్నతంగా మా ముందు నిలబెడుతుంది. అది 1982–83 మధ్య జరిగిన ఓ అనుకోని సంఘటన. విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య ఒక పెద్ద ఉద్యమం, ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. ఆ సందర్భంలో మా నాన్న సౌందర్యరాజన్ చీఫ్ వార్డెన్ గా ఉండగా, కొంతమంది విద్యార్థులు ఆవేశంలో మా ఇంటిపై దాడి చేశారు. పోలీసులు మా ఇంటికి వచ్చి కేసు నమోదు చేయమంటే నాన్న మాత్రం ‘వద్దు.. వారు కూడా మన పిల్లలే. తెలియక ఒక తప్పు చేశారు. మళ్లీ కేసు పెడితే వాళ్ల భవితవ్యం దెబ్బతింటుంది’ అని సున్నితంగా తిరస్కరించారు. మరుసటి రోజు దాడికి పాల్పడ్డ యువకులు మా ఇంటికి వచ్చి పశ్చాత్తాపంతో ‘మీలాంటి చీఫ్ వార్డెన్ మాకు దొరకడం మా అదృష్టం... కేసు నమోదయ్యుంటే మా భవిష్యత్ దెబ్బతినేది’ అని క్షమాపణ చెప్పి వెళ్లిపోయారు. ఇటీవల ఒక ఉన్నతస్థాయి పోలీసు అధికారి మా నాన్నగారిని కలిసి నమస్కరించడానికి వచ్చినప్పుడు, నన్ను పక్కకు పిలిచి ‘అప్పుడు మీ నాన్నగారు మా మీద కేసు పెట్టి ఉంటే నేను ఈరోజు ఉన్నతస్థాయి అధికారిగా మీ ముందు నిలిచి ఉండే వాడిని కాను’... అని కళ్లు తుడుచుకుని వెళుతుంటే మా నాన్నని తలచుకుని మనసులోనే ఆ మహనీయునికి నమస్కరించుకున్నాను.ఎం.వి. రంగ రాజన్, చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులుఆయన వ్యక్తిత్వమే వారసత్వంమా నాన్న పీవీశర్మ ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పని చేసేవారు. ఆయనకు బతకడం చేతకాదని అందరూ అనేవారు. అంటే వారి అర్థం డబ్బు, ఆస్తులు సంపాదించడం చేతకాదని. కాని వ్యక్తిత్వాన్ని చంపుకుని, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడితే పోగయ్యే సంపదలో సంతృప్తి ఉండదు.. అలా సంపాదించిన వారికి లేని మనఃశాంతి నాకు అంతులేనంత ఉందని అనేవారాయన. తెలుగు సాహిత్యంపై ఆయనకున్న ప్రేమే నాకూ అబ్బింది. ఇంగ్లీష్ లిటరేటర్ అన్నా ఆయనకు అమితమైన అభిమానం. ఆ అక్షరాభిమానం నాకు ఆర్థిక బలాన్నివ్వకపోయినా, నైతిక స్థిరత్వాన్ని, స్థైర్యాన్నిచ్చాయి. అందరికీ పొలాలు, స్ధలాలు వారసత్వంగా వస్తాయి నాకు మాత్రం మా నాన్న వ్యక్తిత్వం వారసత్వంగా వచ్చింది. అదే నన్ను రచయిత్రిగా మలిచింది.మణి వడ్లమాని రచయిత్రితొలిగురువు నాన్నే..!మా నాన్న కుత్తుం తాతారావు మూడో తరగతి వరకు చదివాడు. అయితేనేం... ఆయనకు అక్షరం మీద మమకారం ఎక్కువ. ఊరికి ఏ ఉత్తరం వచ్చినా ఆయన చేతికే ఇచ్చి చదివించేవారట. ఇంట్లో నలుగురు అన్నదమ్ములం. అమ్మ హేమావతి. నాన్న నిత్య కష్టజీవి. కానీ ఏ కష్టాన్ని మాదాకా రానివ్వలేదు. వ్యవసాయకూలి పనులతోపాటు అన్ని రకాల పనులకు వెళ్లేవాడు. ఎండాకాలం వస్తే సేద్యం తక్కువ. పనులు దొరకవు. అయితే గడ్డితో నేసే పూరిళ్ల నేతలో మా నాన్న చేయి తిరిగిన మనిషి. ఎర్రని ఎండకు పని చేసి సాయంత్రం అయ్యాక మా అమ్మ దగ్గరకొచ్చి ఇదిగో కూలీ డబ్బులంటూ ఇచ్చేవాడు. ఆ డబ్బులతోనే మా అమ్మ సరుకులు కొనేది, సంతలో మాకు బట్టలు కొనేది. మా నాన్న ఎప్పుడూ చిరిగిన బనియన్, లుంగీతోనే కనిపించేవాడు. మాకు సంతలో హవాయి చెప్పులు కొనిచ్చి ఆయన మాత్రం పాత టైరుతో చేయించుకున్న చెప్పులు వేసుకునేవాడు. అలా మా నాన్నని చూస్తున్నప్పుడు ఆయన చెప్పిన గొప్పగొప్ప వాళ్ల మాటలు గుర్తొస్తాయ్...‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగాని, మంచి పుస్తకం కొనుక్కో’అని..ఒక్క కందుకూరి మాత్రమే కాదు, మేము ఇంకా బడి మొహం కూడా చూడకముందే శ్రీశ్రీ, గురజాడ, గరిమెళ్ల సత్యనారాయణ లాంటి మహాకవులు రాసిన ఎన్నో పద్యాలను అలవోకగా చదివి, అర్థం చెప్పేవాడు. అందుకే మా నాన్నే మాకు తొలి గురువు. 2001లో నేను ఆర్మీలో చేరాను. నా తర్వాత మా తమ్ముడు కూడా ఆర్మీలో చేరాడు. మరో ఇద్దరు ఉపాధ్యాయులయ్యారు. ఒకరోజు నేను ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తీవ్రమైన కడుపునొప్పితో నాన్న గారు చనిపోయారన్న చేదు వార్త వినాల్సి వచ్చింది. ఆయన లేని లోటును మేమెన్నటికీ భర్తీ చేయలేం ఆయన చూపిన దారిలో నడవడం తప్ప.కుత్తుం తాతారావు, వినోద్ కుత్తుం మాజీ సైనికోద్యోగినిర్వహణ: శ్రావణ్ జయ -
అత్యంత స్టైలిష్ డిజైనర్వేర్లో మమ్దానీ భార్య రామా దువాజీ..!
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉగాండ-భారత సంతతికి చెందిన 34 ఏండ్ల జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయస్సులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించడమే కాదు అటు న్యూయార్క్ నగర ప్రజలను కూడా ఆశ్చర్యపరిచిన వ్యక్తి. అలాంటి మామ్దానీ తన భార్యతో కలిసి చాలా అరుదుగా బహిరంగ కార్యక్రమాలకు హాజరవ్వుతారు. ఇటీవల నిక్స్ ఎన్బీఏ ఛాంపియన్షిప్ వేడుకకు దంపతులిరువురి హాజరయ్యే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ వేడుకలో మమ్దానీ భార్య రామా దువాజీ CFDA ఫ్యాషన్ ఫండ్ ఫైనలిస్ట్ మిస్ క్లైర్ సుల్లివన్ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను ధరించారు. ఆమె ఫ్యాషన్ ఎంపిక న్యూయార్క్ నిక్స్ జట్టు(బాస్కెట్బాల్ టీమ్) స్ఫూర్తినిచ్చింది. వన్-షోల్డర్ పెప్లమ్ టాప్ను నల్లటి స్కర్ట్తో జత చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే..డిజైనర్ క్లైర్ ఒక నకిలీ వస్తువుల విక్రేత నుంచి సేకరించిన వివిధ రంగులలోని నిక్స్ షర్టుల నుంచి రూపొందించారు. ఆ లుక్ చాలా స్టైలిష్గా ఉండటమే కాకుండా..ఒక న్యూయార్క్ డిజైనర్ టాలెంట్ని ప్రమోట్ చేసింది. ఇది పర్యావరణ అనుకూలమైనది. దువాజీ తన దుస్తులకు నైక్ ఎయిర్ రిఫ్ట్ చెప్పులను జతచేశారు. అలాగే నారింజ రంగు పామ్-పామ్ చెవిపోగులతో స్టైలిష్గా కనిపించారు. దువాజీ బహిరంగంగా కనిపించిన ప్రతిసారి తన విలక్షణమైన ఫ్యాషన్తో ఆకట్టుకుంటారామె. గతంలో కూడా ఆమె నవంబర్4, 2025న మమ్దానీ ఎన్నికల్లో గెలుపొందినప్పడూ కూడా పాలస్తీనియన్-జోర్డానియన్ డిజైనర్ రూపొందించిన లేజర్-కట్ డెనిమ్ టాప్తో ఆకర్షణీయంగా కనిపించారు. కాగా, ఇక మమ్దానీ కూడా ఈ వేడుకలో తన సూట్ జాకెట్ కింద జోష్ హార్ట్ జెర్సీని ధరించి నిక్స్ స్ఫూర్తిని ప్రతిబింబించారు.(చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..) -
మిస్ వరల్డ్ పోటీల్లో చీర ధరించిన అందాల రాణి ఎవరో తెలుసా..!
అందాల పోటీలు అనగానే ఠక్కున సుస్మీతా సేన్, ఐశ్వర్యరాయ్ గుర్తొస్తారు. 1994 ఏడాదిలోనే రెండు ప్రతిష్టాత్మక టైటిల్స్ని ఈ ఇద్దరూ అందాల తారలు గెలుచుకుని భారత్కి గర్వకారణంగా నిలిచారు. కానీ వీరిద్దరి కంటే ముందే భారతదేశాన్ని ప్రపంచపటంపై నిలిపేలా భారతీయ హస్తకళల గొప్పతనాన్ని చాటిన మరొక అందాల తార ఉన్నారు. ఆమె గురించి మీకు తెలుసా అంటూ మిస్ ఇండియా ఆర్గనైజేషన్ అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేసింది. ఇంతకీ ఎవరా అందాల తార అంటే..ఆ అందాల తార కర్మిందర్ కౌర్ విర్క్. మిస్ ఇండియా ఆర్గనైజేషన్ భారతదేశం అంతర్జాతీయ కిరీటంను గెలుచుకునే స్వర్ణయుగానికి ముందే..భారతీయ హస్తకళా నైపుణ్యాన్ని ప్రపంచం గుర్తించేలా చేసిన ఒక అందాల రాణి ఉన్నారు అంటూ ఆమె గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది. "1993 మిస్ వరల్డ్లో, ఫెమినా మిస్ ఇండియా విజేత కర్మిందర్ కౌర్ విర్క్, అందంగా చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చీరతో ఉత్తమ జాతీయ దుస్తుల అవార్డును గెలుచుకున్నారు. అనేక దుస్తులను ఆ రోజు అత్యద్భుతంగా ప్రదర్శిస్తున్న తరుణంలో ఈ ముద్దుగుమ్మ కర్మిందర్ ఈ చీర కారణంగా భారతదేశం వేదికపై ప్రత్యేకంగా నిలవడం విశేషం. అంతేగాదు అంతమంది అందాల భామల డిజైనర్వేర్ల ముందు భారతీయ వారసత్వం, హస్తకళా నైపుణ్యం ప్రామాణికత ఎంత శక్తిమంతమైందో నిరూపితమైంది. మా అందాల పోటీల చరిత్రలో మర్చిపోయిన ఒక అధ్యయం, కానీ దానిని గుర్తుచేసుకున్నందుకు తాము గర్విస్తున్నాం." అని పోస్ట్లో పేర్కొంది మిస్ ఇండియా ఆర్గనైజేషన్.ఆమె ధరించిన చీర ప్రత్యేకత..కర్మిందర్ ధరించిన చీర లెహంగా. భారత దేశపు రాజరిక వారసత్వానికి ప్రతీకగా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు. దట్టమైన జరీ, బ్రోకేడ్, అద్దాల పనితో కూడిన వస్త్రాలు. బరువైన చెవిపోగులు, ఉంగరాలు, నడుముకు కట్టిన పట్టి వంటి సాంప్రదాయ ఆభరణాలు జత చేయడంతో ఆ ప్రపంచ వేదికపై ఆమె రూపం ముగ్ధమనోహరంగా ఆవిష్కృతమైంది. ఈ వస్త్రాలను భారతీయ హస్తకళా నైపుణ్యాన్ని సాంస్కృతికతను ప్రదర్శించేలా అందంగా తీర్చిదిద్దారు.ఎవరీమె..?ప్రపంచ అందాల పోటీల నిర్వాహక సంస్థ ప్రకారం..1994లో న్యూయార్క్ నగరంలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్వైడ్ పోటీలో, ఫెమినా మిస్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన కర్మిందర్ కౌర్ విర్క్ విజేతగా నిలిచారు. ఆమె మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, ఉత్తమ జాతీయ దుస్తుల పురస్కారాన్ని కూడా గెలుచుకున్నారు. ఆమె 1994లో ఐశ్వర్య రాయ్కు మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని కూడా అందించారు. ఆ కాలంలో అగ్రశ్రేణి మోడల్ అయిన కర్మిందర్, సోనీ టీవీలో ప్రసారమైన 'చార్లీస్ ఏంజిల్స్' ఆధారంగా రూపొందించిన 'సి.ఎ.టి.ఎస్.' అనే టీవీ సీరియల్లో కూడా నటించారు. ఆమె సునీల్ శెట్టి నటించిన 'పృథ్వీ', 'శాస్త్ర' వంటి కొన్ని బాలీవుడ్ మూవీలలో కూడా నటించారు. వివాహం తర్వాత కర్మిందర్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్ తీసుకోవచ్చా? ఎందుకంటే..) -
ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..
బరువు తగ్గడం అంటే స్ట్రిక్ట్ డైట్, కఠినతరమైన వ్యాయామాలు అనే భావిస్తారు. ఈ వెయిట్లాస్ జర్నీని భారం, అలసటతో కూడిన కష్టసాధ్యమైన సవాలుగా భావిస్తారు. దాంతో కొంత వరకు చేసి మధ్యలో స్వస్తి పలుకుతారు. ఫలితంగా అధిక బరువు తగ్గించుకోలేకపోతున్నాం అంటూ నిరాశనిస్ప్రుహలకు లోనవ్వుతుంటారు. ఆవిధంగా కంటే నిధానంగా శరీరం అలసటకు లోనవ్వకుండా మెరుగైన ఫలితాలు పొందాలంటే ఆ నాలుగు రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అంటోంది కంటెంట్ క్రియేటర్ సుల్లివన్ డ్రేపర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ సుల్లివన్ డ్రేపర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో సులభంగా బరువు తగ్గడం ఎలాగో పంచుకున్నారు. బరువు తగ్గడం అంటే వీలైనంత తక్కువ తినడం, కాదు, అలసిపోయేంత వ్యాయామాలు చేయడం అస్సలు కాదని అంటోందామె. ఇక్కడ లక్ష్యం బరువు తగ్గడం ఒక్కటే కాదు..మొత్తం ఆరోగ్య శ్రేయస్సు అని గ్రహించమని చెబుతోంది. అందుకే సులభంగా ఇష్టపూర్వకంగా బరువు తగ్గమని పిలుపునిస్తోందామె. అలా చేసే..పొట్టిగా ఉండే తానే తొమ్మిదికేజీల వరకు తగ్గానని చెబుతోంది. తాను ఇది కఠినమైన డైటింగ్లు, తీవ్రతతో కూడిన వర్కౌట్లు చేయకుండానే సాధించానని చెబుతోంది. అందుకోసం ఈ నాలుగు రూల్స్ని పాటించానని వీడియోలో తెలిపారువెయిట్ ట్రైనింగ్కు ప్రాధాన్యత ఇవ్వడంసుల్లివన్ ప్రకారం, వర్కౌట్ తర్వాత అలసిపోతున్నాననే భావనను వెంబడించడం మానేసి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్పై దృష్టి పెట్టడం ప్రారంభించినప్పుడే అతిపెద్ద మార్పు వచ్చింది. "కండరాలను పెంచుకోవడం తోటే ఆ టోన్డ్ లుక్ను ఇస్తుందని ఆమె వివరించారు.కండరాలను కాపాడుకోవడం వల్ల కాలక్రమేణా సన్నగా ఉండటం సులభం అవుతుందని, ఎందుకంటే కండర ద్రవ్యరాశికి మద్దతు ఇవ్వడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుందని ఆ కంటెంట్ క్రియేటర్ తెలిపారు. ప్రతిరోజూ వీలైనన్ని ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ప్రయత్నించే బదులు, ఆమె బలంగా మారడంపై దృష్టి పెట్టారు.కేలరీల లోటును ఆపడంఆమె పోస్ట్లోని అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి ఆమె ఆహారం తీసుకునే విధానం. తాను కేలరీ లోటుని ఇష్టపడనన్నారు. ఎక్కువ కాలం కేలరీల లోటులో ఉండటం వల్ల ప్రజలు అలసిపోయినట్లు అనిపించి, వారి ఫలితాలను నిలబెట్టుకోవడం కష్టతరం అవుతుందని అంటోంది. అందుకే తాను శరీరంలోని కొవ్వును కోల్పోయిన తర్వాత, ఆమె రివర్స్ డైటింగ్ విధానాన్ని అనుసరించానని, ప్రోటీన్ వినియోగాన్ని ఎక్కువగా ఉంచుతూ నెమ్మదిగా తన కేలరీల తీసుకోవడాన్ని పెంచుతానని చెప్పారు.వాకింగ్..తీవ్రమైన వర్కౌట్లు తరచుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ, సుల్లివన్ సాధారణ కదలికల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రోజువారీ నడకలు,తక్కువ-తీవ్రత గల కార్డియో తన శక్తి స్థాయిలను పెంచడానికి, ఆకలిని నియంత్రించడానికి, మొత్తం ఫిట్నెస్కు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయని అన్నారు. ప్రతిరోజూ కఠినమైన వర్కౌట్ దినచర్యలపై ఆధారపడకుండా, ఆమె నడకను ఒక సాధారణ అలవాటుగా మార్చుకున్నారు.తరుచుగా వెయిట్ చెక్ చేయొద్దు..చాలా మంది వెయిట్ మిషన్పై చిన్న మార్పులను చూసి వెంటనే తాము కొవ్వు పెరిగామని అనుకుంటారు. బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయి. అంతమాత్రాన కొవ్వు పెరగడం కాదని అంటున్నారామె. ఆమె ఇప్పుడు ఒక ఖచ్చితమైన సంఖ్యపై దృష్టి పెట్టడానికి బదులుగా, ఆరోగ్యకరంగా బరువు తగ్గడమే తన లక్ష్యంగా నిర్ణయించుకున్నాని చెప్పారామె.ఇక్కడ సుల్లివన్ డేపర్ ప్రయాణం చిన్న, నిలకడైన అలవాట్లు దీర్ఘకాలంలో బరువు నిర్వహణను ఎంత సులభతరం చేస్తాయో తెలియజేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి..స్మార్ట్గా మారే ప్రయత్నం చేయండి మరి.. View this post on Instagram A post shared by sullivan draper (@sullivan.draper)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..! కానీ ఆ ఐదు పొరపాట్లు..) -
ఫీజు కోసం ఎద్దుని అమ్మి...
కాలం వక్రిస్తే ఓడలు బళ్లవుతాయి అంటారు. ఆ మాట మా కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. వారసత్వంగా వచ్చిన 300 ఎకరాల భూమి అకస్మాత్తుగా ఆవిరైపోతే..? బెదరకుండా పరిస్థితులకు బెదిరిపోకుండా మొండితనంతో వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు మా నాన్న లక్షీనరసింహరావు. అది 1972 తీవ్రమైన కరువు..ఇంట్లో అమ్మతో పాటు నేను నా ఇధ్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. ఆకలి మంటలు మొదలయ్యాయి.వరి గింజ లేక వణుకు పుట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో దేవదారు ఆకులు తినిపించి మా ప్రాణాలను కాపాడాడు మా నాన్న..పొద్దున్నే 4 గంటలకు నిద్రలేచి కూలి పనులకు వెళ్లడం, వ్యవసాయాన్ని చూసుకోవడం కాస్త సమయం ఉంటే మాతో గడపడం. రోజుకి 18 గంటలు పొలంలోనే గడిపేసిన రోజులు లెక్కలేనన్ని.. అయినా ఎప్పుడూ ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. మా చదువుల్ని మాన్పించలేదు. ఏది కావాలన్నా వెనకడుగు వేయలేదు.కాని నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చింది. కరువు పరిస్థితులు ఇంకా కుదురుకోలేదు.. ఇంట్లో దమ్మిడీ లేని పరిస్థితి. చదువుకి ఇక స్వస్తి చెప్పినట్టేనని అనుకున్నా. కాని మా నాన్న చేసిన పనిని నేను జీవితంలో మరిచిపోలేను. అసలే కరువు పరిస్థితులు, అప్పు కూడా పుట్టని రోజులు, ఉన్నవే రెండు కాడెద్దులు..అందులో ఒక ఎద్దుని 370 రూపాయలకు అమ్మేశాడు మా నాన్న.. 170 పరీక్ష ఫీజు పోను మిగిలిన 200 రూపాయలతో మరొక బక్క ఎద్దుని కొన్నాడు.దాన్ని కాస్త మేపి కాడి దున్ని వ్యవసాయం చేద్దామని అనుకున్నాడు. కాని వారం తిరక్కముందే అది కాస్తా చనిపోయింది. మా నాన్న ఆశ తిరగబడింది. అసహనం, అశక్తత ఆవహిస్తే ఏ మనిషైనా కుంగిపోక తప్పదు కాని మా నాన్న మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మరింత కష్టపడ్డాడు. పరిస్థితులు అనుకూలించాయి. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈరోజు నేను నా తమ్ముళ్లు, చెల్లెలు అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో రాణించినా, మా వంశ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చినా అదంతా కష్టాలకు వెన్నుచూపని మా నాన్న గుండె చలవే. - జగపతిరావు విశ్రాంత అధ్యాపకులు, మహబూబ్నగర్ జిల్లాతండ్రి లక్షీనరసింహారావు---పచ్చ ఇంకు కలం సాకారమైంది!మా స్కూల్ హెడ్మాస్టర్ జేబులో ఓసారి పచ్చ ఇంకు పెన్ను చూసి మా నాన్న ఏదో ఒకరోజు నువ్వు కూడా అలాంటి పెన్ను జేబులో ఉంచుకునే స్థాయికి వెళ్లాలిరా అన్నాడు. ఆయన చదువుకోలేదు.. కాని ఆయన బిడ్డ మాత్రం అందరూ గౌరవించే స్థాయిలో ఉండాలన్నదే ఆయన ఆశ. అదే నాలో పట్టుదల రేకెత్తించింది. అహర్నిశలు శ్రమించేలా చేసింది.ఈ లక్షణం కూడా మా నాన్న భవనం వెంకటేశ్వర్లు నుంచి వచ్చిందే. అర ఎకరం భూమి మాత్రమే వారసత్వంగా వచ్చినా చెమటోడ్చి వ్యవసాయం చేసి 30 ఎకరాల ఆసామిగా మారాడు మా నాన్న. ఆయనే నాకు తొలి గురువు. 21 ఏట ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చేరినా, నాన్న చెప్పిన మాట మాత్రం మర్చిపోలేదు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడి హోదాను పొందాను. మా నాన్న కలను సాకారం చేశాను. ఆయన సేవా గుణాన్ని స్పూర్తిగా తీసుకుని 24 లక్షల వెచ్చించి పాఠశాలను అభివృద్ధి చేశాను.- భవనం బద్రిరెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, వేటపాలెం, బాపట్లతండ్రి భవనం వెంకటేశ్వర్లు -
నరకలోకంలో... భూలోక ఎంట్రెన్స్ టెస్ట్ (బీ.ఈ.టీ)!
నరకలోకవాసులకు బీ.ఈ.టీ (భూలోక ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహించారు. జూనియర్, సీనియర్లు అనే తేడా లేకుండా అందరూ ఈ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో పాసైతే... భూలోకంలో కొంతకాలం పాటు సకల సౌకర్యాలు అనుభవించే అపురూప అవకాశం వస్తుంది. అందుకే... ఈ పరీక్ష అంటే అంత క్రేజ్! ఆ పరీక్షలో వచ్చిన రెండు కీలక ప్రశ్నలు...∙∙ ‘డియర్ నరకవాసీ, ఈ క్రింది ప్రశ్నకు జవాబు వ్రాయుడి. మార్కులు: 10’అనగనగా ఒక అప్పారావు. ఇతడు ఒకరోజు ఊరి చివర చెరువు దగ్గర విషాదంగా కూర్చున్నాడు.దారిన పోయే దానయ్య...‘ఏమిటిరా అప్పీ....ఏడుస్తూ కూసున్నవు?’ అని అడిగాడు.‘ఈరోజు మా ఆవిడ బర్త్డే’ అన్నాడు అప్పారావు.‘మీ ఆవిడకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలిగానీ, ఇలా ఏడుస్తూ కూర్చుంటారా?’ అన్నాడు దానయ్య.‘ఇచ్చాను కదా!’ కోపంగా అన్నాడు అప్పారావు.‘ఏమిచ్చావు?’ అడిగాడు దానయ్య.‘చైన్ ఇచ్చాను. ఇచ్చానో లేదో చీపురు కట్ట అందుకొని ఇంట్లో నుంచి తరిమి కొట్టింది’ ఆవేదనగా అన్నాడు అప్పారావు.ప్రశ్న:∙ ‘బర్త్డే కానుకగా భార్యకు చైన్ కొనివ్వడం తప్పు కాదు కదా! మరెందుకు అప్పారావు భార్యకు అంత కోపం వచ్చింది?’∙∙ రెండో ప్రశ్న: మార్కులు: 15’అలా అయితే నాకు నరకమైనా స్వర్గమే’ అన్నాడు దేవడోస్.అతడు అలా అనడానికి కారణం ఏమిటో క్లుప్తంగా వివరించండి.∙∙ భూలోక ఎంట్రెన్స్ పరీక్షలో దబ్బనూరు అబ్బయ్యకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పై రెండు ప్రశ్నలకు అతడు రాసిన జవాబులు...∙మొదటి ప్రశ్నకు జవాబు:భార్య బర్త్డేకు అప్పారావు ఇచ్చింది గోల్డ్ చైన్ కాదు. కనీసం రోల్డ్ గోల్డ్ చైన్ కూడా కాదు. అతడు ఇచ్చింది సైకిల్ చైన్! అందుకే ఆమె అంత కోపం వచ్చింది.∙రెండో ప్రశ్నకు జవాబు:దేవడోస్ ప్రతిరోజులాగే లిక్కర్ షాప్ నుంచి ఫుల్బాటిల్ తీసుకొని ఇంటికి వెళుతున్నాడు. అతడికి దారిలో ఒక పెద్దాయన ఎదురుపడి...‘ఏమయ్యా... రోజూ పీపాలకు పీపాలు తాగుతున్నావు. తాగిన వారు నరకానికి పోతారనే విషయం తెలియదా నీకు?’ అన్నాడు.‘నా సంగతి సరే, మందు అమ్మే పీపారావు నరకానికి వెళతాడా?’ అని అడిగాడు దేవ్డోస్.‘యస్’ అన్నాడు పెద్దాయన,‘బార్ ముందు చికెన్ కబాబులు, గుట్కా, సిగరెట్ ΄్యాకెట్లు అమ్మే శీనయ్య వెళతాడా?’ అని అడిగాడు దేవడోస్.‘యస్’ అన్నాడు డోస్.‘రోజూ నాకు మందు పార్టీలో కంపెనీ ఇచ్చే రమేష్, వెంకటేషం, రాజు కూడా వెళతారా?’ అని అడిగాడు దేవడోస్.‘యస్’ అన్నాడు పెద్దాయన.‘నేను నరకానికి వెళితే ఏం! నాకు ఇష్టమైన ఇంతమంది వ్యక్తులు నాతో ఉన్నప్పుడు అది నరకమైనా నాకు స్వర్గమే!’ అని బాటిల్ మూత తీశాడు దేవడోస్. – యాకుబ్ పాషా -
నా సరస్వతిరేఖ మా నాన్న!
మా నాన్న గోరటి నర్సింహ చిన్న రైతు. చెరువు శికం భూమి ఎకరా, భూదాన ఉద్యమం వల్ల వచ్చిన భూమి ఎకరా, పొత్తుల మాన్యం అర ఎకరా... ఆయన ఆస్తి. ఆ రెండున్నర ఎకరాల్లో సేద్యం చేసేవాడు. ఆ తర్వాత ఎప్పుడో కోమట్ల సలహాతో మరో మూడెకరాలు కొని ఐదున్నర ఎకరాల రైతు అయ్యాడు. మా నాన్న భూమమ్మకు కష్టం చేస్తూ బతికాడు. మా ఊర్లో బావులు తవ్వినప్పుడు తేమ కనపడితే అది నీటి జల కాదు మా నాన్న ఓడ్చిన చెమట అనుకునేవాణ్ణి. జొన్నలు, పల్లికాయలు... లేదంటే కుసుమ పంటలు అవి వేసి బతికాడు మా నాన్న. 1971లో పెద్ద కరువు వచ్చి ఊళ్లో పెద్ద పెద్ద ఇళ్లలోనే బియ్యపు గింజలు ఉండేవి కావు. కాని మా ఇంట్లో ఉండేవి. అంత పొదుపుగా బతికారు మా అమ్మ, నాన్న.మా నాన్న యక్షగాన కళాకారుడు. నాటకాలు వేసేవాడు. బడి చదువు లేకపోయినా నాలుగు అక్షరమ్ముక్కలు నేర్చుకున్నాడు. శతక పద్యాలు చెప్పేవాడు. పోతన భాగవతం పలికేవాడు. హరిశ్చంద్రుడి వేషం వేశాడో లేదోగాని హరిశ్చంద్రుడి కంటే నైతికవర్తనుడు. ఆయన నోటిగుండా అబద్ధం పలికినట్టు నేను చూడలేదు. ఉందంటే ఉంది. లేదంటే లేదు. మా నాన్నను ఊళ్లో బహు చక్కని మనిషి అనేవారు. మట్టిలో నుంచి బయల్పడ్డ రంగనాథస్వామి విగ్రహంలా ఉండేది ఆయన రూపం. మితభాషి. ఆయన ఉన్నచోట ఉత్సాహం, ఆనందం ఉండేవి. సందర్భానుసారం హాస్యం పండేది.మా నాన్నకు అంబేద్కర్ తెలియదుగాని చదువు వల్ల బతుకు మారుతుందని తెలుసుకున్నాడు. పిల్లల్ని చదివించాలని పట్టుబడ్డాడు. మేమంతా స్కూలుకు పోతుంటే ఊళ్లో పెద్దలు ‘నువ్వెందుకు ఒక్కడివే కష్టపడతావు. చదువుకొని కొలువుచేసేదుందా. పిల్లల్ని చేతి కిందకు తీసుకో’ అనేవారు. కాని మా నాన్న చదివియ్యాల్సిందే అనుకున్నాడు. నాకు చదువు మీద ధ్యాస లేదు. మా ఊరు (నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గౌరారం గ్రామం)లో తల్లిదండ్రులతో, బంధువుల మధ్య, పశువులు కాచుకుంటూ హాయిగా ఉండాలని ఉండేది. మా ఊళ్లో మూడో క్లాసు దాకానే స్కూలు ఉంటే దుందుభికి అవతలి వైపు రఘుపతిపేట్కు వెళ్లి హాస్టల్లో చేరాలంటే ఏదో విదేశానికి వెళ్లినట్టు ఉండేది. అక్కడకు వెళ్లి హాస్టల్లో చేరి, అర్ధరాత్రిళ్లు దెయ్యాలుంటాయనే నెపం పెట్టి ఏడుస్తుంటే మా నాన్న సాయంత్రం మాఊరి నుంచి రఘుపతిపేట్లోని మా హాస్టల్కు వచ్చి నాకు తోడు పడుకుని మళ్లీ ఉదయాన్నే ఊరికి వెళ్లేవాడు. మమ్మల్ని ఏనాడూ కొట్టింది తిట్టింది లేదు. చలం బిడ్డల శిక్షణ చదవకనే పిల్లల్ని ఎలా పెంచాడో తెలుసుకున్నవాడు. తాను, అమ్మ ముతకబియ్యం తిని మేం హాస్టల్ నుంచి వచ్చినప్పుడు సన్నబియ్యం వండి పెట్టేవారు.నా చిన్నప్పుడు మా ఊరికి ఒక కాశీ బ్రాహ్మణుడు వచ్చి అందరికీ చేయి చూసి ఫలానా ఫలానా అని చెప్పి మా నాన్న చేయి చూశాడు. మా నాన్నతో ‘నీ కొడుకు వెయ్యి రూపాయిల జీతగాడవుతాడు’ అని చెప్పాడు. ఊళ్లో అందరూ పరాచికాలాడారు ఆ మాటకు అయ్యేదా చచ్చేదా అని. మా నాన్న మాత్రం మౌనంగా ఉన్నాడు. ఆయన చదివిస్తే ఎం.ఏ. వరకూ చదివాక నాకు ఉద్యోగం వచ్చింది. జోస్యంలో చెప్పినట్టు వేల జీతం వచ్చింది. మా నాన్న నా ఉద్యోగం చూశాడు. ఎదుగుదల చూశాడు. ఆయన వల్ల నాకు అబ్బిన పద్యం, పాట, గాత్రంతో నేను ఉనికిలోకి రావడం చూశాడు. నేను 49వ ఏట ఉండగా నన్ను విడిచి వెళ్లాడు.ఇప్పటికీ ఆయన ముద్ద ముద్దకూ గుర్తుకు వస్తాడు. ఆనందంలో, దుఃఖంలో, ఆలోచనలో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాతో మాట్లాడుతున్నట్టే ఉంటాడు. నీడ వలే కాపాడుతూనే ఉన్నాడు. ఆయన నాకు దివ్యరూపం. ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మార్గం చూపుతూనే ఉన్నాడు. మా నాన్న చదువు చెప్పించి నా జీవితాన్ని తీర్చిదిద్దినవాడు. ఆయనే నా చేతిలోని సిసలైన సరస్వతిరేఖ. – గోరటి వెంకన్న కవి, వాగ్గేయకారుడు -
పిల్లలు ఉంటేనే వైవాహిక బంధం ఉన్నట్లా..?
పెళ్లైతే పిల్లల్ని కనాల్సిందేనా అనే అంశంపై ఓ 63 ఏళ్ల వ్యక్తి చాలా ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పెళ్లి అవగానే పిల్లలు కనాలని అందరూ చెబుతుంటారు..కానీ ఇది అందరికీ సరిపడే అంశం కాదంటాడు 63 ఏళ్ల కె.ఎఫ్. ఆయన విలియం రోసీ అనే ఇన్ఫ్లుయెన్సర్తో జరిపిన సంభాషణలో ఈ విషయాలను చెప్పుకొచ్చారు. భార్యభర్తలు పిల్లల్ని కంటే సరిపోదు, దానితోపాటే వచ్చే అపారమైన బాధ్యతను గురించి ఎవ్వరూ ఆలోచించరు, చెప్పరు. అందువల్ల పేరెంట్స్గా విఫలమవుతున్నారని అన్నారు కె.ఎఫ్. ముప్పైళ్ల దాంపత్య జీవితంలో తాను తను భార్య ఎంతో సంతోషంగా గడిపామని చెప్పుకొచ్చారు. అయితే తాము ఎప్పుడూ పిల్లలను కనాలని అనుకోలేదని తెలిపాడు. తాము ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంచి తల్లిదండ్రులుగా ఉండగలం అనుకుంటేనే పిల్లలను కనాలని అన్నారు. ముందుగా పిల్లలకు జీవితంలోని సవాళ్లు, వాస్తవాలు గురించి నేర్పించాలి, కానీ తల్లిదండ్రులు భౌతిక సంపాదనపైనే దృష్టిపెడుతున్నారని, అందుకే విఫలమవుతున్నారని అన్నారు. పిల్లల్ని కనడం అంటే.. మంచి ప్రయోజకులుగా తీర్చిద్దిదే బహృత్కార్యంగా అభిర్ణించాడు. అంతేగాదు పిల్లల్నలి పెంచిన విధానమే తల్లిదండ్రుల్ని ప్రతిబింబిస్తుందన్నారు. అలాxo పిల్లలతో పేరెంట్స్ ప్రవర్తించే తీరుని కూడా తప్పుపట్టారు. నాకు లేని సౌకర్యాలు ఇస్తున్నా అనేది చెప్పొద్దు..అవసరానికి మించి డబ్బు ఇవ్వొద్దు, ఇతరుల పట్ల గౌరవంగా మెలిగేలా పెంచండి చాలు అని అన్నాడు. అలా పెంచలేను అనుకుంటే కనొద్దని పరోక్షంగా చెప్పాడు. అలాగే తమ 30 ఏళ్ల వైవాహిక బంధం గురించి కూడా మాట్లాడారు. ఒకరిపట్ల ఒకరికున్న నమ్మకం, నిబద్ధతతే ఇన్నేళ్లు ఇంతలా కలిసిసాగామని అన్నారు. రోజుకు కనీసం ఒక్కసారైన తనను నవ్వించాలి అనుకుంటా..ఇప్పటికీ ఇంద్దరం ఎంతో ప్రేమగా, అన్యోన్యంగా ఉంటామని అన్నారు. నెటిజన్లు పిల్లలు ఉంటేనే వైవాహిక బంధం కాదని చెప్పిన తీరు బాగుందని అన్నారు. అలాగే భార్య నవ్వుతూ ఉండేలా చేస్తానన్న మాట బట్టే అతడేంటో తెలుస్తోందంటూ అభినందించారు. పిల్లలను సరిగా పెంచలేకపోవడం కంటే కనకపోవడమే మేలు అన్న ఆయన మాటలకు మద్దతిస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by William Rossy (@sprouht) (చదవండి: ‘కంపెనీని నిర్మించాను, మారథాన్ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..) -
60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ
ప్రేమలో పడటానికి, ఆత్మీయ నేస్తాన్ని మనసారా జీవితంలోకి ఆహ్వానించడానికి వయసుతో పనేముంది. కొందరు తమ ఇరవైలలోనే తమ సోల్మేట్ను కలుసుకుంటారు. మరికొందరు నిజమైన తోడు కోసం దశాబ్దాల తరబడి వేచి ఉంటారు. కానీ అరవై ఏళ్ల వయసులో అంటే ఎవ్వరూ ఊహించరు కదా. ప్రఖ్యాత నటి సుహాసిని ములేది 60లలో కూడా ప్రేమ దొరుకుతుందని నిరూపించారు. సుహానా సఫర్తో ఇటీవల జరిగిన సంభాషణలో, జాతీయ అవార్డు గ్రహీత సుహాసినీ 60 ఏళ్ల వయసులో తన పెళ్లి గురించి గుర్తుచేసుకున్నారు.“నేను 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. అప్పటివరకు నాకు సరైన జోడి దొరకలేదు. నా భర్త చాలా పేరున్న శాస్త్రవేత్త. ఆయన సైన్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఏమీ అర్థం కాదు, కానీ ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి,” అని తన భర్త గురించి ములే చెప్పుకొచ్చారు. లగాన్, జోధా అక్బర్ వంటి చిత్రాలలో అద్భుత నటనతో ఆకట్టుకుని, అనేక సినిమాల్లో రాణించిన సుహాసిని, ఇక తానెప్పటికీ పెళ్లి చేసుకోలేనేమో ఒంటరిగానే ఉండిపోతానేమే అనుకునేవారట. కానీ విధి మరోలా ఉంది.పేట్ మార్చిన ఫేస్బుక్ మెసేజ్ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా, ఫేస్బుక్లో అనుకోకుండా లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రాజెక్ట్ (LHC) భౌతిక శాస్త్రవేత్త (Physicist) అతుల్ గుర్తు ప్రొఫైల్ రికమండేషన్ కనిపించింది. అరే..భౌతిక శాస్త్రవేత్తలుకూడా ఫేస్బుక్లో ఉన్నారా?’ అనుకున్నారు. తనకు ఎప్పటినుంచో సైన్స్ అంటే ఆసక్తి ఉండటంతో, ఇంకొంచెంఇంట్రస్టింగ్గా అనిపించింది. ‘LHC అంటే ఏంటి?’ అని ఒక మెసేజ్ పంపారు. అంతే అదే ఆమె జీవితాన్ని అందమైన మలుపు తిప్పింది. ఒక్క మెసేజ్వయసు వ్యత్యాసాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, వారిద్దరూ అనేకసార్లు మాట్లాడుకున్నారు. అయితే ఒకరోజు అతుల్ ఆమెకు, "బంధాలను మనమే నిర్మించుకోవాలి; అవి ఆకాశం నుండి ఊడిపడవు" అన్నపుడు పట్ల పూర్తి నమ్మకాన్ని పెంచుకుంది. అయితే, ఆమె నమ్మకాన్ని మరింత బలపరిచిన విషయం ఏమిటంటే, ఆయన తన మొదటి భార్య గురించి రాసిన ఒక వ్యాసం. క్యాన్సర్ బారిన పడ్డ తన భార్య చనిపోయేలోపు ఆమె కోరుకున్న కోరికలన్నీ తీర్చారు. అంతేకాకుండా, ఆమెను సంతోషపెట్టేందుకే ఆమె అనారోగ్య సమస్యను ఆయన ఎంతో సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నారు. ఈ విషయం సుహాసిని దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఆమె హృదయాన్ని కూడా తాకింది.అలా కొన్ని రోజులు ఆన్లైన్లో మాట్లాడుకున్నారు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ చివరిలో ముఖాముఖి కలుసుకున్నారు. అలాగే గుర్తును కలిసి, మాట్లాడిన తర్వాత, తన కూతురు సరైన ఎంపిక చేసుకుందని ఆమె తల్లికి నమ్మకం కలిగిందట. అలా సుమారు 75 రోజుల తర్వాత, కుటుంబం అంగీకారంతో 2011 జనవరి 16న వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకథ ఎంత అసాధారణంగా ఉందంటే, పెళ్లి రిజిస్ట్రార్ కూడా ఆశ్చర్యపోయారట. అయితే తన యవ్వనంలో పెళ్లి చేసుకోనందుకు ఎదుర్కొన్న విమర్శల మాదిరిగానే, 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందట. జీవితంలో ఆలస్యంగా ప్రేమను కనుగొనడం తాను పొందిన అత్యంత అందమైన అనుభవాల్లో ఒకటిగా నిలిచిందంటారు సుహాసిని. సామాజిక ఒత్తిళ్లకు లొంగిపోయో, వయసు పెరుగుతోందనో ఏవరో చెప్పారనో జీవితంలో అతి ముఖ్యమైన సంబంధంలోకి జారిపోకుండా, నిజాయితీగా ఇరు మనసులు కలిసిన నిష్కల్మషమైన ప్రేమే మిన్న అని చాటి చెప్పారు. ఎవరీ సుహాసినీ ములేసుహాసిని ములే హిందీ, మరాఠీ, అస్సామీ చిత్రాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్లో నటించారు. నటనతో పాటు, ఆమె డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో, ఆమె మొత్తం ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నారు. సుహాసిని ములే 1950 నవంబర్ 20న బిహార్లోని పాట్నాలో మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే ఆమె తండ్రి మరణించారు. 1965లో, పియర్స్ సబ్బు ప్రకటన కోసం సుహాసిని ములే మోడల్గా ఎంపికయ్యారు. ఈ ప్రకటనను చూసిన తర్వాత, ప్రముఖ చిత్ర దర్శకుడు మృణాల్ సేన్ తన చిత్రం భువన్ షోమ్ (1969)లో ఆమెకు ఒక పాత్రను అందించారు.అలా మొదలైన ఆమె నటనా ప్రస్తానం ఎన్నో విజయవంతమైన పాత్రలు, అవార్డులు, రివార్డులతో అద్వితీయంగా సాగింది. -
హఠ యోగా అంటే..? అమెరికన్లు ఇష్టపడటానికి కారణ ఇదేనా..
ఇవాళ ఉరుకుల పరుగుల కాలంలో యోగా మళ్లీ అందరి జీవితంలో భాగమయ్యేలా క్రేజ్ సంతరించుకుంటుంది. ఆధునికంగా జిమ్, ఏరోబిక్ వంటి ఎన్నో రకాల వర్కౌట్లు ఉన్నా ప్రముఖులు, సెలబ్రిటీల వరకు అంతా యోగాకే ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అదీగాక మరి కొద్దిరోజుల్లోనే(జూన్ 21)న యోగా దినోత్సవం పురస్కరించుకుని అమెరికన్లు అంతగా మెచ్చే హఠయోగా గురించి సవివరంగా తెలుసుకుందామా.!. గూగుల్స్ ట్రెండ్స్ డేటా ప్రకారం అమెరికన్లు ఎంత ఇష్టపడే సాధాన హఠ యోగా. ఇది శారీరక భంగిమలు, మైండ్ఫుల్నెస్తో చేసే శ్వాస పద్ధతులను మిళితం చేసే సాంప్రదాయ యోగా. ఇది శరీరం, మనస్సు మధ్య బలమైన బంధాన్ని సృష్టించడంపై దష్టిసారించడం వల్లే ప్రజలు అంతగా ఆకర్షితులవ్వుతారని చెబుతున్నారు ప్రముఖ యోగా నిపుణులు. హఠ యోగా అంటే..హఠ యోగా అత్యంత పురాతనమైన..చాలామంది ఆచరించే యోగా రూపాలలో ఒకటి. సాంప్రదాయకంగా, ఇది ఆసనాలు, శ్వాసవ్యాయామాలు, ధ్యానంతో మిళితమయ్యే యోగా ప్రక్రియ. నెమ్మదైన కదలికలతో ఆసనాల్లో ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుంది. ఈ పేరులోని 'హా', 'ఠ'లను సూర్యచంద్రులకు ప్రతీకలుగా చెబుతారు యోగా నిపుణులు. అందువల్ల ఇది శరీరం-మనస్సు మధ్య ఘర్షణను శాంతపరిచేలా సమతుల్యత తీసుకురావడాన్ని లక్ష్యంగా చేసుకుంటుందట. అమెరికన్లు ఇష్టపడటానికి రీజన్..ప్రారంభకులు సలుభంగా చేయగలిగేలా ఉండటం తోపాటు అధిక తీవ్రత గల ఫిట్నెస్ తరగతులకు భిన్నంగా నెమ్మదైన కదలిక, శ్వాసపై ఫోకస్ తదితరాల వల్ల ఈజీగా చేయగలమనే నమ్మకంతో ఇష్టపడుతున్నారనేది వాదన. కొందరు కఠినమైన వ్యాయమాల కంటే ఇది శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్గా, హెల్దీగా ఉండేలా చేస్తుందని ప్రగాఢంగా విశ్వసించడం మరొక కారణం. అదీగాక ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, నిరాస నిస్ప్రుహలను ఎదుర్కొనడం అధికమవ్వడం వల్లే ఈ హఠ యోగాకి ఆదరణ పెరిగిందని అంటున్నారు యోగా నిపుణులు. కలిగే ఉపయోగాలు..ఏకాగ్రతను పెంచుతుంది. దీనిలోని శ్వాన వ్యాయామాలు భావోద్వేగ పరిస్థితులను హ్యాండిల్ చేసే శక్తిని అందించి ప్రశాంతతను చేకూరుస్తాయి. ఒత్తిడితోకూడని పనివేళలు, డిజిటల్ పరధ్యానంకు చెక్పెట్టే గొప్ప సాధనవర్తమానంలో ఉండగలిగే శక్తిని అందిస్తుంది. ఇది శరీరానికి వ్యాయమానికి మించింది కూడా. ధ్యానానిక పునాదిగా మారుతుంది. ఈ కారణాల వల్లే అమెరికన్లు హఠయోగకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు యోగా నిపుణులు. అక్కడ ఇది ఒక ఫిట్నెస్ ట్రెండ్కి మించిందని చెబుతుండటం విశేషం. యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింది లింక్పై క్లిక్ చేయండి -
90లలోనే అతిలోక సుందరి శ్రీదేవి ఆ ఫ్యాషన్ సాహసం..! ఇవాళ అదే..
ఇవాళ ఫ్యాషన్ రంగం ఏ రేంజ్లో ట్రెండ్స్ని సృష్టిస్తూ..లేటెస్ట్ డిజైనర్వేర్లను తీసుకోస్తుందో తెలిసిందే. యువత సైతం వాటిని అనుకరిస్తూ..సోషల్ మాధ్యమాల్లో సరికొత్తట్రెండ్ని సృష్టిస్తున్నారు కూడా. ఇవాళ ఫ్యాషన్ ప్రమాణాలు ఏ రేంజ్లో అదరగొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ..కుప్పలకొద్ది డిజైనర్లు, క్రియేటివిటీలు అందుబాటులో ఉన్నాయి. కానీ 90వ దశకంలో పరిస్థితి వేరు. అప్పట్లో దేశం తన మూలాలకు కట్టుబడి ఉంటూనే..అంతర్జాతీయ శైలిని అందిపుచ్చుకుని గ్లోబల్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. అందువల్ల ఆ సమయంలో గ్లామర్ ప్రపంచం అందర్నీ ఆకర్షించడం అనేది అత్యంత కష్టమైన సవాలుగా ఉండేది. అయితే అప్పటి ఫ్యాషన్ దిగ్గజాలు ఆ సవాలుని చాలా సర్థవంతంగా ఎదుర్కొన్నారు. వారిలో మన టాలీవుడ్ ముద్దుగుమ్మ, అతిలోక సుందరీ శ్రీదేవి ఒకరు. అవును ఆ నాడు ఫ్యాషన్ నెమ్మదిగా పురుడు పోసుకుంటున్న సమయంలోనే ఆమె అతిపెద్ద సాహసం చేశారు. కానీ ఇవాళ ఆ స్టైల్ ట్రెండీగా మారింది. ఆ కాలంలోనే శ్రీదేవి ఆ ట్రెండ్ని సెట్ చేసిన ఘనత అందుకుందామె. ఏంటో ఫ్యాషన్ స్టైల్, దాని విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.అందుకు సంబంధించిన విషయాలను డిజైనర్ నీతా లుల్లా ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. శ్రీదేవి 1993లో వచ్చిన గోవింద మూవీ కోసం మెటాలిక్ హుడెడ్ డ్రెస్ ధరించారు. అది ఇవాళ సర్వసాధారణం. కానీ 90లలో ఫ్యాషన్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన స్టైల్ ఇది. ఆ దుస్తులను ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా రూపొందించారు. దీన్ని మెటల్ మెష్తో (లోహాపు వల వంటి నిర్మాణంతో) ఒకే లైనింగ్ దీనిని తయారు చేయడం విశేషం. దీని డిజైనింగ్లో ఇదే ప్రత్యేకతని అన్నారు. అందువల్లే తాను ఆ మూవీ షూటింగ్ కోసం చిన్నబ్యాగులో హైదరాబాద్కి తీసుకురాగలిగానని అన్నారామె. అయితే ఎయిర్పోర్ట్లో చూడటానికి చిన్న బ్యాగు..కానీ ఏకంగా 25 గ్రాముల బరువు ఎందుకు తూగుతుందని ఎయిర్పోర్టు అధికారులు అడిగారు. అప్పుడు వారికి ఆ డిజైనర్ వేర్ని ఓపెన్ చేసి..మెటల్తో తయారు చేయడం వల్ల ఇంత బరువు తూగుతోందని వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటూ నాటి సంఘటననను గుర్తు చేసుకున్నారు లుల్లా. ఇదొక్కటే కాదు ఆమో మరో మెటాలిక్ దుస్తులను అప్పట్లోనే ధరించి అప్సరసలా కనిపించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారని ఆ సంఘటననకు కూడా ప్రస్తావించారు. బాలీవుడ్ మూవీ "మిస్టర్ ఇండియా"లో 'హవా హవాయి' పాటలో ఆమె ధరించిన బంగారు వర్ణపు, దుస్తులు అప్సరసను తలపించేలా లుక్ని అందించింది. కేటీ కట్రాక్ రూపొందించిన ఈ దుస్తులలో ప్రత్యేకమైన ఆకృతినిచ్చే టాజిల్స్, కదలికకు అనుగుణంగా ఉండే పూసల పనితనం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే తలపై ధరించిన అలంకారప్రాయమైన, మెరిసే శిరోభూషణం (headpiece) మరింత హైలెట్గా కనిపించింది. ఇప్పుడు అదేస్టైల్ 2022లో అమెరికా బ్యూటీ మొగల్ కైలీ జెన్నర్ అచ్చలం అలానే మెడ, తల చుట్టూ హుడ్లాగా చుట్టుకుని మెరిసే సిల్వర్ మెటాలిక్ దుస్తులను ధరించారు. అక్కడ ఫెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ వింటేజ్ పాకో రబానీ ఈ డిజైనర్వేర్ని డ్యూయల్-టోన్డ్ డెనిమ్స్తో సింపుల్ స్టైలింగ్ను జతచేశారు. ఈ ఇద్దరు అందాల తారల మధ్య అద్భుతమైన పోలిక కనిపిస్తున్నప్పటికీ..ఆమె స్టైలిస్ట్ ఈ లుక్ని శ్రీదేవి లుక్తో పోల్చలేదు కానీ..దశాబ్దాలక్రితమే ఈ స్టైల్ ట్రెండ్ని సెట్ చేశారనేది నమ్మక తప్పని నిజం అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా. View this post on Instagram A post shared by Neeta Lulla (@neeta_lulla) (చదవండి: పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..! కానీ ఆ ఐదు పొరపాట్లు..) -
పీసీఓఎస్తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..!
సాధారణంగా బరువు తగ్గడం అనేది సవాలుతో కూడుకున్నది. అందులోనూ పీసీఓఎస్ అంటే అంత సులభం కాదు బరువు తగ్గడం. అలాంటిది ఈ కంటెంట్ క్రియేటర్ జస్ట్ రెండు నెల్లలోనే ఏకంగా తొమ్మిది కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకోసం తానే ఏం చేసింది? ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యిందో షేర్ చేసుకుంది. మరి అవేంటో చూద్దామా..!.పీసీఓఎస్తో బరువు తగ్గడం అనేది అసంభవం అనిపించే సవాలులా ఉంటుంది. పైగా అందరికీ ఈ సమస్య ఒకేలా ఉండదు. అలాగే అందరికీ సరిపోయే డైటింగ్, వ్యాయామాలు ఉండవు. అలాంటిది కంటెంట్ క్రియేటర్ తాన్య మాత్రం పీసీఎస్ని ఆరోగ్యవంతంగా నిర్వహించుకుంటూనే బరువు తగ్గిందామె. పైగా ఎలాంటి కఠినమైన ఆహార నియామాలు, తీవ్రమైన వ్యాయమాల జోలికి పోకుండా నిలకడగా జీవనశైలి మార్పులను పాటించానని అంటోంది. అంతేగాదు తాను ఎలా బరువు తగ్గిందో కూడా షేర్ చేసుకున్నారామె. ఆమె కేవలం రెండు నెలల్లో 75 కిలోల నుంచి 66 కిలోలు అంటే మొత్తం 9 కిలోలు తగ్గినట్లు పేర్కొంది. అయితే ఇలా పీసీఓఎస్తో బరువు తగ్గే ప్రయత్నంలో తాను ఆ ఐదు తప్పిదాలను చేయకుండా జాగ్రత్తపడ్డానని అంటోంది. అందువల్ల ఇంత సులభంగా బరువు తగ్గానని పంచుకుంది. చేయకూడని తప్పిదాలు..అల్పాహారం మానేయడంతాన్య ప్రకారం, అల్పాహారం మానేయడం తాను చేసిన అతిపెద్ద తప్పులలో ఒకటి. చాలా కాలం పాటు, తక్కువ తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతానని నమ్మేదాన్ని అంటోంది. అయితే, ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంపై దృష్టి పెట్టడం ప్రారంభించాక పరిస్థితులు మారాయని వెల్లడించింది.అంతులేని కార్డియో చేయడంగంటల తరబడి కార్డియో చేయడమే బరువు తగ్గడానికి కీలకం అని చాలా మంది అనుకుంటారు. తాన్య దీనితో ఏకీభవించదు. అంతులేని కార్డియో సెషన్లతో తనను తాను బలవంతం చేసుకోవడం కంటే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, క్రమం తప్పకుండా నడవడం తనకు చాలా బాగా పనిచేశాయని ఆమె చెప్పింది.ఆహారానికి భయపడటంతాను వదిలేసిన మరో అలవాటు ఆహారాన్ని శత్రువులా చూడటం అని చెబుతోంది తాన్య. PCOS ఉన్నంత మాత్రాన పస్తులుండటం లేదా క్రాష్ డైట్లపై ఆధారపడటం కానేకాదని అంటోందామె. బదులుగా ప్రోటీన్తో కూడిన సరైన భోజనమే ఎంతో మేలు చేస్తుందని చెబుతోంది.పానీయాల ద్వారా కేలరీలు తీసుకోవడంచక్కెర పానీయాలలో దాగి ఉన్న కేలరీల గురించి కూడా తాన్య ప్రస్తావించింది. ఫ్యాన్సీ కాఫీ డ్రింక్స్ నుంచి ప్యాకేజ్డ్ జ్యూస్ల వరకు, ఈ పానీయాలు కడుపు నిండినట్లు అనిపించకుండానే అదనపు కేలరీలను చేర్చగలవు. ఇలాంటి పానీయాలు ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతాయని, PCOS ఉన్న చాలా మంది మహిళలు దీన్ని నియంత్రించడానికి ప్రయత్నించరని అన్నారామె.అనారోగ్యకరమైన అలవాట్లను తేలిగ్గా తీసుకోవడంకొందరు అనారోగ్యకరమైన అలవాట్లని తెలిసి కూడా చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. ఏదో అప్పడప్పుడూ అంటూ ఆ అలవాట్లకు దూరంగా ఉండరు. ఇక్కడ కేవలం తన రూపానికి సంబంధించి కాదు బరువు తగ్గడం, ఇది తన మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకి సంబంధించింది అని భావించి ఆ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అంటోంది తాన్య. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ని తగ్గించుకునే యత్రం చేయాలి. ఇది కేవలం రూపం కోసం కాదు భవిష్యత్తులో ఆరోగ్య ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి పీసీఓఎస్ని మెరుగ్గా నిర్వహించుకోవడానికి అన్న దృక్పథంతో జాగుకరకతతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తే..సత్ఫలితాలను అందుకోగలమని అంటోంది. అందుకోసం తీవ్రమైన ఆహార నియమాలు లేదా కఠినమైన వ్యాయామాలు కంటే నిలకడగా పాటించే అలవాట్లు, సమతుల్య భోజనం, శక్తినిచ్చే శిక్షణ, దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి మంచి మార్పుని తీసుకొస్తాయని నమ్మకంగా చెబుతోంది కంటెంట్ క్రియేటర్ తాన్య. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Tanya (@tanyabackstage) (చదవండి: స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..! ఆహారంతో స్వాగతం పలికే దేశాలివే..) -
శతక నీతి: త్యాగం!
పిల్లల పెంపకంలో తల్లితండ్రులకు ఓపిక, సహనంతోబాటు ఎంతో త్యాగగుణం.. తాము పస్తులుండి పిల్లలను పెంచే తల్లిదండ్రుల సహజగుణం త్యాగమే.. దేశసేవలోప్రాణాలను ఫణంగా పెట్టి తెగించి త్యాగం చేసే సైనికుల త్యాగం నిస్వార్ధబుద్ధికి మరో ఉదాహరణ...వేమన త్యాగాన్ని ‘వివేకంతో కూడిన దానం’గా పరిగణిస్తాడు..‘తనకు గలదెల్ల ఇతరలకు దానమిచ్చుత్యాగియగు వాడు భువికి దైవమగును సుమ్ము’...అంటాడు.. తన దగ్గర ఉన్నదంతా దానం చేసే వ్యక్తి ‘దేవుడ’ట... దీన్ని బట్టి త్యాగం చేసే వ్యక్తి స్థాయి ఎంత ఉన్నతమో ఆలోచించండి.. దానం చేసేటప్పుడు ఎటువంటి ప్రతిఫలం, పేరు ప్రతిష్టలూ ఆశించకూడదు. అందుకే గుప్తదానం అంటారు.. తనకున్న దానిలోంచి కొంత ఇవ్వడం దానం అయితే పూర్తిగా వదులుకోవడం త్యాగం అని అనవచ్చు.. తన ఆస్తిని, సౌఖ్యాన్ని, సుఖాన్ని పరులకోసం వదులుకోవడం త్యాగం అవుతుంది.సుమతీ శతకంలో...‘కష్టకాలమందు సహాయము చేయువాడుత్యాగియని బుధులు పొగుడుదురు కదరా సుమతీ’...అటుపక్క వ్యక్తులు కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వ్యక్తిని త్యాగి అని కొనియాడారు. పరోక్షంగా ‘విత్తము గలవాడు వితరణి చేయక, పొదుపు చేసినచో పురుగుగ పుట్టును’ అని శపించాడు, బద్దెన సుమతీ శతకంలో. వైరాగ్యకోణంలో భోగాలను, సుఖాలు, సిరిసంపదలను త్యాగం చేసి.. అంటే వదులుకుని ఆత్మజ్ఞానం పొందండని భర్తృహరి సలహా.. ‘భోగేరోగభయం కులే చ్యుతిభయం.. సర్వం వస్తుభయాన్వితం’.. అన్నీ భయమే, అందుకే వదులుకోండి అని ఉవాచ.నారాయణ శతకంలో, కుమార గిరి శతకంలో, దాశరథి శతకంలో దేవుడు కోసం త్యాగం చేయమంటారు..ధనత్యాగం, భోగత్యాగం, కక్ష, గర్వం, కోరికలు మొ... త్యాగం చేయటం చాలా గొప్ప... పురాణాల్లో కర్ణుడు, దధీచి, శిబి, బలి హరిశ్చంద్రుడు మొదలగు వారు ఉంటే కలియుగంలో ఎందరో మాతృమూర్తులు, సైనికులు, మహానుభావులు... ధనం,ప్రాణం త్యాగం చేసిన వారున్నారు.. వారికి నివాళులతో... – డా. కందాళ సత్యనారాయణమూర్తి -
సువార్త: చెయ్యెత్తి జైకొట్టే జైత్రయాత్ర
బాప్తిస్మమను దేవుని సంకల్పాన్ని పరిసయ్యులు నిరాకరిస్తూ వచ్చారు. యేసు దానికి లోబడ్డాడు. ‘ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తూ ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నది’ అంటూ యేసు బాప్తిస్మమిచ్చు యోహానుకు ఉత్తరమిస్తూ అతని ద్వారా బాప్తిస్మం పొందుకున్నాడు. ఒడ్డుకు రాగానే ఆకాశం తెరువబడి దేవుని ఆత్మ పావురంవలె దిగి ఆయన మీదకు వచ్చాడు.‘ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయనయందు నేను ఆనందించుచున్నాను’ అనే ఒక శబ్దము అది తండ్రియైన దేవుని స్వరము అనేలా ఆకాశము నుండి వచ్చింది. అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ ప్రేరణ వలన అరణ్యమునకు త్రోసికొనిపోబడ్డాడు. నలుబది దినములు, రాత్రులు ఉపవాసం ఉంటూ అడవి మృగాల మధ్య గడిపాడు. యేసు ఆకలితో ఉన్న ఈ సమయాన అపవాది వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. యేసు ధీరుడిగా నిలబడి తలపడి ఆ శోధకుడను ఓడించాడు.చెయ్యెత్తి జైకొట్టాలనే యేసు జైత్రయాత్ర సరిగ్గా ఇక్కడనే మొదలైంది. యేసు శిశువుగా ఉన్నప్పుడే ఆయన జైత్రయాత్రను, అనేక ఒడిదుడుకులలో అంతటా అట్టి విజయాన్నే చూస్తామని కొందరు అంటారు గానీ ఇది దేవుని కాపుదల, సంరక్షణ. పండితులు, ధర్మశాస్త్రోపదేశకులు, దేవుని రాజ్యాంగ చట్టనిపుణులు వంటివారు బాలుడిగా ఉన్న యేసు ఆనాడు బోధకులను సైతం ఆలోచనల్లో పడవేసిన విధానం గుర్తు చేసుకుంటారు. ఇలా యేసు బాల్యంలోనే ఆయనదైన జైత్రయాత్ర ప్రారంభమైందనేవారు లేకపోలేదు.ఆ వివరాలలోకి వెళితే – తన తల్లి మరియతో బాలుడిగా ఉన్న బాలయేసు ‘నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా?’ అన్నాడు. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉన్నాడు. ఆయన మాటలు వినిన వారందరు ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరములకు విస్మయమొందుచున్నారు.మరల మనం మొదటికి వస్తే, సాతాను అనే శోధకుడు ఆకలితో ఉన్న యేసు వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఆపై కడుపారా తిని నీ ఆకలి తీర్చుకో అంటూ శోధించాడు. యేసు అతనికి ధీటుగా జవాబిచ్చాడు. ‘మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును’ అన్నది ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉందని చె΄్పాడు.అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి దేవాలయ శిఖరం మీద ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకు. దేవుడు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వారు వచ్చి నీ పాదములు రాతికి తగులకుండ నిన్ను తమ చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడింది అంటూ అపవాది యేసువలె వాక్య వచనంతో మాట్లాడాడు. అందుకు యేసు – ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొకచోట వ్రాయబడిఉన్నదని అపవాదికి చె΄్పాడు.మరల అపవాది మిగుల ఎత్తయిన ఒక కొండ మీదకు ఆయనను తీసికొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటినన్నిటిని నీకు ఇచ్చెదను అంటూ ఆయనను మరీమరీ శోధించాడు. యేసు వానితో – సాతానా, ΄÷మ్ము ! ప్రభువైన నీ దేవునికి మ్రోక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనెను. దీంతో అపవాది ఆయనను విడిచిపోయాడు.యేసు అంతటి ఆకలిలోను సాతాను శోధనలకు ఏమాత్రం లొంగలేదు. స్వకీయ మహిమను ఏనాడూ వెదకకుండా తన సొంత మాటలు, జ్ఞానంతో కాక, దేవుని వాక్యపుశక్తితో శత్రువైన సాతానును ధీటుగా ఎదుర్కొని ఎదిరించిన వైనం అమోఘం. ఇక్కడి నుండే యేసు జైత్రయాత్ర మొదలైందని చెప్పవచ్చు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ విజయయాత్ర సిలువ మరణం వరకు అప్రతిహతంగా కొనసాగింది. – జేతమ్ -
అంతఃశక్తి... అంతులేని బలం
జీవితం అనేది నిరంతరాయంగా సాగిపోయే ఒక ప్రవాహం. ప్రయాణంలో ఎదురుదెబ్బలు తగలడం సహజమే అయినా, నేటి ఆధునిక కాలంలో చాలామంది చిన్నపాటి కష్టాలకే నైరాశ్యంలో మునిగిపోతున్నారు. విజయాల కోసం, బాహ్య ప్రపంచంలో ఎవరో వస్తారని ఎదురుచూడటం కన్నా.. ప్రతి మనిషి తనలోని అపారమైన అంతర్గత శక్తులను గుర్తించడమే పరమార్థం.భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించినట్లు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. కాలం కలిసిరానప్పుడు బాహ్య పరిస్థితులను నిందించడం మాని, ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా మలచుకోవాలి. మనలోని లోపాలను సరిదిద్దుకుంటూ, సృజనాత్మకతకు పదును పెట్టినప్పుడే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అవకాశాలుగా మార్చుకునే వివేకం లభిస్తుంది.ఈ అంతఃశక్తిని మేల్కొలిపి, జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మన మహర్షులు కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాలను నిర్దేశించారు. నిత్యం ధ్యానం చేయడం ద్వారా చంచలమైన మనస్సు ప్రశాంతతను ΄÷ంది, సరైన నిర్ణయాలు తీసుకునే స్పష్టత వస్తుంది. దీనితో పాటు సద్గ్రంథ పఠనం బుద్ధిని వికసింపజేసి జీవన సత్యాలను బోధిస్తే.. సత్సంగం (మంచి వ్యక్తుల సహవాసం) మనలో సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.సముద్రంలో అలలు ఎంత సహజమో, జీవితంలో కష్టాలూ అంతే సహజం. ఎడారిలో సైతం వేళ్లను లోతుగా పాతుకుని జీవాన్ని వెతుక్కునే మొక్కలా.. మనిషి తన ఆత్మబలాన్ని నమ్ముకుని, ప్రతి కొత్త రోజును ఒక అవకాశంగా భావించి విజయపథంలో ముందుకు సాగాలి. – పసుపులేటి వెంకటేశ్వరరావు -
కథానీతి: మంత్రానికి శక్తి ఉంటుందా?
ఒక సభలో జ్ఞాని, మేధావి అయిన వ్యక్తి భారతీయ సనాతన ధర్మం, సంస్కృతులపై అనర్గళంగా, అద్భుతంగా ప్రవచనం చెబుతున్నాడు. గంగాఝరిలా ఆయన ఉపన్యాసం సాగుతోంది. వందల మంది శ్రోతలు మైమరచి ఆయన ప్రవచనం ఆనందంగా వింటున్నారు. ఇంతలో ఒక తుంటరి యువకుడు లేచి నిలపడి, ఆయన వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ ‘మంత్రానికి శక్తి ఉన్నదా?’ అని ప్రశ్నించాడు. అయోమయానికి గురైన శ్రోతలు ఆందోళన చెందారు.ఆ ఉపన్యాసకుడు ఆ యువకుని వైపు కాసేపు నిశ్చలంగా చూసి ‘ఏం కూశావురా వెధవా!’ అని బిగ్గరగా అరిచాడు. అందరూ విస్తుపోయారు. ఇలా అందరి ముందు తనని అవమానించిన ప్రవచనకారునిపై ఆ యువకునికి విపరీతమైన క్రోధం కలిగింది. రక్త ప్రవాహ వేగం హెచ్చి ఆ యువకుని బుగ్గలలోకి ప్రవహించి అవి ఎరుపెక్కాయి. పెదవులు వణకుతున్నాయి. ఎర్రని నిప్పు క ణికల లాగా అతని కళ్ళు కెంపులయ్యాయి. అతను వెంటనే తన పొడవాటి చొక్కా చేతులు పైకి మడవ సాగాడు. పిడికిలి బిగించి భౌతిక దాడికి సిద్ధమయ్యాడు. సభలో స్తబ్ధత ఏర్పడింది. రెండు నిముషాలాగి ఆ ప్రవచనకారుడు బిగ్గరగా నవ్వాడు. తర్వాత ఇలా అన్నాడు. ‘నాయనా! అప్పటికప్పుడు, అనాలోచితంగా, ముందుగా అనుకో కుండా నేను పలికిన నాలుగు సాధారణ అక్షరాల పదమైన ’ మాట ఎంత మార్పు తెచ్చిందో గమనించావా? నీ కళ్ళు ఎర్రబడి, దేహమంతా వణుకుతూ, కోపంతో ఊగిపోతున్నావే! అనాలోచితంగా అన్న మాటకే ఇంత శక్తి ఉంటే, నేను ఏకాగ్రతతో, ధ్యాన నిమగ్నుడనై గాయత్రీ మంత్రం జపిస్తే దానికి అపరిమితమైన శక్తి ఉండదంటావా?’ అని సౌమ్యంగా, అనునయంగా అడిగాడు. సభా ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఆ యువకుడు మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అది శబ్దానికి, మాటకు ఉన్న శక్తి. – డా. గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
ముహర్రం నెల అల్లాహ్ మాసం..
ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ) ఆరంభం కేవలం క్యాలెండర్ మారడం కాదు; అది అంతరాత్మను రగిల్చే ఒక అద్భుత అవకాశం. నూతనత్వాన్ని వేడుకలతోనే ముగించకుండా, ఆత్మపరిశీలనతో స్వాగతించాలని ఇస్లాం బోధిస్తోంది. ఈ ప్రయాణంలో అత్యంత పవిత్రమైనవి ‘ముహర్రమ్’ నెలలోని మొదటి పది రోజులు. ప్రవక్త ముహమ్మద్ (స) ఈ నెలను ‘షహ్రుల్లాహ్’ (అల్లాహ్ మాసం) అని పిలిచారు.1. ఆషూరా మహత్తు.. ఒక దైవిక అద్భుతం.ముహర్రమ్ 10వ రోజును ‘ఆషూరా’ అంటారు. నాడు క్రూరుడైన ఫరోసైన్యం నుంచి ప్రవక్త మూసా (మోషే), అతని అనుచరులను అల్లాహ్ ఎర్రసముద్రాన్ని రెండుగా చీల్చి కాపాడిన అద్భుత ఘట్టం ఈ రోజే జరిగింది. ఈ దైవిక రక్షణకు కృతజ్ఞతగా ప్రవక్త మూసా ఉపవాసం ఉండేవారు. ఆ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ముహర్రమ్ 9, 10 తేదీలలో ఉపవాసం ఉండటం ముస్లింలకు పుణ్యప్రదం. నిష్ఠతో ఉండే ఈ ఒక్క రోజు ఉపవాసం.. గడిచిన ఏడాది కాలపు చిన్నపాపాలన్నింటినీ తుడిచిపెడుతుందని ప్రవక్త నమ్మకాన్ని వ్యక్తపరిచారు.2. ఆచరించాల్సిన ముఖ్యమైన పుణ్యకార్యాలుఈ పది రోజులను వ్యర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో ఈ అలవాట్లను భాగం చేసుకోవాలి:ఉపవాసాలు: రంజాన్ తర్వాత నఫిల్ (ఐచ్ఛిక) ఉపవాసాలకు అత్యుత్తమమైన మాసం ఇదే.దైవస్మరణ (జిక్ర్): ‘సుబ్హానల్లాహి వబిహమ్దిహీ, సుబ్హానల్లాహిల్ అజీమ్‘ లాంటి పదాలతో నోటిని పవిత్రంగా ఉంచుకోవడం.పశ్చాత్తాపం (తౌబా): గడిచిన ఏడాది తప్పులను ఒప్పుకుంటూ, నూతన సంవత్సరంలో సన్మార్గంలో నడవాలని సంకల్పించడం.దానధర్మాలు (సదఖా)పవిత్ర మాసంలో చేసే చిన్న సహాయానికైనా పుణ్యం రెట్టింపు అవుతుంది.ఖురాన్ పఠనం: నిత్యం దైవవాణిని చదవడం, దాని భావాన్ని అర్థం చేసుకోవడం.జీవిత పాఠంఆషూరా కథ నేటి మానవాళికి ఒక గొప్ప ధైర్యం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక వేదనల రూపంలో మన ముందు ‘ఎర్రసముద్రం’ లాంటి అగాధం ఉన్నప్పుడు.. ప్రవక్త మూసా చూపిన పరిపూర్ణ విశ్వాసమే మనకు శరణ్యం. ‘నా ప్రభువు నా వెంట ఉన్నాడు, ఆయన నాకు తప్పక మార్గం చూపుతాడు‘ అనే నమ్మకంతో ప్రార్థిస్తే, దైవం మన కష్టాల సముద్రాన్ని చీల్చి కొత్త దారి చూపిస్తాడు.త్యాగాల స్మరణ...ఆషూరా రోజున ప్రవక్త ముహమ్మద్ (స) ప్రియ మనవడు హజ్రత్ హుసైన్ , వారి అనుచరులు ‘కర్బలా’ మైదానంలో సత్యం, న్యాయం కోసం ప్రాణాలర్పించారు. వారి అమరత్వాన్ని గుండెల్లో స్మరిస్తూనే, ప్రవక్త సంప్రదాయం ప్రకారం ఉపవాసాలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడమే నిజమైన విశ్వాసి లక్షణం. జ్ఞానం ఆచరణలోకి వచ్చినప్పుడే దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఈ పది రోజులు మీ జీవితంలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు!– ముహమ్మద్ ముజాహిద్ -
మహా శివమ్: చెంగల్ శివ పార్వతి క్షేత్రం
మహేశ్వరా! మహాశివా పరమ శివా అని ఈశ్వరుని ఆరాధిస్తాం. అంటే మహాపర్వతం మీద వాసం ఉండేవాడు అని అర్ధం. అంతటి మహాశివుడికి పెద్ద మహా శివాలయాన్ని కేరళలో నిర్మించారు. నిరూపధారిగా లింగ రూపంలో మహా మహా రుద్రాలను తనలో ఆవహించుకున్న మహాదేవుడు లోక రక్షకుడు పరమ శివుడు. మన పుణ్యభూమిలో పలుచోట్ల జ్యోతిర్లింగాలు... ఆత్మలింగాలుగా కొలువుదీరాడాయన. అలాంటి మహాలింగం కేరళలో నిర్మించారు.కేరళ రాజధాని తిరువనంతపురానికి దగ్గర నెయ్యాటింకర అనేప్రాంతంలో ఉంది. నూట పదకొండు అడుగుల ఎత్తు గల శివలింగాన్ని ప్రతిష్టించారు.అక్కడ ఎనిమిది అంతస్థులలో మన దేశంలోకెల్ల పెద్ద శివ క్షేత్రం. దీని పేరు చెంగల్ శివ పార్వతి క్షేత్రం. ఈ స్థల మహాత్మ్యం చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ రెండు సార్లు అతి రుద్ర యజ్ఞం చేశారు. అలాగే మరెన్నో సార్లు అతిరుద్ర యజ్ఞం చేయాలనే సంకల్పం కూడా ఉంది. ఒకసారి అతి రుద్ర మహా యజ్ఞం చేయడమే గొప్ప విషయం. చెంగల్ శివ పార్వతి క్షేత్రం ఉన్న ప్రదేశం ఎంతో పుణ్యభూమిగా భావిస్తారు.ఈ స్థలానికి ఉండే మహత్వాన్ని గమనించి స్వామి మహేశ్వరానంద సరస్వతి ఈ మహా శివలింగ ప్రతిష్ట కోసం పూనుకున్నారు. వీరికి కంచికామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి మంత్ర దీక్ష ఉపదేశించారు. ఈ పుణ్యస్థలం పేరు పుట్టురాకల్. ఇక్కడే శివపార్వతులు పుట్టరూపంలో వెలిశారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో దొరికిన ఆధారాల వలన దేవాలమం 5 వేల ఏళ్ళ పురాతనమైనది అని తెలిసింది. దేశం నలుమూలల నుంచి మట్టి, పవిత్ర నదీ జలాలు వనమూలికలు తెచ్చి నిర్మించారు. మూలాధారంగా వినాయకుడు సరస్వతి బ్రహ్మ రూపాలను ప్రతిష్టించారు. మొదటి అంతస్థు భూ మట్టానికి కింద నిర్మించారు.64 మహారూపాలలో శివుని విగ్రహాలను ఉంచారు. భక్తులు కూర్చుని ధ్యానం చేయడానికి వీలు కల్పించారు అలాగే ప్రతి అంతస్థులో ఓంకారనాదం వినిపిస్తుంటుంది. పంచభూతాలు తనలో ఇమిడి ఉన్నట్టుగా ప్రకృతి అందాలను చిత్రీకరించారు. ఏడవ అంతస్తులోకి వెళితే కైలాసానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది మనకి. సహస్రదళ పద్మాకృతి కింద శివ పార్వతి విగ్రహం ముందు నిలబడి ధ్యానంలోకి వెళ్లడం మనస్సుకి ప్రశాంతంగా ఉండడం గమనించవచ్చు. కింద అంతస్థులో శివలింగ ప్రతిష్ట ఉంది ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. పన్నెండు జ్యోతిర్లింగాల భావన కలిగిన శివ ప్రతిష్ట అద్భుతం. శివపార్వతుల తనయునికి ఇక్కడ చాలప్రాధాన్యత ఉంది. అందుకే 32 విఘ్నేశ్వర రూపాల ప్రతిష్ట ఉంది. బాల గణపతి నుండి యోగ గణపతి వరకు ఉన్న రూపాలకి నిత్యపూజలు జరిపే దేవాలయం ఇక్కడ మాత్రమే ఉంది.అసామాన్య శిల్పకళాచాతుర్యంమహాబలి పురం నుండి వచ్చిన శిల్పుల కళాచాతుర్యం ఇక్కడ ఉన్న విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతుంది. రుద్రుడు అంటేనే మానవ కష్టాలను హరించేవాడు అని అర్ధము. మహా రుద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతి రుద్ర మహా యజ్ఞం చేశారు ఈ యజ్ఞం చేయడం నిజంగా ఎంతో మహత్తర విషయం. పదకొండు రోజులపాటు 121 మంది వేద పండితులు 121 కలశాలతో అభిషేకం, పదకొండు సార్లు రుద్రా మంత్రం జపిస్తే ఫలప్రాప్తి కలుగుతుంది .అటువంటిది రెండుసార్లు జరగడం శివుని శక్తికి నిదర్శనం అని నమ్ముతారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా భావంతో ఇక్కడకు భక్తులు వస్తుంటారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంచెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం 111.2 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన శివలింగం గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇంతకుముందు, కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలోని 108 అడుగుల ఎత్తైన శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైనది గా ఉండేది.10 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తు గల శివలింగం నిర్మాణం 2012 లోప్రారంభమైంది, దీని నిర్మాణం పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పట్టింది. దాని ఎత్తు మాత్రమే కాదు, దాని విశిష్టమైన స్థూపాకార నిర్మాణం, దానిలోపల దాగి ఉన్న అద్భుతమైన ఆశ్చర్యాలు కూడా చూడటానికి ఒక అద్భుతం.కాశీ, గంగోత్రి, రిషికేశ్, రామేశ్వరం, ధనుష్కోడి, బద్రీనాథ్, గోముఖ్, కైలాసం వంటి వివిధ పుణ్యక్షేత్రాల నుండి నీరు, ఇసుక, మట్టిని కూడా నిర్మాణ సామగ్రిలో కలిపారు. అందువల్ల, చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం ఒక దైవిక నిర్మాణంగా భావిస్తారు. ఈ కట్టడంలో 8 అంతస్తులు ఉన్నాయి, వాటిలో ఆరు అంతస్తులు మానవ శరీరంలోని ఆరు చక్రాలు లేదా శక్తికేంద్రాలకుప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ అంతస్తులలో భక్తులు, యాత్రికులు, పర్యాటకులు ఆయా చక్రాలపై ధ్యానం చేయడానికి 6 ధ్యానమందిరాలు ఉన్నాయి. ఈ కట్టడం మొదటి అంతస్తులో 108 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి, ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు.భక్తులు మహా శివలింగంలోకి ప్రవేశించవచ్చు. ఈ శివలింగం లోపల, శివలింగం విశ్వ ప్రభావాన్ని అనుభవించడంతో పాటు, శరీరంలోని చక్రాల శక్తిని పెంచుకోవడానికి ధ్యానం కూడా చేయవచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం -
Hi నాన్న.. కష్టాల కొలిమిలో... నవ్వుల కలిమి
నా ఇరవయ్యవ ఏట అరవై కూడా దాటకుండా వెళ్లిపోయాడు మా నాన్న. ఒక చిన్న సంసారం... భార్య జయమ్మ, ముగ్గురు పిల్లలు సుజాత, నరసింహమూర్తి, గోపి, అమ్మ సుబ్బమ్మ, తమ్ముడు రాములు.. వీళ్ల కోసం ఆయన జీవితమంతా పోరాడాడు. తెనాలి మసోడి షెడ్ మా నాన్న కొంజేటి వెంకటేశ్వర్లు ఆఫీస్. ఆయన నడిపే లారీతో పాటు ఆయన స్నేహితులు ఉండే చోటు కూడా అదే.ఎనిమిదేళ్లుంటాయ్ నాకప్పుడు. వర్షం పడ్డ కాసేపటికి నాన్న చేయి పట్టుకుని షెడ్డుకి వెళ్లా. మా నాన్న స్నేహితుడితో ‘‘ఒరేయ్ ఇవ్వాళ నీ డ్యూటీకి నేను వెళతాను. నా కూతురు పుట్టినరోజు వస్తోంది. దానికి ఏమైనా ఇవ్వడం మాట సరే కనీసం భోజనం..’’ దుఃఖం ఎక్కువైతే గొంతు మూగబోతుంది. నా తండ్రి గొంతు బరువుగా మాట్లాడిన ఆ క్షణం నాకింకా గుర్తుంది. అప్పటికే నాలుగు రోజులు డ్యూటీ చేసిన మనిషి. అయినా మళ్లీ స్నేహితుడి దగ్గర లారీ తాళం తీసుకుని, తెనాలి అంబమ్మ హోటల్ భోజనం కట్టించుకుని ఇంటికొచ్చాడు. అమ్మ వడ్డిస్తుంటే నేను గబగబా తింటున్నా. వాకిట్లో ఉన్న నాన్నని చూసి ‘నాన్నా! నువ్వు రావేం’ అన్నాను. భుజం మీదున్న తువ్వాలుతో కళ్లు తుడుచుకుంటున్నాడు. అర్థం కాలేదు నాకు.. ఆ వయసులో ఆకలి మీదున్న దృష్టి మా నాన్న కళ్ల మీదకి పోలేదు..ఎర్ర పరికిణీ వేసుకుని స్కూలుకి వెళ్లడం, ఆపై కాలేజీ దాని తర్వాత పెళ్లి, పిల్లలు.. ఇలా నా చుట్టూ అల్లిన జీవితపు మల్లెతోటలో ఆనందాన్ని మాత్రమే నింపిన ఆయన, తన జీవితంలోని కష్టాల ముళ్ల కంచెల్ని మాత్రం నాకు తెలియకుండా దాచేశాడు. తన స్నేహితులు ఆయన్ని సావిత్రి అంటూ పిలిచేవారు. సతీనాటకంలో సావిత్రి వేషంలో చాలా బాగా చేశాడని అలా అంటారంతా.. కాని మేం పెద్దవాళ్లవుతున్న కొద్దీ ఆయన నాటకాలకు దూరమయ్యాడు. మాకోసమే నాటకాలొద్దనుకున్నాడని, మాకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు తనొక్కపూటే తింటున్నాడని, ఆయన మాతో ఉన్నన్నినాళ్లూ తెలియలేదు. కష్టాల కొలిమిలో కాలుతున్నా నిలువెత్తు చిరునవ్వుకి చిరునామాగా నిలిచి నా ఎదుగుదలని చూడకుండానే వెళ్లిపోయావు నాన్నా!.. నీకంటూ మేమేమీ ఇవ్వలేకపోయినా.. నువ్విచ్చిన మొండిధైర్యం, పట్టుదల, శక్తి మాకు వరం.– సి. సుజాత, రచయిత్రి, జర్నలిస్ట్నిర్వహణ: శ్రావణ్ జయమీరు కూడా మీ నాన్నతో ఉన్న ఓ మంచి జ్ఞాపకాన్ని మీ నాన్న ఫొటోతో సహా ఈ కింది నంబర్కు మెయిల్ లేదా వాట్సాప్ చేయండి. 9281020501, sakshifamily3@gmail.com -
ఏఐకి సిలబస్ తెలుసు! టీచర్కు నువ్వు తెలుసు!!
‘డియర్ చాట్ జిపిటి..... ఈ క్వశ్చన్ పరీక్షలో రాదు కదా?’ స్టూడెంట్ అడిగితే ఏఐ ‘రాదు’ అని ఊరుకుంటుంది. టీచర్ ‘పరీక్షలో రాకపోయినా జీవితంలో పనికొస్తుంది’ అంటుంది. ఏఐకి సిలబస్ తెలుసు. టీచర్కి నువ్వు తెలుసు. నీ సిల్లీ డౌట్లు, నీ కళ్లలో భయం, నీ గుండెల్లో ఆశ. ఏఐ ఆన్సర్ చెప్తే టీచర్ ఆలోచన నేర్పుతుంది. అందుకే భవిష్యత్ చదువు అంటే ‘ఏఐ వర్సెస్ టీచర్’ కాదు. ‘ఏఐ ప్లస్ టీచర్’.ఇంట్లో పిల్లలు హోంవర్క్ మొదలుపెట్టగానే మొదట అడిగే మాట ‘ఏఐలో కొట్టనా?’. కొట్టాక క్షణాల్లో ఆన్సర్ దొరుకుతుందటే బుర్రకు ఇక పని లేదు. తల్లిదండ్రులు కూడాప్రాజెక్ట్ కోసం ‘ఏఐని అడుగు’ అని ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో చాలామందికి ఒక అనుమానం వస్తోంది. ఏఐ అన్నీ చెప్పేస్తుంటే ఇక స్కూల్, టీచర్ ఎందుకు అని. నిజమే, ఏఐ వేగంగా సమాచారం ఇస్తుంది. అర్ధరాత్రి అడిగినా విసుక్కోదు. కానీ చదువులో తెలియడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఆ రెండింటి మధ్య గ్యాప్ను పూడ్చేది టీచర్ మాత్రమే. ఏఐ యుగంలో టీచర్ పోలేదు. టీచర్ పాత్ర మారింది.టీచర్ కలిగించే స్పృహ‘ఆకు పచ్చగా ఎందుకు ఉంది?’ అని పిల్లాడు అడిగితే ఏఐ మూస పద్ధతి జవాబు చెప్తుంది. టీచర్ మాత్రం ‘నువ్వు అన్నం తింటే బలం వచ్చినట్టు, చెట్టు ఎండ తింటే ఆకు పచ్చగా అవుతుందిరా’ అంటారు. దీన్నే ‘కాన్సెప్టువల్ క్లారిటీ’ అంటారు. ఏఐ డేటా ఇస్తుంది. ఆ డేటాను జీవితానికి అన్వయించే వివేకం, విలువ, దృక్పథం టీచర్ మాత్రమే ఇవ్వగలరు. ఇది యంత్రానికి రాని మానవ స్పందన.టీచర్కు ‘క్లాస్రూమ్’ తెలుసుమంచి టీచర్ పాఠం చెప్తూనే పిల్లల ముఖాలు చదువుతారు. ఎవరి కళ్లలో కన్ఫ్యూజన్ ఉందో, ఎవరు అర్థం కాకపోయినా తల ఊపుతున్నారో పసిగడతారు. వెంటనే పాఠం ఆపి, ఉదాహరణ మార్చి, అవసరమైతే మాతృభాషలోకి దిగి చె΄్తారు. పిల్లాడి కంట్లో నీళ్లు చూస్తే సిలబస్ పక్కనబెట్టి ముందు ధైర్యం చె΄్తారు. ఏఐకి ఈ శక్తి లేదు. దానికి ఎమోషన్ తెలియదు. ఒక పద్ధతి ఫెయిల్ అయినా అందరికీ అదే పద్ధతి చూపిస్తుంది. కొత్త బ్యాచ్ వచ్చిన ప్రతిసారీ టీచర్కు మరింత అనుభవం పెరిగి ఉంటుంది. ఆ హృదయం, ఆ పరిశీలన ఏఐకి రాదు.‘పాస్’... ‘పర్సన్’చదువులో ముఖ్యమైనది మోటివేషన్. పిల్లలు సబ్జెక్ట్తో కాదు, సబ్జెక్ట్ చెప్పే మనిషితో కనెక్ట్ అవుతారు. ‘నువ్వు చేయగలవు’ అని ఏఐ చెప్పదు. టీచర్ చె΄్తారు. ఆ మాటే పిల్లాడిని ఫెయిల్యూర్ నుంచి లేపుతుంది. ఏఐ ఆన్సర్ ఇస్తుంది. టీచర్ ప్రశ్న అడిగే ధైర్యం ఇస్తారు. ఏఐ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. టీచర్ విలువలు నేర్పుతారు. క్యూరియాసిటీ వెలిగించడం, తప్పుచేస్తే సరిదిద్దడం, ఒత్తిడిలో ఉన్న పిల్లాడిని గుర్తించి దగ్గర తీసుకోవడం మనిషికే సాధ్యం. అందుకే భవిష్యత్ చదువు అంటే ‘ఏఐ వర్సెస్ టీచర్’ కాదు. ‘ఏఐ ప్లస్ టీచర్’.మనిషి గుర్తుఅసలు ప్రశ్న ‘టీచర్లు అవసరమా’ అని కాదు. ‘టీచింగ్లో మానవీయ స్పర్శ కాపాడుకుంటున్నామా’ అని. ఏఐ వచ్చింది కాబట్టి టీచర్ పని తగ్గలేదు. బాధ్యత పెరిగింది. ఇకపై టీచర్ క్యూరియాసిటీ వెలిగించే కాగడా. డేటా యుగంలో దారి చూపే దిక్సూచి. మీ పిల్లాడి ఫో¯Œ లో ఏఐ ఉండొచ్చు. కానీ వాడి లైఫ్లో ‘నా మేడం, నా సార్’ అనే ఒక మనిషి ఉండాలి. ఆ మనిషిని రీప్లేస్ చేసే టెక్నాలజీ ఇంకా పుట్టలేదు. బడిగంట మోగింది. ఇక టీచర్ అసలు పాఠం మొదలు. కేస్ స్టడీ 1హైదరాబాద్లో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థి సైన్స్ప్రాజెక్ట్ కోసం ఏఐని.‘గ్లోబల్ వార్మింగ్ కారణాలు’ అడిగాడు. టైప్ చేయగానే ఐదు పాయింట్లు వచ్చాయి. యథాతథంగా చార్ట్ మీద రాసి తీసుకెళ్లాడు. క్లాస్లో టీచర్ ‘మన వీధిలో చెట్లు నరికితే ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది?’ అని అడిగారు. పిల్లాడు మౌనం వహించాడు. ఏఐ ఇచ్చిన డేటాను తన చుట్టూ ఉన్న ప్రపంచానికి అన్వయించలేక పోయాడు. ఆరోజు టీచర్ క్లాస్ మొత్తాన్ని బయటకు తీసుకెళ్లి ఎండలో సిమెంట్ రోడ్డు వేడి, చెట్టు నీడ చల్లదనం తెలిపి ఉష్ణోగ్రత తేడా ఫీల్ చేయించారు. ఏఐ ‘ఏంటి’ చెప్పింది. టీచర్ ‘ఎందుకు’ అనుభవంలోకి తెచ్చారు.కేస్ స్టడీ 2ఓ ఇంటర్ విద్యార్థిని లెక్కల్లో బలహీనం. ట్యూషన్ చేరి అడిగితే ‘సిల్లీ డౌట్’ అని కోప్పడతారేమోనని భయం. దాంతో ఏఐతోప్రాక్టీస్ మొదలుపెట్టింది. సమాధానాలు వచ్చాయి. కానీ పరీక్షలో అదే మోడల్ మార్చి ఇస్తే తడబడింది. కారణం ఏఐ ఆమె భయాన్ని గుర్తించలేదు. కాలేజీలో లెక్కల మేడం ఆమె ముఖం చూసి విషయం కనిపెట్టారు. ‘నీకు కాన్సెప్ట్ రావాలి’ అని ధైర్యం చెప్పి బోర్డు మీద కాకుండా ఆమె నోట్బుక్లోనే తప్పును సరిదిద్దారు. మూడు నెలల్లో ఆ అమ్మాయి పాస్ అయింది. ఏఐ సాధన ఇచ్చింది. టీచర్ నమ్మకం ఇచ్చారు. -
హెల్త్... లీసా రే ఆఫ్ హోప్
లీసారే అనే పేరు వింటే వెంటనే గుర్తు రాక పోవచ్చేమో కానీ టక్కరి దొంగ’లో మహేశ్ బాబు హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొస్తుంది. బోంబే డైయింగ్ బ్రాండ్ మోడల్గా ఒకనాడు ఫ్యాషన్ ప్రపంచపు క్వీన్గా వెలుగొందిన ఈ జన్మతః కెనడియన్ బ్యూటీ... బాలీవుడ్, హాలీవుడ్ నటిగా, టీవీ కార్యక్రమాల హోస్ట్గా, రచయిత్రిగా అనేక పాత్రల్లో నిర్విరామంగా రాణిస్తూనే ఉన్నారు.చాలా చిన్న వయసులోనే బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన లీసా రే దానిని జయించడంతో పాటు ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి... రెట్టించిన ఉత్సాహంతో విభిన్న రంగాల్లో దూసుకు పోతున్నారు. వ్యక్తిగత జీవితానుభవాల నుంచి వచ్చిన ఆలోచనలతో ఇటీవలే మధ్య వయసు మహిళల ఆరోగ్య సమస్యలు చికిత్సా కార్యక్రమాల కోసం ‘నూహెర్’ను ప్రారంభించారు. ఈ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...నూహెర్’ ఆవిర్భావానికి ప్రేరణ అదే...క్యాన్సర్ చికిత్స సమయంలో కీమోథెరపీ ఫలితంగా, 37 ఏళ్ల వయసులోనే మెనోపాజ్ దశలోకి ప్రవేశించాను. హార్మోన్ల మార్పుల సహా నా శరీరంలోకి చొచ్చుకుని వచ్చే అనారోగ్యాల్ని అర్థం చేసుకునే అవగాహన లేక అలసట, నిద్రలేమి, మతిమరుపు నీరసం వంటివన్నీ బతకడానికి చెల్లించాల్సిన మూల్యంలా మారాయి. అయితే పెరిమెనోపాజ్ను ఎదుర్కొంటున్న స్నేహితులతో సంభాషణల ద్వారా, చాలామంది ఇదే గందరగోళంలో ఉన్నారని గ్రహించాను.అప్పుడే ’నూహెర్’ ఆవిర్భవించింది. మన దగ్గర మధ్యవయస్సు ఆరోగ్యంపై మౌనం తరతరాల వారసత్వంగా మారింది. చర్చించడానికి ఇబ్బందిపడే విషయాలలో మెనోపాజన్ ఒకటి. ఒక మహిళ విలువ ఆమె పునరుత్పత్తి వయస్సుతో ముడిపడి ఉంటుందనే భావన. అందుకే చాలామంది మహిళలు అసౌకర్యాన్ని భరించడానికి అలవాటుపడ్డారు.శరీరంపై అవగాహన మార్చిన క్యాన్సర్...నా శరీరంతో నాకున్న సంబంధాన్ని క్యాన్సర్ సమూలంగా మార్చేసింది. దానికిముందు, నా జీవితంలో ఎక్కువ భాగం బాహ్య రూపానికే ప్రాధాన్యతనిస్తూ గడిచింది. స్త్రీత్వం అనేది యవ్వనం, సంతానోత్పత్తి లేదా రూపంతో నిర్వచించేది కాదని గ్రహించాను. నిజమైన బలంలో భావోద్వేగ, మానసిక శారీరక ఆరోగ్యం ఇమిడి ఉంటాయని నా అనుభవం నాకు నేర్పింది.వృద్ధాప్యం సమస్య కాదు...యవ్వనాన్నే అందానికి ఏకైక కొలమానంగా భావించే సంస్కృతిలో జీవిస్తున్నాం, కానీ అందం కాలక్రమేణా మారుతుందని నేను నమ్ముతాను. మహిళలు... వృద్ధాప్యం అనేది పరిష్కరించాల్సిన సమస్య కాదని గుర్తించడమే మొదటి అడుగు. మీ విలువ ఎప్పటికీ యవ్వనంగా కనిపించడంతోనే ముడిపడి లేదని అర్థం చేసుకోవడం నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. అందుకే నేను ‘వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడం‘ గురించి మాట్లాడుతుంటాను, మనం అసాధ్యమైన ప్రమాణాలను వెంబడించడం కంటే జీవశక్తిని ఆస్వాదించాలని నమ్ముతాను.మహిళలూ మిమ్మల్ని మీరు గుర్తించండి...ఎంతోమంది మహిళలు దశాబ్దాల పాటు ఇతరుల అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ, లక్షణాలు విస్మరించలేనంత తీవ్రమయ్యే వరకు తమ ఆరోగ్య సమస్యల్ని వాయిదా వేస్తూ ఉంటారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం స్వార్థం కాదు, అది అత్యవసరం. మధ్యవయస్సు అనేది మిమ్మల్ని మీరు పునఃసమీక్షించుకోవడానికి మీపై మీరు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన సందర్భం. మీరు ప్రతిరోజూ ఇతరులకు ఇచ్చే అదే శ్రద్ధ, ఆప్యాయత, కరుణ పొందడానికి మీరు కూడా అర్హులని గుర్తించండి.నా మానసిక ఆరోగ్యం... వ్యాపకాల్లోనే...యోగా, ధ్యానం ప్రకృతిలో గడపడం వంటివి నాకు అమూల్యమైన సందర్భాలు. ఇతరుల ఆమోదం కంటే సహజత్వాన్ని ఎంచుకోవడం నాకు అలవాటైంది. బాహ్య గుర్తింపు అశాశ్వతమైనదని జీవితం నాకు నేర్పింది. మిమ్మల్ని నిలబెట్టేది బలమైన అంతర్గత జీవితం, అర్థవంతమైన సంబంధాలు ఒక లక్ష్య స్పృహ.విజయం అంటే?కీర్తి అశాశ్వతమైనది. మనం ఎంచుకున్న విలువలకు అనుగుణంగా జీవిస్తున్నానా? నా పని అర్థవంతమైన మార్పును తీసుకువస్తుందా లేదా?అదే ఇప్పుడు నాకు ముఖ్యం. నేను అనుభవించిన లేదా పంచుకున్న ఏదైనా విషయం మరో మహిళ ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి, మరింత సమాచారం తెలుసుకోవడానికి లేదా మరింత సాధికారత పొందడానికి సహాయపడితే, అది అపారమైన సంతృప్తిని ఇస్తుంది. ప్రపంచానికి ఏదైనా అర్థవంతమైన దానిని అందిస్తూ, యథార్థంగా జీవించే స్వేచ్ఛను కలిగి ఉండటమే విజయం. ప్రస్తుతానికి, నా దృష్టి వినోదానికి అతీతంగా రచన, ‘నూహెర్’ ద్వారా మహిళల ఆరోగ్య పరిరక్షణ, వంటి ప్రాజెక్ట్లపైనే ఉంది. నాకు రచనపై కూడా చాలా ఆసక్తి ఉంది. నా కవితా సంకలనం త్వరలో ప్రచురితం కానుంది.– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
దువ్వెనను ఇలా ఎంచుకోండి!
చాలామంది జుట్టు సంరక్షణ అనగానే రకరకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్, కండిషనర్ల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ, మనం రోజూ వాడే దువ్వెన కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని గమనించరు. కర్లీ జుట్టయినా, స్ట్రెయిట్గా ఉన్నా... సరైన దువ్వెనను వాడటం వల్ల జుట్టుకు మంచి రక్షణ దొరుకుతుంది. మరి అలా సరైన దువ్వెనని ఎంచుకోవాలంటే కొన్ని చిట్కాలు...వెడల్పాటి పళ్లున్న దువ్వెన: కర్లీ, వేవీ హెయిర్ ఉన్నవారికి వెడల్పాటి పళ్లు ఉండే దువ్వెనలు బాగా ఉపయోగపడతాయి. ఇవి జుట్టు చిక్కులను సులభంగా తొలగిస్తాయి. అలాగే జుట్టు విరిగిపోకుండా, కుచ్చుగా మారకుండా కాపాడతాయి.సన్నటి పళ్లు ఉండే దువ్వెనలు: స్టెయిట్, పల్చని జుట్టు ఉన్నవారికి సన్నటి పళ్లు ఉండే దువ్వెనలు చక్కగా సరిపోతాయి. ఇవి జుట్టును చక్కగా దువ్వుకోవడానికి, నీట్గా స్టైల్ చేసుకోవడానికి బాగా పనికొస్తాయి.చిక్కులు తీసే దువ్వెనలు: జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో జుట్టు త్వరగా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, తడి జుట్టుపై ‘డిటాంగ్లింగ్ కూంబ్’ ఉపయోగించడం వల్ల జుట్టు ఊడిపోకుండా, ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చిక్కులను సులభంగా తొలగించుకోవచ్చు.ఉడెన్ కూంబ్: కర్రతో చేసిన దువ్వెనలు జుట్టు మొత్తానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి స్కాల్ప్ను మృదువుగా మసాజ్ చేయడమే కాకుండా, జుట్టులో స్టాటిక్ కరెంట్ ఏర్పడకుండా తగ్గిస్తాయి. అంతేకాదు, తలలోని సహజ నూనెలను జుట్టు అంతటా సమానంగా వ్యాపించేలా చేసి, జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.టెయిల్ కూంబ్: జుట్టును సమానంగా లేదా నీట్గా పాపిడి తీసుకోవడానికి టెయిల్ కూంబ్స్ ఎంతో అవసరం. హెయిర్ స్టైల్స్ చేసుకునేటప్పుడు జుట్టును వేర్వేరు సెక్షన్లుగా విభజించడానికి ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. (చదవండి: ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..! ఆ 45 నిమిషాల రైడ్ ఆమెకు..) -
ఆమె ‘స్కర్ట్’పై అమ్మ చిత్రం.. భావోద్వేగంలో ఒబామా!
మిషెల్ తన ఫ్యాషన్ అభిరుచికి పేరుగాంచిన మహిళ. ఎప్పటికప్పడు విలక్షణమైన స్టైలిష్ వేర్లతో ఫ్యాషన్కి సరికొత్త అర్థమిస్తారామె. ఆమె దృష్టిలో ఫ్యాషన్ అంటే మన వ్యక్తితత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే వస్తాలని అర్థం. అయితే ఈసారి మాత్రం ఒబామా అత్యంత విలక్షణమైన స్కర్ట్ టాప్లో మెరిశారామె. పైగా ఈ దుస్తులు అత్యంత ప్రత్యేకం కూడా. చికాగోలో ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఒక రెసెప్షన్లో మిషెల్ ఈ బ్రాండెడ్ దుస్తులతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు సైతం ఆమె డ్రెస్ని చూసి ఒక్క క్షణం తత్తరపడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ మిషెల్ ఒబామా దుస్తుల్లో అంత స్పెషాల్టీ ఏంటంటే..చికాగోలో ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఒక రిసెప్షన్లో, మిషెల్ ఒబామా వినూత్నమైన డ్రెస్లో మెరిసి అందర్నీ విస్తుపోయాలా చేశారు. ఒబామా ధరించిన స్కర్ట్పై ఆమెకెంతో ఇష్టమైన తన అమ్మ ఫోటోతో ఉన్న స్కర్ట్ ధరించి ఆ కార్యక్రమానికి హాజరవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆఖరికి మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం ఆశ్చర్యపోయారు. From an early age, my mom, Marian Robinson, taught me how to think for myself, use my own voice, and understand my own worth.Ahead of #MothersDay, I’m proud to announce that the “Opening the White House” exhibit at the Obama Presidential Center will be named after her. 💕 pic.twitter.com/QDhSSRRet0— Michelle Obama (@MichelleObama) May 6, 2022 ఆమె తన వస్త్రధారణతో దివంగత తల్లికి నివాళులర్పించేందుకు ఇలా వచ్చినట్లు వెల్లడించారు. తన తల్లి మరియన్ రాబిన్స్ ఫోటోతో ఉన్న పెన్సిల్ స్కర్ట్ డిజైన్ కోసం మెరెడిత్ కూప్, ఆక్నే స్టూడియోస్తో కలసి పనిచేశానని తెలిపారు. స్కాండేనేవియన్ లేబుల్ ఆటం కలెక్షన్స్కు చెందిన ఈ స్కర్ట్కి బ్రౌన్ రంగు టాప్ని జత చేశారామె. ఆ వేడుకలో ఒబామా తన దుస్తులు గురించి మాట్లాడుతూ..తన భర్తను చూసి తనకెంతో గర్వంగా ఉందన్నారు. అతను నిజంగా చాలా కంగారు పడుతున్నాడు. ఎందుకంటే మెరెడిత్ కూప్ డిజైన్ చేసిన ఈ స్కర్ట్ గురించి ఒబామాకు అస్సలు తెలియదు. అందుకే ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ కంగారుపడుతున్నట్లు తెలిపారు. అలాగే తాను ఈ స్కర్ట్కి అలవాటుపడటానికి చాలా సమయం పట్టిందన్నారు. నిజంగా తన తల్లి ఇది చూసుంటే గర్వపడేది కదా అని ఉద్విగ్నంగా అన్నారామె. దీని గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు తన ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుకొచ్చారు. 'ఈ రాత్రి నా అత్తగారు మరియన్ రాబిన్స్ గురించి ఆలోచిస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయ్. ఆమె తన పిల్లలు మిషెల్, క్రెయిగ్ల కోసం ఎంతో కష్టపడింది. తన భర్త ఫ్రేర్ రాబిన్సన్ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి నేవీ పియర్ సమీపంలోని నీటి పునరుద్ధరణ ప్రాంతంలో పనిచేసేవారు. ఆయన వల్లే కష్టపడి పనిచేయడం, కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం గురించి తెలుసుకున్నా. వాళ్లిద్ద్దరూ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులని, నిమ్న వర్గాలతో సహా అందర్నీ గౌరప్రదంగా చూస్తూ..తమ పనులను తాము చక్కబెట్టుకునే వ్యక్తులు. భూమికి పునాది రాళ్లలాంటి మనుషులు ఆ ఇద్దరూ. చికాగో సౌత్ అంతటా, యావత్తు అమెరికా దేశంలోనూ ఉన్నారు" అంటూ తన పోస్ట్ని ముగించారు. View this post on Instagram A post shared by HOLLYWOOD UNLOCKED (@hollywoodunlocked) (చదవండి: స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..! ఆహారంతో స్వాగతం పలికే దేశాలివే..) -
స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..!
జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా యూరప్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ సోమవారం(జూన్ 15, 2026) స్లోవేకియాలో దేశ రాజధాని బ్రటిస్లావాలో ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫీకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అదీగాక 1993లో ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్లోవేకియాను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. విమానం దిగగానే మోదీకి స్లోవేకియా విదేశీ యూరోపియన్ వ్యవహారాల మంత్రి జురాజ్ బ్లానార్ సాంప్రదాయ స్లోవేకియా ఆహార పద్ధతిలో స్వాగతం పలికారు. అసలేంటి స్వాగతం? దాని అర్థం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.స్లోవేకియా స్లావిక్ సంస్కృతి ప్రకారం.. గౌరవనీయ అతిథికి తాజాగా కాల్చిన రొట్టెముక్క, ఒకచిన్న పళ్లెంలో ఉప్పుతో స్వాగతం పలుకుతారు. అక్కడ రొట్టే శ్రేయస్సుని, జీవనోపాధిని, భూమి ఆశీర్వాదాలను సూచిస్తుందట. ఇక ఉప్పు శాశ్వత స్నేహం, రక్షణకు చిహ్నంగా పేర్కొంటారు. ఈ స్వాగత కార్యక్రమంలో రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శన కూడా ఉంటుంది. దీంతోపాటు జావా ప్రాంతానికి చెందిన 'కోపానిసియారిక్' అనే బాలల జానపద బృందం జానపద నృత్యంతో మెదీకి ఘన స్వాగతం పలికారు. స్లోవేకియాలానే ఆహారంతో పలికే కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.ఖర్జూరం, అరబిక్ కాఫీమధ్యప్రాచ్యంలోని అనేక దేశాలలో, అతిథులకు సాంప్రదాయకంగా ఖర్జూరాలు, అరబిక్ కాఫీ (గహ్వా)తో స్వాగతం పలుకుతారు. చరిత్రకారుల ప్రకారం, ఖర్జూరాలు ఉదారతకు, సమృద్ధికి చిహ్నంగా ఉండగా, తేలికపాటి మసాలాలతో కూడిన కాఫీని ఆతిథ్యానికి, గౌరవానికి చిహ్నంగా పేర్కొంటారు.పోయితో అలోహా స్వాగతంచరిత్రకారుల ప్రకారం, సాంప్రదాయ హవాయి సంస్కృతిలో, సందర్శకులకు స్వాగతం పలకడంలో ఆహారం తరచుగా ఒక పాత్ర పోషిస్తుంది. అక్కడ తిథ్యంతో ముడిపడి ఉన్న ఒక ప్రసిద్ధ ఆహారం పోయి. ఇది టారో దుంపతో తయారు చేసే వంటకం. సామూహిక సమావేశాలలో పోయిని పంచుకోవడం స్నేహం, ఐక్యతకు ప్రతీకగా చెబుతుంటారు. అంతేకాకుండా సందర్శకులకు ఆహారం అందించడం అనేది ఒక కుటుంబం ఉదారతను, అతిథుల పట్ల వారి నిబద్ధతను ప్రదర్శిస్తుందని విశ్వసిస్తారు.టీతో స్వాగతం..నిపుణుల ప్రకారం, మంగోలియా టిబెటన్ పీఠభూమిలో, అతిథులకు తరచుగా వెన్న టీ లేదా పాల టీతో స్వాగతం పలుకుతారు. అతిథి వచ్చిన వెంటనే ఒక గిన్నెడు టీని అందించడం, దానిని స్వీకరించడం గౌరవానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ ఆచారం శతాబ్దాల సంచార సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అక్కడ మనుగడకు ఆతిథ్యం చాలా కీలకం అని ప్రజలు బలంగా విశ్వసిస్తారు.కలాచ్ రొట్టెతో స్వాగతంఉక్రెయిన్, రష్యాలో, అతిథులకు సాంప్రదాయకంగా కలాచ్ అనే ఒక ఉత్సవ రొట్టెతో స్వాగతం పలుకుతారని, తరచుగా దానితో పాటు ఉప్పు కూడా ఉంటుందని చెబుతారు. ఈ సంప్రదాయం స్లోవేకియా రొట్టె-ఉప్పు ఆచారాన్ని పోలి ఉంటుంది; ఈ ఆచారం శ్రేయస్సు, స్నేహం, అలాగే సందర్శకుడు ఎప్పటికీ ఆకలితో ఉండకూడదనే భావనకు ప్రతీక. అలాగే వివాహాలు, రాష్ట్ర పర్యటనలు, సాంస్కృతిక వేడుకలు వంటి ముఖ్యమైన సందర్భాలలో, ఈ రొట్టెను ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రంపై ఉంచి, అతిథులకు ఒక ముక్కను విరిచి ఉప్పులో ముంచుకోమని ఆహ్వానిస్తారు. ఈ ఆచారం నేటికీ అనేక తూర్పు యూరోపియన్ సమాజాలలో ఆప్యాయత ,గౌరవానికి శక్తివంతమైన చిహ్నంగా నిలిచి ఉంండటం విశేషం. (చదవండి: 4,500 ఏళ్ల నాటి మొహంజోదారో నాట్యకారిణి..! ఇప్పటికీ అంత క్రేజ్ ఎందుకంటే..) -
4,500 ఏళ్ల నాటి మొహంజోదారో నాట్యకారిణి..! ఇప్పటికీ అంత క్రేజ్ ఎందుకంటే..
పాఠ్యపుస్తకాల్లో ఆ విగ్రహం మార్పుతో మరోసారి 4,500 ఏళ్ల నాటి మోహంజోదారో డ్యాన్సింగ్ క్వీన్ విగ్రహం తెరపైకి వచ్చింది. ఎన్సీఆర్టీ తొమ్మిదో తరగతి ఎడ్యుకేషన్ పాఠపుస్తకం 'మధురిమ'లో, మోహెంజో-దారోకు చెందిన ప్రసిద్ధ 'నాట్యకారిణి' విగ్రహం మార్పు చేయడంతోనే వివాదం చెలరేగింది. ఈ పాఠ్యపుస్తకంలో కంచు విగ్రహం మొండెంపై నీడను వేసి, ఆ విగ్రహం దుస్తులు ధరించినట్లుగా కనిపించేలా చేశారు. ఈ మార్పుపై చరిత్రకారులు, విద్యావేత్తల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సింధు లోయ నాగరికతకు చెందిన అత్యంత సుపరిచితమైన కళాఖండాలలో ఒకటైన ఈ విగ్రహాన్ని ఎందుకు మార్చారంటూ ప్రశ్నించారు. దీంతో పాత చిత్రాన్నే యథాతథంగా ముద్రిస్తామని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ తెలిపారు. అసలు చరిత్రకారులు, కళా ప్రేమికులు అంతలా ఆరాధించే ఆ నాట్యాకారిని విగ్రహం ఎవరిది..ఎందుకు ఇంత క్రేజ్ అంటే..ఈ నాట్యకారిణి" విగ్రహం, క్రీ.పూ. 2500 ప్రాంతంలో ప్రపంచంలోని తొలి పట్టణ సంస్కృతులలో ఒకటైన సింధు లోయ నాగరికత అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటి. ఈ కంచు విగ్రహాన్ని 1926లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త ఎర్నెస్ట్ మెకే, మొహెంజో-దారో (ప్రస్తుత పాకిస్తాన్) నుంచి తవ్వకాలలో వెలికితీశారు. ఆ ప్రాచీన నగరంలోని 'తొమ్మిదవ సందు'గా పిలిచే మార్గంలో ఒక సాదాసీదా ఇంటి శిథిలాలలో పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. కేవలం 10.5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఈ విగ్రహం ఆశ్చర్యకరంగా చాలా చిన్నది. అయినప్పటికీ, దాని ప్రభావం మాత్రం అసాధారణమైనది.అత్యంత ఆధునిక పద్ధతిలో..హరప్పా స్థలాల నుంచి లభించిన వేలాది టెర్రకోట విగ్రహాల వలె కాకుండా, 'నాట్యకారిణి' విగ్రహాన్ని అత్యంత అధునాతనమైన 'లాస్ట్-వ్యాక్స్ కాస్టింగ్' పద్ధతిని ఉపయోగించి కంచుతో తయారుచేశారు. ఈ పద్ధతి ఎంత ఆధునికమైనదంటే, అది నేటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ విగ్రహం తయారీలో భాగంగా, మైనంతో ఒక నమూనాను చెక్కి, దానికి బంకమట్టి పూత పూసి, ఆ మైనాన్ని కరిగించివేసి, ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలో కరిగిన లోహాన్ని పోస్తారు.కట్టిపడేసే రూపకల్పన..ఇంత సున్నితంగా చెక్కబడిన కంచు వస్తువు ఉనికి, నాలుగు వేల సంవత్సరాల క్రితమే సింధు లోయ ప్రజలకు లోహశాస్త్రం, పోత, కళాత్మక రూపకల్పనలో అత్యంత అభివృద్ధి చెందిన జ్ఞానం ఉండేదని నిరూపిస్తుంది. ఇప్పటికీ ఆధునికంగా అనిపించే ఆ భంగిమ. ఆ డ్యాన్సింగ్ క్వీన్ విగ్రహంలో ప్రధాన ఆకర్షణ అంతా ఆ భంగిమలోనే ఉంది.ఆమె ఒక హారం, అనేక గాజులు ధరించి ఉంది; ఒక చేతికి 24 లేదా 25 గాజులు, మరో చేతికి కేవలం నాలుగు గాజులు ఉన్నాయి. ఆమె జుట్టును ఒక పెద్ద కొప్పులా ముడివేసి, అది ఆమె భుజంపై ఆనించి ఉంది.ఈ విగ్రహాన్ని అధ్యయనం చేసిన బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త సర్ జాన్ మార్షల్ ఇలా పేర్కొన్నారు. "ఒక యువతి, నడుముపై చేయి పెట్టి, కొంటె భంగిమలో ఉంది" అని వర్ణించారు. అంతేగాదు ఆ క్షణానికి, తనపైనా, ప్రపంచంపైనా సంపూర్ణ విశ్వాసంతో ఉన్న ఒక అమ్మాయిగా పేర్కొన్నారు.ఆమె నిజంగా "నాట్యం" చేసిందా?విచిత్రమేమిటంటే, ఆమె అసలు నర్తకి అవునా కాదా అనే విషయంపై చరిత్రకారులు ఏకీభవించలేకపోతున్నారు. ఈ సాంప్రదాయక వ్యాఖ్యానం చాలావరకు మార్షల్ వర్ణన నుంచి ఉద్భవించింది. ఆమె భంగిమ, వంగిన కాలు, నడుముపై చేయి పెట్టిన నిలకడ కదలిక వంటివి కనిపించడంతో చరిత్రకారులు దీన్ని "నాట్యకారిణి" గా పిలిచారు. అంతేగాదు ఆమె ఒక పూజారిణి లేదా పవిత్ర స్త్రీ అయి ఉండవచ్చని కొందరు వాదిస్తారు. మరికొందరు ఆమె ఒక రాణి లేదా సమాజంలోని ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తికి, సంతాన దేవతకు లేదా ఒక యోధురాలికి ప్రతీకగా నమ్ముతారు. ఆమె మెడలోని గాజులు అసాధారణంగా అసమానంగా అమరి ఉండటం, అలాగే ఆ గంభీరమైన భంగిమ తదితరాల్ని ఔను అని అంగీకరించేలా ఉండటం విశేషం. కానీ నిజంగానే ఆమె నర్తకీనేనా అనేది మిస్టరీనే..ఎందుకంటే అందుకు సంబంధించిన ఆధారాలు, నిర్థారణలు కానరాలేదు. పైగా సింధు లిపీ కూడా ఇప్పటికీ దానిపై ఎలాంటి స్పష్టతను ఇవ్వలేకపోయింది. దీని కథ తవ్వకంతో ముగిసిపోలేదు..ఆ విగ్రహాన్ని గుర్తించిన తర్వాత లాహోరల్లో ఉంచారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలన చివరి సంవత్సరాలలో న్యూఢిల్లీలోని సంస్థలకు తరలించారు. 1947లో భారతదేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు, ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రదేశాల నుంచి తవ్వకాలలో లభించిన కళాఖండాల యాజమాన్యంపై వివాదాలు తలెత్తాయి. చివరికి, ప్రసిద్ధ పూజారి-రాజు శిల్పం పాకిస్తాన్ వద్దే ఉండిపోగా, నాట్యకారిణి విగ్రహం భారతదేశం వద్దే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ విగ్రహం న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో భద్రంగా ఉంది. View this post on Instagram A post shared by itihāsology | Indian History & Art (@itihasology) (చదవండి: పసుపు కొమ్ము గణపతి రహస్యం..! గురుగ్రహం దోషాలకు పరిష్కారంగా..) -
ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి రూ. 20 లక్షలు : ఎలా?
ఓర్హాన్ అవత్రామణి (Orhan Awatramani) అలియాస్ ఓర్రీ (Orry) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, బాలీవుడ్ స్టార్స్కు అత్యంత సన్నిహితుడిగా సుపరిచితుడు. బిజినెస్, సినిమా ఇలా ఎక్కడ ఏ సెలబ్రిటీ పార్టీ జరిగినా అక్కడ ఓర్రీ వాలిపోవాల్సిందే. అంతేకాదు స్టార్ హీరోయిన్లు, మొదలు, స్టార్ కిడ్స్దాకా క్రేజీ పోజులిస్తూ హాట్ టాపిక్గా నిలుస్తుంటాడు. తాజాగా ఓర్రీ తెగ హల్ చల్ చేస్తున్నాడు. ఎలాంటి ఉద్యోగం లేకుండా ఆయనకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఏం పని చేస్తాడు? ప్రతి సెలబ్రిటీ పార్టీలో కనిపించడం, స్టార్స్తో కలిసి వెకేషన్స్ వెళ్లడం, సోషల్ మీడియా ఫీడ్లో హల్చల్ చేయడం ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, కేవలం సెలబ్రిటీలతో ఉన్న పరిచయాలు, వినూత్నమైన ఫ్యాషన్ సెన్స్, పార్టీలతో ఇంటర్నెట్ సంచలనంగా నిలుస్తుంటాడు. ఇటీవల కావ్య కర్నాటక్ హోస్ట్ చేసిన 'లెర్న్ బై కేకే క్రియేట్' (Learn by KK Create) పాడ్కాస్ట్లో పాల్గొన్న ఓర్రీ తన సంపాదనా రహస్యాలను పంచుకున్నాడు. ముఖ్యంగా తన పర్సనల్ బ్రాండ్, ఆన్లైన్ క్రేజ్ను ఒక లాభదాయకమైన వ్యాపారంగా ఎలా మార్చుకున్నాడో వివరించారు. దీంతో ఈ విషయాలు తెగ వైరల్గా మారాయి.ఒక్క డీల్తో రూ. 76 లక్షలుతన ఆదాయం గురించి ఓర్రీ మాట్లాడుతూ.. తన సంపాదనలో ఎక్కువ భాగం బ్రాండ్ కొల్లాబొరేషన్స్ (Brand Collaborations) , పెయిడ్ అప్పియరెన్స్ (డబ్బులు తీసుకుని ఈవెంట్స్కు వెళ్లడం) ద్వారా వస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా గత నెలలో నేను కేవలం ఒకే ఒక్క డీల్, అంటే ఒకే ఒక్క రీల్ (Reel) ద్వారా రూ. 76 లక్షలు సంపాదించాను అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కోసం బ్రాండ్స్ ఇంత చెల్లిస్తున్నాయా అని నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొంతమంది ఈ నెంబర్ చూసి షాక్ అవుతుంటే, మరికొందరు మాత్రం తనకున్న క్రేజ్ను బిజినెస్గా మార్చుకున్న ఓర్రీ తెలివిని అభినందిస్తున్నారు.అలాగే ఓర్రీ వ్యాపారం కేవలం సోషల్ మీడియా ప్రమోషన్లకే పరిమితం కాలేదు. ప్రైవేట్ ఈవెంట్స్కు వెళితే రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తాడట. ఇందులో లంచ్లు, డిన్నర్లు, బర్త్డే పార్టీలు, పెళ్లిళ్లు మరియు ఇతర ఫంక్షన్లు ఉంటాయి."రూ. 15-రూ. 25 లక్షలు ఇస్తే, మీరు నన్ను లంచ్కి లేదా డిన్నర్కి పిలవొచ్చు. మీ పెళ్లికి లేదా బర్త్డేకి వస్తాను. మనం చిన్నప్పటి స్నేహితులం అన్నట్లుగా అక్కడ స్పీచ్ ఇస్తాను. మీతో కలిసి తిరుగుతాను, మీ పేరెంట్స్తో కలిసి షాట్స్ వేస్తాను. మీరు ఎవరిని కలవమంటే వారిని కలుస్తాను. ఇదొక ఎక్స్పీరియన్స్, దీన్ని మీరు డబ్బులతో కొనవచ్చు" అంటూ ఛలోక్తులు విసిరాడు. ఈవెంట్స్కు వెళ్ళడమే కాకుండా, అక్కడ ఉన్న అతిథులతో మాట్లాడటం, ఫోటోలకు ఫొజులివ్వడం , తన ఫేమస్ 'సిగ్నేచర్ పోజ్' ఇవ్వడం వంటివి కూడా చేస్తారు.ఇదీ చదవండి: అఫ్గాన్లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!పర్సనల్ బ్రాండింగ్ పవర్అటెన్షన్ అనేది ఒక విలువైన వస్తువుగా మారిన ఈ రోజుల్లో, ఒక వ్యక్తిని కూడా ఒక సర్వీస్ లాగా మార్కెట్ చేయవచ్చని నిరూపిండంలో ఓర్రీ ఆరితేరిపోయాడు. ప్రస్తుత కాలంలో 'క్రియేటర్ ఎకానమీ' (Creator Economy) వల్ల ఫేమ్ను క్యాష్ చేసుకునే విధానం పూర్తిగా మారిపోయిందని ఓర్రీ అభిప్రాయపడ్డారు. తన సిగ్నేచర్ పోజ్ పాపులారిటీ గురించి జోక్ చేస్తూ..హిందుస్తాన్లో కేవలం ఇద్దరి పోజులు మాత్రమే ఫేమస్ - ఒకటి షారూఖ్ ఖాన్, రెండు ఓర్రీ అన్నంత స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నాడు. డబ్బును ఎవరు మేనేజ్ చేస్తారు అని ప్రశ్నించినపుడు సింపుల్గా అమ్మానాన్ని అని సమాధానమివ్వడం విశేషం. భవిష్యత్తులో ఆ విషయంలో తల్లిదండ్రులకే బాధ్యత వదిలేస్తాను అని కూడా చెప్పాడు. -
ఆలయాల్లో.. ద్వారపాలకులు ఎందుకు?
సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా.. గర్భాలయం వెలుపల.. ద్వారానికి అటూఇటూ ఇద్దరు ద్వారపాలకులుంటారు. ప్రాచీన ఆలయాల్లో కూడా అందమైన విగ్రహాల రూపంలో ద్వారపాలకులను ప్రతిష్టించారు. అసలు ఆలయాల్లో ద్వారపాలకులెవరు? ప్రధాన దేవతలకు ద్వారపాలకుల అవసరం ఉంటుందా? వైష్ణవ, శైవ, శక్తి ఆలయాల్లో ఎవరెవరు ద్వారపాలకుల బాధ్యతలను నెరవేరుస్తారు? ఈ వివరాలను గురించి సవివరంగా తెలుసుకుందాం..ఆలయాల్లో గర్భాలయాల వెలుపల విగ్రహాల రూపంలో ఉండే ద్వారపాలకులు కేవలం కావాలివారు అనుకోవడానికి వీళ్లేదు. ఆలయానికి వచ్చే భక్తుడి మానసిక స్థితిని దైవదర్శనానికి అనుగుణంగా మార్చే ఆధ్యాత్మిక సంకేతాలుగా ద్వారపాలకులు నిలుస్తారని పండితులు చెబుతుంటారు. సైన్స్ కూడా.. గర్భాలయం నిర్మాణ శైలి.. గాలిగోపురం వంటివి భక్తుల్లోని నెగటివ్ ఎనర్జీని లాక్కొని.. ఆకాశంలోకి కలిపేసి.. వారిలో పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేసేందుకు దోహదపడే అంశాలుగా ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ ద్వారపాలకులు కూడా సరిగ్గా అదే పని చేస్తారని తెలుస్తోంది. భక్తుల చిత్తాన్ని దేవుడిపై ఉండేలా వీరు అనుగ్రహిస్తారని పెద్దలు చెబుతుంటారు.ఆలయంలో దేవతను బట్టి..ద్వారపాలకులు..గర్భాలయంలో ఉండే దేవతలను బట్టి.. ద్వారపాలకులు ఉంటారు. విష్ణు ఆలయాల్లో జయవిజయులు ద్వారపాలకులుగా ఉంటారు. వీరిద్దరూ వైకుంఠంలో మహావిష్ణువుకు ద్వారపాలకులు అనే విషయం తెలిసిందే..! వీరిద్దరికీ కూడా విష్ణుదేవుడి మాదిరిగా నాలుగు చేతులుంటాయి. శంఖచక్రాలను ధరించి ఉంటారు. ఇక శివాలయాల్లో చూస్తే.. ద్వారపాలకులుగా దిండి, మొండి ఉంటారు. వీరిద్దరూ శివుడి ప్రధాన గణాల్లోని మహాకాలుడు, నందికి ప్రతిరూపాలుగా చెబుతారు. దిండి, మొండి.. వీరిద్దరిలో ఒకరు శూలాన్ని, ఢమరుకాన్ని ధరించి ఉంటారు. కొన్ని ఆలయాల్లో ధాత్రి, విధాత్రి అనే పేర్లతో కూడా వీరిని పిలుస్తారు. వీరిద్దరూ భక్తుల హృదయంలో ఉండే భయాన్ని, భీతిని తొలగించి, వారి చిత్తం శివుడిపైకి మళ్లేలా చూస్తారని పండితులు చెబుతున్నారు. ఇక అమ్మవారు, శక్తి ఆలయాల్లో స్త్రీ ద్వారపాలికలు ఉంటారు. మీరు గమనించవచ్చు.. గర్భాలయంలో ఉండే అమ్మవారు శాంతస్వరూపిణి అయితే.. ద్వారపాలికలు శాంతంగాను.. అమ్మవారు క్రోదం, రౌద్ర స్వరూపిణిగా ఉంటే.. ద్వారపాలికలు ఉగ్రంగా ఉంటారు. అందుకు కారణాలను మనం మరో వీడియోలో తెలుసుకుందాం. అయితే.. అమ్మవారి స్వరూపాన్ని బట్టి.. ద్వారపాలికలు మారుతుంటారు.ప్రతీ ఆలయంలో ద్వారపాలకులకు విశిష్ఠత ఉంటుంది. వీరు ఆలయ పవిత్రతను, అనంత శక్తిని కాపాడతారని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా భక్తులు గర్భాలయంలో ప్రధాన దేవతామూర్తిని దర్శించడానికి ముందు.. ద్వారపాలకులకు నమస్కరిస్తేనే ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ద్వారపాలకులు అనేది కేవలం శిల్పకళ కోసమో.. అలంకారం కోసమో కాదని, వారి అనుమతితోనే ముందుకు సాగాలని వివరిస్తున్నారు. ఆలయాలను నిర్మించిన రాజులు, రాజవంశాలు కూడా ద్వారపాలకుల శిల్పాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవి. గంగైకొండ చోళపురం వంటి చోట్ల.. భారీకాయులైన ద్వారపాలకులు కనిపిస్తారు. పల్లవుల కాలంలో సహజసిద్ధమైన మానవరూపాలకు సారూప్యంగా ఉండే ద్వారపాలకులకు ప్రాధాన్యమిచ్చారు. చాళుక్యుల కాలంలో ద్వారపాలకులకు కూడా అలంకారానికి ప్రాధాన్యతనిచ్చారు. బౌద్ధ, జైన ఆలయాల్లో యక్షుల రూపంలో లేదా ధర్మరక్షకులుగా, సౌమ్యులుగా ద్వారపాలకులు దర్శనమిస్తారు. సో.. ద్వారపాలకుల గురించి తెలిసింది కదా?? ఇకపై ఏ దేవాలయానికి వెళ్లినా.. ముందుగా ద్వారపాలకులకు నమస్కరించాకే.. ప్రధాన దేవతామూర్తిని దర్శించుకోవాలనే విషయాన్ని మర్చిపోవొద్దు. (చదవండి: హిమాలయాల నడుమ చల్లని స్వర్గం) -
జస్పాల్ రాణా మృతి: గుండెపోటు విషయంలో బహుపరాక్!
భారత దిగ్గజ షూటర్, కోచ్ జస్పాల్ రాణా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిజానికి ఆయన ప్రయాణంలో ఉండగానే.. ఆసుపత్రికి చేరుకునే ముందు కూడా ఛాతీ నొప్పి కొనసాగింది. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని స్థిరీకరించినప్పటికీ, గుండె పంపింగ్ సామార్థ్యం ఫెయిలై మృతి చెందారు. అంతేగాదు వైద్యులు ఆయన మరణం భారతదేశంలో మధ్య వయస్కులలో పెరుగుతున్న గుండె సంబంధిత మరణాలపై ఆందోళన రేకెత్తించింది. చాలామంది తేలిగ్గా కొట్టిపారేయడంతోనే ఆ టైంలో గోల్డెన్ అవర్ని పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత సమస్యలను గోల్డెన్ అవర్లోనే గుర్తించి ఎలా ప్రాణాలు రక్షించుకోవాలో సవివరంగా తెలుసుకుందామా.ప్రముఖ భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా విషాద మరణం, గుండెపోటు కేవలం వృద్ధులకు, అనారోగ్యవంతులకు మాత్రమే వస్తుందనే అపోహపై చర్చలను లేవనెత్తింది. వైద్యుల ప్రకారం, రాణాకు తెలియకుండానే మూడు రోజుల పాటు గుండెపోటుతో బాధపడ్డట్టు సమాచారం. ఆ తర్వాత ఆయన వైద్య సహాయం తీసుకున్నారు. అక్కడికి రాణాకు అత్యవసర చికిత్స విజయవంతంగా అందించినప్పటికీ, ఆ ఆలస్యం చివరికి ప్రాణాంతకంగా మారింది. గుండెపోటు విషయంలో ప్రతి నిమిషం విలువైనదేనని ఆయన ఉదంతం గట్టిగా గుర్తుచేస్తుంది. సన్నగా, దృఢంగా, కండరాలతో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని హెచ్చిరిస్తున్నారు వైద్యులు. అంతేగాదు చాలామటుకు పలు కేసుల్లో 30 ఏళ్ల మగవారిలోనే ఈ గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇందుకు ఆహారం, జీవనశైలి వంటివే కారణాలని చెబుతున్నారు వైద్యులు.ఇక్కడ జస్పాల్ రాణా కూడా విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడూ తీవ్రమైన ఛాతీ అసౌకర్యాన్ని అనుభవించాడు. కానీ ఆ లక్షణాలు ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ (జీర్ణకోశ సమస్య)కు సంబంధించినవిగా భావించాడు. పైగా ప్రయాణం కొనసాగించాడు. ఆ క్షణమే తక్షణ వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంది, కానీ ఆయన తీసుకోకపోవడంతో గుండె పనితీరు బలహీనమై వైఫల్యానికి దారితీసిందని చెబుతున్నారు వైద్యులు. నిజానికి రాణా మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినా..ఆ తర్వాత ఆయన కార్డియాక్ రప్చర్ (గుండె పగిలిపోవడం) సంభవించిందని వైద్యులు తెలిపారు. ఇది తీవ్రమైన గుండెపోటు తర్వాత సంభవించే ఒక అరుదైన ప్రాణాంతక సమస్యగా పేర్కొన్నారు వైద్యులు.గోల్డెన్ అవర్ ఎందుకు ముఖ్యం?గుండెపోటు ప్రారంభమైన తర్వాత మొదటి 60 నిమిషాలను హృద్రోగ నిపుణులు "గోల్డెన్ అవర్" అని పిలుస్తారు. ఈ సమయంలో, సత్వర చికిత్స గుండె కండరాల నష్టాన్ని గణనీయంగా తగ్గించి, మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుంది. గుండెపోటు సమయంలో ప్రతి నిమిషం విలువైనది. రోగులు మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, చికిత్సలో జాప్యం కోలుకోలేని గుండె నష్టం, ప్రాణాంతక సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా కొన్ని గంటలకు మించి ఆలస్యం అయితే గుండెకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి రక్త సరఫరా నిలిచిపోతే, గుండె కండర కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. చికిత్సను ఎంత ఆలస్యం చేస్తే, గుండె వైఫల్యం, ప్రమాదకరమైన అరిథ్మియాలు, కార్డియోజెనిక్ షాక్, గుండె పగిలిపోవడం వంటి సమస్యల ప్రమాదం అంత తీవ్రంగా ఉంటుంది. అందుకే కీలకమైన ముందస్తు చికిత్స అందించడం వల్ల రోగిని అనేక సంభావ్య సమస్యల నుంచి కాపాడవచ్చు అని చెబుతున్నారు. కానీ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవ్..గుండెపోటును తరచుగా గుర్తించలేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, దాని లక్షణాలు ఎల్లప్పుడూ తీవ్రమైన ఛాతీ నొప్పిగా కనిపించవు. సాధారణ హెచ్చరిక సంకేతాలు:ఛాతీలో ఒత్తిడి, బరువుగా అనిపించడం, బిగుతుగా ఉండటం లేదా నొప్పిచేయి, దవడ, మెడ, భుజం లేదా వీపుకు వ్యాపించే నొప్పిఆయాసంఅధికంగా చెమట పట్టడంవికారం లేదా వాంతులుతల తిరగడం లేదా అసాధారణమైన అలసటఎసిడిటీగా పొరబడే పై పొట్టలో అసౌకర్యందాదాపు మూడింట ఒక వంతు గుండెపోటులను మొదట్లో అజీర్ణం, కండరాల ఒత్తిడి లేదా అలసటగా కొట్టిపారేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.యువకుల్లోనే అధికం ఎందుకంటే..గతంలో కంటే ఇప్పుడు యువకులలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. నిశ్చల జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం, పొగాకు వాడకం, సరిగా నిద్రపోకపోవడం, ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం, అధిక స్క్రీన్ సమయం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తదితరాలే కారణమని చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో చిన్నవయసులోనే ఈ సమస్య బారిన పడినట్లయితే అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే శారీరకంగా దృఢంగా ఉండటం, లేదా సాధారణ శరీర బరువుని కలిగి ఉండటం అనేది హృదయ సంబంధ వ్యాధుల దరిచేరవని కాదు అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.తీసుకోవాల్సిన జాగ్రత్తులు..క్రమం తప్పకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం పరీక్షలు చేయించుకోవడంధూమపానం, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండటం. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడంపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవడంఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పాటించడంఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం(చదవండి: ఏరోస్పేస్ ఉద్యోగాన్ని వదిలి కేఫ్..! ఏడాదికి రూ. 1.44 కోట్లు..) -
ప్రియాంకా చోప్రా తల్లి హెయిర్ టిప్స్..! ఇంట్లోనే హెయిర్ మాస్క్..
ప్రియాంక చోప్రా తల్లి డాక్టర్ మధు అఖౌరి చోప్రా గతంలో కాంతివంతమైన ముఖం కోసం సౌందర్య చిట్కాలను పంచుకోగా తాజాగా ఒత్తైన జుట్టు కోసం సింపుల్ హెయిర్ టిప్స్ షేర్ చేశారు. కురులు ఒత్తుగా దృఢంగా ఉండాలంటే సెలూన్లకు వెళ్లాల్సిన పనిలేదని, ఇంట్లోనే చేసే హెయిర్ మాస్క్ చక్కటి ఫలితాన్ని ఇస్తుందని అంటోంది డాక్టర్ మధు అఖౌరి. చలన చిత్ర నిర్మాణ, కాస్మెటాలజిస్ట్, స్టూడియో ఈస్తటిక్ సహా వ్యవస్థాపకురాలు అయిన డాక్టర్ మధు 40 ఏళ్ల వృత్తి అనుభవంతో జుట్టు సంరక్షణకు సంబంధించిన చిట్కాలు, పద్దతులు గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అదికూడా ఇంట్లోనే సులభంగా చేసుకోగలిగే హెయిర్ మాస్క్ గురించి వివరించారు. తన వారపు సంరక్షణ దినచర్యలో భాగంగా ఒక హెయిర్ మాస్క్ తయారీ విధానాన్ని పంచుకున్నారు. వంటగదిలో అందుబాటులో ఉండే ఈ మాస్క్ జుట్టు ఒత్తుగా ఉండేందుకు ఎలా ఉపకరిస్తుందో సవివరంగా వెల్లడించారామె. తయారీ విధానం..అందుకోసం కొబ్బరి నూనె, మెంతులు, రోజ్మేరీ (నూనెలో ఒక రోజ్మేరీ రెమ్మ), కొంచెం ఉడికించిన బియ్యం నీరు (గంజి), చియా విత్తనాలు తీసుకుంటానని అన్నారు. ఇక్కడ నానబెట్టిన చియా విత్తనాల వల్ల ఆ మిశ్రమం జెల్లీలాంటి ఆకృతిని పొంది, జుట్టుకు సులభంగా రాసుకునేలా మారుతుందని ఆమె తెలిపారు. ఒక్కో పదార్థం ఒక చిన్న చెంచా చొప్పున తీసుకుని ఒక అద్భుతమైన మాస్క్ను తయారు చేస్తానని అన్నారామె. దీన్ని జుట్టుకు రాసుకుని గంటసేపు ఉంచి, ఆ తర్వాత కడిగేస్తానని అన్నారామె. ఇది తన జుట్టుని ఒత్తుగా ఉండేలా చేయడంలో సహాయపడుతుందంటూ తన వీడియోని ముంగించారు 73 ఏళ్ల మధు అఖౌరి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి మరి. View this post on Instagram A post shared by Dr Madhu Akhouri Chopra (@drmadhuakhourichopra) (చదవండి: '30-60-90-108' సూర్య నమస్కారాల సాధన..! నటి కరీనా సైతం..) -
'30-60-90-108' సూర్య నమస్కారాల సాధన..! నటి కరీనా సైతం..
బరువు తగ్గడం కోసం జిమ్, ఇతర అధిక తీవ్రతర వర్కౌట్ల కంటే యోగా బెస్ట్ అని చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందులో ఉండే కొన్ని రకాల ఆసనాలు కండరాలు, కీళ్లను బలోపేతం చేసి..అదనపు కొవ్వు తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధిగాంచింది సూర్యనమస్కారాలు. వెయిట్ ట్రైనింగ్ కోసం ప్రతి వారాంతంలో చేయగల ఒక వ్యాయామం 30-60-90-108 సూర్య నమస్కారాలు. బరువు తగ్గాలనుకునేవారందరికీ ఇది బెస్ట్ అని చెబుతోంది ప్రముఖ యోగనిపుణురాలు రూపాళ్ సిధ్. బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్తో కూడా ఇది చేయించానని అన్నారు. ఈ ముద్దుగుమ్మ కరీనా ఒకేసారి 50 సూర్య నమస్కారాలు, ఆ తర్వాత 108 రౌండ్లు చేసేదన్నారు. మరి అంతలా సూర్యనమస్కారాలు ఎలా చేయాలి..?, బరువు తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితరాల గురించి ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.యోగా నిపుణురాలు సిధ్ బరువు తగ్గాలనుకుంటే..సూర్యనమస్కారాలు ఎలా చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, వంటి వాటి గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ముందుగా చేయాల్సినవి కొన్ని..ప్రతిరోజూ 10 వేల అడుగులు వేయండివేగంగా కొవ్వు తగ్గించుకోవడానికి, జీవక్రియను పెంచేందుకు ప్రతిరోజూ 6 పూటలా చిన్న చిన్న భోజనాలు చేయండివెయిట్ ట్రైనింగ్తో కండరాలను పెంచుకోండి. బరువులు ఎత్తడం ప్రారంభించండి, కానీ క్రమంగా పెంచండిప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీరు త్రాగండిఉదయం పూట ముందుగా కొవ్వును కరిగించండిప్రతిరోజూ కనీసం 45 నిమిషాల యోగా/వర్కౌట్ చేయండిప్రతి భోజనం తర్వాత నడవండిచిన్న చిన్న భాగాలుగా ఆహారం తీసుకోండికనీసం 8 గంటలు నిద్రపోండి108 రౌండ్లు సూర్య నమస్కారాలు ఎలా చేయాలంటే..సూర్య నమస్కారం అనేది బలం, చలనశీలత, వశ్యత, సమతుల్యత, హృదయ సంబంధ ఓర్పుని మిళితం చేసే ఒక పూర్తి శరీరా కదలికల క్రమం. 108 రౌండ్లు పూర్తి చేయడం అనేది రోజువారీ ఫిట్నెస్ అవసరం కంటే ఎక్కువ. పైగా శారీరకంగా మానసికంగా సవాలుగా ఉంటుంది. ఇన్ని సార్లు చేయాలంటే..నెమ్మదిగా సెషన్లు పెంచడమే తెలివైన విధానం అని అంటున్నారామె. పరుగు లేదా బలవర్ధక శిక్షణ మాదిరిగానే, పునరావృతమయ్యే కదలికలకు శరీరం అలవాటు పడటానికి సమయం పడుతుంది. కొన్ని రోజుల పాటు సూర్య నమస్కారాలను 30 నుంచి 60కి, ఆపై 90కి, చివరకు 108కి పెంచాలి. దీని వల్ల కండరాల ఓర్పు, కీళ్లు తట్టుకునే శక్తి, హృదయ సంబంధ సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటం తోపాటు తరుచుగా అయ్యే గాయాల ప్రమాదాలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు యోగా నిపుణులు. అయితే ఇక్కడ రౌండ్లు పెంచడం అనేది వ్యక్తిగత ఫిట్నెస్ స్థాయిలు, వయస్సు, కోలుకునే సామర్థ్యం, టెక్నిక్ నాణ్యతపై ఆధారపడి ఉంటుందని అన్నారు.అయితే సరైన పద్ధతిలో 20–30 సూర్య నమస్కారాలు సునాయాసంగా చేసేవారికి, ప్రతి వారం మరిన్ని అదనపు రౌండ్లు జోడించొచ్చు కానీ..ప్రారంభకులు మాత్రం ఒకేసారి ఎక్కువ రౌండ్లు చేస్తే మాత్రం మణికట్టు నొప్పి, భుజం బెణకడం, నడుము నొప్పి లేదా అధిక అలసటకు దారితీయవచ్చు. ఒక సూర్యనమస్కారం భుజాలు, ఛాతీ, వీపు, కోర్, గ్లూట్స్, కాళ్లతో సహా అనేక కండర సముహాలను కదిలిస్తుంది. అలాంటిది వీటిని వందసార్లకు పైగా పునరావృతం చేస్తే..కీళ్లు, కండరాలపై గణనీయమైన భారం పడుతుందనేది గుర్తెరగాలి. కాబట్టి వీటన్నింటిన పరిగణలోని తీసుకుని యోగా నిపుణులు సమక్షంలో చేయడం ఉత్తమం. వైద్యపరంగా కూడా సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిలకడగా..చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామటుకు క్రమం తప్పకుండా చేస్తే 12–24 నాణ్యమైన రౌండ్లు మంచి ప్రయోజనాలు ఇస్తాయని నమ్మకంగా చెప్పారు.ఎవరైనా 108 చేయాలనుకుంటే..1–2 వారాలు: 24–30 రౌండ్లు3–4 వారాలు: 40–50 రౌండ్లు5–6 వారాలు: 60–75 రౌండ్లు7–8 వారాలు: 90+ రౌండ్లుఆ తర్వాత, రికవరీ టెక్నిక్ బలంగా ఉన్నప్పుడు 108 ప్రయత్నిస్తే మంచిదని అన్నారు. ఇక్కడ ఫిట్నెస్ సవాళ్లను పరీక్షలా కాకుండా, శిక్షణలా స్వీకరించాలని అన్నారు. View this post on Instagram A post shared by Rupal Sidhpura Faria | Yoga & Travel (@rupal_sidh)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే మందుకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: థాయిలాండ్లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్ ..) -
నాన్నకు ప్రేమతో..నాన్నకు ప్రేమతో..
ప్రతి స్టేజీ మీద అవార్డ్ అందుకునే చేతుల వెనుక, ఆ చేతుల్ని చిన్నప్పుడు స్కూల్ గేట్ దగ్గర వదిలిపెట్టి, వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న ఒక జత కళ్లు ఉంటాయి. ఆ కళ్ల పేరే నాన్న. ఆటగాడు స్టేడియంలో సిక్స్ కొడితే కెమెరా అతడి మొహం చూపిస్తుంది. కానీ గ్యాలరీలో సీట్ దొరక్క నిలబడి, ‘వాడు మా అబ్బాయిరా’ అని పక్కవాడి భుజం తడుతూ గర్వంగా చెప్పే మనిషిని చూపించదు. ఆ మనిషి నాన్న.అమ్మాయి ఐ.ఏ.ఎస్ అయ్యి వార్తల్లోకి వస్తే, ‘మా ఊరి అమ్మాయి’ అని ఊరంతా సంబరపడుతుంది. కానీ ఆ అమ్మాయిని రాత్రిళ్లు దీపం కింద కూర్చోబెట్టి, తోడుగా కునికిపాట్లు పడుతూ కూచున్న నీడని మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఆ నీడ పేరు నాన్న.నాన్న ‘లేదు’ అనే మాటని ఇంట్లో పిల్లల ముందు పలకడు. అడిగితే ఆయన జవాబు ఒక్కటే ‘తీసుకో నాన్నా’. నాన్న జేబుకి చిల్లు ఉంటుంది. కానీ కొడుకు పాకెట్ మనీకి లోటు ఉండదు. నాన్న చెప్పులు అరిగిపోతాయి, కానీ కూతురి స్కూల్ షూస్ కొత్తగా మెరుస్తూ ఉంటాయి.నాన్న తన కలల్ని ష్యూరిటీగా ఇచ్చి, పిల్లల కలలకి డౌన్ పేమెంట్ కడతాడు.పిల్లల విజయం వెనుక అమ్మ ఉంటుంది నిజమే. కానీ ఆ అమ్మ చేతిలో గరిటె ఆగకుండా తిప్పడం వెనుక, ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ తొక్కుతూ డ్యూటీకి వెళ్లిన, ఫ్యాక్టరీలో ఓవర్టైం చేసిన, ఎండలో ఆటో నడిపిన ఒక మనిషి చెమట ఉంటుంది. ఆ మనిషి నాన్న.ఫాదర్స్ డే జూన్ 21న. ఈ సందర్భంగా సమాజంలో ఎందరో సామాన్య అసామాన్య నాన్నలను గుర్తు చేసుకుందాం.రోజుకో నాన్నకి నమస్కరించుకుందాం.ఫోటోలో కనిపించని, ఫ్లెక్సీలో పేరు లేని, అవార్డ్ అందుకోని నాన్నలందరికీ... ఈ కాలమ్ అంకితం.నాణెం కాదు ప్రాణంగొంతెమ్మె కోరికలు కోరకు.. ఉన్నదాంట్లో సర్దుకో..అన్నమాటను చిన్నప్పుడు మనమంతా ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. మరీ ముఖ్యంగా దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఈమాట సర్వసాధారణం.. ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని జష్పూర్ జిల్లా, కేసరపాత్ గ్రామంలో నివసించే బజరంగ్ రామ్ భగత్ది అలాంటి కుటుంబమే. అతను గుడ్లు, శెనగలు అమ్ముతూ వ్యవసాయం చేసుకునే ఒక సన్నకారు రైతు. అతని కుమార్తె చంపా భగత్ బీకామ్ చదువుతోంది. తనకేమో స్కూటీ నడపాలని, కాలేజ్కి వెళ్లాలని చాలా ఆశ. పదేపదే స్కూటీ కావాలని చంపా నాన్నని అడిగేది. కాని స్కూటీ ధర అక్షరాలా లక్ష. అంత డబ్బు భగత్ దగ్గర లేదు. అప్పు చేసే ధైర్యం లేదు. అలాగని కూతురు మనసుని నొప్పించాలనీ లేదు. అందుకే ప్రతిరోజూ వ్యాపారంలో మిగిలే పది, ఇరవై రూపాయల నాణేలను పోగు చేశాడు. అలా దాదాపు ఏడు నెలలు పోగు చేశాక కూతురుని వెంటబెట్టుకుని బైక్ షో రూమ్కి వెళ్లాడు. అక్కడ సంచుల నిండా ఉన్న నాణేలను తెరచి నేలమీద పోయడం చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు. సిబ్బంది దాదాపు మూడు గంటలపాటు నాణేలను లెక్కపెట్టగా నలభైవేలకు తేలింది. ఆ మొత్తాన్ని అక్కడ డౌన్ పేమెంట్గా కట్టి కుమార్తెకు స్కూటీని కొనిచ్చాడు. స్కూటీ నడపాలన్న ఆశను కుటుంబ ఆర్థిక స్థోమత సవాల్ చేసినా, కూతురు మీదున్న ఆ తండ్రి ప్రేమ పేదరికాన్ని జయించి చూపింది.నాన్నేనెట్వర్క్పిల్లల కోసం తండ్రులు ఎంతటి త్యాగానికైనా... కష్టానికైనా వెనుతీయరనడానికి ఇదో ఉదాహరణ. దక్షిణ కర్ణాటకలోని బల్లక్క గ్రామంలో నారాయణ అనే రైతు తన కూతురు చదువు కోసం వర్షాన్ని సైతం లెక్క చేయలేదు. గ్రామంలో నెట్వర్క్ లేకపోవడంతో నారాయణ కూతురు గ్రామం బయటకు వెళ్లి ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేది. నెట్వర్క్కి తోడుగా ఒకరోజు ఊరిలో భారీ వర్షం కురిసింది. ఇప్పుడు క్లాసులకు హాజరు కావడం మరింత జటిలంగా మారింది. అయినా సరే తన కూతురు క్లాసులకు మిస్ కాకూడదని నారాయణ కూడా వచ్చి ఇలా గొడుగుపట్టుకుని నిలబడ్డాడు. ఒకవైపు కూతురు తడవకుండా చూసుకుంటూ మరోవైపు తను తడుస్తూ నిలుచున్నాడు. ఈ హృద్యమైన దృశ్యాన్ని చూసిన స్థానిక జర్నలిస్ట్ మహేష్ పుచ్చప్పాడి తన కెమెరాలో క్లిక్మనిపించి ట్విట్టర్లో పెట్టాడు. ప్రతి రోజూ సాయంత్రం 4గంటలకు నారాయణ తన కూతురు ఆన్లైన్ క్లాసుల కోసం ఇదే ప్రదేశానికి తీసుకువస్తున్నాడని, మారుమూల ప్రాంతంలో నెట్వర్క్ లేక ప్రజలు పడుతున్న అవస్థలకు ఇదొక ఉదాహరణ అంటూ పేర్కొన్నాడు.స్విగ్గీ డాడీకొన్ని నెలల కిందట వైరల్ అయిన ఫొటో ఇది. స్విగ్గీలో పని చేస్తున్న ఓ వ్యక్తి తనతో పాటు కూతుర్ని కూడా తీసుకెళ్లాడు. ఓ అపార్ట్మెంట్లో డెలివరీ ఇచ్చాక కాస్త సమయం దొరికింది. అపార్ట్మెంట్ మెట్లు దిగుతూ ఓ చోటు చూసుకుని కూర్చుని పుస్తకం తీసి తన కూతురికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చక్కటి దృశ్యాన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే..కొన్ని గంటల్లోనూ వేలాది లైకులు, కామెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. కూతురు కోసం కష్టపడుతున్న తండ్రిని శభాష్ అని మెచ్చుకుంటూ రియల్ హీరో స్విగ్గీ డాడీ అంటూ పోస్ట్లు చేశారు. తండ్రి అన్నవాడు ఎంత కష్టపడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా అదంతా బిడ్డ కళ్లల్లో ఆనందం చూడ్డానికేనని, బిడ్డకి మంచి భవిష్యత్ ఇవ్వడానికేనని ఈ ఫొటో నిరూపించింది. నిర్వహణ : శ్రావణ్ జయ -
పాతికేళ్ల 'లగాన్' వేడుకలో..స్పెషల్ అట్రాక్షన్గా కరీనా కపూర్!
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) కెరీర్లోనే కాదు.. భారత సినీ చరిత్రలోనే ఓ మైలురాయి లాంటి చిత్రంగా నిలిచిపోయింది ‘లగాన్. ఈ మూవీ ఒకవైపు దేశభక్తిని, మరోవైపు యువతను విశేషంగా ఆకర్షించే క్రికెట్ సన్నివేశాల మేళవింపుతో భావోద్వేగభరితంగా తెరకెక్కించిన క్లాసిక్ చిత్రంగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. దర్శకుడు అశుతోష్ గోవారికర్ (Ashutosh Gowariker) తెరకెక్కించిన ఈ మూవీ 2001 జూన్ 15న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్తో దూసుకుపోతూ.. సూపర్ హిట్గా నిలిచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సరిగ్గా ఈ నెల 15తో 25 ఏళ్లు పూర్తైయ్యాయి. ఈ సందర్భంగా ఈ మైలురాయిని పురస్కరించుకుని, నటుడు ఆమిర్ ఖాన్, దర్శకుడు అశుతోష్ గోవారికర్ జూన్ 13న ముంబైలో ఒక ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీనా కపూర్ ఖాన్, సల్మాన్ ఖాన్తో సహా బాలీవుడ్ అగ్రశ్రేణి తారలు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ తనదైన గ్లామరస్ లుక్తో అలరించారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే బేబో పింక్ కుర్తాలో గులాబీలా మెరిసింది. ఈ వేడుకలో ఆమె ధరించి డ్రస్, హైహిల్స్ ధర వింటే విస్తుపోవాల్సిందే. ఇది ఎకాయ బనారస్ బ్రాండ్కి చెందిన సిల్క్ కుర్తా. డిజైనర్ అమృత గిల్ షేర్ రూపొందించారు. కరీనా డిజైనర్వేర్పై క్లిష్టమైన, చేనేత కట్వర్క్ బనారసీ డిజైన్లు ఉన్నాయి. ఫ్లేర్డ్ కుర్తాను స్ట్రెయిట్ ప్యాంట్లు, దానికి సరిపోయే షీర్ దుపట్టాతో జత చేశారు. ఈ లుక్ని మరింత అందంగా కనిపించేలా అక్వాజురా హీల్స్ను ఎంచుకుంది. ఇక కరీనా ధరించిన ఈ అందమైన కుర్తా ధర వచ్చేసి రూ. రూ. 41,000 కాగా, హీల్స్ ధర వచ్చేసి ఏకంగా రూ. 92,000 పైనే పలుకుతుందట. ఇక హెయిర్స్టైల్ కోసం క్లాసిక్ నీట్ బన్ను ఎంచుకున్నారు. అలాగే సింపుల్ మేకప్ టోన్స్, గ్రీన్ కళ్లు అందంగా కనిపించే కాజల్, చిన్న బొట్టుతో తన ఆహార్యాన్ని పూర్తి చేశారామె. అంతేగాదు ఈ బ్యూటీ బేబో స్టైలిష్గా ఆకర్షణీయంగా కనపించే అవకాశాన్ని ఎప్పుడు వదులుకోదామె. ఎల్లప్పుడూ ఓ కొత్తలుక్తో కరీనా తన అభిమానులను ఆశ్చర్యపరస్తుంటుందామె. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్లో టేలర్ స్విఫ్ట్ ధరించిన చేతి ఉంగరం అంత ఖరీదా?) -
జామ గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
జామకాయలు అందరికీ సులభంగా దొరికే పండు. అలాగే ప్రతి ఇంటి పెరటిలో ఉండే మొక్క కూడా. అందుకే ఈ పండు అంటే మనకు చిన్న చూపు. జామకాయ అనగానే పైన వగరుగా ఉండే తొక్క, గింజలు పడేసి తింటుంటారు కొందరు. అంతేగాదు ఈ జామ గింజలు అరగవని, కడుపునొప్పి పట్టుకుంటుందని చెబుతుంటారు పెద్దలు. కానీ అదంతా అపోహేనని కొట్టిపారేస్తున్నారు ఐసిఎఆర్–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆదర్శ గౌడ. అంతేగాదు అరుగుదల తక్కువగా ఉండి, సున్నితమైన జీర్ణ సంబంధిత వ్యాధులుంటే వైద్యులను సంప్రదించి ఈ పండు తినడం మంచిదన్నారు. కానీ చాలామటుకు జామపండు ఆరోగ్యానికి మంచిదేనని, ముఖ్యంగా గింజలు ఎక్కువ ఉండే జామకాయలు మరింత ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అసలు ఈ జామగింజలతో కలిగే లాభాలేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!జామగింజలు తినదగినవి, వాటిల్లోని పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. పండుతో సహా వీటిని ఎప్పుడైతే తింటామో..మొతం పీచు పదార్థం శరీరానికి అందతుంది. ఫలితంగా జీవక్రియ క్రమబద్ధతకు, పేగు ఆరోగ్యానికి, కడుపు నిండిన భావన వంటి ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు.కలిగే లాభాలు..జామ గింజల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, తక్కువ మొత్తంలో ఒమేగా-3, ఒమేగా -6 కొవ్వుల తోపాటు విటమిన్ ఈ, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. గింజలను నలపడం లేదా నమలడం వల్ల వాటిలో దాగిఉన్న పోషకాలు నేరుగా విడుదల కావడానికి సహాయపడతాయట. తద్వారా జీర్ణక్రియ(అరుగుదల) సమయంలో అవి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల తోపాటు పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఇది మలానికి బలాన్ని చేకూర్చి జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలడానికి సహాయపడుతుందనట. అలాగే ఈ పండులో విటమిన్ సీ, లైకోపీన్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయట. అందువల్ల జామ అందుబాటులో ఉన్న అత్యంత పోషక-సాంద్రత కలిగిన ఉష్ణమండల పండ్లలో ఒకటిగా పేర్కొటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గింజలు గట్టిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నవాళ్లంతా పండులో ఉన్న ఈ భాగాన్ని నిరంభ్యంతరంగా తినవచ్చుని చెబుతున్నారు నిపుణులు. వీటిలో పోషక విలువలు తక్కువగానే ఉండవచ్చు, కానీ వాటిని పారేయడం వల్ల విలువైన పీచుపదార్థం, సహజంగా లభించే ఫైటోన్యూట్రియెంట్లను కోల్పోయినట్లేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.అందుకే గింజలను ఉమ్మివేయడానికి బదులుగా, పండిన జామకాయను తినేటప్పుడు వాటిని బాగా నమలండి లేదా అదనపు పీచుపదార్థం, ప్రయోజనకరమైన కొవ్వుల కోసం పండు మొత్తాన్ని స్మూతీస్లో కలుపుకోని తినమని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..) -
నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్
ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవన శైలి, సమతుల ఆహారం, కనీసం వ్యాయామం అవసరమని ఆరోగ్యనిపుణులు నిరంతరం చెప్పేమాట. దాదాపు 93 ఏళ్ల వయసులోనూ సగం వయసున్న వారి కంటే ఎక్కువ ఫిట్నెస్తో జీవించాలంటే ఏం చేయాలి? శాస్త్రవేత్తలనే అబ్బుర పరిచిన ఇటలీకి చెందిన ఎమ్మీ మరియా మజ్జెంకా (Emma Maria Mazzenga) ఫిట్నెస్ రహస్యాల గురించి తెలుసుకుందాం.ఇటలీలోని పాడువా నగరానికి చెందిన 92 ఏళ్ల ఎమ్మీ మరియా మజ్జెంకా ఒక రిటైర్డ్ హైస్కూల్ సైన్స్ టీచర్. 90-94 ఏళ్ల విభాగంలో పలు ప్రపంచ రికార్డులను సృష్టించిన ఎలైట్ స్ప్రింటర్ (పరుగు పందెం క్రీడాకారిణి). ఆమె శారీరక దృఢత్వంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా అద్భుతమైన విషయాలు వెలుగు చూశాయి.ఆమె శరీరం ఆక్సిజన్ను గ్రహించి, కండరాలకు సరఫరా చేసే సామర్థ్యం ప్రస్తుతం 30 ఏళ్ల యాక్టివ్ యువతులలో ఉన్నంత శక్తివంతంగా ఉంది. కణాలకు శక్తిని అందించే మైటోకాండ్రియా (Mitochondria) పని తీరు 20 ఏళ్ల యువతలో ఉన్నంత బలంగా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. వ్యాయామం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను పూర్తిగా మార్చేయవచ్చని ఎమ్మీ జీవితం నిరూపిస్తోందని వ్యాయామ ఫిజియాలజిస్ట్ సిమోన్ పోర్సెల్లి పేర్కొన్నారు.ఎమ్మీ ఫిట్నెస్ వ్యూహం గంటల తరబడి కష్టపడే మారథాన్లపై ఆధారపడలేదు. ఆమె కేవలం క్రమశిక్షణ (Consistency) ను నమ్ముకున్నారు.వర్కౌట్ ప్లాన్ఆమె వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే వర్కౌట్ చేస్తారు. ప్రతి సెషన్ గంట లోపే ఉంటుంది. ఆమె సుదీర్ఘ పరుగు పందాల్లోనూ పాల్గొనరు.తేలికపాటి జాగింగ్తో వార్మప్, కొన్ని షార్ట్ స్ప్రింట్స్ (వేగవంతమైన పరుగు), ప్రతిరోజూ అవుట్డోర్ వాకింగ్, అప్పుడప్పుడు తేలికపాటి రెసిస్టెన్స్ వ్యాయామాలు అంతే ఆమె రొటీన్.ఇక ఆహార నియమాలువిషయానికి వస్తే..పెద్దగా నియంత్రణలు కూడా ఏమీలేవు. కఠినమైన డైట్ జోలికి వెళ్లరు. కానీ చాలా తేలికపాటి సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా చేపలు, గుడ్లు, కూరగాయలు ఎక్కువగా తింటారు. అయితే, తనకు నచ్చినప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా మాంసం కూడా తింటూ సమతుల్యతను కాపాడుకుంటారు.90 ఏళ్ల వయసు దాటినా కూడా శరీరం వ్యాయామానికి ఎంతో అద్భుతంగా స్పందిస్తుందని ఎమ్మీ మరియా మజ్జెంకా జీవితం ప్రపంచానికి నిరూపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మీ జీవనశైలి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వృద్ధాప్య మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంది.WHO ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు పాటించాల్సిన రూల్స్ వారానికి కనీసం 150 నుండి 300 నిమిషాల మధ్యస్థ-తీవ్రత కలిగిన వ్యాయామం, లేదా 75 నుండి 150 నిమిషాల కఠినమైన వ్యాయామం .శారీరక సమతుల్యత , కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలను వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులు చేయడం వల్ల కింద పడకుండా ఉండటంతో పాటు ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.కదలికలు లేకుండా కూర్చునే అలవాట్లను మానుకుని, కేవలం తేలికపాటి వాకింగ్ చేసినా కూడా వృద్ధాప్యంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా? -
'హొన్నావర్' అందానికి జయహో అనాల్సిందే..!
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడూ మంచి స్ఫూర్తిదాయకమైన కథలను, కమనీయ ప్రదేశాల గురించి షేర్ చేస్తూ ఉంటారు. అలానే ఈసారి ప్రకృతి రమ్యతకు, నిశబ్దమైన గంభీరతకు ఆలవాలమైన ఒక కమనీయ ప్రదేశం ఫోటోలను షేర్చేస్తూ..దాని గురించి రాసుకొచ్చారు. అంతగా చూడని, గమనించని అందమైన ప్రదేశం అంటూ..ఆ పర్యాటక అందాల గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇంతకీ ఆ పర్యాటక ప్రదేశం ఎక్కడ ఉందంటే..కర్ణాటక తీరప్రాంతంలోని హొన్నవార్ అందాలకు ఫిదా అవ్వుతూ దాని గొప్పతనం గురించి సోషల్ మీడియా ఎక్స్లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. శ్రద్ధ అనే పదానికి అర్హమైన అపురూపమైన ప్రకృతి రత్నంగా అభివర్ణించారు. తాను ప్రజలు అంతగా అన్వేషించని, రద్దీ తక్కువగా ఉండే ప్రశాంతమైన ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నానంటూ రాశారు. అంతా కేరళ బ్యాక్వాటర్స్(బ్యాక్ వాటర్స్ (Backwaters) అనగా నదులు, సరస్సులు లేదా సముద్రపు తీరాలకు సమీపంలో నీటి ప్రవాహం మందగించడం వల్ల ఏర్పడే నిశ్చలమైన జలాలు. )ని ప్రశంసిస్తుంటాం. కానీ కర్ణాటక తీరంలో అలాంటి బ్యాక్వాటర్కి సంబంధించిన అద్భుతమైన ప్రదేశం ఒకటి ఉందని అన్నారు. జోగ్జలపాతంపై ఘోషించే శరావతి నది చివరకు హొన్నవార్ వద్ద నిశ్శబ్దంగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇదోక మాయ ప్రదేశం. మడ అవడవులు, వంకరటింకరగా ప్రవహించే జలమార్గాలు, అద్దంలాంటి బ్యాక్వాటర్స్, ఎవ్వరినైన కట్టిపడేస్తాయని అన్నారు. మడ అడవులు ప్రకృతి అత్యంత సమర్థవంతమైన తీర రక్షకులలో ఒకటి కాబట్టి..హోన్నవార్ అందానికి పర్యావరణ ప్రాముఖ్యత కూడా తోడైన రమ్యమైన ప్రదేశంలా ఉంటుంది అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్చేశారు. అందుకు నెటిజన్లు కూడా మద్దతిస్తూ..తమకు లిసిన తెలిసిన అద్భుత పర్యాటక ప్రదేశాల గురించి పంచుకున్నారు. కొందరు కేరళ తరచుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, కానీ భారతదేశ తీరప్రాంతం దాగి ఉన్న అద్భుత కళాఖండాలతో నిండి ఉంది. అసాధారణంగా ఉండటానికి అందానికి జనసమూహం అవసరం లేదని మనకు గుర్తుచేసే ప్రదేశాలలో హొన్నవార్ ఒకటిగా కనిపిస్తుంది.Continuing my search for underexplored & less crowded destinations….We often celebrate Kerala’s backwaters. But on Karnataka’s coast is a hidden gem that deserves equal attention.The same river that roars over Jog Falls, the Sharavathi River, finally and quietly merges with… pic.twitter.com/N9himujjg1— anand mahindra (@anandmahindra) June 14, 2026 (చదవండి: ఆక్వా కలర్ బనారసీ చీరలో నీతా అంబానీ అందమైన లుక్..! తయారీకే ఏకంగా..) -
90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..
బరువు తగ్గడం అనేది వివిధ రకాల డైట్లు, వర్కౌట్ల సమాహారం. అందుకు తగిన ఓపిక, నిలకడ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఉండాలి. ముఖ్యంగా భారంగా కాకుండా ఇష్టంగా ఆరోగ్య కోసం అనే స్పృహతో సులభంగా బరువు తగ్గొచ్చని చాలామంది నిరూపించారు. ఆ కోవకు చెందిన వ్యక్తే బాలీవుడ్ హీర్ కార్తిక్ ఆర్యన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘చందు ఛాంపియన్’ కోసం ఏకంగా 18 కిలోలు ఎలాంటి మందులు వాడకుండా సహజ పద్ధతిలో తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం ఆర్యన్ ఎంతలా కష్టపడ్డాడో తెలిస్తే..స్మార్ట్గా మారాలంటే మన నుంచి కనీసం ఈ మాత్రం కష్టం ఉండక తప్పదని అంగీకరిస్తారు. మరి ఆర్యన్ ఏకంగా 90 నుంచి 72 కిలోలు బరువు తగ్గేందుకు ఏం చేశాడో సవివరంగా తెలుసుకుందామా..!.సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రపంచం మర్చిపోయిన భారతదేశపు మొట్టమొదటి పారా ఒలింపిక్స్ స్వర్ణ విజేత మురళీకాంత్ పేట్కర్ పాత్రలో కార్తిక్ ఒదిగిపోయారు. ఆయన ఆ పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసినట్లు తన ఆకృతిని మార్చుకున్నారు. ఆర్యన్ నటనకు విమర్శకు ప్రశంసలందుకున్నప్పటికీ..ఆ సినిమాకి అయ్యిన వ్యయానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. కారణాలు ఏవైనా..ఈ మూవీ ఓటమిని అంగీకరించిన ఓ క్రీడాకారుడి కథ. గాయలు, ఎదురుదెబ్బల నుంచి పతకాలు దక్కించుకున్ను శక్తిమంతమైన క్రీడాకారుడి స్టోరీ. మరి ఆ పాత్ర ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడ్ని చేసేలా ఉండాలంటే..ఆర్యన్ ఆ యోధుడి రూపంలోకి మారక తప్పదు. ఆ నేపథ్యంలోనే 90 కేజీల బరువు ఉండే ఆర్యన్ 72 కిలోలకు తగ్గేలా శిక్షణ తీసుకున్నారు. ఎలాంటి మందులు వినియోగించకుండా నేచురల్ పద్ధతిలో బరువు తగ్గడం విశేషం. వెయిట్లాస్ కోసమే ఆర్యన్ బాక్సింగ్ శిక్షణ తీసుకోవడం నుంచి ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం వరకు ఎన్నో త్యాగాలు, ఎంతో శారీరక శ్రమ దాగి ఉంది. ఆయన ఫిట్నెస్ శిక్షణ అందించిన త్రిదేవ్ పాండే సైతం నిజమైన బాక్సర్ అనుసరించే శిక్షణా విధానాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నెలల తరబడి కఠినమైన క్రమశిక్షణ, నిరంత కృషి ఉందన్నారు. అయితే ఆయన మొదట్లో ఒక్క పుష్ అప్ కూడా చేయలేకపోయారని, కానీ క్రమంగా వీపుపై 50 నుంచి 60 కేజీల అదనపు బరువుతో వాటిని చేసే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అతని స్కిప్పింగ్ కూడా మెరుగపడింది. ప్రాథమిక ఫుట్వర్క్తో ఇబ్బందుల నుంచి సుమారు 14 నుంచి 15 ఇతన ఆధునతాన జిమ్ వర్కౌట్లు చేసే స్థాయికి చేరుకున్నారు. అంతేగాదు అనుకున్నట్లుగానే 14 నెలల్లో 18 కేజీలు తగ్గి అద్భుతంగా కనిపించడమే కాదు, ఆ పాత్రకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలందుకున్నారు కార్తీక్ ఆర్యన్. చెయ్యాలి అని బలంగా అనుకుంటే..ఎన్ని కష్టాలకైనా ఓర్చి..అనుకున్నది సాధిస్తాం అనేందుకు హీరో కార్తీక్ ఆర్యన్నే ఉదాహరణ. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని అనుసరించడం ఉత్తమం. (చదవండి: 92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..) -
భారత విజ్ఞానం: జెండాపై కపిరాజు...
జెండాపై కపిరాజు అంటే ఆంజనేయుడు.... ఆయన చిరంజీవి కనుక త్రేతా యుగం నాటి రామాయణ కాలంలోనే కాదు.... ద్వాపర యుగంలో జరిగిన మహా భారత యుద్ధంలోనూ ఆంజనేయుడు కన బడతాడు. శ్రీకష్ణుడుని కోరిక మేరకు అర్జునిని రధం పై ఉండే జెండాలో కొలువై ఉంటాడు. ఇలా కొలువై ఉండేందుకు కారణం కూడా ఉంది. మహాభారతంలో ఆంజనేయుడు రెండు సందర్భాల్లో కనిపిస్తాడు. ఒకసారి భీముడికి గర్వభంగం జరిగిన సందర్భంలో... మరోసారి కురుక్షేత్ర యుద్ధంలో ఆంజనేయుడి ప్రస్తావన ఉంది.΄ాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధికా పుష్పాలు కావాలని భీముడిని కోరుతుంది. ఈ పూలు తీసుకురావడానికి భీముడు వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకుంటున్న కోతిని చూసి అడ్డుతప్పుకోమని భీముడు కోరతాడు. తాను ముసలివాడినని, తోకను కూడా కదిపే శక్తి లేనందున నువ్వే అడ్డు తొలగించుకుని వెళ్లమని భీముడికి చెబుతాడు. అహంకారంతో ఉన్న భీముడు ఆ తోకను నెట్టేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైనది కాదని గ్రహించి, శరణు కోరడంతో హనుమంతుడు నిజస్వరూపం దాల్చి భీముడిని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత మరో సందర్భంలో కోతిరూపంలోనే అర్జునుడిని కలుస్తాడు ఆంజనేయుడు.త్రేతాయుగంలో లంకకు చేరేందుకు నిర్మించిన వారధిని చూసి దీని నిర్మాణానికి కోతులసహాయం ఎందుకు? నేను ఒక్కడినే బాణాలతో నిర్మించేవాడిని అని బాణాలు సంధిస్తాడు అర్జునుడు. అయితే ఆంజనేయుడు కాలుమోపగానే ఆ వారధి కుప్పకూలిపోతుంది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న కృష్ణుడు తన దివ్యస్పర్శతో వంతెనను స్పృశించి పునర్నిర్మిస్తాడు.ఓడిపోయానన్న భావనతో తన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్న అర్జునుడికి కురుక్షేత్రంలో సహాయం చేస్తానని మాటిస్తాడు ఆంజనేయుడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభ నుంచి చివరి వరకూ అర్జునుని రథ జెండాపై ఉంటాడు ఆంజనేయుడు. కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు వరకూ జెండాపై ఉన్న హనుమంతుడికి కృష్ణుడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయ్యింది.ఇదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు కృష్ణుడు, ఇప్పటివరకూ నీ రథంపై హనుమంతుడు ఉండడం వల్ల దివ్యమైన ఆయుధాలేవీ ఏమీ చేయలేకపోయాయని లేదంటే రథం ఎప్పుడో అగ్నికి ఆహుతి అయ్యేదని చెబుతాడు. అందుకే జెండపై కపిరాజు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దుష్టశక్తులు దరిచేరవని, విజయం సాధిస్తారని విశ్వసిస్తారు. ఏది ఏమైనా కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథంపై ఉన్నప్పటి నుంచి జెండాపై కపిరాజు అనడం, ఇలాంటి ఆంజనేయుని జెండా తమ కూడా ఉంటే విజయం తమనే వరిస్తుందన్న సెంటిమెంట్ కూడా ప్రచారంలో ఉంది. - సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
సమ్యక్ దృష్టి.. మిధ్యా దృష్టి!
బుద్ధుడు ఒకసారి మగధ రాజధాని రాజగృహలో ఉన్నాడు. వేణు వనంలో ఉడుతలకు మేత వేస్తున్నాడు. వాటిలో కొన్ని బుద్ధుని మీదకు ఎక్కాయి. ఇంకొన్ని మేత మేస్తున్నాయి. కొమ్మ మీద ఉన్న ఉడుతలు రెండు చకచకా వచ్చి బుద్ధుని ముందు నిలబడ్డాయి. అప్పుడు జయసేనుడు, భూమిజుడు ఇద్దరూ అక్కడికి వచ్చారు. వారూ ఉడుతలకు ఆహారం పెట్టారు. అప్పుడు జయసేనుడు ‘‘భగవాన్! సమ్యక్ దృష్టి, మిధ్యా దృష్టి గురించి చెప్పండి’’ అన్నాడు.‘‘భిక్షువులారా! నూనె కావలసిన వాడు నూనె కోసం వెతుకుతున్నాడు. వాడు నూనె తొట్టిలో ఇసుక పోసినాడు. ఎంతసేపటికీ నూనె రాదు. అది మిధ్యా దృష్టి’’ ‘‘భగవాన్! ఔను. నూనె కావలసిన వాడు ఇసుక పోస్తే నూనె ఎలా వస్తుంది?’’ అన్నాడు భూమిజుడు. ‘‘అలాగే.. పాలు కావలసిన వాడు పాల కోసం వెతుకుతూ ఆవు కొమ్మును పితుకుతాడు. వాడూ పాలను పొందలేడు. అవే మిధ్యా కర్మలు’’‘‘ఒకడు వెన్నను కావాలనుకుంటాడు. బానలో నీటిని పోసి కవ్వాన్ని వేసి తిప్పుతాడు. వాడికీ వెన్న లభించదు. ఇదే మిధ్యా ప్రయత్నం’’‘‘భగవాన్! చాలా చక్కగా చెప్పారు’’ అన్నాడు జయసేనుడు. ‘‘అలాగే వేరొకడు... అగ్నిని కావాలని వెతుకుతూ ఉంటాడు. చేవగల పచ్చికట్టెను మధిస్తాడు. అప్పుడూ కూడా మంటను పొందలేడు. ఇదే మిధ్యా సంకల్పం’’ ‘‘కాని ఒకడు పాలు కావాలనుకుని చంటి దూడను పితుకుతాడు. ఆవు రొమ్మును పితకడు. ఇదే మిధ్యా వాక్కు’’ ‘‘ఇంకొకడు... పెరుగును పోసి కవ్వంతో తిప్పుతాడు. వాడు వెన్నను పొందుతాడు. ఇదే సమ్యక్ దృష్టి... అలాగే మిగిలినవన్నీ... అన్నాడు బుద్ధుడు. ‘‘భగవాన్! నూనెను కావలసినవాడు ఆవనూనెతో, పాలు కావలసినవాడు ఆవు పొదుగుతో, వెన్న కావలసిన వాడు బానలోని వెన్నతో... ఇలా పొందాలి.’’అన్నాడు భూమిజుడు.‘‘అవును.’’ అన్నాడు బుద్ధుడు. ఈ నాలుగు ఉపమానాలు చెప్పాడు. ఇద్దరూ ప్రసన్నలయ్యారు. చెట్టు మీద ఉన్న ఒక ఉడుత కిందకు దిగలేదు. అటూ ఇటూ ఆలోచిస్తుంది. కొంచెం కిందకు కొంచెం పైకీ పోతుంది. వారిద్దరూ పిలిచారు. అది అలాగే చూస్తోంది. బుద్ధుడు చూశాడు. ఉడతను కిందికి రమ్మన్నాడు. అది కిందకు వచ్చింది.‘‘ఇదిగో తిను... నీ మేత...’’ అంటూ మేత వేశాడు. అది నెమ్మదిగా వచ్చి బుద్ధుడి దగ్గర వాలింది. దాన్ని తీసుకుని దాని వీపుని నిమిరాడు. అది కొమ్మపైన వాలినట్టుగా ఆయన పాదాల మీద వాలిపోయింది. – డా. బొర్రా గోవర్ధన్ -
ఈ ఆపిల్ తోటలు ఎక్కడ?
ఇండియాలో అత్యంత అందమైన ఆపిల్ తోటలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఇండియాలో ఆపిల్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలిచే ప్రదేశం హిమాచల్ ప్రదేశ్లోని కోట్గఢ్. అందమైన హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ఈ హిల్ టౌన్, మన దేశంలో కమర్షియల్ ఆపిల్ కల్టివేషన్ కి పుట్టినిల్లుగా ప్రసిద్ధి పొందింది.1916 సంవత్సరంలో అమెరికన్ మిషనరీ శామ్యూల్ ఇవాన్స్ స్టోక్స్ అమెరికా నుంచి హై క్వాలిటీ ఆపిల్ శాప్లింగ్లను కోట్గఢ్కి తీసుకుని వచ్చి నాటారు. ముఖ్యంగా రెడ్ డిలీషియస్ వెరైటీ ఇక్కడి క్లైమేట్కి చాలా బాగా అడాప్ట్ అయింది. అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ అంతటా ఆపిల్ కల్టివేషన్ వేగంగా అభివద్ధి చెందింది. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ ఇండియాలో అత్యధిక ఆపిల్స్ ్ర΄÷డ్యూస్ చేసే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.కోట్గఢ్ చుట్టూ పచ్చని ఆపిల్ తోటలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్లని వాతావరణం, తాజా గాలి టూరిస్టులను ఆకర్షిస్తాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు ఆపిల్ హార్వెస్టింగ్ సీజన్ ఉంటుంది. ఈ సమయంలో తోటలు అన్నీ కూడా ఎర్ర, ఆకుపచ్చ రంగు ఆపిల్స్తో నిండిపోయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కొన్ని తోటల్లో ప్రయాణికులు ఆపిల్స్ను కోసుకుని తినే అవకాశం కూడా లభిస్తుంది. ఆపిల్ ఫార్మింగ్ అనేది ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారం. ఫ్రెష్ ఆపిల్స్తో పాటు ఆపిల్ జ్యూస్, జామ్, సైడర్, డ్రైడ్ ఆపిల్స్లాంటి ఉత్పత్తులు కూడా ఇక్కడి ఎకానమీకి బలాన్ని అందిస్తాయి. నేచర్ లవర్స్ కోసం కోట్గఢ్ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. అందమైన మౌంటైన్ రోడ్స్, ప్రశాంతమైన గ్రామాలు, ఆపిల్ తోటలు, చల్లని వాతావరణం ఇవన్నీ కలిసి ఒక అందమైన, అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.ఆపిల్ తోటల్లో నడవాలి అనుకుంటే, ఫ్రెష్ ఆపిల్స్ డైరెక్ట్గా చెట్టు నుంచి కోసి తినాలి అనుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కోట్గఢ్ని తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రదేశాన్ని ఆపిల్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. -
వర్షం రాసే దక్షిణ భారత ప్రయాణ గీతం..
కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం. కొన్ని ప్రయాణాలకు మాత్రం వర్షమే మనల్ని పిలుస్తుంది. చినుకులు పడిన వెంటనే పచ్చని పర్వతాలు, మేఘాలలో దాగిపోయిన లోయలు, జలజలా పారుతున్న జలపాతాలు కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి.దక్షిణ భారతంలో వర్షాకాలం అంటే కేవలం సీజన్ కాదు. అది ప్రకృతి తన అందాన్ని మరోసారి కొత్తగా అలంకరించే సమయం. కేరళ బ్యాక్ వాటర్స్ నుండి కర్ణాటకలోని ఘాట్స్ వరకు, తమిళనాడు హిల్ స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని లోయల వరకు ప్రతీ చోట వర్షం ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది.దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాకాలంలో పచ్చని స్వర్గాన్ని తలపిస్తాయి. వెస్ట్రన్ ఘాట్స్ మొత్తం మేఘాలతో కవర్ అవుతుంది. ఈ సమయంలో ఈ ప్రాంతం మొత్తం ఒక పెయింటింగ్లాగ కనిపిస్తుంది. రోడ్డు పక్కనే వెలిసిన కాఫీ తోటలు, టీ ఎస్టేట్స్, శాండిల్వుడ్ సువాసనలు, వర్షంతో తడిసిన అడవులుం ప్రతీ దశ్యం ఒక సినిమా ఫ్రేమ్లా ఉంటుంది. ఉదయం సమయంలో మేఘాలు కొండల్ని ముద్దాడుతుంటే, మధ్యాహ్నం చినుకుల మధ్య సూరీడు అందంగా ప్రకాశిస్తాడు. సాయంత్రం అయితే కురిసే వర్షం ఆ తరువాత వీచే చల్లని గాలి మనసుని కూడా ఫ్రెష్గా మార్చేస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి మాన్ సూన్ జర్నీ మొదలైతే ట్రెయిన్ విండో పక్కన కూర్చొని వెళ్లడంలోనే ఒక ప్రత్యేక ఆనందం ఉంటుంది. సిటీ బిల్డింగ్స్ మెల్లిగా కనుమరుగై, పంటపొలాలు, నదులు, అడవులు మొదలవుతాయి. రోడ్ జర్నీలో ఘాట్ రోడ్డులు, మేఘాల మధ్య ట్రావెల్ చేస్తూ ప్రతీ టర్న్లో కొత్త సీన్ ను ఎంజాయ్ చేయవచ్చు.ఫ్లైట్ జర్నీ అయినా కూడా మేఘాల పైన వెళ్తున్న అనుభవం వేరే ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుండి హిల్ స్టేషన్స్ వైపు వెళ్తుంటే వెదర్ మెల్లిగా మారడం గమనించవచ్చు.విజయవాడ నుంచి ప్రయాణం మొదలు పెట్టే వారికి కూడా రైల్ అండ్ రోడ్డు మార్గంలో ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.ప్రతీ కిలో మీటర్లో వాతావరణం మారిపోతుంది. గాలి చల్లబడుతుంది. పచ్చని దశ్యాలు చూసి మనసు పరవశించి పోతుంది. ఈ చిన్న చిన్న విషయాలు ప్రయాణాల్ని మెమోరెబుల్ చేస్తాయి.యాత్రా, బడ్జెట్ వివరాలు..హైదరాబాద్ లేదా విజయవాడ నుండి 5 రోజుల మాన్ సూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, ఎంచుకునే ప్రయాణ శైలిని బట్టి బడ్జెట్ మారుతుంది. ఒక సాధారణ బడ్జెట్ రేంజ్ ట్రిప్ కోసం వ్యక్తికి సుమారు రూ. 18,000 నుండి రూ. 25,000 వరకు ఖర్చు అవుతుంది.అదే కొంచెం సౌకర్యవంతంగా ఉండే స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ అయితే రూ. 30,000 నుండి రూ. 45,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రీమియం రిసార్టులు, ప్రైవేట్ వాహనాలతో లగ్జరీగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనిషికి రూ. 60,000 నుండి రూ. 90,000 వరకు బడ్జెట్ అవసరమవుతుంది.ఇక బస విషయానికి వస్తే, బడ్జెట్ హోటల్స్లో ఒక రాత్రికి రూ. 1,500 నుండి రూ. 3,000 మధ్య ఛార్జీలు ఉంటాయి. మధ్యస్థంగా ఉండే స్టాండర్డ్ రిసార్టులు అయితే రూ. 4,000 నుండి రూ. 8,000 వరకు, విలాసవంతమైన ప్రీమియం స్టేలు రాత్రికి రూ. 10,000 పైనే ఉంటాయి.ఇక ఆహార ఖర్చుల కోసం మీ లైఫ్స్టైల్ను బట్టి రోజుకు సుమారు రూ. 600 నుండి రూ. 1,500 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. n విజయవాడ నుంచి ట్రావెల్ చేసే వాళ్లకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కొంచెం మారవచ్చు కానీ ఓవరాల్ బడ్జెట్ దగ్గరగానే ఉంటుంది. కొన్నిప్రాంతాల్లో ప్లాంటేషన్ స్టేలు, హెరిటేజ్ కాటేజీలు, హౌజ్ బోర్డు ఎక్స్పీరియన్సులు, లోకల్ సైట్ సీయింగ్ ΄్యాకేజీలు కూడా లభిస్తాయి. ఈ అనుభవాలు వర్షాకాలం జర్నీని మరింత మెమోరెబుల్గా మార్చేస్తాయి.ఏం చూడాలి?వర్షాకాలంలో జలపాతాలు ఫుల్ ఫ్లోలో ఉంటాయి. లోయలు మొత్తం తెల్లని పొగ మంచు కప్పేసుకుంటాయి. టీ తోటల్లో వర్కర్స్ మెల్లిగా పని చేసుకుంటూ కనిపించే దశ్యం స్థానికుల జీవితాన్ని దగ్గరగా చూపిస్తుంది.అడవి మార్గాల్లో ట్రావెల్ చేస్తుంటే చిన్న చిన్న జలపాతాలు రోడ్డు పక్కనే పరిగెడుతూ ఉంటాయి. సరస్సులపై పడుతున్న చినుకులు, అవి సష్టించే చిన్న చిన్న వలయాల సోయగం కళ్లతో చూడాల్సిందే.ఉదయం సూర్యోదయం కోసం వేచి చూస్తున్న మేఘాలు చాలా అందంగా ఉంటాయి. సాయంత్రం సమయంలో మేఘాలు మెల్లిగా క్లియర్ అయ్యాక కనపించే పచ్చదనం పైసా వసూల్ సీన్ లా అనిపిస్తుంది.ఈ ప్రయాణంలో జలపాతాల దగ్గర కొన్ని నిమిషాలు గడపడం, ప్లాంటేషన్ వాక్స్ ఎంజాయ్ చేయడం, లోకల్ మార్కెట్లో తిరగడం, బోటింగ్ను ఆస్వాదించడం, సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద సైలెంట్గా నిలబడటం అనే ఈ ఐదు అనుభవాలు సహజంగానే ఈ సీజన్ ని మరింత మధురంగా మార్చేస్తాయి.ఎక్కడ ఉండాలి?వర్షాకాలంలో స్టే అంటే కేవలం రూమ్ మాత్రమే కాదు. మార్నింగ్ బాల్కనీలో కాఫీ కప్ పెట్టుకుని మేఘాలను చూస్తూ గడిపే నిమిషాలు గుర్తుండిపోయే జ్ఞాపకాలు అవుతాయి.వుడెన్ కాటేజీలు, ప్లాంటేషన్ రిసార్టులు, లోయవైపు ఉన్న హోమ్ స్టేలు, లేక్ సైడ్ ప్రాపర్టీలుం ఇవన్నీ ప్రకతి మధ్య కలిసిపోయిన అనుభవాన్ని ఇస్తాయి.రాత్రి సమయంలో వర్షం చినుకుల శబ్దం అనేది వినసొంపైన శబ్దంగా అనిపిస్తుంది.ప్రతీ ఉదయం విండో తెరిస్తే చల్లని తాజా గాలి, తడిసిన మొక్కల సువాసనలు, దూరంలో కనిపించే ఫాగ్ ఇవన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.మున్నార్..వర్షాకాలంలో మున్నార్ టీ గార్డెన్స్ మధ్య నడుస్తుంటే ప్రతీ క్షణం మేజికల్గా అనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు కొండల మధ్య తిరగడాన్ని చూస్తుంటే సమయం కూడా నెమ్మదిగా నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది.కూర్గ్..కూర్గ్ కాఫీ ఎస్టేట్స్లో వర్షం పడిన తరువాత వచ్చే కాఫీ వాసన చాలా రోజులు గుర్తుండిపోతుంది. చిన్న జలపాతం, గ్రీన్ వ్యాలీస్, తొలి మంచుతో కలిసిన రోడ్డు మార్గాల్లో వెళ్తుంటే సైలెంట్ మెలోడీలో మనం భాగం అయినట్టు అనిపిస్తుంది.వయనాడ్..వయనాడ్ అడవుల మధ్య ట్రావెల్ చేస్తుంటే ప్రకృతి మాత్రమే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బాంబూ ఫారెస్ట్, జలపాతాలు, లేక్స్ అన్నీ మాన్ సూన్ లో మరింత లైవ్లీగా మారుతాయి.చిక్మగళూరు..చిక్మగళూరు కొండల్లో సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తే మేఘాల మధ్య నుండి వెలుగు బయటికి వస్తున్న దశ్యాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు.అరకు వ్యాలీ..ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీ కూడా ఈ సీజన్ లో మరింత అందంగా మారిపోతుంది. కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా పరిసరాలు అన్ని చినుకులతో కలిసి ఒక ఫ్రెష్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.ఏం తినాలి?కేరళలో అప్పం అండ్ వెజిటెబుల్ స్టూని వర్షం పడుతున్నప్పుడు తినడం అనేది ఎప్పుడూ మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. అలాగే తాజా మసాలాలతో తయారు చేసిన కూరలు లోకల్ ఫ్లేవర్ను పరిచయం చేస్తాయి.కూర్గ్లో ఫిల్టర్ కాఫీ ప్రతీ సిప్పులో కాఫీ ఎస్టేట్ అరోమా ఉంటుంది. చిక్మగళూరు కాఫీ కూడా ట్రావెల్ మెమోరీస్లో స్పెషల్ ప్లేస్ను పొందుతుంది.తమిళనాడు హిల్ స్టేషన్ లో హాట్ హాట్ ఇడ్లీలు, దోశ, పొంగల్ చల్లని వాతావరణంలో ఒకరకమైన కంఫర్ట్ను ఇస్తాయి.అరకులో బాంబూ చికెన్, ట్రైబల్ వంటకాలు, ఫ్రెష్ కాఫీ కాంబినేషన్ అనేవి లోకల్ కల్చర్ని రుచుల ద్వారా తెలుసుకునే అవకాశంగానే భావించవచ్చు.ఆసక్తికరమైన విషయాలు..మాన్ సూన్ బెస్ట్ టైమ్: జూన్ నుండి సెప్టెంబర్ వరకు సౌత్ ఇండియాలో ప్రకతి దర్శనం అత్యంత అందమైన అనుభూతిగా మిగులుతుంది. ఫేమస్ప్రాంతాలు: పశ్చిమ కనుములు అనేవి యునెస్కో జీవ వైవిధ్యప్రాంతంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. స్లో ట్రావెల్, నేచర్ వాక్, ఫోటోగ్రఫీతో పాటు ప్రశాంతమైన హాలిడేస్ కోసం వర్షాకాలం చాలా అనువైన కాలం అని చెప్పవచ్చు. అయితే ట్రిప్ స్టార్ట్ చేసే ముందు మీరు వెళ్లే దారి, డెస్టినేషన్ లో పరిస్థితి గురించి తెలుసుకోవడం మరవద్దు.గమనిక: ట్రావెల్, బడ్జెట్ వివరాలు అనేవి మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా అప్డేట్స్ స్వయంగా వెరిఫై చేసుకోగలరు. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
టేలర్ స్విఫ్ట్ ధరించిన చేతి ఉంగరం అంత ఖరీదా?
ఈ ఏడాది సాంగ్రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ వేడుకలో పాప్ గాయని, గేయ రచయిత్రి టేలర్ స్విఫ్ట్ ప్రదాన ఆకర్షణగా నిలిచింది. ఆమె ధరించిన డ్రెస పరంగానే కాకుండా చేతికి ధరించి ఉంగరం అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అంతేగాదు ఈ హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమానికి విచ్చేసిన అత్యంత పిన్నవయస్కురాలిగా కూడా చరిత్ర సృష్టించిందామె. ఈ ప్రత్యేక వేడుక కోసం పాప్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ హుందాగా బ్లాక్ కలర్ పూల గివెన్చీ గౌనులో రెడ్కార్పెట్పైకి అడుగుపెట్టింది. దూరం నుంచి చూస్తే ఆ గౌను చాలా సింపుల్గా క్లాసిక్గా ఉన్నా..దగ్గరకు వస్తే..ఆ డ్రెస్పైనే కనిపిస్తున్న ఎండ్రాయిడరీ పూల లుక్ హైలెట్గా నిలవడం విశేషం. ఈ డిజైనర్వేర్కి అనుగుణంగా చేతిక ధరించి ఆభరణంతో..భారతీయతను జోడించింది. టేలర్ స్విఫ్ట్ చేతికి భారతీయ లగ్జరీ ఆభరణాల సంస్థ అమ్రపాలి జ్యువెల్స్ రూబీ డైమండ్ ఉంగరం ధరించింది. రాజస్థాన్ 18 క్యారెట్ డైమండ్ అండ్ రూబీ రింగ్గా పిలిచే ఆభరణం ప్రత్యేకంగా నిలవడమే గాక, అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ ఉంగరం 18-క్యారెట్ బంగారంలో పొదిగిన 2.41-క్యారెట్ల అండాకారపు రూబీ రత్నం. దాని చుట్టూ పూల వలయం ఆకారంలో మెరిసే రోజ్-కట్ వజ్రాలు అమర్చబడి ఉన్నాయి. ముదురు గులాబీ-ఎరుపు రంగు రూబీ ఈ ఆభరణానికి ప్రధాన ఆకర్షణగా నిలవగా, వజ్రాలు పాతకాలపు శోభను, పురాతన హస్తకళా నైపుణ్యాన్ని హైలెట్ చేశాయి. దీన ధర వచ్చేసి భారత కరెన్సీ ప్రకారం అక్షరాల రూ. 9.4 లక్షలట. ఈ మేరకు అమ్రపాలి జ్యువెల్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో ఇది భారతీయ రాజరిక హస్తకళకు నిజమైన నివాళిగా పేర్కొనడం గమనార్హం. అలాగే మరో చేతి వజ్రాల బ్రాసెలెట్, సున్నితమైన సిట్రిన్ డ్రాప్చెవిపోగులను జతచేస్తూ..చాలా సింపుల్గా లగ్జరీయస్గా సందడి చేసింది టేలర్ స్విఫ్ట్. (చదవండి: పుట్టుకతో ముంజేయి లేని ఐఐటీ గ్రాడ్యుయేట్ సివిల్స్ విజయగాథ..! తొలి ప్రయత్నంలోనే సఫలం కానీ..) -
స్నాక్ సెంటర్: నోరూరించే.. వెరైటీ వంటకాలు!
ప్రతిరోజూ ఒకేవిధంగా వంటకాలు తిని.. తిని ఇబ్బందిపడేదానికన్నా కొంచెం భిన్నంగా ఉండేలాగా ట్రైం చేద్దాం అనుకునేవారికి ఈ వెరైటీ వంటకాలు సరిగ్గా ఉపయోగపడుతాయి. అయితే ఇప్పుడే వాటిని ఇలా రెడీ చేయండి.బాంబే ఐస్ హల్వా..కావలసినవి:పాలు: ఒకటిన్నర కప్పు,పంచదార: కప్పు,కార్న్ ఫ్లోర్: 1/4 కప్పు,నెయ్యి: 1/4 కప్పు,ఆరెంజ్ ఫుడ్ కలర్: టీ స్పూన్,ఏలకుల పొడి: కొద్దిగా, బాదం ముక్కలు: టేబుల్ స్పూన్,పిస్తా ముక్కలు: టేబుల్ స్పూన్.తయారీ:ఒక పెద్ద కడాయిలో కప్పు పాలు, పంచదార, కార్న్ ఫ్లోర్, నెయ్యి వేసుకోండి.స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్లో ఉంచి ఉండలు కట్టకుండా గరిటెతో రౌండ్గా కలుపుతుండాలి.ఈ మిశ్రమం చిక్కబడి పేస్ట్లా మారిన తరువాత ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్తో పాటుగా నెయ్యి వేయండి.మంటను మీడియంలో ఉంచి బాగా కలపండి. ఆ తరువాత టీస్పూన్ ఏలకుల పొడి వేసి బాగా కలపండి.మిశ్రమం అంతా జిగటగా, మెరుస్తూ మారేంత వరకు కలపండి.ఒకవేళ అలా మెరవకపోతే మరికొద్దిగా నెయ్యి వేసి కలపండి.ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని, దానిపై ఒక గరిటెడు ఐస్ హల్వా మిశ్రమాన్ని వేసి, దీనిపై నెయ్యి రాసిన మరొక బటర్ పేపర్ షీట్ను ఉంచి చేతితో మెల్లగా నొక్కండి.ఆపై చపాతీ కర్ర సహాయంతో మీకు నచ్చిన మందంలో పరచండి. పైనున్న బటర్ పేపర్ను మెల్లగా తీసివేసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలను చల్లి 15 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచండి.హల్వా పూర్తిగా గట్టిపడిన తర్వాత, బటర్ పేపర్తో సహా ముక్కలుగా కట్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన బాంబే ఐస్ హల్వా సిద్ధం!మసాలా చీజ్ టోస్ట్..కావలసినవి:ఉల్లిపాయ, క్యాప్సికమ్,క్యారట్: కప్పు (సన్నగా తరిగినవి),కారం: 1/2 టీస్పూన్,మిరియాల పొడి: 1/2 టీస్పూన్,ధనియాల పొడి: 1/2 టీస్పూన్,ఉప్పు: రుచికి సరిపడా,బ్రెడ్ స్లైసెస్: 2,చీజ్: తగినంతతయారీ:ఒక గిన్నెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారట్ ముక్కలను తీసుకోండి.అందులో కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.ఈ కూరగాయల మిశ్రమాన్ని ముక్కలు కాస్త మెత్తబడే వరకు పాన్ పై లైట్గా వేయించి పక్కన పెట్టుకోండి.ఆ తర్వాత ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని, ఒక వైపు మాత్రమే లైట్గా కాల్చండి. ఇప్పుడు బ్రెడ్ కాల్చిన వైపున మనం తయారుచేసి పెట్టుకున్న వెజిటబుల్ మసాలా మిశ్రమాన్ని సమానంగా పరచండి.ఆ మసాలా పైన తగినంత చీజ్ వేసి, దానిని కరగనివ్వండి.బ్రెడ్ కింద వైపు చక్కగా క్రిస్పీగా కాలిన తర్వాత, అలాగే పైన చీజ్ పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే వేడివేడి సువాసనలతో కూడిన మసాలా చీజ్ టోస్ట్ సిద్ధం.ఖట్టా మూంగ్..కావలసినవి:పచ్చ పెసలు: 2 కప్పులు (నానబెట్టినవి),పుల్లటి పెరుగు: కప్పు,శనగపిండి: 3 టేబుల్ స్పూన్లు,కారం: 2 టీస్పూన్లు,పసుపు: 2 టీస్పూన్లు,ధనియాల పొడి: 2 టీస్పూన్లు,జీలకర్ర: టీస్పూన్,ఆవాలు: టీస్పూన్,పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి),కరివేపాకు: 5–6 ఆకులు,అల్లం ముక్కలు (సన్నని తరుగు): 5–6,కొత్తిమీర: 1/2 కప్పు (సన్నగా తరిగినది),నూనె: సరిపడినంత, నీళ్లు.తయారీ:ముందుగా నానబెట్టిన పెసలను ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి.అందులో మూడు కప్పుల నీళ్లు పోసి, మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.పెసలు ఉడికేలోపు, ఒక గిన్నెలో శనగపిండి, పుల్లటి పెరుగు, కారం, పసుపు, ఒక కప్పు నీరు వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, మీడియం మంట మీద కొన్ని సెకన్ల పాటు వేయించండి.తాలింపు వేగాక, ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును పాన్లో వేసి, తాలింపు అంతా పప్పుకు పట్టేలా బాగా కలిపి.. రెండు నిమిషాల పాటు ఉడికించండి.ఆ తర్వాత, మనం సిద్ధం చేసి పెట్టుకున్న శనగపిండి–పెరుగు మిశ్రమాన్ని, ధనియాల పొడిని ఇందులో వేసి బాగా కలపండి.మంటను సిమ్లో పెట్టి 3–4 నిమిషాల పాటు ఉడకనిచ్చి, స్టవ్ ఆఫ్ చేయండి.చివరగా పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర, అల్లం ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుజరాతీ స్పెషల్ ఖట్టా మూంగ్ రెడీ! ఇది చపాతీలు, పూరీలు, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. -
92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..
తొమ్మిది పదుల వయసులో వృద్ధాప్యాన్ని దిక్కరించేలా చురుగ్గా ఉందామె. సింపుల్గా చెప్పాలంటే 30 ఏళ్ల వ్యక్తిలా ఉంది. ఆమె కండరాల శక్తి, యాక్టివిటీని చూసి శాస్త్రవేత్తలే విస్తుపోయారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు మించి తీవ్రమైన వ్యాయామాలు చేస్తంటుంది. పైగా 60 దాటినవారు చేయకూడని వ్యాయమాలే అయినా..ఈ బామ్మ మాత్రం చాలా సునాయాసంగా చేసేస్తుంది. అంతేగాదు ఆమెను చూడగానే తొమ్మిది పదుల వయసు ఉన్న వ్యక్తిలా కనిపించదు..జస్ట్ 30 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఇంతలా యంగ్లుక్లో ఆశ్చర్యపరుస్తున్న ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఆ బామ్మ పేరే ఎమ్మా మరియా మజెంగా. ఇటలీలో పాడువాలో నివశిస్తున్న రిటైర్డ్ సైన్స్ టీచరమ్మ. ఆమె ఎన్నో ప్రపంచిరికార్డులు కలిగి ఉన్న అగ్రశ్రేణి స్ప్రింటర్. పరుగు పందెంలో ఆమెకు సాటిలేరెవ్వెరూ అన్నట్లుగా ఎన్నో పతకాలు సొంతం చేసుకుందామె. వయసు పరంగా 90 ఏళ్లు పైబడిన వ్యక్తిలా ఉండదు..30 ఏళ్ల మాదిరిగా కనిపిస్తోంది. వృద్ధాప్యాన్నే ధిక్కరించేలా హెల్దీగా ఉండే తీరు శాస్త్రవేత్తలను సైతం అబ్బురపర్చింది. వాళ్లు సైతం ఆమె ఆరోగ్యంపై స్టడీ చేయగా..ఆమె శరీరంలోని కండరాలు..30 ఏళ్ల వ్యక్తుల మాదిరిగా శక్తిమంతంగా ఉన్నాయని చెప్పారు. తొంభై ఏళ్ల వయసులో కూడా ఈ రన్నింగ్ పోటీల్లో ఎలా పాల్గొనగలుగుతోందే అనే కుతూహలంతో ఆమె శరీరం తీరుపై పరిశోధన చేయగా..30 ఏళ్ల క్రీడాకారుల ఫిట్నెస్ని పోలి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంతేగాదు ఆక్సిజన్ను శక్తిగా మార్చే మైటోకాండ్రియా, ఆమె కండరాలలోని 20 ఏళ్ల యువకుడిలో ఉన్నంత దృఢత్వంతో పనిచేస్తోందట. ఎమ్మా కథ వ్యాయామ దినచర్య వృద్ధాప్యాన్ని తిరగరాయగలదని చెబుతోంది. అయితే గంటల తరబడి మారథాన్ చేయదామె..కేవలం నిలకడతో తేలికపాటి వ్యాయామాలోతోనే ఈ ఫిట్నెస్ని సాధించిందామె. ఎమ్మా చేసే వ్యాయామం గంటలోపే పూర్తవ్వుతుందట. వార్మప్, తేలికపాటి జాగింగ్, లక్షిత స్ప్రింట్ల శ్రేణి, వాకింగ్, చిన్నపాటి తీవ్రత వ్యాయామాలు ఉంటాయంతే. అలాగే డైట్ పరంగా గుడ్లు, చేపలు, కూరగాయలపై దృష్టి పెడుతూ..సమతుల్యత పాటిస్తానంటోందామె.ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలుఎమ్మా జీవనశైలి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం దీర్ఘాయువు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్వకాలను అనుగుణంగా ఉంటుందట. 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల కోసం డబ్ల్యూహెచ్ఓ వారమంతా 150 నుంచి 300 నిమిషాల తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను, లేదా 75 నుంచి 150 నిమిషాల అధిక-తీవ్రత ఏరోబిక్ శారీరక శ్రమను సిఫార్సు చేస్తుంది. అలాగే పడిపోవడాన్ని నివారిస్తూ..ఎముకల ఆరోగ్యం కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు శక్తి శిక్షణకు ప్రాధాన్యతనిచ్చే వర్కౌట్లను సూచించింది. అలాగే వృద్ధులు తమ వ్యక్తిగత ఫిట్నెస్కు అనుగుణంగా తమ శ్రమ స్థాయిలను సర్దుబాటు చేసుకోవాలని WHO స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎమ్మా వంటి వారు అందుకు విభిన్నమని తొంభైలో కూడా యువకుల మాదిరి అధిక తీవ్రత వ్యాయమాలు చేయగలరని తెలుస్తోంది. View this post on Instagram A post shared by The Washington Post (@washingtonpost) (చదవండి: నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..) -
మా బాబుకి రెండేళ్లు! ఎంత పిలిచినా.. చూడటం లేదు..
మా బాబుకు రెండేళ్లు. పేరు పిలిచినా చాలాసార్లు తిరిగి చూడడం లేదు. సరిగ్గా ఆడుకోవడం లేదు. మాటలు కూడా సరిగా రావడం లేదు. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇవన్నీ ఆటిజం లక్షణాలా? నాకు చాలా ఆందోళనగా ఉంది. – రాము, ఒంగోలు.ముందుగా మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆటిజం అనేది తల్లిదండ్రుల తప్పు వల్ల వచ్చే సమస్య కాదు. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక పరిస్థితి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ‘ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి ఫలితం’ అనేది మాత్రం చాలా నిజం. సాధారణంగా ఆటిజం లక్షణాలు 9 నుంచి 12 నెలల వయస్సు నుంచే కొద్దికొద్దిగా కనిపించడం ప్రారంభమవుతుంది.అయితే చాలామంది పిల్లల్లో 18 నుంచి 24 నెలల మధ్య స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. గర్భధారణ నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఉండే మొదటి వెయ్యి రోజులు మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైన సమయం. ఈ దశలోనే ముందస్తు చికిత్స లేదా థెరపీ ప్రారంభిస్తే పిల్లల్లో భాష, సామాజిక నైపుణ్యాలు, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కొన్ని ప్రారంభ సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. చిన్నపిల్లలలో ఆటిజం లేదా అభివృద్ధి ఆలస్యాలను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడే తొమ్మిది సింపుల్ స్క్రీనింగ్ ప్రశ్నలు ఉన్నాయి. అవే ఇవీ.. 1. పేరు పిలిచినప్పుడు తిరిగి చూస్తాడా?2. కంటి చూపు బాగా కలుపుతాడా?3. నవ్వు లేదా ముఖభావాలకు స్పందిస్తాడా?4. కావాల్సిన వస్తువును చూపించి అడుగుతాడా?5. చేతితో బైబై లేదా ఇతర సంకేతాలు చేస్తాడా?6. ఇతర పిల్లలతో లేదా పెద్దలతో కలవాలనే ఆసక్తి ఉందా?7. మాటలు లేదా శబ్దాల అభివృద్ధి వయస్సుకు తగ్గట్టుగా ఉందా?8. ఒకే పని లేదా అలవాటు పదేపదే చేస్తూ ఉంటాడా?9. నేర్చుకున్న మాటలు లేదా సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయాయా?ఈ ప్రశ్నల్లో ఏదైనా ఆందోళన కలిగిస్తే ‘ఇంకొంచెం పెద్దవాడైతే సర్దుకుంటాడు’ అని ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా అభివృద్ధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.ఆటిజంను పూర్తిగా నివారించే కచ్చితమైన పద్ధతి లేదు. ఎందుకంటే దీనికి ఒకే ఒక్క కారణం ఉండదు. అయితే పిల్లల మెదడు ఆరోగ్యకర అభివృద్ధికి కొన్ని విషయాలు చాలా ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, అయోడిన్ వంటి పోషకాలు సరిపడా తీసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే పిల్లలకు టీకాలు సమయానికి వేయించాలి. టీకాలు ఆటిజం కలిగిస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. చిన్నపిల్లల్లో స్క్రీన్ టైమ్ కూడా తగ్గించాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడటం, కథలు చెప్పడం, పాటలు పాడటం, ఆటలు ఆడించడం వల్ల మెదడు అభివృద్ధికి చాలా మంచిది. ఆటిజంను ముందుగానే గుర్తించడం అంటే పిల్లలకు ఒక ‘లేబుల్’ వేయడం కాదు, వాళ్ల భవిష్యత్తుకు సరైన సహాయం అందించడానికి అవకాశం కల్పించడం. తల్లిదండ్రుల గమనికే పిల్లల మొదటి రక్షణ. - డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్ , పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
కాబోయే అమ్మకు కడుపులో వికారం
గర్భధారణ తర్వాత చాలామంది మహిళల్లో వాంతులు అవుతుండటం చాలా సాధారణం. వాంతులు కావడం అనే లక్షణాన్ని బట్టి ఒక మహిళ గర్భవతి అయ్యిందనే సూచన మన చాలా సినిమాల్లో కనిపించడం సాధారణమే. గర్భవతులైన అందరిలోనూ ఇదే లక్షణం కనిపించకపోయినప్పటికీ కొందరిలో ఇలా వాంతులు కావడం చాలా సాధారణం. అలాగే గర్భధారణ జరిగిన చాలామంది మహిళల్లో వికారం (నాసియా) అనే లక్షణమూ కనిపిస్తుంది. గర్భవతుల్లో ఇలా ఎందుకు జరుగుతుందో, వికారంగా ఉండటం లేదా వాంతులు ఎక్కువగా అవుతున్న మహిళల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.గర్భవతుల్లో కనిపించే వాంతులు ఎక్కువగా కావడం, వికారంగా ఉండటాన్ని డాక్టర్లు సాధారణ పరిభాషలో ‘మార్నింగ్ సిక్నెస్’గా డాక్టర్లు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపించడానికి దేహంలో స్రవించే ఒక హార్మోన్ కారణమవుతుంది. మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్న మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... మార్నింగ్ సిక్నెస్ కారణంగా వాంతులు అవుతున్న గర్భవతులు రోజూ కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తింటుండాలి. కొవ్వులు, మసాలాలూ ఎక్కువగా ఉండే హెవీ ఫుడ్ కాకుండా... ఆహారం చాలా తేలిగ్గా ఉండి, సులువుగా జీర్ణమయ్యేలాంటి బ్లాండ్ డైట్ తీసుకుంటూ ఉండటం మేలు. ద్రవాహారాలు... అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ ద్రవాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పండ్లు కూడా ఎక్కువగానే తింటూ ఉండటం మంచిది. పచ్చళ్లు, నూనెవస్తువులు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వాంతులు అవుతున్నా దాన్ని విస్మరించి, ఏదో ఒకటి తింటూ ఉండండి. ఎందుకంటే... వాంతులవుతున్నందున అసలే తినకపోతే ఎసిడిటీ వల్ల కడుపులో యాసిడ్ పేరుకొని పసరువాంతులు, రక్తపువాంతులు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటివారు అవసరమైనప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే కొన్ని రకాల యాంటాసిడ్ మందులు, వాంతులను, వికారాన్ని తగ్గించే మందులైన యాంటీఎమెటిక్ మందులను వాడవచ్చు. అయితే వీటిని కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. చాలామందిలో మార్నింగ్ సిక్నెస్ చాలా సహజం. దాని గురించి ఆందోళన అక్కర్లేదు. అయితే అది చాలాకాలం కొనసాగుతుంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. వాంతుల కారణంగా బిడ్డకు పోషకాలు అందవా?కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలకు తమకు చాలా ఎక్కువగా వాంతులు అవుతున్నాయనీ, దాంతో కడుపులోని బిడ్డకు అందాల్సిన పోషకాలు అందవేమోనని ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వాంతులు అవుతున్నా బిడ్డకు అందాల్సిన పోషకాలు అందుతూనే ఉంటాయి.ఇటీవలి అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే...ఇటీవల ఓ తాజా అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... గర్భవతుల్లో వాంతులకు ప్రధానంగా గ్రోత్ డిఫరెన్సియేషన్ ఫ్యాక్టర్ –15 (జీడీఎఫ్–15) అనే అంశం కూడా ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ ఫ్యాక్టర్ వల్ల కొత్తగా గర్భధారణ జరిగిన మహిళల్లో... ఆకలి లేకపోవడం, ఏ ఆహారమూ రుచిగా అనిపించక΄ోవడం / రుచి తెలియక΄ోవడం, వికారం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయనే విషయం తాజాగా వెల్లడయ్యింది. గర్భధారణ తర్వాత మహిళల్లో వాంతులు ఎందుకంటే...ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల్లో ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడోట్రాపిన్’ (హెచ్సీజీ) అనే హార్మోన్ విడుదల అవుతుంది. మహిళ దేహానికి ఈ హర్మోన్ ఒక సందేశం పంపిస్తుంది. అదేమిటంటే... ‘ఈ దేహంలో గర్భధారణ ప్రక్రియ మొదలైంది. కాబట్టి నెలనెలా వచ్చే పీరియడ్స్ ప్రక్రియను ఆపేసి, ఇక గర్భధారణ ప్రక్రియ కోసం అవసరమైన ప్రొజెస్టెరాన్ను స్రవించమనీ, తద్వారా... అండం ఆశ్రయం తీసుకోవాల్సిన ‘ఎండోమెట్రియమ్–యుటెరైన్’ పొరలను మరింత మందంగా చేయడం, తద్వారా గర్భం నిలబడేలా చేయాలం’టూ ఈ హెచ్సీజీ హార్మోన్ ద్వారా దేహానికి సందేశం అందుతుంది. అయితే కొందరిలో ఈ ‘హ్యూమన్ కోరియానిక్ గొనాడో ట్రాపిన్ (హెచ్సీజీ) చాలా తక్కువ మోతాదులో, మరికొందరిలో చాలా ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఆ హార్మోన్ కారణంగా గర్భవతుల్లో కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఓ మోస్తరుగా, మరికొంతమందిలో చాలా ఎక్కువగా వాంతులు అవుతుంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. డాక్టర్ పి. స్వప్న, సీనియర్ కన్సల్టెంట్ అబ్స్టెట్రిక్స్ – గైనకాలజీ నిర్వహణ: యాసీన్(చదవండి: ఫైట్ అండ్ ప్లైట్లో గ్రాండ్ మాస్టర్) -
ఆక్వా కలర్ బనారసీ చీరలో నీతా అంబానీ అందమైన లుక్..!
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, నీతా అంబానీ కాలాతీమైన చేనేత వస్త్రాలతో సదా ఆకట్టుకుంటారు. మన భారతీయ వారసత్వాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని తన ఫ్యాషన్ శైలితో ప్రపంచానికి చాటుతుంటారు. ఈసారి అలానే అంతర్జాతీయ వైద్యుల సమావేశంలో అత్యద్భుతమైన బనారసి చీరలో మెరిశారామె.విలాసవంతమైన కటన్ సిల్క్తో నేసిన ఈ చీరలో, టీల్-ఆక్వా రంగుల మనోహరమైన కలయిక నీతాకు రాజసమైన ఆకర్షణను అందించింది. ప్రకృతిని తలపించే బంగారు జరీ పూల డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బనారస్ నేతలో అత్యంత క్లిష్టమైన కడ్వానేత ఇది. ఈ చీరలో ప్రతి డిజైన్ను వస్త్రం ఉపరితలంపై ఎబ్రాయిడరీ చేయకుండా విడివిడిగా వస్త్రంలోనే నేస్తారు. దీని తయారీకి మూడు నెలలు పైనే పట్టిందట. ఈ చీరను మహమ్మద్ యాసిన్, ఇక్బాల్ అహ్మద్ రూపొందించారు. ఆ చీరల కళాకారులు దశాబ్దాల తరబడి నైపుణ్యం, ప్రతి దారంలో స్పష్టంగా కనిపిస్తుంది. చీరపై అడ్డంగా ఉన్న బంగారు జరీ పూల అల్లిక, మొఘల్ తోటల డిజైన్లో రూపొందించారు. ఒకరకంగా ఇది నాటి వైభవాన్ని కళముందు ప్రతిబింబించేలా చారిత్రక వైభవాన్ని జోడించారు. ఈ చీరకు సరిపోయే మెరిసే వజ్రాల చెవిపోగులు, గాజులు, ఉంగరాలు ఎంచుకున్నారామె. జుట్టు తాజా తెల్లని పువ్వులతో అలకరించి చక్కగా ముడిలా తీర్చిదిద్దారు. అలాగే నీతా తన రూపం హుందాగా కనిపించేలా లైట్ మేకప్ని ఎంచుకున్నారు. ఇక్కడ నీతా చీర చేనేత కళాకారుల అసామాన్య నైపుణ్యాన్ని చాటడమే కాకుండా సందర్భోచితంగా హుందాగా ఎలా దుస్తులు ధరించాలో చెబుతున్నట్లుగా ఉంది. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) (చదవండి: సీఎంలంతా ఆ అమ్మ చెంతకే ఎందుకంటే..?! చివరికి విజయ్ సైతం..జ) -
తల్లిదండ్రుల మధ్య వివాదం.. చిన్నారికి పేరు పెట్టిన కోర్టు!
తల్లిదండ్రుల మధ్య వివాదం ఓ చిన్నారికి ‘పేరు’ సంకటాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులిద్దరూ చెరో పేరూ చెప్పడంతో ఏ పేరూ ఖరారు కాలేదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని రిజిస్ట్రార్ చెప్పడం వివాదానికి కారణమైంది. చివరికి ఆ చిన్నారి తల్లి కోర్టును ఆశ్రయించింది. ఆ కుటుంబ సమస్యకు పరిష్కారమే కాదు.. ‘పేరెంట్’ అనే పదానికి ఉన్నత న్యాయస్థానం అర్థం చెప్పింది.కేరళకు చెందిన సంగీత, బాలగంగాధరన్ నాయర్ దంపతులకు 2020లో ఓ పాప జన్మించింది. తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. చిన్నారికి ఏ పేరు పెట్టాలనే అంశంపై వారి మధ్య సయోధ్య కుదరక ఏ పేరూ పెట్టలేదు. రోజులు గడిచాయి. పాపను స్కూల్లో చేర్చాల్సిన సమయం వచ్చింది. జనన ధ్రువీకరణ పత్రంలో చిన్నారి పేరు లేకపోతే అడ్మిషన్ ఇవ్వడం కుదరదని యాజమాన్యం చెప్పింది. దీంతో ‘పేరు’ తప్పనిసరి అయింది.కోర్టును ఆశ్రయించిన తల్లిపేరు నమోదు కోసం తల్లి జనన, మరణ ధ్రువీకరణ రిజిస్ట్రార్ను కలిసింది. ‘ఫుణ్యనాయర్’ పేరుతో తన కుమార్తెకు జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరింది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని ఆ అధికారి చెప్పాడు. దీంతో కుమార్తెకు పేరు పెట్టేందుకు తన భర్త సహకరించేలా ఆదేశించాలని కోరుతూ ఆమె మొదట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలని, పేరు నమోదుకు సహకరించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది. ఇరువురు కలిసి నమోదు కేంద్రానికి వెళ్లాలని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.ఉన్నత న్యాయస్థానానికి చేరిన సమస్యహైకోర్టులో ఆ చిన్నారి పేరు విషయమే కాదు, జనన, మరణాల నమోదు చట్టం–1969లోని సెక్షన్ 14 ప్రకారం పేరు నమోదుకు తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు వెళితే సరిపోతుందా? పేరు నమోదుకు ఇద్దరి అంగీకారం అవసరమా? ‘ది పేరెంట్’ అంటే అర్థం ఏమిటి? అనే ప్రశ్నలు కేసు విచారణ సందర్భంగా తలెత్తాయి. వీటిపై కోర్టు లోతుగా విశ్లేషించింది.‘ది పేరెంట్’ ఏకవచనమే‘ది పేరెంట్’ లేదా గార్డియన్ అని దరఖాస్తులో ఉంది. పేరెంట్ అంటే తల్లి లేదా తండ్రి అని డిక్షనరీ సూచిస్తోంది. బ్లాక్స్ లా డిక్షనరీ ప్రకారం పేరెంట్ అంటే ‘ఒక వ్యక్తికి చట్టబద్ధమైన తండ్రి లేదా తల్లి’. అందువల్ల పేరెంట్ అనే పదం తండ్రిని గాని తల్లిని గాని సూచించవచ్చు అని కోర్టు పేర్కొంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇద్దరినీ కలిపి కూడా సూచించవచ్చని తెలిపింది. ఈ పదానికి ఏ అర్థం ఇవ్వాలనే కేసు పరిస్థితుల ఆధారంగా కొన్ని సందర్భాల్లో నిర్ణయించాల్సి వస్తోందని పేర్కొంది.చట్టంలో పేరెంట్ అనే పదానికి ముందు ‘ద’ అనే ఆర్టికల్ను ఉపయోగించారు. పేరెంట్ అనే పదాన్ని పేరెంట్స్ అనే బహువచన రూపంలో ఇవ్వలేదు. కావున ‘ద పేరెంట్’ అనే పదానికి ఏకవచన అర్థం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. ‘బోత్ పెరెంట్స్’ అని ఎక్కడా లేదు. అందువల్ల తల్లి లేదా తండ్రి వారిలో ఎవరైనా పేరు నమోదుకు హక్కు కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. చట్టంలో లేని విధంగా ఇద్దరూ కలిసే దరఖాస్తు చేయాలి. ఇరువురి అంగీకారం కావాలని రిజిస్ట్రార్ కొత్త నియమాన్ని పెట్టలేడని పేర్కొంది. ఈ వ్యాఖ్యానం ఆధారంగా తల్లి లేదా తండ్రి తొందరపడి తనకు నచ్చిన పేరుతో పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఆపేరు నచ్చకపోతే చట్టపరంగా సవరణలు కోరే అవకాశం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.పాప భవిష్యత్తే ముఖ్యం‘పుణ్య నాయర్’ అని తన కుమార్తెకు పేరు పెట్టాలని తల్లి కోరింది. ‘పద్మ నాయర్’ పేరును తండ్రి సూచించాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్న సమయంలో ‘పిల్లల ప్రయోజనాలనే పరిగణన’లోకి తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. పాప భవిష్యత్తే ముఖ్యమని పేర్కొంది. పేరు విషయంలో తల్లిదండ్రులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ‘పేరెన్స్ పాట్రీ’ కింద కోర్టే తుది నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి తన తల్లి సంరక్షణలోఉన్నందున ఆమె సూచించిన పేరుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. పితృత్వం విషయంలో ఎలాంటి వివాదం లేనందున తండ్రి పేరును కూడా చేర్చాలని అభిప్రాయపడింది. ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ సంక్షిప్తంగా ‘పుణ్య బి.నాయర్’ గా ఆ చిన్నారికి పేరు పెట్టింది. ఈ పేరుతో కొత్తగా దరఖాస్తు చేయాలని సూచించింది. దరఖాస్తు అందిన 15 రోజుల లోపు ఆ పేరుతో జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.ఈ కేసులో కోర్టు కేవలం ‘పేరు’ వివాదాన్ని మాత్రమే పరిష్కరించలేదు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్తు, చట్టంలో పేర్కొన్న పదాలకు ఇవ్వాల్సిన సరైన అర్థం గురించి స్పష్టత ఇచ్చింది. కన్నబిడ్డకు తల్లిదండ్రులే పేరు నిర్ణయించలేని స్థితిలో కోర్టే స్వయంగా ఓ చిన్నారికి పేరు పెట్టడంతో న్యాయవ్యవస్థలో ఇది ఆసక్తికరమైన, అరుదైన తీర్పుల్లో ఒకటిగా నిలిచింది. - దిలీప్ మాదిరెడ్డి -
హెయిర్ సెట్ చేయడానికి.. ఈ 'క్యాప్స్లాక్'!
హెయిర్ సెట్ చేయడానికి టైమ్ లేకపోయినా, బార్బర్ చేసిన పని కాస్త అతిగా అనిపించినా, లేదా ‘ఈరోజు కాస్త స్టయిలిష్గా కనిపించాలి’ అనిపించినా, ఒక క్యాప్ పెట్టుకుంటే చాలు– లుక్ ఆటోమేటిక్గా కూల్లాక్ అయిపోతుంది. అయితే, ఈ క్యాప్ కేవలం తలకు కవర్లా కాకుండా, మీ స్టయిల్కి ఒక కిరీటంలా కనిపించాలంటే ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే!బేస్బాల్ క్యాప్ ఎప్పటికీ క్లాసిక్!ఫ్యాషన్ ట్రెండ్స్ మారినా, బేస్బాల్ క్యాప్ మాత్రం ఎప్పుడూ ఔటాఫ్ స్టయిల్ కాదు. జీన్ ్స, టీషర్ట్, షార్ట్స్– ఏ ఔట్ఫిట్తో అయినా ఈజీగా మ్యాచ్ అవుతుంది. ముఖ్యంగా నేవీ, బ్లాక్, వైట్ కలర్స్లో ఉంటే ఎప్పుడైనా కళ్లుమూసుకుని వేసేయొచ్చు.లోగో మ్యాజిక్!కొన్ని క్యాప్స్పై చిన్న లోగో ఉంటేనే సరిపోతుంది. ఆ చిన్న లోగోనే పెద్ద స్టేట్మెంట్ అవుతుంది. స్పోర్ట్స్ లోగోలు లేదా మినిమల్ బ్రాండ్ ఎంబ్రాయిడరీలు ఉన్న క్యాప్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి.ట్రక్కర్ క్యాప్స్కి గాలి ఫుల్!వెనుక భాగం మెష్తో ఉండే ట్రక్కర్ క్యాప్స్ సమ్మర్కి బెస్ట్. గాలి బాగా ఆడుతుంది, చెమట తక్కువగా ఇబ్బంది పెడుతుంది. బైక్ రైడ్స్, ట్రావెల్స్, వీకెండ్ ఔటింగ్స్కి ఇవి పర్ఫెక్ట్.క్లాసిక్ స్ట్రీట్ స్టైల్ఒక వైట్ టీషర్ట్, ఓవర్సైజ్డ్ డెనిమ్ జాకెట్, బ్లాక్ లేదా నేవీ క్యాప్ జత చేస్తే చాలు. ఇది ఎప్పటికీ ఫెయిల్ అవని కాంబినేషన్ . సింపుల్గా కనిపించినా స్టయిల్లో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేస్తుంది.వెకేషన్ వైబ్లైట్ వెయిట్ లినెన్ షర్ట్, షార్ట్స్తో పాటు బీజ్ లేదా క్రీమ్ కలర్ క్యాప్ పెట్టుకుంటే హాలిడే మోడ్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. బీచ్కి వెళ్లకపోయినా, చూసేవాళ్లకు మాత్రం మీరు వెకేషన్ లో ఉన్నట్టే అనిపిస్తుంది.ఆల్ బ్లాక్ ఆటిట్యూడ్బ్లాక్ టీషర్ట్, బ్లాక్ జీన్ ్స, బ్లాక్ క్యాప్– ఈ కాంబో ఎప్పుడూ పవర్ఫుల్గా కనిపిస్తుంది. అయితే మొత్తం లుక్ బ్లాక్లోనే ఉంటే, ఒక వాచ్ లేదా వైట్ స్నీకర్స్తో చిన్న కాంట్రాస్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు.జాగ్రత్తలు!- క్యాప్ పెట్టుకున్నారంటే స్టిక్కర్లు, ట్యాగులు తీసేయండి. లేదంటే కొత్తగా కొన్నానని ప్రపంచానికి ప్రకటన ఇచ్చినట్టే ఉంటుంది.- మురికి పట్టిన క్యాప్తో స్టయిల్ కంటే అలసత్వమే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్గా క్లీన్ చేయండి.- ఇండోర్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ క్యాప్ తీసేయకుండా ఉంటే, అది అలవాటు ఎక్కువైనట్టే. సందర్భాన్ని బట్టి క్యాప్ను క్యారీ చేయాలి. - కొండి దీపిక -
అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్ స్కిన్ కేర్ డివైస్!
ప్రముఖ బ్యూటీ టెక్నాలజీ సంస్థ ‘ఇన్యూమీ’ సౌందర్య ప్రేమికుల కోసం ఒక సరికొత్త, వినూత్నమైన పోర్టబుల్ స్కిన్ కేర్ డివైస్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘నానో హైడ్రా ప్రో’ పేరుతో రూపొందించిన ఈ హైటెక్ గాడ్జెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీల కలయికతో పనిచేస్తుంది.ఈ ఆధునిక నానో హైడ్రా ప్రో డివైజ్లో ఆటోమేటెడ్ డ్యుయల్–పంప్ మెకానిజంతో పాటు ఏఐ సాంకేతికతను ఉపయోగించారు. ఇది చర్మ సంరక్షణకు అవసరమైన లిక్విడ్లను అత్యంత సూక్ష్మమైన స్ప్రే రూపంలోకి మారుస్తుంది. దీనివల్ల స్కిన్ కేర్ లిక్విడ్స్ చర్మం లోపలి పొరల వరకు సులభంగా చేరుకుని, చర్మాన్ని ఎక్కువ సమయం పాటు హైడ్రేటెడ్గా ఉంచుతుంది.ప్రయాణాల్లో సైతం ఎంతో సులభంగా తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఈ స్మార్ట్ డివైస్లో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. డివైజ్ను ఎలా ఉపయోగించాలో గైడ్ చేయడానికి ప్రత్యేక డిస్ప్లే, సెన్సర్లు ఇందులో ఉంటాయి. దీనిని ఫోన్ యాప్తో అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా వాతావరణ పరిస్థితులను బట్టి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఎప్పటికప్పుడు రిమైండర్లను పంపుతూ ఒక పర్సనల్ స్కిన్ కేర్ కన్సల్టెంట్లా ఈ డివైజ్ సహాయపడుతుంది. ఇందులో స్కిన్ కేర్ లిక్విడ్స్ నింపుకోవడానికి వీలుగా సులభంగా మార్చుకోగలిగే మ్యాగ్నెటిక్ క్యాప్సూల్స్ ఉండటం విశేషం.పురాతన ఈజిప్షియన్, భారతీయ, గ్రీకు, రోమన్ ప్రజలు కుంకుమపువ్వును సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించేవారు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా స్నానం చేయడానికి కుంకుమపువ్వు కలిపిన నీరు/పాలు ఉపయోగించేదట! తేనెతో పులియబెట్టిన గుర్రం పాలతో నిండిన టబ్లో స్నానం చేయడం, ఆమె ఆచరించిన సౌందర్య మార్గాలలో ఒకటి. ఆధునిక కాలంలో కూడా అనేక లగ్జరీ స్కిన్ కేర్ బ్రాండ్స్ క్లియోపాత్రా వాడిన పాలు, తేనె, కుంకుమపువ్వు ఫార్ములాను ఆధారంగా తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.ఎండల్లోనూ మెరిసేలా!ఉక్కపోత, వేడి వల్ల వేసవిలో చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు. వేసవిలో సన్ స్క్రీన్ని ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ తీవ్రమైన సన్ బర్న్ బారిన పడితే కలబంద గుజ్జు, జింక్ ఉన్న క్రీములు, ఐస్ ప్యాక్స్తో చర్మాన్ని చల్లబరచుకోవాలి. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని మళ్లీ తాజాగా మార్చవచ్చు. అందువల్ల ఎక్స్ఫోలియేషన్పై దృష్టిపెట్టాలి.మచ్చలు, మొటిమలు ఏ కాలంలోనైనా రావచ్చు. కానీ వేసవిలో ఇవి మరింత ఎక్కువవుతాయి. మొటిమలు వేధిస్తున్నప్పుడు గ్లైకోలిక్ యాసిడ్ లేదా శాలిసిలిక్ యాసిడ్ ఉన్న క్లెన్సర్ను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. శరీరంలో తగినంత నీరు ఉన్నట్లయితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. -
ఫైట్ అండ్ ప్లైట్లో గ్రాండ్ మాస్టర్
మన శరీరంలో కొన్ని అవయవాలు పరిమాణంలో చిన్నవైనా, వాటి పని మాత్రం అసాధారణంగా ఉంటుంది. అలాంటి వాటిల్లో అడ్రినల్ గ్రంథులు ఒకటి. ప్రతి అడ్రినల్ గ్రంథి సుమారు 4–6 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఆకారంలో చిన్న త్రిభుజంలా కనిపించే ఈ గ్రంథులు ఒక్కో కిడ్నీపైన ఒక్కటి ఉంటాయి. జీవక్రియలకు అత్యవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తిమంతమైన గ్రంథులివి. ఈ అడ్రినల్ గ్రంథి చేసే అద్భుతమైన పనులేమిటో తెలుసుకుందాం.చాలా మందికి అడ్రినల్ గ్రంథుల గురించి పెద్దగా తెలియదు. కానీ ప్రతి రోజు మన శరీరంలో జరిగే అనేక ముఖ్యమైన ప్రక్రియలను ఇవే నియంత్రిస్తాయి.ఒత్తిడి సమయంలో అడ్రినల్ గ్రంథుల పాత్ర మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో అడ్రినల్ గ్రంథులు వెంటనే స్పందిస్తాయి. ఈ సమయంలో అడ్రినలిన్ విడుదల అవుతుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం రక్తపోటు పెరగడం శరీరానికి తక్షణ శక్తి అందించడం మెదడు అప్రమత్తంగా మారడం జరుగుతుంది. ఇలా జరగడాన్ని వైద్యపరంగా ‘ఫైట్ లైదా ఫ్లైట్ రెస్పాన్స్’ అంటారు. అంటే ప్రమాదాన్ని ఎదుర్కొని పోరాడటానికీ లేదా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి శరీరం సిద్ధమవుతుంది.కార్టిసోల్ అంటే ఏమిటి... ఎందుకు అవసరం?కార్టిసోల్ను చాలామంది ‘స్ట్రెస్ హార్మోన్’ అని పిలుస్తారు. కానీ ఇది కేవలం ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ మాత్రమే కాదు. ఇది... రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ, రక్తపోటు నిర్వహణ ఇన్ఫెక్షన్లకు ప్రతిస్పందన శరీర జీవక్రియలు (మెటబాలిజం) శక్తి వినియోగం వంటి అనేక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది.ఆల్డోస్టెరోన్ పని ఏమిటి?ఆల్డోస్టెరోన్ శరీరంలో సోడియం, పొటాషియంలతోపాటు నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది. దీని ద్వారా రక్త΄ోటు నియంత్రణ జరుగుతుంది. కొంతమందిలో ఆల్డోస్టెరోన్ అధికంగా తయారవుతుంది. దీనిని ‘ప్రైమరీ హైపర్ ఆల్డోస్టెరోనిజం’ అంటారు. ఇది అధిక రక్త΄ోటుకు ఒక ముఖ్యమైన కారణం. కానీ... దీన్ని గుర్తించడం కష్టం. ముఖ్యంగా చిన్న వయసులోనే తీవ్రమైన బీపీ రావడం, మూడు నాలుగు మందులతో కూడా బీపీ నియంత్రణలోకి రాక΄ోవడం, రక్తంలో పొటాషియం తగ్గిపోవడం వంటి పరిస్థితుల్లో ఈ వ్యాధిని అనుమానించాలి. సరైన పరీక్షలతో దీన్ని గుర్తించి చికిత్స చేస్తే బీపీని గణనీయంగా నియంత్రించవచ్చు.అడ్రినల్ గ్రంథి ఆరోగ్యానికి చేయాల్సిందేమిటి...?కంటినిండా నిద్ర క్రమబద్ధంగా చేసే వ్యాయామం ఒత్తిడి నియంత్రణ ధ్యానం సమతుల్య ఆహారం... ఇవి అవసరం. చివరిగా... అడ్రినల్ గ్రంథులు పరిమాణంలో చిన్నవైనా, జీవానికి అత్యంత కీలకమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తివంతమైన గ్రంథులు. శరీర సమతుల్యతను కాపాడడంలో ఇవి చేసే పని అసాధారణం. అందుకే శరీర సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదించడం మంచిది.డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి,సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్, -
పచ్చగా కళకళ.. పక్షుల కిలకిల!
ఢిల్లీ మహా నగరమంటే పొద్దెక్కక ముందే రోడ్డెక్కిన వాహనాలు, నాన్స్టాప్గా మోగే హారన్ మోతలు, గందరగోళాలు, గజిబిజీ బతుకులు.. కాని అదే నగరంలో మరోప్రదేశంలో తెల్లవారకముందే వినిపించే పక్షుల కిలకిలారావాలు, సూర్యకాంతి వెలుగులో జిలుగులు విరజిమ్మే సీతాకోక చిలుకలు, ఆకాశానికి నిచ్చెనేసినట్టు ఎగబాకే మొక్కలు... ఇదంతా ఓ ఇంటిపైన ... దీని వెనుక ఉంది ఓ కుర్రాడి తపన.ఢిల్లీ వాసి అమన్ శర్మకి 19 ఏళ్లు. బాల్యం నుంచి అతని అమ్మానాన్నలు తరచూ పక్షుల సంరక్షణా కేంద్రాలకు తీసుకెళ్లేవారు. లాక్డౌన్ టైంలో మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అమన్కి అప్పుడొచ్చిన ఐడియానే ‘అర్బన్ జంగిల్.’ తన ఇంటిపైన ఉన్న 1500 చదరపు అడుగులను చిన్నసైజు అడవిలా మార్చాలనుకున్నాడు. ఒక్కొక్క పూలకుంyీ ని ఏర్పాటు చేస్తూ వాటిని సంరక్షిస్తూ వచ్చాడు. అలా తన ఇంటి మేడమీద 500 మొక్కలను పెంచాడు. ఒకప్పుడు అలారం పెట్టుకుని లేచే అమన్కి ఇప్పుడు రోజూ పక్షుల కిలకిలారావాలతోనే మెలకువ వస్తుంది. మేడమీదకెళ్లగానే సీతాకోక చిలుకలు స్వాగతం పలుకుతాయి. వాటిని తరుముకుంటూ వచ్చి జామపళ్లను తింటూ చిలుకలు తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి.దాదాపు వందకు పైగా రకాల చెట్లు పెరుగుతున్న ఈ అర్బన్ జంగిల్లో 25 నుంచి 30 రకాల పక్షిజాతులు రోజూ వస్తుంటాయి. ఢిల్లీ పరిసరప్రాంతాలలో ఇలాంటి పక్షిజాతులు కూడా ఉన్నాయా అంటూ... చూసిన వారంతా విస్తు΄ోతున్నారు. పక్షులను, కీటకాలను ఆకర్షించడానికి నిమ్మ, కరివేపాకు, మిల్క్వీడ్, జామ, దానిమ్మ, స΄ోట వంటి చెట్లను నాటితే సీతాకోక చిలుకలు, తేనెటీగలు, చిలుకలతోపాటు ఇతర పక్షులను ఆకర్షించవచ్చని అమన్ పేర్కొన్నాడు.అమన్ 14 ఏళ్ల వయసులోనే పిల్లల కోసం పిల్లలు మాత్రమే నడిపే ‘కుకు అబౌట్ నేచర్ క్లబ్’ అనే క్లబ్నుప్రారంభించాడు. ఈ క్లబ్ద్వారా పిల్లల్ని ఢిల్లీ పరివాహకప్రాంతాల్లోని నేచర్ పార్క్లకు తీసుకెళ్లేవాడు. అచిరకాలంలోనే ప్రకృతి ప్రేమికులు అనేకమంది అమన్తో జతకట్టారు. అలా మొదలైన ఈ చిన్నపిల్లల క్లబ్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద బర్డ్ కమ్యూనిటీ క్లబ్గా తయారైంది.పర్యావరణ పరిరక్షణలో అమన్ చూపిన చొరవకు ఐక్యరాజ్యసమితి (యుఎన్జీఏ) నోబుల్ పీస్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక వేదికల నుంచి పిలుపు వచ్చింది. అంతేకాదు నగరాల్లోని వన్య్రపాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ బ్రాండ్ నికాన్ నియమించిన అంబాసిడర్లలో అత్యంత పిన్న వయస్కుడిగా అమన్ గుర్తింపుపొందాడు. -
లిక్విడ్ నైట్రోజన్తో కూడిన ఆహారం సురక్షితమేనా?
అసాధారణమైన ఘనీభవించిన డెజర్ట్ల తయారీ కోసం, అలాగే ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ద్రవ నైట్రోజన్ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో, ద్రవ నైట్రోజన్తో తయారుచేసిన ఆహారాలు, చూడటానికి ఆసక్తికలిగించే ఫ్యాషన్ ట్రెండ్గా మారాయి. సాధారణ ఫ్రీజింగ్ పద్ధతుల కంటే ద్రవ నైట్రోజన్ ఉష్ణోగ్రత ఆహారపదార్థాలను భిన్నంగా గడ్డకట్టేలా చేస్తుంది. దీనివల్ల వాటికి విభిన్నమైన చిక్కదనం, ఆకృతి రావడంతో పాటు, ఒక ప్రత్యేకమైన ఆవిరి కూడా వెలువడుతుంది. ఈ ఆవిరిని చెఫ్లు "డ్రాగన్ బ్రీత్" స్నాక్స్ కోసం ఉపయోగిస్తారు. ఎవరైనా డ్రాగన్ బ్రీత్ స్నాక్ను కొరికినప్పుడు, అది ఒక ఆవిరి మేఘాన్ని విడుదల చేస్తుంది. అంటే..ఇది వారి నోటి నుంచి పొగ వస్తున్నట్లుగా ఒక ప్రభావాన్ని సృష్టిస్తుంది. దీన్ని డ్రాగన్ శ్వాస లేదా స్వర్గపు శ్వాస వంటి ట్రెండ్లుగా పిలుస్తారు. అలాంటి ఆహారాలకు కేరాఫ్ బెంగళూరులోని వివి పురం ఫుడ్ స్ట్రీట్. పాపం ఓ పెళ్లైన కొంత జంట అక్కడకువెళ్లి ఆ ట్రెండ్ ఫుడ్ని సరదాగా ట్రైం చేయడంతో ఏం జరిగిందో తెలిస్తే విస్తుపోతారు. అంతేగాదు ఇలాంటి ఆహారం తినేటప్పుడు జాగురకతతో తినాలంటూ ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.అసలేం జరిగిందంటే..జస్ట్ పెళ్లై నాలుగురోజులైంది. ఆమె సరదాగా భర్తతో కలిసి ఈ స్మోకీ ట్రెండ్ ఫుడ్ని టేస్ట్ చేయాలని వి.వి.పురం ఫుడ్ స్ట్రీట్కు వెళ్లారు. అక్కడ ద్రవ నైట్రోజన్తో పూత పూసి.. పొగలు వెలువరించే బిస్కెట్లు తిన్నారు. అంతే ఆ నవవధువుకి నోటి నుంచి రక్తస్రావం, ఎండోస్కోపీలో అన్నవాహిక , జీర్ణాశయ శ్లేష్మ పొర గణనీయంగా క్షీణించినట్లు తేలింది. ఆ తర్వాత రెండు చేతులు, కాళ్లలో బలహీనత మొదలై..ఒక నెల వరకు మంచానికే పరిమితమైంది. వైద్య పరీక్షల్లో నరాల ప్రసరణ పరీక్షలలో అక్యూట్ మోటార్ ఆక్సోనల్ న్యూరోపతి ఉన్నట్లు నిర్ధారణ అయింది. సరదాగా తిన్న ఆహారం ఆటోఇమ్యూన్ న్యూరోపతికి దారితీసింది. తినేటప్పుడు తస్మాత్ జాగ్రత్త..ద్రవనైట్రోజన్తో కూడిన ఆహారాలు తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందట. అవి పూర్తిగా ఆవిరైకపోక ముందే తింటే నోరు, అన్న వాహిక, కడుపుకి తీవ్రమైన క్రయోజెనిక్ కాలిన గాయలు ఏర్పడి, కోతలు, రక్తస్రావం, చిల్లులు పడటానికి దారితీస్తుందట. ఆ నేపథ్యంలోనే ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) దీనిపై స్పష్టమైన హచ్చరికలు జారీ చేసింది. పైగా ఆహారాన్ని ప్లేట్లో వడ్డించేటప్పుడు లేదా కస్టమర్లకు నేరుగా అందించే ముందు ద్రవ నైట్రోజన్ ఉపయోగించడం పూర్తిగా నిషేధించింది. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ సమయంలో లేదా ఐస్క్రీంల తయారీలో మాత్రమే దీనిని శీతలీకరణ (cooling) ఏజెంట్గా ఉపయోగించడానికి అనుమతి ఉంది. ఒకవేళ సరదాగా ఇలాంటి క్రయోజనిగ్ ఫుడ్ని ప్రయత్నించాలనుకుంటే..ఆ పొగ అంతా అయిపోయేదాక వెయిట్ చేసి అప్పుడు ఆరగించాలని అంటున్నారు. నేరుగా అలానే తింటే తీవ్ర ప్రమాదాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: జస్ట్ ఒక్క గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అనుకున్నా..! కానీ ఏకంగా 19..) -
జస్ట్ ఒక్క గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అనుకున్నా..! కానీ..
కొందరు సక్సెస్కి చిరునామాగా ఉంటారు. చాలామంది ఎంచుకున్న దాంట్లో సక్సెస్ అందుకోవడానికే నానా తంటాలు పడతూ ఉంటే..రాసిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం అంటే..మాటలు కాదుకదా..!. అంత అంకితభావంతో, అంతలా ప్రిపేరవ్వడం నిజంగా మాటలు కాదు కదా..!. కానీ ఈ అమ్మాయ్ అలాంటి ఘనతనే సాధించింది.ఆ అమ్మాయే రాయ్పూర్కి చెందిన చారు పాండే. భారతదేశంలో ప్రభుత్వ నియామకానికి సంబంధించిన ఎన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఉత్తీర్ణత సాధించలేక అభ్యర్థులు ఎంతలా ఇబ్బంది పడతుంటారో తెలిసిందే. అలాంటిది..అంత కఠినతరమైన ప్రభుత్వ నియమాక పరీక్షలన్నీ సులభంగా చేధించేసిందామె ఆమె. ఒకటి, రెండు కాదు ఏకంగా 19 సెంట్రల్ గవర్నెమెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం విశేషం. జస్ట్ 23 ఏళ్ల వయసుకే ఈ ఘనతను సాధించిన అమ్మాయిగా రికార్డు సృష్టించి..వార్తల్లో నిలిచింది. ఆమె రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలు, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ వంటి అనేక పరీక్షల్లో రాసింది. ఆమె చేసిన నిరంతర ప్రయత్నాలు చివరకు ఫలించి ఏకంగా 19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి దారితీసింది. ఈ మేరకు చారు పాండే మాట్లాడుతూ..19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. నిజం చెప్పాలంటే ఇన్ని పరీక్షలు రాస్తానని అస్సలు అనుకోలేదని చెబుతోంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా సంపాదించగలిగితే చాలు అనుకున్నా..కానీ ఏకంగా ఇన్ని పరీక్షల్లో విజయవంతమయ్యా అంటూ సంతోషంగా చెప్పుకొచ్చింది. తన గణిత నేపథ్యం కారణంగా తన పేరెంట్స్ టీచర్ లేదా లెక్చరర్ రంగంలోకి వెళ్లాలని ఆశించారు. ఈ నేపథ్యంలోనే ఇలా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే నెటిజన్లు కొందరు ఆమె పట్టుదలపి, కృషిని ప్రశంసించగా, మరికొందరు ఇన్ని రాసిందంటే..ఆమెకు ఎందులోనూ సరైన అభిరుచి లేదు..పైగా ఆ రంగంలోని వాళ్ల రిజర్వేషన్ ఈమె కారణంగా కోల్పోతేందంటూ మండిపడుతూ పోస్టులు పెట్టారు.#WATCH | Raipur, Chhattisgarh: Charu Pandey, starting her journey at 23 with the dream of a government job, has inspired lakhs of young aspirants by clearing 19 competitive exams, says, "... My family is very happy with this achievement of mine. I am receiving an award for… pic.twitter.com/Zo21tNMxPs— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 12, 2026 (చదవండి: కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్!) -
నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..
ఇటీవల కాలంలో లేఆఫ్స్ ఎంత కామన్గా అయిపోయాయో తెలిసిందే. ఉద్యోగ భద్రత కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పరిస్థితులు ఇవి. అలాంటి స్థితిని ఎలా హ్యాండిల్ చేసి..సులభంగా మన కెరీర్ని పునర్నిర్మించుకోగలమో చెప్పే కథ ఇది. అందుకు కుటుంబ మద్దతు తోడైతే తిరుగే ఉండదంటున్నాడు ఈ వ్యక్తి. అంతేగాదు తన బంగారు తల్లే ఈ సమస్య నుంచి బటయపడేలా కొండంత స్టైర్యాన్ని ఇచ్చింది అంటున్నాడు ఈ నాన్న. అందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్గా మారింది. హిమాన్షు ఝా అనే పారిశ్రామిక వేత్త తన జాబ్ పోయి ఏడాది అయిన సందర్భంగా.. నాటి తన పరిస్థితి గురించి వివరించాడు. తన కెరీర్లోని అత్యంత గడ్డుపరిస్థితిని ఆ ఏడాదిలో చవిచూశానంటూ..నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు. ఆకస్మికంగా చక్కటి కార్పొరేట్ ఉద్యోగం కోల్పోవడంతో.. ఒక్కసారిగా తన పరిస్థితి తలకిందులైనట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఏం చేయాలో దిక్కుతోచని ఆ స్థితిలో తన భార్య, కూతురు ఎలా తన మద్దతుగా నిలిచారో చెబుతూ వారిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ కష్ట సమయంలో మన స్నేహితులు, బంధువులు ఎలా దూరమవుతారో, అలాగే మనకెంతో ప్రియమైన వారు ఎలా అండగా నిలబడతారో మనకు తెలుస్తుంది. అంతేగాదు ఉద్యోగం కోల్పోవడంతో ఐదు పాఠాలను నేర్చుకున్నానంటున్నాడు. ఆ సమయంలో తన కుమార్తెతో గడుపుతూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడూ.. ఆమె ఇక ఇప్పుడు మీకు నచ్చింది చేయండి నాన్న అంది. అప్పుడే అర్థమైంది జాబ్ పోవడం అంతం కాదు, కెరీర్లో ఎదురయ్యే ఎదురుదెబ్బ అంతిమం కాదని తెలుసుకోగలిగనంటున్నాడు. ఏ వయసులోనేనా మళ్లీ తిరిగి ప్రారంభించి నిలదొక్కుకోవచ్చు..అందుకు గుండె నిండా ధైర్యం కావాలి. అది ఉంటే చాలు..చతికిల పడినా..రాకెట్లా తిరిగి దూసుకుపోగలమని అవగతమైందని చెప్పుకొచ్చాడు హిమాన్షు. ఇది అప్పటి వరకు ఉన్న సౌకర్యవంతమైన స్థితి నుంచి బయటకు నెట్టి..స్ట్రాంగ్గా మరింత బలంగా నిలబడేందుకు అంకురార్పణ అవుతోందంటున్నాడు. తన కూతురు చెప్పినట్లుగా 44 ఏళ్ల వయసులో నా కలను అనుసరించి స్టార్టప్ ప్రారంభించి, వ్యవస్థాపకుడిగా మారానని చెప్పాడు. నచ్చిన పనిచేయి నాన్న అంటూ మాట్లాడిన మాటలు..చాలా సాధారణమైనవిగా కనిపిస్తున్నా..ధైర్యాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చించిందామె. ఈ పరిస్థితి.. ఎవరు మనకు ఆప్తులు..ఎవరు శత్రువులో కూడా తెలియజేస్తుంది. అలాగే దీంతోపాటు..అతిపెద్ద ఆస్తి ఆరోగ్యం అని దానిపై సదా దృష్టిపెట్టమని కోరాడు. ఏళ్ల తరబడి కార్పొరేట్ లైప్ బిజీలో, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని తెలుసుకున్నా..అంతర్గత శాంతికి ప్రయత్నించి మరీ.. నిలదొక్కుకునే ప్రయత్నం చేశానని రాసుకొచ్చాడు. అలాగే ఎక్కువగా భయపడే ఉద్యోగ తొలగింపు భయం..ఒక్కోసారి మిమ్మల్ని స్ట్రాంగ్గా మార్చే అధ్యయంగా కూడా మారుతుందని నమ్మకంగా చెబుతూ..తన పోస్ట్ని ముగించాడు హిమాన్షు. నెటిజన్లు కూడా ఆయన మాటలకు మద్దతు తెలుపుతూ..ముందుకు సాగకుండా..రాబోయేదాన్ని స్వీకరించకుండా, గతాన్ని పట్టుకుని వేళాడటమే తప్పు..మీకు అంతా మంచే జరుగుతుంది సార్ అని అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్న వారు ఈ వ్యక్తి స్ఫూర్తినే తీసుకుంటూ...ముందుకు సాగండని హితవు పలుకుతున్నాడు హిమాన్షు.(చదవండి: ఆటో డ్రైవర్ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్కి..! జస్ట్ దేశీ బ్రాండ్తోనే.) -
వృక్షాసనం.. ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం!
వృక్షాసనం అంటే ‘చెట్టు భంగిమ‘ అని అర్థం. ‘వృక్షాసనం మనకు చెట్టు వంటి స్థిరత్వం, సమతుల్యత, ఏకాగ్రతను నేర్పే అద్భుతమైన యోగాసనం. ‘వృక్షాసనం అనేది ఒక కాలి మీద నిలబడి, శరీర సమతుల్యతను కాపాడుకునే యోగాసనం. చెట్టు మాదిరిగా స్థిరంగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన 4–6 గంటల వ్యవధి తర్వాత ఈ ఆసనం వేయడం అత్యంత శ్రేయస్కరం.వృక్షాసనం చేసే విధానం..యోగా మ్యాట్పై నిలబడి, రెండు కాళ్లను దగ్గరగా ఉంచండి. ఇప్పుడు కుడి కాలిపై నిలబడి, శరీర బరువును బ్యాలెన్స్ చేయండి.ఎడమ మోకాలిని వంచి, ఎడమ పాదాన్ని కుడి కాలి తొడ లోపలి భాగానికి (తొడమూలానికి వీలైనంత దగ్గరగా) గట్టిగా ఆన్చండి. రెండు చేతులను నెమ్మది గా పైకి లేపి, నమస్కార ముద్రలో అరచేతులను కలపాలి.ముందు భాగంలో ఏదైనా ఒక వస్తువుపై దృష్టిని కేంద్రీకరిస్తూ, శ్వాసను సాధారణంగా తీసుకుంటూ 10–20 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి.ఇదే పద్ధతిని కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచి మరోవైపు రిపీట్ చేయాలి..ప్రయోజనాలు..విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది, మనో నిబ్బరం, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి.కాళ్లు, చీలమండలు, వెన్నెముక దృఢంగా మారతాయి.నాడీ వ్యవస్థకు ప్రశాంతత చేకూరుతుంది.నడుము నొప్పి, సయాటికా నరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.శరీరం బ్యాలెన్స్, స్టెబిలిటీ పెరుగుతాయి.జాగ్రత్తలు..తీవ్రమైన మైగ్రేన్, అధిక లేదా తక్కువ రక్తపోటు సమస్యలు ఉంటే ఈ ఆసనం వేయకూడదు.నిద్రలేమి సమస్య ఉన్నవారు దీనిని నిపుణుల సమక్షంలోనే చేయాలి.మోకాళ్లు, తుంటి లేదా మెడకు సంబంధించిన సర్జరీలు అయినవారు ఈ ఆసనాన్ని వేయరాదు.మొదటిసారి చేసేవారు బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండటానికి గోడ సపోర్ట్ తీసుకోవచ్చు లేదా కుర్చీని పట్టుకుని చేయవచ్చు.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
తడిసిన పుస్తకం.. మూడు రోజుల కూలీ!
అబ్రహాం లింకన్ కి 11 ఏళ్లు ఉన్నప్పుడు ఇండియానాలోని పిజన్ క్రీక్ దగ్గర ఉండేవాడు. చదువంటే పిచ్చి. పక్క ఊరిలో జోసియా క్రాఫోర్డ్ అనే రైతు దగ్గర ‘ద లైఫ్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్’ అనే పుస్తకం ఉందని తెలిసింది. లింకన్ బతిమాలి తెచ్చుకున్నాడు. ఆ రాత్రి వర్షం. గుడిసె కప్పులో నుంచి నీళ్లు కారి, పుస్తకం తడిసి నాశనం అయ్యింది.తెల్లారి లింకన్ ఏడుస్తూ క్రాఫోర్డ్ దగ్గరికి వెళ్లి, ‘నేను పుస్తకం పాడు చేశాను సార్’ అని ఒప్పుకున్నాడు. క్రాఫోర్డ్ దానికి ‘సరే, మూడు రోజులు నా పొలంలో పని చెయ్. అప్పు తీరిపోతుంది’ అన్నాడు. 11 ఏళ్ల లింకన్ మొక్కజొన్న పొలంలో, పందుల షెడ్డులో మూడు రోజులు కూలి చేశాడు. పుస్తకానికి ఖరీదు కట్టాడు. ఆ పుస్తకాన్ని మళ్లీ ఎండబెట్టి, అట్ట వేసి, పూర్తిగా చదివాడు. నిజాయితీ ఉన్నవాడు పైకి వస్తాడని ఈ ఘటన చెబుతోంది. -
ఆలోచిస్తూ బుర్ర ఎందుకు గీరుకుంటారో తెలుసా?
‘వినీష్... మన రాష్ట్రపతి పేరేంటి?’ అని టీచర్ అడిగితే వాడు లేచి బుర్ర గీరుకుంటాడు. శ్రేష్ఠ ఎగ్జామ్ రాస్తూ ఆన్సర్ గుర్తుకు రాక తల గీరుకుంటుంది.ఎందుకు అలా తల గీరుకుంటారు?మన చర్మం కింద లక్షల కొద్దీ నరాలు ఉంటాయి. తల గీరినప్పుడు ఆ నరాలు మెదడుకు మెసేజ్ పంపిస్తాయి. ఆ సిగ్నల్తో మెదడులో నిద్రపోతున్న భాగాలు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఆలోచన వేగం పుంజుకుంటుంది. దీన్నే సైంటిస్టులు ‘సోమాటోసెన్సరీ యాక్టివేషన్’ అంటారు. తల గీరడం వల్ల అక్కడి చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది.రక్తంతో పాటు ఆక్సిజన్ కూడా మెదడుకు ఎక్కువగా అందుతుంది. ఆక్సిజన్ అందిన మెదడు చురుకుగా పనిచేస్తుంది. అందుకే ఒక్కసారిగా సమాధానం గుర్తొస్తుంది. మన మెదడు ఒక పెద్ద లైబ్రరీ లాంటిది. సమాధానం దొరకకపోతే మెదడు పుస్తకాలు అన్నీ వెతుకుతుంది. ఆ సమయంలో బుర్ర గీరడం వల్ల మెదడుకు ఎక్స్ట్రా ఎనర్జీ అందినట్టు అవుతుంది. అందుకే సరైన జ్ఞాపకం టక్కున దొరుకుతుంది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే బుర్ర గోకడం అనేది అలసిపోయిన మెదడుకు మనం ఇచ్చే మసాజ్ లాంటిది. -
బడి తెరిచారోచ్..! స్కూల్ బ్యాగ్ సూత్రం ఇదే..
నీ బ్యాగ్ నీకు స్నేహితుడిలా ఉండాలి, శత్రువులా కాదు. అందుకే టైంటేబుల్ చూసి ఆ రోజుకి కావాల్సిన పుస్తకాలు, నోట్బుక్స్ మాత్రమే పెట్టుకో. లెక్కల పీరియడ్ లేనప్పుడు ఆ పెద్ద లెక్కల పుస్తకం ఎందుకు? ఒక పెన్సిల్ బాక్స్, అందులో 2 పెన్సిళ్లు, ఎరేజర్, షార్పనర్, ఒక పెన్ను, ఒక స్కేల్ చాలు. నీళ్ల బాటిల్ తప్పనిసరి. డీహైడ్రేషన్ అయితే బుర్ర పనిచేయదు మరి.లంచ్ బాక్స్, ఒక చిన్న కర్చీఫ్, వర్షాకాలం కాబట్టి చిన్న రెయిన్ కోట్ కూడా ఒక మూలన పెట్టుకో. సెల్ ఫోన్, ట్యాబ్ స్కూల్కి అస్సలు వద్దు. బ్యాగ్ని రెండు భుజాల మీద సరిగ్గా వేసుకో. బ్యాగ్ బెల్టులు వదులుగా కాకుండా బిగుతుగా పెట్టుకుంటే బరువు తెలియదు. గుర్తుంచుకో, మార్కులు తెచ్చేది బ్యాగ్లోని పుస్తకాలు కాదు, నీ బుర్రలోని ఆలోచనలు. కాబట్టి బ్యాగ్ తేలికగా ఉంచుకో, బుర్రని చురుగ్గా ఉంచుకో.వాటర్ బాటిల్ శాస్త్రంస్కూల్ బ్యాగ్లో అన్నింటికంటే ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరో తెలుసా? వాటర్ బాటిల్. నీళ్లు తాగే బాటిల్ ఎలా ఉండాలో తెలుసా? నీ వాటర్ బాటిల్ స్టీల్తో కానీ, కాపర్తో కానీ ఉంటే బెస్ట్. లేదంటే ’BPA Free’ అని రాసున్న ప్లాస్టిక్ బాటిల్ అయినా ఓకే. BPA అంటే విషం లాంటిది, అది నీళ్లలో కలిసిపోతే కడుపునొప్పి, జ్వరం వస్తాయి. రంగురంగుల బొమ్మల బాటిళ్లు బాగుంటాయి కానీ లోపల ఏ మెటీరియల్ ఉందో అమ్మతో చెక్ చేయించుకో. బాటిల్ మూత గట్టిగా ఉండాలి. లేకపోతే పుస్తకాలన్నీ తడిసి ‘వాటర్ పార్క్’ అయిపోతాయి. సైజు ముఖ్యం..5వ క్లాస్ పిల్లాడివి అయితే 750 ఎంఎల్ బాటిల్ చాలు.హైస్కూల్ హీరోవి అయితే 1 లీటర్ బాటిల్ ఉండాల్సిందే. నీ వయసుకి, నీ దాహానికి సరిపడే సైజు సెలెక్ట్ చేసుకో.సిప్పర్ ఉన్న బాటిల్ అయితే ఇంకా మంచిది.‘కడగడం కంపల్సరీ’. రోజూ బాటిల్ కడగడం మర్చిపోవద్దు.లోపల సబ్బు నీళ్లు పోసి బ్రష్తో తోమాలి. వారానికి ఒకసారి వేడి నీళ్లు, కాస్త ఉప్పు వేసి కడిగితే బ్యాక్టీరియా బైబై. -
కొన్ని సందర్భాల్లో.. మౌనమే సమాధానం!
మాట వెండి అయితే, మౌనం బంగారం లాంటిది అని ఒక ఆంగ్ల సామెత. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. దీనివల్ల మన చుట్టూ ఉన్న సంబంధాలు బాగుంటాయి. అయితే అన్ని సమయాల్లోనూ మౌనంగా ఉండకూడదు. ఎప్పుడెప్పుడు మౌనంగా ఉంటే మంచిదో తెలుసుకుందాం!మాటలు మంత్రంలా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఆ మాటలే మంటల్ని సృష్టిస్తాయి. అలాంటప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది. మౌనం అనేది చాలా సందర్బాల్లో రిలేషన్స్లో గొడవలు లేకుండా చేస్తుంది. మన విలువని కూడా కా΄ాడుతుంది. అదెప్పుడో చూద్దాం..ముఖ్య విషయాలు చెబుతున్నప్పుడు..ఇంటికి సంబంధించినవి కావచ్చు, ఆఫీస్కి సంబంధించిన విషయాలు కావొచ్చు.. ఇలా దేనికి సంబంధించి విషయాలైనా ఎదుటివారు చెప్పినప్పుడు అవి వినడం తప్ప మధ్యలో కల్పించుకోకూడదు. విషయం పూర్తయ్యాకే మాట్లాడాలి. అప్పటివరకూ మౌనంగా ఉండడమే ఉత్తమం.ముందే పరిష్కారం దొరికినప్పుడు..మీకంటే ముందే ఎవరైనా విషయం గురించి చెప్పి ఇంకా మీరు చెప్పడానికి ఏం లేనప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉండడం మంచిది. ఇతరులు చెప్పిన విషయాన్ని యాక్సెప్ట్ చేయండి. కానీ, అదే విషయాన్ని మీరు మొదట్నుంచీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు.విషయం తెలియనప్పుడు..మాట్లాడేటప్పుడు ఆ సందర్భం, ఆ సమస్య గురించి కచ్చితంగా పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. అలా ఏం తెలియకుండా మాట్లాడొద్దు. దీనికంటే ఆ సమయంలో మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే, ఇలాంటప్పుడు మీ మాటలు ఎవరు పట్టించుకోరు. మీరు నలుగురిలో నవ్వుల΄ాలయే అవకాశం ఉంది.రుజువు చేసుకోలేనప్పుడు...మీరు మాట్లాడే విషయాల గురించి సాక్ష్యాలు కచ్చితంగా ఉండాలి. అంతేకానీ, ఏవో ఊహించి మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల వేరే వ్యక్తులపై మానసిక, శారీరక ప్రభావం చూపే అవకాశం ఉంది.అవతలివారిని బాధపెట్టే సందర్భంలో...మన మాటల వల్ల మనకి కానీ, ఎదుటివారికి కానీ ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయేమో ఆలోచించి మాట్లాడాలి. ఎదుటివారిని నొప్పించే సందర్భాలు ఉంటే అలాంటప్పుడు మాట్లాడకపోవడమే మంచిది.మనసు బాగోలేనప్పుడు...అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. ఒక్కోసారి అలవోకగా మాట్లాడే మనం మరికొన్నిసార్లు స్పష్టంగా మాట్లాడలేం. దీనికి కారణం మన మనసు బాలేకపోవడం, అలసిపోయి ఉండడం, ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆ సమయంలో మీరు కోపంగా, ఆత్రంగా మాట్లాడడం మంచిది కాదు. దీనివల్ల తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మాట్లాడే ముందు కొన్ని క్షణాలు ఆలోచించడం మంచిది. -
నేరేడు పండ్లు తింటున్నారా?
నేరేడు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. ఆయుర్వేద పరంగా అన్ని విధాల ఆరోగ్యానికి మేలు అన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇలాంటి సమస్యలు ఉంటే తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు వైద్యులు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటే నేరేడు పండ్లు తీసుకోకూడదో తెలుసుకుందామా.!.నేరేడు పండ్లు ఇపుడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పండు, అందరికీ మేలు చేయకపోవచ్చు. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. అయితే, డయాబెటిస్ కోసం మందులు వాడుతున్న వారు వీటిని అధికంగా తీసుకుంటే, రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల కళ్ళు తిరగడం, విపరీతంగా చెమటలు పట్టడం, కంగారు, గుండె వేగం పెరగడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పండ్లలో సహజంగానే ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్రంలోని క్యాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు లేదా ఆ సమస్య వచ్చే అవకాశం ఉన్నవారు నేరేడు పండ్లను పరిమితంగానే తినాలి. నేరేడు పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదే. కానీ, ఒకేసారి వీటిని అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, లేదా కడుపు తిప్పడం వంటి సమస్యలు రావచ్చు. ∙ఈ పండ్లను అతిగా తింటే బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల గర్భిణులు నేరేడు పండ్లను తినే ముందు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. అలర్జీ హిస్టరీ ఉన్నవారు ఈ పండును మొదటిసారి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరికి నేరేడు పండ్ల వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది. -
బరువు తగ్గాలంటే.. మోయాలంతే!
స్మార్ట్ ఉండాలంటే ఆలోచిస్తే సరిపోదు.. ఫిట్గా కూడా ఉండాలి. అలాంటప్పుడే బ్రెయిన్ బాగా పని చేస్తుంది. పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఫిట్సెస్ సెంటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామాల్లో కూడా కొత్త విధానాలొచ్చేస్తున్నాయి. జిమ్, ఏరోబిక్స్, యోగా లాంటివి..కాని ఇవ్వన్నీ కామన్.. ఇప్పుడు కొత్తరకం ఫిట్నెస్ మంత్ర వచ్చింది అదే ‘రక్కింగ్’.కొత్త ఫిట్నెస్ ట్రెండ్ ఇప్పుడు బాగాప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతిలో ఒక నిర్దిష్ట బరువున్న వెస్ట్ను లేదా బ్యాక్ప్యాక్ను ధరించి నడస్తూ వెళ్లాలి. అలా అనుకున్న టార్గెట్ వరకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఒకసారి టార్గెట్ పూర్తయ్యాక నడకలో కాస్త వేగాన్ని పెంచాలి. అమెరికా, యూరప్లలో ఇప్పటికే ఈ పద్ధతిని లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఈ రక్కింగ్ వల్ల కాళ్ల కండరాలు రక్తప్రసరణ జరిగి ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. వాస్తవానికి ఇదేం కొత్త పద్ధతేం కాదు.. మిలటరీ శిక్షణలో భాగంగా సైనికులకు తుపాకీ, బ్యాక్ప్యాక్ ఇచ్చి నడిపిస్తారు. ఈ పద్ధతినే జనబాహుళ్యంలోకి తీసుకొచ్చి కొత్తరకం ఫిట్నెస్ సూత్ర అంటూ ప్రచారం చేస్తున్నారు. కాని ఊబకాయంతో బాధపడేవారికి మాత్రం ఈ రక్కింగ్ పద్ధతే కరెక్ట్... పైగా రక్కింగ్ చేయడానికి జిమ్లకు, యోగా క్లాసులకు వెళ్లక్కర్లేదు. ఎవరైనా ఇంట్లో ఉంటూ రక్కింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. -
నో గాసిప్స్ ప్లీజ్! ఎవరైనా గాసిప్ ప్రారంభించగానే.. ఇలా చేయండి!
మనం జీవితంలో రెండు విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీటిలో చాడీలు చెప్పడం ఒకటైతే నిందలు వేయడం రెండోది. ఎదుటి వ్యక్తి గురించి చాడీలు చెప్పినా, నిందలు వేసినా.. మనం దిగజారిపోయినట్టే! కనుక మనం మాటను ఆచితూచి ఉపయోగించాలి లేదంటే చేజేతులా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే! మన స్నేహితులతోనో, బంధువులతోనో, సన్నిహితులతోనో మాట్లాడేటప్పుడు మన దగ్గర లేని వ్యక్తి గురించి ఏది పడితే అది మాట్లాడటం మంచిది కాదు. ఇలాంటి ధోరణి హత్యతో, అత్యాచారంతో సమానమని, ఇతరుల గురించి విపరీతంగా అసూయపడే వారే ఇలాంటి ఇచ్చకాల మాటలకు పాల్పడుతుంటారని రామాయణం, మహాభారతంతో సహా పురాణాలన్నీ నొక్కి చె΄్పాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలూ ఈ ధోరణిని తీవ్రంగా ఖండించాయి. ఎటువంటి ఆధారం లేకుండా ఇతరుల దోషాలను, లోపాలను, తప్పిదాలను వేలెత్తి చూపిస్తూ మాట్లాడడాన్ని మహాపాపంగా బైబిల్ పరిగణించింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూప్రోత్సహించవద్దని, చేరదీయవద్దని గట్టిగా హెచ్చరించింది. ఇలా ఇచ్చకాలు మాట్లాడడాన్నే ఆంగ్లంలో గాసిప్స్ అని వ్యవహరిస్తారు. గాసిప్ మాట్లాడటం అంటే ఉత్తి పుణ్యానికి ఇతరుల మీద బురద చల్లడం, ఇతరుల ప్రతిష్టను, గౌరవ మర్యాదలను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం. ఇది సమాజానికి, వ్యక్తిగత జీవితానికి కూడా శ్రేయస్కరం కాదని మహాభారతంలో విదురుడు చె΄్పాడు. ఇతరుల గురించి పొరపాటున తప్పుగా మాట్లాడినప్పుడు వెంటనే పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ఒక్కటే దీనికి పరిహారమని బైబిల్ స్పష్టం చేసింది. ఇతరుల పరోక్షంలో వారి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి నరకాలకు వెళతాడని, హీనమైన జన్మ ఎత్తుతాడని మహాభారతం పేర్కొంది.కనుక పనికి రాని ఇచ్చకాలు ఎప్పటికీ ప్రమాదమే. అది సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. చెత్త ఆలోచనలు , చెత్త కబుర్లు మాట్లాడడం వల్ల అవి మనలోనిప్రాణశక్తిని హరించి వేయడమే కాకుండా మన జీవితంలో విలువైన సమయం వధా కావడానికి దోహదపడతాయి.పుకార్ల వల్ల చోటుచేసుకునే పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా,ప్రాణాంతకంగా ఉంటాయి. గాసిప్లో మునిగి తేలే వ్యక్తి ఎటువంటి దారుణానికైనా ఒడిగడతాడు. గాసిప్స్కు పాల్పడే వ్యక్తి తాను మానసికంగా చెడిపోవడమే కాకుండా, ఇతరులను కూడా మానసికంగా చెడగొడతాడు.అంతేకాదు అతను వ్యాప్తి చేసే పుకార్ల వల్ల సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ‘గాసిప్స్ వల్ల నిజం మరుగున పడిపోతుంది. అదొక కార్చిచ్చు లాంటిది. అది తన చుట్టూరా ఉన్న సమాజాన్ని దహించి వేస్తుంది. అది విషంతో సమానం.మనసులో ద్వేషాన్ని నింపుకున్న వాడే గాసిప్స్ను వ్యాప్తి చేస్తాడు. ఇటువంటి పనికిమాలిన కబుర్లు చెప్పడం ఎంత టైమ్ వేస్టో, వాటిని వినడం,ప్రోత్సహించడం కూడా అంతకన్నా ఎక్కువ టైమ్ వేస్ట్, ఇటువంటి వాటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. స్నేహితులు కానీ, బంధువులు కానీ ఇటువంటి గాలికబుర్లు చెప్పడంప్రారంభించగానే వాటిని తిరస్కరించడమో లేక వారిని ఆపు చేయడమో చేయాలి. లేదంటే అది కొన్ని సున్నితమైన గుండెల్ని బద్దలు చేయవచ్చు. మనసుల్ని, మనుషుల్ని కుప్పకూల్చవచ్చు. చివరకు మన వ్యక్తిత్వాన్నే సర్వనాశనం చేస్తుంది. నిస్సహాయుల్ని దారుణంగా దెబ్బతీస్తుంది’’ ఇటువంటి వ్యక్తుల్నిప్రోత్సహించే వారిని, చేరదీసే వారిని సైతం ఆ నీలినీడలు వెంటాడుతూనే ఉంటాయి.కేవలం మన పట్ల మనం మాట్లాడుకునే మాటలే ఎంతో ప్రభావం చూపిస్తే.. మరి మనం ఇతరుల జీవితాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను వారు లేనప్పుడు వారి గురించి మాట్లాడటం ఎంతటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించాలి.ఎవరైనా గాసిప్ ప్రారంభించగానే ఆ వ్యక్తి అంత హితమైన వ్యక్తి కాదని వెంటనే గ్రహించాలి. మనసు నిండా కుళ్లుతోనూ, అసహనంతోనూ, అంతకుమించిన అసూయతోను అలాంటి గాలిమాటలు చెబుతున్నాడని అర్థం చేసుకుని అటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానివ్వకపోవడం మంచిది. ఏది ఏమైనా, గాసిప్ మాట్లాడే వ్యక్తి తనను తాను దుర్మార్గుడిగా పరిచయం చేసుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. -
Beauty Tips: మార్కెట్లో దొరికే.. కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఇవే మేలు!
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం పొడిబారిపోవడం, కాంతి విహీనంగా మారడం సహజం. అయితే మార్కెట్లో దొరికే కెమికల్ప్రొడక్ట్స్ కంటే, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వాటితోనే చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా మార్చుకోవచ్చు. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి ఓట్మీల్, హనీ స్క్రబ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక అద్భుతమైన ఎక్స్ఫోలియేటర్. ఓట్స్ను పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి స్క్రబ్ లాగా అప్లై చేయాలి. ఇది చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేయడమే కాకుండా, తేనెలోని గుణాలు చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచుతాయి.ముఖానికి తక్షణ మెరుపును ఇవ్వడానికి పసుపు, కాఫీతో పాటు తేనె కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఇది ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా, చర్మానికి మంచి తాజాదనాన్ని ఇచ్చి ఆరోగ్యకరమైన లుక్ను అందిస్తుంది.చాలామంది అరటిపండు తొక్కను పారేస్తుంటారు. కానీ, అరటిపండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై మెల్లగా రుద్దడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది ముఖానికి ఇన్స్టంట్గా ఒక సహజసిద్ధమైన మెరుపును ఇస్తుంది. -
ఈ ఐదు రాష్ట్రాలలోనే వీళ్లు ఎక్కువ..
సామాజిక కోణంలో చేసే నివేదికలు ఆప్రాంత, రాష్ట్ర, దేశంలోని జనాభా మనుగడ ఏ స్థాయిలో ఉందో సూచిస్తాయి. దీనిలో భాగంగానే శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.దేశవ్యాప్తంగా 5.4 శాతం మంది మహిళలు వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, విడిపోయినవారు ఉన్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే పెద్ద రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడు 11.6 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది జాతీయ సగటు కంటే రెట్టింపుకు పైగా ఉంది. కేరళలో 10.4 శాతం ఉండగా దాని తర్వాతి స్థానంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వరుసగా 8.6 శాతం, 8.0 శాతం, 7.6 శాతం వాటాలను నమోదు చేశాయి. ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు కలిసి జాతీయ స్థాయిలో మొదటి ఏడు స్థానాలలో ఐదింటిని ఆక్రమించాయి. బిహార్లో అత్యల్పంగా 2శాతంతో దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా ఉంది.దేశంలో ఈ ఐదు రాష్ట్రాలలోనే వితంతువులు, ఒంటరి, వృద్ధ మహిళా జనాభా అధికంగా ఉండటానికి గల కారణాలను ఎస్ఆర్ఎస్ శోధించింది. దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, స్వతంత్రంగా జీవించడం, పనిచేసే వయస్సులో పురుషుల మరణాలు అధికంగా ఉండటం గమనించింది.ఇదే విషయంలో జాతీయ స్థాయిలో పురుషుల జాబితా చూస్తే.. భార్యను కోల్పోయిన, విడాకులు తీసుకున్న లేదా విడిపోయినవారి సగటు శాతం 1.6 ఉంది. కర్ణాటకలో 1.4 శాతం, తెలంగాణలో 1.6 శాతం నమోదు కాగా, తమిళనాడు 2.9 శాతంతో అత్యధికంగా ఉంది. అయినప్పటికీ మహిళలతో పోలిస్తే పురుషులలో ఈ శాతం చాలా తక్కువ. తమిళనాడులో జీవిత భాగస్వామి లేకుండా జీవిస్తున్న స్త్రీ, పురుషుల వాటాల మధ్య వ్యత్యాసం 8.7 శాతం పాయింట్లు కాగా, కేరళలో ఈ అంతరం 8.6 శాతం పాయింట్లుగా నమోదైంది. ఐదు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఈ వ్యత్యాసం 3.8 శాతం పాయింట్లతో జాతీయ సగటును మించిపోయింది. -
ఆఫీస్బాయ్ నుంచి ఏకంగా ఐటీ కంపెనీ సీఈఓ రేంజ్కి..!
‘అక్కడే ఆగిపోకు... ముందుకు వెళ్లి చూడు’ అనేది వ్యక్తిత్వ వికాస పాఠాల్లో ఒకటి. ఆఫీస్ బాయ్గా పనిచేసిన ఫణిరాజ్ అక్కడే ఆగిపోలేదు. చకచకా షార్ట్హ్యాండ్ నేర్చుకొని క్లర్క్ ఉద్యోగం సాధించాడు. అక్కడే ఆగిపోతే...కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన ఐటీ కంపెనీకీ అధిపతి అయ్యేవాడు కాదు. ‘సాధించాలి అనే గట్టి పట్టుదల ఉంటే అసాధ్యం అనేది లేదు’ అంటున్న తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లికి చెందిన ఫణిరాజ్ జలిగామ స్ఫూర్తిదాయకమైన సక్సెస్ స్టోరీ...చిన్న వయసు నుంచే ఫణిరాజ్ను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. పదో తరగతిలో మంచి మార్కులు సాధించినా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులు చదివే అవకాశం దక్కలేదు. కుటుంబానికి ఆసరాగా నిలవడానికి పాన్ షాప్లో పని చేశాడు. వారపత్రిక ఏజెంట్గా, ఎలక్ట్రీషియన్ గా, డ్రైవర్గా ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. ఎన్ని పనులు చేసినప్పటికీ చదువుపై ఆసక్తి దూరం కాలేదు. ఐటీఐ, ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తర్వాత కరీంనగర్ జిల్లా కోర్టులో ఆఫీస్ బాయ్గా ఉద్యోగంలో చేరాడు.ఆత్మవిశ్వాసమే శక్తిగా...కరీంనగర్ జిల్లా కోర్టులో ఆఫీస్ బాయ్గా చేరడం ఫణిరాజ్ జీవితంలో కీలక మలుపు. కోర్టులో పనిచేస్తున్న క్లర్కులను చూసి ‘నేను కూడా ఏదో ఒకటి సాధించాలి’ అనుకున్నాడు. షార్ట్హ్యాండ్లో శిక్షణ తీసుకుని నిమిషానికి 225 పదాలు టైప్ చేసే స్థాయికి చేరుకున్నాడు. దీంతో స్టెనోగ్రాఫర్గా పదోన్నతి పొంది కెరీర్లో మరో మెట్టు ఎక్కాడు. తనలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఇంకా ఏదైనా సాధించాలనే తపన పెరిగింది. స్టెన్గ్రాఫర్ ఉద్యోగాన్ని వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె ఆయన బలంఎంసీఏ పట్టభద్రురాలైన జీవిత భాగస్వామి శ్రీలలిత రాకతో ఫణిరాజ్ ప్రయాణం కొత్త మలుపు తిరిగింది. ఆమె ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో కంప్యూటర్ కోర్సుల్లో చేరాడు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి, రూ.15,000 జీతంతో పుణెలోని ఐటీ సంస్థలో చేరాడు. ‘బంగారంలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రిస్క్ చేస్తున్నావు’ అన్నారు కొందరు.రిస్క్ చేస్తేనే కదా... ఘన విజయాలు దక్కేవి! ఈ విషయం తెలిసిన ఫణిరాజ్ ‘నేను రిస్క్ చేస్తున్నాను’ అనుకోలేదు. ‘మరో మంచి ప్రయత్నం చేస్తున్నాను’ అని మాత్రమే అనుకున్నాడు. ఐటీ కంపెనీలో పనిచేస్తూనే ఎంబీఏ పూర్తి చేసి, క్రమంగా సీనియర్ మేనేజర్ నుండి అసోసియేట్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు.పాజిటివ్ ఎనర్జీతో.. .పద ముందుకు...ఐటీ కంపెనీలో పనిచేయాలనే కలను సాకారం చేసుకున్న ఫణిరాజ్ మరో పెద్ద కల కన్నాడు. అది అంత సులువైన పని కాదని ఫణిరాజ్కు తెలియనిది కాదు. అయినా సరే, ముందుకు వెళ్లాడు.తన స్నేహితుడు అరుణ్ కుమార్తో కలిసి ‘ఓజాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్‘ అనే ఐటీ కంపెనీ స్థాపించాడు, ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, భార్య తన బంగారు నగలను అమ్మి అండగా నిలబడింది. ప్రారంభ కష్టాలు ప్రారంభంలోనే ఉంటాయి. మంచి రోజులు తప్పకుండా వస్తాయి’ అనుకున్న ఫణిరాజ్ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ‘పాజిటివ్ ఎనర్జీ’తో ముందుకు వెళ్లాడు. తాను ఆశించినట్లే కంపెనీ లాబాల బాట పట్టింది. దేశ, విదేశాల్లో ఎన్నో ప్రాజెక్టులతో 100 కోట్ల రూపాయల టర్నోవర్ని సాధించి, 900 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది.గెలుపు అంటే...ఇతరులను గెలిపించడం కూడా!‘ఎలాగైనా గెలవాలి. మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను’ ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం... నాలాగే గ్రామీణ నేపథ్యం నుండి వచ్చే విద్యార్థులకు, ఐటీ రంగంలోకి రావాలని కోరుకునే నిరుద్యోగులకు శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేయాలనుకుంటున్నాను. బీఏ, బీకాం చదివిన వారికి కూడా ఐటీ రంగంలో అవకాశాలు ఎలా దక్కించుకోవాలో నేర్పిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే నా ముందున్న లక్ష్యం.– ఫణిరాజ్, సీఈవో, ఓజాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్– గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి -
ఆ నటుడికి అరుదైన బ్రెస్ట్ కేన్సర్..!ఎందువల్ల వస్తుందంటే..
రొమ్ము కేన్సర్ అంటే మహిళలకే వస్తుందని అనుకుంటారు. కానీ పురుషులకు కూడా వస్తుందట. అయితే పురుషుల్లో ఇది అత్యంత అరుదు. మరి మగవాళ్లలో ఈ కేన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?, ఎందువల్ల వస్తుంది?, నివారణ చర్యలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్, టైలర్ మానేకు బ్రెస్ట్ కేన్సర్ ఉన్నట్లు వైద్యులు ఇటీవలే నిర్థారించారు. అందుకోసం కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు కూడా తెలిపారు. 59 ఏళ్ల హీరో పురుషుల రొమ్ము కేన్సర్పై అవగాహన కల్పించడం కోసం ఇన్స్టాగ్రామ్లో ఇలా రాసుక్చొఆరు. అవును నాకు బ్రెస్ట్ కేన్సర్ ఉంది. ఇది చాలా అరుదైనది, పైగా ఇది 1% మంది మగవాళ్లే ఈ సమస్య బారిన పడతారట. నిజం చెప్పాలంటే మొదట బహిరంగంగా మాట్లాడాలనుకోలేదు. కానీ తర్వాత నాకు తెలిసిందేంటంటే..దీని గురించి మాట్లాడకపోవడం, దీనికోసం తెలుసుకోకపోవడం వల్లే పురుషులలో ఈ వ్యాధి చాలామటుకు లాస్ట్ స్టేజ్లో నిర్థారిస్తున్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే దీని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నా. డాక్టర్లంతా కొట్టిపారేసినా..నా భార్య ఆ గడ్డను తొలగించుకోమని ఒత్తిడి చేయడంతోనే ముందుగానే చికిత్స తీసుకుంటున్నా. ప్రతి 755 మంది పురుషులలో ఒకరికి వారి జీవితకాలంలో రొమ్ము కేన్సర్ నిర్థారణ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీన్ని ముందుగానే గుర్తింస్తే..చికిత్స చేయడం సులభం. అందువల్ల ఇకనైనా మేల్కోవాలి, తక్షణమే స్పందించాలి అని పిలుపునిచ్చారు.పురుషుల రొమ్ము కేన్సర్ అంటేరొమ్ము కణజాలంలోని అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగి కణితిగా ఏర్పడినప్పుడు పురుషులలో రొమ్ము కేన్సర్ వస్తుంది. పురుషులకు రొమ్ము కణజాలం తక్కువగా ఉంటుంది, అంటే అక్కడ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయినప్పటికీ ఇది మహిళలతో పోలిస్తే తక్కువ.కేన్సర్ లక్షణాలుప్రారంభ సంకేతాలను గుర్తించడం సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సకు సహాయపడుతుంది.కొన్ని సాధారణ లక్షణాలు:రొమ్ములో గడ్డ లేదా వాపురొమ్ము కణజాలం గట్టిపడటంరొమ్మును కప్పి ఉంచే చర్మంలో మార్పులు, ఎరుపు లేదా గుంటలు పడటం వంటివిచనుమొన నొప్పి లేదా సున్నితత్వంలోపలికి తిరిగిన చనుమొనచనుమొన నుండి స్రావం, కొన్నిసార్లు రక్తంతో కూడి ఉండవచ్చుచంక కింద శోషరస గ్రంథులు వాపునిరంతర పుండ్లు లేదా చనుమొనల చుట్టూ మార్పులుపురుషులు తమ ఛాతీ లేదా రొమ్ము ప్రాంతంలో ఏవైనా అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ గడ్డ నొప్పిలేకుండా ఉన్నప్పటికీ, దానిని ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.పురుషులలో రొమ్ము కేన్సర్కు ప్రమాద కారకాలుఅనేక కారకాలు పురుషులలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వాటిలో ఇవి ఉన్నాయి:వయస్సు పెరగడం: చాలా కేసులు 60 ఏళ్లు పైబడిన పురుషులలో నిర్ధారణ అవుతాయి. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది.కుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము క్యాన్సర్ ఉన్న పురుషులకు ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యు మార్పులు కూడా ఒక పాత్ర పోషిస్తాయి.జన్యు మార్పులు: కొన్ని జన్యువులలో, ముఖ్యంగా BRCA2 జన్యువులో మార్పులు, పురుషులలో రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.హార్మోన్ల అసమతుల్యత: ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం లేదా టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండటం రొమ్ము కేన్సర్ అభివృద్ధికి దోహదపడవచ్చు.స్థూలకాయం: శరీరంలో అధిక కొవ్వు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది, ఇది ప్రమాదాన్ని పెంచవచ్చు.కాలేయ వ్యాధి: సిర్రోసిస్ వంటి పరిస్థితులు హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి, కేన్సర్కు గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి.రేడియేషన్ ప్రభావం: గతంలో ఛాతీ ప్రాంతానికి రేడియేషన్ చికిత్స చేయించుకోవడం వల్ల.. రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరగవచ్చు.నివారణరొమ్ము కేన్సర్ను పూర్తిగా నివారించడం ఎల్లప్పుడూ సాధ్యం కానప్పటికీ, కొన్ని జీవనశైలి ఎంపికలు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రమాదం.అధిక బరువు ఉండటం అనేది అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడతాయి.అధికంగా మద్యం సేవించడం వల్ల రొమ్ము కేన్సర్తో సహా అనేక కేన్సర్ల ప్రమాదం పెరగవచ్చు.క్రమం తప్పని శారీరక శ్రమ హార్మోన్ల స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్న పురుషులు తమ ప్రమాదం గురించి ఆరోగ్య సంరక్షణ నిపుణులతో చర్చించాలి. కొన్ని సందర్భాల్లో, జన్యుపరమైన కౌన్సెలింగ్ సిఫార్సు చేయవచ్చు కూడా.క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు సత్వరమే సమస్యను గుర్తించడానికి సహాయపడతాయి. రొమ్ము మార్పుల గురించి అవగాహన పెంచుకోవాలి. పురుషులు తమ ఛాతీ ప్రాంతంలోని సాధారణ స్వరూపం, స్పర్శ గురించి తెలుసుకోవాలి. ఏవైనా గడ్డలు, వాపు లేదా చనుమొనలలో మార్పులను ఆలస్యం చేయకుండా వైద్యుడికి తెలియజేయడం వలన ముందుగానే ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. View this post on Instagram A post shared by Tyler Mane (@therealtylermane)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్ ఖేర్) -
ఆటో డ్రైవర్ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్కి..! జస్ట్ దేశీ బ్రాండ్తోనే..
జీరో నుంచి మొదలు పెట్టి కోట్లు గడించే రేంజ్కి చేరుకున్నాడు. అదికూడా తన చుట్టు ఉన్న అవసరాలే వ్యాపారంగా మలిచాడు. ఆఖరికి విలాసవంతమైన కారు కొన్నా..అది తన స్థాయి చూపించుకోవడానికి కాకుండా..సొంతూరు గర్వించే స్థాయిలో ఉన్నాను అని చూపేందుకు అని చెబుతుంటాడు. గెలుపుకి పెద్ద పెద్ద డిగ్రీలు, బ్యాగ్రౌండ్తో పనిలేదని చాటిచెప్పే అసామాన్యుడి కథ ఇది. సాధారణ ఆటో రిక్షా డ్రైవర్గా మొదలైన జీవితం ఏకంగా రూ. 900 కోట్లు టర్నోవర్ చేసే కంపెనీకి యజమానిగా మారి యవతకు ప్రేరణగా నిలిచిన విజయగాథ ఇది. అతడే కర్ణాటకలోని బళ్లారికి చెందిన సత్య శంకర్. అతడు ఇంటర్ డ్రాపౌట్. తండ్రి సాధారణ పూజరి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడంతో చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దాంతో కుటుంబ పోషణ కోసం కష్టపడి డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించి..ఆటో రిక్షా నడుపుతుండే వాడు. ఆ తర్వాత ప్రభుత్వ పథకం కింద రుణంపై సొంతంగా ఆటో కొనుక్కుని నడపడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లకు ఆ రుణాన్ని తీర్చేసి..వెంటనే తన ఆటోని కారుగా మార్చాడు.ట్యాక్సీ డ్రైవర్గా తనుండే జిల్లా చుట్టూనే కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి ముందుకెళ్లాడు. ఆ క్రమంలో తరచుగా విదేశీ పర్యాటకులను తన వాహనంలో తీసుకువెళ్లేవాడు. వాళ్లంతా ఎక్కడ నుంచి వచ్చినా..మొదటగా కొనేది ప్యాక్ చేసిన మంచినీటి సీసానే అని గమనించాడు శంకర్. తాను రోడ్డుపై దృష్టిపెడితే..విదేశీ పర్యాటకులంతా ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఇలా చేస్తున్నారని గ్రహించాడు. అప్పుడే ఇదేదో పనికొచ్చే బిజినెస్లా ఉందే అని అతడి బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమంది కానీ ఆచరణలోకి తీసుకురాలేదు. ఆ తర్వాత కారు నడపడం కంటే..కారు విడిభాగాలను అమ్మే వ్యాపారమే బెటర్ అని గ్రహించి ఆటోమొబైల్ వ్యాపారం ప్రారంభించాడు. విడిభాగాలు కొనే ప్రతి కస్టమర్కు టైర్ కూడా అవసరం అని గ్రహించి టైర్ల దుకాణాన్ని కూడా తెరిచాడు. అంతేగాదు తన వద్ద రైతులు, స్థానికులు అరువుపై వస్తువులు కొనుగోలు చేసేవారు. చిన్న చిన్న వాయిదాలలో తిరిగి చెల్లించేవారు. దాంతో తను కూడా బ్యాంకుకు విడతల వారీగా డబ్బు చెల్లించొచ్చని తెలుసుకున్నాడు శంకర్. అలా 1994లో ప్రవీణ్ క్యాపిటల్ అనే ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. ఇతర ఫైనాన్షియర్లు పాత వాహనాలను పట్టించుకోనప్పటికీ, శంకర్ సెకండ్ హ్యాండ్ ఆటోలు,కార్లకు రుణాలు ఇచ్చాడు. అతను కూడా ఒక కష్టపడే డ్రైవరే కాబట్టి, కష్టాల్లో ఉన్న డ్రైవర్ను పరిస్థితిని అర్థం చేసుకుని ఈ సాహసానికి పూనుకున్నాడు. ఇక ఆ తర్వాత తనలో ఆనాడు విదేశీ పర్యాటకుల కారణంగా తన బ్రెయిన్లో తట్టిన ఆ వ్యాపార ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశాడు. భారీ వర్షాలు కురిసే పుత్తూరు సమీపంలోని నరిమొగేరు అనే గ్రామంలో అతను మంచినీటి ఫ్యాక్టరీని స్థాపించాడు. అతను ఆ బ్రాండ్కు బిందు (‘కన్నడలో చుక్క’) అని పెట్టారు. అక్కడితో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆపలేదు. శంకర్ ఉత్తర్ భారత దేశ పర్యటనలో ఓ చిన్న సోడా దుకాణం వద్దకు వచ్చాడు. అక్కడ సర్వ్ చేసిన సోడా పానీయం అతడికి మరో వ్యాపారాన్ని నిర్మించేదుకు దారితీసింది. అలా తన సొంతూరు పుత్తూరులో బిందు ఫిజ్ జీరా మసాల అనే కూల్డ్రింక్ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. మొదట్లో వంద సేల్ అవ్వడమే కష్టంగా ఉండేది. అయితే దేశీ రుచి కచ్చితంగా విజయవంతమవ్వుతుందన్న ఆశతో వెనక్కి తగ్గకుండా హైవేలపై ఉండే గోడలనే ప్రచార బోర్డులుగా మార్చి ఆ డ్రింక్ ప్రకటనలను ఇచ్చేవాడు. నోటి మాటతో దాని రుచి ప్రజలకు చేరువయ్యేలా చేశాడు. దాంతో గ్రామీణ శైలి ఆహారంతో ప్రజలు కోరుకునే పానీయంగా ప్రజల మదిలో నిలిచే చల్లని పానీయంగా బిందు ఫిజ్ని స్థిరపడేలా చేశాడు. మార్చి 2025 నాటికి 60 ఏళ్లు శంకర్కి. కానీ ఆయన వ్యాపార విస్తరణ ఆగలేదు. ఇప్పటికీ అంతే ఉత్సాహంతో సాగిపోతున్నాడయన. అంతేగాదు ఆయన ఎస్జీ కార్పొరేట్స్, ఇప్పుడు రూ. 900 కోట్ల టర్నోవర్ ఆర్జిస్తుండగా, హౌస్ ఆఫ్ బిందు (పానీయాలు , స్నాక్స్) రూ. 570 కోట్ల ఆదాయం, ప్రవీణ్ క్యాపిటల్ (ఫైనాన్స్ విభాగం) రూ. 330 కోట్లను ఆర్జిస్తోంది. ఆయన ప్రసిద్ధ జీరా మసాలా నుంచి మామిడి రసాలు, స్నాక్స్ వరకు 55 రకాల ఉత్పత్తులను అమ్ముతారు. ఆయనకు తెలంగాణ, కర్ణాటకలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. పైగా ఆంధ్రలో కొత్తవి రానున్నాయి కూడా. ఆయన వద్ద ప్రస్తుతం రోల్స్ రాయిస్ కారు కూడా ఉంది. అది తన స్టేటస్ ఆఫ్ సింబల్ కోసం కాదని, బళ్లారికి చెందిన వ్యక్తి ఎంత దూరం వెళ్లగలడు అని చెప్పడానికని గర్వంగా అంటాడు శంకర్. తన వ్యాపారాలన్నీ..సామాన్య ప్రజలు కోరుకునేది, వారి అవసరాల దృష్టి నుంచి మొదలైనవేనని, అదే తన సక్సెస్మంత్ర అని అంటాడాయన. అంతేగాదు అంతా ఇంగ్లీష్ పానియాలతో వ్యాపారం చేస్తే..స్థానిక భాషకు ప్రాధాన్యత ఇచ్చి..దేశీ రుచిని అందించే పానీయాలను తీసుకొచ్చారు. ఓపిక, నిశిత పరిశీలన ఉంటే..ఎప్పటికైనా గెలుపు తథ్యం అంటాడు కర్ణాటకకు చెందిన సత్య శంకర్.(చదవండి: అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..) -
90 నిమిషాల్లో రూ. 30 కోట్లు : ఈ లెక్కలతో మతిపోవాల్సిందే!
ఫిఫా ప్రపంచకప్ 2026 (fifa world cup 2026) ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రపంచ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. దశాబ్దాలుగా ఫుట్ బాల్ క్రీడకు వన్నె తెచ్చి, ప్రపంచాన్ని ఏలిన దిగ్గజాలకు ఇదే చివరి ప్రపంచకప్ కాబోతోంది. లియోనెల్ మెస్సీ, రొనాల్డో, లూకా మోద్రిచ్, థామస్ ముల్లర్, నెయ్మార్ వీరిలో ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖ పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. ఆతని సంపాదన తీరుతెన్నులపై చర్చ నడుస్తోంది.పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు నిజానికి జీతం ఏమీ సంపాదించడం లేదు. కానీ ఆయన సంపాదన ఒక యుగ కాలంతో సమానం. ఆయన ఫుట్బాల్ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. 41 ఏళ్ల పోర్చుగీస్ ఫుట్బాలర్, కేవలం తన సౌదీ క్లబ్ డీల్ ద్వారానే ఏడాదికి సుమారు 20 కోట్ల డాలర్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఒకే ఏడాదిలో దాదాపు రూ. 1,600 నుండి 1,700 కోట్ల వరకు ఉంటుంది. క్లబ్, దేశం తరఫున ఆయన ఒక సీజన్లో సాధారణంగా 55 మ్యాచ్లు ఆడుతారని అనుకుందాం. ఆ వార్షిక సంపాదనను 55తో భాగిస్తే వచ్చే అంకె అద్భుతంగా ఉంటుంది. ఆయన ఆడే ప్రతి మ్యాచ్కు దాదాపు రూ. 30 కోట్లు. మరోలా చెప్పాలంటే, 90 నిమిషాల ఫుట్బాల్ ఆట (అదనపు సమయంతో కలిపి), అనేక భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ కలిపి ఏడాది మొత్తానికి కేటాయించే జీతాల బడ్జెట్తో సమానమైన డబ్బును ఆయనకు అందిస్తుంది.కళ్లు చెదిరే నెట్వర్త్ రొనాల్డో నికర ఆస్తి విలువ ప్రస్తుతం 120 కోట్ల డాలర్లు (సుమారు రూ. 10,000 కోట్లు). ఈ అపారమైన సంపద అనేది కేవలం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. రెండు దశాబ్దాలకు పైగా టాప్-క్లాస్ జీతాలు, ఛాంపియన్స్ లీగ్ బోనస్లు, ఇమేజ్ రైట్స్, స్పాన్సర్షిప్ డీల్స్, వ్యాపార పెట్టుబడులు, అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ను డబ్బుగా మార్చుకోవడం ద్వారా ఈ సామ్రాజ్యం సాధ్యమైంది.ఒక మ్యాచ్కు రొనాల్డో సంపాదన దాదాపు రూ.30 కోట్లు. వార్షిక జీతం రూ. 12 లక్షలు సంపాదించే భారతీయ ఉద్యోగి 40 ఏళ్ల పాటు కెరీర్ను కొనసాగించినా ఈ ఆస్తిలో ఒక చిన్న భాగానికి కూడా సరిపోలదు.. రొనాల్డో నికర ఆస్తికి సమానంగా సంపాదించాలంటే రూ. 12 లక్షల వార్షిక జీతం ఆర్జించే సుమారు 2 వేలమందికి సమానం. ఏడాదికి సుమారు 2,000 ఆఫీసు పని గంటల చొప్పున లెక్కిస్తే, ఇది దాదాపు 16 నుండి 17 కోట్ల గంటల శ్రమతో సమానం. దీనికి బదులు రొనాల్డో మైదానంలో గడిపే ప్రతి మ్యాచ్ గంటకు రూ. 20 కోట్లు సంపాదిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, ఆధునిక ఫుట్బాల్ ప్రపంచంలో అత్యున్నత శిఖరం 90 నిమిషాల ఫుట్బాల్. -
పరమ విశిష్టమైన ఏకాదశి..
అధికమాసంలో వచ్చే ఏకాదశిని ‘పరమ ఏకాదశి‘ అని అంటారు. ఇది చాలా పవిత్రమైన ఏకాదశి. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ రోజున శ్రద్ధాభక్తులతో ఉపవాసం ఉండి లక్ష్మీ నారాయణులను ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుందని ప్రతీతి. యజ్ఞాలు చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, ఈ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే అంతే పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. నేటి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో పూజా కార్యక్రమాలు చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.ఎందుకని అంతటి విశిష్టత?‘పరమ‘ అంటే అత్యున్నతమైనది, శ్రేష్ఠమైనది. పురాణాల ప్రకారం మూడేళ్లకోమారు అధికమాసంలో వచ్చే ఏకాదశి ఎంతో విశిష్టమైనది. విష్ణుప్రీతికరమైనది. ఈ రోజు మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు.ఏం చేయాలి?విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః‘ మంత్రాన్ని జపించండి.దానాలు... పరమ ఏకాదశి నాడు పేదలకు, అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం, ఆర్థికసాయం వంటివి చేస్తే అక్షయ పుణ్యఫలాలను పొందడానికి మార్గం సుగమం అవుతంది. తామర గింజలు లేదా సగ్గుబియ్యంతో పాయసం చేసి లక్ష్మీదేవికి సమర్పించిన తరువాత కర్పూర హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి, కుటుంబ సభ్యులకు పెట్టడం వల్ల లక్ష్మీవిష్ణువుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.తులసి కోట దగ్గర... ఈ పవిత్రమైన ఏకాదశి నాడు తులసి మొక్క దగ్గర ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీ నారాయణులను మనస్ఫూర్తిగా స్మరించుకుంటే ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆ లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. -
మిమ్మల్ని మీరు తెలుసుకోండి..
నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు ఈ భూమి మీద మానవుడిగా జన్మించాను ఈ మానవ జన్మ పరమార్థం ఏమిటి ఈ జన్మ అయిన తర్వాత నా పయనం ఎటువైపు. చాలామంది సత్యాన్వేషకులలో ఈ ప్రశ్నలు తరచూ వారి మదిలో మెదులుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం మనకు ప్రసాదించడానికి పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ తారీఖున సహజ యోగమనే మహాయోగాన్ని మానవాళికి ప్రసాదించారు.ఈ సహజ యోగం ద్వారా మనలో ఉన్న ఆత్మ, సూక్ష్మ శరీరం ఉనికిని గుర్తించి అనుభూతిపరంగా తెలుసుకొనవచ్చు. భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్ముడు నీవు కేవలం ఆత్మవు ఈ శరీరం బుద్ధి అహంకారం కాదు అని సుస్పష్టంగా తెలియజేశాడు. ఆరవ శతాబ్దంలో వచ్చిన శంకరాచార్యులు కూడా నీవు ఆత్మవు అని సంపూర్ణంగా వివరించి తెలియజేశారు.బుద్ధుడు, మహావీరుడు కూడా పరమాత్ముని తెలుసుకొనుటకు ముందు నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. అది గురు దత్తాత్రేయ పదిసార్లు ఈ భూమి మీద వివిధ ప్రదేశాలలో వివిధ సమయాలలో వచ్చి నీవు ఎవరవు అన్న విషయాన్ని తెలియజేయ ప్రయత్నించాడు. కబీర్ దాస్, భక్తవేమన, రమణ మహర్షి మొదలైన మరెందరో ఈ భూమి మీదకు వచ్చి నిన్ను నీవు తెలుసుకో అని చెబుతూ వస్తూ ఉన్నారు. మనలో ఉన్న ఆత్మను తెలుసుకొనడానికి పరమాత్మునితో అనుసంధానం అవడం తెలుసుకోవడానికి ఎన్నో విధాలుగా బోధించారు మనల్ని ముందుకు నడిపించారు.అవతరించిన 10 మంది ఆది గురువులు..శ్రీ రాజా జనకుడుమిథిలా రాజు, శ్రీరాముని భార్య సీతాదేవి తండ్రి (భారతదేశం సుమారు క్రీస్తుపూర్వం 8000).శ్రీ అబ్రహాం ఇజ్రాయేలు, 12 గోత్రాల పూర్వికులు (ఇజ్రాయేలు సుమారు క్రీస్తుపూర్వం 2000).శ్రీ జరథుస్త్రుడుఏకేశ్వరవాదం, అగ్ని ఆరాధనను స్థాపించినవారు (పర్షియా సుమారు క్రీస్తుపూర్వం 1800).శ్రీ మోసెస్యూదుల ధర్మశాస్త్ర స్థాపకులు (ఈజిప్ట్ సుమారు క్రీస్తుపూర్వం 1250).శ్రీ లావో–త్సు ‘‘టావో టే చింగ్’’ రచయిత(చైనా జననం క్రీస్తుపూర్వం 604).శ్రీ కన్ఫ్యూషియస్ నైతిక విలువలను బోధించి ‘‘ఐ చింగ్’’ సంకలనం చేసినవారు (చైనా జననం క్రీస్తుపూర్వం 549).శ్రీ సోక్రటీస్ గ్రీకు తత్వశాస్త్ర స్థాపకుడు (గ్రీస్ జననం క్రీస్తుపూర్వం 431).శ్రీ మహమ్మద్ ఇస్లాం మత స్థాపకుడు (అరేబియా మరణం క్రీస్తుశకం 632).శ్రీ గురు నానక్ సిక్కు మత స్థాపకుడు (భారతదేశం జననం క్రీస్తుశకం 1469).షిర్డీ సాయినాథ్ శ్రీ మాతాజీ జననాన్ని ప్రవచించినవారు (భారతదేశం సుమారు 1840 – 1918 క్రీస్తుశకం).ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనలో ఉన్న శక్తులను మనం తెలుసుకుని మన జీవితాన్ని వివేకం,విచక్షణ,జ్ఞానం, వినమ్రత, ప్రశాంతతతో ఆనందంగా జీవించడానికి మనలో ఉన్న శారీరిక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక సామాజిక, ఆధ్యాత్మిక సమస్యల నుంచి బయటపడడానికి, మతకల్లోలాల నుంచి యుద్ధాల నుంచి వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు మనలో ఉన్న కుండలిని శక్తిని ఆత్మసాక్షాత్కారం ద్వారా జాగృతపరచుటకు ఆత్మను ప్రకాశవంతం చేసుకొనుటకు స్వీయ అనుభవం ద్వారా మనలో ఉన్న సూక్ష్మ శరీర అవగాహన చేసుకొనుటకు శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగమనే మహాయోగాన్ని మానవాళికి ప్రసాదించారు.ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అన్ని సమస్యల నుంచి బయటపడడానికి సహజ యోగ ధ్యానం ద్వారా విముక్తులు అయి అత్మసాక్షాత్కారం పొందండి. – డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు -
పునరుత్థానుడైన క్రీస్తు ఆరోహణ వాగ్దానం
యేసు పునరుత్థానుడైన తరువాత 40 రోజులు వరకు ఆయన సేవకులకు, శిష్యులకు, ప్రేమించిన వారికి దర్శనం ఇచ్చాడు. అనేక విషయాలు ప్రబోధించాడు, వాటిలో ప్రాముఖ్యంగా మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు నా ఆజ్ఞలు గైకొనులాగున తండ్రిని వేడుకొనుచున్నాను, నేను వెళ్లుచున్నాను, నేను వెళ్లి మీ కొరకు ఆదరణ కర్తను పంపుతాను ఆ ఆదరణ కర్త మిమ్ములను సర్వసత్యంలోనూ, మంచి మార్గంలోనూ నడిపిస్తాడు. అప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ మార్గం ఏది? తండ్రి ఎవరని ప్రశ్నలు అడిగారు.అందుకు యేసు నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవ్వరును దేవుని వద్దకు రాలేరన్నాడు. తండ్రి, నేను ఏకమై ఉన్నామన్నాడు. ఆదరణ కర్త ఎవరు సత్య స్వరూపి ఆయన ఆత్మయై ఉన్నాడు, కావున భయపడకండి అంటూ ధైర్యపరిచాడు.నా తండ్రి ఇంట అనేక నివాసాలు, స్థలము ఉన్నవి నేను మిమ్ములను నాతో ఉండు లాగున తీసుకొని వెళ్తాను. ఆదరణకర్తను పంపుతాను అనగా పరిశుద్ధాత్మ ఆయన కూడా వ్యక్తి, శక్తి అనగా త్రిత్వదైవత్వం. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్ముడు వీరు ఒక్కరైనా ఏక దేవుడై ఉన్నారు. అని సందేశం ఇచ్చి వారిని బేతనీయ అనే ప్రాంతానికి తీసుకొని వెళ్లి వారిపై చేతులుంచి ఆశీర్వదించి పరమునకు ఆరోహణమయ్యాడు (పరి. యోహాను 14:1–30) , (లూకా 24: 50–51) పరలోకం అనగా నిత్యజీవముండే స్థలము (హెవెన్) భౌతిక శరీరం విడిచి మన ఆత్మ చేరే శాశ్వత ఆధ్యాత్మిక స్థలం. ఆరోహణమనగా పైకి వెళ్లడం, అది ఒక క్రీస్తుకే సాధ్యం. ఎందుకనగా పరిశుద్ధాత్మ మహిమ కన్యగర్భంలో ఏ విధంగా జన్మించాడో అదే రీతిన దేవునితో ఆరోహణమయి దేవునిలో లీనమయ్యాడు. కుడిపార్శా్వన కూర్చుని ఉన్నాడు. అంటే ఇది ఏఐ లాగున కాదు ఆ ప్రణవ నాదమైన పవిత్ర వాక్యం (పరి. యోహాను 1:1–2).ఒకటి యేసు వారి ఆరోహణం, రెండు పరిశుద్ధాత్ముని పంపుతానన్న వాగ్దానాన్ని చూస్తున్నాం (పరి. యోహాను : 14:16). పరిశుద్ధాత్మ అనేది క్రైౖ స్తవ సంఘానికి ఊపిరి, ప్రాణం. పరిశుద్ధాత్మ తండ్రి (సృష్టికర్త), కుమారుడు (యేసుక్రీస్తుతో), సమానం. దీన్ని పరిశీలించగా ‘రువా’ హెబ్రూ పదం అనగా ఊపిరి, శ్వాస ఇది వీచే గాలిలోనూ, జీవించే మనుషుల్లోనూ ఉన్న దేవుని ఆత్మ, అందుకే ‘సామెతలు’ గ్రంథకర్త 20:27, ఈ విధంగా ప్రబోధించాడు. నరుని ఆత్మ యెహోవా (ప్రభువు) పెట్టిన దీపం. యెహోవా అనగా సర్వంతర్యామి, సర్వశక్తుడగు దేవుడు, పాత నిబంధన గ్రంథంలో ఈ విధంగా ఉన్నది.దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అనగా మన శ్వాస, నిశ్వాసలలో ఉన్న ఊపిరి ఆయనదే (దేవునిదే). మనలో నుండి ఆ శ్వాస ఎప్పుడు ఆగిపోతుంది అనగా మనం అబద్ధాలు, వ్యభిచారం, మద్యపానం, ధూమపానం మొదలగు వాటికి బానిసలై స్పృహ కోల్పోయినప్పుడు మరణించుతాం. దానినే పాపం వల్ల వచ్చు జీతం మరణం అని బైబిల్ చెబుతుంది, ఉదాహరణకు గొంగళి పురుగును చూడగా, దాన్ని మనుషులు అసహ్యించుకుంటారు కానీ అదే రూపాంతరం చెంది సీతాకోకచిలుకగా అయినప్పుడు ఆనందించుతాము, అలాగే పరిశుద్ధాత్ముని మనలోనికి ఆహ్వానిస్తే దురాత్మ దూరమైపోతుంది, అలాగే దురలవాట్లు గల వ్యక్తిని చూసినప్పుడు అసహ్యించుకుంటారు. పరిశుద్ధాత్మ అట్టి వారిలో ప్రవేశించితే ఆ వ్యక్తికి గౌరవమర్యాదలు ఇస్తారు కదా!కావున పరిశుద్ధాత్మను కోరుకుందురు గాక, దేవుడిచ్చిన జీవాత్మను కాపాడుకుందాం ఇలాంటి సందేశం ఇచ్చి యేసు – మెస్సయ్యగా, ప్రభువుగా, క్రీస్తుగా చూస్తున్నారు.ఈ సందేశం ఇచ్చిన ప్రభువును మనుషులలో దీపాలు వెలిగించును గాక, ప్రభువును అంతరంగంలోనికి రమ్మని ఆహ్వానిద్దాం, ఎందుకనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుచేత దేవుని అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశించక నిత్యజీవం పొందుతారు, అందుచేత నిత్యజీవాన్ని కోరుకుందుముగాక! (పరి. యోహాను 3:16). – బి.బి. చంద్రపాల్ కోట -
శతక నీతి: విద్యాప్రభావం..
విదురనీతిలో విద్యయే మనిషికి నిజమైన అందం, దాచి పెట్టిన ధనం, దొంగిలించడానికి వీలులేని సంపద అని చెప్తారు. భీష్ముడు ‘నాస్తి విద్యాసమం చక్షు:’ అంటాడు. అంటే విద్యతో సమానమైన కన్ను మరొకటి లేదని. అమరకోశ వాక్యం ప్రకారం పండితులు శ్రేష్తులు.. ‘విద్వాన్ సర్వత్రే పూజతే’ అన్నది సంస్కృత సుభాషితం.మన జీవితంలో అనునిత్యం ముడి పడే ప్రతి అంశానికి, సందర్భానికి సముచితంగా బోధించే శతకాలు చాలా ఉన్నాయి.. ఒక్కొక సందేశం విలువైన మాట, జీవితాన్ని శాసించే మాట, నిలబెట్టే మాట, సక్రమ మార్గంలో పెట్టే మాట... విద్య విషయంలో శతక నీతులు ఏమని అంటాయంటే..‘సకల కళా విభూషితులు.... విత్తము లేకయు వారు పూజ్యులే’ అంటారు భర్తృహరి. ‘ప్రభువులు పండితులగువారివలన గర్వకలన మా నుడు వారు మీ కలిమి తృణము లీల బోలింపలేమి మృణాళ గుణము భూరిమదవారణంబె’ అంటే పాండిత్యం ముందు రాజుల సంపద గడ్డిపోచ అని అంటాడు.‘కేయూరాణి న భూషయన్తి... వాగ్భూషణం భూషణమే’.. ఒకప్పుడు ఆకాశవాణి కేంద్రం ద్వారా ఉదయం వార్తలు తరువాత వినేవాళ్ళం.. దీనర్థం విద్యయే అలంకారం అని.‘విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్విద్య యశస్సుభోగకరి విద్య గురుండు విదేశబంధుడన్విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాడు మర్త్యుడే..'భావం: విద్యయే సర్వోత్తమం. విద్య ఉంటే అన్ని ఉన్నట్టే. విద్వాంసుల వలనే లోకం నిలుస్తుంది. మహా కవులు, పండితులు మరణించినా కీర్తితో బతికే ఉంటారు.భర్తృహరి సంస్కృత శతకానికి ఏనుగు లక్ష్మణ కవి చేసిన అనువాదంలో బయటపడ్డ ఆణిముత్యాల సారాంశం ఇదంతా అయితే, వేమన శతకాల్లో .విద్య లేని వాడు వింత పశువులన్నారు. చదువు రాని వాని బ్రతుకంత శూన్యం అన్నాడు..‘చదివినంతనే పండితుండగునే మనుజుడు ‘ అని అన్నాడు..బద్దెన సుమతీ శతకం లో ‘విద్య నిగూఢగుప్త మగు విత్తం’ అని అన్నారు..భాస్కర శతకంలో భాస్కరుడు పేరుకు తగ్గట్టు నిత్యం ప్రకాశించే మాట చె΄్పారు..‘విద్యయే భూషణము నరునకు ‘... ఇది ‘కేయూరాణి’కి... దగ్గరలో ఉంది.‘విద్య లేని వాడు వింత మృగంబు రా’ అంటూ వేమన భావాన్నీ వెలిబుచ్చాడు.రామదాసు శతకంలో రామునే స్మరించినా రామదాసు ‘చదువు రాని వాడు జగములోనూ దద్దమ్మ అని తేల్చేశాడు.కాళీదాసు మూడు ముఖ్య విషయాలు చె΄్పాడు..‘విద్య వినయ సహితం’ అని,‘శైశమేభ్యస్త విద్యానం యువనే విషయైషిణామ్’ అంటేబాల్యంలోనే నేర్చుకోవాలని, ధర్మంగా బతకడం కోసం విద్య అని.విద్య ద్వారా ఉత్తమ గుణాలను వెలికితీయాలని సెలవిచ్చారు.విద్య విషయంలో తగిన శ్రద్ధ వహించి, కాలానికి తగ్గట్టుగా చదివి, విషయాలుని సంగ్రహించి, వినయంతో ఉండి, విజ్ఞానాన్ని సంపాదించి, నైతిక విలువలను, మానవ విలువలను పాటిస్తూ, రక్షిస్తూ ధార్మిక జీవితం గడపాలి. – డా. కందాళ సత్యనారాయణ మూర్తి -
క్షమాగుణానికి నిలువెత్తు రూపం..
కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోవడం, అధికారం చేతికి రాగానే పగ తీర్చుకోవడం మానవ నైజం. కానీ, ఎన్ని అపనిందలు ఎదురైనా అల్లాహ్ పై నమ్మకం కోల్పోకుండా, తప్పు చేసిన వారు కళ్లముందు నిలబడినా కక్ష సాధించకుండా క్షమించిన మహోన్నత చరిత్ర ప్రవక్త యూసుఫ్ (అలైహిస్సలాం)ది. ముళ్లబాటలను అధిగమించి, ఈజిప్ట్ దేశాన్ని కరవు బారి నుంచి రక్షించిన ఒక అద్భుత ప్రజా నాయకుడి జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం.యూసుఫ్ (అ) చిన్నతనం నుంచే ఎంతో అందమైనవాడు, అమాయకుడు. ఒకరోజు ఆయన కు ఒక వింత కల వచ్చింది. 11 నక్షత్రాలు, సూర్యచంద్రులు తన ముందు వంగి నమస్కరిస్తున్నట్లు కల కన్నారు. ఈ విషయాన్ని తన తండ్రి యాఖూబ్ (అ) కు చెప్పగా.. ఆయన ఆ కలలోని దైవ సందేశాన్ని గ్రహించారు. ‘నాయనా! ఈ విషయాన్ని నీ సోదరులకు చెప్పకు, వారు అసూయపడతారు’ అని హెచ్చరించారు. కానీ, తండ్రికి యూసుఫ్పై ఉన్న మితిమీరిన ప్రేమే అన్నదమ్ముల మధ్య అసూయకు కారణమైంది.బావి నుంచి బానిసగా..అసూయతో రగిలిపోయిన సోదరులు యూసుఫ్ను అంతమొందించాలని పథకం వేశారు. ‘ఆడుకోవడానికి తీసుకెళ్తాం’ అని తండ్రిని ఒప్పించి, అడవిలోని ఒక పాడుబడ్డ బావిలోకి యూసుఫ్ను తోసేశారు. ఆయన బట్టలకు గొర్రె రక్తం పూసి, ‘తోడేలు తినేసింది’ అని తండ్రిని నమ్మించారు. ఆ కన్నతండ్రి ‘ఇది దైవ పరీక్ష, నేను ఓపిక పడతాను’ అని సహనం వహించారు. మరోవైపు, ఆ బావి మీదుగా వెళ్తున్న వర్తకులు యూసుఫ్ను రక్షించి, ఈజిప్ట్సంతలో ఒక అధికారికి బానిసగా అమ్మేశారు.జైలు జీవితం.. కలలోని సత్యంఅక్కడ అపనిందలు, ఆరోపణలు ఎదురైనా యూసుఫ్ తన శీలాన్ని, దైవభీతిని కాపాడుకున్నారు. ఫలితంగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలులోనే ఆయనకు అల్లాహ్ ‘కలల అర్థాలను వివరించే’ అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించాడు.సరిగ్గా అదే సమయంలో ఈజిప్ట్ రాజుకు ఒక వింత కల వచ్చింది. 7 బలిసిన ఆవులను, 7 బక్కచిక్కిన ఆవులు మింగేయడం.. అలాగే 7 పచ్చటి పనసలు, 7 ఎండిన పనసలు కనిపించడం రాజును కలవరపెట్టింది. దేశంలోని పండితులెవరూ ఆ కలకు అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు జైలు నుంచి యూసుఫ్కు పిలుపు వచ్చింది. ఆ కలకు యూసుఫ్ చెప్పిన పరిష్కారం ఇది: ‘రాబోయే 7 ఏళ్లు ఈజిప్ట్లో సమృద్ధిగా పంటలు పండుతాయి. ఆ తర్వాత 7 ఏళ్లు ఘోరమైన కరవు వస్తుంది. కాబట్టి తొలి ఏడేళ్ల ధాన్యాన్ని వృథా చేయకుండా ఖజానాలో దాచండి’’యూసుఫ్ మేధస్సుకు ముగ్ధుడైన రాజు, ఆయనను సగౌరవంగా జైలు నుంచి విడుదల చేసి, ఖజానా అధిపతిగా నియమించాడు. బానిస గా వచ్చిన వ్యక్తి, తన మేధస్సుతో ఆ దేశ రక్షకుడి గా మారాడు! పగ కాదు.. ప్రతీకారం అంతకన్నా కాదు!రాజు కన్న కల నిజమైంది. దేశంలో కరవు తాండవించింది. ఆహారం కోసం పొరుగు దేశాల నుంచి జనం ఈజిప్టుకు రావడం ్రపారంభించారు. ఆ గుంపులో యూసుఫ్ సోదరులు కూడా ఉన్నారు. తమను బావిలో పడేసిన అన్నదమ్ములు తన ముందే నిలబడి యాచిస్తుంటే, యూసుఫ్ వారిని గుర్తుపట్టారు. కానీ పగ తీర్చుకోలేదు.చివరకు తన నిజమైన రూపాన్ని బయటపెడుతూ.. ‘నేనే మీ తమ్ముడు యూసుఫ్ను. మీ తప్పులను నేను క్షమించేశాను. నాపై మీకు ఎలాంటి నిందలు లేవు‘ అంటూ వారిని కౌగిలించుకున్నారు. తండ్రి యాఖూబ్ (అ) ను, మొత్తం కుటుంబాన్ని ఈజిప్టుకు పిలిపించుకున్నారు. చిన్నప్పుడు కన్న కలకు నిజరూపంగా.. తల్లిదండ్రులు, సోదరులు అందరూ యూసుఫ్ ఉన్నత స్థానాన్ని చూసి గౌరవంతో తలవంచారు. – ముహమ్మద్ ముజాహిద్ -
ఇతిహాసాలను మలుపు తిప్పిన శాపాలు..!
ప్రాచీన భారతీయ ఇతిహాసాలు, పురాణాలు కేవలం కథల సమాహారం మాత్రమే కాదు... మానవ జీవన విలువలను, కర్మ సిద్ధాంతాన్ని బోధించే అద్భుత జ్ఞాన నిధులు. మన సంస్కృతి లో ‘వాక్కు’కు అత్యున్నత స్థానం ఉంది. ఒకసారి నోటి నుంచి వచ్చిన మాటను వెనక్కి తీసుకోలేం. అందుకే, పూర్వం మహర్షులు, తపస్సంపన్నులు ఆగ్రహంతోనో, అధర్మాన్ని సహించలేకో ఇచ్చిన శాపాలు... చరిత్ర గమనాన్నే మార్చేశాయి. తీవ్రమైన భావోద్వేగాలు, ద్రోహం, అహంకారం, క్రోధం నుంచి పుట్టిన 5 శక్తిమంతమైన శాపాలు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాలు ఇవే...అశ్వత్థామకు శ్రీ కృష్ణుని శాపం...మహాభారత యుద్ధం ముగింపు దశలో, నిద్రిస్తున్న ఉపపాండవులను క్రూరంగా వధించిన అశ్వత్థామపై జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అశ్వత్థామకు మరణశిక్ష విధించకుండా, అంతకంటే భయంకరమైన శాపాన్ని ఇచ్చాడు పరమాత్ముడు. అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తొలగించి, ఒళ్లంతా రక్తం, చీము కారుతున్న గాయాలతో, నిరంతర వేదనతో మూడు వేల సంవత్సరాల పాటు ఒంటరిగా భూమిపై సంచరించాలని శపించాడు.పరిణామం... మరణం లేని అమరత్వం ఒక్కోసారి ఎంతటి నరకంగా మారుతుందో ఈ ఘటన నిరూపిస్తుంది. చేసిన కర్మల నుంచి, అధర్మం నుంచి ఎంతటి యోధుడైనా తప్పించుకోలేడని, ప్రకృతి నియమాలకు అందరూ లొంగాల్సిందేనని ఈ శాపం మనకు బోధిస్తుంది.నారద మహర్షి శాపం...ఒకానొక సందర్భంలో నారద మహర్షి మోహపాశంలో చిక్కుకున్న ప్పుడు, శ్రీమహావిష్ణువు ఆయనకు హితం చేయడం కోసం మాయా రూపంతో నారదుడిని పరీక్షించి విఫలుడిని చేస్తాడు. భంగపడిన నారదుడు తీవ్ర అవమాన భారంతో, విచక్షణ కోల్పోయి విష్ణుమూర్తినే శపిస్తాడు. తాను ఏ విధంగానైతే స్త్రీ విరహంతో బాధపడ్డాడో, అదే విధంగా విష్ణుమూర్తి కూడా భూలోకంలో మానవుడిగా జన్మించి, భార్యావియోగాన్ని అనుభవించాలని, కోతులే ఆయనకు సహాయం చేయాలని శపించాడు.పరిణామం... ఈ శాప ఫలితంగానే త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించిన పరమాత్ముడు... సీతాదేవిని కోల్పోయి, అరణ్యాలలో తీవ్ర విరహ వేదనను అనుభవించాడు. వానరుల సహాయంతో లంకపై దండెత్తాడు. దైవమైనా సరే, భక్తుని వాక్కును గౌరవించక తప్పదనే సత్యాన్ని ఈ కథ చాటిచెబుతుంది.గాంధారి శాపం...కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన నూరుగురు కుమారులను కోల్పోయిన గాంధారి దేవి దుఃఖం క్రోధంగా మారింది. ఈ సర్వనాశనానికి అంతటా ఉండి నడిపించిన శ్రీ కృష్ణు్ణడే కారణమని ఆమె భావించింది. భారతీయులందరినీ కాపాడగలిగే శక్తి ఉండి కూడా యుద్ధాన్ని ఆపనందుకు... ఏ విధంగానైతే కౌరవ వంశం అంతమైందో, అదే విధంగా 36 ఏళ్ల తర్వాత కృష్ణుడి కళ్లముందే యాదవ వంశం కూడా అంతర్గత కలహాలతో నశించిపోతుందని శపించింది.పరిణామం... గాంధారి శాపం వృథా పోలేదు. మౌసల పర్వం నాటికి యాదవులంతా ప్రభాస తీర్థంలో ఒకరినొకరు హింసించుకుని సర్వనాశనమయ్యారు. చివరికి శ్రీ కృష్ణుడు కూడా ఒక బోయవాడి బాణానికి చిక్కి, ఏకాకిగా అవతారాన్ని చాలించాల్సి వచ్చింది. ఒక తల్లి ఆక్రందన, దుఃఖం ఎంతటి శక్తిమంతమైనవో ఈ ఘట్టం వివరిస్తుంది.దుర్వాస మహర్షి శాపం...శకుంతల దుష్యంతుడి ప్రేమలో మునిగిపోయి, తన ఆశ్రమానికి వచ్చిన తపోధనుడైన దుర్వాస మహర్షిని గమనించకుండా అగౌరవపరుస్తుంది. తీవ్ర కోపిష్టిగా పేరొందిన దుర్వాసుడు ఆమె ప్రవర్తనకు ఆగ్రహించి శాపాన్ని ఇస్తాడు. ‘నువ్వు ఎవరి ధ్యానంలో మునిగిపోయి నన్ను నిర్లక్ష్యం చేశావో... ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా మర్చిపోవు గాక!‘ అని శపించాడు.పరిణామం... దీనివల్ల దుష్యంతుడు శకుంతలను పూర్తిగా మరచిపోతాడు. శకుంతల ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక క్షణ కాలపు చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని ఎంతటి అగాధంలోకి నెడుతుందో, అలాగే అతిథి మర్యాద ఎంత ముఖ్యమో ఈ వృత్తాంతం తెలియజేస్తుంది.వశిష్ఠుడి శాపం...దేవతలు ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని పవిత్రమైన కామధేనువును అపహరించడానికి ప్రయత్నిస్తారు. త్రికాలజ్ఞాని అయిన వశిష్ఠుడు వారి తప్పును తెలుసుకుని తీవ్రంగా శపించాడు. దివ్యలోకంలో ఉండే అర్హతను కోల్పోయి, అష్టవసువులంతా భూలోకంలో మానవులుగా జన్మించాలని శపించాడు.పరిణామం... ఈ శాపం వల్లే వసువులు గంగాదేవి గర్భాన జన్మించాల్సి వచ్చింది. వారిలో ఏడుగురిని గంగాదేవి పుట్టగానే నదిలో కలిపేసి శాపవిముక్తి కలిగించగా, ఎనిమిదో వసువు మాత్రం భూమిపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆయనే మహాభారతంలో అజేయ యోధుడిగా పేరొందిన ’భీష్మ పితామహుడు’. దేవతలైనా సరే కర్మఫలాన్ని అనుభవించక తప్పదని ఈ కథ చెబుతుంది. ప్రాచీనగాథలలోని ఈ శాపాలు కేవలం శిక్షలు మాత్రమే కావు... అవి మనకు కొన్ని జీవితసత్యాలను బోధిస్తాయి. కోపం, అహంకారం, నిర్లక్ష్యం ఎంతటి వారినైనా పతనానికి నడిపిస్తాయని హెచ్చరిస్తాయి.మాట అనేది చాలా పదునైన ఆయుధం, దాన్ని ఉపయోగించేటప్పుడు వివేకం ఎంత అవసరమో ఈ కథలు మనకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. – పసుపులేటి వెంకటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు -
రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త
భార్య వైద్య అవసరాల కోసం నానా పాట్లు డుతోంటే భర్త ఏకంగా రూ. 19 కోట్లను దాచిపెట్టి, తనకు కనీసం 35 వేలు ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టాడని ఒక మహిళ వాపోయిన వైనం సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం,తన భర్త తనకు తెలియకుండా ఇన్నాళ్లుగా సుమారు 14 మిలియన్ యువాన్లను (దాదాపు రూ.19 కోట్లు) రహస్యంగా ఉంచాడని చైనాకు చెందిన 53 ఏళ్ల మహిళ గుర్తించింది. ఒక పక్క తాను దాదాపు రూ. 95వేల వైద్య బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, ఆయన మాత్రం విలాసంగా జీవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ఆస్తులన్నింటినీ రహస్యంగా ఉంచాడనిఆరోపించింది. విడాకుల ప్రక్రియ సమయంలో ఆర్థిక రికార్డులను పరిశీలించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. తన ఆదాయాన్నిగానీ, ఆస్తులను గానీ ఎపుడూ వెల్లడించలేదని వాపోయింది. ఇంతకాలం అవగాహన లేక అతని ఆస్తిపాస్తులపై పట్టించుకోలేదని వాపోయింది.వైద్య ఖర్చులకు ఇబ్బందులుఇంత సంపద దాచిపెట్టినప్పటికీ, తన భర్త కనీస ఆర్థిక సాయం చేయడానికి కూడా నిరాకరించాడని వాంగ్ ఆరోపించింది. తనకు నెలకు ఇవ్వాల్సిన 2,500 యువాన్ల (సుమారు రూ.35,000) అలవెన్స్ను ఇచ్చేందుకు నిరాకరించాడని, అలాగే తన వైద్య చికిత్సకు ఒక్క రూపాయికూడా సహాయం చేయలేదని ఆమె పేర్కొంది. బీజింగ్లో చికిత్స పొందుతున్న సమయంలో చాలా పొదుపుగా జీవించాల్సి వచ్చిందని. అద్దె తక్కువ ఇంట్లో ఉంటూ, చౌక ధరల బట్టలు ధరిస్తూ , వైద్య ఖర్చులు భరించే స్తోమత లేక ఇబ్బందులు పడ్డాడని వెల్లడించింది. ఈ సమయంలో తన భర్త మాత్రం బ్రాండెడ్ వస్తువులు, కాస్మెటిక్ ట్రీట్మెంట్ల కోసం విపరీతంగా ఖర్చు చేసేవాడని ఆమె ఆరోపించింది.గృహహింస, శారీరక దాడి ఈ కేసులో తీవ్రమైన గృహహింస ఆరోపణలు మరో ముఖ్యమైన అంశం. భర్త చేతిలో పదేళ్ల పాటు శారీరక హింసను భరించింది. ఆమె కొట్టిన దెబ్బలు పక్కటెముకలు విరగడమే కాకుండా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించిన 100 కి పైగా ఫోటోలను ఆమె ఆధారాలుగా చూపించింది. ఈ శారీరక హింస , ఆర్థిక నియంత్రణ వల్లే తాను తీవ్రమైన డిప్రెషన్కు, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
పిల్లల సమాచారం.. సోషల్గా వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘నా బిడ్డ స్కూల్లో ఫస్ట్ వచ్చింది’, ‘ఇవాళ నా కుమారుడి పుట్టినరోజు.. ‘మా పాప అక్షరాభ్యాసం చేయించాం’, ‘మా పిల్లలను ఫలానా స్కూల్లో చేర్పించాం..’ అంటూ పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పంచుకోవడం ఇప్పటి తరం తల్లిదండ్రులకు సాధారణమైంది.అయితే ఈ చర్యలే పిల్లలను సైబర్ నేరగాళ్ల బారిన పడేలా చేస్తున్నాయని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆన్లైన్ భద్రతపై స్కూళ్లు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతికి ఒక స్కూల్ వార్షికోత్సవంలో తీసిన ఫొటోలో విద్యార్థి పేరు, స్కూల్ లోగో, తరగతి వివరాలు కనిపిస్తే, సోషల్ మీడియా ద్వారా ఆ బాలుడి పూర్తి డిజిటల్ ప్రొఫైల్ను సేకరించడం సైబర్ నేరగాళ్లకు సులభమవుతుందని చెబుతున్నారు.అనంతరం ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకున్నట్లు దేశంలోని సైబర్ భద్రతా సంస్థలు పలుమార్లు హెచ్చరించాయి.ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ వివరాలు ఇతరులకు కనిపించకుండా ప్రైవేటు సెట్టింగ్లు పెట్టుకోవాలి.లొకేషన్ ట్యాగ్లను నిలిపివేయాలి. సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్ను కఠినంగా అమలు చేయాలి.పిల్లలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలి. -
డైనమిక్ డయాన్ @ 79
విజయానికి ఎన్ని మెట్లో ఎవరు చెప్పగలరు? కొందరు మాత్రం కొన్ని మెట్ల తర్వాత ఆగిపోతారు. కొందరు మాత్రం ప్రతి మెట్టులో ప్రతికూలతలు ఎదురైనా వెనక్కి తగ్గరు. ‘ఫోర్బ్స్ సెల్ఫ్–మేడ్ ఉమెన్’ సంపన్నుల జాబితాలో వరుసగా తొమ్మిదవసారి చోటు సాధించిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల డయాన్ హెండ్రిక్స్ రెండో కోవకు చెందిన మహిళ. ‘పెద్ద ఎంటర్ప్రెన్యూర్ కావాలి’ అని చిన్నప్పటి నుంచే కలలు కన్న డయాన్ ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసిన రోజులూ ఆమె జీవితంలో ఉన్నాయి. ‘విజయం అంటే కొత్తగా ఆలోచించడం. మార్కెట్లోని లోటుని భర్తీ చేయడం’ అంటున్న డయాన్ హెండ్రిక్స్ గురించి...పదేళ్ల వయసు నుంచే ఎంటర్ప్రెన్యూర్ కావాలని కలలు కనేవారు డయాన్ హెండ్రిక్స్. ‘చిన్నప్పుడు ఎన్నో కలలు కంటాం... అవి నిజమవుతాయా!’ అని ఆ తరువాత అనుకోలేదు డయాన్. తన ‘లక్ష్యం’ అనే మొక్కను పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. కలను సాకారం చేసుకొని ‘సెల్ఫ్–మేడ్ ఉమెన్ బిలియనీర్’గా జేజేలు అందుకుంటున్నారు డయాన్.అప్పులు చేసి.. ఆస్తులు తాకట్టు పెట్టి...తాజాగా... తొమ్మిదవసారి అమెరికా రిచెస్ట్ సెల్ఫ్–మేడ్ ఉమెన్(2026) జాబితాలో చోటు సాధించి తన ప్రత్యేకత నిలుపుకున్నారు డయాన్. ఆమె సంపదలో అధిక భాగం ఆమె రూఫింగ్ మెటీరియల్ కంపెనీ ‘ఏబీసీ సప్లై’కి చెందినదే. తన భర్త కెన్ హెండ్రిక్స్తో కలిసి 1989 లో ఈ కంపెనీని స్థాపించారు. ఆరోజుల్లో వివిధ తయారీదారులు తయారు చేసిన రూఫింగ్ మెటీరియల్స్ ఒకేచోట దొరికే దుకాణాలు చాలా తక్కువగా ఉండేవి. ఇది గ్రహించిన డయాన్ ‘ఏబీసీ సప్లై’ కంపెనీకి శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీప్రారంభించడానికి బ్యాంక్ నుంచి అప్పు చేయాల్సి వచ్చింది. ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. విస్కాన్సిన్లోని బెలోయిట్ కేంద్రంగా మొదలైన కంపెనీ కొన్ని సంవత్సరాలలో లాభాల బాట పట్టింది.విజయ రహస్యం‘నా విజయ రహస్యం... మార్కెట్లోని ఒక లోటును భర్తీ చేయడం’ అంటారు డయాన్. ఒస్సియో(యూఎస్)లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పెరిగిన డయాన్ పెద్ద నగరంలో ఉండాలని, నీలం రంగు సూట్లు ధరించి, ఖరీదైన కార్లు నడపాలని కలలు కనేవారు. చిన్న వయసులోనే పెళ్లి అయి గర్భవతి కావడంతో ఇంటి నుంచే చదువు పూర్తి చేశారు. కాలేజీ చదువు కంటే రియల్ ఎస్టేట్ రంగంలో కెరీర్ వెదుక్కోవడానికి చిన్నాచితకా పనులు చేశారు. చిన్న వయసులో తల్లి అయిన డయాన్ తన ఖర్చుల కోసం ప్లేబాయ్ బన్నీ(ప్లేబాయ్ క్లబ్లో పనిచేసే కాక్టెయిల్ వెయిట్రెస్)గా కూడా పనిచేశారు.క్యాన్సర్ను జయించి...రెండు సార్లు క్యాన్సర్ బారిన పడ్డారు డయాన్. తన సంకల్పబలమే క్యాన్సర్ను జయించే శక్తిని ఇచ్చింది. భర్త మరణం ఆమెను దుఃఖంలో ముంచెత్తింది. కష్టకాలం లో, నిరాశానిస్పృహల చీకటిలో కూడా...‘సాధించాలి. తప్పకుండా సాధించాలి’ అని గట్టిగా ఒకటికి పదిసార్లు అనుకునేవారు డయాన్. ప్రారంభ రోజుల్లో...ఖర్చుల కోసం టాయిలెట్లు శుభ్రం చేసేవారు. పాత ఇంటిని కొని స్వయంగా మరమ్మతు చేసి కాలేజీ స్టూడెంట్స్కు అద్దెకు ఇచ్చేవారు.చాలా కష్టం...అయినా సరే...డయాన్ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో ‘ఏబీసీ సప్లై కో’ కంపెనీ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేస్తూ మార్కెట్ లో దూసుకుపోతోంది. మార్కెట్ పోకడలకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. వ్యర్థాల తగ్గింపు, పర్యావరణ అనుకూల ఉత్పత్తులపై దృష్టి పెడుతోంది. రైతుబిడ్డ నుండి బిలియనీర్ వ్యాపారవేత్తగా డయాన్ ప్రయాణం అనేది పట్టుదల, అపారమైన ధైర్యసాహసాల కలబోత. ఎంతోమంది ఔత్సాహికులకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే అపూర్వ విజయం.‘ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు... ‘వ్యాపారవేత్తగా రాణించడం అనేది చాలా కష్టం. మూస ఆలోచనలు కాకుండా ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. మీరు చేయాలనుకుంటున్నది మార్కెట్కు ఎంత అవసరం... అనేది మీకు మీరు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న. వ్యాపారంలో విలువైన సమయంతోపాటు, డబ్బు కూడా కోల్పోవలసి రావచ్చు. అలా అని భయపడకూదు. రిస్క్ తీసుకోవాలి. ఎంత రిస్కైనా సరే!’ ఎంతోమంది ఔత్సాహికులు తమ కలలను నిజం చేసుకోవడంలో సహాయపడిన డయాన్ దాతృత్వ కార్యక్రమాలలోనూ ముందుంటారు. టెన్ కమాండ్మెంట్స్కష్టపడి పనిచేసి నా కలలను నిజం చేసుకున్న ఒక సాధారణ అమెరికన్ అమ్మాయిని, రైతు బిడ్డను. వ్యక్తిగత, వృత్తి జీవితంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది నా తల్లిదండ్రులు. మా నాన్నగారు ఏది సరైనదో, ఏది కాదో చెప్పేవారు. ‘నేను చేస్తున్న పని సరైనదేనా అని నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటే నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది’ అని చెప్పేవారు. టెన్ కమాండ్మెంట్స్ నా వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిజీవితంలోనూ ప్రభావాన్ని చూపుతున్నాయి. నేను వాటిని మళ్లీ మళ్లీ చదువుతాను. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఏది సరిౖయెనదో, ఏది త΄్పో అవి వివరిస్తాయి.– డయాన్ హెండ్రిక్స్ -
40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు
ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉద్యోగ ఒత్తిళ్లు, గంటల తరబడి కూర్చునే జాబ్ నుంచి ఫిట్గా మారాలని నిర్ణయించుకుని, తీవ్ర కసరత్తు చేస్తారు. కానీ దీనికి సంబంధించి వైద్యుల సలహాలు, మందస్తు ప్రిపరేషన్ లేకపోతే ముప్పు తప్పదు. బెంగళూరుకు చెందిన ఒక ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం ఈ విషయాన్నే మరోసారి రుజువు చేసింది. పరుగు మంచిదే, కానీ ముందస్తు ప్రిపరేషన్ అవసరం,సురక్షితమైన ఆరోగ్యమే అంతిమ లక్ష్యం కావాలి అనే అంశంపై ఓ కథనం.బెంగళూరుకు చెందిన, 40 ఏళ్ల మధ్య వయసు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని భావించాడు. ఏళ్ల తరబడి ఒత్తిడితో కూడినడెస్క్ జాబ్నుంచి ఫిట్గా మారాలను కున్నాడు. అంతేకాదు లాంగ్-డిస్టెన్స్ రన్నింగ్ను చేపట్టాలని నిర్ణయించుకున్నాడు అమెరికాలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అంతలోనూ ఊహించని ప్రమాదం అతణ్ని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. ఇంతకీ ఏమైందంటే.అల్ట్రామారథాన్కోసం శ్రద్ధగా శిక్షణ పొందాడు. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సంకేతాలవీ లేకుండా ఆరోగ్యంగా కనిపించాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన అతనికి షాక్ ఇచ్చింది. అతను తన ప్రాక్టీస్ రన్ల సమయంలో ట్రాక్పై కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు ఎమర్జెన్సీ రూమ్కు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలో అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు ప్రధాన కరోనరీ ధమనులలో క్లాట్స్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఆ తరువాత పరీక్షల్లో హై కొలెస్ట్రాల్ స్థాయిలు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్రతో సహా, ఏళ్లుగా గుర్తించడని పలు అంతర్లీన ప్రమాద కారకాలు బయటపడ్డాయి.ఒక విధంగా చెప్పాలంటే అతను చాలా అదృష్టవంతుడు. ఒక పెను ప్రమాదం జరగక ముందే అతని పరిస్థితిని గుర్తించారు. గుండె ఆరోగ్యానికి పరుగు ఉత్తమమైన వ్యాయామమే అయినప్పటికీ, మధ్య వయస్సులో ఎలాంటి ముందస్తు సన్నాహం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన ఓర్పు శిక్షణను ప్రారంభించడం, సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న అంతర్లీన వ్యాధిని కొన్నిసార్లు బయట పెట్టగలదని ఈ కేసు గుర్తు చేస్తుంది.పరుగు తీయడం వల్ల గుండె జబ్బులు రావు. నిజానికి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, సుదీర్ఘకాలం పాటు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చాలా కాలం గడిపి, ఒక్కసారిగా 40 ఏళ్ల వయసులో తీవ్రమైన పరుగు పందాలు (మార్గాథాన్లు) ప్రారంభించడం వల్ల, లోపల దాగి ఉన్న గుండె సమస్యలు అకస్మాత్తుగా బయటపడే ప్రమాదం ఉంది. 40 ఏళ్లు పైబడిన వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, ధూమపానం వంశపారంపర్య గుండె జబ్బుల వంటి రిస్క్ ఫ్యాక్టర్లు చాలా సంవత్సరాలుగా లోపల నెమ్మదిగా ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.బయటకు ఎంతో ఫిట్గా కనిపించే వ్యక్తికి కూడా లోపల గుండె ధమనులలో తీవ్రమైన బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది.ఒక్కసారిగాతీవ్రంగా శ్రమించడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి, రక్తపోటు ఎక్కువ అవుతుంది. దీనివల్ల లోపల ఉన్న కొవ్వు పలకలు (plaques) ఊడిపోయి హార్ట్ ఎటాక్కు దారితీయవచ్చు.40 ఏళలు దాటిన తరువాత ముందే కార్డియాక్ స్క్రీనింగ్ అంటే గుండె పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ECG, ఎకోకార్డియోగ్రామ్ , ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి చేయించుకోవడం ఉత్తమం. పరుగు, లేదా కఠిన వ్యాయామాలను ఆరంభించే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.ప్రధానంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ పరీక్షలతో ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి 'కరోనరీ CT యాంజియోగ్రఫీ' ద్వారా లోపల ఉన్న బ్లాక్స్ను ముందే గుర్తించవచ్చు.వ్యాయామాన్ని ఒకేసారి తీవ్రం చేయకూడదుకొన్ని సంవత్సరాలుగా రన్నింగ్ చేయని వారు ఒక్కసారిగా కొన్ని నెలల్లోనే పెద్ద రేసులకు సిద్ధం కాకూడదు.తొలుతసాధారణ నడకతో ప్రారంభించి, ఆపై వేగంగా నడవడం (Brisk Walking), ఆ తర్వాతే రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.వేగం లేదా దూరం కంటే క్రమం తప్పకుండా చేయడం (Consistency) ముఖ్యం. దీనివల్ల గుండె, కండరాలు, కీళ్లకు తగిన సమయం దొరుకుతుంది.మరి ఏం చేయాలి?40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కండరాల సాంద్రత సహజంగానే తగ్గుతుంది. కాబట్టి కేవలం పరుగు మాత్రమే సరిపోదు. స్ట్రెంత్ ట్రైనింగ్ (కండరాల వ్యాయామం) తప్పనిసరివారానికి కనీసం రెండు సార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు (Strength Training) చేయాలి.ఇది మోకాళ్లు, నడుము, తుంటి భాగాలపై ఒత్తిడిని తగ్గించి గాయాలు కాకుండా కాపాడుతుంది.అంతేకాదు భారీ భోజనం వెంటనే రన్నింగ్ చేయకూడదు. ఆహారం తిన్న తర్వాత కనీసం రెండు గంటల సమయం ఇచ్చి, ఆపై రన్నింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. శరీరం కూడా బాగా సహకరిస్తుంది. ఇదీ చదవండి: 10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్ -
అదే తలమానికం.. మార్చుకోకండి!
మన తలపై ఉండే ఉపరితల భాగమైన మాడును ఇంగ్లిష్లో స్కాల్ప్ను అంటారన్నది తెలిసిందే. నిజానికి మాడు అంటే అదో దేహ భాగం అనుకునేందుకు అవకాశముంది. కానీ అది సరికాదు... ఇంగ్లిష్లో పేరు పెట్టిన ఆ యాక్రొనిమ్కి విస్తృతార్థం ఉంది. ఇంగ్లిష్ స్కాల్ప్ స్పెల్లింగ్లోని ఐదు ఇంగ్లిష్ అక్షరాల్లో... ‘ఎస్’ అంటే స్కిన్ అనీ, ‘సీ’ అంటే కనెక్టివ్ టిష్యూ అనీ, ‘ఏ’ అంటే ఎపోన్యూరోటికా అనీ, ‘ఎల్’ అంటే లూజ్ ఏరియోలా అనీ, ‘పీ’ అంటే పెరియాస్టియమ్ అని అర్థం. ఆ ఐదు అక్షరాలూ కలిసి ‘స్కాల్ప్’గా ఏర్పడ్డాయని ఈ పదాల వల్ల తెలుస్తుంది. ఇందులో మొదటిదైన స్కిన్ అంటే చర్మం నుంచి మొదలుకొని... ‘పి’ అంటే పెరియాస్టియమ్ అనే పుర్రె ఎముక వరకు వరసగా ఉంటే పొరల తాలూకు ఇంగ్లిష్ పేర్లతో ఈ ‘స్కాల్’ అనే ఇంగ్లిష్ పదం ఏర్పడింది. మాడు అనే స్కాల్ప్ సంరక్షణ ఎలాగో తెలుసుకుందాం...మాడును వెంట్రుకలు కప్పేసి ఉంచి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ వెంట్రుకలు దట్టంగా ఉన్నవారిలో ఎండకూ, వెలుతురుకూ అడ్డు పడటం ద్వారా అక్కడ పుట్టే చెమట తాలూకు తేమ వాతావరణం కొన్ని సూక్ష్మజీవులు పెరిగే వాతావరణాన్ని కల్పించడం వల్ల దురద రావడం వంటి నలుగురిలో ఇబ్బంది పెట్టే లక్షణాలూ కనిపించవచ్చు. అలాగే ఎండ వల్ల కూడా మాడుపై కొన్ని అనర్థాలూ కనిపించవచ్చు. ఆ అనర్థాలూ, నష్టాలూ ఎలా వస్తాయో చూద్దాం.ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మాడుకు కలిగే అనర్థాలేమిటంటే...మానవ దేహం మీద మిగతా చర్మంతో పోలిస్తే మాడు మీద ఉండేవీ... నూనె స్రవించే గ్రంథుల సంఖ్య దాదాపు పది రెట్లు ఎక్కువ. ఈ నూనెను స్రవించే గ్రంథులను సెబేషియస్ గ్లాండ్స్ అని పిలుస్తారు, అలా స్రవించే నూనెను సీబమ్ అంటారు. ఈ సీబమ్ ఎప్పుడూ స్రవిస్తూ ఉన్నప్పటికీ ఎంత తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువగా సీబమ్ స్రవిస్తుంటుంది. దానికి తోడు మిగతా చర్మం కంటే మాడులో ఈ సెబేషియస్ గ్రంథులు పది రెట్లు ఎక్కువ కావడం వల్ల స్రావాల పరిమాణం కూడా బాగా పెరురుగుతుంది. దాంతో చర్మం త్వరగా జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.చర్మంలో ప్రధానంగా మూడు రకాలుంటాయి. అవి... 1. పొడి చర్మం (డ్రై స్కిన్)2. సాధారణ చర్మం (మాడరేట్ స్కిన్)3. జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్)పైన చెప్పిన నేపథ్యంలో జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలో సీబమ్ మరింత ఎక్కువగా స్రవిస్తుంటుంది. దాంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో తల మరింత జిడ్డుగా మారడం చాలా సాధారణం. దానికి తోడు చర్మంపై చెమట పట్టే గుణం ఎక్కువగా ఉన్నవారిలో తల మరింత జిడ్డుగా మారే అవకాశాలెక్కువ.జిడ్డు చర్మంపై చుండ్రు ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే...‘మలసేజియా’ అనే ఒక రకం ఫంగస్ పెరగడానికి మన తలపైన ఉండే మాడు చాలా అనువైన ప్రదేశం. ఆ మలసేజియా ఫంగస్ అనేది ఈ ‘సీబమ్’ను ఆహారంగా తీసుకుంటుంది. దాంతో సీబమ్ ఎక్కువగా స్రవించేవారిలో మలజేజియా పెరగడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ ఫంగస్ మరింత ఎక్కువగా వృద్ధి చెంది అదే చుండ్రు పెరుగుదలకు కారణమవుతుంది. దానికి తోడు తలమీద ఫంగస్ మరింతగా పెరిగిపోతే అది ‘సెబోరిక్ డర్మటైటిస్’ అనే చర్మవ్యాధికి కారణమై... చర్మంపై నుంచి జిడ్డు పొడిబారినప్పుడు అది పొట్టుగా రాలుతుంటుంది. అందుకే మాడుపైన ఈ తరహా పెరుగుదల ఉన్నవారి తలలో దురదగా ఉండటం, గీరినప్పుడు పొట్టు రాలుతుండటంతో నలుగురిలో ఇబ్బందిగా ఫీలవుతుంటారు.ఫాలిక్యులైటిస్ వంటి సమస్యలు కూడా... మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించడంతో పాటు కొందరిలో వారి శరీర తత్వాన్ని బట్టి చెమట ఎక్కువగా పడుతుండటం, దానికి తోడు జుట్టు దట్టంగా ఉండేవారిలో ఈ చెమట కారణంగా తలలో చెమ్మ వాతావరణం ఏర్పడి... అక్కడ మరికొన్ని రకాల బ్యాక్టీరియా కూడా విపరీతంగా పెరుగుతుంది. వాటి కారణంగా కొందరిలో రోమాంకురాలకు (హెయిర్ ఫాలికిల్స్కు) ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ సమస్యనే వైద్యపరిభాషలో ‘ఫ్యాలిక్యులైటిస్’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో మాడు మీద చీము పొక్కులు (పస్ నిండినట్లుగా కనిపించే కురుపులు, గుల్లలు) వస్తుంటాయి. వాటి వల్ల తీవ్రమైన నొప్పి, విపరీతమైన దురద రావచ్చు. ఈ పరిస్థితి కూడా ఆ వ్యక్తుల్ని నలుగురిలో మెలగడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేలా చేస్తుంది.ఎలా దువ్వుకోవడం అన్నది మాడుకు మంచిదంటే...జుట్టు రాలకుండా ఉండటంతో పాటు మాడు ఆరోగ్యం బాగుండాలంటే జుట్టు దువ్వుకునే సమయంలో ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించడం మేలు.తల మీద ఉన్న జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగితే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు త్వరగా రాలిపోకుండా ఉంటుంది. ఇందుకోసం పరిశుభ్రమైన మంచి దువ్వెనతో దువ్వుకోవడం మంచిది.జుట్టును పాయలు పాయలుగా విడదీస్తూ, కుదుళ్ల మొదలు దగ్గర నుంచి చివర్ల వరకు జుట్టును దువ్వాలి. ఇందుకు మరీ సన్నటి పళ్లు ఉన్న దువ్వెన కంటే కాస్తంత వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో దువ్వడమే మంచిది. సన్నటి పళ్ల దువ్వెన వల్ల జుట్టును లాగినట్టుగా ఉంటుంది. కాస్త వెడల్పాటి పళ్లున్న దువ్వెన వల్ల రోమాంకురాలకు అంతగా నష్టం ఉండదు. జుట్టును ఇలా పాయలు పాయలుగా విడదీసే సమయంలో మాడుపై వెలుగూ వెలుతురూ ఎక్కువగా ప్రసరించడం వల్ల చుండ్రు పెరిగే వాతావరణానికి భంగం కలిగి చుండ్రు అంతగా పెరగదు. దీనికి తోడు ఇలా దువ్వడం వల్ల తలలో దుమ్ము తగ్గి అది మాడుకు మేలు చేస్తుంది.మాడు సంరక్షణ కోసం ఆహారపరమైన జాగ్రత్తలివి...మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, ప్రోటీన్లు, ఖనిజలవణాలతో పాటు తాజా పండ్లు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇలా అన్ని రకాల పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటూ, తగినన్ని ద్రవాహారాలూ, నీళ్లు తీసుకుంటూ ఉండటం వల్ల మంచి ఆరోగ్యం లభించడంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది. దాంతో సాధారణ ఆరోగ్యం బాగుండటంతో పాటు... మాడుకు వచ్చే అనేక సమస్యలూ నివారితమవుతాయి.ప్రతిరోజూ రెండు లీటర్లకు తగ్గకుండా లేదా కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగుతూ ఉండడటం వల్ల మాడు మీద ఏర్పడుతుండే మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. దాంతో మాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది.జుట్టు సంబంధిత సమస్యలు ఉన్నవారు వీలైనంతవరకు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే తప్పనిసరి అయినప్పుడు వీటిని చాలా పరిమితంగా తీసుకోవాలి.మాడు విషయంలో డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలంటే...ఈ కింద పేర్కొన్న లక్షణాలలో ఏదైనా కనిపిస్తే మాడుకు ఏదైనా సమస్య వచ్చినట్లు గ్రహించి తక్షణం డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఆ లక్షణాలేమిటంటే...మాడు మీద దురద విపరీతం వస్తూ మరింతగా పెరుగుతూ పోతుండటంఎండలోకి వెళ్లగానే దురద మరింతగా పెరగడంమాడుపైన ఎర్రగాగనీ లేదా చీముతో కూడిన కురుపులు కనిపించడంమాడు మీద తెలుపు లేదా గ్రే కలర్లో పెచ్చులు వస్తున్నప్పుడుఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ జుట్టు మరింతగా రాలిపోతుండటం.అపోహలూ... వాస్తవాలుమంచి షాంపూతో తల స్నానం చేశాక ఎండలోకి వెళ్తే జుట్టు బాగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంటుందనీ, అలాగే ఎండ నుంచి రక్షించుకోడానికి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందనే అపోహలు చాలామందిలో ఉంటాయి. అవెంతవరకు వాస్తవమో చూద్దాం.ఎండవేడిమిలో జుట్టు ఆరబెట్టుకుంటే సూర్మరశ్మి కారణంగా వెంట్రుకలు మెరిసిపోతూ జుట్టు అందం ఇనుమడిస్తుందా?ఇది చాలామందిలో ఉండే అపోహే. మంచి షాంపూతో తలస్నానం చేశాక... కాసేపు మంచి ఎండలో వెంట్రుకలను ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు బాగా మెరుస్తూ కనిపిస్తుందని చాలామంది అనుకుంటుంటారు. నిజానికి జుట్టుపై ఎండ తీవ్రత నేరుగా పండటం అంత మంచిది కాదు. నేరుగా వెంట్రుకలపై పడే ఎండ తీవ్రత వాటిని డల్గా మార్చేసేందుకు అవకాశాలెక్కువ. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే... ఎండ సమయంలో వెంట్రుకలకు రక్షణగా గాలి ఆడుతూ ఉండే బ్రిమ్ హ్యాట్ లేదా క్యాప్ ధరించడం మేలు. కాస్తంత వదులుగా ఉండే కాటన్ క్యాప్ అయితే మరీ మంచిది. అంచులు వెడల్పుగా ఉండే బ్రిమ్ క్యాప్ అయితే వెంట్రుకలకు మరింత ఎక్కువ రక్షణ కలుగుతుంది.ఎండ వల్ల కూడా జుట్టు రాలే ముప్పు... ఎండ తీవ్రత నేరుగా మాడుపై పడే కొందరిలో జుట్టు రాలిపోయే ముప్పు కూడా ఎక్కువే. దీనికి కారణమూ ఉంది... నేరుగా వెంట్రుకలపై పడే ఎండ కారణంగా కొందరిలో ‘రోమాంకురాలు’ (హెయిర్ ఫాలికిల్స్) దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది. ఫలితంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యనే ‘ఎక్టినిక్ టెలోజెన్ ఎఫ్లూవియమ్’ అని కూడా అంటారు. ఈ సమస్యతో పాటు మరికొందరిలో నుదుటి మీద చిన్న చిన్న పొక్కులు లేదా మొటిమల వంటివి కూడా కనిపిస్తుంటాయి. ఎండ తీవ్రత నుంచి మాడును రక్షించుకోవడమిలా...ఎండలో మాడును రక్షించుకోడానికీ, దాని ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించడం మేలు. అవి...మాడుపై సీబమ్ ఎక్కువగా స్రవించే దేహలక్షణం ఉన్నవారిలో జుట్టు జిడ్డుగా మారడం చాలా ఎక్కువ. ఆ జిడ్డు కారణంగా జుట్టు మరీ ఎక్కువ డల్గా కనిపించవచ్చు. ఇలా జుట్టు డల్గా కనిపించకూడదంటే... జిడ్డు చర్మం ఉన్నవారు వారంలో రెండు సార్లు లేదా రోజు విడిచి రోజు తలస్నానం చేయడం మంచిది.స్కాల్ప్పైనున్న మన దేహ భాగంలో పీహెచ్ విలువ 5.5 ఉంటుంది. ఇలాంటివారు సరిగ్గా ఇదే పీహెచ్ ఉన్న షాంపూలను వాడితే అది వాళ్ల మాడుకు ఉపయుక్తంగా ఉంటుంది.చుండ్రు లేదా ఫాలిక్యులైటిస్ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డర్మటాలజిస్టులను పాటించడం మంచిది. సాధారణంగా చుండ్రు ఉన్నవారికి డర్మటాలజిస్టులు వారికి అనువైన లేదా కీటకెనజోల్ వంటి యాంటీఫంగల్ షాంపూలను సూచిస్తుంటారు. ఆ మేరకు బాధితులు వాటిని మెయింటెనెన్స్ ట్రీట్మెంట్లాగా వాడుకోవచ్చు.జిడ్డు చర్మం, జిడ్డుగా ఉండే మాడు ఉన్నవారు తలకు నూనె పట్టించడం అంత మంచిది కాదు.ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు, ద్రవాహారాలు కూడా ఎక్కువగా తీసుకోవడం అన్నది జిడ్డు చర్మంతో ఉండేవారితో పాటు అందరికీ మేలు చేసే అంశం.హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు మరింత ఎక్కువగా రాలుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. గాలి ఆడక చెమట పడుతుండటం వల్ల ఇలాంటి అభి్రపాయం చాలామందిలో కలగడం చాలా సాధారణం. అయితే నిజానికి హెల్మెట్ అన్నది ప్రమాద సమయంలో తలనూ ్రపాణాలనూ కాపాడటమే కాదు... దాన్ని ధరించడం వల్ల అది ఇటు జుట్టునూ, అటు మాడునూ ఏకకాలంలో రక్షిస్తుంటుంది. అంతేకాదు... బయటి వాతావరణంలోని కాలుష్యం నుంచి కూడా జుట్టును కాపాడుతుంది. నిజం చెప్పాలంటే... హెల్మెట్ ధరించని బైక్ రైడర్స్తో పోలిస్తే హెల్మెట్ వాడే వారిలోనే జుట్టు రాలిపోకుండా సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు.హెల్మెట్ వాడే వారు పాటించాల్సిన సూచన... అయితే హెల్మెట్ తొడుక్కునేప్పుడు ఒక జాగ్రత్త పాటిస్తే మంచిది. ఒక పరిశుభ్రమైన పొడి గుడ్డను కాస్తంత లూజ్గా ఉండేలా తల మీద కప్పుకొని, ఆ పైనుంచి హెల్మెట్ ధరించాలి. ఆ గుడ్డ కూడా కాటన్తో తయారైన మృదువైన కర్చిఫ్లాంటిదైతే మరింత మేలు. ఇలా ధరించడం వల్ల హెల్మెట్ పైభాగం ఆ వ్యక్తి తాలూకు చెమటతో తడిసిపోకుండా ఎప్పుడూ పొడిగా ఉంటుంది. దాంతో చెమటతో తడిసిన హెల్మెట్నే మాటిమాటికీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం తలపైన పరచుకునే గుడ్డను మారుస్తూ దాన్ని మాటిమాటికీ ఉతుక్కోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉతికిన వస్త్రాన్ని వాడుకోవచ్చు. అయితే ఇలా కాకుండా హెల్మెట్ను నేరుగా ధరిస్తుంటే... దాన్ని శుభ్రపరచుకోవడం సాధ్యం కాదు కాబట్టి నిపుణులు ఈ జాగ్రత్తను సూచిస్తుంటారు.చివరగా... మనిషిని చూడగానే మొదటగా అందరికీ కనిపించేది తల... దానిపైన ఉండే మాడు భాగం మాత్రమే. అది ఆరోగ్యంగా కనిపిస్తుంటేనే సదరు వ్యక్తి కూడా పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనిపిస్తుంటాడు. కేవలం నలుగురిలోకి వెళ్లినప్పుడు కలిగే ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించుకోడానికే కాకుండా... మాడును ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా కనిపిస్తాడని గుర్తుంచుకోవాలి. ఆ మేరకు మాడు విషయంలో జాగ్రత్త వహించడమన్నది మిగతా దేహ ఆరోగ్యానికీ మేలు చేసే అంశమని గుర్తుంచుకోవాలి. - డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్నిర్వహణ : యాసీన్ -
బ్రెయిన్ ట్యూమర్కి వైఫై, స్మార్ట్ఫోన్లే కారణమా?
గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దాంతో అంతా మొబైల్ ఫోన్లు, వైఫై రౌటర్లు, స్క్రీన్ టైం తదితరాలే అందుకు కారణమని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగావీటన్నింటికి ఒత్తిడి కూడా తోడవ్వుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జూన్ 8 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే (World Brain Tumor Day) సందర్భంగా డిజిటల్ వినియోగం ఈ సమస్యకు ఎంత వరకు కారణం? శాస్త్రీయపరంగా ఇది ఎంత వరకు కరెక్ట్ వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.వై-ఫై, స్మార్ట్ఫోన్లు, ఒత్తిడి, లేదా అధిక స్క్రీన్ టైమ్ వంటివే బ్రెయిన్ ట్యూమర్కి ప్రధాన కారణమని చెప్పడానికి సరైన ఆధారాలే లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగా డిజిటల్ వాడకం వల్ల రేడియేషన్ బారినపడతారనే దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. మొబైల్ ఫోన్లు మరియు వై-ఫై పరికరాల నుంచి లువడే రేడియోఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ కారణంగానే ఈ ఆందోళన వ్యక్తమైందది గానీ..ఎక్స్-రేలు లేదా అణు పదార్థాల నుంచి వెలువడే అయనీకరణ రేడియేషన్ లా కాకుండా RF రేడియేషన్ను తక్కువ-శక్తి గలదిగా, అయనీకరణం చెందనదిగా పరిగణిస్తారని అన్నారు. అందువల్లే కేన్సర్ పరిధకులు..మొబైల్ ఫోన్లు లేదా వై-ఫై సాధారణ వాడకం బ్రెయిన్ కేన్సర్కు కారణమని నిర్థారించలేమని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ వాడకం బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని ఎంత మేరకు కలిగించగలదో చేసిన అధ్యయనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయన్నారు. కొన్ని అధ్యయనాల్లో ఫోన్ని అతిగా వాడే వారిలో కొన్ని అరుదైన కణితులు పెరిగినట్లు తేలిందని..మరికొన్ని పరిశోధనల్లో సరైన ఫలితాలివ్వలేదని చెబుతున్నారు. దీనిపై మరింత దీర్ఘకాలిక పరిశోధన అవసరమని చెబుతున్నారు.అధిక స్క్రీన్ సమయం బ్రెయిన్ని దెబ్బతీస్తుందా?స్క్రీన్ సమయం బ్రెయిన్ ట్యూమర్కి కారణమని నేరుగా చెప్పలేకపోయినా.. అధికంగా వాడకం మాత్రం ఇతర మార్గాల్లో మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. ఒకవేళ స్క్రీన్ల ముందు ఎక్కువ గంటలు గడడితే మాత్రం..కంటి ఒత్తిడి, తలనొప్పులునిద్ర నాణ్యత తగ్గడంఒత్తిడి, ఆందోళన పెరగడంశారీరక శ్రమ తగ్గడంమానసిక అలసటకానీ స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి, ముఖ్యంగా రాత్రి పొద్దుపోయాక పరికరాలను ఉపయోగించినప్పుడు, మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించి, నిద్ర చక్రాలను కూడా భంగపరచవచ్చు. అందుకే ఆరోగ్య నిపుణులు వినోదం కోసం చూసే స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసుకోవాలని, క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదీఏమైనా..ఈ అధిక డిజిటల్ వినియోగం మానసిక శారీరక ఆరోగ్యంపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ఒత్తిడి కారణమా?కేన్సర్తో సహా అన్ని రోగాలకు ఒత్తిడే కారణమని చెబుతుంటారు. దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరిచి, వాపును పెంచి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినప్పటికీ..ఒత్తిడి మెదడు కణితులకు కారణమవుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవనే అంటున్నారు.అసలు కారణం ?చాలా సందర్భాలలో, మెదడు కణితులకు ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉందన్నారు. అయితే, శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో అనేక ప్రమాద కారకాలను గుర్తించారు. అవేంటంటే..జన్యుపరమైన పరిస్థితులు, వారసత్వంగా వచ్చే సిండ్రోమ్లుఅధిక మోతాదులో అయోనైజింగ్ రేడియేషన్కు గురికావడంవయస్సుకొన్ని రకాల కేన్సర్ల కుటుంబ చరిత్రఅరుదైన సందర్భాల్లో పర్యావరణ విషపదార్థాలుసాధ్యమైనంత వరకు మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ, క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య పోషణతో ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే రెగ్యులర్ చెకప్లతో ముందుగానేబ్రెయిన్ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి చేస్తే..ఈ సమస్య దరిచేరదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. -
పిల్లలను మానసికంగా స్ట్రాంగ్గా మార్చే ‘10-10-10’ రూల్..!
ప్రస్తుతం డిజిటల్ యుగంలో పిల్లలు తల్లిదండ్రులు మధ్య సత్సంబంధాలు సరిగా లేవనే చెప్పాలి. తల్లిదండ్రులిరువురు తమ ఉద్యోగాలతో బిజీ అయిపోవడంతో పిల్లలతో సాన్నిహిత్యంగా ఉండేది తక్కువనే చెప్పాలి. దాంతో వారిలో అభద్రతా భావం ఎక్కువైపోతోంది. పైగా చిన్న చిన్న వాటికే కోపతాపాలు ఎక్కువైపోవడం, చదువులో వెనకబడటం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా అలాంటి పిల్లలు ఏ సమస్యనైనా తేలిగ్గా తీసుకుని అధిగమించే ప్రయత్నం చేయరు. భయంతో వణికిపోవడం లేదా చికాకు, నిరాశ నిస్ప్రుహలతో చెడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అలా కాకుండా చిన్నారులు మానసికంగా బలంగా ఉండి, ప్రతి మాట తల్లిదండ్రులకు నివేదించేలా పెంచాలంటే ఏం చేయాలంటే..ఈ డిజిటల్ యుగంలో పిల్లలు పెద్దలు స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. దాంతో ఇరువురి మధ్య దూరం ఎక్కువైపోతోందని అంటున్నారు. అదీగాక పిల్లలు కూడా ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యి..అభద్రతా భావనికి గురయ్యిపోతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముందుగా వాళ్లలో మానసిక పరిణితి సరైన విధంగా ఉండటం లేదని అందువల్లో చిన్న వయసుకే అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని చెడు మార్గాలకు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. మొదటగా పిల్లలు తల్లిదండ్రలు మధ్య విడదీయరాని అనుబంధం స్ట్రాంగ్గా ఉండాలంటున్నారు. అందుకోసం గంటలు గంటలు.. లేదా రోజుల తరబడి వెచ్చించాల్సిన పనిలేదు. ప్రతిరోజు మీ దినచర్యలో భాగమయ్యేలా ఓ పదినిమిషాలు పిల్లల కోసం కేటాయిస్తే చాలంటున్నారు. అదికూడా పేరెంట్స్ తమ స్క్రీన్ టైంకి జస్ట్ 30 నిమిషాలు వీడ్కోలు పలికేలా ప్లాన్ చేస్తే చాలంటున్నారు. పైగా అది బిజీ షెడ్యూల్కి విరామంలా పిల్లలు హ్యాపీగా ఫీలయ్యేలా ఉంటుందని చెబుతున్నారు. జస్ట్ 30 నిమిషాలా అంటే..ఔను జస్ట్ 30 అంటూ సరికొత్త పేరెంటింగ్ టిప్ ‘10+10+10’ రూల్ని పరిచయం చేస్తున్నారు మానసిక నిపుణులు. అంటే ..పిల్లలు నిద్ర లేచినప్పుడు ఓ పది నిమిషాలు, పిల్లలు పడుకునే టప్పడు ఓ పదినిమిషాలు, అలాగే పాఠాశాల నుంచి తిరిగి రాగానే వారితో కాసేపు పది నిమిషాలు ఎలాంటి పరధ్యానం లేకుండా, ఫోన్తో పనిలేకుండా వాళ్ల కళ్లల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడండి. అది ఇరువురి మధ్య బలమైన అనుబంధాన్ని ఏర్పరిచి పిల్లలు మానసికంగా దృఢంగా ఎదిగేందుకు ఉపకరిస్తుందని అంటున్నారు. ఇది వినడానికి జస్ట్ 30 నిమిషాలైనా అనిపించినా..చాలా ప్రభావవంతంగా ఉంటుందన్నారు. ఇక్కడ చిన్నారులు పేరెంట్స్ ఎంత ప్రేమ పంచారనేది చూడరు..తమ అమ్మనాన్నలు తమకెంత అందుబాటులో ఉన్నారో అర్థమవుతుందంటున్నారు. తాము భద్రంగా ఉన్నామనే భరోసా, ధైర్యం అందిస్తుంది. పైగా పిల్లలకు ఏం జరిగినా, ఏ సమస్య వచ్చినా..నేర్పుగా వ్యవహరించడం ఎలాగే తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. అదీగాక పిల్లలను స్క్రీన్లకు అతుక్కుపోయే వ్యసనం బారినపడకుండా రక్షించేందుకు చక్కటి మందులా కూడా ఉపయోగపడుతుందట. రోజుంతో కొద్దిసేపు పిల్లలను పర్యవేక్షించే తీరు వల్ల వాళ్లు తప్పు చేసే అవకాశం, తప్పుడు మార్గంలో పయనించే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే భావోద్వేగపరంగా బలంగా ఉంటారని అంటున్నారు. అంతేగాదు తమకంటే పేరెంట్స్కి ఏది ఎక్కువ కాదనే నమ్మకం పిల్లల్లో పెంపొందుతుంది కూడా. సో ఇంకెందుకు ఆలస్యం పిల్లల కోసం జస్ట్ 30 నిమిషాలు కేటాయించి చూడండి మరి..(చదవండి: సింగిల్ మదర్గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!) -
సింగిల్ మదర్గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!
ఓ అమ్మ ఒంటరిగా పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కష్టానికి తగ్గట్టుగా కొడుకు ప్రయోజకుడు అయితే ఆ ఆనందం మాటలకందనిది. కానీ అదే కుమారుడు ఆ అమ్మ కష్టాన్ని గుర్తించి గౌరవిస్తే..అంతకంటే ఆ తల్లికి కావల్సిందేముంటుంది. అలాంటి సందర్భమే ఇక్కడే చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అతడు ఒకప్పుడు ఐఐటీ జేఈఈ పరీక్షల్లో విఫలమైన భారతీయ్ టెక్ నిపుణుడు అభిజయ్ అరోరా. తన తల్లికి భావోద్వేగభరితమైన నివాళి అర్పించడంతో నెట్టింట వైరల్గా మారాడు. అతడు ప్రస్తుతం గూగుల్ పనిచేస్తున్నాడు. ఆయన తనతల్లి తనను ప్రయోజకుడిగా తీర్చిదిద్దేందుకు పడ్డ కష్టానికి తగిన గౌరవం దక్కేలా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్లో బిల్బోర్డు భారీ స్క్రీన్పై తనతోపాటు తనతల్లి ఫోటో కనిపించేలా చేశాడు. అభిజయ్ తన తల్లికి వీడియో కాల్ చేసి మరి ఆ భారీ స్క్రీన్ని చూపించి సంతోషం వ్యక్తం చేశాడు. వేల మైళ్ల దూరం నుంచి చూస్తున్న ఆమె ఆ నివాళి తనకే అంకితం చేయబడిందని తెలిసి చిరునవ్వులు చిందించింది. అభిజయ్ అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. "ఆమె తన కలల కన్నా నా కలలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఎన్నో ఎదురుదెబ్బలు, అనిశ్చితిలో తనకు అండగా నిలిచిన మహిళ మా అమ్మ. అందుకే ఆమెను ఇలా గౌరవించా. ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఆమె చేసిన త్యాగాలన్నింటికీ నా నా కృతజ్ఞతను తెలియజేయడానికి, నేను మా అమ్మను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్పై చూపించాను." అని పేర్కొన్నాడు. దాంతోపాటు తన సక్సెస్ జర్నీని కూడా పంచుకున్నాడు.ఐఐటీ ఫెయిల్ నుంచి గూగూల్ ఉద్యోగిగా..హర్యానాలోని పంచకులకు చెందిన అభిజయ్ బాల్యం అంతా తన ఒంటరి తల్లి ఆధ్వర్యంలోనే సాగిందని చెప్పుకొచ్చాడు. తన స్థోమత కారణంగా పాత పుస్తకాలు చదువుకునేవాడినని తెలిపాడు. కానీ తన అమ్మ తనకు మంచి విద్య అందించాలని తపించిపోయేది. అందుకోసం ఏం చేయాలో అన్ని చేసేది. అయితే అత్యంత పోటీతో కూడిన ఐఐటీ జేఈఈలో ఫెయిలై అమ్మని నిరాశపరిచిన క్షణం తనని నిద్రపోవనివ్వకుండా చేసేదని అన్నాడు. ఏనాటికైనా అమ్మని గర్వంగా తలెత్తుకునేలా చేయాలని బలంగా అనుకునేవాడినని చెప్పాడు. అయితే 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వెంటనే ఏ ఉద్యోగ ఆఫర్ తనకు రాలేదని, 2017లో హ్యాకథాన్ గెలుచుకోవడం తన మొదటి గెలుపని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత మళ్లీ 2016 నుంచి 2020 వరకు మొత్తం మూడుసార్లు జీమ్యాట్ పరీక్ష రాసినా.. ఓటమే ఎదురైందని వెల్లడించాడు. కానీ 2021లో తాను దరఖాస్తు చేసుకున్న ప్రతి బిజినెస్ స్కూల్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నాడు. అమెరికాలో కూడా తన కష్టాలు కొనసాగాయి. అక్కడ కూడా అతను ఉద్యోగం కోసం వెతుకుతూనే 90 రోజుల వీసా గడువుతో పోటీ పడాల్సి వచ్చింది. వారానికి దాదాపు వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా..పదే పదే రిజెక్ట్ అవుతూనే ఉండేవి. అయితే ఆ టైంలో తన భార్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగా, తల్లి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇలా లాభం లేదని తనే అవకాశాలు సృష్టించుకోవాలని భావించి అభిజయ్ ఒక AI-ఆధారిత రెజ్యూమె టూల్ను తన నెట్వర్క్ను, గుర్తింపును విస్తరించుకోవడానికి ఆన్లైన్లో కంటెంట్ను పంచుకోవడం ప్రారంభించాడు. ఈ వ్యూహం ఫలించి.. 2022లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. 2025 నాటికి, అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ కోసం గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా చేరాడు. ఆ తర్వాత, అతను సిలికాన్ వ్యాలీ AI నాయకులతో ఒక పాడ్కాస్ట్ను ప్రారంభించి..దాదాపు ఆరు లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించుకున్నాడు. అలా తల్లి పడ్డ త్యాగాలకి, కష్టానికి సరైన అర్థం ఇచ్చేలా మంచి ఉన్నత స్థాయికి చేరుకున్న అభిజిత్ అందుకు కృజ్ఞతలు తెలుపుతూ ఇలా అమ్మకు టైమ్స్ స్క్వేర్ నివాళి అందించాడు. నెటిజన్లు కూడా ఆ తల్లికి ఇది హృదయపూర్వక కృతజ్ఞత, ఆమె గర్వించేలా మరింతగా ఎదగండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | AI, Tech & Careers (@abhijayarora_) (చదవండి: తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..) -
తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..
చాలామంది కెరీర్లో చాలా ఓటములు, నిరాశను ఎదుర్కొన్నవారే. ఆశించినట్లుగా ఉన్నత చదువును అందుకోలేక..నచ్చలేంది చదవలేక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఇతరులు సాధిస్తే..తానొక్కడే ఫెయిల్ అవ్వడం, ప్రతిదాంట్లో నిరాశ, నైరాశ్యం వెంటాడుతుంటే కుంగిపోతాం. కానీ ఇక్కడ ప్రయత్నం ఆగిపోకూడదు. ఈ రోజు ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఏదో ఒకరోజు తప్పక ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటాం అనేందుకు ఈ వ్యక్తే కథే ఉదాహరణ. నెట్టింట అతడి స్టోరీ వైరల్గా మారడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది.వ్యవస్థాపకుడు, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్మీడియా వేదికగా 26 ఏళ్ల శౌర్య శిఖర్ విజయవంతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఇది మొక్కవోని స్థైర్యంతో చివరికి సక్సెస్ని ఒడిసిపట్టుకున్న అందమైన విజయగాథ. ఐదేళ్ల క్రితం వరకు శౌర్య కెరీర్లో సెటిల్ అవ్వలేక చాలా ఇబ్బందిపడ్డ వ్యక్తి. అతను అందరిలా ఐఐటీ-జేఈఈ సాధించాలని కలలుగన్న వ్యక్తి. అయితే అతడు అందులో సక్సెస్ అవ్వలేకపోయాడు. తన తండ్రి ఐఐటీ అయ్యి ఉండి, తాను సాధించలేక పోవడం అతడ్ని మరింత కుంగదీసింది. తీవ్ర నిరాశతో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అదీ చదవలేక నానా పాట్లు పడ్డాడు. ఆ క్రమంలో ఏకంగా 110 కేజీల అధిక బరువుతో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. కాలేజ్లో చదువుతున్నప్పుడే శౌర్య అంకుర్ వారికూ బృందంలో చేరాడు. కానీ శౌర్య నిరాశ, కెరీర్లో అనిశ్చితి, వ్యక్తిగత పోరాటాల మధ్య చిక్కుకుని తనకు భవిష్యత్తు అనేది ఉందా అని భయపడుతుండేవాడు. చెప్పాలంటే తను ఎందుకు పనిరానని భావంతో ఉండేవాడు. తనకెంతో ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్సు చేయలేకపోయానని, బీబీఏ చేస్తున్న ఫూల్ని అని బాగా బాధపడేవాడు. ఇక ఎప్పటికీ తన లైఫ్ మంచిగా ఉండదేమో అని దిగులుతో ఉండేవాడు. కట్చేస్తే..సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో శౌర్య మంచి కెరీర్ను నిర్మిచుకుని నెలకు లక్షల్లో జీతం ఆర్చించే స్థాయికి చేరుకున్నాడు. అంతేగాదు తన తండ్రి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఏకంగా రూ. 55 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారుని కొనిచ్చాడు. విలాసవంతమైన కారు కోసం చెల్లించిన డౌన్ పేమెంట్ శౌర్య నికర ఆస్తిలో 5% కంటే తక్కువగా ఉందని, అలాగే ఈఎంఐ అతని నెలవారీ సంపాదనలో 7% కంటే తక్కువగా ఉంటుందని వారికూ వెల్లడించారు. అతనిలో వచ్చిన మార్పు కేవలం డబ్బుకే పరిమితం కాలేదు, ఏళ్లు గడిచే కొద్దీ..శౌర్య ఆరోగ్యం, ఫిట్నెస్పై దృష్టి సారించి ఫిట్గా మారాడు. ఇక్కడ శౌర్య కథ విలాసవంతమైన కారు, సంపద గురించి చెప్పడం లేదు. ఎదురు దెబ్బలు ఒక వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశించవు, జీవితంలో ఒక దశ దారుణమైన వైఫల్యం ఎదుర్కొని ఉండొచ్చు. కానీ అదే క్రమంగా విభిన్నమైన మార్గానికి నాంది పలికి ఉన్నతమైన స్థానానికి చేరుకునేలా చేస్తుంది అనేందుకు శౌర్యనే ఉదాహరణ. కానీ ఇక్కడ జీవితంలో ఎదురయ్యే గడ్డుపరిస్థితులకు చేతులెత్తేయకుండా ముందుకు సాగడమే జీవితం అని నమ్మి..ప్రయత్నం ఆపకూడదనేది గ్రహించాలని అంటున్నారు అంకుర్ వారికూ. అలాంటి స్థితిలో ధైర్యంగా ముందుకు సాగినవాడు తప్పకుండా ఏదో ఒకనాటికి జీవితం మంచిగా సెటిల్ అవుతుందని అన్నారు. ఈ స్టోరీ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..అత్యంత నిరాశ నిస్ప్రుహల మధ్య ఆశావాదం హాస్యస్పదంగా అనిపించినా.. ఇక్కడ శౌర్య కార్యాచరణలో నిమగ్నమే ముందుకు సాగాలనే దృక్పథాన్ని ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా..ముందుకు సాగే వారే విజేతలు అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు.(చదవండి: చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..) -
నీలి అలల మధ్య పచ్చని కల..
కొన్ని ప్రదేశాలు చూడటానికి వెళ్లాలి అనుకుంటాం. కొన్ని ప్రదేశాలు మాత్రం మనల్ని రారమ్మని పిలుస్తాయి. అలాంటి కోవలోకి చెందినదే ‘రాజా అంపట్’. ఇండోనేషియాలోని సౌత్వెస్ట్ పాపువాప్రాంతంలో ఉన్న ఈ ‘రాజా అంపట్’ అనేప్రాంతం వేలాది చిన్న ద్వీపాల సమూహం. ప్రకృతి తన అందం మొత్తం ఒక్కసారి చూపించాలి అనుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ కనులారా వీక్షించవచ్చు. పచ్చని అడవులు, నీలి సముద్రం, తెల్లని ఇసుక తీరాలు కలిసి ఒక చిత్రకారుడి కాన్వాస్లా కనిపిస్తాయి. ప్రతి ప్రయాణంలో ఒక కొత్త దృశ్యం, ప్రతి అలలో ఒక కొత్త అనుభవం నిండి ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలు..రాజా అంపట్ అంటే ఇండోనేషియా భాషలో నలుగురు రాజులు అని అర్థం.ఇది ఇండోనేషియాలోని సౌత్వెస్ట్ పాపువాప్రాంతంలో ఉంటుంది.ఈప్రాంతం మొత్తం వేలాది చిన్న ద్వీపాలతో కలిసి ఉంటుంది.ప్రకృతి, సముద్ర జీవ వైవిధ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.సముద్రం రంగుల మార్పులు ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన దృశ్యాల్లో ఒకటి.రాజా అంపట్ చేరగానే మనకు ముందు కనిపించేది విశాల సముద్రం. అక్కడి నీటి రంగుల్లో ఆకాశంలోని మబ్బుల కదలికలను స్పష్టంగా చూడవచ్చు. కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల టార్కాయిస్, మరికొన్ని చోట్ల గాఢమైన నీలం. ద్వీపాల మధ్య వెళ్తున్న బోట్ ప్రయాణం ఒక సినిమా సీ¯Œ లా అనిపిస్తుంది. చుట్టూ చిన్న చిన్న లైమ్స్టోన్ ద్వీపాలు నీటి నుంచి వెలుస్తున్నట్టు ఉంటాయి. వాటిని చూస్తుంటే ప్రకృతి. సముద్రం మధ్యలో తన సంతకం పెట్టినట్టు అనిపిస్తుంది. అలలు మెల్లిగా బోట్ని తాకుతుంటే సమయం కూడా అక్కడ నిలిచిపోయిందేమో అనిపిస్తుంది.సందర్శనీయ ప్రదేశాలు..రాజా అంపట్లో ప్రతి ద్వీపం ఒక కొత్త కథ చెబుతుంది. ప్లేనెమో వ్యూ పాయింట్ నుంచి చూస్తే పచ్చని ద్వీపాలు నీలి సముద్రంపై విరిసిన ఆకుల్లా కనిపిస్తాయి. వాయాగ్ అనేప్రాంతంలో సముద్రం, ద్వీపాల మధ్య కనిపించే దృశ్యం ఒక కలలా ఉంటుంది. మిసూల్ దగ్గర నీటి కింద ఉన్న పగడపు దిబ్బల ప్రపంచం మరింత ఆకర్షిస్తుంది. సముద్రంపై చూస్తున్నప్పుడు ఒక అందం, నీటి కింద చూస్తున్నప్పుడు మరొక అందం కనిపిస్తుంది. కొన్ని చోట్ల సముద్రం అంతా స్పష్టంగా ఉంటుంది కాబట్టి బోట్ నుంచి కూడా నీటి కింద లైఫ్ ఎలా ఉందో కనిపిస్తుంది.ఎక్కడ ఉండాలి?రాజా అంపట్లో ఉండటం అంటే కేవలం రూమ్కి పరిమితం అవ్వడం మాత్రమే కాదు. సముద్రం దగ్గర కట్టిన వుడెన్ కాటేజీలు, నీటిపై నిలబెట్టిన విల్లాలు, అడవి మధ్య ఉన్న ఎకో రిసార్ట్స్ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. ప్రతి ఉదయం అలల శబ్దాలతో మేలుకోవడం, సాయంత్రం సముద్రంపై పడిన సూర్యాస్తమయం చూస్తూ కూర్చోవడం అక్కడి రోజుల్లో భాగం అయిపోతుంది. నగర హడావిడి నుంచి దూరంగా ప్రకృతి మధ్య గడిపిన సమయం మనసుకి ఒక కొత్త ప్రశాంతతను ఇస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలైతే ముందు ఇండోనేషియా రాజధాని జకార్తా లేదా బాలీ చేరుతారు. అక్కడి నుంచి పాపువాప్రాంతం వైపు విమానం వెళుతుంది. ప్రయాణంలో నగర దృశ్యాలు తగ్గి సముద్రం, ద్వీపాల ప్రపంచం మొదలవుతుంది.విజయవాడ నుంచి రాజా అంపట్ వెళ్లాలి అనుకుంటే హైదరాబాద్ లేదా చెన్నై నుంచి వెళ్లవచ్చు. ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో సముద్రం మధ్య చిన్న ఎయిర్పోర్ట్ చేరిన అనుభవమే యాత్రలో ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగులుతుంది. ఆకాశం నుంచి కనిపించే ద్వీపాల దృశ్యం రాజా అంపట్ అందాన్ని ముందుగానే పరిచయం చేస్తుంది.ఏం చూడాలి?ఉదయం వేళలో సముద్రంపై పడిన సూర్యకిరణాలు రాజా అంపట్ని మరింత వెలుగులతో నింపేస్తాయి. బోట్లో ద్వీపాల మధ్య తిరుగుతుంటే ప్రతి మలుపు దగ్గర కొత్త దృశ్యం కనిపిస్తుంది. కొన్ని చోట్ల పక్షుల గానం వినిపిస్తుంది. మరికొన్ని చోట్ల సముద్రం శబ్దం మాత్రమే ఉంటుంది. నీటి కింద కనిపించే కోరల్ గార్డెన్స్, రంగురంగుల చేపలు, నిశ్చలంగా తిరిగే సముద్ర జీవులు అక్కడ ప్రకృతి వైభవాన్ని మరింత దగ్గర నుంచి చూపిస్తాయి. సూర్యాస్తమయం సమయంలో సముద్రంపై విరిసిన బంగారు వెలుగు ప్రయాణంలో మర్చిపోలేని క్షణంగా మిగిలిపోతుంది.ఏం తినాలి?ఇండోనేషియా రుచులను ఎంజాయ్ చేయడానికి రాజా అంపట్ మంచి చాయిస్ అని చెప్పవచ్చు. తాజా సీఫుడ్ సముద్రం దగ్గర కూర్చుని ఆస్వాదించే అనుభవం ప్రత్యేకం. కొబ్బరి ఫ్లేవర్స్, లోకల్ స్పైసెస్, సముద్రపు రుచులు కలిసిన భోజనం ప్రయాణంలో భాగం అయిపోతుంది. సాయంత్రం వేళలో సముద్రం ముందు కూర్చుని లోకల్ ఫిష్ కర్రీ, గ్రిల్డ్ సీఫుడ్ లేదా ఇండోనేషియన్ డిషెస్ ఆరగించడం అక్కడి జీవన శైలిని దగ్గరగా అనుభవించిన అనుభూతిని ఇస్తుంది.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి రాజా అంపట్కి ఐదు రోజుల యాత్ర కోసం బడ్జెట్ రూ.90 వేల నుంచి రూ.1 లక్షా 20 వేల మధ్య ఉంటుంది. స్టాండర్డ్ కంఫర్ట్ యాత్ర రూ.1 లక్షా 40 వేల నుంచి రూ.2 లక్షల వరకు చేరవచ్చు.ప్రీమియం రిసార్టులు, ఎక్స్క్లూసివ్ ఐలాండ్ ఎక్స్పీరియెన్స్ యాడ్ చేస్తే రూ.2 లక్షల 50 వేల వరకు ఉండవచ్చు.స్టే చార్జీలు ప్రతి రాత్రికి రూ.4 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటాయి. ఫుడ్ ఖర్చు రోజుకు సాధారణంగా రూ.1,000 నుంచి రూ.3,000 మధ్య ఉంటుంది. ఐలాండ్ హాపింగ్ బోట్ ఎక్స్పీరియెన్స్ మెరైన్ ఎక్స్΄్లోరేషన్ యాక్టివిటీస్ ఈ యాత్రలో ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతాయి.ఇండోనేషియాకి భారతీయ ప్రయాణికులకు వీసా అవసరం ఉంటుంది. ట్రావెల్ ప్లాన్ ను బట్టి లేటెస్ట్ వీసా గైడ్లైన్స్ని ముందుగా పరిశీలించడం – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..
దక్షిణ భారతదేశంలో చాలామందికి చాయ్ తోపాటు ఏదో ఒకటి ముంచుకునే తినే అలవాటు ఉంది. అలాంటి వాటిలో ఈ చాయ్ ఇడ్లీ కలిపి తినడం అనేది కూడా ఒకటి. అయితే ఇలా తినొచ్చా అంటే..ఇటీవల సోషల్ మీడియాలో చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్టాపిక్గా మారి చర్చలకు తెరతీసింది. ఆ పోస్ట్పై సీనియర్ కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ..ఆయన ఆ పోస్ట్లో షేర్ చేసిన ఫోటోలో.. చాయ్ ఇడ్లీ కనిపించిన విధం గురించి మాట్లాడారు. ఆ చిత్రంలో ఇడ్లీ పసుపు వర్ణంలో చాలా గట్టిగా ఉన్నట్లుగా కనిపిస్తుందన్నారు. "బహుశా అందుకే ఇలా చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటున్నారేమె. మాములుగా ఆ ఇడ్లీని తినడం కష్టం..ఇలా గట్టిదైతే వేడివేడి చాయ్లో ముంచుకుంటే సులభంగా నోటిలో కరిగిపోతుంది. అందుకు ఇలా అభిప్రాయ పడి ఉండొచ్చు. కానీ ఇడ్లీ అనేది మల్లెపువ్వుతా స్పాంజ్లా ఉండాలి. అలాంటి ఇడ్డీని కచ్చితంగా చాయ్లో ముంచి తినడం అంత ఈజీ కాదు. ఆయన చివరికి చెప్పేందేంటంటే..ఆ రెండింటిని వేర్వేరుగా ఆస్వాదించడమే మంచిదన్నారు." ఇడ్లీని చాయ్లో ముంచడం కంటే ఇడ్లీ తినేశాక చాయ్ తీసుకుంటే బెటర్ అని అన్నారు. తాను బ్రేక్ఫాస్ట్ లేదా భోజనం చేశాకే టీ తాగడానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తనకు చాయ్ అంటే మహా ఇష్టమని, ఇక అల్పాహారంలో ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తింటానని అన్నారు. నిపుణులు ఏం అంటున్నారంటే..టీ తాగేటప్పుడు తినే కొన్ని రకాల స్నాక్స్, ఆహారాల కాంబినేషన్ మంచిదికాదంటున్నారు. ముఖ్యంగా ఇడ్లీలు, బిస్కెట్ల కాంబినేషన్తో చాయ్ తాగడం అస్సలు మంచిది కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా టీ కాంబినేషన్తో తింటే అరుగుదల,జీర్ణాశయం సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేగాదు కడుపు ఉబ్బరం, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. పైగా మెటబాలిజం కూడా నెమ్మదించి అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇవే కాదు మరే ఇతర పోషకమైన వాటిని కూడా చాయ్ కాంబినేషన్తో వద్దనే అంటున్నారు. దానివల్ల ఆయా పోషకాలు శరీరానికి సరిగా అందవని అంటున్నారు. అందువల్ల కాస్త విరామం ఇచ్చి వేర్వేరుగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.Oh, I see what you're doing here! Aside from provoking me, that is.I have to be honest: that idli looks a bit too solid and dense for my liking. And the discolouration in the pic is not very appetising. There’s something about a perfectly soft, snowy-white, fluffy idli that… https://t.co/O9GsGAGPa6— Shashi Tharoor (@ShashiTharoor) June 7, 2026 (చదవండి: 145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..) -
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
బరువు తగ్గడం అంటే కేలరీల లోటు, జిమ్లో ఎక్కువ గంటలు గడపడం వంటివి మాత్రమే అనుకుంటాం. కానీ దాంతోపాటు ఇతర మార్పులు కూడా తప్పనిసరి. ముఖ్యంగా జీవనశైలిలోని ఆహారపు అలవాట్లే అత్యంత ప్రధానం. తీసుకునే ఆహారం పోషకవంతమైనది, బరువు అదుపులో ఉంచేది తీసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు అని అంటోంది ఈ ముంబై ఇన్ఫ్లుయెన్సర్. ఆమె ఒకప్పుడు ఏకంగా 145 కేజీల పైనే బరువు ఉండేదాన్ని అని తెలిపింది. ఇప్పుడు ఏకంగా 55 కేజీల బరువు తగ్గి నాజుగ్గా మారానని, అందుకోసం ఆ ఏడు ఆహారాలను తీసుకుంటున్నానంటూ తన వెయిట్లాస్ సీక్రెట్ని వెల్లడించారామె. మరి ఆ ఆహారాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.ముంబై ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ డాలీ సుమారు 145 నుంచి 90 కేజీ బరువు తగ్గేందుకు చేసిన ఆ ఏడు ఆహార మార్పుల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ పోస్ట్లో తాను చేసిన ఈ ఆహారపు మార్పులు అదనపు కేలరీలను తగ్గించి..వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడిందని నమ్మకంగా చెబుతోందామె. మరి అవేంటంటే..చక్కెర పానీయాలుడాలీ చక్కెర పానీయాలను పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు శరీరంలోకి చేరి, బరువు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దానికి బదులుగా, తాను నిమ్మరసం, కొబ్బరి నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలను తీసుకున్నట్లు డాలీ వెల్లడించింది. తెల్ల రొట్టె(మైదాతో చేసేవి)శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, అతిగా తినడానికి దారితీస్తుంది. కాబట్లి ఆమె తెల్ల రొట్టెను పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ గోధుమ రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఓట్స్ను తీసుకోవడం ప్రారంభించింది.చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్వాటిలో ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల ఆమె చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం మానేసినట్లు పేర్కొంది. దానికి బదులుగా ఆమె మితంగా వేయించిన మఖానా, వేయించిన శనగలు, నట్స్ను ఎంచుకుంది.ఫాస్ట్ ఫుడ్ఫాస్ట్ ఫుడ్లో కొవ్వు, ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల దానిని పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా డాలీ పనీర్ శాండ్విచ్లు, గోధుమ కూరగాయల ర్యాప్లు లేదా ఇంట్లో తయారుచేసిన భోజనం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుందామె.ఐస్ క్రీమ్ఐస్ క్రీమ్లో తరచుగా చక్కెర,కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిని తన ఆహారం నుంచి తొలగించింది. గ్రీక్ యోగర్ట్, పండ్లు, ఫ్రోజెన్ బనానా స్మూతీలు లేదా చిన్న మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఆమె తన కోరికలను నియంత్రించుకుంది.మద్యంమద్యపానం డీహైడ్రేషన్కు, ముఖం ఉబ్బడానికి కారణమవుతుందని అందుకే తాను దానిని పూర్తిగా మానేసినట్లు తెలిపింది డాలీ. నిమ్మరసం కలిపిన సోడా నీరు, చక్కెర కలపని తాజా పండ్ల రసం, డిటాక్స్ వాటర్ ఆమె ఇష్టపడే ప్రత్యామ్నాయాలుగా మారాయి.ప్రాసెస్ చేసిన ఆహారాలుప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా సోడియం సంకలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని మానేశారు. దానికి బదులుగా, ఆమె గుడ్లు, టోఫు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్ వంటి సహజమైన ఆహార వనరులపై దృష్టి సారించింది.పైన చెప్పిన ఈ ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గించి.. ఎక్కువ నీరు తీసుకుంటూ.. బాగా నిద్రపోండి. అలాగే మీరు నిర్దేశించుకున్న డైట్ క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోమని సూచిస్తోంది. ఇలా చేస్తే కచ్చితంగా శరీరం వేగంగా నాజూకుగా మారుతుందంటూ తన పోస్ట్ని ముగించింది డాలీ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఒక్క ఏడాదిలో 35 కిలోలు..!ఆ ఆరుబోరింగ్ అలవాట్లు..) -
క్యూఆర్ కోడ్ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా?
పిల్లలూ! నేడు చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ తప్పనిసరి అయిపోయింది. అసలు ఆ క్యూఆర్ కోడ్ అంటే ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇది చదివేయండి. క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్. అంటే త్వరగా స్పందించడం అని అర్థం. మనం ఏ క్యూఆర్ కోడ్ను గమనించినా, దాని మూడు మూలల్లో పెద్ద నల్లటి బాక్సులు కనిపిస్తాయి. ఇవి డిజైన్ కోసం పెట్టినవి కావు. మనం మొబైల్ ఫోన్ ను ఏ యాంగిల్లో పెట్టి స్కాన్ చేసినా, కెమెరా ఆ కోడ్ను వెంటనే గుర్తించడానికి ఈ మూడు బాక్సులు ఎంతగానో సహాయపడతాయి.అలాగే క్యూఆర్ కోడ్ మధ్యలో వేల కొద్దీ చిన్న చిన్న నల్లటి, తెల్లటి చుక్కలు ఉంటాయి. ఆ కోడ్ను స్కాన్ చేసినప్పుడు, ఆ నలుపు–తెలుపు చుక్కలను ‘1’లు ‘0’లుగా మన ఫోన్ కెమెరా చదువుతుంది. దానినే బైనరీ డేటా అని పిలుస్తారు. అలా చదివిన సమాచారాన్ని క్షణాల వ్యవధిలో మనకు అవసరమైన డేటాగా లేదా చెల్లింపు లింక్గా మార్చేస్తుంది.ఈ అద్భుతమైన సాంకేతికతను మొదటగా 1994లో జపాన్ లోని ఒక ప్రముఖ కంపెనీ కనిపెట్టింది. తమ కార్ల విడిభాగాలను ట్రాక్ చేయడం కోసం ఈ క్యూఆర్ కోడ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. అలా వచ్చిన ఈ సాంకేతికతనేడు ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల డిజిటల్ ట్రాన్సక్షన్లలో, వ్యాపారాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. -
జస్ట్ ఏడాదికే 35 కిలోలు..! ఆ ఆరు బోరింగ్ అలవాట్లు..
బరువు తగ్గే జర్నీలు ఇప్పటి వరకు వర్కౌట్లు, పక్కా ప్లాన్తో నిలకడగ చేసి.. స్లిమ్గా మారిన వారి గురించి విన్నాం. అలా కాకుండా ఈ మహిళ వెరైటీగా రోజువారీ జీవితంలో భాగమైన బోరింగ్ అలవాట్లతో బరువు తగ్గింగిదట. సంక్లిష్టమైన డైట్, వర్కౌట్లు లేకుండా.. సింపుల్గా చేసేవి, మన రోజువారి కొన్ని రకాల అలవాట్లకే దూరంగా ఉంటే బరువు తగ్గడం సులభం అంటోంది ఆ మహిళ. మరి అదెలాగో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!షావీ అనే మహిళ తాను కేవలం 12 నెలల్లో 35 కిలోలు తగ్గానంటూ..తనకు ఉపకరించిన ఆరు ప్రభావవంతమైన జీవనశైలి మార్పులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన రోజువారీ క్రమశిక్షణలో పాతుకుపోయిన సరళమైన, స్థిరమైన అలవాట్లు తన బరువు తగ్గే ప్రయాణంలో ఎలా కీలక పాత్ర పోషించాయో సవివరంగా వెల్లడించారామె.డైనింగ్ టేబుల్ వద్ద కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేయకపోవడంఇది తాను బరువు తగ్గే దశలో చేసిన తాత్కాలిక మార్పుగా షావీ పేర్కొంది. కుటుంబంతో ఉంటే తన డైట్ గురించి చేసే వ్యాఖ్యలు బరువు తగ్గడంపై ఫోకస్ని దూరం చేస్తాయని ఈ మార్పు చేసినట్లు వివరించారామె. అందుకే తాను వారితో కలిసి తినడం మానేశానని అన్నారామె. తనకు, ఇది కుటుంబం నుంచి భావోద్వేగపరంగా దూరం కావడం గురించి కాదని పేర్కొంది.రాత్రి భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయడంఆ రోజుకు తినడం అధికారికంగా ముగిసిందని తన మెదడుకు అది ఒక అధికారిక 'షట్ డౌన్' లాంటిది," అని ఆమె అంటోంది. నియంత్రణ కోల్పోయి, మళ్ళీ తినేసిన రోజుల్లో, తాను మరోసారి బ్రష్ చేసుకునేదాన్నని షావీ చెబుతుంది. ఆ చిన్న చర్య తన మనసులో ఒక హద్దును సృష్టించి.. వంటగది క్లోజ్ అయ్యిందని చెబుతుండేదని అన్నారామె.స్క్రీన్ లేకుండా ఎక్కువగా తినే అలవాటును పాటించడంఇలా చేస్తే ఎక్కువగా తినం, పైగా తింటున్న ఆహారంపై అటెన్షన్ ఉంటుందని అంటోంది. ఎప్పుడైనా ఎక్కువగా తినాలనిపిస్తే, ఏ స్క్రీన్ లేకుండానే పూర్తి చేస్తానని అంటోంది.ఎక్కువగా తినడాన్ని రేపటికి వాయిదా వేయడంనియంత్రణకు బదులుగా, పోస్ట్పోన్ చేయడం ఒక సాధనంగా మారుతుంది. ‘నేను దీన్ని రేపు తినగలను’ అని చెప్పుకుంటూ ఉంటే.. ఎప్పుడోకప్పుడూ తింటాననే సంతృప్తి అతిగా తినడాన్ని నియంత్రణలో ఉంచుతుందని అంటున్నారు.ఫ్రిజ్లో ప్రోటీన్ను కనిపించేలా ఉంచడంతినే ఆహారం కంటికి కనిపించే చేరువలో పెడితే..అవి తీసుకోవాలనే స్పృహ ఉంటుందని అంటోంది. అందుకే వేయించిన శనగలు, సోయా, పనీర్, ఉడికించిన గుడ్లు, చీజ్, ఇవి ఎప్పుడూ కంటికి కనిపించేలా పెట్టుకునేదాన్ని అని చెబుతున్నారామె.ఫుడ్ రీల్స్కి దూరంగా ఉండటం..కంటెంట్ వినియోగానికి, తినాలనే కోరికలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని వివరించింది షావీ. రోజంతా బ్రెయిన్కి ఆహార సంబంధిత కంటెంట్ను అందించడం ఆపేసినప్పుడు, తినాలనే కోరికలు చాలా వరకు తగ్గుతాయని అంటోంది. మనం ఏం చూస్తామో అదే తినాలని అనుకుంటామని అని చెబుతోంది షావీ. వినడానికి విచిత్రంగా ఉన్నా..కష్టంగా లేకుండా ఆచరణాత్మకంగా చిన్నపాటి మార్పులతోనే సులభంగా బరువు తగ్గే బెస్ట్ రెమిడ్స్లా ఉన్నాయి కదూ. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి. View this post on Instagram A post shared by Shavy | 35 kgs off (@shavyjain7) (చదవండి: ఆత్మవిశ్వాసం ఉంటే..అద్భుతం చేయొచ్చు!: మిస్ యూనివర్స్ కేరళ) -
లుక్స్, భాష పరంగా..అభద్రతా భావంతో ఉండేదాన్ని..!
కజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ కేరళ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే ఈ టైటిల్ను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె అరుదైన రికార్డును సృష్టించారు. అయితే ఆమెను ఓ మీడియా ఇంటర్వ్యూలో ఈ గెలుపు ఎలా సాధ్యమైందని ప్రశ్నించగా..అందుకు కజియా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారామె. మిస్ యూనివర్స్ ఇండియాకు సిద్ధమవుతున్న ఈ 19 ఏళ్ల యువతి..తన లుక్స్, సంభాషణ పరంగా అభద్రతా భావంతో ఉండేదాన్ని అని చెప్పింది. దాంతో ఆత్మవిశ్వాసంగా ఉండలేకపోయాదాన్ని అని వాపోయారు. అయితే దీన్ని అధిగమించడం రాత్రికి రాత్రే జరిగిపోలేదన్నారు. ఇలా కాదు మొదట తాను కాన్ఫిడెంట్ని డెవలప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాని అన్నారామె. అందుకోసం తనపై తాను ఫోకస్ పెట్టడం ప్రారంభించానని అన్నారామె. అంటే నా సంభాషణ నైపుణ్యాలు, వ్యక్తిత్వం, రూపం ఇలా మొత్తం తనపై తాను ఎక్కువ దృష్టి పెట్టి మెరుగయ్యేలా చేసుకున్నానని అన్నారు. అయితే తనకు బాగా హెల్ప్ అయిన విషయం ఏంటంటే..సాధించే వరకు ఆపొద్దు అనే సూత్రంం. ఈ భూమ్మీద నేనే అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిని అని తన బ్రెయిన్ని పూర్తిగా నమ్మించి వేదికలపైకి కాన్ఫిడెన్స్గా నడవగలిగానని అన్నారు. ఇక తనకు ఈ అందాల పోటీలపై ఆసక్తి మొదలైంది..2021లో భారతదేశం మిస్ యూనివర్స్ గెలవడాన్ని చూసిన తర్వాతేనని అన్నారామె. అంతవరకు అందాల పోటీల గురించి పెద్దగా తెలియదని అన్నారు. భారత్ ఆ పోటీల్ల గెలవడంతో తనలో ఏదో స్ఫూర్తి రగిలిందన్నారు. అదీగాక హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021ను గెలుచుకోవడంతో భారత్ 21 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లైందని పేర్కొంది. అంతకుముందు 1994లో సుష్మితా సేన్, 2000లో లారా దత్తా ఈ టైటిల్ని గెలుచుకున్నారు. అయితే చాలామంది ఈ అందాల పోటీలను కేవలం శారీరక సౌందర్య ప్రదర్శనగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అయితే ఈ అందాల పోటీలు గెలిచినా, గెలవకపోయినా..మీ గొంతుని కనుగొనడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వంటివి ఎన్నో నేర్పిస్తుందన్నారు. పైగా ఈ జర్నీలోని ఎంతో మెరుగవుతాం అంటూ తన సంభాషణను ముగించారామె.(చదవండి: అంతా అయిపోయాక కాదు..ముందుగా తెలుసుకోవాల్సిన ఆరోగ్య పాఠాలు..!)


