Lifestyle
-
మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..
కొన్ని రకాల మానసిక రుగ్మతలు చాలా భయానకంగా ఉంటాయి. ఓ పట్టాన వాటికి ఉపశమనం దొరకదు. మనిషి సంకల్పబలానికే పరీక్ష పెట్టేలా ఉంటాయి ఆ వ్యాధులు. కొందరు జయిస్తారు. మరికొందరు ఆ వ్యాధి పెట్టే బాధకు తలవొగ్గక తప్పని పరిస్థితి ఎదురవ్వుతుంది. అలాంటి దుస్థితిలోనే ఉన్నాడు ఈ 28 ఏళ్ల వ్యక్తి. ఇన్స్టాగ్రామ్ వేదిక తన వ్యథను పంచుకున్నాడు.బ్రిటన్ సంతతి ఘనా కళాకారుడు జోసెఫ్ అవువా-డార్కో మానసిక అనారోగ్యంతో జీవించడం కంటే ముగించేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చేశాడు. అతడు మెదడుకి సంబంధించిన బైపోలార్ డిజార్డర్తో బాధపతున్నాడు. చట్టబద్ధంగా జీవితాన్ని ముగించేసేలా నెదర్లాండ్ దేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు ఇన్స్టా వేదికగా తెలిపాడు. అనాయస మరణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అనుమతి రావడానికి సుమారు నాలుగేళ్లు పడుతుందని అన్నాడు. ఎలాగో ఇంతటి జఠిలమైన నిర్ణయం తీసుకున్నాను కదా అని.. 'ది లాస్ట్ సప్పర్ ప్రాజెక్ట్'ను ప్రారంభించాడు. ఏంటంటే ఇది..తన చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతో అపరిచితులతో కనెక్ట్ అయ్యి వారితో విందులు ఆస్వాదించాలనేది అతడి కోరిక. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్త పర్యటనలకు పయనమయ్యాడు కూడా. ఇప్పటి వరకు అతడు పారిస్, మిలన్, బ్రస్సెల్స్, బెర్లిన్లలో 57 విందులను ఆస్వాదించాడు. వచ్చే ఏడాదికి 120 విందులతో కూడిన టూర్స్కి ప్లాన్ చేశాడు. దీనివల్ల తాను ఇతరులతో కనెక్ట్ అవ్వడమేగాక తనకు ఓ రుగ్మత ఉందనే విషయం మర్చిపోయి ఆనందంగా గడపగలుగుతున్నాడట. మనల్ని ప్రేమించేవారు సంతోషంగా ఉండేలా వైద్య సహాయంతో పొందే ఈ అనాయస మరణం అహింసాయుతమైనదేనని చెబుతున్నాడు జోసఫ్. చివరగా తన బైపోలార్ సమస్య ఎంత తీవ్రతరమైనదో వివరించాడు. పొద్దుపొద్దున్నే లేవడమే ఓ నరకంలా ఉంటుందని, ప్రతి ఉదయం ఓ నరకమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగేళ్లకు పైగా బాగా ఆలోచించే ఇక ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించాడు.. జోసఫ్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అతడి వ్యథను విన్న నెటిజన్లు అతని నిర్ణయాన్ని కొందరు గౌరవించగా, మరికొందరు నిర్ణయం మార్చుకో బ్రదర్..తమతో విందు షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం, బైపోలార్ డిజార్డర్ అనేది మెదడుకి సంబంధించిన మానిక్-డిప్రెసివ్ అనారోగ్యం. ఇది మానసిక స్థితి, శక్తి స్థాయిలలో తీవ్ర మార్పులకు కారణమవుతుంది. ఏటా చాలామంది ఈ రుగ్మత బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Joseph “Nana Kwame” Awuah-Darko 🇬🇭 (@okuntakinte) (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..! వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?
ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాల తోపాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు, అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో అన్ని రుతువుల్లో తయారు కావు. ఇచ్చి పుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు సేవలు భారత దేశానికీ అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి కాబట్టి ఈ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్ తీసుకుంటాం. అదే టోకెన్ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్ఫోను విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకొనే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తుమార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం.అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30 వేల రూపాయలకు అమ్మితే అమెరికాలో 500 డాలర్లు పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే 500 డాలర్ల విలువ 30 వేల రూపాయల విలువ సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలరుకు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపాదేశాలు కూడబలుక్కుని తమదేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా ’యూరో’ను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు. (చదవండి: ప్రపంచ శాంతి కోసం ఆ పాప ఏం చేసిందంటే.. ) -
ప్రపంచ శాంతి కోసం ఆ పాప ఏం చేసిందో తెలుసా?
‘నేను బతుకుతానా అమ్మా?‘ అని అమాయకంగా అడిగింది సడాకో. తల్లి ఏమీ చెప్పలేక పక్కకు వెళ్లి ఏడ్చింది. సడాకోను ఆసుపత్రిలో ఉంచి రకరకాల చికిత్సలు అందిస్తున్నారు. 12 ఏళ్ల సడాకోది జపాన్ దేశం. ఆటపాటల్లో, చదువులో ఉత్సాహంగా ఉంటుంది. అలాంటి పిల్ల ఒక రోజు ఉన్నట్టుండి అనారోగ్యం పాలైంది. డాక్టర్లు తనకు రకరకాల పరీక్షలు చేశారు. పిడుగు లాంటి వార్త తెలిసింది. ఆ చిన్నారి పాపకు లుకేమియా. అంటే కేన్సర్. తనకీ పరిస్థితి ఎందుకు వచ్చిందని సడాకో తల్లిని అడిగింది.‘అణుబాంబు వల్ల’ అంది తల్లి. 1945 ఆగస్టులో అమెరికా జపాన్ మీద అణుబాంబు వేసే సమయానికి సడాకో వయసు రెండేళ్లు. సరిగ్గా బాంబు వేసిన ప్రదేశానికి మైలు దూరంలోనే సడాకో కుటుంబం ఉంటోంది. ఆ బాంబు దాడి నుంచి ఆ కుటుంబం ఎలాగో తప్పించుకుని బతికింది. కానీ అణుధార్మికత వల్ల సడాకోకు క్యాన్సర్ వచ్చింది.‘అలాంటి బాంబును ఎందుకు వేశారు? ఎందుకు ఇంత నష్టం కలిగించారు?‘ అని అడిగింది సడాకో. తల్లి దగ్గర సమాధానం లేదు. ఏమని చెప్పగలదు? దేశాల మధ్య వైరంలో సామాన్యులే బాధితులు అని ఆ చిన్నారికి ఎలా అర్థం చేయించాలి? ‘ఇకపై ఎక్కడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?‘ అని మరో ప్రశ్న వేసింది సడాకో. ‘ప్రపంచంలో శాంతి నెలకొనాలి‘ అంది తల్లి.’అవును! శాంతి నెలకొనాలి. ప్రపంచంలో అందరూ హాయిగా ఉండాలి. ఎవరికీ ఏ కష్టం రాకుండా ఉండాలి’ అని సడాకో నిర్ణయించుకుంది. కానీ తాను ఏం చేయగలుగుతుంది? తట్టిందో ఆలోచన.జపాన్ దేశ నమ్మకం ప్రకారం కాగితంతో కొంగు బొమ్మలు చేసి దేవుణ్ని ప్రార్థిస్తే అనుకున్నది నెరవేరుతుంది. వెంటనే ఆస్పత్రి మంచం మీదే సడాకో కాగితాలతో కొంగ బొమ్మలు చేయడం ప్రారంభించింది. ఒకటి.. రెండు.. మూడు.. చేతులు నొప్పి పుట్టేవి. అలసట వచ్చేది. అయినా సడాకో ఆగిపోకుండా బొమ్మలు చేసేది. అలా చేస్తూ ఉంది. చేస్తూనే ఉంది. 1300 బొమ్మలు తయారు చేసింది. ఆపై చేయలేక΄ోయింది. 12 ఏళ్లకే సడాకో క్యాన్సర్తో మరణించింది. ప్రపంచంలో శాంతి నెలకొనాలన్న తన కోరిక ఇంకా సజీవంగా ఉంది. ఈ విషయం తెలిసిన జపాన్ ప్రభుత్వం సడాకో కోసం స్మారకం నిర్మించింది. కాగితపు కొంగ బొమ్మ పట్టుకున్న సడాకో విగ్రహాన్ని చూస్తే ప్రపంచంలో శాంతి నెలకొనాలన్న తన ఆశ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. నేటికీ అనేక మంది ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి కాగితంతో కొంగ బొమ్మలు చేసి అక్కడ పెడతారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తారు. కాని నేటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపిల్లల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. పిల్లలు ఈ పెద్దల్ని చూసి ఏమనుకుంటారు? వీరికి బుద్ధి లేదు అనే కదూ..?. (చదవండి: యమ్మీబ్రదర్స్: చదువుకుంటూనే వ్యాపారం చేస్తున్న చిచ్చరపిడుగులు..!) -
Kid Entrepreneurs: చదువుకుంటూనే వ్యాపారం చేస్తున్న చిచ్చరపిడుగులు..!
ఈ అన్నదమ్ములను అంబానీ బ్రదర్స్ అనొచ్చా? ఇంత చిన్న వయసులో వ్యాపారంలో ఢమఢమలాడిస్తుంటే అనక తప్పదు మరి. ఈ అన్నదమ్ముల్లో పెద్దవాడి వయసు 17. మిగిలినవారికి 15, 13, 11. వీళ్లను అందరూ ‘బిల్లింగ్స్లియా బాయ్స్’ అనీ ‘యమ్మీ బ్రదర్స్’ అనీ అంటుంటారు.అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన జాషువా, ఇషయా, కాలెబ్, మైకా అన్నదమ్ములు. చిన్న వయసులోనే చాలా ఫేమస్ అయ్యారు. అందుకు వారు చేసే వ్యాపారమే కారణం. వారు కుకీలు(బిస్కెట్లు) తయారు చేసి అమ్ముతుంటారు. అలా స్థానికంగా వారు పేరు తెచ్చుకున్నారు.వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వారికి ఎలా వచ్చింది? ఒకరోజు కుకీలు ఎలా తయారు చేయాలో వారికి వారి తాతమ్మ సరదాగా నేర్పింది. దాంతో ఆ నలుగురు అప్పుడప్పుడూ ఆ కుకీలు చేసి వీధిలో పంచేవారు. అవి చాలా కొత్తగా, రుచికరంగా ఉన్నాయని అందరూ మెచ్చుకునేవారు. దీంతో దాన్నే వ్యాపారంగా మార్చుకోవచ్చని వారికి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే వెళ్లి వాళ్ల నాన్నకు చెప్పారు. ఆయన అంగీకరించడంతో వెంటనే పని మొదలుపెట్టారు. కుటుంబమంతా వారికి సహకరించింది. అలా ‘యమ్మీ బ్రదర్స్’ సంస్థ ప్రారంభమైంది. సుమారు 36 రకాల కుకీలు వారు తయారు చేసి మార్కెట్లో పెట్టగా, జనం వాటిని ఎగబడి కొన్నారు. అలా వారి కుకీలకు డిమాండ్ పెరిగింది. సంస్థలో మైకా ఆర్థిక అధికారి అయితే, ఇషయా మార్కెటింగ్ ఆఫీసర్, కాలెబ్ ఆపరేటింగ్ అధికారి, జాషువా ఎగ్జిక్యూటివ్ అధికారి. నలుగురూ ఒక్కొక్క పనిని పంచుకుని క్రమపద్ధతిలో చేస్తారు. తమ పనిలో చిన్న తేడా కూడా రాకుండా చూసుకుంటారు. మొదట స్థానికంగా మొదలైన వారి కార్యకలాపాలు ఆ తర్వాత దేశమంతా వ్యాపించాయి. దేశంలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా వారు కుకీలను పంపిస్తారు. రుచి, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడరు. ప్రారంభించిన రెండేళ్లలోనే దాదాపు నాలుగు లక్షలను కుకీలను అమ్మేశారు. ప్రస్తుతం వారి వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఒక్క పక్క వ్యాపారం చేస్తూనే, చదువును నిర్లక్ష్యం చేయకుండా కాలేజీకి, స్కూల్కి వెళ్లి చదువుకుంటున్నారు. (చదవండి: అందాల భామలకు ఆతిథ్యం! యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు..!) -
అందాల భామలకు ఆతిథ్యం! యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు
అందాల భామలకు అతిథ్యమిచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సిద్ధమవుతోంది. హైదరాబాద్లో మే 7 నుంచి 31 వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్–2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలకు 140 దేశాల నుంచి మూడు వేల మంది అందాల భామలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారిద్వారా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా అందాల భామలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్పోచంపల్లి, యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఇలా వివిధ దేశాల అందాల భామలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మే 15న ఇక్కత్ వస్త్రాలతో ర్యాంప్వాక్..ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరుగాంచిన భూదాన్పోచంపల్లికి మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే 15వ తేదీన రానున్నారు. వీరు ఇక్కడి చేనేత కార్మికులతో ముఖాముఖి మా ట్లాడుతారు. అనంతరం మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. తరువాత చేనేత చీరలు ధరించి ర్యాంప్వాక్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మిస్వరల్డ్ పోటీల ఈవెంట్లను నిర్వహించే పోచంపల్లి ఇక్కత్వస్త్రాల విశిష్టతను వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఫలితంగా చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మరింత పేరును తీసుకురావడమే ఈవెంట్ల ముఖ్య ఉద్దేశమని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పేర్కొంటోంది. ఇప్పటికే అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు వేదికైన పోచంపల్లికి ఇప్పుడు మరోసారి ప్రపంచ సుందరీమణులు వస్తుండడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి పొందనుంది.ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. విజయ విహార్లో విడిదిప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్వరల్డ్ పోటీదారులు సాగర్లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక నగరికి.. మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. (చదవండి: -
స్థిరత్వం, నిలకడ బుద్దికోసం..!
ఆంజనేయాసనం అనేది యోగాలో ఒక భంగిమ. దీనిని క్రెసెంట్ మూన్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం హనుమంతుడి తల్లి అంజన చేసే నృత్య భంగిమలోదిగా చెబుతారు. అందుకే ఈ ఆసనానికి ఆంజనేయాసనం అని పేరు. ఈ ఆసనం ప్రయోజనాలు...శరీరాన్ని ఒక కాలు మీద స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సమతుల్యత కలుగుతుంది. స్థిరత్వం మెరుగుపడుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరానికి– మనసుకు మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. హిప్ భాగం ఫ్లెక్సిబుల్ అవుతుంది. శరీరంపై అవగాహన కలుగుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. కీళ్ల పనితీరును, ఉచ్ఛ్వాస–నిశ్వాసలను మెరుగు పరుస్తుంది. మానసిక, శారీరక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మనస్సును స్థిరంగా ఉంచుతుంది. దిగువ శరీరాన్ని సాగదీయడానికి, ఛాతీని విశాలం చేయడానికి ఈ ఆసనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎలా చేయాలంటే... ఎడమ మోకాలిని ముందుకు చాపి, కుడి కాలిని వెనక్కి వంచి, కుడి కాలి మునివేళ్లమీద ఉండాలి. తలను నిటారుగా ఉంచి, రెండు చేతులను కంటికి ఎదురుగా నమస్కార భంగిమలో ఉంచాలి. ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనసును స్థిరంగా ఉంచే ఈ ఆసనంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ ఆసనాన్ని సాధనం చేయడం వల్ల మానసిక వికాసం కూడా మెరుగవుతుంది. (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
ఆరోగ్యానికి మంచిదని తినేయ్యొద్దు..! కొంచెం చూసి తిందామా..
చాలా మంది తెలిసో తెలియక కొన్ని ఫుడ్స్ను ఆరోగ్యానికి మంచిదని గుడ్డిగా నమ్మి తినేస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యంగా ఉండటానికి బదులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో తెలుసా?ఫ్లేవర్డ్ ఓట్ మీల్...ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు. కానీ ఇది స్వచ్ఛమైన, సాదా ఓట్ మీల్కి మాత్రమే వర్తిస్తుంది. అయితే రకరకాల ఫ్లేవర్స్తో రకరకాల ఓట్ మీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో రుచిని పెంచడానికి కృత్రిమ రంగులు, చక్కెర సిరప్ వంటి అనేక ఆరోగ్యానికి హాని చేసే వస్తువుల్ని కలుపుతారు. ఇవి తినడం మంచిది కాదు. బ్రౌన్ బ్రెడ్...ఈ రోజుల్లో మార్కెట్లో లభించే బ్రౌన్ బ్రెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి పేరుకు మాత్రమే బ్రౌన్ బ్రెడ్స్. చాలా మంది వీటిని చౌకగా అమ్ముతున్నారు. అంటే ఇలాంటి బ్రౌన్ బ్రెడ్లో శుద్ధి చేసిన పిండి, కృత్రిమ రుచి, రంగు, చక్కెరను ఉపయోగిస్తున్నారని అర్థం. అందుకే బ్రౌన్ బ్రెడ్ కొనేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే మంచి బ్రాండ్ కొనడం మేలు.ప్యాక్ చేసిన పండ్ల రసాలు లేదా స్మూతీలు...మార్కెట్లో వివిధ రకాల పండ్ల రసాలు, స్మూతీలు ప్యాకెట్లలో సులభంగా లభిస్తాయి. ఆరోగ్యానికి మంచిదని వీటిని తెగ కొనేస్తున్నారు. నిజానికి, ఈ ప్యాక్ చేసిన జ్యూస్లలో కృత్రిమ రంగులు, చక్కెర, కృత్రిమ రుచులు మొదలైన అనారోగ్యకరమైన వస్తువులు కూడా ఉంటాయి. అందుకే వీటిని కొనే ముందు వాటి ΄్యాక్ చెక్ చేస్తే పండ్ల రసాలు, స్మూతీల్లో ఏం వాడారో తెలుస్తుంది.ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్...ఈ రోజుల్లో స్పోర్ట్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగే అలవాటు చాలా మందికి ఉంది. అయితే, ఈ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని తాగడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుందేమో కానీ.. రాను రాను అనారోగ్యం కూడా వస్తుంది. పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రింక్స్ తాగనివ్వకండి. వీటి బదులు ఇంట్లో చేసుకున్న పండ్ల జ్యూస్లు బెస్ట్.బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్...ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో మార్కెట్లో బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ అమ్ముతున్నారు. చాలా మంది ఈ ప్యాకేజ్డ్ మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిదని భావించి కొని తింటున్నారు. నిజానికి వీటిని తయారు చేయడానికి అదనపు చక్కెర, కత్రిమ రుచి కలుపుతారు. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కూడా ఉండదు. వీటి బదులు సహజంగా దొరికే తృణధాన్యాలతో ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. -
నచ్చినట్లే ఉంటున్నారా..?
ఇతర పరిస్థితులు ఎలా ఉన్నా సరే, జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే, డబ్బు, ఆస్తులు, పరపతి ఉన్నా కొందరు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ఇతరుల మాటలు, సలహాల వల్ల చాలా మంది తమను తాము మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా తమ సెల్ఫ్ ఐటెంటిటీని, తద్వారా సంతోషాన్ని కూడా కోల్పోతున్నారు. జీవితంలో ఇతరుల కోసం మార్చుకోకూడని అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. మీ గుర్తింపును కాపాడుకోండిఇలా ప్రవర్తించవద్దు, అలా మాట్లాడవద్దు, ఇలా ఆలోచించవద్దు అని ఇతరుల మీకు సలహాలు ఇస్తుంటే వాటిని అంతగా పట్టించుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని అనుసరించే ముందుకు సాగాలి. ఇతరుల్ని ఫాలో అయితే మీ సొంత గుర్తింపును కోల్పోయే ప్రమాదముంది. ఇతరుల కోసం ప్రతి రోజూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూపోతే.. చివరికి మిగిలేది ఏముండదు. ప్రపంచానికి భిన్నంగా ఉండటం, మీ గుర్తింపును కాపాడుకోవడం ఏ మాత్రం తప్పు కాదని గుర్తుంచుకోండి.వ్యక్తిగత వ్యవహారాలలో తలదూర్చనివ్వద్దుప్రతి వ్యక్తికి పర్సనల్ స్పేస్ ఉంటుంది. కొన్ని సీక్రెట్స్ దాచడంతో ΄ాటు ఒంటరిగా గడిపే హక్కు ఉంది. అయితే, ఎవరైనా మిమ్మల్ని పదే పదే నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటే వారికి దూరంగా ఉండటమే మేలు. వేరే వాళ్లు మీరు చేసే ప్రతి పనిలో జోక్యం చేసుకుంటుంటే అది ఏ మాత్రం సరైనది కాదని గమనించండి. మీ పర్సనల్ స్పేస్ని గౌరవించుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో దూరవద్దని స్పష్టంగా చెప్పేయండి.పీస్ ఆఫ్ మైండ్ఎవరైనా సరే, మీతో సంబంధం ఉన్నా లేకపోయినా మీ మానసిక ప్రశాంతతను చెడగొట్టే వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు ఏం కాదు అంతా కరెక్ట్గా ఉందని మీ మనసును చికాకు పెట్టవచ్చు. కానీ, మీరే సంతోషం లేకుంటే దాని ఉపయోగం ఏంటి? అందుకే ప్రతికూల పరిస్థితులు, వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వండి.నైతిక విలువలపై రాజీ వద్దుకొందరు లేదా కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మోసగాళ్లుగా, అబద్ధాల కోరుగా మార్చటానికి ప్రయత్నించవచ్చు. కొందరు మీ చేత తప్పు పనులు చేయించడానికి బలవంతం పెడతారు. అయితే, ఇక్కడ నైతిక విలువలు పాటించడం ముఖ్యమని గుర్తించుకోండి. ఎవరో చె΄్పారని, వాళ్లు బలవంతం చేశారని చెడ్డ పనులు చేస్తే భవిష్యత్తులో కష్టాలే పలకరిస్తాయి. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ.. ఏది కరెక్టో దానివైపే నిలబడండి.నో చెప్పడం నేర్చుకోండిఇతరులు ఎల్లప్పుడూ వారి మాటలే వినాలని, వారి కోసమే సమయం కేటాయించాలని భావిస్తారు. అంతేకాకుండా వారి కోరికల ప్రకారం ఇతరుల జీవించాలని కోరుకుంటారు. అయితే, వేరే వాళ్లు చెప్పే పనులన్నింటికీ యస్ చెప్పుకుంటూ ΄ోతే మీకు మిగిలేది ఏమీ ఉండదు. సంతోషం, ఆనందం అన్నీ దూరమై΄ోతాయి. అందుకే ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. ఇతరులకు నో చెప్పడానికి ఎందుకు సంకోచం. మీ పరిమితుల్ని మీరే నిర్ణయించుకోండి.కలల్ని, ఆశయాల్ని వదులుకోకండిచాలా మంది మనం ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే సూటి ΄ోటి మాటలతో వెనక్కు లాగే ప్రయత్నం చేస్తారు. ఈ వయసులో నువ్వు ఏం సాధిస్తావు. ఇందులో నష్టం తప్ప లాభం ఉండదు, వేరే పని చూసుకుంటే మంచిదని లేని΄ోని సలహాలు ఇస్తుంటారు. అయితే, ఒకటి మాత్రం ఆలోచించండి. మీ జీవితాన్ని ఇతరుల ప్రకారం జీవించాలనుకోకూడదు. మీకు ఏదైనా సాధించాలని ఉంటే ఆ దిశగా అడుగులు వేయండి. మీ కలలకు విలువ ఇవ్వండి. లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారు.మీకు మీరే ముఖ్యంమన అవసరాల్ని తీర్చుకుని మిగతావారిని పట్టించుకుంటే చాలా మంది స్వార్థుపరులనే ట్యాగ్ వేసేస్తారు. మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం స్వార్థం కాదని గుర్తుంచుకోండి. అది మీపై మీరు చూపించుకునే స్వీయ ప్రేమ. మీ ఆనందాన్ని, అవసరాల్ని ఇతరుల కోసం మార్చుకుంటే మిమ్మల్ని మీరు కోల్పోయినట్టే. ఇతరులకు అవసరమైనప్పుడు మాత్రమే సాయం చేయండి. ఎవరో ఏదో అనుకుంటారని ఇతరుల కోసం మీ అవసరాల్ని త్యాగం చేస్తే చాలా కోల్పోతారు. (చదవండి: పంటపొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..) -
మామిడికాయతో ఆవకాయేనా..? తియ్యటి మిఠాయిలు కూడా చెసేయండి ఇలా..!
పచ్చి మామిడికాయతో ఒక్క ఆవకాయేనా? ఇంకా చాలా చేయవచ్చు. పచ్చిమామిడితో వంటకాలే కాదు... పుల్లని మామిడితో తియ్యటి మిఠాయిలూ సృష్టించొచ్చు. షర్బత్లూ తాగించొచ్చు.కావలసినవి: పచ్చి మామిడికాయ–1 (మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచె తీపి, పులుపు కలిపి ఉన్నది తీసుకోవాలి), మైదా–అరకప్పు, పంచదార–1 కప్పు, నీర –1 కప్పు, నెయ్యి– 2 చెంచాలు.తయారీ: మామిడికాయను పచ్చని భాగం పోయేవరకూ చెక్కు తీసి, ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక మామిడి ముక్కలు వేసి మెత్తబడేవరకూ మగ్గనివ్వాలి; తర్వాత చల్లారబెట్టి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి; ఈ పేస్ట్లో మైదా వేసి బాగా కలుపుకుని, మృదువుగా అయ్యాక ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి; గిన్నెలో నీరు, పంచదార వేసి స్టౌమీద పెట్టాలి; లేతపాకం తయారయ్యాక... జామూన్లను నూనెలో వేయించి పాకంలో వేయాలి; ఉండలు పాకాన్ని బాగా పీల్చుకున్నాక తరిగిన డ్రైఫ్రూట్స్తో అలంకరించి వడ్డించాలి. ఇవి చూడ్డానికి మామూలు జామూన్లలానే ఉంటాయి కానీ తింటే తీపితో పాటు కొద్ది పులుపుగా ఉండి ఓ కొత్త రుచిని పరిచయం చేస్తాయి.పచ్చి మామిడి హల్వాకావలసినవి: పచ్చి మామిడికాయ – 1, వెర్మిసెల్లీ – 1 కప్పు, పంచదార – 2 కప్పులు, నీళ్లు – 2 కప్పులు, నెయ్యి పావుకప్పు, జీడిపప్పు పొడి – 2 చెంచాలు, యాలకుల పొడి – 2 చెంచాలుతయారీ: మామిడికాయను మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి (గుజ్జు 1 కప్పు ఉండాలి); స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక సేమ్యా వేసి వేయించాలి; రంగు మారాక నీళ్లు పోయాలి; సేమ్యా కాస్త మెత్తబడ్డాక మామిడి గుజ్జును వేయాలి; రెండు నిమిషాలు ఉడికాక పంచదార కూడా వేయాలి; అడుగంటకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి; మిశ్రమం బాగా చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి కలపాలి; హల్వా దగ్గరపడి నెయ్యి గిన్నె అంచులువదులుతున్నప్పుడు దించేసుకోవాలి.మ్యాంగో బనానా షర్బత్కావలసినవి: పచ్చి మామిడికాయలు – 2, పంచదార – 1 కప్పు, అరటిపండు – 1, జీలకర్ర పొడి – 1 చెంచా, మిరియాల పొడి – చిటికెడు, ఉప్పు – తగినంతతయారీ: అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి; మామిడికాయల్ని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి; ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి; తర్వాత నీరు ΄ోసి పల్చని జ్యూస్లా బ్లెండ్ చేయాలి; దీన్ని గ్లాసులోకి వడ΄ోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి; ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ షర్బత్ శరీరాన్ని చల్లబరుస్తుంది. (చదవండి: -
పంటపొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..
ఇంతకాలం పంటలకు పురుగు మందులు పిచికారీ చేయడం, నానో యూరియా వంటి ఎరువులు చల్లడం వంటి క్లిష్టతరమైన పనులను పురుషులే చేస్తున్నారు. అయితే ఇలాంటి పనులను కూడా ఇకపై మహిళలే చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లతో వ్యవసాయ పనులను చేయడంపై గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 54 మంది ఎస్హెచ్జీ మహిళలను ఎంపిక చేశారు. తొమ్మిది రోజుల పాటు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి ఈ డ్రోన్లను అందించనున్నారు. బెంగుళూరుకు చెందిన ఫ్లైయింగ్ వెడ్జ్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.80 శాతం సబ్సిడీపై...కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం కింద ఈ డ్రోన్లకు 80 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ డ్రోన్ తోపాటు, సంబంధిత మెటీరియల్తో కలిపి యూనిట్ వ్యయం రూ.పది లక్షలు. ఇందులో లబ్ధిదారులు 20 శాతం (రూ.రెండు లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.ఎనిమిది లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమో దీదీ, కిసాన్ దీదీ పథకాల కింద సబ్సిడీ ఇస్తున్నాయి. ఈ డ్రోన్ సేవలను తమ వ్యవసాయ పొలాలకు వినియోగించడంతోపాటు, గ్రామంలో ఇతర రైతుల పొలాలకు సేవలందించనున్నారు. ఇందుకోసం నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇలా ఎస్హెచ్జీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతోపాటు, రైతులకు తమ పంట పొలాలకు పురుగుమందుల పిచికారీ కష్టాలు తప్పనున్నాయి. పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డిఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మేలు..డ్రోన్ స్ప్రేపై మాకు శిక్షణ ఇస్తున్నారు. వీటిని వినియోగించడం ద్వారా మేము ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. అలాగే రైతులకు తక్కువ ఖర్చుతో పురుగు మందుల పిచికారీ చేసే సేవలు అందుబాటులోకి వస్తాయి. మా లాంటి మహిళా సంఘాలకు ఈ అవకాశాన్ని కల్పించడం పట్ల సంతోషంగా ఉంది.– అనిత, ఎస్హెచ్జీ మహిళ,అల్మాయిపేట, సంగారెడ్డి జిల్లా.డ్రోన్లను వినియోగించి పంటలకు పురుగుమందులు ఎలా పిచికారీ చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. రైతులకు ఈ సేవలు అందించడం ద్వారా మాకు ఆర్థికంగా కలిసొస్తుందని భావిస్తున్నాము. అలాగే రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. మాకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నారు. డ్రోన్ల సేవలు అందించేలా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది.– లక్ష్మి, ఎస్హెచ్జీ మహిళ, అన్నాసాగర్, సంగారెడ్డి జిల్లా (చదవండి: లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన) -
మహమ్మారి మా గౌరవాన్ని పెంచింది!
2020 మార్చి 24.. జనతా కర్ఫ్యూ... అదే లాక్డౌన్ గుర్తుందా? ఆనాడు రోజులను గుర్తుపెట్టుకోవడం కూడానా అని ముఖం చిట్లిస్తున్నారా?నిజమే చేదు అనుభవాలను అదేపనిగా గుర్తుపెట్టుకోనక్కరలేదు! కానీ కష్టకాలంలో అందిన సేవలు, సహాయాన్ని మాత్రం మరువకూడదు కదా!అలా కోవిడ్ టైమ్లో ఫ్రంట్లైన్ వారియర్స్గా నిలబడ్డ నర్స్లు, డాక్టర్లు, పోలీసులు అందించిన సేవలు, సాయం గురించి మార్చి 24 లాక్డౌన్ డే సందర్భంగా ఒక్కసారి గుర్తుచేసుకుందాం.. ఓ సిరీస్గా! అందులో భాగంగా నేడు .. సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ శిరీష ఏం చెబుతున్నారంటే..ఆ రోజులను తలచుకుంటే ఇప్పటికీ భయమే! నేనప్పుడు ఉస్మానియాలో పనిచేసేదాన్ని. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు. కోవిడ్ పాజిటివ్ అని తేలాకే అందులో జాయిన్ చేసుకునేవారు. జనరల్ పేషంట్స్, కోవిడ్ లక్షణాలున్న వాళ్లు ఉస్మానియాకు వచ్చేవాళ్లు. టెస్ట్ చేసి.. పాజిటివ్ అని తేలితే గాంధీకి పంపేవాళ్లం. ఉస్మానియా కోవిడ్ కాదు, ఎన్ 95 మాస్క్లు, పీపీఈ కిట్స్ ఖరీదైనవి కూడా .. కాబట్టి వాటిని ముందు డాక్టర్స్కే ఇచ్చారు. అయితే నిత్యం పేషంట్స్తో ఉంటూ వాళ్లను కనిపెట్టుకునేది నర్సింగ్ స్టాఫే కాబట్టి మాస్క్లు, పీపీఈ కిట్లు ముందు వాళ్లకు కావాలని మాకు ఇప్పించారు అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సర్.మామపోయాడు.. అల్లుడు బతికాడుఒక కేస్లో మామ, అల్లుడు ఇద్దరికీ కోవిడ్ సోకింది. ఇద్దరినీ గాంధీలో చేర్పించాం. మాకు రెండు ప్రాణాలూ ఇంపార్టెంటే! ఇద్దరికీ ఈక్వల్ సర్వీసే ఇస్తాం. దురదృష్టవశాత్తు పెద్దాయన అంటే మామ చనిపోయాడు. ఆ అమ్మాయి భర్త డిశ్చార్జ్ అయ్యాడు. అల్లుడిని చూసి అత్తగారు తన భర్త కూడా తిరిగొస్తాడనుకుంది. వెంటనే నిజం చెబితే ఆమెకేమన్నా అయిపోతుందన్న భయంతో నెల తర్వాత అసలు విషయం చెప్పారురు. ఇలా ఎన్నికేసులో! కోవిడ్ నుంచి బయటపడగలమా అని దిగులేసేది. అలాంటి సిట్యుయేషన్ ఎప్పటికీ రావద్దు!వెంటిలేటర్ మీదుంచే స్థితిలో..లాక్డౌన్ టైమ్లో మాకు వారం డ్యూటీ, వారం సెలవు ఉండేది. రెండో వారమే నాకు కాళ్లు లాగడం, కళ్లు మండటం స్టార్టయింది. దాంతో తర్వాత వారం కూడా సెలవు తీసుకున్నాను. ఇది కోవిడా లేక నా అనుమానమేనా అని తేల్చుకోవడానికి డ్యూటీలో జాయినయ్యే కంటే ముందురోజు అంటే పదమూడో రోజు టెస్ట్ చేయించుకున్నాను. స్వాబ్ టెస్ట్లో నెగటివ్ వచ్చింది. సీటీ స్కాన్ కూడా చేయిస్తే.. సీవియర్గా ఉంది కోవిడ్. ఆ రిపోర్ట్స్ని మా హాస్పిటల్లోని అనస్తీషియా డాక్టర్కి పంపాను. వాటిని చూసిన ఆవిడ ‘వెంటిలెటర్ మీదుంచే స్థితి తెలుసా నీది? అసలెలా ఉన్నావ్?’ అంటూ గాభరాపడ్డారు. కానీ నేను మాత్రం బాగానే ఉన్నాను. అయినా ఆవిడ కొన్ని జాగ్రత్తలు చె΄్పారు. తెల్లవారి డ్యూటీలో జాయిన్ అయ్యాను. అయితే డాక్టర్స్, కొలీగ్స్ చాలా కేర్ తీసుకున్నారు. ఇంట్లో మా ఆయన, పిల్లలు కూడా! డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మావారు వేడినీళ్లు పెట్టి ఉంచేవారు. మా పెద్దబ్బాయి రోజూ నాన్వెజ్ చేసిపెట్టేవాడు.‘ నువ్వు డ్యూటీ చేయాలి కదమ్మా.. మంచి ఫుడ్ అవసరం’ అంటూ. అందరూ చాలా స΄ోర్ట్గా ఉన్నారు.అంత విషాదంలోనూ సంతోషమేంటంటే.. మా నర్సింగ్ స్టాఫ్లో డెబ్భై శాతం మందికి కోవిడ్ సోకింది. ఐసొలేషన్ పీరియడ్ అయిపోగానే వెంటనే డ్యూటీకొచ్చారు.. భయపడలేదు. పీపీఈ కిట్తో ఉక్కపోతగా ఉండేది. అది వేసుకున్న తర్వాత ఒక్కసారి తీసినా మళ్లీ పనికిరాదు. దాంతో వాష్రూమ్కి కూడా వెళ్లేవాళ్లం కాదు. దానివల్ల డీహైడ్రేషన్ అయింది. అయినా, సహనం కోల్పోలేదు. కోవిడ్ మా సర్వీస్కి పరీక్షలాంటిది. నెగ్గాలి.. మానవ సేవను మించిన పరమార్థం లేదు అనుకునేదాన్ని! అంత విషాదంలోనూ సంతోషమేంటంటే మా నిబద్ధత, సేవ ప్రజలకు అర్థమైంది. ప్రభుత్వాసుపత్రుల మీదున్న చెడు అభిప్రాయం పోయింది. మమ్మల్ని గౌరవిస్తున్నారు. – సరస్వతి రమ (చదవండి: లాభాల తీరం మత్స్య సంపద యోజన) -
లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన
పీఎమ్ఎస్సెస్వై (ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన) కిందకు వచ్చే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని 2020లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా చేపలపెంపకందారులకు ఏడు శాతం వడ్డీతో రెండు లక్షల రూపాయాల వరకు రుణాన్ని అందిస్తున్నారు. చేపలు, రొయ్యల పెంపకంపై ఉచిత శిక్షణనూ అందిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు 60 శాతం వరకు గ్రాంట్ అందుతోంది. ఈ పథకం తీర్రప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులకు లాభాల పంట పండిస్తోంది. చేపల ఎగుమతిలో భారతదేశాన్ని ముందంజలో నడిపిస్తోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఫిషరీస్, మత్స్యకారుల సంక్షేమశాఖ సహాయసంచాలకుల కార్యాలయంలో మరిన్ని వివరాలను పొదవచ్చు. జిల్లా మత్స్యశాఖ లేదా ఏదైనా హేచరీ నుంచి ఉచితంగా చేప సీడ్ను పొందవచ్చు. ఈ పథకానికి అధికారిక వెబ్సైట్ https://pmmsy.dof.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో స్కీమ్ లింక్పై క్లిక్ చేయాలి. నింపాల్సిన ఫామ్ కనిపిస్తుంది. అందులోని వివరాలను పూరించాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, భూమి వివరాలనూ పొందుపరచాలి. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సహా సూచించిన పత్రాలను అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి.. ఫామ్ను సమర్పించాలి. దరఖాస్తుదారు అర్హతలు, సంబంధిత పత్రాలను ఆమోదించిన తరువాత పథకం ప్రయోజనాలను పొందవచ్చు. తీర్రప్రాంతం లేని చోటా మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం రుణాన్ని అందిస్తోంది. కమర్షియల్ ఆక్వా కల్చర్ సిస్టమ్ కింద ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 20 లక్షలు అయితే రూ. 5 లక్షల వరకు సొంత పెట్టుబడి ఉండాలి. అప్పుడు రూ. 15 లక్షల రుణాన్ని పొందవచ్చు. ఇందులో సబ్సిడీ ఉంటుంది. (చదవండి: Earth Hour: "'స్విచ్ ఆఫ్": ఆ ఒక్క గంగ ప్రకృతితో కనెక్ట్ అవుదామా..!) -
ఇవాళ గంటపాటు "స్విచ్ ఆఫ్"
మనిషికి జీవనాధారమైన భూమిని ఆహ్లాదంగా ఉండేలా ప్రయత్నిస్తే.. ఆటోమేటిగ్గా అన్ని బాగుంటాయి. అందుకోసమే ప్రంపచవ్యాప్తంగా ఉన్న మానవళి ప్రయోజనార్థమే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సామాజికవేత్తలు. అలా ఏర్పాటైనవే ప్రకృతికి సంబధించిన దినోత్సవాలు. ఆ విధంగా వచ్చిన వాటిలో ఒకటి ఈ ఎర్త్ అవర్. అసలేంటిది..? ఆ ఒక్క రోజు.. ఒక్క గంటపాటు పాటించేస్తే నిజంగానే భూమిని కాపాడేసినట్లేనా..? అంటే..?. .ఎర్త్ అవర్ అంటే.. పర్యావరణం కోసం ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఒక కార్యక్రమం. ప్రతి ఏడాది మార్చి నెలలో చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల మధ్య జరుగుతుంది. ఈపాటికే ఇరు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు మార్చి 22 శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపేయాలని అధికారికంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేసింది కూడా. అలాగే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలందురూ స్వచ్ఛందంగా భాగం కావాలని కోరాయి ఇరు ప్రభుత్వాలు.ఎలా ప్రారంభమైందంటే? 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. WWF (World Wildlife Fund) అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడటమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం.ప్రాముఖ్యత ఎందుకు..మన ప్రపంచానికి మన సహాయం కావాలి. మనం తినే ఆహారం నుంచి పీల్చే గాలి వరకు ప్రకృతి మనకు చాలా ఇస్తుంది. అది మనల్ని ఆరోగ్యంగా, అభివృద్ధి చెందేలా చేస్తుంది. డబ్ల్యూబడ్యూఎఫ్(WWF) ఎర్త్ అవర్ అనేది స్విచ్ ఆఫ్ చేసి మనం నివశించే గ్రహానికి(భూమి) తిరిగి ఇవ్వడానికి సరైన సమయం. ఎందుకంటే మనం ప్రకృతిని పునరుద్ధరించినప్పుడే అది మనల్ని పునరుద్ధరిస్తుంది.'స్విచ్ ఆఫ్'లో ఉన్న ఆంతర్యం..ఎర్త్ అవర్ అంటే కేవలం లైట్లు ఆర్పేయడం మాత్రమే కాదు - మానసికంగా "స్విచ్ ఆఫ్" చేసి అంతర్ముఖులం కావడమే. అంటే ఇది వరకు చూడండి కరెంట్ పోతే చాలు అంతా బయటకు వచ్చి ముచ్చటలు ఆడుకునేవాళ్లు. ఆ వసంతకాలం వెన్నెలను వీక్షిస్తూ భోజనాలు చేస్తూ..హాయిగా గడిపేవాళ్లం గుర్తుందా..?. అచ్చం అలాగన్నమాట. ప్రకృతితో గడపటం అంటే ఏ అడువులో, ట్రెక్కింగ్లే అక్కర్లేదు..మన చుట్టు ఉన్న వాతావరణంతో కాసేపు సేదతీరుదాం. చిన్న పెద్ద అనే తారతమ్య లేకుండా ఫోన్ స్క్రీన్లతో గడిపే మనందరం కాసేపు అన్నింటికి స్విచ్ ఆఫ్ చెప్పేసి.. మనుషులతోనే కాదు మనతో మనమే కనెక్ట్ అవుదాం. తద్వారా గొప్ప మానసిక ఆనందాన్ని పొందుతాం కూడా. ఎందుకంటే సెల్ఫోన్ లేకుండా ప్రాణామే లేదన్నట్లుగా హైరానా పడుతున్న మనకు ఆ ఒక్క గంట అమూల్యమైన విషయాలెన్నింటినో నేర్పిస్తుందంటున్నారు మానసిక నిపుణులు.మరి అంత గొప్ప ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొందామా..!. ఇది కేవలం భవిష్యతరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడమే గాక మనకు ఈ ఒక్క గంట లైట్స్ ఆపి చీకటిలో గడిపే చిన్నపాటి విరామంలో అయినా మనలో ఆరోగ్యం, ప్రకృతిని రక్షించుకోవాలనే మార్పు వస్తుందేమోనని ఆశిద్దాం.(చదవండి: ఫుడ్ ప్యాకేజింగ్ లేబుల్స్లో ఇంత మోసమా..? వైరల్గా హర్ష గోయెంకా పోస్ట్) -
ఫుడ్ ప్యాకేజింగ్ లేబుల్స్లో ఇంత మోసమా..? వైరల్గా హర్ష్ గోయెంకా పోస్ట్
ఆహార ప్యాకేజింగ్ లేబుల్స్పై ఉన్న సమాచారం నమ్మి..కొనుగోలు చేయకండి అని హెచ్చరిస్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. నెటిజన్లతో మంచి విషయాలను ముచ్చటించే హర్ష్ గోయెంకా తాజాగా ఆహార కంపెనీలు వినియోగదారులను ఎలా మోసం చేస్తున్నాయో వివరించే వీడియోను పంచుకున్నారు. ఇన్ని ప్రముఖ ఆహార కంపెనీలు తన ప్యాకేజీ లేబుల్పై ఇంతలా తప్పుదారి పట్టించేలా సమాచారం ఇస్తున్నాయా..? అని తెలిసి షాకయ్యా అంటూ పోస్ట్లో పేర్కొన్నారు. ఇంతకి హర్ష్ గోయెంకా పోస్ట్ చేసిన ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..?హర్ష గోయెంకా ఇటీవల మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఓ సమస్యను బయటపెట్టారు. మన ఆహార కంపెనీలు మనల్ని ఎలా మోసగిస్తున్నాయో ఈ వీడియోలో సవివరంగా ఉందని, అది చూసి విస్తుపోయానంటూ రాసుకొచ్చారు పోస్ట్లో. ఆ వీడియోలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ అయిన రేవంత్ హిమత్సింగాక్ ఆహార కంపెనీలు వినియోగదారులను తప్పుపట్టించేలా చేస్తున్న మోసపూరిత వ్యూహాల గురించి మాట్లాడారు. అందులో గుడ్ డే బిస్కట ప్యాకేట్స్, కుకీలు వంటి వాటిల్లో బాదం, జీడిపప్పుల క్యాండిటీ 50-60 శాతం ఉంటాయని లేబుల్పై ఉంటుంది. కానీ కేవలం బాదం 1.8 శాతం, జీడిపప్పలు 0.4 శాతం మాత్రమే ఉంటాయన్నారు. మరోక బిస్కెట్ ప్యాకెట్ని చూపిస్తూ..దీన్ని హోల్వీట్ కుకీగా ప్రచారం చేస్తుంటారు. కానీ దానిలో 52 శాతం శుద్ధి చేసిన పిండి, 19.5 శాతం మాత్రమే హోల్వీట్ ఉంటుందన్నారు. అలాగే హెర్బ్ కుకీగా అమ్ముడవుతున్న మరో ప్రొడక్ట్లో అశ్వగంధ, పసుపు, తులసి, గిలోయ్, ఆమ్లా (గూస్బెర్రీ) ఉన్నాయని పేర్కొంది. అవి లేబుల్లో చెప్పినంత శాతంగా కాకుండా కేవలం 0.1 శాతం మాత్రమే ఉన్నాయి. ఇలా మనకు తెలియకుండా చాలా పెద్ద నకిలీ మార్కెట్ జరుగుతోంది. ఇది ఒక విధమైన పెద్ద సమస్య, ప్రజలు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని వీడియోలో న్యూట్రిషన్ రేవంత్ చెబుతున్నట్లు కనిపిస్తుంది. మం గనుక ప్రొడక్ట్లపై ఉన్న సమాచారాన్ని నమ్మి తింటే ఆరోగ్యం ప్రమాదంలో పడటమేగాక ఆస్పత్రి పాలవ్వుతామని అన్నారు. ఏదో రకంగా వినియోగదారుడుకి కట్టబెట్టడంలో నైపుణ్యం కలిగిన ఆహార కంపెనీలు అవి. అవన్నీ ఒక దానికొకటి పోటీ పడుతూ మనల్ని దారుణంగా తప్పుదారి పట్టించేలా మోసం చేస్తన్నాయని చెప్పారు న్యూట్రిషన్ రేవంత్. అందువల్ల ప్రాసెస్ చేసిన ఆహారాలు కంటే మొక్కల ఆధారిత ఆహరానికే ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటివి కొనుగోలు చేసి ఒళ్లు, జేబు గుల్ల చేసుకుని వాడి లాభాలు తెచ్చిపెట్టే కంటే..ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదన్నారు న్యూట్రిషన్ రేవంత్. చివరగా హర్ష గోయంకా ఆరోగ్యకరంగా తింటూ ఆరోగ్యంగా ఉందాం అని పోస్ట్ని ముగించారు. How our food companies are taking us for a ride! I was truly shocked by these revelations. pic.twitter.com/oRWTeVuYxw— Harsh Goenka (@hvgoenka) March 19, 2025 (చదవండి: నటి రాణి ముఖర్జీ టోన్డ్ బాడీ సీక్రెట్..! వంద సూర్యనమస్కారాలు ఇంకా..) -
Rani Mukerji: టోన్డ్ బాడీ సీక్రెట్..! వంద సూర్య నమస్కారాలు ఇంకా..!
బాలీవుడ్లో అత్యంత ప్రసిద్ధ తారల్లో రాణి ముఖర్జీ ఒకరు. బెంగాలీ చిత్రంలో సహాయ నటి పాత్రతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజా కీ ఆయేగీ బారాత్ వంటి బ్లాక్బస్టర్ మూవీలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారామె. ఈ రోజు ఆమె 46వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2013లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి నటించిన అయ్యా మూవీ కోసం ఎంతలా కష్టపడి స్లిమ్గా మారిందో తెలుసుకుందామా. ఆ మూవీలో సన్నజాజి తీగలాంటి దేహాకృతితో హీరో పృథ్వీరాజ్తో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకుల మదిని దోచుకోవడమే గాక ఇప్పటకీ హైలెట్గా ఉంటుంది. ఆ సినిమాలో రాణి ముఖర్జీ టోన్డ్ బాడీతో మెస్మరైజ్ చేస్తుంది. అందుకోసం ఎలాంటి డైట్ ప్లాన్, వర్కౌట్లు ఫాలో అయ్యేదో రాణి ముఖర్జీ ఫిట్నెస్ ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవేంటంటే..ఆ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ గ్లాస్ ఫిగర్ని పొందేందుకు ఎలా కష్టపడిందో వింటే విస్తుపోతారు. తన శరీరాకృతి మెరుపు తీగలా ఉండేందుకు ఎలాంటి డైట్-వర్కౌట్ ప్లాన్ని అనుసరించిందంటే. రాణి ముఖర్జీ దినచర్య ఎలా ఉండేదంటే...తెల్లవారుజామున 60 మి.లీ కలబంద రసం.ఒక గిన్నె బొప్పాయి, సగం ఆపిల్రెండు గంటలు వ్యాయామంఅల్పాహారం: ముయెస్లీ/ఓట్స్ స్కిమ్డ్ మిల్క్ మధ్యాహ్నం: రెండు మల్టీగ్రెయిన్ ఆట రోటీలు, పప్పు.సాయంత్రం: మొలకలు, రెండు గుడ్డులోని తెల్లసొన, మల్టీ-గ్రెయిన్ బ్రెడ్ .రాత్రి భోజనం: 1 రోటీ, కాల్చిన కూరగాయలు, 150 గ్రాముల తందూరీ చేపలు.100 సూర్య నమస్కారాలు, మైదా కార్బోహైడ్రేట్లు లేవుచివరగా టైనర్ సత్యజిత్ చౌరాసియా మాట్లాడుతూ..ఈ మూవీ ప్రారంభించడానికి రెండు వారాల ముందు తనను సంప్రదించి విల్లలాంటి శరీరాకృతి కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలకు పొట్ట భాగాన్ని, వెనుక భాగాన్ని వొంపైన తీరులో చూపించాల్సి ఉంటుందని చెప్పిందన్నారు. సులభంగా బాడీ కదలికలు కూడా ఉండాలని తెలిపిందన్నారు. కాబట్టి ఆమెను టోన్గా కనిపించేలా చేసేందుకు యోగా, చక్కటి డైట్ ప్లాన్ని ఆమెకి ఇచ్చినట్లు తెలిపారు. నటి రాణి కూడా తాను సూచించినట్లుగానే దాదాపు 50 నుంచి 100 సూర్యనమస్కారాలు చేసేది. అలాగే ప్రతి రెండు మూడు గంటలకొకసారి తినేదన్నారు. వీటి తోపాటు రెండు మూడు లీటర్ల నీరు తాగాలని, కార్బోహైడ్రేట్లు, మైదాను పూర్తిగా తొలగించాలని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆహారంలో ఒక చెంచాకు మించి నూనె ఉండకుండా కేర్ తీసుకున్నట్లు తెలిపారు. అయితే అప్పడప్పుడు చాక్లెట్ పేస్ట్రీల వంటివి తీసుకునేదన్నారు. ఇక్కడ రాణి కూడా అలాంటి దేహాకృతి కోసం చాలా అంకితభావంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు. (చదవండి: 'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!) -
ఒడియా ఆహార సంస్కృతిలో ఆణిముత్యం ‘పొఖొలొ’
భువనేశ్వర్: ప్రపంచ పొఖాలొ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, శాసన సభ స్పీకరు సురమా పాఢి, మంత్రి మండలి సభ్యులతో కలిసి పొఖాలొ (చద్దన్నం) ఆరగించారు. దేశ, విదేశాల్లో విస్తరించిన ఒడియా ప్రజలు కూడా పొఖాలొ దిబొసొ వేడుకగా జరుపుకున్నారు. పసి పిల్లలకు చద్దన్న ప్రాసనం కూడ సరదాగా నిర్వహించి ముచ్చట పంచుకోవడం మరో విశేషం. పొఖాలొ ఒడియా ప్రజలకు ఇష్టమైన నిత్య ఆహారం. ప్రతి ఇంటా పొఖాలొ ఉంటుంది. ఈ ఆహారం అనాదిగా ఒడియా ప్రజల ఆహార సంస్కృతిలో ఇమిడి పోయింది. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత శ్రీ జగన్నాథునికి కూడా దొహి పొఖాలొ (దద్దోజనం) నివేదించడం సనాతన ధర్మ, ఆచారాలకు ప్రతీకగా పేర్కొంటారు. వ్యవహారిక శైలిలో పొఖాలొ (చద్దన్నం) శరీరానికి చల్లదనం చేకూర్చుతుందని చెబుతారు. కొరాపుట్: పొఖాలొ తినాలని బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పిలుపు నిచ్చారు. ఉత్కళ పకాలి దినోత్సవం సందర్భంగా తాను పొఖాలొ తింటున్న చిత్రం విడుదల చేశారు. వేసవిలో పొఖాలొ తినడం వల్ల చల్లదనం చేస్తుందన్నారు. (చదవండి: అవకాడో: పోషకాల పండు.. లాభాలు మెండు) -
సుమనోహరం వెడ్డింగ్ ట్రెండ్స్..!
పెళ్లిళ్ల సీజన్కు ముందు బుక్ మార్క్ చేసుకోదగిన అతిపెద్ద ఫ్యాషన్ ట్రెండ్స్ ఈ ఏడాది మనల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయం, ఆధునిక ధోరణులను కలబోసి మన ముందుకు తీసుకువచ్చాయి. వధువుల కోర్సెట్ చోళీలు, భారతీయ సంప్రదాయ నేత చీరలు, పలుచటి మేలి ముసుగులు, ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా కనిపించాయి. పెళ్ళిళ్లకు ముందే బుక్ మార్క్ చేసుకోదగిన పెళ్లికూతురుట్రెండ్స్లో ప్రధానంగా కనిపించిన జాబితాను చెక్ చేద్దాం..భారతీయ చేనేతక్లాసిక్ ఇండియన్ చేనేత పునరుజ్జీవనాన్ని మనం గమనించి తీరాలి. వివాహ వేడుకలకు కాంజీవరం, బనారసి, చికంకారి వంటి చీరలకు మంచి డిమాండ్ ఉంది. ఈ కాలాతీత డిజైన్లు సంప్రదాయ రూపంలో ధరించినా లేదా ఆధునిక ట్విస్ట్తో మెరిపించినా, ఇవి మసకబారే సూచనలు కనిపించడం లేదన్నది నిజం.కోర్సెట్లు ఫ్యాషన్ రంగాన్ని ఆక్రమించాయి అని చెప్పవచ్చు. వీటిని సంప్రదాయ వివాహ వేడుకలకు తీసుకురావడం ఎలా అనే అంశంపై పెద్ద కసరత్తే జరిగింది. అందుకు పెళ్లికూతుళ్లు కూడా తమ వివాహ సమయంలో ఆధునికంగా కనిపించడానికి కోర్సెట్ చోళీలను ఎంచుకుంటున్నారు. దాంతో దిగ్గజ డిజైనర్లు తమ డిజైన్స్కు ఆధునికతను జోడిస్తున్నారు. సాంప్రదాయ పెళ్లి బ్లౌజ్లకు ఇవి ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి. ఫిష్టైల్ లెహంగాతో కోర్సెట్ చోళీలు జతగా చేరి అద్భుతంగా కనిపిస్తున్నాయి. సంగీత్ నుంచి రిసెప్షన్ వరకు కోర్సెట్లు అంతటా రాజ్యమేలుతున్నాయి.లాంగ్ వెయిల్స్పాశ్చాత్య వివాహాల నుంచి వీటిని స్ఫూర్తి పొందినట్లు అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం వధువులలో ట్రైల్ లేదా వెయిల్ ఉన్న లెహంగాలను ధరించే ధోరణి పెరుగుతోంది. గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకునే వధువులకు ఈ లుక్ ఒక గొప్ప ఎంపిక. లాంగ్ ట్రైల్స్ లేదా వెయిల్స్ ఉన్న లెహంగాలు ప్రిన్సెస్ లుక్తో అందంగా కనిపిస్తాయి. (చదవండి: 'మిట్టి దీదీ': విషరహిత విత్తనాల కోసం..!) -
'మిట్టి దీదీ': విషరహిత విత్తనాల కోసం..!
బిడ్డ ఎదుగుదలకు తోడ్పడే పోషకాలన్నీ కలిపి అమ్మచేతి గోరుముద్ద రూపంలో బుజ్జాయి బొజ్జలోకి వెళ్తాయి. అలాంటి అమ్మ చేతి ముద్దలో ఉండే ఆహారం రసాయనాలతో నిండితే.. భవిష్యత్తు తరం ఏమవుతుందోనన్న ఆలోచనే ఓ వినూత్న కార్యక్రమానికి పురుడు పోసింది. ఒకప్పటి విష రహిత దేశీ విత్తనాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాలన్న లక్ష్యంతో నిర్మల్ జిల్లాలో డీఆర్డీఓ విజయలక్ష్మి తమ కలెక్టర్ అభిలాష అభినవ్ సహకారంతో సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. గురువారం నిర్మల్ కలెక్టరేట్లో మహిళా అధికారులు, మహిళా రైతులు, మహిళా సంఘాల సభ్యులు అందరూ కలిసి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.వాక్ ఫర్ దేశీ సీడ్...‘మన విత్తనం – మన భవిష్యత్తు‘ అన్న ట్యాగ్ లైన్తో ‘వాక్ ఫర్ దేశీ సీడ్‘ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురాతన దేశీ విత్తనాలను సేకరించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం జిల్లా అధికారులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ఇప్పటికీ సాగులో ఉన్న దేశీ విత్తనాలను సేకరించారు. వరి, పప్పు దినుసులతో పాటు కూరగాయలలోనూ అందుబాటులో ఉన్న దేశీ సీడ్ రకాలను తెప్పించారు. బహురూపి వంటి అరుదైన రకాలను సేకరించారు. జిల్లాలో ఆరువేల మంది సభ్యులుగా ఉన్న ‘మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ‘లో ఆధ్వర్యంలో వీటిని సాగు చేయించడం మరో ప్రత్యేకత. ముందుగా 20ఎకరాలలో 200 మంది మహిళ రైతులతో దేశీ విత్తనాలతో సాగు చేయించాలని నిర్ణయించారు. ఇలా సాగుచేసిన పంటలను సైతం తిరిగి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ కొనుగోలు చేస్తాయి. పెరటి తోటల పెంపకంపై ఆసక్తి గల వారికి సైతం దేశీ విత్తనాలు అందిస్తామని చెబుతున్నారు.మిట్టి దీదీ...ఎంతటి విత్తనమైనా మట్టి బాగుంటేనే బతికి బట్ట కడుతుంది. అందుకే ఈ మహిళా అధికారులు కేవలం దేశీ విత్తనాలనే కాకుండా.. మట్టిని సైతం పరీక్షించిన తర్వాతే సాగు చేయాలన్న మరో లక్ష్యాన్ని ముందుకు తీసుకొచ్చారు. ‘భూసార పరీక్ష – నేలతల్లికి రక్ష‘ ట్యాగ్ లైన్ తో ‘మిట్టి దీదీ‘ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో ఏఐ టెక్నాలజీ కలిగిన ఫార్మోసిస్ యంత్రంతో భూసార పరీక్షలను చేసి అప్పటికప్పుడే అక్కడ ఎలాంటి పంటలు పండిస్తే బాగుంటాయో చెప్పేస్తారు. ఇలా భూసార పరీక్షలు చేయడం కూడా మహిళ రైతు ఉత్పత్తిదారుల సంఘాలే చేయనుండటం విశేషం.– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్దేశీ విత్తనాలు కాపాడుకోవాలని...ప్రస్తుత పరిస్థితులలో ఆర్గానిక్ ఆహారం పైన చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అధిక ధరలు ఉండటంతో ΄ాటు తక్కువ మొత్తంలో లభ్యమవుతుండటం ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో మహిళా రైతులను ్ర΄ోత్సహించడంతో΄ాటు మనవైన దేశీ విత్తనాలను ముందు తరాలకు అందించాలన్న ఉద్దేశంతో కలెక్టర్ అభిలాష అభినవ్ గారి సహకారంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. – విజయలక్ష్మి, డీఆర్డీఓ, నిర్మల్ -
74 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటానికి కారణం అదే..!: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా అనూహ్యంగా ఉంటాయో.. అలాగే అత్యంత విభిన్నంగా ఉండే ఆయన వ్యవహారతీరు ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అయితే మోదీ ఏడుపదుల వయసులోనూ అంతే ఫిట్గా, చలాకీగా ఉంటారు. ఎక్కడ అలసటను దరిచేరనీయరు. ఏ కార్యక్రమంలోనైన ముఖంపై రచిరునవ్వు, ఉత్సాహం చెరగనివ్వరు. మోదీ ఈ ఏజ్లో కూడా యువకుల మాదిరి నూతనోత్సహాంతో పనులు చక్కబెట్టుకుంటారు. అలా చలాకీగా ఉండేందుకు తాను పాటించే ఆ దినచర్యేనంటూ తన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.24 గంటల్లో ఒక్కసారే భోజనం..అమెరికాకు చెందిన పాడ్కాస్టర్ ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన సంభాషణలో మోదీ తన ఉపవాస షెడ్యూల్ గురించి, జీవనశైలి గురించి వివరించారు. జూన్ మధ్యలో ప్రారంభమైన దీపావళి నుంచి 4 నెలలు పాటు భారత వైదిక ఆచారమైన చాతుర్మాస్ దీక్షను అవలంభిస్తారట. ఆ రోజుల్లో 24 గంటల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఏమైనా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు మోదీ. సరిగ్గా అది వర్షాకాలం ఆ టైంలో మనిషి జీర్ణక్రియ ఎలా మందగిస్తుందో వివరించారు. అంతేకాదు తాను పాటించే నవరాత్రి ఉపవాస దీక్ష గురించి కూడా మాట్లాడారు. ఆ సమయంలో మోదీ పూర్తిగా ఆహారం తీసుకోకుండా తొమ్మిది రోజులు కేవలం వేడినీరు మాత్రమే తీసుకుంటానని అన్నారు. అయితే వేడినీరు ఎల్లప్పుడూ తన దినచర్యలో ఒక భాగమేనని చెప్పారు. అది తనకు ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. అలాగే మోదీ మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రి ఉపవాసాన్ని కూడా అనుసరిస్తానన్నారు. అంతేగాదు తన దృష్టిలో ఉపవాసం అనేది ఒక రకమైన స్వీయ-క్రమశిక్షణగా పేర్కొన్నారు. ఇది భక్తితో కూడిన దినచర్య. నెమ్మదించేలా చేయదు. మరింత చురుకుగా ఉండేలా చేస్తుంది. ఉపవాసం శక్తి..ఉపవాసం శరీరాన్ని బలహీనపరస్తుందనే సాధారణ నమ్మకాన్ని సవాలు చేస్తూ..మనస్సు, ఆత్మ రెండింటిని రీచార్జ్ చేసుకునే ఓ గొప్ప మార్గంగా అభివర్ణించారు. ఆ టైంలో వాసన, స్పర్శ, రుచి వంటి జ్ఞానేంద్రియాలు సున్నితంగా మారడాన్ని గమనించొచ్చన్నారు. ఉపవాసం అంటే భోజనం దాటవేయడం మాత్రమే కాదు. శరీరాన్ని తిరిగి సమతుల్యం చేసుకోవడం, సంకల్ప శక్తిని బలోపేతం చేయడం, అంతర్గత సామరస్యాన్ని సాధించడం అని ఆయన వివరించారు. (చదవండి: Coconut Water Vs Sugarcane Juice: భగభగమండే ఈ ఎండలకు ఏ పానీయం మేలు అంటే..?) -
కొబ్బరి నీరు వర్సెస్ చెరకు రసం: ఈ సమ్మర్లో ఏ పానీయం బెస్ట్..!
అప్పుడే మే నెల రాకుండానే ఎండలు భగభగ మంటున్నాయి. ఉక్కపోతలతో తారెత్తిస్తోంది. ఈ ఎండలకు ఏం తినాలనిపించదు. ఒక్కటే దాహం.. దాహం అన్నట్లు ఉంటుంది పరిస్థితి. దీంతో అందరు మజ్జిగ, నిమ్మకాయ పంచదార నీళ్లు, పండ్లపై ఆధారపడుతుంటారు. అంతేగాదు ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ హైడ్రేషన్కి గురవ్వుతారు. అందుకే అంతా ఆరోగ్యానికి మంచిదని ప్రకృతి అందించే సహజసిద్ధమైన రిఫ్రెషింగ్ పానీయాలైన కొబ్బరి నీరు, చెరుకురసం వంటి వాటిపై ఆధారపడుతుంటారు. ఈ రెండూ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్? అందరూ తీసుకోవచ్చా అంటే..చెరకు రసంఇది అద్భుతమైన వేసవి పానీయం. తక్షణ శక్తిని అందించి.. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది సహజంగా చక్కెరలతో సమృద్ధిగా ఉంటుంది. ప్రభావవంతమైన శక్తి వనరుగా ఉంటుంది.శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి అందివ్వడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్, అలసటను నివారించడంలో మంచి హెల్ప్ అవుతుందిచెరకురసంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.చెరకు రసంలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్లు జీర్ణక్రియకు సహాయపడతాయిఆమ్లత్వాన్ని నివారించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయిదీనిలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఎవరు తీసుకోవాలంటే..?బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునే వారు చెరుకు రసాన్ని మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవడం మంచిదని చెబుతుంటారు నిపుణులు. చెరకు రసంలో అధిక స్థాయిలో సహజ చక్కెర ఉంటుందిఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.దీనిలో ఉండే అధిక చక్కెరలు, కేలరీల కంటెంట్ కారణంగా పరిమితంగా తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.కొబ్బరి నీరుదీన్ని ప్రకృతి స్పోర్ట్స్ డ్రింక్ అని పిలుస్తారు. ఇందులో అద్భుతమైన హైడ్రేటింగ్ లక్షణాలు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, కండరాల తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది.చెరకు రసంలా కాకుండా, కొబ్బరి నీళ్ళల్లో సహజ చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు నిర్వహణకు అనువైనదిగా చెబుతుంటారు. జీర్ణక్రియకు సహాయపడుతుందివిషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుందిపేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందిఅదనపు నీటి నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుంది.పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.రెండింటిలో ఏది బెటర్ అంటే..కొబ్బరి నీళ్ళలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది అవసరమైన ఖనిజాలను అందిస్తుంది కాబట్టి ప్రతిరోజూ దీనిని తీసుకోవచ్చు. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల సోడియం అసమతుల్యతకు దారితీసే ప్రమదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల దీనిని మితంగా తీసుకుంటేనే మంచిదంటున్నారు. చెరకు రసం, కొబ్బరి నీరు రెండూ అద్భుతమైన సహజ వేసవి పానీయాలు. ప్రతిది వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. తక్షణ శక్తికోసం అయితే చెరకు రసం బెస్ట్ ఆప్షన్. రోజువారీ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, తక్కువ కేలరీల ప్రత్యామ్నాయం కోసం కొబ్బరి నీరు మంచిది. ఈ వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్(Hydration)గా ఉండేలా చూసుకోండి. ఈ రిఫ్రెష్ పానీయాల ప్రయోజనాలను పొందేలా సరైన పద్ధతిలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 'మొక్క'వోని హాబీ.. సిరులు కురిపిస్తోంది..!) -
'మొక్క'వోని హాబీ.. సిరులు కురిపిస్తోంది..!
పచ్చని సీమలో ఎడారి మొక్కల అందాలు కనువిందు చేస్తున్నాయి. హాబీగా చేపట్టిన బోన్సాయ్ మొక్కల పెంపకం సిరులు కురిపిస్తోంది. ఎడారికి అందాలు అద్దే అడీనియం మొక్కలకు మండలంలోని వెలివోలు గ్రామం చిరునామాగా మారింది. ఈ కుగ్రామం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు అడీనియం మొక్కలు సరఫరా అవుతు న్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణజిల్లా వెలివోలు గ్రామానికి చెందిన కుంభా సాంబ శివరావు ప్రైవేటు స్కూల్లో వ్యాయామోపాధ్యాయుడగా పనిచేసేవారు. 2020లో తన హాబీ మేరకు తెలిసిన వారి దగ్గర నుంచి 12 రకాల అడీనియం మొక్కలను తెచ్చి తన ఇంటి పెరటిలో నాటారు. కరోనా సంక్షోభం కారణంగా ఓ పక్క స్కూల్స్ మూతపడటం, మరోపక్క చేసేందుకు ఎక్కడా పని దొరక్కపోవటంతో తన దృష్టిని ఎడారి మొక్కల పెంపకంపై కేంద్రీకరించారు. తన పెరటిలో ఉన్న 12 అడీనియం మొక్కల నుంచి విత్తనాలను సేకరించి, వాటి నుంచి మొక్కలను పునరుత్పత్తి చేయడం ప్రారంభించారు. రెండు పద్ధతుల్లో మొక్కల పునరుత్పత్తి తన పెరటిలో ఉన్న అడీనియం మొక్కలతోపాటు థాయ్ల్యాండ్, కేరళ, తమిళనాడు నుంచి మరికొన్ని రకాల మొక్కలను సాంబశివరావు దిగుమతి చేసుకున్నారు. వాటి ద్వారా అరుదైన అడీనియం రకాలను సృష్టించడం ప్రారంభించారు. తన ఇంటి పెరట్లో 12 మొక్కలతో ప్రారంభమైన నర్సరీ నేడు 75 సెంట్ల స్థలంలో సుమారు 10 వేల అడీనియం మొక్కలతో విరాజిల్లుతోంది. ఇక్కడ మొక్కలను రెండు రకాలుగా పునరుత్పత్తి చేస్తున్నారు. అంటుకట్టు పద్ధతిలో ఇప్పటి వరకూ 100 రంగులకు పైగా పూలు పూసే మొక్కలను ఉత్పత్తి చేశారు. రెండో పద్ధతిలో విత్తనాలు నాటడం ద్వారా మరో 200 రకాల మొక్కలను సృష్టించినట్లు సాంబశివరావు తెలిపారు. 5 వేల మొక్కల విక్రయం సాంబశివరావు నర్సరీలో అరబికం, ఉబేసం, నోవా టాంజానియా, క్రిస్పం, స్వాజికం, సోమాలియన్స్, మల్టీఫ్లోరం, సోకోట్రానమ్, బహుమీనియం, తాయ్ సోకోట్రానమ్ వంటి రకాలు, ఉప రకాల మొక్కలు ఉన్నాయి. మూడు నెలల నుంచి పదేళ్ల వయసు మొక్కలు కొలువుదీరాయి. ప్రత్యేకంగా సృష్టించిన రకాల్లో టవర్ఫామ్, రూట్ ట్రెయిన్ప్లాంట్, అనకొండ వంటివి ఉన్నాయి. నాలుగేళ్లలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఢిల్లీ, మేఘాలయ ప్రాంతాలు మినహా దాదాపు మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఐదు వేలకు పైగా మొక్కలను ఎగుమతి చేశారు. తన SambaAdeniums అనే ఇస్టా్రగామ్, ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా ఆర్డర్లు సేకరించి ఈ మొక్కలు సరఫరా చేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు. రూ.150 నుంచి రూ.25 వేల విలువైన, అరుదైన మొక్కలు తన వద్ద ఉన్నట్లు చెప్పారు. ప్రతి నెలా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ మొక్కల విక్రయం ద్వారా తనకు ఆదాయం వస్తోందని వివరించారు. మక్కువే పెట్టుబడి కరోనా తరువాత ఉద్యోగం లేక పనిదొరక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. మొక్కల పెంపకంపై ఉన్న నా మక్కువను అడీనియం వెలల మొక్కల వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టా. 12 మొక్కలతో ప్రారంభించిన నర్సరీ 10 వేల మొక్కలకు విస్తరిం చింది. మారుమూల గ్రామమైన వెలివోలు నుంచి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు మొక్కలు సరఫరా చేస్తున్నా. ఇష్టమైన అలవాట్లను వ్యాపార అవకాశాలుగా మార్చుకుంటే తప్పక విజయం సాధిస్తామని నా నమ్మకం. –కుంభా సాంబశివరావు, నర్సరీ యజమాని, వెలివోలు (చదవండి: సునీతా విలియమ్స్ జీరో-గ్రావిటీ డైట్: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..) -
సివిల్స్లో సక్సస్ కాలేదు..కానీ ఇవాళ ఓ కంపెనీ సీఈవో..!
ఒక్కోసారి మనం వెళ్లేదారిలో గమ్యం కానరాకపోవచ్చు. సక్సస్ అంత తేలిగ్గా రాకపోవచ్చు. లేదా మనం ఎంపిక చేసుకున్నదాంట్లో సక్సెస్ రాకపోవచ్చు అయినంత మాత్రాన ఓడిపోయినట్లు, అసమర్థులు కాదు. ఇంకోచోట గెలుపుని అందుకోవచ్చు. అది మనం ధైర్యంగా తీసుకునే నిర్ణయంలో ఉంటుంది. ఆ దిశగా ఫెయిల్యూర్స్ వైపు చూడకుండా వెళ్తే..సక్సస్ కచ్చితంగా మన కాళ్ల వద్దుకు వచ్చి తీరుతుందని చేసి చూపించాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన స్ఫూర్తిదాయకమైన సక్సస్ జర్నీని షేర్ చేసుకున్నాడు.అతడే చాయ్ సుత్తా బార్ సహ వ్యవస్థాపకుడు అనుభవ్ దూబే. సోషల్ మీడియా పోస్ట్లో యూపిఎస్సీ కల చెదరిపోవడంతో తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లి కొట్టుమిట్టాడుతున్న తరుణంలో తన స్నేహితుడితో కలిసి తీసుకున్న ఆ నిర్ణయం తన లైఫ్నే ఛేంజ్ చేసిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఒక్కచోట విజయం అందుకోలేదని అక్కడే నిరీక్షించటం కంటే మరో చోట ప్రయత్నించి చూస్తే.. సక్సెస్ తథ్యం అంటున్నాడు. తాను యూపీఎస్సీకి ప్రిపేరవుతున్నప్పుడూ..వరుసగా వైఫల్యాలు పకరిస్తూనే ఉన్నాయి. ఇక రాసే ఛాన్స్ అయిపోయింది. ఇంకో పక్క జీవితంలో ఏం సాధించలేకపోయానన్న ఆత్మనూన్యత నిరాస నిస్ప్రుహలతో సతమతమవుతున్న తరుణంలో స్నేహితుడితో కలిసి వ్యాపారం చేయాలనే ఆలోచన తెరతీశాడు. ఆ నిర్ణయం కరెక్టో కాదో కూడా తెలియదు. కానీ ఏదో నమ్మకం, గెలవాలన్న పట్టుదల అంతే..ఆ కసితోనే చిన్ని టీ స్టార్టప్తో వచ్చాను. మట్టికప్పుల్లో టీ సర్వ్ చేయాలన్న విన్నూత్న ఆలోచనే తన స్టార్టప్ని విస్తరించేలా చేసింది. 300 కి పైగా నగరాల్లో 500కి పైగా టీ రిటైల్ చైన్గా విస్తరించింది. అదోకా బ్రాండ్లా తన చాయ్ సుత్తా బార్ స్టార్టప్ని తీసుకొచ్చాడు. ఇలా తన టీస్టాల్ పేరు వెరైటీగా ఉండటం కూడా ప్రజాదరణకు కారణమైంది. ఇండోర్కు చెందిన ఈ చాయ్ సుత్తా బార్ (CSB) అతిపెద్ద టీస్టాల్ విక్రేతగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అలా తన బ్రాంచ్లన్నింటికి హెడ్గా సహా వ్యవస్థాపకుడిగా మారాడు. "తాను చదువులో బ్యాక్బెంచర్ని. చిన్నప్పటి నుంచి ఎలాంటి అవార్డులు, సర్టిఫికేట్లు పొందలేదు. కానీ ఈరోజు తన చాయ్ సుత్తా బార్ (CSB) క్యాబిన్ ంనిండా అవార్డులు, సర్టిఫికేట్లతో నిండిపోయింది. గెలుపురాలేదని అలానే ఉండిపోవద్దు..మరోచోట కచ్చితంగా అంతకుమించిన సక్సెస్ని చవిచూస్తారు. ధైర్యంగా ముందడుగు వేయండి అని విలువైన సందేశంతో పోస్ట్ని ముగించారు అనుభవ్ దూబే.This is for those who haven’t received any award or recognition in their life.Till the age of 25, I hadn’t received a single award. I was a backbencher. Awards, certificates se mera door door tak koi lena dena nahi tha.When I started feeling that I might not clear my UPSC… pic.twitter.com/CxX8sCVObR— Anubhav Dubey (@tbhAnubhav) March 18, 2025 (చదవండి: సునీతా విలియమ్స్ జీరో-గ్రావిటీ డైట్: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..) -
Sunita Williams: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..?
తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో దాదాపు 288 రోజులు గడిపారు. నాసా ఎప్పటికప్పుడూ వారి బాగోగులను ట్రాక్ చేస్తూనే ఉంది. ఇరువురు తగినంత పోషకాహారాం తీసుకుంటున్నారా..? లేదా అనేది అత్యంత ముఖ్యం. ఈ విషయంలో నాసా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే గాక వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించేది కూడా. నిజానికి ఆ సున్నా గురుత్వాకర్షణలో వ్యోమగాములు ఆహారం తీసుకోవడంలో చాలా సవాళ్లు ఉంటాయి. మరీ వాటిని సునీతా విలియమ్స్, ఆమెతోపాటు చిక్కుకుపోయిన బుచ్ విల్మోర్ ఎలా అధిగమించారు. ఎలాంటి డైట్ తీసుకునేవారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా, బుచ్ విల్మోర్ ప్రత్యేక డైట్ని ఫాలో అయ్యేవారు. ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేసిన ఆహారాన్ని (Self-Sable Menu) తీసుకునేవారు. నివేదికల ప్రకారం.. సునీతా పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యలు, కాక్టెయిల్స్ వంటి కంఫర్ట్ ఫుడ్స్ తీసుకునేవారు. అవన్నీ నాసా స్పేస్ ఫుడ్ సిస్టమ్స్ లాబొరేటరీలో ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు. పాడవ్వకుండా నిల్వ ఉండే ఈ ఆహారాన్ని ఫుడ్ వార్మర్ ఉపయోగించి వేడిచేసుకుని ఆస్వాదిస్తే చాలు.ఎంత పరిమాణంలో తీసుకుంటారంటే..వ్యోమగామి రోజువారీగా 3.8 పౌండ్ల పౌండ్ల మేర ఆహారం తీసుకునేలా కేర్ తీసుకుంటారు. దీన్ని ఆయా వ్యక్తుల పోషకాల పరిమితి మేర నిర్ణయిస్తారు నాసా అధికారులు. అయితే విలియమ్స్ ఆ పరిమితి పరిధిలోనే తగినంత ఆహారం తీసుకునేలా కేర్ తీసుకున్నారు. అయితే ఆ వ్యోమగాములు ఎనిమిది రోజులు ఉండటానికి వెళ్లి సుదీర్ఘకాలం చిక్కుకుపోవాల్సి రావడంతో మొదటలో తాజా పండ్లు, తాజా ఆహారం తీసుకున్నారు. మూడు నెలలు తర్వాత మాత్రం డ్రై కూరగాయాలు, పండ్లపై ఆధారపడక తప్పలేదు. ఇక బ్రేక్ఫాస్ట్లో పొడిపాలతో కూడిన తృణధాన్యాలను తీసుకునేవారు. ఇక ప్రోటీన్ల పరంగా మాత్రం వండేసిన ట్యూనా, మాంసం ఉంటాయి. అంతరిక్షంలో భూమ్మీద ముందే వండేసిన వంటకాలనే పాడవ్వకుండా ఉండేలా తయారు చేసుకుని తీసుకువెళ్తారు. అక్కడ జస్ట్ వేడి చేసుకుని తింటే సరిపోతుంది. ఇక అక్కడ ఉన్నంత కాలం వ్యోమగాములు దాదాపు 530-గాలన్ల మంచినీటి ట్యాంక్ని ఉపయోగించినట్లు సమాచారం.సుదీర్ఘకాల అంతరిక్ష ప్రయాణంలో తెలుసుకున్నవి..విలియమ్స తన మిషన్లో భాగంగా అత్యాధునిక ఆహారం గురించి పరిశోధన చేశారు. ముఖ్యంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు తాజా పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేలా మంచి బ్యాక్టీరియాను ఉపయోగించి మొక్కల పెంపకం, వ్యవసాయం వంటివి ఎలా చెయ్యొచ్చు. అక్కడ ఉండే తగినంత మేర నీటితోనే కూరగాయలు, పువ్వుల మొక్కలు ఎలా పెంచొచ్చు వంటి వాటి గురించి సమగ్ర పరిశోధన చేశారు. అంతేగాదు ఆ మైక్రోగ్రావిటీలో "ఔట్రెడ్జియస్" రోమైన్ లెట్యూస్ - అనే ఒక రకమైన ఎర్ర లెట్యూస్ మొక్కను పెంచడం వంటివి చేశారు కూడా. అడ్వాన్స్డ్ ప్లాంట్ హాబిటాట్ కార్యకలాపాలతో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలకు మార్గం సుగమం చేయడమే గాక వ్యోమగాములకు ఉపకరించే ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగే ఓ కొత్త ఆశను రేకెత్తించారు.(చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ..) -
ఏడేళ్లకే తైక్వాండో శిక్షకురాలిగా గిన్నిస్ రికార్డు..!
కొంతమంది చిన్నారులు అత్యంత చిన్న వయసులో అపారమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తుంటారు. వారి అద్భుతమైన ప్రతిభ ఎవ్వరినైనా ఆశ్చర్యంలో ముంచెత్తడమే గాక కట్టిపడేస్తాయి. అంతేగాదు వాళ్లని చూడగానే "పిట్ల కొంచెం కూత ఘనం" అనే ఆర్యోక్తి గుర్తుకురాక మానదు. అలాంటి ప్రతిభ పాటవాలనే ప్రదర్శిస్తోంది ఈ చిన్నారి. చిన్న వయసులో అత్యంత క్లిష్టమైన విద్యలో ఆరితేరి శెభాష్ అనిపించుకుంటోంది.ఆ చిన్నారే మధురైకి చెందిన ఏడేళ్ల సంయుక్త నారాయణన్. అసాధారణమైన తైక్వాండో నైపుణ్యాలతో యావత్తు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఆ అసాధారణమైన ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది కూడా. అంతేగాదు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్స్టా పోస్ట్లో ఏడేళ్ల 270 రోజుల వయసులో అతి పిన్న వయస్కురాలైన తైక్వాండో బోధకురాలిగా చరిత్ర సృష్టించిందని పేర్కొంది. ఈ చిన్నారి ఎంతో మంది పిల్లలకు ప్రేరణ. పిల్లలను క్రీడలకు సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే వారిలోని అపారమైన నైపుణ్యాలు వెలికివస్తాయనేందుకు ఈ చిన్నారే నిదర్శనం. అయితే నెటిజన్లు ఈ గిన్నిస్ పోస్ట్పై రకరకాలుగా స్పందించారు. కొందరేమో చిన్న వయసులో తైక్వాండో సాధన చేయడం హానికరం అని ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం పిల్లలు అసాధారణమై విజయాలు అందుకోగలరని ప్రూవ్ చేసింది ఆ చిన్నారి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆ పెర్ఫ్యూమ్ ప్రతి గంటకు 108 బాటిళ్లు సేల్ అవుతాయ్..! తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..) -
ఆ పెర్ఫ్యూమ్ ప్రతి గంటకు 108 బాటిళ్లు సేల్ అవుతాయ్..!
పెర్ఫ్యూమ్లు తయారీలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆహ్లాదభరితమైన వాటి సువాసనే దాని తయారీ వెనుకున్న కృషని కళ్లకు కట్టేలా చూపిస్తుంది. అయితే ఈ పెర్ఫ్యూమ్ మాత్రం ఎన్ని కొత్త బ్రాండెడ్ పెర్ఫ్యూమ్లు వచ్చినప్పటికీ..దాని క్రేజ్కి సాటిలేదు ఏదీ..!. ఇప్పటికీ విక్రయాల పరంగా ఎవర్ గ్రీన్ ఇదే. గంటకు వందలకొద్దీ బాటిళ్లు సేల్ అయిపోతాయట. అంతలా ప్రజాదరణ పొందిన ఈ పెర్ఫ్యూమ్ తయారీ వెనుకున్న గమ్మత్తైనా స్టోరీ చూస్తే.."ప్రేమ" గొప్ప ఆవిష్కరణాలకు దారితీస్తుందా..! అనిపిస్తుంది. మరీ ఆ పెర్ఫ్యూమ్ సృష్టికర్త..దాని తయారీకి ప్రేరేపించిన లవ్స్టోరీ వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.ఆ పెర్ఫ్యూమ్ సృష్టికర్త ఫ్రెంచ్ పెర్ఫ్యూమర్ జాక్వెస్ గెర్లైన్. 1924లో దాన్ని తయారు చేశాడు. సువాసన పరిశ్రమలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ పెర్ఫ్యూమ్గా ఇది నిలిచింది. ఇప్పటికీ దాని అమ్మకాలు రికార్డు స్టాయిలోనే ఉంటాయట. ఎన్నెన్ని కొంగొత్త బ్రాండ్లు కూడా దానిముందు నిలవజాలవని అంటారు మార్కెట్ నిపుణులు. జాక్వెస్ని ఈ పెర్ఫ్యూమ్ని తయారు చేసేలా ప్రేరేపించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ కథ అట. పారిస్ మహారాజుని సందర్శించినప్పుడే జాక్వెస్కి షాజహాన్ లవ్స్టోరీ గురించి తెలిసిందట. మొఘల్ చక్రవర్తి షాజహాన్కి తన భార్య ముంతాజ్ మహల్ అంటే ఎంతో ఇష్టమో తెలుసుకున్నాడట. ఆమె కోసమే షాలిమార్ గార్డెన్స్ని సృష్టించాడట. ఇక్కడ షాలిమార్ అంటే అత్యంత సువాసనా భరితమైన ఉద్యానవనం అని అర్థం. ఆఖరికి ఆమె తన నుంచి దూరమైపోయిందని, ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్ మహల్ని కట్టించాడని తెలుసుకుని చలించిపోయాడట. షాజహాన్ ప్రేమ ఆ ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమర్ని మనసును ఎంతగానో కదిలించిందట. అంతటి చక్రవర్తి గొప్ప ప్రేమను పొందిన మహారాజ్ఞీ ముంతాజ్ మహల్ గౌరవార్థం అత్యంత సువానభరితమైన సెంట్ని తయారుచేయాలని ఆ క్షణమే గట్టిగా నిశ్చయించుకున్నాడట. అలా జాక్వెస్ పరిపూర్ణమైన సువాసన కోసం వెల్వెట్ వెనిల్లా, గంధం,రెసిన్ బెంజోయిన్, ఐరిస్, ప్యాచౌలి, ధూపం వంటి కలయికతో మనసును కట్టిపడేసే అద్భుతమైన పెర్ఫ్యూమ్ని తయారు చేశాడు. అయితే దాని బాటిల్ డిజైన్ కూడా అంతే అద్భుతంగా ఉండాలని భావించి అసాధారణమైన డిజైన్ని ఎంపిక చేసుకున్నాడు. నీలిరంగు, ఫ్యాన్ ఆకారపు బాటిల్తో ఈ పెర్ఫ్యూమ్నీ తీసుకొచ్చాడు. ఈ బాటిల్ని బాకరట్ క్రిస్టల్తో తయారు చేశారట. అంతేగాదు ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ డిజైన్ 1925లో పారిస్లో జరిగిన అంతర్జాతీయ అలంకార కళల ప్రదర్శన అవార్డు(ఇంటర్నెషనల్ డెకరేషన్ అవారడు)ని గెలుచుకుంది. ఈ రోజు వరకు కూడా ఈ ఫెర్ఫ్యూమ్ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు 108 బాటిళ్లు అమ్ముడయ్యే పెర్ఫ్యూమ్గా రికార్డులకెక్కింది. (చదవండి: లక్షల ప్యాకేజీ కంటే..వ్యాపారమే ముద్దు..! వైరల్గా ఐఐటీ స్టూడెంట్ పోస్ట్) -
లక్షల ప్యాకేజీ కంటే..వ్యాపారమే ముద్దు..!
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఏ విద్యార్థి అయినా లక్షల ప్యాకేజీ జీతంపైనే దృష్టిపెడతారు. అందుకోసం అలాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం అహోరాత్రులు కష్టపడతారు. అయితే ఈ మహిళ కూడా ఆ ఆశతోనే అంతలా కష్టపడి ఐఐటీ, ఐఐఎం వంటి వాటిలలో విజయవంతంగా డిగ్రీ పూర్తి చేసింది. అనుకున్నట్లుగానే ఓ పెద్ద కార్పోరేట్ కంపెనీలలో లక్షల ప్యాకేజీ ఉద్యోగ పొందింది. అయితే లైఫ్ ఏదో సాదాసీదాగా ఉందన్నే ఫీల్. ఏదో మిస్ అవుతున్నా..అన్న బాధ వెంటాడటంతో తక్షణమే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఓబ్రాండెడ్ బిజినెస్ పెట్టాలనుకుంది. అందులో పూర్తి విజయం అందుకుంటానా..? అన్నా ఆలోచన కూడా లేకుండా దిగిపోయింది. మరీ ఆ ఆమె తీసుకున్న నిర్ణయం లైఫ్ని ఎలా టర్న్ చేసింది ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఆ మహిళే రాధిక మున్షి. ఆమె రెండు ప్రతిష్టాత్మక సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థిని. తాను లక్షల జీతం అందుకునే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని చీరబ్రాండ్ అనోరాను స్థాపించాలనే నిర్ణయంతో మలుపు తిరిగిన తన కెరియర్, ఆ తాలుకా అనుభవం తనకు ఏ మిగిల్చాయో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. మరీ ఇంతకీ రాధికా తన నిర్ణయం కరెక్టే అంటోందా..?ఇన్స్టా పోస్ట్లో "తాను ఐఐటీ, ఐఐఎంలలో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశాను. ఆ సమయంలో అత్యధిక జీతం అందుకోవడమే నా ప్రథమ లక్ష్యం. అయితే నేను ఎన్నడు అనుకోలేదు సొంతంగా బిజినెస్ పెడదామని. అందువల్లే నేను అనుకున్నట్లుగానే పెద్ద కార్పొరేట్లో అత్యథిక పారితోషకంతో ఉద్యోగం సాధించాను. అయితే ఏదో రోటీన్గా తన ఉద్యోగం లైఫ్ సాగిపోతుందంతే. ఆ తర్వాత ఎందుకనో ఇది కెరీర్ కాదనిపించి వెంటనే చీర బ్రాండ్ అనోరాను ప్రారంభించాను. మొదట్లో చీరల డిజైన్ చూసి కాస్త భయం వేసింది. అసలు జనాలు నా చీరలను ఇష్టపడతారా అని?..కానీ జనాలకు నచ్చేలా ఏం చేయాలో కిటుకు తెలుసుకున్నాక.. సేల్స్ చేయడం ఈజీ అయిపోయింది. ఇలా వ్యవస్థాపకురాలిగా మారిన క్రమంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా..అయితే వాటిని అధిగమిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందం, కిక్కు దొరికేది. తాను లక్షల కొద్ది జీతం పొందినప్పుడు కూడా ఇలాంటి సంతృప్తిని అందుకోలేకపోయానంటూ సగర్వంగా చెప్పింది. అయితే సమాజం, చుట్టూ ఉండే బంధువులు ఇలాంటి నిర్ణయాన్ని అనాలోచిత, తప్పుడు నిర్ణయంగా చూస్తారు. కానీ మనమే ధైర్యంగా ముందడుగు వేయాలి, ఏం జరిగినా సహృద్భావంతో ముందుకెళ్లాలి. పడినా గెలిచినా అది మన ఆలోచన నిర్ణయంతోనే జరగాలి. అప్పుడే ఏ రంగంలోనైనా విజయం సాధించగలం అంటూ తన స్టోరీ పంచుకుంది". వ్యవస్థాపకురాలు మున్షీ. కాగా, ఆమె 2023లో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుంచి విజయవంతంగా దూసుకుపోతోంది. ఆమె బ్రాండ్కి చాలామంది కస్టమర్లు ఉన్నారు. వారిచ్చే రివ్యూలను బట్టే చెప్పొచ్చు ఆమె బ్రాండ్ ప్రజల మనసుల్లో ఎలాంటి సుస్థిరమైన స్థానం పొందిదనేది. View this post on Instagram A post shared by Anorah ✨ Contemporary sarees (@anorah.in) (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
గురుత్వాకర్షణ లేని కురుల అందం!
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ‘మీ జుట్టు బాగుంది. అందంగా, దృఢంగా ఉంది. నేనేమీ జోక్ చేయడం లేదు. ఇది నిజం’ అని సునీతా విలియమ్స్ (Sunita Williams) జుట్టు గురించి ప్రశంసలతో ముంచెత్తాడు. జుట్టు అందం గురించి ప్రశంసలు వినడం సాధారణ విషయమే అయినా... అంతరిక్షంలో జుట్టును అందంగా, శుభ్రంగా కాపాడుకోవడం ఆషామాషీ విషయం కాదు! భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల తల స్నానం (Head Bath) చేయడం అనేది మనకసలు సమస్య కాదు. తలకు కాస్తంత షాంపు రుద్దుకొని షవర్ కింద నిలబడితే సరిపోతుంది.కాని అంతరిక్షంలో అలా కాదు. జుట్టు శుభ్రం చేసుకోవడం వ్యోమగాములకు కష్టమైన పని, దీనికి కారణం స్పేస్స్టేషన్లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం.నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ కరెన్ నైబర్గ్ అంతరిక్షంలో జుట్టు ఎలా శుభ్రం చేసుకుంటారో ఒక వీడియోలో చూపించింది. ఈ జీరో గ్రావిటీ హెయిర్ వాషింగ్ ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంది. ‘హెయిర్ వాష్ (Hair Wash) చేసుకోవడానికి నేను వీటిని ఉపయోగిస్తాను’ అంటూ గోరు వెచ్చని నీటి పాకెట్, షాంపూ బాటిల్, దువ్వెన, అద్దం, వైట్ టవల్ చూపించింది.మొదట నీళ్లను తలపై స్ప్రే చేసుకుంది. దువ్వెనతో తల వెంట్రుకలను పైకి దువ్వడం మొదలుపెట్టింది. వెంట్రుకలు కుదురుగా ఉండకుండా వివిధ దిశలలో ఎగురుతూనే ఉన్నాయి. ఆ తరువాత షాంపూ రాసుకుంది. మళ్లీ తల వెంట్రుకలను పైకి దువ్వింది. తరువాత టవల్తో తల క్లీన్ చేసుకుంది. మళ్లీ తలపై వాటర్ స్ప్రే చేసి దువ్వెనతో పైకి దువ్వింది, టవల్తో తుడుచుకుంది. ‘శుభ్రం చేసుకునేటప్పుడు జుట్టును సరిగ్గా పట్టుకోవడం కష్టమవుతుంది’ అంటుంది నైబర్గ్.నైబర్గ్ తన జుట్టును స్థిరమైన స్థితిలో ఉంచడానికి పడుతున్న కష్టం మనకు వీడియోలో కనిపిస్తుంది. దువ్వుతున్నప్పుడు ఆమె జుట్టు వివిధ దిశలలో ఎగురుతుంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) లోపల ఎయిర్ ఫ్లో తలపై తేమను ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లో డ్రైయర్ల అవసరం ఉండదు. చాలాసార్లు వ్యోమగాములు హెల్మెట్ (Helmet) లేదా హెడ్గేర్లను ధరిస్తారు. ఇది నెత్తిమీద గాలి ప్రసరణ (ఎయిర్ సర్క్యులేషన్)ను బ్లాక్ చేస్తుంది. జుట్టును ఫ్రీగా వదిలేయడం వల్ల చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది.చదవండి: సునీత రాక.. బైడెన్పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలునిరంతరం బ్రష్ చేయడం వల్ల కూడా జుట్టును ముడి వేయాల్సిన అవసరం ఉండదు. భూమిమీద తల వెంట్రుకలు బుద్ధిగా మన మాట వింటాయి. అంతరిక్షంలో మాత్రం ‘నా ఇష్టం’ అన్నట్లుగా ఉంటాయి. అయితే వాటి ఇష్టం వ్యోమగాములకు కష్టం కాదు. చాలామంది మహిళా వ్యోమగాములు తమ జుట్టును ఫ్రీగా వదిలేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. భూమిపై మాదిరిగా తల వెంట్రుకలు (Hair) ముఖంపై పడవు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. -
వెల్కమ్ సునీత
వినోదం కోసం నిర్మించే ‘బిగ్బాస్’ షోను మనం ఫాలో అయినట్టుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలిమయ్స్ వార్తలు ఫాలో అయ్యామా? 60 ఏళ్ల వయసులో ఆమె ఏం చెప్పడానికి అంతరిక్షంలో పరిస్థితులను ధిక్కరించి చిర్నవ్వును నిలబెట్టుకుంది? ‘నీకేం రాదు ఊరుకో’ అని ఇకపై స్త్రీలతో ఎవరూ అనకూడదు. సైకిల్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు వారు రిపేర్ చేయగలరు. వెల్కమ్ సునీతా. నీ విజయం మాకు గర్వకారణం... సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని జయించి సగర్వంగా భూమిని తాకనున్న మహిళ.పదిరోజుల ముందు మహిళా దినోత్సవం చేసుకున్నాం కదా. ఆ దినం వస్తుంది అంటేనే నాకు భయం వేస్తుంది. మహిళకు పది, పదహారు చేతులు పెట్టి ఓ చేతిలో కంప్యూటర్, ఓ చేతిలో పెన్ను, పుస్తకం, ఓ చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో అట్లకాడ; ఆడాళ్ళు ఏ పనైనా చేసేస్తారు, చేసెయ్యాలి; కానీ ఎంత గొప్ప పనులు చేసినా డిఫాల్ట్గా అట్లకాడ లేదా పప్పు గరిట లేనిదే స్త్రీ శక్తికి పరిపూర్ణత రాదు అని సందేశం ఇస్తారు. ఈ తలతిక్క వేడుకల మధ్యలో సునీత విలియం జీవన ప్రయాణం, వ్యోమగామిగా ఆమె సాధించిన విజయాలు, అంతరిక్ష నడకలు, నాసాకి చేసిన కృషి గురించి గుర్తు చేసుకోవడం ఒక ఊరట. స్టెమ్ రంగాలలో మహిళల విజయాలకు స్ఫూర్తిమంతమైన వేడుక.1965లో అమెరికాలో పుట్టిన సునీత నేపథ్యం రీత్యా, తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కావడం భారతీయులకు ఆమెను దగ్గర చేసే అంశం కాగా సునీత విజయాలు తేదీలతో,ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచ మహిళలంతా ఉత్సవాలు చేసుకోవలసిన సందర్భం. సునీత తొమ్మిదిసార్లు; అరవై గంటలకన్నా ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన మహిళలందరిలో ‘ఎక్కువ సమయం’ రికార్డ్ ఆమెదే.భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్, గుజరాత్ టెక్నలాజికల్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్, విశ్వ గుజరాత్ సొసైటీ వారి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డుతో పాటు, రష్యా ప్రభుత్వం మెడల్ ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అమెరికన్ డిఫెన్స్ సర్వీస్ సుపీరియర్ మెడల్ లాంటి లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమె ఖాతాలో చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. సునీత నౌకాదళంలో డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె 2770 కన్నా ఎక్కువ గంటలు విమానాలు నడిపారు. నాసాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006–07లో ఖీ –116 మిషన్ ద్వారా మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లి అక్కడ 195 రోజులు గడిపారు. ఆ తర్వాత 2012లో ఎక్స్పెడిషన్ 32/33లో మరొకసారి అంతరిక్షం చేరుకుని, బోలెడు ప్రయోగాలు చేశారు. ఇంకా చాలా చాలా. గత జూన్ లో స్వల్పకాల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కానీ, బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే దీర్ఘకాలం చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యం ప్రదర్శించి భూమికి వెనుతిరిగారు.ఐ కమాండర్ సునీత న్యూస్ విన్నప్పుడు నాకు అనేక విషయాలు ఆలోచనకు వచ్చాయి. మానవ జాతికి పనికి వచ్చే పరిశోధనల కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళతారు. అదే క్రమంలో సునీత స్పేస్స్టేషన్లో చిక్కుకుని పోతే భూమ్మీద కులాసా జీవితం గడిపే మనం ఎంతమాత్రం వారి గురించి తలచుకున్నాం? వినోదంలో భాగంగా ఒక హౌస్లో కొందరు చేసే అల్లరి, ఆటపాటలు, న్యూసెన్ ్స గొడవలు చూపిస్తే, ఎందుకూ పనికిరాని వాటిని ఆసక్తితో చూస్తూ వుంటాం.సునీత అంతరిక్షంలో గడిపిన సమయంపై టీవీలో వస్తే ఆ సమాచారానికి, ముఖ్యంగా మనప్రాంతంలో టీఆర్పీ రేటింగ్స్ ఏ మేరలో ఉంటాయో! మొత్తంగా మన ఆసక్తులను పునర్ నిర్వచించమని, వాటిని పనికొచ్చే కార్యక్రమాల్లో పెట్టమని సునీత ఇవాళ మనకు సందేశం ఇస్తోంది. సునీత, అరవై ఏళ్లకు దగ్గర పడుతున్నది. ఈ దశలో చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ బాగా గడిస్తే చాలు, ఇంట్లో పనులు అవసరం అయినంత మేర చేస్తే చాలు, ఆఫీసులో అక్షింతలు పడకుండా బైటపడితే చాలు అనుకుంటారు. కానీ ఈ దశ మరింత ఉత్పాదక అభివృద్ధికి అడ్డంకి కాదు అని సునీత మనతో చెబుతోంది. సైకిల్ మెకానిజం సైతం మగవారి డొమైన్గా పరిగణన చేసే మన సమాజంలో, కృషి, పట్టుదలకి తోడు అవకాశం కల్పిస్తే మహిళ ఎయిర్ మెకానిక్ కావడం సాధ్యమే అని సునీతని చూస్తే అర్థం అవుతోంది. – డాక్టర్ ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, ప్రోఫెసర్, రచయిత్రి -
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్: బాడీలో ఇన్ని మార్పులా..?
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ ఇటీవల బాగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే త్వరితగతిన బరువు తగ్గిపోతుండటంతో చాలామంది దాన్నే ఫాలో అవుతున్నారు. కొందరు తమ ట్రైనర్స్ ఆధ్వర్యంలో చేస్తుంటే మరికొందరూ అనాలోచితంగా ఫాలో అయ్యి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అయితే ఓ న్యూట్రిషన్ ఈ డైట్ని ఫాలో అయ్యి తన అనుభవాన్ని పంచుకున్నారు. అందరూ చెబుతున్నట్లు బరువు తగ్గినా..బాడీలో ఎంత సడెన్ ఛేంజ్లు వస్తాయో తెలిపారు. స్లిమ్గా మారడం ఎలా ఉన్నా..లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అవేంటంటే..పొట్ట వద్ద ఉన్న ఫ్యాట్ని తగ్గించాడానికి తాను ఏడు రోజులు జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ని తీసుకున్నట్లు తెలిపారు ప్రముఖ న్యూట్రిషన్ కోచ్ జస్టిన్ గిచాబా. అయితే ఏడు రోజుల్లో తన శరీరంలో పలు మార్పులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. బాడీ తేలికగా మారుతుంది. అయితే మిగతా పనులేవి చురుకుగా చేయలేకపోతున్న ఫీల్ కలిగిందని చెప్పారు. వర్కౌట్ చేస్తుంటే శక్తి సన్నగిల్లినట్లు అనిపించిందట. ఇదివరకటిలా ఏ బరువులు అంతగా ఎంతలేకపోయానని అన్నారు. బాడీలో ఫ్యాట్ తగ్గింది కానీ అనుహ్యంగా దాంతోపాటు బాడీలో ఉండే ఎనర్జీ కూడా తగ్గిపోయిందన్నారు. అలాగే మానసికంగా కూడా చాలా మార్పులు చూశానన్నారు. చివరికి తనకి ఇది ఆరోగ్యకరమైనది కాదని క్లియర్గా అర్థమైందన్నారు.జీరో కార్బోహైడ్రేట్స్ వల్ల సంభవించే మార్పులు..ఈ డైట్ని వరసగా ఏడురోజులు అనుసరించినప్పుడు సంభవించిన మార్పులను సవివరంగా ఇలా వివరించారు. గ్లైకోజెన్ క్షీణత: ఈ డైట్ ప్రారంభించిన మొదటి 24 నుంచి 48 గంటల్లో, శరీరం కండరాలు, కాలేయంలో నిల్వ చేయబడిన చక్కెర రూపంలో ఉన్న గ్లైకోజెన్ను ఉపయోగిస్తుంది. ప్రతి 1 గ్రా గ్లూకోజ్తో శరీరం 3 గ్రా నీటిని కలిగి ఉంటుంది కాబట్టి ుముందుగా శరీరం నీటి బరువును కోల్పోతుంది. కీటోసిస్ ప్రారంభమవుతుంది: గ్లైకోజెన్ నిల్వలు క్షీణించిన తర్వాత, శరీరం ప్రత్యామ్నాయ శక్తి వనరుగా కీటోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అంటే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు ఖర్చవ్వడం మొదలవుతుందన్నారు. View this post on Instagram A post shared by Justin Gichaba | Nutrition Coach (@justin_gichaba) శక్తి, మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు: చురుకుదనం కోల్పోయి, తలనొప్పి, అలసట వంటివి దరిచేరుతాయి. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా నిద్రలేమి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పారు. ఆకలి తగ్గిపోవడం: కీటోన్లు తరచుగా ఆకలిని అణిచివేస్తాయి. ఈ డైట్లో కొంతమంది సహజంగానే కొన్ని రోజుల తర్వాత తక్కువ తింటారని అన్నారు. జీర్ణ మార్పులు: కార్బ్ మూలాల నుంచి ఫైబర్ లేకపోవడం మలబద్ధకం వచ్చి.. గట్ మైక్రోబయోటాకు దారితీయవచ్చు.ఇన్సులిన్ స్థాయిలు: పిండి పదార్థాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి లేదా ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఒకరకంగా ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడవచ్చునని అన్నారు. ఎలా తీసుకుంటే బెటర్..జీరో కార్బో హైడ్రేట్లు బదులు తక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుగా ఉండేలా చూసుకుంటే చాలని చెప్పారు. ఫైబర్తో కూడిన కార్మోహైడ్రేట్లు ఎప్పటికీ ఆరోగ్యదాయకమైనవే అని అన్నారు. మన శరీరం ధర్మానికి అనుగుణంగా అన్ని సమతుల్యంగా తీసుకోవాలని సూచించారు. చివరగా కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉండే, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఎనర్జీని కోల్పోయే ప్రమాదం ఉండదు. పైగా దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు సమతుల్య ఆహారం అనేది అన్ని విధాల ఆరోగ్యానికి మేలని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.(చదవండి: మహిళా వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?) -
వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారి రాక కోసం అంతా నిరీక్షించారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడేలా మరికొద్దిగంటల్లో భూమ్మీదకు రానున్నారు. వారు అన్నిరోజులు అంతరిక్షంలో ఎలా గడిపారు, వారి మానసికస్థితి వంటి వాటి గురించి తెలుసుకోవాలనే కుతుహలంతో ఉన్నారు అంతా. ఒకరకంగా ఈ పరిస్థితి వల్ల భవిష్యత్తు అంతరిక్షంలో మానువుని మనుగడ గురించి కొత్త విషయాలు తెలుసుకునే అనుభవం దొరికిందని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఆ ఇరువురు చిక్కుపోయిన సమయంలో ఎప్పటికప్పుడూ వారెలా ఉన్నారనే దాని గురించి ఫోటోల రూపంలో అప్డేట్ ఇచ్చేది. ఆ ఫోటోల్లో సునీతా ఎప్పుడు వదులుగా ఉన్న జుట్టుతోనే కనిపించేవారు. నిజానికి ఆ చిత్రాలు చాలామందిలో ఓ ఉత్సుకతను రేకెత్తించింది. అసలు ఎందుకని మహళా వ్యోమగాములు అంతరిక్షంలో జుట్టుని ముడివేసుకోరనే ప్రశ్నను లేవెనెత్తింది. మరీ దీని వెనుకున్న రీజన్, ఆ సైన్సు ఏంటో చూద్దామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ వదులుగా ఉన జుట్టుతో కనిపించేవారు. ఆమె జుట్టు అంతరిక్షంలో గాల్లో ఎగురుతున్నట్లుగా కనిపించేది. అదిగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు చిక్కుపోయిన ఈ ఇరువురు వ్యోమగాముల గురించి మాట్లాడుతూ..సునీతా విలియమ్స్ జుట్టుపై వ్యాఖ్యలు చేశారు. అడవిలా గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తున్న ఆ ధృడమైన జుట్టుని చూస్తేనే తెలుస్తోంది ఆమె ఎంత ధైర్యవంతురాలేనది అని హాస్యాస్పదంగా అన్నారు.ఆ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలకుగానూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యారు కూడా. ఆ నేపథ్యంలోనే వ్యోమగాములు, ముఖ్యంగా మహిళలు అంతరిక్షంలో తమ జుట్టును ఎలా నిర్వహిస్తారనే విషయం హైలెట్ అయ్యింది.అదీగాక సునీతా విలియమ్స్లాంటి వ్యోమగాములంతా కూడా తమ జుట్లుని ముడివేయడం లేదా రబ్బర్తో కట్టేయడం వంటివి ఎందుకు చెయ్యరు అని అంశంపై చర్చించడం ప్రారంభించారు అంతా. అందుకు సైన్సు పరంగా పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.అవేంటంటే..గురుత్వాకర్షణ శక్తి శూన్యం కాబట్టి.. జుట్టును క్రిందికి లాగదు కాబట్టి ముడివేయడం లేదా కట్టేయడం వంటివి చేయాల్సిన పనిలేదు. సులభంగా వాషింగ్ చేసుకోవచ్చట. ఎలాంటి షాంపులతో పనిలేకుండానే వాష్ చేయొచ్చట. పైగా టవల్తో తుడుచుకోవాల్సిన పని ఉండదట. ఇక డ్రైయర్లతో అస్సలు పని ఉండదట. ఎందకంటే జుట్టులోని నీరంతా ఆవిరి అయిపోతుందట . అలాగే అక్కడ ఉంటే జీరో గ్రావిటేషన్ కారణంగా ఇలా జుట్టు ఫ్రీగా వదిలేసినా..ముఖం మీదకి వచ్చి ఇబ్బంది పడే సమస్య ఉండదట. దీనిపై నాసా వ్యోమగామి కరెన్ నైబర్గ్ సోషల్ మీడియా వేదికగా తన అంతరిక్ష అనుభవాలను షేర్ చేసుకుంటూ..ఆ అంతరిక్షంలో తన హెయిర్ కేర్ రొటీన్ గురించి కూడా మాట్లాడారు. 2013లో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నప్పుడు తన పొడవాటి జుట్టుని ఎలా వాష్ చేసుకుందో వివరించింది. తాము నీటిని చిమ్ముకుంటూ వాష్ చేసుకుంటామని తెలిపింది. తమకు షాంపుల వాడకం, అలాగే తడిచిన జుట్టుని పిండాల్సిన పని గానీ ఉండదని చెప్పింది. ఎందుకంటే తలపై ఉన్న నీరంతా అంతరిక్షంలో ఘనీభవించి త్రాగునీరుగా మారిపోతుందని చెప్పుకొచ్చింది.(చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?) -
టెలివిజన్ షోలో హైలెట్గా 'కివీ ఐస్ క్రీం డెజర్ట్'! సెలబ్రిటీ చెఫ్లే ఫిదా
స్టార్ ప్లస్లో మంచి ఫేమస్ అయిన షో సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా. ఇది పాకకళకు సంబంధించిన రియాలటీ షో. ఈ ఈవెంట్లో ప్రముఖ సినీ సెలబ్రిటీలు, మాస్టర్ చెఫ్ల సమక్షంలో కంటెస్టెంట్లు తమ పాక కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దగ్గర దగ్గర 12 నుంచి 15 మంది దాక పోటీదారులు పాల్గొంటారు. అయితే ఈ సారి మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 1లో ఓ వైరైటీ వంటకం ఆ షో న్యాయనిర్ణేతలని కట్టిపడేసింది. తప్పనిసరిగా ఆ డెజర్ట్ని తమ భోజనంలో భాగంలో చేసుకుంటామని అన్నారు. అదేంటో చూసేద్దామా..:తన పాక నైపుణ్యంతో న్యాయనిర్ణేతను ఫిదా చేసింది అర్చన గౌతమ్ అనే పోటీదారురాలు. ఆమె ఈ సీజన్ పోటీలో జడ్జీలను తన పాక కళతో అమితంగా జడ్జీలను ఆకట్టుకుంది. వండిన విధానమే గాక సర్వ్ చేసే తీరు హైలెట్గా నిలిచింది. అయితే ఆమె ఇటీవల జరిగిన ఎపిసోడ్లో చేసిన వంటకంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.ఆ షో న్యాయనిర్ణేతలు కూడా ఆ వంటకం చేసిన తీరు, ప్రెజెంట్ చేసిన విధానానికి ఫిదా అయ్యి ప్రశంసలతో ముంచెత్తారు. మరీ ఆ కంటెస్టెంట్ తయారు చేసిన వంటకం ఏంటంటే.. కివి ఐస్ క్రీం:ఆ షోలో ఆమె కివి ఐస్క్రీంని తయారు చేసింది. ఆకృతిపరంగానే కాకుండా తయారు చేసిన విధానం కూడా వేరెలెవెల్. కివిని పచ్చిపాలతో కలపి, అల్లం, పుదీనా, మిరపకాయలతో అత్యద్భుతంగా తయారుచేసింది. దాన్ని క్యాండీ ఫ్లాస్తో అందంగా సర్వ్ చేసింది. చూడటానికి ఏదో కళాత్మక ఖండంతో కలగలిసిన వంటకంల ఆకర్షణీయంగా ఉంది. ఇక ఆ షోలో సెటబ్రిటీలు ఫరా ఖాన్, రణవీర్ బ్రార్ , ప్రముఖ చెఫ్ ఈ వంటకాన్ని ఎంతో బాగుందంటూ ప్రశంసించారు. అంతేగాదు తాము ఇక నుంచి తమ భోజనంలో ఈ వంటకం ఉండేలా చూసుకుంటామని అన్నారు. కొన్ని వంటకాల తయారీ మనలో దాగున్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీస్తాయంటే ఇదే కదూ. అందులోనూ ఆ కంటెస్టెంట్ ఆరోగ్యకరమైన వాటితోనే రుచికరమైన డెజర్ట్ చేసి మరిన్ని ఎపిసోడ్లు కొనసాగేలా అర్హత పొందింది. View this post on Instagram A post shared by Viral Duniya (@viral_duniya_247) (చదవండి: కృత్రిమ గుండెతో వంద రోజులకు పైగా బతికిన తొలి వ్యక్తి..!) -
కృత్రిమ గుండెతో వంద రోజులకు పైగా బతికిన తొలి వ్యక్తి..!
కృత్రిమంగా గుండెని తయారు చేయడం అనేది వైద్యశాస్త్రంలో ఓ అద్భుతం. పైగా దాన్ని ఒక మనిషికి అమర్చి సమర్థవంతంగా పనిచేసేలా చూడటం మరో అద్భుతం. అయితే అది ఏ కొన్ని గంటలో కాదు ఏకంగా వంద రోజులకు పైగా ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలిపింది. దాత దొరికేంత వరకు ఊపిరిని అందించింది. గుండె వైఫల్యంతో బాధపడే రోగుల్లో కొత్త ఆశను రేకెత్తించింది. వైద్య చరిత్రలోనే ఈ కేసు ఓ అద్భుతమని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ కృత్రిమ గుండెని ఎవరికీ అమర్చారు. దాని విశేషాలేంటో చూద్దామా..!.టైటానియంతో తయారు చేసిన కృత్రిమ గుండెతో వందరోజులకు పైగా జీవించిన తొలి వ్యక్తిగా ఆస్ట్రేలియన్ న్యూ సౌత్ వేల్స్ చరిత్ర సృష్టించాడు. ఈ 40 ఏళ్య వ్యక్తికి గత నవంబర్లో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆస్పత్రిలో టైటానియంతో తయారు చేసిన బివాకర్ అనే పరికరాన్ని అమర్చారు. ఆయన తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతుండటంతో విన్సెంట్ ఆస్పత్రి వైద్యులు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ పాల్ జాన్జ్ నేతృత్వంలో దాదాపు ఆరుగంటలు శ్రమించి ఈ కృత్రిమ గుండె ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేశారు. ఈ ఆధునాత వైద్యాన్ని అందించిన తొలి వైద్య బృందం తామే కావడం గర్వంగా ఉందన్నారు వైద్యుడు జాన్జ్. అంతేగాదు ఇలా ప్రపంచంలో కృత్రిమ టైటానియం గుండెని పొందిన ఆరవ వ్యక్తి అతడేనని చెప్పారు. అతను ఈ గుండెతో పెద్దగా ఎలాంటి సమస్యలు లేకుండా వందరోజులకు పైగా బతికి బట్టగట్ట గలిగాడన్నారు. అతడికి ఈ నెల ప్రారంభంలో ఒక దాత గుండెని అమర్చినట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె ఇంప్లాంట్ ప్రక్రియని "అద్భుతమైన క్లినికల్ విజయం"గా ప్రకటించారు ఆస్ట్రేలియన్ వైద్య బృందం.ఏంటీ టైటానియం బివాకర్..క్వీన్స్ల్యాండ్లో జన్మించిన డాక్టర్ డేనియల్ టిమ్స్ ఈ గుండె మార్పిడి బివాకర్ పరికరాన్ని కనుగొన్నారు. దాత గుండె మార్పిడి అందుబాటులోకి వచ్చే వరకు రోగులను సజీవంగా ఉంచడానికి ఇది వారధిలాగా పనిచేస్తుంది. ఇది నిరంతర పంపుగా పనిచేస్తుంది. దీనిలో అయస్కాంతంగా సస్పెండ్ చేసిన రోటర్ శరీమంతా సాధారణ పల్స్లో రక్తం ప్రసరించేలా చేస్తుంది. ఇలా సస్పెండ్ చేసి ఉన్న అయస్కాంతం చర్మం వెలుపల ఉన్న త్రాడు మాదిరి పరికరంతో బయట పోర్టబుల్ కంట్రోలర్కు కలుపుతుంది. పగటిపూట బ్యాటరీలతో పనిచేస్తుంది. రాత్రిపూట మెయిన్స్లో ప్లగ్ చేసి ఉంటుంది. ఇక్కడ టైటానియంని ఉపయోగించడానికి ఇది తుప్పు నిరోధకత కలిగినది, అలాగే బలమైన జీవన వ్యవస్థకు అనూకూలమైనది కావడమే. ప్రస్తుతం ఈ పరికరాన్ని తాత్కాలిక ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు..భవిష్యత్తులో ఇది ఇతర అనారోగ్య పరిస్థితుల కారణంగా గుండె మార్పిడికి అర్హత లేనివారికి ఉపయోగపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం ఆ దిశగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె పనితీరు కాల వ్యవధి దాత గుండె కంటే చాలా తక్కువ అనేది గమనించదగ్గ విషయం.(చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
ఇస్రో శాస్త్రవేత్త ఆధ్యాత్మిక సేవ..! బృహత్ గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని..
ఆయనో శాస్త్రవేత్త.. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇష్రో)లో పనిచేసి, వృత్తిలో తన ప్రతిభను కనబర్చిన విజ్ఞాన వేత్త. భారతీయ సాహిత్యం, సంస్కృతి సంప్రదాయంలోని విశిష్టతను అవసోపన పట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇందులో భాగంగానే తేనెలొలికే తెలుగు పదాలతో పుణ్య చరితుడు బమ్మెర పోతన రచించిన పద్య భాగవతాన్ని ఈ తరానికి మరింత చేరువ చేయాలనుకున్నారు. అంతటి బృహత్ గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని అచ్చు పుస్తక రూపంలో, ఇంటర్నెట్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయనే.. న్యూనల్లకుంటకు చెందిన మందడి కృష్ణారెడ్డి. – ఇప్పటికే వివిధ రూపాల్లో లభ్యమవుతున్న భాగవత సంబంధిత సమాచారానికి ఆయన చేసిన ఆధునాతన రూపకల్పన ఈతరం భాగవత విశ్లేషకులకు, ఔత్సాహికులకు సులభతరం చేసింది. ఒక ఉన్నత శ్రేణి శాస్త్రవేత్తగా ఇస్రో ఐఐఎస్యూ తిరువనంతపురం నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఆయన.. తర్వాత విశ్రాంత సమయాన్ని దైవకార్యంగా భావించి సాహిత్య విశిష్టతలను కలగలిపి ఉన్న శ్రీమద్భాగవతాన్ని అందరికీ సులువైన మార్గంలో అందించడానికి సమగ్ర సంకలన రూపకల్పనకు నాంది పలికారు. ఇందులో భాగంగా సాంకేతిక అభివృద్ధి ఆకాశాన్ని అంటుతున్న ఈ కాలంలో వినూత్నంగా ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ అనే మార్గాన్ని ఎంచుకుని శ్రీమద్భాగవతంలోని 12 స్కందాలు, 688 ఘట్టాలలోని 10,061 పద్యాలకు భావాన్ని, పదోచ్చారణ నేర్చుకోవడానికి వీలుగా ఆ పద్యాల ఆడియోను రూపొందించారు. ప్రతి పద్యంలోని పదాలకు అర్థం, ఆ పద్యానికి సంబంధించిన వ్యాకరణ అంశాలు ఛందస్సు, అలంకారాల వివరాలన్నీ ఒక పద్యం నుంచి మరొక పద్యానికి విషయ సూచిక ఆధారంగా సులువుగా వెళ్లేలా సమకూర్చారు. ఇవన్నీ కేవలం ఒక ప్రధాన పవర్ పాయింట్ స్లయిడ్ నుంచి ఒక్క క్లిక్తో సాధ్యమయ్యేలా చేశారు. సాహిత్యం, శ్రీమద్భాగవతం వంటి గ్రంథ పఠనం కష్టతరమైన ప్రస్తుత కాలంలో ఇంత సులభతరంగా పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడం అమృతప్రాయమైన విషయంగా భావిస్తున్నారు. ఈ అనితర సాధ్యమైన సాధనం ఉపయోగించడంలో ఒక ప్రధాన స్లయిడ్ నుంచి వేల పద్యాలకు సంబంధించిన పేజీలకు ఏర్పరచిన హైపర్ లింక్స్ ద్వారా సులువుగా వెళ్లేలా విస్తృతమైన ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ చేయటం ఇదే ప్రథమం. మందడి చెన్నకృష్ణారెడ్డి, రంగనాయకమ్మ పుత్రుడైన కృష్ణారెడ్డి ఒకప్పటి ఆర్ఈసీ ఇప్పటి నిట్ వరంగల్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్, ఐఐటీ చెన్నై నుంచి ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం పరిశోధనలోనూ తన ప్రతిభతో ఎన్నో అవార్డులు అందుకున్నారు.సమగ్ర సంకలనంగా రూపొందించా.. ఈ సంకలనానికి, ‘శ్రీభాగవత సుధానిధి‘ అని నామకరణం చేశాను. ఎందరో మహానుభావులు పద్య భావాన్ని, ఆ పద్యాలకు సంబంధించిన ఎన్నో విశేషాలను క్రోడీకరించి అందుబాటులోకి తెచ్చారు. కానీ ఆ అంతర్యామి లీలా విశేష గ్రంథమైన శ్రీమద్భాగవతానికి సంబంధించి గ్రంథ విశేషాలను ఒక సమగ్ర సంకలనంగా రూపొందించాను. తెలుగు భాష, గ్రంథ పఠనంపై ఆసక్తి మాత్రమే అర్హతగా విద్యార్థులు మొదలుకొని పెద్దల వరకు ఎవరైనా అమృత తుల్యమైన పోతనామాత్యుల విరచిత శ్రీమద్భాగవత గ్రంథ విశేషాలను సులువైన మార్గంలో ఆకళింపు చేసుకునేలా రూప కల్పన చేశాను. ఈ ప్రయత్నంలో భాగంగా శ్రీమద్భాగవత పద్యాలు, ఆ పద్యాల భావాన్ని, పదోచ్చారణ, ప్రతిపదార్థం, పద్యాలలోని అలంకార విశేషాలు విడివిడిగా ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలలో లభ్యమవుతున్న వాటిని సమగ్ర సంకలనంగా మార్పు చేశాను. – కృష్ణారెడ్డి (చదవండి: మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే..!) -
మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే..!
జాతీయ స్థాయిలో ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ మిసెస్ ఇండియా పోటీల్లో ప్రియాంక తారే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చత్తీస్గఢ్లోని భిలాయ్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ఆమె మిసెస్ ఇండియా తెలంగాణ క్వీన్ 2025 అనే ప్రతిష్టాత్మక బిరుదుతో పాటు మిసెస్ ప్యాషనేట్ అవార్డు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జాతీయ వేదికపై మిసెస్ ఇండియా పోటీలో తెలంగాణ సౌందర్యాభిలాషను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ప్రియాంక తారే అద్భుత ప్రతిభావంతురాలు. ఎంఎన్సీసీలో హెచ్ఆర్, సీఎస్ఆర్గా పలు ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఆమె క్రీడలు, పాటలు, నృత్యం వంటి వాటిలో మంచి ప్రతిభావంతురాలు . ప్రియాంక రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. ఆమె తన డ్రీమ్ని నెరవేర్చుకోవడమే గాక ఇతరులను కూడా ఆ మార్గంలో వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అంతేగాదు వివిధ రకాల ఎన్జీవోలతో కలిసి నిరుపేద బాలికలు/పిల్లల సంక్షేమం, మహిళ సాధికారత వంటి సామాజిక కార్యక్రమాల కోసం తన వంతుగా సేవలందిస్తోంది. (చదవండి: 'విందోదయం': బ్రేక్ ఫాస్ట్లకు కేరాఫ్ ఈ టిఫిన్ సెంటర్లు..!) -
'విందోదయం': బ్రేక్ ఫాస్ట్లకు కేరాఫ్ ఈ టిఫిన్ సెంటర్లు..!
మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఇంటిల్లి పాదీ కలిసి పేరున్న రెస్టారెంట్/కేఫ్లకు లంచ్, డిన్నర్లకో వెళ్లడం తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ సమయం కూడా సిటిజనుల మీట్ అండ్ ఈట్లకు కేరాఫ్గా మారింది. లేట్నైట్స్లోనే బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేసెస్ గురించి మాట్లాడుకుని ఉదయమే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీజనులు తమ బ్రేక్ ఫాస్ట్, అల్పాహారం కోసం తరచూ ఎంచుకునే వాటిలో ఇవీ.. టేస్టీ ఫుడ్ ఆస్వాదించి సంతృప్తిగా రోజును ప్రారంభించడం కన్నా మంచి రోజు ఏముంది? అద్భుతమైన వంటల వారసత్వానికి ప్రసిద్ధి చెందిన మన నగరం, రుచికరంగా రోజును కిక్స్టార్ట్ చేయడానికి అనేక ఎంపికలను అందిస్తుంది. దోసెలు, ఇడ్లీల వంటి సంప్రదాయ దక్షిణ భారతీయ ఇష్టమైన వాటి నుంచి ఆమ్లెట్లు, వాఫ్ఫల్స్ వంటి అంతర్జాతీయ వెరైటీల వరకు మన సిటీలోని అల్పాహార సమయం.. వైవిధ్యంగా ఉంటుంది. రుచులు అనుభవాల విందోదయాల కోసం అందుబాటులో కొన్ని.. కోఠిలోని సందడిగా ఉండే వీధుల్లో ఉన్న ప్రగతి టిఫిన్ సెంటర్ దక్షిణ భారత అల్పాహార ప్రియుల సందడితో నిండి ఉంటుంది. క్రిస్పీ దోసెలు, మెత్తటి ఇడ్లీలు, ఊతప్పమ్లకు ఈ సెంటర్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హైలైట్ ఏమిటంటే ప్రతి వంటకంతో పాటు అందించే చట్నీలు. ఉదయం 7గంటల నుంచి 9 గంటలలోపు హనుమాన్ టేక్డి, హెచ్వీఎస్ రోడ్లో ఉన్న ఈ సెంటర్ను సందర్శించం అంటే నోరూరించే దక్షిణాది వంటకాలను ఆస్వాదించినట్లే.. సంప్రదాయ రుచులను కోరుకునే వారు గచ్చిబౌలిలోని ఇందిరానగర్లో ఉన్న ఉడిపి ఉపహార్కు చలో అంటున్నారు. ఇడ్లీలు, వడలు, దోసెలు, ఊతప్పమ్ వంటి అనేక రకాల దక్షిణ భారతీయ ప్రధాన వంటకాలను అందిస్తుంది. మెనూలో డబుల్ కా మీఠా, బొబ్బట్టు వంటి స్వీట్ ట్రీట్లు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ అల్పాహారం ఉదయం 7 నుంచి 10.30గంటల మధ్య అందుబాటులో ఉంటుంది.మాదాపూర్లోని హమ్మింగ్ బర్డ్ కేఫ్లో కేఫ్ స్టైలి ఆరోగ్యకరమైన అల్పాహారం కోరుకునే సిటిజనులు ఎంచుకుంటున్నారు. ఇక్కడ మష్రూమ్ ఆమ్లెట్ల నుంచి బ్రోకలీ చీజ్ ఆమ్లెట్ల వరకు రోజంతా అల్పాహారం అందించడం విశేషం. ఆహారం పోషకాలతో నిండిన సూప్లు, సలాడ్లతో పాటు కాఫీలూ ఎంజాయ్ చేయవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.30 దాకా అందుబాటులో ఉంటుంది. పిజ్జాదోస, పాస్తా దోస, మంచూరియా దోస వంటి వెరైటీ ఆధునిక దక్షిణ భారత బ్రేక్ఫాస్ట్లను కోరుకునేవారు బంజారాహిల్స్లోని రాయల్ టిఫిన్ సెంటర్ను ఎంచుకుంటున్నారు. వీరి మెనూలో ఉప్మా ఊతప్పమ్ల వంటి క్లాసిక్స్ కూడా ఉన్నాయి. ఆహ్లాదకరమైన అలంకరణ, ప్రత్యేకమైన మెనూతో జూబ్లీహిల్స్లోని ది హోల్ ఇన్ ది వాల్ కేఫ్ అల్పాహార ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇంగ్లిష్ బ్రేక్ ఫాస్ట్ వెరైటీల్లో.. వెజ్జీ పిజ్జా ఆమ్లెట్, గోల్డెన్ ఫ్రిటాటా మిక్స్ ఇక్కడ హైలైట్స్గా చెప్పాలి. స్వీట్ టూత్ ఉన్నవారు ఇక్కడి చాక్లెట్ వాఫ్ఫల్స్, బ్లూబెర్రీ చీజ్ వాఫ్ఫల్స్ తప్పనిసరిగా టేస్ట్ చేయాలి. ఉదయం 8.30గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. సిటిజనులకు చిరపరిచితమైన పేరే మినర్వా కాఫీ షాప్. ఈ పేరు దక్షిణ భారతీయ వంటకాలకు పర్యాయపదంగా ఉంది. టమాటా చట్నీ రైతాతో కలిపిన రైస్ పొంగల్, నెయ్యితో నింపిన ఇడ్లీలు క్రిస్పీ దోసెలు ఇక్కడ స్పెషల్.. ఇక్కడి ఫిల్టర్ కాఫీ వావ్ అనిపిస్తుందంటారు కాఫీప్రియులు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకూ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. నగరంలోని దారుల్షిఫా, చట్టా బజార్లో ఉన్న హోటల్ నయాబ్ ఉదయం 5 గంటల నుంచే సంప్రదాయ అల్పాహారాన్ని అందిస్తుండటం ఎర్లీ బైకర్స్ను ఆకర్షిస్తోంది. బటర్ నాన్, లుక్మీతో పాటు భేజా ఫ్రై వంటి స్థానిక హైదరాబాదీ ప్రత్యేకతలతో బ్రేక్ ఫాస్ట్ చేయిస్తోంది. ఇరానీ చాయ్తో సహా మన అసలైన రుచులను ఇష్టపడేవారు నయాబ్ను సందర్శిస్తున్నారు. ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఇక్కడ బ్రేక్పాస్ట్ ప్రియుల సందడి కనిపిస్తుంది. (చదవండి: -
ఇన్ఫెక్షన్: సెల్యు'లైట్' తీసుకోకండి..!
ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మానికి సెల్యులైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఇందులో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, చర్మం ఎర్రగా అలాగే బాధితులకు వేడిగా అనిపిస్తుంటుంది. ముట్టుకుంటేనే నొప్పి (టెండర్నెస్)తో బాధాకరంగా ఉంటుంది. ఇది చేయి లేదా కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే చేయి/ కాలికి మాత్రమే పరిమితమైన ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టగల ఈ సెల్యులైటిస్పై అవగాహన కోసం ఈ కథనం.సెల్యులైటిస్ సాధారణంగా దేహంలోని కాలు, చేయితో పాటు ఏ భాగానికైనా రావచ్చు. కానీ ఈ కండిషన్ కాలిలో కనిపించడమే ఎక్కువ. సెల్యులైటిస్తో ప్రభావితమైన కాలు బాగా వాచిపోతుంది. ఎర్రబారుతుంది. ఇలా జరగడాన్ని ఎరిథిమా అంటారు. వాపు వచ్చి ముట్టుకుంటే మంట (ఇన్ఫ్లమేషన్)తో, లోపల వేడిగా ఉన్న భావన కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్తో కూడిన సెల్యులైటిస్ను తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించిన కొద్దీ సెల్యులైటిస్లోని ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంతో కలిసి లింఫ్నోడ్స్కూ వ్యాపిస్తుంది. సెల్యులైటిస్ కనిపించే సూక్ష్మక్రిములివే... సెల్యులైటిస్ సోకిన కాలు నునుపుదనంతో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతకు ముందే కాలికేదైనా గాయం ఉండటం, చర్మం చీరుకుపోయి ఉండటం వంటివి జరిగితే దానికి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడంతో పాటు అది రెండో (సెకండరీ) దశకు చేరితే... అది సెల్యులైటిస్కు దారితీయవచ్చు. ఇందుకు చాలారకాల సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) కారణమవుతాయి. ఉదాహరణకు... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్ ఎస్పీపీ, బ్యాక్టీరియోడీస్ వంటివి వీటిల్లో ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధాన రకాలకు చెందిన సూక్ష్మజీవులూ ఉంటాయి. సెల్యులైటిస్లో ఎలా వస్తుందంటే?వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకుపోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్కు దారితీస్తుంది. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకు΄ోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్కు దారితీస్తుంది.చర్మం రంగు మారడం: సెల్యులైటిస్ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. అప్పటికే ఎర్రటి చర్మం ఉన్నవారిలో ఇలా ఎర్రబారడం జరిగితే దాన్ని గుర్తుపట్టడం కాస్తంత కష్టమవుతుంది. అదే కాస్త నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ రంగు మార్పును వెంటనే గుర్తుపట్టడం సాధ్యమతుంది. దాంతో తగిన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. వాపు రావడం : సాధారణంగా వాపు పాదం నుంచి మొదలై పై వైపునకు వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలు కావచ్చు. ∙కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది బాగా నునుపుగా అనిపిస్తూ, మెరుస్తూ కనిపిస్తుంది. వాపు కారణంగా చర్మం బాగా బిగుసుకు΄ోయినట్లుగానూ అనిపిస్తుంటుంది. ∙ముట్టుకుంటే మంట / నొప్పితోపాటు లోపల వేడిగా ఉన్నట్లుగానూ అనిపిస్తుంటుంది. ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలతో... చలితో కూడిన జ్వరం కూడా కనిపించవచ్చు. ∙రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనడానికి ఇది ఒక సూచన. ∙వాపు వచ్చిన కాలి భాగంలోని పుండ్ల నుంచి పసుపు రంగుతో కూడిన చీము స్రవిస్తుంటుంది. సెల్యులైటిస్కు తావిచ్చే కండిషన్స్చర్మానికి గాయమై అది దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం. చర్మం చీరుకు΄ోయి ఆ గాయం చాలాకాలం మానక΄ోవడం, కాలి మీద పుండ్లు రావడం. దీర్ఘకాలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి, అవి దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం (ప్రధానంగా కాలికి... అథ్లెట్స్ ఫూట్ వంటివి). ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కొద్దిగా అరుదుగా దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా. ∙చర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉందాహరణకు చికెన్పాక్స్, షింగిల్స్ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉండి కాలిపై దీర్ఘకాలికంగా పుండ్లు పడటం (డయాబెటిస్ ఉన్నవారిలో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ).రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉండటం (వేరికోసిక్ వెయిన్స్ వంటివి). పెరిఫెరల్ వ్యాస్క్యులార్ డిసీజ్ వంటి జబ్బుల కారణంగా. శరీరంలో లింఫ్ ప్రవాహం తగినంతగా లేకపోవడం వల్ల. దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో. (అంటే... క్రానిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్కు అవకాశాలెక్కువ). స్థూలకాయం ఉన్నవారిలో. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కారణంగా. చాలా సందర్భాల్లో కాలిన గాయాల కారణంగా. చర్మంలో ప్రవేశపెట్టే సూదుల కారణంగా (ఇంట్రావీనస్గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా వంటివి), ట్యూబ్స్, ఆర్థోపెడిక్ కేసుల్లో చర్మంలోపల అమర్చే ప్లేట్లు, రాడ్ల వంటి వస్తువుల కారణంగా. ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల. కొన్ని కీటకాల కాటు కారణంగా (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల. దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వల్ల... ఇలాంటి అనేక కారణాల వల్ల సెల్యులైటిస్ రావచ్చు. ఒకసారి సెల్యులైటిస్ సోకాక...ఒకసారి సెల్యులైటిస్ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్’ అంటారు. ఈ దశలో సెల్యులైటిస్కు సరైన చికిత్స తీసుకోక΄ోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్కు వెంటనే చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్ సెల్యులైటిస్ అంటారు.సాధారణంగా కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్ వస్తుంటుంది. సెల్యులైటిస్ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూపోతుంటే దాన్ని అసెండింగ్ సెల్యులైటిస్ అంటారు. సాధారణంగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇలా జరుగుతుంది. సెల్యులైటిస్ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటే దీన్ని యూనిలేటరల్ సెల్యులైటిస్గా పేర్కొంటారు. ఈ యూనిలేటరల్ సెల్యులైటిస్ చాలా సాధారణం. కానీ కొంతమందిలో రెండుకాళ్లకూ సెల్యులైటిస్ కనిపించ వచ్చు. కాకపోతే ఇది కాస్తంత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్ రావడాన్ని ‘బైలేటర్ కాంకరెంట్ సెల్యులైటిస్’ అంటారు. చికిత్స యాంటీబయాటిక్స్తో చికిత్స స్ట్రెప్టోకాక్సి, స్టెఫాలోకాక్సి బ్యాక్టీరియాను మట్టుపెట్టే యాంటీబయాటిక్స్ మందులను నోటి ద్వారా తీసుకోవడం లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో నరానికి ఇంజెక్షన్ ద్వారా పంపడం వంటి చికిత్స అందిస్తారు.వ్యాయామం (ఫిజియోథెరపీ) వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం అవసరమవుతుంది. కొన్ని జాగ్రత్తలుసెల్యులైటిస్ను నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాలిపై ఎలాంటి గాయాలూ లేకుండా చూసుకోవడం.కాలి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్త వహించడం.కీటకాలు, జంతువులు కుట్టకుండా / కరవకుండా వాటిని దూరంగా ఉంచడం.కాలిన గాయాలైనప్పుడు అవి పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉండటం.కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైన వారు మురికినీళ్లలోకి వెళ్లక΄ోవడం. గాయమైన కాలితో సముద్రపు నీటిలోకి వెళ్లకపోవడం. కాలికి సరిగ్గా సరిపోయి, సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్ ధరించడం. (కాలికి గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్ను బలవంతంగా తొడగకూడదు. చెప్పులు లేదా షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి జరుగుతుంటే ఆ పాదరక్షలను తొడగడం మానేసి, సౌకర్యంగా ఉండే వాటినే తొడుక్కోవాలి. పాదరక్షల వల్ల కాలికి గాయాలవుతున్నాయా అంటూ తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి) అథ్లెట్స్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్తోపాటు అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్కు తగిన చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గేలా జాగ్రత్త వహించడం వేరికోస్ వెయిన్స్ వంటి సమస్య వస్తే అది తగ్గేలా చికిత్స తీసుకోవడం సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం. చివరగా... సెల్యులైటిస్ వచ్చి, అది ప్రాణాంతకం అవడం కంటే ... కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో అసలది రాకుండానే చూసుకోవడం మేలు.డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్డా.జి. వెంకటేష్ బాబు, సీనియర్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ – కాస్మటిక్ సర్జన్ (చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
ఐదు వందల ఏళ్ల నాటి బావి..నిర్మించిన తీరుకి విస్తుపోవాల్సిందే..!
పురాతన శిల్పాలు, ఆనాటి కట్టడాలు గొప్పగొప్ప కథలెన్నో చెబుతుంటాయి. ఆనాటి రాజరికపు దర్పాన్ని, ప్రజా జీవన శైలిని కళ్లకు కడుతుంటాయి. అలాంటిదే కర్నూలు జిల్లా మండల కేంద్రం మద్దికెరలోని భోజరాజు బావి. ఇది సుమారు 5 వందల ఏళ్ల క్రితం పెద్దనగరి యాదవరాజులైన భోజరాజు తవ్వించారు. నాటి నుంచి నేటికీ గ్రామస్థులు, ఆ బావి నీటిని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దాదాపు 70 అడుగుల లోతు, 80 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ బావి ఎన్నో ప్రాచీన విగ్రహాలతో ఆకట్టుకుంటుంది. ఈ బావిని ఎలాంటి మట్టి, ఇతర సామగ్రిని వినియోగించకుండా రాతి మీద రాతిని పేర్చి, హెచ్చుతగ్గులు కనిపించకుండా కట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాతి కట్టడంపై దేవతామూర్తులు, నర్తకుల నృత్యభంగిమలు, జలచర జీవుల రూపాలు, జలకన్యలు ఇలా వందలకొద్ది శిల్పాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. పదేళ్ల క్రితం వరకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ బావి నీటినే వినియోగించేవారు. కాలక్రమేణా నీళ్ల వ్యాపారం మొదలైననాటి నుంచి, ఎవరికి వారు, వాటర్క్యాన్స్ కొనుక్కుంటూ ఈ బావి నీటిని గృహ అవసరాలకు వాడటం మానేశారు. ప్రస్తుతం ఈ నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. ‘అప్పట్లో ఈ నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు ఉండేవి కావు, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తేవి కావు’ అని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు.కరువులోనూ ఆదుకుంది..దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు మా వంశస్తులు నిర్మించిన భోజరాజు బావి ప్రజల దాహార్తిని తీర్చింది. ప్రస్తుతం 15 ఎకరాల వ్యవసాయ భూమికి ఈ బావి నీరే ఆధారమైంది--విజయ రామరాజు జమేదార్ మద్దికెరపి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు డెస్క్టి.వెంకటేశ్వర్లు, మద్దికెర(చదవండి: ఈ తిను 'బండారం' గురించి తెలుసుకోండి..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?
హైదరాబాద్కు చెందిన పద్మావతి(24)కి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. నాటి నుంచి పిల్లలు లేక అనేక ఆసుపత్రులకు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు సిటిజన్ హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి వైద్య పరీక్షలు చేసి సంతాన చికిత్స అందించారు. గర్భం దాల్చి ఆదివారం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ముగ్గురు ఆడశిశువులని, ఇరువురు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు. వైద్య చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా సహకారం అంంచినట్లు పేర్కొన్నారు.'జన్యుపరమైన కారణాల వల్లే'మహిళ గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఏకకాలంలో ఫలదీకరణం చెందడం వల్ల ఇలా ఒకే కాన్పుల్లో ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చని చెప్పారు. ఒకే కాన్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణమని, అయితే ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టడాన్ని వైద్య పరిభాషలో పాలీజైగోటిక్ అంటారని తెలిపారు వైద్యులు. (చదవండి: అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారి! జీతం ఒక్క రూపాయే..!) -
అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారి! జీతం ఒక్క రూపాయే..!
ఇంతవరకు ఎంతోమంది ఐఏఎస్ అధికారులను చూసి ఉండుంటారు. అతెందుకు టీనా దాబి, అమిత్ లోధా వంటి ఎందరో సెలబ్రిటీ హోదాని పొందిన అధికారులను చూశాం. కానీ ఈ ఐఏఎస్ అధికారి గురించి విని ఉండటం అత్యంత అరుదు. ఒక్క రూపాయే జీతం తీసుకున్న ఐఏఎస్ అతడు. కానీ కలెక్టర్లందరి కంటే అత్యంత ధనిక కలెక్టర్ ఆయన. ఎవరా కలెక్టర్ అంటే..అతడే ఐఏఎస్ అమిత్ కటారియా. ఆయన హర్యానాలోని గురుగ్రామ్లో ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. అతడి కుటుంబం కోట్లలో వార్షిక టర్నోవర్తో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రన్ చేస్తోంది . అంతేగాదు ఆ వ్యాపార సామ్రాజ్యం ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా విస్తరించి ఉంది. అయితే కటారియా కుటుంబ వ్యాపారాన్ని పక్కకుపెట్టి మరీ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సివిల్ సర్వీస్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. అలా కటారియా ఐఏఎస్ అయిన ధనవంతుడుగా నిలిచాడు.. ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్.. అమిత్ కటారియా తన పాఠశాల విద్యను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బి.టెక్ డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, కటారియా UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE)కి ప్రిపేరవ్వడం ప్రారంభించారు. చివరికి 2003లో సివిల్స్ నియామక పరీక్షలో ఉత్తీర్ణుడై ఐఏఎస్ అయ్యారు. ఆయన ఆల్ ఇండియా 18వ ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నారు. చత్తీస్గడ్ కేడర్లో కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. అయితే ఐఏఎస్ అమిత్ కటారియా సివిల్ సర్వీసెస్లో చేరినప్పుడు కేవలం రూ. 1 జీతమే తీసుకునేవారని సమాచారం. అందుకు కటారియా తాను దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఐఏఎస్ అయ్యానని అంటుండేవారని అంతరంగికులు చెబుతున్నారు. అమిత్ కటారియా 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి రావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇది ప్రోటోకాల్కు విరుద్ధం. ఆ సమయంలో కటారియా ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత బస్తర్ జిల్లా జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు. వైవాహిక జీవితం..ఐఏఎస్ అమిత్ కటారియా వృత్తిరీత్యా వాణిజ్య పైలట్ అయిన అస్మితా హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరుచుగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. పైగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆ జర్నీల తాలుకా ఫోటోలను షేర చేసుకునేవారు. ఇక ఈ ఐఏఎస్ అమిత్ కటారియా ఆస్తులు నికర విలువ దాదాపు రూ. 8.90 కోట్లు పైనే అని అంచనా. (చదవండి: సైన్స్ కోర్సు చదవలేకపోయా..! క్షణాల్లో వీడియో వైరల్.. ఏకంగా కేంద్ర విద్యామంత్రే..) -
చిన్నారులకు చిప్స్ ప్యాకెట్లు కొనిస్తున్నారా..?
పిల్లాడు అన్నం తినడం లేదు.. వెంటనే ఓ చిప్స్ ప్యాకెట్ తాయిలమైపోతుంది. పాప మారాం చేస్తోంది.. మరో ఎరుపురంగు ప్యాకెట్ తారకమంత్రంగా పనిచేస్తుంది. బుజ్జాయి స్కూలుకు వెళ్తోంది.. ఆ బ్యాగ్లో పుస్తకాలు ఉన్నా లేకున్నా చిరుతిళ్ల ప్యాకెట్టు మాత్రం ఉండి తీరుతుంది. చిన్నారి బడి నుంచి వచ్చాడు. ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టకుండా వీధి చివరి దుకాణంలో ఊరూపేరూ తెలియని రంగురంగుల ప్యాకెట్ వాడి నోరు మూయిస్తుంది. ఏ పదార్థంతో తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారో తెలీని ‘ప్యాకెట్లు’ చిన్నారుల పాలిట విషంగా మారుతున్నాయి. ఈ తిను ‘బండారం’ తెలుసుకోకుండా తల్లిదండ్రులు చేతులారా పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. ఏ షాపు చూసినా చిరుతిళ్ల ప్యాకెట్ల తోరణాలు కనిపిస్తుంటాయి. ఏ మాత్రం వాటి ఆకర్షణలో పడినా పిల్లలను ఆస్పత్రుల చుట్టూ తిప్పాల్సిందే. జంక్ ఫుడ్ పేరిట నానా రకా ల పదార్థాలు పాన్షాపుల్లో దర్శనమిస్తున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో ఆకట్టుకునే బొమ్మలతో పిల్లల నోరూరిస్తున్నాయి. కానీ ఇటువంటి చిరుతిళ్లు చిన్నారుల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే భారీమూల్యం తప్పదని చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్కు చెందిన రింగ్స్ చిప్స్ ప్యాకెట్లు ఎక్కువగా జిల్లాలోని దుకాణాల్లో కనిపిస్తున్నాయి. రింగ్స్, ట్రాప్స్ అనే రకాలకు చెందిన రింగ్స్ చిప్స్ ఒడిశా నుంచి వస్తున్నాయని, ట్రాయ్ రింగ్స్ అనే రకం పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా వస్తున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. ఎక్కువగా పాఠశాలలు ఉండే ప్రాంతాల్లో పాన్ షాపుల్లో రెండు, ఐదు రూపాయలకే ఈ చిరుతిళ్లు దొరుకుతుండడంతో.. అవి తినడం బాలలకు వ్యసనంగా మారిపోతోంది. ముప్పొద్దులా వీటినే తింటుండడంతో చాలా మంది ఉదర సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రంగు రంగు ప్యాకెట్లు, నకిలీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జంక్ ఫుడ్స్కు దూరంగా ఉంచాలి పిల్లలను జంక్ఫుడ్స్కు దూరంగా ఉంచాలి. జింక్ ఫుడ్స్లో కెమికల్స్ ఉంటాయి. ఇవి తిన డం వల్ల చిన్నారులకు ఊపిరితిత్తుల సమస్యలు, కడుపు నొప్పి, విరోచనాలు, ఆకలి మందగించడం వంటి సమస్యలు పిల్లలకు ఎక్కువగా వస్తుంటాయి. పాణిపూరి, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. – జి.వేణుగోపాల్, చిన్నపిల్లల వైద్యుడు, సీహెచ్సీ, పాతపట్నంవిద్యార్థులు చదువుకు దూరం విద్యార్థులు పాఠశాలకు వచ్చేముందు చిప్స్, రింగ్స్ ప్యాకెట్లు తినుకుంటూ వస్తుంటా రు. పాఠశాలకు వచ్చి కడుపు నొప్పి, విరేచనాలు అంటూ మా కు చెబుతుంటారు. ఇంటికి విద్యారి్థని పంపిస్తుంటాము. మధ్యాహ్నం భోజనం కూడా పాఠశాలలో సరిగా తినడం లేదు. చిరుతిళ్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. – పొడ్డిడి కృష్ణారావు,హెచ్ఎం, ఎంపీపీ మెయిన్ పాఠశాల, పాతపట్నం(చదవండి: 10th Class Exams: ఈ పంచ సూత్రాలతో ఒత్తిడిని అధిగమిద్దాం..గెలుపును అందుకుందాం!) -
మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్ వైరల్
ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ జోరుగా నడుస్తోంది. ప్రముఖ్యంగా ఈ సీజన్లో చాలామంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. బ్యాచిలర్స్ జీవితానికి బై బై చెప్పేస్తున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ విపుల్ ధనాకర్ క్లబ్లో చేరారు. తన లేడీలవ్తో ఏడడుగులు వేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఈ జంటను అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.విలేన్గా పాపులర్ సింగర్ విపుల్ ధనాకర్. తాజాగా ( మార్చి 16)తన ప్రేయసి దివ్య దహియాతో వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం గురించి చాలా గోప్యంగా ఉండే, విలేన్ ఇన్స్టాగ్రామ్లో ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఈ సడన్ సర్ప్రైజ్కి ఫ్యాన్స్సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. "మా ఈ ప్రయాణం లోతు ఎంతో మాకు మాత్రమే తెలుసు మా కష్టాలు, బాధలు, అనుభవించిన, బాధ , ప్రేమ అన్నీ.. చివరకు ఇలా.. జీవితాంతం కలిసి పయనించబోతున్నాం’’ తన జీవితంలో ముఖ్యమైన రోజు గురించి వార్తను షేర్ చేశాడు. దీంతో కొన్ని అందమైన ఫోటోలను కూడా పంచుకున్నాడు.విలేన్,దివ్య దహియా పెళ్లిదుస్తుల్లో అత్యద్భుతంగా కనిపించారు. తెల్లటి, సిల్వర్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో రాయల్ లుక్తో అదిరిపోయాడు. ముత్యాల హారం, ముత్యాలు, కుందన్ కల్గితో అలంకరించిన తెల్లటి పగ్డితో, గడ్డంతో విలేన్ లుక్ మరింత ఎలివేట్ అయింది.ఇకవధువు దివ్య పాస్టెల్ పింక్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది. ఎంబ్రాయిడరీ స్కర్ట్, సరిపోలే బ్లౌజ్తో మహారాణిలా మెరిసిపోయింది. తలపై షీర్ దుపట్టా, క్లాసీగా కనపించింది. డైమండ్ నెక్లెస్, గ్యాజులు మ్యాచింగ్ చెవిపోగులు ,మాంగ్ టీకాతో లుక్ను మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అద్భుతంగా ఉన్నారు..దిష్టి తగిలేను జాగ్రత్త అంటూ నెటిజన్లు కొత్త జంటను అభినందించారు.గాయకుడిగా విలేన్ న్యూ ఢిల్లీకి విపుల్ దనాకర్ యూట్యూబ్లో తన మ్యూజిక్ వీడియోలకు బాగా ప్రాచుర్యం పొందాడు. 2018లో ‘ఏక్ రాత్’,చిడియా (2019) పాటలతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూత లూగించాడు.అలాగే సావన్, జవానీ లాంటి పాటలతోపాటు, కనికా కపూర్ తో పాడిన తాజా పాట ‘చురాకే’ మరింత ప్రజాదారణ పొందాడు. గాయకుడిగా, స్వరకర్తగా,రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ప్రయాణంలో చాలా కష్టపడ్డాను. ప్రతిదీ అర్థం చేసుకోవాలి, దర్శకత్వం , స్క్రీన్ ప్లే రాయాలి, ఎడిటింగ్ కంపోజింగ్, సాహిత్యం ఎలా రాయాలి వీటన్నింటిలోనూ పట్టు ఉండాలి,అప్పడేరాణిస్తాం అంటాడు విలేన్. View this post on Instagram A post shared by Vilen (@vilenofficial) -
పదోతరగతి పరీక్షలు: ఈ పంచ సూత్రాలతో ఒత్తిడి పరార్..! గెలుపుని ఒడిసిపడదాం ఇలా..
ఈనెల 21 నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షల్లో విజయానికి ప్రణాళిక బద్ధంగా చదవడం సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయి ప్రతికూల ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. దీంతో పరీక్షలు అంటే విద్యార్థులకు భయం ఏర్పడడం సహజం. ఇలాంటి సమయాల్లో ఎంతో నేర్పుగా ఉండి, ఆందోళనలను దూరం చేసుకుని స్వేచ్ఛగా పరీక్షలను రాస్తే విజయం సొంతం చేసుకోవచ్చు. ప్రణాళిక బద్ధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వీలు కలుగుతుంది.ఉపాధ్యాయులు ఇలా చేయాలి..విద్యార్థులను జీపీఏ, ర్యాంకులు, మార్కుల పేరు తో ఒత్తిడి చేయరాదు. ఇంటి వద్ద పిల్లలు ఎలా చదువుతున్నారు అనే దానిపై తల్లిదండ్రులతో ఆరా తీయాలి. పరీక్షల నేపథ్యంలో ఆందోళన చెందకుండా తరచూ పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడి ప్రోత్సహించాలి.విద్యార్థులతో చేయకూడనివి..విద్యార్థులను ఇతరులతో పోల్చి వాళ్లలోని ఆత్మనున్యత భావాన్ని కలిగించరాదు. వారిని భోజనం చేయడానికి ఒంటరిగా వదలకుండా వారితో కలిసి కడుపునిండా భోజనం చేసేలా చూడాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ వాళ్ల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చాలి. వారిపై అత్యాశలు పెట్టుకొని వారిని చదవాలంటూ తరచూ ఒత్తిడికి గురిచేయొద్దు. తల్లిదండ్రులు, టీచర్లు వారి ఆశలను పిల్లలపై రుద్ది ఇబ్బందులకు గురి చేయరాదు.వైద్యులతో కౌన్సెలింగ్పరీక్షలు అంటేనే భయానికి గురయ్యే విద్యార్థులకు ఒత్తిడి బారిన పడకుండా స్థానిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. విషయాల వారీగా ఎలా సిద్ధం కావాలని తెలియజేస్తూ ప్రశాంతంగా ఉండేందుకు సలహాలు సూచనలు చేయాలి. పౌష్టిక ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర కలిగి ఉండడం, యోగా ధ్యానం చేసే విధంగా ప్రోత్సహించాలి. టీవీ సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. చదువుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలి. బట్టీ పట్టకుండా అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి.పంచ సూత్రాలు పాటిద్దాం..ధోరణి: విద్యార్థులు మానసిక స్థితి బాగుండాలి. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఎలాంటి ఆందోళన గురికారాదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సందేహాలను నివృత్తి చేసుకొని బృంద చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి.నమ్మకం: సబ్జెక్టుల వారీగా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ముందుగా తనపై తనకు నమ్మకం కలిగి ఏదైనా సాధించగలమనే దీమా పెంచుకోవాలి. లక్ష సాధనకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలి.ఏకాగ్రత: పాఠ్యాంశాలను చదివే క్రమంలో పూర్తి ఏకాగ్రతను కలిగి ఉండాలి. చదివే సమయంలో ఆలోచనలు, చూపు పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. నిత్యం ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.క్రమశిక్షణ: పరీక్షల సమయంలో సామాజిక మాద్యమాలకు దూరంగా ఉండాలి. సెల్ ఫోన్, టీవీలకు బానిసలు కాకుండా పుస్తకాలపైనే దృష్టి పెట్టాలి. చదువును వదిలి పక్కదారి పట్టే విధంగా కాకుండా క్రమశిక్షణగా మెలగాలి.దృష్టి: విద్యార్థుల దృష్టి పూర్తిగా చదువుపై కేంద్రీకరించాలి. వ్యసనాలకు దూరంగా ఉండి పుస్తకాలతోనే గడపాలి. టీచర్లు, పేరెంట్స్ విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి కఠిన అంశాలపై పట్టు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. సులువైన వాటిని చివరకు చదివే విధంగా సూచనలు చేయాలి.అందమైన చేతి రాతతో..పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించేందుకు అందమైన చేతి రాత ఎంతో ఉపకరిస్తుంది. అక్షరాలను ఆకట్టుకునే విధంగా గుండ్రంగా రాస్తూ పదాలకు పదాలకు మధ్య సమదూరాన్ని పాటించాలి. అక్షరాలన్నీ ఒకే సైజులో ఉండేలా, అక్షర దోషాలు లేకుండా కొట్టివేతలకు తావుగకుండా చూసుకోవాలి.తేలికగా జీర్ణమయ్యే ఆహారం మేలుసమయానికి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. పప్పు దినుసులు, ఆకుకూరలు, పాలు, పండ్లు తినాలి. కాఫీ, టీ జోలికి పోరాదు. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తాగితే జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఉండవు. రోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.– డాక్టర్ గందె కార్తీక్, జనరల్ ఫిజీషియన్, నారాయణపేటప్రశాంతంగా చదవాలిపరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లలు ఆందోళన, మానసిక ఒత్తిడికి గురికారాదు. మార్కులపై దృష్టి పెట్టి బెంగ పడితే లాభం ఉండదు. మానసిక ప్రశాంతతతోనే ఉత్తీర్ణత సాధిస్తాం. మెదడు చెరుకుగా పనిచేసే విధంగా ఉత్తేజితం కావాలి.– యాద్గిర్ జనార్ధన్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణపేట.ఇతర విషయాలపై దృష్టి పెట్టొద్దుప్రశాంతంగా ఉండి ఉత్సాహంతో పరీక్షలకు హాజరు కావాలి. గంటల తరబడి చదవాలనే నియమం లేదు. మానసికంగా సంసిద్ధులుగా ఉన్న సమయంలోనే పాఠ్యాంశాలు చదవాలి. ఇతర విషయాలపై దృష్టి పెట్టరాదు. ఇప్పటివరకు చదివిన అంశాలనే పునఃశ్చరణ చేసుకోవాలి. కొత్త వాటి జోలికి పోరాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.– గోవిందరాజు, డీఈఓ(చదవండి: తల్లికి జరిగిన అన్యాయమే ఐఏఎస్ అధికారిగా మార్చింది..ఆనంద్ మహీంద్రా మెచ్చిన స్టోరీ..) -
పద్ధతిగా బతకడం అంటే ఇది..!
ఓ రాజుకు ఒక గురువు తారసపడ్డాడు. రాజ్యం సుఖసంతోషాలతో ఉండాలంటే ఏమి చేయాలని ఆ గురువును అడిగాడు రాజు. ప్రతి గ్రామంలోనూ సత్సంగం జరుపుకోడానికి, ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడానికి తగిన భవన సముదాయాలు కట్టించమన్నాడు గురువు.అలాగేనన్నాడు రాజు. అయితే రాజు మనసులో ఓ అనుమానం మొదలయ్యింది. ‘నిజంగా అలాంటి ఏర్పాట్లు చేస్తే ప్రజల్లో నైతికత, భక్తి భావం నెలకొని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారా?’ అని! ‘సరే, ప్రయత్నించి చూద్దాం, సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం’ అని మందీమార్బలంతో బయలుదేరాడు.తమ రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న చిన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ గుడి దగ్గర ప్రవచనకర్త ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు. జనం దండిగా కూర్చుని ప్రవచనాలను ఆసక్తిగా వింటూ ఉన్నారు. కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు రాజు అక్కడే ఉండి ‘‘నాలుగు మంచి మాటలు వినడానికి మీరు చూపిస్తున్న ఆసక్తి ఎంతో సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీకందరికీ నా కానుకగా ఒక్కో వెండినాణెం ఇవ్వదలిచాను. వచ్చి తీసుకోండి’’ అని చెప్పాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆశ్చర్యపోయాడు రాజు. విషయం ఏమిటని ప్రవచనకర్తను అడిగాడు. ‘‘ఇక్కడి వారికి చేయి చాపడం ఇష్టం ఉండదు. ఉచితంగా ఇస్తే ఏదీ తీసుకోరు’’ అని చెప్పాడు ప్రవచనకర్త. ఎందువల్ల వారు ఇలా చేస్తున్నారని అడిగాడు రాజు.‘‘ఏళ్లకొద్దీ ఈ గ్రామంలో సత్సంగం జరుగుతోంది. బతికినంత కాలం పద్ధతిగా బతకాలని అనుకుంటారు. తాము కష్టపడి సంపాదించిన దానితో తృప్తిగా జీవనం సాగిస్తారు’’ అని బదులిచ్చాడు ప్రవచనకర్త. రాజు చిన్నగా అక్కడినుంచి బయలుదేరి నదికి ఆవల ఉన్న మరో గ్రామానికి వెళ్ళాడు. అక్కడ రచ్చబండ దగ్గర చాలామంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాజు వచ్చింది తెలుసుకుని అందరూ గుమికూడారు.‘‘మీ ఊర్లో సత్సంగం జరుగుతోందా?’’ అని అడిగాడు రాజు. అలాంటి పదమే వినలేదని బదులిచ్చారు. మీకందరికీ వెండి నాణేలు పంచాలని ఉందని చెప్పాడు రాజు. అంతే... జనం పరుగులు తీస్తూ వచ్చి, ఎగబడి తీసుకున్నారు. రాజులో ఆలోచనలు మొదలయ్యాయి.‘మొదటి గ్రామంలో ఇచ్చేవాడున్నా తీసుకోలేదు వారు. ఆధ్యాత్మిక భోధనల వల్ల గ్రామస్తులు ఉన్నదానితో తృప్తిగా ఉన్నారు. వారి మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ్డాయి. రెండవ గ్రామంలో... ఎవరైనా ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామస్తులు తీసుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారంటే వారిలో ‘ఇంకా... ఇంకా’ కావాలన్న కోరిక బలంగా ఉంది. ఎందుకంటే ఆ గ్రామస్తుల మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ లేదు’ అని గుర్తించాడు రాజు.‘ఆధ్యాత్మిక బోధనలు చేయించి మంచి చెడ్డలు తెలియజేయాల్సిన బాధ్యత నాది’ అని అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు రాజు. త్వరత్వరగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భవన సముదాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి: దైనందిన జీవితంలో దైవం అంటే..?) -
'వాకింగ్ యోగా': జస్ట్ ఒకే వ్యాయామంతో..!
నడక, యోగా రెండూ దేనికవే ప్రత్యేకం. ఆరోగ్యకరమైన వ్యాయామ మార్గాలు. ప్రస్తుతం ఈ రెంటినీ మిళితం చేసిన సరి కొత్త వ్యాయామంగా అందుబాటులోకి వచ్చింది వాకింగ్ యోగా. అటు నడక ద్వారా లభించే ప్రయోజనాలతో పాటు.. ఇటు యోగా ఫలితాలను ఒకే వ్యాయామం ద్వారా అందుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అనేక మందిని ఆకట్టుకుంటున్న ఈ వాకింగ్ యోగా విశేషాలివి..నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నడక– యోగా ఆ ప్రయోజనాలను మరింత ముందడుగు వేయిస్తుంది. ఆధునిక సౌకర్యాలు, పని విధానాల వల్ల చలన రహితంగా మారుతున్న శరీరాన్ని చురుకుగా కదపడానికి విభిన్న రకాలుగా సాగదీయడానికి, సరైన రీతిలో శ్వాస పీల్చుకోడానికి వీలుగా ఈ వాకింగ్ యోగా రూపుదిద్దుకుంది. ఇది నడిచేటప్పుడు మన శరీర భంగిమను మెరుగుపరచడానికి, నడకను మరింత ప్రయోజనకరంగా మార్చడానికి సహకరిస్తుంది. ఏదో నడిచాం అన్నట్టుగా కాకుండా అవగాహనతో నడవడం నేర్పిస్తుంది. ఇందులో ప్రతి అడుగు లోతైన శ్వాస, సున్నితమైన స్ట్రెచ్లతో కలిపి ఉంటుంది. భంగిమకు మేలు.. మనలో చాలా మంది మన శరీర భంగిమ ఎలా ఉంటుందో పట్టించుకోకుండా నడుస్తూ ఉంటారు. తద్వారా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతుంటారు. వాకింగ్ యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్లు, మెడ.. వీటిని సరైన రీతిలో ఉంచేలా సహాయపడుతుంది. నిటారుగా నిలిచేలా, నడుము భాగం, వీపుతో నడకను అనుసంధానిస్తుంది. కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొందరికి అననుకూలం.. ఒక వ్యక్తి తమ నడకను మరింత విశ్రాంతిగా అదే సమయంలో మరింత ఉపయుక్తంగా మార్చే నడక యోగా టీనేజర్స్తో సహా అన్ని వయసుల వారికీ ఉపయుక్తమే. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది అందరికీ అనుకూలం కాకపోవచ్చు. వేగవంతమైన నడక లేదా తీవ్రమైన వ్యాయామాలను ఇష్టపడే వ్యక్తులకు నప్పకపోవచ్చు. అలాగే, దీనికి ఏకాగ్రత, ఎక్కువ సహనం అవసరం. అది లేనివారు దీన్ని సాధన చేయడం కష్టం. నప్పుతుందో లేదో తెలుసుకోడానికి ఒక వారం పాటు దీనిని ప్రయత్నించి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానసికంగానూ ఎంతో మేలు.. నడక యోగా ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతిని అందించడానికి ఒక గొప్ప మార్గం. ఇది నడుస్తున్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం అలవాటు చేస్తుంది. తద్వారా ఆందోళనను, ప్రతికూల ఆలోచనలను తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది చురుకుగా ఉంటూనే మెదడుకు రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయడం లాంటిదని చెప్పొచ్చు. మనసు శరీరానికి క్రమబద్ధమైన అభ్యాసం ఇది. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని, ఏకాగ్రతను పెంచడానికి శరీరంపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజుకు 5 నిమిషాలతో.. బాగా పరిచయం ఉన్న కాస్త ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో రోజుకు ఐదు నిమిషాలతో ఈ వాకింగ్ యోగాని ప్రారంభించాలి. రోజుకు క్రమంగా ఐదు నిమిషాల చప్పున పెంచుకోవచ్చు. తద్వారా రొటీన్ వ్యవహారాలకు, వ్యాయామాలతో సర్దుబాటు కావడానికి కండరాలకు సమయాన్ని ఇవ్వాలి. ‘రోజుకు 20 నిమిషాలు వచ్చే వరకూ ఈ విధంగా పెంచుతూపోవాలి. ప్రతిరోజూ 20 నిమిషాలు కేటాయించలేకపోతే.. కనీసం వారానికి మూడు రోజులు 30 నిమిషాలు చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. 50 ఏళ్ల క్రితమే.. మైండ్ఫుల్ వాకింగ్ అనే ప్రక్రియను యోగా శిక్షకురాలు, యోగా ఫర్ పెయిన్ యాప్ సృష్టికర్త, లండన్కు చెందిన సోఫియా డ్రోజ్డ్ వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఇదేమీ కొత్తది కాదని, దాదాపు 50 ఏళ్ల క్రితం.. అంటే 1970 ప్రాంతంలోనే రోజువారీ కార్యకలాపాలతో యోగా, బ్రీత్వర్క్లను కలిపే సాధనంగా ఇది ప్రప్రథమంగా వినియోగంలోకి వచ్చిందని డ్రోజ్డ్ అంటున్నారు. ప్రకృతితో మమేకం.. మైండ్ ఫుల్ వాక్.. దృష్టిని పూర్తిగా శ్వాస మీదే కేంద్రీకరిస్తూ.. ఆలోచనలు మరే విషయం మీదకూ మళ్లించకుండా శరీరాన్ని కదిలించడమే మైండ్ ఫుల్ నెస్. నడిచే సమయంలో ఈ ప్రక్రియను సాధన చేస్తే.. అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అది కూడా ప్రకృతిలో మమేకమవుతూ చేయడం మరింత ప్రయోజనకరం. నడకను, యోగాను మేళవించడమే వాకింగ్ యోగా. మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నేచర్ వాక్, పచ్చని గడ్డి మీద నడిచే బేర్ ఫుట్ వాక్, క్లౌడ్ గేజింగ్.. వంటివన్నీ ఇందులో భాగంగానే చెప్పవచ్చు. నగరంలో పలువురు వాకింగ్ యోగాను సాధన చేస్తున్నారు. – రీనా హిందోచా, యోగా శిక్షకురాలు (చదవండి: క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..) -
క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..
నూడుల్స్ని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వంటకం ఇది. భారతీయుల వంటకాల జాబితాలో ప్రస్తుతం ఇదే అగ్ర స్థానంలో నిలుస్తోంది. ఈజీగా అయిపోయే వంటకం కావడంతో అంతా దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా బిజీగా ఉండే వర్కింగ్ మహిళలకు ఇది ఎంతో తేలిగ్గా చేసే వంటకం. అయితే ఈ రెసిపీ తయారీని ఎవరు కనిపెట్టారు..? ఎలా ప్రజలకు ఇష్టమైన వంటకంగా మారింది తదితరాల గురించి చూద్దామా..!.క్షణాల్లో తయారు చేసే వంటకం ఏదన్నా ఉందంటే అది మ్యాగీ నూడుల్సే. భారతీయ సంస్కృతిలో కూడా అంతర్భాగమైపోయింది. అంతలా ప్రజాదరణ చూరగొన్న ఈ వంటకం తయారీ ఎవరు కనుగొన్నారంటే..ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని చూరగొన్న ఈ వంటకం విజయవంతమైన బ్రాండ్గా నిలిచి అందరి మన్ననలకు అందుకుంటోంది. ఈ మ్యాగీ వంటకం పుట్టింది 19వ శతాబ్దంలో స్విట్జర్లాండ్లోని కెంప్తాల్ అనే సుందరమైన పట్టణంలో జరిగింది. 1884లో యువ ఔత్సాహిక వ్యవస్థాపకుడు జూలియస్ మ్యాగీ అనే వ్యక్తి ఈ మ్యాగీ నూడుల్స్ ఒక బ్రాండ్లా తీసుకొచ్చాడు. తక్కువ సమయంలో మంచి పోషకాలతో రుచికరమైన వంటకం చేయాలనే సంకల్పంతో జనించిన వంటకం ఇది. అయితే మొదట్లో ఇది ఉప్పు, మిరియాలతో తయారైంది. అనాతికాలంలోనే దీని ఉత్పత్తులకు తర్వగా ప్రపంవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దాంతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యూఎస్ వంటి ఇతర దేశాల్లో కూడా దాని శాఖలు తెరిచే స్థాయికి చేరుకుంది. 1900 సంవత్సరంలో, జూలియస్ ఉత్పత్తులు స్విట్జర్లాండ్ వంటి అనేక దేశాలకు విస్తరించాయి. ఇక జూలియస్ మొత్తం 18 రకాల వెరైటీ ఫ్లేవర్డ్ నూడిల్స్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈమ్యాగీ ప్యాకేజ్ ఉత్పత్తులను ఈజీxe ఐడెంటిఫై చేయగలం. కానీ ఆకాలంలో ఇవి ఎరుపు, పసుపు, నలుపు రంగుల ప్యాకింగ్ల ద్వారా మాత్రమే గుర్తించేవారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ని నెస్లే కొనుగులు చేసి చౌక ధరల్లో నాణ్యతతో కూడిన పోషకాహారాన్ని అందించాలనే ఆకాంక్షను నెరవేర్చుకుంది. అలాగే నెస్లే నివేదిక ప్రకారం.. "ప్రతి సెకనుకు, ప్రపంచవ్యాప్తంగా 21000 కంటే ఎక్కువ ఆహారాలు మాగీ ఉత్పత్తులతో తయారైనవే." సంవత్సరాలుగా, ఈ బ్రాండ్ చాలా మంది హృదయాల్లో మంచి స్థానాన్ని ఏర్పరుచుకుంది. చకచక తయారై ఈ వంటకం ఆల్-టైమ్ సొల్యూషన్తో వచ్చిన రెసిపీ. ఎప్పటికీ మహిళలకు, బ్యాచిలర్లకు, నిమిషాల్లో ఎలాంటి శ్రమ లేకుండా క్షణాల్లో తయారై వంటకంగా పేరు తెచ్చుకుంది.(చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..) -
ఆన్లైన్ ఫుడ్ క్రేజ్..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం..వ్యాపార నిమిత్తం ఉదయం నుంచి ఉరుకుల పరుగులమయం.. రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే వైనం.. దీనికితోడు పిల్లల అభ్యున్నతికి ఆరాటం.. నిత్యం బతుకు పోరాటం.. ఇదీ నేటి నగర జీవనం.. ఈ స్థితిలో వంట తయారీకి దొరకని సమయం.. కొత్తజంటలకు వంట చేయడం తెలియనితనం.. వెరసి..హోటళ్లలో భోజనమే ఆధారం..అక్కడి వరకూ వెళ్లడానికి ఓపిక లేనితనం.. ఆన్లైన్ భోజనం ఆరగించడానికే మొగ్గు చూపుతున్న జనం. ఫలితం రోజురోజుకూ పెరుగుతున్న ఇంటి వద్దకే భోజనం సంప్రదాయం. నగర జీవనం బిజీబిజీగా గడుస్తోంది. మెరుగైన జీవనం కోసం భార్యాభర్తలిద్దరూ కష్ట పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులుగానో.. వ్యాపారం వైపో పరుగులు పెడితేగాని కుటుంబాలు ముందుకు సాగడంలేదు. ఈ క్రమంలో పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, బిజీలైఫ్తో మహిళలు వంటగది వైపునకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పిల్లలు, కుటుంబం, ఉద్యోగం ఇతర పనుల్లోనూ మహిళలు భాగస్వాములు కావడంతో వంట అదనపు భారం అవుతోంది. ఈ క్రమంలోని ఎక్కువ కుటుంబాలు ఆన్లైన్ ఫుడ్పై ఆధారపడుతున్నాయి. ఇక సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు కుటుంబ సమేతంగా హోటల్లోకి వెళ్లి పూట గడిపేస్తున్నాయి. మరికొందరు అన్నం వండుకుని కర్రీలు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగరంతోపాటు జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఆన్లైన్ డెలివరీ ఇచ్చే జొమోటో, స్విగ్గీ వంటి సంస్థలు విస్తరించాయి. ఇంట్లో కూర్చొని కావాల్సిన ఆహారం నచ్చిన హోటల్ నుంచి తెప్పించుకోవడం చాలా మందికి ఫ్యాషన్గా మారింది. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ క్రమేణా పెరుగుతోంది. నగరంలో ఆన్లైన్ ఆహారంపై ఆధారపడిన వారి వివరాలను ఓ సర్వే సంస్థ అంచనా వేసింది. విలాస జీవనానికి కొత్త జంటల ఆరాటం కొత్త జంటలు విలాసవంత జీవనానికి అలవాటు పడ్డాయి. దీనికితోడు పలువురు యువతులు పుట్టింట్లో వంటల ఓనమాలు నేర్చుకోకుండా అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఈ క్రమంలో అత్తారింట సైతం అలానే కొనసాగాలనే ఉద్దేశంతో పెళైన కొత్తలోనే వేరు కాపురాలు పెడుతున్నారు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఆన్లైన్ ఆర్డర్లు, హోటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు కొత్తగా కాపురం పెట్టి వంట చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చానళ్లు చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. వండిన వంట రుచికరంగా లేకవపోవడంతో అబ్బాయిలు ఆమాడదూరం వెళ్లిపోతున్నారు. దీంతో వంట తంట నుంచి తప్పించుకునేందుకు ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్ల వైపు మొగ్గు కుటుంబ వ్యవహారాలతోపాటు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ పురుషులతోపాటు మహిళలు సైతం అలసిపోతున్నారు. ఒత్తిడి కారణంగా ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేక చాలా మంది మహిళలు వంట తయారీపై ఆసక్తి చూపడం లేదు. అన్నం, కూరలు లేదా టిఫిన్ కర్రీలను వండుకునేందుకు గంటకుపైగా సమయం పడుతుంది. ఆ సమయంలో పిల్లలతో గడపడం, విశ్రాంతి తీసుకోవడం, ఇంట్లో ఇతర పనులను చక్కబెట్టుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లపై కు టుంబ సమేతంగా మొగ్గు చూపుతున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు జొమోటా, స్విగ్గీ సేవలను అందుబాటులో ఉంచడంతో ఆన్లైన్ రేటింగ్ ఆధారంగా హోటల్ను ఎంపిక చేసుకుని నచ్చిన ఆహారం తెప్పించుకుంటున్నారు. అలానే మరి కొన్ని హోటళ్ల లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికి తెచ్చించే వెసులుబాటును యజమానులు కల్పించారు. ఆర్డర్ పెట్టుకున్న అర్థగంటలోపే ఇంటికే నచ్చిన ఆహారం తెప్పించుకుని ఆరగిస్తున్నారు. 40 శాతం కుటుంబాలు ఆన్లైన్ ఆహారంతో గడిపేస్తున్నారు. హోటల్కు వెళ్లడం ఫ్యాషన్ సెలవు రోజులు, ఇతర ప్రత్యేక దినాలు, కుటుంబంలో ఎవరికైనా పుట్టిన రోజు వంటివి ఉన్నప్పు డు కుటుంబ సమేతంగా, మరికొందరు బంధుమిత్రులతో కలిసి హోటళ్లకు వెళ్లి తినడం ఫ్యాషన్గా భావిస్తున్నారు. సాయంత్రం పూట అలా బైక్లో నో కారులోనో వెళ్లి హోటల్లో కొంతసేపు సరదాగా గడిపి, ఎవరికి నచ్చిన ఆహారం వారు తినేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బ్యాచిల ర్లు రూమ్ల్లో అన్నం వండుకుని కర్రీలు తెచ్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డబ్బు పొదుపులో భాగంగా బ్యాచిలర్లు కర్రీ పాయింట్లపైన ఆధారపడుతున్నారు. అలానే రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడే ఆహారప్రియులు రోజూ హోటల్ నుంచి తప్పించుకుని లాగియిస్తున్నారు. పిల్లలు, యువత ముఖ్యంగా రుచికరమైన ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. తిరుపతి నగరంలో 11 గంటలకు అన్ని హోటళ్లు బంద్ చేస్తున్నారు. అయితే ఆన్లైన్ ఫుడ్ మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు దొరుకుతుంది. ఆన్లైన్ ఆహారం వివరాలివీ.. మహిళా ఉద్యోగులు 12,875 నూతన జంటలు 2,140 భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన కుటుంబాల సంఖ్య 7,396 బ్యాచులర్లు 10,250 విశ్రాంత ఉద్యోగులు 3,256 ఒంటరి మహిళలు, పురుషులు 895 వ్యాపారవేత్తలు 1,276 సందర్భం ఆధారంగా ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నవారు 2,564 ఇంటి వంటతోనే ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఇంటి వంటలతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అయితే కాలానుగుణంగా ఇళ్లలో ఒత్తిడి పెరగడం, తీరికలేని జీవనంతో వంటగదికి వెళ్లేందుకు కొంతమంది ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. ఉన్న సమయంలో ఇంట్లోనే వంట వండుకుని తినేందుకు ఆసక్తి చూపాలి. బయటి రుచులకు అలవాటు పడితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. రుచికరమైన ఆహారంతో అనారోగ్యం తప్పదు. పిల్లలకు ఇంట్లో ఆహారంపై ఆసక్తి పెంచేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి. –డాక్టర్ మంజువాణి, పోషకాహార నిపుణురాలు, తిరుపతి కొత్తగా పెళ్లి అయ్యింది..వంట సరిగ్గా రాదు మాకు కొత్తగా పెళ్లి అయ్యింది. ఏడాది కావస్తోంది. వంట చేయడం రాదు. ఎంటెక్ వరకు చదివాను. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా ను. నా భర్త నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకుడు. ఇద్దరికీ వంట చేయడం తెలియకపోవడంతో ప్రతిరోజు ఆన్లైన్ ఆర్డర్లతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. సెలవు రోజుల్లో మాత్రం వంట ప్రయోగాలు చేస్తుంటాం. తప్పని పరిస్థితి. –సరళ, ప్రైవేటు ఉద్యోగిని, తిరుపతి ఇద్దరం ఉద్యోగులం తప్పని పరిస్థితి మాది కర్నూలు. నా కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. నా భర్త ఓ ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం చేస్తా రు. ఇద్దరం ఉద్యోగులం కావడంతో ఉదయమే విధులకు హాజరు కావాలి. దీంతో ఆదివారం సెలవు దినాలలో తప్ప ఇంట్లో వంట వండుకునేందుకు అవకాశం దొరకదు. దీంతో మాకు ఆన్లైన్ ఆర్డర్లే గతి. ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు.–పార్వతి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, తిరుపతి (చదవండి: పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై!) -
పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై!
షుగర్ వ్యాధి బారిన పడకుండా ఒక్కొక్కరు ఒక్కో ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తుంటారు. ఒకరు రైస్ తినకూడదంటారు.. ఇంకొకరు నడక మంచిదంటారు.. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే, రాకుండా జాగ్రత్త పడటం ఇంకొక ఎత్తు. మరి పుట్టుకతోనే ఈ వ్యాధి తోడుగా వస్తే.. ఆ పిల్లల జీవితం నరకప్రాయం. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే తప్ప బతకలేని పరిస్థితి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? వీళ్లు చేసిన పాపం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన యువకునికి పుట్టుకతోనే షుగర్ వ్యాధి వచ్చింది. వైద్యులు పరిశీలించి టైప్–1 డయాబెటిస్గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్సులిన్ను ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇతని వయస్సు 30 ఏళ్లు. రోజూ ఇంజెక్షన్ వేయించుకోవాలంటే బాధగా ఉంటోందని, కానీ బతకాలంటే తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్వీట్లు అంటే ఇష్టమని, కానీ తింటే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోతున్నాడు. పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మల్లయ్య, మానస దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వెంకట ఉమామహేష్ రెండవ కుమారుడు లిఖిత్. 9 నెలల వయస్సు కలిగిన లిఖిత్కు పుట్టుకతోనే చక్కెర వ్యాధి తోడుగా వచ్చింది. తరచూ అపస్మారక స్థితికి చేరుకోవడం గమనించి కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. షుగర్ లెవెల్స్ గుర్తించేందుకు మిషన్ తెచ్చుకుని వారానికోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయించాల్సిన పరిస్థితి. నెలకు సుమారు రూ.5వేల దాకా ఖర్చవుతోందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పేరులో తియ్యదనం దాచుకున్న మహమ్మారి మధుమేహం. ఇది పెద్దలనే కాదు.. చిన్నారులనూ వదలని పరిస్థితి. పుట్టుకతోనే తోడుగా వచ్చి జీవించినంత కాలం వేధిస్తోంది. అందరిలా జీవించాలంటే రోజూ సూదిపోటుతో ఇన్సులిన్ మందు వేసుకోవడం తప్పనిసరి. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను తల్లిదండ్రులే స్వయంగా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం వారికీ నరకంతో సమానం. ఇలాంటి బాధితుల సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. శరీరంలోని క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలను(బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్–1 మధుమేహం(డయాబెటిస్) అంటారు. సాధారణంగా పిల్లలు, యువకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగినిరోధక వ్యవస్థ నిరీ్వర్యం చేయడం కాకుండా క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. దీనిబారిన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్ను ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంత మందికి జన్యుపరంగా కూడా రావచ్చు. మరికొంత మందికి పలు రకాల వైరల్ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. అంతేకానీ ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్–1 డయాబెటిస్కు కారణం కావు. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఇన్సులిన్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సతో పాటు ఇన్సులిన్ను ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా వీరికి అరకొరగా ఇన్సులిన్ ఇస్తున్నారు. కేవలం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో మాత్రమే అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి ఇన్సులిన్ను కొద్దిమొత్తంలో అందజేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీల్లో ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలా మంది మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రెండు నుంచి నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. పెరుగుతున్న చికిత్స వ్యయం మెడికల్షాపుల్లో ఒక్కో ఇన్సులిన్ ఖరీదు రూ.180 వరకు ఉంటోంది. ఈ మేరకు ప్రతి చిన్నారికి నెలకు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు క్లినిక్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్ద చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆధునిక వైద్యవిధానాల మేరకు వారికి నొప్పి తక్కువగా ఉండే ఇన్సులిన్ పెన్నుల ద్వారా ఇంజెక్షన్ చేస్తున్నారు. వీటి ఖరీదు సాధారణ ఇన్సులిన్తో పోలిస్తే రెట్టింపుగా ఉంటుంది. లక్షణాలుటైప్–1 డయాబెటిస్ లక్షణాలు బయటపడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా బాగా ఆకలివేయడం, నోరు తడి ఆరిపోవడం. కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లుమూత్రవిసర్జనకు వెళ్లడం. ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గిపోవడం. శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు. మూడ్ మారిపోవడం, నిద్రలో మూత్రవిసర్జన చేయడం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50లక్షల వరకు జనాభా ఉంటుంది. ఇందులో 15 నుంచి 20 శాతం వరకు మధుమేహ బాధితులు. వీరిలో టైప్–2 మధుమేహ బాధితులు 90 శాతం కాగా.. టైప్–1 బాధితులు 10 శాతం పైనే. ఈ లెక్కన 7.50లక్షల నుంచి 10లక్షల వరకు మధుమేహ బాధితులు ఉండగా.. 75వేల నుంచి లక్ష దాకా చిన్నారులు ఉంటున్నారు.కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 అనంతరం టైప్–1 డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగింది. గతంలో డయాబెటిస్ రోగులు 5 శాతం ఉండగా ఇప్పుడు 10శాతానికి చేరుకుంది. కోవిడ్ వైరస్ నేరుగా బీటా కణాలపై దాడి చేయడమే ఇందుకు కారణం. ఈ కారణంగా కోవిడ్కు గురైన వారికి జని్మంచే పిల్లల్లో టైప్–1 డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తోంది. – డాక్టర్ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్వోడి, జీజీహెచ్, కర్నూలు ఇన్సులిన్తో మాత్రమే చికిత్స చిన్నపిల్లల్లో వచ్చే టైప్–1 డయాబెటిస్కు ఇన్సులిన్తో మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. ఆయాసం, కడుపునొప్పి, వాంతులు లక్షణాలతో చిన్నపిల్లలను ఆసుపత్రికి తీసుకొస్తారు. అన్నిరకాల పరీక్షలు నిర్వహించి డయాబెటిస్ నిర్ధారణ అయ్యాక చికిత్స ప్రారంభిస్తాం. ఈ పిల్లలకు ఇన్సులిన్తో పాటు ఆహార నియమావళి తప్పనిసరి. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు (చదవండి: మొటిమలను నివారిద్దాం..పెదవులను మృదువుగా చేసేద్దాం ఇలా..!) -
మొటిమలను నివారిద్దాం..పెదవులను మృదువుగా చేసేద్దాం ఇలా..!
పెదవులు పొడిబారితే ముఖమే అందహీనంగా మారుతుంది. అందుకే చాలామంది అధరాలను మృదువుగా మార్చుకోవడానికి ఏదైనా చిట్కా ఉందా అని అడుగుతుంటారు. అలాంటి వారికి ఈ లిప్బామ్ ఉత్తమ ఎంపిక. దీని పేరు ‘కోలరెన్ స్క్వాలేన్ + అమైనో యాసిడ్స్ లిప్ బామ్’. దీన్ని ఎక్కువసార్లు అప్లై చేయాల్సిన పనిలేదు. ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలాసేపటి వరకూ నిలిచి ఉంటుంది. దీన్ని పెదవులకే కాదు మోచేతులు, గోళ్లు వంటి పగుళ్లు ఉన్న భాగాల్లో అప్లై చేస్తే వెంటనే మృదువుగా మారతాయి. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లేలా చిన్నగా రూపొందించడంతో, క్యారీ చేయడం చాలా తేలిక. ఈ లిప్ బామ్ని రాత్రి పూట అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.మొటిమలకు చెక్ పెట్టేద్దాం ఇలా..అందానికి ప్రాధాన్యమిచ్చేవారు ముఖం మీద చిన్న మొటిమ వచ్చినా, మచ్చ పడినా అసలు తట్టుకోలేరు. వెంటనే దాన్ని తగ్గించుకోవడానికి బ్యూటీ పార్లర్ బాట పడుతుంటారు. ప్రస్తుత సాంకేతికత అలాంటి సమస్యలను ఇట్టే దూరం చేస్తుంది. ఇంట్లోనే స్వయంగా, సులభంగా, తమకు తామే ట్రీట్మెంట్ చేసుకునే విధంగా గాడ్జెట్స్ను పరిచయం చేస్తోంది. అందులో భాగమే ఈ స్కిన్ కేర్ డివైస్. చిత్రంలోని ఈ మినీ మెషిన్.. మచ్చలను, మొటిమలను, చర్మంపై రంధ్రాలను పోగొట్టి, ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. ఇది బ్లూకలర్ లైట్ థెరపీతో మొటిమల్లోని బ్యాక్టీరియాను నిర్మూలించి, వాటి కారణంగా ఏర్పడిన మచ్చలను వేగంగా తగ్గిస్తుంది. దీనిలోని నీలం రంగు లైట్ 415 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో వెలుగుతూ, 0.5 మిల్లీమీటర్ల మేరకు చర్మం లోతుల్లోకి చొచ్చుకుని వెళ్లి, ముఖాన్ని శుభ్రపరుస్తుంది. సున్నితమైన చర్మానికి కూడా ఇది చక్కటి ట్రీట్మెంట్ అందిస్తుంది. అయితే ఈ లైట్ థెరపీ తీసుకునేటప్పుడు కళ్లకు ప్రత్యేకమైన కళ్లజోడును కచ్చితంగా ధరించాలి. ఈ కళ్లజోడు డివైస్తో పాటు లభిస్తుంది.మెషిన్కి ఉన్న లైట్ హెడ్ మీద, 44 హై–ఇంటెన్సిటీ ఎల్ఈడీ బల్బులు ఉంటాయి. ఈ గాడ్జెట్ చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు రకరకాల అలర్జీలను తగ్గిస్తుంది. ఇక ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది పర్ఫెక్ట్ డివైస్ అని చెప్పుకోవచ్చు. దీనిలోని కాంతి చర్మంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. అలాగే దీనిలోని కంటిన్యూస్, పల్సేటింగ్ అనే రెండు మోడ్స్ ఉంటాయి. మనకు కావలసిన రీతిలో 1 నిమిషం, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 12 నిమిషాల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్ 120 నిమిషాల పాటు నిరంతరాయంగా పని చేయగలదు. చార్జింగ్ పెట్టుకుని దీన్ని వైర్లెస్గా కూడా వినియోగించుకోవచ్చు. ఫేస్ క్రీమ్, సీరమ్ వంటివి అప్లై చేసుకున్నాక ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం. (చదవండి: ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!) -
పరీక్ష హాల్లో టాపర్స్ టెక్నిక్స్!
పరీక్ష హాల్ అనేది యుద్ధభూమి కాదు, ఇదొక గేమ్బోర్డ్! పరీక్షల్లో నిజమైన విజేతలు ఎవరంటే ఎక్కువగా చదివినవాళ్లు కాదు. పరీక్ష హాల్లో సరిగ్గా ఆలోచించి, సమయాన్ని ప్లాన్ చేసుకుని, ప్రశాంతంగా ఉండగలిగిన వాళ్లే విజేతలుగా నిలుస్తారు. అంటే మీ విజయం మీ మైండ్సెట్, ప్లానింగ్, ఆటిట్యూడ్ మీదే ఆధారపడి ఉంటుంది! అందుకే పరీక్ష హాల్లో మెదడు ఎలా పనిచేస్తుంది? టాపర్ల సీక్రెట్ మైండ్ హ్యాక్స్ ఏమిటనే విషయం ఈరోజు తెలుసుకుందాం.చేయకూడనివి...గడియారం చూస్తూ ఆందోళన చెందవద్దు. ఇది ఒత్తిడిని పెంచుతుంది. ఒక్క ప్రశ్నకే అతుక్కుపోయి ఎక్కువ సమయం వృథా చేయడం.పరీక్ష మధ్యలో ‘నేను తక్కువ మార్కులు తెచ్చుకుంటానేమో‘అనే అనవసరమైన ఆలోచనలతో భయం పెంచుకోవడం.ప్రశ్నలకు పూర్తి సమాధానం రాశానా? లేదా? అన్న ఆందోళనకి లోనవడం.ఎవరైనా పేపర్ రాయడం పూర్తిచేస్తే, ఒత్తిడిగా ఫీల్ అవ్వడం.పరీక్ష భయాన్ని తగ్గించే ‘పామింగ్ టెక్నిక్’కొంతమంది విద్యార్థులకు పరీక్ష హాల్లోకి అడుగు పెట్టగానే గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట పట్టడం, మెదడు ఖాళీ అయినట్లు అనిపించడం వంటి లక్షణాలకు లోనవుతారు. సింపతటిక్ నర్వస్ సిస్టమ్ అధికంగా యాక్టివ్ కావడమే దీనికి కారణం. దీన్ని నియంత్రించేందుకు ‘పామింగ్ టెక్నిక్’ ఉపయోగపడుతుంది. ఇది చేయడం కూడా చాలా సులువు. చేతులను రుద్ది వేడిగా చేయండి · కళ్లు మూసుకుని వేడి చేతులను కళ్ల మీద ఉంచండి లోతుగా ఊపిరి తీసుకుంటూ, ‘నేను ప్రశాంతంగా ఉన్నాను‘ అని మౌనంగా చెప్పుకోండి 30 సెకన్ల పాటు అలా ఉంచిన తర్వాత, చేతులను వదిలి నెమ్మదిగా గాలి పీల్చుకోండి. ఇది నాడీ వ్యవస్థను రిలాక్సేషన్ మోడ్లోకి మార్చి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. పరీక్ష ముందు, ప్రశ్నపత్రం చూసిన వెంటనే ఇది చేయడం మిమ్మల్ని స్పష్టమైన ఆలోచనకు తీసుకెళుతుంది.మైండ్ బ్లాక్ అయ్యిందా? నో ప్రాబ్లెమ్కొందరు విద్యార్థులకు పరీక్ష మధ్యలో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. చదివినవేవీ గుర్తుకురావు. దీన్ని హ్యాండిల్ చేసేందుకు టాపర్లు జీఎస్ఆర్ మోడల్ అనే ప్రత్యేకమైన టెక్నిక్ ఉపయోగిస్తారు. మీరూ దాన్నే ఫాలో అవ్వండి!Ground Yourself – కాళ్లు నేలకి ఆనించి 5 సెకన్లు లోతుగా ఊపిరి పీల్చుకోండి. Switch Focous– 10 సెకన్ల పాటు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండండి.Restart Slowly – నెమ్మదిగా ప్రశ్న మళ్లీ చదవండి.పరీక్ష హాల్లో మైండ్ఫుల్నెస్ టెక్నిక్పరీక్ష సమయంలో ఒక్కసారిగా ప్రశ్న అర్థం కాకపోతే, మెదడు ‘ఫ్రీజ్‘ అవుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, సమయం వృథా అవుతుంది. దీన్ని అధిగమించేందుకు మైండ్ఫుల్నెస్ సైకాలజీలో ఉపయోగించే ‘గౌనర్–స్విచ్ మోడల్‘ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలంటే... గౌనర్ మోడ్ (గమనించు): ప్రశ్న అర్థం కాకపోతే, కొంతసేపు అక్షరాలను ప్రశాంతంగా గమనించు.స్విచ్ మోడ్ (మార్చు): ప్రశ్నను పూర్తిగా వదిలేయకుండా, కొంచెం వెనక్కి వెళ్లి మళ్ళీ నిశ్శబ్దంగా చదువు.స్కానింగ్ మోడ్: పక్కనే ఉన్న ఇతర ప్రశ్నలను చూసి, మైండ్ను మళ్ళీ సెట్ చేసుకోవడం. ఇది మెదడును బ్లాక్ అవుట్ నుంచి రికవరీ మోడ్లోకి తీసుకువచ్చి, మరింత చురుకైన ఆలోచనకు సహాయపడుతుంది.చివరి నిమిషాల్లో చేయవలసినవిపరీక్ష పత్రం అందుకున్న వెంటనే, 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి · ముఖ్యమైన సమాధానాల్ని గుర్తించి, ముందుగా అవి రాయడం మొదలుపెట్టండి · ప్రశ్నలకు సమాధానం రాస్తూ, మధ్యలో చిన్న మైండ్ఫుల్ బ్రేక్స్ తీసుకోండి సమాధానాలను సాఫ్ట్గా, క్లియర్గా రాయండి మార్కుల స్కోరింగ్కు డయాగ్రామ్స్, హైలైట్స్ ఉపయోగించండి గుర్తులేదనుకున్న ప్రశ్నలపై చివరి 15 నిమిషాల్లో ప్రయత్నం చేయండి. పరీక్ష అనేది మీరు చదివిన తీరుకే కాదు, మీ మానసిక స్థిరత్వానికి కూడా పరీక్ష. ఈ టూల్స్టెక్నిక్స్ ఉపయోగించుకుని ప్రశాంతంగా, ప్లానింగ్తో రాస్తే, మీరు విజయం సాధించటం ఖాయం! పరీక్ష అనేది ఒక స్ట్రాటజిక్ గేమ్! దీనిని గెలవడం మీ చేతుల్లోనే ఉంది! పరీక్షలో విజయం సాధించేది ఎక్కువగా చదివినవారు కాదు, ప్రశాంతంగా ఆలోచించగలిగినవారే!సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com (చదవండి: ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!) -
ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!
ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలి? – రాధ, శ్రీకాకుళంప్రెగ్నెన్సీలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కావాలసిన పోషకాలన్నీ అందులోనే దొరుకుతాయి. ఫోలిక్ యాసిడ్ మాత్రలు, విటమిన్–డి సప్లమెంట్స్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్లోనే తీసుకోవటం మొదలు పెట్టాలి.వీటిని ప్రెగ్రెన్సీలో చాలామందికి ఇస్తాం. ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డకు ఎలాంటి అవయవ లోపాలు లేకుండా, వెన్నెముక సమస్యలు రాకుండా చేస్తుంది. ఇది ఎక్కువగా బ్రకలీ, పాలకూర, బీన్స్ లలో ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకున్నా కూడా ఫోలిక్ యాసిడ్ సప్లమెంట్స్ అవసరం ఉంటుంది. ప్రతిరోజూ 400 ఎమ్సీజీ ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది.విటమిన్–డి ఎముకలు, కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మార్చి నుంచి సెప్టెంబర్ నెల వరకు సూర్యకాంతి నుంచి విటమిన్–డి వస్తుంది, ఇది సరిపోతుంది. మిగిలిన నెలల్లో మాత్రం విటమిన్–డి సప్లమెంట్స్ తీసుకోవాలి. చేప, గుడ్లు, మాంసంలో విటమిన్–డి ఉంటుంది. రోజుకు 10 ఎమ్సీజీ టాబ్లెట్ సరిపోతుంది. ప్రెగ్నెన్సీలో విటమిన్–ఎ విటమిన్ టాబ్లెట్స్ తీసుకోకూడదు. ఇది బేబీకి హాని చేస్తుంది. లివర్, లివర్ ప్రాడెక్ట్స్లో హై విటమిన్–ఎ ఉంటుంది. అందుకే వీటిని ఆహారంలో తీసుకోకూడదు. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: చేపే కదా కరిచిందని తేలిగ్గా తీసుకున్నాడు..!కట్చేస్తే..) -
ప్రెగ్నెన్సీ టైంలో జుట్టుకి రంగు వేసుకోవచ్చా..?
నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. ఫంక్షన్కి జుట్టుకు రంగు వేయించుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఇది మంచిది కాదని విన్నాను. ఇప్పుడు జుట్టుకు ఎలాంటి రంగులు వేసుకోవటం మంచిది? – మీనాక్షి, అనంతపురం చాలామంది గర్భవతులు అడిగే ప్రశ్న ఇది. జుట్టుకు వేసుకునే రంగు మంచి కంపెనీది వాడటంతో గర్భవతులకు ఎలాంటి హాని జరగదని ఎన్నో పరిశోధనల్లో తేలింది. పర్మినెంట్, సెమీ పర్మినెంట్ డైలతో కొంతమందికి రియాక్షన్స్, దురదలు రావచ్చు. ఈ జుట్టుకు వేసుకునే రంగు తలపై మాడు ద్వారా రక్తంలోకి వెళ్లి బేబీకి హాని చేస్తుంది అనేది నిజం కాదు. జుట్టుకు వేసుకునే రంగులో చాలా తక్కువ మోతాదులో రసాయనాలు ఉంటాయి. ఇవి బేబీకి ఏ హాని చెయ్యవు. కాని ఆరోగ్యకరమైన మాడు లేకపోయినా, హై డోస్ కెమికల్ షాంపూలు, డైలు వాడినా చర్మంలో మార్పులు, దురదలు రావచ్చు. ఆరోగ్యకరమైన మాడు ఎక్కువ డైని పీల్చుకోదు. కాని, 12 వారాల ప్రెగ్నెన్సీ దాటే వరకు అంటే మూడు నెలలు నిండే వరకు ఎలాంటి యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, రసాయనాల గాఢత ఎక్కువ ఉండే జుట్టు, చర్మ చికిత్స మందులను తీసుకోవద్దని చెప్తాం. రెండు, మూడు త్రైమాసికాల్లో ప్రెగ్నెన్సీలో వచ్చే చర్మం, శరీరంలో వచ్చే మార్పుల వలన చాలామందికి డైలతో రియాక్షన్స్, దురదలు రావచ్చు. కొన్నిసార్లు డై సరిగ్గా పనిచెయ్యకపోవచ్చు. హై స్ట్రాండ్స్ కలర్స్ అంతగా పనిచెయ్యవు. కాని ప్రతిసారి హెయిర్ డై లేదా హెయిర్ కలర్ చేయించుకునే ముందు స్ట్రాండ్స్ టెస్ట్ చేయించుకోండి. ప్యాచ్ టెస్ట్ అనే స్కిన్ టెస్ట్ ప్రతిసారి చెయ్యమనండి. ఒకవేళ ఇంట్లోనే జుట్టుకు రంగు వేసుకుంటుంటే, చేతులకు గ్లోవ్స్ వేసుకోవాలి. స్కిన్ ఇరిటేషన్ ప్రెగ్నెన్సీలో చాలా తర్వగా వస్తుంది. డై వేసుకున్న తర్వాత ఆ కంపెనీ చెప్పిన సమయం వరకు మాత్రమే ఉంచుకొని, వెంటనే శుభ్రం చేసుకోవాలి. బాగా గాలి, వెలుతురు ఉన్న ప్రదేశంలో డై వాడాలి. మాడును చాలాసార్లు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాగే ముఖం, మిగిలిన డైని కూడా శుభ్రం చేసుకోవాలి. డై బ్లడ్ స్ట్రీమ్ ద్వారా శరీరంలోకి వ్యాపించడం చాలా అరుదు. హైలైట్స్ అనేవి ఈమధ్య చాలామంది చేసుకుంటున్నారు. అక్కడ వేసే రసాయనాలను కేవలం జుట్టు మాత్రమే పీల్చుకుంటుంది. సెమీ పర్మినెంట్ కలర్స్ అంటే హెన్నా లాంటì వి ఇంట్లోనే తయారుచేసుకొని వాడుకోవటం మంచిది. -
ఫ్యూచర్ టెన్స్ విజన్ 2030
పాతిక సంవత్సరాలు బ్యాంకర్గా పనిచేసిన ముంబైకి చెందిన మధురా దాస్ గుప్తా సిన్హా ఉద్యోగమే జీవితం అనుకోలేదు. ఇతర మహిళల జీవితాల గురించి ఆలోచించింది. ప్రసవం తరువాత దాస్ గుప్తా స్నేహితురాలు ఉద్యోగ విరామం తీసుకుంది. ఆమె ఉన్నత విద్యావంతురాలు. కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యోగ విరామం అలాగే ఉండిపోయింది‘పెళ్లయిన తరువాత ఉద్యోగం ఎందుకు?’ అనే భావనతో ఒక యువతి తన ఉద్యోగానికి రాజీనామా చేసింది... ఇలాంటి సంఘటనలు మధురా దాస్ గుప్తాను లోతుగా ఆలోచించేలా చేశాయి.‘యాస్పైర్ ఫర్ హర్’ అనే సంస్థనుప్రారంభించేలా చేశాయి.భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గడాన్ని దృష్టిలో పెట్టుకొని ‘యాస్పైర్ ఫర్ హర్’కు శ్రీకారం చుట్టింది మధురా దాస్ గుప్తా. మెంటార్షిప్, స్కిలింగ్, రోల్మోడల్స్, నెట్వర్కింగ్ ద్వారా మహిళలు శ్రామిక శక్తిలోకి వచ్చేలా ప్రేరేపించడానికి ఉద్దేశించిన కమ్యూనిటీ ఆధారిత వేదిక ఇది. 2030 నాటికి పది మిలియన్ల మంది మహిళలను శ్రామిక శక్తిలో చేర్చే లక్ష్యంతో ‘యాస్పైర్ ఫర్ ఉమెన్’ పనిచేస్తుంది. -
ఎక్కువ ఆయుర్దాయం కావాలా? జపనీయుల టాప్ సీక్రెట్స్ ఇవే!
జపనీయుల దీర్ఘాయువు వెనక... స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల అనుకున్నంత కాలం జీవించలేకపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం జపాన్? ప్రజలు మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయంతో ఎక్కువకాలం పాటు జీవిస్తున్నారు. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం.. మనం కూడా వారిని అనుసరిద్దాం.డబ్ల్యుహెచ్. ఓ. అంచనాల మేరకు... జపాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 83.7 సంవత్సరాలు (మహిళలకు 86.8 సంవత్సరాలు పురుషులకు 80.5 సంవత్సరాలు)గా ఉంది. జపాన్ ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, సంస్కృతి, జెనెటిక్స్? దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇకిగై (సంతోషంతో జీవించడం): జపనీయులు ‘ఇకిగై’ అనే సిద్ధాంతంతో సంతోషంగా జీవిస్తారు. ఆనందంతో జీవించాలని ఈ పురాతన తత్వశాస్త్రం బోధిస్తుంది. అంతేకాక, ఎందుకు జీవిస్తున్నామనే దానిపై స్పష్టతతో జీవితానికి లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రేమతో కలిసి ఉండటం వంటి అంశాలు వారి ఆయుష్షును పెంచుతాయి. హరా హాచ్ బన్ మి. ఇది జపాన్లో ఒక సామెత. అంటే తగిన మోతాదులోనే ఆహారం తినాలని అర్థం. కడుపులో 80 శాతం నిండినంత వరకు మాత్రమే తింటే దీర్ఘాయువు కలిగి ఉంటామని జపనీయుల నమ్మకం. అంతేకాదు, పెద్ద పళ్లెంలో కాకుండా చిన్న చిన్న ప్లేట్లలో లేదా బౌల్స్లో నెమ్మదిగా తినడానికి ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి తింటారు. భోజనం చేసేటప్పుడు టీవీ, సెల్ ఫోన్ వంటి వాటికి దూరంగా ఉంటారు. కింద కూర్చునే తింటారు. సమతుల ఆహారం: జపనీస్ ఆహారం లో పండ్లు, ఒమేగా ఫాటీ ఆమ్లాలు అధికం గా ఉండే చేపలు, బియ్యం, తృణధాన్యాలు, టోఫు, సోయా, మిసో, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. ఇవన్నీ తక్కువ కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. తద్వారా కాన్సర్, గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చు. ఈ ఆహారం కారణంగానే జపాన్లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు.హెర్బల్ టీ: జపనీస్ ప్రజలు టీ తాగడాన్ని ఇష్టపడతారు. అది వారి సంస్కృతిలో భాగంగా భావిస్తారు. జపాన్ ద్వీప సమూహంలో మాచా టీ చాలా ప్రాచుర్యం పొందింది. టీ తయారీలో ఉపయోగించే టీ ఆకులు అధిక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు కాన్సర్తో పోరాడే శక్తినిస్తాయి. కాలి నడకకు ప్రాధాన్యం: జపాన్ ప్రజలు ఒకేచోట కూర్చుని పని చేసే జీవన శైలిని అంతగా ఇష్టపడరు. యువకుల నుంచి వృద్ధుల వరకు అంతా నడవడానికే ఇష్టపడతారు. విద్యార్థులు, ఉద్యోగులు సమీపంలోని రైల్వే స్టేషన్కు నడవడం లేదా సైక్లింగ్? చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ వారి ఆయుర్ధాయం పెరగ డానికి దోహదం చేస్తాయి.జీన్స్ ఇవి వారు ధరించే జీన్స్ కాదు.. జపనీస్లో సహజసిద్ధంగా ఉండే జన్యువులు. ఇవే వారి ఆయుష్షును పెంచుతున్నాయి. టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్స్, గుండెపోటు, సెరెబ్రోవాస్కులర్, హృదయ సంబంధ వ్యాధులలను నిరోధించడానికి ఈ జన్యువులు సహాయపడతాయి.వృద్ధుల సంరక్షణ: ఇతర దేశాలలా జపాన్ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఓల్డ్? ఏజ్?హోమ్లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం అక్కడి వారి సాంప్రదాయం. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, సంతోషంగా జీవిస్తారని అక్కడి వారి నమ్మకం. చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?ఆరోగ్య సంరక్షణ: జపాన్లో అనారోగ్యాలను నివారించి, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.సామాజిక నిర్మాణం: బలమైన సామాజిక సంబంధాలు, సమాజ మద్దతు మెరుగైన మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడి స్థాయులను తగ్గించడానికి దారితీస్తుంది, ఇవి దీర్ఘాయువుకు ముఖ్యమైనవి.చదవండి: ఇక్కడ జిమ్లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!చూశారుగా...పైన చెప్పుకున్న వాటిలో ఒక్క జన్యుపరమైన కారణాలు తప్ప మిగతావన్నీ మనం సులువుగా అనుసరించదగ్గవే. వీలయిన వాటిని వీలయినంత వరకు అనుసరించి ఆయురారోగ్యాలతో హాయిగా ఉందాం. దీర్ఘాయుష్మాన్ భవ! -
ఇక్కడ జిమ్లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!
#Continuum: జిమ్లో చేరాలంటే నెలకు ఎంత కడతాం? మిగిలిన చోట్ల ఎంత ఉన్నా, న్యూయార్క్ (NewYork) లోని గ్రీన్విచ్కి దగ్గరలోని ఒక గ్రామంలో కొంటినూమ్ (Continuum )అనే వెల్నెస్ సోషల్ క్లబ్లో జిమ్ చేయాలంటే అక్షరాలా 8000 పౌండ్లు కట్టాలి. గత ఏడాది ఏప్రిల్లో ఆరంభం అయిన ఈ జిమ్లో లగ్జరీ లాంజ్ ఉంది. సభ్యులకు ఫిట్నెస్ పెంచుకోవడం కోసం టాప్క్లాస్ జిమ్ తరగతులు జరుగుతుంటాయి. 25000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ వెల్నెస్ సెంటర్ 250 మంది సభ్యులకు మాత్రమే పరిమితం. చిత్రం ఏమిటంటే, కళ్లు తిరిగేటంత సభ్యత్వ రుసుము కండలు పిండి మరీ వసూలు చేస్తున్నా కూడా ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవడం కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారి జాబితా చాలానే ఉందట. చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?ఇక్కడ చేరి శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటున్న వారందరికోసం ఇంటి దగ్గర ఉండి మరీ కసరత్తులు చేసేందుకు ఆన్లైన్లో ప్రత్యేకమైన హోమ్ వర్క్ (వర్కవుట్లు చేయిస్తారట) కూడా ఇస్తారట. డబ్బు కట్టగానే ఇక్కడ సభ్యులకు పూర్తి వివరాలతో కూడిన ‘ఆన్బోర్డింగ్ అసెస్మెంట్’ ఉంటుంది. శరీరంలోని ప్రతి పార్ట్నూ స్కాన్ చేసి, ఉండవలసిన దానికన్నా హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే పరీక్షించి, వాటిని బ్యాలన్స్ చేసుకునేందుకు తగిన స్పెషల్ వర్కవుట్లు చేయిస్తారు. అంతేకాదు, శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నిద్ర నాణ్యత ఎలా ఉంది... వంటి పరీక్షలన్నీ చేసి అందుకు తగ్గట్టు జిమ్ చేయిస్తారట. ఏమైనా.. పిండికొద్దీ రొట్టె అన్నట్టు మనం చెల్లించిన డబ్బుకు తగ్గట్టు వర్కవుట్లు చేయించి మన ఫిట్నెస్ను పరిరక్షిస్తారన్నమాట! -
వీల్ పవర్
ఆమె పేరు వసుంధర.. విధి పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గింది.. వీల్ చెయిర్తోనే విజయానికి అడుగులు వేసింది! మాతృత్వాన్నీ సాధించింది! డేరెస్ట్ ఉమన్గా మన్ననలు అందుకుంటున్నారు హైదరాబాద్కు చెందిన వసుంధర. ఈ విజేత గురించి ఆమె మాటల్లోనే..‘మన దగ్గర ఫిజికల్లీ చాలెంజ్డ్ వాళ్లకు అనువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ లేదు. అంటే నా చిన్నప్పటి పరిస్థితి ఊహించుకోండి.. ర్యాంప్స్, సపరేట్ వాష్ రూమ్స్ అనే ఊసే ఉండేది కాదు. ఫిజికల్లీ చాలెంజ్డ్ పిల్లలు చదువుకోవాలన్నా.. ఏదైనా యాక్టివిటీ నేర్చుకోవాలన్నా వాళ్లతో ఒక మనిషి ఉండాల్సిందే పనులన్నీ మానుకొని! అందుకే సాధారణంగా దిగువ, మధ్యతరగతి కుటుంబాల్లో వైకల్యం ఉన్న పిల్లలను ఇంట్లోనే ఉంచేస్తారు. కానీ నన్ను మా అమ్మ చదివించింది. ఆవిడ సింగిల్ పేరెంట్. పెద్దగా చదువుకోలేదు. కానీ బ్రహ్మాండమైన లీడర్షిప్ క్వాలిటీస్తో నెగ్గుకొచ్చింది. టైలరింగ్ చేసేది అమ్మ. వీల్ చెయిర్ కొనేంత స్తోమత లేదు. అయినా నా చదువు విషయంలో వెనకడుగు వేయలేదు. స్కూల్కి, కాలేజ్కి తమ్ముడే నన్ను ఎత్తుకుని తీసుకెళ్లేవాడు. కాలేజ్లో క్లాసెస్ మారాల్సి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్ చేసేవారు.→ కలాం గారిని అడిగాను కానీ...నేను సీఏ చదువుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారిని కలిశాను. ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ నడుపుకోగలిగే వెహికిల్స్ని సమకూర్చొచ్చు కదా అని అడిగాను. అడిగాక ఆలోచించాను.. వాళ్లకోసం నేను కూడా ఏమైనా చేయొచ్చు కదా.. మాకున్న సమస్యల గురించి మనమే పోరాడాలి.. ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవాలనిపించింది. అది మీడియాలో ఉంటేనే సాధ్యమవుతుందని గ్రహించాను. దాంతో సీఏ డ్రాప్ అయిపోయి, పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివాను. → చాలా నేర్చుకున్నాను.. జర్నలిస్ట్గా నా పయనాన్ని ఆరంభించాను. చాలెంజింగ్గా ఉండిందా జాబ్. నేనొక డిజేబుల్డ్ పర్సన్ని అన్న విషయమే మర్చిపోయాను. సమీ„ý కురాలిగా... కంటెంట్ రైటర్గా, కొన్నిసార్లు న్యూస్ రీడర్గా,ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా.. ఇలా అన్ని బాధ్యతలూ తీసుకున్నాను. రిపోర్టర్ లేకుండా అరగంట విమెన్ బులెటిన్ని ఆరునెలల పాటు రన్ చేశాను. దాంతో చాలా నేర్చుకున్నాను. అయితే పది గంటలపాటు అలా ఒకేచోట కూర్చోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. కానీ దివ్యాంగుల సమస్యలను తెలపడానికి ఒక వేదికైతే ఉండాలి కదా! అందుకే వేవ్ మీడియాను స్టార్ట్ చేశాను. దివ్యాంగులకు అన్నిరకాల అవకాశాలను అందించడానికి ‘గుర్తింపు ఫౌండేషన్’ను మొదలుపెట్టాను. దివ్యాంగుల్లోని ఆంట్రప్రెన్యూర్ స్కిల్స్ని వెలికి తీసి, వాళ్లను ఆంట్రప్రెన్యూర్స్గా తయారుచేయడానికి ‘డీ హబ్’నుప్రారంభించాను. రీసెంట్గా ఇంటర్నేషనల్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్నాను. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి నేనొక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను.→ వైవాహిక జీవితానికి వస్తే..డిజేబుల్డ్ పర్సన్స్ వైవాహిక జీవితానికి పనికిరారనే అపోహ, ఆరోగ్యవంతుడు డిజేబుల్ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడంటే అతనిలో ఏం లోపం ఉందో అనే కామెంట్ల మధ్య.. నన్నర్థం చేసుకొనే స్నేహితుడు నరేందర్ని పెళ్లి చేసుకున్నాను. తల్లిని కావాలనీ ఆశపడ్డాను. కానీ నా ఆరోగ్యం అందుకు సహకరిస్తుందో లేదో అనే భయం ఉండేది నరేందర్కి. దాంతో ఆయన్ని కౌన్సెలింగ్కి తీసుకెళ్లాల్సి వచ్చింది!ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే వరకు చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాను కానీ.. తర్వాతే చాలా ఒత్తిడి ఫీలయ్యాను. నాలాగే నా బిడ్డకూ వైకల్యం వస్తుందేమోననే భయం. పోలియో తప్ప జెనెటికల్గా నాకెలాంటిప్రాబ్లం లేదు. అయినా టెస్ట్లు చేయించుకున్నాను. బ్యాక్ బోన్ పెయిన్ వల్ల ఒకసారి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికీ వెళ్ళాను. అప్పుడే నాకు సివియర్ స్కోలియోసిస్ ఉందని తేలింది. 150 డిగ్రీల వంపు తిరిగినట్లు ఉంటుంది నా బాడీ. దీనివల్ల నాకు ఒక లంగ్ చిన్నగా.. ఒక లంగ్ పెద్దగా, ఒక కిడ్నీ చిన్నగా.. ఒక కిడ్నీ పెద్దగా ఉంటుంది. అలాగే నా గర్భాశయంలో కూడా బిడ్డ ఒక సైడ్కు పెరుగుతోందని తెలిసింది.→ ఎన్నో పరీక్షలను తట్టుకుని...డీ హబ్ని డెవలప్ చేస్తున్న సమయంలోనే ప్రెగ్నెన్సీ రావడంతో ఫైనాన్సియల్గా కూడా స్ట్రగుల్ అయ్యాం. ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడా లేదు. ముందు జాగ్రత్తగా ఏడోనెలలోనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు డాక్టర్. ఆసుపత్రిలోంచే వర్క్ చేశాను డెలివరీ ముందు రోజు వరకు. లక్కీగా ఏ కాంప్లికేషన్స్ లేకుండా తొమ్మిదోనెల వరకు రాగలిగాను. సిజేరియన్ డెలివరీతో బాబు పుట్టాడు. కానీ జాండీస్తో ఐసీయూలో పెట్టారు. వాడు ఇంటికి రావడానికి 27 రోజులు పట్టింది. వచ్చాక అనిమియా .. వీక్లీ చెకప్ అన్నారు. అది జ నరల్ కండిషన్నే అని తెలిసినా... తలసేమియానా? నా డిజేబిలిటీ వల్లే ఇలా అవుతోందేమో అనే భయం. ఆ మానసిక వేదనను మాటల్లో చెప్పలేను. అన్ని అవాంతరాలు దాటి బిడ్డ ఆరోగ్యంగా కేరింతలు కొడుతుంటే అన్నీ మరచిపోయాను. ఇప్పుడనిపిస్తుంటుంది.. నేనేనా అంతలా భయపడ్డది అని! నాకున్న కండిషన్లో మాతృత్వమనేది నిజంగానే నేను సాధించిన అతిపెద్ద అచీవ్మెంట్ అనిపిస్తుంది’’ అంటూ తన విజయగాధను వివరించారు వసుంధర.నేనొక డిజేబుల్డ్ పర్సన్ని అన్న విషయమే మర్చిపోయాను. సమీక్షకురాలిగా... కంటెంట్ రైటర్గా, కొన్నిసార్లు న్యూస్ రీడర్గా,ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా.. ఇలా అన్ని బాధ్యతలూ తీసుకున్నాను. రిపోర్టర్ లేకుండా అరగంట విమెన్ బులెటిన్ని ఆరునెలల పాటు రన్ చేశాను. – శిరీష చల్లపల్లి -
15 ఏళ్ల నాటి ఆభరణాలతో, అందర్నీ కట్టి పడేసిన సాక్షి ధోనీ
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అతని భార్య సాక్షి ధోని హాజరయ్యారు. సతీసమేతంగా ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ ధోని సందడి చేశాడు. రణబీర్ కపూర్ 2009 బ్లాక్ బస్టర్ “అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ”లోని “తు జానే నా” అనే సాంగ్కు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ పెళ్లిలో ఇంకో విశేషం కూడా చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని తన ఆకర్షణీయమైన శైలితో వార్తల్లో నిలిచింది.సాక్షి ధోని ఫ్యాషన్, స్టైల్కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. రిషబ్ పంత్ సోదరి వివాహ వేడుకలో పెళ్లైన ఇన్నాళ్ల తరువాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత తన పెళ్లి రోజున ఆభరణాలను ఆభరణాలను తిరిగి ధరించింది.ఆ ఆభరణాలే అందరి దృష్టిని ఆకర్షించాయి. డైమండ్స్ ఆర్ ఫరెవర్ అన్నట్టు వజ్రాలు, పచ్చలు పొదిగిన గోల్డ్ జ్యుయల్లరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోల్డ్ చోకర్ నెక్పీస్, లేయర్డ్ నెక్లెస్, ముక్కెర, జుమ్కాలతో తన లుక్కు మరింత స్టైల్ యాడ్ చేసింది. లెమన్ గ్రీన్ కలర్ పట్టుచీర, స్కాలోప్-నెక్ డిజైన్ ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్, దీనికి జతగా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిర్రర్ దుపట్టాతో తన లుక్ను మరింత ఎలివేట్ చేసుకొని అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే సాక్షి, దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి వైరల్గా మారాయి.మరోవైపు పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో ధోనీ, సాక్షి, పంత్ మధ్య ఆకర్షణీయ సంభాషణ కూడా వైరల్గామారింది. తమ రిలేషన్ షిప్ లో ధోనీనే లక్కీ అని సాక్షి సిగ్గుల మొగ్గలవుతూ చెప్పింది. ఇంతలో మధ్యలో కల్పించుకున్న పంత్, ఆడవాళ్లందరూ ఇలాగే అనుకుంటారని తుంటరి కమెంట్ చేయడంతో అక్కడంతా నవ్వులు పువ్వులు పూశాయి. ఈ వీడియోపై కామెంట్లు వెల్లువెత్తాయి.సాక్షి ధోని పెళ్లి రోజు లుక్15 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహానికి, భారీ నెక్లెస్, చూడామణి లాంటి ఆభరణాలు సహా బుటీ వర్క్, జర్దోసి ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు, ఆకుపచ్చ రంగు లెహంగా ధరించింది 2010 జూలై 10న డెహ్రాడూన్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
తల్లికి జరిగిన అన్యాయమే ఐఏఎస్ అధికారిగా మార్చింది..ఆనంద్ మహీంద్రా మెచ్చిన స్టోరీ..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువతను ప్రేరేపించే మంచి స్ఫూర్తిదాయక స్టోరీలు షేర్ చేసుకుంటుంటారు. అలానే ఈసారి ఆయన మనసుకు బాగా హత్తుకున్న స్పూర్తిదాయకమైన మరొక గాథను పంచుకున్నారు. తల్లికి జరిగిన అన్యాయమే కొడుకుని ప్రతిష్టాత్మక యూపీఎస్సీ ఎగ్జామ్ని చేధించేందుకు దారితీసింది. ప్రపంచముందు ఓ హీరోలో నిలిచేందుకు కారణమైంది. విమర్శలతో సాగిన జీవితం బాధతో ఆగిపోకూడదనే చెప్పే ఈ స్టోరీ అందరి మనసులను కదిలిస్తుందంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ సక్సస్ స్టోరీ ఎవరిదంటే...రాజస్థాన్కి చెందిన హేమంత్ స్టోరీనే ఇది. అతడి తల్లి దినసరి కూలీ. అయితే సాధారణంగా కూలీకి ఇచ్చే రూ. 200 వేతనం కంటే తక్కువే ఆమె పొందడంతో బాధపడి ఇదేంటని కాంట్రాక్టర్లని నిలదీశాడు హేమంత్. వాళ్లంతా ఎగతాళి చేస్తూ.చాలా అవమానకరంగా మాట్లాడారు. అదే హేమంత్లో కసిని పెంచి ఐఏఎస్ అవ్వాలనే ఆకాంక్షను రగిల్చింది. అందుకు అతడి వద్ద కనీస వనరులేవి లేవు. ఇంట్లో ఆదాయం అంతంతమాత్రమే. తన లక్ష్యం ఇది అని చెబితే..అంతా సాధ్యం కాదని నిరాశపరిచినవాళ్లే. పైగా కాస్త డబ్బున్న వాళ్లు కోచింగ్లు తీసుకుని సాధించగలరని నిరుత్సాహాపరిచడమే అడగడుగునా..అయినా అవేం పట్టించుకోలేదు. కేవలం జేబులో రూ. 1400లతో ఢిల్లీ వెళ్లిపోయాడు. అక్కడ ఎక్కడ చదువుకోవాలో తెలియదు. మార్గదర్శకత్వం చేసేవాళ్లు లేరు. కేవలం ఎలాగైన ఐఏఎస్ అధికారి కావాలన్న తపన మాత్రమే ఉంది. అదే అతడిని తనలాంటి వాళ్లకు ఆశ్రయం ఇచ్చే చోటుకి చేర్చింది. అలా LBSNAA (లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్)లో శిక్షణ తీసుకుని మరీ ఆల్ఇండియా ర్యాంక్ 884 సాధించాడు. దివ్యాంగుల కోటలో సాధించాల్సిన ర్యాంకుని అందుకుని ఐఏఎస్ అయ్యాడు. ఇక్కడ హేమంత్కి శారీరకంగా, ధనం పరంగా అసమానతలు ఉన్నాయి. నిజానికి సాధించగలిగేంత చిన్న లక్ష్యం కాదు ఐఏఎస్ అంటే. ఆ విషయం హేమంత్కి కూడా తెలుసు. అయితే హేమంత్ ఎదుర్కొన్న విమర్శలు అతడిని లక్ష్యం సాధించేలా కసి పెంచాయి. అందువల్లే అతడు తన లక్ష్యం అనితరసాధ్యమైనదని ఎందరన్నా..తన గమ్యం వైపే అడుగులు వేశాడు. ప్రతికూలతలు, అవమానాలకు ప్రతిస్పందన మనం సాధించే విజయమే అని చాటి చెప్పాడు. అంతేగాదు మనం అందుకున్న ఘన విజయం విమర్శకుల నోటికి తాళం పడేలా చేస్తుందని చేతల్లో చేసి చూపించాడు హేమంత్. ప్రతిఒక్కరూ తమ కెరీర్లో ఎక్కడో ఒక చోట ఇలాంటి అవమానాలు, చులకనభావం వంటివి ఎదుర్కొనే ఉంటారు. వాటికి ప్రతిస్పందించి శక్తిని వృద్ధా చేసుకునే కంటే..మన అభ్యున్నతిపై దృష్టిపెట్టి ఊహించని విజయం అందుకుంటే అదే వారికి గొడ్డలిపెట్టు అని పోస్ట్లో హైలెట్ చేసి చెప్పారు ఆనంద్ మహీంద్రా. నెటిజన్లు కూడా ప్రతికూలతలకు మన విజయంతోనే గట్టి సమాధానం చెప్పాలంటూ ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టారు.When you are demeaned or insulted, don’t waste much time in getting offended….Spend time on getting ahead…Proving that your critics were wrong is always the most satisfying response….#MondayMotivation https://t.co/ljVFDysHmq— anand mahindra (@anandmahindra) March 10, 2025--(చదవండి: ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే..! హెచ్చరిస్తున్న న్యూట్రిషన్లు) -
ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే వృద్ధాప్యం త్వరగా వస్తుందా..?
ఇటీవల కాలంలో అంతా స్లిమ మంత్ర.. అంటూ వివిధ రకాల డైట్లు పాటిస్తున్నారు. కొందరూ అవి తమ శరీర తత్వానికి సరిపోతాయా..? లేదా అని లేకుండా అనాలోచితం పాటించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఒక టీనేజర్ అలానే ప్రాణాలు పోగొట్టుకుంది. అయితే చాలావరకు అన్ని డైట్లలో చెప్పేది ఒకటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేవి తీసుకోమనే చెబుతాయి. అది మన శరీర తత్వం ఆధారంగా ఎంత మేర తీసుకుంటే మంచిది అనేది పోషకాహార నిపుణులను సంప్రదించి పాటిస్తే సత్వరగతిన మంచి ఫలితాలు పొందుతారు. అలా కాకుండా ప్రోటీన్ మంచిదని అధికంగా తీసుకుంటూ ఉంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అదేంటో పోషకార నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దామా..!.మన రోజువారీ భోజనంలో ప్రోటీన్ను చేర్చుకోవడం ఎంత కీలకమో అందరికీ తెలుసు. ఇది మన కణజాలాలను, కండరాలను నిర్మించడానికి, మరమత్తు చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో మొత్తం శక్తిని ఇస్తుంది. అందుకోసం అని చాలామంది ప్రోటీన్ పౌడర్లు, షేక్లు, సప్లిమెంట్లపై ఆధారపడతారు. కానీ వాటికంటే గుడ్లు, మాంసం, పెరుగు, జున్ను వంటి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తమ డైట్లో చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇలా ప్రోటీన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పేనని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు వృద్ధాప్యం ేవేగవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు.ఈ మేరకు ప్రముఖ పోషకాహార నిపుణురాలు లోవ్నీత్ బాత్రా ఇన్స్టాగ్రామ్ వేదికగా దీని గురించి షేర్ చేశారు.ప్రోటీన్ ఎక్కువగా తినడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందా? ఇటీవల పోషకాహార నిపుణుడు లోవ్నీత్ బాత్రా ఇన్స్టాగ్రామ్లో ప్రోటీన్ తీసుకోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందని పంచుకున్నారు. ప్రోటీన్ పౌడర్లు,జంతు ఆధారిత ప్రోటీన్లపై ఎక్కువగా ఆధారపడితే గ్లైకేషన్ ప్రేరేపించబడుతుందట. ఇది కణజాలాలను గట్టిపరిచే ప్రక్రియ అట. దీంతో ముడతలు, కీళ్ల ధృడత్వం, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని చెప్పారు. అంతేగాదు ఇది శరీరంలో ప్రోటీన్ అసమతుల్యతను ఏర్పరిచి జీవక్రియను దెబ్బతీస్తుందని అన్నారు. ఫలితంగా ఇన్సులిన నిరోధకత, వాపు వంటి సమస్యలు వస్తాయని అన్నారు. అలాగే ఈ ప్రోటీన్ షేక్లలో ఉండే కృత్రిమ స్వీటెనర్ల ప్రిజర్వేటివ్లతో శరీరం లోడ్ అవుతుందనేది గ్రహించండి అని చెబుతున్నారు. కాబట్టి అధిక ప్రోటీన్ వినియోగం అనేది ఆరోగ్యానికి అన్ని విధాల హానికరమే అని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ శరీరానికి అనుగుణంగా ప్రోటీన్ తీసుకోండి. అలాగే జంతు ఆధారిత ప్రోటీన్ కంటే ఆల్కలీన్ స్వభావం కలిగిన మొక్కల ఆధారిత ప్రోటీన్లను తీసుకువాలని అన్నారు. ముఖ్యంగా కాయధాన్యాలు, క్వినోవా, టోఫు, గింజలు, నట్స్, వంటివి ఉత్తమం అని చెప్పారు. అదనంగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలతో భర్తీ చేసుకోమని సూచించారు. అంటే విటమిన్లు సీ, ఈఅధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలతో సమతుల్యం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రోటీన్ పౌడర్ల కంటే సంపూర్ణ ఆహార పదార్థాలను తీసుకోవడమే మంచిదని నొక్కి చెప్పారు. అలాగే మన శరీరం ప్రోటీన్ లోపంతో బాధపడుతుందనేందుకు సంకేతంగా జుట్టు, చర్మం, గోర్లు కండరాల బలహీనత, అలసట, కొవ్వు కాలేయం కారణంగా పెరిగిన ఆకలి కోరికలు, గాయాలు త్వరగా నయం కాకపోవడం తదితర సమస్యలు చుట్టుముడతాయని వివరించారు లోవ్నీత్ బాత్రా. View this post on Instagram A post shared by Lovneet Batra (@lovneetb) (చదవండి: ఆసియా బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో భారత్ రెస్టారెంట్లు ఎన్నంటే..!) -
ఆసియా బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో భారత్ రెస్టారెంట్లు ఎన్నంటే..!
2025లో ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్ల యొక్క విస్తరించిన జాబితాలో 7 భారతీయ రెస్టారెంట్లు స్థానం పొందాయి. 2025లో ఆసియాలోని ఉత్తమ రెస్టారెంట్ల సంకలనం 51వ నుండి 100వ స్థానంలో ఉంది. ఇటీవల విడుదలైంది. ఏడు భారతీయ సంస్థలు దీనిలో చోటు దక్కించుకున్నాయి. ఈ 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాలో ఏడు భారతీయ సంసథలు చోటు దక్కించుకున్నాయి. ఈ రెస్టారెంట్ల అవార్డుల ప్రదానోత్సవం ఆవిష్కరణ ఈ నెల ఆఖరున సియోల్ జరగనుంది. ఆ జాబితాలో చోటు దక్కించుక్ను ఏడు భారతీయ రెస్టారెంట్లు వరుసగా కసౌలిలోని నార్ (66వ స్థానం), బెంగళూరులోని ఫార్మ్లోర్ (68వ స్థానం), ముంబైలోని అమెరికానో (71వ స్థానం), న్యూఢిల్లీలోని ఇంజా (87వ స్థానం), ముంబైలోని ది టేబుల్ (88వ స్థానం), న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ (89వ స్థానం), ముంబైలోని ది బాంబే క్యాంటీన్ (91వ స్థానం). అంతేగాదు ముంబైలోని ది టేబుల్ రెండోసారి ఈ జాబితో నిలిచింది. గతంలో ఈ లిస్ట్లో నిలవడమేగాక "వన్ టు వాచ్ " అవార్డుని కూడా దక్కించుకుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నార్, ఫార్మ్లోర్, ఇంజా రెస్టారెంట్లు తొలిసారిగా చోటు దక్కించుకున్నాయి. ఇక తొలిస్థానంలో సియోల్లోని బోర్న్ అండ్ బ్రెడ్ నిలిచింది. మొదటి పది స్థానాలలో బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్ సియోల్కి సంబంధించిన ఆరు రెస్టారెంట్లు ఉండటం విశేషం. కాగా, గతేడాది ఐదు భారతీయ రెస్టారెంట్లు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం దక్కించుకోగా ఈ ఏడాది మరో రెండు రెస్టారెంట్లు ఈ జాబితాలో చేరడం విశేషం. (చదవండి: మత్స్యకారుడి కూతురు జలక్రీడల్లో సత్తా చాటుతోంది..!) -
మత్స్యకారుడి కూతురు జలక్రీడల్లో సత్తా చాటుతోంది..!
జల ప్రపంచంలో అలలే పాఠాలు. అలలే అరుదైన గురువులు. అలా ఎంతో మంది గురువుల దగ్గర ఎన్నో గెలుపు పాఠాలు నేర్చుకున్న నాగాయలంకకు చెందిన నాగిడి గాయత్రి వాటర్ స్పోర్ట్ ‘కయాకింగ్’లో సత్తా చాటుతుంది. జాతీయ స్థాయిలో రాణిస్తోంది.సాగర సంగమ తీరం నాగాయలంకలో ‘వాటర్ స్పోర్ట్స్ అకాడమీ’ నెలకొల్పడంతో గ్రామీణ్ర ప్రాంతాలకు అంతగా పరిచయం లేని కయాకింగ్–కెనోయింగ్ జలక్రీడలు దివిసీమ వాసులకు చేరువయ్యాయి. కృష్ణా జిల్లా తీరప్రాంత నాగాయలంక గ్రామానికి చెందిన నాగిడి గాయత్రి ‘వాటర్ స్పోర్ట్స్ అకాడమీ’లో శిక్షణ పొంది కయాకింగ్–కెనోయింగ్ జలక్రీడల్లో మెలకువలను ఒడిసి పట్టుకుంది. జల క్రీడలలో జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది.మొదట నాటు పడవతోనే శిక్షణ పొందిన గాయత్రి 2022లో గుజరాత్లో జరిగిన 36వ జాతీయ స్థాయి కయాకింగ్ పోటీలలో 4వ స్థానంలో నిలిచి పతకాల బోణీ కొట్టింది. గత సంవత్సరం మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన 5వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ కయాకింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో రజత పతకం గెలుచుకుంది. గోవాలో జరిగిన నేషనల్ వాటర్ స్పోర్ట్స్ ΄ోటీల్లో మరోసారి రజత పతకం గెలుచుకుంది.గత నెల ఉత్తరాఖండ్లో జరిగిన 38వ కెనోయ్ స్లాలమ్–2025 నేషనల్స్ ΄ోటీల్లో ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో బంగారు పతకం అందించి తన సత్తా చాటింది. కయాకింగ్–కెనోయింగ్లోనే కాదు...కరాటే, థైక్వాండోలోనూ గాయత్రి ప్రతిభ చూపుతూ ఎన్నో పతకాలు సాధించింది. 2017లో ఢిల్లీలో జరిగిన 33వ నేషనల్ తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం, 2021లో రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకుంది. ఇటీవల నాగాయలంక పర్యటించిన కృష్ణాజిల్లా కలెక్టర్ డికె బాలాజీ వాటర్ స్పోర్ట్స్లో గాయత్రి చూపుతున్న ప్రతిభను ప్రశంసించారు. ఆమెకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘ఒలింపిక్స్లో పతకం సాధించడమే నా లక్ష్యం’ అంటున్న ఇరవై సంవత్సరాల గాయత్రి కల నెరవేరాలనే ఆశిద్దాం.చేపల వేటలో తనకు తానే సాటినాగాయలంక కృష్ణానదిలో తండ్రి నాగబాబు సాగించే చేపల వేటలో గాయత్రి సాయపడుతూ ఉంటుంది. రాత్రి వేళల్లో సైతం తండ్రితోపాటు బోట్పై సాగర సంగమ ప్రాంతంలోకి వెళ్ళి చేపల వేటలో గాయత్రి తన నైపుణ్యం ప్రదర్శిస్తుంటుంది. వేటలో తలపండిన మత్స్యకారులు చేయలేని పనులను ఆమె సునాయాసంగా చక్కబెడుతుంది. మగవారితో దీటుగా పడవ నడుపుతూ అవసరమైన చోట లంగరు వేసేస్తుంటుంది. గాలం తాడు వేటలో గాలానికి రొయ్యను ఒడుపుగా గుచ్చడంలో ఆమెది అందెవేసిన చెయ్యి. నాగాయలంక రేవులో గాలానికి రొయ్య గుచ్చడంలో నలుగుౖరైదుగురికే నైపుణ్యం ఉంటే వారిలో ఒకరు గాయత్రి కావడం విశేషం.మా కుటుంబానికి చేపల వేటేజీవనాధారం. నాన్న ఎంతో కష్టపడి నాకు శిక్షణ ఇప్పించాడు. ఏపీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అడ్వయిజర్ తిప్పిరెడ్డి శివారెడ్డి ప్రోత్సాహాం మర్చిపోలేనిది. మొదట్లో కోచ్లు శ్రీనివాస్, నాగబాబు, చినబాబు ఇచ్చిన శిక్షణ మెలకువలే నన్ను ఈ స్థాయికి తెచ్చాయి. ఎప్పటికైనా ఒలింపిక్స్ వాటర్ స్పోర్ట్స్లో పాల్గొని బంగారు పతకం సాధించాలన్నదే నా లక్ష్యం అంటోంది నాగిడి గాయత్రి – సింహాద్రి కృష్ణప్రసాద్, సాక్షి, నాగాయలంక(చదవండి: వారెవ్వా..! ఏం సందేశం ఇది..! వైరల్గా డైరీ మిల్క్ అడ్వర్టైస్మెంట్) -
Holi 2025 - నేచురల్ కలర్స్ ఈజీగా తయారు చేసుకోండిలా!
హోలీ వచ్చిందంటే ఆ సంతోషమే వేరు. సరదాలు, రంగులు కలగలిసిన చక్కటి రంగుల పండుగ హోలీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఒకరిపై ఒకరు సంతోషంగా రంగులు జల్లుకుంటూ సంబరంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ హోలీ వెనుక అనే పురాణగాథలున్నాయి. అంతేకాదు పండుగ వేడుకల్లో ఆరోగ్యకరమైన ఆయుర్వేదకర ప్రయోజనాలున్నాయి. వణికించే చలి పులి పారిపోతుంది. వేసవి కాలం వచ్చేస్తుంది. ఈ గాలి మార్పు కారణంగా జ్వరాలు, జలుబూ మేమున్నాం అంటూ వచ్చేస్తాయి. వీటిని అడ్డుకునేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడులను నీళ్లలో కలిపి చల్లుకునేందుకు ఈ వేడుక పుట్టిందని పెద్దలు చెబుతారు. కానీ కాలక్రమంలో సహజమైన రంగుల స్థానంలో రసాయనాలుమిళితమైన ప్రమాదక రంగులు వచ్చి చేరాయి. పైగా నాచులర్ కలర్స్తో పోలిస్తే చవగ్గా దొరుకుతాయి. అందుకే ఇంట్లోనే తక్కువగా ఖర్చుతో ఆర్గానిక్గా తయారు చేసుకునే కలర్స్ గురించి తెలుసుకుందాం. తద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు ప్రకృతిని కాపాడుకున్నవారమవుతాం.పండుగ వేడుక అంటే సంతోషాన్ని మిగిల్చాలి. ఆనందంగా గడిపిన క్షణాలు మనకు లేనిపోని సమస్యల్ని, రోగాలను తీసుకు రావడం కూడదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆ చెట్ల ఆకులతోనూ, పరిసరాలలో ఉన్న ప్రకృతి వనరులతోనూ సహజమైన రంగులు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మందారం, బంతి, చేమంతిలా పూలతోపాటు, గోరింటాకుతో పచ్చని రంగు, టొమాటో, క్యారట్లతో ఎరుపు రంగు, బీట్రూట్తో గులాబీ రంగు, పసువు కొమ్ములతో పసుపు రంగులు తయారు చేసుకోవచ్చు. మోదుగుపూల రసాన్ని మర్చిపోతే ఎలా? మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు హోలీ పండుగ పూట చలువ చేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరి చేరవని అంటారు.పసుపు: బంతి పువ్వులు, నారింజ తొక్కల పొడి, చేమగడ్డ పొడి, పసుపు వంద సమపాళ్లలో తీసుకొని కలుపుకోవాలి.దీనికి కొద్దిగా నిమ్మ రసం వేసి ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే చక్కటి పసుపు రంగు తయారవుతుంది. దీన్ని నీళ్లలో కలుపుకుంటే లిక్విడ్ కలర్గా మారిపోతుంది.ఎరుపు: మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. వీటిని మెత్తని పొడిగా నూరుకుంటే ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఇది ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే దీనికి కొంచెం బియ్యప్పిండి యాడ్ చేసుకుంటే చాలు.మందారంతోపాటు ఎర్ర చందనం పౌడర్(కొంచెం ఖరీదైనదే)కలిపితే రెడ్ కలర్ తయారవుతుంది. ఎర్ర చందనం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తడి, పొడి రూపంలో వాడుకోవచ్చుగోధుమరంగుగోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పార్ల ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్ర మాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్య ప్పిండిని కలిపితే చాలు.నీలం: జకరండ లేదా బ్లూ, ఊదా గుల్మొహార్ ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. అలాగే నీలం రంగు శంఖు పుష్పాలను నీళ్లలో నానబెడితే చక్కటి నీలం రంగు తయారవుతుంది. ఆకుపచ్చ: గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్య కలిపి గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా సిద్దం చేసుకోవచ్చు.కాషాయం: మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెడితే పసుపు కాషాయం రంగుల మిశ్రమంతో చక్కటి రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. గోరింటాకును నూరి నీటిలో కలిపి, కొద్దిసేపు ఉంచి వడబోసుకుంటే ఆరెంజ్ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును (ఇది కూడా చాలా ఖరీదైనది) రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికి కాషాయం రంగు తయారవుతుంది.గులాబీ: హోలీ ఆటలో చాలా ప్రధానమైన గులాల్ గులాబీ రంగులో ఉంటుంది. బీట్ రూట్ (నీటిలో మరగబెట్టి) రసం ద్వారా దీన్ని తయారు చేయొచ్చు. బీట్ రూట్ను ఎండబెట్టి పౌడర్ చేసుకుని దీనికి శెనగ, పిండి, బియ్యం, గోధుమ పిండిని కలుపుకోవచ్చు. -
కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లినా.. నొప్పి తెలియదట ఆమెకు..!
ఓ పట్టాన అంతుచిక్కని కొన్ని రకాల వ్యాధులు వైద్యులకు భలే గమ్మత్తైన సవాళ్లని విసురుతుంటాయి. ఒక్కోసారి అదెలా సాధ్యం అని వైద్యులకే చెమటలు పట్టించేస్తాయి. అచ్చం అలాంటి వైద్య పరిస్థితితోనే పోరాడుతోంది ఈ చిన్నారి. వైద్యపరంగా ఆమె ఓ అద్భుతంగా మారింది. ప్రతి వ్యక్తి మనుగడకు, ఆరోగ్యానికి ప్రధానమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే బతికేస్తుంది ఆమె. మరీ ఆ చిన్నారి ఎలాంటి వైద్యపరిస్థితితో బాధపడుతోందంటే..యూకేకి చెందిన ఒలివియా పార్న్స్వర్త్ అనే అమ్మాయి అరుదైన జన్యుపరమైన సమస్యతో పోరాడుతోంది. ఆ ప్రత్యేకమైన పరిస్థితి కారణంగా వైజ్ఞానికంగా అద్భతమైన అమ్మాయిగా మారిందామె. ప్రపంచంలో ప్రతి మానవుడికి కీలమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే జీవించగలదామె. సింపుల్గా చెప్పాలంటే ఆమె ఆ మూడు సవాళ్లను ఒకేసారి అధిగమించగల అసాధారణ అమ్మాయి. అంతెందుకు వైద్యులు కూడా ఆమెను ఓ ఆద్బుతంగా పరిగణించారు. ఏంటా వైద్యపరిస్థితి అంటే..ఒలివియాకి నొప్పి, ఆకలి, నిద్ర అనేవి ఉండవట. ఇది మనిషిలో ఉండే ఆరవ క్రోమోజోమ్లోని జన్యుపరమైన అసాధారణత ఫలితంగా ఆమెకు ఇలాంటి పరిస్థితని వైద్యలు భావిస్తున్నారు. ఒకరకంగా ఇది వరంలా కనిపించినా ఆమెకు ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే అనే ఒలివియా తల్లి ఆవేదనగా చెప్పారు. ఈ మూడింటి ఫీలింగ్స్ ఆమెకు తెలియదు కాబట్టి ఏ క్షణంలో తనను తాను ఎలా గాయపరుచుకుంటుందో అనే భయపడుతూ బతకాల్సి వస్తోందంటూ కన్నీటి పర్యాంతమైంది ఒలివియా తల్లి. ఇక ఆమెకు ఆకలి ఉండదు కాబట్టి ఆమె పోషకాహార లోపంతో బాధపడకుండా మంచి ఆహారాన్ని ఇచ్చేలా పర్యవేక్షించక తప్పదని చెబుతోంది. అంతేగాదు ఒలివియాకు ఏడేళ్ల వయసులో జరిగిన ప్రమాదం గుర్తించేసుకుంటూ..నాడు తామంతా ఒలివియా పరిస్థితి చూసి కంగుతిన్నామని చెప్పింది. ఆమె చిన్నతనంలో ఓ కారు ఆమెను ఢీకొట్టి చాలాదూరం ఈడ్చుకుని వెళ్లిపోయిందని నాటి ఘటనను వివరించారు. ఒళ్లంతా నెత్తురోడుతున్న...ఆ ఆకస్మిక ఘటనకు మా కుటుంబం అంతా షాక్లో ఉండిపోయింది. కొద్దిపాటి మెరుపు వేగంలో తేరుకుని ఒలివియాను రక్షిద్దాం అనుకునేలోగా ..ఒలివియా ఏమి కానట్లుగా తనంతాట తానే లేచి తమ వద్దకు రావడంతో హుతాసులైపోయాం అంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారామె. ఒంటినిండా గాయలైనా ఏం కానట్లు ఒలివియా ప్రవర్తించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేనంటోంది తల్లి. "ఒలివియాకి నిద్ర కూడా ఓ సవాలు. ఎందుకంటే మందులు లేకుండా సహజంగా నిద్రపోలేదు. మనం గనుక మందులు వేయకపోతే అలా మూడు రోజుల వరకు మేల్కొనే ఉంటుందట. ఆ నిద్రలేమిని నిర్వహించేలే కఠినమైన నిద్ర సహాయాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు". ఒలివియా తల్లి. ఆ అమ్మాయి పరిస్థితిని ఆస్పత్రి వారు బయోనిక్గా అబివర్ణించారు. ఈ అరుదైన కేసు జీవశాస్త్రం సంక్లిష్టతలు, జన్యుఉత్పరివర్తనాల ప్రభావంపై అంతర్దృష్టిని అందిస్తోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఆ అమ్మాయి కేసు తమ వైద్యానికే అంతపట్టని చిక్కుప్రశ్నలా ఉందన్నారు. ఒలివియా పరిస్థితిని ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాటిలో ఒకటిగా పేర్కొన్నారు. నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి వైద్య నిపుణులకేకాదు సాధారణ ప్రజలకు కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉంది కదూ..!.(చదవండి: కిడ్నీలు పదిలమేనా..? మదుమేహం లేకపోయినా వస్తుందా..?) -
మధుమేహం లేకపోయినా కిడ్నీ వ్యాధి వస్తుందా..?
కిడ్నీ.. మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవం. తినేతిండి, తాగే నీటిని వడకట్టి వడబోసి.. శరీరానికి అవసరమైన శక్తిని రక్తంలోకి, మలినాలను, వ్యర్థాలను మలమూత్రవిసర్జన ద్వారా బయటికి పంపించే ప్రక్రియను కిడ్నీ నిర్వహిస్తుంది. ఇటీవలకాలంలో తెలంగాణ కరీంనగర్ జిల్లాలో కిడ్నీవ్యాధి బాధితులు పెరుగుతున్నారు. పిల్లలు, యువతను సైతం సమస్య వెంటాడుతోంది. అనేక మందికి ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపోయినా మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడం కనిపిస్తోంది. దశాబ్దకాలంలో వేలాదిమంది మరణాలకు కారణమైన వ్యాధికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు కాగా పెయిన్ కిల్లర్స్ అధిక వినియోగం, డీహైడ్రేషన్ మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కథనం.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్రెడ్డి(55) వ్యవసాయం చేస్తుంటాడు. ఒకరోజు అనూహ్యంగా వాంతులయ్యాయి. కాళ్లు వాపులు వచ్చాయి. వెంటనే కరీంనగర్ వెళ్లగా రక్త పరీక్షలు చేసిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిలయ్యాయని నిర్ధారించారు. విజయేందర్రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, వారానికి రెండుసార్లు డయాలసిస్ చేశారు. ప్రతిసారీ రూ.5000 చొప్పున నెలకు రూ.40వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అయ్యాయి. విజ యేందర్రెడ్డిని ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసిన తమ్ముడు జితేందర్రెడ్డి(51) తన రెండు కిడ్నీల్లోని ఒక్కటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. విజయేందర్రెడ్డికి జితేందర్రెడ్డి కిడ్నీ మ్యాచ్ అయింది. అదిపని చేయడం ప్రారంభించింది. మృత్యుముంగిట అసహాయంగా చేతులు కట్టుకుని నిల్చున్న సోదరుడికి ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది.కిడ్నీలు ప్రతిరోజు దేహంలో 200 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేస్తూ, యూరియా, క్రియాటినిన్ లాంటి జీవరసాయనాలను వడపోస్తాయి. కిడ్నీల పనితీరు దాదాపు 70 నుండి 80 శాతానికి పడిపోయే వరకు బాధితులకు ఆ విషయమే తెలియదు. ఒకసారి కిడ్నీలు గనక చెడిపోతే, జీవక్రియల్లో వెలువడే ఎన్నో విషరసాయనాలు దేహంలోనే పేరుకుపోవడం మొదలవుతుంది. దీంతో ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది. అవగాహన లేమి, నిర్లక్ష్యం, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ మందులు వాడకంతో ఉమ్మడి జిల్లాలో జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. మూత్రపిండాలు ఒకసారి దెబ్బతింటే తిరిగి బాగు చేయటం సాధ్యం కాదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పాడవకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గురువారం ‘ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం’ సందర్భంగా కథనం.ఇదీ నేపథ్యం2006లో తొలిసారిగా మార్చి 14న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఏటా ప్రత్యేక థీమ్ని ప్రకటించి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల ఆరోగ్యం, డయాలసిస్ అవగాహన కోసం ఏటా మార్చి రెండవ గురువారం “ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.థీమ్: “మీ మూత్రపిండాలు బాగున్నాయా? ముందుగానే గుర్తించండి.., మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడండి..’' అనేది ఈ ఏడాది నినాదం. కిడ్నీ వ్యాధికి సంబంధించిన ప్రమాద కారకాలు మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) కుటుంబంలో మూత్రపిండాల వ్యాధి చరిత్ర ఉండడమని వైద్యులు పేర్కొంటున్నారు.కిడ్నీల పనితీరు కీలకంమూత్రపిండాలు మూత్రం తయారీతోపాటు రక్తం వడపోతలో కీలకంగా పనిచేస్తాయి. కణాలు ఉత్పత్తి చేసే ఆమ్లాలను (యాసిడ్)ను బయటకు పంపిస్తాయి. రక్తంలో నీరు, లవణాలు, సోడియం, కాల్షియం, భాస్వరం, పోటాషియం వంటివి సమతుల్యంగా ఉండేలా చేస్తాయి. కిడ్నీలు దెబ్బతింటే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంది. సీరం క్రియాటిన్ పరీక్ష ద్వారా కిడ్నీ పనితీరును తెలుసుకునే వీలుంది. ఏడాదికోసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలుమూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రక్తపోటు, మధుమేహం, అధిక బరువు వంటివి తలెత్తకుండా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం మానుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి, వ్యాయామం చేయాలి. ఉప్పు తక్కువ తీసుకోవాలి. అధికంగా మాంసం తీసుకోవద్దు. ఆహారంలో సగభాగం పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. నొప్పి గోళీలు, అనవసరంగా స్టెరాయిడ్స్ వాడకూడదు.ఉమ్మడి జిల్లాలో మూత్రపిండ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగంలో కిడ్నీ బాధితులకు నామమాత్రపు వైద్య సేవలు అందుతున్నాయి. స్థానికంగా ప్రైవేటు రంగంలో నెఫ్రాలజిస్టులు ఉన్నప్పటికీ సదుపాయాల కొరతతో రోగులు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వైద్యశాలల్లో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలు లేవు. చికిత్స మాత్రమే అందిస్తున్నారు.గోదావరిఖని జీజీహెచ్తోపాటు పెద్దపల్లి జిల్లా ఆస్పత్రి, మంథని ప్రభుత్వాస్పత్రుల్లో ఐదు మిషన్లు చొప్పున మూడు డయాలసిస్ కేంద్రాలున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద జీజీహెచ్లో రోజుకు 16 మందికి నాలుగు షిప్టుల ద్వారా నెలలో 40మందికి, పెద్దపల్లిలో రోజుకు 15 మందికి మూడు షిఫ్టుల చొప్పున నెలకు 33 మంది పేషెంట్లకు, మంథనిలో రోజుకు తొమ్మిది మందికి ఒక షిఫ్టులో నెలలో 9మంది పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 95మంది కిడ్నీలు (మూత్రపిండాలు) ఫెయిల్ అయి డయాలసిస్పై జీవిస్తున్నారు. వందలాది మంది సకాలంలో వైద్యం అందక, కిడ్నీ అందించే రక్తసంబంధీకులు ఎవరూ ముందుకు రాక.. ప్రాణాలు కోల్పోయారు.కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు నగర శివా రులో ఉన్న రెండు వైద్యకళాశాలల్లో సైతం డయాలసిస్ సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారు.పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దుఈ మధ్య చాలా మంది పేయిన్ కిల్లర్స్, ఇతర హానికరమైన మందులను విచ్ఛలవిడిగా మింగుతున్నారు. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులను వాడకూడదు. నాటు వైద్యం జోలికి వెళ్ల కూడదు. జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్య రుగ్మతలు కిడ్నీ వ్యాధులకు కారణం. సంపూర్ణ ఆరోగ్యం కోసం మన జీవనశైలిని మార్చుకోవాలి. – కుందరాపు గోపికాంత్, యూరాలజిస్టు, గోదావరిఖనిలక్షణాలు తెలియడం లేదుచాలా మంది వ్యాధి ముదిరే వరకు లక్షణాలు తెలియపోవడం వల్ల పరిస్థితి విషమించిన తర్వాత వైద్యం కోసం వస్తున్నారు. తగ్గని జ్వరం, కాళ్లు, ముఖం వాపులు, యూరిన్లో ప్రొటీన్లు పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అశ్రద్ధ చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.– రాంచందర్ తొర్రెం, నెఫ్రాలజిస్టు (చదవండి: డీహైడ్రేషన్కు రీహైడ్రేషన్తో చెక్..! ఎండాకాలం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..) -
సుర్రుమంటున్న సూర్యుడు.. డీహైడ్రేషన్ బారినపడకూడదంటే..!
ఎండాకాలం మొదలైంది. మార్చి రెండోవారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాది 47 నుంచి 49 డిగ్రీల సెల్సీయస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదేస్థాయిలో మండే ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఎలాంటి వైద్య సేవలు పొందాలి? తదితర అంశాలను గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీంనగర్ జిల్లా వైద్య అధికారి(డీఎంహెచ్వో) వెంకటరమణ వివరించారు.వేసవిలో ఎలాంటి రక్షణ పొందాలి?డీఎంహెచ్వో: ఎండ ఎక్కువగా ఉండే 11 నుంచి 3 గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మంచింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా రుమాలు పెట్టుకుని, తెల్లని దుస్తులు ధరించాలి. రేకులషెడ్లలో నివాసముండే వారు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. రేకులపై గడ్డి, గోనె సంచులను వేసుకొని నీళ్లు చల్లాలి.రోజూ ఎన్ని నీళ్లు తాగాలి? డీఎంహెచ్వో: ఎండాకాలంలో నీటిశాతం లోపంవల్ల శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. శరీరంలో శక్తి తగ్గి అలసట కలుగుతుంది. ప్రతీ రోజు 8నుంచి 10గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా ప్రయాణం లేదా బయట పనులున్నప్పుడు నీరు తాగడం మరిచిపోవద్దు. అది కూడా సురక్షితమైన నీటిని తీసుకోవాలి.ఆహారం విషయంలో జాగ్రత్తలు?డీఎంహెచ్వో: ఎండాకాలంలో మిగిలిన ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. ప్రతీరోజూ తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్, బిర్యానీలు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం చేయాలి? డీఎంహెచ్వో: శరీరంలో టెంపరేచర్ పెరిగినప్పుడు, బట్టలు తీసేసి చల్లటి నీటితో ముఖం, చేతులు, కాళ్లు తుడవాలి. గాలి ఆడే స్థలంలో విశ్రాంతి తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.ఆస్పత్రుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీఎంహెచ్వో: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. డీహైడ్రేషన్ జరగకుండా ఉండేందుకు 2 లక్షల ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాం. అంగన్వాడీ కేంద్రాల్లో, ఉపాధిహామీ కూలీలకు పనిస్థలాల్లోనూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా వాడుకోవచ్చు.గతేడాది వడదెబ్బ మరణాలు సంభవించాయా? డీఎంహెచ్వో: గతేడాది జిల్లాలో ఇద్దరు వడదెబ్బ కారణంగా మరణించారు. వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించేందుకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశాం. ఇందులో మెడికల్ ఆఫీసర్, తహసీల్దార్, పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటారు. వీరి ద్వారా వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ జరిగితే ప్రభుత్వం నుంచి కలెక్టర్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.గర్భిణులు, పిల్లలు, వృద్ధులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? డీఎంహెచ్వో: గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడే వారు హైరిస్క్ గ్రూపులో ఉంటారు. వీరు ఎండలో ఎక్కువ సమయం ఉండొద్దు. ముఖ్యంగా గర్భిణులు డెలివరీకి ముందే ప్లాన్ చేసుకొని ఆసుపత్రికి చేరుకోవాలి. పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్, కేన్సర్ తదితర వ్యాధులతో బాధపడేవారు ఎండలో తిరిగే సాహసం చేయవద్దు.డీహైడ్రేషన్ అయితే ఏం చేయాలి?డీఎంహెచ్వో: డీహైడ్రేషన్ అయితే రీహైడ్రేషన్తో చెక్ పెట్టాలి. ఎవరైనా డీహైడ్రేషన్కు గురైన వెంటనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఉప్పునిమ్మకాయ కలిపిన నీరు తాగించాలి. ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఆ చెఫ్ చేతులు అద్భుతం చేశాయి..! వావ్ బంగాళదుంపతో ఇలా కూడా..) -
ప్రధాని మోదీ మెచ్చిన ‘మిల్లెట్ కేక్’.. దెబ్బకు వ్యాపారం కోట్లకు పడగలెత్తింది
సేల్స్మ్యాన్గా, ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తూ కెరియర్లో అంచలంచెలుగా ఎదిగాడు. అయితే పనిలో భాగంగా బేకరి పనులను అర్థం చేసుకోవడానికి బ్రిటానియా, అమూల్ వంటి కంపెనీలను సందర్శించడంతో బేకరీ ఫుడ్స్ తయారీపై ఆసక్తి ఏర్పరుచుకున్నాడు. అలా సొంతంగా వ్యాపారం చేద్దామన్నా ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. అందుకోసం విదేశాలకు వెళ్లి మరీ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. చివరిక బేకరీ పెట్టాడు..అలా మిల్లెట్స్ కేక్ తయారీతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించి..కోట్లకు పడగలెత్తాడు. ఎందరికో యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతడి విజయ ప్రస్థానం ఎలా జరిగిందంటే..రాజస్థాన్లోని జోధ్పూర్లో పుట్టి పెరిగిన అమిత్ సోనీ ఆభరణాల కళాకారుల కుటుంబం నేపథ్యం నుంచి వచ్చాడు. అమిత్ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి, అనంతరం ఎలక్ట్రానిక్స్ రంగంలో సేల్స్మ్యాన్ నుంచి ఈవెంట్ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు. అలా వివిధ ఉద్యోగాలు చేశాడు. అయితే తన ఉద్యోగంలో భాగంగా బేకరీ పనులను అర్థం చేసుకోవడానికి తరుచుగా బ్రిటానియా, అముల్ వంటి కంపెనీలను సందర్శిస్తుండేవాడు. ఆ నేపథ్యంలో బేకరీ పెట్టాలనే ఆలోచన వచ్చింది అమిత్కి. అయితే బేకరీ ఉత్పత్తులను ఎలా తయారుచేస్తారనేది తెలియదు, కానీ బిజినెస్ గురించి మాత్రం బాగా తెలుసు అమిత్కి. ఉద్యోగంలో బాగానే రాణిస్తున్నా..వ్యాపారం చేయాలనే కోరికతో 2017లో ఉద్యోగానికి రిజైన్ చేశాడు. ముందుగా బేకరీలోని ఆహార పదార్థాల తయారీలో శిక్షణ తీసుకునేందుకు (ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్)కి వెళ్లాడు. తర్వాత థాయిలాండ్ వంటి విదేశాలకు వెళ్లి ఆ రంగంలో మరింత మెరుగులు దిద్దుకున్నాడు. అయితే అమిత్కి విదేశాల్లో మంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి కానీ తల్లిదండ్రులు ఇక్కడే ఉండాలని పట్టుబట్టడంతో..అలా 2019లో జోథ్పూర్లో తన సొంత బేకరీ RDz 1983ని ప్రారంభించాడు. మొదట్లో ఇది బ్రెడ్, కేక్లను అందించేది. అయితే అనూహ్యంగా ఐసీఏఆర్ రాజస్థాన్ నుంచి బజ్రా చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేయాలనే ఆర్డర్తో మిల్లెట్ల వైపుకి ఆకర్షితుడయ్యాడు అమిత్. అయితే మిల్లెట్లో గ్లూటెన్ లేకపోవడంతో కేక్ తయరీ చాలా సవాలుగా మారింది. దాదాపు 96 సార్లు విఫలమయ్యాక చివరికి మిల్లెట్ కేక్ని తయారు చేశాడు. 80 కిలో గ్రాముల కేక్ని ఓ పది కిలోగ్రాముల ముక్కలుగా విభజించాడు. వాటిని కొంతమంది CAZRI (సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) అధికారులు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)కి తీసుకువెళ్లారు. రెండు రోజుల తర్వాత వీడియోతో కూడిన సందేశం పంపించారు వారు. అమిత్ దాన్ని ఓపెన్ చేసి చూశాకగానీ తెలియలేదు..ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా ఆ మిల్లెట్ కేక్ను కట్ చేస్తున్నారని. ఆ సమయంలో నరేంద్ర సింగ్ తోమర్, కైలాష్ చౌదరి, రాజ్నాథ్ సింగ్ వంటి ప్రముఖులు అతని పక్కనే ఉన్నారు. ఆయనలా అమిత్ తయారు చేసిన మిల్లెట్ కేక్ కట్ చేసి ప్రారంభించారో లేదో ఒక్కసారిగా ఆర్డర్లు వెల్లువలా రావడం జరిగింది. ఇక అమిత్ ఎక్కువ కాలం నిల్వ ఉండే కుకీలు, బ్రౌనీలపై దృష్టిసారించాడు. అలా పెర్ల్ మిల్లెట్ కుకీలను అందించే స్థాయికి చేరుకున్నాడు. దీంతో అమిత్ UN సమావేశాలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఉదయపూర్లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశం వంటి ఉన్నత స్థాయి కార్యక్రమాలకు మిల్లెట్ కుకీలను అందించే పెద్ద పెద్ద ఆర్డర్లు అందుకున్నాడు. అంతేగాదు దేశీయంగా దాదాపు వందకి పైగా హోటళ్లలో ఈ మిల్లెట్ కుక్కీలు అమ్ముడయ్యాయి. బహ్రెయిన్, దుబాయ్ వంటి విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం అతడి బేకరీ ప్రతిరోజూ 150 కిలోల కుకీలను తయారు చేస్తోంది, అలాగే నెలకు 15 వేలకుపైగా కస్టమర్లకు సర్వ్ చేస్తోంది. ఈ వ్యాపార రంగంలోకి అమిత సోదరుడు ఫిజియోథెరపిస్ట్ అయిన డాక్టర్ సుమిత్ సోనీకూడా చేరారు. ఇలా అమిత్ కుటుంబ బేకరీ బిజినెస్ ఏడాదికి రూ. 1.5 కోట్లను ఆర్జిస్తోంది. బెంగళూరు, ముంబై వంటి నగరాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం అమిత్ సీఆర్పీఎఫ్ జవాన్లకు మిల్లెట్ కుకీలను అందించే ఆర్డర్ తయారీకి రెడీ అవుతున్నాడు. నిజంగా ఇది మహర్షి మూవీలో హీరో మహేష్ చెప్పినట్లు "సక్సస్ ఈజ్ జర్నీ నాట్ ఏ డెస్టినేషన్ (విజయం అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు)" అంటే ఇదే కదా..!. View this post on Instagram A post shared by RD'Z 1983 BAKERY (@rdz_1983) (చదవండి: మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..! నాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..) -
కివిపండుని తొక్కతో సహా తింటున్నారా..?
కివి విదేశీ పండైనా..మనకి మార్కెట్లలో అందుబాటులోనే ఉంది. దీన్ని చైనీస్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. చాలామంది ఇష్టంగా తింటారు కూడా. అయితే ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అన్నీ లాభాలనందించే ఈ పండుని తొక్కతో తినొచ్చా..? ఏ సమయంలో తింటే మంచిది వంటి వాటి గురించి తెలుసుకుందామా..!రుచిలో తియ్యగా, పుల్లగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే తియ్యగా, పుల్లగా ఉండే ఈ కివీ వివిధ వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా ఈ పండుని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఈ కివి పండుని తీసుకోవండ కలిగే లాభాలేంటంటే..ఆరోగ్య ప్రయోజనాలు..కివి పండులో విలువైన ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఉబ్బరం తగ్గిస్తుంది గట్ బ్యాక్టీరియాకు ఉపయోగపడుతుంది సెరటోనిస్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి హాయిగా నిద్రపడుతుంది ∙బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది ∙రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒమేగా ఫ్యాటీ అమ్లాల వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది మల బద్దకం సమస్య లేకుండా చేస్తుంది. కివీలో ఉండే ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది ∙శరీరం కోల్పోయిన నీటిని అందించడంలో కివీలోని విటమిన్లు సి, ఇ, పొటాషియం... ఉపయోగపడతాయి. ఏ సమయంలో తినాలి కివి తినడానికి సరైన సమయం ఉదయం. కివిలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. కివి ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి కాబట్టి ఖాళీ కడుపుతో తినకుండా కాస్త బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తినడం మంచిది.ఎలా తింటే మంచిదంటే..కివీ పండ్లతో ప్రయోజనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుం టాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెంట్లు పూర్తి పీచు పదార్థంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియిన్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు. (చదవండి: బీట్రూట్ని మజ్జిగతో కలిపి ఎందుకు తీసుకోవాలంటే..!) -
రికవరీ సూట్ ఫైల్ చేసుకోవచ్చు..!
దుబాయ్లో ఉండే ఒక వ్యక్తికి 12 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాను. అతను భారతీయుడే. కానీ తిరిగి చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా, స్టేషన్కు వచ్చి సెటిల్ చేసుకొని ‘7 లక్షల రూపాయలు కడతాను, అంతకుమించి ఇవ్వలేను’ అని అందరిముందూ ఒప్పుకున్నాడు. మూడు లక్షలు ఇచ్చాడు. నాలుగు లక్షలకి చెక్కు రాసి ఇచ్చాడు. కానీ ఇంతవరకు డబ్బులు ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు. ఇది జరిగి రెండు సంవత్సరాలు అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరూ తిరిగి దుబాయ్కి వెళ్ళిపోయారు. ‘ఎప్పుడిస్తారు అని అడిగితే కేసులు పెట్టుకోండి మా దగ్గర డబ్బులు లేవు’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఆన్లైన్లో ఐదులక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన రసీదు మా దగ్గర ఉంది. ఇదేమైనా సాక్ష్యంగా పనికొస్తుందా? ఈ పరిస్థితుల్లో ఏం చేయమంటారు?– చిరంజీవి, మచిలీపట్నంరెండు సంవత్సరాల క్రితం చెక్కు ఇచ్చారు అని చెప్పారు కానీ అది పోస్ట్డేటెడ్ చెక్కా లేక డేటు వేయకుండా ఇచ్చారా అనే విషయాన్ని చెప్పలేదు. ఒకవేళ చెక్కు మీద డేటు వేసి ఉంటే, ఆ డేటు నుంచి మూడు నెలల గడువులోగా చెక్కును డిపాజిట్ చేసి, అది చెల్లకపోతే చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. అలాంటి వీలు ఉందో లేదో చూసుకోండి. లేనిపక్షంలో సివిల్ కోర్టును ఆశ్రయించి రికవరీ సూట్ ఫైల్ చేసుకోండి. అప్పు తీసుకున్న నాటినుండి లేదా ఆ లావాదేవీ జరిగిన తేదీ నుంచి మూడు సంవత్సరాలలోగా కేసు వేసుకోవాల్సి ఉంటుంది. దగ్గర్లోని లాయర్ను సంప్రదించి మీ వద్ద ఉన్న సాక్ష్యాలను, చెక్కును చూపించి ఏం చేయాలో నిర్ణయం తీసుకోండి.నేను ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటూ ఆ అపార్ట్మెంట్ కోశాధికారిగా బాగోగులు చూస్తున్నాను. మా దాంట్లో ఒక ఓనర్ మెయింటెనెన్స్ కట్టడం లేదు. బకాయి పెరిగి΄ోతోంది. ఎన్నిసార్లు అడిగినా ఎదో సాకు చెప్తూ డబ్బు ఇవ్వడం లేదు. గట్టిగా అడిగితే అసలు ఇవ్వనని కరాఖండిగా చెప్తున్నాడు. అతని నుంచి మెయింటెనెస డబ్బులు రాబట్టడం ఎలా?– గోవిందరాజు, హైదరాబాద్మీ అపార్ట్మెంట్ సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయిందా లేదా అనే విషయాన్ని మీరు చెప్పలేదు. ఒకవేళ కోపరేటివ్ సొసైటీస్ చట్టం కింద రిజిస్టర్ అయి ఉంటే, సదరు కమిషనర్ ముందు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం, 2001 చట్టం కింద రిజిస్టర్ చేసుకుని ఉంటే... సెక్షన్ 23 ప్రకారం, ఆర్బిట్రేషన్ ద్వారా లేదా సివిల్ కోర్టును ఆశ్రయించడం ద్వారా మీ బకాయిలను వసూలు చేసుకోవచ్చు. బకాయిలు చెల్లించేంతవరకు సదరు ఓనరు ఇల్లు అమ్మడానికి వీలు లేదు అనేటటువంటి ఆర్డర్ కూడా పొందవచ్చు. (చదవండి: జాగ్రత్త పడకుంటే విడాకులే..!) -
జాగ్రత్త పడకుంటే విడాకులే..!
అమెరికాలో విడాకుల లాయర్గా పేరుబడిన జేమ్స్ శాక్స్ట్టన్. విడాకులు పెరగడానికి కారణం ‘స్లిప్పేజ్ అన్నాడు. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు పట్టించుకోక చూపే లెక్కలేనితనాలే ఒకనాటికి ‘విడాకులు’గా మారుతున్నాయని హెచ్చరించాడు. ‘నా ఉద్యోగం, పిల్లలు, సంపాదన...వీటన్నింటి కన్నా ముందు నువ్వే నాకు ముఖ్యం’ అని భార్య/భర్త ఒకరికొకరు తరచూ చెప్పుకోకపోతే చర్యలతో చూపకపోతే విడాకులకు దగ్గరపడ్డట్టే అంటున్నాడు. స్లిప్పేజ్ లక్షణాలు మీలో ఉన్నాయా..?ఒకరోజు ఉదయాన్నే మీరు బట్టలు ధరిస్తుంటే అవి బిగుతుగా కనబడతాయి. వేసుకోవడానికి పనికి రానట్టుగా ఉంటాయి. ఏమిటి... ఇంత లావై΄ోయానా అనుకుంటారు. ఈ లావు రాత్రికి రాత్రి వచ్చిందా? కాదు. సంవత్సరాలుగా మీరు నిర్లక్ష్యంగా తిన్నది, వ్యాయామాన్ని పట్టించుకోనిది పేరుకుని ఇప్పుడు ఇలా బయటపడింది. మీ జీవన భాగస్వామి ఒక ఉదయాన వచ్చి మనం విడాకులు తీసుకుందాం అనంటే అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో సంవత్సరాల నిర్లక్ష్యాల ఫలితం’ అంటున్నాడు జేమ్స్ శాక్స్టన్. అమెరికాలో విడాకుల లాయర్గా పేరుగడించిన ఈయన ఇటీవల ఒక పాడ్కాస్ట్లో ‘స్లిప్పేజ్’ అనే మాట వాడాడు. పెళ్లయ్యాక ఏది ముఖ్యమో, ఏది అక్కడ అవసరమో అది వయసు గడిచేకొద్దీ ‘స్లిప్’ చేసుకుంటూ వెళితే ఎదురయ్యేది విడాకులే అంటాడతను. ఇతని మాటల ఆధారంగా వివిధ మ్యారేజ్ కౌన్సిలర్లు తమ వ్యాఖ్యానం వినిపిస్తున్నారు.మీ పెళ్లయ్యాక ఇలా చేస్తున్నారా?అతడు/ఆమె ఇష్టాఇష్టాలను ‘ఏం పర్లేదులే’ అనే ధోరణిలో ఖాతరు చేయకపోవడం.చిన్న చిన్న కోరికలు పట్టించుకోకపోవడంతగిన సమయం ఇవ్వకపోవడంసంభాషించకపోవడంమాటల్లేని రోజులను పొడిగించడంఅసంతృప్తులను బయటకు చెప్పకుండా కప్పెట్టి రోజులు వెళ్లబుచ్చడం..ఇలాంటివి జరుగుతుంటే త్వరలోనే వివాహ బంధం బ్రేక్ కానుందని అర్థం.ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?మీరు కేవలం రోజువారి పైపై మాటలే మాట్లాడుకుంటున్నారా?లోతైన, ఆత్మీయమైన సంభాషణలే చేసుకోవడం లేదా?సన్నిహితమైన సమయాలే ఉండటం లేదా?సమస్యాత్మక విషయాలను చర్చకు పెట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారా?ఇలా ఉన్నా మీ వివాహం ప్రమాదంలో ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.మంచి తల్లిదండ్రులైతే సరిపోదుచాలామంది దంపతులు తాము మంచి తల్లిదండ్రులుగా ఉండటం ముఖ్యమనే దశకు వెళతారు. పిల్లలతో అనుబంధం గట్టిగా ఉంటే భార్యాభర్తల బంధం కూడా గట్టిగా ఉంటుందని అనుకుంటారు. అయితే ఇలా ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. ‘నేను, నా ఉద్యోగం, నా పిల్లలు, నా సంపాదన ఆ తర్వాతే జీవిత భాగస్వామి అనుకుంటారు చాలామంది. వాస్తవానికి జీవిత భాగస్వామి ముందు ఉండాలి. మనం చేస్తున్నదంతా భార్య/భర్త కోసమే అనుకుని నిర్లక్ష్యం వహిస్తే భార్య/భర్త దూరమవుతారు. పిల్లలు, కెరీర్ కంటే ముందు భార్యాభర్తలుగా మన బంధం ముఖ్యం అని ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకోవాలి... ఆ విధంగా రిలేషన్ను కాపాడుకోవాలి’ అంటున్నారు నిపుణులు.ఇలా చేయండి..మీ జీవిత భాగస్వామి పట్ల అక్కరగా ఉండండి.తరచూ ఎక్కువగా మాట్లాడండి. మంచి సమయాన్ని గడపండి.ఆర్థిక విషయాలు దాచకుండా చర్చిస్తూ ఇష్టాఇష్టాలు గమనించండి.మీ భార్య/భర్త ఒక గట్టి పాయింట్ లేవదీసి మిమ్మల్ని నిలదీస్తే తప్పించుకోకుండా దానిపై ఇవ్వాల్సిన వివరణ ఇచ్చి ముగించండి. లేకుంటే అది పెరుగుతూనే ఉంటుంది.మీరు భార్య లేదా భర్త. అంటే వివాహ బంధంలో మీవంటూ కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ బాధ్యతలను మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ బంధం గట్టిగా ఉంటుందని భావించండంలో లాజిక్ లేదు.పెళ్లి తనకు తానుగా నిలబడదు. కాని మీరు నిర్లక్ష్యం చేస్తే తనకు తానుగా విఫలమవుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి. (చదవండి: ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
బీట్రూట్ని మజ్జిగతో కలిపి తీసుకోవచ్చా..?
మాములుగా బీట్రూట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. దీన్ని జ్యూస్ రూపంలో లేదా కూర రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కొన్నింటిని కొన్ని రకాల ఆహారాలతో జత చేసి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.బీట్రూట్ ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ల మూలం. దీన్ని మజ్జిగతో జత చేసి తీసుకుంటే శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ శోషణ పెరుగుతుందని చెబుతున్నారు న్యూట్రిషన్లు. ఇలా తీసుకుంటే ఐరన్ శోషణ తోపాటు, గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందట. చలవ చేయడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. బీట్రూట్లో ఉండే కొన్ని రకాల ఐరన్లను మన శరీరం గ్రహించలేదు. అదే దాన్ని మజ్జిగతో కలిపి తీసుకున్నట్లయితే.. అందులో ఉండే లాక్టిక్ ఆమ్లం మంచి ప్రోబయోటిక్లను అందిస్తుంది. మంచి గట్ ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేగాదు ఇందులోని ఆమ్లత్వం పేగులోని ఐరన్ శోషణను మరింత పెంచుతుంది. ఎర్రరక్తకణాలు ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తహీనతను కూడా నివారిస్తుంది. దీనిలో నైట్రిక్ ఆక్సైడ్లుగా మార్చే నైట్రేట్లు ఉంటాయి. రక్తనాళాల్లో బ్లాక్లు ఉండవని చెబుతున్నారు నిపుణులు. ఇది హృదయనాళ పనితీరుకి మద్దతిచ్చే బయోయాక్టివ్ పెప్టైడ్లను అందిస్తుంది. వీటన్నింటి తోపాటు కాలేయ పనితీరుకి కూడా సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. ఇలా బీట్రూట్ బట్టర్మిల్క్ మిక్సింగ్ అనేది శక్తిమంతమైన రిఫ్రెష్ టానిక్లా పనిచేస్తుంది. (చదవండి: 'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!
మాతృత్వం మధురిమ మాటలకందనిది. అందుకోసం ప్రతి అమ్మాయి తపిస్తుంటుంది. ప్రస్తుత జీవనవిధానం ,పర్యావరణ కాలుష్యం కారణంగా "అమ్మ" అనే పిలుపు దూరమవుతున్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొందరూ 'ఎగ్ ఫ్రీజింగ్' బాటపడుతున్నారు. ముఖ్యంగా ఈ మార్గాన్నే టాలీవుడ్ హీరో రామ్చరణ్ భార్య ఉపాసన, నటి మెహ్రీన్, మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా వంటి ప్రముఖులు ఎంచుకున్నారు. తాజాగా వారి సరసన చేరింది బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ. అసలు ఇంతకీ ఏంటి ఎగ్ ప్రీజింగ్..? ఈ వైద్య విధానం మంచిదేనా?.. అంటే..ప్రస్తుతం యువత కెరీర్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ క్రమంలో వయసు పెరిగిపోతుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టక చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. దీన్ని అధిగమించేందుకు నవతరం ఈ ఎగ్ ఫ్రీజింగ్ బాట పడుతోంది. చెప్పాలంటే ఇది జెన్ జెడ్ ట్రెండ్గా మారింది. అసలు ప్రముఖులే కాగా సామాన్యులు సైతం ఈ పద్ధతికే మొగ్గుచూపిస్తాన్నారు. మరీ అసలు ఈ విధానం ఎలా ఉంటుందనే దాని గురించి బాలీవుడ్ నటి తనీషా మాటల్లో చూద్దాం. ఎగ్ ఫ్రీజింగ్ అంటే..ఎగ్ ఫ్రీజింగ్ విధానాన్ని ఎంచుకున్నామంటే అంతా తప్పుగా చూస్తారు. పైగా ఇది చాలా పెయిన్తో కూడిన విధానమని భయబ్రాంతులు గురిచేశారని చెప్పుకొచ్చింది 46 ఏళ్ల తనీషా. అయితే తానువైద్యుల సాయంతో దాని గురించి వివరంగా తెలుసుకున్నాకే ధైర్యంగా ముందడుగు వేశానని చెప్పింది. వైద్య పర్యవేక్షణలో అండాలు భద్రపరుచుకునే విధానాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఈ పక్రియలో కడుపు ప్రాంతంలో ప్రొజెస్టెరాన్ని ఇంజెక్ట్ చేస్తారు. మొదట్లో తిమ్మిరితో కూడిన బాధ ఉంటుంది. ఆ తర్వాత ఐదు నుంచి ఆరో రోజులు అందుకు బాడీ ఆటోమేటిగ్గా సిద్ధమైపోతుంది. ఇదంతా అరగంట ప్రక్రియ. అయితే వాళ్లు అండాలను సేకరించిన విధానం మనకు తెలియకుండానే జరిగిపోతుందంటూ..ఆ వైద్య విధానం గురించి వివరించింది సోషల్మీడియా వేదికగా వెల్లడించింది. అయితే ఈ హర్మోన్లు ఇంజెక్ట్ చేసే ప్రక్రియలో బరువు పెరగడం జరుగుతుంది. అయితే ఇంజెక్ట్ చేసిన హార్మోన్లను తొలగించడానికి కూడా ఓ విధానం ఉంటుందని చెప్పుకొచ్చారు తనీషా. వైద్యులు ఏమంటున్నారంటే..నిజానికి ఈ ఎగ్ ప్రీజింగ్ ప్రక్రియలో సాధారణంగా హార్మోన్ల ఇంజెక్షన్ల సాయంతో అండాలను సేకరించడం జరుగుతుంది. అయితే అందుకు పేషెంట్ శారీరకంగా మాససికంగా సంసిద్ధంగా ఉండటం అనేది అత్యంత కీలకం. అయితే ఈ హార్మోన్ల ఇంజెక్షన్లలో ప్రొజెస్టెరాన్ ఉండదని ప్రసూతి వైద్యులు చెబుతున్నారు. అండాశయాలను ఉత్తేజపరిచేందుకే ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఉంటాయని అన్నారు. అయితే వీటి కారణంగా బరువు పెరగడం అనేది జరగదని చెప్పారు. అయితే ఆ తర్వాత సంభవించే ఆకలి మార్పులే లేదా శరీరంలో ద్రవాల నిలుపదల వంటి మార్పులను ఎదుర్కొంటారు. ఆ సమస్యలు ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గుముఖం పడతాయట. ఇక్కడ తగినంత నీరు తాగినట్లయితే అదనపు హార్మోన్లు బయటకు వచ్చేస్తాయని చెబుతున్నారు వైద్యులు. దీంతో ఈ హార్మోన్లు శరీరం నుంచి బయటకు వెళ్లేలా తాజాపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కాయధాన్యాలు తదితర పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఆ సమయంలో వాకింగ్, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి, బరువు పెరగకుండా రక్షిస్తాయని అన్నారు. వాటన్నింటి తోపాటు ఎనిమిది గంటల నిద్ర, యోగా, ధ్యానం వంటి వాటితో ఈ అదనపు హార్మోన్లను సమతుల్యం చేయొచ్చని చెప్పారు. జస్ట్ రెండు రుతక్రమ సైకిల్స్ కల్లా సాధారణ స్థితికి మహిళలు తిరిగి వస్తారని వెల్లడించారు వైద్యులు..ఈ విధానాన్ని ఎంచుకోవడానికి రీజన్..కెరీర్లో ముందుండాలనే క్రమంలో వయసు దాటిపోతుంది. ఆ తర్వాత పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకున్న చాలామంది జంటలు ఎంతలా అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారనేది తెలిసిందే. పోనీ ఏదోలా పిల్లలను కన్నా..వాళ్లు ఆరోగ్యంగా ఉండక ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ నానాపాట్లు పడుతున్నవాళ్లున్నారు. ఆ నేపథ్యంలోనే యువత ఇలా అండాలను భద్రపరుచకునే ఎగ్ ప్రీజింగ్ లేదా క్రయో ఫ్రిజర్వేషన్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ఇక ఆ జంటలు లేదా యువత కెరీర్లో నిలదొక్కుకున్నాక హాయిగా పిల్లల్ని కనడం గురించి ప్లాన్ చేస్తున్నారు. (చదవండి: జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!) -
నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) ఇప్పటికీ అంతే అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. శ్రియ ఇష్టం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాదు ఇప్పటికీ అంతే ఆకర్షణీయమైన లుక్తో కుర్ర హీరోయిన్లకు మించిన సౌందర్యం ఆమెది. శ్రియ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడూ ఎలా ఉందో.. అలానే గ్లామర్గా ఉంది. ఆమె అందం రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు అనేలా మాయ చేస్తుంటుంది. అంతే ఫిట్గా స్లిమ్గా ఉంటుంది. నాలుగు పదుల వయసులోనూ ఇంతలా బాడీ ఎలా మెయింటైన్ చేస్తుందా అని ఆశ్యర్యం కలగకమానదు. మరీ ఆమె హెల్త్, బ్యూటీ సీక్రెట్లేంటో చూద్దామా.. నటి శ్రియ శరణ్ ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ రహస్యాన్ని షేర్ చేసుకుంది. అదే తన తన బ్యూటీ సీక్రెట అని నవ్వుతూ చెబుతోంది. ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉన్నట్లేనని అంటోంది శ్రియ. మన ఆరోగ్యంతో మన సౌందర్యం ముడిపడి ఉంటుందంట. అందుకే తినే భోజనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటానంటోంది. వర్కౌట్ల కంటే కూడా తీసుకునే భోజనం పోషకవంతమైనదైతే ఆటోమేటిగ్గా స్లిమ్గా, అందంగా ఉంటామని నమ్మకంగా చెబుతోంది శ్రియ. ఇదేంటి ఆమె చాలా వెరైటీగా మాట్లాడుతుందనుకుంటే.. పొరబడ్డట్టే. ఎందుకంటే చాలామంది నిపుణులు కూడా చాలాసార్లు ఈ విషయాన్నే బలంగా నొక్కి చెప్పారు. డైట్ ఎలా ఉండాలంటే..సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చే మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటుందట. నిర్ణిత సమయానికే బోజనం తీసుకునేలా చూసుకుంటుందట. కడుపు నిండిన అనుభూతి కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటానని తెలిపింది. తన రోజుని నిమ్మకాయ తేనెలతో కూడిన వాటర్ తీసుకుంటుందట. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి,బాడీలో ఉండే టాక్సిన్లను బయటకు పంపేస్తుందట. హైడ్రేషన్ తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తానంటోంది. బ్రేక్ఫాస్ట్ కోసం బాదంగింజలు, ఓట్మీల్, గుడ్లులో తెల్లసొనతే వేసిన ఆమ్లేట్ లేదా బెర్రీలు, అరటి పండ్లు తింటుందట. పొద్దపొద్దునే డీప్ ఫైడ్ పదార్థాల జోలికిపోదట. ఇవి జీర్ణక్రియను నెమ్మదించి చురుకుదనం లేకుండా చేస్తాయట. ఇక భోజనంలో పప్పు, రోటీ , సబజీ, కవినోవా, ఉడికించిన కూరగాయలు, కాల్చిన చేప లేదా చికెన్ ఉంటాయట. ఇంట్లో తయారు చేసిన పెరుగుని తీసుకుంటుందట. పెరుగు ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటమే గాక జీర్ణక్రియ సమస్యలను అదుపులో ఉంచుతుందట. ఇక స్నాక్స్గా బిస్కెట్లు లేదా చిప్స్ వంటి జోలికి అస్సలు పోనంటోంది. అందుకోసం దోసకాయ, క్యారెట్ వంటివి ఆస్వాదిస్తా, ఒకవేళ కుదరకపోతే కొంచెం డార్క్ చాక్లెట్ ముక్కతో గ్రీన్ టీ తీసుకుంటానంటోంది. జీవక్రియను చురుగ్గా ఉంచే స్నాకస్ తీసుకుంటే అతిగా తినాలనే కోరిక అదుపులో ఉంటుందటోంది శ్రియ. రాత్రి భోజనం తేలికగా జీర్ణంమయ్యే వాటిని ఎంచుకుంటానంటోంది. కూరగాయలతో తయారు చేసిన సూప్, కిచ్డీ లేదా సలాడ్ తీసుకుంటానంటోంది. అయితే రాత్రి భోజనం సాధ్యమైనంతవరకు సాయంత్రం ఏడున్నరలోపే ఫినిష్ చేస్తుందట. అంతేగాదు రాత్రి సమయాల్లో ఎక్కువ ఆయిల్తో కూడిన ఆహారాలను తీసుకోకపోవడమే మేలంటోంది. ఎందుకంటే ఇది జీరణక్రియను మందగింపచేసి, మరసటి రోజు బాడీలోని శక్తిస్థాయిలను ప్రభావితం చేస్తుందట. ఎలాంటి వర్కౌట్లంటే.. చర్మం ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఉపకరించేలా నీళ్లను ఎక్కువగా తీసుకుంటుందట. అలాగే యోగా, పైలేట్స్, డ్యాన్స్ వంటివి తన దినచర్యలో భాగమని అంటోంది. హెల్తీగా ఉండటం అంటే..ఫిట్గా ఉండటం అంటే ఆహారాలను దూరం చేసుకోవడం అని కాదు. ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోవడం అని భావిస్తే..బరువు నిర్వహించడం తేలిక అవుతుంది. అలాగే కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటే నోరు కట్టేసుకున్నామనే ఫీల్ కలగదు. పైగా శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. శ్రమ లేకుండానే మంచి పోషకాహారాలతో హెల్తీగా, నాజుగ్గా ఉండొచ్చని చెబుతోంది అందాల శ్రియ. (చదవండి: మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!) -
అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నటుడు నాగచైతన్యతో వివాహం, విడాకులు తరువాత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. సినీ పరిశ్రమలో అందం, ప్రతిభతో తానేంటో నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్గా అభిమానుల మనసుల్లో తన చోటును సుస్థిరం చేసుకుంది. తాజాగా సమంతాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.సమంత నిశ్చితార్థ ఉంగరాన్ని సరికొత్తగా మార్చేసినట్టు తెలుస్తోంది. తన ఎంగేజ్మెంట్ రింగ్ను లాకెట్టుగా మార్చేసిందని తాజా నివేదికల సమాచారం. ఈ మేరకు సూరత్కు చెందిన ఆభరణాల డిజైనర్ ధ్రుమిత్ మెరులియా అంచనాలు వైరల్గా మారాయి. నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత, ఈ జంట 2021 లో విడాకులు తీసుకుంది. విడాకుల తీసుకున్న ఇన్నేళ్లకు ఇపుడు సమంత తన డైమండ్ రింగ్ను లాకెట్టుగా మార్చుకుంది. 3 క్యారెట్ల ప్రిన్సెస్-కట్ డైమండ్ రింగ్ను లాకెట్గా ఎలా మార్చుకుందో వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేశాడు. దీన్ని క్రమం తప్పకుండా ధరిస్తోందని, ఇది ప్రస్తుత ట్రెండ్ అంటూ పేర్కొన్నాడు. అయితే దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ ధ్రుమిత్ మెరులియా ఊహ మాత్రమే అయినప్పటికీ, ఇది ఫ్యాన్స్ మరియు, నెటిజనులను మనసులను కదిలించింది. View this post on Instagram A post shared by Dhrumit Merulia (@dhrumitmerulia) కాగా 2024లో, సమంత తన వెడ్డింగ్ గౌను అవార్డుల వేడుక కోసం కొత్తగా డిజైన్ చేయించుకుంది. వైట్ వెడ్డింగ్ గౌనును నల్లటి సాసీ గౌనుగా మార్చి ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ దీనికి న్యూలుక్ను తీసుకురావడం విశేషం. దీంతో అభిమానులు దీనిని 'రివెంజ్ డ్రెస్' అని కూడా ట్యాగ్ చేశారు. ఈ డ్రెస్ ఫోటోలను కూడా సమంత ఇన్స్టాలో పంచుకుంది. గౌను ధరించిన చిత్రాలను పంచుకుంది. మన భూమాత రక్షణ కోసం, తన జీవన శైలిని సస్టైనబుల్గా మార్చుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో మనం తీసుకునే ప్రతీ చిన్న నిర్ణయాత్మక చర్య చాలా ముఖ్యం.అందరూ దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొంది. అంతేకాదు విడాకుల తర్వాత, సాధారణంగా ఒక అమ్మాయి 'సెకండ్ హ్యాండ్', 'ఆమె జీవితం వృధా అయింది' లాంటి ముద్రలు వేస్తారు. ఇది ఆమెకు, ఆమె కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది. ఇక అంతా అయిపోయినట్టు, విఫలమై నట్లు భావిస్తారు. ఇది తనకు చాలా బాధపెట్టిందని, కానీ తాను విడాకులు తీసుకున్నాననే వాస్తవాన్ని జీర్ణించుకుంటున్నట్టు చెప్పింది. అలాగే తన పెళ్లి గౌనును మార్చుకోవడం అనేది ప్రతీకారం కోసం ఎంతమంత్రం కాదని, తన బలానికి అదొక చిహ్నమని సమంతా స్పష్టం చేసింది. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!…సమంతతో విడాకుల తరువాత నాగ చైతన్య డిసెంబర్ 2024లో నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. అలాగే సమత ది ఫ్యామిలీ మ్యాన్ 2 , సిటాడెల్: హనీ బన్నీ లాంటి సిరీస్లతో కలిసి పనిచేసిన రాజ్ & డీకే ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందన్న పుకార్లు బాగా వినిపిస్తున్నాయి. -
మహిళలు.. మహారాణులు..!
మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాత సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందాయి. ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు..వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలవరకు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది.సోలార్ప్లాంట్ ఆలోచనలో ఉన్నాంప్రభుత్వం బస్సులివ్వడం ఊహించలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, చెల్లించడమే తెలిసిన మాకు ఇది మంచి అవకాశం. నెలనెలా ఆర్టీసీ చెల్లించే డబ్బులతో సొలార్ ప్లాంట్లు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే స్థలాలు పరిశీలిస్తున్నాం. సమాఖ్యను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్, సెర్ఫ్ సీఈవో దివ్యదేవరాజన్లకు ధన్యవాదాలు.– హరిణి, ఉదయలక్ష్మి సమాఖ్య, చిగురుమామిడిప్రభుత్వానికి రుణపడి ఉంటాం మా సమాఖ్యకు బస్సు రావడం సంతోషకరం. మా మీద నమ్మకంతో బస్సు కేటాయించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. నెలానెలా బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతో కొత్త వ్యాపారాలు మొదలు పెడుతాం. మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళతాం.సరిత, శ్రీచైతన్య మండల సమాఖ్య, ధర్మపురిఆర్థికాభివృద్ధికి వినియోగిస్తాం ప్రభుత్వం మా సంఘానికి కేటాయించిన ఆర్టీసీ బస్సు ద్వారా వచ్చే రూ.77 వేల ఆదాయాన్ని సంఘ సభ్యుల ఆరి్థకాభివృద్ధికి ఉపయోగిస్తాం. ఆదాయ మార్గాలను అన్వేíÙంచి, కొత్త వ్యాపారం కోసం త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సంఘ సభ్యులంతా సమావేశమై సమష్టిగా చర్చిస్తాం. – గుర్రాల మహేశ్వరి, అధ్యక్షురాలు, రుద్రమ మండల సమాఖ్య, ముత్తారంబస్సు రావడం సంతోషంగా ఉందిమా మండల సమాఖ్యకు బస్సు రావడం సంతోషంగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొదటి బస్సు మాకే ఇచ్చారు. మండల సమాఖ్య సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్లో బస్సు నిర్వహణ ఖర్చుల విషయం, మాకు వచ్చే ఆదాయం చర్చించి ఏం చేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకుంటాం. మా సంఘంపై నమ్మకంతో బస్సును అందించినందుకు ధన్యవాదాలు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బస్సును అందించి బాసటగా నిలిచారు.– పంచెరుపుల విజయ, అభ్యుదయ మహిళా సంఘం అధ్యక్షురాలు, జయవరం -
మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!
ఒత్తిడి ఉంటేనే కొన్ని పనులు పూర్తవుతాయని కొందరి అభిప్రాయం. కానీ అది మితిమీరితే వచ్చే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ఆ కాసేపు ఒత్తిడిని భరిస్తే సరిపోతుంది కదా అని సరిపెట్టుకోవాలనుకునేవారు మరికొందరు. కానీ అప్పటి ఒత్తిడి... ఆ అనంతరం కాలంలోనూ తన దుష్ప్రభావాలను చూపుతుంది. అంతేకాదు... మానసిక ఒత్తిడి అన్నది అలా చాలాకాలం పాటు అలా కొనసాగుతుంటే అది శారీరకంగా కూడా అనేక సమస్యలను... ముఖ్యంగా అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. మానసిక ఒత్తిడి తెచ్చిపెట్టే అనేక శారీరక సమస్యలూ, వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఒత్తిడి ఎప్పుడూ తాత్కాలికం కాదు. దాని వల్ల శరీరంలో అనేక ప్రతికూలమైన మార్పులు వస్తాయి. అన్నిటికంటే ముందు ప్రభావితమయ్యేది మన వ్యాధి నిరోధక వ్యవస్థ. దాంతో అది అనేక జబ్బులకూ, శారీరక సమస్యలకు తావిస్తుంది. ఫలితంగా ఎన్నిరకాల వ్యాధులు వస్తాయో చూద్దాం. ప్రధాన ప్రభావం...వ్యాధి నిరోధక వ్యవస్థపైనే! మామూలుగా ఎవరికైనా ఎక్కడైనా గాయమైనప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం (వాపు వచ్చి ఎర్రబారి మంటగా అనిపించడం) మామూలే. సాధారణంగా దేహంలో ఎక్కడ గాయమైనప్పటికీ ఇలా జరుగుతుంది. గాయాన్ని మానేలా చేయడమనే ప్రక్రియలో వ్యాధి నిరోధక వ్యవస్థ ద్వారా కార్యకలాపాలు వల్ల ఇలా వాపు, మంట రావడమనేవి సహజంగా జరుగుతాయి. ఆ తర్వాత అవి మెల్లగా తగ్గిపోతాయి. అయితే ఎవరిలోనైనా అపరిమితమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ మానడం అనేది బాగా ఆలస్యమవుతుంది. ఈ విషయం కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాల ద్వారా స్పష్టంగా వెల్లడయ్యింది. ఈ అధ్యయన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాలూకు మార్గదర్శకాల్లో చోటుచేసుకున్నాయి కూడా. ఒత్తిడి అన్నది శరీరంపై ఎలా దుష్ప్రభావం చూపుతుందన్న విషయం మొదటిసారిగా స్పష్టమైన తార్కాణాలతో వెలుగుచూసింది. నిజానికి ఎవరిలోనైనా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ నిరోధక అంశాలు మెల్లగా ఇన్ఫ్లమేషన్ను నియంత్రిస్తాయి. దాంతో ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గిపోవాలి. కానీ అదేపనిగా చాలాకాలం పాటు ఒత్తిడి కొనసాగుతూపోతూ ఉంటే ఆ కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గదు. ఇది మాత్రమే కాకుండా... ఇంకొన్ని ఉదాహరణల ద్వారా కూడా ఈ థియరీ వాస్తవమని తేలింది. సాధారణంగా ఎవరికైనా జలుబు వస్తే, ఒకటి రెండు రోజుల్లో అది దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం ΄ాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం పడుతుంది. ఒత్తిడి ప్రభావం కారణంగా వ్యాధినిరోధక అంశాలపై ప్రతికూల ప్రభావాలు పడటమే ఇందుకు కారణం. ఇలా చూసినప్పుడు మానసికమైన ఒత్తిడి కేవలం మానసికంగానే కాకుండా అది శారీరక సమస్యలైన స్థూలకాయం వంటి వాటిని తెచ్చిపెడుతుంది. ఇలా ఒక్క బరువు పెరగడమనే కారణమే కీళ్లనొప్పులూ వంటి ఇంకా ఎన్నో సమస్యలకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు... గుండెజబ్బులు, డయాబెటిస్, జీర్ణకోశ సమస్యలు, డిప్రెషన్, ఆస్తమా, అలై్జమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తుందని పరిశోధకులు స్పష్టంగా తెలుసుకున్నారు.ఒత్తిడి ఉన్నట్లు గుర్తించడమిలా...కొందరు వ్యక్తులు నిత్యం ఒత్తిడికి గురవుతున్నప్పుడు వాళ్లలో తీవ్రమైన ఒత్తిడి ఉన్న విషయమే వారికి తెలియక΄ోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలతో వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయం తెలుస్తుంది. ఆ లక్షణాలివి.. ఆకలి లేకపోవడం బాగా ఆలస్యంగా నిద్రపట్టడం లేదా అస్సలు నిద్రపట్టకపోవడం (నిద్రలేమి) మాటిమాటికీ తలనొప్పి వస్తుండటం తరచూ కండరాలు పట్టేస్తుండటం (మజిల్ క్రాంప్స్) తరచూ గ్యాస్, కడుపులో మంట వంటి జీర్ణకోశ సమస్యలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఇవి చాలా సాధారణంగా కనిపించేవే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు.ఆస్తమా : తీవ్రమైన ఒత్తిడి ఊపిరి అందకుండా చేసే ఆస్తమాను ప్రేరేపిస్తుందని వైద్య పరిశోధనల్లో అనేక సార్లు వెల్లడైంది. ఇలా జరగడాన్ని సైకలాజికల్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. నిజానికి పెద్దల్లో ఒత్తిడి కలగడం వల్ల అది వాళ్లకు మాత్రమే పరిమితం కాదు... తల్లిదండ్రుల ఒత్తిడి చూసి, పిల్లలూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. దాంతో అది వారి చిన్నపిల్లల్లోనూ ప్రతికూల ప్రభావం చూపి, ఆ చిన్నారుల్లోనూ ఆస్తమా రూపంలో వ్యక్తమయ్యే అవకాశమున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్న గర్భవతులనూ, అలాగే తీవ్రమైన కాలుష్యం నెలకొని ఉన్న పరిసరాల్లో నివసిస్తున్న ఇంకొందరిని ఒక అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ఈ అధ్యయన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. నిజానికి కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన సంతానం కంటే... తీవ్రమైన ఒత్తిడికి లోనైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో చాలా మందికి ఆ తర్వాతికాలంలో ఆస్తమా వస్తుండటం పరిశోధకలను అబ్బుర పరిచింది. అంటే కాలుష్య ప్రభావం కంటే తీవ్రమైన ఒత్తిడి తాలూకు ప్రతికూల ప్రభావాలే ఎక్కువనేది గత కొంతకాలం కిందట తెలిసి వచ్చిన వాస్తవం.గుండెజబ్బులు : తీవ్రమైన ఆవేశానికి లోనైనవాళ్లు గుండెపట్టుకుని కుప్పకూలిపోతుండటం సినిమాల్లో చాలా తరచుగా చూసే దృశ్యం. అయితే అది పూర్తిగా సత్యదూరం కాదంటున్నారు పరిశోధకులు. ఏవైనా సమస్యల ఒత్తిడి కారణంగా గట్టిగా అరుస్తుండేవాళ్లు, త్వరగా వాదనల్లోకి దిగేవాళ్లు, త్వరగా కోపగించుకునేవాళ్లలో అనేక మంది ఆ ఒత్తిడి తాలుకు దుష్ప్రభావానికి లోనై గుండె జబ్బులు తెచ్చుకుంటారనేది నిపుణుల మాట. ఒత్తిడి తాలూకు ప్రతికూల ఫలితాలు గుండెజబ్బుల రూపంలో వ్యక్తమవుతుంటాయంటున్నారు కొందరు పరిశోధకులు. గుండెజబ్బులు ఉన్నవారిలో చాలామందిని పరిశీలించి, వారిపై అధ్యయనాలు నిర్వహించినప్పుడు వాళ్లలో నిత్యం భావోద్వేగాలకు లోనయ్యేవాళ్లూ, త్వరగా కోపం వచ్చేవారే ఎక్కువగా ఉంటారని ఆ అధ్యయన ఫలితాల్లో తేలింది. అలా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘకాలిక గుండెజబ్బులు వస్తుండటంతోపాటు అవే ఒక్కోసారి గుండెపోటుకు దారితీస్తాయంటున్నారు అధ్యయనవేత్తలు, గుండెజబ్బుల నిపుణులు. స్థూలకాయం: శరీరంలోని మిగతా భాగాలతో పోలిస్తే... సాధారణంగా పోట్ట, తొడలు, పృష్టభాగం(హిప్స్) వంటి భాగాల్లోనే కొవ్వు ఎక్కువగా పేరుకుంటుంది. వీటన్నింటిలో తొడలు, పృష్టభాగంలో పేరుకునే కొవ్వు కంటే... పోట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇలా పొట్టభాగంలో కొవ్వు పేరుకోవడమన్నది... ఒత్తిడి అనుభవించే వారిలోనే ఎక్కువగా జరుగుతుందని స్పష్టమైందని అధ్యయనవేత్తలు వెల్లడిస్తున్నారు. మామూలుగా ఇతర చోట్లలో కొవ్వు పేరుకునేవారికంటే పొట్టలో కొవ్వు పేరుకోవడం వల్ల (ఆబ్డామినల్ ఒబేసిటీ) వల్ల ఎక్కువగా హాని జరుగుతుందని తేలడం వల్ల... ఒత్తిడి అనేది మొదట పోట్టభాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకునేందుకు దారితీయడంతోపాటు ఆ తర్వాత అది గుండెజబ్బుల వంటి వాటి ద్వారా తీవ్రమైన హానిచేస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. అధిగమించడం మేలు...అది చేయాల్సిందిలా...మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా ఆ సమస్యను అధిగమించడానికీ లేదా నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయని తేలింది.ఉదాహరణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని బాగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారించుకోగలగడం సాధ్యమేనని కొన్ని అధ్యయనాల్లో తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి అనుసరించాల్సిన మార్గాలివి... ఏ కారణంగా ఒత్తిడి కలుగుతుందో గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండటం. ఉదాహరణకు ఒక వృత్తి వల్ల ఒత్తిడి పెరుగుతుందని గుర్తిస్తే, ఒకవేళ ప్రొఫెషన్ను పూర్తిగా మార్చుకునే అవకాశం ఉంటే దాన్ని మార్చుకోవడమే మేలు. అలా మార్చుకునే అవకాశం లేక΄ోతే ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడం అవసరం. అవి... బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. దాంతోపాటు యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి ∙ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరో వ్యాపకంలో పడిపోయి దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడానికి ప్రయత్నించడం పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడాలి. సమస్యలను అధిగమించాల్సిన పరిస్థితుల్లో ఏ మార్గం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి. లేదంటే ఆ పరిస్థితిని అధిగమించడానికి తోడ్పడే నిపుణులను సంప్రదించాలి దేహానికి అవసరమైన వ్యాయామాలు చేయాలి. దీని వల్ల మెదడులో దేహాన్ని రిలాక్స్ చేసే, ఆహ్లాదంగా ఉంచే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవేవీ పనిచేయనప్పుడు అవసరమైతే వృత్తినిపుణులైన సైకాలజిస్టులు, కౌన్సెలర్స్ను సంప్రదించాలి.డయాబెటిస్ : తీవ్రమైన మానసిక ఒత్తిడి డయాబెటిస్కు దారితీయవచ్చన్న విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ ఇది రెండు రకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా పెరిగే ఆకలి వల్ల అప్పటికప్పుడు దొరికే... తినడానికి ఆరోగ్యకరం కాని ఆహార పదార్థాలైన వేపుళ్లు, నిల్వ పదార్థాలూ, బేకరీ ఐటమ్స్ తినేలా చేస్తుంది. ఇవి తిన్న తర్వాత మళ్లీ రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరగడంతో బాధితులు అనారోగ్యానికి గురవుతారు. డయాబెటిస్ కారణంగా ఇదొక సైకిల్లా సాగుతూ అనారోగ్యానికీ, చక్కెర పెరుగుదలకూ దారితీస్తుంది.వయసు త్వరగా పైబడటం : ఒత్తిడి వల్ల వయసు పైడాల్సిన సమయం కంటే ముందే వృద్ధులై΄ోయే మరో దుష్పరిణామానికి అవకాశముంది. తల్లుల, పిల్లల డీఎన్ఏలను పరిశీలిస్తూ జరిగిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైన వారు, వారి తల్లిదండ్రులతో పోలిస్తే మీరే త్వరగా వృద్ధాప్య దశకు చేరుకున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి. నిర్దిష్టంగా చె΄్పాలంటే తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న కొందరు ఆ వయసుకు కనపడాల్సిన లక్షణాలను చాలా త్వరగా అంటే... 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.అల్జిమర్స్ డిసీజ్ : ఒత్తిడి వల్ల మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అలై్జమర్స్ డిసీజ్కు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒత్తిడి వల్ల అలై్జమర్స్ డిసీజ్ తీవ్రం కావడంతో ΄ాటు దానివల్ల వచ్చే మరుపు మరింత వేగవంతం కావడం చాలా త్వరత్వరగా జరుగుతుంది. అంటే ఒత్తిడి లేనివారిలో అలై్జమర్స్ డిసీజ్ కాస్త ఆలస్యమైతే... ఒత్తిడి వల్ల అది రావాల్సిన సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలూ ఉన్నాయని స్పష్టమవుతోంది.చాలా ముందుగా మరణించడం (ప్రీ–మెచ్యుర్ డెత్) : ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం చాలా సాధారణ ప్రజలు కూడా చేస్తుంటారు. ఉదాహరణకు ‘ఆయన ఇప్పుడే చనిపోవాల్సిన వ్యక్తి కాదు. ఇంకా చిన్నవయసు’ లాంటి వ్యాఖ్యానాలు చేస్తుండటం కొందరి విషయంలో వింటుండటం పరిపాటే. తీవ్రమైన దీర్ఘకాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగానే వస్తుందని అధ్యయనవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..) -
ప్రధాని మోదీ స్ఫూర్తితో ‘భారత్ డిష్'..! ఎలాంటి వంటకాలు ఉంటాయంటే..
ఇంటిగ్రేటివ్ లైఫ్స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో ‘భారత్ డిష్'ని ఆవిష్కరించారు. దీన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ప్రతిష్టాత్మక NXT కాన్క్లేవ్ 2025లో ప్రారంభించారు. ఇది స్వదేశీ ఆహార పదార్థాల ఆరోగ్య ప్రయోజనాలను హైలెట్ చేసేలా లైఫ్స్టైల్ నిపుణుడు రూపొందించారు. ఇది భారతదేశ గొప్ప పాకకళ వారసత్వానికి నివాళి. భారతదేశ ఆహార సంస్కృతిలో పాతుకుపోయిన పోషకాహారాలు, వాటి రుచి సమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఈ ‘భారత్ డిష్'. అంతేగాదు రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహారాన్ని భాగం చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తుందని చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో . దీన్ని అగ్రశ్రేణి చెఫ్లచే రూపొందించినట్లు తెలిపారు. మరి ఇంతకీ అందులో ఎలాంటి ఆహార పదార్థాలు, వంటకాలు ఉంటాయంటే..ప్రధాని మోదీ క్రమశిక్షణా జీవనశైలిని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించానని అన్నారు ల్యూక్ కౌటిన్హో. ఇందులో ముఖ్యంగా పోషకాలు అధికంగా ఉండే చిరుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే సత్తు, సాంప్రదాయ మఖానా, రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, తాజా శీతాకాలపు ఆకుకూరలు, స్థానికంగా లభించే, కాలానుగుణ పదార్థాలు తదితరాలు ఉంటాయి. అంతేగాదు భారతీయ వంటకాలు సమతుల్యతకు పెద్దపీట వేసేలా కాలనుగుణంగా ఉంటాయని చెబుతున్నారు జీవనశైలి నిపుణుడు. కలిగే లాభాలు..పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తయారు చేస్తారు. ఇవి దీర్ఘాయువుని, ఆరోగ్య ప్రయోజనాలని అందించే పదార్థాలు. ఆరోగ్యకరమైన భోజనాన్ని హైలెట్ చేయడమే గాక, అతిగా తినడం, బరువు సమస్యలకు చెక్పెట్టేలా ఉంటుందట. భారతీయ ఆహారం శరీరానికి మాత్రమే కాకుండా మనసులో భావోద్వేగాలకు కూడా ఔషధమేనట. దీన్ని ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ప్రజలు అనారోగ్య సమస్యలతో పోరాటాన్ని నివారించడమేనట. ఇక ఈ భారత్డిష్ అనేది పూర్వీకులు చేసినట్లు కాలనుగుణంగా ఉండటమేగాక, ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునేలా ప్రోత్సహిస్తుందట.ప్రధాని మోదీ చెప్పినట్లుగా వంట నూనెల వాడకం తగ్గించి, ఏ2 నెయ్యి, కోల్డ్-ప్రెస్డ్ నూనెలు, నట్స్ వంటివి మాత్రమే ఉంటాయట.చివరిగా ఇది శాకాహారులైన, మాంసాహారులైన బరువుని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన వంటకాలే ఉంటాయట ఇందులో.At the NXT Conclave 2025, I had the honor of unveiling The Bharat Dish & Lifestyle Tips, inspired by Hon. Prime Minister Narendra Modi Ji’s disciplined lifestyle and health practices.This is more than just a dish—it’s a celebration of India’s rich culinary wisdom and the power… pic.twitter.com/OR8PzeGV8b— Luke Coutinho (@LukeCoutinho17) March 1, 2025 ఈ మేరకు జీవనశైలి నిపుణుడు ల్యూక్ కౌటిన్హో మాట్లాడుతూ..ప్రపంచ నాయకులు భాగస్వామ్యం అయ్యే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత్ డిష్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. భారతీయ వెల్నెస్ జ్ఞానాన్ని ప్రపంచవేదికపై తీసుకువెళ్లేందుకు ఉపకరించిన అద్భుత అవకాశం అని అన్నారు. ఈ 'భారత్ డిష్' అనేది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా ప్రోత్సహించే ఒక ఉద్యమం, ప్రభావంతమైన మార్పుకి నాంది. ఇది ఇక్కడితో ఆగదు. ప్రతి కుటుంబం, పాఠశాలు, ఇతర సంఘాలకు చేరకునేలా చేసే ఒక గొప్ప చొరవ. అంతేగాదు ఆరోగ్య స్ప్రుహతో కూడిన సాధికారతకు మార్గం వేస్తుందని కూడా చెబుతున్నారు ల్యూక్ కౌటిన్హో.#StopObesity | Today, Mr. @LukeCoutinho17, Co-Founder, Luke Coutinho Holistic Healing Systems while visiting an Anganwadi Centre in New Delhi stressed on the importance of tackling obesity to build a healthier India. Highlighting Prime Minister Shri @narendramodi’s vision for a… pic.twitter.com/WgNqoM1pzk— Ministry of Health (@MoHFW_INDIA) February 28, 2025(చదవండి: కశ్మీర్ వివాదాస్పద ఫ్యాషన్ షో: నిర్వహించింది ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్..ఆ డిజైనర్లు ఎవరంటే..?) -
కశ్మీర్ వివాదాస్పద ఫ్యాషన్ షో: ఆ డిజైనర్లు ఎవరంటే..?
పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్లో జరిగిన ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపింది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఈవెంట్పై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు ఫ్యాషన్ షో దూమారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీని కూడా అట్టుడికించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నెల మార్చి 7న గుల్మార్గ్లో జరిగిన ఈ ఫ్యాషన్ షోపై తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పదంగా మారిన ఈ షో వెనుకున్న డిజైనర్లు ఎవరంటే..?ఎవరా డిజైనర్ ద్వయం..?ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిజైనర్లు శివన్ భాటియా, నరేష్ కుక్రేజా. ఈ ఇద్దరు స్థానిక సున్నితత్వాన్ని విస్మరించి పవిత్ర రంజాన్ మాసంలో అశ్లీల దుస్తులతో ప్రదర్శన ఇవ్వడంతోనే ఈ షో వివాదాస్పదమైంది. అయితే డిజైనర్ల ద్వయం ఫ్యాషన్ పరిశ్రమలో తమ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుల్మార్గ్లోని ప్రఖ్యాత స్కీ రిసార్ట్లో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించారు. వాళ్ల బ్రాండ్కి సంబంధించిన శిల్పకళా స్కీ సూట్లు, అప్రెస్-స్కీ దుస్తులు, ఆర్ట్ ప్రింట్లు ఉన్న ట్రాన్స్పరేంట్ దుస్తులు ధరించారు ఇందులో పాల్గొన్న పురుషులు, మహిళలు. అయితే వాళ్లు సరిగ్గా రంజాన్ పర్వదినం సమయంలో దీన్ని నిర్వహించడతో ఇంతలా స్థానిక ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను దారితీసింది. పైగా ఈ ఈవెంట్ సాంస్కృతిక విలువలకు తిలోదాకలిచ్చే రీతిలో దారుణంగా ఉందంటూ మత పెద్దలు, ప్రజలు, రాజకీయనాయకులు మండిపడ్డారు. అయితే ఈ షోని నిర్వహించింది ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ హాలిడే. ఇది కేన్స్లోని 'మారే డి మోడా'లో భారతదేశపు తొలి లగ్జరీ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది. అధునాతన సౌందర్యానికి చెందిన ఈ బ్రాండ్ హాలిడే రిసార్ట్, స్విమ్ దుస్తుల పరంగా ఫ్యాషన్లో సంచలనాలు సృష్టించింది. వారి కలెక్షన్లు డీఎల్ఎఫ్ ఎంపోరియో (ఢిల్లీ), కలఘోడా (ముంబై), బంజారా హిల్స్ (హైదరాబాద్), ఎంబసీ చాంబర్ (బెంగళూరు) లలో అందుబాటులో ఉన్నాయి.ఇద్దరు డిజైనర్లు ఫ్యాషన్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థానాన్ని దక్కించుకున్నారు. వారిలో శివన్ NIFT ఢిల్లీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇస్టిట్యూట్ యూరోపియో డి డిజైన్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. కాగా నరేష్ అదే సంస్థ నుంచి లగ్జరీ అండ్ మార్కెటింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఈ బ్రాండ్ని ఎక్కువగా బాలీవుడ్ నటులు కిమ్ కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు నిర్వహించారు. ఈ బ్రాండ్కి వరించిన అవార్డులు..స్వరోవీస్కీ మోస్ట్ క్రియేటివ్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ (2007)ఉత్తమ ఎమర్జింగ్ డిజైనర్లు (మేరీ క్లైర్ ఫ్యాషన్ అవార్డ్స్, 2010)ఉత్తమ రిసార్ట్ వేర్ (ఎల్లే స్టైల్ అవార్డ్స్, 2010)ఉత్తమ క్రూయిజ్ వేర్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2011)‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్ టు ది వరల్డ్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2012)యంగ్ అచీవర్స్ అవార్డు (ఎంబసీ ఆఫ్ ఇండియా, ఖాట్మండు అండ్ టుడేస్ యూత్ ఆసియా)ఇంత మంచి పేరు, కీర్తీ దక్కించుకున్న ఈ ఫ్యాషన్ డిజైనర్లు గుల్మార్గ్ ఫ్యాషన్ షోతో ఒక్కసారిగా వివాదాస్పద వ్యక్తులుగా అపకీర్తిని మూటగట్టుకున్నారు, విమర్శలపాలయ్యారు. View this post on Instagram A post shared by SHIVAN & NARRESH (@shivanandnarresh) (చదవండి: వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..) -
చికాగో టూ కశ్మీర్..యువరాణిలా డ్రీమీ వెడ్డింగ్: వావ్ అంటున్న నెటిజన్లు
భారతీయ పెళ్లిళ్లలో తమదైన బ్యూటీతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు పెళ్లి కూతుళ్లు. అత్యంత సుందరంగా ముస్తాబవుతో యువరాణులను మరపిస్తున్నారు. మేకప్ నుంచి డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, మెహిందీ, ఇలా ప్రతీదాంట్లోనూ రాయల్ లుక్స్తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. కోరుకున్న కలల రాకుమారుడిని పెళ్లి చేసుకునే క్షణాలను అపురూపంగా దాచు కునేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్ను ఎంచుకుంటున్నారు. ఈ డ్రీమీ వెడ్డింగ్ స్టైల్ చికాగోకు చెందిన ఒక వైద్యురాల్ని విపరీతంగా ఆకర్షించింది. అందాల కశ్మీరంలో.. తన వివాహ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించి ఒక వీడియో నెట్టింట సందడి చేస్తోంది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా!చికాగోకు చెందిన డాక్టర్ పైజ్ రిలే(Paige Riley) తన వివాహ వేడకలతో అందర్నీ అబ్బురవపర్చింది. కాశ్మీరీ వధువుగా మారి తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్ చేసుకుంది. మేకప్ దుస్తులు, అలంకరణ, మెహిందీ ఇలా ప్రతీదీ స్పెషల్గా ఉండేలా జాగ్రత్తపడి కశ్మీరీ పెళ్లి కూతురిలా మెరిసి పోయింది. రాహుల్ మిశ్రా రూపొందించిన పీకాక్, పూల డిజైన్లో ఐవరీ కలర్ లెహెంగా, షీన్ దుపట్టాతో అందర్మీ మెస్మరైజ్ చేసింది. తన జుట్టును కర్ల్స్తో అలంకరించుకుంది. పచ్చల హారం, ఝుంకాలు, గాజులు, ఉంగరంతో చోకర్ ఇలా భారతీయ ఆభరణాల్లో అమె అందం మరింత ఎలివేట్ అయింది. దీనికి తోడుగా సింపుల్గా ఐషాడో, బ్లష్, మస్కారా, బిందీతో మేకప్ చేసుకుంది. View this post on Instagram A post shared by JAMMU MAKEUP ARTIST (@sabihabeig) ఇక మెహెందీ వేడుక కోసం హౌస్ ఆఫ్ మసాబా నుండి అందమైన పసుపు-టోన్డ్ లెహంగాను లెహెంగాను ఎంచుకుంది. నక్సీ డిజైన్లో వెండి జరీ వర్క్తో పాటు గులాబీ రంగుల్లో టెంపుల్ వర్క్తో తయారు చేయబడింది. స్లీవ్లపై పూల ప్రింట్లు ఉన్నాయి. అలాగే ఈ లెహెంగాతో డ్యూయల్ దుపట్టాలను ధరించింది. View this post on Instagram A post shared by JAMMU MAKEUP ARTIST (@sabihabeig) దీనికి సంబంధించిన వీడియో చూసినెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. ‘‘భలే అందంగా ఉన్నారు’’ ‘ప్రిన్సెస్లా ఉన్నారు. డ్రెస్ అద్భుతంగా ఉంది’, "మీరు డ్రెస్ చేసుకున్న విధానం నాకు చాలా నచ్చింది, వావ్ అచ్చం కాశ్మీరీ పండిట్లా ఉన్నారు.. లాంటి కామెంట్స్ వెల్లువెత్తాయి. -
వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..
మగవాళ్లకు కుదిరినట్లుగా మహిళలకు తమ ఫిట్నెస్పై దృష్టి సారించడం సాధ్యం కాదనేది చాలామంది వర్కింగ్ మహిళల వాదన. ఎందుకంటే, పొద్దున లేచినప్పటి నుంచి పిల్లలు, కుటుంబ బాధ్యతలే సరిపోతాయి. ఇంకెక్కడ టైం ఉంటుంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి..?. అలాంటి బిజీ వర్కింగ్ విమెన్స్ ఫిట్నెస్ కోచ్ అకన్నీ సలాకో సింపుల్ టిప్స్ ఫాలోఅయ్యి, ఈజీగా బరువు తగ్గండి. మరి ఇంకెందుకు ఆలస్యం హెల్ప్ అయ్యే ఆ చిట్కాలేంటో చూసేద్దామా..!.అత్యంత బిజీగా ఉండే మహిళలు తమ ఫిట్నెస్పై దృష్టి సారించేలా ప్లాన్ చేసుకోవాలో వెయిట్ లాస్ కోచ్ డాక్టర్ అకన్నీ సలాకో ఇన్స్టా వేదికగా వీడియోలో వెల్లడించారు. పనులు వేగవంతంగా చేయాలన్న ధ్యాసలో ఆకలి ఆటోమేటిగ్గా ఎక్కువ అవుతుంది. దాంతో తెలియకుండానే స్వీట్స్, జంక్ఫుడ్స్ స్పీడ్గా లాగించేస్తుంటారని చెబుతున్నాడు అకన్నీ. అందుకే వ్యాయమాలు చేయడం కష్టం అనుకున్న మహిళలు వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ దరిచేరనీయకూడదు. సౌకర్యమంతమైన ఆరోగ్యదాయకమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు. పోనీ ఇది కష్టం అనుకుంటే ఓ రెండు రోజులు స్వీట్లు ముట్టనని స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండిచాలు అంటున్నారు అకన్నీ. దీంతోపాటు ఏదోలా చిన్నపాటి వ్యాయామాలు చేసుకునేలా ప్లాన్ చేయాలి. ఇక్కడ ఉద్యోగం, పిల్లలు కుటుంబం తోపాటు ఆరోగ్యం కూడా ప్రధానమే అన్న విషయం గుర్తించండి. ముందు మీరు బాగుంటేనే కదా ఈ పనులన్నీ సవ్యంగా పూర్తి చేయగలరు. కాబట్టి ఎలాగైన చిన్న చిన్న వ్యాయామాలు చేద్దాం. పోనీ అలా కాదు నో ఛాన్స్ అంటే.. వారంలో రెండు లేదా మూడు రోజులు కనీసం 30 నిమిషాలు వ్యాయామాలకి కేటాయించండి చాలు. అప్పుడు ఆటోమేటిగ్గా నెమ్మదిగా మనంతట మనమే రోజులు పెంచుకునే ఛాన్స్ ఉంటుందని అన్నారు. భోజనం విషయంలో సమయాపాలన పాటించండి. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్. అలాగే సాయంత్రం 6 గంటకి, మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్లతో పూర్తి చేయండి. స్నాక్స్ జోలికిపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రోటీన్, కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్ వంటి సమతుల్య భోజనానికి ప్రాధాన్యత ఇస్తే ఆకలి నియంత్రణలో ఉంటుంది, అలాగే బరువు పెరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ అకన్నీ. అలాగే ఇది పోషకాహారం, ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చే సమసర్థవంతమైన డైట్ప్లాన్ అని అన్నారు ఫిట్నెస్ నిపుడు అకన్నీ.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr. Akanni Salako | Women’s Weight Loss Coach (@dr.salako) (చదవండి: పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..? అధ్యయనంలో అవాక్కయ్యే విషయాలు..) -
పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..?
వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ సామర్థ్యం కూడా తగ్గుతుంటుంది. అది సర్వసాధారణం. అయితే అలా కాకుండా బాడీపై వచ్చే వృద్ధాప్య లక్షణాలకు ఎలా అడ్డుకట్టవేస్తామో అలాగే బ్రెయిన్ సామర్థ్యం వృద్ధాప్యం బారిన పడకుండా ఎలా సంరక్షించుకోవాలనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో చాలా అవాక్కయ్యేలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంపెడుమంది పిల్లలు ఉంటే బాధ్యతలు ఎక్కువై మతిమరుపు, త్వరితగతి వృద్ధాప్యం బారినపడటం జరుగుతుదనేవారు. కానీ అది అవాస్తమట. పరిశోధన ఏం చెబుతుందో తెలిస్తే.. అసలు ఇదెలా అని విస్తుపోవడం ఖాయం. మరీ పరిశోధనలో వెలుగు చూసిన ఆ షాకింగ్ విషయాలేంటో చూద్దామా..!.ఈ సరికొత్త పరిశోధన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS)లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం పిల్లలను కలిగి ఉన్నవాళ్లకు మెదడు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుందని తేల్చింది. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు మూడు వేల మందికిపైగా తల్లిదండ్రుల మెదడు పనితీరుపై పరిశోధనలు చేయగా ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలసట, ఒత్తిడి అనేవి తల్లిదండ్రులైన వాళ్లలో కంటే పిల్లలు లేని తల్లిదండ్రులలోనే ఎక్కువగా కనిపించాయట. పిల్లలు ఉండటం అనేది వ్యక్తిగత జీవితాన్ని సుసంపన్నం చేసి అహ్లదభరితంగా చేస్తుందట. సాధారణంగా పేరెంట్స్ శారీరక శ్రమని పరస్పర సహకారంతో సునాయసంగా అధిగమించగలుగుతారని పరిశోధన నొక్కి చెబుతోంది. ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రుల మెదడు మంచి క్రియెటివిటి కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా పేర్కొంది అధ్యయనం. ఈ పరిశోధనలలో తల్లిదండ్రుల్లో తండ్రిని మినహాయించాయి. ఎందుకంటే వారు శారీరకంగా గర్భం ధరించరు, ప్రసివించరు, తల్లిపాలు ఇవ్వరు కాబట్టి తల్లులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కోన్నారు పరిశోధకులు. అయితే ఈ అధ్యయనంలో దాదాపు 17 వేలకు పైగా పురుషులు కూడా పాల్గొన్నారని అన్నారు.అయితే ఈ పరిశోధన పిల్లల పుట్టుక, వారి పెంపకం, పెరిగిన అదనపు బాధ్యతలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి. అయితే లేటు వయసులో తల్లిదండ్రులైన వారిలో తక్కువ మెరుగైన ఫలితాలే కనిపించాయన్నారు. తల్లిదండ్రులుగా వారి పిల్లల బాధ్యతే వారి మెదడుని వృద్ధాప్యం బారిన పడకుండా శ్రీరామరక్షలా కాపాడతుందని అధ్యయనం చెబుతోంది. అంతేగాదు ఈ పరిశోధనకు కీలకమైన శాస్త్రవేత్త అవ్రామ్ హోమ్స్ ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంతలా వారి మెదుడు సురక్షితంగా ఉంటుందని చెప్పడం విశేషం. ఇది వరకు పిల్లల బాధ్యతల కారణంగా జుట్టు ఊడిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగతాయని ప్రగాడంగా భావించేవారు అంతా. అయితే అదంతా అవాస్తమని కొట్టిపారేసింది తాజా అధ్యయనం. కానీ ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా యూకేకి చెందిన వాళ్లే కావడంతో మరిన్ని కచ్చితమైన ఫలితాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెంట్స్పై పరిశోధన చేయాల్సి ఉందని అన్నారు శాస్త్రవేత్తలు. దీంతోపాటు పిల్లల పెంపకం అనేది బ్రెయిన్ వృధ్యాప్యాన్ని ఎలా నివారిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. ఈ పరిశోధన గనుక నిజమైతై ఒటరితనం, చిత్తవైకల్యం వంటి సమస్యలను ఎలా అధిగమించాలనేందుకు కచ్చితమైన పరిష్కారం కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..! మాజీ సీఎం లాలు యాదవ్, ప్రదాని మోదీ..) -
పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్డీ..!
కొందరు చిన్న వయసులోనే అసాధారణ తెలివితేటలు, ప్రతిభ సామర్థ్యంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఈ అసామాన్య వ్యక్తులు అందరిలా కాకుండా చిన్న వయసులోనే పెద్ద పెద్ద డిగ్రీలు పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంటారు. అలాంటి కోవకు చెందినవాడే తథాగత్ అవతార్ తులసి. అతడి అసామాన్య ప్రతిభ గురించి తెలిస్తే నోటమాట రాదు. మరీ అతడి ప్రతిభాపాటవాలేంటో చూద్దామా..!.ఆ అసామాన్యుడే తథాగత్ అవతార్ తులసి. ఆయన సెప్టెంబర్ 9, 1987న బిహార్లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తథాగత్ చిన్నప్పటి నుంచి తన అసాధారణ మేథాతో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. అలా తథాగత్ 9 ఏళ్లకే పాఠశాల విద్యను పూర్తి చేశాడు. 11 ఏళ్లకు బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక 12 ఏళ్లకే ఎంఎస్సీ పూర్తి చేసి, 21 ఏళ్లకే డాక్టరేట్ని పొందాడు. ఆ విధంగా 22 ఏళ్ల వయసుకే ప్రతిష్టాత్మక ఐఐటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రొఫెసర్ అయ్యాడు. ఈ అపార ప్రతిభాశాలి పీహెచ్డీలో క్వాంటం సెర్చ్ అల్గారిథంపై పరిశోధన చేసి మంచి పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు తథాగత్ ప్రఖ్యాత శాస్త్రవేత్త లవ్ గ్రోవర్తో కలిసి ఒక పరిశోధనా పత్రాన్ని కూడా రచించాడు అయితే అది ఏ జర్నల్లోనూ ప్రచురితం కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన 2019లో ఐఐటీ బాంబే నుంచి తొలగించబడ్డారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఉద్యోగ పోరాటం చేస్తున్నారు. 2011లో తథాగత్ తీవ్ర జ్వరం బారినపడీ అలెర్జీకి గురయ్యాడు. ఆ అనారోగ్యం చాలా ఏళ్ల పాటు కొనసాగడంతో సుదీర్ఘ సెలవు తీసుకున్నాడు. చివరికి 2013లో ముంబై విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. ఆ కారణాల వల్లే 2019లో తథాగత్ ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోయాడు. తన అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలో నివసించడం సాధ్యం కాదని, తనని ప్రత్యేక కేసు కింద IIT ఢిల్లీకి బదిలీ కోసం అభర్థిస్తున్నారు తథాగత్. అందుకోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు సమాచారం. చివరగా తథాగత్ మాట్లాడుతూ..క్వాంటం కంప్యూటర్ల రంగం పరంగా నాదేశం అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ అంశంపైనే చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నాను. కేవలం 17 ఏళ్ల వయసులో లవ్ గ్రోవర్ మార్గదర్శకత్వంలో దీనిపై పనిచేయడం ప్రారంభించాను. తన పరిశోధన ప్రొఫైల్ ముందు బాగానే ఉంది. ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ పరిశోధనపై ఫోకస్ పెట్టలేకపోయానని వాపోయారు. కానీ ఇప్పుడు తాను క్వాంటం కంప్యూటర్ల రంగానికి తోడ్పాలని కోరుకుంటున్నానని అన్నారు. అదీగాక మన భారతదేశంలో క్వాంటం కంప్యూటర్లపై రూ. 8 వేల కోట్లు ఆంక్షలు ఉన్నాయి. కావున ఆ సమస్యకు చెక్పెట్టేలా ఈరంగంలో మంచి విప్లవం తీసుకురాగలనని ధీమాగా చెప్పారు తథాగత్ .సత్కారాలు, అవార్డులు..1994లో, తథాగత అవతార్ తులసిని అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సత్కరించారు. ఆయన సాధించిన విజయానికి బహుమతిగా ఆయనకు కొంత డబ్బుని పారితోషకంగా ఇచ్చారు. కానీ తథాగత్ ఆ డబ్బుని తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆయనకు ఒక మంచి కంప్యూటర్ని బహుమతిగా ఇచ్చారు. అది ఆయనకు మరిన్ని గొప్ప విజయాలను సాధించడానికి సహాయపడింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం తథాగత్ సాధించిన విజయాలకు అబ్బురపడటమే గాక అతడిని ఘనంగా సత్కరించారు కూడా. (చదవండి: అంతా జేమ్స్ బాండ్ హీరో హీరో సెవన్గా కీర్తిస్తారు..కానీ ఆయన..!) -
వినోదం వికాసం
సాధారణ మనుషుల్లా కాకుండా ఆయనకు మూడో కన్ను ఉంటుంది.., అదే తన కెమెరా. ఈ కన్నుతో తాను చూసిన అద్భుతాలు, సామాజిక అంతరాలు వంటి విశేషాంశాలన్నింటినీ కెమెరాలో బంధిస్తాడు. అలా తను తీసిన ఫొటోలు భారత్తో పాటు విదేశాల్లోని ఫొటో ఎగ్జిబిషన్లలో ప్రదర్శించాడు. ఆయనే వినోద్ వెంకపల్లి. ఆయన ప్రయాణం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక ఇతివృత్తాలను బంధించి ప్రపంచానికి పరిచయం చేశాడు. చదువుకుంది ఐఐటీ ఎని్వరాన్మెంటల్ ఇంజినీరింగ్, కానీ తన శోధన, పరిశోధన అంతా ఫొటోగ్రఫీనే. ఎందుకు అని ఎవరైనా అడిగితే.. అందులోనే సంతృప్తి దొరుకుతుందని చెబుతాడు. తన ఫొటోగ్రఫీ నైపుణ్యంతో క్యోటో వేదికగా జరగనున్న కేజీ ప్లస్ సెలెక్ట్ 2025 ఫొటో ఎగ్జిబిషన్కు అర్హత సాధించారు. ఇందులో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 10 మందికి మాత్రమే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన వినోద్ తన అనుభవాలను, ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ఇంజినీరింగ్.. చెన్నైలో, ఎమ్టెక్ ఐఐటీ దన్బాగ్లో చేశాను. కానీ నా ఆలోచనలన్నీ సమాజం చుట్టూనే తిరిగేవి. ముఖ్యంగా సామాజిక సమస్యలు, ఇతివృత్తాలను పరిశోధించడం, ఫొటోలుగా బంధించడం ఇష్టం. వాటితో స్టోరీ టెల్లింగ్ ఇంకా ఇష్టం. దీని కోసం ఎంత దూరమైనా కెమెరా బుజాన వేసుకుని బైక్పై వెళుతుంటాను. కొన్ని రోజులు జాబ్ కూడా చేశాను.. కానీ సంతృప్తినివ్వలేదు. కెమెరాతో ఊర్లు తిరుగుతూ.. అక్కడి సంస్కృతులు, సంప్రదాయాలు, పండుగలు, జాతరలు, కష్టాలు, సంతోషాలను ఫొటోలుగా తీయడం మంచి అనుభూతినిచ్చేది. ఇలా 11 ఏళ్ల నుంచి ఫొటోగ్రఫీ, డాక్యుమెంటరీలతో నా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఈ ప్రయాణంలో కేజీ ప్లస్ సెలెక్ట్ 2025 ఫొటో ఎగ్జిబిషన్లో పాల్గోనుండటం సంతోషంగా ఉంది. ఏప్రిల్ 12 క్యోటోలో నా ఫొటోలను ప్రదర్శించనున్నాను. గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కంబోడియా, తైవాన్, అమెరికా వంటి దేశాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో ఫొటోలు ప్రదర్శితమయ్యాయి. ప్రయాణం నగరం నుంచే.. నగరంలోని ట్యాంక్బండ్ వంటి ప్రదేశాల్లో ఫొటోలు తీస్తూ మొదలు పెట్టిన ప్రయాణం తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు చేరింది. చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణం ఏమీ తెలియదు. అమ్మా, నాన్న డాక్టర్లు. కానీ వారు నా సామాజిక బాధ్యతను ప్రేరేపించేవారు. అటువైపు నన్ను ప్రోత్సహించేవారు. ఈ ప్రయాణంలో నల్గొండ ఫ్లోరోసిస్పై పరిశోధనాత్మక ఫొటోగ్రఫీ చేశాను. దీని కోసం బైక్పై నల్గొండలోని ఫ్లోరైడ్ బెల్ట్కు వెళ్లేవాడిని. అంతేకాకుండా తెలంగాణలోని అప్పటి నీళ్ల కష్టాలను నా ఫొటోలతో చూపించాను. అరకులో మలేరియా వ్యాపించి ప్రజలు అవస్థలు పడుతున్నారనే విషయం తెలుసుకుని చేసిన ప్రాజెక్టు ఇంకా కళ్ల మందే మెదులుతోంది. మహబూబ్నగర్లో నీటి ఎద్దడికి ఇసుక చలిమల్లో ఓ చిన్నారి ముంతతో నీరు సేకరించిన ఘటన..నీటి ప్రధాన్యతను తెలియజేసింది. కరువు, సంక్షోభాలు, విపత్కర పరిస్థితులు, సామాజిక సమస్యలు, మానవీయ కోణాలు, వివక్ష, సాంఘిక అకృత్యాలను ఫొటోలుగా బంధిస్తూ వచ్చాను. క్రమంగా నమ్మకం కలిగింది.. హైదరాబాద్లో బోనాలు, ముంబైలో వినాయక చవితి, మహోకుంభ మేళా.. ఇలా సందర్భం ఏదైనా అక్కడి పరిస్థితులను చిత్రించాను. అమ్మ నాన్నలు నాస్తికులు.. కానీ ప్రజల్లో దేవుని పై నమ్మకం నన్ను ఆలోచింపజేసేది. నమ్మకం లేకుంటే మనిషి పరిస్థితులు ఏంటనే దిశగానూ శోధించాను. అప్పులు చేసి పంట వేసిన ఒక రైతు దేవుడి పై నమ్మకంతో తన జీవనాన్ని ఎలా ముందుకు సాగిస్తాడు.. ఆ నమ్మకమే లేకుంటే కష్టజీవుల మానసిక అవస్థలు ఎలా ఉంటాయో దగ్గరగా చూశాను. వివిధ వేదికల్లో.. నా ఫొటోలు ది న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, ది వాషింగ్టన్ పోస్ట్, ఎమ్ఎస్ఎన్ సౌత్ ఆఫ్రికా, డైలీ మెయిల్, యాయూ న్యూస్ యూకే, నేషనల్ పోస్ట్, యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ వంటి వేదికల్లో ప్రచురితమయ్యాయి. నాకు విభిన్న కళల్లో ప్రావీణ్యముంది.. డ్రాయింగ్ వేస్తాను. శిల్పకళలోనూ ప్రావీణ్యముంది. మెటల్ ఫేస్ తయారు చేస్తాను. ఫొటోగ్రఫీకి బయటకు వెళ్లడానికి నాకు డబ్బులను అందించేది నా డ్రాయింగ్ మాత్రమే. నా ఫొటోల్లో బంధించలేని వాటిని బొమ్మలుగా వేసి ముంబై ఆర్ట్ ఫెయిర్లో ప్రదర్శిస్తే.. అన్నీ అమ్ముడు పోయాయి. ఫొటోగ్రఫీలో ప్రతిష్టాత్మక టోటో ఫొటోగ్రఫీ అవార్డ్, రెండు సార్లు తెలంగాణ స్టేట్ అవార్డులను అందుకున్నాను. ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్లో సభ్యుడిని. సామాజిక అంశాల ఇతివృత్తంతో రెండు, మూడు డాక్యుమెంటరీలు, షార్ట్ఫిల్్మలు తీసే ప్రయత్నంలో ఉన్నాను. అది అమాయకత్వం కాదు.. ఆప్యాయత.. ఫొటోల కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల స్వచ్ఛమైన మనస్తత్వం చూశాను. మొదట్లో ఆశ్చర్యపడేవాడిని. ఓ అవ్వ అన్నం పెట్టేది. ఒక పెద్దాయన తన ఇంట్లో ఆశ్రయం కలి్పంచేవారు. ఇలా పల్లె మట్టిలో అమ్మతనం నన్ను ఫొటోగ్రఫీలో మరింత లోతుగా తీసుకెళ్లింది. మొదట్లో అదంతా అమాయకత్వం అనుకున్నా.. కాదు ఆప్యాయత అని నెమ్మదిగా తెలుసుకున్నా. తోటి మనుషులకు వారిచ్చే విలువను తెలుసుకున్నా. అఫ్ఘాన్ వార్లో చనిపోయిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ దాని‹Ùసిద్ధికీ (ఢిల్లీ) పలు విలువైన సూచనలిచ్చి ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్టుగా మారేలా చేశారు. -
వన్ లెగ్డ్ జీన్స్..! ఇదేం ఫ్యాషన్ ట్రెండ్..
ఫ్యాషన్ ట్రెండ్ అనేది నిరంతరం మారుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడూ లేటెస్ట్ ట్రెండ్ వచ్చేస్తుంటుంది. అయితే కొన్ని ఫ్యాషన్ డిజైన్లు చూస్తే అబ్బా ఇదేం ఫ్యాషన్ అని నెటజన్లు మండిపడేలా ఉంటాయి. అసలు వాటిని ఎలా ధరిస్తారురా బాబు అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది కూడా. అయితే వాటి ధర చూస్తే అంత పలుకుతుందా అని నెటిజన్లు షాక్ అయ్యేలా ఉంటాయి. అలాంటి ఫ్యాషన్ ట్రెండ్ ప్రస్తుతం నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఇదేం పిచ్చి ఫ్యాషన్ అని తిట్టుకుంటున్నారు నెటిజన్లు. నిజంగా ఇది స్టైలిష్ ఫ్యాషనా..? లేక తెలియక ఏదో అలా డిజైన్ చేశారా..? అని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఫ్రెంచ్ లగ్జరీ లేబుల్ కోపర్ని కలెక్షన్కి సంబంధించిన డిజైనర్వేర్ వన్ లెగ్డ్ జీన్స్ గురించి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ క్రిస్టీ సారా వీడియో రూపంలో తన అభిప్రాయాన్నిషేర్ చేసింది. దీంతో ఈ డిజైనర్వేర్ నెట్టింట హాట్టాపిక్ మారింది ఇది. ఆ వీడియోలో ఆమె భర్త సడెన్గా ఎంటర్ అయ్యి ప్రస్తుతం దీన్ని ఎవ్వరూ ధరించడం లేదని అన్నారు. అయితే సారా మాత్రం ఈ డిజైన్ నచ్చింది కానీ కాస్త పెద్ద సైజు కావాలన్నారు. అయితే దీని ధర మాత్రం రూ. 38 వేలు పైనే పలుకుతోందని తెలిపింది.తక్కువలో దొరికితే ఇలాంటి డిజైన్లు ట్రై చేయగలమని తన అభిప్రాయాన్ని పంచుకుంది. కానీ నెటిజన్లు మూవీలో ఫన్ కోసం నటులు వేసుకున్నారనుకున్నాం. ఇది కూడా ఓ ఫ్యాషన్నే అంటూ మండిపడ్డారు. అసలు ఎలా ధరించి బయటకు రాగలరు. ఏ ఫ్యాషన్ అయినా చూసేవాళ్లకు, మనకు కూడా కంఫర్ట్ ఉండాలి కదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Kristy Sarah Scott (@kristy.sarah) (చదవండి: సమ్మర్లో స్లిమ్గా మారడం ఈజీ..! ఎలాగంటే..) -
సమ్మర్లో స్లిమ్గా మారడం ఈజీ..! ఎలాగంటే..
వ్యాయామంతో బరువు తగ్గించుకునేందుకు ఇదే అనువైన సమయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ వేసవిలో స్లిమ్గా మారొచ్చంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటికే వేసవి ప్రారంభమైంది. జిమ్ చేయడానికి సిద్ధమవుదాం. నడక ఎంతో ప్రయోజనం ప్రస్తుత యాంత్రిక జీవనంలో అనేక రకాల పనుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. దీన్ని నడకతో అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. సాయంత్రం కంటే మార్నింగ్ వాక్ చాలా మంచిది. ఉదయం స్వచ్ఛమైన వాతావరణంతో పాటు, ఆక్సిజన్ స్థాయి అధికంగా ఉంటుంది. సున్నితంగా సూర్యకిరణాలు పడుతుంటే మనసుకు హాయినిస్తుంది. అయితే జాగింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవంటున్నారు. నీరసం వచ్చే వరకూ జాగింగ్ చేయడం ప్రమాదకరమే. దాహం వేస్తే అందుబాటులో తాగునీటిని ఉంచుకోవాలి. శీతల ప్రాణాయామం శీతల ప్రాణాయామం చేస్తే కొంత వరకూ ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందడంతోపాటు, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి ముక్కుద్వారా వదిలే ప్రక్రియే శీతల ప్రాణా యామం. ఉదయం 7 గంటల లోపు 5 నిమిషాలు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం మేలు పుచ్చ, కీర, కర్బూజా, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటితో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. శీతల పానీయాలు, షుగర్ వేసిన జ్యూస్లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి. వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. డైట్ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలను తీసుకుంటే బరువును నియంత్రించవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. ఇవి పాటిస్తే.. బరువు తగ్గాలనుకునే వారికి స్విమ్మింగ్ మంచి వ్యాయామం ఎంతటి భోజన ప్రియులైన వేసవిలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని వివిధ రూపాల్గో తీసుకుంటే బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఫ్రిజ్లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం. జాగ్రత్తలు తీసుకోవాలి వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసే సమయంలో నీరసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా వాకింగ్ చేయకూడదు. ఎండలో వాకింగ్ చేయడం మంచిది కాదు. వేసవిలో శరీరంలో నీరు త్వరగా ఆవిరై డీ హైడ్రేషన్కు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ టీవీ మురళీకృష్ణ, జనరల్ ఫిజీషియన్ఆహార నియమాలు పాటించాలి వేసవిలో ఆహార నియమాలు పాటించాలి. వేపుళ్లు, నూనె ఎక్కువుగా ఉన్న వంటకాలు తీసుకోకుండా ఉండటం మంచిది. తాజా ఆకుకూరలు, పళ్లు తీసుకోవాలి. నీరుశాతం ఎక్కువగా ఉంటే పుచ్చ, కర్బూజ, వంటి పళ్లు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేస్తే స్లిమ్గా మారొచ్చు. – గర్రే హరిత, ఆహార నిపుణులు -
ఈ మేకప్ బాక్స్ ఉపయోగించడం చాలా ఈజీ..!
మేకప్ ఉత్పత్తులను దాచిపెట్టుకోవడం, అవసరానికి వాటిని వెతుక్కోవడం పెద్ద సమస్య. ఇక మేకప్ సామగ్రికి బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చేరకుండా జాగ్రత్తపడటం మరో సమస్య. ఆ సమస్యను ఈ మేకప్ బాక్స్ ఇట్టే దూరం చేయగలదు. పైగా మిర్రర్, ఫ్యాన్, లైట్ వంటి వాటితో రూపొందిన ఈ మేకప్ బాక్స్ వాడుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది.క్రీమ్స్, సీరమ్స్, లోషన్స్, ఫౌండేషన్స లిప్స్టిక్స్, ఐ లైనర్స్, పౌడర్స్ ఇలా రోజువారీ వినియోగించే మేకప్ సామాన్లను ఈ బాక్స్లో చక్కగా సర్దిపెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్కి ఒకవైపు అద్దం ఉంటుంది. మరోవైపు స్టోరేజ్ కంటైనర్ ఉంటుంది. దీనికున్న అద్దాన్ని 360 డిగ్రీల్లో ఎలా అయినా తిప్పుకోవచ్చు. కూర్చునే కాదు, నిలబడి కూడా మేకప్ వేసుకోవచ్చు. వేసుకున్న మేకప్ త్వరగా ఆరడానికి దీనిలో ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇక దీనిలో పర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిష్లు, నెయిల్ రిమూవర్స్ వంటివన్నీ దాచుకోవచ్చు. అద్దం వెనుక భాగంలో కూడా కొన్ని మేకప్ వస్తువులను పెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్లో మరో నాలుగు చిన్నచిన్న సొరుగులు ఉంటాయి. దీనికి ఎల్ఈడీ లైట్ అమర్చి ఉండటంతో, కరెంట్ లేనప్పుడు కూడా మేకప్ వేసుకోవడానికి వీలవుతుంది. ఈ లైట్ మూడు వేర్వేరు కాంతుల్లో వెలిగేందుకు ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మార్చుకుంటూ మేకప్ ముఖానికి సరైన విధంగా ఉందో లేదో చూసుకోవచ్చు. మనకు కావాల్సిన అన్ని రకాల మేకప్ ఉత్పత్తులను ఇందులో భద్రపరచుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీన్ని బాత్ రూమ్లో, బెడ్ రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలాంటి మేకప్బాక్సులు చాలానే, రకరకాల మోడల్స్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి రకరకాల రంగుల్లో లభిస్తున్నాయి. దీని ధర సుమారుగా మూడు లేదా నాలుగు వేలు ఉంటుంది. మోడల్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. వీటిలో కొన్నింటిని ముందే చార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు. కొన్నింటిని బ్యాటరీలతో వినియోగించుకోవచ్చు.ముఖ కాంతికి చికిత్స..:ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి రకరకాల చిట్కాలు ఉన్నాయి. రకరకాల సౌందర్య లేపనాలు, అధునాతన పరికరాలు ఉన్నాయి. ఇవేవీ ఫలించనప్పుడు నిపుణులు చేసే చికిత్స పద్ధతులు ఉన్నాయి. ముఖ సౌందర్యాన్ని త్వరగా మెరుగుపరచడానికి ఇటీవలి కాలంలో ‘లో లెవల్ లేజర్ లైట్ థెరపీ’ అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిలో తక్కువ స్థాయిలో లేజర్ లైట్ను వెదజల్లే పరికరాన్ని ఉపయోగిస్తారు. టార్చ్లైట్లా ఉండే ఈ పరికరం ద్వారా ముఖచర్మంపై లేజర్ కాంతిని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ముఖ కండరాల్లో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, సడలిపోయిన ముఖం తిరిగి బిగుతుదేరుతుంది. ముఖంపై ఏర్పడిన ముడతలు, మచ్చలు, మొటిమలు కూడా క్రమంగా నయమవుతాయి. పలు దేశాల్లో చర్మవైద్య నిపుణులు ఈ పద్ధతిలో చికిత్సను అందిస్తున్నారు. (చదవండి: ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!) -
నగరాన్ని తలపించే హైటెక్ నౌక..!
సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో ఉండే రాజప్రాసాదం నీటిలో తేలియాడితే ఎలా ఉంటుందంటే, అది అచ్చం ‘సోమ్నియా’లాగే ఉంటుంది. సోమ్నియా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నౌక మాత్రమే కాదు, అద్దాల గోడలతో నిండిన అద్భుత నిర్మాణం. లాటిన్లో సోమ్నియా అంటే ‘కల’ అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే ఈ నౌక ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ఇందులో మొత్తం విలాసవంతమైన 39 అపార్ట్మెంట్లను ఆరు డెక్లలో నిర్మించారు. సుమారు పదివేలమంది వరకు ఇందులో ఉండొచ్చు. పెద్ద రెస్టరెంట్లు, లాబీ, స్పా, బార్లు, సూపర్ మార్కెట్లు, బొటిక్, ఫిట్నెస్ సెంటర్లు, టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్పూల్, కాక్టెయిల్ లాంజ్ సహా సమస్త సౌకర్యాలను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. ఈ నౌక యజమాని మలేషియాలో అత్యంత ధనవంతుడైన రాబర్ట్ కుయోక్ అని సమాచారం. రాబర్ట్ తన విహార యాత్రల కోసం కస్టమైజ్డ్ యాట్లను తయారు చేసే డచ్ కంపెనీతో దీనిని తయారు చేయించుకుంటున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.. కాని, అధికారికంగా ఇంకా ఈ నౌక యజమాని ఎవరనేది వెల్లడి కాలేదు.(చదవండి: భారీ కీటకం.. దాంతోనే వంటకం..! ఎక్కడంటే..?) -
సండే వెరైటీగా రొయ్యల దోసెలు, కాజు రవ్వ వడ చేసేయండిలా..!
ఈ ఆదివారం చిన్న పెద్ద అంతా ఇంట్లోనే సందడిగా ఉంటారు. ఆదివారం అంటే ఆటవిడుపులా అనిపిస్తుంది అందరికి. అమ్మపై భారం వేయకుండా..అందరూ తలో చేయి వేసి ఈ సండే ఇలా వెరైటీ వంటకాలు ట్రై చేసి మరింత ఖుషీగా ఉండండి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేయాలో చూసేయండి మరీ..!.రొయ్యల దోసెలుకావలసినవి: సోయా పాలు– 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్– 2 టీ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు– 2 లేదా 3 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి– అర టీ స్పూన్ పసుపు– కొద్దిగా ఉప్పు– తగినంత రొయ్యలు– 250 గ్రాములు (శుభ్రం చేసుకుని హాఫ్ బాయిల్ చేసుకుని, పక్కన పెట్టుకోవాలి) మిరియాల పొడి– పావు స్పూన్ కొత్తిమీర తురుము– కొద్దిగా కరివేపాకు– కొద్దిగా పచ్చిమిర్చి– 2 (చిన్నగా తరగాలి) గరం మసాలా– 1 టీ స్పూన్ దోసెల పిండి– రెండు మూడు కప్పులు గుడ్లు– రెండు లేదా మూడు (అభిరుచిని బట్టి) నూనె– సరిపడాతయారీ: ముందుగా కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని దోరగా వేయించుకోవాలి. అనంతరం దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, గరిటెతో తిప్పుతూ అర నిమిషం పాటు వేయించాలి. తర్వాత మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మరికొద్దిగా కారం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు సోయా పాలు పోసి మూత పెట్టి, చిన్న మంట మీద ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గరపడుతున్న సమయంలో రొయ్యలు వేసుకుని, ఒకసారి రుచి చూసి, సరిపడా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుకోవాలి. ఆ మిశ్రమం మరింత దగ్గర పడిన తర్వాత ఆ కళాయి దించి పక్కన పెట్టుకుని, స్టవ్ మీద దోసెల పెనం పెట్టుకోవాలి. దానిపై దోసెలు వేసుకుని, ఒక్కో దోసెపై ఒక్కో గుడ్డు కొట్టి, అభిరుచిని బట్టి పసుపు సొనను కదిలించకుండా ఉడికించి, ఆపైన కొద్దికొద్దిగా రొయ్యల కర్రీ, కొత్తిమీర తురుము వేసుకుని, దోసెను ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. కాజు రవ్వ వడ..కావలసినవి: జీడిపప్పు– అర కప్పు రవ్వ– కప్పు అల్లం తురుము– టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము– 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి– 1 (చిన్నగా తరగాలి) ఉప్పు– తగినంత కరివేపాకు– 1 రెమ్మ (చిన్నచిన్నగా తుంచి వేసుకోవాలి) కుకింగ్ సోడా– అర టీ స్పూన్ డ్రై ఫ్రూట్స్ తరుగు– కొద్దిగా పెరుగు– అర కప్పు పైనే నూనె– డీప్ ఫ్రైౖ కి సరిపడాతయారీ: ముందుగా జీడిపప్పును పొడిపొడిగా మిక్సీ పట్టుకోవాలి. దానిలో రవ్వ, అల్లం తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కుకింగ్ సోడా, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసుకుని, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో పెరుగు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ముద్దలా చేసుకోవాలి. అనంతరం చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని, వడల్లా ఒత్తుకుని, నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చట్నీలో లేదా సాస్లో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. -
సమ్మర్ కష్టాలకు స్మార్ట్గా చెక్పెట్టేద్దాం ఇలా..!
‘అయ్యో వచ్చే వేసవి.. తెచ్చే తిప్పలు’ అనే మాటలకు ఇకపై స్మార్ట్గా చెక్ పెట్టొచ్చు. మండే ఎండల నుంచి తప్పించుకోవడానికి చల్లదనం కోసం, ప్రజలు రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు. ఆ చిట్కాల్లో ఈ గాడ్జెట్లనూ చేర్చి, సమ్మర్కు స్మార్ట్గా, కూల్గా మార్చేయచ్చు. ఇందుకోసం ఉపయోగపడే కొన్ని లేటెస్ట్ గాడ్జెట్ల వివరాలు మీకోసం...సన్స్క్రీన్ టెస్టర్ వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్డ్రైవ్లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా. వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!స్మార్ట్ వాటర్ బాటిల్వేసవిలో హైడ్రేటెడ్గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్తో మీరు హైడ్రేటెడ్గా ఉండొచ్చు. ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది. అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్లు, బీచ్ డేస్కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది. క్యాప్ విత్ ఫ్యాన్వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్గా మారాయి. ఈ క్యాప్స్కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్గా ఈ ఫ్యాన్లు పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్ఫోన్ , పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది. (చదవండి: 'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడు అడుగుపెట్టారో..) -
హీరోయిన్ నయనతారలాంటి స్టన్నింగ్ లుక్ కోసం..!
తెరపై నవరసాలను అలవోకగా పలికించే నటి నయనతార. అంతటి అభినయాన్ని మ్యాచ్ చేసే ధైర్యం లేక.. ఆమె అందాన్ని మ్యాచ్ చేసే పోటీలో మేమూ నిలబడతామన్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. నా ముఖంలో వచ్చిన మార్పులకు చాలామంది ప్లాస్టిక్ సర్జరీ కారణమని అనుకుంటుంటారు. కాని, నాకు తరచు ఐబ్రోస్ చేయించుకోవటం ఇష్టం. అవి గేమ్ చేంజర్ లాంటివి. ఆహారం, బరువులో వచ్చే తేడాలతో పాటు నా డిఫరెంట్ ఐబ్రోస్ స్టయిల్స్ కూడా నా లుక్స్ని మారుస్తాయని చెబుతోంది లేడీ సూపర్ స్టార్ నయన తార.అందాల చేతులకు సెలబ్రిటీ టిప్చేతిగాజులు చేతులకే అందాన్ని తెస్తాయి. కాని, అవి సంప్రదాయ దుస్తులకే సెట్ అవుతాయి. జీన్స్, వెస్టర్న్వేర్ దుస్తులకు గాజులు నప్పవు. అలాంటప్పుడు ఈ సింపుల్ సెలబ్రిటీ స్టయిల్ ఫాలో అయితే, మీ చేతులను అందంగా మార్చేయచ్చు. సింపుల్గా ఉండే బ్రాస్లెట్తో పాటు మరో రెండు, మూడు రకాల బ్రాస్లెట్స్ను ఒకేసారి ధరిస్తే మీ చేతులకు ఎలిగెంట్, ట్రెండీ లుక్ సొంతం అవుతుంది. ఇలా మీ రెండు చేతులకు లేదా ఒక చేతికి కూడా ధరించొచ్చు. ఈ విధంగా హెవీగా చేతులను స్టయిల్ చేసినప్పుడు మెడను, చెవులను కూడా సింపుల్గా స్టయిల్ చేసుకోవాలి. అప్పుడే మీ చేతులు హైలెట్ అయి అందంగా కనిపిస్తారు. ఈ టెక్నిన్నే నటి నయనతార కూడా ఫాలో అయింది. ఈ ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా జ్యూలరీ షాపింగ్ చేసేటప్పుడు మూడు నాలుగు రకాల బ్రాస్లెట్స్ను కూడా కార్ట్లో యాడ్ చేసుకోండి. (చదవండి: విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక..!) -
సాల్ట్ అండ్ పెప్పర్: అందాల ఈ పెళ్లి కూతుర్నిచూసి షాకవ్వకండి!
ఇటీవలికాలంలో వివాహ తీరుతెన్నుల్లో చాలా మార్పులొచ్చాయి. తమ జీవితంలో ముఖ్యమైన క్షణాలను అపురూపంగా దాచుకునేందుకు ఎంతఖర్చుకైనా వెనుకాడని వారు,స్థాయికి మంచి ఖర్చుచేస్తున్నవారు కొందరైతే, అత్యంత సాదాసీదాగా పెళ్లిళ్లు చేసుకొని, కొంత పొమ్మును దాతృత్వ సేవలకు వెచ్చిస్తున్నవారు కొందరు. ఇవన్నీ ఒకెత్తు అయితే, తామెలా ఉన్నా, ఆత్మన్యూనతకు గురికుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు ఈ తరం జంటలు. ఆత్మస్థైర్యంతో తమ వ్యక్తిత్త్వాన్ని చాటుకుంటున్నారు. పురాతన స్టీరియోటైప్ అభిప్రాయాలనుంచి బయటపడి, సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్తో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ఆసక్తికరమైన వధువు గురించి తెలుసుకుందాం.నల్లగా వున్నా, లావుగా ఉన్నా, తెల్ల జుట్టు ఉన్నా, ఆడవాళ్లకు మీసాలు గడ్డాలు వచ్చినా, మగవాళ్లకు బట్ట తల ఉన్నా.. అదేదో లోపం లాగా ఆత్మన్యూనతతో బాధపడుతూ కూర్చోవడంలేదు. ఎలా ఉన్నా మనల్ని మనల్ని యథాతథంగా స్వీకరించడం, మనల్ని మనం ప్రేమించుకోవడం అవగాహన కూడా పెరుగుతోంది. భారత దేశానికి చెందిన మైత్రి జొన్నల నెరిసి తెల్ల జుట్టుతో ధైర్యంగా పెళ్లి పీటలెక్కి తన వ్యక్తిత్వాన్ని చాటుకుంది. పెళ్లి కూతురు అంటే ఇలాగే ఉండాలి అనే సాంప్రదాయపు గోడల్ని బద్దలు కొట్టింది. సహజ సౌందర్యంతో, ఆనందంగా తన చిరకాల ప్రియుడు పార్త్ను గత ఏడాది వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట సందడిగా మారాయి.అమ్మనుంచి వచ్చిన గిఫ్ట్ఈ సందర్భంగా మైత్రి సాల్ట్ అండ్ పెప్పర్ జుట్టు తల్లితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది.తన జుట్టు గురించి సిగ్గుపడటం లేదా భయపడటం లేదని వెల్లడించింది. తన తల్లికి కూడా 30 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా బూడిద రంగులోకి మారిపోయిందనీ, ఎవరెన్ని ఉచిత సలహాలిచ్చినా, తన సహజ జుట్టును అలాగే ఉంచుకుందని గుర్తు చేసుకుంది. ఆమే తనకు స్ఫూర్తి అని ఆత్మవిశ్వాసంతో తెలిపింది. View this post on Instagram A post shared by Mythri Jonnala (@mythrijonnala) "నా బూడిద జుట్టు నన్ను భయపెట్టదు, అది నేను నా తల్లి కూతురినని నాకు గుర్తు చేస్తుంది. నా అమ్మ జుట్టు 30 ఏళ్ల నాటికి పూర్తిగా తెల్లగా మారిపోయినా, కానీ ఆమె ఎప్పుడూ వాటికి రంగు వేసుకోలేదు. అలాగే వదిలేసింది. ఉచిత సలహాలను ఎప్పుడూ పట్టించుకోలేదు. అమ్మ ధైర్యమే శక్తినిస్తోంది’’ అని తెలిపింది. మొదట్లో కొన్ని రోజులు నేను సిగ్గు పడ్డాను. కానీ పెళ్లి మాత్రం ఇలాగే చేసుకోవాలను కున్నాఇప్పటివరకు అనుభవించిన అత్యంత అందమైన క్షణాలివే అంటూ సిగ్గుపడింది మైత్రి. మైత్రి జొన్నల బంగారు అంచుతో ఉన్న చక్కటి ఎర్రటి చీరలో అందంగా మెరిసిపోయింది. దీనికి జతగా బంగారు జరీ వర్క్తో తయారు చేసిన రెడ్ బ్లౌజ్ ధరించింది. నెక్లెస్, చెవులకు ఝుంకాలు, పాపిట బిళ్ల, అరవంకీ, గాజులుతో లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా జాగ్రత్తపడింది. కాగా మైత్రి తత్వ భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి బీఏ, ఎల్ఎల్బి (ఆనర్స్), సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి బిజినెస్ లా , ఎడిఆర్లో మాస్టర్ ఆఫ్ లాస్ను అభ్యసించింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీ సలహాదారుగా పనిచేస్తోంది. -
డెన్మార్క్ రాణి 1800ల నాటి అరుదైన కిరీటం..! 140 ఏళ్లుగా..
రాణులు ధరించే ప్రతి ఆభరణానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంటుంది. తరతరాలుగా ఆ ఆభరణాలను వారసత్వంగా ధరించడం జరుగుతుంది. అయితే ఆ భరణాలు అత్యంత ఖరీదే గాక వాటి వెనుక ఎంతో ఆసక్తికరమైన కథలు ఉంటాయి. వాటి నేపథ్యం చూస్తే నోటమాటరాదు. అన్నేళ్లుగా ఆ ఆభరణాలను తరతరాలుగా భద్రపరచడం చూస్తే..వాటికున్న విలువ, పూర్వకాలం నాటి హస్తకళా నైపుణ్యం భవిష్యత్తు తరాలకు తెలుసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ డెన్మార్క్ క్వీన్ ధరించి శోరోభూషణం కూడా అందరీ దృష్టిని ఆకర్షించడమే ఒక్కసారిగా దాని చారిత్రక నేపథ్యం కళ్లముందుకు కదలాడింది. మరీ ఆఇంట్రస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దామా..!.డెన్మార్క్రాణి మేరీ ఇటీవల హెల్సింకిలోని ఒక రాష్ట్ర వేడకలో అందరూ మర్చిపోయిన రాజ ఆభరణాన్ని వెలుగులోకి తెచ్చింది. క్వీన్ మేరీ డెన్మార్క్, ఫిన్లాండ్ల మధ్య సన్నిహిత సంబంధాల బలోపేతం చేసుకునేందకు ఏర్పాటు చేసిన వైట్- టై ఈవెంట్లో ఈ శిరో ఆభరణాన్ని(కిరీటం)ధరించింది. ఆమె ధరించి కిరీటం 1839- 1848 కాలం నాటిది. ఆ కాలంలో డెన్మార్క్ రాజప్రతినిధి అయిన క్రిస్టియన్ VIIIని వివాహం చేసుకున్న క్వీన్ కరోలిన అమాలీకి చెందిన బంగారు కీరిటీం. ఈ కిరీటం అత్యంత అరుదైన రత్నాలతో పొదిగి ఉంటుంది. డానిష్ కోర్టు ప్రకారం, 1819-1821లో ఈ జంట ఇటలీ పర్యటన సందర్భంగా ఆ 11 రత్నాలను సేకరించారట. ఆ పర్యటనలో ఈ దంపతులు రోమ్ని సందర్శించి సమీపంలో పాంపీలో జరిపిన పురాతన తవ్వకాల నుంచి వీటిని సేకరించినట్లు డానిష్ కోర్టు పేర్కొంది. ఆసక్తికర కథేంటంటే..ఈ కిరీటం 140 ఏళ్లకు పైగా కనిపించలేదు. రాజ ఖజనాలోనే లాక్ చేసి ఉంచారని డానిష్ కోర్టు ధృవీకరించింది. మళ్లీ ఇన్నేళ్లకు డెన్మార్క్ రాణి మేరీ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో జరిగిన వేడుకలో ఆ ఆభరణాన్ని తలకు ధరించింది. ఈ కార్యక్రమం ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, అతని భార్య సుజాన్ ఇన్నెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇది ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా జరిగిన ఈవెంట్. ఇక రాయల్ కలెక్షన్లలో తరుచుగా కనిపించే అత్యంత విలాసవంతమైన వస్తువులా కాకుండా రోజువారీ దుస్తులకు సరిపోయేలా ధరించడానికి అనుగుణంగా ఉండేటమే ఈ కిరీటం ప్రత్యేకతట. (చదవండి: ‘ఆడపిల్లనమ్మా..’ పాటతో పాపులర్ అయిన సింగర్ మధుప్రియ జర్నీ..!) -
'వంట చేయడం గొప్ప టాలెంట్'..!: థైరోకేర్ వ్యవస్థాపకుడు
వంట చేయడం లేదా వంట వృత్తిని తక్కువగా లేదా తేలిగ్గా చూస్తారు చాలామంది. పైగా గబగబ ఏదో ఒకటి టైంకి వండిపెట్టేవాళ్లు లేకపోతే అల్లాడిపోతాం. అలాంటిది ఆ వృత్తిని మాత్రం చీప్గా చూస్తాం. ఇప్పుడు నెట్టింట థైరోకేర్ వ్యవస్థాపకుడు షేర్ చేసిన ట్వీట్ చూసి కచ్చితంగా మనసు మార్చుకుంటారు. ఎందుకుంటే వంట ప్రాముఖ్యతను హైలెట్ చేస్తూ వివరించిన విధానం నెటిజన్ల మనసును హత్తుకుంది. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ వేలుమణి ఇటీవల రెండు రకాల వ్యక్తులపై తన దృక్పథాన్ని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో వంట ప్రాముఖ్యతను ఆయన హైలెట్ చేయడంతో ఒక్కసారిగా నెట్టింట ఈ పోస్ట్ హాట్టాపిక్గా మారింది. వేలుమణి వంట చేయడం నేర్చుకునేవారు, వంట చేయడాన్ని టైం వేస్ట్ పనిగా భావించే వారు అంటూ రెండు విరుద్ధ అభిప్రాయల గల వ్యక్తుల గురించి పోస్ట్లో రాశారు. వంటను రుచికరంగా చేసేవారు వైవాహిక జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తారని, అత్యంత సంపన్న కుటుంబ నేపథ్యం ఉండి, వంట చేయడాన్ని టైం వేస్ట్గా భావించేవారికి వైవాహిక జీవితంలో సత్సంబంధాలు సవ్యంగా ఉండవని అన్నారు. అంటే ధనవంతుడైనా భాగస్వామి దొరికినా.. ఆమెకు వంట చేయడం పట్ల సరైన ఆసక్తి లేకపోతే ఇరువురి మధ్య సరైన సత్సంబంధాలు లేక ఇబ్బంది పడతారని అన్నారు వేలుమణి. అంతేగాదు తన పోస్ట్లో థైరోకేర్ వ్యవస్థాపకుడు వేలుమణి తన భార్య సుమతి వేలుమణి ఇరు కుటుంబాలను చక్కగా చూసుకునేదని అన్నారు. ఆమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉద్యోగం చేస్తూ కూడా కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహించేదని, వంట చక్కగా చేసేదంటూ తన దివంగత భార్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆహారమే ఓ వ్యక్తి ప్రేమను మరింత హృదయానికి హత్తుకునేలా చేస్తుందని అన్నారు. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిలల్లకు వంట నేర్పించండి. ఆ విషయంలో పేరెంట్స్గా విఫలమై ఆ తర్వాత పశ్చాత్తాపం పడినా ప్రయోజనం లేదంటూ రాసుకొచ్చారు వేలుమణి ఆ పోస్ట్లో.There are two kinds. 1. Intelligent enough to Learn a good deal of cooking. They enjoy a happy married life by building bilateral relationships. 2. Lazy enough to think that cooking is waste of time. Even if they find a rich spouse, they struggle in generating or sustaining… pic.twitter.com/rVHR6jM3fu— Dr. A. Velumani.PhD. (@velumania) March 5, 2025 (చదవండి: ఆ వ్యక్తికి 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు..! కుటుంబమే..) -
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
దివంగత టాలీవుడ్ నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అచ్చం తల్లిలానే తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. అలనాటి అందాల తార శ్రీదేవిని తలపించేలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. దేవర మూవీలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ సరసన నటించి నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసేలా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ ఏడాది మార్చి 06తో 28 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె గ్లామర్ పరంగా తన తల్లికి ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్గా స్లిమ్గా ఉంటుంది. మరో అతిలోక సందరిలా కళ్లు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. అంతలా ఫిజిక్ మెయింటైన్ చేయడం వెనుకున్న రహస్యం ఏంటో చూద్దామా..!.జాన్వీ తరుచుగా తన ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో బ్యూటీ సీక్రెటని బయటపెట్టింది. తన ఆహారపు అలవాట్లు, ఫిటెనెస్ సీక్రెట్ తదితరాల గురించి షేర్ చేసుకుంది. తాను ఎక్కువుగా ఇంట్లో వండిన ఆహారాలనే ఇష్టంగా తింటానని అంటోంది. కఠినమైన డైట్ని ఫాలోఅవుతానని అంటోంది. అల్పాహారం అవకాడో, రెండు గుడ్ల మాత్రమేనని, భోజనంలో గ్రిల్డ్ చికెన్, పాలకూర, సూప్ తీసుకుంటానని చెబుతోంది. ఎక్కువగా జపనీస్, ఇటాలియన, ఆంధ్ర, మొఘలాయ్ వంటకాలంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే తాను గ్లూటైన్ రహిత ఫుడ్నే తీసుకుంటానంటోంది. ఎందుకంటే గ్లూటైన్ తనకు పడదని, అలెర్జీ వస్తుందని తెలిపింది. తనకు బాగా నచ్చిన ఆరోగ్యకరమైన మంచీలను లేదా పండ్లు ఎక్కువగా ఇష్టంగా తింటానని చెప్పింది. వాటిలో చక్కెర ఎలాగో ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వీట్స్ జోలికి వెళ్లనంటోంది. బాగా, పానీపూరీ, ఐస్క్రీం, స్ట్రాబెర్రీలు అంటే మహా ఇష్టమని చెబుతోంది. చాలామటుకు అన్ని కూరగాయలు, పళ్లు తింటానని, కాకపోతే బరువు పెరగకుండా చూసుకునేందుకు ఎక్కువగా వ్యాయామాలు చేస్తానని చెప్పింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తుందట. అందుకే ఎక్కువగా రెడ్రైస్ బిర్యానీనే తింటుదట. తన చివరి భోజనం తొందరగానే పూర్తి చేశానని ఒకవేళ షూటింగ ఉంటే 10 గంటల కల్లా పూర్తి చేస్తానని చెబుతోంది. ఇంతకుమునుపు చిలగడదుంప, పరాఠా వద్దకు వెళ్లేదాన్నికాదని, నో కార్బ్సో డైట్ను పాటించేదాన్ని అని తెలిపింది. అయితే ఇప్పుడు కార్బోహైడ్రేట్లు పెంచడం ప్రారంభించినట్లు వెల్లడించింది జాన్వీ కపూర్. గ్లామర్ పీల్డ్లో రాణించాలంటే ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే కష్టమే కదూ..!.(చదవండి: కోచింగ్ లేకుండానే నీట్లో 720కి 720 మార్కులు..!) -
కోచింగ్ లేకుండానే నీట్లో 720కి 720 మార్కులు..!
చాలామంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో కోచింగ్లు తీసుకుని చదువుతుంటారు. అయినా కూడా అనుకున్న ర్యాంకు సాధించలేక చతికిల పడుతుంటారు. తల్లిందండ్రులకు ఆర్థిక భారాన్ని కలిగిస్తున్నామనే బాధ ఓ పక్క, చదవలేక మరోవైపు నానాఇబ్బందులు పడుతుంటారు కొందరు విద్యార్థులు. అలాంటి వాళ్లకు ఈ కుర్రాడే స్ఫూర్తి. ఎలాంటి కోచింగ్ లేకుండానే నూటికి నూరు శాతం మార్చులు తెచ్చుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సక్సెస్ అంటే ఇది అని చూపించాడు.ఆ కుర్రాడే బీహార్లోని మధుబనిలోని ఆంధ్రాతర్హి గ్రామానికి చెందిన తథాగత్ అవతార్. అతడు నీట్ పరీక్షలో 720/720 మార్కుల స్కోరు సాధించాడు. అతడి విజయ ప్రస్థానం అంత ఈజీగా సాగలేదు. అతడు కూడా అందరిలానే తొలి ప్రయత్నంలో కాస్త ఇబ్బంది పడ్డాడు కానీ 611 మార్కులు సాధించాడు. అయితే మంచి కాలేజ్లో ఎంబీబీఎస్ చేయాలన్న కోరికతో మరోసారి ప్రయత్నించాడు. ఈసారి మరింత కష్టపడి చదివాడు. అతడి కృషి ఫలించి నీట్ 2024లో మంచి మార్కులు సాధించి టాప్ ర్యాంకు తెచ్చుకున్న ఇతర అభ్యర్థుల సరసన నిలిచాడు. అయితే నీట్ యూజీ తాత్కాలికి సమాధాన కీ ఆధారంగా తొలుత 715 మార్కులు స్కోర్ చేయగా, జూన్ 4న విడుదల చేసిన సవరించిన కీ ఆధారంగా అతని స్కోరు 720 రావడం జరిగింది. ఆల్ ఇండియా ప్రథమ ర్యాంకులో నిలచాడు. అతను ఇప్పుడు ఢిల్లీ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఈయర్ చదువుతున్నాడు.కుటుంబ నేపథ్యం..తథాగత్ విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చాడు. అతని తల్లి కవితా నారాయణ్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు, తండ్రి మిడిల్ స్కూల్లో టీచర్. తల్లి తరుఫు తాత అశోక్ చౌదరి మధుబనిలోని జూనియర్ కళాశాల లైబ్రేరియన్. అతని తాత ఇప్పటికీ తన పూర్వీకుల గ్రామమైన గెహుమాబెరియాలో నివశిస్తున్నారు. కానీ తథాగత్, అతని కుటుంబం ప్రస్తుతం అతని తాత గ్రామమైన ఆంధ్రతార్హిలో నివసిస్తున్నారు.గ్రామంలోనే ఉండి నీట్కి ప్రిపేరయ్యాడు..తథాగత్ తన గ్రామంలోనే ప్రిపరేషన్ కొనసాగించాడు. ఆన్లైన్ తరగతులకు హాజరవ్వుతూ ప్రిపేరయ్యాడు. అతడు చిన్ననాటి నుంచే స్వతహాగా తెలివైన విద్యార్థి అని తల్లిదండ్రులు, బంధువులు చెబుతున్నారు. అతడు ఇంతలా మంచి మార్కుల తెచ్చుకున్నందుకు తమకెంతో గర్వంగా ఉందని అతడి కుటుంబం చెబుతోంది. ఎయిమ్స్లో చదవాలనేది తన జీవితకాల కల అని అందుకే ఇంతలా కష్టపడ్డానని, తన కృషి ఫలించిందని ఆనందంగా చెబుతున్నాడు తథాగత్. అయితే భారతదేశంలో ఉన్న వైద్యుల కొరత, ఆర్థిక పరిమితులు దృష్ట్యా ఎంతమంది విద్యార్థులు డాక్టర్ చదువు అభ్యసించలేక ఇబ్బందులు పడుతున్నారో చూస్తే బాధనిపించిందని, అదే తనకు డాక్టర్ అయ్యేందుకు ప్రేరణనిచ్చిందని అన్నాడు. ముందుకు ఖర్చు గురించి విద్యార్థులు చింతించకుండా మంచి ర్యాంకు తెచ్చుకోవడంపై దృష్టిపెడితే తక్కువ ఖర్చుతోనే మంచి ప్రభుత్వ కళాశాలల్లో చదువుకోగలుగుతారని తథాగత్ చెబుతున్నాడు. ఈ విధంగా మరింతమంది అర్హులైన విద్యార్థులు నైపుణ్యం కలిగిన వైద్యులుగా మారి దేశానికి సేవ చేస్తారని చెబుతున్నాడు తథాగత్.(చదవండి: కొడుకు అనారోగ్యం ఆ అమ్మను వ్యాపారవేత్తగా మార్చింది..! ఏడాదికి రూ. 9 లక్షలు) -
ఆ పరీక్షే నాకు ఆనందాన్నిస్తోంది..!
ప్రవచనాలు చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే పాఠశాలలో లేదా కళాశాలలో ఏమీ తెలియని వారికి, చిన్న వాళ్లకీ పాఠాలు బోధించడం చాలా సులువు. కానీ అన్నీ తెలిసిన వారికి, పెద్దవారికి ప్రవచనాలు చెప్పడం అంటే కత్తిమీద సామే. అది మహిళా ప్రవచనకారులకు మరీ పరీక్ష. అయినా సరే, ఆ పరీక్షే తనకు ఆనందాన్నిస్తోందంటున్నారు దుర్భాకుల హేమ... అది ఆమె మాటల్లోనే...ప్రవచనాలు చెప్పడం మామూలు విషయం కాదు. ఎందుకంటే పాఠశాలలో లేదా కళాశాలలో ఏమీ తెలియని వారికి, చిన్న వాళ్లకీ పాఠాలు బోధించడం చాలా సులువు. కానీ అన్నీ తెలిసిన వారికి, పెద్దవారికి ప్రవచనాలు చెప్పడం అంటే కత్తిమీద సామే. అది మహిళా ప్రవచనకారులకు మరీ పరీక్ష. అయినా సరే, ఆ పరీక్షే తనకు ఆనందాన్నిస్తోందంటున్నారు దుర్భాకుల హేమ... అది ఆమె మాటల్లోనే...నా పూర్వజన్మ సుకృతంప్రతిసారీ ప్రవచనం చెప్పడం నాకొక గొప్ప పరీక్ష. ఆ పరీక్షే నాకు చాలా అనందాన్నిచ్చేది. విస్తృతంగా గ్రంథ పఠనం చేయడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం, ఆవళింపు చేసుకున్న విషయాన్ని సభాముఖంగా సుస్పష్టంగా వివరిస్తూ శ్రోతలకు ఆనందం కలిగించడం ప్రవచనకారిణిగా నా ప్రథమ కర్తవ్యంగా భావించాను. ఎంతోమంది ప్రఖ్యాత ప్రవచనకారుల ఉపన్యాస వైదుద్యాన్ని తెలుసుకోవడం కోసం వీలున్నప్పుడల్లా వారి ఉపన్యాసాలు వినేదాన్ని. ఇంకొక విషయం, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు లభించిన ప్రవచన వేదికలన్నీ చాలా శక్తివంతమైనవి. ఎన్నో దేవాలయ ప్రాంగణాలు, ఎన్నో ధార్మిక సంస్థల వారి వేదికలు, మరెన్నో ప్రాచుర్యం వహించిన ఆధ్యాత్మిక స్థలాలు నాకు చేయూతనిచ్చాయి. కాలం మారింది. నేడు ఎందరో యువతీయువకులు ఆధ్యాత్మిక రంగం పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. నా ప్రవచనం పూర్తయ్యాక నా దగ్గరకు వచ్చి ‘‘అమ్మా! మీరు చెబుతున్న విషయాలు బాగున్నాయి. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఏ ఏ పుస్తకాలు చదవాలి ? ఏ ఏ గ్రంథాలయాలలో పుస్తకాలు కోసం వెదకాలి. అని అడుగుతుంటే మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. నాకు సాధ్యమైనంతవరకు వారికి తగిన మార్గాన్ని సూచిస్తుంటాను. – డాక్టర్ దుర్భాకుల హేమ -
అభయమిచ్చే వీర హనుమానుడు..!
ఆసియా ఖండంలో అతి ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహం 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన కొలువై ఉంది. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆంజినీపుత్రుడిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల 65వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన ప్రకృతి నడుమ అభయాంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామి వారిని విశాలమైన ్ర΄ాంగణంలో జాతీయ రహదారి పక్కన 2003వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. వర్షాకాల నేపథ్యంలో చుట్టూ పచ్చని పొలాల మధ్య అభయమిచ్చే వాయుపుత్రుని చూసేందుకు నిత్యం భక్తులు వచ్చి వెళ్లుతుంటారు. జాతీయ రహదారి పక్కన పరిటాల సమీపంలో ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ధర్మకర్త బోడేపూడి వెంకటేశ్వరరావు 28 ఏప్రిల్ 2001లో శంకుస్థాపన చేశారు. నాలుగున్నర ఎకరాల్లో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంజినీ పుత్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఆలయ ్ర΄ాంగణంలో ప్రతిరోజు హనుమాన్చాలీసా పారాయణం చేశారు. విగ్రహం ఏర్పాటు చేసే నాటికి 1.35 లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది.అతి ఎత్తయిన విగ్రహం...ఆసియా ఖండంలో అతి ఎత్తయిన ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం పరిటాల గ్రామ సమీపంలో పాదపీఠంతో కలుపుకుని 150 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన విజయవాడకు 28 కిలోమీటర్ల దూరంలో ఈ విగ్రహం వుంది. ప్రతి ఏటా నిత్యం ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతుండేది. ఆలయంలో ఒకపక్క స్వామి వారికి భక్తిపారవశ్యంతో భజన కీర్తనలు, మరో పక్క హనుమాన్ చాలీసా, ఇంకోపక్క అన్నసమారాధనతో ఆలయ ప్రాంగణం భక్తులతో విరాజిల్లుతుంటుంది.పర్యాటక కేంద్రంగా పరిటాల ఆలయం...కంచికచర్ల మండలంలోని పరిటాల జాతీయ రహదారి పక్కన కొలువై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. అభయాంజనేయస్వామి విగ్రహానికి పూజలు చేసేందుకు భక్తులు బస్సులు, కార్లు ఇతర వాహనాల ద్వారా వస్తుంటారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి నిత్యం వందల సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు.హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి విశేష పూజలు చేస్తుంటారు. ఆలయ ధర్మకర్త వెంకటేశ్వరరావు భారీగా అన్న సమారాధన చేస్తుంటారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో బాలాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో రామాలయం, క్షేత్ర ΄ాలకురాలయిన రేణుకాంబ అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి. ఆలయంలో నిత్యం హనుమాన్ చాలీసా మహాన్యాస పూర్వక నీరాజన, అష్టోత్తర పూజలు జరుగుతుంటాయి. నిత్యం భక్తులచే ప్రత్యేక పూజలందుకుంటున్న అభయాంజనేయ స్వామిని ప్రజలు చూసి తరించాల్సిందే.– శ్రీనివాస శర్మ, ప్రధాన అర్చకులు, పరిటాల – బొక్కా ప్రభాకర్, సాక్షి, కంచకచర్ల (ఎన్టీఆర్ జిల్లా)(చదవండి: మహిమాన్విత క్షేత్రం.. ఓంకారం! ఏకంగా 13 రకాల వంటకాలతో..) -
టైప్ 2 డయాబెటిస్కి మొక్కల ఆధారిత ఔషధం..!
దేశంలో ఎక్కువ మంది టైప్2డయాబెటిస్(Type2Diabetes)తోనే బాధపడుతున్నారు. గణాంకాలు సైతం ఆ వ్యాధి బాధితులు ఏటా వేలల్లో ఉంటున్నట్లు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వాడుతున్న మందులన్నీ ఈ వ్యాధిని అదుపులో ఉంచుతాయే తప్ప. పూర్తిగా నివారించలేవు. ఆ దిశగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కొంత పురోగతిని సాధించారు. తాజా అధ్యయనంలో టైప్2 డయాబెటిస్కి చెక్పెట్టే సరికొత్త ఔషధాన్ని తయారు చేశారు. ఇది రెండో దశ క్లినికల్ ట్రయల్స్లో సత్ఫలితాలనందించి, డయాబెటిస్ రోగుల్లో కొత్త ఆశను రేకెత్తించింది. మరీ ఆ ఔషధం విశేషాలేంటో చూద్దామా..!.బెర్బెరిన్ అనేది వివిధ మొక్కలలో సహజంగా లభించే ఆల్కలాయిడ్. దీన్ని సాంప్రదాయ చైనీస్లో జీర్ణ సమస్యలు, వాపు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వాళ్లు దీన్ని శతాబ్దాలుగా వివిధ రకాల చికిత్సకు ఉపయోగిస్తన్నారు. దాంతోనే టైప్2డయాబెటిస్ ఔషధాన్ని తయారు చేశారు చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ పీపుల్స్ హాస్పిటల్ పరిశోధకులు. మొక్కల్లో లభించే బెర్బెరిన్ ఉత్పన్నం అయినబెర్బెరిన్ ఉర్సోడియోక్సికోలేట్ ఔషధాన్ని తయారు చేశారు. ఇక టైప్ 2 డయాబెటిస్ అనేది ఇన్సులిన్ నిరోధకత వల్ల సంభవిస్తుంది, ఇక్కడ శరీరం ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్కు సరిగా స్పందించదు. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ అమాంతం పెరుగుతుంది. అయితే దీనికి కేవలం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థాయికి తగ్గించే మందులు వాడుతూ..ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడమే మార్గం. నిజానికి ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స చేయడానికి బెర్బెరిన్ ఉర్సోడియోక్సికోలేట్, లేదా HTD1801ని కనుగొన్నారు. అయితే ఫేస్ 2 ట్రయల్స్లో ఊహించని విధంగా టైప్ 2 డయాబెటిస్ని కూడా సమర్థవంతంగా ప్రభావితం చేసి గణనీయంగా తగ్గించింది. అంతేగాదు ఆ అధ్యయనంలో ఇది కాలేయ కొవ్వు శాతంతోపాటు రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణను గణనీయంగా మెరుగుపరిచిందని పరిశోధకులు గుర్తించారు. ఇక్కడ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ లేదా HbA1c అనేది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కొలిచే మార్కర్. అయితే ఆ ట్రయల్స్లో ఆహారం, వ్యాయామంతో తగినంతగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గని ఈ టైప్2 డయాబెటిస్ రోగుల్లో మాత్రం గణనీయమైన ప్రభావం చూపింది. వారిలో ఈ HTD1801 ఔషధం ప్రభావాన్ని అంచనా వేయగా..కొందరికి దీన్ని 500 మిల్లీ గ్రాములన చొప్పున రోజుకు రెండుసార్లు ఇచ్చారు. అలా తీసుకున్న వాళ్లలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. వారందరిలో HbA1c అనేది చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రోజుకు 500 మిల్లీగ్రాముల చొప్పున తీసుకున్నవాళ్లలో ఈ HbA1c 0.7% తగ్గింపు కనిపించింది. ఇక రోజుకు రెండు సార్లు చొప్పున మొత్తం 1000 మిల్లిగ్రాముల మోతాదులో ఔషధం తీసుకున్నవారిలో HbA1c లో 1.0% తగ్గింపు కనిపించింది. అంటే ఈ ఔషధం మోతాదు ఆధారిత మెరుగుదలను గుర్తించారు పరిశోధకులు. అంతేగాదు ఈ HTD1801 ఔషధం లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ (LDL-C, 'చెడు' రక్తం) స్థాయిలు, వాపు, హృదయనాళ ప్రమాదాలను గణనీయంగా తగ్గించింది. అలాగే ఈ పరిశోధనలో పాల్గొన్న రోగులెవరు బరువు పెరగలేదు కూడా. ఈ ఔషధంతో చికిత్స సురక్షితమైనది రోగులు ఈ మందు ప్రభావాన్ని తట్టుకోగలుగుతున్నారు. పైగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. దీన్ని కేవలం టైప్ 2 డయాబెటిస్కి మాత్రమే కాకుండా ఇతర చికిత్సలకు కూడా వినయోగించొచ్చని వెల్లడించారు. ఇక ఈ ట్రయల్స్కి ఔషధం HTD1801 తయారీదారులైన షెన్జెన్ హైటైడ్ బయోఫార్మాస్యూటికల్ లిమిటెడ్ నిధులు సమకూర్చింది. ఈపరిశోధన జామా నెట్వర్క్ జర్నల్లో ప్రచురితమైంది. (చదవండి: 'మష్రూమ్ చట్నీ పౌడర్': పోషకాలు పుష్కలం ఆరోగ్యం కూడా..!) -
'మష్రూమ్ చట్నీ పౌడర్': పోషకాలు పుష్కలం ఆరోగ్యం కూడా..!
బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించిన ముఖ్యమైన సాంకేతికతల్లో ఒకటి ‘అర్క మష్రూమ్ చట్నీ పౌడర్’ టెక్నాలజీ. పుట్టగొడుగులకు విలువ జోడించటం ద్వారా వాటిలో పోషక విలువలను అనేక విధాలుగా ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. సంప్రదాయం, పౌష్టికత, రుచిల మేలు కలయికకు మష్రూమ్ చట్నీ పౌడర్ టెక్నాలజీ నిదర్శనంగా నిలుస్తుంది. తాజా పుట్టగొడుగులు ఎన్నో రోజులు నిల్వ ఉండవు, పైగా మార్కెట్ ధర ఎక్కువ. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండవు. అందుకని వీటిత పొడులు తయారు చేసే టెక్నాలజీని ఐఐహెచ్ఆర్ రూపొందించింది. ఎండు పుట్టగొడుగులతో రకరకాలుగా చట్నీ పొడులను తయారు చేసుకోవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతవాసులు రోజువారీ భోజనంలో సులభంగా వాడుకునే విధంగా పోషకాలు నష్టపోని రీతిలో పొడులు తయారు చేయవచ్చు. సంప్రదాయ రుచులకు తగినట్టుగా 7 రకాల పుట్టగొడుగుల చట్నీ పొడులను రూపొందించారు. బ్రహ్మీ, మునగ ఆకులు, అవిశ గింజలు, నువ్వులు, వేరుశనగలు, కొబ్బరి వంటి వాటితో వీటిని వేర్వేరుగా రూపొందించారు. మన వంటకాల్లో కలిపి ఈ పొడులను వాడుకోవచ్చు. స్కూళ్లలో మధ్యాహ్నభోజనం, సైన్యానికి భోజనాల్లో సైతం వాడుకోదగినవని ఐఐహెచ్ఆర్ పేర్కొంది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ పొడులను తయారు చేసి ఎయిర్ టైట్ కంటెయినర్లలో/ పౌచ్లలో నింపుకొని (26–28 డిగ్రీల సెల్షియస్) సాధారణ ఉష్ణోగ్రత ఉండే చోట నిల్వ చేసుకుంటే 3 నెలల పాటు వాడుకోవచ్చు. ఈ పొడులను తయారు చేసి విక్రయించడం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలు, సైనిక వితంతువులు, వికలాంగులు.. ఉపాధి పొందవచ్చని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఈ టెక్నాలజీ పూర్తి వివరాలకు.. 080–23086100 – ఎక్స్టెన్షన్ 348, 349 mushroomiihr@gmail.com(చదవండి: -
మహిళలు అలాంటి డైట్ని పాటించకండి! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల యువత స్మార్ట్గా, నాజుగ్గా ఉండటానికి ఇష్టపడుతోంది. అలా ఉండేందు కోసం వ్యాయామాల, కసరత్తులంటూ తెగ కష్టపడుతున్నారు. మరికొందరూ కఠినమైన డైట్ల పేరుతో నోరు కట్టేస్తుకుంటున్నారు. ఎలాగైన హీరోయిన్ మాదిరిగా స్లిమ్గా ఉండాలన్నదే అందరి ఆరాటం. ఏ మాత్రం కొద్దిగా బరువు పెరిగినా..ఏదో జరగకూడనిది జరిగినట్లుగా ఫీలవ్వుతున్నారు. అంతలా చిన్నా, పెద్దా..తమ బాడీపై శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ఆ క్రమంలో ఫాలో అయ్యే డైట్లు ఒక్కోసారి బరువు తగ్గడం ఎలా ఉన్నా..పలు ఆరోగ్య సమస్యలు తెచ్చు పెడుతున్నాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక్కడ అలానే ఒక మహిళ స్లిమ్గా ఉండాలని అనుసరించిన డైట్ ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టిందో చూస్తే షాకవ్వుతారు. అంతేకాదండోయ్ వైద్యులు మహిళలందర్నీ అలాంటి డైట్ ఫాలో కావద్దని హెచ్చరిస్తున్నారు కూడా. అదెంటో చూద్దామా..శరీరంలో కొవ్వుని తగ్గించి శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచేందుకు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడంపై ఆధారపడతారు. ఆ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. అంటే ఇక్కడ మాంసాహారంతో కూడిన డైట్కి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఈ డైట్లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, చిక్కుళ్లు, నెట్స్ మినహాయించి మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, సముద్ర ఆహారం, చేపలు, పాల ఉత్పత్తులు, నీటిని మాత్రమే తీసుకుంటారు. నిజానికి దీన్ని"జీరో కార్బ్" అని పిలుస్తారు. ఈ డైట్లో కార్బోహైడేట్స్ అనేవి ఉండవు. అయితే ఇది మహిళ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్ కరణ్ రాజన్ అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేసి మరీ వివరించారు. ఇలా మాంసాహారంతో కూడిన డైట్ మహిళలకు పనికిరాదని చెప్పారుమహిళలు మాంసాహారం ఎందుకు తీసుకోకూడదంటే..డాక్టర్ కరణ్ షేర్చేసిన వీడియోలో ఒక మహిళ ఎనిమిది వారాలపాటు మాంసాహారమే తీసుకునే డైట్ని పాటించినట్లు వెల్లడించి. ఆమె ఆ వీడియోలో తాను ఎమనిది వారాల పాటు మాంసాహారమే తీసుకున్నట్లు చెబుతుంది. దీంతో ఆమె కొవ్వుని కోల్పోయి కొన్ని రకాల ఆరోగ్య సమస్యల బారినపడినట్లు చెబుతోంది. ముఖ్యంగా ఆమెకు పీరియడ్స్ ఆగిపోవడం జరిగిపోతుంది. అంటే పీసీఓఎస్ సమస్యలు వచ్చాయి. మొటిమలు తీవ్రమయ్యాయి. మాంసాహారం అధికంగా తీసుకుంటే మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఉండదు అది మొత్తం ప్రత్యుత్పత్తి వ్యవస్థనే తీవ్రంగా ప్రభావితం చేస్తుందట. అదెలాగంటే..మొక్కల ఆధారిత ఆహారం జీవక్రియను ప్రభావితం చేసి శరీరంలోని వేస్ట్ని బయటకు పంపేస్తుంది.చెప్పాంటే డంపింగ్ పనిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ కాలేయం ఈస్ట్రోజెన్ను గట్లోకి పంపిస్తుంది. అయితే ఆహారంలో ఫైబర్ లేని కారణంగా దాన్ని బంధించి బయటకు పంపిచే అవకాశం లేకపోతుంది. దీంతో ప్రేగులే ఈస్ట్రోజన్ని తిరిగి గ్రహిస్తాయి. దీంతో ఈ జీవక్రియ సమస్య కాస్త చర్మంపై దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అధిక ఈస్ట్రోజన్ చర్మ సమస్యలు, హర్మోన్ల అసమతుల్యతకు దారితీసి మొటిమలకు కారణమవుతుందని అన్నారు. అంతేగాదు దీనితోపాటు మూడ్ స్వింగ్స్, ఆందోళన, మెదడు పనిచేయకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు డాక్టర్ కరణ్. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి మాంసాహారం డైట్ సైడ్ఎఫెక్ట్స్ ఇవ్వకపోవచ్చు. కానీ చాలామటుకు ఇది సరిపడదని తేల్చి చెప్పారు. హర్మోన్ల అసమతుల్యతకు, గట్ ఆరోగ్యానికి ప్రతిబంధకాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ డైట్ మానవ శరీరాన్ని జడత్వంగా మార్చేస్తుందని, చురుకుదనం ఉండదని పలువురు వైద్యులు చెబుతున్నారు. (చదవండి: పప్పు ధాన్యాలు తీసుకోకపోతే శరీరంలో సంభవించే మార్పులు ఇవే..!) -
పప్పుధాన్యాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే..!
పప్పుధాన్యాలు పోషకాల గనులు. ఇవి తీసుకోకపోయినా..లేక అవి లేకపోతే పర్యావరణ పరంగానే కాదు మానువుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడిపోతుంది. అవి తీసుకోకపోతే జీవనమే అస్తవ్యస్తంగా అయిపోతుంది. మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్తో కూడిన పోషక కేంద్రాలివి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకి మద్దతిస్తాయి. అలాగే స్థిరమైన వ్యవసాయానికి కీలకం ఇవి. పోషకాహారంలో వాటి పాత్ర అపారమైనది. అవి లేకుండా జీవనం అంటే.. ఊహకే అందని విషయం. ఇవి మానవ ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దామా..ప్రోటీన్లు కోల్పోతాం.పప్పుధాన్యాలు తీసుకోకపోతే కండరాల నష్టం, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. శాకాహారులు మాంసకృత్తుల కోసం ప్రత్యామ్నాయంగా వాడే పప్పుధాన్యాలతో ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఈ పప్పుధాన్యాలు తీసుకోకపోతే గుండెకు ఆరోగ్యకరమైన ప్రోటీన్లను కోల్పోతాం. హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వీటిని పూర్తిగా తీసుకోవడం మానేస్తే ప్రోటీన్ కొరత ఏర్పడి కీళ్ల సమస్యలు అధికమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.ఫైబర్లు అందవు: జీర్ణక్రియ, గట్ సమస్యలు మొదలవుతాయి. మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, గట్ సంబంధిత సమస్యలు అధికమవ్వుతాయి. కొలొరెక్టల్ కేన్సర్, టైప్ 2 డయాబెటిస్ , హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. నిజానికి పప్పుధాన్యాల్లో ఉండే ఫైబర్లు గట్ ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తాయి. అలాంటిది వాటిని అస్సలు తీసుకోకపోవడమంటే.. ఆరోగ్యాన్ని కోల్పోవడంతో సమానమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.ఐరన్ లోపం:పప్పుధాన్యాల్లో ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి ఉంటాయి. ఎప్పుడైతే వీటిని తీసుకోమో అప్పటి నుంచి శరీరంలో రక్తహీనత వంటి సమస్యలు అధికమవుతాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా సులభంగా వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐరన్, ఫోలేట్లు రక్తహీనతను నివారించగా, మెగ్నీషియం, పొటాషియ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. జింక్ రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.పర్యావరణానికి కూడా నష్టమే..ఈ పప్పుధాన్యాలు మానవులకు మాత్రమే కాదు పర్యావరణానికి కూడా మంచివి. వాటి నత్రజని-స్థిరీకరణ సామర్థ్యం నేలను సారవంతంగా ఉంచుతుంది. వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తుంది. ఇతర పంటలతో పోలిస్తే ఈ పప్పుధాన్యాల పంటలకు తక్కువ నీరు చాలు. అంతేగాదు రైతులు వనరులు అధికంగా అవసరమయ్యే పంటలు, జంతువుల పెంపకంపై ఆధారపడవలసి వస్తుంది. దీని వల్ల అధిక నీరు వినియోగం కోసం భూమిపై అధిక ఒత్తిడి తెస్తుంది. ఫలితంగా ఆహార ఉత్పత్తి తగ్గుతుంది పర్యావరణ నష్టం మరింత పెరుగుతుంది.చెడు ఆహారపు అవాట్లు ఎక్కువ అవుతాయి..ఎప్పుడైతే పప్పుధాన్యాలు లేవో అప్పుడు ప్రజలు అనారోగ్యకరమైన ఆహారపదార్థాలకు ఎడిక్ట్ అవుతారు. ఇవి రుచికరంగా ఉన్నా..ఆరోగ్యానికి అంతగా మంచివి కావు. ఎప్పుడైతే ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం మొదలవుతుందో పోషకాహారం లోపం ఏర్పడి వివిధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా ఎక్కవ అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రక్తంలో చక్కెర అధికమవుతుంది:డయాబెటిస్ ప్రమాదం పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ పప్పుధాన్యాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)ని కలిగి ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి కీలకమైన ఆహారంగా మారుతాయి. డయాబెటిస్ రోగులు పప్పుధాన్యాలు తీసుకోకపోవడం వల్ల చక్కెరను అదుపులో ఉంచే మార్గాన్ని కోల్పోవడం జరగుతుంది. జీవక్రియ రుగ్మతలు, బరువు పెరగడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి.చూడటానికి చిన్నగా ఉండే ఈ పప్పుధాన్యాలు శక్తిమంతమైనవి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచడం లేదా దరిచేరనీయవు. ఇవి మానవ ఆరోగ్యాన్ని కాపాడి, ఆకలిని నియంత్రించే అద్భుతమైన పోషకాలని కలగి ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి లేని ప్రపంచమంటే అనారోగ్యకరమైన జీవనం లేదా ప్రాణాపాయకరమైన జీవనంగా పేర్కొనవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఆరోగ్యకరమైన హైడ్రేటెడ్ చర్మ కోసం తప్పక తీసుకోవాల్సిన ఆహారాలివే..! -
ముడతలు లేని ఆరోగ్యకరమైన చర్మం కోసం..!
చర్మం గరుకుగా పొడిబారినట్లుగా అయిపోయి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తున్నాయా..?. అందుకోసం చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ఆధారపడటానికి బదులుగా తీసుకునే ఆహారంపై శ్రద్ధ చూపితే మేలు అని చెబుతున్నారు చర్మ నిపుణులు. మొక్కల ఆధారిత ఆహారాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలతో నిండి ఉంటాయని పలు పరిశోధనల్లో నిరూపితమైంది కూడా. వీటిలో చర్మానికి కావాల్సిన విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, చర్మంపై వచ్చే మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు చర్మం ఆకృతికి, ఆర్థ్రీకరణను ప్రోత్సహించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. మరీ అందుకోసం తీసుకోవాల్సిన సూపర్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఏంటో చూద్దామా..!.జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెక్స్ 2022లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం..నిర్దిష్ట పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్ళు , పాలీఫెనాల్ అధికంగా ఉండే పానీయాలు తదితరాలు మెరుగ్గా ఉండే ఆరోగ్యకరమైన చర్మంలో కీలకపాత్ర పోషిస్తాయని తేలింది. ఈ ఆహారాలు యవ్వనంతో నిగనిగలాడే చర్మాన్ని అందిస్తాయని పరిశోధన వెల్లడించింది. మరి యవ్వన చర్మానికి దోహదపడే మొక్కల ఆధారిత ఆహారాలు ఏవంటే..నారింజ: ఇది విటమిన్ 'సీ'కి అద్భుతమైన మూలం. ఇది కొల్లాజెన్ సంశ్లేషణ, చర్మం మరమత్తులో కీలకపాత్ర పోషిస్తుంది. ముదురుఎరుపు రంగు కండ కలిగిన బ్లడ్ ఆరెంజ్లతో మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. సుమారు 20 నుంచి 27 ఏళ్ల వయసు గల యువత 21 రోజుల పాటు ప్రతిరోజూ 600 ఎంఎల్ బ్లడ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల డీఎన్ఏ నష్టం తగ్గడం తోపాటు విటమిన్ సీ, కెరోటినాయిడ్ల స్థాయిలు పెరిగినట్లు పరిశోధనలో వెల్లడైంది.టమోటాలు..దీనిలో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మానికి శక్తిమంతమైన యాంటీ ఆక్సీడెంట్లను అందిస్తుంది. పెద్దలు ప్రతిరోజు ఆలివ్నూనె తోపాటు 55 గ్రాముల టమోటా పేస్ట్ తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు గణనీయంగా తగగుతాయని పరిశోధనలో తేలింది. దీనిలో చర్మ నష్టం నుంచి రక్షించే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు సూర్యరశ్మి, కాలుష్యం, పర్యావరణ ఒత్తిళ నుంచి చర్మాన్ని రక్షించడంలో టమోటాలు సమర్థవంతంగా ఉంటాయని అన్నారు.బాదంపప్పుబాదంపపపులో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు(ఎంయూఎఫ్ఏ), విటమిన్ ఈ, పాలీఫైనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మరక్షణకు దోహదం చేస్తాయి. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు 16 వారాల పాటు మొత్తం రోజువారీ కేలరీల్లో 20% బాదంపప్పులు తీసుకోవడంతో గణనీయమైన మార్పులు కనిపించాయని అన్నారు. సోయబీన్స్..దీనిలో ఐసోఫ్లేవోన్లుగా పిలిచే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఈస్ట్రోజెన్తో సమానమైన నిర్మాణాలను కలిగి ఉంటాయి. రుతువిరతి సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం తోపాటు చర్మం పొడిబారడం, గాయలయ్యే అవకాశాలు ఎక్కుగా ఉంటాయట. ఎప్పుడైతే సోయాబీన్ తీసుకోవడం మొదలుపెడతామో..అప్పటినుంచి చర్మ స్థితిస్థాపకతలో మంచి మార్పుల తోపాటు ఆర్థ్రీకరణ పెరిగి గీతలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కోకోకోకోలో ఫ్లేవనోల్స్ నిండి ఉన్నాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. పరిశోధనలో 24 వారాలపాటు ఓ వృద్ధ మహిళ ప్రతిరోజూ కోకో పానీయం తీసుకోవడంతో ఆమె చర్మంలో ముడతలు, గరుకుదనం తగ్గి యవ్వనపు కాంతి సంతరించుకుందని శాస్తవేత్తలు చెబుతున్నారు. అందువల్ల పోషకాలు అధికంగా ఉండే ఈ మొక్కల ఆధారిత ఆహారాలను డైట్లో చేర్చుకోవడం వల్ల చర్మ ఆర్థ్రీకరణ, స్థితిపాకత తోపాటు మొత్తం రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యకరమైన యవ్వన చర్మాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా ఉంటాయని చెబుతున్నారు చర్మ నిపుణులు. (చదవండి: మహిళల రక్షణకు ఉపకరించే చట్టాలివే..) -
లాలస: స్త్రీలందరికీ ఆమె ఆదర్శమా? అనుసరణీయమా?
గాఢంగా చీకట్లు కమ్మిన ఒక రాత్రి– ఆకాశాన్ని చీలుస్తూ ఒక మెరుపు మెరుస్తుంది... మనల్ని, మన పరిసరాలనీ మన కళ్ళకే చూపించి మాయమై పోతుంది. ఆ మెరుపును మన ఇంటి దీపంలాగా గోడకు వేలాడదీసుకుందామంటే కుదరదు. కుదిరి నా భరించటానికి ఆ ఇంటికి శక్తి చాలదు. ఆ క్షణకాలపు వెలుగులో ఏం చూడగలరో, పరిసరాలను ఎంత చక్కదిద్దుకోగలరో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. సరిగ్గా ఆ మెరుపులాంటిదే లాలస! చలం రాసిన ‘జీవితాదర్శం’లో నాయిక. లాలస నాకు నచ్చింది అని చెప్పిన వాళ్ళకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి– స్త్రీలందరికీ ఆమె ఆదర్శమా? అనుసరణీయమా? ఆ దారిలో నడవటం ఆడవాళ్ళకు క్షేమమా? అంటూ. అన్నిటికీ జవాబు ఒకటే– కాదు. మరెందుకు మాట్లాడుకోవాలి లాలస గురించి? స్త్రీ పురుష సంబంధాలు– అధికారం వల్లనో, అవసరాల కోసమో సాగేవిగా ఉండరాదని, అవి హృదయగతమైన సంబంధాలుగా ఉండాలని చెప్పినందుకు, వాటిలో కపటమూ మోసమూ చోటు చేసుకున్నప్పుడు ఎంత బలమైన నిర్మాణమైనా లోలోపల గుల్లబారి కూలిపోక తప్పదని చెప్పటానికి తనను తానొక ప్రయోగశాలగా మార్చుకున్నందుకు లాలస గురించి మాట్లాడుకోవాలి.లాలస నమ్మి, ఆచరించిన ‘హృదయవాదం’ అతి ప్రమాదకరమైనది. ఉనికిలో వున్న ఏ ఆదర్శ నమూనాలోనూ అది ఇమడదు. ‘నీతిమంతమైన’ ఏ నిర్మాణమూ దాన్ని భరించదు. నిజానికి లాలస పేచీ పడింది నీతితోనూ, ఆదర్శాలతోనూ కానేకాదు. ‘నీతి చాలా గొప్ప విషయమూ, అవసరమైన విషయమూ’ అని గౌరవించే లాలస ఆ నీతులూ, ఆదర్శాలూ హృదయం లోంచి పుట్టే సహజ ప్రేరణలుగా కాకుండా ఉత్తి రిచువల్స్గా తయారవటాన్ని అసహ్యించుకుంటుంది. స్త్రీలను సమానులుగా మనస్ఫూర్తిగా గుర్తించకుండా, అలా ఉన్నట్టుగా కనబడే వ్యక్తులకు సామాజిక గౌరవం ఉన్నందుకే ఆలా నడుచుకునే హి΄ోక్రటిక్ ఆదర్శ జీవులను ఆమె నిలదీస్తుంది. అయితే ఇలా విమర్శించినంత మాత్రాన తానొక ఆదర్శ వ్యక్తిననే భ్రమలు ఆమెకేమీ లేవు. ‘నువ్వు నాకు ఆదర్శమైన పురుషుడివి కావు... ఆదర్శమైన స్త్రీ కూడా లేదు. కానీ, నేనొకతె ను ఉన్నానని నమ్ముతున్నావు, దురదృష్టవంతుడివి కనుక’ అని తను పెళ్ళాడబోతున్న వ్యక్తితో నిస్సంకోచంగా చెప్పగలదు లాలస. ఆదర్శవంతమైన మనుషులు, అత్యంత కఠినమైన స్వీయ ప్రయత్నంతో రూపొందగలరే తప్ప, సామాజిక నిర్బంధంతో కాదని ఆమె నమ్మకం. ఆ ప్రయత్నంలో ఎగుడు దిగుళ్ళూ, తప్పటడుగులూ ఉండి తీరుతాయి. ఏ విలువల ప్రాతిపదికన బయల్దేరుతామో వాటిని కోల్పోయే స్థితికి దిగజారే ప్రమాదమూ ఎదురు కావచ్చు. వీటన్నిటికీ సిద్ధపడి, ఒక విలువను ప్రతిపాదించగల స్థాయికి చేరిన వ్యక్తి లాలస. జనసామాన్యాన్ని కూడగట్టి నడిపించటానికీ, ఆచరణాత్మకమైన నిర్మాణాలను రూపొందించటానికీ పనికొచ్చే నాయకులు కాదు లాలస వంటి వ్యక్తులు. చదవండి: కనపడని నాలుగో సింహం..!ఆ పనుల కోసం రూపొందాయని చెప్పే మార్గాలు మూఢనమ్మకాలుగా మారిపోకుండానూ, ఆ నిర్మాణాలు గిడసబారి పోకుండానూ హెచ్చరించే అనుభవాల ప్రయోగశాలలు వీళ్ళు. మార్పు కొరకు జరిగే ప్రతి ఉద్యమమూ మానవీయమైన సహజ చర్యగా సాగాలని, ఆదర్శాలన్నవి మనుషుల వ్యక్తిత్వాల్లో అసంకల్పితంగా భాగమై పోయేంత సహజ స్పందనలుగా మారాలనీ కలలుగనే మానవులు. అలాంటి కలలు గన్న పాత్రగా లాలస పాఠకులకు నచ్చుతుంది.- కాత్యాయని -
కనపడని నాలుగో సింహం..!
సినిమాల్లో ‘శుభం’ కార్డు పడే సమయంలో ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అంటూ ఇన్స్పెక్టర్ పరుగెత్తుకు వచ్చి నేరస్థుడికి అలవోకగా సంకెళ్లు వేస్తాడు. అయితే నిజజీవితంలో అలా కాదు. నేరస్థుడిని పట్టుకోవడానికి లక్ష సవాళ్లు ఎదురవుతాయి. అలా అని నేరస్థుడిని పట్టుకోవడంలో ఆలస్యం జరగకూడదు. ‘నేరస్థుడిని త్వరగా పట్టుకోవాలి’ అనే తొందరపాటు కూడా ఉండకూడదు. ‘99 మంది దోషులు చట్టం నుంచి తప్పించుకున్నా... ఒక్క అమాయకుడు శిక్షకు గురి కాకూడదు’ అనే మాట ఉండనే ఉంది! క్రైమ్ సీన్ సవాలు విసురుతుంది. ఎవరైతే ఆ సవాలును స్వీకరించి, తమ తెలివితేటలు, శక్తిసామర్థ్యాలకు పదును పెట్టి, ఏ పుట్టలో ఏ పాము ఉందో కనిపెట్టి నిందితుడిని కటకటాల వెనక్కి తీసుకువెళతారో... వారే క్రైమ్సీన్ ఆఫీసర్లు. క్లూస్టీమ్లో భాగంగా పనిచేసే క్రైమ్సీన్ ఆఫీసర్లు (సీఎస్ఓ) నేరం జరిగిన వెంటనే ఘటనాస్థలికి వెళ్లి అణువణువూ అధ్యయనం చేసి, దర్యాప్తు అధికారులుగా ఉండే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి అవసరమైన ఆధారాలు అందిస్తారు. హైదరాబాద్ క్లూస్టీమ్లో మొత్తం 43 మంది సీఎస్ఓలు ఉండగా వీరిలో ఆరుగురే మహిళలు. పోలీసులు మనకు కనిపించే మూడు సింహాలైతే... ఈ ‘సీఎస్ఓ’లు కంటికి కనిపించని నాలుగో సింహం. ‘క్లూ’లు అందించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుడిబోయిన ఇందిర, దానం ఎలిజబెత్లు ఎన్నో ముఖ్యమైన కేసుల దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు... హైదరాబాద్లోని నేరేడ్మెట్ (Neredmet) ప్రాంతానికి చెందిన గుడిబోయిన ఇందిర 2015 నుంచి హైదరాబాద్ (Hyderabad) క్లూస్ టీమ్లో సీఎస్ఓగా పని చేస్తోంది. తన పదేళ్ల సర్వీసులో ఎన్నో నేరస్థలాలకు వెళ్లి కీలక ఆధారాలు సేకరించి కేసు చిక్కు ముడి వీడడంలో కీలక పాత్ర పోషించింది. ఆ కేసులలో కొన్ని...నిందితుడు... ఇదిగో... ఈ ఇంట్లోనే!హైదరాబాద్లోని మెట్టుగూడ (Mettuguda) నల్లపోచమ్మ ఆలయం దగ్గర నివసించే రేణుక పెద్ద కుమారుడు యశ్వంత్ మౌలాలీలోని రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పని చేసి మానేశాడు. ఫిబ్రవరి ఆరోతేదీన కొంతమంది దుండగులు తమ ఇంట్లోకి చొరబడ్డారని, తల్లితోపాటు తనపై కత్తితో దాడి చేశారని యశ్వంత్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఈ హత్యాయత్నం కేసు సంచలనం సృష్టించింది. విధి నిర్వహణలో భాగంగా సీఎస్ఓ ఇందిర యశ్వంత్ ఇంటికి వెళ్లింది. ఘటనాస్థలిలో ఉన్న పరిస్థితులతోపాటు ఆ ఇంటి పరిసరాలను అధ్యయనం చేసింది. రేణుక ఒంటిపై ఉన్న కత్తిపోట్లు ఎదుటివాళ్లే పొడిచినట్లు ఉన్నప్పటికీ యశ్వంత్ గాయాలపై అనుమానం వచ్చింది. దీనికితోడు వారి ఇంటికి బయటనుంచి గడియపెట్టి ఉందనే విషయం తెలుసుకున్న ఇందిర మరింత లోతుగా ఆరా తీసింది. ఈ నేరంలో మూడో వారి ప్రమేయం లేదంటూ పోలీసులకు నివేదించింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా యశ్వంతే నిందితుడని తేలింది. కుటుంబ కలహాలు, పెళ్లి కావట్లేదనే బాధతో డిప్రెషన్ కు గురైన యశ్వంత్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లికి కత్తిపోట్లు పడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన యశ్వంత్ తనపై కేసు కాకుండా ఉండటానికి ‘ఎవరో మాపై హత్యాయత్నం చేశారు’ అంటూ నాటకం ఆడాడు. కుమారుడిని జైలుకు పంపడం ఇష్టంలేక పోలీసులను తప్పుదోవ పట్టించింది రేణుక. చివరకు ఇందిర చొరవతో కేసు కొలిక్కివచ్చి యశ్వంత్పై హత్యాయత్నం కేసు నమోదైంది.స్క్రూ డ్రైవర్ ముక్కే... పక్కాగా పట్టించింది!నాలుగేళ్ల క్రితం బేగంపేటలో ఒక ఇంట్లో చోరీ జరిగింది. నేరస్థలిని సందర్శించిన ఇందిర అక్కడ విరిగిన స్క్రూడ్రైవర్ ముక్కను గుర్తించింది. బాధితులు పక్కింటివారిపై అనుమానం వ్యక్తం చేయడంతో వారింట్లో సోదాలు చేశారు. అక్కడ మిగిలిన స్క్రూ డ్రైవర్ దొరకడంతో వారే నిందితులుగా తేలి కేసు కొలిక్కివచ్చింది.సూసైడ్ నోట్ కనిపెట్టి... అతడి ఆట కట్టించిందికుటుంబ కలహాల నేపథ్యంలో గత వారం వారాసిగూడ ప్రాంతంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె భర్త కూడా ఇంట్లోనే ఉండటంతో ఇది హత్యగా అనుమానించారు. ఘటనాస్థలికి వెళ్లిన ఇందిర మృతురాలి శరీరంతోపాటు ఆమె వస్త్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సూసైడ్ నోట్ వెలికి తీసింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపుల కేసు భర్తపై నమోదైంది. తట్టిఅన్నారంలోని జీవీఆర్ కాలనీకి చెందిన దానం ఎలిజబెత్ 2015 నుంచి హైదరాబాద్ క్లూస్ టీమ్లో సీఎస్ఓగా పని చేస్తోంది. ఇప్పటి వరకు అనేక కేసుల దర్యాప్తులో కీలకంగా మారిన ఆధారాలను సేకరించి అందించింది. గత ఏడాది చివరలో హబీబ్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ‘గుండెపోటు మరణం’ ఎలిజెబెత్ అందించిన ఆధారాలతోనే హత్యగా తేలింది.డస్ట్బిన్లో దాగిన రహస్యంకురుమబస్తీకి చెందిన రేణుక ఇంటి అరుగుపై ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుండెపోటు వచ్చి ఉంటుందని, తమ అరుగుపై పడుకుని ప్రాణాలు విడిచి ఉంటాడని రేణుక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న హబీబ్నగర్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మృతుడు ఏ బ్యాట్రీలేన్కు చెందిన ఖాలేద్గా గుర్తించారు. రేణుక ఇంట్లోనూ సోదాలు చేయాలని పోలీసులు క్లూస్ టీమ్ను కోరారు. ఎలిజబెత్ అక్కడకు వెళ్లి రేణుక ఇంటిలో అణువణువూ పరిశీలించింది. రేణుక మంచం పైన కనిపించిన కొన్ని వెంట్రుకలు ఖాలేద్ వెంట్రుకలతో సరిపోలాయి. రేణుక వంటగదిలో ఉన్న డస్ట్బిన్లో ఓ కొత్త కాటన్ టవల్ పడి ఉండటం ఎలిజబెత్ దృష్టిలో పడింది. కొత్త టవల్ డస్ట్బిన్లో ఉండటం, అదీ కిచెన్లోది కావడంతో అనుమానించింది. ఆ టవల్ తడిగా ఉండటంతోపాటు కొన్ని రకాలైన మరకలు ఉన్నట్లు కనిపెట్టింది. వీటి ఆధారంగా రేణుక హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం అందించింది ఎలిజబెత్. దీంతో అధికారులు రేణుకను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనుకోకుండా హత్య చేశానని, తన సోదరుడు వెంకటేష్ సాయంతో మృతదేహాన్ని ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చి అరుగుపై పడుకోబెట్టానని రేణుక ఒప్పుకుంది. చదవండి: 'ఇ-నాలుక' రుచిని కోల్పోయిన వాళ్లకు వరం..!రేణుక–ఖాలేద్ల మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆరోజు రేణుక ఇంటికి వెళ్లిన ఖాలేద్ తన కోరిక తీర్చమని కోరగా ఆమె అంగీకరించలేదు. ఆ సమయంలో జరిగిన గొడవలో బెడ్పై పడిన ఖాలేద్ నోరు, ముక్కు టవల్తో మూసేసి హత్య చేసింది. రేణుకతోపాటు ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
'ఇ-నాలుక'..రుచిని కోల్పోయిన వాళ్లకు వరం..!
సాంకేతిక సాయంతో ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలతో సవాళ్లకు సమాధానమిస్తుంటారు శాస్త్రవేత్తలు. అలానే తాజాగా పరిశోధకులు సరికొత్త ప్రయోగంతో ఓ గొప్ప ఆవిష్కరణకు నాంది పలికారు. ఇంతవరకు జ్ఞానేంద్రియాలకు సంబంధించి క్లిష్టతరమైన ప్రయోగాల్లో ఎదురవ్వుతున్న సమస్యకు చెక్పెట్టేలా ముందడుగు శారు. ఈసారి ఏకంగా రుచిని గుర్తించే ఇ-నాలుక(E-Tongue)ను అభివృద్ధి చేశారు. రుచిని కోల్పోయిన వ్యక్తులకు ఈ ఆవిష్కరణ ఒక వరంగా ఉంటుందని చెబుతున్నారు కూడా. మరీ ఆ ఆవిష్కరణ విశేషాలేంటో చూద్దామా..!.యిజెన్ జియా నేతృత్వంలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇ-టేస్ట్(E-Tongue) అనే నాలుక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆహార నమూనాలను విశ్లేషించడం తోపాటు రుచులను పాక్షికంగా గుర్తించలేనివారికి ఇది ఉపయోగాపడేలా రూపొందించారు. ఈ సాంకేతికత ప్రాథమిక అభిరుచికి అనుగుణంగా ఐదు కీలక రుచులను సులభంగా గుర్తిస్తుంది. సోడియం క్లోరైడ్ (ఉప్పు), సిట్రిక్ ఆమ్లం (పుల్లని), గ్లూకోజ్ (తీపి), మెగ్నీషియం క్లోరైడ్ (చేదు), గ్లూటామేట్ (ఉమామి). ఈ ఐదు రుచులు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరి ఉండేవే అని పరిశోధకుడు జియా చెబుతున్నారు. ఈ సరికొత్త ఎలక్ట్రానిక్ నాలుక ఇ టంగ్ కేక్, ఫిష్ సూప్ వంటి రుచులను గుర్తించగలదు. అయితే వాసనను ప్రభావితం చేసే రుచిని మాత్రం గుర్తించలేదు. ఇది ఇంకా వాసన ఆధారంగా రుచిని ఐడెంటిఫై చేయలేదని పరిశోధకులు తెలిపారు. ఎలా వర్క్ చేస్తుందంటే..ఆహారంలో రుచి భాగాల సాంద్రత గుర్తించడానికి ఇ-టేస్ట్ సెన్సార్లను ఉపయోగిస్తుంది. డేటాను డిజిటల్ సిగ్నల్లుగా మారుస్తుంది. ఒక పంపు సాయంతో ఒక వ్యక్తి నాలుక కింద ఉన్న గొట్టం ద్వారా ఫ్లేవర్డ్ హైడ్రోజెల్లను కచ్చితమైన మొత్తంలో పంపిణీ చేస్తుంది. ముందుగా ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి మొదట ఇది రుచులను ఎలా పునరుత్పత్తి చేస్తుందో అంచనా వేశారు. ఆ తర్వాత పది మంది వ్యక్తుల్లో దీని సామర్థ్యాన్ని పరీక్షించగా.. కృత్రిమ రుచి ఒరిజనల్ రుచికి సమానంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత నిమ్మరసం, కేక్, వేయించిన గుడ్డు, చేపల సూప్, కాఫీతో సహా సంక్లిష్ట రుచులను గుర్తించగలదో లేదో అని పరీక్షించారు. అయితే పరిశోధకులు ఆహారం ఫ్లేవర్ కంటే దాని రుచే ప్రధానమని చెబుతున్నారు. వాసన, రంగువంటి ఇంద్రియ అంశాలు ఆహారాన్నిఎలా గ్రహిస్తామనే దానిపై కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఎందుకంటే ముక్కు, కళ్లు మూసుకుంటే స్ట్రాబెర్రీలు పుల్లగా అనిపిస్తాయట, అదే చూసి తింటే వాటి ఎరుపుదనం వల్ల తీపిదనంతో కూడిన అనుభూతి కలుగుతుందట. అందువల్ల తాము రూపొందించిన ఈ ఇ టేస్ట్ పులుపు, తీపి వంటి రుచులను చూడగలిగినా..మానవ నాలుకలా రుచిని పూర్తిగి ఆస్వాదింప చేయలేదని వెల్లడించారు పరిశోధకులు.(చదవండి: పనిప్రదేశాల్లో పాలివ్వడాన్ని అవమానంగా చూడొద్దు: సుప్రీం కోర్టు) -
పనిప్రదేశాల్లో పాలివ్వడం తప్పేమి కాదు: సుప్రీం కోర్టు
పనిప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వడం తప్పేమి కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను త్యజించాలని స్పష్టం చేసింది. పాలిచ్చే తల్లలుకు తమ బిడ్డ సంరక్షణలో అది భాగమని, దాన్ని అందరూ గౌరవించాలని పేర్కొంది. అది వారి హక్కు కూడా కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో, పనిప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని తప్పుపట్టొద్దని ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాలు, భవనాల్లో చైల్డ్ కేర్ గదుల ఏర్పాటకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సలహాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను/కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ దాఖలైన పిటిషన్పై జస్టిస్లు బి.వి. నాగరత్న, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. అంతేగాదు ఇలా బహిరంగ ప్రదేశాల్లోనూ, పనిప్రదేశాల్లోనూ తల్లిపాలివ్వడాన్ని అవమానకరంగా చూస్తే..మహిళలు అనవసరమైన ఒత్తిడి లేదా బెదిరింపులకు గురవ్వుతారంటూ యూఎన్ నివేదికను వెల్లడించింది. అలాగే తల్లిపాలిచ్చే హక్కుని గురించి కూడా నొక్కి చెప్పింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అంతర్జాతీయ చట్టంలో పొందుపరిచిన పిల్లల ప్రయోజనాలు, అనే ప్రాథమిక సూత్రం, 2015 జువైనల్ జస్టిస్(పిల్లల సంరక్షణ )చట్టంల నుంచి ఈ హక్కు ఉద్భవించిందని ధర్మాసనం తెలిపింది. అంటే అందుకు తగిన సౌకర్యాలు, వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత రాష్ట్రలపై ఉందని దీని అర్థం అని కూడా స్పష్టం చేసింది. ఈ విషయంలో ఫిబ్రవరి 27, 2024న కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి ప్రభుత్వ భవనాల్లో ఫీడింగ్ గదులు, క్రెచ్లు వంటి వాటి కోసం స్థలాలు కేటాయించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ ఆదేశించిన సలహాను ధర్మాసనం పరిగణలోకి తీసుకుని ఇలా తీర్పుని వెల్లడించింది. అంతేగాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(3) కింద ఉన్న ప్రాథమిక హక్కులకు అనుగుణంగా కేంద్రం సలహా ఉందని కూడా పేర్కొంది ధర్మాసనం. ఇది తల్లలు గోప్యత, శివువుల ప్రయోజనార్థం సూచించన సలహాగా పేర్కొంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్య తీసుకుంటే తల్లి బిడ్డల గోప్యతకు భంగం వాటిల్లకుండా చేయడం సులభతరమవుతుందని తెలిపింది. అందువల్ల, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఆర్డర్ కాపీతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శి/నిర్వాహకుడికి రిమైండర్ కమ్యూనికేషన్ రూపంలో పైన పేర్కొన్న సలహాను చేర్చాలని సూచించింది. తద్వారా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం జారీ చేసిన ఈ సలహాలను పాటిస్తాయిని పేర్కొంది ధర్మాసనం. దీంతోపాటు ప్రస్తుత ప్రజా ప్రదేశాలలో సాధ్యమైనంతవరకు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పైన పేర్కొన్న ఆదేశాలు అమలులోకి వచ్చేలా చూసుకోవాలని కూడా పేర్కొంది. అలాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సలహాలు తెలియజేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరింది ధర్మాసనం. (చదవండి: జాతీయ భద్రతా దినోత్సవం: భద్రంగా ఉంటున్నామా..?) -
National Safety Day 2025: భద్రంగానే ఉంటున్నామా..?
మన దేశంలో జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఏటా మార్చి 4న నిర్వహిస్తారు. పర్యావరణం, కార్యాలయ భద్రత, ఆరోగ్య, నియమాలు, ట్రాఫిక్ నియమాలు, మానవ ఆరోగ్య విషయాలతో సహా అన్ని రకాల భద్రతా నిబంధనల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది భారతదేశం (India) 54వ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రతి ఏడాది ఓ థీమ్తో దీన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోంది. అలానే ఈ ఏడాది విక్షిత్ భారత్ భద్రత, సంక్షేమం కీలకం అనే థీమ్తో ప్రజలను చైతన్యపరిచేలా అవగాహన కల్పించనుంది. ఈ సందర్భంగా మన దేశంలోని భద్రత ఏ విధంగా ఉందో చూద్దాం. నిజంగా మహిళలు, పిల్లలు భద్రంగా ఉంటున్నారా..?. మనమంత సేఫ్టీకి చేరువలో ఉన్నామా..? అంటే..మన దేశంలో భద్రత అనే పదమే భారంగా కనిపిస్తుంది. ఎందుకంటే జరుగుతున్న ఘోరాలు, నేరాలు చూస్తుంటే సేఫ్టీకి చోటుందా అనే సందేహం కలుగకమానదు. మన భారతీయ సంస్కృతి స్త్రీని యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని కీర్తిస్తూ సముచిత స్థానాన్ని ఇచ్చింది. మన వేదాలు, పురాణాలు కూడా స్త్రీకి పెద్దపీట వేసి మరీ గౌరవించాయి. అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే హృదయ ద్రవించిపోతోంది. గొప్ప నాగరికులం, ఏఐ టెక్నాలజీతో పరుగులు పెట్టే కాలంలో ఉన్నామంటూ భుజాలు ఎగరేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ మన సమాజంలో చిన్నారులు, మహిళలు ఎంతటి అభ్రతా పరిస్థితుత్లో జీవిస్తున్నారో చూస్తే ఇదేనా అభివృద్ధి అనే భావం కలుగుతుంది. ప్రతి ఏడాది జాతీయ భద్రతా దినోత్సవం (National Safety Day) పేరుతో వారోత్సవాలు నిర్వహించుకుంటూ చేతులు దులిపేస్తుకుంటున్నాం. అసలు మన చుట్టుపక్కల ఉన్న బాలికలు, అభంశుభం తెలియని పసి పిల్లలు హింసకు, లైగింక వేధిపులకు గురవ్వుత్ను ఘటనలు మీడియాలోనూ, పేపర్లో వస్తున్నా..ఆ..! ఇది కామన్ అన్నట్లు తేలిగ్గా తీసుకుంటున్నాం. మన పిల్లలు సేఫ్గా ఉన్నారు కదా అన్న ధీమా కొందరిది. నిజానికి ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023/24లో 177 దేశాల సరసన భారత్ 128కి పడిపోయింది. అంటే మన దేశంలో మహిళలకు భద్రత అనే మాటకు ఆస్కారం లేదనే కదా అర్థం. మహిళలు, చిన్నారులపై జరిగిన ఘటనలు చూస్తే..ప్రేమోన్మాదుల చేతిలో బలైన అమ్మాయిలు..ముఖ్యంగా అమ్మాయిల వెంటపడి వేధిస్తున్న ప్రేమోన్మాదులు ఎంతకైనా తెగిస్తున్నారు. పెళ్లికి ఒప్పుకోవడం లేదన్న కోపంతో నిరుడు హైదరాబాద్లోని గోపన్నపల్లిలో యువతి ప్రాణం తీశాడొక దుర్మార్గుడు. ఏపీలోని బద్వేలులోనూ గతేడాది ఒక ఇంటర్ విద్యార్థిని అలాగే బలైపోయింది. ప్రేమను నిరాకరించిందని బాపట్ల జిల్లాలో ఒక ప్రబుద్ధుడు ఇటీవల బాలికతో పాటు ఆమె కుటుంబంపై కత్తితో దాడిచేశాడు. అదే కారణంతో తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒక సైకో మరీ పైశాచికంగా ప్రవర్తించాడు. యువతి నోట్లో యాసిడ్ పోసి, కత్తితో పొడిచి ఉసురు తీసేందుకు యత్నించాడు. ఇలా ప్రేమోన్మాదుల చేతుల్లో రోజూ ఎందరో అమాయక చిట్టి తల్లులు బలైపోతున్నారు. కరడుగట్టిన పితృస్వామ్య భావజాలమే దేశీయంగా మహిళా సాధికారతకు ప్రధాన ప్రతిబంధకమవుతోందనేది కొందరి నిపుణుల వాదన. సర్కారీ లెక్కల ప్రకారం 2014లో ఇండియాలో మహిళలపై నేరాలకు సంబంధించి 3.37 లక్షల కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్లలో అవి 31శాతం మేర ఎగబాకాయి. నిపుణులు చెబుతున్న కారణాలు..ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అశ్లీల చిత్రాలు, వీడియోలకు తోడు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం, మాదకద్రవ్యాల వినియోగంతో మనుషుల్లో పశుప్రవృత్తి కోరలు చాస్తోందంటున్నారు నిపుణులు. ఆడ పిల్లల్ని వేధించడాన్ని, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడాన్ని హీరోయిజంగా చూపిస్తున్న సినిమాలు, వెబ్సీరిస్ యువతను దారితప్పిస్తున్నాయని చెబుతున్నారు.స్త్రీలను ఆటబొమ్మలుగా చిత్రీకరించే పెడపోకడలు పెరిగిపోతుండటంతో పనిప్రదేశాలూ బహిరంగ స్థలాలు.. ఇలా అన్నిచోట్లా మహిళల భద్రత ప్రశ్నార్థకమవుతోందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ అమ్మాయిలపై రోత వ్యాఖ్యల వెల్లువెత్తుతూనే ఉంటున్నాయని చెబుతున్నారు. అలాగే నవతరం నైతిక విద్యకు దూరమవుతున్న కొద్దీ దేశ భవిష్యత్తుపై చీకట్లు ముసురుతాయని హెచ్చరిస్తున్నారు. పాఠశాల దశ నుంచి పసి మనసులు కలుషిత కాకుండా కేర్ తీసుకోవాలని చెబుతున్నారు. తెలిసో తెలియకో లేదా పురుషాధిక్య ఆలోచనలతోనో ఇళ్లలో అబ్బాయిలను అతిగా ముద్దు చేసే ధోరణులు లింగ వివక్షను పెంచి పోషిస్తున్నాయి. మహిళల పురోగతికి అవే గొడ్డలిపెట్టు అవుతున్నాయి. తల్లిదండ్రుల మద్దతుతో ఎందరో అమ్మాయిలు నేడు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలనూ వెన్నుతట్టి ముందుకు నడిపించే అలాంటి వాతావరణం ప్రతి కుటుంబంలోనూ నెలకొనాలని అంటున్నారు నిపుణులు. భద్రతకు భరోసా ఇచ్చేలా జీవిద్దాం..ప్రతి తల్లి కూడా తమ కొడుకు అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే కప్పి పుచ్చే యత్నం చేయకుండా దండించడమో లేదా శిక్షించడమో చేసి మార్పు తెవాలే గాని మగాడని వెనకేసుకొచ్చే యత్నం చేయకూడదు. అలాగే పోలీసులు మహిళలపై జరిగే అమానుష ఘటనలపై సత్వరమే స్పందించి వారికి తగిన న్యాయం జరిగేలా మద్దతిస్తే..బాలికలు, మహిళల భద్రతకు ఢోకా ఉండదని చెబుతున్నారు సామాజిక నిపుణులు. సేఫ్టీ దినోత్సవం పేరుతో ఐక్యతతో ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొందాం అంటూ మాటలు కాదు..అలాంటి ఘోరాలు జరిగినప్పుడూ గొంతెత్తి నినదిద్దాం. ఆ తప్పు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు పూనుకునేలా చేద్దాం. మహిళల, బాలికలకు భద్రత అనే మాటకు అసలైన అర్థం ఇచ్చేలా భరోసా కల్పిద్దాం. చదవండి: వయసుతో ముసిరే సమస్యలు.. -
వయసుతో ముసిరే సమస్యలు..!
చాలా సమస్యలు స్త్రీ, పురుషులిద్దరిలోనూ కామన్గానే ఉన్నా... కొన్ని సమస్యలు మాత్రం మహిళల్లో చాలా ప్రత్యేకం. వాళ్లలో స్రవించే హార్మోన్లూ, సంక్లిష్టమైన సైకిళ్ల వల్ల వాళ్లకు కొన్ని సమస్యలిలా ప్రత్యేకంగా వస్తుంటాయి. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలూ, పరిష్కారాలను సూచించే ఈ ప్రత్యేక కథనమిది...రుతుస్రావం మొదలుకాగానే ఓ బాలిక బాలుర నుంచి వేరుగా కనిపించడం మొదలువుతుంది.రుతుస్రావం నుంచే అమ్మాయిల్లో కొన్ని సమస్యలు కనిపించడం మొదలువుతుంది. చాలామంది అమ్మాయిలు ఇంకా ఈ విషయమై మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇందులో బిడియపడాల్సిందేమీ లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించి తగిన సూచనలతోపాటు అవసరమైతే తగిన వైద్య చికిత్స కూడా తీసుకోవాలి.తొలుత యువతల్లో కనిపించే రుతుసంబంధమైన సమస్యలను తెలుసుకుందాం.రుతుసంబంధిత సమస్యలను ఇంగ్లిష్లో మెన్స్ట్రువల్ డిజార్డర్స్గా చెబుతారు. వీటిల్లో కొన్ని ప్రధాన సమస్యలిలా ఉంటాయి. ప్రైమరీ అమెనోరియా : సాధారణంగా అమ్మాయిల్లో 12 నుంచి 16 ఏళ్ల మధ్య రుతుస్రావం మొదలువుతుంది. కానీ కొందరు యువతుల్లో 16 ఏళ్లు దాటినా రుతుక్రమం మొదలుకాదు. ఈ కండిషన్ను ‘ప్రైమరీ అమెనోరియా’ అంటారు. ఇందుకు చాలా కారణాలుంటాయి. వీళ్లు డాక్టర్ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, కారణాలు తెలుసుకోవాలి. ఆ కారణాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. డిస్మెనూరియా: రుతుసంబంధిత సమస్యల్లో ప్రధానమైనదీ, దాదాపు 80 శాతం మంది అమ్మాయిల్లో కనిపించేది రుతు సమయాల్లో నొప్పి. దీన్నే ‘డిస్మెనూరియా’ అంటారు. వీళ్లు ఒకసారి డాక్టర్ను సంప్రదించాక, వారి సలహాతో రుతుసమయంలో నొప్పి వచ్చినప్పుడల్లా వారు సూచించిన మోతాదులో నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల మరికొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి డాక్టర్ సూచించిన మోతాదుకు మించకుండా వాడాలి. పరిష్కారం : రుతు సమయంలో వచ్చే ఈ నొప్పి ఒక వయసుకు వచ్చాక చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. ఇలాంటివారికి డాక్టర్లు కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్లు కూడా సూచిస్తారు. సంతానం కలిగిన తర్వాత చాలామందిలో ఈ నొప్పి రావడం ఆగిపోతుంది. కొందరిలో నొప్పి రావడం ఆగకపోవచ్చు. వాళ్లు డాక్టర్ను సంప్రదించి, తగిన మందులు వాడాలి. మెనొరేజియా: కొంతమంది యువతుల్లో రుతు సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుంటుంది. ప్రధానంగా చిన్న వయసు (తరుణ వయస్కులైన అడాలసెంట్) బాలికల్లో అలాగే పాతిక ముఫ్ఫై ఏళ్లు వరకు యువతుల్లోనూ ఈ సమస్య కాస్త ఎక్కువే. ఇలా ఎక్కువ మోతాదులో రక్తం పోతుండటం వల్ల రక్తహీనతతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పరీక్షలూ, పరిష్కారం: ఈ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు కొన్ని హార్మోనుల పరీక్షలు చేయించుకొని, అవసరాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఈ రక్తస్రావం ఫైబ్రాయిడ్స్ వల్ల కావచ్చు. వైద్యపరీక్షల ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. ప్రి మెనుస్ట్రువల్ సిండ్రోమ్ : కొంతమంది మహిళల్లో రుతుస్రావం మొదలు కావడానికి కొద్ది రోజులు ముందర నుంచే కొన్ని శారీరక సమస్యలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు... ఆ సమయంలో వాళ్లకు రొమ్ముల్లో సలపరం, బాధ /నొప్పి, భావోద్వేగాలు వెంటవెంటనే మారి΄ోవడం (మూడ్స్ స్వింగ్స్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యను ప్రీ–మెనుస్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. పరిష్కారం : ఈ సమయంలో కలిగే బాధల నివారణ కోసం తగినన్ని నీళ్లు తాగుతుండాలి. అలాగే ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలతో కూడిన పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఒత్తిడికి లోనుకాకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై, మంచి ఉపశమనం కలగజేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు పొగతాగడం, కెఫిన్ డ్రింక్స్ (కాఫీ, కూల్డ్రింక్స్లో కోలా డ్రింక్స్ వంటివి), ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్కు దూరంగా ఉండాలి. కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అప్పటికీ ప్రయోజనం కనిపించక΄ోతే డాక్టర్ను సంప్రదించి, కొన్ని హార్మోన్ పరీక్షలు చేయించుకుని, ఆ వైద్య పరీక్షల ఫలితాలను బట్టి అవసరమైన చికిత్స తీసుకోవాలి. మూత్ర సంబంధ సమస్యలుమహిళల శరీర నిర్మాణం కారణంగా పురుషులతో ΄ోలిస్తే... మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువ. మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్స్తో తరచూ వస్తుండేవారు నీళ్లూ, ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, ప్రతి మూడు గంటలకోసారి మూత్రవిసర్జనకు వెళ్లి, మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ అయ్యేలా జాగ్రత్త తీసుకోవడం, భార్యాభర్త కలయిక తర్వాత మూత్ర విసర్జనకు వెళ్లడం (ఈ సమయంలో కాస్త వేగంగా మూత్రవిసర్జన చేయాలి), ప్రైవేటు పార్ట్స్ శుభ్రంగా కడుక్కోవడం, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చు. యూరినరీ ఇన్కాంటినెన్స్: కొందరు మహిళల్లో మూత్రంపై నియంత్రణ అంతగా ఉండదు. ఈ సమస్య ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, ఏదైనా వస్తువును అకస్మాత్తుగా ఎత్తినా, కొందరిలో నవ్వినా వారి పొట్టపై కండరాలు మూత్రాశయంపై ఒత్తిడి కలిగించి... మూత్రం చుక్కలు, చుక్కలుగా పడేలా చేస్తాయి. సాధారణంగా ప్రసవం తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రసవమైన తర్వాత మహిళల పొట్ట కండరాలు బలహీనం కావడంతో మూత్ర విసర్జన స్ఫింక్టర్పై వారు నియంత్రణ కోల్పోయేందుకు అవకాశమెక్కువ. దాంతో ఈ సమస్య కనిపిస్తుంది. పరిష్కారాలు: డాక్టర్ను సంప్రదించి, వారు సూచించిన విధంగా కొన్ని ప్రసవానంతర వ్యాయామాలూ, కెగెల్స్ ఎక్సర్సైజ్ల ద్వారా మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించవచ్చు లేదా వారు సూచించిన విధంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది కొందరిలో శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. మహిళల్లో కనిపించే కొన్ని సాధారణ గైనిక్ సమస్యలు..పీసీఓఎస్ / పీసీఓడీ : అండాశయంలో అనేక నీటితిత్తులు పెరిగే ఈ సమస్యను వైద్యపరిభాషలో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లేదా డిజార్డర్ అంటారు. చాలావరకు అవి హానికరం కాకపోవచ్చు. అలాగే గర్భధారణకూ పెద్దగా అంతరాయం కలిగించకపోవచ్చు. పీసీఓఎస్ / పీసీఓడీకి కారణాలు : మహిళల అండాశయం నుంచి ప్రతి నెలా ఒక ఫాలికిల్ (అండం పెరిగే నీటి తిత్తి) కనిపిస్తుంది. దీని పరిమాణం 18 నుంచి 20 మిల్లీమీటర్లకు చేరాక ఇది పగిలి దాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే కొంతమందిలో ఫాలికిల్స్ 5–10 మిల్లీమీటర్లకు చేరగానే అంతకు మించి అది పెరగకుండా చిన్న చిన్న నీటి బుడగలాగా పెరుగుతాయి. అవి పది, పన్నెండు కంటే ఎక్కువగా ఉన్న కండిషన్ను పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇవి ఏర్పడానికి స్పష్టమైన కారణం తెలియదుగానీ... మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, కొన్ని మానసిక, శారీరక సమస్యలతో పాటు హార్లోన్లలో అసమతౌల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇవి వస్తుండటం పరిశోధకులు గమనించారు. ఈ సమస్య ఉన్న మహిళల్లో బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సక్రమంగా లేకపోవడంతో పాటు కొంతమందిలో సంతానలేమి, గర్భధారణ సమస్యలు కనిపించవచ్చు. పరీక్షలు/పరిష్కారాలు : కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలతో సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ సమస్య ఉన్న మహిళలందరికీ ఒకేలాంటి చికిత్స ఉండదు. వారిలో కనిపించే లక్షణాలు, రక్తపరీక్షలు తేలిన అంశాలను బట్టి చికిత్స మారుతుంది. బరువు తగ్గించుకోవడం, అవసరాన్ని బట్టి మెట్ఫార్మిన్ వంటి మందులు, హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఎండోమెట్రియాసిస్ : గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియమ్ అంటారు. రుతుస్రావం తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడంతో అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి 14 రోజులపాటు వృద్ధి చెంది, 15వ రోజున విడుదల అయ్యే ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ వల్ల ఆ పొర మరింత మందమవుతుంది. అక్కడ సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఓవరీస్లో విడుదలైన అండం శుక్రకణంతో కలవకపోతే 14 రోజుల తర్వాత ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర... గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. మహిళల్లో ప్రతినెలా అయ్యే రుతుస్రావం ఇదే. అయితే కొందరిలో ఎండోమెట్రియమ్ కణాలు గర్భాశయంలోపలి వైపునకు కాకుండా, కొన్ని కారణాల వల్ల కడుపులోకి వివిధ అవయవాలపైన అంటే... అండాశయాలపైనా, ట్యూబ్స్పై, గర్భాశయం పై పొరపై, కత్తికడుపులోని గోడలపై, పేగులపై, మూత్రాశయంపై, ఇంకా చాలా అరుదుగా ఊపిరితిత్తుల్లో, మెదడులోకి పెరుగుతాయి. హార్మోన్ల ప్రభావం వల్ల అవి రుతుచక్రంలో ఎలాంటి మార్పులు చెందుతాయో... బయట పెరిగిన ఆ కణాల్లోనూ అలాంటి మార్పులే జరుగుతూ అవి పెరిగిన చోట కూడా వృద్ధి చెందుతుంటాయి. వాటినే ఎండోమెట్రియల్ ఇంప్లాంట్స్ అంటారు. రుతుస్రావం సమయంలో ఆ అవయవాల్లో కూడా కొద్దిగా బ్లీడింగ్ అవుతుంటుంది. ఈ సమస్యనే ఎండోమెట్రియాసిస్ అంటారు. వివిధ అవయవాలపై ఉన్న ఎండోమెట్రియమ్ ఇంప్లాంట్స్లో రక్తస్రావం జరిగాక... అది బయటకు వెళ్లడానికి దారి లేక రక్తం అక్కడిక్కడే ఇంకిపోతుంది. అయితే కొందరిలో రక్తం ఇంకకుండా అది గూడు కట్టడం జరగవచ్చు. కొందరిలో ఒక అవయవానికి, మరో అవయవానికి మధ్య ఈ రక్తపు కణాలు గూడుకట్టడం వల్ల కండ పెరగడమూ జరగవచ్చు. ఇలా జరగడం వల్ల పెరిగిన కండను అడ్హెషన్స్ లేదా ఫైబ్రోసిస్ బ్యాండ్స్ అంటారు. అలా పెరిగిన కణజాలం నుంచి విడుదల అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్స్తోపాటు ఇతర రసాయన పదార్థాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో నడుం, పొత్తికడుపులో నొప్పి, సంతానం కలగకపోవడం, పేగులు అతుక్కు΄ోవడం, మూత్రనాళాలు, పేగుల్లో అడ్డంకులు ఏర్పడటం వంటి సమస్యలు రావచ్చు. పరిష్కారం : ఈ సమస్యకు ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ వంటి హార్మోన్ మాత్రలతో చికిత్స అందిస్తారు. కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు.చర్మ సమస్యలు..మహిళల్లో బిగుతైన వస్త్రధారణ కారణంగా వారిలో చర్మానికి సంబంధించిన కొన్ని సమస్యలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. అందులో ముఖ్యమైనవి... క్యాండిడియాసిస్ / ఫంగల్ ఇన్ఫెక్షన్స్: ఇది మహిళల్లో కనిపించే చాలా సాధారణ సమస్య. వాళ్లకు చెమట విపరీతంగా పట్టే ప్రదేశాల్లోనూ, అలాగే చర్మంలోని ముడతలుండే ప్రాంతాల్లో తగినంత గాలి, వెలుతురు సోకే అవకాశాలు తక్కువ. దాంతో అక్కడ ఉక్క΄ోతలతో చెమట తాలూకు చెమ్మ పెరగడంతో క్యాండిడియాసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశమెక్కువ. ఇక కొందరిలో వాళ్లు గర్భం దాల్చినప్పుడూ ఈ సమస్యలు కనిపించడం మామూలే. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలోనూ, రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడే వారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తరచూ కనిపిస్తుంటాయి. పరీక్షలు / పరిష్కారాలు: సాధారణ ఫిజికల్ ఎగ్జామినేషన్తోనే ఈ సమస్యను తెలుసుకోవచ్చు. చర్మంపై వచ్చిన ఫంగస్ తాలూకు రకాన్ని బట్టి కొన్ని చర్మంపై పూసేందుకు కొన్ని పూతమందులూ (టాపికల్ మెడిసిన్స్), నోటి ద్వారా తీసుకోవాల్సిన యాంటీఫంగల్ మందులు వాడాల్సి ఉంటుంది. ఎండోక్రైన్ సమస్యలు : ఇది హార్మోన్ల స్రావాల్లో వచ్చే తేడాల వల్ల వచ్చే సమస్యలు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు కనిపించేందుకు అవకాశాలెక్కువ. మొదటిది థైరాయిడ్ గ్రంథి చాలా తక్కువగా లేదా అస్సలు పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య అయిన హైపోథైరాయిడిజమ్.ఈ సమస్య స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినా సాధారణంగా మహిళల్లోనే కాస్త ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల హై΄ోథైరాయిడిజమ్ రావచ్చు. తీవ్రమైన అలసట / మందకొడిగా ఉండటం, డిప్రెషన్, బరువు పెరగడం, చర్మం పొడిగా మారడం, మలబద్దకం, రుతుక్రమం సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలతో ఇది కనిపిస్తుంది. కొందరిలో ఈ కండిషన్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగి అవి హృద్రోగాలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మైక్సిడిమా కోమా అన్న కండిషన్కు దారితీసి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. గర్భిణుల విషయంలో థైరాక్సిన్ మోతాదులు తగ్గుతున్నాయేమో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ పరీక్షలు చాలా అవసరం. గర్భిణుల్లో హై΄ోథైరాయిడిజం అన్నది బిడ్డ మానసిక వికాసానికి కొద్దిగా అంతరాయం కలిగించవచ్చు. అందుకే గర్భిణుల విషయంలో హైపోథైరాయిడిజమ్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. లెవో థైరాక్సిన్ సోడియమ్ వంటి మందుల ద్వారా దీనికి చికిత్స చేస్తారు. హైపర్ థైరాయిడిజమ్ : రక్తంలో థైరాయిడ్ హార్మోన్లు (టీ3, టీ4) పెరగడం వల్ల వచ్చే సమస్యను హైపర్ థైరాయిడిజమ్ లేదా థైరోటాక్సికోసిస్ అంటారు. దీని లక్షణాలన్నీ హైపోథైరాయిడిజమ్ లక్షణాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. గుండెదడ చేతులు వణకడం బరువు తగ్గిపోవడం ∙నీరసం ∙విరేచనాలు ∙ రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు థైరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్థైరాయిడిజమ్ను రక్త పరీక్ష ద్వారా గుర్తిస్తారు. ఈ పరీక్షలో రక్తంలో టీ3, టీ4 మోతాదు ఎక్కు కావడం, టీఎస్హెచ్ మోతాదు బాగా తగ్గి΄ోవడం కనిపిస్తుంది. దీనికి చికిత్సగా యాంటీ థైరాయిడ్ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. చాలామందిలో ఈ యాంటీథైరాయిడ్ మందులు ఆపిన తర్వాత మళ్లీ థైరాయిడ్ హార్మోన్ మోతాదులు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా యాంటీ థైరాయిడ్ మందుల ద్వారా హార్మోన్ని తగ్గించి, ఆ తర్వాత ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రెండు పద్థతులు అనుసరిస్తారు. మొదటి దానిలో రేడియో ఆక్టివ్ అయోడిన్ మందును ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్ తయారు చేసే కణాలను నాశనం చేయడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఇక రెండో పద్ధతిలో ఆపరేషన్ ద్వారా థైరాయిడ్ గ్రంథిని తొలగించడం ద్వారా హార్మోన్ స్రావాన్ని తగ్గిస్తారు. ఈ రెండు పద్ధతుల్లోనూ హార్మోన్ స్రావం బాగా తగ్గిపోయి, చివరకు హార్మోన్ లోపానికి దారితీస్తుంది. అప్పుడుహైపోథైరాయిడిజమ్లో మాదిరిగానే జీవితాంతం థైరాక్సిన్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. మధ్య వయసులో వచ్చేవి..మధ్యవయసు నాటికి మహిళల్లో కనిపించే సమస్యల్లో ముఖ్యమైనవి ఇవి... మెనోపాజ్ సమస్యలు : రుతుక్రమం రావడంతో సమస్యలు మొదలవుతాయంటే... తమకు 45 ఏళ్లు వచ్చాక అదే రుతుక్రమం ఆగి΄ోవడం కూడా మహిళల్లో ఒక సమస్యాత్మక అంశంగానే ఉంటుంది. రుతుక్రమం ఆగే సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందున వారికి ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు రావడం, భావోద్వేగాల్లో వేగంగా మార్పులు (మూడ్స్ స్వింగ్స్), ఆస్టియో΄ోరోసిస్తో ఎముకలు బలహీనం కావడం, ఈస్ట్రోజెన్ వల్ల గుండెకు కలిగే సహజ రక్షణ తొలగిపోవడం వల్ల గుండెజబ్బులకు తేలిగ్గా గురికావడం, యోని పొడిగా మారడం, గర్భసంచి కిందికి జారడం వంటి అనేక సమస్యలు కనిపిస్తాయి. పరిష్కారం : రుతుక్రమం ఆగిన (మెనోపాజ్) మహిళల్లో సంబంధిత లక్షణాలేవైనా కనిపిస్తే తక్షణం డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను బట్టి డాక్టర్లు హెచ్ఆర్టీ వంటి చికిత్సలను సూచిస్తారు. క్యాల్షియమ్, విటమిన్ ’డి’ ఇవ్వడం వల్ల మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే ఆహారంలో క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాల వంటివి తీసుకోవడంతోపాటు దేహానికి తగినంత వ్యాయామం కూడా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్టియోపోరోసిస్... మహిళల్లో ఈ ఎముకలకు గుల్లబారి΄ోయే ఈ వ్యాధి చాలా ఎక్కువ. పైగా మన దేశ మహిళలు (ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి యువతుల వరకు) క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు క్రమం తప్పకుండా తాగడం చాలా తక్కువ. ఇటీవల చాలామంది సూర్యకాంతికి ఎక్స్పోజ్ కాకపోవడంతో ఎముకలకు బలం చేకూర్చే విటమిన్ డీ3 పాళ్లూ తగ్గుతాయి. పైగా మహిళలకు వ్యాయామ అలవాట్లూ తక్కువే. వీటిన్నింటి ఫలితంగా మహిళల్లో ఎముక సాంద్రతా, బలం క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇక తమ వ్యాధినిరోధక శక్తి తమపైనే ప్రతికూల ప్రభావం చూపే ఎముక సంబంధితమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ వంటి వ్యాధులు మహిళ్లోనే ఎక్కువ. అందుకే మహిళల్లో ఎముకల బలాన్ని పెంచడానికి పొట్టుతో ఉంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ధాన్యాలైన (గోధువు, జొన్న, మెుక్కజొన్న, రాగులు, ఓట్స్)తో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పొట్టుతీసిన కార్బోహైడ్రేట్స్ నివారించాలి. తాజా పండ్లు, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే రాగులు, తాజా ఆకుపచ్చ కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) తీసుకోవడం చాలా మంచిది. ఇటీవలి ఆధునిక మహిళలు ఇంటిపనులతోపాటు బయట ఉద్యోగాలూ చేస్తున్నారు. అందుకే వారిపై పనిఒత్తిడి తోపాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. ఫలితంగా ఆరోగ్య సమస్యలూ ఎక్కువే. అందుకే ఆమెకు కుటుంబం నుంచీ, అందునా మరీ ముఖ్యంగా భర్త నుంచి తగిన సహాయ సహకారాలు అవసరమని అందరూ తెలుసుకోవాలి.డాక్టర్ చల్మేడ నివేదిత, సీనియర్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ (చదవండి: అరుదైన శసస్త్ర చికిత్స: దంతంతో కంటి చూపు..!) -
ట్రంప్ భేటీలో వైరల్గా జెలెన్స్కీ దుస్తులు..డిజైనర్ ఎవరంటే..?
ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా వైట్హౌస్ ఓవల్ కార్యాలయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో ఇరువురు అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. ఆ తదనంతరం వైట్హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో జెలెన్ స్కీ ధరించిన దుస్తులు హాట్టాపిక్గా మారాయి. అగ్రరాజ్యం అధ్యక్షుడిని వైట్హౌస్లో కలిసేటప్పుడు డ్రెస్ కోడ్ పాటించాలి కదా అంటూ ప్రశ్నలు లేవెనెత్తడం జరిగింది. ఇది అమెరికన్లను అవమానించడమే అంటూ వ్యాఖ్యలు రాగా వాటికి జెలెన్స్కీ తనదైన శైలిలో ధీటుగా సమాధానాలిచ్చారు కూడా. ఈ నేపథ్యంలో ఆయన ధరించిన దుస్తులు ప్రత్యేకత, డిజైనర్ వంటి వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..!.జెలెన్స్కీ నల్ల కార్గోప్యాంటు, బూట్లతోపాటు ఉక్రెనియన్ జెండాలో ఉండే త్రిశూలం వంటి చిహ్నలతో కూడిన డ్రెస్ని ధరించారు. పైన ధరించిన షర్ట్కి మూడు బటన్లు అల్లిన లాంగ్ స్లీవ్ పోలో చొక్కాను ధరించారు. ఆయన వైట్హౌస్లోకి ఎంటర్ అవ్వగానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలకిరిస్తూ..జెలెన్స్కీ దుస్తులపై వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో రియల్ అమెరికాస్ వాయిస్ అనే కన్జర్వేటివ్ రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్ జెలన్స్కీని మీరు సూటు ఎందుకు ధరించలేదు అంటూ ప్రశ్నించాడు. ఈ దేశ కార్యాలయంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు కదా..మరీ ఇలా సూట్ లేకుండా ఎలా వచ్చారంటూ ప్రశ్నలు గుప్పించాడు. అయితే అందుకు జెలెన్స్కీ త్వరలో మీకంటే మంచి సూట్ కచ్చితంగా ధరిస్తాను. స్వేచ్ఛను కోరుకుంటున్న తన దేశానికి ప్రతికగా ఈ వస్త్రధారణ అని ధీటుగా బదులిచ్చాడు జెలెన్స్కీ. మరీ ఈ దుస్తులని ఇంతలా అర్థవంతంగా తీర్చిదిద్దింది ఎవరో తెలుసా..!.ఎల్విరా గసనోవాఉక్రేనియన్ డిజైనర్ ఎల్విరా గసనోవా ఈ దుస్తులను రూపొందించింది. ఆమె డామిర్లి బ్రాండ్ పురుషుల దుస్తుల కలెక్షన్ నుంచి పోలో చొక్కా, ప్యాంటుని ధరించారు జెలెన్స్కీ. ఎల్విరా జెలెన్స్కీ కోసం ఈ పత్యేక వెర్షన్ను డిజైన్ చేసింది. దీన్ని డిజైనర్ 1991లో ఉక్రెయిన్ స్వీకరించిన కోట్ ఆఫ్ ఆర్మ్స్ త్రిశూలం ఉన్న షీల్డ్ ఆధారంగా రూపొందించిందిఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో తన ఉక్రెయిన్ భవిష్యత్తు కోసం పోరాటం సాగిస్తున్నా తమ ధైర్యానికి గుర్తుగా జెలెన్స్కీ సూట్ని కాకుండా ఉక్రెయిన్ బ్రాండ్ డామిర్లి పోలో చొక్కాను ఎంచుకున్నారు. ఇది ఆధునిక యోధుని యూనిఫాం. స్వేచ్ఛ కోసం నిలబడే దేశం అజేయమైన ఆత్మకు చిహ్నం. ఫ్యాషన్ సౌందర్యాన్ని అధిగమించి, ధిక్కరణ, విజయంపై విశ్వాసానికి శక్తిమంతమైన చిహ్నంగానూ, స్వరంగానూ ఉంటుంది ఈ వస్త్రధారణ అని ఎల్విరా సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చింది.ఇక డిజైనర్ ఎల్విరా 2013లో డొనెట్స్క్లో తన బ్రాండ్ని స్థాపించారు. ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కీ తరచుగా ఈ బ్రాండ్ బట్టలనే ధరిస్తుంటారు. దీన్ని ఆమె ఇద్దరు సభ్యులతో ప్రారంభించింది. తాను డిజైన్ చేయగలనా అని భయపడింది, కానీ క్రియేటివిటీగా తీర్చిదిద్దడంపై ఆసక్తి పెరిగి తనకు తెలియకుండానే వస్త్రాలు డిజైన్ చేయగలిగానంటోంది. నిజానికి ఆమె దంత వైద్యురాలు అవ్వాలనుకుంది. అయితే అనుకోకుండా డోనెట్స్క్ ఫ్యాషన్ డేలో పాల్గొంది. అక్కడ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా మారాలని ఫిక్స్ అయ్యి ఈ రంగంలోకి వచ్చింది. ఆమె తొలి ఫ్యాషన్ షో నవంబర్ 01, 2013న జరిగింది. అలా ఆమె ఫ్యాషన్ డిజైనర్ ప్రస్థానం జరిగింది.Q: "Why don't you wear a suit?"Ukrainian President Zelenskyy: "I will wear costume after this war will finish." pic.twitter.com/FzJqjIAQHa— CSPAN (@cspan) February 28, 2025 (చదవండి: అరుదైన శస్త్రచికిత్స: దంతంతో కంటి చూపు..!) -
నీటి కష్టాలు : పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న నీటి మట్టాలు
సాక్షి, ముంబై: ముంబైకి నీటి సరఫరా చేసే జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. ముంబైలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. దీంతో ముంబైకి నీటి సరఫరా చేసే ఏడు జలాశయాల్లో నీటిమట్టాలు వేగంగా అడుగంటుతున్నాయి. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు అందించిన వివరాల మేరకు ముంబైకి సరఫరా అయ్యే నీటి జలాశయాల్లో నీటి నిల్వలు 50.06 శాతానికి పడిపోయాయి. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో నీటి ఇక్కట్టు తప్పేటట్టు లేదని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో బీఎంసీ అ«ధికారులతోపాటు ముంబైకర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రస్తుత నీటి నిల్వల ప్రకారం నాలుగైదు నెలలపాటు నీటి సరఫరా చేయాల్సిరానుంది. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న నీటి మట్టాల కారణంగా ఇబ్బంది పడాల్సిరానుందని చెబుతున్నారు. జూన్లో వర్షాలు కురవకపోతే నీటి సమస్య మరింత జఠిలమయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ముంబైకి నీటి సరఫరా చేసే జలాశయాల్లో కేవలం 50.06 శాతం మాత్రమే నీటి నిల్వలున్నాయి. వైతర్ణా, మోడక్సాగర్, తాన్సా, మధ్య వైతర్ణా, భాత్సా, విహార్, తులశీ మొదలగు ఏడు జలాశయాల నుంచి ముంబైకి నీటి సరఫరా జరుగుతోంది. ముంబైలో సుమారు 1.30 కోట్ల జనాభా ఉంది. వీరికోసం ప్రతీరోజు 4,450 మిలియన్ లీటర్ల నీరు డిమాండ్ ఉండగా 3,850 మిలియన్ లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. వివిధ కారణాలవల్ల 25 శాతం నీటి లెక్కలు తేలడంలేదు. కాగా, ప్రతీ వ్యక్తికి వివిధ అవసరాల కోసం సుమారు 150 లీటర్ల నీరు అవసరముంటుంది. కానీ లీకేజీ వల్ల పూర్తిగా సరఫరా చేయలేకపోతోంది. అయినప్పటికీ నగరంలో ఇప్పటికీ 20 లక్షల మందికి నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వీరంతా మురికి కాల్వలు శుభ్రం చేయడం, ఆటో, ట్యాక్సీలు నడుపుకొంటూ, ఇళ్లలో పాచి పనులు చేస్తూ జీవనం సాగించేవారున్నారు. ఇలాంటి వారికే నీటి సరఫరా సరిగా అందడంలేదు. చదవండి: ఏసీలు కూడా పేలే అవకాశం : ఎలా గుర్తించాలి? ముఖ్యమైన జాగ్రత్తలుమోడక్సాగర్లో అత్యల్పం ముంబైకి నీటి సరఫరా చేసే ఏడు జలాశయాల్లో మోడక్సాగర్ జలాశయంలో అత్యల్పంగా నీటి మట్టాలున్నాయి. మోడక్సాగర్ జలాశయం సామర్థ్యం 1,28,925 ఎమ్మెల్డీలుండగా ప్రస్తుతం 25,972 ఎమ్మెల్డీలు అంటే కేవలం 20.1 శాతానికి నీటి నిల్వలు చేరుకున్నాయి. ఇక తాన్సా జలాశయం సామర్థ్యం 1,45,080 ఉండగా ప్రస్తుత నీటి నిల్వలు 62,161 ఎమ్మెల్డీలకు అంటే 42.8 శాతానికి చేరుకున్నాయి. మరోవైపు ముంబైకి నీటి సరఫరా జలాశయాల్లో అతిపెద్ద జలాశయమైన అప్పర్ వైతర్ణాలో అత్యధికంగా 69.4 శాతం నీటి నిల్వలున్నాయి. అప్పర్వైతర్ణా జలాశయం సామర్థ్యం 2,27,07 ఎమ్మెల్డీలు ఉండగా ఈ జలాశయంలో నీటి నిల్వలు 1,57,50 ఎమ్మెల్డీల అంటే 69.4 శాతానికి చేరుకున్నాయి. ఇది సంతృప్తికరమైన విషయమని చెప్పవచ్చు. మరోవైపు గత సంవత్సరం వర్షాలు కురిసినప్పటికీ జలాశయాల్లో నీరు అనుకున్నంతగా చేరలేదు. దీంతో నీటి నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం అందిన వివరాల మేరకు ముంబైకి నీటి సరఫరా అయ్యే జలాశయాల్లో కేవలం 50.06 శాతం ఉండటంతో కోత విధించే అవకాశాలుండవని కానీ ఉష్ణోగ్రతలు ఇతర పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో పరిస్థితి మారకపోతే నీటి కోత విధించే అవకాశాలున్నాయని బీంఎసీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా బీఎంసీ అందించిన వివరాల మేరకు ఒక శాతం నీటిని సుమారు రెండు నుంచి మూడు రోజులపాటు సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. ఈ ప్రకారం నెలకి సుమారు 10 నుంచి 15 శాతం నీరు సరఫరా చేస్తారు. ఈ లెక్కన 50 శాతం నీటిని సుమారు నాలుగు నుంచి ఐదు నెలలపాటు చేయవచ్చని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో నీటి నిల్వలు ఆవిరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని నీటి విధించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత జూన్లో వర్షాలు కురవనట్టయితే ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అరుదైన శస్త్రచికిత్స: దంతంతో కంటి చూపు..!
"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నారు పెద్దలు. కళ్లే లేకపోతే ఏం నేర్చుకోవాలన్న కష్టమే. అంధత్వంతో బాధపడేవాళ్లకు బాగా తెలుస్తోంది ఆ ఇబ్బంది ఏంటో. అయితే పుట్టుకతో కంటి చూపు కోల్పోయినా, లేదా ఏదైనా వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయినా తిరిగి చూపు ప్రసాదించడం కాస్త కష్టం మవుతుంది. కంటి చూపుకి కారణమయ్యే, నరాలు, కార్నియా బాగుంటేనే అదంతా సాధ్యం. అలాంటిది వైద్యులు సరికొత్త వైద్య విధానంతో అంధత్వంతో భాధపడుతున్న వాళ్లకు సరికొత్త ఆశను అందించారు. కంటికి దంతం సాయంతో చూపుని ప్రసాదించారు వైద్యులు. ఇలాంటి ప్రక్రియ ద్వారా చూపుని ప్రసాదించిన తొలి కేసు ఇదేకావడం విశేషం.కెనడియన్ మహిళ గెయిల్ లేన్కి 'టూత్ ఇన్ ఐ' అనే అరుదైన శస్త్ర వైద్య విధానంతో చూపుని ప్రసాదించారు. దీన్ని వాంకోవర్లోని మౌంట్ సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ నిర్వహించింది. ఈ మేరకు డాక్టర్ గ్రెగ్ మోలోనీ శస్త్ర చికిత్స గురించి వివరిస్తూ..ఈ ప్రక్రియ గురించి చాలామంది వైద్యులకు తెలియదని అన్నారు. ఇది క్రియాత్మక కార్నియాను సృష్టించడానికి రోగి పంటిలో లెన్స్ను అమర్చి చేస్తారని చెప్పారు. ఇది సంక్లిష్టమైన ప్రక్రియని, రెండు దశల్లో నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా రోగి నోటిలో దంతాన్ని ఒకటి తీసి సరైన ఆకృతిలోకి మార్చి, దానిలో ప్లాస్టిక్ లెన్స్ని చొప్పిస్తారు. ఈ సవరించిన దంతాన్ని ఆమె చెంపలో మూడు నెలలపాటు ఉంచుతారు. ఆ తర్వాత అవసరమైన కణాజాలాన్ని అభివృద్ధి చేసిన తర్వాత నేరుగా కంటిలో అమర్చుతామని వివరించారు. ఆమె చెంప నుంచి కణజాల అంటుకట్టుతో దీన్ని అమర్చడం సాధ్యమవుతుందని అన్నారు. ఎందుకంటే సహజ బంధన కణజాలం దంతంలో లేకపోవడంతో ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.అయితే ఈ ప్రక్రియ అన్ని దృష్టి సమస్యలకు సరిపోయే వైద్య విధానం మాత్రం కాదని డాక్టర్ మోలోనీ నొక్కి చెప్పారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, రసాయన కాలిన గాయాలు లేదా ఇతర గాయాలు, కండ్లకలక మచ్చల వల్ల తీవ్రమైన కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ వైద్య విధానం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ శస్త్ర చికిత్స మంచి ఫలితం ఇవ్వాలంటే మాత్రం సదరు రోగులకు ఆరోగ్యకరమైన రెటీనా, ఆప్టిక్ నరాలను కలిగి ఉండాలని అన్నారు. చివరగా సదరు రోగి గెయిల్ లేన్ తాను పదేళ్లుగా చూడలేదని..ఇప్పుడూ గనుక ఈ ప్రక్రియ సఫలమైతే భయం, ఆశ రెండూ ఒకేసారి కలుగుతాయంటూ కన్నీళ్లు పెట్టుకుందామె. కంటి చూపు వస్తే మాత్రం తప్పక చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నయంటూ సంతోషభరితంగా చెబుతోంది లేన్.(చదవండి: చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చింది..? ఆ నెంబర్తో పిలవడానికి రీజన్..?) -
ఏసీలు కూడా పేలే అవకాశం : ఎలా గుర్తించాలి? ముఖ్యమైన జాగ్రత్తలు
ఎండలు ముదురుతున్నాయి. సూర్యుడి భగభగలను తట్టుకోవాలంటే అందరూ తప్పనిసరిగా ఏసీలను వాడుతున్న పరిస్థితి. అయితే ఏసీల పని తీరుపై ప్రాథమిక అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా శీతాకాలమంతా వాడకుండా పక్కన పెట్టి ఉంచుతాం కాబట్టి ఇపుడు వాడేటపుడు మెయింటెనైన్స్పై దృష్టి పెట్టాలి. ఏసీలోని భాగాలను శుభ్రం చేసుకోవాలి. అసలు ఎండాకాలంలో ఏసీల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించాలో తెలుసు కుందాం ఈ కథనంలో...కొన్ని చోట్ల ఏసీ పేలడం కారణంగా అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.మెయింటెనెన్స్వేసవికాలంలో ఏసీలను వాడే ముందు శుభ్రంచేయడం, ప్రొఫెషనల్ టెక్నీషియల్ సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. ఏసీ సరిగ్గా పనిచేస్తుందో? లేదో నిపుణులై టెక్నీషియన్ ద్వారా తనిఖీ చేయించాలి. లేదా సంబంధిత బ్రాండ్ సర్వీస్ సెంటర్ వారిని సంప్రదించాలి. దీని వల్ల ఏసీలో ఉన్న లోపాలను ముందుగనాఏ గుర్తించవచ్చు. అన్ని ఎలక్ట్రికల్ భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవచ్చు. ఫిల్టర్లను శుభ్రపరచడం, రిఫ్రిజిరేంట్ లీక్ లాంటి ప్రధానం చెక్ చేసుకోవాలి.వైరింగ్ తనిఖీఏసీకి అనుబంధంగా ఉన్న వైరింగ్ను తనిఖీ చేయాలి. ఏవైనా లోపాలు కనిపిస్తే బాగు చేయించుకోవాలి, లేదా వెంటనే మార్చుకోవాలి. వైరింగ్ సరిగ్గా లేకపోతే షాక్ వచ్చే అవకాశాలుంటాయి. రిమోట్లో కూల్ మోడ్, డ్రై మోడ్, ఫ్యాన్ మోడ్ లేదా ఎనర్జీ-సేవింగ్ మోడ్ వంటి మోడ్లు పనిచేయక పోవడం, AC లోని సెన్సార్ పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది. మోడ్లు ఏవీ సరిగ్గా పనిచేయకపోతే, వెంటనే టెక్నీషియన్ను సంప్రదించడం చాలా ముఖ్యం.వెంటిలేషన్ ఏసీని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టడం మంచిది. ఖాళీగా ఉన్న ప్రదేశంలో, మంచి వెంటిలేషన్ ఉంచితే ఏసీ వేడెక్కకుండా ఉంటుంది. గాలి ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చూసుకోవాలి. లేదంటే గాలి సరిగ్గా రాదు. గాలి ప్రవాహం సరిగ్గా ఉటే ఏసీ యూనిట్ పై ఎలాంటి ఒత్తిడి పడదు. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కంప్రెసర్ వేడెక్కి అగ్ని ప్రమాద అవకాశాలను పెంచుతుంది.ఒక వేళ ఏసీ ఎలక్ట్రికల్ భాగాలు పాడైతే, వాటిని రీప్లేస్ చేసినప్పుడు నాణ్యమైన, కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ భాగాలతోనే రీప్లేస్ చేయాలి. అలాగే పవర్ సాకెట్లు, ప్లగ్గులు, షెడ్యూల్ బ్రేకర్లు నాణ్యతను ఒకటిరెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఏసీ టెంపరేచర్ని రూమ్ టెంపరేచర్ కంటే తక్కువగా సెట్ చేసుకోవడం కూడా ముఖ్యంఏసీ నుంచి అసాధారణ శబ్దాలు వస్తున్నా, వాసన వస్తున్నా, లీకేజీ ఉన్నా కూడా వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి. ఏసీ నుంచి పొగలు వస్తున్నట్టు గమనిస్తే పొరపాటున కూడా నీటిని చల్లకూడదు. నిపుణులు వచ్చి తనిఖీ చేసేదాకా ఏసీని ఆఫ్ చేయడం ఉత్తమం.ఏసీ నిరంతరం వాడుతున్నవారు ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే.. రోజులో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఏసీ ని ఆఫ్ చేసి ఉంచాలి. దీని చాలాప్రమాదాలను నివారించవచ్చు. అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. స్మోక్ డిటెక్టర్లు లాంటి పరికరాలు ఇంట్లో ఉంటే మంచిది. ఎలాంటి ప్రాణాపాయాలు కలగకుండా ఉంటాయి.ఎలాంటి ఏసీలను తీసుకోవాలి? నాణ్యమైన ఎలక్ట్రికల్ భాగాలను వినియోగించే, నాణ్యమైన బ్రాండుకు సంబంధించిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలి. నోట్ : ఏసీలు వాడుతున్నవారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మెంటెయిన్ చేయాలి. దీని వల్ల చల్లదనాన్ని ఆస్వాదించడంలోపాటు, కరెంట్ ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు. ఇదీ చదవండి : సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు, ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది! -
'చికెన్ 65'కి ఆ పేరెలా వచ్చిందో తెలుసా..?
చికెన్ రెసిపీల్లో అందరికీ నచ్చేది చికెన్ 65. దీనికున్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఎన్నో రకాల రెసిపీలు వాటి తయారీ విధానం లేదా తయారీకి పురికొల్పిన విధానం బట్టి వాటి పేర్లు వస్తాయి. మరికొన్ని రెసిపీలైతే కొందరు సెలబ్రిటీలు లేదా ప్రముఖులు కాంబినేషన్గా తిన్న తీరు అనుసరించి వారి పేరు మీదుగా రెపిపీల పేర్లు రావడం జరిగింది. కానీ ఈ చికెన్ 65(Chicken 65)కి ఆ పేరు వచ్చిత తీరు తెలిస్తే విస్తుపోతారు. ఆ..! ఇలానా దానికి ఆ పేరు వచ్చింది అని నోరెళ్లబెడతారు. మరీ ఆ గమ్మత్తైన కథేంటో చదివేయండి మరీ..గతేడాది ప్రముఖ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రైడ్ చికెన్ వంటకాల జాబితా ఇచ్చింది. అందులో మన భారతదేశ వంటకం చికెన్ 65 మూడో స్థానాన్ని దక్కించుకుంది. అంతలా ఫేమస్ అయిన ఈ చికెన్ 65ని ఆ నెంబర్తో ఎందుకు పిలుస్తారనేది అతిపెద్ద డౌటు. అందుకు గల రీజన్ కూడా తెలియదు. అయితే చాలామంది 65 చికెన్ ముక్కలతో చేస్తారేమో లేక అన్ని రోజులు లేదా గంటలు ఈ చికెన్ని మ్యారినైట్ చేస్తారేమో అంటూ..పలు వాదనలు కూడా వినిపించాయి. కానీ అవేమీ కారణం కాదట. అలా పిలిచేందుకు ఓ తమాషా కథ ఉంది. అదేంటంటే..చాలమంది దీన్ని స్నాక్ రూపంలో తింటారు. కొందరు నాన్స్, చపాతీలు, భోజనంగానూ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి టేస్టీ చికెన్ 65 పేరు రావడానికి కారణం చెన్నైలోని బుహారీ రెస్టారెంట్ అట. అక్కడ మద్రాస్ మాజీ షెరీఫ్ ఎ ఎం బుహారీ కొలంబోలో పాకశాస్త్రంపై ఇష్టంతో దానికి సంబంధించిన హోటల్మేనేజ్మెంట్ చదువుని పూర్తి చేసుకుని భారత్కి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత చెన్నైలో రెస్టారెంట్ని ప్రారంభించాడు. నాటి బ్రిటిష్ వాళ్లకు భారతీయ ఆహారంతో కూడిన సరికొత్త భోజనాన్ని అందించింది ఆయనే. బుహరీ హోటల్ ద్వారా అక్కడి స్థానిక ప్రజలకు విభిన్న రుచులను అందించాడు. నాటి రోజుల మెనూలో సుదీర్ఘ వెరైటీల జాబితా ఉన్న హోటల్గా ప్రసిద్ధి చెందింది ఈ హోటల్. ఆ నెంబర్తోనే ఎందుకంటే..అయితే మనకేది కావాలో ఆర్డర్ చేయడానికి ఒక సైనికుడు భాషా సమస్య కారణంగా ఆ మెనూలోని నెంబర్ ఆధారంగా ఆర్డర్ చేశాడంట. అతడు ఎప్పుడు 65 నెంబర్లో ఉన్న చికెన్ రెసిపీని ఇమ్మని చెప్పేవాడట. పైగా అది క్రంచీగా ఉండే చికెన్ అని చెప్పేవాడట. దీంతో మిగతా కస్టమర్లు కూడా అతడిలా ఆ నెంబర్లో ఉన్నచికెన్ని ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. చెప్పాలంటే ఆ మెనూలో 65వ నెంబర్లో ఉన్న చికెన్ ఆర్డర్లే ఎక్కువగా ఉండేవి. అలా క్రమేపి అది కాస్త చికెన్ 65గా స్థిరపడిపోయింది. ఆ విధంగా ఆ రెసిపీకి చికెన్ 65 అని పేరొచ్చింది. కాలం గడిచేకొద్ది ఈ వంటకానికి ప్రజాదరణ పెరిగిందే కానీ తగ్గలేదు. ఇప్పటికీ ప్రతి రెస్టారెంట్లలో నువ్వానేనా అనే రెసిపీలు ఎన్ని ఉన్నా.. ఈ చికెన్ 65కి ఉన్న క్రేజ్ మరే రెసిపీకి లేదని చెప్పొచ్చు. ఈ వంటకం దొరికే ఫేమస్ రెస్టారెంట్లుచెన్నైలో ఈ వంటకానికి పేరుగాంచిన రెస్టారెంట్లు ఇవే..ఈ రోడ్ అమ్మన్ మెస్: ఇక్కడ చికెన్ 65 తోపాటు ఆంధ్రా చిల్లీ చికెన్ ఫేమస్. అయితే ఈ ఆంధ్రా చిల్లీ చికెన్ని పెద్దపెద్ద పచ్చి మిర్చితో వెల్లుల్లి మసాలతో డెకరేట్ చేసి ఉంటుంది. బుహారీ హోటల్: ఇక్కడ చికెన్78, చికెన్ 82, చికెన్ 90 అనే వంటి రకాల డిషెస్ కూడా ఫేమస్దక్షిణ్ రెస్టారెంట్: తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటకాల మెనూ ఉంటుంది. అయితే ఓన్లీ రుచికరమైన చికెన్ 65 మాత్రమే ఉంటుంది. (చదవండి: కాఫీ నాణ్యతను డిసైడ్ చేసేది ఆమె..! ది బెస్ట్ ఏంటో..) -
కాఫీ నాణ్యతను డిసైడ్ చేసేది ఆమె..! ది బెస్ట్ ఏంటో..
పొద్దుపొద్దునే ముక్కుపుటలను తాకి మేల్కొలిపే కాఫీ వాసనకు ఫిదా కానివాళ్లు ఉండరు. అలాంటి కాఫీల్లో మంచి నాణ్యతను డిసైడ్ చేసే వాళ్లు ఉంటారని, మరిన్ని విబిన్నమైన బ్రూలను తయారు చేస్తారని తెలుసా..?. జస్ట్ కాఫీ గింజలతోనే చేసే కాఫీ కాదు. వాటిని ఉడకించి లేదా రోస్ట్చేస్తే వచ్చే ఫ్లేవర్లలో ఏది ది బెస్ట్ టేస్ట్ అని డిసైడ్ చేసి వాటికి రేటింగ్ ఇచ్చి మార్కెటింగ్ చేస్తాయి కంపెనీలు. అందుకోసం ప్రత్యేక కాఫీ టేస్టర్లను పెడతారు. వాళ్లే మంచి నాణ్యతతో కూడిన కాఫీని రైతులతో తయారు చేయిస్తారు. అలా మనదేశలో తొలి మహిళా కాఫీ టేస్టర్గా పేరుగాంచిన ఆమె ఎవరో తెలుసా..!. ఆమె అక్షరాల అచ్చ తెలుగింటి ఆడపడుచు..!. మరీ ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చింది? ఎలా అంచెలంచెలుగా ఎదిగింది తదితరాల గురించి చూద్దామా..!.కాఫీ ప్రపంచంలో ది బెస్ట్ కాఫీలను మనకందించేది సునాలిని ఎన్. మీనన్. ఆమె భారతదేశంలోని తొలి మహిళా కాఫీ టేస్టర్. మీనన్ తన నిపుణుల బృందంతో కాఫీ బీన్స్ని అంచనా వేస్తారు. వాటిని ఉడికించడం లేదా రోస్ట్ చేయడం ద్వారా దాని రుచి, రంగుని డిసైడ్ చేసి ఏది బెస్ట్ అనేది నిర్ణయిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే కాఫీలను తయారు చేయించేది సునాలినే. ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..ఆమె ఫుడ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ఆమె డైటీషియన్ కావాలని అనుకుంది. ఆ నేపథ్యంలో న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైటెటిక్స్లో డైటెటిక్స్లో సీటు కోసం దరఖాస్తు చేసుకుంది. అలా స్కాలర్షిప్ కూడా పొందింది. ఇక యూఎస్ వీసా వచ్చేస్తే వెళ్లిపోవడమే తరువాయి. ఆ తరుణంలో స్థానిక వార్తాపత్రికలో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కాఫీ టేస్టర్ రిక్రూట్మెంట్ ప్రకటన చూసింది. ఇది కాఫీకి ప్రభుత్వ నోడల్ సంస్థ. ఈ ప్రకటన తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఎందుకంటే తన మేనమామ టీ ఫ్యాక్టరీలోని ఘటన గుర్తుకొచ్చింది. అక్కడ తన మావయ్య వాళ్ల బృందం టీలని సిప్ చేసి చర్చిస్తున్న విషయాలు గుర్తుకు వచ్చాయి. ఎందుకంటే అప్పడుది టీ రుచి, సూక్ష్మ నైపుణ్యాలు అంచనా వేయడానికి అలా చేస్తున్నారనేది ఆమెకు తెలియదు. వెంటనే ఆ ఆసక్తితోనే ఆ ఉద్యోగ ప్రకటనకు అప్లై చేసింది. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనేది కూడా తెలియదు. కానీ సునాలిని ఎంపికవ్వడం జరిగిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా అంచలంచెలుగా ఎదుగుతూ.. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఏకంగా బెంగళూరులో ప్రత్యేకంగా కాఫీలాబ్ను స్థాపించే వరకు వెళ్లిపోయింది. ఇది కాఫీ నాణ్యతను నిర్థారించడంలో ఆమె చేసిన అచంచలమైన కృషికి సంకేతం అని చెప్పొచ్చు.సునాలిని తెలుగమ్మాయే..ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కడలూరుకి చెందింది. అది తన అమ్మమ్మగారి ఊరు. మద్రాస్లో పెరగడంతో కాఫీతో అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం మద్రాసుని చెన్నైగా పిలుస్తున్నారు. ఇది దక్షిణ భారత ఫిల్టర్ కాఫీకి కేంద్రంగా ఉండేది. అలా సునాలినికి ఇంటి నుంచే కాఫీపై ఆసక్తి ఏర్పడటం జరిగింది. ఇక ఆమె తన కెరీర్ ప్రారంభంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ రంగంలో సముచిత స్థానం ఏర్పరుచుకునేలా చాలా కష్టపడింది. పురుషాధిక్య ప్రదేశంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఏ మహిళకైనా చాలా ధైర్యం ఉండాలని అన్నారామె. ఇలా కాఫీ రుచులను చూస్తూ విసుగొచ్చేసిందా అని సునాలిని ప్రశ్నిస్తే..మరింతగా వాటి గురించి తెలుసుకునేలా మక్కువ ఏర్పరచుకున్నానంటోందామె. ఏ రంగంలోనే బాగా రాణించాలంటే విసుగుకి చోటివ్వకూడదని నొక్కి చెబుతోంది. ఆ ఆసక్తి వల్లే తనకు ప్రతిరోజూ విభిన్న కాఫీ రుచలను ఆస్వాదించడంలో ఉండే ఆనందాన్ని వెతుక్కుంటున్నాని చెబుతోంది. ఇక చివరిగా తనకు ఫిల్టర్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ అంటే మహా ఇష్టమని అన్నారు. ఏరంగంలోనైనా సవాళ్లు ఉంటాయనేది సహజం, ఐతే దాన్ని ఇష్టంగా మార్చుకుని ఆసక్తి ఏర్పరుచుకుంటే కచ్చితంగా ఉన్నత స్థాయి చేరుకుంటానేందుకు సునాలిని విజయగాథే నిదర్శనం. (చదవండి: అరబిక్ కడలి సౌందర్య వీక్షణం! ఆ తీరానే కృష్ణుడు, జాతిపిత, గోరీ..) -
పరీక్షల్లో విజయం సాధించాలంటే..?
పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలకమైన మైలురాళ్లు. చాలామంది విద్యార్థులు పరీక్షల సమయానికి తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. మెదడు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది? మన మనస్సు పరీక్షలకు అనుగుణంగా ఎలా సిద్ధం కావాలి? అనే విషయాలు తెలుసుకోవడం అవసరం.మానసిక స్థిరత్వం, సమర్థమైన అధ్యయన పద్ధతులు, దృఢమైన ఆత్మవిశ్వాసం పరీక్ష విజయాన్ని నిర్దేశించే మూడు ప్రధాన అంశాలు. పరీక్షల సమయంలో ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడం, మెదడును ఒత్తిడికి అలవాటు చేయడం, చదువును ఒక ఉల్లాసభరితమైన ప్రక్రియగా మార్చుకోవడం ఎంతో అవసరం. పరీక్షలలో విజయం అనేది జ్ఞానం కన్నా మానసిక దారుఢ్యం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ వ్యాసంలో అందించే పద్ధతులను అనుసరిస్తే, పరీక్షలపై భయం కాకుండా, ఆత్మవిశ్వాసం పెంచుకుని విజయాన్ని సాధించగలుగుతారు.ఒత్తిడిలో మెదడు ఎలా స్పందిస్తుంది?పరీక్షల సమయంలో ఒత్తిడికి గురైనప్పుడు, మెదడు అమిగ్డాలా అనే భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది మన భయాలకు, ఆందోళనకు ఆధారమైన భాగం. అమిగ్డాలా మిగతా మెదడు భాగాల కంటే హై అలర్ట్లోకి వెళ్ళి, ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ పరిస్థితిలో మూడు రకాల ప్రతిచర్యలు కనిపిస్తాయి:Fight Mode: పరీక్షను సవాలుగా తీసుకుని మరింత కృషి చేయడంFlight Mode: పరీక్షలంటే భయపడి చదవడంపై ఆసక్తి చూపలేకపోవడం, అంటే తప్పించుకుని పారిపోవడంFreeze Mode: పరీక్ష సమయంలో మెదడు పనిచేయకపోవడం, గుర్తొచ్చిన విషయాలు మర్చిపోవడం.ఇందులో ఫ్లైట్, ఫ్రీజ్ మోడ్స్ వల్ల ఎలాంటి ఉపయోగమూ లేకపోగా మీ లెర్నింగ్ను, జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి. ఫైట్ మోడ్లో ఉండటం పరీక్షల్లో విజయానికి కచ్చితంగా అవసరం. అందుకే మీరో ఫైటర్లా మారండి. పరీక్షలను చాలెంజ్గా తీసుకుని ముందుకు సాగండి. విజయానికి సానుకూల దృక్పథం పరీక్షలో విజయానికి ఆ మూడు గంటలు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది అతి ముఖ్యమైన విషయం. నేనింతే సాధించగలననే ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి నేను సాధించగలననే గ్రోత్ మైండ్ సెట్ అభివృద్ధి చేసుకోవాలి. అది మానసిక స్థితిని శక్తిమంతంగా మార్చి, ప్రతిభను మరింత పెంచుతుంది. అందుకోసం ఓ మూడు టెక్నిక్స్ తెలుసుకుందాం. ఆటో సజెషన్: ‘‘నేను ఈ పరీక్షను విజయవంతంగా రాయగలను’’అని ప్రతిరోజూ మనసులో అనుకోవడం. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఉదాహరణలు చదవడం, ఆయా వీడియోలు చూడడం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.విజువలైజేషన్: పరీక్ష హాలులో ప్రశాంతంగా సమాధానాలు రాస్తున్నట్లు మనసులో ఊహించడం. ఇలా చేయడం వల్ల ఊహించిన అనుభవాలను నిజంగా అనుభవించినట్లు మెదడు గుర్తుంచుకుంటుంది. దానికి ఊహకూ, నిజానికీ మధ్య తేడా తెలియదు. స్వీయ కరుణ: తప్పులు చేసినా, వాటిని నేర్చుకునే అవకాశంగా చూడటం అవసరం. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, మీతో మీరే పోటీ పడాలి. మీ ప్రగతిని చూసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని పూర్తిచేయడం ద్వారా మనసుకు ఓవర్లోడ్ కాకుండా ఉంటుంది.ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడం నేర్చుకోవాలి. అందుకోసం పలు సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈరోజు తెలుసుకుందాం. అలాగని జస్ట్ తెలుసుకుంటే సరిపోదు, వాటిని రోజూ ప్రాక్టీస్ చేయాలి. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం: మనసు ప్రశాంతంగా ఉండాలంటే శరీరం ప్రశాంతంగా ఉండాలి. అందుకోసం డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ను ప్రాక్టీస్ చేయాలి. అదేమంత కష్టమైన పనికాదు. వెరీ సింపుల్. నాలుగు సెకన్లు లోపలికి శ్వాస తీసుకోవడం, ఏడు సెకన్లు శ్వాసను బంధించడం, ఆ తర్వాత ఎనిమిది సెకన్లు నెమ్మదిగా వదిలేయడం. దీనివల్ల మెదడులో ఆక్సిజన్ పెరిగి ప్రశాంతతను అందిస్తుంది.వ్యాయామం: రోజూ 20 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మెదడులో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది.దీంతో పాటు సరైన ఆహారం, నిద్ర అవసరం. గుడ్లు, కాయధాన్యాలు, ఉల్లిపాయలు, వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. పరీక్షల ముందు కనీసం 7 గంటలు నిద్రపోవడం అవసరం. రాత్రంతా మేల్కొని చదివితే మెదడు పనితీరు మందగిస్తుంది. ---సైకాలజిస్ట్ విశేష్, www.psyvisesh.com(చదవండి: 'గోచీ పండుగ': వినడానికి వింతగా ఉన్నా..పండుగలో మాత్రం..!) -
'గోచీ పండుగ'..ఎందుకోసం నిర్వహిస్తారో తెలిస్తే షాకవ్వుతారు..!
వినడానికి వింతగా; అనడానికి విడ్డూరంగా ఉన్నా.. కనడానికి కన్నులవిందుగా ఉంటుందా వేడుక. పేరులో ‘గోచీ’ ఉండొచ్చు కాని, పండగలో పాల్గొనేవారు మాత్రం నిండుగా సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోతారు. సంతానోత్పత్తికి సంకేతంగా నిర్వహించే ఈ పర్వదినంలో ఆబాలగోపాలానికి అవకాశం లేదు. పెళ్లిళ్లయిన, పెళ్లీడుకొచ్చిన స్త్రీ పురుషులు మాత్రమే అర్హులు. ఆశ్చర్యంగా అనిపించే ఆ వేడుక పేరే ‘గోచీ’ పండుగ. ఇంతకీ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది? ఏమిటా వేడుక విశేషాలు? తెలుసుకోవాలనుందా, అయితే ఇది చదివేయండి. శిశుజననం.. వారికి పండుగదేవభూమిగా భాసిల్లే హిమాచల్ ప్రదేశ్ దేశంలోని అగ్రగామి పర్యాటక ప్రాంతాల్లో ఒకటనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో సింహభాగం మైదాన ప్రాంతం కంటే పర్వత శ్రేణుల్లోనే ఉంటుంది. సముద్ర మట్టానికి సగటున 50 మీటర్ల ఎత్తున ఉండే ఆవాసాలే అధికం. ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంత వాసులే! 2016 నాటికి 99.5 శాతం విద్యుద్దీకరణ జరిగిన రాష్ట్రంగా నమోదైంది. అంతేకాదు 2017 సర్వే ప్రకారం అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా ఖ్యాతికెక్కింది. అయితే సంతానోత్పత్తి విషయంలో మాత్రం వెనుకబడింది. 2014కు ముందు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.9గా ఉండేది. 2015–16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆ రేటు 1.7కు పడిపోయింది. ఇక 2019–21 జాతీయ నివేదిక ఆధారంగా ఆ రేటు మరింత దిగజారి 1.5గా నమోదైంది. ఇక ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఈ రేటు మరింత క్షీణించింది. బహుశా ఈ పరిణామాలే పర్వత శ్రేణుల్లోని లోయల్లో నివసించే గిరిజనులు గోచీ పండగను మరింత ఘనంగా నిర్వహించేందుకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఇక్కడి లాహోల, స్పితి జిల్లాల్లోని చంద్, భాగ్ లోయల్లోని గిరిజనులు సంతానప్రాప్తిని అదృష్టంగా భావిస్తారు. అందుకు ప్రతీకగా శిశువు జన్మించిన సందర్భంలో ఊరంతా ఏకమై ఉత్సవం నిర్వహిస్తారు. ఎవరికైతే బిడ్డ పుట్టాడో ఆయా కుటుంబాలు గోచీ ఉత్సవానికి సంకల్పిస్తాయి. ఏటా మాఘ మాసంలో ఈ పండగ జరుపుకొంటారు. స్థానిక గిరిజన తెగల ప్రజలు చలిమంటల చుట్టూ చేరి, స్త్రీ పురుషులు వేర్వేరుగా నృత్యాలు చేస్తూ పండగను ప్రారంభిస్తారు.లక్ష్యం చేరిన బాణమే సంతానానికి సంకేతంగహర్ లోయలో పదుల సంఖ్యలో గిరిజన గ్రామాలున్నాయి. వేర్వేరు తండాల్లో ఒక్కో రీతిన ఈ ఉత్సవం నిర్వహిస్తారు. మగబిడ్డ పుడితే ఓ గ్రామం, ఆడ బిడ్డ జన్మిస్తే ఇంకో గ్రామం ఇలా ఒక్కొక్కరు గోచీ పండగ నిర్వహిస్తారు. పండగకు ఒకరోజు ముందు గ్రామపూజారి విల్లుబాణం పట్టుకుని ఊరంతా తిరిగి స్థానిక గ్రామదేవతకు ప్రార్థన చేస్తాడు.ఆ తర్వాత బిడ్డ పుట్టిన ఇంటిని సందర్శిస్తాడు. పండగ రోజు ఉదయాన్నే ఊరంతా సమావేశమై ఎలా ముందుకువెళ్లాలో నిర్ణయిస్తారు. పర్వదినం సందర్భంగా సత్తు పిండితో శివలింగాన్ని చేసి, దానికి పూజలు చేస్తారు. ఈ రూపాన్ని స్థానికులు ‘యుల్లా’ దేవత అని పిలుస్తారు. ఊరంతా కలియతిరిగి ఓ కూడలిలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారు. దేవతారా«ధన అనంతరం విలువిద్య ఆట ఆడతారు. పెళ్లైన మగవారికి మాత్రమే ఇందులో ప్రవేశం. నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని తాకిన బాణాల సంఖ్య ఆధారంగా ఆ గ్రామానికి రానున్న కాలంలో అంతమంది శిశువులు జన్మిస్తారని వీరి నమ్మకం. లక్ష్యం చేరిన బాణాల సంఖ్య పదికి దాటితే చాలు వీరి ఆనందానికి అవధులుండవు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు. సంప్రదాయ వంటకాలతో అందరూ సహపంక్తి భోజనాలు చేస్తారు. ఆడపిల్లతో అదృష్టమని..ఈసారి భాగ్ లోయలోని పుకార్ గ్రామం ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో ఇక్కడి వారు కేవలం మగబిడ్డలు పుడితేనే గోచీ పండుగ జరిపేవారు. కాని, ఈసారి ఆడ శిశువు పుడితే ఘనంగా వేడుక నిర్వహించడం విశేషం. తమ ఇంట అమ్మాయి పుడితే అదృష్టంగా భావించారు పుకార్ గిరిజనులు. తాజాగా ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజులు ఉత్సవాన్ని జరిపారు. ‘తంగ్జన్’గా పిలిచే గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పూజారి బిడ్డ తల్లిదండ్రులను ఆశీర్వదించాడు. అనంతరం బారసాల (తొట్టి పండగ) నిర్వహిస్తారు. అయితే ఈ సందర్భంగా బిడ్డకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తీయరు. ఆరునెలలు నిండేంత వరకు ఈ నిబంధనను పాటిస్తారు. అలా చేస్తే కనుదృష్టి తగులుతుందని వీరి భయం. లోహర్ అని పిలిచే డప్పుల దరువులతో పండగ మారుమోగుతుంది. ‘చాంగ్’ అనే సంప్రదాయ మద్యాన్ని అంతా సేవిస్తారు. డప్పుల దరువులకు లయబద్ధంగా నృత్యం చేస్తూ ఒకరిపై ఒకరు మంచుముద్దలను విసరడంతో గోచీ పండుగ ముగుస్తుంది. · -
ఫైటింగేల్ ఆఫ్ ఇండియా..! ఆ ముగ్గురే..
కోకిల పాడుతుందని అంటారు. మరి, కోకిల పాటలు వింటుందా? 1949 మార్చి 1 రాత్రి సరోజినీ నాయుడు తనకు చికిత్స చేస్తున్న నర్సును పిలిచి పాట పాడమని కోరారని అంటారు. ఆ పాటే ఆమెను నిద్రపుచ్చిందట! సరోజినిని గాంధీజీ ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ అన్నారు. సరోజిని ఎప్పుడైనా పాటలు కూడా పాడారేమో! గాంధీజీ అన్నది మాత్రం ఆమె కవిత్వం గురించి! ఆ కవిత్వంలోని భావయుక్తమైన లాలిత్యం ఆయనకు ఉద్యమ పోరాట గానంలా అనిపించి ఉండాలి. అలాగైతే ఆమెను ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు.సరోజినీ నాయుడుకి, ఈ ఏడాదికి ఒక ‘చారిత్రకత’ ఉంది. అలాగే ఈ యేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి, సరోజినీ నాయుడి ఆశయానికి ఒక ‘సారూప్యం’ ఉంది. ఇక నేడైతే (2, మార్చి) సరోజినీ నాయుడు ఈ లోకానికి ‘వీడ్కోలు’ చెప్పిన రోజు. రాజకీయ కార్యకర్తగా, మహిళా హక్కుల ఉద్యమ నేతగా, అంతిమ క్షణాల వరకు జీవితాన్ని ప్రేమించిన మనిషిగా ఆమె నుంచి స్ఫూర్తిగా తీసుకోవలసినవి ఈ మూడు సందర్భాలూ! చారిత్రకత (1925–2025)ఈ ఏడాది డిసెంబర్ 28కి, భారత జాతీయ కాంగ్రెస్కు 140 ఏళ్లు నిండుతాయి. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1925లో అధ్యక్షురాలయ్యారు సరోజినీ నాయుడు. స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్న భారత జాతీయ కాంగ్రెస్కు అప్పటివరకు ఒక భారతీయ మహిళ అధ్యక్షురాలిగా లేరు. తొలి మహిళా అధ్యక్షురాలు అనీబిసెంట్ (1917) అయితే, తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఆ తర్వాత నెల్లీ సేన్గుప్తా (1933) అధ్యక్షురాలయ్యారు. మొత్తం మీద స్వాతంత్య్రానికి పూర్వం జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులు అయింది ముగ్గురే మహిళలు.సరోజినీ నాయుడుకు ముందరి ఏడాది 1924లో మహాత్మా గాంధీ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరి మధ్య వయసులో పదేళ్ల వ్యత్యాసం. ఇద్దరి మధ్య ముప్పై ఏళ్ల స్నేహం. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ఇద్దరిదీ దాదాపుగా సమానమైన భాగస్వామ్యం. గాంధీజీని తొలిసారిగా 1914లో లండన్లో చూశారు సరోజిని. తనే ఆయన్ని వెదుక్కుంటూ వెళ్లి కలిశారు. ఆయన్ని చూసీ చూడగానే ఆమెకు నవ్వొచ్చింది. ‘‘బక్కపల్చని మనిషి, నున్నటి గుండు. నేల మీద కూర్చొని.. చిదిపిన టమాటా ముక్కలు, ఆలివ్ నూనె కలిపి తింటూ కనిపించారు. ఒక ఉద్యమ నాయకుడు ఇలా వినోదాత్మకంగా కనిపించడంతో పగలబడి నవ్వాను..’’ అని సరోజిని ఆ తర్వాత ఒక చోట రాసుకున్నారు. తనను చూసి ఆమె నవ్వగానే : ‘‘అయితే నువ్వు సరోజినీ నాయుడివి అయుండాలి. ఇలా ప్రవర్తించే ధైర్యం వేరే ఎవరికుంటుంది?’’ అంటూ ఆమెను నవ్వుతూ పలకరించారు గాంధీజీ! అప్పటికే ఈ జాతీయవాద ఉద్యమ యువ నాయకురాలి గురించి ఆయన విని ఉన్నారు. 1917 తర్వాత ఆమె గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో చేరారు. సారూప్యం (1930 ఉప్పు సత్యాగ్రహం–2025 విమెన్స్ డే థీమ్)ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్.. ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ : రైట్స్. ఈక్వాలిటీ. ఎంపవర్ మెంట్ (మహిళలు, బాలికలందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత). ఈ థీమ్కు, జాతీయవాద ఉద్యమంతో సమాంతరంగా సరోజినీ నాయుడు నడిపిన మహిళా హక్కుల పోరాటానికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. సరోజిని కవయిత్రి. స్త్రీవిద్యను ప్రోత్సహించే క్రమంలో ఆమె మంచి వక్తగా కూడా అవతరించారు. ఆమె కవిత్వం, ప్రసంగ నైపుణ్యం.. రెండూ, మహిళా ఉద్యమానికి పదును పెట్టాయి. విద్యతోనే హక్కులు, సమానత్వం, సాధికారత సిద్ధిస్తాయని ఆమె ప్రబోధించారు. మహిళల చురుకైన సహకారం లేకుండా జాతీయవాద ఉద్యమం ముందుకు సాగలేదని ధైర్యంగా గాంధీజీకే చెప్పారు! ఇందుకొక ఉదాహరణ : ఉప్పు సత్యాగ్రహం లాంటి కార్యక్రమాలలో పాల్గొనడం మహిళలకు కఠినంగా ఉంటుందని భావించిన గాంధీజీ సుమారు 70 మంది మగవాళ్లతో కలిసి దండి యాత్రకు వెళుతున్నారు. ఈలోపు సరోజినీ నాయుడు నాయకత్వంలో కొందరు మహిళలు ఆ ఊరేగింపులోకి వచ్చి చేరారు! అనుకోని ఆ పరిణామానికి గాంధీజీ ముచ్చట పడ్డారు తప్ప ఆశ్చర్యపోలేదు. అసలు మహిళలు వాడే ఉప్పుకు సంబంధించిన సత్యాగ్రహాన్ని మగవారికి వదిలేయడం ఏమిటన్నది సరోజినీ నాయుడు ప్రశ్న. వీడ్కోలు (2, మార్చి 1949)దేశంలోనే తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే ఆమె ఉత్తరప్రదేశ్ (నాటి యునైటెడ్ ప్రావిన్సెస్) గవర్నర్గా నియమితులయ్యారు. గవర్నర్గా ఉండగానే 1949లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆ ముందు రోజు రాత్రి ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. తీవ్రమైన తలనొప్పి. ఉపశమన చికిత్స చేశారు. ఆ కొద్ది సేపటికే కుప్పకూలి పోయారు. మర్నాడు కన్నుమూశారు. మరణానంతరం గోమతి నది ఒడ్డున సరోజిని అంత్యక్రియలు జరిగాయి. ‘‘జీవితం ఒక పాట. పాడండి. జీవితం ఒక ఆట. ఆడండి. జీవితం ఒక సవాలు. ఎదుర్కొండి. జీవితం ఒక కల. నిజం చేసుకోండి. జీవితం ఒక త్యాగం. అర్పించండి. జీవితం ఒక ప్రేమ. ఆస్వాదించండి..’’ అంటారు సరోజిని. అయితే వీటన్నిటికీ కూడా పోరాట పటిమ అవసరం అని కూడా తన కవితల్లో చెబుతారు ఈ ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా. (చదవండి: నెస్ట్..ఆర్కిటెక్చర్లో బెస్ట్..!) -
సైకిల్ సవారీ..ఆరోగ్యం, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన..!
వ్యాయామాల అన్నింటిలోనూ అత్యుత్తమమైనది సైకిలింగ్. ఆరోగ్యానికీ ఇది ఎంతో మంచిది. ఓ వైపు ఆరోగ్యం.. మరోవైపు పర్యావరణ కాలుష్యం పట్ల పెరుగుతున్న అవగాహన వెరసి హైదరాబాద్నగర వాసుల్లో సైక్లింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు వారాంతాల్లో గ్రూపులుగా మారి సైకిలింగ్ చేయడం ప్రస్తుతం హాబీగా మారింది. ఈ అలవాటు క్రమంగా విస్తరిస్తోంది. దీంతో విభిన్న రకాల సంస్థలు సైక్లిస్ట్ల కోసం రైడ్స్ నిర్వహిస్తుండడంతో తెలంగాణలోని హైదరాబాద్ నగరవాసులు భాగ్యనగర వీధుల నుంచి విదేశీ విహారాల వరకూ రైయ్ రైయ్ మంటూ సైకిల్పై సవారీ చేస్తున్నారు. ఎడా పెడా దూసుకొచ్చే బైక్స్, కార్స్, ఆటోల మధ్య తాదూరే సందు.. లేదు మెడకో డోలు అన్నట్టు ఉంది..భాగ్యనగరంలో సైకిల్ సవారీ. సరదా ఉంది కదా అని కిలోమీటర్ల కొద్దీ సైకిల్ తొక్కాలంటే ప్రత్యేక ట్రాక్స్ వెతుక్కోవాల్సిందే తప్ప.. నగర రోడ్లపై పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. నగరంలో సైకిల్ ట్రాక్స్ ఉన్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడంతో సైక్లిస్ట్స్ రైడింగ్ కోసం ప్రత్యేక మార్గాలను అన్వేషించక తప్పడం లేదు. ఈ క్రమంలోనే సైకిల్పై లాంగ్ జర్నీ చేయాలనుకునే నగరవాసుల కోసం విభిన్న రకాల రైడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. నైట్.. రైట్.. ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి వారాంతపు సెలవుదినాలను ఎంచుకుంటున్నారు ఎక్కువ మంది సైక్లిస్ట్లు. తమ హాబీని ఎంజాయ్ చేయడం కోసం.. మరింత సౌకర్యంగా వీధుల్లో విహరించాలని రాత్రి సమయాల్లో జాయ్ రైడ్స్కి జై కొడుతున్నారు. ‘పగలు ట్రాఫిక్ రద్దీతో పాటు పొల్యూషన్ కూడా ఎక్కువ. అందుకే వీలైనంత వరకూ రాత్రిపూట సైక్లింగ్ చేస్తా’ అని చెప్పారు ఐటీ ఉద్యోగి సౌరభ్. సాధారణంగా ఈ నైట్ రైడ్స్ రాత్రి 7గంటల ప్రాంతంలో మొదలై పరిస్థితులు, పాల్గొన్నవారి ఆసక్తిని బట్టి.. 10 నుంచి 12గంటల వరకూ కొనసాగుతున్నాయి. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో రైడ్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రసిద్ధ క్రీడా పరికరాల ఉత్పత్తి కంపెనీ డెకథ్లాన్ ప్రతినిధి చరణ్ తెలిపారు. బ్రేక్ఫాస్ట్ రైడ్స్ షురూ.. నగరంలో ట్రాఫిక్ రద్దీ తక్కువ ఉండే ఉదయపు వేళల్లో బ్రేక్ ఫాస్ట్ రైడ్స్ షురూ అయ్యాయి. తెల్లవారుజామున మొదలై ఉదయం 8–9 గంటల లోపు ముగిసిపోయే ఈ తరహా రైడ్ పూర్తయిన అనంతరం ఏదైనా ప్రత్యేక రెస్టారెంట్ లేదా దాబాల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ‘ఒకప్పుడు జిమ్లో కార్డియో వ్యాయామంలో భాగంగా ఎక్కువ సైకిల్ తొక్కేదానిని. అయితే దాని వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వైద్యుల సూచన మేరకు రోడ్స్ మీద సైక్లింగ్ను ఎంచుకున్నా’ అని సైక్లిస్ట్ నీలిమారాణి చెప్పారు. సుదూర ప్రాంతాలకూ రెడీ.. సైక్లింగ్పై ఉన్న ఇష్టం నగరవాసులను దూరాభారం లెక్కజేయనీయడం లేదు. నగరం నుంచి విభిన్న ప్రాంతాలకు లాంగ్రైడ్స్కూ వెనుకాడడం లేదు. ఈ విషయంలో బైకర్ క్లబ్స్తో వీరు పోటీపడుతున్నారని చెప్పొచ్చు. ‘కనీసం 100 నుంచి 250 కి.మీ వరకూ దూరంలో ఉండే గమ్యాలను చేరుకోడానికి నగరంలోని సైక్లిస్ట్లు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తరచూ లాంగ్ రైడ్స్ ఏర్పాటు చేస్తున్నాం’ అని బైక్ అఫైర్స్ నిర్వాహకులు వివరించారు. విదేశాల్లోనూ.. రయ్ రయ్.. నగరం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి రోడ్స్పై రైడ్స్ చేయాలనుకునే ఆసక్తి కలిగిన నగరవాసుల కోసం అక్కడ సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహించే సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ‘మల్టీ డే బైస్కిల్ రైడ్స్ పేరిట విదేశాల్లో సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. నార్తర్న్ థాయ్లాండ్లో గత ఫిబ్రవరిలో ఒక రైడ్ నిర్వహించాం. పలువురు సిటిజనులు అందులో పాల్గొన్నారు. త్వరలో స్పెయిన్లోనూ ఈ తరహా రైడ్ నిర్వహించనున్నాం’ అని చెప్పారు బార్నోల్ అడ్వెంచర్స్ సంస్థ నిర్వాహకులు. పెడలింగ్.. ఈవెంట్స్.. నగరవాసుల్లో నైట్రైడ్స్ పట్ల పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా డెకథ్లాన్, బైక్ అఫైర్స్ తదితర సంస్థలు ప్రత్యేక సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. వాహనం ఉండి, సైక్లింగ్పై ఆసక్తి ప్రధాన అర్హతగా, వ్యక్తిగతంగా లేదా బృందాలుగా కూడా పాల్గొనేందుకు వీటిని నిర్వహిస్తున్నవారు సైక్లిస్ట్లకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ తరహా రైడ్స్లో భాగంగా సైక్లిస్ట్లకు కొత్త కొత్త సైకిళ్ల గురించిన సమాచారం, వాహన నిర్వహణపై అవగాహన, ఆరోగ్యకరమైన అభిరుచిగా తీర్చిదిద్దుకోవడంపై మెళకువలు అందిస్తున్నారు. చిన్న చిన్న రైడ్స్ కోసం కెబీఆర్ పార్క్, నెక్లెస్ రోడ్ ఎంచుకునే వీరు.. రైడ్ ఈవెంట్స్కి శంకర్పల్లి నుంచి కోకాపేట్ టూ శంకర్పల్లి టౌన్, శంకర్ పల్లి నుంచి కంది రోడ్, మేడ్చల్ రోడ్/నాగ్పూర్ హైవే వంటివి ఎంచుకుంటున్నారు.బిగినర్స్.. సిగ్నేచర్.. ఆలోచనలు, ఆసక్తికి అనుగుణంగా విభిన్న రకాల ఈవెంట్ మేనేజర్స్ రైడ్స్ డిజైన్ చేస్తున్నారు. ప్రారంభకుల కోసం 15 నుంచి 20 కి.మీ వేగం పరిమితితో బిగినర్స్ రైడ్ నిర్వహిస్తున్నారు. ఈ తరహా రైడ్స్ కోసం 25 నుంచి 30 కి.మీ దూరాన్ని ఎంచుకుంటున్నారు. ఇటు ప్రారంభకులు అటు అలవాటైన వారు కాకుండా మధ్యస్థంగా ఉండే వారికి సిగ్నేచర్ రైడ్ నిర్వహిస్తారు. దీని కోసం సుమారు 70 కి.మీ దూరాన్ని నిర్ణయిస్తున్నారు. కనీసం 25 నుంచి 30 కి.మీ వేగంతో 80 నుంచి 100 కి.మీ దూరం ప్రయాణం చేసే రైడ్స్ని ఫాస్ట్ రైడ్స్గా పేర్కొంటున్నారు. ఇవి నైపుణ్యం కలిగిన వారికి ఏర్పాటు చేస్తున్నారు. (చదవండి: 'నా ఇన్స్పిరేషన్ మా అమ్మ'..!: సొనాలీ బెంద్రే) -
నాకు నచ్చిన పాత్ర మనోరమ: మృణాళిని
తెలుగులో సుప్రసిద్ధమైన నవలల్లో ఒకటి రాచకొండ విశ్వనాథశాస్త్రి ‘అల్పజీవి’. ఇది చదివిన వారందరికీ సుబ్బయ్య పాత్ర, చైతన్యస్రవంతి శిల్పం మాత్రమే గుర్తుంటాయి. కానీ అందులో కథకు అతి కీలకమైన స్త్రీ పాత్ర ఉంది. ఆమే మనోరమ. నవలలో వస్తువు సుబ్బయ్యలోని ఆత్మన్యూనత. అదే ఆ పాత్రను అల్పజీవిని చేసిన అంశం. ఆ ఆత్మన్యూనత తగ్గడానికి ప్రేరణ మనోరమ (Manorama) సాన్నిహిత్యం. అందరిచేతా ‘నంగిరి పింగిరి గాడు’, ‘భయస్థుడు’, ‘అసమర్థుడు’ అనిపించుకున్న సుబ్బయ్య, భార్య చేత ‘మగడు మగాడు కాకపోతే భార్యల గతి ఇంతే’ అని ఈసడించుకోబడ్డ సుబ్బయ్య, నవల చివర్లో ‘ఈ ఆడది కష్టంలో ఉందని తెల్సుకుందికి అట్టే కష్టం లేదు... చేతనైతే సాయం చేయవచ్చు’ అని మనోరమ గురించి అనుకునే స్థాయికి ఎదగడానికి, తన అల్పత్వాన్ని అధిగమించడంలో తొలి అడుగు వేయడానికి కారణం ఆ మనోరమే. మనోరమను ‘నల్లచీర మనిషి’ అని పరిచయం చేస్తాడు రచయిత. స్కూలు టీచరు (School Teacher) అని చెబుతాడు. ఆమె గతం మనకుగానీ, సుబ్బయ్యకు గానీ చెప్పడు. మాట తీరును బట్టి కలుపుగోలు మనిషి, ముప్ఫయ్యో పడిలో ఉన్న అందమైన స్త్రీ అని మాత్రమే ఆ పరిచయంలో అర్థమవుతుంది. మనోరమ తెలుగు నవలాసాహిత్యంలోనే విలక్షణమైన పాత్ర. కొంతవరకూ మార్మిక పాత్ర కూడా. నవలలో సుబ్బయ్యను మనిషిలా చూసిన ఏకైక వ్యక్తి. అతన్ని అన్ని బలహీనతలతో సహా అభిమానించిన వ్యక్తి. ఏ ఫలాపేక్ష లేకుండా అతని కష్టాలన్నీ సానుభూతితో వినడమే కాక, అతనికి శారీరకంగానూ దగ్గరైన వ్యక్తి. అతని ప్రాణానికి కంటకుడిగా మారిన గవరయ్యను తన ఊరివాడన్న చిన్న సెంటిమెంటును గుర్తుచేసి, నచ్చజెప్పి, సుబ్బయ్యకు ఆపద తప్పించిన ఉపకారి.మనశ్శాస్త్రవేత్త ఆల్ఫెడ్ర్ ఆడ్లర్ సిద్ధాంతం ప్రకారం ఆత్మన్యూనతకు లోనై, సమాజం నుంచి పారిపోవాలనుకునే వ్యక్తికి కుటుంబం నుంచి కానీ సమాజం నుంచి గానీ ఒక ఆధారం, ఊరట లభిస్తే ఆ బలహీనత నుంచి కోలుకుంటారు. ఆ ఊరటకు ప్రతీకే మనోరమ. మగవాడికి, ఒక అపరిచితురాలైన అందమైన స్త్రీ తన సాన్నిహిత్యాన్ని కోరుతున్నది అన్న ఒక్కటి చాలు – అహం తృప్తి పడ్డానికీ; న్యూనత తగ్గడానికీ. పురుషుల సైకాలజీకి సంబంధించిన ఈ అంశానికి ప్రతినిధిగా మనోరమను సృష్టించి, రావిశాస్త్రి తన రచనాప్రతిభను చాటుకున్నారు. చదవండి: 'నా ఇన్స్పిరేషన్ మా అమ్మ'..!: సొనాలీ బెంద్రేరచయిత మనోరమ అంతరంగాన్ని చిత్రించకపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. నవల చివర్లో మాత్రం ఆమె ఎందుకో బాధపడుతోందన్న సూచన చేస్తాడు. దాని వివరాలేవీ చెప్పడు. ఎందుకంటే ఇది సుబ్బయ్య కథ. మనోరమ కథ కాదు. కానీ, ఎప్పుడూ తన ఏడుపు మాత్రమే ఏడ్చుకునే సుబ్బయ్య ఒక మనిషిగా మారడానికి మనోరమలో కలిగిన ఈ వ్యాకులమే నాంది పలికింది. ఆ పాత్ర ప్రయోజనం ఈ నవలకు సంబంధించినంతవరకూ అంతే కావచ్చు. ఈ రకంగా రావిశాస్త్రి మనోరమకు అన్యాయం చేసి వుండవచ్చు కూడా... కానీ, రావిశాస్త్రి ఎందుకోసం సృష్టించినా, గుండె నిండా ఔదార్యం, మనసు నిండా ప్రేమ కలిగిన మనోరమ తెలుగు నవలా సాహిత్యంలో గుర్తుంచుకోదగ్గ స్త్రీ పాత్ర. -
'నా ఇన్స్పిరేషన్ మా అమ్మ'..!: సొనాలీ బెంద్రే
ప్రతి ఆడపిల్ల ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే మనం ఏం చెప్పిన నెగ్గుతుంది. ఎంతటి ధనవంతుడిని పెళ్లి చేసుకున్న ధైర్యంగా ఉండలేం. ఆర్థికంగా బాగుంటేనే స్థైర్యం దాతనంతటే అదే తన్నుకుంటూ వస్తుంది. ఆ విషయంలో నాకు మా అమ్మే స్ఫూర్తి అంటోంది బాలీవుడ్ నటి సొనాలీ బెంద్రే. అదెలాగో ఆమె మాటల్లో చూద్దామా..!.ఎలాగంటే...‘మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఆడపిల్లలకు చదువు, ఆర్థిక స్వాతంత్య్రం చాలా ముఖ్యమని నమ్ముతుంది మా అమ్మ (పేరు.. రూప్సీ బెంద్రే). నేను మోడలింగ్ ట్రయల్స్లో ఉన్న రోజుల్లో ఒకసారి.. నన్ను, నా సిస్టర్స్ని కూర్చోబెట్టుకుని చెప్పి ‘మీరు ఎంత సంపన్నులను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పినా నేను పర్మిషన్ ఇవ్వను. మీ కాళ్ల మీద మీరు నిలబడి.. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యాకే.. పెళ్లి! ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే మీకు వాయిస్ ఉంటుంది.. గుర్తుపెట్టుకోండి’ అని చెప్పింది. ఆ మాట మంత్రంలా పనిచేసింది మాకు. కెరీర్లో ఎదగడానికి స్ఫూర్తినిచ్చింది. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే స్ఫూర్తి అమ్మే! నిజంగానే ఆడపిల్లకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి. దాని వల్ల ఒక భరోసా వస్తుంది. ఆ భరోసా మనల్ని స్ట్రాంగ్గా నిలబెడుతుంది!’.(చదవండి: ఆ చేప పోరాటానికి ఫిదా కావాల్సిందే..!) -
శత్రువుని భయపెట్టబోయి భంగపడటం అంటే ఇదే..! ఇరాన్ అత్యుత్సాహం..
యుద్ధంలో అప్పుడప్పుడు రహస్య పథకాలు, పన్నాగాలతో శత్రువులను గందరగోళంలో పడేస్తుండటం మామూలే! అయితే, ఇరాన్ సైన్యం మాత్రం తన రహస్యాలను తానే బట్టబయలు చేసుకుని, ఇతర దేశాలను భయపెట్టే ప్రయత్నం చేసింది. సముద్ర మట్టానికి 500 మీటర్ల దిగువన నిర్మించుకున్న రహస్య నౌకాదళ స్థావరాన్ని ఇరాన్ ఇటీవల ప్రారంభించింది. అక్కడ ఉండే పెద్దపెద్ద భూగర్భ క్షిపణులతో పాటు, వారి వద్ద ఉన్న ఆయుధాలను కూడా బాహ్య ప్రపంచానికి చూపించింది ఇరాన్ సైన్యం. దీనికి సంబంధించిన వీడియోను స్థానిక టీవీ చానల్స్లో ప్రసారం చేస్తూ, ‘మేము పెద్ద, చిన్న శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామ’ని ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో డొనాల్ట్ ట్రంప్ను ఒక ఇంటర్వ్యూలో ఇరాన్తో యుద్ధానికి వెళ్లే అవకాశాల గురించి ప్రశ్నించగా.. ‘ఏదైనా జరగవచ్చు’ అని బదులిచ్చారు. అందుకే ఇరాన్ సైన్యం ట్రంప్ను ఇలా పరోక్షంగా హెచ్చరిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇరాన్ సైన్యం విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. దీనిని గమనించిన ఇరాన్ ప్రభుత్వం ఆ వీడియోను తొలగించింది. (చదవండి: పెళ్లే అవ్వదనుకున్నారు..అలాంటిది ప్రెగ్నెంట్ అయ్యింది..ఏకంగా 36 సార్లు..!) -
ఎనిమిదేళ్లకే పర్వతాలు అధిరోహిస్తున్న చిచ్చర పిడుగు..!
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హనుమతండాకి చెందిన జాటోత్ తిరుపతి నాయక్, వాణి దంపతుల కుమారుడు విహాన్ రామ్ 4వ తరగతి చదువుతున్నాడు. పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహించిన ఎంతోమంది సాహసికుల కథలను పెద్దల నోటినుంచి వినేవాడు. ఆ సాహసాల నుంచి స్ఫూర్తి పొందిన విహాన్ ‘నేను కూడా’ అని రెడీ అయ్యాడు.‘ఈ వయసులో ఎందుకులే’ అని తల్లిదండ్రులు అనలేదు. ఓకే అన్నారు. లెంకల మహిపాల్ రెడ్డి దగ్గర మూడు నెలల పాటు ట్రెక్కింగ్లో విహాన్ శిక్షణ తీసుకున్నాడు. హిమాచల్ప్రదేశ్ మనాలీలో 15రోజుల పాటు బేసిక్ మౌంట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. హిమాచల్ప్రదేశ్లోగల మౌంట్ పాతాల్పు పర్వతం 4,250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గత సంవత్సరం ఈపర్వతాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించాడు.టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతం 5,895 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 10న మొదలుపెట్టి 5 రోజుల్లో మైనస్ 20 డిగ్రీల వాతావరణంలో పర్వతాన్ని అధిరోహించాడు.చిన్న వయస్సులోనే పర్వతాలను అధిరోహిస్తున్న విహాన్ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సన్మానించి, చేతి గడియారం బహుమతిగా అందజేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్లో చోటు సాధించాడు విహాన్. ‘ప్రపంచంలో ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనేది నా లక్ష్యం’ అంటున్నాడు విహాన్ రామ్. విజయోస్తు...విహాన్!– గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
పెళ్లే అవ్వదనుకున్నారు..అలాంటిది ప్రెగ్నెంట్ అయ్యింది..ఏకంగా 36 సార్లు..!
కొన్ని రకాల వ్యాధులు ఎలా ఉంటాయంటే..జీవితాంతం వాటితోనే బతకాల్సిందే. వాటికి నివారణ ఉండదు. అలాంటి వ్యాధి ఉన్నవాళ్లు ఎంతలా ఆత్మనూన్యత భావంతో ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. నాకే ఎందుకు ఇలాంటి సమస్య అని దిగులు చెందడం సహజం. కానీ ఈ అమ్మాయి. ఆ వ్యాధికే సవాలు విసిరేలా బతికి చూపిస్తోంది. ఇంతకీ మహిళ. ఎవరంటే..అహ్మదాబాద్కు చెందిన కింజల్ లాథి చిన్ననాటి నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి బారిన పడినవాళ్లు ప్రతి 15 రోజులకొకసారి రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధిగ్రస్తుల జీవితకాలం చాలా తక్కువ. ఎందుకంటే. జీవించినంత కాలం కనీస 50 వేలకు పైగా రక్తం ఎక్కించుకుంటారు. దీని కారణంగా శరీంలో ఐరన్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయి ఇతర అవయవాలపై దుష్ప్రభావం చూపే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ వ్యాధితో బాధపడే యువతకు పెళ్లి అవ్వడం అనేది కష్టమే. కుటుంబసభ్యులకు కూడా ఈ విషయం తెలిసి జీవించినంత కాలం వారు ఆనందంగా ఉండేలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ కింజల్ తల్లిదండ్రలు కూడా అలానే ఆమెను అపురూపంగా చూసుకునేవారు. పెళ్లి అవ్వదనే బెంగతోనే ఉండేవారు. కింజల్ వ్యాధి గురించి పూర్తి అవగాహన ఉండి, సహృదయంతో అర్థం చేసుకుని ముందుకు వస్తే.. పెళ్లి చేయగలమని తల్లిదండ్రులకు తెలుసు. అందుకే పెళ్లి అనేది తమ కూతురుకి కలగా మిగిలిపోతుందేమో అనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. పెళ్లి అవ్వడమే గగనం అనుకుంటే.. అయితే కింజల్కి కామన్ ఫ్రెండ్ ద్వారా తన పక్కింటిలో ఉండే నవీన్ లాథితో పరిచయం ఏర్పడుతుంది. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది. నవీన్ కింజల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కింజల్తోనే నేరుగా చెప్పాడు నవీన్. అయితే తన ఆరోగ్య సమస్య గురించి నవీన్తో క్లియర్గా చెప్పి.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని సూచించింది. అయితే నవీన్ తననే పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పాడు. అయితే నవీన్ నిర్ణయానికి ఆశ్చర్యపోవడం తోపాటు ఆమె హెల్త్ రిపోర్ట్లను నవీన్ చేతిలో పెట్టి..మంచి వైద్యుడిని సంప్రదించి తగు నిర్ణయం తీసుకోమని కోరారు. నవీన్ కూడా ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలసుకుని అర్థం చేసుకోవడమే గాక కింజల్ని పెళ్లి చేసువాలని ఫిక్స్ అయ్యాడు. నవీన్ తన తల్లిదండ్రులు వద్దన్నా.. కింజల్ని పెళ్లి చేసుకున్నాడు. దీంతో పెళ్లి అవ్వదనుకున్న తన కూతురికి వివాహం కావడంతో కింజల్ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. అక్కడితో కింజల్ ఆగలేదు. ఎలాగైనా తల్లిని కావాలనుకుంది. నిజానికి తలసేమియాతో బాధపడే వాళ్లు బిడ్డును కనేందుకు ప్లాన్ చేయడం కుదరదు. అందుకు వైద్యులు కూడా ఒప్పుకోరు ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడే వాళ్లలో ఐరన్ లోపం తోపాటు ప్రతి 15 రోజులకు ఎక్కించే రక్తం కారణంగా.. బిడ్డకు సక్రమంగా ఆక్సిజన్ అందడం కష్టమవుతుంది. పైగా ప్రసవం సమయంలో చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతాయి కూడా. కింజల్దే తొలి కేసు..అదీగాక ఇంతవరకు తలసేమియాతో బాధపడుతున్న ఏ మహిళా పిల్లలను కన్న కేసు ఒక్కటి కూడా లేదు. అలాంటిది కింజల్ పట్టుపట్టి..భర్తను ఒప్పించి మరీ బిడ్డను కనేందుకు సిద్ధమైంది. డాక్టర్లు కూడా ఆమె కోరికను కాదనలేక ఓ ఛాన్స్ తీసుకుంటే ఏమవుతుందని ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు డాక్టర్ అనిల్ ఖత్రి వైద్య బృందం. వాళ్లకు కూడా కింజల్దే తొలి కేసు. వాళ్లు అత్యంత జాగ్రత్తగా కింజల్ని పర్యవేక్షించారు. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినా మూడు నెలల వరకు ఇంట్లో చెప్పొద్దన్నారు వైద్యులు. ఆ తర్వాత ఆమె కండిషన్ బాగానే ఉందని తెలిసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అలా ఆమె గర్భధరాణ సమయంలో ఏకంగా 36 సార్లు రక్త మార్పిడి చేయించుకుంది. అన్ని సార్లు చేయించుకుంటే..లోపల బిడ్డ బతకిబట్టకట్టడం కష్టం అనేది వైద్యుల ఆందోళన. కానీ కింజల్ ఆ అనారోగ్య సమస్యను సవాలు చేసేలా అధిగమించి మరీ పండండి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అదృష్టవశాత్తు ఆ చిన్నారి తలసేమియా బారినపడలేదు. అలా 2019 జూలై 12న ఆరోగ్యకరమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది కింజల్. ఓ పక్క రక్తం ఎక్కించుకుంటూనే బిడ్డకు పాలిచ్చింది కూడా. ఇప్పుడు ఆ చిన్నారికి ఆరేళ్లు. చాలా ఆరోగ్యంగా ఉంది కూడా. ఇక్కడ అనారోగ్యం ఎంత పెద్దదైనా..మనలో ధైర్యం, బాగుండాలనే ఆశ బలంగా ఉంటే సమస్య కూడా ఉఫ్మని ఎగిరిపోతుందని నిరూపించింది కింజల్. ఎలాంటి స్థితిలోనైనా ధైర్యాన్ని వివడకండి ఆనందకరమమైన జీవితాన్ని వదులోకకండి అని చెబుతున్నట్లుగా ఉంది కదా కింజల్ కథ..!. (చదవండి: యూట్యూబర్ ప్రజక్తా కోలి మెడలో హైలెట్గా తిల్హరి నెక్లెస్..! స్పెషాలిటీ ఏంటంటే..) -
తల్లి కాబోతున్న కియారా : తొలి మెటర్నిటీ ఫ్యాషన్ లుక్ అదుర్స్!
హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మా జీవితాల్లో అత్యంతవిలువైన బహుమతి రాబోతోంది అనే క్యాప్షన్తో ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన కియారా త్వరలోనే ఒక బిడ్డకు జన్వనివ్వబోతోందన్న వార్త ఫ్యాన్స్ను ఆనందంలో ముంచెత్తింది. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని కియారా భర్త సిద్దార్థ్ (Sidharth Malhotra)కూడా ఇన్స్టాలో షేర్ చేశాడు. కియారా అద్వానీ ఫ్యాషన్ మాస్ట్రో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రకటన చేయడానికి ముందు ఫ్యాషన్షోలో బాలెన్సియాగా బ్లాక్ దుస్తులను ప్రదర్శించింది. అది ట్రెడిషనల్ దుస్తులైనా, లేదా హై-ఫ్యాషన్ వెస్ట్రన్ అయినా ఆమె లుక్ స్పెషల్గా ఉంటుంది. ఇటీవల, తీరా ఈవెంట్లో, కియారా క్లాసిక్ బ్లాక్ దుస్తులు, బంగార ఆభరణాలతో ఒక బోల్డ్ స్టేట్మెంట్ లుక్తో అదరగొట్టింది. బ్రాండ్ సిగ్నేచర్ లోగోను పోలీ ఉన్న లూజ్గా ఉండేశాటిన్ జాక్వర్డ్ టాప్ ఎంచుకుంది బాలెన్సియాటూ-పీసెస్ ఎటైర్లో స్టన్నింగ్గా కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆమె తొలి పబ్లిక్ మెటర్నిటీ ఫ్యాషన్ లుక్. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) ఇక బంగారు ఆభరణాల విషయానికి వస్తే చోకర్ ,ఆకర్షించే సింహం పంజా పెండెంట్తో సహా చంకీ స్టేట్మెంట్ నెక్లెస్లను ధరించింది కియారా. భారీ చెవిపోగులు, ఉంగరాలు బ్రాస్లెట్ల స్టాక్ను కూడా జోడించింది. అంతేకాదు లౌబౌటిన్ హీల్స్లో అసలే పొడగరి అయిన కియారా మరింత సొగసరిలా అందర్నీ మెస్మరైజ్ చేసింది. -
రెండే రెండు చిట్కాలతో ఏకంగా 90 కిలోలు తగ్గింది.. వావ్ అనాల్సిందే!
బరువు తగ్గాలంటే అంత ఈజీ కాదు గురూ! ఇది ఒకరి మాట..మనసు పెట్టాలే గానీ అదెంత పనీ అనేది సక్సెస్ అయిన వారి మాట. విజయవంతంగా తాము అనుకున్నది చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది వెయిట్లాస్ జర్నీల గురించి తెలుసుకున్నాం. తాజాగా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దాదాపు 90 కిలోలు తగ్గింది. అధిక బరువుతో బాధపడే ఆమె జీవనశైలి మార్పులతో జాగ్రత్తగా తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇంతకీ ఎవరామె? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? తెలుసుకుందాం పదండి.వాస్తవానికి బరువు తగ్గడం అనేక సవాళ్లతో కూడుకున్నది. డైటింగ్ చేసి కష్టపడి బరువు తగ్గినా, దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. దీనికి మన శరీర తత్వంపై, మనం తింటున్న ఆహారంపై, మన జీవన శైలిపై అవగాహన ఉండాలి. వైద్య నిపుణుల సలహా మేరకు, ప్రణాళికా బద్దంగా ప్రయత్నించి ఒక్కో మైలురాయిని అధిగమించాలి. ఫలితంగా అధిక బరువు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించడమేకాదు కొన్ని కిలోలు తగ్గి స్లిమ్గా ఆరోగ్యంగా కనిపించడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం.న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే అదే చేసింది. తద్వారా 150కిలోల బరువునుంచి 66 కిలోలకు విజయవంతంగా బరువును తగ్గించుకుంది. కేవలం రెండేళ్లలో ఈ విజయాన్ని సాధించింది. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఉంచి ఆమె ప్రయాణం మొదలైంది. రోజువారీ శారీరక శ్రమ,ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించింది. దీనికి సంబంధించి ఎలా బరువు తగ్గిందీ ఇన్స్టాలో వివరించింది. తన అభిమానులు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. బరువు తగ్గడం ఎవరికైనా సాధ్యమేనని రుజువు చేసింది.తన కృషి , అంకితభావాన్నిఇలా చెప్పింది.‘‘బరువున్నా.. బాగానే ఉన్నాను కదా అనుకునేదాన్ని..అంతేకాదు అసలు నేను సన్నగా మారతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎలాగైతేనేం డబుల్ డిజిట్కి చేరాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. ఎంతో చెమట చిందించాను. కన్నీళ్లు కార్చాను. చివరికి ఇన్నేళ్లకు 150 కిలోల నుండి 66 కిలోలకు చేరాను’’ అని తెలిపింది.ప్రాంజల్ అనుసరించిన పద్దతులుబరువు తగ్గడానికి డైటింగ్, ఎక్స్ర్సైజ్ కంటే.. జీవనశైలిమార్పులే ముఖ్యం అంటుంది ప్రాంజల్.ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీరు త్రాగడం ప్రోటీన్ ఫుడ్ బాగా తినడం, చేపలు, పౌల్ట్రీ, రొయ్యలు ,గుడ్లు, అలాగే మొక్కల ప్రోటీన్,పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్, సోయాలాంటివి ఆహారంలో చేర్చుకోవడం.భోజనానికి ముందు సలాడ్ తీసుకోవడం ముఖ్యంగాక్యారెట్లు , కీరలాంటివాటితోసూక్ష్మపోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం తృణధాన్యాలు, పండ్లు , కూరగాయలు తినడం. ప్రతిరోజూ నాలుగు లీటర్ల నీరు త్రాగడం.వ్యాయామంప్రతి భోజనంలో ప్రోటీన్కు ప్రాధాన్యత. ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు రోజువారీ నడక. వాకింగ్ కుదరకపోతే భోజనం తర్వాత చురుకుగా ఉండటానికి 10-15 స్క్వాట్లు , పడుకునే ముందు 2-3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయడం. జిమ్కు వెళ్లడం, పైలేట్స్ , వాకింగ్ లేదా జాగింగ్ నోట్: బరువు తగ్గడం, దానిని నిర్వహించడం అనేది పూర్తి జీవనశైలి మార్పు ద్వారా సాధ్యం అనేది ప్రాంజల్ అనుభవం. ఇది అందరికీ ఒకేలా ఉండకపోయినా.. దాదాపు అందరికీ వర్తిస్తుంది. అంకితభావం , ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎవరైనా తమ లక్ష్యాలను సాధించవచ్చు. -
టైలరన్నలకు ‘రెడీమేడ్’ దెబ్బ
ధరించే దుస్తులతోనే మనిషికి అందం.. హుందాతనం లభిస్తాయి. వస్త్రానికి ఒక ఆకృతిని ఇచ్చి కళాత్మకంగా తీర్చిదిద్దేది దర్జీలే.. ప్రస్తుతం వారికి ఆదరణ తగ్గిపోయింది. మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తులు (Readymade Garments) విపరీతంగా రావడంతో జనం వాటి పట్ల మక్కువ చూపుతున్నారు. దానితో టైలర్లకు ఉపాధి కరువైంది. గతంలో పండగలు, పర్వదినాలు, శుభకార్యాల సమయంలో చేతినిండా పనితో బిజీగా ఉండే దర్జీలు (Tailors) నేడు పనులు లేక వారి కుటుంబాల పోషణ కష్టమై ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో 5,478 మంది టైలర్లు ఉన్నారు. చిన్న గదుల్లో షాపులు పెట్టుకుని వచ్చే అరకొరమందికి దుస్తులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు.ఒకప్పుడు ప్రతీ పండగకు ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దీపావళి, క్రిస్మస్, రంజాన్, బక్రీద్ తదితర పండగలకు, పలు పర్వదినాలకు, కుటుంబాల్లో వివిధ శుభకార్యాలకు ఇంటిల్లిపాదీ కొత్త వస్త్రాలు తెచ్చుకుని కుట్టించుకునేవారు. ఆయా పండుగలకు నెల ముందు నుంచే టైలర్లకు పని ఎక్కువగా ఉండేది. భోజనం చేసే తీరిక కూడా లేకుండా పనిచేసేవారు. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. దుస్తులు కుట్టించుకునేవారే కరవయ్యారు. మార్కెట్లో రెడీమేడ్ దుస్తుల దుకాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకొక ఫ్యాషన్తో దుస్తులను ఫ్యాక్టరీల్లో తయారుచేసి మార్కెట్లోకి దించుతున్నారు. దీంతో ఆ దుకాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కువ మంది అప్పటికప్పుడు ఆ దుకాణాలకు వెళ్లి తమకు కావలసిన దుస్తులను కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టైలర్లు పనులు లేక ఆ వృత్తిని వదిలేసి బతుకు జీవుడా అంటూ ప్రత్యామ్నాయ వృత్తులు వెతుక్కుని జీవనం సాగిస్తున్నారు.గతంలో ఆదుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపనులు తగ్గిపోయి కష్టాల్లో నలిగిపోతున్న టైలర్లను గత వైఎస్సార్ సీపీ (YSRCP) ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. చేతి వృత్తుల వారి కోసం జగనన్న చేదోడు పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక భరోసా కల్పించింది. దానిలో భాగంగా ప్రతీ టైలర్కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం చేసింది. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో సుమారు 5,478 మంది టైలర్ల లబ్ధి పొందారు. ఈ విధంగా ఏడాదికి సుమారు రూ.5.48 కోట్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేసేవారు. అంతేకాక ప్రతీ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాం క్లాత్ అందచేసి, దుస్తుల కుట్టుకూలీ డబ్బులను కూడా చెల్లించేది. ఆ విధంగా కూడా టైలర్లకు ఉపాధి లభించేది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం టైలర్ల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. గత ప్రభుత్వం మాదిరిగానే టైలర్లకు చేయూతనిస్తే ఆర్థిక తోడ్పాటుతో పాటు యూనిఫాం దుస్తుల ద్వారా కొంతవరకై నా ఉపాధి లబిస్తుందని టైలర్లు అభిప్రాయపడుతున్నారు.నేడు ప్రపంచ టైలర్స్ దినోత్సవంఏటా ఫిబ్రవరి 28న కుట్టుమెషీన్ సృష్టికర్త విలియమ్ ఎలియాస్ హోవే జయంతిని ప్రపంచ దర్జీల దినోత్సవం (టైలర్స్ డే) గా జరుపుకుంటున్నారు. దర్జీ చేతి పనిని, వస్త్ర పరిశ్రమలో వారిని గౌరవిస్తూ ఈ రోజును జరుపుకుంటారు. కుట్టుమెషీన్ను కనిపెట్టి తమ జీవనానికి దారి చూపిన విలియమ్ పట్ల విశ్వాసం, గౌరవంతో నియోజకవర్గ కేంద్రం కొత్తపేటలో టైలర్స్ కొన్నేళ్ల క్రితం స్థానిక పాత బస్టాండ్ వద్ద ఆ మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏటా ప్రపంచ టైలర్స్ డే (World Tailors Day) నాడు విలియమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పిస్తారు.చదవండి: ప్రజల చేతిలో ఆయుధం సైన్స్ఇదే జీవనాధారంటైలరింగ్ పనిమీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. రెడీమేడ్ దుస్తుల రాకతో వస్త్రం కొనుగోలు చేసి కుట్టించుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృత్తి రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారుతోంది. కుట్టు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం చేతి వృత్తిదారులను ఆదుకోవాలి. విద్యార్థులకు యూనిఫాం క్లాత్ ఇస్తే టైలర్లకు కొంతవరకై నా పని దొరుకుతుంది.– అవిడి వీరవెంకట సత్యనారాయణ, టైలర్, కొత్తపేట -
అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి..! ఆమె వికాస్ దివ్యకీర్తి..
భారతదేశంలో గురువులను దేవుడిగా పూజిస్తారు. తల్లిదండ్రుల తర్వాత పూజ్య స్థానం గురువులదే. అలాంటి గురువు మనసుని దోచిన విద్యార్థినే ఐఏఎస్ సాధించి ఆనందాన్ని కలిగించింది. చిన్నతనంలో తండ్రి మరణంతో చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు అయినా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. అదే తన బతుకు జీవనానికి బలమైన ఆయుధమని నమ్మింది. చివరికి ఓ మహోన్నత గురువు సాయంతో అనితర సాధ్యమైన యూపీఎస్సీ సివిల్స్లో సత్తా చాటింది. అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటే పేదరికం అడ్డంకి కాదని నిరూపించి స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరంటే..హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్వ తన్వర్ చిన్నప్పటి నుంచి మంచి తెలివైన విద్యార్థి. చాలా మెరిట్ స్టూడెంట్. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి అతి పెద్ద విషాదాన్ని ఎదుర్కొంది. ఇంటి పెద్దదిక్కు లేకపోతే ఆ కుటుంబం ఎలా రోడ్డునపడుతుందో పసివయసులోనే తెలుసుకుంది. నిత్యం చుట్టుముట్టే ఆర్థిక కష్టాలు చదవాలనే ఆలోచనను చెరిపేస్తున్నా..మొండి పట్టుదలతో చదువును సాగించింది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా..తన ఆనందం మొత్తం చదువులోనే వెతుక్కునేది దివ్య. అదే తన కష్టాలను దూరం చేసే వజ్రాయుధమని బలంగా అనుకునేది. ఎంతటి దీనస్థితిలో బాధలు అనుభవిస్తున్నా సరే ఎక్కడ చదువుని నిర్లక్ష్యం చేయలేదు. అలా దివ్య ప్రాథమిక విద్యను మహేంద్రగఢ్లోని నవోదయ విద్యాలయంలో పూర్తి చేసింది. తర్వాత మహేంద్రగఢ్లోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి బి.ఎస్సీ డిగ్రీని పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్పై దృష్టి పెట్టింది. ఆఖరికి సివిల్స్ ప్రిపేరయ్యే తాహత లేకపోయినా..గురువుల మన్ననలతో వారి సాయంతో కోచింగ్ తీసుకుంది. సాధ్యం కాదనిపించే సమస్యల నడుమ వెనకడుగు వేయని ఆమె పట్టుదల ప్రతిష్టాత్మకమైన సివిల్స్లో విజయం సాధించేలా చేసింది. తొలి ప్రయత్నంలోనే 438వ ర్యాంకు సాధించింది. అఅయితే తాను అనుకున్నట్లు ఐఏఎస్ పోస్ట్ సాధించలేకపోయింది. దీంతో మరోసారి ప్రయత్నించి ఏకంగా ఆల్ ఇండియా 105వ ర్యాంకు కొట్టి ఐఏఎస్ అధికారిణి అయ్యింది. అంతేగాదు దేశంలోని అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఐఏఎస్ కోచింగ్ వ్యవస్థాపకుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన వికాస్ దివ్యకీర్తికి ప్రియమైన విద్యార్థి అట. చాలామంది విద్యార్థులు ఆయనే రోల్ మోడల్. అంతలా విద్యార్థులను ప్రభావితం చేసే గురువు వికాస్కి ఎంతో ఇష్టమైన విద్యార్థి ఈ దివ్య తన్వర్.(చదవండి: 'సెలబ్రిటీ అట్రాక్షన్గా పంచకట్టు దోశ') -
మనసు 'దోసే'స్తారు..!
టాలీవుడ్ ప్రముఖులను సిటీలో చూడాలనుకుంటే.. కాస్ట్లీ క్లబ్లోనో, సగటు మనిషి తొంగిచూడలేని లగ్జరీ కేఫ్లోనో.. ఒక్కోసారి అనుకోకుండా మరో చోటనో తారసపడవచ్చు. కొన్ని సార్లు.. సాదా సీదా ఇడ్లీలు, దోశలు విక్రయించే టిఫిన్ సెంటర్ దగ్గర కూడా కావచ్చు. అవును మరి.. విలాస వంతమైన రెస్టారెంట్లు, ప్రత్యేకమైన క్లబ్లు హై–ఎండ్ కేఫ్లకు మాత్రమే వెళ్లడం అలవాటైన వారిని కూడా ఓ టిఫిన్ సెంటర్ రారమ్మంటోంది. అదే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉన్న రాయలసీమ శైలి ప్రత్యేకమైన అల్పాహారంతో చవులూరిస్తోంది.పంచెకట్టు అంటే.. తెలుగింటి వస్త్రధారణ గుర్తొస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ తన పేరుకు తగ్గట్టే మెనూలో సంప్రదాయం ప్రతిబింబిస్తుంది. నెయ్యి, కారం ఇడ్లీ, కారం పాళ్యం దోసె, ఉల్లి, నెయ్యి కారం దోశ, నన్నారి ఫిల్టర్ కాఫీ వంటి వెరైటీలే ఇక్కడ ఉంటాయి. ఇక దోశల తయారీ చూడటం ఒక చక్కటి అనుభవం. ప్రతి దోశనూ తక్కువ మంటపై రెండు వైపులా దోరగా కాల్చి, నెయ్యి పోసి, కారం పొడితో ప్లేట్లో ఉంచుతారు. పల్య (బంగాళదుంప కూర), టాంగీ మిరపకాయ చట్నీ క్లాసిక్ కొబ్బరి చట్నీతో కలిపి వడ్డిస్తారు.అలా మిస్సై.. ఇలా క్లిక్కై.. తాడిపత్రి మా సొంతూరు. అక్కడి నుంచి నగరానికి ఐటీ ఉద్యోగం రీత్యా వచ్చాం.. మా ప్రాంతపు వంటకాలను బాగా మిస్సయ్యేవాడిని. నాలాంటి ఫీలింగ్ మరికొందరిలోనూ చూశాక.. 2019లో ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశాను. పంచెకట్టుతో దోశలు వేయడం, తినడం మా ప్రాంతంలో సర్వసాధారణం. అందుకే ఆ పేరు పెట్టాను. అనంతరం నగరవాసుల ఆదరాభిమానాలతో పూర్తి స్థాయి రెస్టారెంట్గా మార్చాను. ఇడ్లీ, దోశలతో పాటు ఉప్మా, పొంగలి.. వంటి అల్పాహారాలు అందిస్తున్నాం. నెయ్యి, మసాలా తదితర ముడి దినుసులతో సహా చాలా వరకూ రాయలసీమ నుంచే తీసుకొచ్చి స్థానిక ఫ్లేవర్ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు పాటిస్తున్నాం. – నాగాభరణ్, పంచెకట్టు దోసె నిర్వాహకులు టాలీవుడ్ ఫేవరెట్ స్పాట్.. తొలుత ఫుడ్ ట్రక్గా ప్రారంభమైన పంచెకట్టు దోశ, ఇప్పుడు నగరం చుట్టూ నాలుగు శాఖలకు విస్తరించింది. దీని కస్టమర్లుగా టాలీవుడ్ సెలబ్రిటీలైన ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, హీరో సిద్ధార్థ, నటుడు మురళీ శర్మ, నటి లక్ష్మి మంచు తదితరులతో పాటు బ్యూటీ క్వీన్ మానుషి చిల్లర్, మేఘాంశ్ శ్రీహరి, గాయకుడు మనో, దర్శకుడు పరశురామ్ కూడా ఉన్నారు. బంజారాహిల్స్, మాదాపూర్, ప్రగతి నగర్ కొండాపూర్లలో పంచెకట్టు దోశ సెంటర్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by FORAGE HOUSE| Shreya Gupta (@forage_house) (చదవండి: అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్లో..!) -
రెట్రో టు మెట్రో..! సరికొత్త స్టైల్కి ఐకానిక్గా..
పాల మీగడను తలపించే లేత పసుపు రంగువసంతకాలాన్ని మరింత కళగా మార్చేస్తుంది. కాంతిమంతమైన రంగులను వెనక్కి నెట్టేస్తూ ఇండో– వెస్ట్రన్ స్టైల్ అయినా, సంప్రదాయ వేషధారణ అయినా ఈ స్ప్రింగ్ సీజన్లో బటర్ ఎల్లో స్పెషల్ మార్క్ వేస్తోంది.. పాజిటివ్ ఎనర్జీని చుట్టూ నింపడంలోనూ ప్రకృతిలో కొలువుండే ఆహ్లాదాన్ని కళ్లకు కడుతూ మదిని దోచేస్తోంది. రెట్రో స్టైల్కి సరైన ఎంపికగా నిలుస్తోంది. కార్పోరేట్ సంస్కృతికి కొత్త అర్ధం చెబుతూ మెట్రో స్టైల్తో బెస్ట్ మార్కులు కొట్టేస్తుంది.ఈ వసంత కాలంలోనే కాదు రాబోయే వేసవిలోనూ హాయిగొలిపే రంగుల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది బటర్ ఎల్లో. ఈ లేత పసుపు రంగు షేడ్స్ సంప్రదాయ క్లాసిక్ వేర్లోనే కాదు బోల్డ్ కాంట్రాస్ట్ కలర్స్తోనూ జత కలుస్తుంది. మృదువైన, ప్రకాశవంతమైన రంగుల ఎంపికలో బటర్ ఎల్లో ముందువరసలో ఉంది. లాంగ్ గౌన్లు, స్టైలిష్ కార్పొరేట్ వేర్గానే కాదు ఫ్యాషన్ వేదికలపైనా లేత పసుపు రంగు తనదైన ముద్ర వేస్తోంది. చందేరీ, షిఫాన్, జార్జెట్ ఫ్యాబ్రిక్లలో బటర్ ఎల్లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటే కాటన్, పట్టులలో రిచ్ లుక్తో అబ్బురపరుస్తుంది. కాంట్రాస్ట్ కలర్ ఆలోచనకు ఈ షేడ్ను దూరంగా పెట్టవచ్చు. సేమ్కలర్ ఎంబ్రాయిడరీ వర్క్, ఫ్లోరల్ ప్రింట్స్లో తెలుపు, గాఢమైన పసుపు రంగు మోటిఫ్స్, పోల్కా డాట్స్ బటర్ ఎల్లోను మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి. ఇటీవల బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ముంబైలోని ఫ్యాషన్ ఈవెంట్ బీవోఎఫ్ గాలాలో డిజైనర్ జార్జ్ స్టావ్పోలోస్ రూపొదించిన లేత పసుపు షిఫాన్ గౌను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ లుక్ 1970ల నాటి వింటేజ్ గ్లామర్ను తన డ్రెస్సింగ్ ద్వారా చూపింది.. ప్రాచీన అందాన్ని ఆధునికతతో మేళవించినట్టుగా తన డ్రెస్సింగ్ ద్వారా చూపుతూ ఈ సీజన్కు తప్పనిసరిగా ఉండవలసిన బటర్ ఎల్లో ప్రాముఖ్యతను చాటింది. (చదవండి: పువ్వులు పంచే అందం..!) -
పువ్వులు పంచే అందం..!
ఈ సీజన్లో రకరకాల పువ్వులు మనకు కనువిందు చేస్తుంటాయి. అవి మన చర్మానికి, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. కొన్నింటి సువాసనల వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంటుంది. మరికొన్ని పువ్వులు బ్యూటీ ట్రీట్మెంట్లలో చేరి, తమ గొప్పతనాన్ని చాటుతుంటాయి. బంతిపువ్వులు క్రిమినాశకంగా పనిచేస్తాయి. చర్మంపై దద్దుర్లు, చికాకులకు, మొటిమల సమస్యలు ఉన్నవారికి ఔషధంలా పనిచేస్తుంది. బంతి పువ్వు రేకలను కొద్దిగా నూరి, మొటిమలపై రుద్ది, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మొటిమల సమస్య దూరం అవుతుంది. లావెండర్ మనసుకు శాంతిని కలిగించడంలోనూ, చర్మానికి యాంటీ బాక్టీరియల్గానూ ఉపయోగపడుతుంది. మసాజ్ల కోసం లావెండర్ నూనెలు, చర్మం డీ హైడ్రేట్ కాకుండా లావెండర్ వాటర్ స్ప్రే చేస్తే తిరిగి కళగా మారుతుంది.మల్లెలతో చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పొడి చర్మం గలవారు జాస్మిన్ ఆయిల్, జాస్మిన్ ఫేస్ ప్యాక్లు వాడితే మృదువుగా మారుతుంది. ఒత్తిడి ఉపశమనానికి జాస్మిన్ సువాసనలు ఎంతో మేలు చేస్తాయి. గులాబీ – లావెండర్ ఫ్లవర్ ప్యాక్ కప్పు రోజ్ వాటర్, టీస్పూన్ ఎండిన లావెండర్ పువ్వులు, 5–6 చుక్కల లావెండర్ నూనె తీసుకోవాలి. రోజ్ వాటర్ను మరిగించి, ఎండిన లావెండర్ పువ్వులను అందులో వేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి, మిశ్రమాన్ని చల్లబరచాలి. తర్వాత వడకట్టి, ఏదైనా నూనె కలిపి రాసుకోవచ్చు. మందార పువ్వులు నిస్తేజంగా ఉన్న శిరోజాలకు కండిషనర్గా ఉపయోగపడి మెరుపును తీసుకువస్తాయి. మాడుపై ఉండే చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. గుప్పెడు మందార పువ్వులను తీసుకొని, వాటిని మెత్తని పేస్ట్లా తయారు చేసి,అందులో కొద్దిగా పెరుగు కలిపి తలకు ప్యాక్ వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారి ఉన్న శిరోజాలు మృదువుగా అవుతాయి. ‘గులాబీపువ్వులలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకే కాదు ఔషధంగా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. టోనర్గా రోజ్వాటర్, ఫేస్ మాస్క్లు, చర్మ సంరక్షణలో రోజ్ ఆయిల్ను ఉపయోగించవచ్చు. (చదవండి: అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్లో..!) -
అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్లో..!
ఒక మహిళకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ మగపిల్లలే. అయితే ఎందువల్లో ఇద్దరు డీఎన్ఏలు వేర్వురుగా ఉన్నాయి. ఒక బిడ్డ డీఎన్ఏ ఆమె భర్తతో మ్యాచ్ అవ్వగా, మరో బిడ్డ డీఎన్ఏ మాత్రం అస్సలు మ్యాచ్ కాలేదు. ఇదేంటి ఇద్దరు కవలలు ఒకేలా ఉన్నారు. ఇదెలా సాధ్యం ఒకరిది మాత్రమే తండ్రితో మ్యాచ్ అయ్యి, మరొకరిది కాకపోవడంతో వైద్యులు సైతం కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే. ఈ విచిత్రమైన ఘటన పోర్చుగల్లోని గోయాస్ రాష్ట్రంలోని మినెరోస్ నగరంలో చోటు చేసుకుంది. 19 ఏళ్ల మహిళ కవల ప్లిలలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చిన ఆనందాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఖుషీగా ఉంది. అయితే ప్రస్తతం వారికి ఎనిమిది నెలల వయసు. వారి బర్త్ సర్టిఫికేట్ల విషయమై డీఎన్ఏ టెస్ట్లు చేయగా అవాక్కయ్యే విషయం వెలుగులోకి చ్చింది. ఒక బిడ్డ డీఎన్ఏ మాత్రం ఆ మహిళ భర్తతో సరిపోయింది. మరో బిడ్డది అస్సలు మ్యాచ్ కాలేదు. దీంతో వైద్యులు సైతం ఇదేంటని తలలు పట్టుకున్నారు. అయితే ఆ మహిళలను వైద్యులు క్షణ్ణంగా ఆరా తీయగా తాను మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం బయటపెట్టింది. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి డీఎన్ఏ టెస్ట్ చేయగా ఆ వ్యక్తితో ఆ బిడ్డ డీఎన్ఏ సరిగ్గా మ్యాచ్ అయ్యింది. అయితే ఇదెలా సాధ్యం అనే ప్రశ్న వైద్యలును కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అయితే పిల్లల తండ్రులు వేర్వేరు అయినా.. జనన ధృవీకరణ పత్రంలో ఒకటే రాయాల్సి ఉంది. దీంతో ఆ మహిళ భర్తనే ఆ ఇద్దరు పిల్లలకు తండిగ్రా పేరు నమోదు చేయించుకుని ఆ బిడ్డ బాధ్యత తనే చూసుకుంటానని అనడం విశేషం.ఇది అత్యంత అరుదైన కేసు..ఈ మేరకు డాక్టర్ టులియో జార్జ్ ఫ్రాంకో మాట్లాడుతూ..ఇప్పటివరకు మొత్తం ప్రపంచంలో ఇలాంటి కేసులు 20 మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటిలో కవలల తండ్రులు వేర్వేరుగా ఉన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తల భాషలో హెటెరోపెరెంటల్ సూపర్ఫెకండేషన్ అంటారని అన్నారు. ఒకే తల్లి రెండు అండాలు వేర్వేరు పురుషుల ద్వారా ఫలదీకరణం చెందినప్పుడు ఇది జరుగుతుందని వెల్లడించారు. అయితే ఇక్కడ ఆ స్త్రీ గర్భం సాధారణంగానే ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఆ శిశువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెప్పారు. నిజంగా ఇది అత్యత విచిత్రమైన కేసు.(చదవండి: సందీప్ కిషన్: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..) -
Sundeep Kishan: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..
స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్కిషన్.బాలీవుడ్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పక్కింటి కుర్రాడిలా ఉంటే సందీప్ చాలా స్మార్ట్గా మంచి బాడీని మెయింటైన్ చేస్తాడు. అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా తన రూపురేఖలను కూడా మార్చుంటాడు చాలా సులభంగా. మరీ అతడి ఫిటనెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.అందరి హీరోల మాదిరిగా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వడట. తనకస్సలు స్ట్రిక్ట్ డైట్'పై నమ్మకం లేదని తేల్చి చెప్పాడు. దానికంటే ఏడాది పొడవునా మంచిగా తినడమే మంచిదని చెబుతున్నాడు. చాలామంది కఠినమైన డైట్లు ఎంచుకోమని చెబుతారు గానీ, దానిపై తకెందుకనో నమ్మకం రాదని, హయిగా నచ్చిన ఫుడ్ తింటూ వ్యాయామాలు చేసుకోవడమే మేలు. అలాగే అందరీ బాడీకి ఒకేవిధమైన డైట్ సెట్ అవ్వదు. ప్రతి శరీరానికి వివిధ రకాలు ఆహార నియమాలు అవసరమవుతాయిని అన్నాడు సందీప్. కాబట్టి ఎవరికి వారు తమ బాడీకి ఏది సూటవ్వుతుందో పరీక్షించుకుని ఎంచుకోవడమే ఉత్తమం అని సూచిస్తున్నాడు. తీవ్రమైన కఠిన ఆహార నియంత్రణ కంటే ఒత్తిడిని దూరం చేసే మంచి ఉత్తేజకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నొక్కి చెబుతున్నాడు. ఏదైతే ఇష్టంగా తింటారో దాన్నే తీసుకోండి, అయితే అది ఆరోగ్యకరమైనదే అయ్యి ఉండాలన్నది గుర్తించుకోండి అని అంటున్నాడు. తాను మాత్రం వివిధ రకాల ఆహారాలను ఆస్వాదించడం తోపాటు, రోజంతా యాక్టివ్గా ఉంచే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తన బాడీకి సరిపోయే వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేస్తానని అన్నాడు సందీప్. కాగా, సందీప్ నటించిన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 3' షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన 'మజాకా' మూవీ విడుదలైంది. (చదవండి: పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్ పదిసార్లు ఫెయిల్.. అయినా..!) -
పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్ పదిసార్లు ఫెయిల్.. అయినా..!
ఒక సాధారణ విధ్యార్థి ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వుతున్నాడంటే అందరూ ఎందుకురా అని ఈజీగా హేళన చేస్తారు. ఎందుకంటే డిగ్రీ వరకు ఏదో పాస్ మార్కులు సంపాదించుకున్నవాడు ప్రతిష్టాత్మకమైన సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేరవ్వడం అంటే అంత ఈజీ కాదు. చిన్న చిన్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరైతే బెటర్ కదా అని అంతా సలహలిచ్చేస్తారు. కానీ అతడు మాత్రం కష్టతరమైన సివిల్స్ ఎగ్జామ్నే ఎంచుకున్నాడు. అయితే అతడు అందులో సక్సస్ అయ్యాడా అంటే..బిహార్కి చెందిన అవనీష్ శరణ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అతడు చదువులో అంత మెరిట్ విద్యార్థి కాదు. పదోతరగతిలో జస్ట్ 44.7% అత్తెసరు మార్కులతో పాసయ్యాడు. ఇక ఇంటర్, గ్రాడ్యుయేషన్లలో కూడా జస్ట్ కొద్దిపాటి ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసయ్యాడంతే. తాను సాధారణ విద్యార్థినే అని తెలిసి కూడా యూపీఎస్సీ లాంటి పెద్ద లక్ష్యాన్ని చేధించాలని పెట్టుకోవడం విశేషం. ఏ మాత్రం తన వల్ల అవుతుందా..? అనే అనుమానానికి తావివ్వకుండా ప్రయత్నించేందుకు సిద్ధమయ్యాడు. పోనీ అలా అని విజయం అంత ఈజీగా వరించిందా అంటే లేదు. అయితే ఇక్కడ అవనీష్ జస్ట్ రాష్ట్రంలో నిర్వహించే కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ చూస్తే నోట మాటరాదు. ఒకటి, రెండు.. మూడు సార్లు కాదు ఏకంగా పదిసార్లు రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్స్ ప్రిలిమ్స్లో పెయిల్ అయ్యాడు. అయినా సరే ఏద తెలియని మొండి పట్టుదల, ఎలాగైన సాధించాలన్న కసి.. అతడిని సివిల్స్కి ప్రిపేరయ్యేలా పురిగొల్పింది. ఆ పట్టుదలే అతడిని అందర్నీ షాక్కి గురిచేసేలా అద్వితీయమైన విజయాన్ని అందుకునేలా చేశాయి. స్టేట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో నెగ్గుకురాలేని వ్యక్తి ఏకంగా యూపీఎస్సీ సివిల్స్లో ఆల్ ఇండియా 77వ ర్యాంకు సాధించగలిగాడు. అతడు రెండో ప్రయత్నంలో ఈ ఘన విజయాన్ని అందుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి నిష్క్రమించాడు. అలా అతను 2009లో ఐఏస్ అయ్యి.. సామాన్య విద్యార్థి కూడా అద్భుతమైన సక్సస్ని అందుకోగలడని ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం అవనీష్ చత్తీస్గఢ్లోని బిలాస్పుర్ జిల్లాలో ఐఏఎస్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మన సామర్థ్యం తక్కువే అని అయినా..ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించిన తెగువ ఉంటే..సామాన్యుడు సైతం అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసుకోగలా సత్తాని సొంతం చేసుకోగలడు అని నిరూపించాడు. ఎందరికో కనువిప్పు కలిగించేలా స్ఫూర్తిగా నిలిచాడు.(చదవండి: అమెరికా నుంచి భారత్కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్) -
నటి భాగ్య శ్రీ హెల్త్ టిప్స్: కాంతులీనే చర్మం, ఆరోగ్యం కోసం..!
బాలీవుడ్ నటి భాగ్య శ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు మంచి మంచి హెల్త్ టిప్స్ని షేర్ చేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలగజేస్తుంటుంది. అలాసే ఈసారి సరికొత్త హెల్త్ చిట్కాని నెట్టింట షేర్ చేసింది. అదే తన ప్రతిరోజూ ఉదయం తీసుకునే సూపర్ఫుడ్ అని చెబుతోంది. దీనివల్ల చర్మ, జుట్లు, ఆరోగ్యం బాగుంటాయని నమ్మకంగా చెప్పింది. ఇంతకీ అదెంటంటే..మెంతి గింజల ప్రయోజనాల గురించి చెప్పుకొచ్చింది ఇన్స్టాలో. నానబెట్టిన మెంతిగింజలు ఒక సూపర్ ఫుడ్ అని అది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుందని, రక్తాన్ని శుభ్రపరిచి..ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని, అద్భుతమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయని చెప్పుకొచ్చారు. వీటిని గనుక డైలీ లైఫ్లో భాగం చేసుకుంటే ఆరోగ్యంలో చక్కటి మార్పుని చూస్తారని అన్నారామె. ముఖ్యంగా కాంతులీనే చర్మాన్ని అందివ్వడంలోనూ, జుట్టు ఆరోగ్యంలోనూ కీలకంగా ఉంటుందని పేర్కొంది. నిపుణులు ఏం అంటున్నారంటే..మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మెంతుకు సాటిలేదని చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి సవివరంగా వెల్లడించారు. అవేంటంటే..దీనిలోని ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్ధకాన్ని నివారిస్తుందిగ్యాస్ సమస్యలను తగ్గిస్తుందిబరువుని అదుపులో ఉంచుతుంది, ఆకలిని అరికట్టి జీవక్రియను మెరుగ్గా ఉంచుతుందికీళ్ల నొప్పులు, ఉబ్బసం వంటి సమస్యలను తగ్గిస్తుందిమెరుగైన తల్లిపాల ఉత్పత్తిలో కీలకంగా ఉంటుంది. చక్కెర స్థాయిల నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుందిమొటిమలు, ముడతలను తగ్గిస్తుంది.జుట్టు రాలడం తగ్గుతుందిపీసీఓఎస్ సమస్యలు అదుపులో ఉంటాయి. శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.కాగా, నటి భాగ్యశ్రీ గతంలో చర్మ సౌందర్యానికి ఉపయోగ పడే గ్రీన్జ్యూస్ ప్రయోజనాలను గురించి పంచుకున్నారు. తాజాగా మరో ఆరోగ్య చిట్కాతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలందించే మెంతులు గురించి నెటిజన్లతో షేర్ చేసుకున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణలను సప్రదించడం మంచిది. (చదవండి: అమెరికా నుంచి భారత్కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్) -
చిటికెలో ఇంటి పనులన్నీ ఫినిష్ ఎలాగో తెలుసా..!
మహిళలు కూడా ఉద్యోగాలు చేయడంతో ఇంట్లో పనిమనిషి లేకపోతే చాలా కష్టం. ఆమె ఒక్క రోజు డ్యూటీకి రాలేదా..? ఇంట్లో ఉండే హడావిడి అంతఇంత కాదు. ఎప్పుడు ఈ పనిమనిషి లీవ్ పెడుతుందోనన్న టెన్షన్తో చాలా ఇబ్బంది పడుతుంటారు చాలామంది మహిళలు. ఇక ఆ బాధ లేకుండా మన ఇంటిలో పనులన్నీ చకచక చేసిపట్టే రోబో మన జీవితంలో భాగం కానుంది త్వరలో. మరీ ఆ ఇంటి పనుల రోబో విశేషాలేంటో చూద్దామా..!.రోబోలు మన ఇంట్లో తిరుగాడే రోజులు సుదూర కల కాకపోవచ్చు. నార్వేకు చెందిన రోబోటిక్స్ కంపెనీ ‘1 ఎక్స్’ వివిధ రకాల పనులు చేయగల కొత్త రోబోను మార్కెట్లోకి తీసుకు వచ్చింది.‘నియో గామా’ అనే ఈ హ్యూమనాయిడ్ రోబోట్ ఇంటిపనులకు సహాయపడుతుంది. సహజ కదలికలతో ఆకట్టుకుంటుంది. కంపెనీ షేర్ చేసిన ప్రమోషన్ క్లిప్లో... నైలాన్ నిట్ సూట్ ధరించిన రోబో కాఫీసర్వ్ చేయడం, పెయింటింగ్ వేలాడదీయడం, బుట్ట మోయడం, అద్దాలు శుభ్రం చేయడం, బయటినుంచి వచ్చిన వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం... మొదలైన దృశ్యాలు ఉన్నాయి. ఇంటి పనులు సరే... ఈ హ్యూమనాయిడ్ రోబోట్లు సాంకేతికపరంగా ఎంత వరకు భద్రం అనే అనుమానాన్ని దృష్టిలో పెట్టుకొని...‘నియో గామా భద్రతకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకున్నాం’ అని ప్రకటించింది కంపెనీ. (చదవండి: అమెరికా నుంచి భారత్కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్) -
అమెరికా నుంచి భారత్కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటారు. అందుకోసమే యువత అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు పయనమవుతోంది. ఆ దేశాలు వారికి వృత్తిపరమైన అబివృద్ధితోపాటు ఆర్థిక స్థైర్యాన్ని కూడా అందిస్తున్నాయి. అయితే ఇది కాస్త సవాళ్లతో కూడినది కూడా. పైగా ఆ దేశాల సంస్కృతికి అనుగుణంగా బతకడం అనేది అంత ఈజీ కూడా కాదు. తమ వాళ్లను వదిలి ఆ కొత్త వాతావరణంలో నెగ్గుకురాక తప్పని స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఓవ్యక్తి మాత్రం పదేళ్లకు పైగా విదేశంలో ఉండి మరీ..తాను స్వదేశానికి వచ్చి మంచి పనిచేశానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని చెప్పేస్తున్నాడు. విదేశాలకి వెళ్తేనే మంచి లైఫ్ అనుకునేవారి ఆలోచనకు అత్యంత విభిన్నంగా తన మనోభావాలను ఆన్లైన్ వేదికగా షేర్ చేసుకున్నాడు ఈ సీఈవో.ఎందుకంటే..ఆర్క్అలైన్డ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అనిరుద్ధ అంజనా అమెరికాలో ఒక దశాబ్ద కాలం పాటు ఉన్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు భారతదేశానికి తిరిగి రావాలని గట్టిగా నిర్ణయించుకుని మరీ వచ్చేశారు. అయితే వాళ్లు వీసా సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం వంటి రీజన్లు కాకుండా బలమైన కారణాన్ని వివరిస్తూ నెటిజన్ల మనసును దోచుకున్నారు. ఇంతకీ ఎందువల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడంటే..అనిరుద్ధ తన వృద్ధ తల్లిదండ్రులును చూసుకోవాలనే ఉద్దేశ్యంతో స్వదేశానికి తిరిగి వచ్చేశానని అన్నారు. జాబ్ సెక్యూరిటీ, వలస అనిశ్చితులు, కెరీర్ సమస్యల వల్ల కాదని తేల్చి చెప్పేరు. కేవలం తన కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన తల్లిదండ్రులకు తన అవసరం ఉన్నందున తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాడు. అయితే తన స్నేహితులు బంధువులు నుంచి తాను ఉద్యోగం కోల్పోవడం, వీసా సమస్యలు వల్ల ఇలా నిర్ణయం తీసుకున్నానంటూ పలు వ్యాఖ్యాలు వచ్చాయి. కానీ అసలు రీజన్ మాత్రం తల్లిదండ్రులతో పూర్తి సమయం వెచ్చించేందుకే ఇలా చేశానంటూ తెలిపారు. వారు నన్ను తిరిగి వచ్చేయమని ఎప్పటికీ అడగరని తెలిసే ఇలా చేశానంటూ ఇన్స్టాగ్రాంలో వివరించారు సీఈవో అనిరుద్ధ. తాను జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదేనని చాలా నమ్మకంగా చెప్పారు. అనిరుద్ధ పోస్ట్ సోషల్మీడియా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అతని పోస్ట్పై స్పందిస్తూ..సవాలుతో కూడిన చక్కటి నిర్ణయం అని ఒకరు, బంధాల విలువను తెలిపేలా ఉంది, అందరూ ఇలా ఆలోచిస్తే బాగుండును అంటూ మరొకరు ఇలా అనిరుద్ధ నిరర్ణయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Aniruddha (@growwith_ani) (చదవండి: 'గైనకాలజీ పితామహుడు': అనస్థీషియా లేకుండా నల్లజాతి మహిళలపై..!) -
తీవ్రమైన పగటి కలలతో విసిగిపోయారా? నియంత్రణ ఎలా?
డాక్టరు గారూ! నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నాకీ మధ్య పగటి కలలు ఎక్కువగా వస్తున్నాయి. క్లాసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నడుస్తున్నా, ఏ పనిలో ఉన్నా, ఏవేవో పగటి కలలు వస్తున్నాయి. కలెక్టర్ను చూస్తే కలెక్టర్ అయినట్లు, పోలీస్ అఫీసర్ను చూస్తే ఎస్.పి. ని అయినట్లు, సినిమాలో హీరోయిన్ను చూస్తే నేను కూడా హీరోయిన్ అయినట్లు, ఇలా రకరకాలుగా పగటి కలలు, ఊహలు వస్తున్నాయి. ఆటోలో బస్సులో వెళుతున్నప్పుడు ఇవి మరీ ఎక్కువగా వస్తున్నాయి. అలా వచ్చినప్పుడల్లా చాలా హాయిగా ఉంటుంది. దాంట్లోంచి బయట పడగానే అయ్యో! ఇది నిజం కాదా అని చాలా బాధ కలుగుతుంది. క్లాసులో ఇలా కలలు రావడం వల్ల చదువు కూడా దెబ్బతింటోంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అని ఆందోళనగా ఉంది. ఈ ఊహల్లోంచి బయట పడే మార్గం చెప్పండి – ప్రణీత, మహబూబ్ నగర్ఇలా కలలు, పగటి కలలు కనడం మనిషికి చాలా సహజం. ఈ ప్రపంచంలో అసలు కలలు–పగటి కలలు ఎప్పుడో ఒకసారి కనని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇలా పగటి కలలు... అంటే ‘డే డ్రీమింగ్’ యుక్త వయసులో చాలా సహజం. మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురైనవారు, ‘ఎ.డి.హెచ్.డి.’ అంటే నిలకడ, ఏకాగ్రత లేకుండా ఓవర్ యాక్టివ్గా ఉండేవారిలో కూడా ఈ పగటి కలలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. మనం అనుకున్నవన్నీ నిజ జీవితంలో సాధించలేనప్పుడు, కొంత సేపైనా ఊహాలోకంలో విహరించి, నిజజీవితంలో పొందలేనివి ఇలా ఊహల్లోనైనా పొంది మనిషి తృప్తి పొందాలనుకుంటాడు. ఎడారిలాంటి మన జీవితాలకు పగటి కలలు ఒక ‘ఒయాసిస్’ లాగా పనిచేస్తాయి. అసంతృప్తితో ఉన్న మనసుకు ఈ పగటికలలు కొంత ఊరట కలిగించి, మన బాధలకు సమస్యలకు ఒక ‘ఔట్లెట్’ లాగా పనిచేసి మనల్ని సంతృప్తి పరుస్తాయి. మరికొందరికి పగటికలలు, వారిలో ‘క్రియేటివిటీ’ పెరిగేందుకు, జీవిత సమస్యలనుండి కొన్ని పరిష్కారాలు పొందేందుకు కూడా తోడ్పడతాయి. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!కానీ ‘అతి సర్వత్రా వర్జయేత్!’ అన్నట్లు ఏదైనా అతిగా ఉంటేనే ఇబ్బంది. వాస్తవాన్ని పూర్తిగా మరచి, పగలంతా పగటి కలల్లో, విహరించడమనేది అంత మంచిది కాదు. దీనివల్ల మీ చదువు, ఇతర పనులు దెబ్బతింటాయి. మీరు మీ జీవిత గమ్యాలను ప్రతిరోజు స్మరించుకుంటూ, వాటిని సాధించేందుకు, మీ శక్తియుక్తులను పూర్తిగా వినియోగించండి. ఏకాగ్రత నిగ్రహ శక్తి, పెంచుకునేందుకు సరైన నిద్ర, ధ్యానం, ప్రాణాయామం, మైండ్ఫుల్నెస్, ఉపయోగపడతాయి. మీకిష్టమైన వేరే వ్యాపకాలపై ధ్యాస పెట్టండి. జీవితంలో పగటి కలలు ఒక భాగమే తప్ప పగటి కలలే జీవితం కారాదు! -
రంగరంగ వైభవంగా..
నిన్నా మొన్నటి దాకా సినిమాల ప్రభావంతో కుదేలైపోయిన నాటక రంగం.. ఇప్పుడు ఓ వైపు సినిమాలు, మరోవైపు ఓటీటీలు, ఇంకెన్నో డిజిటల్ వినోదాలూ.. విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వీటన్నింటినీ తట్టుకుంటూ నగరవాసుల్ని తన ప్రదర్శనల వైపు నడిపిస్తోంది. యువతరాన్ని ఆకట్టుకుంటూ కాలేజీ క్యాంపస్లతో పాటు కార్పొరేట్ కంపెనీల ఆడిటోరియమ్స్ దాకా నాటకాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సరికొత్త ఉత్సాహానికి కారణం.. ఆధునికులకు నచ్చే యూత్ కలర్స్ రంగరించి.. రంగస్థల ఈవెంట్స్ను సిటిజనులకు చేరువ చేయడంలో డ్రామానన్ వంటి సంస్థలు నగరానికి రావడం ఒక కారణంగా చెప్పొచ్చు. ఈశాన్య రాష్ట్రమైన మణిపాల్లో పాతికేళ్ల క్రితం 2000వ సంవత్సరంలో డ్రామనాన్(డ్రామాటిస్ట్ అనామిక) ఏర్పాటైంది. వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్ ఆర్కే షెనాయ్, దివంగత చందన్ శతపతిలు స్థాపించిన ఈ థియేటర్ గ్రూప్.. పాతిక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా 450కి పైగా ప్రదర్శనలతో 70కి పైగా నాటకాలను విజయవంతంగా ప్రదర్శించింది. అనంతరం అర్బన్ ప్లానర్ అయిన ఆర్కే షెనాయ్ మన నగరానికి మకాం మార్చాక 2007లో డ్రామానాన్ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభమైంది. అప్పటి నుంచి డ్రామనాన్ నగర థియేటర్ రంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 2007లో భారతీయ విద్యాభవన్లో విలియం సెబ్రింగ్ రచించిన ‘ది ఒరిజినల్ లాస్ట్ విష్ బేబీ’తో ప్రారంభించి, ‘ఫూల్స్, ది గుడ్ డాక్టర్, పిజ్జాజ్ అండ్ డబుల్స్, ది లాస్ట్ రిసార్ట్, లవ్, లాస్ట్, 24 రూబుల్స్ లాస్ట్, అదర్ ఫాస్ట్ ఫుడ్స్.. ఇలా అనేక సొంత నాటకాలను సిటీలో ప్రదర్శించింది. ఆదరణ.. అవార్డ్స్.. 19 సంవత్సరాలుగా డ్రామనాన్ దేశవిదేశాలలో వివిధ ఉత్సవాల్లో ప్రదర్శనలు సమర్పించింది. గత 2015లో, బ్రాడ్వే ఆన్లైన్ మ్యాగజైన్ డ్రామనాన్ను దేశంలోని టాప్–20 థియేటర్ గ్రూపులలో ఒకటిగా పేర్కొంది. డ్రామనాన్ హైదరాబాద్ 2012, 2013లో ఐనా థియేటర్ పోటీల్లో, 2013లో షార్ట్ ప్లస్ స్వీట్ థియేటర్ పోటీల్లో గెలుపొంది సిటీ థియేటర్ సత్తా చాటింది. ప్రముఖ నటులు రజిత్ కపూర్ షెర్నాజ్ పటేల్ నటించిన రేజ్ ప్రొడక్షన్స్ ‘లవ్ లెటర్స్’ వంటి ప్రసిద్ధ నాటకాలను కూడా డ్రామనన్ నిర్మించింది.స్కిట్.. ఫైట్.. షురూ.. థియేటర్ ప్రేమికులు, ఔత్సాహిక నటీనటులను ప్రోత్సహించేందుకు ‘స్కిట్స్’ అనే 12 నిమిషాల షార్ట్ ప్లే కాంటెస్ట్ని డ్రామనాన్ ప్రారంభించింది. ఇందులో నగరానికి చెందిన వివిధ కార్పొరేట్ సంస్థలు, ఔత్సాహిక అనుభవజ్ఞులైన థియేటర్ గ్రూప్స్ పాల్గొంటున్నాయి. ఒక వార్షిక కార్యక్రమంగా మారిన ఈ పోటీల్లో అతుల్ కుమార్, రజిత్ కపూర్, షెర్నాజ్ పటేల్, అభిక్ మజుందార్ ప్రకాష్ కోవెలమూడి తదితర రంగస్థల ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. 1, 2 తేదీల్లో ప్రిలిమినరీ పోటీలు.. ఈ పోటీల్లో ఈ ఏడాది 24 టీమ్స్ పాల్గొంటున్నాయి. స్కిట్స్ కార్యక్రమం నుంచి ‘ఉత్తమ నటుడు’, ‘ఉత్తమ దర్శకుడు’, ‘ఉత్తమ ప్లే’, ‘ఉత్తమ ఒరిజినల్ స్క్రిప్్ట’, ‘ఉత్తమ పోస్టర్’, ‘ఉత్తమ ప్రచార వీడియో’, ‘ఆడియన్స్ ఛాయిస్ ప్లే’ వంటి పురస్కారాలు అందిస్తున్నారు. మొత్తం ప్రైజ్ మనీ రూ.1,20,000 వరకూ ఉంటుంది. ఈ పోటీలకు సంబంధించి ప్రాథమిక రౌండ్ స్కిట్లు 1, 2వ తేదీల్లో గచి్చ»ౌలిలోని సుప్రీమ్ ట్రాంపోలిన్ పార్క్ సమీపంలో ఉన్న ఎలైన్డ్ ఎంప్లాయీస్ కాలనీలోని రంగభూమి స్పేసెస్లో జరుగుతాయి. -
చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?
దేశంలో ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఈ తరహాలో గుండెపోటు, స్ట్రోక్, గుండె, ధమనుల వ్యాధులు వృద్ధులలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పాతికేళ్లలోపువారిలోనూ గుండపోటు కేసులు వెలుగు చూస్తున్నాయి. దీనికి కారణమేమిటి? వైద్యులు ఏమంటున్నారు?పురుషుల్లోనే అధికంఇండియన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్నేళ్లుగా 50 ఏళ్లలోపు వయసుగల వారిలో గుండెపోటు ముప్పు 50 శాతం, 40 ఏళ్లలోపు వారిలో 25 శాతం మేరకు పెరిగింది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో.. మహిళల్లో గుండెపోటు కేసులు చాలా తక్కువని తెలిపింది. పురుషులు ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ధూమపానం, మద్యపానం అనేవి యువతలో హృదయ సంబంధ వ్యాధులకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ వ్యసనాల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఇది కరోనరీ హార్ట్ డిసీజ్కు దారితీస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది రక్త నాళాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది.కారణాలివే..👇👉ఆహారపు అలవాట్లుఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ పని ఒత్తిడి మరింతగా పెరిగింది. దీంతో యువత తమ ఆహారపు అలవాట్లు, దినచర్యపై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇది పలు రకాల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తోంది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని కారణంగా శరీరంలోని కేలరీల పరిమాణం పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.👉అధిక పని ఒత్తిడిమానసిక ఒత్తిడి కూడా గుండెపోటుకు కారణంగా నిలుస్తోంది. పని భారం అనేది నేరుగా రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా యువకులు, మధ్య వయస్కులు రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఎనిమిది గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.👉మధుమేహం యువతలో గుండె జబ్బులకు మధుమేహం (డయాబెటిస్) కూడా ఒక ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో డయాబెటిస్ రోగులు అత్యధికంగా ఉన్నారు. 2019లో భారతదేశంలో 7.7 కోట్ల మంది డయాబెటిక్ బాధితులు ఉన్నారని పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2045 నాటికి డయాబెటిస్ రోగుల సంఖ్య 13 కోట్లకు పైగా పెరుగుతుందనే అంచనాలున్నాయి.జిమ్, డ్యాన్స్ సమయంలోనే ఎందుకంటే..అధికంగా శారీరక శ్రమ చేయడం వలన గుండె ధమనులలో అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ చీలిపోయే ప్రమాదం మరింతగా పెరుగుతుంది ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఛాతీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే గుండెపోటు ముప్పు కూడా మరింతగా పెరుగుతుంది. అందుకే నిపుణుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా నృత్యం చేసే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నృత్యం చేసే సమయంలో హృదయ స్పందన పెరుగుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఊబకాయం కలిగివారు, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఎక్కువ స్టెప్స్ కలిగిన నృత్యం చేస్తున్నప్పుడు వారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్తపడండిఛాతీ, వీపు, గొంతు, దవడ లేదా రెండు భుజాలలో తరచూ నొప్పిగా అనిపిస్తుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అలాగే ఉన్నట్టుండి చెమటలు పడుతున్నా, ఊపిరి ఆడటం కష్టంగా అనిపించినా, రెండు అడుగులు కూడా వేయలేనంత నీరసంగా అనిపించినా వెంటనే వైద్య నిపుణులను కలుసుకోవాలి. ఇదేవిధంగా ఛాతీలో, ఉదరంలో గ్యాస్ ఏర్పడినా, విపరీతమైన అలసట లేదా తల తిరుగుతున్నట్లు ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఛాతీ నొప్పి, విశ్రాంతి లేకపోవడం, శ్వాస సమస్యలు లేదా వేగంగా శ్వాస తీసుకోవడం మొదలైనవి గుండెపోటు సంబంధిత లక్షణాలు కావచ్చని గుర్తించాలని, ఇటువంటి సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు.గుండెలో సమస్యలు👉హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిగుండె కండరాలు గట్టిపడే జన్యుపరమైన రుగ్మత. దీని వలన గుండె రక్తాన్ని సమర్ధవంతంగా పంప్ చేయలేకపోతుంది.👉డైలేటెడ్ కార్డియోమయోపతి దీనిలో ఎడమ జఠరిక పెద్దదిగా, బలహీనంగా మారుతుంది. ఇది గుండెకు రక్తాన్ని సమర్థవంతంగా ప్రసరింపజేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.👉అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ డిస్ప్లాసియా దీనిలో కొవ్వు లేదా పీచు కణజాలం గుండె కండరాలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ప్రాణాంతక అరిథ్మియా ముప్పును మరింతగా పెంచుతుంది.ముందుగా చేసే పరీక్షలివే..👉ఎకోకార్డియోగ్రఫీ (ఎకో) గుండె పనితీరునంతటినీ అంచనా వేయడానికి చేసే గుండె సంబంధిత అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ఇది.👉స్ట్రెస్/ట్రెడ్మిల్ పరీక్ష శారీరక శ్రమ చేసే సమయంలో గుండె ఎలా స్పందిస్తుందో ఈ పరీక్ష అంచనా వేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను గుర్తిస్తుంది.👉జెనెటిక్ పరీక్ష ఆకస్మిక గుండెపోటు, వారసత్వంగా వచ్చిన గుండె సంబంధిత సమస్యలు, కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు.👉హోల్టర్ పర్యవేక్షణ హోల్టర్ మానిటర్ అనేది హృదయ స్పందనను రికార్డ్ చేస్తుంది. ఇది గుండె సంబంధిత అసాధారణ సంకేతాలను తనిఖీ చేస్తుంది. బాధితులకు అవసరమైనప్పుడు వైద్యులు 24 గంటల హోల్టర్ పర్యవేక్షణను సూచిస్తుంటారు.వెంటనే ఏం చేయాలంటే..అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్ అనేది ప్రాణాలను కాపాడుతుంది. సీపీఆర్ చేయడం ద్వారా మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. కణజాల మరణాన్ని కొంతసేపటి వరకూ నివారిస్తుంది. సీపీఆర్ అందని పక్షంలో ఐదు నిమిషాల్లో మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. ఎనిమిది నిమిషాల తర్వాత మరణం దాదాపు ఖాయమని వైద్యులు చెబుతున్నారు.అత్యవసర సేవలకు కాల్ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే పక్కనే ఉన్నవారు ఆ వ్యక్తిని కదిలిస్తూ ‘బాగున్నారా?’ అని గట్టిగా అడగాలి. వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాలి. బాధితులు శ్వాస తీసుకుంటున్నాడా లేదా అనేది గుర్తించాలి. బాధితుడు శ్వాస తీసుకోకవడం లేదని గుర్తిస్తే అతని ఛాతీ మధ్యలో గట్టిగా వేగంగా అదమండి. నిమిషానికి 100 నుండి 120 సార్లు ఇలా చేయాలి. సీపీఆర్లో శిక్షణ పొందినవారు 30 కంప్రెషన్ల తర్వాత రెస్క్యూ శ్వాసలను అందించగలుగుతారు. శిక్షణ పొందనివారు ఛాతీ కంప్రెషన్లను కొనసాగించాలి. అదేవిధంగా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.ఇది కూడా చదవండి: Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు -
Indian students: యూరప్ పిలుస్తోంది..
అమెరికా డాలర్ కల కరిగిపోతోంది. బాగా చదువుకొని యూఎస్లో స్థిరపడాలని ఆశించిన యువత ఆశల రెక్కలను ట్రంప్ మహాశయుడు తుంచేశాడు. ఏదో ఒక విధంగా అమెరికాకు వెళితే చాలు నాలుగు డాలర్లు వెనుకేసుకోవచ్చని ఆశించిన లక్షలాది మంది విద్యార్థులు, యువత భంగపాటుకు గురయ్యారు. నకిలీ కన్సల్టెన్సీలను నమ్ముకొని, ఊరూ, పేరూ లేని విశ్వవిద్యాలయాల్లో చేరి ఉన్నత చదువుల నెపంతో రకరకాల ఉద్యోగాలు చేస్తున్న యువత ట్రంప్ దెబ్బకు తిరుగుపయనం అవుతున్నారు.మరోవైపు తమ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని, అగ్రదేశంలో ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకొన్న తల్లిదండ్రులు సైతం ట్రంప్ దెబ్బతో తల్లడిల్లుతున్నారు. ఈ క్రమంలో ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడాలని, బాగా సంపాదించాలని కోరుకొనే యువతను ఇప్పుడు యూరప్ దేశాలు ఆకర్షిస్తున్నాయి. కేవలం ఐటీ ఆధారిత కోర్సులు, ఐటీ ఆధారిత ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాకుండా లైఫ్సెన్స్, ఎని్వరాన్మెంటల్, బయోటెక్నాలజీ వంటి కోర్సుల్లోనూ అద్భుత అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు తమ అభిరుచికి తగిన వాటిని ఎంపిక చేసుకోవచ్చని పలు కన్సల్టెన్సీలు సూచిస్తున్నాయి. యూఎస్కు వెళ్లే విద్యార్థుల్లో చాలామంది ప్రామాణికమైన విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నకిలీ కన్సల్టెన్సీలను నమ్మి మోసపోతున్నారు. ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన తరువాత ఆ దేశంలో ఉండే కన్సల్టెన్సీలు సైతం విద్యార్థులను మరోవిధంగా మోసం చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక ప్రామాణికమైన విశ్వవిద్యాలయంలో చేరేందుకు కనీసం రూ.40 లక్షల వరకూ ఖర్చు కావచ్చు. కానీ తాము కేవలం రూ.8 లక్షలతో మరో వర్సిటీలో తమకు నచి్చన కోర్సుల్లో చేరి్పస్తామంటూ నమ్మిస్తున్నారు. మరోవైపు పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో అలాంటి యూఎస్ కన్సల్టెన్సీలను నమ్మి నకిలీ వర్సిటీల్లో చేరుతున్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో భాగంగా మొదటి 36 నెలల పాటు పార్ట్టైమ్ ఉద్యోగం చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు లాటరీలో హెచ్–1 వీసా లభిస్తే ఇక భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండబోదనే ఆలోచనతో తక్కువ బడ్జెట్ ఆఫర్లతో ఆకట్టుకొనే వర్సిటీల్లో చేరుతున్నారు. మరి కొందరు రకరకాల విశ్వవిద్యాలయాల పేరిట ఆన్లైన్ కోర్సుల్లో చేరి ఒకే సమయంలో రెండు, మూడు రకాల పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా ఒక నిర్థిష్ట లక్ష్యం లేకుండా, ప్రామాణికమైన విశ్వవిద్యాలయంలో చేరకుండా ఏదో ఒకవిధంగా స్థిరపడాలని భావించే వారిపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. యూఎస్లోని వివిధ ప్రాంతాల్లో కనీసం లక్షన్నర మంది విద్యార్థులు ఉన్నట్లు నగరానికి చెందిన ఓ ప్రముఖ కన్సల్టెన్సీ వెల్లడించింది. ట్రంప్ విధానాల ఫలితంగా ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు ఇంటిదారి పట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధి చెబుతున్న మాట.వెల్కం టు యూరప్.. ఈ క్రమంలో యూరప్ విశేషంగా ఆకట్టుకుంటోంది. విదేశాల్లో చదువుకొని స్థిరపడాలని కోరుకొనే విద్యార్థులు ప్రస్తుతం బ్రిటన్, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ తదితర దేశాలను ఎంపిక చేసుకుంటున్నారు. ‘యూఎస్లో ఎన్నికల వాతావరణం మొదలైనప్పటి నుంచి విద్యారంగంలో మార్పులు కనిపించాయి. ముఖ్యంగా ట్రంప్ గెలుపు అనివార్యంగా మారిన తరువాత చాలా మంది విద్యార్థులు యూఎస్ ఆలోచనను విరమించుకొని బ్రిటన్, తదితర దేశాలకు వెళ్తున్నారు.’ అని అమీర్పేట్కు చెందిన కాన్వొకేషన్స్ స్క్వేర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకులు హిమబింధు కోల్లా తెలిపారు. జర్మనీ, ఫ్రెంచ్ వంటి భాషల్లో కొద్దిపాటి ప్రవేశం ఉన్నా చాలు అక్కడి విద్యాసంస్థల్లో చేరవచ్చు. స్విట్జర్లాండ్లోనూ గొప్ప విద్య, ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల ప్రధాని పర్యటనతో మన విద్యార్థులకు ఫ్రాన్స్ ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం 5 సంవత్సరాల గడువుతో కూడిన వీసాలు ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేయవచ్చు. జర్మనీలో స్థిరపడుతున్న తెలుగువాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడ స్థిరపడాలనుకొనేవారికి చక్కటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.సృజనాత్మకతకు పెద్దపీట.. చాలా మంది బీటెక్ చదివి ఇంజినీరింగ్ వైపే వెళ్లాలని భావిస్తారు. కానీ ఎన్విరాన్మెంటల్ సస్టెయినబుల్ గవర్నెన్స్ (ఈఎస్జీ), వేస్ట్మేనేజ్మెంట్, ఏఐ ఎథి్నక్స్, సైబర్క్రైమ్, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ, నర్సింగ్, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వంటి వివిధ కోర్సుల్లో ప్రతిభను చాటే విద్యార్థులు, యువతకు యూరప్ దేశాల్లో అద్భుత అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.స్పష్టమైన లక్ష్యంతో ఢోకా లేదు.. అమెరికాలో కూడా చదువుకోవచ్చు. అక్కడే మంచి ఉద్యోగాల్లో చేరి స్థిరపడొచ్చు. కానీ ఏ లక్ష్యంతో వెళ్లాలి, ఏ విశ్వవిద్యాలయంలో చదవాలనే విషయంలో స్పష్టత ఉండాలి. యూరప్లో అభిరుచికి తగిన కోర్సుల్లో చదివి ఉద్యోగాలు సంపాదించుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. – హిమబింధు కోల్లా, కాన్వొకేషన్స్స్కే్వర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ -
Father of Gynecology: ప్రయోగాల వెనుక దారుణ నిజాలు..!
ప్రస్తుతం గైనకాలజీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గానీ పూర్వం రోజుల్లో ఇవి లేక మహిళలు చాలా ఇబ్బందిపడేవారు. తమ సమస్యలను మరొకరితో చెప్పుకునేందుకు కూడా సిగ్గుపడేవారు. అలాంటి పరిస్థితుల్లో వారుపడే అంతర్గత గైనకాలజీ సమస్యలు చికిత్స లేనివిగా ఉండేవి. ఆ దిశగా ప్రయోగాలు చేసేవాళ్లు కూడా తక్కువే. అందులోనూ స్త్రీ శరీర ధర్మాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందుకు అనుగుణంగా చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటిపై ధైర్యంగా ప్రయోగాలు చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి జేమ్స్ మారియన్ సిమ్స్. అతని వల్లే స్త్రీల ప్రసూతి సమస్యలకు నివారణోపాయాలు కనిపెట్టడానికి మార్గం సుగమమైంది. ఆ నేపథ్యంలో అతడు ఒడిగట్టిన దారుణలు తెలిస్తే వామ్మో అని విస్తుపోతారు. 'గైనాకాలజీ' అనే అంశం వస్తే అతడికే ధన్యవాదాలు చెప్పుకొవాలి. అంతేగాదు అతడిని "ఆధునిక గైనకాలజీ పితామహుడు"గా అభివర్ణిస్తారు కూడా. అయితే ఈ గైనకాలజీ సమస్యలను నివారించే క్రమంలో అతడు చేసిన దారుణ ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. గైనకాలజీ నిపుణులు జేమ్స్ మారియన్ సిమ్స్ 1813లో అమెరికా సౌత్ కరోలినాలోని లాంకాస్టర్ కౌంటీలో జన్మించాడు. అతడు జెఫెర్సన్ మెడికల్ కాలేజీలో మూడు నెలల కోర్సు పూర్తి చేసుకుని ఒక వైద్యుడి వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేశాడు. ఆ తర్వాత సాధారణంగా కొన్నేళ్లు హౌస్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఆ కాలంలో సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేయకుండానే నేరుగా వైద్య వృత్తిని కొనసాగించేవారు. ఆ నేపథ్యంలోనే ఆయన వల్ల ఇద్దరు రోగులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత జేమ్స్ అలబామాలోని మోంట్గోమెరీకి మకాం మార్చాడు. అక్కడ జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో వైద్య మానవీయ శాస్త్రాల ప్రొఫెసర్ వెనెస్సా గాంబుల్ ఆధ్వర్యంలో డాక్టర్గా పనిచేసేవాడు. అక్కడ ఉండే ఎనిమిది మంది వ్యక్తుల ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందించేవాడు. కొందరిని తన ఇంటికి తీసుకువెళ్లేవాడు. అక్కడ వారిపై ప్రయోగాలు చేసేవాడు. అయితే ఆరోజుల్లో మహిళల ప్రసూతికి సబంధించిన సమస్యలను పరిశీలించడానకి సరైన పరికరాలు ఉండేవి కాదు. దీంతో వారి సమస్యను అర్థం చేసుకునేందుకు ప్రత్యత్పత్తి అవయవాల్లోకి వేళ్లను చొప్పించి గానీ తెలుసుకోవడానికి వీలు ఉండేది కాదు. అలాగే వారికి చికిత్స చేసేందుకు అనువైన బెడ్ కూడా ఉండేది కాదు. అవమానీయ పద్ధతుల్లో మహిళలకు ట్రీట్మెంట్ చేయకతప్పని పరిస్థితి అంటూ జేమ్స్ తన ఆత్మకథకు సంబంధించిన పుస్తకంలో రాశారు. ఆ క్రమంలో కొందరి పేషెంట్ల పరిస్థితి రీత్యా తన వ్యక్తిగత కార్యాలయానికి తీసుకువెళ్లి అక్కడ ఆ సమస్యకు పరిష్కారం కోసం ప్రయోగాలు చేసేవాడట. అందుకోసం అతడు నల్లజాతి పేషెంట్లనే వినయోగించానని ఆ పుస్తకంలో తెలిపాడు. అందరు అనుకున్నట్లు నల్లజాతీయల శరీరాలు మందంగా ఉంటాయి కాబట్టి బాధ తక్కువగా ఉంటుందనేది అపోహేనని పేర్కొన్నాడు. తాను వారిపై అనస్థీషియా ఇవ్వకుండానే ప్రయోగాలు చేసేవాడినని, ఎందుకంటే సమస్యను, స్త్రీ దేహ నిర్మాణాన్ని అర్థంచేసుకునేందుకు అలా చేయక తప్పేది కాదని పుస్తకంలో చెప్పుకొచ్చాడు. ఆ నేపథ్యంలో తన వద్దకు వచ్చిన ఒక రోగి కేసు గైనకాలజీ సమస్యను పరిష్కరించడానకి దారతీసిందని తెలిపాడు. ఒకామెకు ఫిస్టులా సమస్యతో బాధపడుతుంది. దీని కారణంగా ఆమెకు మూత్రం తెలియకుండానే వెళ్లిపోతుంది. అందుకు చికిత్స లేదని తెలిసి ఆమెపై పలు ప్రయోగాలు చేశానని, ఆ విధంగానే మహిళల ప్రసూతి సమస్యలకు నివారణ మార్గాలను కనిపెట్టగలిగానని తన తన ఆత్మకథ ది స్టోరీ ఆఫ్ మై లైఫ్లో రాసుకొచ్చాడు. తాను చేసిన ప్రయోగాలు చాలామంది మహిళలను బాధపెట్టి ఉండొచ్చు గానీ, వాళ్లంతా ఎదుర్కొనే గైనకాలజీ సమస్యలను నివారించడానికి మార్గం సుగమమైందని ఆ పుస్తకంలో చెప్పుకొచ్చాడు. ఇక్కడ కేవలం నల్లజాతీయుల మహిళలపై ప్రయోగాలు చేయడం అనేది చూస్తే జేమ్స్కి ఉన్న జాత్యాహంకారం తేటతెల్లమవ్వగా, మరోవైపు ఆ నల్లజాతీయ మహిళలను యావత్తు స్త్రీల సమస్యలకు నివారించడంలో సహాయపడిన వారిగా కీర్తించవచ్చు కూడా కదూ..!. (చదవండి: మానసిక రుగ్మతలతో ఇంతమందా..? వెలుగులోకి 'మతి'పోయే విషయాలు) -
హల్దీ ఫంక్షన్లో హనుమాన్ హల్చల్.. వైరల్ వీడియో
పెళ్లిళ్లల్లో ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు. మూడుముళ్లూ పడి, అమ్మాయి అత్తారింటికి వెళ్లేదాకా వధువు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. మర్యాదలకోసం అత్తింటివారు చేసే ఆగడాలు, పెళ్లి కొడుకు అలకలు, అబ్బో..ఇలాంటి వ్యవహారాలు చాలానే ఉంటాయి. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. కానీ ఒక షాదీలోకి అనుకోని అతిధి వచ్చి గందరగోళం సృష్టించింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చివరిదాకా చదవాల్సిందే.!పెళ్లి వారంతా హల్దీ వేడుకలో సందడిగా ఉంటే, ఎక్కడినుంచి వచ్చిందో ఒక మర్కటం నానా హంగామా చేసింది. సందు చూసుకొని తన ప్లాన్ పక్కాగా అమలు చేసింది. దీనికి తోడు ఇంకో పిల్లకోతి కూడా చేరింది. అతిథుల చేతిలోని పళ్లను చేతపట్టుకుని గెంతులేస్తూ అక్కడున్న వారినందరినీ హడలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాలో షేర్ అయింది. వధూవరుల హల్దీ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అతిథులంతా వధూవరులకు పసుపు పూస్తూ, నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్సాహంగా పూర్తిగా వేడుకల్లో మునిగిపోయారు. మరికొందరు ఫోటోలు క్లిక్ చేస్తూ బిజీ...బిజీగా ఉన్నారు. ఇంతలో, ఒక కొంటె కోతి, దాని పిల్ల ఎంట్రీ ఇచ్చాయి. పళ్లు,పళ్లాలతో కొతి గెంతులు వేసింది. ఇంతటితో ఆగలేదు.. ఏకంగా పండ్లతో నిండిన పళ్లాన్ని పట్టుకుని కనిపించింది. ఓరి దేవుడా.. అని స్పందించేలోగానే అతిథుల చేతిలోని పండ్లను చేతబట్టుకొని ఇంకోచోటికి తుర్రుమంది. దీంతో పెళ్లి కొడుకు సహా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత మెల్లిగా అక్కడ్నించి జారుకుంది. కాసేపటికి తేరుకున్న అందదూ నవ్వుల్లో మునిగి పోయారు. మనమూ కోతి నుంచే వచ్చాంగా అనుకున్నారో ఏమోగానీ మరింత అల్లరి చేశారు. దీంతో అప్పటిదాకా ఆందోళనగా ఉన్న అక్కడి వాతావరణం మంకీ గలాటాతో నవ్వులతో నిండిపోయింది. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis); స్వయంగా హనమాన్జీ యే వచ్చాడు: నెటిజన్లుఈవీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హనుమాన్ జీ వివాహాన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు" , స్వయంగా హనుమంతుడే దిగివచ్చాడు అని కొందరు, ఏది జరిగినా మన మంచికే అని మరికొందరు, అయ్యో.. ఇంకొన్ని పళ్లు తీసుకుని వెళ్లాల్సి ఉందని కొంతమంది నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. -
మానసిక రుగ్మతలతో ఇంతమందా..? వెలుగులోకి 'మతి'పోయే విషయాలు
అనంతపురం నగరంలో బీకాం చదువుతున్న ఓ యువకుడికి వారం రోజుల క్రితం మతి మరుపు సమస్య వచ్చింది. తల్లిదండ్రులు అతడిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లగా.. తీవ్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. మొబైల్ ఫోన్కు బానిసై అన్నీ మరచిపోయాడని తెలిపారు. ఇటీవల గుంతకల్లుకు చెందిన ఓ యువతి మూడు దఫాలు ఆత్మహత్యాయత్నం చేసింది. వైద్యుడి వద్దకు ఆమెను తీసుకెళ్లగా.. మానసికంగా కుంగిపోయి ఉందని ఆయన తెలిపారు. చదువులో ఒత్తిడి భరించలేక ఇలా అయిందని చెప్పారు. వీరిద్దరే కాదు.. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో ఇటీవల భారీగా పెరిగింది. గత కొన్ని నెలలుగా వివిధ ప్రాంతాల్లో ఎన్హెచ్ఎం (జాతీయ హెల్త్ మిషన్) అధికారులు చేపట్టిన పరిశీలనలో ‘మతి’పోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి అనంతపురం జిల్లా గత కొన్ని సంవత్సరాలుగా జబ్బులకు అడ్డాగా మారుతున్నట్టు తేలింది. ఇప్పటికే మధుమేహం, రక్తపోటు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా మూడో యముడు అన్నట్టు మానసిక రుగ్మతలు తీవ్రంగా వేధిస్తున్నాయి. దశాబ్దం క్రితం వరకూ పట్టణాలకే పరిమితమైన మానసిక రుగ్మతలు పల్లెటూళ్లకూ పాకాయి. ఈ జబ్బు బారిన పడుతున్న వారు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. 15 వేల మంది బాధితులు.. బీపీ, మధుమేహం కంటే కూడా మానసిక రుగ్మతను అత్యంత ప్రమాదంగా పరిగణిస్తారు. అలాంటి తీవ్ర మానసిక రుగ్మత బాధితులు ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ఉన్నట్టు అంచనా. మరో లక్ష మంది వరకూ సాధారణ, మోస్తరు మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభావం తక్కువగా ఉన్నప్పుడే కౌన్సెలింగ్ లేదా మందులు ఇప్పిస్తే తీవ్ర రుగ్మతగా మారే అవకాశం ఉండదు. కానీ బాధితులకు అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరే వరకూ వైద్యులను సంప్రదించకపోవడం గమనార్హం. 15 వేల మందికి మందులే లేవు.. గతంలో ‘వైఎస్సార్ ఆరోగ్య సురక్ష’, ఏఎన్ఎంల ఇంటింటి సర్వే, 104 వాహనాల్లో పరీక్షలు తదితర కార్యక్రమాల వల్ల వ్యాధుల బాధితులను వేగంగా గుర్తించేవారు. ఇంటి వద్దే ఉచితంగా మందులిచ్చే వారు. అయితే, గత ఆరు మాసాల నుంచి మెంటల్ హెల్త్ పేషెంట్లకు ఒక్క మాత్ర కూడా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని బాధితులు మందులు వాడక, జబ్బు ముదిరి పూర్తి మానసిక వైకల్యానికి గురవుతున్నారు. రుగ్మతలకు కారణాలివే.. మితిమీరిన ఒత్తిడి కారణంగా చాలామంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. మొబైల్ ఫోన్లకు బానిస కావడంతో ప్రపంచమే అదే అనుకుని దాని మత్తులోకి వెళ్లిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రకరకాల రీల్స్, న్యూస్ చూస్తూ తమలో తామే ఊహించుకుని మానసికంగా కుంగిపోతున్నారు. కొంతమంది విద్యార్థులు చదువుల ఒత్తిడి కారణంగా డిప్రెషన్లోకి జారుకుంటున్నారు. రకరకాల బెట్టింగ్లు, ఆర్థిక కారణాలతో తీవ్ర మానసిక రోగానికి గురవుతున్నారు.ఇటీవల కాలంలో లోన్యాప్ల ఒత్తిళ్లతో మానసిక స్థైర్యం కోల్పోతున్నారు.చాలా మందికి అవగాహన లేదు వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే గుర్తిస్తే నయం చేసుకోవచ్చు. కానీ చాలామందిలో అవగాహన లేక జబ్బు ముదిరే వరకూ జాగ్రత్త పడటం లేదు. ఆల్కహాల్, డ్రగ్స్కు బానిసలవుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు ఇటీవల ఎక్కువయ్యారు. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్య నిపుణులు, ఎన్హెచ్ఎం (చదవండి: ప్రధాని మోదీకి మఖానా దండతో స్వాగతం..! 300 రోజులు ఆ సూపర్ ఫుడ్తో..) -
ప్రధాని మోదీకి మఖానా దండతో స్వాగతం..! 300 రోజులు ఆ సూపర్ ఫుడ్తో..
ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్లోని భాగల్పూర్లో ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆయనకు ప్రజలు భారీ మఖానా పూల దండతో సత్కరించి గౌరవించారు. ఎందుకంటే తాజగా కేంద్ర బడ్జెట్లో సైతం మఖానా పంటకి పెద్దపీటవేయడంతో బీహార్ రైతులకు ఇది కాసుల పంటగా మారింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మఖానా బోర్డుని ఏర్పాటు చేసి మరీ రైతులకు మరింత చేయూత అందించనున్నాట్లు ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలోనే మోదీకి ఇలా మఖానా దండతో స్వాగతం పలికారు. అలాగే మోదీ ఆ కార్యక్రమంలో తనకు ఈ సూపర్ ఫుడ్ ప్రీతికరమైన ఆహారమని హైలెట్ చేసి మరీ చెప్పారు. తాను ఏడాదిలో 300 రోజులు మఖానును చాలా ఇష్టంగా తింటానని అన్నారు. మరీ ప్రధాని మోదీ డైట్లో దీనికి ఎందుకంత ప్రాముఖ్యతను ఇచ్చారో చూద్దామా..!.భారతదేశంలో మఖాన్ ఉత్పత్తిలో బిహార్ అతిపెద్దది. దేశసరఫరాలో సుమారు 80% వాటాను కలిగి ఉంది. ఈ సూపర్ఫుడ్ కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ను కొనసాగించడానికి రాష్ట్రం చాలా కష్టపడుతోంది. దీనికి పరిష్కారంగానే కేంద్ర బడ్జెట్ 2025లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బిహార్లో ప్రత్యేక మఖానా బోర్డుని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ బోర్డు ద్వారా రైతులకు మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్ మార్కెటింగ్కి మద్దతు ఇవ్వడమేగాక అందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంతేగాదు ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందేలా కూడా చూస్తుంది.మఖానా అంటే..?మఖానాని ప్రిక్లీ వాటర్ లిల్లీ విత్తనాల నుంచి తయారు చేస్తారు. ఇది కాస్తా శ్రమతో కూడిన ప్రక్రియ. సూపర్ ఫుడ్గా ఎందుకు పరిగణిస్తారంటే..ప్రధానమంత్రి దీనిని తన రోజువారీ ఆహారంలో ఎందుకు చేర్చుకున్నారంటే..ఇది పోషకశక్తికి కేంద్రంగా ప్రజాదరణ పొందిన ఆహారం. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాబరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారికి బెస్ట్ స్నాక్ ఐటెంశాకాహారులకు మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం శారీరక విధులకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయిశరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి సహాయపడే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.వివిధ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫుడ్ ఇదిజీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుందిఅలాగే మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మోదీ దీన్ని సూపర్ఫుడ్గా పిలుస్తూ..తన రోజువారి ఆహారంలో ప్రాధాన్యత ఇచ్చారు. మరీ మనం కూడా మన డైట్లో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉందామా..!.(చదవండి: ఖోబార్ కళ: సీతమ్మ కాలం నాటిది..! కానీ ఇప్పుడు..) -
Kohbar art: సీతమ్మ కాలం నాటిది..! కానీ ఇప్పుడు..
భారతదేశం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ ఉండే కళలకు అంతే స్థాయిలో ప్రాముఖ్యత, చరిత్ర ఉంటుంది. ఒక్కో కళ ఆయా సందర్భానుసారం పుట్టికొచ్చి..దృఢంగా అల్లుకుపోయినవే. అలాంటి కోవకు చెందిందే ఈ పురాత ఖోబార్ కళ కూడా. దీన్ని మైథిలి వివాహ పెయింటింగ్, మధుబని ఆర్ట్ వంటి పేర్లతో పిలుస్తారు. అయితే ప్రస్తుతం ఈ కళ కనుమరగయ్యే పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ కళ గొప్పతనం, ఎక్కడ ఆవిర్భవించింది వంటి వాటి గురించి చూద్దామా..!.బీహార్, నేపాల్కు చెందిన మధుబని పెయింటింగ్, పండుగలు, వివాహాలు లేదా ఇతర ఆనందకరమైన సందర్భాలలో దీన్ని ఇంటి గోడలపై వేస్తారు. ఎక్కడైన వివాహం జరగుతుందంటే తప్పనిసరిగా మిధిలా ప్రాంతాలైని బిహార్లోని కొన్ని గ్రామాల ప్రజలు దీన్ని తప్పనిసరిగా వేస్తారట. ఈ పెయింటింగ్ వేస్తున్నారంటే..అక్కడ ఎవరిదో వివాహ జరగునుందని అర్థమైపోతుందట. మిధిలా ప్రాంతంగా చెప్పే బీహార్, జార్ఖండ్, నేపాల్లో ఈ ఆర్ట్ ఎక్కువగా కనిపిస్తుందట.ఈ కళ ఆవిర్భవించింది ఇలా..ఈ కళ రామాయణ కాలం నాటిదిగా చెబుతుంటారు చరిత్రకారులు. పురాణాల్లో మిథిలా పాలకుడు జనకమహారాజు తన కుమార్తె సీత ప్రస్తుత నేపాల్లో ఉన్న జనక్పూర్లో రాముడిని వివాహం చేసుకున్నప్పుడు ఈ ఖోబార్ డిజైన్లను వేసిందని చెబుతుంటారు. మిధిలా ప్రాంతాలుగా చెప్పే.. బిహార్లో దర్భంగా, మధుబని, పూర్ణియా, సహర్స, సీతామర్హి, సుపాల్ వంటి గ్రామాల్లోని కర్ణ కాయస్థ, బ్రాహ్మణ వర్గాలకు చెందిన మహిళలకు ఈ కళ బాగా సుపరిచితం. వివాహం కుదిరిన వెంటనే వధువు కుటుంబంలోని మహిళలు గోడలపై ఈ ఖోబార్ ఆర్ట్ని వేయడం ప్రారంభింస్తారు. పూర్వం మట్టి గోడలపై అందంగా వేసేవారు. వివాహం అయిన తర్వాత వధువరులు ఈ డిజైన్తో వేసిన గదిలో గడపటం అక్కడి ఆచారం. అలా పుట్టుకొచ్చిందో ఈ ఖోబార్ కళ.ఈ ఆర్ట్ వేసే విధానంఖోబార్ ప్రాథమిక రూపకల్పన మధ్యలో కమలం ఉంటుంది. దాని నుంచి వెదురు కాండం ఉద్భవిస్తుంది. కమలం వికసించే ఇరువైపులా, ఒకదానికొకటి అనుసంధానించబడిన ఏడు గుండ్రని ఆకులు ఉంటాయి. వెదురు రెమ్మ పైభాగంలో, మానవ ముఖం ఉండి ఆపైభాగంలో సూర్యుడు, చంద్రుడు, గ్రహాల మూలాంశాలతో పాటు శివుడు, పార్వతి చిత్రాలు వేస్తారు. వీటి తోపాటు పనస, అరటి చెట్లు, చేపలు జంటగా, తాబేళ్లు, పాములు, చిలుకలు, నెమళ్ళు, వెదురు తోటలు వంటివి కూడా చిత్రిస్తారు. వివాహ సందర్భానుసారం మాత్రం సీతా స్వయం వరం, గౌరీపూజ, శివుని పూజా, బిదాయి(వీడ్కోలు) వంటి చిత్రాలను వేస్తారు. ఈ కళలో వివాహా ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపినట్టుగా ముగ్ధమనోహరంగా వేస్తారు.అయితే ఇప్పడు మట్టి ఇళ్లు లేకపోవడం, వివాహా ఆచారాలు కూడా మారిపోవడంతో వేసే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం దీన్ని గోడలపై కాకుండా చేతితో తయారు చేసిన కాగితంపై పత్తి లేదా పట్టుముక్కలపై డిజైన్ చేస్తున్నారు. అలా కర్టన్లు, కాన్వాస్పై కూడా ఆ ఆర్ట్ని వేయడం ప్రారంభించారు. మిథిలకు చెందిన కళకారులు మాత్రం ఖోబార్ పెయింటింగ్లో వస్తున్న మార్పులను ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వివాహాలు, హోటళ్లు, వివాహ మందిరాల్లో జరుగుతున్నాయి. దీంతో ఈ ఆర్ట్ని కాన్వాస్ లేదా వస్త్రంపై వేయడం జరగుతోంది. అది కూడా ఈ సంప్రదాయన్ని ఎన్నాళ్లు కొనసాగిస్తారనే సందేహం మెదులుతోంది. నాటి కాలంలో పెళ్లికి ముందు వధువరులు కలవకూడదనే నియమనిబంధనలుండేవి. ఆ నేపథ్యంలోనే వధువు మనసు చెదరకుండా ఉండేలా వివాహం నిశ్చయం అయిన వెంటనే ఆమె చేత ఈ పెయింటింగ్ని వేయించేవారు. ఆమె తోపాటు ఇతర స్త్రీలు కూడా సాయంగా ఈ ఆర్ట్ పనిలో చేరేవారు. అయితే ఇప్పడు స్మార్ట్ ఫోన్ల యుగం..అన్ని ఫాస్ట్గా జరిగిపోవాల్సిందే అలాంటప్పడు ఈ సంప్రదాయ కళకు ఎక్కడ చోటు ఉంటుందని స్థానిక కళాకారులు ఆవేదనగా చెబుతున్నారు. అందువల్ల తాము ఈ కళను బావితరాలకు తెలిసేలా ఆ కళఖండాలన్నింటిని పొందుపరస్తున్నామని అన్నారు. అదీగాక మైథిలి ప్రాంతంలోని కొన్ని వర్గాలకు చెందిందే కావడంతో ప్రభుత్వం నుంచి మద్దతు కూడా అంతగా లేదనే చెప్పాలి. అందువల్ల చాలామంది కళకారులు ఈ ఆర్ట్ గురించి అందరికీ తెలిసేలా తమవంతు కృషి చేస్తున్నారు. ఆ కళా నైపుణ్యం గురించి పుస్తకాలు సైతం రాస్తుండటం విశేషం.(చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్లు..) -
ఆముదంతో చర్మం, జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చిలా!
బంకబంకగా జిగురుగా ఉండే ఆముదం చూడగానే ముట్టుకోవడానికి ఇష్టపడం.. కానీ ఇది అందానికి, కురుల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు. దీన్ని సంప్రదాయ వైద్య విధానంలో కూడా ఉపయోగిస్తారు. అన్ని ప్రయోజనాలని అందించే ఈ ఆముదం నూనెని జుట్టు, చర్మం సంరక్షణ కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.టేబుల్ స్పూను ఆముదం, టేబుల్ స్పూను కొబ్బరి నూనెలను కలిపి వేడి చేసి గోరువెచ్చగా అయిన తరవాత మాడుకు పట్టించి పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే.. చుండ్రు తగ్గడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.పొడిబారిన చర్మానికి సైతం ఆముదం మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. బాడీ లోషన్స్కు బదులు ఆముదాన్ని రాసుకుంటే మరింత మంచిది.గోరువెచ్చని ఆముదాన్ని పలుచగా ఉన్న కనుబొమ్మలకు రాసి రెండు నిమిషాలు మర్దన చేసి ఉదయం కడిగేయాలి. ఇలా కొన్నిరోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా కనిపిస్తాయి.రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని పెదవులకు రాసి మూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. చిన్న బాక్స్లో ఆముదాన్ని ΄ోసుకుని రోజులో అప్పుడప్పుడు లిప్బామ్లా రాసుకుంటూ ఉంటే పెదవులు మృదువుగా, పింక్ కలర్లోకి మారతాయి. క్లెన్సర్లు, లోషన్లు, సౌందర్య సాధనాలలో విస్తృతంగా ఈ ఆముదాన్ని ఉపయోగిస్తారు.దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు కాలిన గాయాలు, ప్రెజర్ అల్సర్లు, డయాబెటిక్ అల్సర్లు, శస్త్రచికిత్సా గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని ఒలీక్, లినోలిక్ యాసిడ్ రక్త ప్రసరణను పెంచి మీ జుట్టును బలంగా, మృదువుగా మార్చుతాయి.(చదవండి: బీపీ-హైబీపీకి మధ్య తేడా ఏంటి..? వంశపారపర్యంగా వస్తుందా..?) -
చరిత్ర సృష్టించిన చిత్రం..!
శుచి తలాటీ రచించి, దర్శకత్వం వహించిన ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ 40వ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్లో జాన్ కాసావెట్ అవార్డును గెలుచుకుంది. హిమాలయన్ బోర్డింగ్ స్కూల్లో చదివే మీరా అనే టీనేజర్ ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే చిత్రం ఇది.‘నా దృష్టిలో ఇది తల్లీకూతుళ్ల ప్రేమ కథ. అయితే సంక్లిష్టమైన ప్రేమ కథ. ఈ సినిమా ద్వారా రెండు తరాలకు చెందిన మహిళల స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచనలను చెప్పే ప్రయత్నం చేశాం’ అని తన చిత్రం గురించి చెప్పింది శుచి తలాటీ.జాన్ కాసావెట్ అవార్డ్ గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ చరిత్ర సృష్టించింది. మిలియన్ డాలర్ల కంటే తక్కువ బడ్జెట్తో నిర్మించిన చిత్రానికి ఈ అవార్డ్ ఇస్తారు. ప్రముఖ నటులు రిచా చద్దా, అలీ ఫజల్ ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ను నిర్మించారు.‘ఈ విజయం ఒక కలలా అనిపిస్తోంది. ఎప్పుడో కన్నకల సాకారం అయినట్లుగా అనిపిస్తోంది. ఇది ఒకరి వ్యక్తిగత విజయం కాదు. సమష్టి కృషికి దక్కిన విజయం. ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్ గెలుచుకున్న తొలి భారతీయ నటిగా, నిర్మాతగా ఇది నా విజయం మాత్రమే కాదు వైవిధ్యమైన కథలను రూపొందించడానికి కృషి చేస్తున్న అందరి విజయం’ అంటుంది రిచా చద్దా.‘నా దృష్టిలో ఇది కేవలం అవార్డు కాదు. కథలోని బలానికి దక్కిన గౌరవం’ అంటుంది శుచి తలాటి. (చదవండి: ఒక్క ఏడాదికే 26 కిలోలు తగ్గాడు..! బాగా చేశారంటూ హీరో హృతిక్ ప్రశంసల జల్లు..) -
బీపీ-హైబీపీకి మధ్య తేడా ఏంటి..? వంశపారపర్యంగా వస్తుందా..?
ఇంగ్లిష్లో బీపీ అని సంక్షిప్తంగా చెప్పే ఓ ఆరోగ్య సమస్య అసలు రూపం బ్లడ్ ప్రెషర్. కానీ నిజానికి దీన్ని హైబీపీగా చె΄్పాలి. అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఒత్తిడితో రక్తం ప్రవహించడమని అర్థం. తెలుగులో దీన్నే రక్తపోటు అంటారు. దీని నార్మల్ విలువ 140/90. ఉండాల్సిన విలువకంటే ఎక్కువ ఒత్తిడితోరక్తం ప్రవహిస్తే అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు తావిస్తుంది. ఒకప్పుడు కాస్త పెద్ద వయసు వచ్చాకే బీపీ, డయాబెటిస్ కనిపించేవి. కానీ ఇప్పుడు మన దేశంలో అప్పుడే తమ కౌమార దశ దాటి అప్పుడప్పుడే యువకులు/యువతులుగా మారుతున్న వారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. ఎన్నో అనర్థాలకు కారణమయ్యే ఈ హైబీపీ సమస్య గురించి విపులంగా తెలుసుకోవడం కోసమే ఈ కథనం. బీపీ కారణంగా పక్షవాతం, గుండెపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటి చూపు కోల్పోవడం లాంటి అనర్థాలతోనూ, అలాగే కిడ్నీల వంటి ఎండ్ ఆర్గాన్స్ వైఫల్యంతో ఏటా ఎంతో మంది మరణిస్తున్నారు. ఇది ఉన్న విషయమే బయటకు తెలియకపోవడం, అది దెబ్బతీసే అవయవాలైన కిడ్నీ వంటివి పూర్తిగా చెడిపోయేవరకు వాటి లక్షణాలేమీ బయటకు కనిపించకపోవడంతో ఇది నిశ్శబ్దంగా అనర్థాలను తెచ్చిపెట్టి, కొన్నిసార్లు మరణాలకు కారణమవుతుంటుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. హైబీపీ తెచ్చిపెట్టే సమస్యలేమిటి, ఎలా ఉంటాయి, వాటిని అధిగమించడం ఎలా వంటి అనేక విషయాలను తెలుసుకుందాం. హై–బీపీ అంటే ఏమిటి?కొంతమంది తాము అతిగా ఉద్రేకపడ్డా లేదా బాగా కోపం ఫీలయినప్పుడు తమకు బీపీ పెరిగిందంటుంటారు. అలాగే మరికొందరు తమకు బాగా తలనొప్పిగా ఉండటం, చెమటలు పడుతుండటం, నర్వస్గా ఉండటం, నిద్రపట్టకపోవడం, బాగా ఉద్వేగంగా/ఉద్రిక్తంగా ఫీలయినప్పుడు ఆ టైమ్లో బీపీ పెరిగిందని చెబుతుంటారు. అయితే అలా జరిగినప్పడు బీపీ పెరిగి ఉండవచ్చు. కానీ కొందరిలో బీపీ పెరిగాక అది అలాగే కంటిన్యూవస్గా ఉండటాన్నే హైబీపీగా చెప్పవచ్చు. ఇక కొంతమందిలో తాము హాస్పిటల్కు వెళ్లగానే, అక్కడి డాక్టర్లను చూడగానే బీపీ పెరుగుతుంది. ఇంటిదగ్గర రీడింగ్ తీసినప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇలా తెల్లకోట్లలో ఉండే డాక్టర్లను చూసినప్పుడు రక్తపోటు పెరగడాన్ని ‘వైట్ కోట్ సిండ్రోమ్’ అంటారు. ఇలాంటి సందర్భాల్లో బీపీ పెరగడం, అలాగే తమలో భావోద్వేగాలు చెలరేగినప్పుడు రక్తపోటు కొంతమేరకు పెరగడం జరగవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో బీపీ పెరిగినప్పటికీ దాన్ని హైబీపీగా పరిగణించడం జరగదు. అయితే ఓ వ్యక్తిలో అనేక పర్యాయాలు రీడింగ్ తీశాక కూడా... రక్తపోటు (సిస్టోల్ / డయాస్టోల్) విలువలు 140/90 అనే కొలతకు మించి ఉంటే అప్పుడు మాత్రమే హైబీపీగా పరిగణిస్తారు. హైబీపీ ఎన్ని రకాలు... హైబీపీని రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది ఎసెన్షియల్ హైపర్టెన్షన్. అంటే ఇది మామూలుగా వచ్చే బీపీ అనుకోవచ్చు. ఇతరత్రా ఎలాంటి కారణం లేకుండా వచ్చే బీపీ ఇది. ఇది చాలా సాధారణంగా కనిపించే హైపర్టెన్షన్. ఇక రెండోదాన్ని సెకండరీ హైపర్టెన్షన్గా చెప్పవచ్చు. ఇది శరీరంలో ఏదో ఇతరత్రా కారణాల వల్ల వస్తుంది. అంటే బాధితులకు ఒంట్లో థైరాయిడ్ సమస్య ఉండటం వల్లనో, లేదా మూత్రపిండాల వ్యాధి వంటి ఇతర సమస్యల కారణంగా రక్త΄ోటు పెరిగిపోవడం జరుగుతుంది. అందుకే ఒంట్లో బీపీ ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు థైరాయిడ్, కిడ్నీ వంటి ఇతరత్రా సమస్యలేమైనా ఉన్నాయా అంటూ చెక్ చేయించుకుని, వాటికి మందులు వాడాలి. ఈ సెకండరీ కారణాలు చక్కబడితే అప్పుడు బీపీ తగ్గుతుంది. కానీ మొదటిదైన ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అలా కాదు. ఆ సమస్యకు డాక్టర్ల సూచన మేరకు బీపీని నియంత్రణలో ఉంచే మాత్రలు వాడటం అవసరం. చిన్నపిల్లల్లోనూ హైబీపీ ఉండవచ్చా?చిన్నపిల్లల్లో లేదా అప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న యువకుల్లో హైబీపీ ఉండక΄ోవచ్చని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాళ్లలోనూ కొందరికి హైబీపీ (హైపర్టెన్షన్) ఉండే అవకాశం ఉంది. ఇటీవల చాలా చిన్నపిల్లలు.. అంటే 3 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు వాళ్లలోనూ, కౌమారం (టీనేజ్)లో ఉన్న పిల్లలు... అంటే 13 నుంచి 19 ఏళ్ల మధ్యవారిలోనూ హైబీపీ కనిపిస్తోంది. అయితే చిన్నపిల్లల్లో హైబీపీ నిర్ధారణకు దాన్ని చాలా జాగ్రత్త (మెటిక్యులస్)గా కొలవాలి. పిల్లల్లో బీపీని తెలిపే చార్ట్ను ‘సెంటైల్ చార్ట్’ అంటారు. పిల్లల తాలూకు నార్మల్ విలువలు... వాళ్ల వయసునూ, జెండర్నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతుంటాయి. పెద్దవాళ్లలో నార్మల్స్ వాళ్లలో నార్మల్ విలువకు సమానం కాదు. ఉదాహరణకు వారిలో డయాస్టోల్ బీపీ కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. కొలత విలువ 95 పర్సంటైల్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్ 95–99 ఉంటే హైపర్టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా భావించాలి. ఈ దశలూ, తీవ్రతలను బట్టి ఆయా పిల్లలకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు.లక్షణాలేమీ లేకపోతే హైబీపీ లేనట్లేనా? లక్షణాలేమీ బయటకు కనిపించక΄ోయినప్పటికీ చాలామందికి హైబీపీ ఉండే అవకాశముంది. నిజానికి చాలామందిలోనూ తమకు హైబీపీ ఉన్న విషయమే తెలియకుండా చాలాకాలంగా వాళ్లలో హైబీపీ ఉండే అవకాశం ఉంది. ఇలా చాలాకాలంగా హైబీపీ ఉండటం వల్ల మానవ దేహంలో ఎండ్ ఆర్గాన్స్గా పిలిచే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. అవి పూర్తిగా పాడైపోయాకగానీ ఆ అవయవాలు దెబ్బతిన్నప్పుడు కనిపించే లక్షణాలు బయటపడవు. ఈలోపు జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగి΄ోవచ్చు. అందుకే దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. కేవలం లక్షణాలు కనిపించనంత మాత్రాన హై–బీపీ లేదని అనుకోవడం సరికాదు. ఒకసారి డాక్టర్ను కలిసి, చెకప్ చేయించుకుని హైబీపీ లేదన్న నిర్ధారణ జరిగాకే నిశ్చింతగా ఉండాలి. హైబీపీ మందులు చాలాకాలంపాటు వాడుతుంటే, వాటికే అలవాటు పడి... ఇక మున్ముందు బీపీ తగ్గదేమో?ఒకసారి హై–బీపీ నిర్ధారణ అయ్యాక... దాన్ని అదుపులో ఉంచేందుకు డాక్టర్లు కొన్ని మందులను సూచిస్తుంటారు. వారిలోని బీపీ తీవ్రతను బట్టి కొందరికి రెండు, మరికొంతమందికి మూడు, ఇంకొందరిలో నాలుగు... ఇలా మందులను వాడాలంటూ డాక్టర్లు సూచిస్తారు. బీపీ కొలతలను తరచూ చూస్తూ... మందుల మోతాదును అడ్జెస్ట్ చేస్తుంటారు. జీవనశైలి మార్పులతో బీపీని అదుపులో పెడితే కేవలం రెండులోపు మాత్రలతోనే చాలాకాలం కొనసాగవచ్చు. కానీ బీపీ అదుపులో లేకపోతే మందుల సంఖ్యా, మోతాదులు పెరుగుతాయి. హైబీపీ మందులైనా, డయాబెటిస్ మందులైనా సుదీర్ఘకాలం వాడాల్సిందే. అది బాధితుల బీపీ కొలతలను బట్టి ఉంటాయి తప్ప... మందులకు అలవాటు పడి... బీపీ తగ్గినప్పటికీ వాటికే అలవాటు పడటం, మానకుండా ఉండలేకపోవడం అనే అంశాలకు ఆస్కారం లేదు. కొన్నాళ్ల తర్వాత బీపీ అదుపులోకి వచ్చాక మందులు మానేయవచ్చా?ఒకసారి హైబీపీ నిర్ధారణ జరిగి... మందులు మొదలుపెట్టాక వాటి ప్రభావంతో రక్తపోటు అదుపులోకి వస్తుంది. దాంతో బీపీ అదుపులోనే ఉంది కదా అని చాలామంది మందులు మానేస్తుంటారు. మళ్లీ బీపీ చెక్ చేయించుకోరు. దీని లక్షణాలు బయటకు కనిపించవు కాబట్టి అది పెరిగిన విషయం తెలియనే తెలియదు. అందుకే ఒకవేళ హై–బీపీ నియంత్రణలోకి వచ్చిందని మందులు ఆపేసినా... మళ్లీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. బీపీ పెరిగినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం డాక్టర్ను సంప్రదించి, ఉన్న హై–బీపీ విలువకు తగినట్లుగా తగిన మోతాదు నిర్ణయించుకుని, మందులు మొదలుపెట్టాలి. అంతేకాదు... మందులు వాడుతున్నప్పటికీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటూనే ఉండాలి. ఒకవేళ ఆ మోతాదు సరిపోక బీపీ పెరిగితే... డాక్టర్లు మందులు మార్చడమో లేదా సరైన మోతాదు కోసం మరో మాత్ర లేదా రెండు మాత్రలు పెంచడమో చేస్తారు. అందుకే బీపీ మందులు వాడుతున్నప్పుడు వాటిని మానేయకపోవడం మంచిది. అలాగే తరచూ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండటం కూడా తప్పనిసరి. బీపీ పెరుగుతూ, తగ్గుతూ ఉండటం తరచూ జరగవచ్చంటారు కదా... కాబట్టి హైబీపీ లేకపోయినా, ఉన్నట్టుగా డాక్టర్లు పొరబడవచ్చు కదా?హైబీపీ వల్ల కొందరిలో తలనొప్పి, తలతిరగడం వంటివి కనిపించవచ్చు. కానీ ప్రతి తలనొప్పీ అధిక రక్తపోటు వల్లనే కాకపోవచ్చు. హై–బీపీ తాలూకు లక్షణాలు అని పేర్కొనే కండిషన్లు కనిపించినప్పుడు అసలు బీపీని కొలవకుండానే కేవలం లక్షణాలను బట్టే బీపీ ఉందని అనుకోవడం సరికాదు. డాక్టర్లు అలా పొరబడే అవకాశమే ఉండదు. ఎందుకంటే... రక్తపోటు పెరగడం వల్ల మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే కొందరిలో వారి బాడీ పోష్చర్ అకస్మాత్తుగా మారడం వల్ల రక్తపోటు తగ్గనూవచ్చు. దీన్ని ‘ఆర్థోస్టాటిక్ హై΄ోటెన్షన్’ అంటారు. అప్పుడు తల తిరగడం గానీ లేదా కొందరిలో ముందుకు తూలిపడిపోతామనే భావన కలగవచ్చు. బీపీ తగ్గిన ఇలాంటి సందర్భాల్లోనూ బీపీ పెరిగినప్పుడు కనిపించే గిడ్గీనెస్ వంటి లక్షణాలే కనిపిస్తాయి. అందువల్ల డాక్టర్లు కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా... అనేక సందర్భాల్లో అనేక మార్లు అలాగే రకరకాల వేళల్లో కొలిచి చూశాకే... హైబీపీని నిర్ధారణ చేస్తారు. ఒక్కోసారి ఐదు రోజుల పాటు రోజుకు మూడు సార్ల చొప్పున కొలతలు తీశాకే నిర్ధారణ చేస్తారు. కేవలం ఒకటి లేదా రెండు కొలతలతో హైబీపీ నిర్ధారణ చేయరు కాబట్టి డాక్టర్లు పొరబడే అవకాశమే ఉండదు.హైబీపీకి బార్డర్లైన్లో ఉన్నవారికి మందులు అవసరం లేదు కదా?హైబీపీ వస్తున్న సూచనలు కనిపిస్తున్నవారు... అంటే హైబీపీ విలువలు మరీ ఎక్కువగా కాకుండా బార్డర్లైన్లో ఉన్నవాళ్లు మందులు వాడనక్కర్లేదనీ, వాళ్లు మంచి జీవనశైలి నియమాలు పాటిస్తూ ఉంటే చాలని చెబుతుంటారు. అంటే... క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లతో బీపీని అదుపులో ఉంచుకోవాలంటూ డాక్టర్లు చెబుతారన్నది కొందరి వాదన. ఇక చాలామంది తాము మందులు వాడబోమనీ, మంచి క్రమశిక్షణతో వ్యాయామం, ఆహారనియమాలు పాటించడం వంటి జీవనశైలిని అనుసరిస్తూ, హైబీపీని అదుపు చేయగలమని మొదట్లో ప్రతిఒక్కరూ అనుకుంటుంటారు. అయితే ఒకటి రెండు రోజులు పాటించినప్పటికీ... చాలామంది ఈ జీవనశైలి నియమాలను సరిగా పాటించ(లే)రు. ఇలాంటి వాళ్లలో తమ కీలకమైన అవయవాలపైన హై–బీపీ తన దుష్ప్రభావం చూపినప్పుడు జరిగే నష్టం... అప్పుడు అవసరమైన వైద్యపరీక్షలకూ, చికిత్సకూ అవసరమైన ఆర్థికభారం, ఏదైనా ఎండ్ ఆర్గాన్ శాశ్వతంగా దెబ్బతింటే కలిగే నష్టం లాంటివి డిసీజ్ బర్డెన్ను విపరీతంగా పెంచుతాయి. అంతేకాదు... కుటుంబ సభ్యులపైనా ఆర్థిక, భావోద్వేగపరమైన ఒత్తిడీ చాలా ఎక్కువగా పడుతుంది. ఆ భారంతో పోలిస్తే... అసలు మనపై ఎలాంటి బరువూ పడకుండా చాలా చవగ్గా దొరికే మందుల్ని రోజూ ఒకపూట లేదా రెండు పూటలు తీసుకోవడం వల్ల చాలాకాలం పాటు కీలకమైన అవయవాలను సంరక్షించుకుంటూ హాయిగా జీవించవచ్చు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి ఎన్నో వేదనాభరితమైన జబ్బులను తప్పించుకోవచ్చు. పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు హైబీపీని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.హై–బీపీ ఉన్నవారు ఉప్పు పూర్తిగా మానేయాలా?హై–బీపీ ఉన్నవాళ్లలో ఉప్పు వల్ల రక్త΄ోటు మరింత పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ముందుజాగ్రత్తగా ఉప్పు మానేసేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే మానవ దేహంలోని కీలకమైన జీవక్రియలకు ఉప్పు / లవణాలు అవసరం. ఉదాహరణకు మెదడు నుంచి నాడుల (నర్వ్స్) ద్వారా కండరాలకు వచ్చే ఆదేశాలన్నీ ఉప్పు/ఇతర లవణాలలోని అయాన్ల ద్వారానే జరుగుతుంటాయి. ఉప్పు పూర్తిగా మానేస్తే హైపోనేట్రీమియా అనే కండిషన్ వచ్చి, ఒక్కోసారి అది ప్రాణాలకే ముప్పుగా మారవచ్చు. అందుకే ఉప్పును పూర్తిగా మానేయడం సరికాదు. దానికి బదులుగా ఇంతకుముందు వాడుతున్న మోతాదులో సగం లేదా సగానికంటే తక్కువగా వాడటం మంచిదని గుర్తుంచుకోవాలి. మనం వాడే రోజువారీ ఆహారాల్లో మనకు తెలియకుండానే ఉప్పు ఉంటుంది. మనం తీసుకునే చిప్స్ వంటివీ లేదా బేకరీ పదార్థాల్లో, ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఉప్పు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఉప్పుకూ బీపీ పెరుగుదలకు నేరుగా సంబంధముంటుంది. అంతేకాదు... ఆకుకూరల్లోనూ లవణాల రూపంలో ఉప్పు ఉంటుంది. ఉప్పును చాలాపరిమితంగా తీసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే హైబీపీ ఉన్నవాళ్లలో ఒక వ్యక్తికి కేవలం రోజుకు రెండు గ్రాముల ఉప్పు అనే మోతాదు సరిపోతుంది.మందులు వాడుతున్నా... బీపీ నియంత్రణలోకి రాలేదంటే... ఆ పేషెంట్ మందులకు రెసిస్టెన్స్ పెంచుకోవడం వల్లనేనా? కొంతమంది బీపీ నిర్ధారణ సమయంలో ... మొదటిసారి మాత్రమే డాక్టర్ను కలుస్తారు. అప్పుడు డాక్టర్ రాసిన మందులనే ఏళ్ల తరబడి వాడుతుంటారు. కానీ వాటితో బీపీ నిజంగానే అదుపులోకి వచ్చిందా... లేక ఆ డోస్ సరి΄ోతోందా, లేదా... ఇలాంటి విషయాలేమీ పట్టించుకోరు. మరికొందరు తొలిసారి మందులు వాడకం మొదలుపెట్టాక... రెండో వారంలోనో లేదా పది రోజుల తర్వాతనో మరోసారి బీపీ చూసుకుని, అది తగ్గడం లేదంటూ ఫిర్యాదు చేస్తారు. ఇవన్నీ సరికాదు. అలాగే మందుల ప్రభావం తగ్గిపోయిందనే అపోహ కూడా సరికాదు. ఒకసారి బీపీ మందులు మొదలుపెట్టాక అవి పనిచేయడం ప్రారంభించి హై–బీపీ అదుపులోకి రావడానికి కనీసం 3 – 4 వారాల సమయం పట్టవచ్చు. ఇవేవీ చూడకుండానే కొందరు తాము అనుకున్నదే వాస్తవం, అదే నిజమనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది కూడా సరికాదు. అందుకే బీపీ మందులు వాడుతున్న వారు డాక్టర్ నిర్దేశించిన ప్రకారం... ఆయా సమయాలకు ఫాలో అప్కు వెళ్తుండాలి. తరచూ పరీక్ష చేయిస్తూ తమలో రక్త΄ోటు అదుపులో ఉందా లేదా అన్నది తెలుసుకుంటూ, ఒకవేళ బీపీ ఇంకా పెరిగితే దాన్ని బట్టి మందులు మార్చడం లేదా మోతాదు మార్చడం జరుగుతుంది. బీపీ అకస్మాత్తుగా పెరిగిపోతే...బీపీ అకస్మాత్తుగా పెరగడం చాలా ప్రమాదమని గుర్తించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ... బీపీ విలువ నార్మల్ కంటే ఎక్కువగానే ఉంటుంది కదా! ఈ అపోహ చాలామందిలో ఉంది. ఇది చాలాకాలం పాటు రాజ్యమేలింది కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ కొద్దిగా ఎక్కువే ఉండవచ్చని తొలుత అనుకున్నారు. (వయసు + 100) అంటూ ఓ సూత్రం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి వయసు 60 ఏళ్లు అయితే అతడి పై కొలత 160 వరకు ఉన్నా పర్లేదని అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పటి లెక్కలు వేరు. ఇప్పుడు తాజాగా... పద్దెనిమిది దాటిన ఏ వయసువారికైనా బీపీ 140/90 కి పైన ఉంటే అది హైబీపీ కిందే లెక్క. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకూ హైబీపీ వస్తుందా?తల్లిదండ్రులకు హైబీపీ ఉంటే... పిల్లలకు అది తప్పనిసరిగా వచ్చేలాంటి జన్యుపరమైన సమస్య కాదు గానీ... తల్లిదండ్రులకూ, రక్తసంబంధీకులకూ, దగ్గరి బంధువులకు అధిక రక్తపోటు ఉన్నప్పుడు... వారి వారసులకు కూడావచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. (చదవండి: -
మెడిటేషన్కి అనుగుణంగా ఇంటిని మార్చేద్దాం ఇలా..!
ఎన్నో కారణాల వల్ల ఇంటా బయటా ఒత్తిడితో జీవనం సాగించే రోజులివి. ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఎవరికి తోచిన సలహాలు వాళ్లు చెబుతుంటారు. కాని, ఇంట్లోనే సానుకూల వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతతతో పాటు ధ్యాన సాధనకూ అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న మార్పులతో ధ్యానానికి అనువుగా ఇంట్లోనే ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి గదుల్లో ఏదైనా ఒక మూలన బుద్ధ ప్రతిమ లేదా క్యాండిల్స్, ఆర్టిఫియల్ ట్రీ లేలా ఇండోర్ ప్లాంట్ తీగలనూ డిజైన్ చేసుకోవచ్చు. ప్రశాంతతను కలిగించే సంగీతం వింటూ రోజూ ఈ ప్లేస్లో కాసేపు సేద దీరితే మనసు, శరీరం విశ్రాంతి పొందుతాయి.మట్టి కుండలు లేదా రాళ్లతో డిజైన్ చేసిన ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్ లభిస్తాయి. వాటి అలంకరణతో జలపాతపు ఆహ్లాదాన్ని పొందవచ్చు. ధ్యానం చేయడానికి అనువైన ప్లేస్ అలంకరణకు బేబీ మాంక్స్ బొమ్మలు, బోన్సాయ్ మొక్కలు, స్టోన్ వర్క్తో డిజైన్ చేసిన వస్తువులను ఎంచుకోవచ్చు. వీటిని చూసినప్పుడు చికాకుగా ఉన్న మనసు కొంత కుదుటపడుతుంది. మనలోని ఏడు చక్రాలకు గుర్తుగా ఏడు రంగులు సూచికగా ఉంటాయి. వాటిని తలపించేలా కలర్ కాన్సెప్ట్తో చక్రా షెల్ఫ్ డిజైన్ చేసుకోవచ్చు. రెడీమేడ్గా లభించే వాటినీ అమర్చుకోవచ్చు. ఈ కలర్ చక్రా షెల్ఫ్ల రంగులను బట్టి ధ్యానాన్ని ఏకాగ్రతతో సాధన చేయవచ్చు. అలంకరణలో చక్రా షెల్ఫ్, వాల్ హ్యాంగింగ్, ఫొటో ఫ్రేమ్స్తో లివింగ్ రూమ్నీ అందంగా అలంకరించవచ్చు. (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్లు..) -
అతడి వెయిట్లాస్ జర్నీకి నటుడు హృతిక్ రోషన్ ఫిదా..!
ఎందరో తమ వెయిట్ లాస్ జర్నీతో స్ఫూర్తిని రగులుస్తున్నారు. బరువు తగ్గడం ఏమి భారం కాదని చేతలతో నిరూపిసతున్నారు. అంతేగాదు కొందరూ అచంచలమైన దీక్షతో బరువు తగ్గి ఊహించని రీతీలో స్మార్ట్గా మారి సెలబ్రిటీల చేత గ్రేట్ చేత ప్రశంసలందుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఫిట్నెస్ ఇన్ప్లుయెన్సర్ ఫుర్కాన్ ఖాన్. అతడు అంతలా ఓపికతో వ్యహరించి మరీ బరువు తగ్గిన తీరు నెటిజన్లందరినే గాక బాలీవుడ్ ప్రసిద్ధ నటుడుని సైతం ఇంప్రెస్ చేసింది. 23 ఏళ్ల ఫుర్కాన్ ఖాన్ తన ఫిట్నెస్ జర్నీని డాక్యుమెంట్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోకి 'ఓపికతో కసరత్తులు చేస్తూనే ఉండండి' అనే క్యాప్షన్తో తన వెయిట్ లాస్ జర్నీ వీడియోలు షేర్ చేసేవాడు. ఆ వీడియోలో పుర్కాన్ జనవరి 19 2024 జిమ్లో చేరిన 9 రోజుల తర్వాత అనే క్లిప్తో ప్రారంభమవుతుంది. ఒక ఏడాది క్రితం తాను ఎలా ఉన్నాడో చూపిస్తూ తన ఫిట్నెస్ జర్నీని గురించి వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే అంతలా జిమ్లో వర్కౌట్లు చేసినా ఫలితం మాత్రం త్వరగా రాదు. అయినా స్కిప్ చేయకుండా కష్టపడుతున్న తీరు వీడియోలో కనిపిస్తుంటుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలల్లో పెద్ద మార్పు కనిపించదు. శరీరాన్ని ఫిట్గా నిర్మించుకోవడానికి సంవత్సరాలు పట్టినా సరే.. మనం మాత్రం మన వర్కౌట్లు స్కిప్ చేయకూడదని చెబుతుంటాడు. ఓపిక అనేది అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతుంటాడు. అయితే అలా చేయగా చేయగా.. ఫుర్కాన్ శరీరంలో చక్కటి మార్పు కనిపిస్తూ ఉంటుంది. చివరగా ఏది ఒక్క రోజులో జరగదనేది బాగా గుర్తించుకోండి అంటూ ముగిస్తాడు వీడియోలో. అతడి విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీకి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావడమే గాక స్వయంగా హృతిక్ రోషన్ నుంచే మన్ననలను అందుకోవడం విశేషం. హృతిక్ సదరు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఫుర్కాన్ని "మీరు బాగా చేశారు" అంటూ సోషల్ మీడియాలో ప్రశంసించారు. దీంతో నెటిజన్లు బ్రో గ్రీకు దేవుడు హృతిక్ నుంచే ప్రశంసలు అందుకున్నావు కదా..! నువ్వు గ్రేట్ అంటూ మెచ్చుకోగా, మరొకరు స్థిరత్వం, క్రమశిక్షణ ఎంత గొప్పవనేది తెల్తుస్తుందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Furkan Khan (@flexwithfurru) (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్లు..)