breaking news
Lifestyle
-
8 రోజులు.. 800 కిలోమీటర్లు..!
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్ నుంచి ముంబై వరకూ 800 కిలోమీటర్ల సైకిల్ యాత్రకు సంకలి్పంచాడు.. ఇందులో భాగంగా 30 చోట్ల ఫిట్నెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించుకున్నాడు.. మార్చి 7 ప్రారంభమైన ఈ సైకిల్యాత్ర 14 వరకూ కొనసాగనుంది. ప్రజలకు ఫిట్నెస్, సైక్లింగ్ ప్రాముఖ్యతను వివరించడమే లక్ష్యంగా వెల్నెస్ అడ్వొకేట్ కాంతి దత్ ముందుకు కదులుతున్నాడు. ఫియర్ ప్రాజెక్ట్ పేరిట స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని నోవోటెల్ హోటల్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్నెస్ ప్రేమికులు పాల్గొని కాంతి దత్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచే సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. ఎనిమిది రోజుల పాటు.. మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై ఫిట్నెస్ ప్రాముఖ్యత, సైక్లింగ్ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు. ‘పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థ అయిన సైక్లింగ్ను ప్రోత్సహించడం, రోజువారీ జీవితంలో సైక్లింగ్ను భాగం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పించడం’ ప్రాధాన లక్ష్యమని కాంతి దత్ తెలిపారు. (చదవండి: తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడైనా..) -
ఇంతై..ఇంతింతై..! సందిడిగా సాక్షి 'ఆల్ ఫర్ హర్'
‘ఇంతింతై.. వటుడింతయై’ పోతన భాగవతంలోని వామనావతార ఘట్టానికి చెందిన ప్రసిద్ధ పద్యం తెలిసిందే.. వామనుడు విశ్వరూపం దాల్చి భూమి, ఆకాశం, నక్షత్రలోకాలను ఆక్రమించిన దృశ్యాన్ని ఈ పద్యం వరి్ణస్తుంది.. అలాగే సమాజాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న మహిళా శక్తి కీర్తి ప్రతిష్టలు ఇంతై.. ఇంతింతై.. అన్నట్లు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఓ వైపు కుటుంబాన్ని నడిపించే శక్తిగా, మరోవైపు ప్రతి రంగంలోనూ ప్రతిభను చాటుతూ ఇంతులు కొత్త కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్నారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ సాధికరాతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘సాక్షి’ గ్రూప్ మరో ముందడుగు వేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆల్ ఫర్ హర్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్లోని రాజపుష్ప అట్రియా వేదికగా జరిగిన వేడుకలు మహిళల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, స్వయం అభివృద్ధి సందేశాన్ని ప్రతిధ్వనించేలా చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆరి్టస్ట్ తమన్నా రూజ్ మేకప్ మాస్టర్ క్లాస్ సెషన్ ప్రత్యేక ఆకర్షణ కాగా..ఈ సెషన్లో మహిళలకు ట్రెండీ మేకప్ పద్ధతులు, సేఫ్టీ మేకప్ టెక్నిక్స్, స్కిన్ కేర్ సంబంధిత సూచనలు అందించారు. తమన్నా రూజ్ హైదరాబాద్లో మేకప్ స్టూడియోను ప్రారంభించిన తొలి మేకప్ ఆరి్టస్ట్గానే కాకుండా లండన్ స్కూల్ ఆఫ్ మేకప్ నుంచి పట్టభద్రురాలు.. రష్యా, లెబనాన్, దుబాయ్ వంటి పలు దేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. రాజపుష్ప అట్రియా అసోసియేషన్ సభ్యులతో పాటు కమ్యూనిటీకి చెందిన మహిళలు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాధికారత..సమన్వయం.. మహిళల ఆత్మవిశ్వాసం, స్వీయ సాధికారత ప్రదర్శించేలా నిర్వహించిన ‘ఫేస్ ఆఫ్ సాక్షి కమ్యూనిటీ’ క్రౌన్ సెర్మనీ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా సూపర్ మామ్ క్రౌన్ను మధు, బ్యాలెన్సింగ్ చాంప్ కిరీటాన్ని సంగీత, గ్రేస్ ఫుల్ సీనియర్ లేడీ క్రౌన్ను సుమతి గెలుచుకున్నారు. దీంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాప్ డ్యాన్స్ యాక్టివిటీలో మహిళలు ఉత్సాహంగా స్టెప్పులేశారు. అనంతరం ఉమెన్స్ డే కేక్ కట్టింగ్ చేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకు జోయాలుక్కాస్ జ్యువెల్స్ ప్రోత్సాహక బహుమతులు అందించారు. పాఠకులతో సాక్షి మమేకం.. సాక్షి మీడియా గ్రూప్ 18 సంవత్సరాలుగా ప్రజలకు, పాఠకులకు కొత్త ఆలోచనలు, కొత్త ఫార్మాట్లను అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉందని, సమాజంతో మమేకమవుతూ ప్రజలతో సాన్నిహిత్యాన్ని బలోపేతం చేయడం సాక్షి గ్రూప్ లక్ష్యమని సంస్థ డైరెక్టర్ రాణీ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే మహిళలతో నేరుగా కలిసేందుకే ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిత్వానికి కేరాఫ్ అడ్రస్.. నేటి తరం మహిళల్లో అందంగా కనబడాలనే ఆసక్తి పెరుగుతోందని తమన్నా రూజ్ పేర్కొన్నారు. సాక్షి టీవీతో ప్రత్యేక అనుబంధం ఉన్న తాను మేకప్ ఆర్టిస్ట్ కెరీర్కు ముందు ‘సాక్షి’ టీవీలో పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. సెల్ఫ్ మేకప్, సెల్ఫ్ గ్రూమింగ్ పట్ల అవగాహన కల్పించడమే ఈ సెషన్ లక్ష్యమని, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారని, మహిళల దైనందిన జీవితంలో అందం, వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమని అన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. నేటి తరం పురుషుల ఆలోచనా విధానంలో మార్పువచి్చందని, అమ్మ, భార్య, చెల్లి, ఇలా కుటుంబంలోని మహిళలను వారు ఎన్నుకున్న రంగంలో ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. నగరంలో బ్యూటీ రంగం ఎంతో మార్పు చెందిందని, ముఖ్యంగా దక్షిణ భారత సమాజంలో మేకప్పై ఉన్న సంప్రదాయ భావనలు క్రమంగా మారుతున్నాయని పేర్కొన్నారు.వెల్ డన్ ‘సాక్షి’.. ఉమెన్స్ డే రోజున సాక్షి ఆధ్వర్యంలో మా కోసం స్ఫూర్తివంతంగా నిర్వహించిన ఈ ‘ఆల్ ఫర్ హర్’ వేడుకలు అభినందనీయం. ఈ వేడుకలు మా అందరికీ సరికొత్త అనుభూతిని, స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందించిన సాక్షి గ్రూప్కు ప్రత్యేక అభినందనలు. – జానకి (పార్టిసిపేషన్ ప్రైజ్ విన్నర్) (చదవండి: వసంతాన్ని ఎక్స్పీరియెన్స్ చేయాలనుకుంటే.. అక్కడకు వాలిపోవాల్సిందే..!) -
ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..
ప్రసవానంతరం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. మాములుగా బరువు తగ్గడానికి గర్భధారణ అనంతరం తగ్గడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పైగా శరీరంలో వచ్చే మార్పులకు తోడు నవజాత శిశువుని హ్యాండిల్ చేస్తూ బరువు తగ్గడం తదితరాలన్ని చాలా సవాలుగా ఉంటాయి. ముందుగా శరీరం మునపటి పటుత్వం లేక..కొద్దిపాటి వ్యాయామాలను ఓర్చుకునే శక్తి స్వతహాగా కొత్త తల్లులకు ఉండదు. మరి అలాంటప్పుడు ఎలాంటి తేలిక పాటి వ్యాయామాలు చేయాలి..? కొత్త తల్లులు నిజంగానే తీవ్రమైన వ్యాయామాల జోలికి పోకపోవడమే మంచిదా..? తదితరాల గురించి కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి త్యాగి చెప్పే సలహాలు సూచనలే గురించి సవివరంగా చూద్దామా..!.ప్రసవానంతరం బరువు తగ్గం అనేది సాధారణ విషయం కాదని అంటోంది నిధి త్యాగి. దీని గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అమూల్యమైన సలహాలు సూచనలు షేర్ చేశారు. ఇక్కడ కొత్త తల్లులు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కంటే..కేలరీలలోటు, కదలికలపై దృష్టిపెట్టాలని అంటోంది. చాలామంది డెలివరీ తర్వాత పాలిస్తారు కాబట్టి బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు. కానీ అది ముమ్మాటికీ అబద్ధమని అంటోంది. తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మామిడపండ్లు అధికంగా తినేదాన్ని అని ఆ టైంలో ఏకంగా 20 కిలోలకు పైగా అదనపు బరువు ఉన్నానని చెప్పుకొచ్చింది. ప్రసవం తర్వాత పదికిలోలు మాత్రమే తగ్గానని, మిగిలిని పదికిలోల బరువు అలాగే ఉందని తెలిపింది. ఏడాదికి పైగా బిడ్డకు పాలిచ్చానని, ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకున్నానని, అలాగే తేలికపాటి వాకింగ్ వంటివి చేసేదాన్ని అని వెల్లడించింది. కానీ అంతలా కేర్ తీసుకున్నా..బరువులో అంతగా మార్పులు కనిపించలేదని అంటోంది. పైగా డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి తీవ్రమైన వ్యాయామాల జోలికి అస్సలు పోకూడదని అంటోంది. ఎందుకంటే కొత్త తల్లుల శరీరం సున్నితంగా మారిపోయి ఉంటుంది..దాంతో ఆ వర్కౌట్లు తట్టుకోవడం అంత సులభం కాదని చెబుతోంది. కనీసం 15 నిమిషాలు కూడా చేయలేమని అంటోంది. అలా అని బయటకు జిమ్ వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో హోమ్ ఇన్స్ట్రక్టర్ని నియమించుకున్నట్లు తెలిపింది. అతను సూచించిన కోర్ వ్యాయామాలు, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలతో బలం పుంజుకోగలిగానని అంటోంది. వీటివల్ల కండరాలు బలోపేతం అవుతుతాయి. కొద్దిపాటి బరువులు ఎత్తి..బోడ్డులోపలికి కోర్ని స్ట్రాంగ్గా మార్చుకోగలిగానని అంటోంది. అలా తాను నాలుగు నెలల్లో నాలుగు నుంచి ఐదు కిలలోలు వరకు తగ్గగలిగానని అంటోంది. ప్రస్తుతం తాను ప్లాంక్లు కూడా వేయగలనని, వెన్నునొప్పి లేదని అంటోంది. కానీ ప్రసవానంతరం వేగవంతంగా బరువు తగ్గాలనుకోవడం తప్పులేదు గానీ..ఆ క్రమంలో తప్పుడు మార్గంలో వెళ్లొద్దని, ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోమని చెబుతోంది కంటెంట్ క్రియేటర్ నిధి త్యాగి. View this post on Instagram A post shared by Nidhi Tyagi (@thenidhityagi) (చదవండి: చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!) -
నయనిక రెడ్డి అల్లు శిరీష్ పెళ్లిలో హైలెట్ 'శంకు చక్రం' మెహందీ డిజైన్
ఈసారి సెలబ్రిటీల జంట ట్రెండ్ని సెట్ చేయడం లేదు. వాళ్లే సరికొత్త ట్రెండ్ని సెట్ చేసేలా భారతీయ మూలాలను గౌరవించడం విశేషం. ఈ మార్చి 6న అల్లు శిరీష్ నయనిక రెడ్డీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అల్లు శిరీష్ చేతి మెహందీ అందర్నీ అమితంగా ఆకర్షించింది. మన సంస్కృతికో పాతుకపోయిన గోరింటాకు అంతరార్థాన్ని తెలియజెప్పేలా శిరీష్ చేతి మెహిందీ ఉంది. నిజంగానే మన భారతీయ సంప్రదాయంలో వధువరులను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. నారాయణుడకి తమ ఇంటి ఆడపిల్ల చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిని అందిస్తున్నాం అన్నట్లుగా కాళ్లు కడిగి మామగారు అల్లుడి చేతిలో పెడతారు. నారాయణ..మా లక్ష్మీకి ఇక నుంచి అన్ని నీవే అని చెబుతారు. ఆ నేపథ్యాన్ని ఇలా శిరీస్ చేతిపై ఉన్న మెహందీ డిజైన్ ద్వారా చెప్పకనేచెప్పారు. ఈ శంకు చక్రాలు ఎక్కువగా వైష్ణవులు తమ భుజాలపై ఛాతీపై ధరిస్తారు. అలాగే ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఇవి దర్శనిమిస్తాయి. నిజంగా ఆ వివాహ వేడుకలో నారయణుడిగా శిరీష్..లక్ష్మీదేవిగా నయనికలు అతిథులకు చూడచక్కని జంటలా కనువిందు చేశారు. ఇక్కడ శంఖం అనేది శుభ శుచికానికి, ధనానికి ప్రతీక అయితే..చక్రం మన జీవిత గమనానికి సంకేతం..ఇక మధ్యలో ఉండే తిరునామాలు..అందరిలోనూ ఉండే సర్వాంతర్మామి ఆ నారాయణుడి అని గొంతెత్తి చెప్పేలా చాలామంది వైష్ణవులు ముఖంపై ధరిస్తుంటారు. కాగా ఈ వివాహ వేడుకలో అల్లు శిరీష్ బంగారు రంగులో క్లిష్టమైన ఎంబ్రాయిడీ కలిగి న్న ఆఫ్ వైట్ సిల్క్ షేర్వానీని ఎంచుకోగా, నయనికా రెడ్డి బంగారం వెండి జర్దోజీ వర్క్తో అంకరించబడిన లావెండర్ రంగు పట్టు చీరను ఎంచుకుంది. దానికి అనుబంధంగా రూబీ, వజ్రాల నెక్లెస్లు, స్టేట్మెంట్ చెవిపోగులు, గాజులతో ముగ్ధమనోహరంగా ఉంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) (చదవండి: Arjun Saaniya Chandhoks wedding: సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!) -
మైండ్ ఫుల్నెస్.. బిజీ షెడ్యూల్లో ప్రశాంతతను వెతుక్కోవడం
నేటి ఆధునిక కార్పొరేట్ ఉద్యోగి జీవితం ఒక నిరంతర పరుగుపందెం. ఉదయం నిద్రలేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు టార్గెట్లు, డెడ్లైన్లు, ఈమెయిల్ నోటిఫికేషన్లు, ఫోన్ కాల్స్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పనులు మిమ్మల్ని చుట్టుముడుతుంటాయి. ఈ ఉరుకుల పరుగుల మధ్య మీ మెదడు నిరంతరం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ లేదా గతం గురించి అసహనంతో ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో యంత్రంలా మారిపోతాం. ఇలాంటి సందర్భంలో మైండ్ఫుల్నెస్ (Mindfulness) అనేది ఒక విలాసం కాదు, అది అత్యవసరమైన జీవన నైపుణ్యం.మైండ్ఫుల్నెస్ అంటే కేవలం ధ్యానం కాదు..చాలామంది మైండ్ఫుల్నెస్ అంటే కళ్లు మూసుకొని గంటల తరబడి ధ్యానం చేయడం అనుకుంటారు. అది తప్పు. మైండ్ఫుల్నెస్ అంటే 'ప్రస్తుత క్షణంలో పూర్తిగా నిమగ్నమై ఉండటం'. మీరు కాఫీ తాగుతున్నప్పుడు కేవలంకాఫీ రుచిని, దాని సువాసనను మాత్రమే అనుభవిస్తూ తాగడం. ఆఫీసులో మీటింగ్ జరుగుతున్నప్పుడు, పక్కాగా ఆ మీటింగ్ మీదే దృష్టి పెట్టడం. గతంలోని అపజయాల గురించి గానీ, భవిష్యత్తులోని భయాల గురించి గానీ ఆలోచించకుండా, ఆ క్షణంలో మీరు చేసే పనిని పూర్తిగా ఆస్వాదించడమే మైండ్ఫుల్నెస్.బిజీ షెడ్యూల్లో మైండ్ఫుల్నెస్ను ఎలా పాటించాలి?మీకు గంటల కొద్దీ సమయం లేకపోయినా, పద్ధతిగా ప్రయత్నిస్తే బిజీ షెడ్యూల్లోనే ప్రశాంతతను పొందవచ్చు.మైండ్ఫుల్ బ్రీతింగ్: ఆఫీసులో ప్రతి గంటకు ఒకసారి కేవలం ఒక నిమిషం పాటు పని ఆపేయండి. మీ కళ్లు మూసుకొని, మీ శ్వాస గాలి లోపలికి వెళ్లడం, బయటకు రావడం మీద దృష్టి పెట్టండి. అది మీ నాడీ వ్యవస్థకు ఒక 'రీసెట్ బటన్'లా పనిచేస్తుంది.ఏకకాలంలో ఒకటే పని: మల్టీ-టాస్కింగ్ అనేది మెదడును త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఒకే సమయంలో పది పనులు చేసే ప్రయత్నం చేయడం మానేసి, ప్రస్తుతం చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. దీనివల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది, మానసిక అలసట తగ్గుతుంది.ఆహారపు అలవాట్లు: లంచ్ బ్రేక్ సమయంలో ఫోన్ చూస్తూ తినడం మానేయండి. మీరు తినే ఆహారం రుచి, రంగు, వాసనను గమనిస్తూ తినండి. ఇది మీ మనసును ఆఫీసు ఒత్తిడి నుండి ఆ క్షణానికి తీసుకువస్తుంది.నడకలో ధ్యానం (Walking Meditation): ఆఫీసు కారిడార్లో నడుస్తున్నప్పుడు లేదా పార్కింగ్ ఏరియాకు వెళ్తున్నప్పుడు, ప్రతి అడుగును గమనిస్తూ నడవండి. మీ పాదాలు నేలను తాకడం, మీ చుట్టూ ఉన్న గాలిని గమనించడం చేయండి. ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్.నా దగ్గరికి వచ్చిన ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ (పేరు, వివరాలు మార్చాను) తన బిజీ షెడ్యూల్ వల్ల ప్రతిరోజూ పానిక్ అటాక్స్కు గురయ్యేవాడు. అతను ప్రతి రోజూ కనీసం 50 కాల్స్ అటెండ్ చేసేవాడు. మేము అతనికి '3-సెకన్ల రూల్' నేర్పించాం. ఫోన్ మోగగానే వెంటనే ఎత్తకుండా, 3 సెకన్లు ఆగి, రెండు సార్లు దీర్ఘ శ్వాస తీసుకున్న తర్వాతే ఫోన్ ఎత్తడం అలవాటు చేసుకున్నాడు. ఆ చిన్న మార్పు అతని మొత్తం రోజువారీ అనుభవాన్ని మార్చేసింది. ఆ మూడు సెకన్లు అతనికి ఎంతో ప్రశాంతతను ఇచ్చాయి.ఎందుకు మైండ్ఫుల్నెస్ అవసరం?👉ప్రశాంతంగా ఉన్న మెదడు సంక్లిష్టమైన నిర్ణయాలను తప్పులు లేకుండా తీసుకోగలదు.👉మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వారి వైపు శ్రద్ధ చూపిస్తే, సంబంధాలు మెరుగుపడతాయి.👉కోపం, భయం వంటి భావోద్వేగాలను మీ మెదడు పసిగట్టి, వాటికి ప్రతిస్పందించేలా చేస్తుంది.మీ కోసం ఒక చిన్న టాస్క్...ఈ రోజు మీరు పని చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న శబ్దాలను గమనించండి. ఏసీ శబ్దం, కీబోర్డ్ టైపింగ్ శబ్దం, పక్కవారి మాటలు.. కేవలం గమనించండి, వాటికి రియాక్ట్ అవ్వకండి. మీరు గమనించిన క్షణమే మీరు మైండ్ఫుల్గా ఉన్నట్టు లెక్క. జీవితం అంటే మీరు ఎక్కడికో వెళ్లడం కాదు, మీరు ఉన్న చోటే ఎలా జీవిస్తున్నారో అన్నదే ముఖ్యం. బిజీగా ఉండటం అంటే కష్టపడటం మాత్రమే కాదు, మీకంటూ ఒక ప్రశాంతమైన స్థానాన్ని మెదడులో నిర్మించుకోవడం. కాస్త ఆగి, శ్వాస తీసుకోండి.. ప్రపంచం ఎక్కడికీ పారిపోదు, కానీ మీ ప్రశాంతత మీతోనే ఉంటుంది.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, గెలుస్తూ ఉండటం అనుకుంటారు. కానీ నిజమైన పర్సనాలిటీ గ్రోత్.. మీరు కింద పడ్డప్పుడు ఎంత వేగంగా లేచి నిలబడతారో, అందులోనే ఉంది. సైకాలజీలో దీనినే 'Resilience' అంటారు.1. Resilience అంటే ఏమిటి?మనిషి జీవితంలో ఎప్పుడూ 'హ్యాపీగా' ఉండలేడు. ఓటములు, అవమానాలు, గాయాలు అనేవి రాక మానవు. కానీ, అక్కడే ఆగిపోకుండా, మనల్ని మరింత పవర్ఫుల్గా మలిచే శక్తి Resilience (పునరుద్ధరణ శక్తి).జీవితం అనేది ఒక సముద్రంలాంటిది, అలలు (సమస్యలు) వస్తూనే ఉంటాయి. రెసిలియన్స్ అంటే అలలను ఆపడం కాదు, ఆ అలల మీద సర్ఫింగ్ చేయడం నేర్చుకోవడం. ఇది ఒక టాలెంట్ కాదు, ఇది మనం ప్రాక్టీస్ చేసి పెంచుకోవాల్సిన ఒక 'మజిల్' (Muscle).* Fixed Mindset: "నేను ఓడిపోయాను, నా వల్ల కాదు" అని అనుకోవడం.* Growth Mindset (Resilience): "నేను ఓడిపోయాను, కానీ ఇది ఒక లెసన్. దీన్నుండి నేను ఏం నేర్చుకున్నాను?" అని అనుకోవడం.2. The 3 Pillars of Resilienceఒక వ్యక్తి కింద పడ్డా తిరిగి లేవాలంటే, అతని మైండ్సెట్లో ఈ మూడు ఉండాలి.* Acceptance: "ప్రస్తుతం నా జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితి ఉంది" అని ఆ వాస్తవాన్ని భయపడకుండా అంగీకరించడం.* Purpose: మీరు ఎందుకు బ్రతకాలి? మీ లక్ష్యం ఏంటి? మీకంటూ ఒక 'ఎందుకు' (Why) బలంగా ఉంటే, మీరు 'ఎలాంటి' (How) పరిస్థితినైనా దాటగలరు.* Adaptability: పాత పద్ధతులు పని చేయనప్పుడు, మూర్ఖంగా వాటినే పట్టుకోకుండా, కొత్త మార్గాలను వెతకడం.3. మోటివేషన్ మాయ vs నిజమైన దృఢత్వంమోటివేషన్ "ఎప్పుడూ గెలుస్తూనే ఉండు" అని చెప్తుంది. ఇది ఒక అబద్ధం, ఎందుకంటే గెలవకపోతే వారు కుంగిపోతారు.రెసిలియన్స్ "ఓడిపోవడం సహజం, కానీ ఆ ఓటమికి నీ జీవితాన్ని అప్పగించకు" అని చెప్తుంది. రెసిలియన్స్ ఉన్న వ్యక్తికి ఓటమి ఒక 'ఎండ్' కాదు, ఒక 'ఎపిసోడ్' మాత్రమే.4. రెసిలియెంట్ మైండ్సెట్ బిల్డింగ్Genius Matrix మోడల్ ఉపయోగించి, మీరు కూడా ఒక 'అజేయమైన వ్యక్తి'గా ఎలా మారాలి?Step 1: భయం బంధనాలను బ్రేక్ చేయండిఓడిపోతే ఏమవుతుందో అన్న భయం, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం.. వీటిని 'Break' చేయండి. ఓటమిని అవమానంగా కాకుండా, ఒక 'డేటా పాయింట్' (Data Point) లా చూడండి. మీరు ఎంత ఎక్కువ ప్రయోగాలు చేస్తే, అంత ఎక్కువ డేటా మీకు దొరుకుతుంది.Step 2: పోరాట పటిమ (Build)మీ రెసిలియెన్స్ను ఒక మజిల్ లాగా బిల్డ్ చేయండి. చిన్న చిన్న సవాళ్లను తీసుకోవడం ద్వారా మీ మెదడును ట్రైన్ చేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు "ఎందుకు నాకు ఇలా జరిగింది?" అని కాకుండా, "దీన్ని నేను ఎలా అధిగమించగలను?" అని అడగండి. మీ మైండ్ని 'Solutions' వైపు 'Build' చేయండి.Step 3: స్టాయిక్ మాస్టరీ ( Beyond)పరిస్థితులు మీ కంట్రోల్లో లేనప్పుడు, మీరు వాటికి ఇచ్చే 'రియాక్షన్' మీ కంట్రోల్లో ఉంటుంది. తుఫానులో కూడా ప్రశాంతంగా ఉండటమే 'Beyond' స్టేజ్. దీంతో మీరు అజేయంగా మారుతారు.5. మీ రెసిలియన్స్ స్కోర్ ఎంత?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.* మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అతి పెద్ద ఓటమి ఏంటి?* ఆ ఓటమి మీకు నేర్పిన ఒకే ఒక్క ముఖ్యమైన పాఠం ఏంటి?* ఇప్పుడు ఆ ఓటమిని మీరు గర్వంగా (ఒక అనుభవంగా) చెప్పుకోగలరా?కింద పడటం ఒక కళ!బ్రో, కింద పడటం వల్ల కాదు, పడి అక్కడే ఉండిపోవడం వల్ల మీ వ్యక్తిత్వం దెబ్బతింటుంది. కింద పడి, దుమ్ము దులుపుకుని, నవ్వుతూ లేచి నిలబడటమే ఒక కళ (Art of Resilience). మీరు ఎంత బలంగా దెబ్బ తింటే, అంత బలంగా తిరిగి రాగలరు. ఇదే మీ Real Personality కి అసలైన కొలమానం."The greatest glory in living lies not in never falling, but in rising every time we fall." -Nelson Mandela-సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
స్ట్రాంగ్ ఉమెన్ అవుతారా?
ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు.. మానసికంగానూ బలంగా ఉండాలి. అపుడే అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతారు. అందుకోసం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఒక చిన్న అలవాటు మీ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలదు, అదే సమయంలో పూర్తిగా దెబ్బతీయగలదు కూడా. మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్ ఉమెన్గా చూసుకోవాలనుకుంటే, మీరు అలవర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు..భావోద్వేగాలపై నియంత్రణ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక బలంతో పాటే మానసికంగా దృఢంగా ఉండటమూ చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉపయోగించడమే మానసిక దృఢత్వానికి మొదటి మెట్టు. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో తెలిసుండాలి. కోపం, బాధ కలిగినపుడు కుంగిపోకుండా.. ఆ భావాలను అర్థం చేసుకుని మరింత మానసిక పరిపక్వతతో ముందుకు సాగుతుండాలి.నో చెప్పడమే బెటర్అందరినీ మెప్పించాలనేం లేదు. అలా ప్రయత్నిస్తే మానసిక అలసట తప్పదు. అందుకే ఎదుగుదలకు, మనశ్శాంతికి అడ్డుపడే విషయాలకు నిర్మొహమాటంగా నో అని చెప్పగలగాలి. ఇందులో ఎటువంటి గిల్టీ ఫీలింగ్ని కలిగి ఉండకూడదు. సమయానికి విలువ ఇవ్వడం, అనవసరమైన బాధ్యతలను తిరస్కరించడం అనేది స్వార్థం కాదు, మీ ఆత్మగౌరవానికి నిదర్శనం.‘కాదు’ అని చెప్పగలగడం విజయానికే కాదు, ప్రశాంతమైన జీవనానికి కూడా తోడ్పడుతుంది.తప్పుల నుంచి పాఠాలుఓటమికి భయపడని వారే విజేతలుగా నిలుస్తారు. తమ తప్పులకు ఇతరులను నిందించకూడదు. బాధ్యత తీసుకోవాలి, లోపాలను విశ్లేషించుకోవాలి. ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. ఈ నేర్చుకునే తత్వం అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది.నేర్చుకోవడానికి సిగ్గుపడకపోవడం తమకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనుకోకూడదు. తమకున్న జ్ఞానంపై నమ్మకం ఉన్నప్పటికీ, ఇతరుల అనుభవాలకు విలువ ఇవ్వాలి. ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు దానిని మనస్ఫూర్తిగాస్వీకరించాలి. ఇతరులలోని మంచిని, గొప్ప లక్షణాలను అడాప్ట్ చేసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. ఈ లక్షణాలు అలవర్చుకుంటే ఏ మహిళ అయినా తన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలదు.అసూయ పడకపోవడం మానసిక బలానికి ప్రధాన వనరు అసూయ లేకపోవడం. ఇతరుల విజయాన్ని చూసి కుళ్లుకోవద్దు. బదులుగా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరని గుర్తించాలి. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, నిన్నటి కంటే ఈరోజు తాము ఎంత మెరుగ్గా ఉన్నాము అనే దానిపైనే దృష్టి పెట్టాలి.చదవండి: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వరకుమార్పును స్వీకరించాలిప్రపంచంలో మార్పు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మార్పును చూసి భయపడకుండా దానిని ఒక అవకాశంగా మలచుకోవాలి. అది కెరీర్ అయినా.. వ్యక్తిగత జీవితం అయినా పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. గతాన్ని తలచుకుని బాధపడటం కంటే, భవిష్యత్తు కోసం ప్రస్తుతం ప్రణాళికలు రచించుకోవాలి. -
పాత ఆలోచనా విధానాన్ని కూల్చేయండి
ఇప్పటివరకు మనల్ని మనం గమనించాం, మన లోపాలను గుర్తించాం, మన మెదడు మనకు చెప్పే అబద్ధాలను పట్టుకున్నాం. ఇప్పుడు ఆ పాత పునాదిని పూర్తిగా కూల్చివేసి (Break), కొత్తదానికి సిద్ధమయ్యే సమయం. ఎందుకంటే, పాత భవనం మీద కొత్త ఇల్లు కట్టలేం కదా! మన పాత పర్సనాలిటీని ఎలా 'బ్రేక్' చేయాలో చూద్దాం.పర్సనాలిటీ డెవలప్మెంట్లో 'బ్రేక్' చేయడం అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం కాదు, మనల్ని మనం పరిమితం చేస్తున్న ఆ పాత 'ఐడెంటిటీ' (Identity) ని వదిలించుకోవడం. దీనినే సైకాలజీలో 'De-conditioning' అంటారు. మీరు ఇన్నాళ్లూ నమ్మిన 'నేను' అనే వ్యక్తి, కేవలం పరిస్థితులు సృష్టించిన ప్రతిబింబం మాత్రమే. ఆ ప్రతిబింబాన్ని ఇప్పుడు తుడిచేయాలి.1. పాత పునాది ఎందుకు కూలిపోవాలి?చాలామంది తమ పాత అలవాట్లను, పాత భయాలను ఎందుకు వదలలేకపోతారంటే, అవి వారికి సుపరిచితమైనవి. అవి మనకు కష్టం కలిగించినా, అవి మనకు తెలిసినవి కాబట్టి వాటిని వదలడానికి భయపడతాం.పాత ఆలోచనలు = మీ గతం.కొత్త పర్సనాలిటీ = మీ భవిష్యత్తు.ఈ రెండింటికీ మధ్య ఒక గ్యాప్ ఉంటుంది, అదే 'The Void' (శూన్యం). ఈ శూన్యంలోకి వెళ్లడానికి చాలామంది భయపడతారు. కానీ, ఆ శూన్యమే మీ కొత్త వ్యక్తిత్వానికి పునాది!2. కూల్చివేతకు కావాల్సిన మూడు ఆయుధాలుమీ పాత ఐడెంటిటీని బ్రేక్ చేయడానికి మీకు మూడు ముఖ్యమైన ఆయుధాలు కావాలి.Radical Honesty: మీకు మీరు అబద్ధం చెప్పుకోవడం మానేయాలి. "నాకు కోపం రాదు" అని అబద్ధం చెప్పే బదులు, "నేను అతిగా రియాక్ట్ అవుతున్నాను, అది నా బలహీనత" అని ఒప్పుకోవాలి. నిజం మాట్లాడటం మొదలుపెడితే, పాత అబద్ధపు గోడలు దానంతట అదే కూలిపోతాయి.Detachment: మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు మాత్రమే మీరు కాదు. కోపం వచ్చినప్పుడు "నేను కోపంగా ఉన్నాను" అనడం కంటే, "నాలో కోపం అనే భావం కలుగుతోంది" అని అనండి. ఆ ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు వేరు (Detach) చేసుకున్నప్పుడే మీరు వాటిని బ్రేక్ చేయగలరు.Destruction of Comfort Zone: ప్రతిరోజూ మీకు భయం కలిగించే చిన్న పనిని చేయండి. మీ పాత వ్యక్తిత్వం ఎక్కడైతే ఆగిపోతుందో, అక్కడ మీరు అడుగు వేయండి.3. మార్కెట్ మోటివేషన్ vs రియల్ సైకాలజీమార్కెట్ "నేను గెలుస్తాను, నేను తోపు" అని అరుస్తూ గోడలను బద్దలు కొట్టమంటుంది. ఇది తాత్కాలిక జోష్.సైకాలజీ (CBT & Mindfulness) గోడలను కొట్టడం కాదు, ఆ గోడలు అసలు ఎందుకు కట్టామో (పాస్ట్ ట్రామాస్) అర్థం చేసుకుని, వాటిని ఇటుక ఇటుకగా విడదీయమంటుంది. అప్పుడే మళ్ళీ ఆ గోడలు కట్టే అవకాశం ఉండదు.4. మీ నూతన నిర్మాణానికి సిద్ధం!Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ కూల్చివేత ప్రక్రియ ఎలా ఉండాలి?Step 1: Break (అహాన్ని వదిలేయడం)మీరు ఇన్నాళ్లు కాపాడుకున్న ఆ 'ఇమేజ్'ని వదిలేయండి. "నేను అంటే ఇలాగే ఉంటాను" అనే ఫిక్స్డ్ మైండ్సెట్ను వదిలేయండి. మీ పాత ఐడెంటిటీని 'డీ-కన్స్ట్రక్ట్' (Deconstruct) చేయండి. ఇది నొప్పిగా ఉంటుంది, కానీ ఇది అవసరం.Step 2: Build (నిశ్శబ్దం)పాత పర్సనాలిటీ కూలిపోయిన తర్వాత, కొత్తది కట్టే ముందు కొద్ది రోజులు 'నిశ్శబ్దం'గా ఉండండి. ఏ ప్లాన్లు లేని, ఏ లేబుల్స్ లేని ఒక శూన్య స్థితిలో ఉండండి. అక్కడే మీ అసలైన పర్పస్ (Purpose) పుడుతుంది.Step 3: Beyond (కొత్త ప్రతిబింబం)ఇప్పుడు మీరు కొత్త ఇటుకలతో, కొత్త ఆలోచనలతో మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. ఈసారి ఇది మీ ఛాయిస్, సమాజం వేసిన అచ్చు కాదు. ఇదే మీరు 'Beyond' స్టేజ్లోకి వెళ్ళే మార్గం.5. మీ పాత వ్యక్తిత్వానికి వీడ్కోలు!ఈ రోజు ఒక చిన్న విచారణ చేయండి.* మీ పాత ఐడెంటిటీలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టిన ఒక లక్షణం ఏది?* ఆ లక్షణాన్ని వదిలేస్తే, మీరు పోగొట్టుకునేది ఏంటి? (బహుశా అది ఒక భద్రత కావచ్చు).* ఆ భద్రతను వదిలి, కొత్తగా మారుతానని మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి.కూల్చండి.. అప్పుడే నిర్మించగలరు!బ్రో, పాత గోడలను కూల్చడం బాధాకరమే కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆ గోడల వల్ల మీరు ఇప్పటివరకు ఎంతో పరిమితంగా బతికారు. ఇప్పుడు ఆ పరిమితులు లేవు. మీరు గాలిలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు."Sometimes, you have to break yourself to become whole."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
పరుగే జీవితం
బస్సులలో ప్రయాణం చేసే సమయంలో మహిళా కండక్టర్లు విధుల్లో కనిపిస్తుంటారు. ఇంటిని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు చక్రాల్లా తిరుగుతున్నవారి పనిని మౌనంగా గమనిస్తుంటాం. సికింద్రాబాద్లోని మచ్చబొల్లారంలో ఉంటున్న ఐదుపదుల స్వరాజ్య లక్ష్మి ఉద్యోగ బాధ్యతలతో పాటు జాతీయ, అంతర్జాతీయ రన్నింగ్ రేసులో పాల్గొని పతకాలూ సాధిస్తోంది. ‘వయసు మీద పడినా పనిలో చురుగ్గా ఉండాలంటే మహిళలకు క్రీడలు తప్పనిసరి’ అంటూ తన క్రీడా జీవితాన్ని వివరించింది లక్ష్మి.‘‘రోజూ ఉదయమే నాలుగున్నర గంటలకు డ్యూటీలో ఉంటాను. అంటే, మూడు గంటలకు నిద్రలేస్తాను. తిరిగి ఒంటి గంటకల్లా ఇంటికి వచ్చేస్తా. ఇంటి పనులు చూసుకొని, కాసేపు రెస్ట్ తీసుకొని, సాయంకాలం గ్రౌండ్కి వెళ్లి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను. పాతికేళ్లుగా కంటోన్మెంట్లో కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను, రన్నింగ్లోనూ నన్ను నేను నిరూపించుకుంటున్నాను.మార్చుకున్న షెడ్యూల్...చదువుకునే రోజుల్లో రన్నింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఆ తర్వాత కండక్టర్గా ఉద్యోగంలో చేరాను. మా వారు ప్రైవేట్ ఉద్యోగి. మాకు ఓ బాబు. ఇంటర్ చదువుతున్నాడు. ఇంటి పనులు, ఉద్యోగం చేసుకున్నా ఇంకా సమయం మిగిలే ఉండేది. దీంతో చదువుకున్న రోజుల్లో వదిలేసిన రన్నింగ్ను ఉద్యోగంలో చేరాక కంటిన్యూ చేశాను. పదిహేనేళ్ల క్రితం ఆర్టీసీలో ఎవరైనా క్రీడాకారులు ఉంటే వాళ్లు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిసింది. దీంతో రన్నింగ్ అంటే ఇష్టం ఉండి, ప్రాక్టీస్ చేస్తున్న నాకు మంచి అవకాశం లభించినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి నా టైమ్ టేబుల్ను నేనే మార్చుకున్నాను. ఉదయం డ్యూటీకీ వెళ్లి పోయి, మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి, సాయంకాలానికి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం... ఇన్నేళ్లుగా ఇదే షెడ్యూల్లో నా జీవన శైలి ఉంటుంది. విదేశీ పోటీల్లోనూ...దీంట్లో భాగంగానే ఇండోనేషియా, మలేషియాలో జరిగే రన్నింగ్ కాంపిటిషన్లలో పాల్గొని బంగారు పతకాలను సాధించాను. దేశీయస్థాయిలో రాజస్థాన్, చండీగడ్, ఢిల్లీలోనూ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నాను. ఈ యేడాది జనవరిలో అజ్మీర్లో జరిగిన రన్నింగ్ రేస్లో పాల్గొన్నాను. 400 మీటర్ల పరుగులో సెకండ్ ప్రైజ్, 800 మీటర్ల పరుగులో థర్డ్ ప్రైజ్ వచ్చింది. పోటీలలో పాల్గొనడానికి వెళ్లేటప్పుడు వసతి సదుపాయాలు నిర్వాహకులే చూస్తారు. ప్రయాణ ఖర్చులు మాత్రం నేను ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటాను.మా మహిళా కండక్టర్లు కలిసినప్పుడు ‘మేమంతా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాం. కానీ, డ్యూటీ చేస్తూ ఈ వయసులో కూడా నువ్వు యాక్టివ్గా ఉన్నావు’ అంటుంటారు. పనిలో యాక్టివ్గా ఉండాలంటే ఏదో ఒక క్రీడ ఉంటేనే మంచిది. క్రీడల్లో పాల్గొంటే మన జీవనమే మారి పోతుంది. ప్రతీది ఛాలెంజ్గా తీసుకుంటాం. ధైర్యం వచ్చేస్తుంది. ఆరోగ్యంగానూ ఉంటాం. అందుకే, మా మహిళా ఉద్యోగులకు ‘ పోటీలో పాల్గొనక పోయినా సరే, ఏదో ఒక గేమ్ని ఎంచుకొని ప్రాక్టీస్ చేయమని చెబుతుంటాను’ అని వివరించింది ఈ క్రీడా కండక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రణరంగంలో నారీ శక్తి..!
ఒకప్పుడు కేవలం వైద్య, నర్సింగ్ సేవలకే పరిమితమైన మహిళలు, నేడు భారత సైన్యంలో కీలక విభాగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. యుద్ధ విమానాలు నడపడం నుంచి ఫిరంగి దళాల నిర్వహణ వరకు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ మహిళల పాత్ర ఒక మైలురాయిగా నిలిచింది. క్షేత్ర స్థాయి పోరాటంలో, అత్యున్నత స్థాయి వ్యూహ రచనలో పాల్గొని మహిళల గొప్పదనాన్ని ప్రపంచానికే చాటిచెప్పారు. ప్రస్తుతం భారత సాయుధ దళాల్లో మహిళల సంఖ్య గత ఆరేళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ గణాంకాల ప్రకారం..భారత సైన్యంలో సుమారు 8000 (వైద్య, నర్సింగ్ సేవలతో కలిపి) మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. 2022 నుంచి నేషనల్ డిఫెన్స్ అకాడమీలోకి మహిళా క్యాడెట్లను చేర్చుకోవడం ప్రారంభమైంది. ప్రతి ఆరు నెలలకు 19 మంది మహిళా అభ్యర్థులకు ఇక్కడ శిక్షణ ఇచ్చి నేరుగా ఆఫీసర్లుగా నియమిస్తున్నారు.సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు తర్వాత, మహిళా అధికారులకు కూడా పురుషులతో సమానంగా పదవీ విరమణ వరకు ఆర్మీలో కొనసాగడమే కాకుండా ఉన్నత పదవులను అధిరోహించగలుగుతున్నారుసాధారణ అధికారులుగా (మెడికల్, నర్సింగ్ మినహా) విధులు నిర్వహిస్తున్న వారి సంఖ్య 2037. గతంలో ఇది 1732 ఉండేది. భారత ప్రభుత్వం, సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయాలు సైన్యంలో మహిళల సంఖ్య పెరిగేందుకు దోహదం చేశాయి.సుమారు 145 మందికి పైగా మహిళా అధికారులు ప్రస్తుతం కల్నల్ హోదాలో వివిధ యూనిట్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో 60% మంది సరిహద్దుల్లోని కార్యాచరణ ప్రాంతాలలో సేవలు అందిస్తుండటం విశేషం.అగ్నిపథ్ పథకం కింద మహిళలను అగ్నివీర్లుగా రక్షణ దళాలలోకి తీసుకుంటున్నారు. నావికాదళంలో 20% ఖాళీలను మహిళలకే కేటాయించారు.ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం, టెక్నికల్ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నారు. లెఫ్టినెంట్ హోదాలో చేరే అభ్యర్థులకు శిక్షణ కాలంలోనే నెలకు రూ. 56,000 పైగా స్టైపండ్ ఇస్తూ, గౌరవప్రదమైన కెరీర్ను ఆఫర్ చేస్తున్నారు.కమాండింగ్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిలో 115 మందికి పైగా ఉండగా.. మరో 145 మంది విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరు ఆర్టిలరీ, ఇంజినీర్లు, సిగ్నల్స్ వంటి విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదాతి దళంలోకి సైతం మహిళలను చేర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నారు.మొదటిసారిగా టెరిటోరియల్ ఆర్మీలోని హోమ్ – హెర్త్ ఇన్ఫాంట్రీ బెటాలియన్లలో మహిళా సైనికులను చేర్చుకోవాలని నిర్ణయించారు. దీనికోసం 110 ఖాళీలను కేటాయించారు. భారత సైన్యం లక్ష్యం ప్రకారం సుమారు 1700 మంది మహిళలను దశల వారీగా కోర్ ఆఫ్ మిలిటరీ పోలీస్లో చేర్చుకోవాలని నిర్ణయించారు. దీని ప్రకారం ప్రతి ఏటా 100 మందిని చేర్చుకుంటూ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. మహిళా క్యాడెట్లు 60 మంది ఉండగా ఏటా 20 మంది కొత్తగా చేరుతున్నారు. భారత సైన్యంలో మొత్తంగా చూసినట్లయితే మెడికల్, డెంటల్ విభాగాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా అంటే సుమారు 21% ఉంది.(చదవండి: అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..) -
సౌందర్య సాధనాలకన్నా చిరునవ్వే అసలైన అందం!
వెండితెరపై తన సహజ సిద్ధమైన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న నటి సాయి పల్లవి, తన వ్యక్తిత్వంతోనూ ఎంతోమందికి రోల్ మోడల్గా నిలుస్తోంది. తాను గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ, మహిళలు తమని తాము ఎలా ఉన్నా ప్రేమించుకోవాలని నేర్పిస్తోంది. మన విలువలకు విరుద్ధంగా ఉండేవి ఎంతటి విలువగలవయినా తిరస్కరించాలి అనే సూత్రాన్ని ఆచరించి చూపించారు. రూ. 2 కోట్ల విలువైన ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ని తిరస్కరించి, రంగు అనేది అందానికి కొలమానం కాదని నిరూపించారు. మేకప్ లేకుండా తెరపై కనిపించి .. నీలా నువ్వు ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందని, ఇతరుల కోసం మారాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పారు. మొటిమలున్నా, జుట్టు రింగులుగా ఉన్నా.. అది దేవుడిచ్చిన వరమని, సౌందర్య సాధనాలకన్నా చిరునవ్వుతో వెలిగే ముఖమే మిన్న అని చెబుతున్నారు. అలాగే చదువు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆయుధమని, అది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చాటి చెప్పారు. మనం చేసే పనిపై ఇష్టం ఉంటే విజయం దానంతట అదే వస్తుందని ఆమె అంటారు. విజయాలు, అపజయాలు తాత్కాలికమని, అవి నిన్ను ప్రభావితం చేయనివ్వద్దని సూచిస్తారు. బాల్యంలో స్టేజ్ ఫియర్ ఉన్న సాయిపల్లవి.. భయం ఉన్న చోటే ధైర్యాన్ని వెతుక్కోవాలని తన జీవిత విజయాల ద్వారా నిరూపిస్తారు. (చదవండి: అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..) -
అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..
కొందరు వయసు గడుస్తున్న కొద్దీ.. వృద్ధుల్లా కనిపించరు. యంగ్లుక్లో యువకుల మాదిరిగా ప్రకాశవంతంగాకనిపిస్తూ ఆశ్చర్యపరుస్తారు. అస్సలు అదెలా సాధ్యం అనిపిస్తుంది కూడా. వయసు రీత్యా అంత ఏజ్ ఉన్నా కూడా.. ఏ మాత్రం వృద్ధాప్య ఛాయలు కనుచూపు మేరలో కూడా కానరావు. ఇక్కడ ఈ మోడల్ కూడా అదే కోవకు చెందినవాడు. ఎవరతను అంటే..సింగపూర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, మోడల్ చువాండో టాన్కి మార్చి 03, 2026న అధికారికంగా 60 ఏళ్లు నిండాయి. కానీ దశాబ్దాలుగా టీనేజ్ యువకుడిలా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అతడి యంగ్లుక్ అందర్నీ విస్మయపరుస్తుంటుంది. కనీసం మచ్చుకైనా వృద్ధాప్య ఛాయలు ఎక్కడ కానరావు. అంతలా మెయింటైన్ చేస్తున్నా అతడి గ్లామర్ రహస్యం ఏంటో తెలసుకోవాలన్న కుతుహలం అందరిలోనే రేకెత్తిస్తుంటుంది. మరి అంతలా యవ్వనంగా కనిపించాలంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో తెలుసా..!?.లైఫ్స్టైల్ ఎలా ఉంటుందంటే..ఎలాంటి బ్యూటీ చికిత్సలు తీసుకోడు. దీర్ఘకాలిక క్రమశిక్షణయుత జీవనమే మేలుబ్రేక్ఫాస్ట్: గుడ్లు, తేనె, అవకాడోతో ప్రోటీన్ షేక్స్ లేదా ఓట్మీల్ అల్పాహారాన్ని తీసుకుంటానని తెలిపాడు. లంచ్ లేదా డిన్నర్:భోజనంలో సాధారణంగా ఉడకబెట్టిన లేదా కాల్చిన చికెన్ లేదా చేప, రసం విత్ రైస్ ఉంటాయి. తప్పనిసరిగా వర్కౌట్లు. ఇవి కేలరీలు బర్న్ చేయడానికి సమతుల్యతను బ్యాలెన్స్ చేసేలా డైట్ అత్యంత ముఖ్యమని చెబుతున్నాడు. పగటిపూట చేసే కార్యకలాపాలు ఆ రోజుల్లో మీరు బర్న్ చేసే కేలరీలకు సమానంగా ఉండాలని చెబుతున్నాడు. నాణ్యమైన నిద్ర తప్పనిసరి. ఒత్తిడిలేని సానుకూల మనస్తత్వం అత్యంత ముఖ్యం. ఆరోగ్యమైన వృద్ధాప్యానికి ఇవి అత్యంత కీలకమని చెబుతున్నాడు టాన్. అయితే తాను మద్యం, కాఫీ, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడట. వారానికి మూడు నుంచి ఐదు సార్లు బల శిక్షణ, కార్డియో వ్యాయామాలు, ఈత తదితరాలు ఉంటాయట. కాగా, టాన్ ఇటీవల కొద్దికొద్దిగా వృద్ధాప్యంలో దరిచేరే కొద్దిపాటి శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. సహజంగా కాలంతో వచ్చే వృద్ధాప్యాన్ని ఆపలేమని, కాకపోతే దాన్ని హెల్దీగా మార్చుకుంటే..ఆరోగ్యకరమైన వార్దక్య జీవితాన్ని గడపొచ్చని టాన్ చెబతున్నాడు. అంతేగాదు అతడి పోస్ట్ల్లో సైతం ఆసక్తికరమైన సందేశాలతో నెటిజన్లను ఆకట్టుకుంటాడు. వాటిని చూస్తే అవగతమవుతోంది ఫిట్నెస్ పట్ల ఎంత కేర్గా ఉంటాడనేది. కాగా, టాన్ తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. సమయాన్ని నిజమైన సంపదగా పేర్కొన్నాడు. ప్రతి సూర్యోదయం చూసేలా, అనుభవించేలా చేస్తున్నందుకు, ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నందకు సదా కృతజ్ఞుడును. ప్రతి రోజు ప్రకృతిలో గడపడం, సూర్యకాంతిలో గడపడం మిస్ చేసుకోవద్దు అని రాసుకొచ్చాడు పోస్ట్లో. సింపుల్గా చెప్పాలంటే సమయం, ఆరోగ్యం అత్యంత విలువైనవని, వాటిని నిర్లక్ష్యం చేస్తే.. అన్ని దూరమైపోతాయని చెప్పకనే చెప్పాడు టాన్. View this post on Instagram A post shared by CHUANDO TAN 陈传多 (@chuando_chuandoandfrey) (చదవండి: ఫ్లైట్ వాష్రూమ్ని జిమ్గా మార్చేశాడుగా..!) -
జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!
శీతాకాలం కంటే వేసవికాలంలో బరువు తగ్గడం చాలా సులభం. అందులోనూ ప్రస్తుతం చలికాలం ముగిసి.. వేసవికాలంలోకి ప్రవేశిస్తున్నాం. ఇన్నాళ్లు చలికి భయపడి ముసుగుతన్ని పడుకున్న వాళ్లంతా ఒక్కసారిగా ఈ మండే ఎండల్లో అయినా కొలెస్ట్రాల్ తగ్గించుకుని బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటివాళ్లు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ డాన్ గో నెట్టింట షేర్ చేసిన పదహారు రూల్స్ తప్పక ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన వేసవి సమీపించగానే చాలామంది వెయిట్లాస్కు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెయిట్లాస్ టిప్స్ షేర్ చేశారు ఫిట్నెస్ కోచ్ డాన్గో. ఆరోగ్యప్రదంగా తక్కువ టైంలో కిలోల కొద్ది బరువు తగ్గి.. మెరుగైన ఫలితాలు సత్వరమే అందుకోవాలంటే ఈ పదహారు రూల్స్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.నిద్రకు కొన్ని గంటల ముందు తినకపోవడం..నిద్రవేళకు కనీసం మూడు నుంచి ఐదు గంటలు ముందు తినడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా ఆహారం తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీలు తీసుకోవడంలో కేర్.. శరీర బరువుని 12తో గుణించగా వచ్చిన మొత్తంని మీ రోజువారీ కేలరీలుగా కేటాయించండి. ఈ అసాధారణ సూత్రాన్ని తప్పక అనుసరించమని కోరారు ఫిట్నెస్ కోచ్.ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం..రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ అవనసం. శరీర బరవుని ఏడుతో గుణిస్తే వచ్చిన మొత్తం మీర రోజువారిగా తీసుకోవాల్సిన ప్రోటీన్గా గుర్తించండి. ఈ విధానం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించుకుంటూ..కండరాలను నిర్మించడానికి, నిర్వహించొచ్చని చెబుతున్నారు. అందుకు ఈ మాత్రం ప్రోటీన్ తప్పనిసరి అని అన్నారు.ఆహారంలో జోడించాల్సిన ఆహారాలురోజువారీ ఆహారంలో ఏం చేర్చుకోవాలంటే..గ్రీకు పెరుగునీరు, కాఫీ, టీలీన్ గ్రౌండ్ బీఫ్ (వీలైతే అదనపు లీన్)చికెన్ బ్రెస్ట్ టర్కీ (గ్రౌండ్ లేదా బ్రెస్ట్)కొవ్వు చేపగుడ్లు, గుడ్డులోని తెల్లసొనకాటేజ్ చీజ్లీఫీ గ్రీన్స్బంగాళాదుంపలుషెల్ఫిష్బీన్స్, కాయధాన్యాలుబెర్రీలుఆపిల్, నారింజ, కివి, ద్రాక్షపండు వంటి అధిక ఫైబర్ పండ్లుఆకుపచ్చ క్రూసిఫెరస్ కూరగాయలుకాలీఫ్లవర్, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, మిరియాలు, ఆస్పరాగస్, దోసకాయలు వంటి ఇతర అధిక-పరిమాణ కూరగాయలురోజుకు రెండు పూటల భోజనం..ఫిట్నెస్ కోచ్ రోజుకు రెండు పూటలా భోజనం తీసుకునేలా చూసుకోమని సూచించారు.భోజన షెడ్యూల్లో తీసుకోవాల్సిన కేర్..ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన భోజన షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంటుంది:పడుకునే ముందు 3 నుంచి 5 గంటల ముందు చివరి భోజనంనిద్రలేచిన 1 నుంచి 2 గంటల ముందు మొదటి భోజనంరెండవ భోజనం మధ్యలో ఉండాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలి అనేది ఇక్కడ ఉంది:గ్రీకు పెరుగు - ప్రేగులకు మంచిదిప్రోటీన్ పౌడర్ - ఆకలిని నియంత్రిస్తుంది, కండరాలను మెరుగుపరుస్తుందిబ్లూబెర్రీస్ - ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అలాగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.హైడ్రేటెట్గా ఉండండిశరీరానికి తగిప హైడ్రేషన్ కూడా అవసరం. దీని కోసం, ఫిట్నెస్ కోచ్ ఉదయం 500 మి.లీ నీరు, అలాగే భోజనానికి ముందు తర్వాత త్రాగాలని సూచిస్తున్నారు. అయితే, పడుకునే రెండు గంటల ముందు నీరు త్రాగడం మానేయాలని చెబుతున్నారు.శక్తిమంతమైన వ్యాయామాలు..ఆహారంతో పాటు, ఒక రోజు విశ్రాంతితో వారానికి మూడు సార్లు కాస్త ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అవసరైమతే కాస్త అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు మరింతగా చేసేలా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు.శరీరాన్ని కదిలిస్తూ ఉండండిశక్తి శిక్షణ తర్వాత, శరీరానికి సరైన కదలిక కూడా అవసరం. రోజుకు కనీసం 8 వేల నుంచి 10 వేల అడుగులు వేయండి" అని ఫిట్నెస్కోచ్ సిఫార్సు చేస్తున్నారు. డెస్క్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన ప్రణాలికకు అంతరాయం కలగకుండా..డెస్క్ కింద ట్రెడ్మిల్ తీసుకోవడం, వాక్ చేస్తూ మీటింగ్లు ప్లాన్ చేయడం వంటివి చేయాలి.నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండిచక్కటి సౌకర్యవంతమైన బెడ్రూమ్లో నిద్రపోవాలి. బెడ్రూమ్ చూడగానే నిద్ర వచ్చేలా ఆహ్లాదంగా ఉంచుకోవాలి.స్థిరమైన నిద్ర దినచర్య..మంచి నిద్ర తోపాటు ఇవి కూడా ఉండాలి.ఉదయం నిద్ర లేవగానే సూర్యరశ్మిని పొందండిముఖ్యంగా వారాంతాల్లో ఒకే సమయంలో నిద్రపోండి, మేల్కొనండిశరీరాన్ని చల్లబరచడానికి వేడి స్నానం లేదా స్నానం చేయండిమంచానికి ఒక గంట ముందు స్క్రీన్లను చూడటం మానుకోండిసూర్యుడు అస్తమించేటప్పుడు మసకబారిన లైట్లు లేదా ఎరుపు రంగు ప్రకాశించే బల్బులను ఉపయోగించండిపురోగతిని ట్రాక్ చేయండివార గడిచినప్పుడల్లా..బరువు, శరీరం కొలతల్లో వచ్చిన మార్పులు గమనించాలి. అందుకు తగ్గట్లుగా పోషకాహారం తీసుకుంటుండాలి. అలాగే ఆ మార్పులను ఫోటోలు తీస్తూ..గమనించుకోవాలన్నారు.పరివర్తనను గుర్తించి..మెయింటైయిన్ చేయాలి..కేవలం ట్రాక్ చేయడమే కాకుండా, బాడీలోని మార్పులను గమనిస్తూ..ఆ దిశగా ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకుంటుండాలి. ఈ సమయంలో ఆల్కహాల్ను నివారించండిమెరుగైన ఫలితాలు అందుకుంటున్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.నిరాశను దరిచేరనివ్వకుండా యాక్టివ్గా ఉండటం..అద్దంలో మార్పులు చూస్తూ..మరింత ఆత్మవిశ్వాసంతో డైట్ని, రూల్స్నిన స్థిరత్వంతో పాటించాలి. ఇలా చేస్తే..ఈ సమ్మర్లో సత్వరమే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు డాన్గో. అంతేగాదు నియమానుసారంగా సూచించిన ఈ రూల్స్ అన్నింటిని క్రమం తప్పకుండా ఫాలో అయితే ఈజీగా 14 కిలోలు తగ్గుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Dan Go | High Performance Health Coach (@coachdango)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..) -
మీ మైండ్ మీకు అబద్ధాలు చెప్తోందా?
మన మెదడు ఒక అద్భుతమైన యంత్రం, కానీ ఒక్కోసారి అది మనకే విరుద్ధంగా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే, మన మనసు వాస్తవాలను వక్రీకరించి మనకు అబద్ధాలు చెప్తుంది. దీన్నే సైకాలజీలో "Cognitive Distortions" (ఆలోచనా వైకల్యాలు) అంటారు. వీటిని గుర్తించి, అదుపులో ఉంచుకోవడం అంటే.. మీ మెదడులో సాగుతున్న 'తప్పుడు కోడింగ్'ను సరిచేయడమే.చాలామందికి ఒక అలవాటు ఉంటుంది—ఒక చిన్న తప్పు జరిగితే, "నేను ఎప్పుడూ తప్పులే చేస్తాను" అని అనుకుంటారు. లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని పలకరించకపోతే, "అతనికి నా మీద కోపం, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు" అని భ్రమపడతారు. ఇవన్నీ నిజాలు కావు, ఇవన్నీ మీ మెదడు సృష్టించిన భ్రమలు. ఆరోన్ బెక్ (Aaron Beck) అనే సైకాలజిస్ట్ ఈ Cognitive Distortions అనే కాన్సెప్ట్ను ప్రపంచానికి పరిచయం చేశారు.1. మన మెదడు ఆడుతున్న 3 పెద్ద అబద్ధాలుమీ మెదడు రోజువారీ జీవితంలో మిమ్మల్ని మోసం చేసే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:All-or-Nothing Thinking: "నేను ఒక పనిని పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే నేను ఫెయిల్యూర్" అని అనుకోవడం. అంటే, మధ్యేమార్గం (Grey area) ఉండదు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.Catastrophizing: చిన్న సమస్య జరిగినా.. "ఇక నా జీవితం అయిపోయింది, అంతా నాశనం" అని అతిగా ఊహించుకోవడం.Mind Reading: "ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు" అని భ్రమపడటం. వాస్తవానికి, వారు మీ గురించి అస్సలు ఆలోచించడం లేదు.2. ఈ అబద్ధాలు మీ పర్సనాలిటీని ఎలా నాశనం చేస్తాయి?ఈ 'డిస్టార్షన్స్' వల్ల మీరు నిరంతరం ఒత్తిడిలో ఉంటారు.మీరు ఎప్పుడూ తప్పు చేస్తానేమోనని భయపడుతుంటారు (Anxiety).ఎదుటివారి గురించి తప్పుడు అభిప్రాయాలు పెంచుకుని రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటారు.అతిగా ఆలోచించి (Overthinking) మీ శక్తిని కోల్పోతారు.3. పాజిటివ్గా ఉంటే సరిపోదుట్రైనర్స్ "అన్నీ పాజిటివ్గానే చూడు" అని చెప్తారు. కానీ, అబద్ధం చెప్పే మెదడుకు 'పాజిటివ్ థింకింగ్' కేవలం ఒక ప్లాస్టర్ లాంటిది. మార్కెట్ పాజిటివిటీని నమ్మమంటుంది.సైకాలజీ (CBT - Cognitive Behavioral Therapy) మీ మెదడు అబద్ధం చెప్తున్నప్పుడు దాన్ని పట్టుకుని, "ఇది నిజమేనా? దీనికి ఆధారం ఏంటి?" అని లాజిక్తో ప్రశ్నించమంటుంది. దీన్నే 'Reality Testing' అంటారు.4. మీ మైండ్ ని రీ-సెట్ చేసుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ డిస్టార్షన్స్ ని ఎలా అదుపు చేయాలో చూద్దాం.Step 1: అబద్ధాన్ని పట్టుకోండిమీ మైండ్ ఎప్పుడు నెగటివ్ ఆలోచనలను ఇస్తుందో, వెంటనే 'STOP' అని అనుకోండి. "నేను నా మెదడు చెప్పే అబద్ధాన్ని నమ్మను" అని గట్టిగా చెప్పండి. ఇది ఒక చిన్న 'Break'.Step 2: లాజికల్ ఛాలెంజ్మీ మైండ్ చెప్పిన నెగటివ్ ఆలోచనకు ఒక కోర్టు విచారణ పెట్టండి.* "నేను ఫెయిల్యూర్" అని మీ మెదడు చెప్తే.. "గతంలో నేను సాధించిన విజయాలు ఏంటి?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సాక్ష్యాలతో మీ మెదడు అబద్ధాన్ని ఖండించండి.Step 3: క్లారిటీ ఒక్కసారి మీ మెదడు అబద్ధాలు చెప్తోందని మీకు తెలిస్తే, మీరు ఇక వాటికి భయపడరు. మీ మైండ్ ఒక అద్దంలా మారుతుంది—అక్కడ వాస్తవాలు మాత్రమే కనిపిస్తాయి, అపోహలు కాదు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మైండ్ చెప్పే అబద్ధాల లిస్ట్ఈ రోజు ఒక చిన్న పని చేయండి.ఈ రోజు మీకు వచ్చిన అతి పెద్ద నెగటివ్ ఆలోచనను రాసుకోండి.ఆ ఆలోచన 'Distortion' (అబద్ధం) అని మీకు అనిపిస్తోందా?ఆ ఆలోచన నిజం కాదని నిరూపించే 3 వాస్తవాలను రాయండి.మీ మెదడుకి మీరు యజమాని!బ్రో, మీ మైండ్ ఒక సర్వెంట్ లాంటిది. కానీ అది ఒక్కోసారి యజమానిలా ప్రవర్తిస్తూ మీకు తప్పుడు సమాచారం ఇస్తుంది. దాన్ని నమ్మడం మానేసి, దాని మీద నిఘా పెట్టండి. మీ మెదడు చెప్పే ప్రతిదీ నిజం కాదు, అది కేవలం ఒక ఆలోచన (Thought) మాత్రమే.గుర్తుంచుకోండి, "Don't believe everything you think."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
బతుకులో జీవం నింపే కళ
‘మనసుకు నచ్చిన పని ఎంతటి సంతృప్తిని ఇస్తుందో హస్తకళల ద్వారానే అర్థం చేసుకోవచ్చు అంటారు’ మరియా క్లారా. సికింద్రాబాద్లోని నాగోల్లో ఉంటున్న మరియా ఉద్యోగాన్ని వదిలేసి, కలంకారి, బాతిక్ పెయింటింగ్ నేర్చుకొని కలంబాతిక్ మరియా క్లారా గా తన కళకు గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళ జీవితంలో తగిలే ఎదురుదెబ్బలు ఆమె మనసును ఎలా గాయపరుస్తాయో, తిరిగి ఆమె జీవితం కొత్తగా ఎలా మార్పు చెందుతుందో ఈ కళ కూడా వస్త్రం మీద అలాగే కళ్లకు కడుతుంది’ అంటూ కళాత్మకమైన విశేషాలను పంచుకున్నారు...‘‘కరోనా నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. రెండు దశాబ్దాల పాటు ప్రైవేట్ ఉద్యోగంలో యాంత్రికంగా రోజులు గడిచిపోయాయి. జీవితంలో జీవం ఉండేదెలాగో అన్వేషిస్తుండగా హస్త కళలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆ సమయంలో బాతిక్ ఆర్ట్తో గొప్ప అనుభూతిని పొందాను. మావారు ప్రైవేట్ జాబ్ చేసి, రిటైర్ అయ్యారు. మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఎవరి ప్రయాణం వాళ్లదే. నేను వాళ్లకు సపోర్ట్ చేస్తాను. వాళ్లు నాకు సపోర్ట్ చేస్తారు. నా ఇష్టాన్ని వాళ్లు కాదనరు.అర్థమెంతో...వ్యాక్స్తో క్లాత్ మీద ముందుగా గీతలను డిజైన్ వచ్చేలా గీస్తాం. తర్వాత దానిని ముందే సిద్ధం చేసుకున్న రంగులలో ముంచుతాం. దాంతో ఆ క్లాత్మీద ఉన్న వ్యాక్స్ లైన్ అంతా విరిగిపోతుంది. ఆ గీతల స్థానంలో రంగు లైన్లు లైన్లుగా ఇంకిపోయి, ఒక చెప్పలేని అందం కనిపిస్తుంది. ఎక్కడైతే ఎవరి వల్లనైతే మనం బాధపడతామో, ఆ తర్వాత అదే బాధ అవతలి వారు పడుతున్నప్పుడు దానిని తొలగించాలని చూస్తాం. ఎందుకంటే ఆ నొప్పిని అనుభవించిన వాళ్లకే ఆ బాధ ఏంటో అర్థం అవుతుంది. అంటే, ‘నువ్వు నొప్పిని అనుభవిస్తేనే, అవతలి వారికి ఉపశమనం ఇవ్వగలవు..’. అని ఈ బాతిక్ ద్వారా జీవితపు అర్థం ఏంటో తెలిసి వచ్చింది. అంటే నొప్పిని అనుభవించిన స్త్రీయే, నొప్పికి మందుకూడా వేయగలదు. అది ఈ బాతిక్ చూపుతుంది. మనసుకు అయిన గాయాలకు రంగులు పూసి, మనకే అందంగా చూపించే కళ ఇది.ఆసరా అయ్యేలా కూడా ఉండాలిమన గురించి బయటివారికి చెప్పలేని భావాలను ఆర్ట్ రూపంలో చెప్పవచ్చు. నటించాల్సిన అవసరం లేకుండా చేసేవి హస్తకళలే. నేను చేసేది కమర్షియల్ వర్క్ కాదు. ఎవరైనా తమకు నచ్చిన అంశం డిజైన్లో వచ్చేలా చేసి ఇవ్వమని అడిగితే దానికి తగినట్టు చేసి ఇస్తాను. ఉదాహరణకు.. ‘మా ఇంట్లో పెళ్లి ఉంది, వధూవరుల డిజైన్ చేసి ఇవ్వాలి’ అని అడిగితే అలాగే చేసి ఇస్తాను. మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు పది మందికి ఆసరా అయ్యేలా కూడా ఉండాలని కోరుకుంటాం.ఉపాధి కల్పిస్తున్నాను..కొన్ని చీరలు, డ్రెస్సులు కలం బాతిక్ పెయింటింగ్ చేసి, బొటిక్స్కి ఇస్తాను. ఈ వర్క్ని కొంతమంది మహిళలకు నేర్పి, వారికి ఉపాధిని కల్పిస్తున్నాను. గుజరాతీ, బెంగాల్ రాష్ట్రాలలో ఈ బాతిక్ పెయింటింగ్ బాగా ్రపాచుర్యంలో ఉంది. మన దగ్గర బ్లాక్ ప్రింట్ అచ్చులతో వేస్తారు. నేను మాత్రం పూర్తిగా చేతితోనే వేస్తాను. కాలేజీలు, స్కూళ్లకు కూడా వెళ్లి అక్కడి విద్యార్థులకు ఈ వర్క్ నేర్పిస్తున్నాను. ఈ కళ గురించి ఏమీ తెలియని వారు కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఈ పనిని నేర్చుకోవచ్చు. హైదరాబాద్లోని ఇందిరా మహిళా శక్తి బజార్లో జరిగే కార్యక్రమంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఈ వర్క్ నేర్పించే అవకాశం లభించింది. ఇష్టంతో నేర్చుకున్న పని నన్ను ఎంతో మంది కళాకారులకు చేరువ చేసింది. భావోద్వేగాల సమతుల్యతను నేర్పించింది’ అంటూ హస్తకళల గొప్పతనాన్ని అందంగా వివరించారు ఈ కళాకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
హెయిర్కట్ తప్పిదానికి..రూ. 5 కోట్ల పరిహారం!
హెయిర్కట్ తప్పిదానికి ఓ మహిళ ఏకంగా కోట్లలో నష్టపరిహారం కోరింది. సరిగ్గా హెయిర్ కటింగ్ చేయకపోవడం వల్ల ఉద్యోగంలో ఉన్నతి పదవిని కోల్పోయానని, అధిక వేతనం పొందలేకపోయానంటూ కోర్టుని ఆశ్రయించింది. చిన్నపాటి తప్పిదాన్ని పెద్దగా చేసి చూపించి వినియోగదారుల కేసులో కోట్లలో నష్టపరిహారం పొందింది. పాపం సదరు సెలూన్ సెంటర్ ఇంత చిన్నతప్పిదానికి అంత భారీ పరిహారమా అని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే..మళ్లీ అమాంతం పరిహారం పెంచేసింది. చివరికి ఆమెకు ధర్మాసనం ఊహించని దిమ్మతిరిగిపోయే ఝలక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 12, 2018న, ఆమె హెయిర్ కట్ కోసం ఒక ఫైవ్ స్టార్ హోటల్ బ్యూటీ సెలూన్కి వెళ్లింది. కానీ వాళ్లు పొరపాటున తప్పుగా కట్చేశారు. దాంతో వాళ్ల సేవకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జూలై 2018లో వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 21, 2021న, వినియోగదారుల కమిషన్ బ్యూటీ సెలూన్ను తప్పుపడుతూ బాధిత మహిళకు ఏకంగా రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించమని ఆదేశించింది. వినియోగదారుల కమిషన్ ఆదేశంతో అసంతృప్తి చెందిన బ్యూటీ సెలూన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే పరిహారం మొత్తం అంచనా వేసేందుకు ఆ కేసుని తిరిగి వినియోగదారుల కమిషన్కు పంపింది ధర్మాసనం. దాంతో ఆ మహిళ తన క్లైయిమ్ను అమాంతం రూ.2 కోట్లు నుంచి రూ. 5.2 కోట్లుకు పెంచేసింది. పైగా అందుకోసం కమిషన్ ముందు పలు పత్రాలను కూడా సమర్పించింది. వినియోగదారుల కమిషన్ ఆ పత్రాలను పరిశీలించి ఆమె ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి చెల్లింపు జరిగే రోజుకి రూ. 9 వడ్డీతో కలిపి మళ్లీ రూ. 2 కోట్లు పరిహారంగా మంజూరు చేసింది. దాంతో మనస్తాపం చెంది బ్యూటీ సెలూన్ మళ్లీ సుప్రీంకోర్టులో మరో అప్పీల్ దాఖలు చేసింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టు ముందు, ఆమె తాను ఉన్నత విద్యావంతురాలైన మహిళనని, కలకత్తాలోని ఐ.ఐ.ఎం. నుంచి మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా కూడా చేశానని పేర్కొంది. ఆ సెలూన్లో హెయిర్ కటింగ్ చేసుకోకముందు తనకు మంచి కెరీర్ ఉందని చెప్పింది. కానీ బ్యూటీ సెలూన్ దానిని ఖండించింది. హెయిర్ అనేది ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉన్న అంశంగా వాదించింది. పైగా ఎగ్జిక్యూటివ్ పదవుల్లో ఉన్నవాళ్లు సినీ సెలబ్రిటీలు లేదా మోడలింగ్ వాళ్ల మాదిరిగా జుట్టు కత్తిరించుకోకూడదని వాదించింది. అందువల్ల జాబ్ కెరీర్ పాడైందని, ఉన్నతి పదవులు కోల్పోయానని, భారీ వేతనం అదుకోవాల్సిన తాను తక్కువ మొత్తంలో జీతం పొందుతున్నానని తన గోడును వినిపించింది. అంతేగాదు హెయిర్ కట్ కోసం వెళ్ళినప్పుడు, మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్నానని, కానీ జూన్ 2018లో తన ఉద్యోగాన్ని ఈ కారణంగా కోల్పోయానని పేర్కొంది. అయితే ఈ సంఘటనకు ముందు, తర్వాత ఆదాయ పన్ను రిటర్న్లను సమర్పించడంలో విఫలమైందని సెలూన్ తరుపు న్యాయవాది వాదించారు. అలాగే అంత భారీ మొత్తంలో నష్ట పరిహారం పొందేలా సరైన ప్రామాణిక పత్రాలు ఏమి సమర్పించ లేదని కోర్టు గుర్తించింది. దాంతో కోర్టు కేవలం బాధతురాలి అంచనాలు, ఆమె ఇష్టాఇష్టాలను అనుసరించి పరిహారం ఇవ్వరని స్పష్టం చేసింది. అలాగే ఈ న్యాయపోరాటంలో గతంలో సదరు సెలూన్ 25 లక్షలు కోర్టులో డిపాజిట్ చేసిందని గుర్తుచేస్తూ..అంతమొత్తం మీరు సమర్పించిన పత్రాలకు అనుగుణంగా సరిపోతుందని స్పష్టం చేసింది. అంతేగాదు ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో పరిహారం పొందాలంటే..అతనికి జరిగిన నష్ట తీవ్రతను అంచనా వేస్తారు. అందుకు తగిన డాక్యుమెంట్స్, సాక్షాధారాలు కూడా ఉండాలంటూ సదరు మహిళకు చురకలు అంటించింది.(చదవండి: అర్జున్-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్ లుక్..!) -
మీ బాడీ ఇమేజ్... మీ పర్సనాలిటీ...
చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కేవలం మాట తీరు, డ్రెస్సింగ్ అనుకుంటారు. కానీ మీ పర్సనాలిటీకి అసలైన పునాది "మీ శరీరం". మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు నచ్చని వ్యక్తి కనిపిస్తే, ఆ అసంతృప్తి మీ ప్రతి అడుగులో, ప్రతి మాటలో ప్రతిబింబిస్తుంది. దీన్నే Body Image అంటారు.సమాజం, మీడియా, మన ఆలోచనలు కలిసి మనల్ని మనం ఒక 'వస్తువు'గా చూసుకునేలా చేశాయి. మన పర్సనాలిటీలో ఆత్మవిశ్వాసం (Confidence) పుట్టాలంటే, ముందుగా మన శరీరంతో (Body) మనకు ఉన్న సంబంధం బాగుండాలి.1. బాడీ ఇమేజ్ vs బాడీ రియాలిటీబాడీ రియాలిటీ అంటే మీ శరీరం నిజానికి ఎలా ఉంది? (ఎత్తు, రంగు, బరువు). ఇది ఒక భౌతిక సత్యం.బాడీ ఇమేజ్ అంటే మీ శరీరం గురించి మీ మనసులో ఉన్న అభిప్రాయం.సమస్య ఏంటంటే, మనం బాడీ రియాలిటీతో కాకుండా, బాడీ ఇమేజ్ తో జీవిస్తాం. చాలామంది ఫిట్గా ఉన్నా కూడా, తమని తాము లావుగా భావించడం వల్ల ఆందోళన చెందుతారు. ఇది ఒక రకమైన Cognitive Distortion.2. సమాజం, మీడియా ప్రభావంమీడియా మనకు పర్ఫెక్ట్ బాడీ అంటే ఎలా ఉండాలో ఒక ప్రమాణాన్ని ఇచ్చింది."నువ్వు తెల్లగా ఉండాలి," "నువ్వు పక్కా ఫిజిక్ కలిగి ఉండాలి."ఈ ప్రమాణాలను అందుకోలేక, మెజారిటీ ప్రజలు తమ శరీరాన్ని తాము ద్వేషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి తన శరీరాన్ని అసహ్యించుకోవడం మొదలుపెడితే, అతను తనను తాను 'తక్కువ'గా చూసుకోవడం ప్రారంభించి, పర్సనాలిటీ పరంగా కుంచించుకుపోతాడు.3. పర్సనాలిటీపై ప్రభావంమీ బాడీ ఇమేజ్ బాగోలేకపోతే మీ పర్సనాలిటీ ఎలా మారుతుందో చూడండి.అభద్రతా భావం: ఎప్పుడూ ఇతరులు తనని చూసి ఏమనుకుంటున్నారో అని భయం (Social Anxiety).వాయిదా వేసే స్వభావం: "నేను బరువు తగ్గాక బయటకు వెళ్తాను, నేను అందంగా మారాక ఆ పని చేస్తాను"—ఇలా జీవితాన్ని వాయిదా వేస్తారు.ఎమోషనల్ అస్థిరత: చిన్న విమర్శ కూడా వారిని విపరీతంగా బాధపెడుతుంది.4. మీ శరీరంతో సంధి చేసుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ శరీరానికి, మీకు మధ్య ఉన్న గొడవను ఎలా ఆపాలో చూద్దాం.Step 1: బాడీ షేమింగ్ ని ఆపండిమొదట మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం ఆపండి. అద్దం ముందు నిలబడి మీ శరీరంలోని లోపాలను వెతకడం మానేసి, మీ శరీరం మీకు చేస్తున్న సహాయాన్ని గుర్తించండి. "నా కాళ్లు నన్ను నడిపిస్తున్నాయి, నా మెదడు నాకు ఆలోచనలను ఇస్తోంది" అని కృతజ్ఞతతో ఉండండి. సమాజం చెప్పిన 'పర్ఫెక్ట్' ప్రమాణాలను 'Break' చేయండి.Step 2: ఫంక్షనాలిటీ vs అప్పియరెన్స్మీరు మీ బాడీని చూడటానికి అందంగా ఉండాలని కాకుండా, ఆరోగ్యంగా ఉండాలని అనుకోండి. వ్యాయామం అంటే బరువు తగ్గడానికి మాత్రమే కాదు, అది ఒక Self-Respect. మీరు మీ బాడీని గౌరవించి, దానికి కావాల్సిన వ్యాయామం, ఆహారం ఇస్తే, మీ ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్ గా 'Build' అవుతుంది.Step 3: బాడీ అక్సెప్టెన్స్మీరు పరిపూర్ణంగా ఉన్నారా లేదా అనేది కాదు ముఖ్యం, మీరు మీ శరీరంతో ఎంత Comfortable గా ఉన్నారు అనేది ముఖ్యం. ఎప్పుడైతే మీరు మీ శరీరాన్ని ఒక దేవాలయంలా గౌరవిస్తారో, అప్పుడు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక 'గ్లో' కనిపిస్తుంది. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ అద్దం ఏం చెప్తోంది?ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.అద్దం ముందు నిలబడి, మీకు నచ్చని మీ బాడీ పార్ట్ వైపు చూడండి.దాన్ని ద్వేషించడం మానేసి, "థాంక్యూ, నువ్వు నాకోసం ఇంత కష్టపడుతున్నావు" అని చెప్పండి.మీ దృష్టిని అప్పియరెన్స్ నుండి 'బాడీ ఫంక్షనాలిటీ' కి మార్చండి.మీ శరీరమే మీ మొదటి ఇల్లు!బ్రో, ఒక ఇల్లు పాతబడితే దాన్ని కూల్చేయరు కదా, పెయింటింగ్ వేసి బాగుచేసుకుంటారు. మీ శరీరం మీ మొదటి ఇల్లు. దాన్ని ప్రేమించండి, గౌరవించండి. అప్పుడే మీ పర్సనాలిటీ లోపలి నుండి బయటకు ప్రకాశిస్తుంది.గుర్తుంచుకోండి, "Your body is the vehicle for your soul; treat it with the respect it deserves."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మీ కలలు చెప్పే నిజాలు) -
24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!
విదేశీ టూర్ వ్లాగర్ అనగానే మంచి ఆదాయం, వీసా, మంచి ఆంగ్ల భాషా నైపుణ్యం తదితరాలతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే సాధ్యం. అది కూడా డబ్బున్నవాళ్లకే సాధ్యం, అని అందరి మదిలో నాటుకున్న భావన. అయితే అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ ఓ గ్రామీణ యువకుడు..ఎలాంటి బడ్జెట్, కనీసం ఇంగ్లీష్ భాషా నైపుణ్యం, వివిధ వీసాలు కూడా లేకుండానే ఏకంగా 197 దేశాలు చుట్టేస్తూ..గ్రేట్ ట్రావెల్ వ్లాగర్గా పేరుతెచ్చుకుంటున్నాడు. అది కూడా తన సొంత డబ్బుతోనే ఇన్ని దేశాలు చుట్టేసి రావడం విశేషం. కేవలం 24 ఏళ్లకే ఇన్ని దేశాలంటే మాటలు కాదుకదా..!. మరి ఆ యువకుడు ఎవరు..?, ఏమా కథ చూద్దామా..!. బిహార్లోని ముంగేర్, భాగల్పూర్ల మధ్య ఒక చిన్న గ్రామానికి చెందని శుభమ్ కుమార్ అనే యువకుడు 197 దేశాలు పర్యటించాడు. అదికూడా కేవలం భారతీయ పాస్పోర్ట్తో, తన సొంత డబ్బుతో చుట్టొచ్చాడు. సాధారణంగా విదేశీ ప్రయాణం అంటే.. చేతినిండా డబ్బు, బహుళ వీసాలు పొందే సామర్థ్యం, మంచి ఆంగ్లభాషా నైపుణ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. తనవద్ద ఇవేమి లేకపోయినా..కేవలం తనకున్న ఇష్టం, ప్యాషన్తో అలవోకగా దేశాలు చుట్టేశాడు. నిజానికి శుభమ్ది మధ్య తరగతి నేపథ్యం. తండ్రి ప్రభుత్వ పాఠశాల టీచర్. ఇరుకైన గ్రామదారుల నడుమ చిన్న చిన్న గదులతో ఉండే ఇల్లు. సోషల్ మీడియాలో తన హోమ్టూర్ వీడియోలతో వేలాదిగా అభిమానులను సంపాదించుకున్న అతడి జర్నీ..నెమ్మదిగా ట్రావెల్ వ్లాగ్ పేరుతో విదేశీ టూర్లు పర్యటించే రేంజ్కు చేరుకున్నాడు. అతడి వీడియోలు చాలా నేచురల్గా, వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో అందరూ సులభంగా కనెక్ట్ అయ్యేవారు. అలా అతడి యూట్యూబ్ ఛానెల్కి ఏకంగా మూడు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు, ఆరు లక్షలకు పైగా ఫోలోవర్లు ఉన్నారు. అతని ప్రతి ట్రావెల్ వీడియో కనీసం మూడు నుంచి నాలుగు లక్షల వ్యూస్ వస్తుంటాయి. ఇదంత శుభమ్కి ఒక్కరాత్రిలో సంపాదించిన ఘనత మాత్రం కాదు. జర్నీ ఎలా ప్రారంభమైందంటే..తనకేమి బహుళ వీసాల సామర్థ్యం లేదని, అలాగే ఇంగ్లీష్పై అంత పట్టు కూడా లేదని ఓపెన్గానే చెప్పేశాడు శుభమ్. కేవలం ఇండియా పాస్పోర్ట్తోనే పర్యటిస్తున్నట్లు తెలిపాడు. తనకు 13 లేదా 14 ఏళ్ల వయసు నుంచి విదేశాలు పర్యటించాలనే కోరిక బలంగా ఉండేదని అలా ఈ ట్రావెల్ వ్లాగ్గా వీడియోలు చేస్తూ..తన కోరికను నెరవేర్చుకున్నానని అంటున్నాడు. సరిగ్గా 2018లో లేహ్-లడఖ్ పర్యటనతో మొదలైంది అతడి ప్రస్థానం. ఓ పక్క పాఠశాల తరగుతులు..మరోవైపు ఈ విదేశాల టూర్లుతో బిజీగా ఉండేవాడు. తన తొలి అంతర్జాతీయ పర్యటన మాత్రం నేపాల్, తర్వాత రష్యా, థాయిలాండ్, లావోస్..అలా 2019 నాటికి చైనా నుంచి తన మొదటి గ్లోబల్ వ్లాగ్ పోస్ట్ చేశాడు. అలా చేస్తున్నప్పుడు సవాళ్లు మాములుగా లేవని..తన టూర్ ఖర్చుల కోసం కోచింగ్ సెంటర్లను కూడా మినహాయించాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు శుభమ్. అంతేగాదు 16 ఏళ్ల వయసుకి రష్యా వెళ్లి అక్కడ భూభాగంలో దాదాపు 3 వేల కిలోమీటర్లు హిచ్హైక్ చేశాడు. అలాగే తల్లిదండ్రులకు ఐఏఎస్కి ప్రిపేరవ్వుతా, ఢిల్లీ వెళ్తానని అబద్ధం చెప్పి..మలేషియా విమానం ఎక్కాడు. అయితే ఇక్కడ విదేశీటూర్లకు వెళ్లాలంటే ఎంతో స్ట్రాంగ్ పాస్పోర్టులు చాలానే ఉండాలి. కేవలం భారత పాస్పోర్ట్తో అన్ని దేశాలు చుట్టిరావడం చాలా కష్టం.. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఒత్తిడి, పరిమిత వీసా యాక్సెస్, వీసా స్టాంపులకు పాస్పోర్ట్లో తగినంత ఖాళీ పేజీలు ఉండాలి కూడా. ఆ క్రమంలో ఈక్వెడార్ పర్యటనకు దాదాపు బహిష్కరింపబడతానని భయపడ్డాడట శుభమ్. ఎందుకంటే అప్పటికే తన పాస్పోర్ట్లో ఖాళీ పేజీలు లేనందున తనకు ఈక్వెడార్లోకి ప్రవేశం దాదాపుగా నిరాకరిస్తారనే అనుకున్నాడు. పైగా అప్పటికే ఆరు పాస్పోర్ట్లను నింపాడు. అయితే శుభమ్ ప్రతి దేశానికి ఈ పాస్పోర్ట్తోనే వెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాడట. అలాగే దీంతోనే వెళ్లగలను అని పూర్తిగా విశ్వసించాడట. ఆ నమ్మకంతోనే విజయవంతంగా విదేశాలు చుట్టిరాగలిగాను అంటున్నాడు శుభమ్. 16 ఏళ్లకు మొదలు పెట్టిన ఈ జర్నీని ఏడేళ్లు తన తండ్రి ఇచ్చిన డబ్బులతో పర్యటించగా, 23 ఏళ్లు వచ్చేటప్పటికీ తన పూర్తి సొంత నిధులతో టూర్లు ప్లాన్ చేసుకున్నాడట. అంటే శుభమ్ అప్లోడ్ చేసే వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం..అలాగే ఆయా దేశాల్లో ఉంటూ కొంత సంపాదించిన డబ్బుతో తన ప్రయాణానికి నిధులు సమకూర్చుకునేవాడట. అలా శుభమ్ శుభప్రదంగా 197 దేశాలు పర్యటించాడు. అంతేకాదండోయ్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సైతం అతడికి ఫోన్చేసి మరి అభినందించారట. ఇప్పుడు అతని టూర్ బకెట్ లిస్ట్లో బ్రెజిల్ దేశం ఉంది. ప్రస్తుతం అక్కడే ఉన్నాడట శుభమ్. పరిమిత వనరులే ఉన్నా..గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి కూడా..తన ఆసక్తితో ఇంతటి అనితరసాధ్యమైనదాన్ని సాధించి చూపించి..ఇతర ట్రావెల్ వ్లాగర్లకు, నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు కదా..!. View this post on Instagram A post shared by Shubham Kumar || Extreme Traveller (@nomadshubham) (చదవండి: అత్యంత విషపూరితమైన పాయిజన్తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్..!) -
అత్యంత విషపూరితమైన పాయిజన్తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్..!
పాములను భయానకంగా మార్చేది ఏమిటంటే, కొన్ని విషాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా చంపే సామర్థ్యం. కానీ విషపూరిత కాటుకు తెలిసిన ఏకైక విరుగుడు, యాంటీవెనమ్, అదే విషంతో తయారు చేయబడింది. శతాబ్దాలుగా,పాము విషంలోని ఎంజైమ్ల మిశ్రమంలో వివిధ రకాల ఔషధాలు కూడా ఉండొచ్చని మానవుడు ఏనాడో గుర్తించాడు.ఈ క్రమంలోనే విషం నుంచి తయారు చేసిన ఆధునిక చికిత్సా ఉత్పత్తులు నాడీ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ, రక్తాన్ని ప్రభావితం చేసే వ్యాధులకు చికిత్సగా ఉపయోగించారు. ఈ పాముల విషాన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసేలా లక్ష్యంగా పెట్టుకుని మరి మందులు రూపొందించారు వైద్య నిపుణులు. అవేంటంటే రక్తపోటు , పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు చికిత్స చేసే కాప్టోప్రిల్ జరారాకా (దీన్ని దక్షిణ అమెరికా పిట్ వైపర్ అనే అత్యంత విషపూరిత పాము నుంచి తయారు చేస్తారట), అస్వస్థతకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఎప్టిఫిబాటైడ్ (రాటిల్ స్నేక్ నుంచి తయారు చేస్తారు). ఇవేగాక కింగ్కోబ్రా విషంపై పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ఇందులో కూడా అద్భుతమైన సమ్మేళనాలు ఉన్నాయి. దీని విషాన్ని హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించే బీటా-కార్డియోటాక్సిన్ ఔషధ తయారీలో ఇనియోగిస్తారట. అలాగే పెప్టైడ్ను నోటి ద్వారా తీసుకునే మందుని కూడా తయారు చేస్తారట.కేవలం పాముల నుంచే కాదు అవి కూడా..విషాన్ని ఉత్పత్తి చేసే జీవులు పాములు మాత్రమే కాదు. గొంగళి పురుగులు,కందిరీగలు, కోన్ నత్తల నుంచి టోడ్లు, జెల్లీ ఫిష్ వరకు వివిధ రకాల జంతువులు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. అఖరికి కొన్ని బల్లులు కూడా విషపూరితమైనవేనని చెబుతున్నారు నిపుణులు. మనం తరుచుగా పిల్లలు మధ్యాహ్నం భోజన పథకం కింద అందించే భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు అని వింటుంటాం. అందుకు కారణం అన్నం లేదా కూరలో బల్లి పడటంతో ఇది జరిగిందని చెబుతుంటారు. అంటే సాధారణంగా బల్లలు విషపూరితమైనవి కావు, కానీ మనం తినే పదార్థాల్లో పడినప్పుడు దానిలోని సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రేగుల్లో చేరి పాయిజన్ అవుతుందట. అంతేకాదండోయ్ అమెరికా, మెక్సికో ఎడారులలో కనిపించే గిలా అనే బల్లి విషం నుంచి టైప్ 2 డయాబెటిస్ నివారణ మందును తయారు చేస్తారట. అంతేగాదు అంతకుమించి ప్రమాదకరమైన మరో చిన్నజీవి ఉంది. మనం తరుచుగా ఇళ్లల్లో చూసేదే. అదేనండి గొంగళి పురుగు. దక్షిణ అమెరికాలోని లోనోమియా గొంగళి పురుగు అత్యంత ప్రాణాంతకమైనదట. 1989లోబ్రెటిజల్లో వీటిని చూశారట. ఇవి సముహాలుగా గుత్తులగా ఉంటాయట. ఒక గుత్తిని తాకినా..అంతే ప్రాణాలే పోతాయట. అందుకు పెరూలోనే ఓ రోగి కేసు ఉదాహరణ అంటున్నారు వైద్య నిపుణులు. పెరూలో ఐదు గొంగళి పురుగులపై కాలు వేసిన ఒక యువ కెనడియన్ పర్యాటకుడి ప్రారంభంలో కొద్దిపాటి లక్షణాలు అనుభవించిన..రోజులు గడుస్తున్నకొద్ది బహుళ అవయవాల వైఫల్యంతో మరణించిన ఉదంతం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ గొంగళి పురుగు విషం శాస్త్రవేత్తల పరిశోధనలో అంతర్గత రక్తస్రావం, మూత్రపిండ వైఫల్యానికి దాదితీస్తుందని తర్వాత తెలిసింది. దీనికి విరుగుడు బ్రెజిల్లోని ఇన్స్టిట్యూటో బుటాంటన్ తయారు చేసిన యాంటీవినమ్ మాత్రమే చికిత్స. ఇక సాలీడు విషం సైతం మానవులకు ఉపయోగపడుతుందట. ప్రపంచంలోని నాలుగు ప్రాణాంతక సాలెపురుగులలో ఒకటైన ఆస్ట్రేలియాలోని గరాటు వెబ్ అనే సాలీడు విషం నుంచి సహజ పురుగుల మందు నివారిణిని తయారు చేస్తున్నారు. ఇది దోమలను నియంత్రించడంలో ఉపయోగపడుతుందట. అలాగే ఇది డీడీటీ వంటి ఇతర పురుగుమందుల నిరోధకతను కూడా కలిగి ఉందట. మల్టిపుల్ స్క్లెరోసిస్ చికిత్సలో పాము విషం వాడకాన్ని ప్రోత్సహిస్తోంది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. తేలు కుట్టిన తర్వాత కొన్ని నెలలు అనుభవించిన ఉపశమనం ఆధారంగా తేలు విషాన్ని చికిత్సలో ఉపయోగించారు. అంతేగాదు ఈ తేలు విషం ఒంటి నొప్పులకు నివారణగా కూడా ఉపయోగిస్తారట. అలాగే సముద్ర ఎనిమోన్ల ద్వారా ఉత్పత్తి చేసే టాక్సిన్లను ఆటో ఇమ్యూన్ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారట. పురాత గ్రీకులు ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టారు. పైగా రాబోయే ఔషధాలన్నీ విషం నుంచే తయారవుతాయని ఆనాడే అంచనా వేసి ఉండొచ్చని భావిస్తున్నారు వైద్య నిపుణులు. ఆ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థలు చాలామటుకు తమ చిహ్నంగా సిబ్బంది చుట్టుతా చుట్టబడిన పాము నమునాని ఎంచుకోడానికి రీజనే ఇదే కావొచ్చు కూడా.జానికి లెనిన్(చదవండి: Frogs: నన్నుఇంటికి తీసుకువెళ్ళు) -
ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ..! స్కిన్ క్రీములతో జర భద్రం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ కనిపించడంలో సర్వత్రా రకరకాల ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్ అనారోగ్యం పాలయ్యారా? అని యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్ వివరణ ఇచ్చింది కూడా. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా వెల్లడించారు. అది సాధారణ చర్మక్రీమ్ని ఉపయోగించడం వల్ల వచ్చిన అలెర్జీగా పేర్కొన్నారు. కొన్ని వారాలపాటు ఇలా ఉంటుందని కూడా అన్నారు. దీంతో ఒక్కసారిగా మనం సాధారణంగా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి అలెర్జీకి దారితీస్తుందా అనే సందేహాలు వెల్లువెత్తాయి. అయితే దీని గురించి డెర్మటాలజిస్టులు ఏమంటున్నారంటే..మనం రెగ్యులర్గా వాడే స్కిన్ క్రీములు కూడా ఒక్కోసారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. అదిగాక డీ హైడ్రేషన్ వల్ల, చర్మం పైపొర దెబ్బతిని ఇలా సమస్యలు ఉత్పన్నమవుతాయట. మనం రెగ్యులర్ రాసే ఈ క్రీమ్ సున్నితత్వానికి అలవాటుపడి కూడా ఇలా దద్దుర్లతో కూడిన ఇరిటేషన్ వస్తుంటుందని చెబుతున్నారు. కొందరి సున్నితమైన వ్యక్తుల్లో ఈ అలెర్జీ మరింత తీవ్రంగా ఉండొచ్చని కూడా అన్నారు. ఒక్కోసారి ఏజ్ పైబడటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినా..ఇలా ఎప్పుడూ రాసే స్కిన్ క్రీమ్ ప్రతిచర్య చూపించి చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. కొందరికి వెంటనే ఈ సమస్య చూపించగా, మరికొందరికి కనీసం 24 నుంచి 72 గంటల్లో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అందుకే మన శరీరానికి సరిపడే క్రీమ్ అయినా ప్రతిచర్య చూపిన వెంటనే కడిగేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆ సమస్య తగ్గేంత వరకు ఆయా క్రీమ్లు వినియోగించకపోవడమే మేలు అని అంటున్నారు. ఇది అందరికీ ఒకేలా ఉండదు..కొందరికీ తక్కువ రియాక్టివ్ చర్మం ఉంటుంది.పదే పదే అదే క్రీమ్ వాడటం వల్ల ఆ సంరక్షణకు మించి చర్మానికి ఎఫెక్టివ్ క్రీమ్ అవసరమై ఇలా ప్రతిచర్య చూపించొచ్చు కూడా. అంతేగాదు కొందరికీ ఆ క్షణం అలెర్జీ వచ్చినా..ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే సమస్య తగ్గుముఖం పడుతుంది. అందువల్ల మన శరీరాని పడిన క్రీమ్ అని గుడ్డిగా అదే పనిగా రాసేయొద్దు..ఒక్కోసారి మనం వేరే ప్రాంతంలో ఉంటే అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా స్కిన్క్రీమ్ మార్చాల్సి ఉంటుందనే విషయం గుర్తెరగండి అని చెబుతున్నారు. అలాగే ఏ మాత్రం దురదగా..ఇబ్బందిగా అనిపించినా తక్షణమే ఆ ప్రదేశాన్ని నీళ్లతో శుభ్రపరుచుకుని ఆయా క్రీమ్లను కొద్దిరోజులపాటు వినియోగించకుండా ఉండటమే బెస్ట్ అని చెబుతున్నారు. ఒకరకంగా ఈ ఘటన స్కిన్క్రీమ్ల విషయంలో ఎంత జాగురకతతో వ్యవహరించాలో హైలెట్ చేసిందని చెబుతున్నారు చర్మ నిపుణులు.(చదవండి: బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..) -
మీ కలలు చెప్పే నిజాలు
మన నిద్రలో వచ్చే కలలు కేవలం పిచ్చి ఊహలు కావు, అవి మన Subconscious Mind మనతో మాట్లాడుతున్న భాష. సిగ్మండ్ ఫ్రాయిడ్ వీటిని Wish Fulfillment అని పిలిస్తే, కార్ల్ యుంగ్ Messages from the Psyche అని చెప్పారు.మనం మేల్కొని ఉన్నప్పుడు సమాజం కోసం ఒక ముసుగు (Mask) వేసుకుంటాం. కానీ నిద్రపోయినప్పుడు, ఆ ముసుగు తొలగిపోయి మన అసలైన భయాలు, కోరికలు, మరియు పరిష్కారం కాని సమస్యలు బయటకు వస్తాయి. మీ కలలు మీ పర్సనాలిటీకి ఒక 'రిఫ్లెక్షన్' లాంటివి. మీరు పదే పదే ఒకే రకమైన కలలు కంటున్నారంటే, మీ మనసు ఏదో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.1. ఫ్రాయిడ్ vs యుంగ్: కలల వెనుక ఉన్న సైకాలజీSigmund Freud ప్రకారం, మన కలలో వచ్చే ప్రతిదీ మన లోపల అణిచిపెట్టబడిన కోరికల ప్రతిరూపం. మనం పగలు బయటపెట్టలేని కోపాలు, ఆశలు అన్నీ కలల రూపంలో బయటపడతాయి.Carl Jung దీనిని ఇంకా లోతుగా చూశారు. కలలు మనలోని లోపాలను, మనం మర్చిపోయిన మన 'Shadow Self' (చీకటి కోణం) ను సరిదిద్దడానికి ప్రయత్నిస్తాయి. ఒక వ్యక్తికి పదే పదే ఎత్తు నుండి పడిపోతున్నట్లు కల వస్తుందంటే, అది అతను తన జీవితంలో నియంత్రణ (Control) కోల్పోతున్నాడని అర్థం.2. కలల్లో కనిపించే సింబల్స్ మీరు కలలను విశ్లేషించడం ద్వారా మీ పర్సనాలిటీలో ఉన్న బలాలు, బలహీనతలను తెలుసుకోవచ్చు.పారిపోవడం: ఇది మీ జీవితంలోని సమస్యల నుండి లేదా ఒక బాధ్యత నుండి మీరు పారిపోవాలని చూస్తున్నారని అర్థం. ఇది మీ 'Avoidant Personality' కి సంకేతం.పరీక్షలో ఫెయిల్ అవ్వడం: మీ పర్సనాలిటీలో మీకు 'పర్ఫెక్షనిస్ట్' భయం ఎక్కువగా ఉందని, ఎక్కడ తప్పు చేస్తానో అన్న ఆందోళన ఉందని అర్థం.నీటిలో మునిగిపోవడం: మీ ఎమోషన్స్ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారని అర్థం. మీ Emotional Intelligence తక్కువగా ఉందని ఇది సూచిస్తుంది.3. "కలలు కనండి.. విజయం మీదే"మోటివేషనల్ స్పీకర్లు 'కలలు' అంటే కేవలం 'గోల్స్' అని చెప్తారు. కానీ సైకాలజీలో కలలు అంటే 'సెల్ఫ్-రిఫ్లెక్షన్'. కలలను కేవలం విజయం కోసం మెట్లుగా కాకుండా, మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దే 'గైడ్' లా చూడండి.4. కలలను మీ పర్సనాలిటీకి అద్దంగా మార్చుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ కలల నుండి మీరు నేర్చుకోవాల్సింది ఇదే.Step 1: కలల డైరీ రాయండిప్రతిరోజూ ఉదయం లేవగానే మీరు కన్న కలలను ఒక డైరీలో రాయండి. అది ఎంత పిచ్చిగా ఉన్నా సరే. ఆ కలలో మీకు కలిగిన 'ఎమోషన్' (భయమా? ఆనందమా? కోపమా?) ఏంటో గుర్తించండి. కలలోని సంఘటనల కంటే ఆ 'ఎమోషన్' చాలా ముఖ్యం. ఇది మీ పాత ప్రోగ్రామింగ్ను 'Break' చేసి, నిజమైన మీరు ఎవరో చూపిస్తుంది.Step 2: కలల వెనుక ఉన్న మూలాన్ని వెతకండిఆ కల మీ పగటిపూట జీవితానికి ఎలా కనెక్ట్ అయ్యి ఉందో విశ్లేషించండి. మీరు పగలు దేని గురించి భయపడుతున్నారో, అదే కలగా వస్తుంది. అక్కడ మీరు ఎక్కడ తగ్గుతున్నారో, దాన్ని మీ పర్సనాలిటీలో 'Build' చేయండి.Step 3: మాస్టరీఒక్కసారి మీ కలల భాష (Dream Language) మీకు అర్థమైతే, మీరు మీ సబ్-కాన్షియస్ మైండ్ను కూడా కంట్రోల్ చేయగలరు. అదే Lucid Dreaming కి పునాది. మీరు మీ అంతరాత్మతో నేరుగా సంభాషిస్తున్నప్పుడు, మీ వ్యక్తిత్వం ఒక 'హైయర్ లెవెల్' కి చేరుకుంటుంది.5. కలల విశ్లేషణఈ రోజు ఒక చిన్న పని చేయండి:* ఈ వారం మీకు వచ్చిన అతి ముఖ్యమైన కలని రాసుకోండి.* ఆ కలలో మీరు ఏ పాత్ర పోషించారు? (బాధపడేవారా? పోరాడేవారా? పారిపోయేవారా?)* మీ నిజ జీవితంలో మీరు కూడా ఆ పాత్రనే పోషిస్తున్నారా?కలలు మీ అంతరాత్మ ప్రతిబింబాలు!బ్రో, కలలు మనకు భవిష్యత్తును చెప్పవు, కానీ అవి మన వర్తమానాన్ని, మన అస్తిత్వాన్ని మనకు చూపిస్తాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేయకండి. మీరు ఎవరో తెలుసుకోవాలంటే, మీరు నిద్రపోయినప్పుడు మీ మనసు ఏం చెప్తుందో వినండి."The dream is the small hidden door in the deepest and most intimate sanctum of the soul."-Carl Jungసైకాలజిస్ట్ విశేష్Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Biology of Behavior: మీ హార్మోన్లు మీ వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తున్నాయి?) -
సీమంతం వేడుకలో భార్యకు సర్ప్రైజ్, వైరల్ వీడియో
ఇటీవలి కాలంలో బేబీ షవర్ లేదా సీమంతం వేడుకలకు ప్రాధాన్యత బాగా పెరిగింది. ఈ మధురమైన జ్ఞాపకాన్ని కలకాలం పదిలపర్చుకునేలా మెటర్నిటీ ఫోటోషూట్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని మంగళూరులో ఒక వ్యక్తి తన భార్య బేబీ షవర్ కోసం వినూత్న ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది.మంగళూరులో జరిగిన సీమంత వేడుకలో హెలికాప్టర్లో పూల వర్షం కురియడం విశేషంగా నిలిచింది. మేళతాళాలు, సంప్రదాయ వేషదారణలు, విందుభోజనాల మధ్య ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి జంట ఫోటోలకు పోజులిస్తుండగా, ఆకాశం నుంచి పూల వర్షాన్ని చూసి అర్పిత ఆశ్చర్య చకితురాలైంది. @maamantraventures అనే ఇన్స్టాగ్రాంలో వీడియోను షేర్ చేస్తూ, "లవ్ ఇన్ ఇది ఎయిర్..మంగళూరులో ఒక నిజమైన హీరో, తన భార్య బేబీ షవర్ కోసం హెలికాప్టర్ ఫ్లవర్ షవర్తో ఆమెను సర్ప్రైజ్ చేశాడు. మంగళూరులో మొదటిసారి! నిజంగా గుర్తుంచుకోవలసిన వేడుక!" అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇదిచూసి నెటిజనులను భావోద్వేగానికి లోను చేసింది. View this post on Instagram A post shared by Akshitha Poojary (@akshupoojary) View this post on Instagram A post shared by MMV🫰🏻KUSHI Films (@maamantraventures)వ్యాపారవేత్త ప్రకాష్ కుంపల భార్య అర్పిత బేబీ షవర్ కోసం ఈ ప్రత్యేక ఏర్పాటు చేశాడు. నగర శివార్లలోని అడయార్ గార్డెన్లో అతిథులు హాజరు కాగా సీమంతం వేడుక మధ్య హెలికాప్టర్ ఈ జంటపై పూల వర్షం కురిపించింది. ఈ అద్భుతమైన దృశ్యాల్ని చూసిఅతిథులు కూడా ఆశ్చర్యంగా చూశారు. చాలామంది ఈ అద్భుత క్షణాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్నెటిజనుల స్పందనపురుషుడు నిజంగా భార్యను ప్రేమిస్తే.. అతని ప్రేమ ఎప్పటికీ అనంతం." అని ఒకరు, చేతిలో డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు మరొకరు వ్యాఖ్యానించారు. మరోవైపు ఆ డబ్బును ముగ్గురు అమ్మాయిల వివాహాలకు సహాయం చేసి ఉంటే బావుండేది అని మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.(విజయ్పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు) -
విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్
Virosh Wedding సినిమా స్టార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడిలోని ప్రతీ వేడుకు ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తరువాత సొంత ఊరిలో కొత్త దంపతుల సత్యనారాయణ వ్రతం, భోజనాల విశేషాల సందడి ముగియముందే ఈ జంట సంగీత్ వేడుక ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. పదండి దాని సంగతులేంటో తెలుసుకుందాం.రష్మిక ఎప్పటిలాగానే డైమండ్ ఆభరణాలతో నిండుగా కనిపించింది. ఇక విజయ్ దేవరకొండ తన 'సంగీత్' వేడుకలో ధరించిన స్పెషల్ హారం అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ మెడలోని ప్రత్యేకమైన పచ్చ నెక్లెస్ దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ పెళ్ళిలో రాకుమారుడిలా నగలతో కొత్త ఫ్యాషన్ ట్రెండ్కు నాంది పలికాడు. తన వెడ్డింగ్ లుక్స్తో అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా, తన సంగీత్ వేడుకలో అతని ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. విజయ్ ,రష్మిక ఫల్గుణి షేన్ పీకాక్ దుస్తుల్లో నాట్య మయూరాల్లా విన్యాసాలు చేశారు. విజయ్ ముదురు నీలం రంగులో ఉన్న కుర్తా-పైజామా సెట్ను ఎంబ్రాయిడరీ కోటుతో ధరించగా, రష్మిక సిల్వర్ కలర్ లెహంగాను ధరించింది.యూనిక్ ఎమరాల్డ్ నెక్లెస్విజయ్ ప్రత్యేకమైన వజ్రాలు పొదిగిన పచ్చ నెక్లెస్ మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్. విజయ్ నెక్లెస్లో మధ్యలో భారీ పచ్చ లాకెట్టు అందంగా అమిరిందిన. ఆ లాకెట్టు పైన ఒక పెద్ద డైమండ్ క్యాప్ మరింత వన్నెతెచ్చింది. అలాగే ఎంగేజ్మెంట్ రింగ్గా భావిస్తున్న విజయ్ పదహారు రాళ్ల డైమండ్ రింగ్ చాలా విలక్షణమైంది.ఆ ఉంగరంలో ప్రేమకు చిహ్నంగా బ్రాండ్ క్రిస్క్రాస్ X మోటిఫ్ కూడా ఉంది. ఈ వజ్రపు ఉంగరం ధర సుమారు రూ. 15 లక్షలు ఫిబ్రవరి 26, 2026న, తెలుగు, కొడవ సంప్రదాయల ప్రకారం వివాహ వేడుక జరిగితన తరువాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. (విజయ్పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు) -
నడక చాలు...జిమ్కు వీడ్కోలు...!
‘‘నడక చాలు, మీకు జిమ్ అవసరం లేదు’’ అని ఎవరైనా చెప్పడం మనలో చాలా మంది విని ఉండొచ్చు. సాధారణంగా జిమ్కు వెళ్లలేకపోతున్న వారికి ఇది ఓదార్పుగా అనిపించవచ్చు. జిమ్కు డుమ్మా కొట్టడం దానికి బదులుగా నడకను ఎంచుకోవడం అంటే అది అంత సులువైన విషయం కాదు అలాగని అసాధ్యం కూడా కాదు. జిమ్ మానడం వల్ల కలిగే నష్టాలను నడకతో భర్తీ చేయడం సాధ్యమే అంటున్నారు వ్యాయామ నిపుణులు. వారు చెబుతున్న ప్రకారం...అలా చేస్తే లాభం లేదు...కారు దిగి ఆఫీసు వరకు నడవడం, షాపింగ్ మాల్లో తిరగడం, ఫోన్లో మాట్లాడుతూనో, చాట్ చేస్తూనో నడవడం, పార్క్లో రిలాక్స్డ్గా నెమ్మదిగా వాక్ చేయడం... వంటి వాటివల్ల జిమ్ సెషన్ను భర్తీ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే అవి వ్యక్తి శరీరంపై నిర్మాణాత్మక ఒత్తిడిని కలిగించవు. కార్డియో పేరిట ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్...వగైరాలు జిమ్లో అందుబాటులో ఉంటాయి. అటువంటి వ్యాయామాలతో కూడిన జిమ్ సెషన్ వదిలేస్తూ, ఆ నష్టం భర్తీ కావాలంటే ఏదో ఒక పని మీద కాకుండా నడవడం అనే పని మీద బయటకు వెళ్లాలి. అప్పుడే మన చేతులు సరిగ్గా కదులుతాయి. చూపు ముందుకు ఉంటుంది. ఒక్కో అడుగు సాధారణం కంటే ఎక్కువ దూరం పడుతుంటుంది. ఇలా నడిస్తే...భళా...స్మార్ట్వాచ్ లేదా ఫోన్ ఉంటే, ఒక సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. స్థిరమైన రీతిలో గంటకు 5 కి.మీ వేగంతో 30 నిమిషాల పాటు నిర్విరామంగా నడవాలి. అంటే దాని ద్వారా మనం 2.50 కి.మీ నడుస్తామన్నమాట. ఆ వేగంతో, చాలా మంది సాధారణ నడక నుంచి బయటపడి తేలికపాటి కార్డియో శైలిలోకి వెళతారు. శ్వాస కొంచెం లోతుగా మారుతుంది. కండరాలు సాధారణ ప్రయాణ వేగం కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేయడానికి తగ్గట్టుగా వేడెక్కుతాయి. అలా 30 నిమిషాలు నాన్–స్టాప్ గా నడిస్తే గుండె, ఊపిరితిత్తులు రక్త నాళాలు గట్టి ప్రభావాన్ని ఎదుర్కొంటాయి.దీనికి రోజువారీ తప్పక చేయాల్సిన అవసరం కూడా లేదు. వారంలో నాలుగు రోజులు సరిపోతుంది. ‘‘దానిని ఒకేలా పరిగణించినప్పుడు మాత్రమే. నడక ఒక వ్యాయామం అవుతుంది. తొలుత 5 నిమిషాల పాటు సున్నితమైన వేగంతో ప్రారంభించి ఆపై తగిన వేగంలో స్థిరంగా నడవడం అలవాటు చేసుకోవాలి. అంతే కాకుండా చేతులను వెనక్కి కట్టేయడం లాంటివి చేయకూడదు. చేతులను దాదాపు 90 డిగ్రీల వద్ద వంచి సహజంగా ఊగుతూ ఉండేలాచూడాలి. చదునైన నేలపై 30 నిమిషాల్లో 2.3–2.7 కి.మీ. లక్ష్యంగా పెట్టుకోవాలి. వేగాన్ని తగ్గించకుండా ఉండటానికి అవసరమయితే సంగీతం లేదా పాడ్కాస్ట్లను ఉపయోగించవచ్చు. వాక్ ముగిసే సమయంలో హృదయ స్పందన రేటు తగ్గడానికి 2–3 నిమిషాల పాటు నెమ్మదించిన నడకతో ముగించాలి.(చదవండి: The Biology of Behavior: మీ హార్మోన్లు మీ వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తున్నాయి?) -
హర్మోన్లు ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయంటే..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కేవలం ఆలోచనలు, అలవాట్లు మాత్రమే కాదు. అది మీ శరీరంలో జరిగే Chemistry కూడా. చాలామంది తమ కోపానికి, బద్ధకానికి, ఆందోళనకు కారణం 'చేతకానితనం' అనుకుంటారు. కానీ, అది కేవలం కొన్ని హార్మోన్ల హెచ్చుతగ్గులు మాత్రమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.మనం ఒక వ్యక్తిని "కోపిష్టి" అంటాం, లేదా "చాలా ప్రశాంతమైన వ్యక్తి" అంటాం. కానీ ఒక వ్యక్తి మెదడులో నిరంతరం జరిగే రసాయన చర్యలే ఆ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. మీ హార్మోన్లు మీ కళ్ళకు కనిపించవు కానీ, మీరు ఎలా ప్రవర్తించాలో, మీరు ఎలా ఆలోచించాలో అవే నిర్ణయిస్తాయి.1. The Fantastic Four...మన ప్రవర్తనను ప్రధానంగా నాలుగు హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. వీటిని మనం 'హ్యాపీ హార్మోన్లు' అని పిలుస్తాం.Dopamine - The Reward Molecule: మీరు ఒక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు లేదా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు విడుదలవుతుంది. ఇది లేకపోతే మీరు బద్ధకంగా ఉంటారు, ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు.Serotonin - The Mood Stabilizer: ఇది మనలోని ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక హోదాను నియంత్రిస్తుంది. ఇది తక్కువైతే వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్లడం, విపరీతమైన ఆందోళన చెందడం జరుగుతుంది.Oxytocin - The Bonding Hormone: ఇది మనుషులతో మనల్ని కలిపి ఉంచుతుంది. ఇది ఎక్కువ ఉంటే మీరు నలుగురితో కలిసిపోయి ఉంటారు, తక్కువ ఉంటే ఒంటరితనం (Loneliness) ఫీలవుతారు.Endorphins - The Pain Killer: ఇవి ఒత్తిడిని, శారీరక నొప్పిని తగ్గిస్తాయి. వ్యాయామం చేసినప్పుడు ఇవి ఎక్కువగా విడుదలవుతాయి.2. కార్టిసాల్: మీ పర్సనాలిటీకి శత్రువుమీరు ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ (Cortisol) విడుదలవుతుంది. ఇది ఎక్కువ కాలం ఉంటే, మీ మెదడులోని 'హిప్పోకాంపస్' (జ్ఞాపకశక్తికి సంబంధించింది) బలహీనపడుతుంది. దీనివల్ల మీరు త్వరగా మర్చిపోవడం, కోపపడటం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం జరుగుతుంది. మీరు చేస్తున్న 'ట్రిగ్గర్' పనులన్నీ ఈ కార్టిసాల్ ని పెంచేవే!3. మోటివేషన్ vs బయోలాజికల్ ఫ్యాక్ట్స్సో-కాల్డ్ ట్రైనర్లు "నీ మైండ్ సెట్ మార్చుకో, అంతా మారుతుంది" అని చెప్తారు. అది నిజమే, కానీ ఆ మైండ్ సెట్ మారాలంటే మీ శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఉండాలి.మీరు రోజుకు 30 నిమిషాలు ఎండలో తిరగకపోతే, లేదా వ్యాయామం చేయకపోతే.. మీ మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అప్పుడు మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచించాలనుకున్నా, మీ బయోలజీ మీకు సహకరించదు.4. బయోలాజికల్ రీ-ప్రోగ్రామింగ్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ హార్మోన్లను మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు?Step 1: శారీరక అడ్డంకులను బ్రేక్ చేయండిమీరు బద్ధకంతో ఉన్నప్పుడు "నేను సోమరిపోతుని" అని అనుకోవద్దు. మీ శరీరానికి కావాల్సిన పోషకాలు, నిద్ర లేవేమో అని విశ్లేషించండి. మీ బయోలాజికల్ సైకిల్ ని 'Break' చేసి, సరైన నిద్ర, ఆహారం వైపు అడుగు వేయండి.Step 2: హార్మోనల్ హ్యాకింగ్Dopamine Detox: సోషల్ మీడియా లైకుల ద్వారా వచ్చే తక్షణ డోపమైన్ని ఆపేసి, కష్టపడి ఏదైనా పని చేయడం ద్వారా వచ్చే డోపమైన్ని అలవాటు చేసుకోండి.Oxytocin Boost: తోటి మనుషులతో కనెక్ట్ అవ్వండి, ఇది మీ స్ట్రెస్ ని తగ్గిస్తుంది.Step 3: బయో-మాస్టరీఒక్కసారి మీ శరీరంలోని రసాయన శాస్త్రం మీకు అర్థమైతే, మీరు ఒక మాస్టర్ లా ఉంటారు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉండాలో, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలో మీ హార్మోన్ల ద్వారానే మీరు కంట్రోల్ చేసుకోగలరు.5. మీ హార్మోన్ల చెకప్ఈ రోజు మీరు ఈ చిన్న గమనికను గమనించండి.ఉదయం లేచినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? (ఉత్సాహమా లేక బద్ధకమా?) - ఇది మీ నిద్ర నాణ్యత మరియు డోపమైన్ లెవెల్స్ ని చెప్తుంది.సాయంత్రం వేళల్లో మీకు ఒత్తిడిగా అనిపిస్తుందా? - ఇది మీ కార్టిసాల్ లెవెల్స్ ని చూపిస్తుంది.మీరు ఫిజికల్ యాక్టివిటీ (వ్యాయామం) చేస్తున్నారా? - లేకపోతే మీ ఎండార్ఫిన్లు పని చేయడం లేదని అర్థం.మీ శరీరం మీ దేవాలయం!బ్రో, వ్యక్తిత్వం అంటే కేవలం మీ ఆలోచనలే కాదు, మీ శరీరం కూడా. మీరు మీ హార్మోన్లను పట్టించుకోకుండా, కేవలం మైండ్సెట్ మీద పనిచేస్తే అది పక్షవాతం ఉన్న వ్యక్తికి పరిగెత్తమని చెప్పినట్లే ఉంటుంది. మీ శరీరాన్ని సరిగ్గా చూసుకోండి, అప్పుడు మీ మైండ్ మీకు మద్దతు ఇస్తుంది."A healthy mind needs a healthy chemistry."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
C/O సుజాత టీ కొట్టు
‘‘ఉదయం ఆరు గంటలకు టీ కొట్టు దగ్గరకు వస్తాను. రోజంతా టీ కాస్తూనే ఉంటాను.. సాయంత్రం ఆరుగంటలకు ఇంటికి వెళతా. పదేళ్లుగా ఇదే నా పని. టీ కొట్టు మీద వచ్చిన ఆదాయంతో నేను, నా ఇద్దరు పిల్లలు బతుకుతున్నాం. ఈ ఆదాయంలోనే పిల్లలను చదివించుకుంటున్నా. మా అమ్మాయి కిందటేడాది నీట్లో మంచి ర్యాంకు సాధించింది. ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతోంది. మా అబ్బాయి సిద్దార్థ ఇంటర్ పూర్తి చేసి జేఈఈ చదివేందుకు సిద్దం అవుతున్నాడు.అటు నుంచి ఇటు .. ఇటు నుంచి అటు..మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం తట్టుపల్లి గ్రామం మాది. మా దగ్గరి బంధువుల అబ్బాయికే ఇచ్చి పెళ్లిచేశారు మా అమ్మనాన్నలు. ఉన్న ఊళ్లో కలిగిన దాంట్లో బాగానే ఉండేవాళ్లం. మాకు ఇద్దరు పిల్లలు. మేం చదువుకోలేదు. అందుకే, పిల్లలను బాగా చదివించాలనే ఆలోచనతో హైదరాబాద్కు వెళ్లాం. కానీ, మా ఆయనకు ఎక్కడా సరైన పని దొరకలేదు. ఆర్థిక భారం, అప్పులు మా ఆయన్ని కలిచి వేశాయి. దిక్కుతోచక ఓ రోజు క్షణంలో తీసుకున్న నిర్ణయం నన్ను, నా కుటుంబాన్ని ఒంటరిని చేసింది. భర్త తోడులేని ఆడది, ఇద్దరు పిల్లలతో పట్టణంలో ఎలా బతకాలనేది నా ముందు పెద్ద ప్రశ్నగా ఉండేది. పుట్టెడు దుఃఖంలో కూడా బిడ్డల భవిష్యత్పై మేం పెట్టుకున్న ఆశలు మదిలో మెదలుతూనే ఉండేవి. కానీ, పట్టణంలో బతకలేక ఊరి బాట పట్టాను.ఒంటరి పోరాటం.. ఊళ్లో కూలీ పనులకు పోయేదాన్ని. రోజులు గడిచిపోతున్నాయి. పిల్లల కడుపైతే నింపగలను కానీ, వారికి సరైన భవిష్యత్తును ఇవ్వగలనా.. అనేది పెద్ద సందేహంగా ఉండేది. అంతేకాదు, పిల్లలను బాగా చదివించాలని మా ఆయన, నేను పదే పదే అనుకునేవాళ్లం. ఆ మాటలు ఎప్పుడూ గుర్తుకువస్తుండేవి. పిల్లలను చదివించాలంటే మహబూబాబాద్లో ఉండాలనుకున్న. కానీ, అక్కడకెళ్లి ఎలా బతకాలి? టీ కొట్టు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. బంధువుల సహకారం, కొద్దిపాటి ΄÷దుపు మొత్తంతో మహబూబాబాద్లో చిన్న టీ కొట్టు పెట్టుకున్న. గత 10సంవత్సరాలుగా ఉదయం ఆరు గంటలకు రావడం. సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళ్లడం పనిగా పెట్టుకున్న. దీనిపై వచ్చిన డబ్బులతో మేం బతుకుతున్నం, పిల్లలనూ చదవిస్తున్న. నా ఒంటరి పోరాటాన్ని పిల్లలు అర్ధం చేసుకున్నారు. మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తు అని వారికీ అర్ధమైంది. మా అమ్మాయి వైష్ణవి కిందటేడాది నీట్లో మంచి ర్యాంకు సాధించింది. ఎంబీబీఎస్ సీటు ΄÷ంది చదువుతోంది. కొడుకు సిద్దార్థ ఇంటర్ పూర్తి చేసి జేఈఈకు ప్రిపేర్ అవుతున్నడు. పిల్లలపై నా భర్త పెంచుకున్న ఆశలను నిజం చేయాలన్నదే నా తపన’ అంటూ వివరించింది సుజాత. టీ కొట్టు మీద వచ్చిన ఆదాయం ఇంటి కిరాయి, పోషణ, పిల్లల చదువుకు ఖర్చైపోతుంది. పిల్లలు వారి జీవితాల్లో వారు స్థిరపడాలంటే ఇంకా సమయం పడుతుంది. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే తనకు ఎంతో అండగా ఉంటుందంటోంది సుజాత. – ఈరగాని బిక్షం, సాక్షి మహబూబాబాద్ఫొటోలు: మురళీ మోహన్ -
హోళీ..కలర్ఫుల్ టూర్ కోసం..!
యమునా తీరంలో రంగుల ఆటవెలది... బ్రజ్ భూమిలో రంగుల కథలు...మాధవుడి నగరంలో రంగుల హరివిల్లు... కృష్ణ నగరంలో వసంత స్వాగతం...గోపాలుడి జన్మభూమిలో రంగుల ఋతువు...ఇంద్ర ధనస్సు రంగుల మధ్య ఓ మధురమైన దైవిక స్పర్శ...ఇవన్నీ కనులవిందుగా దర్శించాలంటే ఆ ప్రాంతాల గుండా ప్రయాణించాల్సిందే!! కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికే అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మధుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి. ఉత్తర ప్రదేశ్లో ఉన్న మధుర, యమునా నదీ తీరం నిదానంగా, ఆగిపోయిన కాలంలా ఉంటుంది. ఇక్కడ ప్రతి గల్లీలో కృష్ణ నామస్మరణ, ప్రతి సంధ్యలో దీపాల ప్రకాశం, ప్రతి వసంతం రంగుల ప్రణయంలా ఉంటుంది. మధుర అంటే కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం.కృష్ణ జన్మభూమి వైభవంమధురలో ప్రయాణం ప్రారంభమయ్యే ప్రదేశం శ్రీ కృష్ణ జన్మభూమి. ఆ ప్రాంతంలో నడుస్తుంటే అక్కడి ప్రాచీన శిల్పం, మందిర గోపురాలను చూస్తుంటే మది నిండా ప్రశాంతమైన భావం కలుగుతుంది. ఇక్కడ సంధ్యా సమయంలో శంఖ నాదం వినిపిస్తుంది. అలాగే భక్తుల మధ్య ఒక సమన్వయం కనిపిస్తుంది. ద్వారకాదీశ్ మందిరం వద్ద సంధ్యా హారతి సమయంలో దీపాల వెలుగు, భజనల్లో కలిసిన భక్తుల స్వరం ఇవన్నీ ఒక ప్యూర్ డివోషనల్ ఆరాను క్రియేట్ చేస్తాయి.యమునా తీరంలో నిశ్శబ్ద వేదంవిశ్రామ్ ఘాట్ దగ్గర ప్రతి ఉదయం యమునా తీరాన్ని తాకే సూర్యుడి కిరణాలు కనులకు ఆనందాన్ని, మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. నదిపై అలా అలా సాగుతున్న తెప్ప, నీటిపై ప్రతిబింబించే ఆకాశం, నిదానంగా సాగే జీవితం. ఇదే అక్కడి ప్రతి ఉదయం కనిపించే దృశ్యం. ఇక్కడ నడుస్తుంటే మధుర అనేది ఒక ప్రదేశంలా కాదు, ఒక ఫీలింగ్ అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రయాణం అంటే వేగం కాదు, కాలానికి తగిన విలువ అనిపిస్తుంది. బ్రజ్ భూమిలో రంగుల ఋతువుమధురలో హోలి అంటే పండుగ కాదు. ఒక జీవితోత్సవం. వసంత కాలంలో నగరం మొత్తం రంగులతో నవ్వుతుంది. గులాల్ బ్యాక్గ్రౌండ్లో వినిపించే గీతాలు, భజనల మధ్య ప్రతి గాలిలో ఉత్సాహం కనిపిస్తుంది. బర్సానా, వృందావన్ ప్రాంతాలు హోలి సందర్భంగా ప్రత్యేక వాతావరణం క్రియేట్ చేస్తాయి. రాధాకృష్ణుల మధుర స్మృతులు, రంగుల మధ్య భక్తి భావం, నగరం మొత్తం ఒక వేదికలా మారుతుంది. ఇక్కడ హోలి అంటే రంగులతో ఆడే ఒక క్రీడ మాత్రమే కాదు. ఒక పరంపర. ఒక సంప్రదాయం. ఒక ఆచారం. కాలం అందించే ఆనందానికి ప్రతీక కూడా.‘రాధే రాధే’ అనే పలుకే మధురం...మధుర అనగానే ముందుగా అక్కడి ‘పెడా’గుర్తుకు వస్తుంది. అయితే దీంతోపాటు అక్కడి ప్రత్యేక అల్పాహారాన్ని రుచి చూడడం మర్చి΄ోవద్దు. పెడా, లస్సీ, చాట్ లాంటి తినుబండారాలు నగరంలో ప్రతి చోట సులభంగా లభిస్తాయి. స్థానికుల జీవితంలో భాగమైన వీటిని ఆస్వాదిస్తూ మీరు కూడా కాసేపు అక్కడి స్థానికులుగా మారిపోవచ్చు.పర్యాటకులు ఎక్కడికి వెళ్తున్నా అక్కడి స్థానికుల్లా జీవిస్తేనే పర్యటనలోని అందమైన అనుభూతులను సొంతం చేసుకోగలరు. అందుకే అంటారు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి అని. అలాగే మధురలో ఉన్నప్పుడు మధురవాసిలా మారిపోవాలి. ఇక్కడ ప్రతి గల్లీలో ఒక మిఠాయి దుకాణం, అందులో చిరునవ్వు చిందిస్తూ ‘‘రాధే రాధే’’ అని పలకరించే వ్యాపారి కనిపిస్తాడు. మీరు కూడా ‘రాధే రాధే’ అని పలకరించండి.చేయాల్సిన పనులుమధురలో యమునా తీరంలో ఉదయానే కాసేపు అలా తిరగడం ఒక చక్కని అనుభూతిని అందిస్తుంది. అందుకే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా మార్నింగ్ వాక్ చేసే అవకాశాన్ని ఎవరూ మిస్ చేయకూడదు. ఇది ఎవరూ చెప్పని ఒక ట్రావెల్ హ్యాక్.వీటితోపాటు సాయంత్రం సమయంలో హారతి చూడటం, గోవర్ధన గిరి పరిక్రమ చేయడం, హోలీ సందర్భంగా రంగుల మధ్య భజనలు వినడం, బృందావన్లో సంధ్యా సమయాన భక్తి గీతాలను వినడం ఇవన్నీ మధుర ప్రయాణంలో నిదానంగా మనసును హత్తుకునే విషయాలుగా మిగిలిపోతాయి.సందర్శనీయ స్థలాలుమధుర అనేది ఆ నందకిశోరుడు, అతని భక్తుల ప్రపంచం. ఇక్కడ బృందావన్లో బాంకే బిహారీ ఆలయం, గోవర్ధన పర్వతం, గోకులం, బర్సానా లాంటి ప్రదేశాలు కనిపిస్తాయి. ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి గల్లీకి ఒక కథ ఉంటుంది. ప్రతీ వీధిలో ఒక ఙ్ఞాపకాల నిధి ఉంటుంది. గోవర్ధన పరిక్రమ సమయంలో భక్తులు నిదానంగా నడుస్తూ భక్తిలో నిమగ్నమవుతారు. గోకులంలో బాల కృష్ణుడి లీలల గురించి భక్తులు మాట్లాడే విషయాలు మీరు ఇగ్నోర్ చేయలేరు. బృందావన్ వీధుల్లో ప్రతి సంధ్యా సమయంలో భజనలు వినిపిస్తాయి.ఎలా వెళ్లాలి ?ఢిల్లీ నుంచి రైలు, రోడ్డు మార్గంలో మధురకు సులభంగా చేరుకోవచ్చు.రైలు యాత్రలో యమునా నది పక్కనే కనిపించే దృశ్యాలు ప్రయాణాన్ని మరింత మనోహరంగా మార్చేస్తాయి. ఆగ్రా, ఢిల్లీ నుంచి రోడ్డుమార్గంలో సాగే ప్రయాణం .. బ్రజ్ భూమిలో అడుగుపెడుతూనే ఆనందానుభూతిని కలిగిస్తుంది.ఎక్కడ ఉండాలి ?మధురలో చిన్నా పెద్ద ధర్మశాలల నుంచి ఆధునిక హోటల్స్ వరకు అనేక వసతి సదు΄ాయాలు ఉన్నాయి. యమునా తీరం దగ్గర ఉన్న వసతి స్థలాలు సంధ్యా సమయంలో ప్రత్యేక ప్రశాంతతను ఇస్తాయి. మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే నదీతీరంలో ఉన్న హోటల్స్లో తక్కువ ధరకే రూమ్స్ లభించే అవకాశం ఉంది. అందుకే ట్రైన్ లేదా ఫ్లైట్ టికెట్స్ వంటివి బుక్ చేసుకునే సమయంలో రూమ్స్ కూడా బుక్ చేసుకోవడం ఒక మంచి ప్రయాణికుడి లక్షణం. ఏం చూడాలి ? మధుర ప్రయాణికులకు ఒక మధురమైన అనుభూతిని కల్పిస్తుంది. ఇక్కడికి వస్తే మీరు కృష్ణ జన్మభూమి, ద్వారకాదీశ్ మందిరం, విశ్రామ్ ఘాట్, బృందావన్, గోవర్ధన్ వంటి అనేక ప్రదేశాలను కవర్ చేయవచ్చు. ఈ యాత్రను మధురంగా మార్చుకోవాలి అనుకుంటే చెక్ లిస్ట్ పెట్టుకుని వివిధ ్ర΄ాంతాలను అన్వేషించడం కన్నా ప్రశాంతంగా ఒక్కో ప్రాంతాన్ని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మధుర అనేది పర్యాటక ప్రదేశం కన్నా ముందు ఒక పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ ప్రతి ప్రదేశం భక్తి, శిల్పకళ, సంప్రదాయం కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు (చదవండి: Munnar Tourist Place: "పచ్చందనమే పచ్చదనమే"..!) -
సంజూ సీక్రెట్.. ఆమెతో లవ్స్టోరీ! చారులత గురించి తెలుసా?
ఆదివారం వెస్టిండీస్తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు సంజు సామ్సన్. ఈ ఇన్నింగ్స్ అతడి కెరీర్కు కొత్త ఊపు తెచ్చింది. కీలక మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో అతను జట్టును గెలుపు వరకు తీసుకెళ్లి చిరకాలం గుర్తించుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. సంజూ ధనాధన్ ఆట తీరుతో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సెమీ ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టేలా బెర్త్ ఖరారైంది. ఈ నేపథ్యంలో సంజు కుటుంబ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!.సంజు సామ్సన్ తన చిన్ననాటి ప్రియురాలు చారులత రమేశ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట చాలా ఏళ్లు వెయిట్చేసి మరి..2018లో పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఈ చారులత రమేశ్ ఎవరంటే..?. ప్రముఖ క్రికెటర్ని పరిణయమాడినప్పటికీ.. వ్యక్తిగత జీవితాన్ని చాలా గొప్యంగానే ఉంచుకుంటారామె. మీడియా కంటపడకుండా జాగ్రత్తపడుతుంటారామె. ఇక చారులత విద్యా నేపథ్యం వచ్చేసి..ఆమె మార్ ఇవానియోస్ కళాశాల నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో పట్టా పొందింది. సంజూ చారులతను తొలిసారి ఈ మార్ ఇవానియోస్ కళాశాలలోనే కలుసుకున్నాడు. ఆ తర్వాత ఫేస్బుక్ ద్వారా స్నేహితులుగా సాగిన సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. అయితే చారులత తన కెరీర్పై దృష్టిసారించగా, సంజు దేశీయ క్రికెట్పై ఫోకస్ పెట్టి కెరీర్లో రాణించడం ప్రారంభించాడు. అయితే ఈ జంట తమ రిలేషన్ని అత్యంత గోప్యంగా ఉంచుకున్నారు. మీడియా కంటపడకుండా సాగించారు. అంతేగాదు వీరి వివాహం సైతం అత్యంత గోప్యంగా కొద్దిమంది కుటుంబసభ్యులు, వ్యక్తిగత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. ఈ దంపతులు డిసెంబర్ 22, 2018న వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. (చదవండి: జస్ట్ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..) -
జస్ట్ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్..!
ఇంతవరకు చూసిన వెయిట్లాస్ జర్నీలలో ఇది అత్యంత విభిన్నం. ఓ టీనేజర్ అధిక బరువు తగ్గేంచేందుకు ఎలా ప్రయత్నించాడో వివరించే వెయిట్లాస్ స్టోరీ ఇది. తన పదహారవ పుట్టిన రోజున తీసుకున్న నిర్ణయం..తనలో ఎంతలా పరివర్తనకు దారితీసిందో తెలిపాడు. అయితే జిమ్కి వెళ్లలేదని, అలాగే ఎలాంటి కఠినమైన డైట్లు పాటించలేదని అంటున్నాడు. కానీ రెండేళ్లలో 17 కిలోలు పైనే తగ్గానని అంటున్నాడు. జిమ్, డైట్ పాటించకుండా ఆ టీనేజర్ ఎలా బరువుతగ్గాడంటే..ఇంటి వ్యాయామాలతో అని చెబుతున్నాడు. అదేంటి అనుకోకండి. ఎందుకంటే తాను స్లిమ్గా ఆరోగ్యకరమైన బరువుతో ఉండాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి..వారి సహాయసహకారాలతో బరువు తగ్గాడు. పేరెంట్స్ సాయంతోనే..ఇంటిలోనే చేసే వ్యాయామా పరికరాలను కొనుగోలు చేసి మరి..వర్కౌట్లకు ఉపక్రమించాడు. బరువులు ఎత్తే ప్లేట్ల తోపాటు బార్బెల్ వంటి పరకరాలతో మంచి పురోగతిని అందుకున్నాడు. మొదట్లో పుల్అప్బార్లతో వేలాడిదీసినట్లు ఉండటం దాదాపు అసాధ్యం అనిపించింది. ఒకపుల్అప్ని కూడా పూర్తి చేయలేకపోయేవాడు. అయితే క్రమం తప్పకుండా సాధన చేసి..మంచి మెరుగుదలను అందుకున్నాడు. సరైన టెక్నిక్తో ఇవాళ సుమారు 18 పుల్అప్లు దాక నిర్వహించి..కండరాల బలాన్ని పెంపొందించుకుంటున్నాడు. అలా రెండేళ్లలో చూస్తుండగానే దాదాపు 17 కిలోలు తగ్గి..చాలా స్మార్ట్గా మారిన తన పరివర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఆ టీనేజర్. కేవలం క్రమశిక్షణ, నిబద్ధతత, క్రమం తప్పకుండా చేయడం వంటివి వెయిట్లాస్కి ప్రధానమైనవని అంటున్నాడు. బరువు తగ్గడం గురించి భయపడే వారికి తన వెయిట్లాస్ స్టోరీ ప్రేరణ అని చెప్పడమే గాక, స్లిమ్గా మారేలా ఇతరులను ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నాడు.(చదవండి: పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!) -
పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!
వైఫల్యం అనగానే అవమానంగా, బాధగా అనిపిస్తుంటుంది. మనకే ఎందుకిలా జరుగుతుందని నిరాశ నిస్ప్రుహలకు లోనైపోతుంటాం. అయితే ఈ వ్యక్తి వైఫల్యాలు మీద వైఫల్యాలు పకరించినప్పుడే..విజయం చేరువవ్వుతున్నట్లు లెక్క అని అంటున్నాడు. అందుకు తన అనుభవమే ఉదాహరణ అంటూ..తన స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడే సుమిత్ మిట్టల్ తన మొత్తం సక్సెస్ జర్నీని సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేస్తూ..తాను చేసిన జీవిత పోరాటాల గురించి భావోద్వేగంగా రాసుకొచ్చాడు. తాను ఐఐటీ జేఈఈలో రెండుసార్లు ఫెయిలయ్యానని, అలాగే కెమిస్ట్రీ ప్రీ బోర్డు పరీక్షల్లో ఫెయిలైనట్లు తెలిపాడు. మరోవైపు కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైందని వివరించాడు. దాంతో కాల్సెంటర్లో పనిచేస్తూ..ఓ మారుమూల ప్రాంతంలో బీసీఏ పూర్తి చేశానని, ఓ చిన్న గదిలో విద్యార్థులకు బోధిస్తూ సాగిన ప్రస్థానం..నిమ్సెట్లో ఆల్ఇండియా 4వ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక కాలేజ్లో ఎంసీఏ చేసే రేంజ్కు చేరుకుంది. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదని చెప్పుకొచ్చాడు. తొలుత ప్రొడక్షన్ కంపెనీలో పనిచేస్తూ..కంపెనీని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడమే గాక, విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే రేంజ్కు చేరుకున్నట్లు తెలిపాడు. చివరగా సుమిత్ పదేపదే వైఫల్యాలు పలకరిస్తున్నప్పుడు నిరాశ చెందకూడదని..ప్రతి ప్రయత్నం విజయాన్ని చేరువ చేసే మార్గంగా భావించాలని అంటున్నాడు. అలాగే జీవితం ఎప్పుడు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. వైఫల్యాలనేవి..విజయాన్ని చేరువచేసే ప్రయత్నాలుగా మలుచుకుంటే..గమ్యానికి చేరుకోగలవు..అనుకున్నది సాధించగలవు అంటూ చేసిన పోస్ట్ అందరి హృదయాలను తాకింది..పైగా నెటిజన్లు నిస్సహయ స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ కథ ఓ ప్రేరణ అంటూ పోస్టులు పెట్టారు.Yes, I failed IIT JEE twiceYes, I failed in chemistry pre board examYes, my family faced financial crisisYes, I worked at a call centerYes, I completed my BCA from a distant collegeYes, I just started with teaching 4 students in a very small roomBut, I got AIR 4 in NIMCET… pic.twitter.com/OOasjxAVhm— Sumit Mittal (@bigdatasumit) February 24, 2026 (చదవండి: హార్ట్బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!) -
మీకు ఎప్పుడు కోపం వస్తుంది? ఎందుకు?
చాలామంది "నాకు కోపం రాదు, కానీ ఎవరైనా తప్పు చేస్తేనే కోపం వస్తుంది" అని అంటుంటారు. ఇది నిజం కాదు. నిజానికి, ఎదుటివారు చేసే తప్పు మీ మెదడులో ఉన్న ఒక పాత గాయాన్ని లేదా ఒక భయాన్ని తాకడం వల్లే మీకు కోపం వస్తుంది. మన వ్యక్తిత్వాన్ని శాసించే ఈ 'ఎమోషనల్ ట్రిగ్గర్స్'ను మనం ఈరోజు డీకోడ్ చేద్దాం.1. The Anatomy of a Triggerట్రిగ్గర్ అనేది ఒక వ్యక్తి, ఒక మాట, ఒక శబ్దం లేదా ఒక సంఘటన. అది మన సబ్-కాన్షియస్ మైండ్లోని ఒక పాత బాధను లేదా అభద్రతా భావాన్ని వెలికితీస్తుంది.* ఉదాహరణకు ఆఫీసులో మీ బాస్ మీ పనిని విమర్శించారనుకోండి. మీకు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు? అక్కడ ఆ పనిలోని తప్పు కంటే, మీ బాస్ మాట మిమ్మల్ని "నువ్వు అసమర్థుడివి" అని గుర్తుచేస్తోంది. ఆ 'అసమర్థత' అనే ఫీలింగ్ మీకు చిన్నప్పుడు స్కూల్ టీచర్ దగ్గర లేదా ఇంట్లో ఎదురై ఉండవచ్చు. అక్కడ బాస్ కాదు, మీలోని పాత గాయం ట్రిగ్గర్ అయ్యింది.2. ట్రిగ్గర్లను గుర్తించడం ఎలా?మనకు ట్రిగ్గర్ ఎప్పుడు అవుతుందో తెలియాలంటే, మన రియాక్షన్ను గమనించాలి.* Physical Signs: ట్రిగ్గర్ అయినప్పుడు ముందుగా మన బాడీ రియాక్ట్ అవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, దవడలు బిగుసుకుపోవడం లేదా కడుపులో కలత. ఇవి మొదలవ్వగానే, మీరు ఒక 'ట్రిగ్గర్ జోన్'లోకి వెళ్లారని అర్థం.* The Narrative: ఆ క్షణంలో మీ మైండ్ ఒక నెగటివ్ కథను అల్లుతుంది. "ఇతడు నన్ను తక్కువ చేస్తున్నాడు," "నాకు అన్యాయం జరుగుతోంది" అనే ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలే మిమ్మల్ని కోపంతో ఊగిపోయేలా చేస్తాయి.3. పది అంకెలు లెక్కపెడితే సరిపోదుమోటివేషనల్ స్పీకర్లు, ట్రైనర్స్... "కోపం వస్తే కళ్ళు మూసుకుని 10 వరకు లెక్కపెట్టు, అన్నీ మర్చిపో" అని చెప్తారు. ఇది కేవలం టెంపరరీ పరిష్కారం.కానీ మీలోని చీకటి కోణాలను (Shadows) మీరు అంగీకరించనంత వరకు ట్రిగ్గర్స్ మిమ్మల్ని శాసిస్తూనే ఉంటాయని సైకాలజీ చెప్తుంది. మీరు ఎవరిని ఎక్కువగా ద్వేషిస్తున్నారో, వారిలో మీకు నచ్చని లక్షణం మీలోనే ఎక్కడో దాగి ఉందేమో ఒక్కసారి ఆలోచించండి.4. ట్రిగ్గర్స్ ని అధిగమించడంGenius Matrix Hub ఫిలాసఫీ Break, Build, Beyond ప్రకారం, మీ ఎమోషనల్ రిమోట్ ని మీ చేతుల్లోకి తెచ్చుకోండి.Step 1: The Observer Stateట్రిగ్గర్ అయినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఆ క్షణంలో "నేను ఈ కోపానికి బానిసను కాదు, ఇది నా పాత గాయం" అని మిమ్మల్ని మీరు గమనించండి (Observer mode). ఆ క్షణికావేశాన్ని 'Break' చేయడమే మీరు చేయాల్సిన మొదటి పని.Step 2: Trigger Rewiringమీ ట్రిగ్గర్ను ఒక లెసన్లా మార్చుకోండి. "ఈ వ్యక్తి నన్ను ఎందుకు బాధపెట్టాడు?" అని కాకుండా, "నాలో ఏ భయం ఈ వ్యక్తి మాటతో బయటపడింది?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ విశ్లేషణ మీలో ఎమోషనల్ స్ట్రెంత్ని 'Build' చేస్తుంది.Step 3: Emotional Freedom ఒక్కసారి మీ ట్రిగ్గర్స్ మీకు అర్థమైతే, ఎవరూ మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు. విమర్శలు చేసినా, అవమానించినా మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇదే 'Beyond' స్టేజ్. ఇక్కడ మీరు మీ ఎమోషన్స్ కు మాస్టర్ గా ఉంటారు.5. మీ ఎమోషనల్ మ్యాప్ఈ రోజు ఒక చిన్న పని చేయండి.* ఈ వారం మీకు కోపం తెప్పించిన లేదా బాధపెట్టిన మూడు సందర్భాలను గుర్తు తెచ్చుకోండి.* ఆ సమయంలో మీ మనసులో మొదట వచ్చిన ఆలోచన ఏంటి? (అది భయమా? అవమానమా? తక్కువగా చూస్తున్నారనే ఫీలింగా?)* ఆ భావన మీ చిన్నప్పుడు ఎక్కడ మొదలైందో ఒక్కసారి ఆలోచించండి.కోపం ఒక హెచ్చరిక, ఆయుధం కాదు!బ్రో, కోపం లేదా బాధ అనేది ఒక తప్పుడు రియాక్షన్ కాదు, అది ఒక హెచ్చరిక. "నీ మనసులో ఎక్కడో గాయం ఉంది, దాన్ని నయం చేయి" అని అది మీకు చెప్తోంది. ఆ హెచ్చరికను విని, ఆ గాయాన్ని నయం చేసుకోండి.గుర్తుంచుకోండి, "Between stimulus and response there is a space. In that space is our power and our freedom." (Victor Frankl). ఆ స్పేస్లో మీరు గెలిస్తే, మీ వ్యక్తిత్వం అద్భుతంగా మారుతుంది.-సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
వేదకాలం నుంచి నేటి కాలం వరకు.. విదుషీమణులు
ప్రాచీన కాలంలో, అంటే క్రీ.పూ.3000 సంవత్సరాల ముందు కాలం నుండీ కూడా మన దేశం ‘స్త్రీ విద్య’ ను ప్రోత్సహించి, గౌరవించింది. ఆనాటి నుండీ స్త్రీలు లౌకిక, అలౌకిక విద్యలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. వేదకాలంలోనే మహిళలు ఉపనయన సంస్కారాలు పొంది, వేదాధ్యయనం చేశారు. వేద మంత్రాలు దర్శించారు. తపస్వినులు, ఆధ్యాత్మికవేత్తలైన స్త్రీలను ‘ఋషికలు’ అంటారు. రోమశ, గార్గి వాచక్నవి, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, మైత్రేయి, అపాల, యామి, పౌలోమి, ఘోష, ఖోన, జుహు, వాగంభ్రణి, సావిత్రి, దేవజామి, కక్షివతి, దక్షిణ ప్రజాపత్య, విశ్వావతి, పశుక్రపత్ని, దేవసూని, శాశ్వతి, అంగీరసి, శ్రీ లక్ష్మి, నోధ, శిఖతన్వరి, గౌపాయన, ఉభయభారతి, విజ్జిక, కామాక్షి వంటి స్త్రీలందరూ ఋషికలే. గృహజీవనానికి స్త్రీయే పునాది అని ఋగ్వేదం చెప్పింది. శక్తిస్వరూపిణి అయిన స్త్రీని గౌరవించి, ఆరాధించే సంస్కృతి మనది. పరబ్రహ్మలోని స్త్రీ పరమైన గుణాలు, శక్తులు కలిసి ‘స్త్రీ దేవతలు’ అవతరించారు. వారి గురించి తెలుసుకుందాం. లోపాముద్ర: అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర సంస్కృత, తమిళ భాషలలో నిష్ణాతురాలు. లోపాముద్ర అంటే తనలో తానే లీనమైన ఆత్మనిష్ఠాపరురాలు అని అర్థం. అగస్త్యునికి, లోపాముద్రకు మధ్య జరిగిన సంవాదం, లోపాముద్ర పాండిత్యం, గెలుపును ఋగ్వేదం ప్రశంసించింది. అగస్త్యుడు, లోపాముద్ర సాహచర్యంలో సంవాదాలలో భౌతిక, ఆధ్యాత్మిక జీవితంలోని పవిత్రతను, పూర్ణత్వాన్ని గ్రహించాడని చెబుతారు.ఘోష: ఆమె దుర్గతమసుని మనుమరాలు. కక్షివంతుని కూతురు. దేవ వైద్యులైన అశ్వనీ కు మారులను స్తుతిస్తూ ఆ తండ్రీ కుమా రులు అనేక శ్లోకాలు రచించారు. పదవ ప్రకరణంలోని కొన్ని శ్లోకాలను తండ్రి, తాతగార్లతో సమానంగా ఘోష రచించింది. వాటిలోని ఒక శ్లోకంలో ఆమె అశ్వినులను వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెల్లడిస్తుంది. కుష్ఠువ్యాధిచే కురూపి అయిన ఆమెను అశ్వనీ దే వతలు తమ వైద్యంతో ఆరోగ్యవంతు రాలిని, అందగత్తెను చేసి పెండ్లి చేసు కొంటారు.ఋగ్వేద మంత్ర ద్రష్ట మైత్రేయి: గొప్ప తాత్వికురాలు, ఋషిక అయిన మైత్రేయి కూడా ఋగ్వేద మంత్రాలను దర్శించింది. ఆమె తన భర్త అయిన యాజ్ఞవల్క్యుని వ్యక్తిత్వ, ఆధ్యాత్మిక ఆలోచనలను పరిణితి చెంచేలా చేయడంలో ప్రధానపాత్ర వహించింది. యాజ్ఞవల్క్యునికి కాత్యాయని అనే రెండవ భార్య కూడా ఉంది. ధర్మశాస్త్రాలు, వేదాలు బాగా చదివి, బ్రహ్మవాదినిగా మైత్రేయి ఘనత వహిస్తే, కాత్యాయని ఒక సాధారణ ఇల్లాలిగానే ఉండింది. ప్రాపంచిక చింతనలు విడిచి, సన్యాసికి అనువైన స్వీయ నియంత్రణ, సన్యాసి ప్రతిజ్ఞా పాలన చేయదలచి యాజ్ఞవల్క్యుడు ఒకరోజు తన ప్రాపంచిక ఆస్తిపాస్తులను తన ఇద్దరు భార్యలకు పంచదలిచాడు. ప్రపంచ సంపద తనకు శాశ్వతత్వాన్ని, ముక్తిని ఇవ్వలేదని భావించి మైత్రేయి తన భర్త నుండి కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ముముక్షత్వానికి కావలసిన శిక్షణను కోరుకొని మరీ పొందింది.బ్రహ్మజ్ఞాని గార్గి: వాచక్న మహర్షి కూతురు, వైదిక ప్రవక్త గార్గి. మానవ అస్తిత్వానికి, ఉనికికి, జీవితానికి మూలమేమిటి అనే అంశంపై గార్గి అనేక వేదమంత్రాలను దర్శించింది. ఎందరో వేదాంత వేత్తలను వాదంలో గెలిచిన యాజ్ఞవల్క్యునికి ఆత్మానాత్మల విచారం గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి అనేక ప్రశ్నలను సంధించి గార్గి ఆయనను ముప్పుతిప్పలు పెట్టింది. గొప్ప విజ్ఞాని ఉభయభారతి: మధ్యయుగంలో తత్వవేత్త, మీమాంస, అద్వైత దర్శనాలలో ప్రవీణుడైన మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి ఒక గొప్ప విజ్ఞాని. శ్రీ ఆదిశంకరాచార్యులకు, మండనమిశ్రునికి మధ్య జరిగిన అద్వైత సిద్ధాంత సంబంధిత వాదోపవాదాలకు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. పక్షపాత రహితంగా ఆ వాదనలలో తన భర్తను కాక, ఆదిశంకరులనే విజేతగా ప్రకటించిన విదుషీమణి ఆమె.ఆళ్వార్ ఆండాళ్: ఇంకా ఆ యుగంలో ‘తిరుప్పావై’ అనే భక్తి గీతాలను వ్రాసిన మొదటి మహిళా ఆళ్వార్ అండాళ్. స్త్రీ స్వేచ్ఛ, వ్యక్తిత్వంపై కవితలు వ్రాసిన కర్నాటకలోని శివ భక్తురాలు అక్క మహాదేవి. రాజస్థాన్ లోని కృష్ణ భక్తురాలు, సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన కవయిత్రి మీరాబాయి, సరళ భాషలో వేదాంతపరమైన నిగూఢార్థాలు చాటిచెప్పిన తత్వవేత్త లాలాదేవి, గ్రామీణుల సాధారణ జ్ఞానాన్ని వేదాంత విజ్ఞానంతో అనుసంధిస్తూ రచనలు చేసిన తమిళ కవయిత్రి అవ్వయ్యార్, ఇంకా సక్కుబాయి, ముక్తాబాయి, మదాలస, ఈ మధ్యకాలంలో తరిగొండ వెంగమాంబ, ఆదోని లక్షమ్మ, జిల్లెళ్ళమూడి అనసూయమ్మ మొదలైన యోగినులు, అంతర్బుద్ధి సిద్ధులైన మహిళలు ఎందరో ఉన్నారు.విజ్జిక: దండి మహాకవి తన ఒక రచనలో సరస్వతీ దేవిని తెలుపు దేహరంగు చ్ఛాయ కలదిగా వర్ణించాడు. విజయాంబిక (విజ్జిక) అనే కవయిత్రి నలుపురంగుతో ఉండేది. ఆమె దండి అభిప్రాయాన్ని ప్రతిఘటించింది. నల్లని దేహకాంతిగల అపర సరస్వతినైన నా గురించి తెలుసుకోకుండా సరస్వతి ధవళవర్ణిని అని దండికవి ఎలా అంటాడని ఆమె ప్రశ్నించింది. స్త్రీల ఆత్మవిశ్వాసానికి విజ్జిక ఒక ప్రతీక. ఇంకా గంగాదేవి, తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల వంటి కవయిత్రులు రసవత్తర కావ్యాలు వెలువరించి పురుషులతో సమానంగా నిలిచినవారే.ఆధ్యాత్మిక వేత్త గౌతమి: బౌద్ధయుగంలో గౌతమ బుద్ధుని పెంపుడు తల్లి అయిన మహా ప్రజావతి గౌతమి ఒక ఆధ్యాత్మికవేత్త. ఆమె కాక బౌద్ధ వేదాంత ధ్యాన సన్యాసినులు ఖేమ, ఉప్పలావన, రెండవ భాస్కరుని కూతురైన లీలావతి వంటి ఆధ్యాత్మిక వేత్తలైన స్త్రీలుండేవారు. – డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
చీకటి – వెలుగులు
సాఫ్ట్వేర్ రంగంలో ‘నైట్ డ్యూటీ’ అనే మాట వింటూనే ఉంటాం. బతుకు పోరాటంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్లను ఊడ్చే మహిళా స్వీపర్లూ రాత్రిపూటే విధులను నిర్వర్తిస్తుంటారు. సికింద్రాబాద్లోని రేతిఫైల్ బస్ స్టేషన్ పరిసరాలలో రాత్రి రెండు గంటల సమయంలో రోడ్లను ఊడుస్తూ కనిపించింది కంతి రాణి. కాసేపు ఆమెతో మాట కలిపితే ఒంటిచేత్తో బతుకుబండిని ఎలా లాక్కొస్తుందో ఇలా మన ముందు ఆవిష్కరించింది..‘‘కష్టాలు వచ్చాయని ఆగిపోతమా? చావో బతుకో తేల్చుకోవాలి. రాత్రిపూట రోడ్లమీద పని అంటే మాకు భయమే ఉంటుంది. కానీ, బతుకు భయం అంతకన్నా పెద్దది. అందుకే, ధైర్యంగానే ఈ పని చేస్తుంటాం. రాత్రి ఏడు గంటలకు డ్యూటీలో చేరితే, మళ్లా తెల్లారి ఐదున్నర అయితది డ్యూటీ దిగేసరికి. ఇంటికి చేరేసరికి ఏడు గంటలు. రాత్రంగా రోడ్లు ఊడ్చి ఊడ్చి దుమ్ము కొట్టుకుపోయి ఉంటాం. అందుకని, ముందుగా స్నానం చేసి, ఇంటి పనులు చేసుకొని, ఇంట్ల వాళ్లకు ఇంత వండిæపెట్టి, నేను తిని, పగటేల పన్నెండు గంటలకు పడుకుంట. మళ్లా సాయంకాలం ఐదు గంటలకు లేచి, పనులు చేసుకొని, ఏడు గంటలకు డ్యూటీకి పోత. పదహారేళ్లుగా ఇదే నా పని.. ఒంటి చేతి కష్టమే!మా ఊరు జనగాం దగ్గర వెలిగొండ. చిన్నతనంలోనే మా అమ్మనాయన నాకు పెండ్లి చేశారు. మా అమ్మనాయనకు ముగ్గురు ఆడపిల్లలం, ఓ మగపిల్లాడు. నా భర్త పేరు జక్రయ్య. మా నాయిన సొంత అక్క కొడుకు. చిన్నప్పుడు బావిలో పడి, ఓ కాలు పనిచేయదు. ‘కాలు సరిగా పనిచేయని వాడిని ఎవరూ పెండ్లి చేసుకోరు’ అని నన్ను ఇచ్చి పెళ్లి చేసిండు మా నాయిన. నా పెళ్లి నాటికి నాకు పదిహేనేండ్లు కూడా లేవు. ఊళ్లో కొన్నాళ్లు ఉన్నం. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిండ్రు. బతుకుదెరువు కష్టమైతే హైదరాబాద్ వచ్చినం. మొదట హౌజింగ్ బోర్డ్ ఏరియా లో ఉండేవాళ్లం. అక్కడే ఉప్పర్ పనికి పోయిన, ఇండ్లల్ల పనిచేసిన. మా ఆయన పనికెళితే, పడిపోయేటోడు. దీంతో నేనే ఆయన్ని ఇంట్లో ఉంచి, పిల్లలను స్కూల్కు పంపించి, పనికి పోయేదాన్ని. ఆ తర్వాత తెలిసినవాళ్ల ద్వారా స్వీపర్ పనిలో చేరిన. అప్పుడు యాప్రాల్లోని బాలాజీ నగర్కి వచ్చి, ఇల్లు తీసుకొని ఉన్నం. పిల్లలను పదోతరగతి వరకు చదివించిన. ఆ తర్వాత పెండ్లిండ్లు చేసిన. అన్నీ ఒంటి చేత్తోనే. కలిగిన దాంట్లో సాయం...మా అక్కచెల్లెళ్ల లో ఒక చెల్లెలికి, భర్త చనిపోయి మస్తు కష్టపడుతుంది. తమ్మునికి ముగ్గురు ఆడపిల్లలు. తమ్ముడికి ఆరోగ్యం బాలేక చనిపోయాడు. దీంతో మా మరదలు పిల్లలను పెంచడానికి మా లెక్కనే కష్టపడుతుంటది. అందుకని నాకు కలిగినదాంట్లో వాళ్లకు సాయం చేస్తుంటాను. పిల్లల పెండ్లిండ్లకు అప్పు అయ్యింది, మెల్లగా తీర్చుకుంటున్న. పండగలొస్తే మహా కష్టం..బోనాలు, వినాయక చవితి, జెండా పండగల సమయాలలో, పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు .. చాలా పని ఉంటది. ఎంతంటే... మాపని ఘోరం అని చెప్పచ్చు. గుడుల దగ్గర, స్టేషన్, ట్యాంక్బండ్.. వేరే వేరే చోట్లల్లా డ్యూటీ ఉంటుంది. ఆ రోజుల్లో చెత్త చానా ఎక్కువ ఉంటుంది. ఊడ్చి ఊడ్చి చేయి రెక్కలు బాగా నొప్పి పెడతాయి. ప్రాణాలు అరచేతిలోనే..యాక్సిడెంట్లు అవుతుంటాయి. అర్థరాత్రి దాటిందంటే ట్రాఫిక్ ఉండదు కదా! బండ్లు, వ్యానులు మస్తు స్పీడ్గా పోతుంటయి. ఆ సమయంలో రోడ్డు దాటుతుండగా, ఊడుస్తుండగా యాక్సిడెంట్లు అయినయి. మా గ్రూప్లోనే నలుగురైదుగురు చనిపోయారు. పానాలు అరచేతిలో పెట్టుకొని పనులు చేస్తుంటాం. ఇది కాకుండా తాగినోళ్లు ఉంటారు. తాగి, రోడ్డు పక్కనే పడిపోయిన వాళ్లు ఉంటారు. వాళ్లను జరగమంటే.. ఆ మత్తులో గలీజు మాటలు అనేటోళ్లు ఉంటారు. తిడుతుంటరు. మీద మీదకు వస్తుంటరు. పోలీసులు ఉంటారు. కానీ, రోజూ వాళ్లకు ఎన్నని చెబుతం. అందుకే, అలాంటోళ్ల నుంచి దూరంగా ఉంటూ మా పని మేం చేసుకుంటూ పోతుంటం. బతుకుదెరువు కోసం తప్పదు, అన్నీ భరిస్తాం. మా గ్రూప్లో పదిహేను మంది దాకా ఉంటాం. అందరివీ సమస్యలే. నెలకు నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. అంతకు మించి ఒక్కరోజు సెలవు తీసుకున్నా జీతం కట్ అవుతది. నెలంతా ఊడ్చితే పదివేల రూపాయల దాకా వస్తాయి. అందులోనే అన్నీ సర్దుకుంటాం. ఇప్పుడంటే నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. చిన్న చిన్న పిల్లలున్న తల్లుల కష్టం ఇంకా పెద్దది.ఒకరికి ఒకరం... మా గ్రూప్ వాళ్లం కలిసినప్పుడు ఒకరి కష్టాలు ఒకరం చెప్పుకుంటాం. కానీ, ఎవరి కష్టాలు వారివే. ఊడ్చి ఊడ్చి మెడలు గుంజుతాయి. మళ్లీ ఇంటికొచ్చి పనులు చేసుకోవాలి. ఈ పనిలో చేరిన కొత్తలో చేతనైంత కాలం పని చేసుకోవచ్చు అన్నారు. కానీ, అరవై ఏళ్లు దాటినవాళ్లు పని నుంచి దిగిపోయారు. వాళ్లకు పెన్షన్ ఏమీ లేదు. కానీ, వాళ్ల ఇంట్ల బిడ్డకో, కొడుకుకో మళ్లీ స్వీపర్ పని ఇస్తరు’ అంటూ రాత్రిళ్లు రోడ్లు ఊడ్చే పనుల్లోని చీకట్లను, బతుకులో నింపుకుంటున్న వెలుగును పంచుకుంది రాణి. – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
ఆఫీసులో పని ఒత్తిడి... కుటుంబ సభ్యులపై కోపం
రోజంతా ఆఫీసులో బాస్ మాటలు, డెడ్లైన్ల ఒత్తిడి.. ఈ కోపాన్నంతా లోపలే దాచుకుని సాయంత్రం ఇంటికి వస్తారు. తలుపు తీయగానే పిల్లలు ఏదో అడిగితేనో, భార్య చిన్న ప్రశ్న అడిగితేనో ఒక్కసారిగా పేలిపోతారు. మరుక్షణమే "ఎందుకు అంత కోప్పడ్డాను?" అని గిల్టీగా ఫీల్ అవుతారు. దీన్ని Displaced Aggression అంటారు. అంటే, ఆఫీసులో ఎవరినీ ఏమీ అనలేక, ఆ కోపాన్నిఇంట్లో చూపించడం. దీనివల్ల ఇంట్లో ప్రశాంతతే కాదు, కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటాయి.కుటుంబం మీదే ఎందుకు?ఆఫీసులో మీకు కోపం తెప్పించిన బాస్ను మీరు తిరిగి ఏమీ అనలేరు. ఎందుకంటే అది మీ కెరీర్కు ప్రమాదం. కానీ, ఆ కోపం ఎక్కడో ఒకచోట బయటకు రావాలి. అందుకే, అత్యంత సురక్షితమైన ప్రదేశం.. అంటే మీ ఇల్లు, మీ కుటుంబ సభ్యులు ఆ కోపానికి బలవుతారు. ఇది బలహీనత కాదు, ఒక రకమైన 'ఎమోషనల్ బ్లీడింగ్'.నా దగ్గరికి వచ్చిన రమేష్ (పేరు, వివరాలు మార్చాను) ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజర్. ఆఫీసులో పాలిటిక్స్ వల్ల అతను తీవ్ర ఒత్తిడిలో ఉండేవాడు. ఇంటికి రాగానే అతని భార్య కబుర్లు చెప్పేది. కానీ అతను వినలేకపోయేవాడు. "నాకు ఆఫీసులో తలనొప్పి చాలదు అన్నట్టు, ఇంటికి రాగానే నీ నసేంటి" అని గట్టిగా అరిచేవాడు. ఆ మాటలు అతని భార్యను ఎంతగానో బాధించేవి. రమేష్ తన కోపాన్ని ఆఫీసులో వదిలేయకుండా, ఇంటికి కూడా తెచ్చుకోవడమే అసలైన సమస్య.కుటుంబానికి విముక్తి ఎలా? 1. Decompression Period: ఆఫీసు నుండి ఇంటికి వెళ్లిన వెంటనే కుటుంబంతో కలవకండి. ఒక 15-20 నిమిషాలు మీ కోసం కేటాయించండి. స్నానం చేయడం, కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం, సంగీతం వినడం చేయండి. ఇది ఆఫీసు ఒత్తిడిని మీ మనసు నుండి తొలగిస్తుంది.2. Voice Out: మీ మనసులో ఆఫీసు పట్ల ఉన్న అసహనాన్ని ఇంట్లో చెప్పకండి. దానికి బదులు, ఇంటికి వచ్చే దారిలో ఒక మంచి ఫ్రెండ్తో మాట్లాడండి లేదా ఆఫీసులో జరిగిన కోపాన్ని ఒక డైరీలో రాసి పెట్టండి. అది మీలోని కోపాన్ని తగ్గించే 'వెంటిలేషన్' లా పనిచేస్తుంది.3. ఫోన్/మెయిల్ ఆఫ్ చేయండి: ఇంటి గుమ్మం తొక్కే ముందే మీ ఫోన్ లోని ఆఫీస్ యాప్స్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటే, మీరు ఫిజికల్ గా ఇంట్లో ఉన్నా, మెంటల్ గా ఆఫీసులోనే ఉంటారు.4. "ఐ యామ్ స్ట్రెస్డ్" అని చెప్పండి: "ఈరోజు ఆఫీసులో చాలా ఒత్తిడి ఉంది, నాకు కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకండి" అని ఇంట్లో వాళ్లకు చెప్పడంలో తప్పులేదు. ఇది మీ కోపాన్ని అరిచే వరకు వెళ్ళకుండా ఆపుతుంది.5. కుటుంబమే మీ శక్తి: కోపం వస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి.. "ఈరోజు నేను కష్టపడి పనిచేసింది ఎవరి కోసం? నా కుటుంబం కోసమే కదా!" అప్పుడు ఆ కుటుంబ సభ్యుల మీద కోపం రాదు, ఒక రకమైన కృతజ్ఞత కలుగుతుంది.మీ కోసం ఒక చిన్న పరీక్ష...ఈ సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి: "నేను ఇప్పుడు నా ఆఫీసు కోపాన్ని నా వాళ్లకు బహుమతిగా ఇస్తున్నానా? లేక నా ప్రేమను ఇస్తున్నానా?"కెరీర్లో గెలవడం ఎంత ముఖ్యమో, మనసున్న మనుషుల ప్రేమను గెలుచుకోవడం అంతకంటే ముఖ్యం. గుర్తుంచుకోండి.. ఆఫీసు మీ శ్రమను అడుగుతుంది, కానీ కుటుంబం మీ చిరునవ్వును, మీ సమయాన్ని కోరుకుంటుంది. ఆఫీసు కోపాన్ని ఆఫీసులోనే వదిలేయండి, సంతోషాన్ని ఇంటికి తీసుకెళ్లండి.సైకాలజిస్ విశేష్కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
హార్ట్బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!
పుట్టుకతో వచ్చే రెండు రకాల గుండె లోపాలతో జన్మించిన కార్షియాక్ స్పెషలిస్ట్ అయినా ఆ మహిళ అలుపెరగని పోరాటం చేసి మరి జీవిస్తోందామె. ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్లు చేయించుకున్నా ఆశా అనే జ్యోతిని వెలిగిస్తూ..తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ప్రాణాంతకమైన ఆ గుండె పరిస్థితిని మందులతో నిర్వహిస్తూనే ఆరోగ్యకరంగా జీవిస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య పరిస్థితికి కుంగిపోయే వారికి ఆమె కథ ఓ ప్రేరణపుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మించిన కార్డియాక్ స్పెషలిస్ట్ ఏంజెలికి అసిమాకి ఇంటర్మెటెంట్ ఏవీ బ్లాక కారణంగా 14 సెకన్లపాట్లు గుండె ఆగిపోయే పరిస్థితితో పోరాడుతోందామె. ప్రాణాంతకమైన పరిస్థితిలో పోరాడుతున్న ఆమెకు సరిగ్గా 36 ఏళ్ల వయసులో వచ్చిన స్ట్రోక్ మరోసారి కుప్పకూలిపోయేలా చేసింది. అప్పుడే తెలిసింది ఈ ప్రాణాంతక పరిస్థితికి తోడు గుండెలో "గ్యాపింగ్ హోల్" కూడా ఉందని నిర్థారణ అయ్యింది. ఆమెది ఆకస్మిక కార్డియాక్ మ సంబంధం ఉన్న పరిస్థితికి ఇది మరింత ప్రమాదకరమైన సంకట స్థితి.ఎప్పటి నుంచి పోరాడుతోందంటే..25 ఏళ్ల వయసులో ఏంజెలికీ తొలిసారిగా తనకు గుండెజబ్బుకి సంబంధించిన లక్షణాలు తొలిసారిగా కనిపించాయని చెప్పుకొచ్చింది. నెమ్మదిగా తలతిరడం నుంచి మొదలై నెలలుగా మూర్చపోయే వరకు దారితీసింది. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర లేకపోయినా..ఆమె ప్రాణాంతక గుండెజబ్బు బారినపడింది. పలు వైద్య పరీక్షల అనంతరం ఆమె హృదయస్పందన నిమిషానికి 120 బీట్స్ దాటినప్పుడల్లా ఆమె గుండె 14 సెకన్ల వరకు ఆగిపోతుందని వైద్యులు నిర్ధారించారు. దీని కారణంగా గుండెలో "పై నుంచి దిగువ గదులకు విద్యుత్ ప్రవహించదు, కాబట్టి ఆమెకు పేస్మేకర్ అవసరం. ఈ తీవ్రమైన గుండె జబ్బు గురించి వినడంతోనే ఏంజెలి ఇక తన జీవితం ముగిసిపోయిందనుకుంది. ఎందుకంటే బెడరూమ్ నుంచి బాత్రూమ్ వరకు కూడా వెళ్లలేనంతగా స్ప్రుహతప్పి పడిపోయేది. ఆ తర్వాత ఏంజెలికి ఫేస్మేకర్ని అమర్చారు. 1990లలో ఈ యంత్రంలో అనేక సమస్యలతో రావడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి ఆమెకు. ముఖ్యంగా బ్యాటరీలను నిరంతరం మార్చాల్సి వచ్చేది. ఆ క్రమంలో మెదడులోని రక్తనాళం పగిలి రక్తస్రావం కావడంతో స్ట్రోక్ను ఎదుర్కొంది. దాంతో ఆమెకు ఓపెన్-హార్ట్ సర్జరీతో సహా ఐదు ఫేస్మేకర్లు, మూడు అబ్లేషన్ల, ఒక ఓపెన్-హార్ట్ సర్జరీతో సహ తొమ్మిది వైద్య చికిత్సలు తీసుకుంది. ఇలా ఆమె జీవితాంతం ఇన్ని అనారోగ్య సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ..లండన్ నుండి కార్డియోమయోపతిలో పిహెచ్డి పూర్తి చేసింది, తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్ చేసింది, అక్కడ ఆమె ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది,. అలాగే అమెరికాలో 11 ఏళ్లు గడిపింది. అంతేగాదు ఏంజెలి తనలాంటి గుండె సమస్యతో బాధపడుతున్న వారికోసం..ఆ వ్యాధి నిర్థారణ పర్యవేక్షణ కోసం..ఒక పద్ధతిని ఆవిష్కరించింది. ఇది ప్రమాదకరమైన గుండె బయాప్సీలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఇక ఏంజెలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదీగాక ఏంజెలి పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కారణంగా అనేక గర్భస్రావాలను ఎదుర్కొని మరి..ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారామె. అయితే ఆ పిల్లలు ఇద్దరు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యల లోపాన్ని అధిగమించడమే కాకుండా దాన్నే తన కెరీర్గా ఎంచుకుని..ఆ సమస్యకు చెక్పెట్టే దిశగా అడుగులు వేయడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం.(చదవండి: ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..) -
కట్టుకున్నవాళ్లనే కడతేర్చే కర్కశత్వానికి రీజన్ అదేనా..!
నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న ఇలాంటి హత్యోదంతాలు సమాజంలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఘర్షణలు చినికి చినికి గాలివానగా మారి హత్యలకు దారితీస్తున్నాయి. కలకాలం కలిసిమెలిసి బతుకుతామని ప్రమాణం చేసిన వారే, కాలం గడిచే కొద్దీ ఒకరికొకరు శత్రువులుగా మారిపోతున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు ఒక మేనియాగా మారింది. మద్యం, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల మాదిరిగా ఈ మహమ్మారి నిండుజీవితాలను కబళిస్తోంది. సామాజిక మాధ్యమ వేదికలపై ఏర్పడే పరిచయాలు, సరికొత్త ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలకు ఇవి వాహకాలుగా పనిచేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిన భార్యాభర్తలు క్రమంగా భావోద్వేగాలు పంచుకోలేక క్రమంగా ఆ బంధానికి దూరమవుతున్నారు. దీంతో ఆ స్థానంలోకి కొత్త వ్యక్తులు చేరుతున్నారని, దాంపత్య జీవితాల్లో కల్లోలం మొదలవుతుందని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సంహిత చెబుతున్నారు. ‘నేను, నా సుఖ సంతోషాలు, నా ఆనందం, నేను కోరుకున్న, నాకు ఇష్టమైన జీవితం.. అనే భావన ఒక నార్సిస్ట్ ధోరణికి దారితీస్తోంది. ఈ తరహా మానసిక ప్రవర్తన కారణంగానే కొత్త వ్యక్తులకు దగ్గరై సొంత మనుషులను దూరం చేసుకుంటున్నారని, అవసరమైతే వారిని అంతమొందించేందుకు కూడా వెనుకాడడం లేదని చెప్పారు. అస్తిత్వ పోరాటం.. మరోవైపు ఈ ప్రవృత్తి ఉన్నవారిలో ఐడెంటిటీ క్రైసిస్ భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. ఇతరులు తమను గుర్తించాలనే సంక్షోభంలో కొట్టుకుపోతున్నారు. ‘నిరంతరం తాము ఇతరులను ఆకర్షించాలని కోరుకుంటారు. తమను చూసినప్పుడు ఎదుటివారిలో ఎగ్జైట్మెంట్ కలగాలని భావిస్తారు. సోషల్ మీడియాలోని ఫాంటసీ కంటెంట్, థ్రిల్లర్ కంటెంట్ అలాంటి భ్రమలను సృష్టిస్తాయి. దీంతో కొత్త వ్యక్తులకు దగ్గరైన కొద్దీ సొంతవాళ్లకు దూరమవుతున్నారు.’ అని మరో మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ఒక రహస్య జీవితానికి అవకాశం కల్పిస్తోంది. ఆ రహస్య జీవితంలోపడి చాలా దూరమే కొట్టుకుపోతున్నారు. ఇది క్రమంగా హింసా ప్రవృత్తికి దారితీస్తుందని పేర్కొన్నారు. ‘రెడ్ఫ్లాగ్స్’ ధోరణి.. వివాహేతర సంబంధాలతో రహస్య జీవితానికి అలవాటుపడిన వాళ్లు కుటుంబం నుంచి విడిపోయేందుకు ‘రెడ్ఫ్లాగ్స్’ ధోరణిని అనుసరిస్తారు. అంటే తమ రహస్య జీవితంలోకి ఇతరులు ప్రవేశిస్తారేమోనన్న అభద్రతా భావంతో భార్యాభర్తలు ఒకరినొకరు దూరం పెట్టేస్తారు. చివరకు తమ వస్తువులను తాకినా, ఫోన్ ముట్టుకున్నా భరించలేరు. ఒకరిపై మరొకరికి ద్వేషం పెరుగుతుంది. ఎలా అయినా వాళ్ల నుంచి దూరం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలనే మానసిక నిపుణులు ‘రెడ్ఫ్లాగ్స్’గా పరిగణిస్తున్నారు. నచ్చిన చాక్లెట్ తిన్నట్లుగా, నచ్చిన సినిమా చూసినట్లుగా ‘ఐ నో వాట్ ఐ వాంట్’ అనే భ్రమలో ఎలాంటి దుస్సాహసానికైనా తెగిస్తున్నారు. కట్టుకున్నవారిని కడతేర్చడం ద్వారా ఫ్రీడమ్ లభిస్తుందనే భావనతో జీవితకాల శిక్షను అనుభవిస్తున్నారు. పెళ్లి కాంట్రాక్ట్ కాదు.. భార్యాభర్తల బంధాల్లో మూడో వ్యక్తి ప్రమేయం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లిని ఒక కాంట్రాక్ట్గా భావించే స్వభావం వల్లనే ఇలాంటి పెడధోరణులు చోటుచేసుకుంటున్నాయి. అనైతిక సంబంధాలను సమర్థించే విధంగా వస్తున్న సినిమాలు, రీల్స్, వెబ్సిరీస్లు సమాజాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నాయి. జీవితం పట్ల సానుకూల దృక్పథం కొరవడుతోంది. మితిమీరిన అహం వల్ల హత్యలకు పాల్పడుతున్నారు. – మమతా రఘువీర్, సామాజిక కార్యకర్త సానుకూల దృక్పథం ఉండాలి.. నార్సిస్ట్ ప్రవృత్తి తొలగిపోవాలంటూ ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవనశైలిని, చక్కటి సాంస్కృతిక, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. భార్యాభర్తలుగా పాటించవలసిన ధర్మాన్ని, బాధ్యతలను గుర్తించాలి. మొదట అన్ని రకాల సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టి, పెడధోరణుల నుంచి బయటపడేందుకు సొంతవాళ్లతో ఎక్కువ సమయం గడపాలి. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. కానీ అడిక్ట్ కావొద్దు. – డాక్టర్ సంహిత, సీనియర్ సైకియాట్రిస్ట్ (చదవండి: తరచుగా కళ్లను రుద్దితో..డార్క్ సర్కిల్స్ వస్తాయా..?) -
తరచుగా కళ్లను రుద్దితో..డార్క్ సర్కిల్స్ వస్తాయా..?
నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. నేను ఉద్యోగం వల్ల రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండాల్సి వస్తోంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్తో పాటు స్వల్పంగా వాపు కూడా వస్తోంది. అలాగే నాకు అలర్జీ సమస్య ఉంది. తరచుగా కళ్లను రుద్దుకుంటూ ఉంటాను.కవిత, విశాఖపట్నంఈ రోజుల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్, వాపు చాలామందిలో కనిపిస్తున్న సాధారణ సమస్య. ముఖ్యంగా ముప్పై ఏళ్ల తర్వాత జీవనశైలి మార్పులు, పని ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ అంటే ఆ భాగంలో చర్మం రంగు మారడం, నీడలా కనిపించడం లేదా లోతుగా కనిపించడం వల్ల ముఖం అలసినట్టు లేదా వయస్సు ఎక్కువగా ఉన్నట్టు అనిపించడం. ఇవి సాధారణంగా ఒకే ఒక్క కారణం వల్ల కాకుండా అనేక కారణాల కలయిక వల్ల వస్తాయి. మీ విషయంలో రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం, సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి, మొబైల్, ఇతర స్క్రీన్లను ఎక్కువగా ఉపయోగించడం వంటి జీవనశైలి కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అదనంగా అలర్జీ సమస్య ఉండటం, తరచుగా కళ్లను రుద్దుకోవడం కూడా డార్క్ సర్కిల్స్ను పెంచుతాయి. ముక్కు అలర్జీ లేదా సైనస్ సమస్యల వల్ల కళ్ల చుట్టూ రక్తప్రసరణ మారి నీలం లేదా ఊదా రంగులో వలయాలు కనిపించవచ్చు. తరచు రుద్దుకోవడం వల్ల చర్మంలో మెలనిన్ పెరిగి గోధుమరంగు పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. కొందరిలో కుటుంబ చరిత్ర, చర్మం పలుచగా ఉండటం లేదా కళ్లు లోతుగా ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని కొలాజెన్ తగ్గి చర్మం వదులుగా మారుతుంది. దాంతో లోపలి రక్తనాళాలు స్పష్టంగా కనిపించి కళ్ల కింద నీలి ఛాయ పెరుగుతుంది.కళ్ల కింద డార్క్ సర్కిల్స్ అన్నీ ఒకే రకంగా ఉండవు. కొందరిలో గోధుమరంగు పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. కొందరిలో చర్మం పలుచగా ఉండడం వల్ల నీలం లేదా ఊదా రంగు రక్తనాళాలు కనిపిస్తాయి. మరికొందరిలో కంటి కింద లోతు ఉండటం వల్ల నీడలా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొవ్వు నిల్వ కావడం వల్ల వాపు లేదా బ్యాగ్స్ రూపంలో కనిపిస్తుంది. చాలా మందిలో ఇవన్నీ కలిసిన రూపం ఉంటుంది. అందుకే సరైన చికిత్స కోసం ముందుగా కొన్ని పరీక్షలు చేయించుకోవటం అవసరం. ఈ పరీక్షల్లో చర్మం రంగు, లోతు, వాపు, అలర్జీ లక్షణాలు వంటి అంశాలను పరిశీలిస్తాం. అవసరమైతే హీమోగ్లోబిన్, ఐరన్, విటమిన్ బి12, థైరాయిడ్ పరీక్షలు కూడా సూచిస్తాం. అయితే, చికిత్స కంటే ముందుగా జీవనశైలిలో మార్పులు చేయటం అవసరం. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. రాత్రిపూట అవసరం లేకుండా మేల్కొని ఉండకూడదు. కళ్లను రుద్దుకోవడం మానుకోవాలి. అలర్జీకి సరైన చికిత్స తీసుకోవాలి. చల్లని కంప్రెషన్ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం, సమతుల్యాహారం తీసుకోవడం వల్ల మంచి మెరుగుదల కనిపిస్తుంది. అయినప్పటికీ సమస్య ఎక్కువగా ఉంటే పరిస్థితిని బట్టి ప్రత్యేక చికిత్సలు సూచిస్తాం. సన్స్క్రీన్, విటమిన్ సి, తక్కువ శక్తి గల రెటినాయిడ్ను రాత్రిపూట వాడటం, కొజిక్ లేదా అజెలాయిక్ ఆమ్లం వంటి పిగ్మెంటేషన్ తగ్గించే క్రీములు ఉపయోగించడం చేస్తాం. అవసరమైన సందర్భాల్లో కెమికల్ పీల్స్ చేస్తాం. లోతు ఎక్కువగా ఉన్నవారిలో హయాలురోనిక్ ఆమ్ల ఫిల్లర్లు లేదా పీఆర్పీ చికిత్స ఉపయోగపడుతుంది. పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటే లేజర్ చికిత్సలు, రక్తనాళాలు స్పష్టంగా ఉంటే ప్రత్యేక లేజర్ విధానాలు, చర్మం వదులుగా ఉంటే చర్మాన్ని గట్టిపరచే చికిత్సలు కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి సమస్యలకు ఇంటి చిట్కాలు మాత్రమే పూర్తిగా సరిపోవు. స్టెరాయిడ్ కలిగిన ఫెయిర్నెస్ క్రీములను తప్పకుండా నివారించాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఒకే ఒక్క వ్యాధి కాదు, అనేక కారణాల సంకేతం. పూర్తిగా మాయం కావడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాకపోయినా, సరైన నిర్ధారణతో వ్యక్తిగతంగా అనుకూలమైన చికిత్సను నిపుణుల పర్యవేక్షణలో తీసుకుంటే గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. డా. ఇందిర పవన్ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ (చదవండి: స్మార్ట్ ఫోన్లు వద్దు..ల్యాండ్లైన్ ఫోన్లే ముద్దు..!: పేరెంట్స్) -
స్మార్ట్ ఫోన్లు వద్దు..ల్యాండ్లైన్ ఫోన్లే ముద్దు..!: పేరెంట్స్
ప్రస్తుతం తల్లిదండ్రులకు ఈ జెనరేషన్ పిల్లలను పెంచడం బహుకష్టం. ఎందుకంటే స్మార్ట్ఫోన్లకు చిన్నప్పటి నుంచి అడిక్ట్ అయిపోతున్నారు ఈ తరం పిల్లలు. జస్ట్ మూడేళ్ల పిల్లలే స్మార్ట్ఫోన్ అంటూ పేచీలు, మారాంలు..అది ఇస్తే గానీ కుదురుగా ఉండరు. పైగా సాంకేతిక ప్రభావం చిన్నప్పటి నుంచి వారిపై ఉండటంతో సరిగా చదువుతారనే బెంగ ఎక్కువైపోతోంది తల్లిదండ్రుల్లో. పైగా రీల్స్ పిచ్చిలో..ఇన్ఫ్లుయెన్స్ర్ అవుతాననే అంటున్నారు తప్ప..ఇదివరకటి పిల్లల్లా ఇంజనీర్, డాక్టర్ అని చెప్పడం లేదు. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు అమెరికాలోని తల్లిదండ్రులు ఎలాంటి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారో తెలుసా..!?..అదేంటో తెలిస్తే కంగుతింటారు. చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వడానికి ప్రత్యామ్నాయంగా అమెరికాలో చాలా కుటుంబాలు తిరిగి ల్యాండ్లైన్ టెలిఫోన్లను ఇన్స్టాల్ చేస్తున్నాయట. సోషల్మీడియాఎక్స్పోజర్, ఆన్లైన్ భద్రత, పట్ల తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ ధోరణి ఎక్కువైంది అక్కడ. కొన్ని కుటుంబాలు పిల్లల్లో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అందిపుచ్చుకోవడానికి ఈ ల్యాంఢ్లైన్ టెలిఫోన్ మంచివని, యాప్లు, ఇంటర్నెట్ వంటి వాటి సాయం లేకుండా మంచిగా నేర్చుకోగలరని ప్రగాఢంగా నమ్ముతున్నారట. ఇలా అయితేనే పరధ్యానం లేకుండాం మంచి సంభాషణా చాతుర్యం పెరుగుతుందంటున్నారు. ఈ ఫోన్లు కాన్ఫిడెన్స్గా మాట్లాడగలరిని, తల్లిదండ్రలులు అంటున్నారు. అంతేగాదు ఈ ల్యాండ్లైన్ ఫోన్ ద్వారానే మర్యాదగా సంభాషించడం, సమాధానం ఇవ్వడం తెలుసుకోగలరని, ఎవరితోనైనా మాట్లాడటానికి జంకరని చెబుతుండటం విశేషం. అదీగాక ఈ ల్యాండ్లైన్ ఫోన్ల వల్ల సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వరు, బాధ్యతయుతమైన డిజిటల్ ఉపయోగం ఎలా అనేది కూడా తెలుసుకుంటారని అంటున్నారు. అంతేగాదు అక్కడ సైకాలజిస్టులు సైతం తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలకు ఉపయోగకరమైన మీడియా ప్లాన్ రూపొందిచాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతుండటం విశేషం. పైగా ఈ ధోరణిని భద్రత తోపాటు మంచి అర్థవంతమైన కమ్యూనికేషన్ పిల్లలలో ఉండాలని ఆకాంక్షిస్తూ చేస్తున్న వినూత్న ప్రయోగమని అక్కడి నిపుణులు సైతం దీనికి మద్దతు తెలుపుతున్నారట. మరి ఇదెంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాల్సిందే కదూ..!.(చదవండి: బతుకు కోసం కాదు..గుర్తింపు కోసం చేసిన పోరాటం..!) -
పిల్లలకు భిక్షం వెయ్యని కుబేరులు!
ఆస్తులు పంచడం పాత పద్ధతి. ఆశయాలు పంచడం కొత్త ఒరవడి. పిల్లలకి ఆస్తులు ఇస్తే వాళ్లు సోమరిపోతులు అవుతారని, అదే, కష్టపడే తత్వాన్ని ఇస్తే ప్రపంచాన్నే జయిస్తారని నమ్మిన కొందరు బిలియనీర్ తల్లిదండ్రులు తమ సంపదను సంతానానికి కాకుండా, సమాజానికి రాసిచ్చేస్తున్నారు! ‘‘మీ బతుకు మీరు బతకండి’’ అని పిల్లలకు చేయూతకు బదులుగా ‘చెయ్యి’స్తున్నారు.అమ్మానాన్న కోటీశ్వరులైతే ఇక వాళ్ల పిల్లల లైఫ్ (వాళ్లింకా లైఫ్లోకి అడుగుపెట్టక ముందే) సెటిలైపోయినట్లే. కాని, కొంతమంది సెలబ్రిటీ కుబేరుల కథ ఇందుకు భిన్నంగా ఉంది. కోట్ల ఆస్తులున్నా.. కష్టపడితేనే డబ్బు విలువ తెలుస్తుందని, సామాన్యుల్లాగే తమ పిల్లలు కూడా జీవించాలని వారి ఆకాంక్ష. అందుకే, ఆస్తులన్నీ ట్రస్టులకో, మంచి పనులకో రాసిచ్చేసి.. ‘వారసత్వ ఆస్తి’ అనే పాత పద్ధతికి నీళ్లొదులుతున్నారు. ఈ జాబితాలో బిల్ గేట్స్, జాకీ చాన్, మెకెంజీ స్కాట్ వంటి మహామహులు ఉన్నారు.ఒక్క డాలరూ ఇవ్వలేదు!బిల్ గేట్స్ ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ బాస్. వరల్డ్ నెంబర్ వన్ రిచ్ డాడ్! ఆయన, మాజీ భార్య మెలిందా కలిసి టెక్ ప్రపంచాన్నే సమృద్ధం చేశారు. మరి వీళ్ల ముగ్గురు పిల్లల (కొడుకు, ఇద్దరు కూతుళ్లు) భవిష్యత్తు ఇంకెంత సమృద్ధిగా ఉండాలి? కానీ, అలా ఏం లేదు! రూ. 8,78,800 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నా.. వారత్వంగా ఒక్క డాలరు కూడా ఇచ్చేది లేదని పిల్లలకి వాళ్ల చిన్నప్పుడే క్లారిటీ ఇచ్చేశారు. ఆ డబ్బును ప్రపంచంలోని పేదరికాన్ని, రోగాల్ని తరిమికొట్టేందుకు ఉదారంగా ఇచ్చేస్తున్నారు. అలాగని మరీ ఖాళీ చేతులు చూపకుండా ముగ్గురు పిల్లలకీ తలా రూ.3 కోట్లు పాకెట్ మనీ రాసిచ్చారు! ‘‘పిల్లలకి కొండంత ఆస్తిని ఇచ్చేయటం వాళ్లకు చేసే మేలు కాదు.. అది వాళ్ల సొంత ఎదుగుదలకి అడ్డుగోడ అవుతుంది’’ – బిల్ గేట్స్ఆస్తి మొత్తం చారిటీకే!వారెన్ బఫెట్ పేరు వింటేనే ఇన్వెస్ట్మెంట్ ప్రపంచం గౌరవంతో లేచి నిలుచుంటుంది. సుమారు రూ. 13,37,430 కోట్ల ఆస్తి ఉన్నా, ఈయన లైఫ్ స్టెయిల్ మాత్రం బొత్తిగా మిడిల్ క్లాస్లో ఉంటుంది. 1958లో కేవలం 31,500 డాలర్లకు (రూపాయలలో ఆనాటి ధర రూ. 1 లక్షా 50 వేలు) కొన్న పాత ఇంట్లోనే ఇప్పటికీ ఆయన నివసిస్తున్నారంటే ఆయన సింప్లిసిటీ ఎంత ‘ఆడంబరంగా’ ఉందో అర్థం చేసుకోండి. తన ముగ్గురు పిల్లలకి (ఇద్దరు కొడుకులు, ఒక కూతురు) తలో రూ. 200 కోట్లు ఇచ్చేసి, మిగిలిన 99 శాతం ఆస్తిని చారిటీకి రాసిచ్చేస్తానని ఆయన ఎప్పుడో చెప్పేశారు. ‘‘నేను బతికున్నప్పుడైనా, చనిపోయాకైనా సంపద అంతా సమాజానికే’’ అని ప్రకటించారు. ‘‘నా పిల్లలకి ఇప్పటికే కావాల్సినంత ఇచ్చాను. వాళ్ల లైఫ్ వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇక ఈ అదనపు కోట్లు నాకెందుకు?’’ – వారెన్ బఫెట్ బాండ్ పేల్చిన బాంబ్సినిమాల్లో మాదిరిగానే ఖరీదైన కార్లు, అదిరిపోయే సూట్లు వేసుకుని తిరిగే ‘జేమ్స్ బాండ్’ డేనియల్ క్రెయిగ్, తన పిల్లలకి (ఇద్దరూ కూతుళ్లే) మాత్రం తన ఆస్తిని ఇచ్చే ప్రసక్తే లేదని గన్షాట్గా చెప్పేస్తున్నారు. సుమారు రూ. 1,450 కోట్ల ఆస్తి ఉన్నా సరే, ‘‘నేను పోయేలోపు నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసేస్తా.. లేదంటే దానం చేసేస్తా’’ అని వారసులపైనే బాంబు పేల్చారు మన బాండ్. కనుక ఆయన కూతుళ్లిద్దరికీ ఈ భారీ ఆస్తి దక్కే అవకాశం లేదు. పిల్లలు తమ సొంత కాళ్ల మీద నిలబడి సక్సెస్ అవ్వాలన్నదే క్రెయిగ్ తాపత్రయం. అందుకు తగ్గట్లుగానే ఆయన కూతురు ఎల్లా అప్పుడే మోడలింగ్లో తన మార్క్ చూపిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫోర్డ్ మోడల్స్ ఏజెన్సీలో చేరి, పెద్ద పెద్ద ఫ్యాషన్ మ్యాగజైన్ల కవర్ పేజీల మీద మెరిసిపోతోంది. ‘‘నాన్న నాకు బాట వేయకపోయినా.. నా దారి నేనే వేసుకుంటున్నా’’ అంటోంది. ‘‘వారసత్వంగా యావదాస్తినీ ముందే ఇచ్చేయటం నాకు నచ్చదు. వెళ్లేటప్పుడే అంతా ఇచ్చేయాలి లేదా అసలే ఇవ్వకుండా మానేయాలి’’ – డేనియల్ క్రెయిగ్కష్టపడితేనే కిక్కు‘స్టింగ్’ అనగానే మ్యూజిక్ అభిమానులకు ‘ఎవ్రీ బ్రీత్ యూ టేక్’ లాంటి అదిరిపోయే సాంగ్స్ గుర్తొస్తాయి. ఆయన అసలు పేరు మేథ్యూ థామస్ సమ్మర్. సుమారు రూ. 4,987 కోట్ల ఆస్తి వెనకేసిన ఈ మ్యూజిక్ లెజెండ్ వెనుక కనాకష్టంగా సాగిన ఒక గతం ఉంది. సెలబ్రిటీ అవ్వకముందు ఈయన బస్సు కండక్టర్గా, కూలీగా, ట్యాక్స్ క్లర్క్గా, టీచర్గా... ఇలా రకరకాల పనులు చేశారు. తన ఆరుగురు పిల్లలకి (నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు) కూడా కష్టమంటే ఏమిటో తెలియాలని వారసత్వంగా ఒక్క డాలర్ కూడా ఇవ్వకూడదని తీర్మానించుకున్నారు. సంతోషం ఏమిటంటే, స్టింగ్ పిల్లలు కూడా తండ్రి దగ్గర చేయి చాచకుండా, తమ సొంత కాళ్ల మీద నిలబడ్డారు. కూతురు మిక్కీ నటిగా రాణిస్తుంటే, కొడుకులు ఇలియట్, జో తండ్రి బాటలోనే మ్యూజిక్ ప్రపంచంలో దూసుకుపోతున్నారు. ‘‘కష్టపడితేనే సక్సెస్లో కిక్కు ఉంటుంది’’ అని అంటున్న ఈ ఫ్యామిలీ ఎంతైనా ‘రాకింగ్’ కదా!‘‘మా పిల్లలకి ముందే చెప్పేశా.. నేను చనిపోయే నాటికి పెద్దగా ఆస్తి ఏమీ మిగలదని. ఎందుకంటే ఉన్నదంతా నేనే ఖర్చు పెట్టేస్తున్నానని. అలాగే, వాళ్ల భుజాలపై ట్రస్ట్ ఫండ్స్ అనే భారాన్ని వేయడం నాకు ఇష్టం లేదు’’– ‘స్టింగ్’నాకు ప్రపంచం ముఖ్యంసుమారు రూ.5,14,600 కోట్ల ఆస్తితో ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న జుకర్బర్గ్, తన భార్య ప్రిసిల్లా చాన్తో కలిసి ఒక భారీ నిర్ణయం తీసుకున్నారు. 2015లో తన మొదటి కూతురు మాక్స్ పుట్టినప్పుడే.. ‘‘మా దగ్గర ఉన్న ఫేస్బుక్ షేర్లలో 99 శాతం (సుమారు రూ. 3,75,000 కోట్లు) విరాళంగా ఇచ్చేస్తాం’’ అని ప్రకటించారు. జుకర్బర్గ్ ఫిలాసఫీ కొంచెం ఎమోషనల్, కొంచెం టెక్నికల్! ‘‘మా పిల్లలు (ముగ్గురూ కూతుళ్లే) ఎదిగే లోపు ఈ ప్రపంచాన్ని ఇప్పుడున్న దానికంటే ఇంకా బెటర్గా మార్చాలి’’ అన్నది ఆయన తాపత్రయం. అందుకే ‘చాన్–జుకర్బర్గ్ ఇనీషియేటివ్’ ద్వారా 2100 కల్లా ప్రపంచంలో ఉన్న అన్ని రోగాలకి చెక్ పెట్టాలని ఈ దంపతులు కంకణం కట్టుకున్నారు. తన కూతురికి రాసిన ఓపెన్ లెటర్లో జుకర్బర్గ్ ఒక మాట చెప్పారు: ‘‘మేము నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి నీకు మాత్రమే కాదు.. రేపటి తరం పిల్లలందరికీ ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వడం మా బాధ్యత కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని. ‘‘మా పిల్లలకి వేల కోట్లు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును సెటిల్ చేయడం కంటే, అందరికీ సమానమైన అవకాశాలు ఉన్న ప్రపంచాన్ని సృష్టించటమే మా ధ్యేయం’’? – జుకర్బర్గ్ఎవరి దారి వారే వేసుకోవాలిమార్షల్ ఆర్ట్స్ కింగ్.. జాకీ చాన్. ‘రష్ అవర్’, ‘కరాటే కిడ్’ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ని సంపాదించుకున్న ఈ లెజెండ్ దగ్గర సుమారు రూ. 3,627 కోట్ల ఆస్తి ఉంది. కానీ, ఈ కుంగ్ఫూ మాస్టర్ తన పిల్లలకు (కూతురు, కొడుకు) చిల్లి డాలర్ కూడా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. 2011లోనే జాకీ చాన్ ఒక సంచలన ప్రకటన చేశారు: ‘‘నా ఆస్తిలో నా కొడుక్కి ఒక్క డాలర్ కూడా ఇవ్వను! దమ్మున్నవాడు తన దారి తనే వెతుక్కుంటాడు’’ అన్నారు. అందుకే తన ఆస్తినంతా చారిటీకే ఇచ్చేస్తున్నారు. ‘‘వాడికి (కొడుకు) గనుక సత్తా ఉంటే, వాడే సొంతంగా సంపాదించుకుంటాడు. ఒకవేళ వాడికి ఆ సత్తా లేకపోతే.. నేను ఇచ్చే డబ్బుని కూడా వాడు వృథాగా తగలేస్తాడు!’ – జాకీ చాన్ఇచ్చేదే లేదు..‘యాపిల్’ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ కన్నుమూశాక, ఆ భారీ ఆస్తి అంతా ఆయన భార్య లారె¯Œ కు దక్కింది. ప్రస్తుతం సుమారు రూ. 1,21,498 కోట్ల ఆస్తిపరురాలు ఆమె. కానీ, లారెన్ మాత్రం ఆ కోట్లను దాచుకోవడం కంటే, సమాజానికి పంచడానికే మొగ్గు చూపుతున్నారు. ‘ఎమర్సన్ కలెక్టివ్’ అనే సంస్థ ద్వారా విద్య, ఆరోగ్యం, పర్యావరణం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల మీద పోరాడటానికి ఏకంగా రూ. 29,050 కోట్లను కేటాయించారు. అయితే, తన ముగ్గురు (ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు) పిల్లలకి ఆస్తి ఇచ్చే విషయంలో ఆమె ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు... ఇవ్వకూడదని! ‘‘నా భర్తకి ఆస్తులు కూడబెట్టడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ఈ వారసత్వ ఆస్తుల మీద నాకు కూడా ఆసక్తి లేదు. ఆ విషయం నా పిల్లలకి కూడా తెలుసు. ఒకవేళ నేను సరిపడా కాలం బతికితే గనుక.. ఈ ఆస్తి ప్రవాహం నా దగ్గరే ఆగిపోతుంది. నా తర్వాతి తరానికి దీన్ని మోసుకెళ్లనివ్వను’’ – లారెన్ పావెల్ జాబ్స్చిన్న చిన్న సంస్థలకు ఇస్తా..లాకర్ ఖాళీ అయ్యే వరకు ఇచ్చేస్తూనే ఉంటా అంటున్నారు మెకెంజీ స్కాట్. జెఫ్ బెజోస్తో విడాకుల తర్వాత అమెజాన్ షేర్లలో పాతిక శాతం మెకెంజీకి దక్కాయి. ఆ లెక్కన చూస్తే ఈమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ సుమారు రూ.2,80,170 కోట్లు. ఆమెకు నలుగురు పిల్లలు (ముగ్గురు కొడుకులు, ఒక కూతురు) ఉన్నా, వాళ్లకు వారసత్వంగా ఆస్తి ఇచ్చే విషయంలో ఆమె ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి! 2019లో జెఫ్ బెజోస్కు విడాకులు అవ్వగానే ఆమె ఒక లెటర్ రాశారు. ‘‘నా దగ్గర అవసరానికి మించి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఉంది. ఆ డబ్బుని అందరితో పంచుకుంటాను. నా దగ్గర ఉన్న లాకర్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు నేను దానిని ఇచ్చేస్తూనే ఉంటా..’’ అని ఆ లెటర్ సారాంశం. 2021లోనే ఆమె దాదాపు రూ. 24,843 కోట్లను ఎవరూ పట్టించుకోని చిన్న చిన్న సంస్థలకు దానం చేసి తన ఉదారతను చాటుకున్నారు.‘‘పిల్లలకి గుట్టల కొద్దీ ఆస్తిని దాచిపెట్టడం కంటే, ఆ డబ్బుతో సమాజంలోని లోటుపాట్లను సరిదిద్దడమే నాకు ముఖ్యం’’ – మెకెంజీ స్కాట్ మొత్తానికి ఈ కుబేరులందరూ చెప్పే నీతి ఒక్కటే, ‘పిల్లలకి ఆస్తిని ఇవ్వడం కంటే, ఆ ఆస్తిని సంపాదించే తెలివితేటల్ని ఇవ్వడమే అసలైన గిఫ్ట్!’ అని. నిజమే కదా, వారసత్వం అనేది బ్యాంక్ అకౌంట్లోంచి ఏటీఎం ద్వారా ప్రవహించకూడదు. కష్టించి పని చేసే గుణంగా సంక్రమించాలి. సాక్షి స్పెషల్ డెస్క్ (చదవండి: ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..) -
ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..
షిల్లాంగ్లోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో ఇద్దరు అగ్నివీర్ శిక్షణార్థులు అనుమానిత మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ బారినపడి గంటల వ్యవధిలోనే మరణించారు. ఒక్కసారిగా అస్సాం రెజిమెంటల్ సెంటర్ ఉలక్కిపడింది. సత్వరమై సైనిక సౌకర్యంలో చుట్టుపక్కల కాంటాక్ట్ ట్రేసింగ్, ఆయా వ్యక్తులతో టచ్లో ఉన్నవారిని ఐసోలేషన్లో ఉంచడం తదితరాలతో వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించేలా సత్వరమే అన్ని చర్యలు చేపట్టింది. కేవలం ఆర్మీ శిక్షణా కేంద్రంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా గట్టి నిఘా ఉంచినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇంతకీ అసలేంటి మెనింగోకాకల్ వ్యాధి ..? ఎందువల్ల వస్తుందంటే..?మెనింగోకాకల్ వ్యాధి అంటే ..?మెనింజైటిస్ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న కణజాలాల వాపుకు కారణమవుతుంది. ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్యానికి ఒక తీవ్రమైన ముప్పుగా అభివర్ణించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఇది అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవుల వల్ల సంభవిస్తుందని WHO పేర్కొంది. అయితే ఇది అంటువ్యాధి లాంటిదేనా..? కాదా అనేది కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు వైద్యులు.బాక్టీరియల్ మెనింజైటిస్ అత్యంత తీవ్రమైన రకం మెనింజైటిస్ అని WHO చెబుతోంది. దీని కారణంగా రోగికి తీవ్రమైన, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. మెనింగోకోకస్ అనేది నీసేరియా మెనింగిటిడిస్ అనే బాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియల్ మెనింజైటిస్.వ్యాధి లక్షణాలుక్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం మెనింగోకాకల్ వ్యాధి యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:ప్రకాశవంతమైన కాంతి వల్ల ఇబ్బంది పడటంవిరేచనాలుజ్వరంతలనొప్పివాంతులుముదురు రంగులోకి మారినట్లు కనిపించే చర్మ దద్దుర్లుగట్టి మెడగందరగోళం,చిరాకుచాలా నిద్రమత్తుగా అనిపించడంనడవడానికి లేదా నిటారుగా ఉండటానికి ఇబ్బందివిపరీతమైన మంటలు, నొప్పులుకీళ్లు, కండరాల నొప్పిఆకలి లేకపోవడంఎవరికీ ఈ ప్రమాదం అధికం అంటే..ఈ ఇన్ఫెక్షన్ ఏ వ్యక్తినైనా ప్రభావితం చేయవచ్చు, అయితే, కొంతమందికి ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, టీనేజర్ లేదా చిన్న వయస్సులో ఉన్నవారుప్లీహ గాయం లేదా ప్లీహము లేకపోవడంసికిల్ సెల్ వ్యాధి ఉన్నవాళ్లకుకాంప్లిమెంట్ ఇన్హిబిటర్ మందులు తీసుకునేవాళ్లుమెనింగోకాకల్ వ్యాధి సాధారణంగా ఉండే ప్రాంతాలను సందర్శించడం వల్లదీనికారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలు..బాధిత వ్యక్తులు వెంటనే వైద్య చికిత్స పొందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు, చికిత్స పొందినప్పటికీ ప్రజలు చనిపోవచ్చు. ఈ వ్యాధి కారణంగా ఎదురయ్యే సమస్యలు..మెదడు దెబ్బతినడంమూత్రపిండాల నష్టంఅవయవాలు కోల్పోవడంనరాల దెబ్బతినడంపూర్తిగా వినికిడి లోపంనివారణ చర్యలువ్యాక్సిన్లు సాధారణ రకాల బాక్టీరియల్ మెనింజైటిస్ నుంచి ఉత్తమ రక్షణను అందిస్తాయని WHO చెబుతోంది. మెనింగోకాకస్, న్యుమోకాకస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి (Hib) వల్ల కలిగే మెనింగోకాకల్ వ్యాధిని టీకాలు నిరోధించగలవు. ఇతర నివారణ చర్యలు..11-12 సంవత్సరాల వయస్సులో మెనింగోకాకల్ కంజుగేట్ (MenACWY) వంటి టీకాలు వేయించడం.16 ఏళ్ల లోపు వాళ్లకు బూస్టర్డోస్లు వేయించడం. అలాగే సెరోగ్రూప్ B నుంచి అదనపు రక్షణ కోసం సిఫార్సు చేసిన MenB టీకాలు వేయించడం. టీకాలు సాధారణ జాతులను (A, C, W, Y, B) లక్ష్యంగా చేసుకుంటాయి. టీనేజ్ పిల్లలు, టీనేజర్లు, HIV లేదా అస్ప్లెనియా వంటి ఆరోగ్య ప్రమాదాలు ఉన్నవారికి ఈ టీకాలు వేయించడం మంచిది.పరిశుభ్రత పద్ధతులు: ముఖ్యంగా బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత లేదా తినడానికి ముందు సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోండి. కడగని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండండి. పానీయాలు, ఆహారం, పాత్రలు, లిప్స్టిక్లు లేదా సిగరెట్లను పంచుకోవద్దు, దగ్గు/తుమ్ము వచ్చినప్పుడు చేతులు లేదా జేబురుమాల్ అడ్డుపెట్టుకోవడం. ఈ చర్యలు తీసుకుంటే శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందే ఈ బ్యాక్టీరియాను కట్టడి చేయొచ్చు. ముఖ్యంగా దద్దుర్లు, మెడనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం సహాయం తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రీల్స్ పిచ్చి వర్సెస్ చదువు..!) -
రీల్స్ పిచ్చి వర్సెస్ చదువు..!
ఒకప్పుడు పిల్లలు ‘పెద్దయ్యాక కలెక్టర్ అవుతాను’ అనేవారు, కానీ నేడు ‘ఇన్ఫ్లూయెన్సర్ అవుతాను’ అంటున్నారు. చదువును పక్కన పెట్టి, గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తూ, నిరంతరం రీల్స్ షూటింగులతో బిజీగా ఉంటున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది కేవలం అలవాటు కాదు, ఒక తీవ్రమైన మానసిక పరిణామం. చేతిలో స్మార్ట్ఫోన్, కళ్ళల్లో రీల్స్ కలలు ఉన్న టీనేజర్లను సరిదిద్దడం నేటి తరం తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద సవాలు.మెదడులో డోపమైన్ యుద్ధంటీనేజర్ల మెదడులో ‘ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్’ (నిర్ణయాలు తీసుకునే భాగం) పూర్తిగా అభివృద్ధి చెందదు. కాని, ఆనందాన్ని వెతికే ‘రివార్డ్ సిస్టమ్’ చాలా వేగంగా పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా వీడియో గేమ్స్ ‘వేరియబుల్ రివార్డ్స్’ సూత్రంపై పనిచేస్తాయి. స్వైప్ చేసిన ప్రతిసారి, తర్వాతి వీడియోలో ఏముందో తెలియని ఆ కుతూహలం మెదడులో డోపమైన్ను విడుదల చేస్తుంది. చదువులో ఫలితం రావడానికి ఏడాది పడుతుంది కాని, రీల్కు లైక్స్ రావడానికి సెకన్లు చాలు. అందుకే ఈ ‘తక్షణ తృప్తి’ కోసం మళ్లీ మళ్లీ రీల్స్ చూస్తుంటారు, చేస్తుంటారు. చదువు వర్సెస్ వైరల్ ఫేమ్చాలామంది టీనేజర్లు చదువు మానేసి రీల్స్ చేయడం వెనుక ‘గుర్తింపు కాంక్ష’ ఉంటుంది. కాని, పదివేల మంది ఫాలోవర్లు ఉండటం వల్ల జీవితం సెటిల్ అయిపోదు. సోషల్ మీడియా అల్గారిథమ్స్ మారగానే ఆ గుర్తింపు కనుమరుగవుతుంది.నిరంతరం షూటింగులు, ఎడిటింగ్ ఆలోచనలతో ఉండటం వల్ల మెదడు ‘హైపర్–యాక్టివ్’ స్థితిలో ఉంటుంది. ఫలితంగా, నిశ్శబ్దంగా కూర్చుని చదువుకోవడం వారికి అసాధ్యంగా మారుతుంది.చదువును నిర్లక్ష్యం చేస్తూ, కేవలం ‘వైరల్’ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న టీనేజర్లను డీల్ చేయడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలు. వారిని మొండితనం వైపు నెట్టకుండా, తిరిగి పుస్తకాల వైపు మళ్లించడానికి ఉపయోగపడే ఐదు కౌన్సెలింగ్ చిట్కాలు మీకోసం.1. ‘వై నాట్’కి బదులుగా ‘హౌ’పిల్లలు రీల్స్ చేస్తామంటే ‘వద్దు, చేయకూడదు’ అని మొండిగా చెప్పకండి. అది వారిని తిరుగుబాటు వైపు నెడుతుంది. ‘నువ్వు కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకోవడం మంచిదే కాని, ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్ కావాలంటే నీకు కమ్యూనికేషన్ స్కిల్స్, స్క్రిప్ట్ రైటింగ్, అనలిటికల్ నాలెడ్జ్ ఉండాలి. అవి నీకు చదువు ద్వారానే వస్తాయి’ అని వారితో ఒక ప్రొఫెషనల్లాగా మాట్లాడండి. చదువును వారి ఎదుగుదలకు ఒక అడ్డంకిగా కాకుండా, ఒక సాధనంగా చూపించండి.2. ‘ఇన్స్టంట్ ఫేమ్’ వర్సెస్ ‘లాంగ్ టర్మ్ సెక్యూరిటీ’ టీనేజర్లకు భవిష్యత్తు గురించి స్పష్టత ఉండదు. అందుకే క్లాసులో వచ్చే మొదటి ర్యాంక్ కంటే రీల్స్కు వచ్చే లైక్స్ ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. ‘ఈ రోజు వైరల్ అయిన వీడియో రేపు ఉండదు. కాని, నువ్వు సంపాదించే డిగ్రీ లేదా నైపుణ్యం జీవితాంతం నీకు అన్నం పెడుతుంది’ అని సోషల్ మీడియా వెనుక ఉన్న ‘షెల్ఫ్ లైఫ్’ గురించి వివరించండి. ముఖ్యంగా ఫేడౌట్ అయిపోయిన పాత ఇన్ఫ్లూయెన్సర్ల ఉదాహరణలు చెప్పండి.3. ‘ప్రొడక్షన్ టైమ్’ ఫిక్స్ చేయండిపిల్లలు చదువు మధ్యలో రీల్స్ షూటింగ్ చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. వారానికి ఒక రోజు, రెండు గంటలు మాత్రమే షూటింగ్ సమయంగా కేటాయించండి. మిగిలిన ఆరు రోజులు చదువుకే ప్రాధాన్యం ఇవ్వాలి. ‘నీ చదువు గ్రాఫ్ పడిపోతే, ఈ షూటింగ్ టైమ్ రద్దవుతుంది’ అనే పాజిటివ్ కండిషన్ పెట్టండి.4. అకడమిక్ రివార్డ్ సిస్టమ్వారికి నచ్చిన రీల్స్ చేసే హక్కును వారు ‘సంపాదించుకోవాలి’. ఉదాహరణకు ఒక చాప్టర్ పూర్తి చేస్తే 15 నిమిషాల ఎడిటింగ్ టైమ్. వీక్లీ టెస్ట్లో మంచి మార్కులు వస్తే, ఒక కొత్త రీల్ షూట్ చేసుకునే అవకాశం. ఇలా చేయడం వల్ల వారు చదువును ఒక శిక్షలా కాకుండా, తమకు నచ్చిన పనిని చేయడానికి ఒక మార్గంగా చూస్తారు.5. డిజిటల్ ఐడెంటిటీని గౌరవించండిపిల్లలకు గుర్తింపు కావాలి. ఇంట్లో ఆ గుర్తింపు దొరకనప్పుడు వారు బయట ప్రపంచాన్ని ఆశ్రయిస్తారు. అందుకే రీల్స్ చేస్తారు. ఆ విషయాన్ని గుర్తించండి. వారిని ఒక ‘క్రియేటర్’గా గౌరవిస్తూనే, ఒక ‘స్టూడెంట్’గా బాధ్యతలను గుర్తు చేయండి.నైవర్ మైండ్..!ప్రతిరోజూ మన మెదడులో దాదాపు 50 వేల నుంచి 70 వేల ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి. వీటిలో సుమారు 60 నుంచి 70 శాతం ప్రతికూలమైన ఆలోచనలే! కాబట్టి పరీక్షల సమయంలో తలెత్తే ప్రతికూల ఆలోచనలను పెద్దగా పట్టించుకోకండి. సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: ముసుగు వెయ్యొద్దు మనసు మీద..! లోపాలను దాచొద్దు..) -
విశేషాలకు కొదవ లేని కొడవ కళ్యాణం
అక్కడ పురోహితులు ఉండరు... వేద మంత్రోచ్చారణలు వినిపించవు... వధూవరులు ఏడడుగులు వేయరు... ‘కొడవ’ సంప్రదాయ పద్ధతిలో జరిగే వివాహ వేడక ఇలానే ఉంటుంది. అంతేనా? ఇంకా చాలా విశేషాలుంటాయి. తెలుగు సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఈ వేడుక ఉంటుంది. టాలీవుడ్ లవ్బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ఈ రెండు పద్ధతుల్లోనూ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి జరిగింది. దీంతో కొడవ తెగకు సంబంధించిన వేడుక ఎలా జరిగి ఉంటుందా?! అనే చర్చలు మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...విజయ్ దేవరకొండది తెలంగాణలోని నాగర్కర్నూలు. రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. కొడగునే కూర్గ్ అని కూడా పిలుస్తారు. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీనే కొడవగా పిలుస్తారు. కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, సంప్రదాయాలు మిగతా వారితో పోల్చితే భిన్నంగా ఉంటాయి. వారి పూర్వీకులను గౌరవిస్తూ వివాహ వేడుకలను జరుపుతారు. మామూలుగా జరిగే తెలుగు వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ ఉంటుంది. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించవు. అరిటాకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఈ వివాహ వేడుకను వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుంది. వేదికను అరిటాకులతో పచ్చదనానికి ప్రతీకగా అలంకరిస్తారు.భిన్నమైన కట్టుకొడవ పెళ్లిలో వధూవరులిద్దరూ అభ్యంగన స్నానం చేస్తారు. అనంతరం తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు ‘కుష్య’ అనే నల్లని కోటు, ‘చేలే’ అని పిలిచే నడుముకు కట్టే పట్టీ, ‘పీచే కత్తి’ (చిన్న కత్తి) ధరిస్తాడు. ఇక వధువు చీరకట్టు సంప్రదాయం మిగతా చీరకట్టులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా భారతీయ వస్త్రధారణలో చీర పల్లూను ముందు నుంచి వెనక వైపుకు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో చీర కొంగును వెనక నుంచి ముందుకు తీసి, వేస్తారు. అలాగే, వెనక వైపు కుచ్చిళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కట్టు ఈ కమ్యూనిటీలో కనిపిస్తుంది. ఇక వేడుక అంతా డ్రమ్ బీట్స్, పాటలతో వారియర్ నేపథ్యాన్ని గుర్తుచేసే నృత్యాలు చేస్తారు. అలాగే గన్ సెల్యూట్స్ కూడా ఆ వేడుకలో భాగమే. ఈ పద్ధతిని అనుసరిస్తూ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా కూడా ఈ నృత్యాలు చేశారు.కొడవలు ఎవరు కొడవలను ‘కూర్గులు’ అని కూడా అంటారు. వీరిది కర్ణాటక రాష్ట్రంలోని కొడగు (కూర్గ్) ప్రాంతం. వీరు సుమారు 1.6 లక్షల దాకా ఉన్నారని అంచనా. గతంలో వీరు వ్యవసాయం, ఇతర పనుల మీద ఆధారపడి జీవించేవారు. 19వ శతాబ్దంలో కాఫీ సాగు ద్వారా వీరి పనికి ప్రాధాన్యం లభించింది. మొదట వ్యవసాయ ఆధారిత పండుగలు జరుపుకునే వీరు అనంతరం ఇతర పండుగలూ జరుపుకోవడం మొదలుపెట్టారు. కావేరి నది వీరికి ప్రాధాన్యమైనది. బ్రిటిష్ పాలన సమయంలో వీరు ఇతర రంగాల్లోకి ప్రవేశించారు. వీరి నైపుణ్యాలను గమనించి బ్రిటిష్ అధికారులు వీరిని మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో వినియోగించారు. కొడవల్లో అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు.బంగారు నాణేల మూటపెళ్లి వేదికకు వచ్చే మార్గంలో అరటి చెట్టు నాటుతారు. వరుడు దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, అనంతరం ఆ చెట్టు కాండాన్ని నరకడం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత వరుడు పెళ్లి పీటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, తూర్పు ముఖంగా కూర్చుంటాడు. ఆ సమయంలో ముందుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు వరుడిని ఆశీర్వదిస్తారు. తర్వాత వధువు అక్కడికి చేరుకుని వరుడికి పాలు, బహుమతులు, బంగారం, వెండి, రాగి నాణేలను అందిస్తుంది. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు.12 గులకరాళ్లతో వధువుపై సర్వహక్కులువధూవరులిద్ద్దరూ మల్లెపూల దండలు మార్చుకుంటారు. పవిత్ర దీపం ఎదురుగా నిలబడి వధువు బాధ్యత వరుడికి అప్పగిస్తున్నామని పెద్దలు చెబుతారు. దీంతో పాటు వధువు తరఫు పెద్దలు 12 గులకరాళ్లు వరుడి పెద్దలకు ఇచ్చి, వధువుపై సర్వహక్కులు ఇస్తున్నామని చెబుతారు. అయితే వరుడి వైపు పెద్దలు 11 రాళ్లు తీసుకొని ఒకటి తీసుకోకుండా వదిలేస్తారు. అవసరమైన సందర్భంలో వధువుపై వారికీ హక్కు ఉందనే అర్థంలో ఇలా చేస్తారు. పుట్టింటివారికి కూతురి పట్ల కొంత బాధ్యత ఉంటందని సూచించడానికే ఇలా చేస్తారని చెప్పవచ్చు.నీళ్ల బిందె తలపై పెట్టుకొని..పెళ్లి తర్వాత వధువు తమ అత్తగారి ఇంటి వద్ద గంగా పూజ చేస్తుంది. ఈ పూజ కోసం వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించడానికే ఈ ఘట్టం. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ పెళ్లిళ్లలో మాంసాహారాన్ని వడ్డిస్తారు. అందులో ప్రధానంగా పంది మాంసం, మద్యం తప్పనిసరిగా ఉంటాయట. దీంతో విజయ్–రష్మిక పెళ్లి వేడుకలో ఈ వంటకాన్ని కూడా వడ్డించారు. ఇలా ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం కొడవ సంప్రదాయ పద్ధతిలో జరిగిన విజయ్–రష్మికల వివాహ వేడుకలు ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అయ్యాయి. మార్చి 4న హైదరాబాద్లో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.విరోష్ సెలబ్రేషన్స్‘‘దేశంలోని ప్రజలందరూ ఎప్పుడూ మా ప్రయాణం, ప్రేమలో భాగమయ్యే ఉన్నారు. అందుకే మీ అందరితో మా వెడ్డింగ్ను సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో సంతోషం. ప్రతి వేడుకను ఇండియా ఎలా అయితే ఫుడ్ అండ్ మిఠాయిలతో సెలబ్రేట్ చేసుకుంటుందో అలా మా జీవితంలోని ఈ బిగ్ మూమెంట్ను మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మార్చి 1న దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ స్వీట్ ట్రక్స్ను పంపిస్తున్నాం (కొన్ని నగరాల్లో మాత్రమే). అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నాం. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రేమతో విజయ్ అండ్ రష్మిక’’ అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక ‘ఎక్స్’ లో శనివారం రాత్రి ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే ‘విరోష్ సెలబ్రేషన్స్’ అంటూ, ఏయే నగరాల్లో స్వీట్స్ పంచనున్నారు, ఏయే దేవాలయాల్లో అన్నదానం నిర్వహించనున్నారన్న జాబితాను కూడా ఈ ఇద్దరూ షేర్ చేశారు.స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్... ∙తెలంగాణ – హైదరాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, ∙ఢిల్లీ (ఎన్సీటీ) – ఢిల్లీ ∙చండీఘర్ (యూటీ)– చండీఘర్ ∙ఉత్తరప్రదేశ్ – నోయిడా, గజియాబాద్ ∙గుజరాత్ – అహ్మదాబాద్ ∙మధ్యప్రదేశ్ – భోపాల్ ∙మహారాష్ట్ర – ముంబై ∙రాజస్థాన్ – జైపూర్ ∙ఆంధ్రప్రదేశ్ – వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి ∙కేరళ – కొచ్చి ∙కర్ణాటక – మైసూర్, కూర్గ్, బెంగళూరు ∙తమిళనాడు – కోయంబత్తూర్, చెన్నై ∙పాండిచ్చేరి (యూటీ) – పాండిచ్చేరి ∙బిహార్– (ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా సోమవారానికి వాయిదా). -
సువర్ణ రేఖలు!
సామాన్యుల్లా కనిపిస్తారు గాని అసామాన్య స్త్రీలు వారు. రాక్షస సంహారం చేయరు గాని జీవితంలో ఎదురైన సమస్యల పెను భూతాన్ని తుదముట్టిస్తారు. ఎనిమిది చేతులుండవు గాని ఇంటి పని, పిల్లల పని, చిన్న ఉద్యోగం, అతి చిన్న ఉపాధి... అవలీలగా చేసి బతుకును నిలబెట్టుకుంటారు. గుంపులో ఒకరుగా కనిపిస్తారుగాని వారి పోరాట బలానికి ఎదురు నిలవాలంటే ఒక దేశ సైన్యం సరిపోదు.ఎల్లమ్మ, మల్లమ్మ, లక్ష్మి, సుజాత, మేరి, మస్తానమ్మ... మామూలు పేర్లుగా కనిపిస్తాయి గాని వీరంతా పిడుగుల దారుల్లో వడగండ్ల దాడుల్లో సాగుతున్న తెగువ చిరునామాలు. ఎవ్వరి తోడు లేకపోయినా వీరు ముందుకు నడుస్తారు. ఓడించాలని చూసే కొద్దీ గెలుస్తూ ఉంటారు. కష్టాలను లెక్క చేయరు. బాధల్లో కూడా నవ్వడం మానరు. మన ఇరుగూ పొరుగే ఉంటారు. కాని ఝాన్సీ లక్ష్మీబాయిని మించి ఉంటారు. కామన్ విమెన్ అన్ కామన్ జీవన పోరాటాలను తెలుసుకుందాం రండి.బిడ్డలకు ప్రోత్సాహమిస్తే చక్కగా ఎదుగుతారనే నమ్మకమే ఆమె బలం.. బలగం. చదువు, ఉద్యోగం, సొంత ఇల్లు, కుటుంబ అండ ఏమీ లేకున్నా... ఒంటరిగా ఐదుగురు కూతుళ్లను పోషిస్తూ, వారిని చేతనైనంతగా చదివిస్తోంది హైదరాబాద్ లాలాగూడలో ఉంటున్న సువర్ణ. భర్త మద్యానికి బానిసై ఎప్పుడో చనిపోయాడు. ఆదుకునే వారెవరూ లేకున్నా... పాచిపనిచేస్తూ, రెక్కల కష్టంతో సంసారాన్ని లాక్కొస్తోంది. కొండంత ఆత్మవిశ్వాసంతో జీవన పోరాటం చేస్తున్న సువర్ణను పలకరిస్తే.. ‘ మంచిగ సదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు. అందుకే, ఎంత కష్టమైనా భరిస్తనమ్మ’ అని చెప్పింది... 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ సువర్ణ పాఠాలకు శ్రీకారం.‘‘నా అసలు పేరు సుహాసిని. పెళ్లయ్యాక సువర్ణ అని మార్చారు. ఇంకో రెండేళ్లు దాటితే నలభై ఏళ్లు వస్తాయి. మా చుట్టుపక్కల వాళ్లు ‘పిల్లల్ని కూడా పనిలో పెట్టరాదూ... ఎందుకంత కష్టపడతావు’ అని చెబుతుంటారు. కానీ, నాలాగా ఇళ్లలో పనులు చేసుకుంటే ఈ రోజు రూపాయి సంపాదించుకుంటారేమో... కానీ, చదువుకుంటే రేపు పది రూపాయలు సంపాదించుకుంటరు. అంతేకాదు, బయట ఎట్ల బతకాలో తెలుసుకుంటరు. మంచిగ బతుకతరు. అందుకే ‘కష్టమైనా పర్లేదు, నేనే ఇంకో నాలుగిండ్లలో పనిచేసి, బిడ్డల్ని చదివిస్తా’ అని చెబుతుంటా. ఐదుగురు కూతుళ్లలో పెద్దమ్మాయి పెండ్లి చేసిన. మిగతా నలుగురిలో ఇద్దరు ఇంటర్మీడియెట్, మరో ఇద్దరు స్కూల్లో చదువుకుంటున్నరు.ఎవరి అండా లేదు...నా చిన్నప్పుడే అమ్మానాయినలు చనిపోయారు. మా తాతనే నన్ను, మా చెల్లెల్ని సాదిండు. మా ఊరు తెలంగాణలోని గజ్వేల దగ్గర ధవలాపురం. అమ్మనాన్నలు లేరని హాస్టల్లో పెడితే ఐదవ తరగతి వరకు చదువుకున్నాం. ఆ తర్వాత మళ్లా తాత దగ్గరకు వచ్చేసినం. అప్పటినుంచి ఊళ్లనే. తాత ఏదో చేతనైన పని ఏదో చేసేవాడు. పదిహేనేళ్ల వయసులో మా ఊరి అబ్బాయితోనే పెళ్లయ్యింది. హైదరాబాద్కు వచ్చి, ఓ రూమ్ అద్దెకు తీసుకుని బతుకుతుండేవాళ్లం. కూతురు పుట్టిన రెండేళ్లకు అత్తింటివాళ్లతో గొడవలయ్యాయి. అవి పెద్దగై విడిపోవాల్సి వచ్చింది. ఎట్ల బతకాలో అర్థం కాలేదు. ఇళ్లలో పనికి కుదిరా. నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి, బాధతో కిరోసిన్ పోసుకుని, నిప్పు పెట్టుకున్న. గాంధీ ఆసుపత్రిలో నెల రోజుల పాటు చికిత్స కోసం ఉన్నా. బిడ్డ మొఖం చూసి, బతకాలని నిర్ణయించుకున్న. తిరిగి ఇళ్లలో పనిచేసుకుంటూ, బిడ్డను సాదుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే మంచిదని, మా కాలనీ వాళ్లే చెప్పడంతో మా దోస్త్ బంధువుతో రెండో పెళ్లి చేసుకున్న. మొదట జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ తర్వాత కొట్టడం, హింసించడం చేసేవాడు. తాగీతాగీ చనిపోయాడు.కష్టాలే మార్చాయి...పెద్ద బిడ్డ గర్భవతిగా ఉందని తెలిసి, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లా. ‘గుండెకు రంధ్రం ఉంది, పిల్లలు పుడితే ఆమె బతకదు’ అన్నారు. చూస్తూ చూస్తూ బిడ్డను అలా వదిలేయలేక, గుండె ఆపరేషన్ చేయించిన. ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఆఫీసుల చుట్టూ తిరగగా తిరగగా మొన్నటి నెలనే రేషన్ కార్డు వచ్చింది. వితంతు పింఛను లేదు. ఏ ఆస్తులూ లేవు. కానీ, పిల్లలు నా కష్టాన్ని అర్ధం చేసుకున్నరు. మంచిగ చదువుకుంటున్నరు. నా పిల్లలకు నేను అండ. పిల్లలు నాకు ఆసర అవుతున్నరు. రెక్కల కష్టమ్మీదనే బిడ్డలను సాకుతున్నాను అని, తెలిసినవాళ్లు ‘ఎన్నాళ్లు ఇట్లా కష్టపడతావు..’ అంటుంటారు. నా చిన్నప్పుడు అలాగే హాస్టల్లో ఉండి చదువుకునుంటే, ఏదైనా ఉద్యోగం చేసుకుని బతికేదాన్ని. కానీ, అప్పడు అమ్మనాన్నలేక, పరిస్థితులు బాగోలేక చదువుకోలేకపోయిన. నాలాగా నా పిల్లలు పనిమనుషులు కావద్దు. వాళ్ల జీవితాలు బాగుపడితే నా అన్ని కష్టాలూ చిన్నవే అయిపోతాయి’’ అని వివరించింది సువర్ణ కూతుళ్లను దగ్గరకు తీసుకుంటూ. అచంచలమైన ఆమె ఆత్మవిశ్వాసానికి చేతులెత్తి మొక్కాలనిపించింది. సారా ముంచింది...పిల్లలంతా ఏడాది, రెండేళ్ల తేడాతో పుట్టారు. కొడుకు కావాలని, ఆపరేషన్ చేయించుకోవద్దని బెదిరింపులు, చేయిచేసుకోవడం... సారాకు అలవాటు పడిన ఆయన పైసా సంపాదించకపోగా నా దగ్గరే పైసలు తీసుకునెటోడు. రోజంతా తాగుతూ పిల్లలను కూడ చూసుకునేవాడు కాదు. తాత చూస్తే బాగా ముసలాయన అయిపోయాడు. అప్పటికే చెల్లెలు పెళ్లయి వెళ్లిపోయింది. అయినా పిల్లలను తాత దగ్గరే వదిలేసి, పనికి పోయేదాన్ని. మా చిన్న బిడ్డ ఐదో ఏటన మా ఆయన చనిపోయాడు. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయ్యాయి. ఆ తర్వాత తాత కూడా చనిపోయాడు. పిల్లలను స్కూల్లో వేసి, ఇళ్లలో పనిచేస్తూ ఇన్నేళ్లుగా గడుపుతున్నాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎత్తైన దిండ్లు వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే
దిండు లేకుండా నిద్ర పోవడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గి గ్లాకోమా తీవ్రత తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత అంధత్వానికి దారితీసే కారణాలలో గ్లాకోమా ఒకటి. దీనికి ప్రధాన కారణం కంటిలో ఉండే అధిక ఒత్తిడి దృష్టి నరాన్ని దెబ్బతీయడం. ఎత్తైన దిండ్లు లేదా ఒకటి కంటే ఎక్కువ దిండ్లను వాడటం వల్ల మెడలోని జుగులార్ వెయిన్పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కంటి ద్రవం సరిగ్గా బయటకు వెళ్లలేక, కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి దృష్టి నరాన్ని (ఆప్టిక్ నెర్వ్)ప్రభావితం చేస్తుంది. ఇది గ్లాకోమా రావడానికి కారణం అవుతుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆప్తమాలజీలో ప్రచురించిన ప్రకారం, ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు 144 మంది గ్లాకోమా రోగులను పరీక్షించారు. కూర్చున్నప్పుడు, రెండు దిండ్లతో పడుకున్నప్పుడు, దిండు లేకుండా పడుకున్నప్పుడు వారి కంటి లోపల ఉండే ఒత్తిడిని ప్రతి రెండు గంటలకు ఒకసారి 24 గంటల΄ాటు పరిశీలించారు. దిండ్లతో తల ఎత్తుగా పెట్టి పడుకున్నప్పుడు, దాదాపు మూడింట రెండు వంతుల మంది రోగులలో కంటిలో ఒత్తిడి పెరిగినట్లు వారు గమనించారు. యువకులు, ప్రైమరీ ఓపెన్–యాంగిల్ గ్లాకోమా ఉన్నవారిపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలు ప్రాథమికమైనవే అయినప్పటికీ, గ్లాకోమా ఉన్నవారు తాము నిద్రించే విధానంలో జాగ్రత్త వహించడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. -
కోపానికి టాటా చెప్పేద్దాం!
కోపం వలన గుండె సంబంధిత జబ్బులు రావచ్చని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. చిన్నపాటి కోపమైనా సరే అది రక్తనాళాలను ప్రభావితం చేయడం వల్ల రక్తప్రసరణపై ప్రభావం పడి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆధునిక జీవన శైలి వలన ఇప్పటికే పలు రకాల గుండె జబ్బులు వస్తున్నాయి. సీటులో నుంచి కదలకుండా ఒకేచోట స్థిరంగా కూర్చోవడం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వలన గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అనుకోకుండా వచ్చే కోపం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.కేవలం ఎనిమిది నిమిషాల పాటు ఉండే కోపం అనే భావోద్వేగం వల్ల రక్త నాళాలు విస్తరించే సామర్థ్యం దాదాపు సగానికి తగ్గిపోతుంది. అంతే కాదు కేవలం 8 నిమిషాల పాటు వచ్చే కోపం వలన దాని ప్రభావం 40 నిమిషాల వరకు ఉంటుందని గుర్తించారు. దీనితో పాటు ఎక్కువ కోపంగా ఉండటం వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.పరిశోధనలో అసలేం తెలుసుకున్నారు?అమెరికాలోని వివిధ సంస్థల నిపుణులు చేసిన పరిశోధనలో దాదాపు 300 మంది ఆరోగ్యంగా ఉన్నటువంటి పెద్దవయస్సు వారిని ఎనిమిది నిమిషాల పాటు కోపంగా ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవాలని కోరుతూ అధ్యయనం చేశారు. దీని ద్వారా వారు పొందిన ఫలితాలను బట్టి ఈ అధ్యయనం చేశారు. అయితే, విచారం లేదా ఆందోళన వంటి భావోద్వేగాలు గుండె ఆరోగ్యంపై ఇలాంటి ప్రభావాన్ని చూపలేదు.కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే...బాగా కోపం వచ్చినప్పుడు లోతుగా డీప్ బ్రీత్ తీసుకోవడం లేదా 10 వరకు అంకెలు లెక్కపెట్టడం బెటర్. కోపం కలిగించే వ్యక్తులకు, పరిస్థితులకు దూరంగా ఉండాలి.రెగ్యులర్గా వాకింగ్, ఎక్సర్సైజ్ చేయండి.రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు మంచి నిద్ర, విశ్రాంతి అవసరం. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ధ్యానం లేదా యోగా రెగ్యులర్గా చేయడం అలవాటు చేసుకోవాలి. మీ కొలెస్ట్రాల్ లెవల్స్ మేనేజ్ చేసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోండి. చదవండి: ముప్పై ఏళ్లకే ఎముకలు గుల్లబారుతున్నాయి -
Yoga ఉత్కటాసనం ప్రయోజనాలు అమోఘం, ఈ జాగ్రత్తలు మస్ట్
Yoga రోజూ ఎకువసేపు కూర్చుని పనిచేసేవారిని క్రమంగా నడుం నొప్పులు వెంటాడుతుంటాయి. ఈ నొప్పి నుంచి ఉపశమనం అందించే ఆసనాల్లో సాధన చేయదగిన ముఖ్యమైన శ్రేణిలో నిలిచే ఆసనం ఉత్కటాసనం. ‘ఉత్కట’ అంటే శక్తిమంతమైన/తీవ్రమైన అని అర్థం. ఈ ఆసనం శరీరానికి బలాన్ని, స్థైర్యాన్నీ ఇస్తుంది.ఉత్కటాసనం ప్రయోజనాలు...కాళ్ల కండరాలు, తొడలు కండరాలు బలపడతాయి. రక్తప్రసరణ, శ్వాసక్రియ మెరుగుపడతాయి. శరీరంలో మెటబాలిజం పెరిగి అధికబరువు సమస్య తగ్గు ముఖం పడుతుంది. కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. పొట్ట భాగం, వెన్నెముకకు సపోర్ట్ పెరుగుతుంది. బ్యాలెన్స్– స్టెబిలిటీ మెరుగు పడుతుంది. శరీర సమతుల్యత పెంపొందుతుంది. మెటబాలిజం ఉత్తేమవు తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగు పడుతుంది, శరీరానికి ఉత్సాహం వస్తుంది. మనసుకు ఏకాగ్రత ఫోకస్ పెరుగుతాయి.ఇదీ చదవండి: పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్ వీడియోజాగ్రత్తలు...మోకాళ్ల నొప్పి/ వెన్నునొప్పి / డిస్క్ సమస్య ఉన్నవారు డాక్టర్ లేదా యోగా గురువు పర్యవేక్షణలో చేయాలి. బీపీ లేదా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు. మోకాళ్లు పాదాల వేళ్లకు ముందుకు వెళ్లకూడదు. వెన్నెముక నిటారుగా ఉంచాలి – వంగిపోవద్దు. గర్భిణులు తప్పనిసరిగా గైడెన్స్తో మాత్రమే చేయాలి. ∙మొదట 10–20 సెకండ్లు హోల్డ్ చేయండి. తర్వాత 3–5 రిపిటేషన్స్ చేయాలి. శ్వాస నెమ్మదిగా, సమంగా ఉంచాలి. - పాతర్ల అనిత, యోగా ట్రైనర్ ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?శక్తిని ఇచ్చే ఉత్కటాసనం చేసే విధానం..ముందుగా నిటారుగా నిలబడాలి. పాదాలు రెండూ దగ్గరగా ఉంచి, చేతులను పైకి ఎత్తాలి. కుర్చీలో కూర్చున్నట్టు మోకాళ్లను ముడుచుకుని కిందకు వంగాలి. మోకాళ్లు ముందుకు పడకుండా జాగ్రత్త పడాలి. చేతులను నమస్కార భంగిమలో ఉంచాలి. ఈ స్థితిలో పొట్ట భాగాన్ని లోపలికి తీసుకుంటూ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. దృష్టి నాసికా పుటాలపై లేదా ముందు ఉన్న ఒక బిందువుపై కేంద్రీకరించాలి. ∙5 నుంచి 6 సార్లు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా కండరాలు బలపడతాయి. -
ముసుగు వెయ్యొద్దు మనసు మీద..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది తమలో ఉన్న లోపాలన్నింటినీ కప్పెట్టేసి, ఒక పర్ఫెక్ట్ ముసుగు వేసుకోవడం అనుకుంటారు. "నేను ఎప్పుడూ కాన్ఫిడెంట్గా ఉండాలి", "నాకు అసలు భయం వేయకూడదు" అని తమకు తాము అబద్ధాలు చెప్పుకుంటారు.కానీ సైకాలజీ ప్రకారం, మీలోని లోపాన్ని మీరు అంగీకరించనంత కాలం, దాన్ని మీరు మార్చలేరు. అంగీకారం (Acceptance) అనేది బలహీనత కాదు, అది మార్పుకు అవసరమైన అసలైన ధైర్యం.అంగీకారమే మార్పుకు ద్వారంకార్ల్ రోజర్స్ తన 'Client-Centered Therapy'లో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. మనం మనలోని ఏదైనా ఒక నెగటివ్ లక్షణాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని అసహ్యించుకుంటున్నంత కాలం, మన మెదడు ఆ లక్షణాన్ని డిఫెన్స్ మోడ్లో రక్షిస్తుంది. ఉదాహరణకు, అతిగా కోపం రావడం లేదా అసూయ పడటం.కానీ, "అవును, ప్రస్తుతం నాలో ఈ కోపం ఉంది" అని మీరు ఎప్పుడైతే నిజాయితీగా అంగీకరిస్తారో, అప్పుడు మీ మనసులో ఉన్న ఆందోళన (Anxiety) తగ్గుతుంది. ఆ ప్రశాంతతలోనే మార్పు సాధ్యమవుతుంది.ముసుగుల భారంసో-కాల్డ్ ట్రైనర్లు మిమ్మల్ని ఎప్పుడూ "నటన" చేయమని ప్రోత్సహిస్తారు. "నీ బలహీనతలను ఎవరికీ చూపించకు, పులిలా గర్జించు, లోపల ఏమున్నా బయటకు మాత్రం తోపులా కనిపించు" అని చెప్తారు.ఇది మీలో 'Incongruence' (అంతర్ఘర్షణ) పెంచుతుంది. బయట మీరు గొప్పగా నటిస్తున్నా, లోపల మీ 'Real Self' కు అది అబద్ధం అని తెలుసు. ఈ అబద్ధం మీ సెల్ఫ్-ఎస్టీమ్ (Self-esteem) ని దెబ్బతీస్తుంది. నిజమైన వికాసం అంటే లోపాలను దాచడం కాదు, వాటిని అంగీకరించి, బాధ్యత తీసుకోవడం.అంగీకారం అంటే రాజీ పడటం కాదు"నన్ను నేను ఇలాగే ఒప్పుకుంటే ఇక నేను ఎప్పటికీ మారలేనేమో?" అని చాలామందికి అనుమానం ఉంటుందిResignation (నిరాశ): "నేను ఇంతే, నా జీవితం మారదు" అని వదిలేయడం బలహీనత.Acceptance (అంగీకారం): "ప్రస్తుతానికి నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇది నా వాస్తవం. ఇక్కడి నుండి నేను ఎలా ముందుకు వెళ్ళాలి?" అని ఆలోచించడం బలం.ఉదాహరణకు, ఒక వ్యక్తికి స్టేజ్ ఫియర్ ఉందనుకోండి. "నాకు భయం లేదు" అని నటించడం కంటే, "అవును, నాకు స్టేజ్ ఎక్కాలంటే భయంగా ఉంది.. ఈ భయాన్ని జయించడానికి నేను ఏం చేయాలి?" అనడం నిజమైన పర్సనాలిటీ గ్రోత్.అంగీకార ప్రక్రియGenius Matrix మోడల్ ఉపయోగించి మనల్ని మనం ఎలా అంగీకరించాలో చూద్దాం.Step 1: అవమానాన్ని బద్దలు కొట్టండిమన లోపాలను ఒప్పుకోవడానికి మనకు అడ్డుపడేది 'సిగ్గు' (Shame). "నాలో ఈ లోపం ఉందని తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు?" అనే భయాన్ని 'Break' చేయండి. మీ లోపాలు మిమ్మల్ని తక్కువ మనిషిని చేయవు, అవి మిమ్మల్ని ఒక 'మనిషి'గా చూపిస్తాయి.Step 2: నిజాయితీ గల పునాదిమీ బలహీనతలను ఒక పేపర్ మీద రాయండి. వాటిని చూసి బాధపడకండి. "అవును, ఇవి నాలో ఉన్నాయి" అని గట్టిగా చదవండి. ఎప్పుడైతే మీరు వాటిని వెలుగులోకి తెస్తారో, వాటికి మిమ్మల్ని భయపెట్టే శక్తి పోతుంది. ఇక్కడే మీ కొత్త వ్యక్తిత్వానికి పునాది 'Build' అవుతుంది.Step 3: పరిపూర్ణతకు ఆవలపరిపూర్ణత (Perfection) అనేది ఒక భ్రమ. మనం మనుషులం, దేవుళ్ళం కాదు. మన లోపాలను అంగీకరిస్తూనే, వాటిని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే 'Beyond' స్టేజ్. ఇక్కడ మీరు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు.మీతో మీరు సంధి చేసుకోండిఈ రోజు ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఈ చిన్న పని చేయండి.మీలో మీకు నచ్చని మూడు విషయాలను గుర్తించండి. ఉదా: బద్ధకం, అసూయ, ఫిజికల్ అప్పియరెన్స్.ఆ మూడు విషయాల వైపు చూస్తూ.. "నిన్ను నేను అంగీకరిస్తున్నాను, నిన్ను మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను" అని మనసులో అనుకోండి.ఈ అంగీకారం తర్వాత మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉందో గమనించండి.గాయాలే మీ గుర్తులు!బ్రో, ఒక పగిలిన కప్పును బంగారంతో అతికించినప్పుడు (Kintsugi Art), అది మామూలు కప్పు కంటే ఎక్కువ విలువను, అందాన్ని పొందుతుంది. మన లోపాలు కూడా అంతే. వాటిని దాచకండి, వాటిని అంగీకరించి గౌరవించండి. అప్పుడే మీరు మీ Real Personality ని ప్రపంచానికి చూపగలరు.గుర్తుంచుకోండి, "You can't heal what you don't reveal."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Inner Critic: మిమ్మల్ని నిరంతరం వెనక్కిలాగే శత్రువుని జయించాలంటే..!) -
ముప్పై ఏళ్లకే గుల్లబారుతున్నాయి
మహిళల ఆరోగ్యంలో ఎముకల క్షీణత (ఆస్టియో పోరోసిస్) ఒక ప్రధాన సంక్షోభంగా మారుతోంది. ఒకప్పుడు మెనోపాజ్ దాటిన మహిళల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాధి నేడు 30 ఏళ్లకే ముంచుకొస్తుంది. ప్రీ–మెనోపాజల్ ఆస్టియో పోరోసిస్గా పిలిచే ఈ ఎముకల బలహీనత గత దశాబ్దంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 30 ఏళ్లకే...ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను (బోన్ డెన్సిటీ) 25 నుంచి 30 ఏళ్ల మధ్యే సాధిస్తుంది. ఒకసారి 30 ఏళ్లు దాటాక, కొత్త ఎముక ఏర్పడే వేగం కంటే పాత ఎముక అరిగి పోయే వేగం పెరుగుతుంది.80%భారతదేశంలో సుమారు 6.1 కోట్ల మంది ఆస్టియో పోరోసిస్తో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 80% మంది మహిళలే కావడం ఆందోళన కలిగించే అంశం.20–25%పట్టణ ప్రాంతాల్లో నివసించే 30 ఏళ్ల పైబడిన మహిళల్లో సుమారు 20% నుంచి 25% మందికి ఆస్టియో పీనియా (ఎముకలు పల్చబడటం – ఇది ఆస్టియో పోరోసిస్కు ముందు దశ) ఉన్నట్లు గుర్తించారు.70–80%∙భారతదేశంలోని మెట్రో నగరాల్లో 30 ఏళ్ల మహిళల్లో దాదాపు 70% నుంచి 80% మంది విటమిన్–డి లోపంతో బాధపడుతున్నారు. ఇది ఎముకలు కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది.50 ఏళ్లు∙50 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఎముక విరుపునకు గురవుతున్నారు.15%∙ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను 30 ఏళ్ల నాటికి చేరుకోవాల్సి ఉన్నా.. సరైన పోషకాహారం లేక పోవడం వల్ల 15% మంది మహిళలు అసలు గరిష్ట సాంద్రతను చేరుకోవడంలో విఫలమవుతున్నారు, దీనివల్ల వీరికి 45 ఏళ్లకే ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోంది.20%∙మెనోపాజ్ ప్రారంభమైన మొదటి 5 నుంచి 7 ఏళ్లలోనే మహిళలు తమ శరీరంలోని మొత్తం ఎముక ద్రవ్యరాశిలో 20% వరకు కోల్పోతున్నారు.2040∙ప్రస్తు్తతం 30 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు, తమ ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, 2040 నాటికి దేశంలో హిప్ ఫ్రాక్చర్ల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.21.2%∙ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లు పైబడిన మహిళల్లో సుమారు 21.2% మందికి ఆస్టియో పోరోసిస్ ఉందిముందు జాగ్రత్తలే ముఖ్యం∙ప్రతిరోజూ శరీరానికి కాల్షియం అందేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, రాగులు వంటివి తీసుకోవాలి ∙రోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాల పాటు సహజమైన ఎండ తగిలేలా చూసుకోవాలి ∙కేవలం నడక సరి పోదు, ఎముకలపై ఒత్తిడి కలిగించే వెయిట్–బేరింగ్ వ్యాయామాలు, యోగా ఉండేట్లు చూసుకోవాలి ∙50 ఏళ్లు దాటిన మహిళలు, ప్రమాద సూచనలు ఉన్నవారు తప్పనిసరిగా బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవాలి.ఎముకల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం కేవలం వృద్ధాప్యంలోనే కాదు, యవ్వనం నుంచే ప్రారంభమవడం ఎంతో ముఖ్యం. అందుకోసం తగిన పోషకాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
పరిశోధనల్లో దారి దీపాలు
‘ఈసురోమని మనుషులుంటే ఇస్రో వరకు వెళ్లగలమా!’ అనేది సరదా పేరడీ అయితే కావచ్చుగానీ... అక్షరాలా నిజం.సైన్స్లో ‘రాణించాలంటే ఆసక్తి అనే శక్తి ఉండాలి. ఆ శక్తికి ఉత్సాహశక్తితోడైతే ‘అన్వేషణ’ అనే భవన నిర్మాణం జరుగుతుంది.ఆ భవనంలో ఎన్నో పరిశోధన చిత్రాలను ఆవిష్కరించారు మన మహిళా శాస్త్రవేత్తలు. ‘సైన్స్ అనేది పురుషుల రంగం’ అనే మాటకుకాలం చెల్లిందని తమ ప్రతిభ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. సైన్స్ సామ్రాజ్యంలో సగర్వంగా విజయ పతాకం ఎగరేస్తున్నారు...శాస్త్రరంగంలో ‘షా’జీఆదిత్య ఎల్ 1 విజయవంతంగా ప్రారంభించిన తరువాత అక్కడి మిషన్ కంట్రోల్ సెంటర్ పోడియం దగ్గర నిలబడి ‘ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్కు సంబంధించిన కల నిజమైంది’ అన్నారు ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ. ‘కల నిజమైంది’ అనుకోవడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. తొలిసారిగా ఇంజినీరింగ్ కాలేజీలోకి అడుగుపెట్టినప్పుడు, ఇస్రోలోకి అడుగు పెట్టినప్పుడు ‘నా కల నిజమైంది’ అనుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కలలు కంటూ వాటిని సాకారం చేసుకుంటూ వస్తున్నారు. 1987లో షాజీ ఇస్రోలోకి అడుగు పెట్టారు. ‘వీనస్ మిషన్’కు అధ్యయన డైరెక్టర్గా, రిసోర్సెస్–2 ఏకి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేయడంతో పాటు ఎన్నో ఉపగ్రహ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి సౌరమిషన్ ‘ఆత్య–ఎల్1’కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా సేవలందించడం ఆమె కెరీర్లో మైలు రాయి. శాస్త్ర రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న షాజీ ఇమేజ్ కంప్రెషన్, సిస్టమ్ ఇంజినీరింగ్లపై రచనలు చేశారు.ఆకాశదేశాన...చిన్నతనంలో అన్నపూర్ణి ఆకాశంలోని నక్షత్రాలను ఆసక్తిగా చూసేవారు. నక్షత్రాలు, ఖగోళ విషయాలపై అమితాసక్తి ఆమెను ఎక్కడి వరకు తీసుకు వెళ్లిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్గా పనిచేసేవరకు.‘సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ల గురించి చాలా మంది పిల్లలు భయపడతారు. ముందు ఆ భయాలను వదిలి వేయండి. నిస్సంకోచంగా, నిర్భయంగా వాటిని అధిగమించి దగ్గరకు వచ్చేయండి. ఆ తరువాత అవి మీకు ఆత్మీయ నేస్తాలు అవుతాయి’ అంటారు డా.అన్నపూర్ణి సుబ్రమణ్యమ్.సైంటిఫిక్ ఫిలాసఫీకంప్యుటేషనల్ బయాలజీ లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శాస్త్రవేత్త సంఘమిత్ర బందోపాధ్యాయ. ఎవల్యూషనరీ కంప్యుటేషన్, మెషిల్ లెర్నింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్లో ఆమె పరిశోధనలు చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) తొలి మహిళా డైరెక్టర్గా పనిచేసిన సంఘమిత్ర ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేస్తున్నారు. పాఠశాల రోజుల్లో సంఘమిత్ర జీవశాస్త్రం అంటేనే భయపడేవారు. ఆ తరువాత కాలంలో ఆ భయాన్ని పోగొట్టుకొని ఇష్టాన్ని పెంచుకున్నారు. శాస్త్రరంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. ‘అంకితభావంతో పనిచేసినప్పుడు అద్భుతాలు సాధించవచ్చు’ అనేది ఆమె సైంటిఫిక్ ఫిలాసఫీ. ‘ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్’ విభాగంలో ఇన్ఫోసిస్ ప్రైజ్, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్లు గెల్చుకున్నారు. .....శాస్త్రరంగంలో సత్తాచాటుతున్న మహిళల్లో వీరు కొందరు మాత్రమే. అందరికీ వందనాలు.అప్పుడే మహిళల పురోగతిగౌరవప్రదమైన వాతావరణంలోనే సైన్స్ రంగంలో మహిళల పురోగతి సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను. నాయకత్వ సామర్థ్యం, సంస్థాగత సంస్కృతి వ్యక్తిగత అభివృద్ధిని గణనీయంగా ఎలా ప్రభావితం చేస్తాయో స్వయంగా చూశాను. నా పీహెచ్డీ తరువాత పరిశోధనలను విలువైనవిగా భావించినప్పటికీ, శాస్త్రీయ సమాజానికి మద్దతు ఇవ్వడం ద్వారా విస్తృత ప్రభావాన్ని కలిగించవచ్చుని గ్రహించాను. ఐకేపీ నాలెడ్జ్ పార్క్లో బయో–ఇంక్యుబేషన్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడం, స్కేలింగ్ చేయడం అనేది నా వరకు ఒక మైలురాయిగా మారింది. నా దృష్టిలో ‘సైన్స్లో పురోగతి’ అంటే జ్ఞానం నుంచి ఆవిష్కరణల వరకు నా ప్రభావ పరిధిని విస్తరించడం.– డా. ప్రియాంకన ముఖర్జీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్–బయోనెస్ట్, ఐకేపీ నాలెడ్జ్ పార్క్వారి ప్రోత్సాహమే నా బలంసైన్స్ రంగంలో మహిళల ప్రయాణం సంవత్సరాలుగా సాగుతుంది. అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతిలో నేను భాగం అయినందుకు గర్వపడుతున్నాను. మహిళలు శాస్త్రీయరంగంలోకి ఎలా అడుగు పెడుతున్నారు అనేదానికి నిదర్శనమే నా ప్రయాణం. సైన్స్లో చాలామంది మహిళల మాదిరిగానే వృత్తిపరమైన, బాధ్యతలను కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకున్నాను. మైక్రోబయాలజీలో ఎం.ఎస్సీ. పూర్తి చేసిన తరువాత రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నా కెరీర్ ప్రారంభించాను. ఇతరులతో కలిసి పనిచేస్తూనే మైక్రోబయాలజీలో పీహెచ్డీని విజయవంతంగా పూర్తి చేశాను. శాస్త్రీయ ఆలోచనలను సంస్థలుగా రూపాంతరం చెందేలా చేయడంలో సాయం చేస్తున్నాను.– డాక్టర్ సుధా కళ్యాణి, సీనియర్ మేనేజర్ అండ్ హెడ్, లైఫ్ సైన్స్ ఇంక్యుబేటర్, ఏకేపీ నాలెడ్జ్ పార్క్కాదంబిని గంగూలీకలకత్తా మెడికల్ కాలేజీ (1884)లో ప్రవేశం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబిని. తొలి మహిళా డాక్టర్, ప్రాక్టిషినర్గా చరిత్ర సృష్టించారు.మేరీ పూనెన్ లూకోస్భారతదేశంలో తొలి మహిళా సర్జన్ జనరల్ మేరీ పూనెన్ లూకోస్. మన దేశంలో తొలి మహిళా ప్రసూతి వైద్యురాలు.ఆనందీ బాయి జోషిపాశ్చాత్య వైద్యంలో పట్టా పుచ్చుకున్న తొలి మహిళా వైద్యురాలు ఆనందీ బాయి. బాంబే ప్రెసిడెన్సీ నుండి యూఎస్కు వెళ్లి పాశ్చాత్య వైద్యంలో రెండేళ్ల డిగ్రీ చేశారు.జానకీ అమ్మాల్ఎడవలత్ కక్కట్ జానకి అమ్మాల్ ప్రసిద్ధ బోటనిస్ట్. మొక్కల పెంపకం, సైటోజెనెటిక్స్, పైటోజియోగ్రాఫీలో పరిశోధనలు చేశారు. అల్హాబాద్లోని సెంట్రల్ బొటానికల్ లేబొరేటరీ తొలి డైరెక్టర్ (1952)కమలా సోహోనీకమలా సోహోనీ ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త. 1939లో శాస్త్రీయ విభాగంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళ.అసిమా ఛటర్జీఅసిమా ఛటర్జీ ప్రముఖ సేంద్రియ రసాయన శాస్త్రవేత్త. కలకత్తాలోని ఇండియన్ యూనివర్శిటీ నుండి 1944లో సైన్స్లో డాక్టరేట్ పొందిన తొలి మహిళ.కమల్ జయసింగ్ రణదివేకమల్ రణదివే ప్రసిద్ధ బయోమెడికల్ పరిశోధకురాలు. ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు. ముంబైలోని ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో తొలిసారిగా టిష్యూ కల్చర్ రిసెర్చ్ ల్యాబ్ని ప్రారంభించారు.బీబా చౌదరిభారతదేశంలోని తొలి మహిళా భౌతికశాస్త్రవేత్తలలో బీబా చౌదరి ఒకరు. ఎన్నో విలువైన పరిశోధనలు చేసినప్పటికీ మహిళా శాస్త్రవేత్తగా ఆమెకు రావల్సిన గుర్తింపు రాలేదు.పూర్ణిమా సిన్హాభౌతికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి బెంగాలీ మహిళలలో పూర్ణిమా సిన్హా ఒకరు. ఎక్స్–రే క్రిస్టలాగ్రఫీ రంగంలో విశేష కృషి చేశారు.అన్నా మణిఅన్నా మణి ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. భారతవాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు. పుణేలోని వాతావరణశాస్త్ర విభాగంలో చేరిన తొలి మహిళ. విండ్ ఎనర్జీ ఇన్స్ట్రుమెంట్కు సంబంధించి విశేష కృషి చేశారు. -
టూత్పిక్తో టవర్ నిర్మించి రికార్డు సృష్టించాడు..!
ఒక రంగంపై మంచి ఆసక్తి ఎంతటి అనితరసాధ్యమైనదైనా సాధించేలా చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ యువకుడు. అతడికి ఇంజనీరింగ్ పట్ల ఉన్న మక్కువ ఏకంగా అత్యంత అల్పమైన టూత్పిక్లతో టవర్ నిర్మించేలా చేసి, గిన్నిస్ రికార్డులకెక్కేలా చేసింది. ఆ కుర్రాడు ఎవరంటే..యునైటెడ్ స్టేట్స్లోని ఇల్లినాయిస్లోని నేపర్విల్లేకు చెందిన ఎరిక్ కేబుల్ అనే యువకుడు ఇంజనీరింగ్ పట్ల తనకున్న ప్రేమను రికార్డు క్రియేట్ చేసే విజయంగా మార్చుకున్నాడు. నెలల తరబడి టూత్పిక్లు జిగురు మాత్రమే ఉపయోగించి 17 అడుగుల ఎత్తైన టవర్ని నిర్మించాడు. ఈ నిర్మాణం ఎత్తు 5.28 మీటర్లు. ఇది పూర్తిగా టూత్పిక్తో నిర్మించిన ఎత్తైన భవనంగా నిలిచి..గిన్నిస్ రికార్డులకెక్కింది.ఆ యువకుడు ప్రసిద్ధ ఈఫెల్ టవర్ని ప్రేరణగా తీసుకుని ఈ ఎత్తైన టవర్ని నిర్మించినట్లు తెలిపాడు. ఆ యువకుడు ఎరిక్ 2020లో పాప్సికల్ స్టిక్స్తో ఎత్తైన టవర్ని నిర్మించి రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా ఇప్పుడు ఈ టూత్పిక్లతో తన రికార్డుని తానే బ్రేక్ చేశాడు. చిన్న వయసులో రికార్డులు సృష్టించడం ఒక థ్రిల్లింగ్ అనుభవం అని, అందుకే మళ్లీ మళ్లీ అలాంటిదే చేయాలనే ఆకాంక్ష బలంగా ఉంటుందంటున్నాడు ఎరిక్. అయితే ఈసారి మరింత కఠినతరమైనది నిర్మించాలనే ఛాలెంజ్ తీసుకున్నానని అన్నాడు. ఆ నేథ్యంలో ఇలా టూత్పిక్లు ఎంచుకున్నానట్లు తెలిపాడు. ఇవే ఎందుకంటే పాప్సికల్ స్టిక్స్ అంత బలంగా ఉండదు కాబట్టి వీటితే నిర్మిస్తేనే కథ అసలైన టాలెంట్, కిక్ అని అంటున్నాడు ఎరిక్. ముందుగా చిన్న చిన్న నిర్మాణాలను నిర్మించడం సాధన చేసి..ఆ తర్వాత పెద్ద టవర్ని నిర్మించేందుకు ఉపక్రమించానని అంటున్నాడు. ఆ టవర్ లోపలి ప్రత్యేక విభాగాలను ఇంటివద్ద నిర్మించి ఆ తర్వాత నేపర్విల్లేలోని ఒక బహిరంగ కార్యక్రమంలో దాన్ని నిర్మించినట్లు వివరించాడు. STEM (స్టెమ్) అనే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ కలయికతో కూడిన ప్రతిష్టాత్మక కోర్సుపై ఉన్న మక్కువ వల్లే రికార్డు స్థాయిలో ఈ టూత్పిక్ టవర్ని నిర్మించాడు. (చదవండి: రష్మిక మందన్న మేలి ముసుగుపై శక్తిమంతమైన ఆ పదాలు..!) -
ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్
లవ్బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్లో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లిని అత్యంత గోప్యంగా నిర్వహింకున్న వీరిద్దరూ పెళ్లి వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. ఏఐ కాదు ఒరిజినల్ అంటూ తమ అభిమాన నటుల వెడ్డింగ్ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే సంస్కృతి,కళ, సంప్రదాయాల ప్రాముఖ్యతల కలయికతో రాజసం ఉట్టిపడేలా , ప్రత్యేకంగా చేత్తో తయారు చేసిన ఆభరణాలు వారి రాయల్ వెడ్డింగ్ను మరింత వైభోగంగా మార్చాయి. విరోష్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో రికార్డ్ సృష్టించాయి.కర్ణాటకకు చెందిన మందన్న కొడవ వంశం, దేవరకొండ తెలుగు మూలాల సంప్రదాయాలను గౌరవిస్తూ రాయల్ లుక్లో అదరగొట్టారు. ఈ జంట దక్షిణ భారత సాంప్రదాయ వివాహ దుస్తులు , పురాతన ఆలయ ఆభరణాలతో స్వర్గం నుండి దిగివచ్చిన దేవతల్లా కనిపించారు. విరోష్ వివాహంలో వధూవరుల ఆభరణాలు, ముఖ్యంగా విజయ్ దేవర కొండ ధరించిన చెవి రింగ్స్, సాంప్రదాయ హరామ్లు, స్టేట్మెంట్ ఝుమ్కాలు, జడ బిల్లా, చంపసరాలు, హత్ఫూల్, మఠపట్టి, ముక్కు పిన్, గాజులు, బాజుబంద్, నడుము బెల్ట్, చోకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హై-రిలీఫ్ నక్షి పని , క్లిష్టమైన రావ గ్రాన్యులేషన్ లాంటి మాస్టర్ ఆర్టిస్టులచే చేతితో రూపుదిద్దుకున్నాయని ఆభరణాల నిపుణులు పేర్కొన్నారు. ఈ వివాహ ఆభరణాలను ఒక బలమైన థీమ్తో రూపొందించారట. విజయ్ను ఒక శక్తివంతమైన రాజుగా, రష్మికను ఒక దేవతగా ప్రతిబింబించేలా ఈ డిజైన్లు శ్రీ జ్యువెలర్స్ (Shree Jewellers) తీర్చిదిద్దింది.పది నెలల కష్టం.. కిలోల కొద్దీ బంగార అద్భుత సృష్టిన్యూస్ 18 కథనం ప్రకారం, శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్ , కౌశిక్ కుమార్ ఈ జంటతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. విరోష్ జీవితంలో ఒక ముఖ్యమైన వేడుకలో తాము భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ ఆభరణాల తయారీకి సంబంధించి ఆలోచన మొదలు , చివరి రూపం తీసుకొచ్చేవరకు సుమారు పది నెలల సమయం పట్టింది. ఇందులో క్రియేటివ్ చర్చలు, కస్టమైజేషన్, మేకింగ్ , స్టైలింగ్ వంటి అనేక దశలు ఉన్నాయి. దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతులైన రావా గ్రాన్యులేషన్ (Rava granulation) దీప్ నక్షి (Deep Nakshi)తో ఈ కళాఖండాలను రూపొందించారు.దేవతలా రష్మిక మందన్నవివాహ వేడుకలో రష్మిక 11 రకాల ప్రత్యేక ఆభరణాలతో మెరిసిపోయింది.దక్షిణ భారత దేవాలయ శిల్పాల నుండి స్ఫూర్తి పొంది, అనుభవజ్ఞులైన కళాకారుల నక్షి పనితనం,యాంటిక్ మ్యాట్ పాలిష్ (Antique matte polish) ఆభరణాలు ఆకర్షణీయంగా నిలిచాయి. లేయర్డ్ చోకర్, సాంప్రదాయ హారాలు, జుంకాలు, జడ బిళ్ళ, చెంపసరాలు, హాత్ ఫూల్, మఠాపట్టి, ముక్కు పుడక, గాజులు, బాజుబంద్ (వంకీ), వడ్డాణం , పట్టీలు ఈ సెట్లో ఉన్నాయి. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, తరతరాలకు గుర్తుండిపోయే వారసత్వ ఆభరణాలుగా (Heirloom pieces) నిలిచిపోయేలా రూపొందించబడ్డాయి.విజయ్ దేవరకొండ అలంకరణ: సాధారణంగా భారతీయ వివాహాల్లో వరుడి ఆభరణాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ విజయ్ దేవరకొండ ట్రెండ్కు భిన్నంగా పెద్ద చెవిపోగులు, మణికట్టు కఫ్, ఉంగరం రెండు నెక్లెస్లు, కాళ్లకు కడియాలు, నడుము ఆభరణాలతో పురుషుల వెడ్డింగ్ జ్యువెలరీకి విజయ్ కొత్త మార్క్ను క్రియేట్ చేశారు. డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన రస్ట్ ఆరెంజ్ చీరను ధరించగా, విజయ్ దేవరకొండ ఐవరీ ధోతీ , ఎరుపు రంగు అంగవస్త్రంతో కళకళలాడుతూ అలరించారు. -
రష్మిక మందన్న మేలి ముసుగుపై శక్తిమంతమైన ఆ పదాలు..!
టాలీవుడ్ సెలబ్రిటీ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి26, 2026న గురువారం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయపూర్ వెలుపల 50 కి.మీ దూరంలో ఉన్న అద్భుతమైన ఐటీసీ మెమెంటోస్లో వీరి వివాహం జరిగింది. అయితే వీరిద్దరు తమ పెళ్లిలో ఎంచుకున్న కాస్ట్యూమ్స్ మొత్తం సాంస్కృతిక వారసత్వానికి అర్థం పట్టేలా ఎంచుకున్నారు. ఆధునికతను జోడిస్తూ..సాంప్రదాయ విలువలకు అనుగుణంగా తీర్చిద్దిన డిజైనర్ వేర్లో ముగ్ధమనోహరంగా మెరిశారు. అయితే పెళ్లిలో దాంపత్య విలువను తెలియజేసే పెళ్లి మంత్రాల మాదిరిగా తాను ధరించిన చీరలో సైతం దాన్ని ప్రదర్శించింది రష్మిక. అది ఆ వేడుకనే నిశబ్దంగా హైలెట్ చేసింది. ఇక్కడ రష్మిక ధరించిన ముసుగుపై ఉన్న మూడు శక్తిమంతమైన పదాలు వైవాహిక బంధం గొప్పతనం తెలియజేసేలా చాలాచక్కగా పొందుపరిచారు. ఇంతకీ అక్కడ ఏమని రాశారంటే..రష్మిక పెళ్లివేడుకలో లేత ఎరుపు గోల్డ్ అంచు చీరలో మెరిశారు. మొత్తం చీరపై ఆలయ ప్రేరేపిత ఎంబ్రాయిడరీలు, తోరణాలు, స్థంబాలు, పవిత్రమైన మోటీఫ్లతో చాలా వివరణాత్మకంగా తీర్చిదిద్దారు. వాటిలో హైదరాబాద్ చారిత్రాత్మక వాస్తుశిల్పం నుంచి గర్భగుడులు, ఆధ్యాత్మికతకు సంబంధించి.. ఆలయ గృహనమునాలతో ఎంబ్రాయిడరీ చేశారు. బంగారు జరీ వర్క్తో డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా బ్లౌజ్ సైతం బంగారు థ్రెడ్వర్క్తో చక్కటి ఎంబ్రాయిడరీతో హుందాగా ఉంది. దానికి రాయల్టీ లుక్క్ఇచ్చేలా ధరించిన బంగారు మేలి ముసుగు అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. చూపురులను ఆ ముసుగు బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దానిపై ఉన్న బంగారు ఎంబ్రాయిడరీతో రాసిన ఆ " ప్రతి జీవితకాలంలో" అనే పద బంధం అందర్నీ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. అంటే.. జీవితాంతం ఒకరికొకరు మనం వేరు కాదు, ఇది జన్మజన్మల బంధం అని చెబుతూ భావోద్వేగంగా అందరి హృదయాలను తాకింది. వైవాహిక జీవిత గొప్పదనాన్ని ఈ చిన్న పద బంధంతో చాలా అద్భుతంగా హైలెట్ చేసి చెప్పారు. ఒకరకంగా ఇది ఆ డిజైనర్ నైపుణ్యాన్ని నొక్కి చెప్పింది కూడా. ఇక రష్మిక అందుకు తగ్గట్టు ధరించిన ఆభరణాలు గజిబిజి కాకుండా చాలా చక్కగా పెట్టిన తీరు చాలా బాగుంది. నెక్లైన్ నుంచి లేయర్డ్ ఆభరణాలు, చోకర్లు ఆ చీర లుక్ని మరింత హైలెట్ చేశాయి.అలాగే తలపై ధరించిన పాపిడి బొట్టు సైతం చెదరకుండా చక్కగా అమర్చారు. రష్మిక మొత్తం ఆహార్యం దివి నుంచి భువికి వచ్చిన దేవ కన్యలా అబ్బురపరిచింది. ఇక హీరో విజయ్ దేవరకొండ అనామిక ఖన్నా డిజైనర్ వేర్ ఐవరీ ధోతీ సిల్హౌట్ ధరించి అద్భుతమైన వెర్మిలియన్ అంగవస్త్రంతో రాజకుమారుడిలా కనిపించారు. ఆయన ధరించి ధోతి హైదరాబాద్ వారసత్వం వనసింగారం నేత, దానిపై అడవి, ఆలయ మూలాంశాలతో కూడిన ఎంబ్రాయిడరీ మన సాంస్కృతిక వారసత్వ శక్తిని హైలెట్ చేశాయి.(చదవండి: నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్..! ఈ చీరకట్టు స్పెషాల్టీ ఇదే..) -
నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్..!
నటి రష్మిక మందన్న పెళ్లి గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో, సాయంకాలం కొడగు (కూర్గి) సంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరిగింది. తన సంప్రదాయ మూలాలను మర్చిపోకుండా కొడగు స్టైల్ కట్టును వివిధ సందర్భాలలో ధరించడం మనం చూశాం. వివాహం, ఇతర వేడుకలలో కొడగు సంప్రదాయ చీరకట్టుదే ప్రత్యేక ఆకర్షణ.రష్మిక వివాహ వేడుక సందర్భంగా కొడగు చీరకట్టు ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశ సంప్రదాయ డ్రేపింగ్ శైలిలో విలక్షణంగా కనిపించే కొడగు కట్టును రీ క్రియేషన్ చేసి, బాలీవుడ్ క్లాసిక్ సినిమాలలోనూ కనువిందు చేశారు తారలు. కొడగు స్టైల్ డ్రేప్ ట్రెండ్ గురించి..కర్నాటకలోని కొడగు జిల్లాలో మగువల చీరకట్టులో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ శారీ డ్రేపింగ్. కొండ ప్రాంతంలో పుట్టిన సంప్రదాయ శైలి ఇది. కొడగు లేదా కొడవ లేదా కూర్గి అని పిలిచే కమ్యూనిటీలోని వివాహ సమయంలో అక్కడి వధువు జరీ అంచుతో ఉన్న పట్టు చీరను వారి సంప్రదాయ శైలిలో ధరిస్తుంది. ఇది కేవలం ఒక శైలి కాదు ఒక తరం నుండి మరొక తరానికి అందివస్తున్న వారసత్వం. ఈ చీరకట్టు కొడవ మహిళల బలం, అందం, స్వాతంత్య్రాన్ని ప్రతిబింబింపజేస్తుంది. వేడుకలలో సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ, బంగారు రంగులలో .. జరీ అంచుతో ఉండే కాంతిమంతమైన పట్టు చీరలను ఎంచుకుంటారు. ఇవి శుభాన్ని, శ్రేయస్సును తీసుకువస్తాయని వారి నమ్మకం.నడుము వద్ద చీరను పెట్టికోట్ లోపలికి టక్ చేస్తారు. సాధారణ చీరకట్టుకు భిన్నంగా ముందు వైపు కాకుండా కూర్గి శారీ డ్రేప్కు వెనకవైపు కుచ్చిళ్లు పెడతారు.చీరను రెండుసార్లు శరీరం చుట్టూ తిప్పుతూ, చీర పల్లూ ఛాతీ మీదుగా ఎడమ భుజం కింద నుంచి, కుడి భుజం పై నుంచి ముందుకు తీస్తారు.కుడి భుజం నుంచి తీసిన పల్లూని బ్లౌజ్తో కలిపి పిన్తో అటాచ్ చేస్తారు. పల్లూ అలంకరణ కొంత వరకు బెంగాలీ స్టైల్ను పోలి ఉంటుంది. కొడవ సంప్రదాయ ఆభరణాలలో చంద్రవంక, నాగాభరణం.. వంటి పొడవాటి హారాలతోపాటు ఇతర సంప్రదాయ నగలను అలంకరించుకుంటారు.కొడవ యువతులు షిఫాన్, జార్జెట్, ఆర్గంజా చీరలతో డ్రేపింగ్లో వివిధ రకాల ప్రయోగాలు చేస్తారు.యువతుల కోసం రెడీమేడ్ కొడవ కట్టు శారీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక ఆకర్షణతో ఉండే బెల్టులు, బ్రోచ్లు ఈ కట్టుకు ఇప్పుడు ఫ్యూజన్ ట్విస్ట్ను తీసుకువస్తున్నాయి. View this post on Instagram A post shared by राशि रमा शर्मा (@_wearyourstory__) (చదవండి: ఆ పాదాలకు నమస్కారం..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..) -
మిమ్మల్ని నిరంతరం వెనక్కిలాగే శత్రువుని జయించాలంటే..!
మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు, "ఇది నీవల్ల కాదులే", "అందరూ చూసి నవ్వుతారు", "గతంలో కూడా ఇలాగే ఫెయిల్ అయ్యావుగా" అని మీ లోపల ఒక గొంతు వినిపిస్తుందా? ఆ గొంతుకనే సైకాలజీలో 'The Inner Critic' అంటారు. ఈ శత్రువు బయట ఎక్కడో లేడు, మీ మెదడులోనే ఉంటూ మిమ్మల్ని నిరంతరం వెనక్కి లాగుతుంటాడు.ఈ 'ఇన్నర్ క్రిటిక్' ఎక్కడి నుండి వస్తుంది?మనం పుట్టినప్పుడు ఈ విమర్శించే స్వభావంతో పుట్టము. మన చిన్నతనంలో మనపై ప్రభావం చూపిన వ్యక్తుల మాటలే మనకు పెద్దయ్యాక ఈ లోపలి గొంతుకగా మారతాయి.కండిషనింగ్: చిన్నప్పుడు మిమ్మల్ని అతిగా విమర్శించిన తల్లిదండ్రులు, టీచర్లు లేదా బంధువుల మాటలు మీ సబ్-కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోతాయి.సర్వైవల్ మెకానిజం: మన మెదడు మనల్ని ప్రమాదాల నుండి రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఏదైనా కొత్త పని చేసినప్పుడు అవమానం జరుగుతుందేమో అన్న భయంతో, ఆ మెదడు ఈ 'ఇన్నర్ క్రిటిక్'ను వాడి మిమ్మల్ని ఆపేస్తుంది.ఇన్నర్ క్రిటిక్ రకాలు: మీది ఏ రకం?సైకాలజిస్ట్ Jay Earley ప్రకారం, ఈ అంతర్గత విమర్శకుడు రకరకాలుగా ఉంటాడు:The Perfectionist: "ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే అసలు చేయకు" అని ఒత్తిడి తెస్తాడు.The Taskmaster: "నువ్వు ఇంకా కష్టపడాలి, విశ్రాంతి తీసుకోవడం తప్పు" అని వేధిస్తుంటాడు.The Destroyer: "నువ్వు పుట్టడమే ఒక తప్పు, నువ్వు దేనికీ పనికిరావు" అని మీ ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తాడు.అణచివేస్తే అణిగిపోదు"నీ లోపలి గొంతును అణచివేయి, దాన్ని చంపేయ్" అని ట్రైనర్స్ చెప్తారు. కానీ సైకాలజీ ప్రకారం, మీరు దేన్నైతే అణచివేయాలని చూస్తారో, అది ఇంకా బలంగా తయారవుతుంది.మార్కెట్ విమర్శను ద్వేషించమంటుంది. సైకాలజీ ఆ గొంతు వెనుక ఉన్న 'భయాన్ని' అర్థం చేసుకోమంటుంది.విమర్శకుడిని స్నేహితుడిగా మార్చుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ గొంతును ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం.Step 1: గుర్తించి పేరు పెట్టండిఆ నెగటివ్ ఆలోచనలు రాగానే, అవి "మీవి" కాదని గుర్తించండి. "నేను ఫెయిల్ అవుతాను" అనడానికి బదులు, "నా లోపల ఉన్న విమర్శకుడు నేను ఫెయిల్ అవుతానని భయపడుతున్నాడు" అని అనండి. వీలైతే ఆ గొంతుకు ఒక పేరు పెట్టండి. ఉదాహరణకు: 'మిస్టర్ డౌట్'.దీనివల్ల ఆ గొంతుకు, మీ అసలు వ్యక్తిత్వానికి మధ్య ఒక దూరం ఏర్పడుతుంది (Cognitive Defusion). ఇదే పాత అలవాటును 'Break' చేయడం.Step 2: సెల్ఫ్-కంపాషన్మీ ప్రాణ మిత్రుడు ఏదైనా తప్పు చేసినప్పుడు మీరు అతన్ని ఎలా ఓదారుస్తారో, మిమ్మల్ని మీరు అలాగే ఓదార్చుకోండి."పర్లేదు, తప్పులు అందరూ చేస్తారు, మళ్ళీ ప్రయత్నిద్దాం" అని మీతో మీరు మాట్లాడుకోండి. ఒక సపోర్టివ్ ఇన్నర్ వాయిస్ని 'Build' చేయండి.Step 3: పర్పస్ డ్రైవెన్ లైఫ్మీరు ఒక పెద్ద లక్ష్యం (Legacy) కోసం పని చేస్తున్నప్పుడు, ఈ చిన్న చిన్న విమర్శలు మీకు వినిపించవు. మీ లోపలి విమర్శకుడు చెప్పేది కేవలం ఒక అభిప్రాయం మాత్రమే, అది వాస్తవం కాదు అని తెలిసినప్పుడు మీరు 'Beyond' స్టేజ్లో ఉన్నట్లు.ఈ రోజు మీ విమర్శకుడు ఏం చెప్పాడు?ఒక పెన్ను, పేపర్ తీసుకోండి, ఈ ప్రశ్నలకు సమాధానం రాయండి. ఈ రోజు మీ గురించి మీరు అనుకున్న ఒక నెగటివ్ మాట ఏంటి?ఆ మాట వెనుక ఉన్న భయం ఏంటి? ఉదా: నలుగురు ఏమనుకుంటారో అన్న భయమా?అదే మాట మీ మిత్రుడు తన గురించి తాను అంటే, మీరు అతనికి ఏం సమాధానం చెప్తారు? ఆ సమాధానాన్నే మీకు మీరు చెప్పుకోండి.మీకు మీరే అతిపెద్ద సపోర్టర్ అవ్వాలి!బ్రో, ప్రపంచం మిమ్మల్ని విమర్శించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కనీసం మీ తల లోపల అయినా మీరు మీ వైపు ఉండాలి.మీ 'ఇన్నర్ క్రిటిక్'ను ఒక కఠినమైన యజమానిలా కాకుండా, మీ క్షేమం కోరే ఒక భయపడిన పిల్లాడిలా చూడండి. అతనికి ధైర్యం చెప్పి ముందుకు సాగండి.గుర్తుంచుకోండి, "You have been criticizing yourself for years and it hasn’t worked. Try approving of yourself and see what happens."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా మెరుగుపరుచుకోవాలి..?) -
పిల్లలతో ఆటాపాటా.. వృద్ధులకు ఉల్లాసం
మనవళ్లు, మనవరాళ్లతో గడపడం అనేది వృద్ధుల బ్రెయిన్కు మంచి టానిక్లా పని చేస్తుందని డచ్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది. పిల్లల సంరక్షణలో పాలు పంచుకునే వృద్ధుల జ్ఞాపకశక్తి మిగతా వారితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు తేలింది. అంతేకాదు, దానివల్ల వారికి వయసు పరంగా వచ్చే మానసిక సమస్యల నుంచి కూడా రక్షణ లభిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం కోసం 67 ఏళ్ల సగటు వయసు కలిగిన 2887 మంది తాతాబామ్మలను ఎంపిక చేశారు. కొన్ని ఏళ్లపాటు వీరిని పరిశీలనలో ఉంచి డేటాను సేకరించారు. పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారు, వారికి కథలు చెప్పడం, సందేహాలు తీర్చడం వంటì వాటిలో వారు ఎంత చురుగ్గా పాల్గొంటున్నారో వారి పరిశోధనలో విశ్లేషించగా... పిల్లల సంరక్షణలో పాల్గొనే వారిలో జ్ఞాపకశక్తి, పదాలను స్పష్టంగా ఉపయోగించే పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు పరిశోధనలో తేలింది. పిల్లలతో అనుబంధం ఉండే వృద్ధులలో వారి శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. పిల్లలతో మాట్లాడటం, వారికి విషయాలు వివరించడం వల్ల మెదడు కణాలు చురుగ్గా ఉంటాయి. పిల్లల వెనుక పరుగెత్తడం, వారితో ఆడుకోవడం వల్ల తెలియకుండానే వ్యాయామం జరుగుతుంది. మెరుగైన రక్తప్రసరణ వల్ల మెదడుకు ఆక్సిజన్ అందుతుంది, ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే, పిల్లల ఆలనాపాలనా చూడటం అనేది కేవలం సరదా కోసం, బాధ్యత కోసం కాదు, వృద్ధాప్యంలో మెదడు చురుగ్గా ఉండటానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు తెలియజేశారు. -
గాసిప్ మా బలం
స్త్రీలు గాసిప్ మాట్లాడుకుంటూ ఉంటారనే ఒక ప్రచారం ఉంటుంది. ఆడవాళ్ల కబుర్ల కింద వీటిని కొట్టేస్తూ ఉంటారు. కాని ‘గాసిప్’ స్త్రీల స్నేహానికి ఒక వారధి అని, స్త్రీలు ఒకరితో మరొకరు చెప్పుకునే ఈ కబుర్లే పురుషుడి పెత్తనం నుంచి బయట పడేసే ఓదార్పు అని అంటున్నారు అంజలీ కృష్ణదాస్. కేరళకు చెందిన ఈ రంగస్థల నటి మరో ఇద్దరు నటీమణులతో కలిసి ప్రచారం చేస్తున్న ‘గాసిప్’ నాటకం స్త్రీల స్నేహాలపై కొత్త దృష్టిని కలిగిస్తోంది.అర్థవంతమైన మాటలు, దేశాన్ని ఉద్దరించే మాటలు మగవాళ్లు మాట్లాడుకుంటారట... ఆడవాళ్లు ఉత్త పోచికోలు కబుర్లు చెప్పుకుంటారట. అలా అని ఎవరన్నారు? మగాళ్లే. ఆడవాళ్ల మాటలకు అర్థాలు ఉంటాయని, ఆడవాళ్ల మాటల్లో ఆలోచనలు ఉంటాయని వారికి తెలుసునా?‘తెలియ చేయాలి’ అంటారు అంజలి కృష్ణదాస్. ఈమె ‘కొచ్చి’కి చెందిన క్లాసికల్ డాన్సర్. మరో క్లాసికల్ డాన్సర్ పొన్ను సజీవ్తో కలిసి అక్కడ ‘తుడిప్పు డాన్స్ ఫౌండేషన్’ అనే సంస్థను నడుపుతున్నారు. తన సంస్థ ద్వారా అందరూ స్త్రీలే భాగస్వామ్యం వహించేలా ఒక నాటకం వేయాలని అనుకున్నప్పుడు ఆమె దృష్టికి వచ్చిన వస్తువు ‘గాసిప్’. దీనికి సరైన తెలుగు మాట లేదు. గుసగుసలు, కబుర్లు, చాడీలు, పుకార్లు... అన్నీ కలిపితే గాసిప్. ఆడవాళ్లు ‘గాసిప్’ ఎందుకు మాట్లాడతారు? వాళ్లు మాట్లాడేదంతా గాసిప్పేనా? ఆ సంగతి చర్చించడానికే 45 నిమిషాల ‘గాసిప్’ అనే డాన్స్ డ్రామా సృష్టించారు అంజలి కృష్ణదాస్, పొన్ను సజీవ్.గాసిప్కు మూలం ఏమిటి?‘గాసిప్’ ఇంగ్లిష్ మాటకు మూలం గాడ్సిబ్. పూర్వం నెలలు నిండిన స్త్రీలు ఇంటి బయటకు వచ్చేవారు కాదు. ప్రసవం అయ్యాక కూడా కొన్నాళ్లు వాళ్లు బయటకు రావడానికి వీలుండదు. మరి ఇంట్లో అలాగే మగ్గితే విసుగెత్తి పోతారు. అందుకే ఆ సమయంలో నమ్మకంగా ఇంటికొచ్చి ఇరుగూ పొరుగున ఏం జరుగుతుందో చెప్పే స్నేహితురాళ్లను గాడ్సిబ్ అనేవారు. నెమ్మదిగా ఆ మాట నుంచి గాసిప్ పుట్టింది. ‘గాసిప్ను కాలక్రమంలో చెడ్డ మాటను చేశారు. కాని అది స్త్రీల మధ్య స్నేహానికి సంబంధించిన పదం. ఆ పూర్వపు మర్యాద ఆ పదానికి తీసుకురావడమే మా ప్రయత్నం’ అన్నారు అంజలీ కృష్ణదాస్.బూట్లూ– హైహీల్సూ‘గాసిప్’ నాటకంలో చాలాచోట్ల మగవాళ్ల బూట్లు ప్రదర్శిస్తారు నటీమణులు. ‘హీరో బూట్ల మీదే షాట్ ఓపెన్ చేస్తారు ఎందుకు? బూట్లు అధికారానికి, పురుష స్వామ్యానికి, పీడనకి గుర్తు. ఈ సినిమాలో బూట్ల బరువును ఆడవాళ్లు తోటి ఆడవాళ్ల సాయం, మాట సాయం వల్లే మోస్తారు. ఆఖరున వారు బూట్ల రాసి మధ్యన తమ హైహీల్స్ బయటకు తీయడంతో నాటకం ముగుస్తుంది’ అంటారు అంజలి.‘గాసిప్’ నాటకానికి విశేష ఆదరణ లభిస్తున్నదంటే విచిత్రం ఏముంది. స్త్రీలు చేసే కొత్త ఆలోచనలకు ఎప్పుడూ ప్రశంసలే కదా. అపాయంలో ఉపాయంస్త్రీలు గాసిప్ మాట్లాడని చోటు ఉండదు. వంటిగది, బ్యూటీ సెలూన్, రేషన్ షాప్, వీధి మలుపు, ఇంటి పిట్టగోడ... ఈ పిట్టగోడ మీద అనేక కార్టూన్లు కూడా ఉన్నాయి. ‘కాని స్త్రీల కబుర్లన్నీ వారు తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే వొత్తిడిని, పురుషుల పెత్తనాన్ని దూరం చేసేవే. వారు సాటి స్త్రీలతో మాట్లాడి సలహాలు తీసుకుంటారు, సూచనలు అందుకుంటారు, అపాయాల్లో ఉంటే ఉపాయాలు తెలుసుకుంటారు... పురుషుణ్ణి ఎదుర్కొనడమే వీటన్నింటి లక్ష్యం. తరతరాలుగా గాసిప్ మాట్లాడుతూ స్త్రీలు తమ నిత్య జీవితంలోని ఘర్షణలను దాటుతున్నారు’ అంటారు ‘గాసిప్’ రూపకర్తలు. -
ఆ పాదాలకు నమస్కారం..! ఏకంగా 12 వందల కిలోమీటర్లు..
రోజు కాదు రెండురోజులు కాదు ఒక దేశం మరో దేశం కాదు...ఆ ఇద్దరు మిత్రులు ఫ్రాన్స్ నుంచి బయలుదేరి ఏడాదిన్నర పాటు నడుస్తూ 12000 కిలోమీటర్లు నడిచి చైనాకు చేరి తమ యాత్ర ముగించారు. లోయిక్ వాయిసాట్, బెంజిమిన్ హంబోల్ట్ ఈ ప్రయాణంలో గ్రహించింది ఏమిటంటే మనుషులు అట్టే చెడ్డవారు కాదని!‘ప్రపంచాన్ని చూడాలని ఉంది. ప్రకృతితో మమేకమై బతకాలని ఉంది’ అని చాలామంది అంటూ ఉంటారు. కాని ఆ ఇద్దరు యువకులు మాత్రం దాన్ని చేసి చూపించారు. కష్టాలను తట్టుకుంటూ గమ్యాన్ని చేరుకోవడం ఎందుకు సాధ్యం కాదో నిరూపించడానికి ఈ ప్రయాణం చేశారు. దేవుడిచ్చిన రెండు కాళ్లు ఎంత దూరం తీసుకెళ్లగలవో చూద్దామని కూడా వాళ్లు ఈ సుదీర్ఘ ప్రయాణానికి నడుము కట్టారు. కదలాలనే తలంపు ఉండాలేగాని రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లడానికి కాళ్లున్నాయని వీరు నిరూపించారు. అందుకే ఆ పాదాలకు నమస్కారం.ఆ ఇద్దరు..27 ఏళ్ల బెంజమిన్ హంబోల్ట్, 26 ఏళ్ల లోయిక్ వాయిసాట్ పారిస్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అయినా ఏదో వెలితి. జీవితం మరీ రొటీన్ అయిపోతోందన్న తలంపు. అటు ప్రపంచాన్ని, ఇటు తమ అంతరంగాన్ని ఒకేసారి చూడాలన్న కోరిక. అందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. సెప్టెంబర్ 2024లో ఉద్యోగాలు వదిలేశారు. వారి స్వస్థలం అన్నేసీ నుండి ప్రయాణం మొదలుపెట్టారు. చైనాలోని షాంఘై చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అందుకోసం వారు ఏ వాహనాన్నీ ఆశ్రయించలేదు. కేవలం కాలినడకనే ఐకానిక్ సిల్క్ రూట్ ద్వారా 16 దేశాలు దాటాలని నిశ్చయించుకున్నారు. 17 నెలలపాటు 8 వేల మైళ్లు (12వేల కిలోమీటర్లు) ప్రయాణం చేసిన వారు ఇటీవల వారు తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు.ఏయే దేశాలు దాటి వచ్చారు? ఫ్రాన్నష్ నుంచి నడక మొదలుపెట్టిన లోయిక్, బెంజిమిన్ తమ ప్రయాణంలో భాగంగా స్విట్జర్లాండ్, ఇటలీ, క్రొయేషియా, బోస్నియా, టర్కీ, రష్యా, ఉబ్జెకిస్థాన్, కిర్జిస్థాన్, కజికిస్థాన్ తదితర దేశాలు దాటారు.చివరి మజిలిగా చైనానే ఎందుకు?చైనానే తమ అంతిమ గమ్యస్థానంగా ఎందుకు చేసుకోవాలనుకున్నారని వారిని అడిగినప్పుడు వారి సమాధానం చాలా బలమైన చరిత్రకు సూచనగా నిలిచింది. ‘ఇది వైరుధ్యాల భూమి. ఇక్కడ పురాతన నాగరికత వేగవంతమైన ఆధునికీకరణను కలుస్తుంది. ఫ్రాన్స్లో ఉన్న మాకు ఈ నేలకు చేరుకోవాలని అనిపించింది. మా నిత్యజీవితాల్లో ఒత్తిడి నుంచి దూరం కావాలంటే ఇంత దూరం రాక తప్పదని మాకు అనిపించింది’ అని వారు వివరించారు.మనుషులు మంచివాళ్లేఈ ప్రయాణం లోయిక్, బెంజిమిన్కు ఎన్నో గొప్ప అనుభవాలు ఇచ్చింది. ‘మేము దారిలో మనుషులను కేవలం మంచినీళ్లు అడిగేవాళ్లం. వాళ్లు మా యాత్ర గురించి తెలుసుకుని నీళ్లతో΄ాటు ఎన్నెన్నో ఇచ్చేవారు. మనుషులు మంచివాళ్లు’ అన్నారు వాళ్లిద్దరు. జిన్జియాంగ్ రాజధాని ఉరుంకిలోని ఒక హోటల్లో దిగినప్పుడు అక్కడి సిబ్బంది వారిని హృదయపూర్వకంగా స్వాగతించారు. అంతేకాకుండా స్థానిక పోలీసు అధికారులు మూన్ కేక్లు, అక్కడి సాంప్రదాయ పెరుగును బహుమతిగా ఇచ్చారు. ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది మంచి మనుషులు తమకు సాయం చేశారని, అందువల్లే తాము సురక్షితంగా గమ్యం చేరామని అంటున్నారు. బోస్నియాలో ల్యాండ్మైన్స్ ఉంటాయన్న విషయం తమను భయపెట్టిందని, అయితే ప్రమాదమేమీ జరగకుండా సురక్షితంగా వచ్చామని తెలిపారు. తమ నడకలో తాము గొప్పగా ఆస్వాదించింది సూర్యోదయాలను అని వారన్నారు. బాగా నడిచి నిద్రకు సిద్ధమైతే ఆ కమ్ముకొచ్చే నిద్ర గొప్పగా ఉంటుందని కూడా అన్నారు. నిద్ర పట్టక, ఉన్న చోటునే ఉండి వ్యాయామం ఎరగక ఉంటున్నవారు వీరిలా కాకపోయినా కొంతైనా నడిచినా అదే తమకు తాము ఇచ్చుకునే గొప్ప కానుక. (చదవండి: భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారి..! ఆఖరికి పెళ్లి కూడా..) -
క్షణికావేశం వద్దు : మనసులు విరిగితే మాటలు కలపాలి
రాయవరం: రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడడుగులతో ఆరంభమయ్యే దాంపత్య జీవితం కలకాలం పచ్చగా ఉండాలనే అందరూ ఆకాంక్షిస్తారు. పరిస్థితుల ప్రభావం, మనస్పర్థలు వంటివి ఆ పచ్చని సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతూ సూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తమపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఏమైపోతారో అనే ఆలోచించకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. భర్తను భార్యో, భార్య భర్తనో చంపడమో లేదా చంపించడమో జరుగు తున్నాయి. మనిషి నైతిక విలువలను మరచి దిగజారిపోతున్నాడు. అలా కాకుండా సమస్యను సానుకూలంగా ఆలోచించి నా మనిషేకదా అనుకుంటే సగం పరిష్కారం అయినట్టే. ఆ తరువాత మనసులు నెమ్మదించి మాటలు కలిసి చిలక పలుకులతో చర్చించుకుంటే మళ్లీ ఆ పాత రోజులు నిత్య నూతనాలవుతాయి. అనుమానం పెనుభూతమై బిక్కవోలు మండలం రంగాపురంలో ఒకడు తన భార్యను ఈ నెల 19న హత్య చేశాడు. దీంతో వారి చిన్నారులు తల్లిలేని వారయ్యారు. అలాగే ఈ నెల 17న ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మరొకడు అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో దాడి చేశాడు. సమస్యలు ఎదురైనప్పుడు వీరిని సంప్రదించవచ్చు గృహ హింస నిరోధక చట్టం (2006): మహిళలను శారీరకంగా హింసించడం, గాయపర్చడం, ప్రాణా లకు హాని తలపెట్టడం, మాటలతో మానసికంగా ఒత్తిడి పెంచడం తదితర ఇబ్బందులకు గురి చేస్తే గృహ హింస అవుతుంది. ఇలాంటి సమయంలో బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచితంగా న్యాయసేవలు : కుటుంబాల్లో గొడవలు, వివాదాలను పరిష్కరించుకునేందుకు ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. వన్స్టాప్ సెంటర్ : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం కాకినాడ, అమలాపురంలో వన్స్టాప్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తారు. గృహ హింసకు పాల్పడితే శిక్షలు, చట్టాలు తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. బాధిత మహిళలకు తాత్కాలికంగా షెల్టర్ ఇస్తారు.గొడవలకు కారణాలివీ.. పని ఒత్తిడిలో భాగస్వామితో సమయం కేటాయించకపోవడం. తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతో మొదలైన గొడవలు దంపతుల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి. ఎవరికి వారే గొప్ప అనుకునే స్వభావం. చిన్న సమస్యలకు కూడా ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకోవడం. ఆర్థిక పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యాపారాల్లో నష్టాలు, అనుకోని ఘటనలతో అప్పుల పాలవడం, వాటిని తీర్చే మార్గంలేక ఇంట్లో వారిపై కోపం చూపడం. సామాజిక మాధ్యమాలు, ఇతర పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారితీయడం. ఇంట్లో కుటుంబ కలహాలు.. తల్లిదండ్రులు, అత్తామామలను సరిగా చూసుకోక పోవడం. సెల్ఫోన్లో మాట్లాడినా, ఇతరులతో మాట్లాడుతున్నా భార్య లేదా భర్తపై అనుమానాలు పెంచుకోవడం. ఇద్దరి మధ్య సమన్వయం లేక పోవడం. పరిష్కారాలు ఇలా సమస్య ఎదురైనపుడు సమన్వయం అవసరం. కోపాలు తగ్గించుకోవాలి. గొడవ సద్దుమణిగేలా ఎవరూ తగ్గకపోవడం.. ఒకరినొకరిపై ప్రేమభావం కలిగేలా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. ఇద్దరం సమానమనే భావన కలిగి ఉండాలి. ఆదాయ, ఖర్చులు ఇద్దరికి తెలిసే ఉండాలే చూసుకోవాలి. జీవిత భాగస్వామి ప్రవర్తనకు తగినట్లుగా నడుచుకుంటూ.. ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి.. వేర్వేరు కాదు.. ఒకటే అనే భావన ఇద్దరిలో కలగాలి. పిల్లలతో విహార యాత్రకు వెళ్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడిని చూరం చేసుకోవచ్చు.వన్స్టాప్ సెంటర్ నంబరు : 181 పోలీస్ హెల్ప్లైన్ : 112బాధితులు ముందుకురావాలి : క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. దంపతుల కలహాలు, గృహహింస తదితర బాధితులు ముందుకొచ్చి, పోలీసు స్టేషన్లను సంప్రదించాలి. కుటుంబ సమస్యలతో వచ్చిన భార్యా భర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. సమస్య పరిష్కారం కాకుంటే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. – డి.సురేష్బాబు, ఎస్సై, రాయవరం సానుకూల దృక్పథం అవసరం : జీవన విధానంలో మార్పులు వచ్చాయి. సమస్య చిన్నదే అయినా వ్యతిరేక ఆలోచనలతో ఉంటున్నారు. పరిష్కార మార్గాల వైపు కాకుండా సహనం కోల్పోయి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులతో అధిక సమయం గడపాలి. – డాక్టర్ సౌమ్య పసుపులేటి, సైకియాట్రిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం ప్రశాంతంగా ఆలోచించాలి : సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేర సంబంధ ఘటనలను పదేపదే చూడటం మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మద్యానికి బానిసైన వారిలో మానసిక స్థితి లోపించి భార్యలపై అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇదే గొడవలకు, అనర్ధాలకు దారితీస్తాయి. –డాక్టర్ అఖిలేంద్ర శ్రీనివాస్, సైకియాట్రిస్ట్, జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, రాజమహేంద్రవరం -
ఆ కమెడియన్కి వెయిట్లాస్ మందులు ఎందుకు పనిచేయలేదంటే..!
ఇటీవల కాలంలో చాలామంది స్లిమ్గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోనూ కొందరు సహజపద్ధతిలో ఆరోగ్యంగా బరువు తగ్గితే..ఇంకొందరు ముఖ్యంగా సెలబ్రిటీలు, ప్రముఖులు మాత్రం బరువు తగ్గించే టైప్2 డయాబెటిస్ మందులపై ఆధారపడుతున్నారు. అది కూడా వైద్యుల పర్యవేక్షణలో.. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గుతుండటం విశేషం. అయితే కొందరిలో ఈ డ్రగ్ పనిచేయడం లేదనే విషయం అందరిలోనూ తీవ్ర ఆందోళనలను లేవనెత్తింది. ఎందుకంటే యూట్యూబర్, హాస్యనటుడు, రచయిత తన్మయ్ భట్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. నిజంగానే ఈ మెడిసిన్ అందరికి ప్రభావవంతంగా పనిచేయదా..? అందుకు గల కారణాల ఏంటి..? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.హాస్యనటుడు తన్మయ్ భట్ టైప్2 డయాబెటస్ నిర్వహించడానికి ఎఫ్డీఏ ఆమోదించిన GLP-1 మందులతో బరువు తగ్గే ప్రయత్నం చేసినట్లు ఎక్స్ పోస్ట్లో తెలిపారు. ఈ సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి GLP-1 మందులు టైప్ 2 డయాబెటిస్ను నిర్వహించడానికి FDA-ఆమోదించిన చికిత్సలు. వీటిని బరువు నిర్వహణకు కూడా వినియోగిస్తారు. తాను GLP-1 మందుల సాయంతో ఆకలి తగ్గించుకోవాలనుకున్నా..కానీ తనకు అంతగా పనిచేయలేదని అన్నారు. తనకు ఆ మందు వినియోగించడంవల్ల ఆకలికి సంబంధించి..బలహీన సంతృప్తి సంకేతాలనే అందించిందని అన్నారు. అంతేగాదు తన్మయ్ తాను ఈ మందులు వాడక మునుపే నేచురల్గా 75 కిలోలుల తగ్గానని అన్నారు. అయితే తనకు కొంగొత్త సాంకేతిక వైద్య విధానాన్ని తెలుసుకోవడం, ప్రయత్నించడం ఇష్టమని ఆ నేపథ్యంలోనే ఈ మెడిసిన్ని ప్రయత్నించినట్లు తెలిపారు. ఎందుకు తనకు ఈ మెడిసిన్ పనిచేయలేదు ఎవరైన వైద్యులు లేదా నిపుణులు వివరించాలని కూడా కోరారు పోస్ట్లో.నిపుణులు ఏమంటున్నారంటే..కొందిరిలో ఈ డయాబెటిస్ మెడిసిన్ బరువు తగ్గడానికి పనిచేయకపోవడానికి పలు విధాల కారణాలు ఉంటాయని అంటున్నారు. అవన్నీ బేరీజు వేసుకుని గానీ నిర్థారించలేమని చెబుతున్నారు నిపుణులు. తక్కువ మోతాదు..కొన్నిసార్లు వ్యక్తులు GLP-1 మందులతో ఆకలి నియంత్రణలో ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ప్రారంభంలో తక్కువ మోతాదు ఉంటుంది కాబట్టి. ఈ మందులు పనిచేయడానికి కొంత సమయం అవసరం. ఒక్కోసారి నెలల సమయం కూడా పడుతుందని అన్నారు.ఒక్కోసారి శరీరం స్పందించదు..కొందరిలో అస్సలు ఈ మెడిసిన్ పనిచేయదట. ఎందుకుంటే వారి వారి జన్యు సంబంధిత పరిస్థితతులు, అంతర్లీన జీవక్రియ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందట. అలాగే కొందరు హెల్త్ దృష్ట్యా వాడే ఇతర మందుల వల్ల కూడా ఈ మెడిసిన్ ప్రభావవంతంగా పనిచేయదని చెబుతున్నారు వైద్యులు.జీవనశైలి కారణంగా..అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు లేదా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు బాగా తీసుకునే వారిలో ఈ మందుల ప్రభావాన్ని అధిగమిస్తాయట. అలాంటి వారికి అధిక ప్రోటీన్, అధిక ఫైబర్తో కూడిన ఆహారాన్ని జత చేస్తేనే ఈ GLP-1 మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు వైద్యులు .ఇక్కడ తన్మయ్ భట్ అనుభవం బరువు తగ్గడానికి ఏ విధంగా ఆయన ఈ మెడిసిన్ని ఏవిధంగా విరియోగించారనేది అత్యంత ముఖ్యం అనే విషయాన్ని నొక్కిచెబుతోంది. అందువల్ల ఈ వెయిట్లాస్ మందులు వాడాలనుకునేవారు వైద్యులు లేదా నిపుణులు పర్యవేక్షణలో వారి సూచనలు సలహాల మేరకు ఉపయోగించటమే మేలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో హైలెట్గా నీతా అంబానీ స్పీచ్..!) -
అర్జున్ టెండూల్కర్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో హైలెట్గా నీతా అంబానీ స్పీచ్..!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మార్చి మొదటి వారంలో సానియా చందోక్ ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ జంట ప్రీ వెడ్డింగ్ వేడుకులు జామ్ నగర్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకను అంబానీ కుటుంబమే నిర్మహిస్తుండటం విశేషం. ఈ కార్యక్రమంలో నీతా, ముఖేశ్ అంబానీ, ఆకాశ్-శ్లోకా అంబానీ, అనంత్-రాధికా అంబానీలతో సహా అనేకమంది ఇతర అంబానీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో నీతా అంబానీ టెండ్యూల్కర్ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగం అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నీతా ఏం మాట్లాడారంటే..రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, జామ్ నగర్లోని రిలయన్స్ టౌన్ షిప్కు అతిథులను స్వాగతిస్తూ సచిన్ టెండూల్కర్, అంజలిలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.“అందరికీ నమస్కారం, జామ్నగర్కు స్వాగతం. ఈ రోజు, మనమందరం రెండేళ్ల క్రితం అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఇదేచోట సమావేశమయ్యాం. మళ్లీ ఇదే చోట సచిన్ అంజలీల కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం మరోసారి సమావేశమయ్యాం. సచిన్ అంజలిలు మీరు ఎల్లప్పుడూ మా కుటుంబంలో భాగం. ఈ ఆనందంలో భాగమవ్వడంతో మా హృదంయ నిండిపోయింది. ఇక ప్రియమైన అర్జున్. మీరు మా పాఠశాలలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. చూస్తుండగానే పెరిగి పెద్దవాడై ఈ ప్రదేశంలో మీ జీవిత భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారభించడానికి సిద్దంగా ఉన్న కొత్త అర్జున్ని చూస్తున్నా. సానియా మీచుట్టూత చాలా వెచ్చని, సానుకూల శక్తి ఉంది. మీ ఇద్దరిని ఇలా చూడటం చాలా అద్భుతంగా ఉంది. మీ దంపతులను ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆశ్వీరదించుగాక". అంటూ తన ప్రసంగాన్ని ముగించారు నీతా.అంబానీల కుటుంబంతో సచిన్ బంధం..సచిన్ టెండూల్కర్కి ముఖేశ్, నీతా అంబానీలతో చాలా సన్నిహిత, వ్యక్తిగత అనుబంధం ఉంది. వారి అనుబంధం దశాబ్దాల నాటిది. టెండూల్కర్కి తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్న కాలం నుంచి అంబానీలతో బంధం ఉంది. ఇక టెండూల్కర్ ఐకాన్ ప్లేయర్గా నీతా అంబానీ యాజమాన్యంలోని ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్కు మెంటర్గా పనిచేశారు.అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా ముంబై ఇండియన్స్ జట్టులో అనేక సీజన్లలో సభ్యుడిగా ఉన్నాడు. అలాగే నీతా అంబానీ చెప్పినట్లుగా..ముంబైలోని అంబానీ యాజమాన్యంలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లోనే అర్జున్ టెండూల్కర్ చదువుకున్నాడు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)(చదవండి: అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే పెళ్లాడతా..!: రష్మిక మందన్న) -
Rashmika Mandanna: నా కాబోయే భర్త అలానే ఉండాలి..!
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరు చాలాకాలం ప్రేమలో ఉన్నారు. అయితే ఆ విషయం బయటకు చెప్పకపోవడంతో.. ఈ ఇద్దరూ ఎక్కడ కనిపించినా.. రకరకాల పుకార్లు, గాసిప్స్ చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం వాటిన్నింటికీ చెక్పెట్టేస్తూ..ఈ ఫిబ్రవరి 26న ఉదయపూర్లో గ్రాండ్గా వివాహం చేసుకోనుంది ఈ జంట. ఇంకొన్ని గంటల్లో పెళ్లి బంధంతో ఒక్కటికానుకున్న నేపథ్యంలో రష్మిక మందన్న తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ ఇంటర్యూలో చాలా ఆసక్తికరంగా చెప్పారు. అవేంటో ఈ సందర్భంగా చూద్దామా..!ప్రతి అమ్మాయి పెళ్లి విషయంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అంచనాలు, ఆకాంక్షలు ఉంటాయి. అది సహజం. ఇక్కడ నటి మదన్న కూడా అలానే భావించారు. ఈ ముద్దుగుమ్మ సైతం సగటు అమ్మాయిలా..తన కాబోయే వాడు అలానే ఉండాలని అలా ఉంటేనే అతడిని పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేసింది. ఇంతకీ ఆమె తన భాగస్వామి ఎలా ఉండాలందంటే..ప్రేమలో దయ, గౌరవం ఉంటేనే ఆ బంధం నిలబడుతుందని అంటోంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమయంలో సహచరుడు తప్పక ఉండాలి. కాబట్టి ఆ అమ్మాయికి తన కాబోయే జీవిత భాగస్వామి చాలా స్పెషల్గా ఉండాలి. ఏవిధంగా అంటే..ఆ అమ్మాయి ప్రతి బాధ, కష్టం, ఆనందంలోనూ తన పక్కనే ఉండాలి . ఆ భాగస్వామిని చూడగానే ఎలాంటి ఒడిదుడుకులనైనా ఇట్టే ఎదుర్కొనగలను అనే ధైర్యం, నమ్మకం కలగించేలా ఉండాలి.అతడే ఆమెకు ఓదార్పు, భద్రత, సానుభూతి.. అన్ని అవ్వాలి. అవే ఏ అమ్మాయైనా తన కాబోయే భర్తలో కోరుకునేది. అలాంటి వ్యక్తి లభిస్తే ఏ అమ్మాయి అయినా..అదృష్టవంతురాలే అంటూ తన కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో చాలా చక్కగా వివరించింది రష్మిక. అంతేగాదు ఏ సంబంధంలోనైనా ఒకరినొకరు గౌరవించుకుంటున్నప్పుడు, శ్రద్ధ వహిస్తున్నప్పుడు, బాధ్యత వహిస్తున్నప్పుడు..ఆ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని అంటోంది. చివరగా..ఇలాంటి లక్షణాలే తన భర్తలో ఉండాలని కోరుకుంటానని నవ్వుతూ చెప్పింది రష్మిక. మరి అలాంటి లక్షణాలే విజయ్లో ఉన్నాయి కాబోలు..అందుకే ఈ క్రేజీ బోయ్తో ఇంకొన్ని గంటల్లో ఏడుగుగులు వేసి..కొత్త జీవితాన్ని ఆరభించనుంది ఈ బ్యూటీ. కాగా, విజయ్ రష్మికలు రాజస్థాన్లోని ఉదయ్పూర్కి 50 కి.మీ దూరంలో ఉన్న లగ్జరీ హోటల్ ఐటీసీ మెమెంటోస్లో గ్రాండ్గా వివాహం చేసుకోనున్నారు.(చదవండి: ట్రెండీగా 'కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా' ..! ఫ్యాషన్ని ఇలా కూడా చూపించొచ్చా..) -
యాదగిరీశుని కళ్యాణోత్సవము..!
అభయ ప్రదాతగా... భక్తులను వెన్నంటి ఉండే ఆపద్బాంధవుడిగా యాదగిరీశుని భక్తులు కొలుస్తుంటారు. పిలిచిన వెంటనే పలికే ఆప్తుడిగా... అందరి స్వామిగా భక్త జనుల గుండెల్లో కొలువై ఉన్న యాదగిరీశుడు సౌభాగ్య ప్రదాయిని లక్ష్మీదేవితో సహా కొలువైన క్షేత్రం యాదగిరి నృసింహుడి సన్నిధి. ఈ క్షేత్రంలో గత బుధవారం ఫిబ్రవరి 18న ఆరంభమైన శ్రీస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి. ప్రధాన ఘట్టాలైన శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం, శ్రీస్వామి వారి తిరు కల్యాణోత్సవం బుధవారం జరగగా శ్రీస్వామి దివ్య విమాన రథోత్సవం అర్చకులు నేడు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలతో యాదగిరి క్షేత్రం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకోవడంతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తోంది. యాదగిరి లక్ష్మీనరసింహుడి రూపం ఉగ్రం. మనస్సు నవనీతం. ఘనసింహం గర్జిస్తున్నట్లు.. ముల్లోకాలను వణికించే మృగరాజు పంజా విసురుతున్నట్లు హిరణ్య కశపుడిని రక్కి, చీల్చి చండాడిన ఆ దేవుడి చేతులు ఆది మహాలక్ష్మిని మాత్రం అతి సున్నితంగా అక్కున చేర్చుకున్నాయి. సృష్టికర్త బ్రహ్మకే ఆయువు పోసిన బ్రహ్మాండ నాయకుడని పురాణాలు ఘోషిస్తున్నాయి. పురాణాల పరంగా...యాదగిరి ప్రశస్థికి సంబంధించి ఎన్నో ఇతిహాసాలు రామాయణ మహాకావ్యంలోనూ ప్రస్తావనలున్నాయి. మహాజ్ఞాని విభాండకుడి కుమారుడు రుష్యశృంగుడు. అతడి పుత్రుడైన యాద మహర్షి తపో శక్తితోనే యాదగిరిగుట్ట వెలసిందంటారు. యాదుడు బాల్యం నుంచి మహావిష్ణుభక్తుడు. దేవదేవుడిని తిలకించాలన్న తపన నానాటికి పెరిగింది. అందులోనూ ఉగ్రరూపుడైన నృసింహావతారం పట్ల ఎనలేని మక్కువ కలిగింది. దైవసాక్షాత్కారం కోసం దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతికి చిక్కాడు. ఆటవికులు యాదుడిని క్షుద్ర దేవతలకు బలి ఇవ్వబోయారు. ఆపద సమయంలో ఆంజనేయుడు అండగా నిలిచాడు. కీకారణ్యంలో సింహాకార గుట్టలు ఉన్నాయని, అక్కడికి వెళ్లి తపస్సు చేస్తే స్వామి సాక్షాత్కరిస్తాడని యాదుడికి ఆంజనేయుడు సూచించాడు. యాదర్షి దీర్ఘకాలిక తపస్సు ఫలించి స్తంభోద్భవుడు తొలుత జ్వాల, గండబేరుండ, యోగనంద, ఉగ్రసింహ, శ్రీలక్ష్మీ సమేతుడిగా (పంచరూపాలతో) దర్శనమివ్వడంతో ఈ క్షేత్రం పంచనారసింహ నిలయంగా పురాణాలకెక్కింది. యాద రుషి కోరిక ఫలితంగా వెలసిన ఈ క్షేత్రం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందింది.రక్షణగా సుదర్శన చక్రం...తపోముద్రలో ఉన్న మహర్షిని మింగేయాలని ప్రయత్నించిన ఒక రాక్షసుడిని మరుక్షణమే విష్ణుమూర్తి సుదర్శన చక్రం అడ్డుకుని వధించింది. ఆటంకాలు, ఆపదలు కలగకుండా గుట్ట చుట్టూ సుదర్శనం రక్షా కవచంగా నిలిచి ఉంటుందన్నది భక్తుల అపార విశ్వాసం. ప్రస్తుతం ఈ విమాన గోపురం, సుదర్శన చక్రం స్వర్ణమై భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక స్వామి పుష్కరిణి సాక్షాత్తూ బ్రహ్మ కడిగిన పాదాల నుంచే పుట్టిందంటారు. ఈ పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరిస్తే శారీరక రుగ్మతలు, గ్రహబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు అంటుంటారు. ఎంతోకాలంపాటు మరుగున పడిపోయిన ఈ క్షేత్ర మహాత్యాన్ని స్థానిక గ్రామాధికారి గుర్తించారు. స్వామి కలలో కనిపించిన తన అవతార రహస్యాన్ని చెప్పాడట. హైదరాబాద్ వాస్తవ్యుడు రాజామోతీలాల్ 1920లో ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. ఆయన హయాంలోనే పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంతో పూజలు మొదలయ్యాయని స్థానికులు చెబుతారు. బ్రహ్మోత్సవాల్లో అలంకార, వాహన సేవలు ఇవే...శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు అలంకార ప్రియుడు కావడంతో యాదగిరీశుడి క్షేత్రం అర్చకులు వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు నుంచి అలంకార సేవలను ప్రారంభిస్తారు. 20వ తేదీన ఉదయం మత్స్యావతార అలంకార సేవ, రాత్రి శేష వాహన సేవ, 21వ తేదీ ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంసవాహన సేవ, 22వ తేదీ ఉదయంశ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి పొన్నవాహన సేవ, 23వ తేదీ ఉదయం గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ, 24వ తేదీ ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవలో శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం, 25వ తేదీ ఉదయం శ్రీరామ అలంకార (హనుమంత వాహన సేవ), రాత్రి గజ వాహన సేవలో శ్రీస్వామి వారు పెండ్లి కొడుకుగా కల్యాణ వేధికపై తిరు కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. నేటి ఉదయం అంటే గురువారం శ్రీమహావిష్ణు వాహనమైన గరుడ వాహన సేవతో అలంకార సేవలు ముగుస్తాయి. రాత్రి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది.చివరి రెండు రోజులు ఇలా.. ఉత్సవాల్లో చివరి రెండు రోజులు సైతం విశేష పర్వాలను చేపడతారు. 27వ తేదీన ఉదయం 10.30గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, విష్ణు పుష్కరిణిలో అవభృదస్నానం జరిపిస్తారు. అదే రోజు రాత్రి వేళ శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను జరిపిస్తారు. చివరి రోజైన 28వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం జరిపించి, రాత్రి 9 గంటలకు శృంగార డోలో త్సవాన్ని నిర్వహించి ఉత్సవాలకు పరి సమాప్తి పలుకుతారు -
IQ Vs EQ: ఏది మిమ్మల్ని గెలిపిస్తుంది?
మన సమాజంలో తెలివితేటలు (IQ) ఉన్నవారిని మేధావులు అని తలకెత్తుకుంటాం. కానీ, విపరీతమైన కోపంతో ఎదుటివారిని తిట్టే మేధావిని, ఒత్తిడి తట్టుకోలేక కుంగిపోయే టాపర్ను మనం ఏమనాలి?ఇక్కడే Emotional Intelligence (భావోద్వేగ ప్రజ్ఞ) ప్రాముఖ్యత తెలుస్తుంది. IQ అనేది మీ తల (Head) కి సంబంధించింది అయితే, EQ అనేది మీ హృదయానికి (Heart) కి సంబంధించింది.IQ, EQ మధ్య తేడా ఏంటి?IQ (Intelligence Quotient): ఇది మీ లాజిక్, మెమరీ, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్. ఇది చాలా వరకు పుట్టుకతో వచ్చేది, పెద్దగా మార్చలేం.EQ (Emotional Quotient): ఇది మీ ఎమోషన్స్ ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎదుటివారి ఎమోషన్స్ కి ఎలా స్పందిస్తున్నారు అనే సామర్థ్యం. ఇది నేర్చుకోగలిగే స్కిల్.చాలా మంది సక్సెస్ ఫుల్ పీపుల్ లైఫ్ లో మనం గమనించే అతి ముఖ్యమైన అంశం EQ. స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్లందరూ జీవితంలో ఫస్ట్ రాకపోవడానికి, యావరేజ్ స్టూడెంట్స్ ప్రపంచాన్ని ఏలడానికి ప్రధాన కారణం ఈ EQ.The 5 Pillars of EQడేనియల్ గోల్మన్ (Daniel Goleman) ఈ కాన్సెప్ట్ను ప్రాచుర్యంలోకి తెస్తూ ఒక మాట చెప్పారు: "IQ మిమ్మల్ని ఉద్యోగంలో చేర్పించవచ్చు, కానీ EQ మిమ్మల్ని ఆ ఉద్యోగంలో ఎదిగేలా చేస్తుంది."గోల్మన్ ప్రకారం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో ఐదు ముఖ్యాంశాలు ఉంటాయి.Self-Awareness (స్వయం స్పృహ): మీకు ఎప్పుడు కోపం వస్తుంది? ఎప్పుడు భయం వేస్తుంది? ఆ సమయంలో మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? అని గమనించడం.Self-Regulation (స్వయం నియంత్రణ): ఎమోషన్స్ కలగడం సహజం, కానీ వాటికి బానిస అవ్వకూడదు. కోపం వచ్చినప్పుడు వెంటనే అరవకుండా, ఒక్క క్షణం ఆగి స్పందించడం.Motivation (ప్రేరణ): డబ్బు లేదా పొగడ్తల కోసం కాకుండా, మీలోని తృప్తి కోసం పని చేయడం. ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించే మొండితనం.Empathy (సహానుభూతి): ఎదుటివారి కళ్ళతో ప్రపంచాన్ని చూడటం. వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో వారి కోణంలో అర్థం చేసుకోవడం.Social Skills (సామాజిక నైపుణ్యం): గొడవలను పరిష్కరించడం, టీమ్ ని నడిపించడం, మనుషులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం.మోటివేషనల్ స్పీకర్ల పొరపాటుట్రైనర్స్ మనకు "కోపాన్ని అణచుకో, ఎప్పుడూ నవ్వుతూ ఉండు" అని పైపైన చిట్కాలు ఇస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, ఎమోషన్ ని అణచివేయడం (Suppression) అంటే ప్రెషర్ కుక్కర్ విజిల్ ఆపేసినట్లే—అది ఎప్పుడో ఒకప్పుడు పేలుతుంది.మార్కెట్ ఎమోషన్స్ ని దాచమంటుంది.సైకాలజీ ఎమోషన్స్ ని ఛానలైజ్ (Channelize) చేయమంటుంది.EQని ఎలా పెంచుకోవాలి?Genius Matrix మోడల్ ఉపయోగించి ఈ ఎమోషనల్ స్ట్రెంత్ ని బిల్డ్ చేద్దాం.Step 1: Break (రియాక్షన్ ని బ్రేక్ చేయండి)మీరు ఒక సంఘటనకు స్పందించే లోపు ఒక 'Gap' క్రియేట్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు వెంటనే తిరిగి తిట్టడం మీ పాత ప్రోగ్రామింగ్. ఆ ఆటోమేటిక్ రియాక్షన్ ని 'Break' చేసి, "నేను ఇప్పుడు ఎలా స్పందించాలి?" అని ఆలోచించండి.Step 2: Build (ఎమోషనల్ వొకాబులరీ)చాలామందికి తమకు ఏం అనిపిస్తుందో చెప్పడం రాదు. "నాకు బాధగా ఉంది" అనడానికి బదులు "నాకు కోపంగా ఉంది" అంటారు. మీ ఎమోషన్ కి సరైన పేరు పెట్టడం నేర్చుకోండి. మీ లోపల ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఫౌండేషన్ ని 'Build' చేయండి.Step 3: Beyond (స్టాయిక్ మైండ్సెట్)పరిస్థితులు ఎలా ఉన్నా, మీ ప్రశాంతతను ఎవరు చెడగొట్టలేనప్పుడు మీరు 'Beyond' స్టేజ్ లో ఉన్నట్లు. ఇతరుల ప్రవర్తన మీ మూడ్ ని శాసించకూడదు. అదే నిజమైన పర్సనాలిటీ గ్రోత్.మీ ఎమోషనల్ చెకప్ఈ రోజు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి.గత వారంలో మీరు ఎవరిపైనైనా విపరీతంగా అరిచారా? ఆ తర్వాత బాధపడ్డారా? (అక్కడ మీ EQ తక్కువగా ఉందని అర్థం).ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు అతిగా తింటారా? లేక అందరిపై విసుక్కుంటారా?ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు మీరు నిజంగా వారి బాధను ఫీలవుతున్నారా?స్మార్ట్ అవ్వడం కంటే స్ట్రాంగ్ అవ్వడం ముఖ్యం!బ్రో, IQ మిమ్మల్ని ఒక మంచి ఇంజనీర్ లేదా డాక్టర్ ని చేయవచ్చు, కానీ EQ మిమ్మల్ని ఒక మంచి లీడర్ ని, మంచి భర్తని/భార్యని, ఒక గొప్ప మనిషిని చేస్తుంది. తెలివితేటలు ఉన్నవాడు గెలుస్తాడేమో కానీ, భావోద్వేగ స్థిరత్వం ఉన్నవాడు మాత్రమే ఆ గెలుపును నిలబెట్టుకోగలడు.గుర్తుంచుకోండి, "Life is 10% what happens to you and 90% how you react to it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అద్దంలో కనిపించని అసలు రూపం) -
ఐడియా అదుర్స్..! ఫ్యాషన్ని ఇలా కూడా చూపించొచ్చా..!?
సోషల్ మీడియా పుణ్యమా అని..చాలామంది ఓవర్నైట్ స్టార్లుగా, సెలబ్రిటీ హోదాను పొందుతున్నారు. ఆ జాబితాలోకి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు చేరి.. సక్సెస్ని అందుకోవడం విశేషం. అయితే ఫ్యాషన్ వద్దకు వచ్చేటప్పటకీ.. మనలోపల టాలెంట్ మొత్తం తీసి ..రీల్స్ చేసినా..క్లిక్ అవ్వడం కొంచెం కష్టమే. ముఖ్యంగా అందరికి చేరువవ్వాలంటే అంత సులభమైన టాస్క్ కాదు. ఫ్యాషన్ అనగానే బాగా డబ్బున్నవాళ్లకే చెల్లుతుందనే అభిప్రాయం బాగా ఎక్కువ జనాల్లో. కానీ దాన్ని సామాన్యుల చెంతకు చేర్చి..అది మన లైఫ్లో భాగమనిపించేలా అందంగా చూపించింది ఈ అమ్మాయి. ఈ ఒక్క రీల్తో సెన్సేషన్గా స్టార్గా మారి.. ప్రపంచ వేదికపై నిలిచింది. అంతేగాదు ఎవరా ఆ అమ్మాయి అంత కూల్గా, చాలా క్యాజువల్గా ఫ్యాషన్ని ఎంత బాగా పరిచయం చేసింది.. అని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరంటే ఆమె..ఆ అమ్మాయే దియా జౌకానీ. వృత్తిరీత్యా ఆమె హై-ఎండ్ ఫ్యాషన్ డిజైనర్. ఇన్స్టాగ్రామ్లో"కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" అనే క్యాప్షన్తో ఆమె షేర్ చేసిన ఫ్యాషన్ వీడియో నెట్టిం ప్రభంజనం సృష్టించింది. ఎవరీ కూల్గర్ల్ అని చర్చలకు తెరతీసేలా..హాట్టాపిక్గా మారిందామె. ఆ రీల్లో ఆమె ధరించిన దుస్తులు కూడా స్వయంగా ఆమె డిజైన్ చేసినవేనట. సోషల్ మీడియాను ఆమె తన ఫ్యాషన్ ప్రదర్శనకు ఫ్లాట్ఫామ్గా ఉపయోగించుకుంటూ..తన డిజైన్లను ఇలా రీల్స్ ద్వారా నిశబ్దంగా ప్రదర్శించింది. తన డిజైనర్వేర్లతో చాలా స్మార్ట్గా మార్కెటింగ్ చేస్తోందామె. ఆ వీడియోలో దియా హై ఫ్యాషన్ను సరదాగా ధరించగలిగేలా ఆకర్షించింది. అంతేగాదు దియా ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఆమె ఫ్యాషన్ ప్రపంచాన్ని చూడొచ్చు. తన కంటెంట్ మొత్తం చాలా నిరాడంబరంగా ప్రజెంట్ చేస్తుండటంతో..ప్రజలు ఒక్క క్షణం వేచి వీక్షించగలిగేలా ఆకట్టుకుంటున్నాయి ఆ వీడియోలు. ప్రస్తుతం దియా చేసిన "కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" ఎంత ట్రెండీగా మారిందంటే..అందురు ఆమెలా అనుకరించే యత్నం చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు..ఆ వీడియో ఎంతగా నెటిజన్ల మనసులను తాకిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోల బ్యాగ్రౌండ్లో క్లాసిక్ ఫ్రాంక్ ఓషన్స్ నైట్స్ ప్లే అవుతూ ఉంటే.. దియా చక్కటి ఫ్యాషన్వేర్లో చాయ్ తాగుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత నగర వీధుల గుండా నడవడం ప్రారంభిస్తుంది. కొద్ది సెకన్లలో గుర్రపు స్వారీ చేస్తూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండటం లేదా ఆమె వ్యక్తిగత రైడ్ లాగా JCB పారపై కూర్చోవడం..ఇలా విలక్షణంగా కనబడుతుంది ఆయా వీడియోలలో. అయితే వాటి అన్నింటిలోనూ దియా వివరణాత్మక, హై-ఫ్యాషన్ దుస్తులను ధరించడం స్పష్టంగా చూడొచ్చు. View this post on Instagram A post shared by 🪔 (@diyajoukani)ఈ వీడియో ఇంతలా క్లిక్ అవడానికి కేవలం ప్రజెంటేషన్ చేసిన విధానమే ఆమెను ఐకానిక్గా మార్చేసింది. ఇక్కడ దియా విలాసవంతమైన దుస్తులను ధరించింది కానీ..స్టూడియో లేదా లగ్జరీ నేపథ్యం ఎంచుకోకుండా..ఇలా సాధారణ వీధుల గుండా వెళ్తూ..హై ఫ్యాషన్ మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ఎలాగో నేర్పుతున్నట్లుగా ఉంది. అందుకే ఇది ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అయ్యి..అంతలా వ్యూస్, లైక్లు వచ్చాయి ఆ వీడియోకి. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అన్నట్లుగా ఒక్క రీల్తో దియా సెన్సేషన్గా మారింది కదూ..!. View this post on Instagram A post shared by 🪔 (@diyajoukani) (చదవండి: అరుదైన పెళ్లి: ట్విన్ సిస్టర్స్ని పెళ్లాడిన ట్విన్ బ్రదర్స్..!) -
టెర్రస్.. కామన్ ఏరియానే! అందరికీ హక్కు ఉంటుంది!
ఐదు సంవత్సరాల క్రితం మేము ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నాము. మొత్తం తొమ్మిది ఫ్లాట్లు ఉంటాయి. నాలుగు అంతస్తులు, 8 ఫ్లాట్లు + పెంట్ హౌస్. భూమి యజమాని బిల్డర్తో ఒప్పందం చేసుకొని రెండు ఫ్లాట్లు – పెంట్హౌస్ని తనకోసం కేటాయించుకున్నారు. మేడ పైకి మాకు ఎవరికీ ప్రవేశం లేకపోయినప్పటికీ, కొంతమంది సోలార్ ప్యానల్స్, డిష్ టీవీ యాంటినాలు, ఇంటర్నెట్ కేబుల్ బాక్స్ వగైరా ఉండటం వల్ల అవసరమైనప్పుడు మేడ పైకి రావడానికి అనుమతి ఇస్తుంటారు. ఇప్పుడు కొన్ని ఫ్లాట్ ఓనర్లతో విభేదాలు రావడంతో సోలార్ ప్యానల్ తో సహా సామాగ్రి అంతా తీసేయమంటున్నారు. అదేమని అడిగితే పెంట్హౌస్తోపాటు ఐదవ అంతస్తు మొత్తం అతనిదే అని, అలాగే డెవలప్మెంట్ అగ్రిమెంట్లో కూడా రాసి ఉందని అంటున్నాడు. మేము మా సామాగ్రి తీసేయవలసినదే అంటారా? – రమేష్ రెడ్డి, హైదరాబాదుబాల్కనీలు, మెట్లు, వరండా, మేడ/టెర్రస్ వంటివి కామన్ ఏరియా అంటే అందరికీ హక్కు ఉన్న సాధారణ ప్రదేశం కిందకి వస్తాయి. టెర్రస్ అనేది ఇంటిని/బిల్డింగును కాపాడుతుంది కాబట్టి అది ఏ ఒక్కరి సొంతము కాకూడదు. రెరా చట్టం, 2016లో కూడా టెర్రస్ (మిద్దెపై ఖాళీ ప్రదేశం) ను కామన్ ఏరియాగా మాత్రమే పరిగణిస్తారు. కామన్ ఏరియాను అందరికీ ఉపయోగపడేలాగా ఉంచాలి తప్ప ఏ ఒక్కరికి ప్రత్యేకంగా ఇవ్వడానికి వీల్లేదు అని చాలా సందర్భాలలో పలు కోర్టులు తేల్చి చెప్పాయి. కాబట్టి పెంట్హౌస్ ఉంది అన్న నెపంతో మిమ్మల్ని మేడపైకి రానివ్వను – మీ సోలార్ ప్యానల్స్, డిష్ టీవీ బాక్సులు ఉండనివ్వను అనటం కుదరదు. ఒకవేళ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ఇలాంటి నిబంధన ఏదైనా ఉన్నప్పటికీ అది చట్టరీత్యా చెల్లదు: ఎందుకంటే చట్టంలో కామన్ ఏరియాను చట్టంలో చెప్పిన విధంగానే వాడవలసి ఉంటుంది కాబట్టి. అయితే మంచో చెడో, అగ్రిమెంట్ పత్రాలలో ఇలాంటి చట్ట వ్యతిరేకమైన నిబంధనలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి –ఎవరైనా చట్టం తెలిసిన మధ్యవర్తులను నియమించుకుని ఆ టెర్రస్లో ఉండే వారితో సంధి కుదుర్చుకుని వారికి అర్థమయ్యేలాగా చెప్పి చూడండి. పరిస్థితి తీవ్రం అవుతోందని అనుకుంటే సివిల్ కోర్టు నుంచి తగిన రక్షణ కోరవచ్చు. అయితే మధ్యవర్తిత్వం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమం. అలాంటి ప్రయత్నాలు విఫలమైతే కోర్టు ఉండనే ఉంది! – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: అరుదైన పెళ్లి: ట్విన్ సిస్టర్స్ని పెళ్లాడిన ట్విన్ బ్రదర్స్..!) -
కెరీర్లో రాణించడానికి నేర్చుకోవాల్సిన ఐదు నైపుణ్యాలు ఇవే..!
నేటి యువ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు... "తర్వాత ఏం నేర్చుకోవాలి?" అని నిర్ణయించుకోవడమే. లింక్డ్ఇన్ తాజా డేటా ప్రకారం, వేగంగా మారుతున్న సాంకేతికతకు మరియు నేటి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలకు తాము సిద్ధంగా లేమని 38% మంది భారతీయ ఉద్యోగార్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఉద్యోగార్థులకు సహాయపడటానికి మరియు వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి... లింక్డ్ఇన్ తన 'స్కిల్స్ ఆన్ ది రైజ్ 2026' నివేదికను విడుదల చేసింది. సంస్థలు, పరిశ్రమల అంతటా వేగంగా వృద్ధి చెందుతున్న ఐదు నైపుణ్యాల సమూహాలను ఇది హైలైట్ చేసింది. అవి: ఏఐ అండ్ ఆటోమేషన్, డేటా అండ్ అనలిటిక్స్, ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ అండ్ గ్రోత్, పీపుల్ అండ్ లీడర్షిప్.లింక్డ్ఇన్ డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిక్రూటర్లలో 46% మంది ఇప్పుడు సరైన అభ్యర్థులను ఎంచుకోవడానికి నైపుణ్యాల డేటా పైనే ఆధారపడుతున్నారు. అయినప్పటికీ, అర్హత కలిగిన నైపుణ్యం గల వారిని కనుగొనడం మునుపటి కంటే ఇప్పుడు మరింత కష్టంగా మారిందని భారతదేశంలోని 74% రిక్రూటర్లు చెబుతున్నారు. ఏఐ (AI) సాధనాలతో పనిచేయగల, డేటాను విశ్లేషించి అన్వయించగల, డిజిటల్ సిస్టమ్లను అర్థం చేసుకుని కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచగల నిపుణులకు అన్ని పరిశ్రమలలో డిమాండ్ పెరుగుతోంది.అయితే, కేవలం సాంకేతిక సామర్థ్యం ఒక్కటే సరిపోదు. జట్లు మరింత 'క్రాస్-ఫంక్షనల్'గా 'ఏఐ-ఎనేబుల్డ్'గా మారుతున్న కొద్దీ... సాంకేతిక పరిజ్ఞానాన్ని కొలవగల ప్రభావంగా మార్చడానికి... సహకారం, వాటాదారుల నిర్వహణ, ప్రాజెక్ట్ నాయకత్వం వంటి వ్యక్తిగత నైపుణ్యాలు కూడా అత్యంత అవసరం.ఈ మేరకు లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్ అండ్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ, "కొన్నేళ్లుగా యువ నిపుణులకు ఏదైనా ఒక రంగంలో ప్రత్యేకత సాధించమని చెబుతూ వచ్చారు. కానీ 2026లో ఆ నియమం మారుతోంది. నేడు సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్న అభ్యర్థులు కేవలం ఒకే రంగంలో నిపుణులు కాదు... వారు విభిన్న నైపుణ్యాలను కలబోసిన వారు అయి ఉండాలంటోంది. ఏఐ (AI)తో ఎలా పనిచేయాలో, డేటాను ఎలా విశ్లేషించాలో, పనితీరును ఎలా మెరుగుపరచాలో వారికి తెలుసుండాలి. వీటన్నింటికీ మించి, వివిధ బృందాలతో కలిసి ఎలా పనిచేయాలో కూడా వారికి తెలుసుండా. ఈ నైపుణ్యాలు అందిపుచ్చుక్ను వారికే ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో ఉద్యోగంతో పాటు ప్రమోషన్ను కూడా తెచ్చిపెడుతుంది. ఈ మార్కెట్లో మీ అవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే, విడివిడిగా ఉండే నైపుణ్యాల వెంట పడటం మానేసి... మీకంటూ ప్రత్యేకమైన 'స్కిల్స్ స్టాక్'ను నిర్మించుకోండి. దానినే మీ ప్రధాన పోటీతత్వంగా మార్చుకోండి," అని అన్నారు.భారతదేశంలోని ఉద్యోగార్థులు తమ కెరీర్ను మార్చుకోవడానికి నేర్చుకోవాల్సిన ఐదు నైపుణ్యాలు ఏంటంటే..1. ఏఐ అండ్ ఆటోమేషన్ - ఉత్పాదకతే కొత్త ప్రాతిపదిక: ఏఐ (AI) ని తమ రోజువారీ పనుల్లో భాగం చేసుకోగల నిపుణులు.. పనులను వేగంగా, విస్తృతంగా చేయగలుగుతారు. ఇంజనీరింగ్, ఐటీ రంగాల్లో వర్క్ఫ్లో ఆటోమేషన్, LLMOps, AutoML అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ (API integration) వంటి నైపుణ్యాలకు మంచి గిరాకీ ఉంది. 2. డేటా అండ్ అనలిటిక్స్ - విశ్లేషణ ఆచరణలోకి మారాలి: కేవలం డేటాను విశ్లేషించడమే కాకుండా.. ఆ డేటాలోని అంతరార్థాన్ని గ్రహించి, దానిని స్పష్టంగా వివరించి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించగల నిపుణులకు యాజమాన్యాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. 3. ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ -: డిజిటల్ కార్యకలాపాలు విస్తరిస్తున్న తరుణంలో... టెక్నాలజీ వాతావరణాన్ని సురక్షితంగా ఉంచి, బలోపేతం చేయగల నిపుణులు స్థిరమైన వృద్ధికి కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో సైబర్ సెక్యూరిటీ అత్యంత కీలకం కాగా... సంస్థల డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు మద్దతు ఇచ్చే కన్సల్టింగ్ విభాగాల్లో 'క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్' నైపుణ్యాలకు గిరాకీ పెరుగుతోంది. 4. బిజినెస్ అండ్ గ్రోత్: పనితీరును మెరుగుపరుస్తూనే సంస్థ వృద్ధికి తోడ్పడే నిపుణులకు యాజమాన్యాలు తగిన గుర్తింపును ఇస్తున్నాయి. బిజినెస్ డెవలప్మెంట్ అండ్ సేల్స్లో 'రిలేషన్షిప్ మేనేజ్మెంట్'కు డిమాండ్ పెరుగుతోంది. అలాగే ఆదాయ సంబంధిత విభాగాల్లో 'నెగోషియేషన్' అనేది ప్రధాన సామర్థ్యంగా కొనసాగుతోంది. 5. పీపుల్ అండ్ లీడర్షిప్: బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్, ఇంజనీరింగ్, విద్య, ఆర్ట్స్ అండ్ డిజైన్, ఐటీ, కన్సల్టింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ వంటి అనేక రంగాల్లో ‘కొల్లాబరేషన్' అనేది నిలకడగా కనిపిస్తోంది. వేర్వేరు జట్లు ఎలా పనిచేస్తున్నాయో ఇది స్పష్టం చేస్తోంది. పనులు మరింతగా ఏఐ (AI) ఆధారితంగా, క్రాస్-ఫంక్షనల్గా మారుతున్న కొద్దీ... వ్యక్తులను సమన్వయం చేయడం, సంక్లిష్టతలను నిర్వహించడం, సమిష్టిగా ఫలితాలను రాబట్టడం అనేవి ఉద్యోగావకాశాలను నిర్ణయించే ప్రధాన నైపుణ్యాలుగా మారుతున్నాయి.చివరగా ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడేలా... లింక్డ్ఇన్ కొన్ని ఎంపిక చేసిన 'లింక్డ్ఇన్ లెర్నింగ్' కోర్సులను మార్చి 31, 2026 వరకు ఉచితంగా అందిస్తోంది. వీటిలో 'ఏఐ ఏజెంట్స్ ఫర్ ఎవ్రీడే ప్రొఫెషనల్స్', 'లెర్నింగ్ డేటా అనలిటిక్స్', 'స్టేక్హోల్డర్ మేనేజ్మెంట్ ఫర్ లీడర్స్ అండ్ మేనేజర్స్' వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.(చదవండి: -
జస్ట్ 11 నెలల్లో 52 కిలోలు బరువు తగ్గింది..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..
బరువు తగ్గడం అందరికీ ఒకలా ఉండదు. కొందరికి చాలా కష్టమైనదిగా..మరికొందరికి చాలా తేలికైన వాటితో సులభంగా తగ్గే టాస్క్లా ఉంటుంది. అయితే ఇక్కడ స్థిరత్వాన్ని బ్రేక్ చేయకపోతేనే..లక్ష్యానికి చేరుకోగలం. ఇక్కడ ట్యునిషియాకు చెందిన హిబా అల్లా వెయిట్లాస్ స్టోరీ ఆ విధంగానే సాగింది. ఆమె ఓర్పుతో స్థిరత్వంతో బరువు తగ్గే ప్రయాణాన్ని మొదలు పెట్టి ఏకంగా 133 కిలోల బరువు నుంచి 52 కిలోలకు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదికూడా జస్ట్ 11 నెలల్లో ఈ ఫలితాన్ని అందుకుని స్ఫూర్తిగా నిలిచిందామె. ఇంతకీ ఆమె ఎలాంటి ట్రిక్స్ అనుసరించిందంటే..ట్యునీషియాలోని ట్యునీస్కు చెందని 22 ఏళ్ల హిబా అల్లా అయాది ఒక స్టూడెంట్. ఆమె ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, బరువు ఏకంగా 133.3 కిలోలు ఉండేది. ఆమె రూపం భారీగా ఉండి..కనీసం నాలుగు అడుగులు వేయాలన్నా..ఆయాసంతో ఇబ్బందిపడేది. శ్వాస తీసుకోవడంలో నిరంతరం అలసటను ఎదుర్కొనేది. ఆరోగ్యం రోజు రోజుకి భారంగా మారిపోవడం మొదలైంది. ఇక తనకు తానుగా బరువు తగ్గేందుకు ఉపక్రమించకపోతే..ఉనికే కష్టమవుతుందని అర్థమైంది హిబాకు. దాంతో వెయిట్లాస్ అయ్యేందుకు రెడీ అయ్యింది. అయితే ఆమె అందరు అనుక్నుట్లుగా బరువు తగ్గడం అంటే..తినడం తగ్గించడం, నోరు కట్టేసుకోవడం కాదంటోంది. ఆమె తింటూనే బరువు తగ్గే ప్రయత్నం చేసిందంటే. అయితే తినే వాటిలో ఆరోగ్యకరమైనవి, ప్రోటీన్,ఫైబర్ ఉండేవి ఎంచుకున్నట్లు తెలిపింది. ముందుగా ఆకలి తీరి సంతృప్తిని కలిగించేలా భోజనం ఉండేలా చూసుకునేదాన్ని. అప్పుడు బరువు తగ్గడం భారంగా..భయానకంగా ఉండదట. పైగా తరుచుగా అద్దంలో చూసుకోవడం..స్లిమ్గా మారాలనే లక్ష్యాన్ని నిరంతరం గుర్తుచేస్తుంది. నోరు ఆటోమేటిగ్గా అదుపులో ఉండేలా ఆహారం తీసుకునేలా మైండ్సెట్ అవుతుందట. ఆమెకు అధిక బరువు కారణంగా జిమ్ సభ్యత్వం లభించలేదట. అందుకని హిబా వర్కౌట్లకు బదులుగా నడకను ఎంచుకుందట. నెమ్మదిగా చిన్న అడుగులతో మొదలు పెట్టి..కిలోమీటర్ల కొద్ది నడకను పెంచుకుంటూ పోయేదాన్ని అంటోంది. అధికంగా నీటిని తీసుకోవడం, తాజా పండ్లను తీసుకోవడం వంటివి చేసేదట. అలేగు ఉప్పు, చక్కెరలను మితంగా తీసుకునేదట. ఇక బరువు తగ్గడం శారీరకం భావోద్వేగ పోరాటంగా అభివర్ణించింది. మొదట్లో అంత తొందరగా తన బాడీలో మార్పులు సంతరించుకోలేదని, అయినా..ఎక్కడ అసహనం చెందకుండా ఓర్పుతో తన దినచర్యను కొనసాగించానని చెప్పుకొచ్చింది. ఏం తీసుకున్నా..ఆరోగ్యకరమైన విధంగా ఎంచుకోవడం, వాకింగ్ని స్కిప్ చేయకపోవడం వంటి అలవాట్లతో బరువు తగ్గడం ప్రారంభమవ్వడం మొదలైంది. అయితే తాను ఆ ఉత్సాహంతో అలసిపోతున్నప్పుడూ కూడా ఓపికతో తన డైలీ యాక్టివిటీని కొనసాగించేదాన్ని అంటోంది. అలా ఇవాళ 52.45 కిలోలు బరువుతగ్గి 52 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా అని నవ్వతూ చెప్పింది హిబా. అంతేగాదు బరువు తగ్గడం అనేది శిక్ష కాదని, శరీరం, జీవితానికి ఇచ్చే గౌరవప్రదమైన చర్యగా అభిర్ణించింది. ఈ రోజు తాను ఆరోగ్యంగా, హాయిగా శ్వాస తీసుకునే ఆహ్లాదభరితమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని ఆనందంగా చెబుతోంది. దయచేసి బరువు తగ్గడం అంటే..విపరీతమైన వర్కౌట్లు, కఠినమైన ఆహారంగా భావించొద్దు..సంతృప్తికరంగా తింటూ..ఎంజాయ్ చేస్తూ తగ్గాలి..అప్పుడే మంచి ఫలితాలు అందుకోగలం అని నమ్మకంగా చెబుతోంది హిబా.(చదవండి: బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..) -
బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..
వైద్యశాస్త్రం రోజు రోజుకి పురోగమిస్తు బాధిత రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా సంతానం విషయంలో ఇటీవల కాలంలో ఎన్ని జంటలు ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే. ఐవీఎఫ్, సరోగసీ ద్వారా కొంత ఉపశమనం లభించినప్పటికీ..కొందరు పుట్టుకతో గర్భాశయం లేని అమ్మాయిలకు మాత్రం సంతానం ఓ కలగానే మిగిలిపోతోంది. రూపం, ఆరోగ్యం.. పరంగా బాగుండి ఆ విషయంలో మాత్రం జీవితాంతం వారికో లోపం, శాపంగా ఉండిపోతోంది. ఇప్పుడు ఆ సమస్యకు చక్కటి ఉపశమనం అందించారు వైద్యులు. వైద్యశాస్త్రంలోనే సరికొత్త అద్భుతం చోటు చేసుకునేలా కొంగొత్త వైద్య ఆవిష్కరణలకు నాంది పలికి రోగుల్లో కొత్త ఆశలను నింపుతున్నారు. అందుకు ఈ జంట ఉదంతమే ఓ ఉదాహరణ. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 30 ఏళ్ల గ్రేస్ బెల్ పుట్టుకతోనే గర్భం లేదామెకు. గర్భం లేదు కాబట్టి పీరియడ్స్ ఉండవు గానీ సాధారణ అండశయాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ఎంఆర్కేహెచ్ సిండ్రోమ్గా పేర్కొంటారు. యూకేలో ప్రతి 5 వేల మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బెల్కి పిల్లలు పుట్టాలంటే గర్భమార్పిడి లేదా సరోగసీ ఒక్కటే మార్గం. దాంతో బెల్ భర్త స్టీవ్ పావెల్ ఇద్దరూ గర్భశయాన్ని దానం చేసే దాత కోసం ఎదురు చూస్తుండేవారు. గర్భం దొరికిందని, మార్పిడికి సిద్ధంగా ఉండమని ఆస్పత్రి నుంచి వచ్చిన కాల్ వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నమ్మశక్యం కానీ నిజంలా అనిపించింది ఆ జంటకు. అలా బెల్కి జూన్ 2024లో ఆక్స్ఫర్డ్లోని చర్చిల్ హాస్పిటల్లో దాదాపు 10 గంటలు శ్రమించి గర్భశయ మార్పిడి ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఐవీఎఫ్ని ఆశ్రయించి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా ఈ జంటకు 2025లో ఓ అద్భుత వరంలా 7 పౌండ్ల బరువుతో హ్యోగో అనే బిడ్డ జన్మించాడు. ప్రస్తుతం ఆ చిన్నారికి పదివారాల వయసు. ఆ దంపతులు ఇద్దరు తమకు సంతానభాగ్యాన్ని అందించిన ఆ మహిళకు, ఆమె కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటామంటూ భావోద్వేగంగా చెప్పారు. మా బిడ్డను చూసిన ప్రతిసారి వాళ్లే మాకు గుర్తొస్తారంని అన్నారు. అయితే ఆ జంట మరో బిడ్డను కనాలనుకునేంత వరకు మార్పిడి చేసిన గర్భాశయాన్ని ఉంచి, ఆ తర్వాత తొలిగిస్తారట. ఎందుకంటే ఆ అవయవంపై శరీర రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయకుండా నిరోధించడానికి, అలాగే ఆమె జీవతాంత మందులు తీసకోకుండా నివారించేందుకు ఇది తప్పదని చెబుతున్నారు వైద్యులు. కాగా, ఇలాంటి ఘటనే 2025 ప్రారంభంలో యూకేలో మొదటి సజీవ గర్భదానం ద్వారా అమీ అనే శిశువు జన్మించింది. ఈకేసులో అక్క గర్భాన్ని పొందింది సదరు మహిళ. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో చెలెల్లికి తన గర్భాన్ని దానం చేసింది. వైద్యశాస్త్రంలో ఈ పురోగతి..పుట్టుకతో గర్భంలేని యువతుల పాలిట వరంగా మారుతుంది. పైగా అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేందుకు నాంది పలకడమే గాక..మరణం తర్వాత ఇతరుల జీవితాల్లో వెలుగులు పంచేలా బతకడం ఈ దానం వల్లే సాధ్యమని తెలుసుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: అద్దంలో కనిపించని అసలు రూపం) -
అద్దంలో కనిపించని అసలు రూపం
మనం ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి జుట్టు సర్దుకుంటాం, మేకప్ వేసుకుంటాం. కానీ మన కంటికి కనిపించని మరొక అద్దం మన మనసులో ఉంది. అక్కడ మన గురించి మనం ఒక చిత్రాన్ని గీసి ఉంచాం. సైకాలజీలో దీన్నే 'Self-Image' (స్వీయ ప్రతిబింబం) అంటారు. ఇదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.ఎస్, ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుంది అనేది కాదు, మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు అనేదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.మాక్స్వెల్ మాల్ట్జ్ పరిశోధన...డాక్టర్ మాక్స్వెల్ మాల్ట్జ్ ఒక ప్లాస్టిక్ సర్జన్. ప్రమాదాల్లో ముఖం దెబ్బతిన్న వారికి లేదా పుట్టుకతో లోపాలు ఉన్నవారికి ఆయన ఆపరేషన్ చేసేవారు. చాలామంది ఆపరేషన్ తర్వాత కొత్త ముఖంతో ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. కానీ కొంతమంది మాత్రం, ముఖం పర్ఫెక్ట్గా మారినా, "డాక్టర్, నా ముఖం ఇంకా అలాగే ఉంది, నేను ఇంకా వికారంగానే కనిపిస్తున్నాను" అని చెప్పేవారు.మనం బయట ఎన్ని మార్పులు చేసినా, మన మనసులోని అద్దంలో ఉన్న చిత్రం (Mental Blueprint) మారకపోతే ఏదీ మారదని ఆయనకు అర్థమైంది. దీన్నే ఆయన 'Psychocybernetics' అన్నారు. అంటే మన మెదడు ఒక ఆటో-పైలట్ మెకానిజం లాంటిది; మన అంతరంగంలో మన గురించి మనం ఎలాంటి చిత్రం గీసుకుంటే, మన జీవితం అటువైపే ప్రయాణిస్తుంది.సెల్ఫ్-ఇమేజ్: మీ జీవితపు థర్మోస్టాట్మీ ఇంట్లోని ఏసీ 24 డిగ్రీల దగ్గర ఉందనుకోండి, బయట ఎండ ఎంత ఉన్నా అది గదిని 24 దగ్గరే ఉంచుతుంది. మీ సెల్ఫ్-ఇమేజ్ కూడా మీ జీవితానికి ఒక థర్మోస్టాట్ లాంటిది.ఒక విద్యార్థి "నేను యావరేజ్ స్టూడెంట్ని" అని నమ్మితే, అతను ఎంత బాగా చదివినా చివరికి యావరేజ్ మార్కులే తెచ్చుకుంటాడు. ఎందుకంటే, అతని సబ్-కాన్షియస్ మైండ్ అతన్ని అంతకు మించి వెళ్లనివ్వదు.ఒక వ్యక్తి "నాకు అదృష్టం లేదు" అని నమ్మితే, అద్భుతమైన అవకాశం తలుపు తట్టినా దాన్ని అతను చేజేతులా వదిలేస్తాడు.పాజిటివ్ థింకింగ్ ఎందుకు విఫలమవుతుంది?పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, మోటివేషనల్ స్పీకర్స్ మనకు "నువ్వు గొప్పవాడివి అని గట్టిగా అరువు" అని చెప్తారు. కానీ "నేను దేనికీ పనికిరాను" అని మీ అంతరంగంలో మీరు నమ్ముతున్నంత కాలం, ఆ అరుపులు కేవలం శబ్దాలుగానే మిగిలిపోతాయి. మార్కెట్ విల్ పవర్ వాడమంటుంది. సైకాలజీ ఇమాజినేషన్ వాడమంటుంది.మన సెల్ఫ్-ఇమేజ్ లోపల ఎంత బలంగా ఉంటుందంటే, దానికి వ్యతిరేకంగా మనం చేసే ప్రయత్నాలన్నీ నీటి మీద గీతలు లాంటివే. మనల్ని మనం మార్చుకోవాలంటే మన విల్ పవర్ ని కాదు, మన సెల్ఫ్-ఇమేజ్ ని మార్చాలి.మీ లోపలి అద్దాన్ని క్లీన్ చేసుకోండిGenius Matrix మోడల్ బ్రేక్, బిల్డ్, బియాండ్ ఉపయోగించి ఈ సెల్ఫ్-ఇమేజ్ ని ఎలా రీ-డిజైన్ చేయాలో చూద్దాం.Step 1: Break (పాత ముద్రను గుర్తించడం)ముందుగా అద్దంలో మీకు కనిపించని ఆ 'నెగటివ్ ఇమేజ్' ను గుర్తించండి."నేను ఒక పిరికివాడిని," "నేను ఎప్పుడూ ఫెయిల్ అవుతాను" వంటి వాక్యాలు మీ మైండ్ లో ఎప్పుడు పడ్డాయి?మనసులో ఉన్న ఆ పాత గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. పాత ముద్రను 'Break' చేయడమే మొదటి మెట్టు.Step 2: Build (మెంటల్ రిహార్సల్)మాక్స్వెల్ మాల్ట్జ్ ఒక గొప్ప టెక్నిక్ చెప్పారు—'Creative Visualization'.ప్రతిరోజూ 10 నిమిషాలు కళ్ళు మూసుకుని, మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి.మీ మెదడుకు వాస్తవానికి, ఊహకు మధ్య తేడా తెలియదు. మీరు పదే పదే ఒక కొత్త చిత్రాన్ని ఇస్తే, అది పాత సెల్ఫ్-ఇమేజ్ ని తుడిచేసి కొత్తదాన్ని 'Build' చేస్తుంది.Step 3: Beyond (కొత్త అస్తిత్వం)ఒక్కసారి మీ సెల్ఫ్-ఇమేజ్ మారితే, మీరు మీ పరిమితులను దాటి ప్రయాణిస్తారు. మీరు ఎవరికో ఏదో నిరూపించాల్సిన అవసరం ఉండదు. మీరు మీ మనసు లోపలి అద్దంలో ఒక 'విన్నర్' గా కనిపిస్తారు. ఇదే 'Beyond' స్టేజ్.అద్దం అబద్ధం చెప్పదు!ఈ రోజు మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి:కళ్ళు మూసుకుని, ఒక వ్యక్తిగా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒక వాక్యంలో రాసుకోండి. (అది మీ సెల్ఫ్-ఇమేజ్).ఆ వాక్యం నిజమేనా? దానికి ఆధారాలు ఏంటి?మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఆ కొత్త ఇమేజ్ ని ఇప్పుడే డిజైన్ చేయండి. దాన్ని రోజూ ప్రాక్టీస్ చేయండి.లోపలి అందమే అసలైన శక్తి!బ్రో, ముఖానికి వేసుకునే రంగులు వర్షం వస్తే పోతాయి. కానీ మనసులో వేసుకునే ఈ 'సెల్ఫ్-ఇమేజ్' రంగులు జీవితాంతం ఉంటాయి. మీ మనసు లోపలి అద్దంలో ఉన్న మలినాలను తుడిచేయండి. మీరు ఒక అద్భుతమైన సృష్టి అని ముందు మీరు నమ్మండి.. ప్రపంచం దానంతట అదే నమ్ముతుంది. గుర్తుంచుకోండి, "You cannot outperform your own self-image."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
తీవ్రమైన మోకాలి నొప్పిని వ్యాయామాలతో జయించింది..!
హాంకాంగ్కు చెందని కవితా బిశ్వాస్ టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తుండేవారు. పూర్తికాల ఉద్యోగం తోపాటు యోగా, నృత్య సాధనతో హాయిగా సాగిపోతున్న ఆమె జీవతం ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఆకస్మత్తుగా నలభైల మధ్యలో మోకాలి నొప్పి బారిన పడింది దాంతో ఆమె లైఫ్ఎంతో ఘెరంగా మారిపోయిందంటే..మళ్లీ నడుస్తానన్న ఆశ ఆవిరైపోయింది. కానీ ఆమె ఆ సమస్యను ఎలాంటి మోకాలి ఆపరేషన్ చేయించుకోకుండానే జయించింది. పట్టుదలతో అనారోగ్య సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే..ఏ సమస్య అయినే ఇట్టే మాయం అయిపోతుందనడానికి ఆమె ఉదంతమే ఉదాహరణ. హాంకాంగ్ పాఠశాలలో టీచర్గా సాగిస్తున్న కవితా బిశ్వాస్ జీవితాన్ని మోకాలి నొప్పి..ఆమె జీవితాన్ని చాలా దుర్భరంగా మార్చేసింది. భరించలేని నొప్పి, నడక కష్టమై ఎక్కడకు వెళ్లలేని పరిస్థితికి తీసుకొచ్చేసింది. కనీసం ఓ పదినిమిషాలు నడవాలంటే ప్రాణమే పోయేంత పరిస్థితి. చివరికి కర్ర సాయం లేకుండా నాలుగు అడుగులు కూడా వేయలేని దారుణమైన పరిస్థితికి చేరిపోయింది. ఆఖరికి ఎయిర్పోర్ట్లో సైతం వీల్చైర్ ఆధారం తీసుకోవాల్సి వచ్చిందామెకు. ఆమె ట్రీట్మెంట్ కోసం భారత్కు వచ్చారు. ఇక్కడి వైద్యులు మోకాలి లిగమెంట్ దెబ్బతిందని, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స తప్పదని చెప్పారు. అయితే ఆమె వయసు ఈ చికిత్సకు అర్హమైనది కాకపోవడంతో..మందులు, వ్యాయామాలను కొనసాగించి చూడమని సూచించారు. దాంతో తిరిగి హాంకాంగ్ వచ్చేశారు. ఇక ఎప్పటిలా తనకు తానుగా స్కూల్కి, నృత్యసాధన సాధ్యం కాదని అర్థమైపోయింది కవితకి దాంతో ఫిజియోథెరపీ తీసుకోవాలని డిసైడ్ అయ్యారామె. ఓపక్కన చికిత్స తీసుకుంటూనే..చిన్నగా నడవడం, వ్యాయామాలు చేయడం వంటివి చేసింది. మోకాలి వంచలేదని తెలుసు కానీ..వర్కౌట్లు చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా అయిపోతుందని అలానే బాధనంతటిని పట్టి బిగువున అదిమపట్టి చేస్తుండేది. గోడ ఆధారిత వ్యాయామాలు, రెసిస్టెన్స్ బ్యాండ్లు సాయంతో కండరాలు బలోపేతం చేసే కొద్దిపాటి వ్యాయామాలు చేస్తుండేది. అలాగే ఆహారంలో మార్పులు చేసుకుని 92 కిలోలు నుంచి 74 కిలోలకు చేరుకుది. సుమారు 18 నెలల తర్వాత, కర్ర సాయం లేకుండా తనంతట తానుగ నడవగలిగింది. అంతేగాదు సుమారు 45 నిమిషాల వరకు నడవగలగడంతో..మళ్లీ నా స్వతంత్ర వచ్చింది అంటూ సంబరపడిందామె. ఇక్కడ కవిత తన నొప్పి, వాపులకు అనుగుణంగా వ్యాయామాలు చేసుకునేలా సర్దుబాటు చేసుకుంది. అలా ఈ సమస్య నుంచి బయపటపడే ప్రయత్నం చేసింది. అంతేగాదు ఈ మహిళ అనుభవం..మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ను నిర్వహించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తేటతెల్లం అయ్యింది. మూడేళ్ల క్రితం కవిత ఎయిర్పోర్టుకి వీల్చైర్పై వస్తే..ఇపుడు ఆమె ధీమాగా నడుచుకుంటూ వెళ్లింది. ఆ మహిళ స్టోరీ..ఏ అనారోగ్య సమస్య అయినా..ధైర్యంగా ఉండి వైద్యనిపుణుల సాయం తీసుకుంటే..సులభంగా బయటపడొచ్చని చెప్పకనే చెబుతోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నయనేంద్రియానం కార్నియా ప్రధానం..!) -
కోకిలాబెన్ అంబానీ 92వ పుట్టినరోజు వేడుకలు..! ఆమె మార్క్ ఉండేలా..
వ్యాపార ప్రపంచంలో అపరకుబేరుల్లా వెలుగుతున్న ఫ్యామిలీ అంబానీ. అలాంటి వంశ పార్యంపర్య వ్యాపారానికి వెన్నుముకగా నిలిచిన శక్తిమంతమైన మహిళ కోకిలాబెన్ అంబానీ అంటే అతిశయోక్తి కాదు. ధీరూభాయ్ వ్యాపార ప్రపంచాన్ని శాసించినా, ముఖేష్ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించినా.. దీని వెనుకున్న గొప్ప మహిళా మూర్తి కోకిలా బెన్. ఇవాళ కోకిల్ బెన్ 92వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే ఆమె సంపన్న మహిళ వలే గ్రాండ్గా కాకుండా చాలా సాదాసీదాగా జరుపుకుంటూ..సింపుల్సిటీకీ కేరాఫ్గా నిలిచారామె. ఆఖరికి ధరించిన చీర సైతం సాధారణమైన నిమ్మపండు రంగు షిఫాన్ చీరలో కాలాతీత సౌందర్యానికి కట్టుబడి ఉన్నట్లుగా.. తన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నారామె. అంబానీ అప్డేట్ ఇన్స్టాగ్రామ్లో అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేశాడరు. భారీ అలంకరణలు, ఖరీదైన ఆభరణాలుగానీ ధరించకుండా..ఆహ్లాదకరమైన పసుపు రంగు చీరతో నవ్వుతూ కనిపించారామె. ఒక సాధారణ గొలుసు, సున్నితమైన చెవుపోగులు, సాంప్రదాయ ఎరుపు బిండితో తన లుక్ని పూర్తిచేసింది. సహజ అలంకరణకు మించిన బ్యూటీ మరొకటి ఉండదని చెప్పకనే చెప్పారు కోకిలాబెన్. ఇక ఈ వేడుకలో ఆమె ఉనికిని తెలియజేసేలా చేతులు, కాళ్ల గుర్తుల ఫ్రేమ్తో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కోకిలాబెన్ నేపథ్యం..1934లో గుజరాత్లోని జామ్నగర్లో జన్మించిన కోకిలాబెన్ అంబానీ, అంబానీ కుటుంబానికి మాతృమూర్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ భార్య. 1955లో ధీరూభాయ్ను వివాహం చేసుకుని కొంతకాలం యెమెన్లోని ఆడెన్లో నివశించారు. ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యం అభివృద్ధి చెందడంలో ఆమె కీలక సహాయక పాత్ర పోషించారామె. అలాగే 2002లో ఆయన మరణం తర్వాత, కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య జరిగిన హై ప్రొఫైల్ వివాదానికి ఆమె మధ్యవర్తిత్వం వహించారు. అలా 2005లో రిలయన్స్ గ్రూప్ విభజనకు దారితీసింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్తో సహా పలు దాతృత్వ కార్యక్రమాల్లో ఆమె పాత్ర కూడా ఉంది. సంప్రదాయాలకు కట్టుబడి ఉండే గౌరవనీయమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు కోకిలాబెన్. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
నయనేంద్రియానం కార్నియా ప్రధానం..!
ఓ చిన్నారి పుట్టినప్పటి నుంచి అతడు / ఆమె నేర్చుకునే మొత్తం జీవన నైపుణ్యాల్లో దాదాపు 80 శాతానికి పైగా కంటిచూపు వల్లనే సాధ్యమవుతుంది. పైగా ఈ యుగంలోని చిత్రవిచిత్రాలన్నీ చూడాలంటే కన్నుంటేనే సాధ్యం. అందుకే ‘కన్నుంటేనే కలికాలం’ అన్న నానుడి స్థిరపడింది. జనసామాన్యంలోని ఈ మాటే ఈరోజుల్లో కంటికి ఉన్న ప్రాముఖ్యతనూ, ప్రాధాన్యాన్నీ నొక్కి చెబుతుంది. మరి ఇంతటి విలువైన కంటిచూపును ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు నేత్రదానం తర్వాత కంటి చూపు పొందడం సాధ్యమవుతుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. పైగా ఈ కంటిదానం సమయంలో మొత్తం కనుగుడ్డును స్వీకరిస్తారనే అపోహ కూడా చాలామందిలో ఉంటుంది. నిజానికి కార్నియా అనే పారదర్శకమైన పొర దెబ్బతినడం వల్ల వచ్చిన దృష్టిలోపాన్ని మాత్రమే నేత్రదానంతో సరిచేయడం సాధ్యమవుతుంది. పైగా ఇలా నేత్రదానం చేసిన కేసుల్లో కనుగుడ్డు మొత్తం కాకుండా కేవలం ‘కార్నియా’ అనే నల్లగుడ్డుపై ఉండే పోరనే స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో నేత్రదానమనేది ఎప్పుడెప్పుడు ఎంతమేరకు సాధ్యం? ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కంటి చూపును పొందడం ఏయే సందర్భాల్లో సాధ్యమవుతుంది? ఏయే సందర్భాల్లో అది సాధ్యం కాదు... అలా సాధ్యం కాక΄ోవడానికి కారణాలేమిటి... వంటి అనేక అంశాలపై అవగాహన కోసం... ఈ కథనం. కంటితో చూడటాన్ని సాధ్యం చేసే కంటి నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను ‘కార్నియా’ అంటారు. నిజానికి నేత్రదానం చేసిన వారి నుంచి కంటిని తీసుకునే సమయంలో కనుగుడ్డునంతా స్వీకరించరు. కేవలం కార్నియా అని పిలిచే ఈ నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను మాత్రమే తీసుకుంటారు.కార్నియా అంటే..?ఇది కంట్లో ఉండే ఒక పారదర్శకమైన పొర. కంటిలోని నల్లగుడ్డుపై ఉండటం వల్ల... ఇది పారదర్శకమైన పొర కావడంతో ఇది కూడా నల్లగా కనిపిస్తుంది. ఇది కంట్లోని ఐరిస్ అనే భాగాన్ని, ప్యూపిల్నూ, యాంటీరియర్ ఛేంబర్ను కప్పి ఉంచుతుంది. ఇది బయటి నుంచి వచ్చే కాంతికిరణాలను కంటిపై పడేలా చూస్తూ... మొదట కంట్లోకి ప్రవేశించేలా... అటు పిమ్మట కంటి వెనక ఉండే పొర రెటీనాపై ప్రతిబింబించేలా చేస్తుంది. ఇది పారదర్శకంగా ఉంటేనే చూపు ఉంటుంది. ఇది పారదర్శకత కోల్పోవడం వల్ల చూపునూ కోల్పోవడం జరుగుతుంది. కార్నియా మార్పిడి చికిత్స అంటే..?కార్నియా గాయపడటం లేదా దెబ్బతినడం వల్ల కలిగిన అంధత్వాన్ని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. కార్నియా దెబ్బతినడం వల్ల ఎవరైనా కంటి చూపు కోల్పోతే... అలాంటి వారికి దెబ్బతిన్న కార్నియా స్థానంలో మంచి కార్నియాను అమర్చడం ద్వారా వారు కోల్పోయిన చూపును తిరిగి తెప్పించడం సాధ్యమే. అంటే కార్నియా దెబ్బతినడం వల్ల వచ్చిన అంధత్వానికి మాత్రమే కార్నియా ద్వారా చూపు తెప్పించవచ్చు. ప్రస్తుతానికి కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ఈ ప్రక్రియ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇప్పటికి ఇది మాత్రమే సాధ్యం. ఇంకా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటిచూపును ΄పొందేందుకు పెద్దగా అవకాశాలేమీ లేవు. అయితే కేవలం కార్నియల్ బ్లైండ్నెస్నే కాకుండా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ప్రయత్నాలూ, పరిశోధనలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.తొలిసారి కార్నియా మార్పిడి చికిత్స నేపథ్యమిలా... తొలిసారిగా కార్నియా మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ ఎడ్వర్డ్ జిమ్ అనే వైద్య నిపుణుడు 1905లో చేశారు. కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమయ్యే అవకాశాలు దాదాపు 90 శాతానికి పైగా ఉంటాయి. అయితే ఎవరైనా కళ్లు దానం చేసిన వ్యక్తి మరణించాక ఆరుగంటలలోపే అతడి నుంచి కార్నియాను స్వీకరించి, ఐ–బ్యాంక్లో భద్రపరచాల్సి ఉంటుంది. అటు తర్వాత సేకరించినప్పటికీ అది కార్నియా మార్పిడికి ఉపయోగపడదు.కార్నియల్ బ్లైండ్నెస్కు దారితీసే పరిస్థితులు కంటికి అయ్యే గాయాల కారణంగా కార్నియా దెబ్బతినడం రసాయన ప్రమాదాలకు గురికావడంతో కార్నియా గాయపడటం లేదా కాలి΄ోవడం (కార్నియల్ బర్న్) పోషకాహార లోపం వల్ల కార్నియా దెబ్బతినడం (మరీ ముఖ్యంగా చిన్న వయసులో వైటమిన్ ఏ లోపం వల్ల) కంటికి... మరీ ముఖ్యంగా కార్నియాకు వచ్చే ఇన్ఫెక్షన్స్ (కార్నియల్ అల్సర్స్ – నిజానికి మిగతా కారణాల కంటే కార్నియల్ ఇన్ఫెక్షన్తోనే అంధత్వాలు వచ్చే అవకాశం ఎక్కువ) పుట్టుకతో లేదా జన్యుపరంగా వచ్చే కొన్ని రకాల సమస్యలు ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్లతో ఒకవేళ పైన పేర్కొన్న కారణాలతో కార్నియా దెబ్బతిని అంధత్వం వస్తే దాన్ని కార్నియా మార్పిడి (కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్) చికిత్సతో బాధితులకు చూపు తెప్పించవచ్చు.కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడెప్పుడంటే... కంటి చూపునకు సంబంధించిన కొన్ని సమస్యలున్నప్పుడు (ఆప్టికల్) : సూడోఫేకిక్ బుల్లోస్ కెరటోపతి, కార్నియల్ డీజనరేషన్, కెరటోకోనస్, కెరటోగ్లోబస్, కార్నియల్ డిస్ట్రఫీ వంటి కొన్ని కంటి సమస్యలు ఉన్నప్పుడు కంటిచూపును మెరుగుపరచడానికి. కంటిలోని భాగాలను సమీకృతంగా (ఇంటెగ్రల్గా) ఉంచడానికి (టెక్టానిక్) : ‘స్ట్రోమల్ థిన్నింగ్ డెస్మాటోసీల్’ అనే సమస్యలున్నప్పుడు కంటిలోని భాగాలను బయటికి రాకుండా నియంత్రించి వాటిని ఏకీకృతంగా లోపలే కలిపి ఉంచడానికి. చికిత్సలో భాగంగా చేసే ట్రాన్స్ప్లాంట్స్లో (థెరటిక్) : ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చికిత్సకు ఎంతమాత్రమూ సహకరించకుండా ఉండే కార్నియల్ భాగాన్ని తొలగించి, ఆ ప్రదేశంలో కొత్త కార్నియా ఉంచి చూపు తెప్పించడానికి. అందం కోసం (కాస్మటిక్): కంటి నల్లగుడ్డు భాగంలో తెల్లమచ్చలు ఉన్నప్పుడు...ఆ కార్నియల్ స్కార్స్ను తొలగించి, అందాన్ని ఇనుమడింపజేయడం కోసం.ఎవరెవరిలో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యం కాదంటే... కొందరిలో కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా చూపు తెప్పించడం సాధ్యం కాదు. అది ఎవరిలోనంటే... ∙రెటీనా లోపం లేదా ఆప్టిక్ నర్వ్ లోపంతో అంధత్వం వచ్చినవారు రెటినైటిస్ పిగ్మెంటోజా అనే కండిషన్ కారణంగా చూపు కోల్పోయిన వారు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చిన మాక్యులార్ డీజనరేషన్ అనే సమస్య కారణంగా చూపు పోగొట్టుకున్నవారు ∙ఆప్టిక్ అట్రోఫీతో బాధపడుతున్నవారు రాడ్ అండ్ కోన్ డిస్ట్రఫీ అనే జబ్బుల కారణంగా చూపు కోల్పోయిన వారు ∙నీటికాసుల (అడ్వాన్స్డ్ గ్లకోమా)తో కంటిచూపు కోల్పోయినవారు, కాంతికి స్పందించని (లైట్ పర్సెప్షన్ లేని) కళ్లలో ఈ చికిత్స సాధ్యం కాదు. ఇక్కడ పేర్కొన్న అన్ని సందర్భాల్లోనూ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్తో ఏమాత్రం ప్రయోజనం చేకూరదు.నేత్రదానం ఎందుకు చేయాలి? భారతదేశంలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల మంది కార్నియల్ బ్లైండ్నెస్ కారణంగా అంధులుగా మారుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పైగా ప్రతి సంవత్సరమూ ఈ కార్నియల్ బ్లైండ్నెస్ కారణంగా ఏడాదికి 25,000 నుంచి 30,000 వరకు కొత్త కేసులు ఈ అంధుల జాబితాకు జత అవుతున్నాయన్నది మరో అంచనా. నేత్రదానం అంటే కార్నియాను ఇవ్వడం వల్ల వీళ్లకు అంధత్వాన్ని దూరం చేసి, కంటిచూపు ప్రసాదించవచ్చు. నిజానికి మన దేహంలోని కొన్ని కణజాలాలను కృత్రిమంగా సృష్టించడం సాధ్యం కాదు. ఒకరి నుంచి దానంగా స్వీకరించిన కణజాలాన్ని వేరే చోట అమర్చగలగడం సాధ్యమవుతుంది. అందువల్ల అలాంటి కణజాలాలు అవసరమైనప్పుడు వాటిని దాత ఇచ్చినప్పుడే స్వీకరించడం సాధ్యమవుతుంది. అలాంటివాటిల్లో కార్నియా ఒకటి. ఒకవేళ పిల్లల్లో ఇలా కార్నియా లోపం వల్ల అంధత్వం వస్తే... ఆ పిల్లలకు తెలిసే ఒకే ఒక రంగు... నలుపు! ఈ రంగురంగుల ప్రపంచాన్ని వాళ్లు చూడటమే సాధ్యం కాదు. ఆ చిన్నారి జీవితాల్లోంచి ఆ నలుపును తొలగించి, వాళ్ల జీవితాలను రంగుల మయం చేయడానికి కార్నియాలు లభ్యం కావడమన్నది ఎంతగానో అవసరం. అందువల్ల వ్యక్తులంతా తమ మరణానంతరం కార్నియాను నిరుపయోగంగా మట్టిలో కలిసి΄ోయేలా చేయడానికి బదులు, వాటిని దానంగా ఇవ్వడం ద్వారా ప్రతి వ్యక్తీ మరో ఇద్దరికి చూపును తెప్పించే అవకాశం ఉంటుంది. అందుకే అలా కంటిచూపునకు దూరమైన వ్యక్తులకు ఈ లోకం చూపించడానికి నేత్రదానాలు పెరగడం ఎంతగానో అవసరం.నేత్రదానం చేయడానికి ఎవరెవరు అర్హులు ? ఏడాది వయసుకు పైగా ఉన్నవారెవరైనా తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి అర్హులవుతారు. అలాంటి వారిలో ఈ కింద పేర్కొన్న సమస్యలునప్పటికీ వారు తమ మరణానంతరం నేత్రదానం చేయవచ్చు. అవి... పాక్షికంగానే కనుచూపు ఉన్నవారు (పూర్ సైట్), ∙కళ్లజోడు వాడేవారు డయాబెటిస్తో బాధపడేవారు రక్తపోటుతో బాధపడేవారు (చక్కెర వ్యాధి, హైబీపీ ఉన్నప్పటికీ నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు. ఇలాంటి రుగ్మతలు ఉన్నప్పటికీ నేత్రదానానికి వారు పూర్తిగా అర్హులే) రెటీనా లేదా ఆప్టిక్ నర్వ్ లోపం వల్ల అంధత్వం వచ్చినవారూ... వీరంతా ఎంతగా వయసుపైబడ్డవారైనప్పటికీ నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు.కార్నియాల లభ్యత అవసరమైన మేరకు ఎందుకు ఉండటం లేదంటే? నేత్రదానం అని చెప్పే ఈ కార్నియా దానాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా జరగడం లేదనే చె΄్పాలి. దాంతో బాధితులకు అవసరమైనన్ని కార్నియాలు లభ్యం కావడం లేదు. చాలా అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని ఇవే... నేత్రదానం విషయంలో అవగాహనలోపం ∙నేత్రదానం తర్వాత కార్నియాలను నిలువ చేయడానికి అవసరమైననన్ని కేంద్రాలు (ఐ బ్యాంకులు) లేకపోవడం, నేత్రదానాన్ని ్ర΄ోత్సహించే వారి సంఖ్య అంతగా లేక΄ోవడం (మోటివేషన్ లేక΄ోవడం) సామాజిక, మతపరమైన కారణాలతో నేత్రదానానికి ముందుకు వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉండటం.కార్నియా సేకరణ ఎలా జరుగుతుందంటే..? నేత్రదానం చేస్తానని వాగ్దానం చేసిన వ్యక్తి మరణించిన వెన్వెంటనే... బంధుమిత్రులు ‘ఐ బ్యాంక్’కు సమాచారమివ్వాలి. ఎందుకంటే... మరణించాక ఆరు గంటలలోపే దాత నుంచి కార్నియాను సేకరించాలి. లేకపోతే ఆ కార్నియా నిరుపయోగంగా మారిపోతుంది. ఈలోపు ఐ–బ్యాంక్ నుంచి సిబ్బంది వచ్చే లోపు మరణించిన వ్యక్తి కళ్లపైన తడి దూదిని ఉంచాలి. ఆ గదిలో ఉన్న ఫ్యాన్ను స్విచ్–ఆఫ్ చేయాలి. మరణించిన వ్యక్తి తల భాగం మిగతా శరీరానికి ఆరు అంగుళాల ఎత్తుండేలా మృతుడి తలకింద తలగడ అమర్చాలి. ఐ–బ్యాంక్ సిబ్బంది వచ్చాక... ఇక్కడ పేర్కొన్నట్లుగా ఉంచిన మృతుడి పార్థివ శరీరంలోని కళ్లలోని కార్నియాతోపాటు 10 సి.సి.ల రక్తపు నమూనానూ సేకరిస్తారు. కార్నియా తొలగింపు తర్వాత ఐ–బ్యాంక్ సిబ్బంది ఆ ప్రదేశంలో కృత్రిమ కార్నియాను అమర్చి కంటి ఆకృతిలో ఎలాంటి తేడా కనిపించకుండా చూస్తారు.చూపు పొందడానికే అవకాశాలెక్కువ... కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కాకసోవడానికి అవకాశాలు చాలా తక్కువ. శస్త్రచికిత్స విజయవంతమై చూపు పొందడానికే అవకాశాలెక్కువ. ఈ మాట చె΄్పాల్సిన అవసరమేమిటంటే... సాధారణంగా మిగతా అవయావాల మార్పిడి తాలూకు శస్త్రచికిత్స చేసినప్పుడు శరీరం ఆ అవయవాలను అంత తేలిగ్గా తనవిగా ఆమోదించదు. తనది కాని బయటి పదార్థం (ఫారిన్బాడీ) పరిగణించి, దాన్ని రిజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్లో అలాంటి అవకాశాలు చాలా తక్కువ. అందుకే దాదాపు 90 శాతం కేసులకు పైగా విజయవంతం అవుతాయి. పైగా పైన పేర్కొన్న రిస్క్ ఉన్నందున మిగతా అవయవ మార్పిడి శస్త్రచికిత్స కేసుల్లో శరీరానికి రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీని) తగ్గించడానికి ఇమ్యూనోసప్రెసెంట్ ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కార్నియాకు అలాంటి ప్రమాదం లేదు కాబట్టి ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది నేత్రదానం విషయంలో ఉన్న మంచి సౌకర్యం. కంటి ఆపరేషన్ అయినవాళ్లు కూడా నేత్రదానానికి అర్హులే.ఏయే సందర్భాల్లో రిస్క్ ఉంటుందంటే... కార్నియాను అమర్చే సమయంలో స్వీకర్త శరీరం దాన్ని స్వీకరించక΄ోవడం అన్న రిస్క్ చాలా తక్కువ. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రమాదం ఉండవచ్చు. అదెప్పుడంటే...అంటించిన గ్రాఫ్ట్ ఊడిపోవడం లేదా కదిలిపోవడం గ్రాఫ్ట్ తర్వాత కంటికి ఇన్ఫెక్షన్ రావడం కంటిలోని గుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల (గ్లకోమా) కుట్లు వేయడంలో కొన్ని సమస్యల కారణంగా కార్నియా వాపు వచ్చినప్పుడు.కార్నియా నిరుపయోగమని తేలితే...? కొందరు పెద్దమనసుతో నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ వాళ్ల కార్నియా నిరుపయోగం అని తేలితే... అప్పుడూ దాతల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు ఎయిడ్స్ రోగులు, హెపటైటిస్ బీ లేదా సీ ఉన్నవారి కార్నియాలు దానంగా స్వీకరించడానికి ఉపయోగపడవు. అయితే కొన్ని సందర్భాల్లో వారి నుంచి స్ల్కెరా వంటి కొన్ని కంటి భాగాలను గ్రాఫ్టింగ్ కోసం వాడుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో మానవాళికి ఉపయోగపడే కొన్ని పరిశోధనల కోసం కూడా ఆ కార్నియాలను ఉపయోగించుకోవచ్చు. అందుకే మరో బాధితుడికి అమర్చడానికి వీల్లేనంత మాత్రాన కార్నియా నిరుపయోగం అవుతుందనే అభి్ర΄ాయానికి రావద్దు. చివరగా... మరణానంతరం వృథాగా మట్టిలో కలసిపోవడం వల్లగానీ లేదా కట్టెపై కాలిపోవడం ద్వారాగానీ వృథాగా పోయే కార్నియాలను వీలైనంత ఎక్కవ మంది దానం చేస్తే... ఎంతోమంది చిన్నారులూ, పెద్దవారూ చూపు పొందేలా చేయవచ్చు. అందుకే కార్నియా దానాల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహనను పెంచుకోవడం ఎంతైనా అవసరమని గుర్తించాలి. ఎవరు నేత్రదానం చేయడానికి అర్హులు కారంటే... కొందరి నుంచి మరణానంతరం కార్నియా స్వీకరించడం కుదరకపోవచ్చు. వారు ఎవరంటే... నిర్దిష్టంగా ఏ కారణం వల్ల చనిపోయారో చెప్పలేని వారు రేబిస్, సిఫిలిస్, హెపటైటిస్, సెప్టిసీమియా, ఎయిడ్స్ వంటి జబ్బులతో చనిపోయిన వారి నుంచి కంటికి వచ్చే ఆక్యులార్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు... ఈ అందరి నుంచి కార్నియా స్వీకరించడం కుదరదు. అంటే వీళ్లు నేత్రదానానికి అర్హులు కాదు. డాక్టర్ కె. రవికుమార్ రెడ్డిసీనియర్ కంటి వైద్య నిపుణులు నిర్వహణ: యాసీన్ (చదవండి: -
మందిరా బేడి ఫిట్నెస్ మంత్ర..! 30 ఏళ్ల వయసులో కంటే ఇప్పుడే..
ఫ్యాషన్ డిజైనర్, నటి, టీవీ వ్యాఖ్యాత మందిర బేడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఆమె హవా మాములుగా లేదు. ఆమె స్వరం, నటనతో వేలాది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ మందిరా బేడి. ఐదు పదుల వయసులోనూ యువ హీరోయిన్ మాదిరి ఆహార్యంతో..ఆకర్షణీయమైన లుక్తో అలరిస్తుంటుందామె. ఇంతలా హెల్దీగా, యంగ్గా ఉండటానికి గల రీజన్ గురించి హెర్బాలైఫ్ పాడ్కాస్ట్ వెల్లడిస్తూ..తన బ్యూటీసీక్రెట్ని షేర్ చేసుకున్నారామె.మరి అవేంటో తెలుసుకుందామా..!.మందిరా తన వయసు గురించి చెప్పడానికి అస్సలు భయపడనని, కానీ ఆహార్యం పరంగా యంగ్గానే కనిపిస్తానని అన్నారామె. అందరు కదలిక ఓ మెడిసిన్, వ్యాయామం ఓ ఔషధ అని అంటుండటం వినేదాన్ని. కానీ అది తన విషయంలో నిజమైందని అంటోందామె. వ్యాయామం ఒక్కటే ప్రజలను అనారోగ్యం బారినపడకుండా చేస్తుందని, అదొక సప్లిమెంట్గా అభివర్ణించింది. అన్ని సమస్యలకు వ్యాయామం అద్భుతమైన నివారిని అని నమ్మకంగా చెబుతోందామె. అంతేగాదు 50లలో అధిక బరువు శిక్షణ తప్పనిసరి అని అంటోందామె. ఎందుకంటే..ఆ సమయంలో వృద్ధాప్యం మనలోకి ఎంటర్ అవుతుంటుంది. కాబట్టి ఆ టైంలో ఫిట్నెస్ చాలా ముఖ్యం, అదీగాక శారీరక క్షీణతకు దారితీసే సమయం కూడా అదే. అందువల్ల బలశిక్షణ శరీరానికి ఎంతో అవసరమని అన్నారు. ఇది మనకు శక్తిమంతమైన మార్పుతో పాటు, మన కండరాలను బలోపేతం చేస్తాయని చెబుతోంది. అంతేగాదు వర్కౌట్లు శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యద్భుతమైనవని అన్నారు. దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అవుతాయని అన్నారు. అయితే దీన్ని తీవ్రంగా భయపెట్టేలా చెయ్యొద్దని చెప్పారామె. ఇష్టంతో..స్వాంతన చేకూరేలే చేయాలి. అప్పుడే వృద్ధాప్యాన్ని ధీమాగా తిప్పికొట్టగలమని అన్నారామె. అంతేగాదు ఈ ఏజ్లో నిరంతర సంరక్షణ, నిబద్దతతో చేసే రోజువారీ వ్యాయామాలు మన ఆయుష్షుకి శ్రీరామరక్ష అని చెబుతున్నారు మందిరా బేడి. View this post on Instagram A post shared by Herbalife India Official (@herbalifeindiaofficial)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్
పిల్లలను పెంచడం అనేది ఓ కళ, అది అతిపెద్ద బాధ్యత కూడా. అదొక్కటి కరెక్ట్గా ఉంటే..వాళ్ల భవిష్యత్తు కోసం బెంగ పడాల్సిన పని ఉండదు. కానీ ఇక్కడే ప్రతి పేరెంట్ తప్పటడుగులు వేస్తుంటారు. తమ పిల్లలనే అతిప్రేమ వల్లనో..అతిగారభం వల్లనో కొన్ని బాధ్యతలను నేర్పించడంలో విఫలమవుతుంటాం. తర్వాత బాధపడేది కూడా మనమే. కానీ ఇక్కడో తండ్రి..కోపం, మందలింపు చర్యలతో పనిలేకుండా చాలా సున్నితంగా..వ్యర్థాలను పడేయకూడదని చెప్పిన తీరు అందరీ మనసులను దోచుకుంది. ఇలా కదా పిల్లల్ని పెంచాలి అని అంతా మెచ్చుకునేలా ఉంది అతడి పేరెంటింగ్ స్టైల్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ట్రావెల్ వ్లాగర్ దీపక్ సమల్ తన కొడుకుతో కలిసి రైలులో ప్రయాణిస్తున్న వీడియోని షేర్చేశాడు. తన కొడుకు రైలులో చిప్ప్ తింటూ కింద చెల్లాచెదురుగా పడేస్తాడు. ఆ తర్వాత నాన్న వాటిని ఎవరు తీస్తారు అని అమాకంగా అడుగుతాడు కొడుకు. దాంతో ఇదేమి మన ఇల్లు కాదు. ఈ క్షణం మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి అది మనది. ఆ తర్వాత మరొకరిది. మనం పాడు చేస్తే..మనమే క్లీన్ చేయాలి. ఈ రైలు అందరిది. అని చెబుతాడు. వెంటనే ఆ చిన్నారి కాసేపు నిస్సహాయంగా ఉండిపోతాడు. ఆ తర్వాత నెమ్మదిగా వంగి ఒక్కో చిప్ని తీస్తూ శుభ్రం చేస్తాడు. అక్కడ ఆ తండ్రి ఓరేయ్ మొత్తం చెత్త వేశావ్, పాడు చేశావ్..అని అరవడం గానీ, తిట్టడం గానీ చేయలేదు. జస్ట్ తను చేసిన తప్పుని వివరించాడు. అది ఇతరులకు ఎలా ఇబ్బందిగా మారతుంది..మన బాధ్యత ఏంటో ఆ చిన్ని మనసుకి అద్దమయ్యేలా చెప్పిన తీరు చాలా బాగా ఆకట్టుకుంటుంది. పైగా మన చెత్త మన బాధ్యత అని తన కొడుకుకి సివిక్ సెన్స్ని చాలా సున్నితంగా నేర్పించాడు ఆ తండ్రి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం గుడ్ పేరెంటింగ్ స్టైల్ అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అయినా రైళ్లను శుభ్రంగా ఉంచడం అనేది కేవలం సిబ్బంది బాధ్యత మాత్రమే కాదు మనందరి ఉమ్మడి బాధ్యత. అందురూ తప్పక తెలుసుకోవాల్సింది , నేర్చుకోవాల్సింది కూడా అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Deepak Samal (@travelwithsamalvlogs) (చదవండి: కుక్క మొరగడంతోనే.. పెళ్లి ఆగిపోయింది..! ట్విస్ట్ ఏంటంటే..) -
ఒక్క చిట్కాతో సిజేరియన్ తరువాత 15 కిలోలు తగ్గిన డాక్టర్
పెళ్లి అయ్యేంతవరకు సన్నగా సన్నజాజితీగల్లా ఉన్న మహిళళు ప్రసవం తర్వాత బాగా బరువు పెరుగుతారు. ఇలా పెరిగిన బరువు తగ్గడం అంటే అదో పెద్ద సవాల్. ఈ విషయంలో అందరి అనుభవాలు ఒకలాగా ఉండకపోవచ్చు. కానీ బిడ్డను సంరక్షించుకునే సమయంలో కొంత అశ్రద్ధ. నిజం చెప్పాలంటే మన గురించి మనం సమయాన్ని కేటాయించుకోవడం అసాధ్యం. దీనికి తోడు హార్మోన్ల మార్పులు, నిద్ర లేమి బరువు పెరగడానికి మరింత ఆజ్యం పోస్తుంది. కానీ సరైన ప్రణాళిక , కృషి ఉంటే, మద్దతు ఉంటే, తిరిగి పాత రూపానికి రావచ్చు అంటున్నారు డాక్టర్ అపరాజిత లంబా. తాను C-సెక్షన్ (సిజేరియన్) తర్వాత 15 కిలోల బరువు తగ్గడానికి సహాయపడిన ఒక చిన్న మార్పు గురించి స్వయంగా ఆమె ఫ్యాన్స్తో పంచుకున్నారు.ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పిన దాని ప్రకారం టీకి బదులుగా బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోవడం వల్ల , సిజేరియన్ తరువాత పెరిగిన బరువును బాగా తగ్గించుకున్నారు. దాదాపు 15 కిలోల బరువు తగ్గించుకున్నారు. పైగా బ్లాక్ కాఫీ చర్మానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘాయువును ప్రోత్సహిస్తుందని తెలిపారు. బ్లాక్ కాఫీ మెటబాలిజం (Metabolism)ని మెరుగుపరుస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ (Caffeine) అనే పదార్థం శరీరంలోని కొవ్వును తగ్గించి, శరీరానికి శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కెఫిన్ శరీరంలో సెన్సిటివ్ లిపోలిసిస్ బరువు తగ్గడంలో ఒక ముఖ్యమైన కారణం.బ్లాక్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు:చర్మ ఆరోగ్యం: బ్లాక్ కాఫీలో ఉండే పాలిఫెనాల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని (oxidative stress) తగ్గించి, కొల్లాజెన్ విచ్ఛిన్నం కాకుండా కాపాడతాయి. దీనివల్ల ముడతలు తగ్గుతాయి. పరిమితంగా తీసుకుంటే మొటిమలు తగ్గడానికి, కళ్ల కింద నల్లటి వలయాలు, వాపును తగ్గిస్తుంది. అలాగే UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సహాయ పడుతుంది.గుండె ఆరోగ్యం: మితంగా కాఫీ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది గుండె కణజాలాన్ని రక్షించడమే కాకుండా, శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.దీర్ఘాయువు : కాఫీ మెటబాలిక్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ తాగేవారిలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.శారీరక పనితీరు: వర్కౌట్ చేయడానికి 30-60 నిమిషాల ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల రక్తంలో అడ్రినాలిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరాన్ని తీవ్రమైన వ్యాయామం చేయడానికి సిద్ధం చేస్తుంది.బరువు నిర్వహణ: బ్లాక్ కాఫీలో కేలరీలు దాదాపు సున్నా. ఇది మీ జీవక్రియ రేటును (metabolic rate) 3-11శాతం పెంచుతుంది. శరీరంలో కొవ్వును సమర్థవంతంగా కరిగించడానికి సహాయ పడుతుంది. అలాగే, ఇది ఆకలిని నియంత్రించి అనవసరమైన కోరికలను (cravings) తగ్గిస్తుంది.నోట్: ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే అని గ్రహించగలరు. బరువు తగ్గడం, పెరగడం అనేది వారి వారి శరీర తత్వం, జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. పౌష్టికాహారం, చిన్న పాటి వ్యాయామాలు, చక్కటినిద్ర మనసుకు, శరీరానికి ప్రశాంతతనిస్తాయి. ఇవి ప్రాథమికంగా బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. View this post on Instagram A post shared by Dr. Aparajita Lamba MBBS MD 🥇 (@doctor_a_says) -
మీరు నిజంగా సిగ్గరులా లేక భయస్తులా?
మనలో చాలామంది నలుగురిలోకి వెళ్ళడానికి ఇష్టపడరు. కొత్త వారితో మాట్లాడాలంటే తడబడతారు. అప్పుడు వెంటనే ఒక ముద్ర వేసేసుకుంటారు: "నేను ఇంట్రోవర్ట్ని బ్రో, అందుకే ఎవరితోనూ కలవలేను." కానీ, ఇక్కడ ఒక పెద్ద సైకలాజికల్ మిస్టేక్ ఉంది. ఇంట్రోవర్షన్ (Introversion) అనేది ఒక వ్యక్తిత్వ రకం (Personality Type), కానీ సిగ్గు (Shyness) లేదా సామాజిక భయం (Social Anxiety) అనేది ఒక భావోద్వేగ సమస్య.మీరు నిజంగా ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? లేక నలుగురిలోకి వెళ్తే ఎక్కడ అవమానం జరుగుతుందో అని భయపడుతున్నారా? ఈ రెండింటి మధ్య తేడా తెలియకపోతే మీరు మీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ డెవలప్ చేసుకోలేరు.1. Introversion vs. Shynessఈ కాన్సెప్ట్ను ప్రపంచానికి పరిచయం చేసిన Carl Jung దృష్టిలో...Introversion (అంతర్ముఖత్వం): ఇది మీ శక్తి (Energy) ఎక్కడి నుండి వస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఒక ఇంట్రోవర్ట్ ఒంటరిగా ఉన్నప్పుడు రీఛార్జ్ అవుతాడు. వారికి మనుషులంటే భయం ఉండదు, కానీ ఎక్కువ మంది మధ్య ఉంటే శక్తి హరించుకుపోతుంది. వారు క్వాలిటీ టైమ్ని కోరుకుంటారు.Shyness/Social Anxiety: ఇది 'జడ్జ్మెంట్' (Judgment) పట్ల ఉన్న భయం. "నేను మాట్లాడితే ఎవరైనా నవ్వుతారా?", "నేను సరిగ్గా కనిపిస్తున్నానా?" అనే ఆందోళన వల్ల మనుషులకు దూరంగా ఉండటం.తేడా గమనించండి: ఒక ఇంట్రోవర్ట్ పార్టీకి వెళ్లకూడదని నిర్ణయించుకుంటాడు (Choice). కానీ భయం ఉన్న వ్యక్తి పార్టీకి వెళ్లాలని ఉన్నా, అక్కడ అందరూ తననే చూస్తారేమో అన్న ఆందోళనతో 'ఆగిపోతాడు' (Fear).2. మోటివేషనల్ పొరపాటు: "Be an Extrovert"సో-కాల్డ్ ట్రైనర్లు చేసే అతిపెద్ద డ్యామేజ్ ఏంటంటే.. అందరూ ఎక్స్ట్రోవర్ట్లుగా మారిపోవాలని చెప్పడం."స్టేజ్ ఎక్కు, గట్టిగా అరువు, అందరితో కలిసిపో.. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు" అని చెప్తారు. ఇది మీ సహజ సిద్ధమైన వ్యక్తిత్వాన్ని చంపేయడమే.ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్తలు, రచయితలు, ఆలోచనాపరులు చాలామంది ఇంట్రోవర్ట్లే. మీరు ఎక్స్ట్రోవర్ట్గా మారాల్సిన అవసరం లేదు, మీలో ఉన్న 'భయాన్ని' పోగొట్టుకుంటే చాలు.నిజమైన వికాసం అంటే మీ స్వభావాన్ని మార్చుకోవడం కాదు, మీ స్వభావంలో ఉన్న అడ్డంకులను (భయాన్ని) తొలగించుకోవడం.3. Real Personality Development: బ్రేకింగ్ ది మిత్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ కన్ఫ్యూజన్ నుండి బయటపడటం ఎలా?Step 1: నిజాయితీగా ఒప్పుకోవడంమిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి: "నన్ను ఒక గదిలో ఉంచి, బయట జనం నన్ను అస్సలు జడ్జ్ చేయరు, అందరూ నన్ను పొగుడుతారు అని గ్యారెంటీ ఇస్తే.. అప్పుడు నేను బయటకు వెళ్తానా?"మీ సమాధానం 'అవును' అయితే.. మీరు ఇంట్రోవర్ట్ కాదు, మీరు భయపడుతున్నారు (Social Anxiety).మీ సమాధానం 'కాదు, అయినా నేను ఒంటరిగానే ఉంటాను' అయితే.. మీరు పక్కా ఇంట్రోవర్ట్.ఈ క్లారిటీ రావడమే పాత ముసుగుని 'Break' చేయడం.Step 2: సామర్థ్యాన్ని పెంచుకోవడంమీరు ఇంట్రోవర్ట్ అయినా సరే, సమాజంలో బ్రతకడానికి కమ్యూనికేషన్ అవసరం.కార్ల్ రోజర్స్ చెప్పినట్లు, 'Self-Acceptance' పెంచుకోండి. "నేను తక్కువ మాట్లాడతాను, అది నా బలం" అని నమ్మండి.భయం ఉంటే, చిన్న చిన్న సామాజిక పరిస్థితులను ఎదుర్కోవడం (Gradual Exposure) ప్రాక్టీస్ చేయండి. ఇది మీ లోపల కొత్త న్యూరల్ పాత్వేస్ని బిల్డ్ చేస్తుంది.Step 3: Introvert Powerఒక ఇంట్రోవర్ట్ తన ఏకాగ్రతను, లోతైన ఆలోచనా శక్తిని ఆయుధంగా మార్చుకున్నప్పుడు అతను అజేయుడు అవుతాడు. ఐన్ స్టీన్, బిల్ గేట్స్ వంటి వారు తమ ఇంట్రోవర్షన్ ని బలహీనతగా చూడలేదు, దాన్ని ఒక సూపర్పవర్గా మార్చుకున్నారు. అదే 'Beyond' స్టేజ్.4. మీ అసలు రంగు ఏంటి?ఈ రోజు ఒక పేపర్ మీద ఈ రెండు కాలమ్స్ రాయండి.నేను ఇష్టపూర్వకంగా ఒంటరిగా ఉన్న సందర్భాలు ఏవి? (ఉదా: బుక్ చదువుకోవడం, ఆలోచించుకోవడం)నేను భయం వల్ల వెనక్కి తగ్గిన సందర్భాలు ఏవి? (ఉదా: ఆఫీసు మీటింగ్లో పాయింట్ చెప్పకపోవడం, నచ్చిన అమ్మాయితో/అబ్బాయితో మాట్లాడలేకపోవడం)ఈ రెండో కాలమ్కి ఎక్కువ పాయింట్లు ఉంటే, మీరు ఇంట్రోవర్షన్ వెనుక మీ భయాన్ని దాచుకుంటున్నారు అని అర్థం.ముసుగు వెనుక దాక్కోకండి!బ్రో, ఇంట్రోవర్ట్ గా ఉండటం ఒక గొప్ప వరం. అది లోతైన వ్యక్తిత్వానికి నిదర్శనం. కానీ ఆ పదాన్ని ఒక సాకుగా వాడుకుని మీ ఎదుగుదలని ఆపుకోవద్దు. మీరు సిగ్గరి కాదు, మీరు భయస్తుడు కాదు.. మీరు కేవలం మీ శక్తిని లోపలికి మళ్లించుకునే వ్యక్తి మాత్రమే అని ప్రపంచానికి నిరూపించండి.ముసుగు తీసేయండి.. మీ మౌనంలో ఉన్న శక్తిని (Power of Silence) గుర్తించండి. అదే Real Personality Development.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066(చదవండి: The 'Ideal Self' Trap: ఎదుటివారిలా ఉండాలనుకోవడమే సమస్య!) -
ఆటో డ్రైవర్ బామ్మ @ 65
‘నువ్వు నాకు ఆటోడ్రైవింగ్ నేర్పించాలిరా కన్నా’ అని కుమారుడిని అడిగింది మంగళ. ‘ఈ సరదా ఏమిటి!’ ఆశ్చర్యంగా అడిగాడు కుమారుడు. ‘సరదా కోసం కాదు, ఆటో నడిపి నాలుగు డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను’ అని చెప్పింది తల్లి. మనసులో ఏమనుకున్నాడో తెలియదుగానీ, తల్లి కోరినట్లే ఆటో నడపడం నేర్పించాడు కుమారుడు. పదిహేను రోజుల్లో పర్ఫెక్ట్గా ఆటోనడపడం నేర్చుకుంది మంగళ. ఆ తరువాత ఆటోరిక్షా డ్రైవర్గా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. మహారాష్ట్ర సతార జిల్లాలో కరాడ్–ఉండాలే రోడ్డులో రోజూ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆటో నడుపుతుంది. నెలకు అయిదు నుంచి ఏడు వేల వరకు సంపాదిస్తుంది. ఇది తక్కువ మొత్తమే కావచ్చు. ఆమెకు మాత్రం కోట్లతో సమానం! ఎందుకంటే ఆ డబ్బులో శ్రమ ఫలం ఉంది. ఆత్మగౌరవం ఉంది. ‘నేను చాలారోజులు ఇంట్లోనే ఉన్నాను. దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అనిపించింది. ఏదో ఒక పని చేయాలనుకున్నాను. నా కొడుకు ్రపోత్సాహంతో ఆటో నడపడం నేర్చుకున్నాను. ఇంటి ఖర్చులకు, నా వైద్య అవసరాలకు నేను సంపాదించిన డబ్బు ఉపయోగపడుతుంది. డ్రైవింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి, ఎలాంటి భయం ఉండదు. ఇతర డ్రైవర్లు నన్ను గౌరవంగా చూస్తారు. ముందు అమ్మను వెళ్లన్విండి అంటారు’ అని ఆసందంగా చెబుతోంది 65 సంవత్సరాల మంగళ. -
మజిల్ మమ్మీ
మహిళలకు సంబంధించి సోషల్ మీడియాలో తాజా ట్రెండ్.. మజిల్ మమ్మీ. ‘బాగా సన్నబడాలి... మెరుపు తీగలా కనిపించాలి’ అనుకునే ట్రెండ్లు ఎన్నో వచ్చాయి. వాటికి భిన్నమైన ట్రెండ్ ఇది. వెల్నెస్ సంస్కృతికి సంబంధించిన పాత స్టీరియోటైప్లను తోసిరాజని మహిళల శక్తి, ఫిట్నెస్ను పునర్నిర్వచిస్తున్న ట్రెండ్ ఇది. గత ఫిట్నెస్ ట్రెండ్ల మాదిరిగా కాకుండా ‘మజిల్ మమ్మీ’ కండరాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఈ ట్రెండ్ ప్రధాన సందేశం...బలం బలంలాగే కనిపించాలి. బరువు తగ్గడం మాత్రమే ఫిట్నెస్ కాదు. స్త్రీలు సన్నగా కనిపించాలి, బరువులు ఎత్తవద్దు, స్ట్రెంత్ ట్రైనింగ్ మనకు సంబంధించింది కాదు, నాజూకుగా కనిపించాలంటే మజిల్ అక్కర్లేదు...ఇలాంటి సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను నేటి తరం మహిళలలో చాలామంది తిరస్కరిస్తున్నారు. కండరాలపై దృష్టి సారించే ఈ ఫిట్నెస్ ట్రెండ్ ఊపందుకోవడానికి మరో ప్రధాన కారణం...దీర్ఘకాలిక ఆరోగ్యం గురించి అవగాహన పెరగడం. మెరుగైన ఎముక సాంద్రత(బోన్ డెన్సిటీ), హార్మోన్ల సమతుల్యత...మొదలైవాటికి ప్రాధాన్యతన పెరిగింది. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లాంటి ΄్లాట్ఫామ్లలో ‘మజిల్ మమ్మీ’ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ‘అసలు సిసలు ఫిట్నెస్ అంటే ఏమిటి?’ అనే కాప్షన్తో జనాదరణ పొందిన డెడ్లిఫ్ట్లు, స్క్వాట్లు, రెసిస్టెంట్స్ వర్క్కు సంబధించిన వీడియో క్లిప్లకు, ఆఫ్బీట్ మ్యూజిక్, జోక్స్ జోడించి పోస్ట్ చేస్తున్నారు. -
‘స్విస్ ఆల్ఫ్స్’ : వేసవిలో మంచు పరిమళం
సూర్య కిరణాలు పర్వతాల మీదుగా పయనిస్తుండగా మంచు కాంతిమంతంగా కనువిందు చేసే చోటు ఏది అని అడిగితేవెంటనే ‘స్విస్ ఆల్ఫ్స్’ అని చేప్పేయవచ్చు.సమ్మర్లో కూడా యూరప్ అందాలను వీక్షించాలి అనుకునే వారికి ఈ జర్నీ ఒక బ్యూటిఫుల్ ఛాయిస్..స్విట్జర్లాండ్లో ఎండాకాలం కూడా మంచు ఆకర్షణ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆకాశం నీలంగా, గడ్డి పర్వతాల మీద పచ్చగా, దూరంగా మంచుపై వెలిగే చంద్రప్రభలా కనిపిస్తుంది. ఎండలో కూడా చల్లని గాలి మనసును మేల్కొలుపుతుంది..సరోవరాల సౌందర్యంస్విస్లో సరస్సులు ఎండాకాలంలో ప్రత్యేక అందాన్ని సంతరించుకుంటాయి. లేక్ జెనీవా తీరం దగ్గర మధ్యాహ్నం నిశ్శబ్దంగా ఉంటుంది. నీళ్లు నీలం రంగులో మెరుస్తూ, పర్వతాల ప్రతిబింబాలను తమలో కలిపేసుకుంటాయి. ఇంటర్లేకన్ అనే ప్రదేశంలో రెండు సరోవరాల మధ్య నిలిచిన ఊరిలో నడవడంతో పాటు, స్థానికంగా ఉన్న గడ్డి మీద కూర్చొని ఆకాశాన్ని చూస్తూ సమయాన్ని గడపాలని అనిపిస్తుంది.పర్వతాల మధ్య సూర్యోదయంస్విస్ ఆల్ఫ్స్లో ప్రతీ సూర్యోదయం ఒక గీతంలా మొదలవుతుంది. చర్చి గంటలు దూరంగా వినిపిస్తాయి. పర్వతాల నుంచి దిగే సూర్యోదయం నీలి ఆకాశాన్ని మెల్లిగా బంగారు రంగులో మెరిపిస్తుంది. జెర్మాట్ లాంటి అందమైన గ్రామ వీధుల్లో నడుస్తుంటే, చుట్టూ వుడెన్ హౌసెస్, వరండాల్లో సందడి చేసే పువ్వులు, వెనకాలే మ్యాటర్ హోర్న్ లాంటి శిఖరం చూస్తుంటే జీవితం ఎంత అందమైనదో అనిపిస్తుంది.సందర్శనీయ స్థలాలుఈప్రాంతంలో జెర్మాట్ నుంచి మేటర్హార్న్పపర్వత దర్శనం అనేది ఒక నిశ్చలమైన క్షణంలా అనిపిస్తుంది. ఇంటర్లేకన్లో సరోవరాల మధ్య సాయంత్రం గడపడం ఒక అందమైన పెయింటింగ్లో మనం భాగమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే జుంగ్ఫ్రౌ ఉండే ప్రదేశంలో మంచు రేఖలు ఎండాకాలంలో కూడా తెలుపు వర్ణంతో జిగేలుమనిపిస్తాయి.లూసెర్న్ వీధిలో కెపెల్బ్రూక్ బ్రిడ్జిపై నడిచే సమయంలో ప్రాచీన కథల్లో కథానాయకులమయ్యాం అనిపిస్తుంది. లేక్ జెనీవా తీరంలో సాయంత్రం ఆకాశం నీలం నుంచి గులాబీ రంగులోకి మారడం ఒక లైఫ్టైమ్ మెమరీగా నిలుస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి జూరిచ్ వరకు విమాన ప్రయాణం చేసి యూరోప్ హదయం లాంటి స్విట్జర్లాండ్లోని ఈ అందమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. జూరిచ్ నుంచి రైలులో ప్రయాణిస్తూ పర్వతాల అందాలను వీక్షించవచ్చు. ఈ యాత్రలో కనిపించే సీనరీలు యూరోప్ అంటే ఏంటో చూపిస్తాయి.ఎక్కడ ఉండాలి? స్విస్ గ్రామాల్లో వుడెన్ చాలెట్స్లో బస చేయడం ఒక ప్రత్యేక అనుభవం. బాల్కనీ నుంచి కనిపించే పర్వత శ్రేణులను చూస్తూ ప్రతీ ఉదయాన్ని ఆస్వాదించవచ్చు. చిన్న గెస్ట్ హౌజుల్లో కూడా ఆత్మీయ అనుభవాన్ని పొందవచ్చు.ఏం చూడాలి?పర్వతాల వద్ద వాక్ చేయడం, సరస్సుల తీరంలో నిశ్శబ్దంగా కూర్చొని పుస్తకాలు చదవడం, కేబుల్ కార్లలో శిఖరాగ్రానికి చేరడంం ఇలా అనేక మరుపురాని ప్రదేశాలను చూస్తూ జీవితాంతం గుర్తుండే మెమోరీస్ సష్టించుకోవచ్చు.ఏం తినాలి?స్విస్లో బ్రెడ్, చీజ్ పరిమళం, చాక్లెట్ మధురిమలు చల్లని గాలిలో మరింత రుచిగా అనిపించేలా చేస్తాయి. చిన్న కేఫేలో కాఫీ సిప్ చేస్తూ బయట మంచు శిఖరాలను చూడడం ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి ఫుడ్ లవర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నేచర్ను ఆస్వాదించే మనసు ఉంటే చాలు.చేయాల్సిన పనులుసూర్యోదయం సమయంలో మార్నింగ్ వాక్ చేయడం, సరస్సుల తీరంలో నడుస్తూ సాయంత్రాన్ని ఎంజాయ్ చేయడం, కేబుల్ కార్లో ప్రయాణించడం, స్థానిక గ్రామాల్లో నిశ్శబ్దంగా సంచరించడం, అక్కడి వెరైటీ ఫుడ్ను ఆస్వాదించడం ఇలా మీరు ఎన్నో యాక్టివిటీస్ ΄్లాన్ చేసుకోవచ్చు.మంచును ఇష్టపడే మనసుకు.. ప్రశాంతతనిచ్చే మంచి ప్రదేశం. ఎండాకాలం అంటే వేడి అని మాత్రమే అనుకుంటాం. కానీ స్విస్ ఆల్ఫ్స్లో సమ్మర్ అంటే ఒక ఎవర్గ్రీన్ కూల్ మెమోరీని సొంతం చేసుకునే సమయం. ఇక్కడ సూర్యుడూ నేచర్ను ఎంజాయ్ చేస్తూ కూల్గా కనిపిస్తాడు. అందుకే యూరోప్ ఒక ఎవర్గ్రీన్ ట్రావెల్ డెస్టినేషన్గా నిలిచింది.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
రష్మిక, విజయ్ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్..! ప్రత్యేకతలు ఇవే..
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ నెల ఫిబ్రవరి 26, 2026న వివాహ చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదిక కానుంది రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఐటీసీ మెమెంటోస్ హోటల్. సన్నిహిత వర్గాల ప్రకారం..ఒక వారం ముందుగానే బుక్ చేసినట్లు తెలుస్తోంది. పచ్చటి ఆరావళి కొండలు, నీలి ఆకాశానికి నిలయమైన ఈ వాతావరణంలో గడపాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..!.రష్మిక-విజయ్లు వివాహం చేసుకుంటున్న ITC మెమెంటోస్ లోపల 117 విల్లాలతో, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, విశాలమైన పచ్చని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వెల్నెస్ సెంటర్, అందంగా రూపొందించిన లాంజ్లు ఉన్నాయి. ఇక్కడ అతిథులు చేతితో తయారు చేసిన కాక్టెయిల్స్, వెచ్చని పానీయాలు, ప్రశాంతమైన దృశ్యాలను హాయిగా ఆస్వాదించవచ్చు.ఈ హోటల్లో ఉదయ్ పెవిలియన్, కబాబ్స్ అండ్ కుర్రీస్, రాయల్ వేగా, ది రాక్ బార్ వంటి చక్కటి భోజనాలను ఆస్వాదించొచ్చు. శాఖాహారం నుంచి వివిధ ప్రపంచ రుచుల తోపాటు రిఫ్రెష్ కాక్టెయిల్ వరకు అన్నిరకాల టేస్ట్లను ఆస్వాదించొచ్చు. పలనా రెసిపీ లోటు అనేదానికి అవకాశం లేకుండా ప్రతి వంటకం అందుబాటులో ఉంటుందట. ఆరోగ్యం పరంగా ఫిట్నెస్ సెంటర్ని అధునాతన యంత్రాలతో సెట్ చేశారు. ఇక్కడ ఉన్న విశాలమైన ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ హాయిగా వర్కౌట్లు చేసుకోవచ్చు. ఇదేగాక మరో గొప్ప అనుభూతి ఏంటంటే..ఇక్కడ రాయల్ స్పాలో, వేడుకకు విచ్చేసిన అతిథులు పురాతన భారతీయ చికిత్సలు, ఉత్తేజకరమైన వెల్నెస్ చికిత్సలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ తప్పనిసరిగా ఇన్ఫినిటీ పూల్ లేదా లాంజ్ పూల్ను మిస్ అవ్వకండి. చక్కటి విశ్రాంతికి నిలయం. ఈ పెళ్లికి విచ్చేస్తున్న అతిథులంతా ఇక్కడ జరిగే అన్ని రకాల వినోద కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు, ఉదయ్పూర్ను సందర్శించొచ్చు. ఈ ప్రాంతం ప్రకృతి సహజ సౌందర్యానికి, సాహస అనుభవాలను గమ్యస్థానం. ఈ మెమెంటోస్ సూట్లో బసకి- అక్షరాల రూ. 73,199 - 91,499/-లు ఖర్చు అవుతుందట. View this post on Instagram A post shared by Mementos By ITC Hotels- Ekaaya Udaipur (@mementosbyitchotels_udaipur) (చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..! ఆయిల్ మసాజ్లు, ఇంట్లో తయారు చేసే..) -
ఆరు నెలల్లో 12 కిలోలు బరువు తగ్గిన మహిళ..!
బరువు తగ్గడం అంత ఈజీ కాకపోయినా..అసాధ్యం మాత్రం కాదు. అదనపు బరువుని తగ్గించుకోవడానికి ఇక్కడొక మహిళ అనుసరించిన విధానం..అందర్నీ కదిలిస్తోంది, ప్రేరేపిస్తోంది కూడా. కేవలం ఆరు నెలల్లోనే మంచి ఫలితాన్ని అందుకుంది. పైగా అందుకోసం ఆమె ఎంతలా కష్టపడిందో తెలిస్తే..విస్తుపోతారు. మంచి శీరారకృతి, ఆరోగ్యకరమైన బరువు కోసం ఆ మాత్రం డెడికేషన్ ఉండాల్సిందే మరి. ఇక్కడ ఈ మహిళ బరువు తగ్గడం కోసం ఏం అనుసరించిందంటే..దుబాయ్కి చెందిన షెర్రీ పీటర్ అనే మహిళ తాను ఆరు నెలల్లో 12 కిలోలుకు పైగా బరువు తగ్గానని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొంది. అంతేగాదు ఆగస్టు 2025 vs ఫిబ్రవరి 2026 కల్లా 12 కిలోలు తగ్గి..స్లిమ్గా మారాను అని పోస్ట్లో తెలిపింది. మంచి శరీరాకృతి కోసం అనుసరించిన వెయిట్లాస్ వ్యూహం గురించి పేర్కొన్నారామె.ప్రతిరోజూ పదివేల అడుగులురోజువారీగా పదివేల అడుగుల వాకింగ్. ఇది బరువు తగ్గడానికి ఒక ప్రభావవంతమైన వ్యూహం. దీనివల్ల రోజుకు దాదాపు 300–500 అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. తాను దీన్ని ఒక ఏడాది నుంచి పాటిస్తున్నానని చెప్పారు. జిమ్కి వెళ్లడానికంటే మందు నుంచి ప్రారంభించానని చెప్పారు. వారంలో నాలుగు రోజులు..బరువులు ఎత్తడం, పైలేట్స్ వెయిట్ లిఫ్టింగ్, పైలేట్స్ను వారానికి నాలుగు నుంచి ఐదు రోజులు కేటాయించానని తెలిపింది. వాటిలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జీవక్రియను పెంచగా, పైలేట్స్ కోర్ బలాన్ని పెంపొందిస్తాయి. ఎమ్స్కల్ప్ట్ నియో వారానికి రెండుసార్లుఎమ్స్కల్ప్ట్ నియో అనే మిషన్ సాయంంతో శరీర ఆకృతి చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఏకకాలంలో కొవ్వును కరిగింఇచ 30 నిమిషాల సెషన్లలో కండరాలను నిర్మిస్తుంది. ఇది ఉదరం, పిరుదులు, చేతులు, తొడలపై ప్రభావవంతంగా ఉంటుంది.ఆహారంసమర్థవంతమైన బరువు తగ్గడంలో అధిక ఫైబర్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి సారించడం అత్యంత కీలకం. అలాగే హైడ్రేటెడ్గా ఉంటూనే చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ వినియోగాన్ని కూడా పరిమితం చేయాలి. అదనంగా తినాలనిపించినప్పుడల్లా.. తీసుకున్న గ్రీన్ టీ కాస్త భావోద్వేగ మద్దతుగా మారిందని షెర్రీ చెప్పింది.మద్యం మానేయడంక్యాలరీ తీసుకోవడం తగ్గించడానికి ఆల్కహాల్ తగ్గించడం అనేది చాలా ప్రభావవంతమైన మార్గం. సాధారణంగా ప్రతి పెగ్ ఆల్కహాల్ వంద కేలరీనలు పెంచుతుంది. అందుకే పూర్తిగా మానేసి పైలేట్స్, జిమ్, వాకింగ్లపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారామె.సింపుల్గా చెప్పాలంటే..ఎక్కువ నడవడం, తక్కువ తినడం బరువు తగ్గడానికి సరళమైన మార్గం అని అందరికీ తెలుసు. కానీ ఇలా షెర్రీ లాంటి మహిళల అనుభవపూర్వకమైన వెయిట్లస్ స్టోరీలు..ఇలాంటి వాటిని అనుసరించేలా చేయడంలో ప్రేరణటీ ఉంటాయి కదూ..!. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.august 2025 vs february 202612kgs down and in the best shape of my life pic.twitter.com/ZLMHIIr4H3— deSherry (@Sherrypeter) February 20, 2026 (చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..! ఆయిల్ మసాజ్లు, ఇంట్లో తయారు చేసే..) -
నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..!
భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి సుధాచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగానూ, నృత్యకారిణిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని, గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బుల్లితెరపై విలక్షణమైన నటతో అశేష ప్రేక్షక ఆదరాభిమానాలు పొందారామె. అలాంటి సుధాచంద్రన్ ఆరు పదుల వయసులో కూడా అంతే అందం, ఫిట్నెస్తో యాక్టివ్గా ఉండే ఆమె..అందం, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారామె. ప్రస్తుతం ఉన్న హెల్త్ అండ్ బ్యూటీ ట్రెండ్లకు విరుద్ధంగా పూర్వకాల నాటి ఆయుర్వేద ఆచారాలే తన అందం, ఆరోగ్యం వెనుక సీక్రెట్ అంటోందామె. వాటి గొప్పతనం గురించి సుధా మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!. View this post on Instagram A post shared by Sudhaa Chandran (@sudhaachandran) ప్రస్తుతం బ్యూటీ అనగానే సీరమ్లు, షీట్ మాస్క్లు ట్రెండ్ల హవా ఎక్కువగా ఉంది. పైగా చాలామంది సీనియర్ సెలబ్రిటీలు ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా ఉన్న ట్రెండ్లే అనుసరిస్తే..ఆమె పాతకాలం నాటి ఆయుర్వేదం, నాటి ఆచార సంప్రదాయలకే జై కొడుతోంది సుధాచంద్రన్. అంతేగాదు ఆరోగ్యం, చర్మ సంరక్షణ అనేవి దినచర్యలు కావని, అవి మన అమ్మమ్మల నాటి జ్ఞాపకాతో ముడిపడి ఉన్నావి, తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినవిగా పేర్కొన్నారామె. తాను దక్షిణి భారత్లోని కేరళ నుంచి వచ్చానని, అందువల్ల దేశీ ఆచారాలకే ప్రాముఖ్యత ఇస్తానని అన్నారామె. తనకు ఆయుర్వేదం ఒక ట్రెండ్ కాదని, అదొక జీవన విధానమని అన్నారు. చిన్ననాటి నుంచి చూసినవే ఈనాటికి తూ.చా తప్పకుండా ఆచరిస్తున్నానని అన్నారామె. దక్షిణ భారత దేశం నుంచి రావడంతో మంగళ, శుఖ్రవారాల్లో తలస్నానం తప్పనిసరి అని చెప్పారు. కొబ్బరి నూనె రాసుకుని మరి స్నానం చేయడం అలవాటని కూడా చెప్పారామె. తన అమ్మమ్మ జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలంటే కొబ్బరినూనె తప్పనిసరి అని చెబుతూ తాను పాఠశాలకి వెళ్తున్నప్పుడూ అమ్మమ్మ ఎంతలా తన జుట్టుకి శ్రద్ధగా నూనె రాసేవారో గుర్తు తెచ్చుకున్నారామె. అలాగే 15 రోజులకొకసారి కడుపుని శుభ్రపరుచుకోవడం అంటే..సాఫీగా విరేచనాలు అయ్యేలా కేటాయించడం. మన పురాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదన్నే గట్టిగా విశ్వసిస్తానని చెప్పారామె. కనీసం జలుబు చేసినప్పుడు కూడా దశములారాష్టాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తానని చెప్పారామె. దశములారాష్టం అనేది సాంప్రదాయ ఆయుర్వేద టానిక్. ఇది పది వేర్లు, ఇతర మూలిక మిశ్రమాలతో తయారు చేస్తారని తెలిపారు. శ్వాసకోశ ఆరోగ్యానికి చాలామంచిదని చెప్పారు. అలాగే కళ్లకు పెట్టుకునే కాజల్ కూడా ఇంట్లో తయారుచేసినదే వాడతానని, ఇది తన అమ్మమ్మ నుంచి అమ్మకు..అలా తనకు సంక్రమించిన ఆచారమని. అదే తాను ఇప్పటికీ ఫాలో అవుతానని అన్నారామె. అలాగే జుట్టు ఆరోగ్యానికి ఆముదం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారామె. అలాగే మాయిశ్చరైజింగ్ కొబ్బరి నూనెని ఉపయోగిస్తానని, ఆఖరికి మేకప్ని తొలగించేందుకు కూడా వెట్ వైప్స్ వాడనని, కొబ్బరినూనెతోనే తొలగిస్తానని అన్నారామె. తాను కేరళ నుంచి వచ్చి ముంబైలో స్థిరపడ్డా తన మూలాలను, ఇంటి ఆచారాలనే అనుసరిస్తానని చెప్పారామె. అంతేగాదు కేరళ మసాజ్లు తీసుకుంటానని కూడా అన్నారు. శరీరంలోని అదనపు నీటి నిలుపుదలను తొలగించేందు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. తాను కొత్తగా ఎలాంటి ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడనని, తరతరాల సంప్రదాయాలు, ఆచారాలనే పాటిస్తానని చెప్పారామె. అప్పుడే జీవితం చాలా సులభంగా తేలికగా ఉంటుందన్నారామె. కానీ నేటితరం మార్కెట్లో వచ్చేప్రతి ట్రెండ్ ఫాలో అయ్యి జీవితాన్ని క్లిష్టతరంగా మార్చుకుని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారంటూ..తన పోస్ట్ని ముగించారు సుధాచంద్రన్. View this post on Instagram A post shared by Sudhaa Chandran (@sudhaachandran) (చదవండి: The 'Ideal Self' Trap: ఎదుటివారిలా ఉండాలనుకోవడమే సమస్య!) -
ఫేక్ పర్సనాలిటీ వద్దు..మీరు మీలా ఉండండి..!
మనం రోజూ ఉదయం లేవగానే ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. అక్కడ ఒకరు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తారు, ఇంకొకరు ఖరీదైన కారులో తిరుగుతూ కనిపిస్తారు, మరొకరు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. వారిని చూడగానే "నేను కూడా వాళ్ళలాగే ఉండాలి" అనే ఆలోచన మొదలవుతుంది.మెల్లమెల్లగా మనం 'మనం'లా ఉండటం మానేసి, ఎవరోలా మారడానికి ప్రయత్నిస్తాం. సైకాలజీలో దీన్నే 'Ideal Self Trap' అంటారు. ఇది ఒక మానసిక జబ్బు లాంటిది, ఇది మీ అసలైన వ్యక్తిత్వాన్ని (Real Personality) చంపేస్తుంది.1. Real Self vs. Ideal Self: అసలు గొడవ ఎక్కడ?కార్ల్ రోజర్స్ సిద్ధాంతం ప్రకారం, ప్రతి వ్యక్తిలో రెండు రూపాలు ఉంటాయి. ఒకటి మనం ప్రస్తుతం ఉన్న రూపం (Real Self), రెండోది మనం ఎలా ఉండాలని కోరుకుంటామో ఆ రూపం (Ideal Self).Real Self (నిజమైన నేను): ప్రస్తుతం మీరు ఎవరు? మీ బలాలు ఏంటి? మీ బలహీనతలు ఏంటి? మీ సహజమైన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది ఇది.Ideal Self (ఆదర్శవంతమైన నేను): మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సమాజం మిమ్మల్ని ఎలా చూడాలని మీరు ఆశపడుతున్నారు? అనేది ఇది.ఈ రెండింటి మధ్య దూరం పెరిగినప్పుడు మనిషిలో 'Anxiety' (ఆందోళన) మరియు 'Self-Hatred' (తన్ను తాను అసహ్యించుకోవడం) మొదలవుతాయి.ఉదాహరణకు, మీరు సహజంగా మితభాషి (Introvert) అనుకుందాం. కానీ మీరు ఒక పాపులర్ మోటివేషనల్ స్పీకర్ను చూసి, అతనిలాగా గలగలా మాట్లాడాలని (Extrovert) ప్రయత్నిస్తే.. మీరు మీ 'Real Self'ను మోసం చేస్తున్నట్లే. ఈ గ్యాప్ పెరిగే కొద్దీ మీ పర్సనాలిటీ విచ్ఛిన్నమవుతుంది.2. మార్కెట్ మోటివేషన్ ఎలా ట్రాప్ చేస్తుంది?పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు, motivation స్పీకర్లు ఈ 'Ideal Self' ట్రాప్ను క్యాష్ చేసుకుంటారు. "నువ్వు వారిలా తయారవ్వచ్చు, వీరిలా గెలవొచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే నువ్వు ఒక సూపర్ హ్యూమన్ అవుతావు" అని చెప్తారు. అంటే వారు మీకు ఒక 'అద్దె వ్యక్తిత్వాన్ని' (Borrowed Personality) అమ్ముతున్నారు.సైకాలజీ ఏం చెప్తుందంటే.. "నువ్వు ఎవరిలాగో అవ్వాల్సిన అవసరం లేదు. నీలోని ఉత్తమ వెర్షన్గా మారితే చాలు."వేరొకరిని కాపీ కొట్టడం అంటే మీ ఒరిజినాలిటీని ఖననం చేయడమే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా, మార్కెట్ ఇచ్చే 'సక్సెస్ టిప్స్' మిమ్మల్ని ఒక ఫేక్ పర్సనాలిటీగా మారుస్తాయి.3. ఎదుటివారిలా ఉండాలనుకోవడం 'జబ్బు' ఎందుకు?ఇది జబ్బు అని ఎందుకు అంటున్నానంటే, దీనివల్ల మూడు ప్రమాదాలు ఉన్నాయి:Constant Comparison (నిరంతర పోలిక): మీరు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. దీనివల్ల మీ దగ్గర ఉన్నవి మీకు తక్కువగా అనిపిస్తాయి.Loss of Identity (గుర్తింపు కోల్పోవడం): మీకంటూ సొంత ఆలోచనలు ఉండవు. ఎదుటివారు దేన్ని సక్సెస్ అంటే దాన్నే మీరు కూడా సక్సెస్ అనుకుంటారు.Low Self-Esteem: మీరు 'Ideal Self'ను అందుకోలేనప్పుడు.. "నేను దేనికీ పనికిరాను" అనే భావన బలపడుతుంది.4. Real Personality Development: ట్రాప్ నుండి బయటపడటం ఎలా?Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, ఈ ట్రాప్ నుండి బయటపడి మీ లెగసీని ఎలా నిర్మించుకోవాలి?STEP 1: BREAK (ముసుగును తొలగించండి)ముందుగా మీరు ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో గుర్తించండి."నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నది నా అవసరం కోసమా? లేక పక్కింటి వ్యక్తిని చూసి గొప్పలు పోవడానికా?""నేను ఈ బట్టలు వేసుకుంటున్నది నాకు నచ్చిందా? లేక సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడానికా?"ఈ విశ్లేషణ మీలోని 'ఫేక్ ఐడియల్ సెల్ఫ్'ని బ్రేక్ చేస్తుంది.STEP 2: BUILD (కంగ్రూయెన్స్ - ఏకీకరణ)మీ 'Real Self'కు మరియు 'Ideal Self'కు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి. అంటే, అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకోకుండా.. మీ సహజ సిద్ధమైన నైపుణ్యాలను (Natural Talents) పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.* మీరు మంచి రచయిత అయితే, బలవంతంగా స్పీకర్ అవ్వాలని ట్రై చేయకండి. మీ రైటింగ్లోనే మీ పర్సనాలిటీని బిల్డ్ చేయండి.* Self-Acceptance (నిన్ను నీవు అంగీకరించడం) లేనిదే వికాసం మొదలవ్వదు.STEP 3: BEYOND (అథెంటిసిటీ)ఒక్కసారి మీరు ఎదుటివారిలా ఉండాలనే తాపత్రయం వదిలేస్తే, మీలో ఒక వింతైన ధైర్యం వస్తుంది. అదే అథెంటిసిటీ (Authenticity). ప్రపంచం ఎప్పుడూ 'ఒరిజినల్'కే విలువ ఇస్తుంది, 'కాపీ'కి కాదు. మీరు మీలా ఉంటూనే ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే 'Beyond' స్టేజ్.5. మీ కోసం చిన్న పరీక్షఈ రోజు మీరు ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి:నేను ఏ విషయంలో ఇతరులను చూసి అసూయ పడుతున్నాను? ఆ లక్షణం నిజంగా నా వ్యక్తిత్వానికి అవసరమా?నేను ఎవరి ముందైనా నటించకుండా ఉండగలుగుతున్నానా?నన్ను నేను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నది నా ఆనందం కోసమా? లేక లోకానికి నిరూపించుకోవడానికా?మీ సీటులో మీరు కూర్చోండి!బ్రో, ప్రపంచం ఒక పెద్ద నాటక రంగం అయితే, ఇక్కడ అందరూ హీరోలే అవ్వాలని చూస్తున్నారు. కానీ నిజమైన సక్సెస్ ఎక్కడ ఉందంటే.. మీకు కేటాయించిన పాత్రను (మీ రియల్ సెల్ఫ్) అద్భుతంగా పండించడంలోనే ఉంది.ఎదుటివారిలా ఉండాలనుకోవడం ఒక జబ్బు అయితే, దానికి మందు "మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం". మీలోని లోపాలను కూడా గౌరవించండి, అవే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి."Be a first-rate version of yourself, instead of a second-rate version of somebody else."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: Parenting or Programming: మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా?) -
వివేకం... మంచి చెడుల విచక్షణ
నేటి సమాచార యుగంలో మనకు జ్ఞానం లభిస్తోంది గానీ వివేకం కరువవుతోంది. ఏది మన అభ్యున్నతికి తోడ్పడుతుంది, ఏది మనల్ని పతనానికి నడిపిస్తుంది అని తర్కించగలిగే శక్తే వివేకం. క్షీర నీర న్యాయం ప్రకారం పాల నుండి నీటిని వేరు చేసే హంస వలె, మనిషి లోకంలోని అసత్యాల నుండి సత్యాన్ని గ్రహించగలగడమే వివేక జ్ఞానం.మనం ప్రతిరోజూ ఎన్నో బాహ్య ఆకర్షణలకు లోనవుతుంటాం. తాత్కాలిక సుఖాల కోసం శాశ్వతమైన విలువలను వదులుకోవడం అవివేకం. ఒక పనిని ప్రారంభించే ముందు ‘ఇది నా ఎదుగుదలకు తోడ్పడుతుందా? దీనివల్ల సమాజానికి మేలు జరుగుతుందా?‘ అని ప్రశ్నించుకోవడమే వివేకవంతమైన జీవనం. కోపం వచ్చినప్పుడు ఆవేశంతో నిర్ణయం తీసుకోకుండా, పరిణామాలను యోచించడం వివేక లక్షణం. వివేకం ఉన్న మనిషి ఇతరుల విమర్శలకు కృంగిపోడు, పొగడ్తలకు పొంగిపోడు. ఈ విచక్షణా జ్ఞానం మనిషిని స్థితప్రజ్ఞుడిగా మారుస్తుంది. అది మనలోని అంతర్వాణిని వినేలా చేస్తుంది. మాయా జగత్తులో సత్యం నిగూఢంగా ఉంటుంది; దానిని వెలికితీసే దీపమే మన వివేకం.వివేకం అంటే కేవలం లౌకిక విద్యల ద్వారా ప్రాప్తించే తెలివితేటలు కావు; అది నిత్యానిత్య వస్తు వివేకం. అనగా ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అన్న సత్యాన్ని వేరు చేసి చూడగలిగే దివ్య ప్రజ్ఞ.ఉపనిషత్తులు చెప్పినట్లు ‘శ్రేయస్సు‘, ‘ప్రేయస్సు‘ అనే రెండు మార్గాలు మనిషి ముందు ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండి తక్షణ తృప్తిని ఇచ్చేది ప్రేయస్సు; అంతిమంగా మేలు చేసేది శ్రేయస్సు. వివేకవంతుడు ఎప్పుడూ శ్రేయస్సునే ఎంచుకుంటాడు. వివేకం లేని జ్ఞానం భారమవుతుంది; వివేకం ఉన్న మౌనం కూడా శక్తివంతమవుతుంది. మన ఆలోచనల్లో స్పష్టత, నిర్ణయాల్లో ధైర్యం రావాలంటే వివేకం తోడవ్వాలి. ఇది మనల్ని అంధకారం నుండి జ్యోతి వైపు నడిపిస్తుంది. నిరంతర సాధన, సత్సంగం ద్వారా ఈ వివేకాన్ని పదును పెట్టుకోవచ్చు. వివేకమే మన ప్రయాణానికి దిక్సూచి, మన ఆత్మకు అసలైన వెలుగు.సార్వజనిక ధర్మం అందించిన ఈ వివేక మార్గం వ్యక్తిని పరిపూర్ణ మనీషిగా తీర్చిదిద్దుతుంది. మాయాప్రపంచంలో చిక్కుకోకుండా సత్యపథంలో సాగడమే మన లక్ష్యం కావాలి. మన బుద్ధి వివేకంతో ప్రకాశించినప్పుడు జీవితంలో సవాళ్లు మాయమై అవకాశాలు కనిపిస్తాయి. బాహ్య ప్రపంచం కన్నా మన అంతరంగంలో ఉన్న విచక్షణా శక్తిని నమ్ముకోవడం నేర్చుకోవాలి. వివేకమే ధర్మం, వివేకమే విజయం. సర్వం ప్రజ్ఞామయం!వైదిక ఇతిహాసాలలో వివేకానికి నిదర్శనంగా భగవద్గీతలోని అర్జునుడిని గమనించవచ్చు. యుద్ధరంగంలో విషాదానికి లోనైన పార్థుడికి కృష్ణ పరమాత్మ వివేకాన్ని ప్రసాదించారు. దేహం నశ్వరమని, ఆత్మ శాశ్వతమని బోధించడం ద్వారా ధర్మం పట్ల అతడికి ఉన్న సందిగ్ధతను తొలగించారు. వివేకం ఉన్న చోట భయం ఉండదు; ఎందుకంటే ఆ వ్యక్తికి ఫలితం కంటే కర్తవ్యం గొప్పదని తెలుస్తుంది. అలాగే రామాయణంలో విభీషణుడు రావణుడి వైభవాన్ని చూసి మోసపోకుండా, రాముడి వైపు ధర్మం ఉందని గుర్తించడం ఆయన వివేకానికి నిదర్శనం. అహంకారం మన కళ్లకు కమ్మే పొరలను తొలగించి, సత్యాన్ని దర్శింపజేసే దివ్య నేత్రం వివేకం. అశాశ్వతమైన భోగాల కంటే శాశ్వతమైన ధర్మమే మిన్న అని గ్రహించడమే మానవత్వపు అసలైన విజయం.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
తిండి గింజల దొంగలు
ఒక ఊర్లో ఓ జమీందారు ఉండేవాడు. పదిమందికీ సహాయం చేయాలనే తపన కలిగిన వాడు. తను సంపాదించిన దాంట్లో కొద్ది మొత్తం పక్కన పెట్టి పేదవారికి లేదనకుండా ఆదుకునేవాడు. దాంతో అతడికి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంచివాడనే పేరు వచ్చింది.కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి కొండ వెనుక ఉన్న గ్రామంలో ఒక రైతు ఉన్నాడని, అతడు చాలా మంచివాడని తెలుసుకున్నాడు. ఆ రైతు గురించి ఎంతో గొప్పగా ప్రచారం జరుగుతుండటంతో ఆ రైతును చూడాలన్న కుతూహలం జమీందారుకు కల్గింది.తమ తోటలోని తియ్యటి మామిడి పండ్లను సంచిలో పెట్టుకుని సేవకుడిని తోడు చేసుకుని బయలుదేరాడు. రైతుకు అంత మంచి పేరు రావడానికి కారణం ఏమై ఉంటుందోనని ఆలోచన చేస్తూ నడవసాగాడు. చిన్నగా కొండ దాటి రైతు ఉన్న గ్రామం చేరాడు. అప్పటికే రాత్రి ఒంటిగంట అయ్యింది.అది వరి నూర్పిడికి సిద్ధంగా ఉన్న కాలం. రైతు తన పొలం వద్ద నార మంచం మీద పడుకుని ఉన్నాడు. రైతు పొలంలోకి నలుగురు దొంగలు దూరి ఉన్నారు. వారు వడ్లను మూటల్లోకి నింపుకుంటున్నారు. దొంగల అలికిడికి రైతు లేచి కూర్చున్నాడు. అప్పటికే దొంగలు వడ్లతో నింపిన రెండు మూటలను కట్టి పక్కన పెట్టి ఉన్నారు.రైతు లేచింది చూసి దొంగలు పరిగెత్తబోయారు. వెంటనే రైతు ‘‘ఎందుకు పరిగెత్తుతున్నారు, పరిగెత్తకండి. నేను మీ దగ్గరకు రాను. ఉన్నచోటు నుంచి అంగుళం కూడా కదలను. ఇక్కడే మంచం దగ్గరే ఉంటాను. కడుపుకు లేకనే కదా మీరు దొంగతనం చేస్తున్నారు. ఎన్ని మూటల వడ్లు కావాలో తీసుకెళ్ళండి. నేను మీ జోలికి రాను, ఎవ్వరికీ ఫిర్యాదు చేయను’ అని గట్టిగా అరిచి చెబుతున్నాడు. అయినా దొంగలు వినలేదు. ఎక్కడివక్కడ పారేసి పరుగులు తీస్తూ పారిపోయారు.‘అయ్యో... ఎంత పాపం చేశాను. నేను నిద్ర లేచిన దానివల్ల కదా వాళ్ళు వడ్లు ఎత్తుకుని వెళ్లలేకపోయారు. ఎంతో ఆకలైతే కానీ తిండిగింజల దొంగతనానికి రారు. వారి నోటికాడ కూడు తీసినాను కదా’ అని ఏడుస్తూ కూర్చున్నాడు. అదంతా కళ్ళారా చూసిన జమీందారు చలించిపోయాడు.‘నేను సంపాదించిన దాంట్లో కొంత మాత్రమే పేదలకు పెడుతున్నాను. ఈ రైతు చూడు, తనకి చెడ్డ చేసే వాళ్ళ మంచి కూడా కోరుతున్నాడు. వారి ఆకలికేకల గురించి ఆలోచిస్తున్నాడు. ఇది కదా మానవత్వమంటే. ఇది కదా మంచితనమంటే’ అనుకుంటూ ఆ రైతుకు నమస్కరించి తను తెచ్చిన పండ్లు అతడి చేతికిచ్చి వెనుదిరిగాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
సహజయోగం బ్రహ్మచైతన్యమైన వేళ...
భారతదేశం పుణ్యభూమి, ధర్మభూమి, యోగభూమి. ఈ గడ్డపైన ఎందరో ఋషులు, మహా ఋషులు, అవతార మూర్తులు, ఆధ్యాత్మిక గురువులు జన్మించారు. అలాంటి ఆధ్యాత్మిక గురువులలో అంతర్జాతీయంగా గుర్తింపు, మన్ననలను పొందిన పరమపూజ్య శ్రీ మాతాజీగా పిలువబడే శ్రీమతి నిర్మలా దేవి శ్రీ వాత్సవ ఒకరు. ఆమె కారణ జన్మురాలని ఆమెను గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు.పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు. సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత, సర్వధర్మ సంస్థాపనకోసం ఊరూరా తిరిగి, విదేశాలలో పర్యటించి తాను నమ్మిన సత్యాన్ని, ధర్మాన్ని స్వయంగా ఆచరించి చూపించిన ఆత్మసాక్షాత్కార గురువు. ప్రవక్తలందరూ చెప్పిన ధర్మాలన్నీ ఒకేచెట్టుకు పూసిన పువ్వులే అయినప్పటికీ, ఎవరికి తోచిన పువ్వును వారు కోసుకుని వివిధ మతాలను స్థాపించుకుని, వాటి ప్రవక్తలు ప్రవచించిన మూల సూత్రాలను పక్కదారి పట్టిస్తున్న సమయంలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి అటువంటి వాటినుండి వాస్తవాన్ని, అసలు సత్యాన్ని సహజయోగం ద్వారా బహిర్గత పరచారు. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి 1970 మే 5 వ తేదీన తన స్వీయ తపోశక్తి ద్వారా ‘సహజయోగ’ ని ఆవిష్కరించారు. తనలో నిద్రాణ స్థితిలో వున్న కుండలినీ శక్తిని జాగృతి చేసి సహస్రార చక్రం తెరిచి తద్వారా తన లోని ఆ భగవత్ శక్తి అయిన కుండలినీ శక్తిని బాహ్యపరంగా వున్న పరమాత్మ ప్రేమైక శక్తి అయిన పరమ చైతన్యంతో అనుసంధానం చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కార స్వీయ అనుభూతిని సాధించారు. ‘సహ’ అంటే మనతో ‘జ’ అంటే జన్మించిన శక్తి, యోగ అంటే బాహ్య పరంగా వున్న శక్తితో కలయిక అని అర్థం. ఆ విధంగా మనలోని కుండలినీ శక్తి బాహ్యపరంగా విశ్వవ్యాపిత భగవత్ శక్తితో ఏకీకరణ పొందినప్పుడు మనం కూడా ఆ పరమాత్మ దివ్య శక్తిలో ఓ భాగమైపోతాము.పరమచైతన్యం లేక బ్రహ్మ చైతన్యం అంటే విశ్వవ్యాపితమైన పరమాత్మ ప్రేమ శక్తి మాత్రమే. విశ్వాన్నంతటిని, సకల చరాచర జీవులను, నడిపించే భగవత్ శక్తి. మానవ మేధస్సుకు అతీతమైనది. ఆత్మ సాక్షాత్కారం పొంది ప్రతినిత్యం సహజయోగ సాధన చేస్తున్నవారి సహస్రార చక్రం పూర్తిగా వికసించి, మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో ఉన్న 7 చక్రాలు తెరుచుకుని బ్రహ్మ చైతన్యంలో అంతర్భాగాలైన అధిష్టాన దేవతలు మేల్కొనబడి మనకు తమ ఆశీర్వచనాలు అందచేస్తారు. సదాశివుని అర్ధాంగి అయిన ఆదిశక్తి ఆయన చుట్టూ పరివేష్టించి ఓ చల్లటి మేఘం లాగా ఆవృతమై వుంటుంది. అదే బ్రహ్మ చైతన్యం. పరమచైతన్య శక్తిగా పిలువబడుతున్న ఆ శక్తియే పరమాత్మ అయిన సదాశివుని ఇచ్చాశక్తి. ఆ శక్తియే విశ్వాన్ని సృష్టించింది. భూమి మీద వున్న జీవజాలం మీద,మానవుల మీద తన పరమ చైతన్య శక్తిని వెదజల్లుతుంది. మనల్ని అంతర్గతంగా బలోపేతం చేస్తుంది, పోషిస్తుంది. మనలో ప్రేమ శక్తిగా అంకురిస్తుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం పొంది సహజయోగ సాధన చేస్తున్న వారందరూ ఈ భగవంతుని ప్రేమ శక్తిని తన చుట్టూ ఉన్న పదిమందికీ పంచడానికి కృషి చేస్తారు. కుల, మత, జాతి, ప్రాంత, వయసు, లింగ భేదాలు లేకుండా ఎవరైనా, ఎప్పుడైనా అతి సునాయాసంగా ఆచరించగలిగే ఈ సహజయోగం దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే శారీరిక, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం. మనిషి ఎన్నో ఏళ్లనుండి, ఎన్నో జన్మలనుండి అన్వేషిస్తున్న ‘సత్యాన్ని’ సహజయోగ ధ్యానం ద్వారా ఆవిష్కరించి ఎటువంటి స్వార్థచింతన లేకుండా మానవాళికి శ్రీ మాతాజీ నిర్మలా దేవి అందించారు. సహజయోగం ద్వారా వారిని భగవంతుని శక్తితో అనుసంధానపరచి తమ కష్టాలను, సమస్యలను ధ్యానం ద్వారా తమను తాము ఎలా సమతుల్యంలో ఉంచుకోవాలో, ఎలా తమ సమస్యలను తమంతట తాము పరిష్కరించుకోవాలో తెలుసుకుని ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇలా కోరుకున్న ప్రతి ఒక్కరిలో సరైన పరివర్తన తీసుకురాగలిగే ‘నవ సమాజ నిర్మాణం’, ‘వసుధైక కుటుంబం’, ‘సర్వమానవ సౌభాతృత్వం’ ‘ద్వేష రహిత, ప్రేమ పూరిత సమాజం’ ఏర్పడటం సుసాధ్యమే అని తాను స్థాపించిన సహజయోగం ద్వారా శ్రీ మాతాజీ నిర్మలా దేవి ఆచరించి నిరూపించారు. శ్రీమతి నిర్మలాదేవి తన జన్మ సార్ధకం చేసుకుని 2011 వ సంవత్సరం, ఫిబ్రవరి 23వ తేదీన తన సాకార రూపాన్ని చాలించుకుని నిరాకారం లోనికి వెళ్ళిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా సహజయోగ ధ్యానకేంద్రాలలో ప్రతిఏటా ఫిబ్రవరి 23వ తేదీన ‘బ్రహ్మ చైతన్య దినోత్సవం’ గా జరుపుకుంటున్నారు.– డా. పి. రాకేష్, సహజ యోగ సాధకులు(నేడు అంతర్జాతీయ బ్రహ్మచైతన్య దినోత్సవం) -
జిరాక్స్ షాప్ నుంచి ఏకంగా రూ.6 వేల కోట్ల బ్రాండ్..!
మనతోపాటు సామాన్యులుగా వచ్చి.. చూస్తుండగానే కోట్లకు పడగలెత్తి ఆదర్శంగా నిలుస్తారు కొందరు. వాళ్లు కూడా మనలానే పైకి ఎదిగే క్రమంలో పలు సవాళ్లు ఎదుర్కొంటారు కూడా. కానీ ఆ సమయంలో కూడా ఎలాంటి తడబాటుకి లోనవ్వకుండా సరైన నిర్ణయాలతో.. ఉన్నతస్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వాడే రామచంద్ర అగర్వాల్. వైకల్యం శరీరానికే గానీ..మనసుకు కాదంటూ..అచంచలమైన కృషితో వస్త్రపరిశ్రమలో గొప్ప సక్సెస్ని అందుకుని అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు. అయనే కొల్కతాకు చెందిన రామ్ చంద్ర అగర్వాల్. 1965లో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారినపడి కింద శరీరం అంత చచ్చుబడిపోయింది. అయినా..అతడిలో కష్టపడేతత్వం..అత్యున్నత స్థాయికి ఎదగాలన్న ఆకాంక్ష ప్రగాఢంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అధికారిక విద్యను పూర్తిచేసిన వెంటనే చిన్న జిరాక్స్ షాప్ పెట్టుకున్నాడు. దీంతో త్వరితగతిన ఉన్నతస్థాయికి చేరుకోలేమని గ్రహించి..వస్త్రపరిశ్రమ వైపుకి అడుగులు వేశాడు. అలా కోల్కతాలో చిన్న బట్టల దుకాణం ప్రారంభించాడు. భారతీయ ఫ్యాషన్ వినియోగదారుల ట్రెండ్ని అర్థం చేసుకుంటూ..ఈ పరిశ్రమలో విజయం సాధించడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంబించాడు. అలా 2000 ప్రారంభంలో ఢిల్లీకి మకాం మార్చి..2001లో తన మొదటి విశాల్ మెగా మార్ట్ స్టోర్ని ప్రారంభించాడు. ఇది మధ్యతరగతి వ్యక్తులను ఎక్కువగా ఆకర్షించింది, చేరువైంది కూడా. దాంతో ఈ మార్ట్ కిరాణా సామాగ్రి, దుస్తులు..అనుకూలమైన ధరలకే కొనుగోలు చేసే హాట్స్పాట్గా మారింది. అలా చుట్టపక్కాల మహా నగరాల వరకు ఈ మార్ట్ బ్రాంచ్లు విస్తరించాయి. అలా తన దుకాణాన్ని విస్తరించే క్రమంలో దాదాపు భారీగా అప్పులు చేశాడు. సరిగ్గా ఆ టైంలో 2008-09లో ప్రపపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాంతో అప్పు పెరిగిపోయింది, మరోవైపు కస్టమర్లు తగ్గిపోతున్నారు. చెప్పాలంటే రామ్చంద్రకు కఠినమైన సమయం ఇది. దాంతో 2011లో రూ. 2 వేల కోట్ల విలువైన వ్యాపారాన్ని శ్రీరామ్ గ్రూప్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీకి దాదాపు రూ. 70 కోట్లకు అమ్మేశారు. కొత్త యజమాన్యంలోకి ఉన్నప్పటికీ విశాల్ బ్రాండ్ కొనసాగడం విశేషం. ఆ తర్వాత అగర్వాల్ వీ2 రిటైల్ లిమిటెడ్ రూపంలో కొత్త వెంచర్ ప్రారంభించాడు. మొదటి స్టోర్ జంషెడ్పూర్లో ప్రారంభించారు. అనతి కాలంలో వేగంగా పుంజుకుని లాభాల బాటలు పట్టింది. కొన్నేళ్లకు ఏకంగా వంద కోట్ల టర్నోవర్ని అందుకుంది. పైగా అనేక భారతీయ నగరాల్లో 150కి పైగా ఎక్కువ దుకాణాలను కలిగి ఉంది. అలా 2025 కల్లా వీ2 రిటైల్ భారతదేంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ బ్రాండ్లో ఒకటిగా ఉద్భవించింది. పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6వేల కోట్ల టర్నోవర్కు మించిపోయింది. ఇంతటి బిజీ పరిస్థితుల్లోనూ ఆనందానికి, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోడాయన. ఆయనకు అందమై భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్ల సహాయ సహకారాలతోనే ఇంత పెద్దసక్సెస్ అందుకున్నానని చెబుతుంటాడు రామ్చంద్ర అగర్వాల్. View this post on Instagram A post shared by Startup | Marketing (@marketing.growmatics) (చదవండి: Parenting or Programming: మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా?) -
మీ మైండ్ రిమోట్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది..!
మనం ఒక కొత్త స్మార్ట్ఫోన్ కొన్నప్పుడు అందులో కొన్ని సాఫ్ట్వేర్లు ముందే ఇన్స్టాల్ అయి ఉంటాయి (Pre-installed apps). మనం వాటిని వాడకపోయినా అవి మెమరీని ఆక్యుపై చేస్తూనే ఉంటాయి. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. మన తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్న సమాజం మన చిన్నతనంలో మన మనసులో కొన్ని 'ప్రోగ్రామ్స్' ఇన్స్టాల్ చేస్తారు.మనకు తెలియకుండానే మనం ఆ ప్రోగ్రామ్స్ ప్రకారమే ఆలోచిస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. దీనినే సైకాలజీలో 'Social & Parental Conditioning' అంటారు. మరి ఈ ప్రోగ్రామింగ్ను మార్చడం సాధ్యమేనా?1. పేరెంటింగ్ ఎలా ప్రోగ్రామింగ్గా మారుతుంది?సైకాలజీ ప్రకారం, తల్లిదండ్రుల ప్రవర్తన బిడ్డ మనసులో 'బిలీఫ్ సిస్టమ్' (Belief System) గా మారుతుంది. ఇది మూడు రకాలుగా జరుగుతుంది.Direct Commands: "నువ్వు ఎందుకూ పనికిరావు", "అమ్మాయిలు ఇలాగే ఉండాలి", "డబ్బు సంపాదించడం చాలా కష్టం". ఇలాంటి మాటలు పదే పదే విన్నప్పుడు అవి మెదడులో నిజాలుగా రికార్డ్ అయిపోతాయి.Observation: మీ నాన్న కోపం వచ్చినప్పుడు వస్తువులు విసిరేస్తే.. మీరు పెద్దయ్యాక మీకు తెలియకుండానే అదే చేస్తారు. ఎందుకంటే మీ మైండ్ "కోపాన్ని ఇలాగే వ్యక్తపరచాలి" అని ప్రోగ్రామ్ అయ్యింది.Emotional Anchoring: మీరు ఏదైనా సాధించినప్పుడు మాత్రమే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మెచ్చుకుంటే.. "నేను ఏదైనా సక్సెస్ సాధిస్తేనే నాకు విలువ ఉంటుంది" అనే ప్రోగ్రామ్ మీలో రన్ అవుతుంది. దీన్నే 'Conditional Love' అంటారు.2. మార్కెట్ మోటివేటర్ల పొరపాటు: "Update" vs "Format"సో-కాల్డ్ మోటివేషనల్ స్పీకర్లు "ఈ రోజు నుంచి కొత్తగా ఆలోచించు, సక్సెస్ అవుతావు" అని చెప్తారు. ఇది పాత సాఫ్ట్వేర్ మీద కొత్త స్టిక్కర్ వేసినట్లు ఉంటుంది.ట్రైనర్స్ బాహ్య ప్రవర్తనను మార్చమంటారు. సైకాలజీ అసలు ఆ సాఫ్ట్వేర్ కోడింగ్ను మార్చమంటుంది (Rewiring).మీరు లోపల "నేను దేనికీ పనికిరాను" అనే ప్రోగ్రామ్ను రన్ చేస్తూ, పైన "నేను గొప్పవాడిని" అని అరిస్తే.. ఆ రెండింటి మధ్య ఘర్షణ మొదలై మీలో ఒత్తిడి (Stress) పెరుగుతుంది తప్ప వ్యక్తిత్వం మారదు.3. మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా? (The Science of Change)దీనికి సైన్స్ ఇచ్చే సమాధానం.. ఎస్!ఖచ్చితంగా మార్చుకోవచ్చు! మన మెదడు ఒక రాయిలాంటిది కాదు, అది ఒక ప్లాస్టిక్ లాంటిది. మనం అనుకుంటే కొత్త న్యూరల్ పాత్వేస్ను క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పాత ప్రోగ్రామింగ్ను డిలీట్ చేసి కొత్త కోడింగ్ రాసుకోవచ్చు. దీన్నే Neuroplasticity అంటారు.4. Real Personality Development: రీ-ప్రోగ్రామింగ్ ప్రాసెస్Genius Matrix Model ఉపయోగించి మిమ్మల్ని మీరు ఎలా రీ-డిజైన్ చేసుకోవాలో చూద్దాం.STEP 1: BREAK (డీ-కోడింగ్)ముందుగా మీలో ఉన్న బగ్స్ (Bugs) ఏంటో గుర్తించాలి.* "నేను ఎందుకు భయపడుతున్నాను? ఇది నా భయమా లేక మా అమ్మ భయమా?"* "ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నానా లేక నా ప్రోగ్రామింగ్ తీసుకుంటోందా?"మీరు ఆలోచించే ప్రతి నెగటివ్ ఆలోచన వెనుక ఉన్న 'మూలాన్ని' వెతకండి. ఆ మూలాన్ని గుర్తించడమే పాత ప్రోగ్రామ్ను 'బ్రేక్' చేయడం.STEP 2: BUILD (రీ-కోడింగ్)ఇక్కడ మీరు కొత్త అలవాట్లను, కొత్త ఆలోచనా విధానాలను ఇన్స్టాల్ చేయాలి.* Cognitive Re-structuring: "నేను ఓడిపోతాను" అనే ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు, వెంటనే దాన్ని మ్యాన్యువల్ గా ఆపి.. "నేను నేర్చుకుంటున్నాను" అనే కొత్త లైన్ యాడ్ చేయాలి.* ఇది ఒక్క రోజులో జరగదు. పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల పాత ప్రోగ్రామ్ వీక్ అయి, కొత్త ప్రోగ్రామ్ స్ట్రాంగ్ అవుతుంది.STEP 3: BEYOND (మాస్టరీ)ఒక్కసారి మీరు మీ మైండ్ సాఫ్ట్వేర్ను కంట్రోల్ చేయడం నేర్చుకుంటే, మీరు కేవలం ఒక 'వ్యక్తి'గా మిగిలిపోరు. మీరు ఒక 'Creator' గా మారుతారు. మీ గతం మీ భవిష్యత్తును శాసించదు. మీరు మీ సొంత లెగసీని క్రియేట్ చేస్తారు.5. Self-Reflection: మీ కోడింగ్ని చెక్ చేసుకోండి. అందుకోసం ఈ రోజు ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయండి.* మీరు తరచుగా వాడే ఒక నెగటివ్ వాక్యాన్ని రాసుకోండి (ఉదా: "నాకు అదృష్టం లేదు").* ఈ మాట మీ మనసులోకి ఎప్పుడు వచ్చింది? మీ ఇంట్లో ఎవరైనా ఇలా అనేవారా?* ఈ మాట నిజమేనా? దీనికి వ్యతిరేకంగా జరిగిన మూడు సందర్భాలను గుర్తు తెచ్చుకోండి.* ఇప్పుడు ఆ పాత వాక్యాన్ని కొట్టేసి.. ఒక కొత్త పవర్ఫుల్ వాక్యాన్ని రాయండి.రిమోట్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది!బ్రో, మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ప్రోగ్రామ్ చేసి ఉండొచ్చు. అది వారి తప్పు కాదు, వారికి తెలిసింది వారు చేశారు. కానీ ఇప్పుడు మీరు పెద్దయ్యారు. మీ మైండ్ రిమోట్ కంట్రోల్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. పాత ప్రోగ్రామింగ్ ని సాకుగా చూపిస్తూ అలాగే ఉండిపోతారా? లేక దాన్ని రీ-రైట్ చేసి ఒక Real Personality గా ఎదుగుతారా? ఛాయిస్ మీదే!సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub www.psyvisesh.com8019 000066 -
డెంటల్ యాబ్సెస్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
ఎప్పుడైనా మీ పంటిచిగురు దగ్గర తెల్లగా... చిన్న ఉండలాంటి సంచిలో కాస్త చీము నిండినట్టుగా చిన్న తిత్తి మాదిరిగా కనిపించిందా? కొద్దిగా వాచినట్టుగా, నొప్పిగా, బాధగా ఏదో చిగుర్లకు వచ్చిన సమస్యగా అనిపించిందా? దాన్ని ‘డెంటల్ యాబ్సెస్’ అంటారు. అంటే నోటి పుండు. ఒక్కసారి అది బాగా పొడుస్తున్నట్టుగా తీవ్రమైన నొప్పి రావచ్చు. జ్వరం కూడా కనిపించవచ్చు. కారణం అదో బ్యాక్టీరియల్ సమస్య. ఈ డెంటల్ యాబ్సెస్ అంటే ఏమిటీ, అదెందుకు వస్తుంది, చికిత్స ఏమిటన్న అనేక విషయాలను తెలుసుకుందాం...పంటి చిగురుకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాన్నిండా చీము చేరడం వల్ల వచ్చే సమస్యే ‘పంటి యాబ్సెస్’. నిజానికి పంటిచిగురు దగ్గర చీము చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి తెల్లరక్తకణాలు రంగంలోకి దిగడం తెలిసిందే. ఇలా యుద్ధానికి సన్నద్ధమైన ఈ తెల్లరక్తకణాలు... బ్యాక్టీరియాతో జరిగిన పోరాటంలో నశించాక... ఆ తెల్లరక్తకణాల తాలూకు మృతకణాలన్నీ చీము రూపంలో అక్కడ ఓ తిత్తి (పాకెట్)లాగా ఉండి΄ోతాయి. దాంతో నోరు తెరచి చూసుకున్నప్పుడు ఓ తెల్లటి చీము ఉండ కనిపిస్తుంది.తగ్గినట్టు ఉన్నా ఉపేక్షించడం సరికాదు... పంటి చిగురు దగ్గర కనిపించిన ఆ ఇన్ఫెక్షన్ చిగురుకు పాకే అవకాశముంది. అంతేకాదు... అది పంటిని వదులు చేసేందుకూ ఛాన్స్ ఉంది. ఒక్కోసారి ఆ గడ్డ చిదిమినట్లవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి కాస్తా అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. మొదట ఉన్న తీవ్రమైన నొప్పి అకస్మాత్తుగా లేకుండా పోయి, నొప్పి లేదంటే సమస్య తగ్గిపోయిందని కాదు. సాధారణంగా డెంటల్ యాబ్సెస్ అన్నది దానంతట తగ్గి΄ోవడం కాస్త అరుదే. అందుకే అలా పంటి చిరుగురు ప్రాంతంలో తెల్లటి చీము ఉండ కనిపించిందంటే తప్పక చికిత్స తీసుకోవడం అవసరం. ఇతర అవయవాలకూ పాకవచ్చుడెంటల్ యాబ్సెస్కు తగిన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఒక్కోసారి ఆ సూక్ష్మజీవులు రక్తప్రవాహంలో కలిసి ఇతరచోట్లకూ పాకే అవకాశముంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ దవడకూ, తలకూ, మెడకు కూడా పాకితే ఆ ప్రాంతాల్లోనూ తీవ్రమైన నొప్పి రావచ్చు. ఒక్కోసారి భరించలేనంత నొప్పిగా కూడా ఉండవచ్చు. లక్షణాలుసాధారణంగా నోట్లో పేరుకు΄ోయే బ్యాక్టీరియా సంఖ్య చాలా ఎక్కువ. దీన్నే ఓరల్ బ్యాక్టీరియా, ఓరో–ఫ్యారింజియల్ బ్యాక్టీరియా అంటారు. వీటిలో చాలావరకు నిరపాయకరమైనవే ఎక్కువ. అయితే హానికరమైన బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నోరు బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదంచేసే భాగం అయినందున అవి వేగంగా పెరుగుతాయి. పలువరసలో ఏదైనా భాగం దెబ్బతిని ఉంటే అక్కడ బ్యాక్టీరియా విస్తరించేందుకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దాంతో చీముగడ్డ (పస్ పాకెట్) ఏర్పడటంతో మరికొన్ని లక్షణాలూ కనిపిస్తుంటాయి. అవి... ∙ మాటిమాటికీ పొడిచినట్లుగా తీవ్రమైన నొప్పి ∙ చల్లటి లేదా వేడి ప్రదార్థాలు తీసుకున్నప్పుడు జిల్లుమనడం. ∙ఏదైనా వస్తువు నమలగానే పొడుచుకువచ్చినట్టుగా నొప్పి కలగడం. గొంతులోని గ్రంథులు వాచడం. నోటిలో దుర్వాసన వస్తున్న భావన లేదా దుర్వాసన రావడం. ఏదైనా తినేపదార్థం నోట్లోకి తీసుకుంటే దాని రుచి మారినట్లు అనిపించడం. (ఇలా అనిపిస్తుందంటే అది చీముగడ్డ పగిలినందుకు సూచన. అయితే అప్పటికీ ఇన్ఫెక్షన్ మాత్రం శరీరంలోనే ఉంటుంది. కాబట్టి అది శరీరంలోని ఇతర ప్రాంతాలకు పాకే అవకాశమున్నందున... అలా జరగడం మరింత ప్రమాదానికి దారితీసే ముప్పున్నందున... తప్పనిసరిగా డెంటల్ డాక్టర్ను కలిసి తగిన సూచనలూ, చికిత్స తీసుకోవాలి. నివారణప్రతిరోజూ క్రమంతప్పకుండా ఉదయం, రాత్రి బ్రషింగ్ చేసుకోవడం. ∙బ్రషింగ్ కోసం మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్నే వాడంటం. పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు గుండ్రంగా బ్రష్ చేసుకోవడం. పంటికి బయటివైపే కాకుండా లోపలి వైపునా బ్రష్ చేసుకోవడంతో పాటు నమిలే ప్రదేశాలల్లో... అంటే పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ చక్కగా బ్రష్ చేసుకోవడం. బ్రషింగ్ టైమ్ రెండు లేదా మూడు నిమిషాలకు మించకుండా చూసుకోవడం. నాలుకపైనున్న బక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేసుకోవడం. చిగుర్ల ఆరోగ్యం కోసం బ్రషింగ్ తర్వాత చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసుకోవడం. ప్రతి ఆర్నెల్లకోసారి క్రమంతప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం. చికిత్సపంటి యాబ్సెస్కు డాక్టర్లు సాధారణ యాంటీబయాటిక్స్తో చికిత్స అందిస్తారు. మరీఅవసరమైన వారికి ఆ చీముపాకెట్ను తొలగించడంతోటు రూట్కెనాల్ అవసరం పడవచ్చు. డాక్టర్ ప్రత్యూష, సీనియర్ కన్సల్టెంట్ డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ (చదవండి: అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!) -
సమస్య అబ్బాయిలది కాదు..! 1950ల నాటి ఆలోచనలనే..
మహిళా సాధికారత అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పేస్తుంటాం. టెక్నాలజీ పరంగా, అభివృద్ధి పరంగా అప్గ్రేడ్ అవ్వడానికి ఇష్టపడతాం. కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా పాతధోరణికే వంతపాడతాం. అందులోనూ అత్తగా హోదా రావడంతోనే మహిళలు వెనుబడిపోతున్నారా..?లేక ఏళ్ల నాటి కుచించిత మనస్తత్వం వల్లనో తెలియదు..కానీ అప్పటి వరకు ఉన్న స్త్రీత్వం అత్త అన్న పదం కారణంగా తక్కువగా మారిపోతోంది. చూడటానికి సింపుల్గా కనిపించే ఈ రెండు అక్షరాల పదబంధం తెలియకుండానే తనలోని స్త్రీకి తానే హాని చేసుకుంటూ..ఎవరో తొక్కేస్తున్నారు అని అనుకుంటోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే నెట్టింట వైరల్ అవుతోన్న ఓ అత్త డిమాండ్ చూస్తే..ఇంకా మనం ఏ కాలంలో ఉన్నామనిపిస్తుంది.ఏఐ టెక్నాలజీ, రోబో టెక్నాలజీతో దూసుకుపోతున్న తరుణంలో పెళ్లి విషయంలో కాస్త అప్గ్రేడ్ అయ్యేందుకు ఇష్టపడటం లేదేమో అంటున్నారు గురుగ్రామ్ సీఈఓ జస్వీర్ సింగ్. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఆధునిక కుటుంబాల ఆలోచనలు ఈకాలంలో కూడా ఇలానా అన్నట్లుగా ఉన్నాయంటూ రాసుకొచ్చారు. యువత సైతం కెరీర్ వరకు ఎంత బాగా ఆలోచించినా..కొన్నివిషయాల్లో ఆలోచనలు పాతధోరణికే వంతపాడుతున్నారని అన్నారు. మాట్రిమోనియల్ యాప్ నాట్. డేటింగ్ సీఈవో ఓ మాట్రీమోనిల్ ప్రొఫెల్ని షేర్ చేస్తూ..వారి డిమాండ్లు గురించి రాశారు. డిల్లీ చందిన ఓ తల్లి తన కొడుకు రూ. 75 లక్షలు సంపాదిస్తున్నాడని, కాబట్టి కాబోయే కోడలు..మంచి పేరున్న యూనివర్సిటీలో చదువుకున్న అమ్మాయి అయ్యి..ఉద్యోగం చేసే ఆలోచన ఉండకూడదని కండిషన్ పెట్టారామె. పైగా..అందంగా ఉండాలి, మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అయ్యి ఉండాలి. ఇంటికి, కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలి. తన కొడుకు భార్య పెళ్లి తర్వాత పనిచేయడం తమకు ఇష్టం లేదని కరాఖండీగా చెప్పేశారు. వాళ్లు ముఖ్యంగా డిమాండ్ చేస్తోంది ఏమిటంటే..కెరీర్కి అంత ప్రాధాన్యత ఇవ్వని అమ్మాయి కావాలని చెబుతున్నారు. అయితే సీఈవో జస్వీర్ సింగ్ మాత్రం వాళ్లకి కావాల్సింది మంచి డిగ్రీ, అందమైన శరీరం ఉన్న పనిమనిషి కోసం చూస్తున్నారని అన్నారు. ఇటీవల ఇలాంటి డిమాండ్లో కూడిన కేసులను చాలానే చూస్తున్నామని అన్నారు. ఆధునికులు కానీ సాంప్రదాయవాదులు, తెలివైనవారు కానీ విధేయులు, కార్పొరేట్ తరహా రేంజ్ కానీ కావాల్సింది 1950ల నాటి విధేయత కోరుకుంటున్నారంటూ నేటి మగపిల్లల కుటుంబాల ఆలోచన తీరుని విమర్శించారు. ఆయన షేర్ చేసిన పోస్ట్ సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. అసలు మనం సమాన భాగస్వామ్యానికి సిద్ధంగా లేం కదూ..!. చదువుల్లోనూ, సంపాదనలోనూ అప్గ్రేడ్ అవుతాం కానీ..పెళ్లి విషయంలో మాత్రం కాలం చెల్లిన ధోరణిలో ఉండటానికే ఇష్టపడుతుండటం బాధకరం. ఇక్కడ సమస్య అబ్బాయిలది కాదు..పెద్దలు తమ ఆలోచన తీరు బ్లూప్రింట్నే వారిలో నాటేస్తుండటం వల్ల వస్తున్న సమస్య ఇది. వివాహాలు చేసే విధానంలో డెవలప్మెంట్ ఉంది, కానీ మనస్తత్వాలను మార్చుకోవడం లేదా అప్గ్రేడ్ అవ్వడానికి చాలా దూరంగా ఉంటున్నారు.(చదవండి: ఏఐ సదస్సులో ఎనిమిదేళ్ల చిచ్చరపిడుగు..! టెక్ దిగ్గజాలు సైతం..) -
రాత్రి నిద్రలో కూడా ఆఫీస్ ఆలోచనలేనా?
పగలు ఆఫీసులో ఎనిమిది గంటలు పని చేస్తే.. రాత్రి నిద్రలో మరో ఎనిమిది గంటలు మెదడు అదే పనిని చేస్తూనే ఉందా?. బెడ్ మీద పడుకున్నాక కూడా రేపటి మీటింగ్, బాస్ అడిగే ప్రశ్నలు, పూర్తికాని రిపోర్టులు కళ్ళ ముందు సినిమా రీళ్లలా తిరుగుతున్నాయా? అయితే మీరు 'మెంటల్ స్విచ్ ఆఫ్' చేయడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా నిద్రలేమి, ఉదయాన్నే విపరీతమైన నీరసం మీ జీవితంలో భాగమైపోతున్నాయి.ఆలోచనలు ఎందుకు వస్తాయి? (The Zeigarnik Effect)మానసిక శాస్త్రంలో 'జైగార్నిక్ ఎఫెక్ట్' అనే ఒక సిద్ధాంతం ఉంది. మన మెదడు పూర్తి చేసిన పనుల కంటే, అసంపూర్తిగా వదిలేసిన పనులను (Unfinished Tasks) పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే శుక్రవారం వదిలేసిన ఫైలు ఆదివారం రాత్రి వరకు మిమ్మల్ని వెంటాడుతుంది. దీనివల్ల శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడు మాత్రం 'ఓవర్ టైమ్' పని చేస్తూనే ఉంటుంది.నా వద్దకు వచ్చిన రాకేష్ అనే టీమ్ లీడర్ అనుభవమే అందుకు ఉదాహరణ. అతను రాత్రి 2 గంటలకు కూడా మేలుకుని ఈమెయిల్స్ చెక్ చేసేవాడు. "మెయిల్ చెక్ చేయకపోతే ఏదో అపరాధం చేస్తున్నట్టు అనిపిస్తుంది" అని చెప్పేవాడు. ఫలితంగా అతనికి 'క్రానిక్ ఇన్సోమ్నియా' (దీర్ఘకాలిక నిద్రలేమి) మొదలైంది. మేము అతనికి 'డిజిటల్ కర్ఫ్యూ' మరియు 'బ్రెయిన్ డంప్' టెక్నిక్స్ నేర్పించాం. పక్షం రోజుల్లోనే అతని నిద్ర నాణ్యత పెరిగింది, ఆఫీసులో పనితీరు కూడా మెరుగైంది.ఆఫీస్ ఆలోచనల నుండి విముక్తి పొందే 5 మార్గాలుబ్రెయిన్ డంప్ (Brain Dump): ఆఫీసు వదిలే ముందే లేదా పడుకోవడానికి గంట ముందు, మీ మెదడులో ఉన్న పనులన్నింటినీ ఒక పేపర్ మీద రాయండి. "ఇదిగో, ఈ పనులన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి, రేపు చూసుకోవచ్చు" అని మీ మెదడుకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వండి. అప్పుడు అది పదే పదే గుర్తు చేయడం ఆపుతుంది.వర్క్-హోమ్ రిచ్యువల్ (Work-Home Ritual): ఆఫీసు నుండి ఇంటికి వచ్చే దారిలో ఒక నిర్దిష్టమైన పనిని అలవాటు చేసుకోండి. ఉదాహరణకు, ఆఫీసు ఐడి కార్డు తీసి బ్యాగులో పెట్టడం లేదా ఆఫీసు బట్టలు మార్చుకుని స్నానం చేయడం. ఇది మీ మెదడుకు "ఆఫీసు పని అయిపోయింది, ఇప్పుడు వ్యక్తిగత సమయం మొదలైంది" అని చెప్పే ఒక 'సైకలాజికల్ స్విచ్'.డిజిటల్ బౌండరీస్: పడుకోవడానికి కనీసం ఒక గంట ముందు ఫోన్ను పక్కన పెట్టండి. ఆఫీసు వాట్సాప్ గ్రూపులను 'మ్యూట్' చేయండి. ఆ నీలి రంగు వెలుతురు (Blue light) మీ నిద్రకు అవసరమైన 'మెలటోనిన్' హార్మోన్ను దెబ్బతీస్తుంది.వర్రీ టైమ్ (Worry Time): మీకు ఆందోళన కలిగించే విషయాల గురించి ఆలోచించడానికి సాయంత్రం ఒక 15 నిమిషాల సమయాన్ని కేటాయించండి. ఆ సమయంలో మాత్రమే వాటి గురించి ఆలోచించండి. బెడ్ మీదకు వెళ్ళాక ఆలోచనలు వస్తే, "దీని గురించి ఆలోచించడానికి రేపు సాయంత్రం టైమ్ ఉంది కదా" అని వాయిదా వేయండి.మైండ్ఫుల్ బ్రీతింగ్: నిద్రపోయే ముందు 4-7-8 టెక్నిక్ (4 సెకన్లు శ్వాస తీసుకోవడం, 7 సెకన్లు ఆపడం, 8 సెకన్లు వదలడం) పాటించండి. ఇది మీ నాడీ వ్యవస్థను శాంతపరిచి, ఆలోచనల వేగాన్ని తగ్గిస్తుంది.Today's Taskఈ రాత్రి పడుకునే ముందు, రేపు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులను ఒక డైరీలో రాసి, ఆ డైరీని మూసి పక్కన పెట్టండి. మీ మెదడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో గమనించండి.మీరు నిద్రపోవడం అంటే పనిని నిర్లక్ష్యం చేయడం కాదు.. రేపటి పనిని మరింత సమర్థవంతంగా చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం. గుర్రానికి విశ్రాంతి ఇస్తేనే అది రేపటి రేసులో పరిగెత్తగలదు. మీ మెదడు కూడా అంతే!- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
కథల కళల బండిలో బడిబాటకు...
‘పిల్లలందరూ ఆర్టిస్ట్లే. ఆర్టిస్ట్లందరూ పిల్లలే’ అనే మాట ఉంది. రూబుల్ నాగి ప్రసిద్ధ మ్యూరల్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు. పిల్లల మనసు చిత్రం తెలిసిన మనసెరిగిన మహిళ. ‘రూబుల్ నాగి ఫౌండేషన్’ ద్వారా దేశవ్యాప్తంగా వందలాది మంది పేదింటి పిల్లలకు విద్య అందిస్తోంది. తన కృషికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్–2026’ అందుకుంది. ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అనేది యునెస్కో సహకారంతో యూకేలోని వర్కీ ఫౌండేషన్ ఇచ్చే వన్ మిలియన్ డాలర్ల అవార్డ్...‘రూబుల్ నాగి విద్యావేత్త. అణగారిన వర్గాల పిల్లలకు అక్షరాన్ని చేరువ చేసిన మార్గదర్శి’ అని ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ అవార్డు కమిటీ అభివర్ణించింది. 130 దేశాల నుండి వచ్చిన 5,000 నామినేషన్ల నుండి నాగిని అవార్డు కోసం ఎంపిక చేశారు. జమ్మూకశ్మీర్లో పుట్టిన నాగి రాజకీయ శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసింది. తరువాత లండన్లోని స్లేడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకుంది. సోథెబీస్ లండన్లో యూరోపియన్ ఆర్ట్ను అభ్యసించింది.చదువు పూర్తయిన తరువాత ‘న్యూ డిజైన్ స్టూడియో’ ప్రారంభించి ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకుంది. 800 మ్యూరల్స్ వేసింది. 150పైగా ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించింది. రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో నాగి కళాకృతులను ప్రదర్శించారు. వీటిని రాష్ట్రపతి స్వయంగా ఎంపిక చేయడం విశేషం.కళ పేదల కోసం‘కళ కళ కోసమే’ అనేది ఒక వాదం. ‘కళ ప్రజల కోసం’ అనేది మరో వాదం. నాగి రెండో మార్గాన్ని ఎంచుకుంది. ఆర్టిస్ట్గా ఏకాంత దీవిలో, ఊహల మధ్య మాత్రమే ఉండిపోలేదు ఆమె. సామాన్య ప్రజల మధ్యకు వచ్చింది. ‘సమాజం కోసం ఏం చేయగలను?’ అని ఆలోచించింది. తన దగ్గర ‘కళ’ అనే శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి చదువుకు దూరం అయిన పేదపిల్లలకు చదువును దగ్గర చేయాలని నిర్ణయించుకుంది.లెర్నింగ్ సెంటర్లతో...దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో గ్రామాల్లో 800 లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించింది. ‘కళ’ అనే మాధ్యమంతో వందలాది మంది పేద పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించింది. ఈ విద్యాకేంద్రాలకు ముందు పిల్లలెవరూ బడి ముఖం చూడలేదు. అక్షరం ముక్క రాదు. అలాంటి పిల్లలు కూడా లెర్నింగ్ సెంటర్లో చేరిన తరువాత చదువులో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. పెద్ద స్కూల్స్లో చదివేవారితో సమానంగా పోటీ పడుతున్నారు. లెర్నింగ్ సెంటర్లు ప్రారంభించడానికి ముందు ‘పిల్లలు బడికి ఎందుకు దూరం అవుతున్నారు?’ అనే కోణంలో అధ్యయనం చేసింది నాగి. పేదరికం, ఇంటిపనులు, పొలం పనులు, బాల కార్మిక వ్యవస్థ... ఇలా ఎన్నో కారణాలు కనిపించాయి. ఈ కారణాలను అడ్డంకులుగా భావించలేదు. ప్రత్యామ్నాయ మార్గాలు, స్ఫూర్తిదాయకమైన మాటలతో ఎంతోమంది పేదపిల్లలు బడి బాట పట్టేలా చేసింది. విద్యారంగంలో నాగి చేసిన రెండు దశాబ్దాల కృషికి గుర్తింపుగా ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ దక్కింది.పిల్లలతో కలిసిపోయి...రూబుల్ నాగి దేశమంతటా విస్తృతంగా ప్రయాణిస్తుంటుంది. విద్యాకేంద్రాలలో పిల్లలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటుంది. ఆరువందల మందికి పైగా స్వచ్ఛంద సేవకులు ఆమె సైన్యం. విద్యాకేంద్రాల ద్వారా ఎంతోమంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పిస్తోంది.ఆ మాటే మంత్రంగా...కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని నాగి ఆర్ట్ స్టూడియోకు దగ్గరలోని మురికివాడ నుంచి ఒక పిల్లాడు వచ్చి ఆర్ట్వర్క్స్ను ఆసక్తిగా చూస్తున్నాడు. ‘ఏ క్లాసు చదువుతున్నావు?’ అని అడిగింది నాగి. ‘చదవడం లేదు’ అన్నాడు. ‘ఎందుకు?’ అని అడిగితే ‘మా దగ్గర డబ్బులు లేవు’ అన్నాడు. ఆ మాట నాగిని బాగా ఆలోచించేలా చేసింది. స్టూడియో అనే నాలుగు గోడలకే పరిమితం కావద్దు అని నిర్ణయించుకుంది. మరుసటి రోజే మురికి వాడకు వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుంది. తన ఆర్ట్తో మురికివాడలలోని గోడలను అందంగా కనిపించేలా చేసింది. రెండో అడుగుగా లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించింది. ‘క్లాస్రూమ్లో మాత్రమే పాఠాలు’ అని కాకుండా చెట్ల కింద, ప్రకృతి మధ్య పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.‘విద్యా కార్యక్రమాలు మరింతగా విస్తరించడానికి, నైపుణ్య ఆధారిత, డిజిటల్ అభ్యాస కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి ఈ ప్రైజ్మనీ వినియోగిస్తాను’ అని చెప్పింది రూబుల్ నాగి. సవాళ్లు ఉన్నాసరే...మురికివాడల్లో మేము గోడలపై పెయింటింగ్ వేస్తున్నప్పుడు పిల్లలు గుమిగూడేవారు. ‘మీలో ఎవరికైనా కథ వినాలని ఉందా?’ అని అడిగితే ‘నేను వింటాను’ అంటూ అందరూ ఉత్సాహంగా స్పందించేవారు. అలా కథలు, బొమ్మల ద్వారా వారు బడిలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం విజయవంతం అయింది. ఆర్ట్–బేస్డ్ లెర్నింగ్ ప్రక్రియ ద్వారా పిల్లలు పాఠాలను సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నాలుగు గోడల మధ్యే పాఠాలు చెప్పాలనుకోలేదు. ఆసక్తిగా చెబితే పిల్లలు ఆరుబయట కూర్చోనైనా వింటారు. రెండు మూడు రోజులు లెర్నింగ్ సెంటర్కు వచ్చిన విద్యార్థి మరుసటి రోజు రాకపోతే మా వాలెంటీర్లు ఆ విద్యార్థి ఇంటికి వెళతారు. కారణం ఏమిటో తెలుసుకుంటారు. ఆ విద్యార్థి రోజూ స్కూల్కు వచ్చేలా చేస్తారు. లెర్నింగ్ సెంటర్ల నిర్వహణ అనేది సులువైన విషయమేమీ కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ వాటిని నిర్వహిస్తున్నాం.– రూబుల్ నాగి -
గతకాలపు గాయాలకు మందు వేయాలి
మనిషి వ్యక్తిత్వం అనేది ఒక అందమైన శిల్పం అనుకుంటే, Early Childhood Trauma (బాల్యకాలపు గాయాలు) అనేది ఆ శిల్పం చెక్కేటప్పుడు రాయికి తగిలిన బలమైన దెబ్బలు. చాలామంది వ్యక్తిత్వ వికాసాన్ని కేవలం ఒక "అదనపు నైపుణ్యం"గా భావిస్తారు, కానీ సైకాలజీ ప్రకారం, మీ వర్తమాన ప్రవర్తన వెనుక మీ గతం తాలూకూ నీడలు ఉంటాయి. బాల్యంలో ఎదురయ్యే మానసిక గాయాలు మన వ్యక్తిత్వాన్ని ఎలా శాసిస్తాయో ఈ ఆర్టికల్లో లోతుగా చర్చిద్దాం.1. అసలు 'ట్రామా' (Trauma) అంటే ఏమిటి?ట్రామా అంటే ఒక పెద్ద ప్రమాదం జరగడం మాత్రమే కాదు. ఒక బిడ్డ తన మనసుతో తట్టుకోలేనంత ఒత్తిడికి లోనైనప్పుడు, ఆ అనుభవం మెదడులో ఒక లోతైన ముద్రగా మిగిలిపోతుంది.* ప్రతిరోజూ ఇంట్లో అరుపులు, తిట్లు వినడం.* ఆకలి వేసినప్పుడు లేదా భయం వేసినప్పుడు పట్టించుకునేవారు లేకపోవడం.* ప్రతి చిన్న విషయానికీ శిక్షించడం వల్ల కలిగే భయం.2. ట్రామా మన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చేస్తుంది?బాల్యకాల గాయాలు వ్యక్తిత్వాన్ని మూడు ప్రధాన మార్గాల్లో ప్రభావితం చేస్తాయి.A. Chronic Insecurityచిన్నప్పుడు తల్లిదండ్రుల నుండి సరైన భద్రత లభించని పిల్లలు పెద్దయ్యాక "Anxious Personality" కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ ఏదో కీడు జరుగుతుందని భయపడుతుంటారు. ఎదుటివారు తనను వదిలి వెళ్ళిపోతారేమో అనే భయంతో (Abandonment Fear) అతిగా ప్రవర్తిస్తారు.B. Emotional Detachmentకొంతమంది పిల్లలు తమ బాధను తట్టుకోలేక ఎమోషన్స్ను పూర్తిగా ఆపేస్తారు. వీరు పెద్దయ్యాక చాలా గంభీరంగా, ఎవరితోనూ త్వరగా కలవని "Avoidant Personality" గా మారుతారు. వీరికి ప్రేమను వ్యక్తం చేయడం లేదా ఇతరుల బాధను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.C. Hyper-vigilanceట్రామాకు గురైన వారి మెదడు ఎప్పుడూ 'అలర్ట్' మోడ్లో ఉంటుంది. ఎవరైనా చిన్న విమర్శ చేసినా దాన్ని తట్టుకోలేరు. చాలా త్వరగా కోపం తెచ్చుకోవడం లేదా విపరీతంగా బాధపడటం వీరి వ్యక్తిత్వంలో భాగమైపోతుంది.మోటివేషనల్ స్పీకర్లు ఇచ్చే "పాజిటివ్ థింకింగ్" చిట్కాలు ఈ గాయాలను తాకలేవు. "నీ గతాన్ని మర్చిపో, ఈరోజు నుంచి ధైర్యంగా ఉండు" అని చెప్తే సరిపోదు. నీ గతం నీ శరీరంలో, నీ నరాల్లో స్టోర్ అయ్యి ఉంది. దాన్ని అడ్రెస్ చేయకుండా పైన పూసే పూతలు పని చేయవు.ఉదాహరణకు, ఒక వ్యక్తికి స్టేజ్ ఫియర్ ఉందనుకోండి. మార్కెట్ ట్రైనర్ అతనికి స్పీకింగ్ టిప్స్ ఇస్తాడు. కానీ సైకాలజీ ఆ వ్యక్తి చిన్నప్పుడు స్కూల్ స్టేజ్ మీద ఏదైనా మర్చిపోయినప్పుడు క్లాస్ టీచర్ అందరిముందు కొట్టిన ఆ 'ట్రామా' గురించి మాట్లాడుతుంది. ఆ పాత జ్ఞాపకాన్ని హీల్ చేయకుండా కొత్త కాన్ఫిడెన్స్ రాదు.3. ట్రామాను అధిగమించి నిజమైన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలి?STEP 1: గుర్తించడంమీ ప్రవర్తనలో ఉన్న లోపాలు (ఉదా: విపరీతమైన కోపం, అభద్రత) మీ చిన్ననాటి ట్రామా నుండి వచ్చాయని గుర్తించడం. "నేను పుట్టుకతో ఇలాంటి వాడిని కాదు, నా పరిస్థితులు నన్ను ఇలా మార్చాయి" అని గ్రహించడమే సగం విజయం. మీ గతంలోని చేదు జ్ఞాపకాలను ఒకసారి వెలికితీసి చూడండి.STEP 2: రీ-పేరెంటింగ్మీ చిన్నతనంలో మీకు లభించని ప్రేమను, ధైర్యాన్ని ఇప్పుడు మీరే మీకు ఇచ్చుకోవాలి. దీన్నే 'Inner Child Healing' అంటారు.మీ మనసులోని ఆ గాయపడిన పిల్లాడిని ఇప్పుడున్న మీరు అక్కున చేర్చుకోవాలి. "నువ్వు సేఫ్ గా ఉన్నావు, నేనున్నాను" అని మిమ్మల్ని మీరు ఓదార్చుకోవాలి. సైకాలజీలో దీన్ని మెంటల్ రీ-వైరింగ్ అంటారు.STEP 3: ట్రాన్స్ఫార్మేషన్ఒక్కసారి ఆ గాయాల నుండి విముక్తి పొందితే, మీ వ్యక్తిత్వంలో ఒక అద్భుతమైన లోతు వస్తుంది. ట్రామాను జయించిన వ్యక్తిలో ఉండే Resilience (తిరిగి నిలబడే శక్తి) సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువగా ఉంటుంది. మీ బలహీనతే మీ అతిపెద్ద బలంగా మారుతుంది. అందుకోసం మూడు ప్రశ్నలను నిజాయితీగా మీకు మీరు వేసుకోండి.మీకు బాగా కోపం వచ్చినప్పుడు లేదా భయం వేసినప్పుడు.. ఆ ఫీలింగ్ మీకు పాత జ్ఞాపకాలను ఏమైనా గుర్తు చేస్తోందా? "నేను చిన్నప్పుడు కూడా ఇలాగే ఫీల్ అయ్యాను కదా!" అని ఎప్పుడైనా అనిపించిందా?మీ మనసులో ఎప్పుడూ విమర్శించే గొంతు ఎవరిది? అది మీ సొంత ఆలోచనా? లేక చిన్నప్పుడు మిమ్మల్ని తిట్టిన మీ నాన్నదో, టీచర్దో లేదా బంధువులదో గొంతుకనా?మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? అందరి నుండి దూరంగా వెళ్ళిపోతారా? లేక అందరిపై అరుస్తారా? ఈ ప్రవర్తన మీ రక్షణ కోసం మీరు చిన్నప్పుడే నేర్చుకున్న ముసుగు కాదా?నిజమైన వ్యక్తిత్వ వికాసం అంటే లోపల ఉన్న ముళ్ళను తీసివేసి, అక్కడ పూలను పూయించడం. ఈ ప్రయాణం కష్టంగా అనిపించినా, ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది.మన గతాన్ని మనం మార్చలేం కానీ, అది మన భవిష్యత్తును శాసించకుండా అడ్డుకోవచ్చు. మీ లోపల ఉన్న గాయాలను హీల్ చేసుకుని బయటకు వచ్చే "Authentic Personality" చాలా పవర్ఫుల్.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!) -
ఏఐ సదస్సులో ఎనిమిదేళ్ల చిచ్చరపిడుగు..! టెక్ దిగ్గజాలు సైతం..
భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. దిగ్గజ సీఈవోలు, ప్రపంచ సాంకేతిక నిపుణులు, ప్రముఖ నాయకులు విచ్చేసిన ఈ సదస్సులో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. అందరి ప్రసంగాలు పూర్తి అయ్యాక ఎనిమిదేళ్ల రణ్వీర్ సచ్దేవా అతి పిన్న వయస్కుడైన ‘కీ నోట్ స్పీకర్’గా వేదికపైకి వచ్చినప్పుడు ఒక్కసారిగా గది అంతా నిశబ్దంగా మారిపోయింది. విప్లవాత్మక అల్గారిథంలు, తదుపరి తరం మౌలిక సదుపాయాల గురించి తన వయసుకి మించిన జ్ఞానంతో అలవోకగా మాట్లాడి అందర్ని నిశ్చేష్టులయ్యేలా చేశాడు. ఆ బాలుడి ప్రసంగం అక్కడున్న వారందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. అలాగే భారతీయ తత్వశాస్త్రం కృత్రిమ మేధస్సు (AI)తో ఎలా జతకడుతుంది, AI పట్ల తనకున్న తన ప్రత్యేక ఆసక్తిని, దృక్పథాన్ని పంచుకున్నాడు. ఈ ఏఐ సాంకేతికతకు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడుతూ..సాంకేతికత పట్ల ఉన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ శిఖరాగ్ర సమావేశంలో రణవీర్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్లను కలిశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. కాగా, ఈ ఏఐ విప్లవం వెనుకున్న ఇద్దరు ప్రముఖులతో ఎనిమిదేళ్ల బాలుడు కలిసి పనిచేయడం, అక్కడున్న టెక్ దిగ్గజాలతో సంభాషించడం తదితరాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కాన్ఫరెన్స్లలో ఒకదానిలో మాట్లాడటం అంత చిన్న విషయం కాదు. అయితే రణ్వీర్ టెక్ ప్రపంచానికి కొత్తేమీ కాదు. అతను మూడేళ్ల వయసులోనే కోడింగ్ ప్రారంభించాడు, గతంలో ప్రపంచవ్యాప్తంగా కీనోట్స్లో మాట్లాడాడు. తన వయస్సుకు మించి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ను అధ్యయనం చేశాడు. అప్పటి నుండి అతను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. లక్షలాది మందికి ప్రేరణగా మారుతున్నాడు. పైగా టెక్నాలజీకి వయోపరిమితి లేదని రణ్వీర్ ప్రపంచానికి చాటి చెప్పాడు. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending) (చదవండి: Actress Sneha and Prasanna: మైండ్ఫుల్ పేరెంటింగ్ మంత్ర!) -
బెల్లీఫ్యాట్ తగ్గేందుకు 5:1:1 రూల్ అంటే..!
కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గిస్తే బరువు తగ్గి స్లిమ్గా అవుతామన్నది చాలామందిలో ఉండే అభిప్రాయం. అయితే మనం తీసుకునే కార్బోహైడ్రేట్లకు తగినట్లుగా పీచు, ప్రోటీన్లను చేర్చాలి. ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లు : 1 గ్రాము పీచు (ఫైబర్) : 1 గ్రాము ప్రోటీన్ అంటూ 5:1:1 నిష్పత్తిలో తీసుకుంటే కడుపు చుట్టూ కొవ్వు పేరుకోవడం తగ్గడంతో పొట్ట అలాగే దేహం బరువు పెరగక వ్యక్తులు స్లిమ్గా ఉంటారన్నది న్యూట్రిషనిస్టుల మాట.తెల్ల బ్రెడ్డు, పేస్ట్రీలు, మైదా, ఇన్స్టాంట్ నూడుల్స్ వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్లో కేవలం పిండిపదార్థాలు మాత్రమే ఉంటాయి. వాటిలో పీచుపదార్థాలుగానీ లేదా ప్రోటీన్గానీ ఉండక΄ోవడంతో అవి తిన్నవెంటనే రక్తంలోకి చక్కెర విడుదలవుతుంది. వినియోగం కాని చక్కెర కొవ్వుగా మారి బరువు పెరుగుతారన్నది చాలామందికి తెలిసిన విషయమే. 5:1:1 రూల్ అంటే... ఐదు (5 ) గ్రాముల కార్బోహైడ్రేట్ ఉండే ఆహారాన్ని తీసుకుంటే... దానికి అనుగుణంగా –1 గ్రాము పీచు పదార్థం అలాగే – 1 గ్రాము ప్రోటీన్ తీసుకోవాలి. దాంతో పిండిపదార్థంవల్ల పెరగాల్సిన కొవ్వు పెరగకుండా ఈ పీచు, అలాగే ప్రోటీన్లు అడ్డుపడతాయి. 5:1:1 నిష్పత్తికి అర్థమిదే. ఈ నిష్పత్తిలోని 1 గ్రాముల పీచు, 1 గ్రాము ప్రోటీన్తో ఏయే ప్రయోజనాలు చేకూరతాయో చూద్దాం. 1 గ్రాము పీచుతో... పీచు (ఫైబర్) జీర్ణక్రియను మెల్లగా జరిగేలా చూస్తుంది. దాంతో చక్కెరలు వెంటనే రక్తంలో పెరగకుండా మెల్లమెల్లగా ఇంకుతుంటాయి. ఫలితంగా రక్తంలోని చక్కెర మోతాదులు అకస్మాత్తుగా పెరగవు (స్పైక్ అవ్వవు). ఒకేసారి చక్కెరలు రక్తంలో విడుదల కావు కాబట్టి దాన్ని అదుపు చేయాల్సిన ఇన్సులిన్ కూడా అకస్మాత్తుగా విడుదల కావాల్సిన అవసరం లేదు. అందువల్ల అది నెమ్మదిగా తగిన మోతాదులోనే విడుదలవుతూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక పీచు వల్ల కడుపు నిండుగా ఉన్న భావనతో వెంటనే ఆకలిగా అనిపించదు. అంతేకాదు జీర్ణవ్యవస్థ ఆరోగ్యమూ బాగుంటుంది. జీర్ణవ్యవస్థలో ఉండాల్సిన మేలు చేసే మంచి బ్యాక్టీరియా (గట్ బ్యాక్టీరియా) పెరగడంతో వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది. దాంతో అంత తేలిగ్గా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. ఇక పీచు (ఫైబర్) అన్నది కొవ్వులను సమీకరించి వ్యర్థాల రూపంలో వెళ్లకుండా మలం నుంచి వేరు చేస్తుంది. 1 గ్రాము ప్రోటీన్తో ప్రోటీన్ వల్ల కూడా చక్కెరలు తక్షణం పెరగక΄ోగా... కండరాల బలం కూడా సమంగా నిర్వహితమవుతుంది. ్ర΄ోటీన్ తిన్న తర్వాత వెంటనే ఆకలిగా అనిపించదవు. దాంతో మితిమీరు తినడం (ఓవర్ ఈటింగ్) తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం బాగా తగ్గుతుంది. ఇక ్ర΄ోటీన్ వల్ల కండరాల రిపేర్లు జరుగుతుండటం, దేహానికి అవసరమైన శక్తి అందుతుంది. మరి... ప్రోటీన్లూ, పీచు... ఈ రెండూ పుష్కలంగా ఉండే ఆహారాలేమిటంటే... దాదాపు చాలారకాల పప్పుదినుసులు / కాయధాన్యాలు (లెంటిల్స్) లోప్రోటీన్ తోపాటు పీచుపదార్థాలూ ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు కందులు, శనగలు, చిక్కుళ్లలో 40 నుంచి 50 శాతం కార్బోహైడ్రేట్లతోపాటు ప్రోటీన్, పీచు ఎక్కువగా ఉంటాయి. పొట్టుతీయని ధాన్యాలలో కార్బోహైడ్రేట్లతో పాటు కొంత ప్రోటీన్, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు ముడిబియ్యం, జొన్నలు, కొర్రలు, సజ్జలు, అరికలు, సామలు, ఊదలు, క్వినోవా. అన్నిరకాల తాజా పండ్లలో స్వాభావికమైన చక్కెరతో పాటు విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, తేమ (మాయిశ్చర్) లకు అదనంగా పీచుపదార్థాలూ (ఫైబర్) ఉంటాయి. వీలైనంతవరకు పండ్ల రసాలను కాకుండా పండ్లు తీసుకోవడం మేలు. దూరం ఉంచాల్సినవి... బ్రెడ్, పేస్ట్రీలు, బిస్కెట్లు, కేకులు, డోనట్స్, పిజ్జా, బర్గర్, నూడుల్స్, బేకరీ పదార్థాలు, చిప్స్ వంటి కరకరలాడే (క్రిస్పీ) వేపుళ్లకు వీలైనంత దూరం ఉండాలి. అలాగే ప్యాకేజ్డ్ జ్యూస్లు, జామ్, స్వీట్లకు కూడా దూరంగా ఉండటం మేలు.5:1:1 అనే ఈ నిబంధనను వీలైనంతగా పాటిస్తూ ఉంటే... బరువు పెరగక΄ోవడం, కడుపు చుట్టూ అనవసరమైన కొవ్వు పేరుకుని పొట్టరావడం వీలైనంతగా తగ్గుతుంది. దాంతో ఊబకాయంతో వచ్చే అనేక అనర్థాలు అంటే... డయాబెటిస్, హైబీపీ, ఫ్యాటీలివర్ గుండెజబ్బులు... వీటన్నింటినీ నివారించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. డాక్టర్ శ్రీలత సీనియర్ క్లినికల్ డైటీషియన్ అండ్ న్యూట్రీషనిస్ట్ (చదవండి: Actress Sneha and Prasanna: మైండ్ఫుల్ పేరెంటింగ్ మంత్ర!) -
స్నేహ, ప్రసన్నల మైండ్ఫుల్ పేరెంటింగ్ మంత్ర!
టాలీవుడ్ నటి స్నేహ, తమిళ నటుడు ప్రసన్న వేంకటేశన్ దంపతులు 2012లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వారికి కుమారుడు విహాన్, కూతురు ఆధ్యంత అనే ఇద్దరు పిల్లలు. సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే ఈ ఇద్దరు పిల్లలు పెంపక విషయంలో అత్యంత కేరింగ్ తీసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికే మొదటి ప్రాధాన్యత అని, తల్లిదండ్రులుగా వాళ్లతో గడిపేందుకే ఇష్టపడతామని ఈ దంపతులు పలు ఇంటర్వ్యూల్లో తరుచుగా చెబుతుంటారు. అయితే ఈ జంట పిల్లల పెంపకం విషయంలో మైండ్ఫుల్ పేరెంటింగ్కే ప్రాధాన్యత ఇస్తారట. సెలబ్రిటీ పిల్లలు అనే భావన దరిచేరనీకుండా.. సాధారణ పిల్లలు మాదిరిగానే పెంచుతాం గానీ..అది అత్యంత మైండ్ఫుల్గా ఉండాలంటున్నారు ఈ దంపతులు. అదెలాగంటే..పిల్లలకు తమ తల్లిదండ్రులు సంరక్షణలోనే ఉన్నాం అనే ఫీల్ కలిగేలా పెంచాలి. అంటే తల్లిదండ్రలుకు పిల్లలకు మధ్య దూరం రాకూడదు. అంటే బాధ్యతలు, ఉద్యోగాల పరంగానైనా సరే, తల్లిదండ్రుల సాన్నిహిత్యం దూరం కాకుడదట. కలిసి భోజనం చేయడం, వారితో కలిసి ఆడుకోవడం, కథలు చెప్పడం వంటివి అన్ని కూడా ఉండాలి. అలాగే మనపిల్లలు అన్నివేళలా ప్రతిదాంట్లో టాలెంటెడ్గా ఉండాలని ఆశించొద్దంటున్నారు ఈ దంపతులు. వారి సామర్థ్యాలకు అనుగుణంగా సాధ్యమైనది చేయనివ్వండి. అభినందిస్తూ..మరింత ుముందుకు లక్ష్యం చేరుకోవడం ఎలాగో మార్గనిర్దేశం ఇచ్చేలా ప్రోత్సహించండి. ఒకవేళ్ల సక్సెస్ కాకపోతే..దాన్ని అధిగమించడం ఎలాగో వివరించండి తప్ప..భయపెట్టొద్దు. ఆందోళన, ఒత్తిడిలను హ్యాండిల్ చేయగలిగేలా చేయండి. ముఖ్యంగా వారితో స్నేహపూర్వకంగా మెలగండి. ఏ విషయమైన నిర్భయంగా చెప్పగలిగే స్వేచ్ఛను ఇవ్వండంటున్నారు. ఎప్పటికీ పిల్లలు దృష్టిలో తల్లిదండ్రులే తమ బెస్ట్ ఫ్రెండ్స్ అనేలా బాండింగ్ ఉంటే..కుటుంబ వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో విలువలు నేర్పించాల్సిన బాధ్యత కూడా మనదేనని నొక్కి చెప్పారు. -
అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!
మహమ్మారి కేన్సర్ ఎంతటి బలవంతుడినైన బలహీనుడిగా మార్చేస్తుంది. అంతలా మానసికంగా, శారీరకంగా ఢీలా పడేలా చేసే వ్యాధిని..19 ఏళ్ల అమ్మాయి అలుపెరగని పోరాటం చేసి..మట్టికరిపించింది. ఎందరో కేన్సర్ బాధితులకు స్ఫూర్తిగా నిలవడమే గాక..ప్లీజ్ పోరాడండి అని ధైర్యం చెబుతోంది. యువ కేన్సర్ వారియర్ అని అందరిచేత ప్రశంసలందుకుంటోంది. ఆ అమ్మాయే 19 ఏళ్ల లకితా ఫిద్రా..కెన్యాకు చెందిన ఆమెకు ఐదేళ్ల వయసులో ఉండగా తండ్రి కేన్సర్తో మరణించాడు. ఒంటరి తల్లి పెంపకంలో సాగుతున్న ఆమె జీవితం సరిగ్గా పదేళ్ల వయసులో ఊహించని మలుపు తిరిగింది. ఒకరోజు ఆటలు ఆడుకుంటుండగా, సడెన్గా కుడిమోకాలులో విపరీతమైన నొప్పి..అల్లాడిపోతోంది. తీరా వైద్యుల వద్దకు తీసుకువెళ్తే..వాళ్లు నార్మల్ సమస్యగానే భావించి చికిత్స అందిస్తున్నారు. ఎప్పుడైతే ఆమె కుటుంబ చరిత్రలో తండ్రి అత్త సార్కోమా కేన్సర్ బాధితులని తెలిసిందో..వెంటనే అనుమానంతో డాక్లర్లు వైద్య పరీక్షలు చేయగా..తీవ్రమైన ఆస్టియోసార్కోమా కేన్సర్ నిర్థారణ అయ్యింది. స్కానింగ్లో ఆమె కుడి తొడ ఎముకలో ఈ కేన్సర్ కణితిని గుర్తించారు. దాంతో వైద్యులు కీమోథెరపీ చేయించి, లింబ్ సాల్వేజ్ సర్జరీ చేశారు. ఈ ప్రక్రియలో మోకాలి కీలును టైటానియం ఇంప్లాంట్తో భర్తీ చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు హాయిగా స్కూల్కి వెళ్లి..యథావిధిగా చదువుకోడం ప్రారంభించింది. మళ్లీ ఆ మహమ్మారి 2020లో దాడి చేసింది. ఈసారి ఆమె కాలుని పూర్తిగా తొలగించక తప్పలేదు. అదే ఏడాది అదనపు కీమోథెరపీ, ఎముకమజ్జ మార్పిడి జరిగాయి. ఆమె సొంత స్టెమ్ సెల్స్ ఉపయోగించి మొట్టమొదిటి మార్పిడి చేశారు. దాదాపు వందరోజులపైనే ఆస్ప్రత్రిలో చికిత్స పొందింది. అక్కడితో ఆ కేన్సర్ విజృంభణ ఆగలేదు. ముచ్చటగా మూడోసారి 2022లో, ఆమెకు మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అభివృద్ధి చెందింది. ఇది అతి తీవ్రమైన ఎముక మజ్జ రుగ్మత.ఇది మళ్లీ దాడిచేసే అరుదైన కేన్సర్వ్యాధి. అయితే ఈసారి ఆమెకు అండగా తల్లి నిలబడింది. తల్లి ఎముకమజ్జ మార్పిడితో లకితాకి చికిత్స అందించారు. ఈప్రక్రియ విజయవంతమైంది. ఇక్కడ లకితా మూడోసారి ఎదుర్కొన్న తీవ్రమైన ఎముకమజ్జ మార్పడి..బహుళ కేన్సర్లకు దారితీసే జీవితకాల ప్రమాదం. కానీ ఆమె జన్యువులు దూకుడు లేకుండా చికిత్సా వ్యూహానికి అనుమతించి..తగ్గుముఖం పట్టడం విశేషం. అయితే ఆమెకు సదా వైద్యు పర్యవేక్షణ తప్పనిసరి. కనీసం రెండు మూడేళ్ల కొకసారి కేన్సర్ పరీక్షలు చేయిచుకోక తప్పదు. ఇన్ని కష్టాల మధ్య చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె ఇప్పుడు సైకాలజీ, సామాజిక శాస్త్రం, సాహిత్యం ఏ లెవెల్ను చదువుతోంది. పైగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉంది. తాను పరుగెత్తలేకపోయినా, జిమ్నాస్టిక్స్ చేయలేకపోతేనేం..డ్యాన్స్ చేయగలను, పేయింటింగ్ వేయగలను అంటోంది. పునరావృతమయ్యే బోన్ కేన్సర్, లి-ఫ్రామిని సిండ్రోమ్పై ధైర్యంగా పోరాడిని ధీరురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కేన్సర్ బాధితుల్లో స్థైర్యాన్ని నింపేలా గొప్ప సందేశాన్ని కూడా అందిస్తుంటుంది. మీరు కేన్సర్ రోగిగా ఆస్పత్రల్లో గడపడం కష్టమే అయినపపటికీ తెలియన ధైర్యంతో సాగుతారు. ఆ వ్యాధని చూసి భయపడినప్పటికీ స్ట్రాంగ్గా మారతారు. అప్పుడు తెలుస్తుంది మీరు రోగి కాదు..హీరో అనే సందేశాలతో వాళ్లను వీరోచితంగా కేన్సర్పై పోరాడేలా చేస్తుంది లకితా. (చదవండి: నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!) -
నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!
మనం ఒక భవనాన్ని చూసినప్పుడు దాని రంగులు, కిటికీలు కనిపిస్తాయి కానీ, భూమి లోపల ఉన్న పునాది కనిపించదు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. మీరు ఈరోజు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, లేదా ఎంత భయపడుతున్నా.. దాని వెనుక మీ జీవితంలోని మొదటి 2,000 రోజులు (మొదటి ఐదేళ్లు) ఉన్నాయి.సైకాలజీలో ఒక ప్రసిద్ధ మాట ఉంది: "Give me a child until he is seven, and I will show you the man." అంటే, ఏడేళ్ల లోపు ఒక బిడ్డను నాకు ఇస్తే, అతను భవిష్యత్తులో ఎలాంటి వాడో నేను చెప్పగలను అని. ఎలిజబెత్ హర్లాక్ ఈ కాలాన్ని 'పునాది దశ' (Foundational Stage) అని పిలిచారు.నమ్మకం vs అపనమ్మకం (Trust vs Mistrust): పుట్టిన మొదటి ఏడాది బిడ్డ పుట్టిన మొదటి ఏడాదిలో నేర్చుకునే అత్యంత ముఖ్యమైన విషయం "ప్రపంచం సురక్షితమైనదా? కాదా?".సురక్షితమైన పునాది: బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి వెంటనే పాలు పట్టడం, దగ్గరకు తీసుకోవడం, ప్రేమగా నిమరడం చేస్తే.. ఆ బిడ్డ సబ్-కాన్షియస్ మైండ్లో "ఈ ప్రపంచం నమ్మదగినది. ఇక్కడ నా అవసరాలు తీరుతాయి" అనే నమ్మకం కలుగుతుంది. ఇది భవిష్యత్తులో ఆ వ్యక్తి ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి పునాది అవుతుంది.అభద్రతా భావం: అదే బిడ్డను పట్టించుకోకపోతే, ఆకలితో ఏడుస్తున్నా నిర్లక్ష్యం చేస్తే.. "ఎవరినీ నమ్మలేం, నా గురించి ఎవరూ పట్టించుకోరు" అనే అభద్రతా భావం మొదలవుతుంది. పెద్దయ్యాక ఇలాంటి వారు ఎవరినీ త్వరగా నమ్మలేరు (Trust issues).స్వయంప్రతిపత్తి (Autonomy): 2 నుండి 3 ఏళ్లుఈ దశలో బిడ్డ తన కాళ్లపై తాను నడవడం, తన చేత్తో తాను తినడం నేర్చుకుంటాడు. అంటే తనకంటూ ఒక 'ఇచ్ఛ' (Will) ఉందని గుర్తించే సమయం.పర్యవేక్షణ vs అణచివేత: బిడ్డ తనంతట తాను ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు (ఉదాహరణకు: గ్లాసుతో నీళ్లు తాగడం), తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం (Self-confidence) పెరుగుతుంది."వద్దు.. నువ్వు వొంపేస్తావు, నీకు రాదు" అని ప్రతిదానికీ అరిస్తే.. వారిలో సందేహం (Doubt), సిగ్గు (Shame) మొదలవుతాయి. "నేను ఏదీ సరిగ్గా చేయలేను" అనే నెగటివ్ సెల్ఫ్-ఇమేజ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది.చొరవ (Initiative): 4 నుండి 5 ఏళ్లుఈ వయస్సులో పిల్లలు చాలా ప్రశ్నలు వేస్తారు. ప్రతిదీ తెలుసుకోవాలని కుతూహల పడతారు. ప్రపంచాన్ని ఒక 'ప్లే గ్రౌండ్' లా చూస్తారు.సృజనాత్మకత: పిల్లల ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్తూ, వారి ఆటలను ప్రోత్సహిస్తే వారిలో నాయకత్వ లక్షణాలు (Leadership), సృజనాత్మకత (Creativity) పెరుగుతాయి.అపరాధభావం (Guilt): వారి ప్రశ్నలను విసుక్కుంటే, వారి ఆటలను అల్లరిగా భావించి శిక్షిస్తే.. "నేను ఏదో తప్పు చేస్తున్నాను" అనే గిల్ట్ ఫీలింగ్ వారిలో నాటుకుపోతుంది. పెద్దయ్యాక వీరు ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా భయపడతారు.సో-కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, మోటివేషనల్ స్పీకర్లు ఇచ్చే చిట్కాలు (ఉదాహరణకు: అద్దం ముందు నిలబడి గట్టిగా అరవడం) ఈ లోతైన పునాది గోడలను మార్చలేవు.ఎందుకంటే...మీరు 30 ఏళ్ల వయస్సులో "నేను కాన్ఫిడెంట్గా ఉండాలి" అని అనుకుంటున్నారు. కానీ మీ సబ్-కాన్షియస్ మైండ్లో 3 ఏళ్ల వయస్సులో పడ్డ "నువ్వు ఏదీ సరిగ్గా చేయలేవు" అనే ముద్ర అలాగే ఉంది. పైన మీరు ఎన్ని కోట్లు వేసుకున్నా, లోపల ఆ చిన్న పిల్లాడు ఇంకా భయపడుతూనే ఉంటాడు.Real Personality Development అంటే.. ఆ చిన్ననాటి ముద్రలను గుర్తించి, వాటిని రీ-ప్రోగ్రామ్ చేయడం, మీ ఇన్నర్ చైల్డ్ ను హీల్ చేయడం. కేవలం బాడీ లాంగ్వేజ్ మార్చడం కాదు.ఇదే నిజమైన వ్యక్తిత్వ వికాసం: Genius Matrix WayStep 1: Break (విశ్లేషించడం)మీరు ఇప్పుడు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా (ఉదాహరణకు: స్టేజ్ ఫియర్, రిలేషన్షిప్ సమస్యలు), దానికి మూలాలు మీ మొదటి ఐదేళ్లలో ఎక్కడ ఉన్నాయో వెతకండి."నన్ను చిన్నప్పుడు అతిగా కంట్రోల్ చేశారా?""నా అవసరాలను నా తల్లిదండ్రులు గుర్తించారా?"ఈ విశ్లేషణే మీ పాత వ్యక్తిత్వాన్ని 'బ్రేక్' చేస్తుంది.Step 2: Build (తిరిగి నిర్మించడం)మీ చిన్నతనంలో మీకు దక్కని ప్రోత్సాహాన్ని ఇప్పుడు మీరు మీకు ఇచ్చుకోవాలి. దీనినే 'Reparenting yourself' అంటారు. మీ అంతరాత్మతో మీరు మాట్లాడే తీరును మార్చుకోవాలి."నీకు చేతకాదు" అనే మాటను "నువ్వు నేర్చుకోగలవు" అనే మాటతో రీప్లేస్ చేయాలి.Step 3: Beyond (పరిమితులకు ఆవల)ఒక్కసారి మీ మూలాలు మీకు అర్థమైతే, పాత గాయాలు మీ వ్యక్తిత్వాన్ని శాసించవు. మీరు ఒక స్వేచ్ఛా జీవిగా మారుతారు. ఎదుటివారి సర్టిఫికేట్లతో సంబంధం లేకుండా మీ లెగసీని మీరు నిర్మించుకుంటారు.మొదటి ఐదేళ్లు మీ వ్యక్తిత్వానికి పునాది వేశాయి. అది మీ తప్పు కాదు. కానీ 25 లేదా 30 ఏళ్ల వయస్సులో కూడా అదే పాత భయాలతో బ్రతకడం మీ బాధ్యతారాహిత్యం అవుతుంది. మిమ్మల్ని మీరు రీ-డిజైన్ చేసుకోగలరు!ఎలిజబెత్ హర్లాక్ చెప్పినట్లు, వ్యక్తిత్వం అనేది 'డైనమిక్'. అంటే దాన్ని మార్చుకోవచ్చు. మీ పునాది గోడల్లో పగుళ్లు ఉన్నాయని తెలిస్తే, వాటిని సిమెంట్ వేసి పూడ్చవచ్చు. ఆ పునాదిని అర్థం చేసుకోవడమే Real Personality Development.Self-Reflection: ఈరోజు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మీ ఐదేళ్ల వయస్సును గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీరు ఎలా ఉండేవారు? మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎలా చూసేవారు? ఆ జ్ఞాపకాల్లోనే మీ వ్యక్తిత్వ రహస్యం దాగి ఉంది.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The DNA of You: 'పర్సనాలిటీ'కి పునాది ఎక్కడ పడుతుందంటే..!) -
ఈ వధువరులది ఎంత గొప్ప మనసు..!
చిన్న చిన్న పనులు కూడా మానవత్వానికి అద్దం పడతాయని చెప్పకనే చెప్పిన ఈ వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. ‘వేడుకలలో మనం కూడా ఇలాగే చేయాలి’ అనిపించేలా చేసింది. సాధారణంగా వివాహ వేడుకల్లో ఎవరి బిజీలో వారు ఉంటారు. వేరే వ్యక్తుల గురించి పట్టించుకోరు. ఇక ఈ వివాహం విషయానికి వస్తే....క్యాటరింగ్ స్టాఫ్ పెళ్లికి వచ్చిన వారికి రుచికరమై పదార్థాలు వడ్డించారు. విందు కార్యక్రమం పూర్తయింది.ఈలోపు వధూవరులు...‘క్యాటరింగ్ స్టాఫ్ ఎక్కడా?’ అంటూ వచ్చారు. ‘వడ్డించడంలో ఏదైనా పొరపాటు దొర్లిందా?’ అని వారు భయపడ్డారు. ‘సర్, ఎనీ ΄ప్రాలాబమ్?’ అని వినయంగా అడిగారు. ‘ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇంతకీ మీరు భోజనం చేశారా?’ అని అడిగారు.‘లేదు’ అని చెప్పడంతో వధూవరులు వారికి ఆప్యాయంగా ఆహారపదార్థాలు వడ్డించారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. వధూవరులకు పాన్ఇండియా నుంచి ప్రశంసలు వచ్చాయి. View this post on Instagram A post shared by @Cinematographer🎬 (@aarush7069) -
బతుకు తెరువుకు చదువొక్కటే ముఖ్యం కాదు!
మా అక్కయ్య వాళ్ళ బాబుకు 12 సంవత్సరాలు. అన్ని విషయాల్లో చాలా వెనుకబడి ఉంటాడు. బొత్తిగా లోకజ్ఞానం లేదు. చూడటానికి కూడా చాలా అమాయకంగా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. మొహంలో కూడా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. అయితే ఆ బాబుకు ఎలా వచ్చిందో కాని, సంగీతంలో చాలా మంచి నైపుణ్యం వచ్చింది. రకరకాల రాగాలు పలికిస్తుంటాడు, పాడుతూ ఉంటాడు. టి.వి.లో, రేడియోలో సంగీత కార్యక్రమాలంటే చాలా ఇష్టంగా వింటూ ఉంటాడు.వీడి టాలెంట్ చూసి మాకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసులు వారి కచేరీలకు వీడిని కూడా తీసుకుని తమ బృందంలో ఒక సభ్యుడిగా పెట్టుకుంటున్నారు. చదువులో పైకి రాలేదు కాని, ఇలా సంగీత వేదికల మీద పేరు తెచ్చుకుంటున్నాడు. అన్నింటిలో వెనుకబడిన మా బాబుకు ఇలాంటి సంగీత నైపుణ్యం ఎలా అబ్బిందో అర్థం కావడం లేదు! వీడి భవిష్యత్తును ఎలా మలచాలో తెలియక ఆందోళనలో ఉన్నాము. మీరే మంచి సలహా చెప్పగలరు.– రమణి, శ్రీకాకుళంరమణి గారూ! మానసిక శాస్త్రంలో చాలా అరుదైన ఒక విషయాన్ని బయట పెట్టినందుకు, మీకు నా ధన్యవాదాలు. ఇడియాట్ సావంట్ (IDIOT SAVANT) అనే అత్యంత అరుదైన, వ్యక్తులు కొందరు ఎక్కడో ఒక చోట మనకు కనబడుతారు. మీ అబ్బాయి కూడా ఈ కోవకు చెందినవాడే. బుద్ధిలో, లోకజ్ఞానంలో, చదువులో, లౌకిక విషయాల్లో మానవ సంబంధాల విషయాల్లో వీరు బాగా వెనుకబడే ఉంటారు. అయితే ఇలా ఏదో ఒక ప్రత్యేక విషయంలో, మిగిలిన వారికంటే చాలా ఎక్కువ నైపుణ్యం కలవారై ఉంటారు. ఇలాంటి పిల్లలలో కొందరు గణితంలో అద్భుత ప్రజ్ఞ ప్రదర్శిస్తే, మరికొందరు చిత్రకళలో, కొందరు సంగీతంలో మీ బాబు లాగా, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, ఎవ్వరూ ఊహించలేనంత నైపుణ్యం ప్రదర్శిస్తారు. వీరి మెదడు పూర్తిగా వృద్ధి చెందక పోయినా, ఏదో ఒక భాగం, మామూలు కంటే అతి తక్కువగా వృద్ధి చెంది, ఆయా మెదడు భాగాల పనితీరునుబట్టి, అటు గణితం, సంగీతం, చిత్రలేఖనం, ఇలాంటి విషయాల్లో అత్యద్భుతమైన నైపుణ్యం కలిగేటట్లు చేస్తుంది. చరిత్రలో కిమ్ పీక్ (జ్ఞాపక శక్తి) స్టీఫెన్ విల్ట్ షైర్ (చిత్రలేఖనం), దెరెక్ (సంగీతం) లాంటి వీరు ఈ కోవకు చెందినవారే! ‘ఆటిజమ్’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనయిన పిల్లలలో ఇలాంటి ప్రత్యేకమైన నైపుణ్యాలు కనపడే అవకాశముంది. ఇటీవలే ‘ఇడియాటిక్ సావంట్’ పేరు అభ్యంతరకరంగా ఉందని, దీనిని ‘సావంట్ సిండ్రోమ్’గా (savant syndrome) పేరు మార్చారు. ఇకపోతే, బతుకుదెరువుకు, జీవితంలో పైకి రావడానికి కేవలం చదువొక్కటే ముఖ్యం కాదు. సమాజంలో చదువు తక్కువైన చాలామంది ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నారో మనకు తెలిసిందే! మీ అక్కయ్య వాళ్లను అధైర్యపడ వద్దని చెప్పండి. ఆ బాబును, తననకు అబ్బిన సంగీతం విషయంలోనే, మరింత శిక్షణ ఇప్పిస్తే, అతడు భవిష్యత్తులో మంచిపేరు తీసుకురాగలడని నా నమ్మకం! ఆల్ ది బెస్ట్!- డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
గుండెపోటు మరోసారి రాకూడదంటే..!
గుండెపోటు అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా. అందువల్ల గుండె పోటు నుంచి బయటపడ్డ రోగులు..మరోసారి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..తీసుకోవాల్సిన జాగ్రత్తలు..కొద్ది మోతాదులో వ్యాయామాలు చేయడంవేళకు భోజనం చేయాలిఅధిక కేలరీలు, కొలస్ట్రాల్తో కూడిన భోజనం నివారించాలి.డైట్ ఎలా ఉండాలంటే..1. తృణధాన్యాలు - ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్లు, గోధుమలు తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి.2. తాజా కూరగాయలు, పండ్లు - ఆకుకూరలు, టమోటాలు, క్యారెట్లు, బెర్రీలు, ఆపిల్స్, సిట్రస్ పండ్లు తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గిస్తాయి ధమనుల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.3. ఆరోగ్యకరమైన కొవ్వులు మితంగా - నట్స్, ఆలివ్ నూనె, ఆవాల నూనె, కొద్ది మొత్తంలో తీసుకోవాలి. ఇవి మంచి HDL కొలెస్ట్రాల్ను అందించి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తాయి. 4. ప్రోటీన్ కంటెంట్ కోసం - పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు, టోఫు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు, చేపలు, స్కిన్లెస్ చికెన్. సాల్మన్ వంటి కొవ్వు చేపలు గుండెకు రక్షణ కల్పించే ఒమేగా-3 కొవ్వులను అందిస్తాయి.5. ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి.రోగులు ఖచ్చితంగా నివారించాల్సినవి..1. అధిక ఉప్పు: ప్యాక్ చేసిన స్నాక్ ఫుడ్స్, ఊరగాయలు, పాపడ్లు, సాస్లు, తినడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తులు తదితరాలు సోడియం ప్రధానంగా ఉండే ఆహారాలు. ఇవి రక్తపోటును పెంచి, గుండెపై భారం పడేలా చేస్తాయి.2. డీప్-ఫ్రైడ్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్స్, నామ్కీన్లు, వేయించిన రుచికరమైన స్నాక్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి.3. శుద్ధి చేసిన చక్కెరలు, చక్కెర పానీయాలు - స్వీట్లు, డెజర్ట్లు, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్లు, తదితరాలు అధిక బరువుకి, గుండె జబ్బులకు కారణమవుతాయి.4. మటన్ వంటి ఎర్రటి మాంసం వినియోగాన్ని తగ్గించాలి5. ఆల్కహాల్ - మద్యం వినియోగాన్ని నివారించాలి లేదా పరిమితం చేయాలి. ఆల్కహాల్ రక్తపోటును పెంచుతుంది,పైగా గుండెకు నేరుగా విషపూరితమైనది కూడా.గుండె ఆరోగ్యం బాగుండాలంటే..కొద్దిపాటి వ్యాయామాలు, మందులు, ఒత్తిడి నిర్వహణ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు.డాక్టర్ గిరీష్ గాడ్బోల్, డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్,ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ -
పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి
వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల Y క్రోమోజోమ్ (Y-chromosome)ను ఎక్కువగా నష్ట పోతున్నారట. వృద్ధ పురుషుల్లో Y క్రోమోజోమ్ క్షీణించడం సాధారణమే అయినప్పటికీ కానీ తాజాగా ఈ ధోరణి బాగా పెరుగుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి జబ్బులతోపాటు, తక్కువ ఆయుర్దాయంతో ముడిపడి ఉంది అంటున్నారు పరిశోధకులు వయస్సు పెరిగే కొద్దీ పురుషులలో 'Y' క్రోమోజోమ్ కోల్పోవడం (LOY) వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉందంటున్నారు. ఈ మార్పు గుండె జబ్బులు, క్యాన్సర్ , తక్కువ ఆయుష్షుకు ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. గతంలో, Y క్రోమోజోమ్ కోల్పోవడం వల్ల పెద్దగా నష్టం లేదని పరిశోధకులు భావించేవారు. ఎందుకంటే ఇందులో ఇతర క్రోమోజోమ్ల కంటే తక్కువ జన్యువులు ఉంటాయి. దీని ప్రధాన పని పురుష లక్షణాలను నిర్ణయించడం మరియు వీర్యకణాల అభివృద్ధికి తోడ్పడటం మాత్రమే అని అనుకునేవారు. కానీ కొత్త పరిశోధనలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి.60 ఏళ్ల పురుషులలో సుమారు 40శాతం మందిలో, 90 ఏళ్ల వారిలో 57శాతం మందిలో ఈ లోపం కనిపిస్తోంది. ధూమపానం, రసాయనాల ప్రభావం వల్ల ఈ ముప్పు పెరుగుతుంది. Y క్రోమోజోమ్ లేని కణాలు వేగంగా పెరుగుతాయి. ఈ వేగవంతమైన పెరుగుదల వల్ల శరీరంలో ట్యూమర్లు (గడ్డలు) వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 60 సెకన్లలో కేరళ ట్రూ స్టోరీ : ఒట్టపాలెం కథ కావాలి స్ఫూర్తి!ఆరోగ్య సమస్యలు Y క్రోమోజోమ్ కోల్పోవడం వల్ల అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఆధారాలు లభించాయిప్రధానంగా గుండె జబ్బులు, అల్జీమర్స్ క్యాన్సర్:లాంటివి. జర్మనీలో జరిగిన ఒక పెద్ద అధ్యయనం ప్రకారం, 60 ఏళ్లు పైబడిన పురుషులలో Y క్రోమోజోమ్ లోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. రక్త కణాలలో 'Y' లేకపోవడం వల్ల గుండె కండరాలు దెబ్బతిని, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అల్జీమర్స్ రోగులలో ఈ లోపం పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ కణాలలో Y క్రోమోజోమ్ పూర్తిగా ఉండదు.ఇతర వ్యాధులు: కిడ్నీ వ్యాధులు, కరోనా (COVID-19) మరణాలు కూడా దీనితో ముడిపడి ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆడవారితో పోలిస్తే మగవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం కావొచ్చని కూడా అంచనా వేశారు.ఎలుకల మీద చేసిన ప్రయోగాలలో, Y క్రోమోజోమ్ లేని రక్తకణాలను ఎక్కించినప్పుడు వాటిలో గుండె వైఫల్యం ,గుండె బలహీనపడటం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపించాయి.ఇదీ చదవండి: థాయ్లాండ్లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!'Y' క్రోమోజోమ్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి?మానవ కణాలలో సాధారణంగా 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అందులో ఒక జత 'లైంగిక క్రోమోజోములు'. స్త్రీలలో రెండు 'X' క్రోమోజోములు ఉంటే, పురుషులలో ఒక 'X' , ఒక 'Y' క్రోమోజోమ్ ఉంటాయి.Y క్రోమోజోమ్ సాపేక్షంగా తక్కువ జన్యువులను కలిగి ఉంటుంది. దీని ప్రధాన పాత్ర పురుష లింగ నిర్ధారణ.ఇది సాధారణ స్పెర్మ్ అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. దీనిలో సుమారు 51 ప్రోటీన్-కోడింగ్ జన్యువులు ఉంటాయి. ఇవి శరీరంలోని ఇతర భాగాలలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.కొన్ని 'Y' జన్యువులు క్యాన్సర్ రాకుండా అడ్డుకునే (Cancer suppressors) గుణాన్ని కలిగి ఉంటాయి.Y క్రోమోజోమ్ ఎందుకు పోతుంది అంటే కణాలు విభజన చెందే సమయంలో జరిగే పొరపాట్ల వల్ల 'Y' క్రోమోజోమ్ కణాల నుండి తొలగిపోతుంది. Y' క్రోమోజోమ్ కేవలం పురుషత్వాన్ని నిర్ణయించేది మాత్రమే కాదు, అది మొత్తం శరీర ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటిది. భవిష్యత్తులో ఈ క్రోమోజోమ్ లోపాన్ని ముందే గుర్తించడం ద్వారా పురుషులలో వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.ఇదీ చదవండి: పక్షవాతంతో భర్త.. 70 ఏళ్ల మహిళ హత్య : రూ. 65 లక్షల గోల్డ్ చోరీ -
ఏఐ సదస్సు లంచ్ మెనూ ఇదే..!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభమైన సంగతి తెలిసింది. ఈ ఏఐ సదస్సుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్లు పాల్గొన్నారు. ఉదయం 9:40 గంటలకు ఈ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓపెన్ ఐఏ సీఈవో సామ్ ఆల్ట్మాన్ వంటి టాప్ టెక్ సీఈవోలు ప్రసంగిస్తారు. వీళ్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ పరిశ్రమ నాయకులు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తదితరులు కూడా ప్రసగించనున్నారు. మరి ఈ అతిరథమహారథుల కోసం విందు భారత్ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మరి ఆ నాయకుల లంచ్ మెనూలో ఏయే వంటకాలు సిద్ధంగా ఉన్నాయంటే..లంచ్లో అలెర్జీ రహిత వంటకాలను సర్వ్ చేయనున్నారు. ముఖ్యంగా పాలు, గోధుమ, నట్స్ లేకుండా రెసీపీలు సిద్ధం చేశారు. ఈమెనూలో వందగ్రాముల కేలరీలు,పోషక విలువలు ఉండేలా కేర్ తీసుకున్నారు పాకనిపుణులు. ఇంతకీ ఏమేమి వంటకాలు ఉన్నాయంటే..స్టార్టర్స్ నిమోనా కబాబ్జీలకర్ర, ఆసాఫోటిడాతో టెంపర్ చేసిన పాన్-గ్రిల్డ్ గ్రీన్ బఠానీ కబాబ్. ఇవి బీహార్, ఉత్తరప్రదేశ్లలో ప్రసిద్ధి చెందిన తాజా పచ్చి బఠానీల చేసే శీతాకాలపు వంటకం. వంద గ్రాముల కబాబ్లకు 113 కిలో కేలరీలుఖమ్ ఖతైసున్నితమైన ఆకుపచ్చ మూంగ్ పప్పు ప్యాటీలను తీపి మామిడి చట్నీతో నింపి పాన్-గ్రిల్డ్ చేస్తారు. ఈ శాఖాహార కబాబ్లు నోటిలో ఇట్టే కరిగిపోతాయి. ప్రతి వందగ్రాములకు 116 కిలో కేలరీలుకాశ్మీరీ నద్రు కుర్కురిసుగంధ ద్రవ్యాలతో చల్లిన క్రిస్పీ ఫ్రైడ్ లోటస్ స్టెమ్ చిప్స్. ఇది కాశ్మీర్ లోయ నుంచి వచ్చిన ప్రసిద్ధ, క్రంచీ స్నాక్. ఇందులో కూడా ప్రతి వంద గ్రాములకు 143 కిలో కేలరీలుప్రధాన కోర్సుజాఫ్రానీ సబ్జ్ పులావ్కాలానుగుణ కూరగాయలు, కుంకుమపువ్వుతో సువాసనగల బాస్మతి బియ్యం. ఇది కుంకుమపువ్వు (జాఫ్రాన్), నట్స్, నెయ్యితో తయారు చేసిన గొప్ప, సుగంధ పులావ్ వంటకం. దీనిని తరచుగా హైదరాబాద్లో విలాసవంతమైన, వేడుక లేదా "నవాబీ" భోజనంలో భాగంగా వడ్డిస్తారు. వందగ్రాములకు 152 కిలో కేలరీలుతందూరీ సలాడ్టమోటాలు, బెల్ పెప్పర్స్, పైనాపిల్లను తందూర్లో మ్యారినేట్ చేసి గ్రిల్ చేస్తారు.వంద గ్రాములకు 78 కిలో కేలరీలుథెప్లామెంతులతో రుచిగల గ్రామ్ పిండి ఫ్లాట్బ్రెడ్, మామిడి రుచిగల క్రీమ్ చీజ్తో సర్వ్ చేస్తారు. థెప్లా అనేది గుజరాతీ గృహాల్లో ప్రధానమైన, ప్రసిద్ధమైన, మృదువైన సన్నని ఫ్లాట్బ్రెడ్.వంద గ్రాములకు 138 కిలో కేలరీలుడెజర్ట్లుగులాబీ అండ్ కొబ్బరి పుడ్డింగ్ఫింగర్ మిల్లెట్ క్రంబుల్తో గులాబీ, కొబ్బరి పాలు పుడ్డింగ్ (ఖీర్). శక్తివంతమైన గులాబీ రంగును కలిగి ఉన్న క్రీమీ డెజర్ట్.వంద గ్రాములకు 167 కిలో కేలరీలురామదాన అంజీర్ లడూపఫ్డ్ మిల్లెట్, ఎండిన అంజూరతో చేసే లడ్డూ. ప్రతి వంద గ్రాములకు 172 కిలో కేలరీలుకాగా ఈ ఐఏ ఇంపాక్ట్ సదస్సు సుమారు 20కి పైగా రాష్ట్రాల అధిపతులు, దాదాపు వంద మందికి పైగా సీఈవోలు, వ్యవస్థాపకులతో సహా 500 మంది అగ్ర నాయకులను ఒక చోటకు చేర్చింది.ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 20 కంటే ఎక్కువ రాష్ట్రాల అధిపతులను మరియు 100 మంది CEOలు మరియు వ్యవస్థాపకులతో సహా 500 కంటే ఎక్కువ ప్రపంచ AI నాయకులను ఒకచోట చేర్చింది.(చదవండి: ఆ తాతగారి లైఫ్స్టైల్కి ఫిదా అవ్వాల్సిందే..! జిమ్ లేదు, కనీసం..) -
ఆ తాతగారి లైఫ్స్టైల్కి ఫిదా అవ్వాల్సిందే..!
ఇటీవలకాలంలో అందరిలో ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. మంచి ఆహారపు అలవాట్లు,వర్కౌట్లతో హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు ప్రోటీన్ పౌడర్లు, జిమ్లు వంటి వాటితో ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ ఈ తాత అంతలా ఆరోగ్యం కోసం ఏమాత్రం ఖర్చు చేయకుండానే..చాలా చురుకుగా, దీర్ఘాయువుతో ఉండటం విశేషం. ఈ ఏజ్లో కూడా అన్ని పనులు తానే చాలా యాక్టివ్గా చేసుకుంటున్న తీరుకి ఫిదా అవ్వాల్సిందే. మరి అతడి ఆరోగ్య రహస్యం ఏంటో చూద్దామా..ఆ తాత గారి గురించి ఆయన మనవరాలు కంటెంట్ క్రియేటర్ 28 ఏళ్ల సింధూ ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో పోస్ట్ చేయడంతో అది నెట్టింట సంచలనంగా మారడమే కాదు, ప్రశంసలు వెల్లువెత్తాయి. తన తాతగారికి దగ్గర దగ్గర 95 ఏళ్ల ఉంటాయని, ఆయన రిటైర్డ్ అనస్థీషియాలజిస్ట్ అని వీడియోలో వివరిస్తోంది సింధు. ఆమె తన తాతగారి రోజు ఉదయం 5.30 గంటలకు యోగాతో ప్రారంభమవుతుందని, పదవీవిరమణ చేసి రెండు దశాబ్దాలకు పైనే అవుతున్నా..ల్యాప్టాప్లో వైద్య సాహిత్యం గురించి చదవడం, కొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి వాటితో కాలక్షేపం చేస్తారు. వీటి అన్నింటి తోపాటు అప్పుడప్పుడు షాపింగ్ ట్రిప్పులు, రోజువారీ పూజ, ధ్యానం, యాప్లు లేకుండా సాధన చేయడం తదితరాలు ఉన్నాయి. ఇవేగాక తన వంటను తానే చేసుకుంటారని, "మినీ ఇడ్లీలు" వండటంలో మంచి నిపుణుడని చమత్కరిస్తోంది. ఆయన రిటైర్ అయ్యాక కూడా వైద్యవృత్తిపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ వాటికి సంబంధించినవి చదవడం, ఆర్టికల్స్ రాయడం వంటివి చేస్తుంటారని చెబుతోంది. ఆయన తమిళనాడులోని మధురైలో చాలా ఏళ్లుగా అనస్థీషియాలజిస్ట్గా పనిచేసినట్లు పేర్కొంది. తన తాతగారి రోజువారీ దినచర్య దీర్ఘకాల ఆరోగ్యానికి ఖరీదైన ధోరణులతో పనిలేదని నిరూపించింది. ఇప్పటికీ ఆయన హ్యాపీగా వాక్ చేస్తారు, వంటకూడా చేసుకుంటారు, కొత్తకొత్త నైపుణ్యాలను నేర్చుకుంటుంటారు. పైగా ఆయన ఎలాంటి జిమ్ సభ్యుత్వం లేకుండా, కనీసం సప్లిమెంట్లపై ఆధారపడకుండా.. జస్ట్ శ్రద్ధ అనే రెండు అక్షరాల పదంపై ఫోకస్ పెట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడని సింధు చెపుకొచ్చింది. దక్షిణాసియా హిందూ సంప్రదాయల్లో వందల ఏళ్ల నుంచి రోజువారీ కదలికలు, భావోద్వేగాలపై నియంత్రణ, మానసిక స్పష్టత తదితరాలు ఉన్నాయి. అయితే వాటిని కంటిన్యూ చేసేలా జీవన విధానంలో భాగమైతే తన తాతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవితాన్ని గడపొచ్చని అంటోంది. చిన్న చిన్న వాటిల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునే మనస్తత్వం ఉన్నవారికి ఎదురే ఉండదని, అది వారికి బలోపేతంగా ఉండేలా సామర్థ్యాన్ని అందిస్తుందని అంటోంది. View this post on Instagram A post shared by Sindhu 👩🏽🍳 (@sindhusfoodforthought) (చదవండి: అంబానీల ఆడపడుచు కోడలు.. లెహంగా ధర తెలిస్తే షాక్!) -
'పర్సనాలిటీ'కి పునాది ఎక్కడ పడుతుందంటే..!
మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు.. "అచ్చం వాళ్ళ నాన్న లాగే కోపం", "వాళ్ళ అమ్మ లాగే తెలివైనది" అని అంటుంటాం. మరికొన్ని సార్లు, "వాళ్ళ ఇంట్లో అందరూ సాఫ్ట్.. ఈయన ఒక్కడే ఇంత మొండివాడు ఏంటి?" అని ఆశ్చర్యపోతుంటాం.అసలు ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా తయారవుతుంది? అది మనం పుట్టుకతో తెచ్చుకున్నదా? లేక పెరిగిన వాతావరణం నేర్పినదా?సైకాలజీలో దీనినే Nature vs Nurture (ప్రకృతి vs పెంపకం) అంటారు. డెవలప్మెంటల్ సైకాలజీ ప్రకారం, వ్యక్తిత్వం అనేది కేవలం ఒక రోజులో వచ్చేది కాదు. ఇది గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుండి మొదలై, మన ఎదుగుదల క్రమంలో రూపుదిద్దుకుంటుంది.1. అనువంశికత (Heredity): మీ పర్సనాలిటీ బ్లూప్రింట్మనం పుట్టినప్పుడే కొన్ని లక్షణాలను మన DNAలో మోసుకొస్తాం. మీ తల్లిదండ్రుల నుండి మీకు కేవలం కళ్ళ రంగు, ఎత్తు మాత్రమే కాదు.. మీ మెదడు పనితీరు, మీ ఎమోషనల్ టెంపరమెంట్ కూడా వస్తాయి.Temperament: కొందరు పిల్లలు పుట్టగానే చాలా ప్రశాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఇది వారి DNA లోనే ఉంటుంది. దీనినే 'బయోలాజికల్ ఫౌండేషన్' అంటారు.Intelligence: తెలివితేటలకు సంబంధించిన ప్రాథమిక సామర్థ్యం అనువంశికంగానే వస్తుంది. అయితే దాన్ని ఎలా వాడుకుంటాం అనేది తర్వాత మనం చేసే కృషిపై ఆధారపడి ఉంటుంది.Nervous System: మీ నాడీ వ్యవస్థ ఒత్తిడికి ఎలా స్పందిస్తుంది అనేది కూడా మీ జీన్స్లోనే ఉంటుంది. అందుకే కొందరు చిన్న శబ్దానికే ఉలిక్కిపడతారు, కొందరు ఎంత గొడవలో ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు.2. పరిసరాలు (Environment): శిల్పి చేతిలో ఉలిDNA మీకు ఒక పునాదిని ఇస్తే, మీ చుట్టూ ఉన్న పరిసరాలు ఆ పునాదిపై భవనాన్ని నిర్మిస్తాయి. పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వరకు ఉండే వాతావరణం అత్యంత కీలకం.Early Experiences: చిన్నప్పుడు మీకు లభించిన ప్రేమ, రక్షణ లేదా ఎదురైన అవమానాలు మీ 'సెల్ఫ్-కాన్సెప్ట్'ను డిజైన్ చేస్తాయి. ఒక బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి వెంటనే దగ్గరకు తీసుకుంటే, ఆ బిడ్డలో "ప్రపంచం సురక్షితమైనది" అనే నమ్మకం కలుగుతుంది. అదే నిర్లక్ష్యం చేస్తే, "నేను ఎవరికీ అక్కర్లేదు" అనే అభద్రతాభావం (Insecurity) మొదలవుతుంది.కుటుంబ నిర్మాణం: ఇంట్లో మీరు పెద్దవారా? చిన్నవారా? మీ తల్లిదండ్రుల మధ్య సంబంధం ఎలా ఉంది? ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని మలుస్తాయి.సాంస్కృతిక ప్రభావం: మన తెలుగు సంస్కృతిలో పెరిగిన వ్యక్తికి, పాశ్చాత్య దేశాల్లో పెరిగిన వ్యక్తికి విలువలు, ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది.3. మోటివేషనల్ స్పీకర్లు ఇక్కడ ఎందుకు విఫలమవుతారు?సో-కాల్డ్ మోటివేషనల్ స్పీకర్లు ఏం చెప్తారంటే.. "నీ గతం నీకు అనవసరం. నువ్వు ఈ క్షణం నుంచి మారిపోవచ్చు." ఇది వినడానికి బాగుంటుంది కానీ, సైంటిఫిక్ గా అసాధ్యం.ఎందుకంటే మీ మెదడులో పడ్డ ముద్రలు (Neural Pathways) చాలా బలంగా ఉంటాయి. మీ DNA మరియు మీ చిన్ననాటి చేదు అనుభవాలను (Trauma) పట్టించుకోకుండా, పైన "పాజిటివ్ థింకింగ్" అనే పెయింట్ వేస్తే.. లోపల ఉన్న తుప్పు పోదు.ఉదాహరణకు ఒక వ్యక్తికి చిన్నప్పుడు వాళ్ళ నాన్న అథారిటేటివ్గా ఉండి, ఎప్పుడూ భయపెడుతూ పెంచారనుకుందాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఆఫీసులో బాస్ దగ్గర మాట్లాడాలన్నా భయపడతాడు. ఒక మోటివేషనల్ ట్రైనర్ వచ్చి "ధైర్యంగా ఉండు" అని చెప్తే సరిపోదు. అక్కడ సమస్య బాస్ కాదు.. ఆ వ్యక్తి సబ్-కాన్షియస్ మైండ్లో ఉన్న 'తండ్రి' అనే అథారిటీ ఫిగర్ పట్ల ఉన్న భయం. ఆ 'DNA/Past'ను అడ్రెస్ చేయకుండా పర్సనాలిటీ మారదు.4. అసలైన వ్యక్తిత్వ వికాసంనా Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ DNA మరియు పర్యావరణ ప్రభావాలను మనం ఎలా డీల్ చేయాలి?Step 1: Break (గుర్తించడం, విడగొట్టడం)మీ వ్యక్తిత్వానికి పునాది ఎక్కడ పడిందో తెలుసుకోవడమే మొదటి మెట్టు. "నాకు ఎందుకు కోపం వస్తుంది? ఇది నా DNA లో ఉందా? లేక చిన్నప్పుడు నేను చూసిన మా నాన్న ప్రవర్తనా?" అని విశ్లేషించాలి. మీ గతాన్ని మీరు తవ్వాలి. ఆ పాత ముద్రలను, భయాలను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయాలి.Step 2: Build (సరైన నిర్మాణాన్ని నిర్మించడం)DNA ని మనం మార్చలేం కానీ, అది ఎలా ఎక్స్ప్రెస్ అవ్వాలి అనేదాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు (దీన్ని సైన్స్లో Epigenetics అంటారు).మీకు కోపం వచ్చే స్వభావం DNA లో ఉన్నా.. మెడిటేషన్ ద్వారా, మైండ్ఫుల్నెస్ ద్వారా దాన్ని నియంత్రించడం నేర్చుకోవచ్చు.పాత వాతావరణం మీకు నెగటివిటీని ఇచ్చి ఉంటే, ఇప్పుడు మీరు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసుకోవాలి.Step 3: Beyond (పరిమితులకు అతీతంగా)మీరు కేవలం మీ జీన్స్ కి లేదా మీ గతానికి బానిసలు కాదు. మీ 'DNA ఆఫ్ పర్సనాలిటీ'ని అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని మీ అభివృద్ధికి ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. ఒక బలహీనతను బలంతో ఎలా రీప్లేస్ చేయాలో తెలిసినప్పుడే మీరు ఒక 'జీనియస్' గా ఎదుగుతారు.5. ప్రాక్టీస్ కోసం ఒక చిన్న ఎక్సర్సైజ్మీ వ్యక్తిత్వానికి పునాది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈ మూడు ప్రశ్నలు వేసుకోండి.Heredity: నా అలవాట్లలో మా అమ్మ/నాన్న పోలికలు ఏమున్నాయి? (కోపం, ఆందోళన, తెలివితేటలు, మొండితనం?)Environment: నా చిన్నతనంలో నన్ను ఎక్కువగా బాధించిన లేదా ప్రభావితం చేసిన సంఘటన ఏది? అది ఇప్పటికీ నా నిర్ణయాలను ప్రభావితం చేస్తోందా?Realization: నేను ఇప్పటివరకు అనుకుంటున్న 'నేను' నిజమైన నేనేనా? లేక నా చుట్టూ ఉన్న పరిస్థితులు సృష్టించిన ప్రతిబింబమా?మన DNA మనకు ఒక Map ఇస్తుంది. కానీ ఎటు ప్రయాణం చేయాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మీ వ్యక్తిత్వానికి పునాది ఎక్కడ పడిందో తెలుసుకోవడం అంటే.. మిమ్మల్ని మీరు నిందించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు విముక్తి (Liberate) చేసుకోవడం.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
ఇచట కలలు అమ్మబడును!
‘నాకొక కల వచ్చింది తెలుసా!’ అని చెబితే... ‘బ్రహ్మాండంగా ఉంది. ప్లీజ్...ఆ కలను నాకు అమ్ముతావా’ అని అవతలి వ్యక్తి అడిగితే నవ్వుకుంటాం. ఇప్పుడు నవ్వులాటగా అనిపించినా ఒకప్పుడు ఇలాంటి సంభాషణలు సహజంగా జరిగేవి. వన్స్ అపాన్ ఏ టైమ్ కొరియాలో కలల క్రయ, విక్రయాలు జోరుగా సాగేవి. అలనాటి అరుదైన సంప్రదాయానికి తిరిగి ప్రాణం పోస్తోంది కొరియన్ ఆర్టిస్ట్ లొంగ్సు పార్క్...ఆరవ శతాబ్దంలో కొరియాలో కలల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగేవి! కలలలో తమకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే శకునాలు ఉంటాయని ఒకప్పుడు కొరియాలో బలంగా నమ్మేవాళ్లు. కల గురించి విన్న వ్యక్తి ఆ కల తనకు ప్రయోజనకరంగా ఉంది అని భావిస్తే, తనకు విక్రయించాల్సిందిగా కలలు కన్న వ్యక్తిని అడగవచ్చు. అమ్మడానికి ఆ వ్యక్తి ఓకే అంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేదా విలువైన వస్తువు ఏదైనా ఇవ్వవచ్చు.ఎస్... ఆధారాలు ఉన్నాయి!‘అకాడమీ ఆఫ్ కొరియన్ స్టడీస్ ఆర్కైవ్స్’లో కలల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు 1900 సంవత్సరంలో తనకు వచ్చిన కలలో డ్రాగన్, పులి కనిపించిన ఒక వ్యక్తి తన కలను అమ్ముకున్నాడు.అత్యవసరంగా డబ్బు అవసరం ఉండడం వల్లే తన కలను విక్రయించినట్లు ఒప్పంద పత్రంలో ఉంది. కొన్నిసార్లు కలలు అమ్మడానికి ఆ కలల యజమానులు అంగీకరించకపోవచ్చు. తమ కలలు రహస్యంగానే ఉండిపోవాలని అనుకోవచ్చు. తమ కలలను ఇతరులతో పంచుకుంటే వాటి శక్తి తగ్గిపోతుందనుకోవడమే దీనికి కారణం.గతం నుంచి వర్తమానంలోకి...పన్నెండవ శతాబ్దానికి చెందిన కొరియన్ అధికారిక చరిత్ర ‘ది హిస్టరీ ఆఫ్ త్రీ కింగ్డమ్స్’లో కలల అమ్మకాలకు సంబంధించిన పురాతన కథలు ఉన్నాయి. అలనాటి ఆ పాత సంప్రదాయాన్ని వర్తమానంలోకి తీసుకువచ్చింది లండన్కు చెందిన కొరియన్ ఆర్టిస్ట్ లొంగ్సు పార్క్.అలా మొదలైంది...కొన్ని సంవత్సరాల క్రితం లండన్లోని ఒక కేఫ్లో తన స్నేహితురాలిని కలిసినప్పుడు మాటల మధ్యలో రాత్రి తనకు కలలో టొమాటో సైజ్ బ్లూ బెర్రీ కనిపించిందని చెప్పింది పార్క్.‘ఎంత మంచి కల! నాకు అమ్మేసెయ్’ అని ప్రతిపాదించింది ఆ స్నేహితురాలు. పార్క్ స్నేహితురాలు గర్భవతి. గర్బంతో ఉన్న వారికి బ్లూ బెర్రీ కలలో కనిపిస్తే... పండంటి బిడ్డ పుడతాడని కొరియాలో నమ్మకం!తన కలను అమ్మేసింది పార్క్. హోటల్ బిల్ను పార్క్ స్నేహితురాలే చెల్లించడంతో డీల్ పూర్తయింది! ‘ఇష్ట పూర్వకంగా ఉంటేనే కలల లావాదేవీలు పనిచేస్తాయి’ అని చెబుతోంది పార్క్. కొన్ని నెలల తరువాత... పండంటి బిడ్డను కన్నట్లు స్నేహితురాలి నుంచి మెసేజ్ వచ్చింది.దీంతో కొరియన్ సంప్రదాయాలలోని కలల గురించి పార్క్కు ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తే కలల వెబ్సైట్కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. డ్రీమ్ అడ్వర్టైజింగ్మెలకువతో ఉన్నప్పుడే కాదు నిద్రలో ఉన్నప్పుడు కూడా కస్టమర్లకు చేరువకావడానికి రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నాయి కొన్ని పెద్ద కంపెనీలు. ‘వద్దు బాబోయ్’ అనుకున్నా ఆ కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు కలలలోకి వస్తాయన్న మాట! తరుచుగా వినిపించే, కనిపించే ఆడియో, వీడియో క్లిప్ల ద్వారా వినియోగదారుల సబ్కాన్షియస్లోకి వెళుతున్నాయి బడాకంపెనీల ప్రకటనలు. ఈ కాన్సెప్ట్ను ‘డ్రీమ్ అడ్వర్టైజింగ్’ అంటున్నారు. ‘డ్రీమ్ అడ్వర్టైజ్మెంట్స్ రాబోయే కాలంలో పీడకలగా మారనున్నాయి’ అని హెచ్చరిస్తున్నారు స్లీప్ ఎక్స్పర్ట్లు. అమెరికన్ యువతలో 48 శాతం మందికి ప్రసిద్ధ బ్రాండ్లకు సంబంధించిన అడ్వర్టైజింగ్ కలలు తరచుగా వస్తున్నట్లు ఒక నివేదిక తెలియజేసింది. కోకా–కోలా, యాపిల్, మెక్డోనాల్డ్లాంటి ప్రసిద్ధ బ్రాండ్లకు సంబంధించిన కలలు వస్తుంటాయట. యాదృచ్ఛికంగా ఈ బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్ పదే పదే చూడాల్సి రావడం, మెమోరీ రీయాక్టివేషన్ వల్లే ఇలాంటి కలలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.కలలు వేలం వేస్తారు!కలల వేలానికి సంబంధించి లొంగ్సు పార్క్ ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. తమకు వచ్చిన కలల గురించి ఈ వెబ్సైట్ ద్వారా ఇతరులతో పంచుకోవచ్చునని తెలియజేసింది. ‘మేము కొనుగోలు చేసిన కల నిజమా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి. దానికి ఆధారం ఏమిటి’ ఈ ప్రశ్నను చాలామంది పార్క్ను అడుగుతుంటారు. ‘ఆరోజు నుంచి ఈరోజు వరకు కలలను నిరూపించుకునే ఆధారలేవీ లేవు. అది అసాధ్యం కూడా. ఒకరిపై ఒకరికి విశ్వాసమే ప్రధానం. నిజాయితీ మాత్రమే ప్రధానం’ అని చెబుతుంది పార్క్. వెబ్సైట్లో కొన్ని కీలక పదాలు నమోదు చేస్తారు. ఉదాహరణకు ‘పాము’ అనే కీవర్డ్ కనిపించింది అనుకుందాం. అది పాము కలకు సంబంధించిన వ్యక్తి గురించి సమాచారాన్ని అందిస్తుంది. పాములు కలలో కనిపిస్తే కొరియన్ సంప్రదాయం ప్రకారం జీవితంలో, కెరీర్లో విజయం సాధించబోతున్నారని అర్థం. మంటల్లో ఇల్లు ఉన్నట్లు కల వస్తే కష్టాలు కాలిపోతున్నాయని అర్థం. చెడు శకునాలకు సంబంధించిన కలలు కూడా ఉన్నాయి. పండ్లు ఊడిపోయినట్లు కల వస్తే సన్నిహిత వ్యక్తిని కోల్పోతున్నారని అర్థం.ఆ కలే... అవతార్!‘కలలదేముంది? ఇలా వస్తాయి... అలా పోతాయి’ అని రాత్రి కలలను తేలికగా తీసుకోవడానికి లేదు. ఎన్నో కలలు ఎన్నో ఆవిష్కరణలకు కారణం అయ్యాయి. అద్భుతమైన ఆలోచనలు ఎన్నో తనకు కలల రూపంలోనే వచ్చాయని చె΄్పారు ప్రసిద్ధ శాస్త్రవేత్త నికోలా టెస్లా. తన ఆత్మకథ ‘మై ఇన్వెన్షన్స్’లో కలల ప్రస్తావన ఉంటుంది. చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ‘అవతార్’ గురించి పరిచయం అక్కర్లేదు. ‘అవతార్’ ఐడియా జేమ్స్ కామెరూన్కు ఎలా వచ్చింది అనేది ఆసక్తికర విషయం. కామెరూన్ యువకుడిగా ఉన్నప్పుడు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో అతడికి మరో లోకం కనిపించింది. బంగారంలా మెరుస్తున్న చెట్లు, అందమైన జీవులతో ఉన్న అద్భుత లోకం ఇది. ఆ కల కామెరూన్తో ఉండి చివరికి అవతార్లో పండోర ప్రపంచంగా రూపం దాల్చింది. ‘పందొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను కన్న కల అది’ అని ‘అవతార్’ గురించి చెబుతుంటారు కామెరూన్. -
అలాంటి పిల్లలను వదిలించుకోవాలని చూస్తే జైలు శిక్ష..
నాకు పెళ్లయి 15 సంవత్సరాలు. పెళ్లి అయిన తర్వాత నా భర్త నన్ను అమెరికాకు తీసుకువెళ్లారు. ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు. దురదృష్టవశాత్తూ ఇద్దరికీ తీవ్రమైన ఆటిజం.. అమెరికాలో ఉండగా కూడా నా భర్త పిల్లలను పట్టించుకోకపోగా కొట్టేవాడు. విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు పిల్లలను తమ రక్షణలోకి తీసుకుని నా భర్తపై చర్యలు కూడా తీసుకున్నారు. ఇదే క్రమంలో తను ఇండియా పారిపోయి వచ్చాడు. చాలా కష్టాలు పడి నేను కూడా వచ్చాను. తీవ్రమైన లెవెల్ 3 ఆటిజంతో ఉన్న పిల్లలను పెంచడం చాలా కష్టంతో – ఖర్చుతో కూడుకున్న పని. అతను వాళ్లని వదిలించుకోవడమే కాదు, మేమిద్దరం కలిసి కొనుక్కున్న ఆస్తికి ఈఎంఐలు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడు. నేను 24 గంటలు పిల్లల చుట్టే ఉండవలసిన పరిస్థితి కాబట్టి నేను పని కూడా చేయలేను. ఆటిజం బారిన పడిన పిల్లలకు మన దేశంలో సరైన చట్టాలు పెద్దగా లేవు – ప్రభుత్వ వసతులు కూడా లేవు అని అంటున్నారు. పరిష్కారం సూచించగలరు.– సుమతి, వరంగల్మీ బాధ వింటుంటే హృదయాన్ని కలచివేస్తుంది. మీరన్నది నిజమే! మన దేశంలో ఆటిజంపై పెద్దగా అవగాహన లేదు – బహుశా అందుకే ప్రభుత్వ వసతులు, పథకాలు కూడా పెద్దగా అందుబాటులో లేవు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కింద ఆటిజంను మానసిక/మేధోవైకల్యంగా పరిగణిస్తారు. ఈ చట్టం కింద ఎటువంటి వైకల్యం కల్గిన వ్యక్తినైనా వివక్షకు గురిచేస్తే కఠిన శిక్షలు ఉన్నాయి. అలాగే జాతీయ ట్రస్ట్ చట్టం 1999 అనేది ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, మానసిక వికలాంగత, బహుళ వైకల్యాలున్న వ్యక్తుల సంరక్షణ, చట్టపరమైన సంరక్షకులను నియమించడం, స్వతంత్ర జీవనానికి మద్దతు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన చట్టం/సంస్థ. అయినప్పటికీ ఆటిజం ఉన్నవారికి మిగతా వారిలా సరైన ఇన్సూరెన్స్ కూడా లేదు! అమెరికాలో ఉన్నట్టు పటిష్టమైన ప్రభుత్వ వసతులు, సంస్థలు లేనందున ఆర్థికంగా బలహీనమైన, మధ్యతరగతి తల్లిదండ్రులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు వీటిపై బలమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మీ విషయానికి వస్తే మీ భర్తపై ముందుగా క్రిమినల్ కేసులు పెట్టండి. మీ భర్త చేసినవి నేరాలు! బీ.ఎన్.ఎస్.లోని సెక్షన్ 93 (పూర్వం ఐ.పీ.సీ 317) ఇలా చెప్తుంది: ‘‘పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తండ్రి అయినా, తల్లి అయినా లేదా అలాంటి పిల్లల సంరక్షణ కలిగి ఉన్న ఎవరైనా, ఆ బిడ్డను పూర్తిగా విడిచిపెట్టాలనే ఉద్దేశ్యంతో – ఆ బిడ్డను వదిలించుకునే ఉద్దేశంతో బహిర్గతం చేసినా లేదా వదిలేసినా, ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.’’ అంతేకాదు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015, సెక్షన్ 75 ప్రకారం: పిల్లలను శారీరకంగా, మానసికంగా క్రూరత్వానికి గురి చేయడం లేదా నిర్లక్ష్యం చేయడంపై కఠిన చర్యలు ఉన్నాయి. పిల్లలపై బాధ్యత లేదా నియంత్రణ ఉన్న వ్యక్తి, వారి ఆరోగ్యం లేదా భద్రతకు హాని కలిగించేలా ప్రవర్తిస్తే 3 ఏళ్ల వరకు జైలుశిక్ష, లక్ష వరకు జరిమానా ఉంటుంది.కాబట్టి పై కేసులు పెట్టండి. పోలీసులకి గానీ, శిశు సంక్షేమ శాఖవారి ద్వారా కానీ పిర్యాదు చేయవచ్చు. అదనంగా మీ పిల్లల కోసం – మీకోసం కూడా మెయింటెనెన్స్ కోరుతూ కేసు వేయండి. డీ.వీ.సీ. చట్టం కింద భారీ పరిహారం, గృహ వసతి కూడా కోరవచ్చు. మీకు త్వరగా ఉపశమనం కావాలి అనుకుంటే అదనంగా హై కోర్టును ఆశ్రయించి త్వరితగతిన కేసులు తేల్చవలసిందిగా దరఖాస్తు చేసుకోవచ్చు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. (చదవండి: కిరణ్ రావుకు చికున్గున్యా నిర్థారణ..! ఏకంగా కీళ్ల ఆరోగ్యాన్ని..) -
కిరణ్ రావుకు చికున్గున్యా నిర్థారణ..! ఏకంగా కీళ్ల ఆరోగ్యాన్ని..
బాలీవుడ్ చిత్ర నిర్మాత కిరణ్ రావు ఇటీవల సోషల్ మీడియా పోస్ట్లో తనకు చికున్గున్యా వచ్చినట్లు తెలిపారు. దాని కారణంగా కనీసం పుస్తకం కూడా పట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఆ వ్యాధి తన కీళ్లను ఎంతలా బలహీనపరిచిందో వివరించారామె. అసలు ఈ వ్యాధి అంతలా కీళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా అంటే..ఆల్ఫావైరస్ అనే దోమ జాతి కారణంగా RNA వైరస్ అయిన చికున్గున్యా మానవ శరీరం లక్ష్యంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో జ్వరం తగ్గుతుందేమో కానీ..దాని తాలుకా ఇబ్బందులు శరీరంలో స్పష్టంగా కనిపిస్తాయి, ఎదుర్కొంటాం కూడా అంటున్నారు నిపుణులు. అసలు 'చికున్గున్యా' అంటేనే వంగి ఉండే భంగిమ అని అర్థం. అంటే మన కీళ్లను, కండరాలపై ప్రభావం చూపి..కదపలేని పరిస్థితికి తీసుకువస్తాయి.కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే..ఏడిస్ ఈజిప్టి లేదా ఏడిస్ ఆల్బోపిక్టస్ వంటి జాతి దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందట. ఆ దోమకాటు కారణంగా ఈ చికున్గున్యా వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించి కీళ్లలోని బంధన కణజాలం సైనోవియల్ ఫైబ్రోబ్లాస్ట్లకు వ్యాపిస్తుంది. దాంతో మనకు శరీరమంతా విపరీతమైన నొప్పులు..నడవాలన్న వణుకు పుట్టడం వంటి సమస్యలు వస్తాయట. ఇది మన రోగ నిరోధక వ్యవస్థపై త్రీవంగా దాడి చేస్తుందట. ఫలితంగా శరీరంలో పలుచోట్ల వాపులు కూడా వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఈ వైరస్ చాలా దూకుడుగా ఉంటుందని, ఒక్కోసారి దీర్ఘకాలిక కీళ్ల వ్యాధిని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. కొందరిలో రుమటాయడ్ ఆర్థరైటిస్ బారిన పడేలా చేస్తుందట. అంతేగాదు కొంతమందికి కోలుకున్నాక కూడా పూర్తిస్థాయిలో కదలికలను తిరిగి పొందలేరట. అలాంటి వారికి ఫిజియోథెరపీ అవసరం ఏర్పడుతుందని చెబుతున్నారు. నిరంతర కీళ్లనొప్పి ఈ వ్యాధి ముఖ్య లక్షణంగా చెబుతున్నారు నిపుణులు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..చుట్టుపక్కల నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. అంటే పూలకుండీలు, ఇంటి బయట ఉండే కంటైనర్లు లేదా డ్రమ్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవాలనిపగటి పూట కుట్టే దోమల వల్ల వస్తుంది కాబట్టి..పొడవాటి చేతులు ఉన్న బట్టలు ధరించాలి. దోమల కుట్టకుండా లోషన్లు వంటివి రాసుకోవడం చేయాలి. అవసరమైతే దోమతెరలు తదితరాలను వాడటంఅలాగే ఇంట్లో ఎవ్వరికైనా చికున్గున్యా వస్తే..తక్షణమే దోమల రాకుండా తగిన చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి.చివరగా ఈవ్యాధి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఓపికతో తగిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. దీనికి నిర్ధిష్ట నివారిణి గానీ, టీకా వంటివి లేవని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. త్వరితగతిన కోలుకోవాలంటే మాత్రం..జ్వరం తగ్గేలా మందులు తీసుకుంటూ..వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాలు పుష్కలంగా తీసుకోవాలి. అలాగే కీళ్లు మరి బిగిసుపోకుండా ఉండేలా సాగదీయడం, ఫిజియోథెరపీ వంటివి తీసుకోవడం వంటివి చేయాని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఎవరీ సరితా యోల్మా..? 146 ఏళ్లకు..) -
రంజాన్.... ఆరోగ్యం రీసెట్కు అద్భుత అవకాశం!
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ వచ్చేసింది. రోజంతా పచ్చినీళ్లు కూడా ముట్టకుండా నెల రోజులపాటు ఉపవాసం! మన జీర్ణ వ్యవస్థకు సుదీర్ఘమైన విశ్రాంతినిచ్చి...పునరుజ్జీవం కల్పించేందుకు అద్భుత అవకాశమిది. కానీ...ముస్లిం సోదరులు ఉపవాస దీక్షకు ముందు.. ఇలా ఆహారం తీసుకుంటే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసకుందామా..!.సమోసాలు, పకోడి, లస్సీ, చక్కెర దట్టించిన మసాలా టీ, బిర్యానీ, రోటీ, పరాటా.. హలీమ్ వంటివి రంజాన్ సమయంలో బాగా పాప్యులర్ అవుతూంటాయి. పండ్లు, ఖర్జురాలు తినేవాళ్లు ఉంటారు కానీ చాలామంది బిర్యానీల వంటివాటికి అదనంగా వీటిని స్వీకరిస్తూంటారు. ఫలితంగా రోజంతా ఉండే ఉపవాసంతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కాస్తా దెబ్బతింటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏడాది మొత్తమ్మీద పేరుకుపోయిన మలినాలను శరీరం పగలు మొత్తం శుభ్రం చేసుకుంటే... రాత్రికాగానే మళ్లీ అవే అనారోగ్య కారకాలను లోపలికి పంపిస్తున్నామన్నట. వీటన్నింటినీ జీర్ణం చేసేందుకు కాలేయం కాస్తా కష్టపడాలి. ఫలితంగా నిద్ర చెడిపోతుంది. నెలరోజులపాటు సాగే ఈ తంతు కారణంగా మలినాలను మొత్తం వదిలించుకునే బదులు కాలేయం మరింత ఎక్కువ శ్రమ పడుతుంది. రక్తంలో చక్కెర మోతాదులు తరచూ మారిపోతూండటం వల్ల నాడీ వ్యవస్థపై ఒత్తిడికి గురవుతుంది. ఉపవాసం పుణ్యమా అని పొట్ట తేలిక అయ్యే బదులు వేయించిన తిండి, చక్కెరలతో నిండిపోతూంటుంది.ఇలా చేస్తే మేలు...ఇఫ్తార్...ఖర్జూరం, నీళ్లళ్లతో మీ దీక్ష విరమణ చేపట్టండి. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు ఖర్చూరాల్లో మెండు. డీహైడ్రైషన్ నుంచి కాపాడతాయి. వీటితోపాటు వేడి వేడి సూప్, ప్రొటీన్ కోసం కొంచెం మాంసం/చేప/కోడిగుడ్లు తీసుకోవడం మేలు. అలాగే.. ఉడికించిన కాయగూరలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కొంత మోతాదులో తినడం శరీరంలో మంట/వాపులను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మేలు చేస్తుంది. అవకాడో, ఆలివ్ ఆయిల్, బాదాం. జీడిపప్పు, వాల్నట్స్ వంటివి లేదంటే, గుమ్మడి/సూర్యకాంతి, అవిశ గింజల వంటి వాటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, ప్రొటీన్, ఫైబర్లు లభిస్తాయి.షుహూర్ (తెల్లవారుఝాము)ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులకు ప్రాధాన్యమివ్వండి. రోజంతా శక్తిని అందించేందుకు సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు తీసుకోవడం మేలు. బ్రౌన్ రైస్, ఓట్స్, చిరుధాన్యాలు, చిలగడదుంపలు, క్యారెట్స్లు మాత్రమే కాదు... ఆపిల్స్, ఆరటిపండ్లు, నారింజ వంటి పండ్లు మేలు. చిటికెడు ఉప్పు కలుపుకుని నీళ్లు తాగాలి. ఉప్పు ఎక్కువగా ఉన్న, బాగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం వల్ల దాహం ఎక్కువ అవుతుంది.రెండింటి మధ్య...నిద్రకు ప్రాధాన్యమివ్వండి. రాత్రి ఎక్కువ సేపు మేలుకుని ఉండటం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగిపోయి మంట/వాపులు పెచ్చరిల్లుతాయి. ఇఫ్తార్ విందు తరువాత కాసేపు అటు ఇటు కదలడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అద్భుతమైన అవకాశం...రంజాన్ మాసం... దైవిక సేవతోపాటు మీకు మీరు సేవ చేసుకునేందుకు ఉపయోగించుకునే అద్భుత అవకాశం. అయితే ఉపవాసం ఒక్కటే సరిపోదు. శరీర హీలింగ్కు అవసరమైన పరిస్థితులను కల్పిస్తుంది అంతే. ఇక్కడ ఉపవాసాన్ని మీరెలా చేస్తున్నారనే దానిపై శరీరానికి కలిగే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ముస్లిం సోదరులు ఏటా ఒక నెల రోజులపాటు పైన చెప్పుకున్న ఆహార నియమాలను పాటిస్తే.. మిగిలిన 11 నెలలూ శరీరం మెరుగ్గా పనిచేస్తుంది. ముస్లిం సోదరులు ఒక్కరే కాదు... మిగిలిన వారు కూడా అప్పుడప్పుడు కొంత కాలం పాటు ఉపవాసం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. - మైక్ ఎన్డీగ్వా, నేచురల్ హెల్త్ గైడ్ -
లే ఆఫ్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ
ఇటీవల కాలంలో లేఆఫ్స్ కామన్గా మారాయి. ఇంతకుమునుపు కేవలం ఐటీ రంగానికే పరిమితమవ్వగా, ఇప్పుడు అన్నిరంగాలకు ఇది పాకింది. దీని ప్రభావంతో ఉద్యోగుల్లో అభద్రతా, ఏ క్షణం ఏం జరుగుతోందన్న ఒత్తిడి ఎక్కువయ్యాయి. తమ సహోద్యోగులు ఉద్యోగాలు పోయాయంటేనే..మనకేం జరుగుతోందో అనే ఆందోళన. ఇది ఉద్యోగం సంపాదించడాని కంటే భయంకరమైన టెన్షన్. సింపుల్గా చెప్పాలంటే 40 ఏళ్లు వస్తే ఆ ఉద్యోగి జాబ్ ఉంటుందా లేదా అన్నంత గుబులు మదిలో మెదులుతోంది. అలాగని టెన్షన్తో బతకలేం కదా..మరి ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేసి..మళ్లీ మన ట్రాక్లోకి రావాలో ఈ మాజీ అమెజాన్ ఉద్యోగి మాటల్లో తెలుసుకుందామా..!.అతడే 47 ఏళ్ల మాజీ టెక్ ప్రొఫెషనల్ హేమంత్ విర్మానీ. ఈ భారత సంతతి వ్యక్తి తన అనుభవాన్ని వివరిస్తూ..లేఆఫ్ని ధైర్యంగా ఫేస్ చేయక తప్పదని అంటున్నాడు. తన గురించి వివరిస్తూ ఇలా చెప్పుకొచ్చారు హేమంత్. "నేను యూఎస్లోని అమెజాన్లో సుమారు పదకొండున్నరేళ్లుగా సీనియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేశాను. సరిగ్గా 2023 నుంచి మా కంపెనీలో తొలగింపులు చేపట్టడం చూశాను. నా బృందంలోని సభ్యులను తొలగించడం చాలా దగ్గరగా చూశాను. అది ఎంత కష్టంగా ఉంటుందో కూడా తెలుసు. ఏదో ఒక రోజు ఆ పరిస్థితి నాకు వస్తుందని అప్పుడు తెలియలేదు. సరిగ్గా అక్టోబర్ 2025 అర్థరాత్రి నన్ను తొలగిస్తున్నట్లు మెయిల్ వచ్చాక గానీ తెలిసిరాలేదు. ఆ క్షణం ఒక్కసారిగా షాక్కి గురయ్యా..!. కళ్లముందే పరిస్థితి తలకిందులైనట్లుగా అనిపించింది. ఏం చేయాలో పాలుపోలేదు. చాలా రోజుల వరకు ఉద్యోగం పోగొట్టుకున్నా అనే బాధలోనే ఉండిపోయా. అయితే ఆ రోజు నా ఉద్యోగం పోయిన వెంటనే నా మేజనర్తో దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడాను. ఆయన నాతో చాలా సానుకూలంగా, మానవీయంగా మాట్లాడారు, పైగా నా స్కిల్స్ని అభినందించారు కూడా. అంతేగాదు ఆ తదుపరి మరసటి రోజు ధైర్యంగా ఉన్నానా? లేదా? అని నా పాత మేనేజర్ కాఫీషాప్ వద్దకు వచ్చి కలుస్తుండేవాడు. తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిన లేఆఫ్ అని నచ్చచెప్పే ప్రయత్నం చేసేవాడు. కానీ వాళ్లంతా సానుకూలంగా వ్యవహరిస్తున్నా..నా(హేమంత్) పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతున్నట్లుగా..నిరాశ నిస్ప్రుహలకు లోనయ్యేవాడిని. ఈ పరిస్థితిలో నా కూతురు ఎలా ఉంటుందా అని గమనించగా..నా చిట్టితల్లే నాకు గొప్ప పాఠం నేర్పిందని చెబుతున్నాడు హేమంత్. పరిస్థితులు మారినప్పుడూ వాటిని అంగీకరిస్తూ..ఆమె తన ఖర్చులను సర్దుబాటు చేసుకున్న తీరు..ఎప్పటికీ ఇలానే ఉండపోమన్న ఆమె నమ్మకం..మళ్లీ నన్ను భుజం తట్టి నిలబడేలా చేశాయి. అప్పుడే తెలిసింది..లేఆఫ్తో..అప్పటి వరకు నేను వదిలేసిన ప్రతి పనులను తిరిగి చేయడం మొదలుపెట్టా. ముఖ్యంగా నా కూతురు ప్రాజెక్ట్ వర్క్స్లో హెల్ప్ చేయడం దగ్గర నుంచి ఆరోగ్యంపై కేర్ తీసుకోవడం వరకు అన్నిటిపై ఫోకస్ పెట్టా. అలాగే ఇక తదుపరి నేనేం చేయాలనే దిశగా అడుగులు వేస్తూ.. ఏఐ స్కిల్స్పై దృష్టిసారించాను. అలాగే మళ్లీ పుంజుకోవడానికి మార్గాలేంటో అన్వేషించడం ప్రారంభించా. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చేసినప్పుడూ..అలా ఉండిపోకూడదు..మరింత బలంగా పైకి ఎగరడం ఎలాగో ఆలోచించడం నేర్చుకున్నా. అంతేగాదు ఆ లేఆఫ్ని మన అభ్యున్నతికి వరంగా మార్చుకోవాలని తెలుసుకున్నా" అంటూ..తన అనుభవాన్ని అత్యద్భుతంగా వివరించాడు హేమంత్. అతని పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..గొప్ప స్ఫూర్తిని నింపావు బాస్ అని పోస్ట్లు వెల్లువెత్తాయి.(చదవండి: టీనేజ్ వయసులో చదువుకి డుమ్మా..! కట్చేస్తే..) -
టీనేజ్ వయసులో చదువుకి డుమ్మా..! కట్చేస్తే..
చదవుకునే వయసులో..చదువు అంతగా నచ్చదు, బుర్రకు ఎక్కదు కూడా. టీనేజ్ వయసులో ఎడ్యుకేషన్ అనేది అత్యంత కీలకమైన టర్నింగ్ పాయింట్. పైగా ఆ టైంలో బాగా చదువుకుంటూనే త్వరగా సెటిల్ అవ్వగలం. కానీ ఆ ఏజ్లో చదువుకి డుమ్మా చెప్పేసింది. కొన్నాళ్లుకు గానీ జ్ఞానోదయం కాలేదు..తానెంత పెద్ద తప్పు చేసింది. దాంతో మళ్లీ పుస్తకాలు కుస్తీ పట్టీ చదవడమే కాదు..పీహెచ్డీ అందుకుంది ప్రోఫెసర్గా ఉద్యోగాన్ని కూడా పొందిందామె. ఆమె కథ చదువంటే భయపడే యువతకు స్ఫూర్తి, కనువిప్పు కూడా..!.ఏ వ్యక్తికైనా చదువే మంచి గుర్తింపుని అందిస్తుంది. కానీ ఆ చదవుకే మధ్యలోనే స్వస్తి చెప్పింది జర్మన్కి చెందిన అన్నా షూత్. 17 ఏళ్ల టీనేజ్ వయసులో ఈ చదువులు నా వల్ల కాదంటూ కాలేజ్కి డుమ్మా కొట్టేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన తోటి స్నేహితులు కెరీర్లో తనకంటే ముందుకు సాగిపోవడం ఉండటం చూసి బాధకలగడం మొదలైంది అన్నాకి. ఏదైనా తప్పు చేశానా..ఇది సరైనాదేనా..అనే సందేహాలతో కొన్నాళ్లు గడిపేసింది. ఇంక లాభం లేదు..తాను మళ్లీ చదివి గుర్తింపు తెచ్చుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యి..20ల టైంలో మళ్లీ కాలేజ్ పుస్తకాలు చదవడం ప్రారంభించింది. క్లాస్రూమ్లో అందరికంటే పెద్దగా.. సవాళ్లు ఎదురైనా..అన్నింటిని పక్కన పెట్టి మరి మనసుపెట్టి చదివింది. అలా ఆమె 35 ఏళ్లకు పీహెచ్డీ సంపాదించింది. 42 ఏళ్ల వయసులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగాన్ని పొందిందామె. అయితే మళ్లీ చదువుని ప్రారంభిస్తున్నప్పుడు.." ఇదివరకటిలా చదవగలనా..సైన్స్లో సీటు సంపాదించడం కుదురుతుందా అని సందేహాలు వచ్చేశాయి. గానీ..చదవడం ప్రారంచాక..ఎలాగైనా..అనుకున్నది సాధించొచ్చనే అనే నమ్మకం డెవలప్ అయ్యి..నా లక్ష్యాన్ని చేరుకోలిగానంటోంది". అన్నా. ఈ రోజు, షూత్ హెల్త్, మెడిసిన్ అండ్ లైఫ్ సైన్సెస్ ఫ్యాకల్టీలోని మాస్ట్రిక్ట్ విశ్వవిద్యాలయంలో గ్రూప్ లీడర్. ఆమె ఆంకాలజీ, అధునాతన మైక్రోస్కోపీ అండ్ బయోమెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలపై పరిశోధనలు చేస్తోంది. ఆమె ఈ శాస్త్రీయ పరిశోధనలతో పాటు, విద్యారంగంలో మానసిక ఆరోగ్య సవాళ్ల గురించి, ముఖ్యంగా STEM రంగంలోని మహిళ రాకపోవడం గురించి బహిరంగంగా మాట్లాడుతూ..చైతన్యపరుస్తుంటారామె. ఇక్కడ అన్నా తొలుత చదువు వద్దనుకున్నా..మళ్లీ చదవాలనుకుని పుస్తకాలు కుస్తీ పట్టే క్రమంలో ఎంతో భావోద్వేగాన్ని ఫేస్ చేసుంటారు. కానీ వాటిన్నంటిని అధిగమించి ఉన్నత స్థానానికి చేరుకోవడం నిజంగా ప్రశంసనీయం కదూ..!.(చదవండి: వధువుపై కోట్ల రూపాయల నగదు వర్షం..! ఎక్కడంటే..) -
మోటివేషనల్ రీల్స్ చూస్తున్నారా..? అయినప్పటికీ..
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, కోటు వేసుకున్న ఒక వ్యక్తి స్టేజ్ మీద అరుస్తూ, "నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు", "నీలో ఒక సింహం ఉంది", "ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి నేను తోపు అని చెప్పుకో" అంటూ డైలాగులు కొడుతుంటారు. వీటిని చూసి జనం ఇన్స్టంట్గా ఉత్తేజానికి లోనవుతారు. కానీ, ఆ వీడియో ముగిసిన అరగంటకే మళ్ళీ పాత భయాలు, పాత బలహీనతలు చుట్టుముడతాయి.ఎందుకు?ఎందుకంటే, మార్కెట్ అమ్ముతున్నది 'మోటివేషనల్ డ్రగ్'. కానీ మనకు కావాల్సింది రియల్ పర్సనాలిటీ డెవలప్మెంట్.మోటివేషన్ అనేది ఒక కప్పు కాఫీ లాంటిది. తాగినప్పుడు కిక్ ఇస్తుంది, ఆ తర్వాత నీరసం వచ్చేస్తుంది. కానీ వ్యక్తిత్వ వికాసం అనేది మన మనసులోని సాఫ్ట్వేర్ను రీ-రైట్ చేసే ఒక సుదీర్ఘ ప్రక్రియ.సో-కాల్డ్ ట్రైనర్స్ చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే... అందరికీ ఒకే మందు (One size fits all) ఇవ్వాలని చూడటం."ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. నెగటివిటీని దరిచేరనీయకండి. అన్నీ మంచివే జరుగుతాయని నమ్మండి" అని చెప్తారు సో-కాల్డ్ ట్రైనర్స్. దీన్ని సైకాలజీలో 'Toxic Positivity' అంటారు.కోపం, భయం, అసూయ, బాధలాంటి నెగటివ్ ఎమోషన్స్ కూడా మనిషిలో ఒక భాగమే. వాటిని అణచివేస్తే అవి లోపల కుళ్ళిపోయి డిప్రెషన్ లేదా యాంగ్జైటీగా మారుతాయి.Real Personality Development అంటే నెగటివ్ ఎమోషన్స్ను అణచివేయడం కాదు, వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి. నాకు భయం వేస్తోంది అని ఒప్పుకోవడం బలహీనత కాదు, ఆ భయాన్ని జయించడానికి అది మొదటి మెట్టు."నీకు కాన్ఫిడెన్స్ లేకపోయినా ఉన్నట్టు నటించు. అది చూసి లోకం నమ్ముతుంది, మెల్లగా నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది" అంటారు ట్రైనర్స్.కానీ, ఇది మిమ్మల్ని 'Imposter Syndrome' కి గురి చేస్తుంది. లోపల డొల్లతనం ఉండి పైన మేకప్ వేసుకుంటే, ఎక్కడో ఒకచోట ఆ ముసుగు జారిపోతుందనే భయం మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తుంది.Real Personality Development అంటే నటించడం కాదు, 'అర్హత'ను (Competence) పెంచుకోవడం. మీరు ఒక పనిలో నిష్ణాతులు అయినప్పుడు, కాన్ఫిడెన్స్ అనేది ఒక బై-ప్రొడక్ట్లా దానంతట అదే వస్తుంది.సైకాలజీ ప్రకారం వ్యక్తిత్వం అంటే 'అలవాటు' కాదు, అది ఒక 'ఆర్గనైజేషన్'. వ్యక్తిత్వం అనేది కేవలం మనం నేర్చుకునే స్కిల్స్ కాదు. అది మన అనువంశికత (Heredity), పరిసరాల (Environment) సంక్లిష్టమైన కలయిక.మోటివేషనల్ స్పీకర్లు కేవలం ఈ క్షణం గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ సైకాలజీ మీ 'బాల్యం' (Childhood) గురించి మాట్లాడుతుంది.మీ పర్సనాలిటీకి పునాది మీ ఐదేళ్ల వయసులోనే పడిపోయింది. ఆ పునాదిలో ఉన్న పగుళ్లను (Trauma/Negative conditioning) పూడ్చకుండా పైన అంతస్తులు కడితే, ఆ భవనం ఎప్పుడైనా కూలిపోవచ్చు.నేను డెవలప్ చేసిన నా "Genius Matrix" Break. Build. Beyond. మోడల్ ద్వారా ఈ సో-కాల్డ్ ట్రైనర్స్ ఎక్కడ విఫలమవుతున్నారో చూడండి:స్టెప్ 1: Break (పాత పునాదిని కూల్చడం)ట్రైనర్స్ డైరెక్ట్గా బిల్డింగ్ కట్టమంటారు. కానీ సైకాలజీ ప్రకారం, ముందు లోపల ఉన్న శిథిలాలను తొలగించాలి.చిన్నప్పుడు మీ నాన్న మిమ్మల్ని అందరిముందు తిట్టినప్పుడు "నేను దేనికీ పనికిరాను" అని మీ మనసులో పడ్డ ముద్రను చెరిపేయకుండా, పైన మీరు ఎన్ని "సక్సెస్ మంత్రాలు" చదివినా ఉపయోగం లేదు.మీ బలహీనతలు, మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడ మొదలయ్యాయో గుర్తించి, ఆ పాత సెల్ఫ్-ఇమేజ్ను బ్రేక్ చేయడమే అసలైన వికాసం.స్టెప్ 2: Build (లోపలి నుంచి బయటికి)ఇక్కడ మనం బాహ్య ప్రదర్శనపై కాకుండా, అంతర్గత విలువలపై దృష్టి పెడతాం.ఒక వ్యక్తి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు (Real Self) అనేది కీలకం. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఒక "సక్సెస్ ఫుల్ పర్సన్" కనిపించాల్సిన అవసరం లేదు, ఒక "నిజాయితీ గల మనిషి" కనిపిస్తే చాలు.గొడవ జరిగినప్పుడు అరవకుండా ఉండటం 'కమ్యూనికేషన్ ట్రిక్' కాదు, అది మనసును కంట్రోల్ చేసే 'మెంటల్ స్ట్రెంత్'.స్టెప్ 3: Beyond (పరిమితుల ఆవల - లెగసీ నిర్మించడం)మార్కెట్ కోరుకునేది 'సక్సెస్'. సైకాలజీ కోరుకునేది 'సాటిస్ఫాక్షన్', 'గ్రోత్'.ఎదుటివారిని ఇంప్రెస్ చేయడం మానేసి, మీరు మీ కోసం బ్రతకడం మొదలుపెట్టినప్పుడు మీరు 'Beyond' స్టేజ్లోకి వెళ్తారు. ఇక్కడ మీ పర్సనాలిటీలో ఒక Depth ఉంటుంది. Abraham Maslow చెప్పిన 'Self-Actualization' అంటే ఇదే.ఉదాహరణకు ఒక వ్యక్తికి స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం (Stage Fear). "నువ్వు పులివి.. నువ్వు వెళ్ళి స్టేజ్ మీద ఊగిపో.. కేకలు వేయ్.. జనం చప్పట్లు కొడతారు" అంటాడు మోటివేషనల్ స్పీకర్. ఇది ఒకసారి వర్కౌట్ అవ్వొచ్చు, కానీ భయం పోదు.మరేం చేయాలి?ఆ వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు? విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేడా? (Perfectionism). ఎదుటివారు ఏమనుకుంటారో అనే Social Anxiety ఉందా? తన దగ్గర సరైన కంటెంట్ లేదా? అనే అంశాలను పరిశీలించాలి.ముందుగా ఆ వ్యక్తి తనలోని లోపాలను అంగీకరించేలా చేయడం.చిన్న చిన్న గ్రూప్స్ ముందు మాట్లాడించి 'ఎక్స్పోజర్' ఇవ్వడం.స్టేజ్ మీద మాట్లాడటం అంటే 'తన్ను తాను నిరూపించుకోవడం' కాదు, 'సమాచారాన్ని పంచడం' అనే మైండ్సెట్ మార్పు తేవడం.ఇది Real Personality Development.చివరగా నేను చెప్పేది ఒక్కటే... పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక మోడల్లా నడవడం కాదు, ఒక నాయకుడిలా మాట్లాడటం కాదు.మీ మనసులో ప్రశాంతత ఉందా?మీరు ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉన్నారా?కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా నిలబడుతున్నారా?మీ తప్పులను మీరు ఒప్పుకోగలుగుతున్నారా?ఇవేవీ మార్కెట్లో లభించే రెండు రోజుల వర్క్షాప్లలో దొరకవు. వీటికి లోతైన ఆత్మపరిశీలన, శాస్త్రీయ దృక్పథం అవసరం.మనం ఈ Real Personality Development సిరీస్లో మాట్లాడబోయేది ఆ లోతైన సత్యాల గురించే.ఇక్కడ సో-కాల్డ్ మోటివేషన్ ఉండదు... కేవలం సైకలాజికల్ ట్రాన్స్ఫార్మేషన్ మాత్రమే ఉంటుంది.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!) -
సింకోప్.. పడి లేచే ప్రమాదం
ఫెయింట్ అయిపోవడం అనే మాట చాలామంది వినే ఉంటారు. తెలుగులో చెప్పాలంటే స్వాధీనం తప్పిపోవడం. ఇది స్పహతప్పి అలాగే ఉండిపోవడం కాదు...కాసేపట్లో మళ్లీ మామూలైపోవడం. ఇలా స్వాధినం తప్పిపోయి... కొద్దిక్షణాల్లోనే మళ్లీ మామూలైపోవడాన్ని వైద్యపరిభాషలో ‘సింకోప్’ అంటారు. అయితే కొద్దిసేపట్లోనే మళ్లీ మామూలైపోయినప్పటికీ ఇలా జరగడం కొన్నిసార్లు ప్రమాదాలకూ దారితీయవచ్చు. ఉదాహరణకు ఏ వాహనం నడుపుతున్నప్పుడో ఇలా జరిగితే అది పెను ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. ఈ సమస్యకు చాలా కారణాలుంటాయి. సింపుల్గా దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గిపోవడం (డీహైడ్రేషన్) మొదలుకొని వేగస్ నరం అతిగా స్పందించడం వరకు అనేక కారణాలతో వచ్చే ఈ ‘సింకోప్’ సమస్యపై అవగాహనతో పాటు దీనికి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం.కొందరు ఏదైనా తట్టుకోలేని దృశ్యం చూడగానే స్పృహ తప్పినట్లుగా అయిపోతారు. మరికొందరిలో వారి ఆందోళన స్థాయి మితిమీరిపోతే వెంటనే స్వాధీనం తప్పి పడిపోతారు. ఎందుకిలా అవుతుంది. ఎందుకంటే... గుండె స్పందనల లయ (రిథమ్)లో ఏమాత్రం తేడా రాకూడదు. స్పందన పెరిగినా, తగ్గినా అది ప్రమాదకరమే. గుండె స్పందనలు తగ్గడంతో... మన దేహంలో అత్యంత కీలక అవయవమైన మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. అలా తగ్గినప్పుడు స్పృహ తప్పి పడిపోయే కండిషన్ను సింకోప్ అంటారు. ఇది సాధారణంగా చాలాసార్లు నిరపాయకరమే అయినప్పటికీ... కొన్నిసార్లు మాత్రం అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. సింకోప్ లక్షణాలు, నివారణ, చికిత్సలేమిటో చూద్దాం.సింకోప్లో రకాలున్యూరల్లీ మీడియేటెడ్ : బాగా తీవ్రమైన నొప్పి రావడం లేదా చాలా ఎక్కువగా భావోద్వేగాలకు గురికావడం, అత్యంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం వల్ల. సింకోప్ కండిషన్ రావచ్చు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ : దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గడం వల్లగానీ లేదా ఏవైనా మందులు వాడుతున్నప్పుడు వాటి వల్ల అకస్మాత్తుగా ఒక్కసారిగా రక్తపోటు (బ్లడ్ప్రెషర్) తగ్గిపోవడం వల్ల. కార్డియాక్ సింకోప్ : గుండె రిథమ్లో తేడా రావడం వల్ల (అరిథ్మియా అనే కండిషన్లో) గుండెవేగం పెరగడమో లేదా తగ్గడమో జరిగినప్పుడు. సిచ్చువేషనల్ సింకోప్ : గట్టిగా దగ్గడం లేదా మింగడం లేదా మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్వాధీనం తప్పిపోవడం.సింకోప్ కారణమయ్యే మెకానిజమ్ 1) మెదడుకు గుండెనుంచి తగినంత రక్తం అందకపోవడం / గుండె తగినంత రక్తాన్ని మెదడుకు అందించలేకపోవడం.2) గుండె పంపింగ్ సరిగా ఉన్నప్పటికీ మెదడుకు ఆ రక్తం అందడానికి అవసరమైన బ్లడ్ప్రెషర్ను మెయిన్టెయిన్ చేయడానికి సదరు రక్తనాళానికి తగినంత సామర్థ్యం లేకపోవడం.3) రక్తనాళానికి సామర్థ్యం ఉన్నప్పటికీ రక్తనాళంలో తగినంత రక్తం లేకపోవడం... ఈ మూడింటిలో ఏదో ఒకటిగానీ, లేదా ఒకటి కంటే ఎక్కువగా అంటే... ఏవైనా రెండు కారణాల వల్ల గానీ ఇలా జరగవచ్చు.ఎందుకిలా జరుగుతుందంటే... గుండె ఒక కండర నిర్మితమైన ఒక ఎలక్ట్రిక్ పంపు లాంటి అవయవం అన్న విషయం తెలిసిందే. ఎస్ఏ నోడ్ (సైనో ఏట్రియల్ నోడ్) అనే ఒక కీలకమైన చోటి నుంచి గుండె స్పందించడానికి అవసరమైన కరెంటు మన శరీరంలోనే నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ సరఫరాలో తేడాల వల్ల ఒక్కోసారి గుండె కండరాలు వేగంగానైనా కొట్టుకోవచ్చు లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా స్పందనలు తగ్గవచ్చు. కార్డియాక్ సింకోప్లో ఇలా జరుగుతుంది.వేగం పెరిగితే... కొన్ని సార్లు గుండె స్పందనల్లో వేగం బాగా పెరిగిపోయి ‘టాకికార్డియా’ అనే కండిషన్ ఏర్పడుతుంది. దీని వల్ల గుండె పై గదుల్లోగాని, కింది గదుల్లోగాని వేగం పెరుగుతుంది. అంటే గుండెలో పంప్ చేయడానికి అవసరమైన రక్తం చేరుకోకముందే గుండె ముడుచుకోవడం... అంటే గుండె స్పందన జరుగుతుందన్నమాట. దాంతో గుండె నుంచి కీలకమైన అవయవాలకు అందాల్సినంత రక్తం రక్తనాళాల్లోకి వెలువడదు. ఈ టాకికార్డియా అనే కండిషన్ ఏ వయసు వారికైనా రావచ్చు.వేగం తగ్గితే... గుండె స్పందనల్లో వేగం తగ్గితే ఆ కండిషన్ను బ్రాడికార్డియా అంటారు. బ్రాడి... అంటే నెమ్మదించడం (స్లో కావడం). ఇక ‘కార్డియా’ అంటే గుండె అని అర్థం. గుండె స్పందనల వేగం తగ్గడం వల్ల కూడా కీలకమైన అవయవాలకు రక్తసరఫరా తగ్గుతుంది. మనుషుల్లో తమ వయసు పెరుగుతున్న కొద్దీ వారి గుండె స్పందనలకు అవసరమైన ఎలక్ట్రికల్ సరఫరాల్లో తేడాలు వస్తుండవచ్చు. లేదా కొందరిలో పుట్టుకతోనే గుండెలో బ్లాక్స్ ఉండవచ్చు. గుండెకు అవసరమైన ఎలక్ట్రిసిటీలో తేడాలు రావడం వల్ల వచ్చే సమస్య అన్నది గుండెలో బ్లాక్స్ ఉండటం వల్ల వచ్చే సమస్య కంటే వేరుగా ఉంటుంది.సింకోప్కు కారణాలుగుండె నిర్మాణపరమైనవి : కొన్నిసార్లు గుండెలో నిర్మాణపరంగా ఏవైనా తేడాలు ఉండటం వల్ల మెదడులాంటి కీలక అవయవాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోవచ్చు. ఉదాహరణకు గుండె కండరాలు బలహీనంగా మారడంవల్లనో, లేదా కార్డియోమయోపతి అన్న కండిషన్లో సింకోప్ రావచ్చు.గుండె కవాటాల్లో మార్పులు : గుండె కవాటాలు రక్తాన్ని నిర్దిష్టంగా ఒకే దిశలో ప్రవహించేలా చూస్తుంటాయి. కొన్నిసార్లు గుండె కవాటాలు సన్నబడవచ్చు. ఇలా జరగడాన్ని ‘స్టెనోసిస్’ అంటారు. కొన్నిసార్లు అవి లీక్ కావచ్చు. ఇలా జరగడాన్ని ‘ఇన్సఫిషియెన్సీ’ లేదా ‘రీ–గర్జిటేషన్’ అంటారు. ఈ కండిషన్స్లో దేనివల్లనైనా సింకోప్ రావచ్చు.మితిమీరిన వ్యాయామం : కొందరు వ్యక్తుల్లో... అంటే మరీ ముఖ్యంగా క్రీడాకారులు / అథ్లెట్లలో గుండె కండరాలు మందం కావడం వల్ల కూడా సింకోప్ రావచ్చు. అతి వ్యాయామంతో గుండెపై విపరీతమైన భారం పడేలా పనిచేయించడం వల్ల ఈ కండిషన్ ఏర్పడే అవకాశముంది.పోష్చురల్ హైపోటెన్షన్ : కొన్ని సందర్భాల్లో పక్క మీద పడుకున్న వ్యక్తి స్థిమితంగా కాకుండా హాడావుడిగా లేదా అకస్మాత్తుగా నిల్చునప్పుడు... అతడి కదలికలకు తగ్గట్లుగా గుండె తన స్పందనలను అంతే వేగంగా పెంచుకోలేదు. దాంతో వేగంగా జరిగే శరీర కదలికకు అనుగుణంగా గుండె స్పందనవేగం పెరగకపోవడంతో... కీలక అవయవాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఇలా జరగడాన్ని పోష్చురల్ హైపోటెన్షన్’ అంటారు.వేసోవేగల్ సింకోప్ : నరాల పనితీరు వ్యవస్థలో మన సంకల్పం లేకుండా దానంతట అవే జరిగేపోయేవి, మన సంకల్పంతో జరిగేవి అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండిటికీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ‘సింకోప్’ కండిషన్ వస్తుంది. వేగస్ అనే నరం గుండె వేగాన్ని నెమ్మదించేలా చేస్తుంది. అది ఒక్కోసారి గుండె వేగాన్ని బాగా తగ్గిస్తుంది. ఇలా వేగస్ నరం వల్ల గుండె వేగం మందగిస్తే దాన్ని వేసోవేగల్ సింకోప్ అంటారు.తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి ఆ విపరీతమైన నొప్పి వేగస్ నరాన్ని ప్రేరేపిస్తుంది. ఒక్కోసారి తీవ్రమైన / విపరీతమైన ఒత్తిడులు (సివియర్ స్ట్రెస్) కూడా వేగస్ నరాన్ని ప్రేరేపిస్తాయి. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు కొందరు స్పృహ తప్పడానికి కారణం కూడా ఈ సింకోపే. కొందరు రక్తం చూసినప్పుడు లేదా కత్తులు– కటార్ల వంటి మారణాయుధాలు చూసినప్పుడు కూడా ఇలా స్పృహ తప్పడం దీనివల్లనే.పేగుల కదలికలు తగ్గడం : కొందరిలో జీర్ణక్రియలో జరుగుతుండే పేగుల కదలికలు (బవెల్ మూవ్మెంట్స్), విపరీతంగా తగ్గడం కూడా వేగస్ నరం మీద ఒత్తిడి కలిగింవచ్చు. అప్పుడు కూడా సింకోప్ కండిషన్ వస్తుంది.అకస్మాత్తుగా తల తిప్పడం వల్ల...కొందరు అకస్మాత్తుగా తలతిప్పడం వల్ల వేగస్ సరం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ వెంటనే అది మళ్లీ సింకోప్ కండిషన్కు దారితీస్తుంది.రక్తహీనత.. అనీమియా అనే రక్తహీనత కండిషన్ కూడా సింకోప్కు కారణం. అనిమియా కండిషన్లో రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో కూడా సింకోప్ రావచ్చు. శరీరంలో నీరు / ద్రవాలు తగ్గడం : ఒక్కోసారి దేహంలో నీరు / ద్రవాలు తగ్గడం (డీ–హైడ్రేషన్) వల్ల కూడా సింకోప్ రావచ్చు. కొందరిలో చాలా ఎక్కువగా వాంతులు కావడం వల్లగానీ లేదా నీళ్ల విరేచనాల (డయేరియా) వల్ల గానీ లేదా విపరీతంగా చెమటలు పట్టడం వల్ల శరీరంలో దేహంలో నీటి / ద్రవాల మోతాదులు తగ్గవచ్చు. డయాబెటిస్ సమస్య ఉన్న కొందరిలో వారు మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సిరావడం వల్ల కూడా వాళ్ల శరీరం డీ హైడ్రేషన్కు లోనుకావచ్చు. ఈ కండిషన్లు కొందరిలో సింకోప్కు దారితీసేందుకు అవకాశముంది. చికిత్ససింకోప్ అన్న కండిషన్ నిజానికి అంత సీరియస్ కాదు. కానీ ఇలా ఫెయింట్ కావడం తరచూ జరుగుతుంటే మాత్రం సింకోప్ను నిర్లక్ష్యం చేయడమన్నది ఏమాత్రం తగదు. ఏవైనా ఇతరత్రా ఆరోగ్య సమస్యల (అండర్లైయింగ్ కాజెస్) వల్ల ఇలా జరుగుతుందేమో చూసేందుకు అవసరమైన వైద్యపరీక్షలు జరపాలి. ఇందుకోసం తొలుత డాక్టర్ సలహా తీసుకుని, బాధితుడికి చికిత్స అవసరమా కాదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి. ఇతరత్రా సమస్యలతో (అండర్లైయింగ్ కాజెస్తో) ఇలా జరుగుతుంటే మాత్రం బాధితుడికి అవసరమైన చికిత్స అందించాలి. సింకోప్ అన్నది ఒకసారి స్వల్పంగా వచ్చి, దాని వల్ల ఎలాంటి గాయాలు జరగకపోతే ప్రైమరీ మెడికల్ కేర్ సెంటర్లో డాక్టర్లు కూడా సాధారణ చికిత్స అందించవచ్చు. అయితే సరిగ్గా నాడిగానీ, శ్వాసగానీ అందని పరిస్థితిని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి పరిగణించి వెంటనే పెద్ద హాస్పిటల్స్కు (టెరిషియరీ హెల్త్ కేర్ సెంటర్కు) తరలించాల్సి ఉంటుంది.గుండె స్పందనల లయ (రిథమ్)లో మార్పులు వచ్చిన వారికి, గుండె స్పందనల వేగం తగ్గిన వారిలో కొందరికి పేస్ మేకర్ అమర్చాల్సి రావచ్చు. ఈ పేస్మేకర్ అనేది గుండె స్పందనల వేగం తగ్గడాన్ని... అంటే ‘బ్రాడీకార్డియా’ను ముందుగానే పసిగట్టి... గుండె స్పందనల వేగం తగ్గిపోకుండా చూస్తుంది. ఇలా పేస్ మేకర్ అన్నది తగ్గిపోయే గుండె స్పందనలను మళ్లీ మామూలయ్యేలా (నార్మల్గా స్పందించేలా) చేసేందుకు వాడే ఒక ఉపకరణం. అలాగే టాకీకార్డియా కండిషన్లో ఒక షాక్ ద్వారా గుండె స్పందనలు మళ్లీ నార్మల్ అయ్యేలా చూడటం; అలాగే ఇది గుండెలో పైన, కింద ఉండే గదులు కదలికలు సమన్వయంతో జరిగేలా చూడటం; గుండెలోని ఎడమ, కుడి భాగాలు స్పందనల్లో సమన్వయం ఉండేలా చూడటం వంటి పనులనూ చేస్తుంది.చదవండి: గుండె జబ్బుల రిస్క్ ఎవరికి ఎక్కువ?ఈ పనులన్నింటినీ పేస్ మేకర్ సహాయంతో జరిగేలా చూసే/ చేసే చికిత్సను ‘కార్డియాక్ రీ–సింక్రనైజేషన్ థెరపీ’ (సీఆర్టీ) అని అంటారు. గుండె లయలో వచ్చే మార్పుల వల్ల వచ్చే ప్రమాదాలను నివారించడానికి ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పేస్ మేకర్లలో కూడా తాత్కాలికంగా అమర్చేవి, శాశ్వతంగా అమర్చేవి అని రెండు రకాలుగా ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు అవసరమైనవారు (సాధారణంగా ‘బ్రాడీ–కార్డియా’ సమస్య ఉన్నవారు) దీన్ని వాడాల్సి ఉంటుంది. పేస్మేకర్ అమర్చాక పేషెంట్స్ తాము అంతకుమునుపు చేసే రోజువారీ పనులన్నింటినీ నార్మల్గానే చేసుకోవచ్చు.తక్షణం అందించాల్సిన సపర్యలు∙సింకోప్కు గురైన వ్యక్తిని కాస్తంత చల్లగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి సౌకర్యంగా పడుకోబెట్టాలి. లేదా అతడి తల రెండు మోకాళ్ల మధ్య ఉండేలా చూస్తూ రిలాక్స్డ్గా కూర్చోబెట్టాలి.∙అలా పడుకోబెట్టడం / కూర్చోబెట్టడం జరిగాక... అతడు స్పృహలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత కాస్తంత ఉప్పు కలిపిన ద్రవాన్నిగానీ లేదా ఓఆర్ఎస్ ద్రావణాన్ని గానీ నెమ్మదిగా తాగించాలి. ఒకవేళ రక్తపోటు పడిపోవడం (హైపోటెన్షన్) వల్ల సింకోప్ ఏర్పడితే... ఇలా చేయడం వల్ల బాధితుడు మామూలుగా మారిపోతాడు.నివారణ : నిజానికి సింకోప్కు దారితీసే అసలు కారణాలను కనుగొంటే అందుకు అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవచ్చు. ఉదాహరణకు... వేసోవేగల్ నరం అతి స్పందన వల్ల ఈ సమస్య వస్తుంటే దానికి కారణాలు కనుగొని చికిత్స అందించడం వల్ల ఆ తర్వాత వచ్చే సింకోప్లను నివారించవచ్చు. అకస్మాత్తుగా లేవడం, అకస్మాత్తు కదలికల వల్ల వచ్చే పోష్చురల్ హైపోటెన్షన్ సింకోప్ను అకస్మాత్తు కదలికలు లేకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఉదాహరణకు పక్క మీద నుంచి లేచేప్పుడు మెల్లగా లేవడం, వెంటనే నిలబడకుండా కొద్ది సేపు కూర్చోవడం.. ఇలా కదలికలు క్రమంగా ఉండేలా చూసుకోవడంతో ఈ తరహా సింకోప్ రాకుండా చూసుకోవచ్చు. ఇది డీ హైడ్రేషన్ సమస్య వల్ల వస్తే తగినన్ని ద్రవాలు అందేలా చూసుకోవడం వల్ల కూడా సింకోప్ను నివారించవచ్చు.చివరగా...ప్రతినిత్యం తగినన్ని నీళ్లు తాగుతూ, అన్ని రకాల పోషకాలనూ తీసుకుంటూ, మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నవారిలో సింకోప్ సమస్య చాలా అరుదు. అందుకే అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ ఉండటం అన్నది కేవలం సింకోప్ నివారణకు మాత్రమే కాకుండా అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండటానికీ దోహదపడుతుందని గుర్తుంచుకోవాలి.నిర్వహణ: యాసీన్ -
ప్రెండ్స్..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!
విదేశాల్లో చదవాలని..ఒక వ్యక్తి బంగారంలాంటి క్యాంపస్ ప్లేస్మెంట్ని కాలదన్నాడు. చివరికి అప్పులపాలై..ఎంత తక్కవ వేతనానికి పనిచేసేందుకైనా సై అంటున్నాడు.అలా కాకుండా జాబ్ చేస్తూనే లేకా కాస్త ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నాక..ఆ దిశగా అడుగులు వేసిన బాగుండేది. కానీ అత్యాసతో తీసుకున్న ఈ నిర్ణయం..అతడిని ఎంతటి దయనీయ స్థితిలోకి నెట్టేసిందో చూస్తే..విదేశీ మోజులో ఉండే యువతకు అడకి కథ ఓ గొప్ప కనువిప్పు అని చెప్పొచ్చు. ఓ వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్లో చేసిన పోస్ట్ పెను దుమారం రేపి వివిధ చర్చలకు దారితీసింది. ఆ పోస్ట్లో ఇలా ఉంది. "నా స్నేహితుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏడాదికి ఏడు లక్షలు వేతనమిచ్చే జాబ్ ఆఫర్ని కాలదన్నాడు. విదేశాల్లో ఎంఎస్ చేస్తే..అంతకుమించి సంపాదించాలనే అత్యాశతో వద్దనుకున్నాడు. చివరకి తను అనుకున్నట్లుగానే యూఎస్లో విజయవంతంగా ఎంఎస్ పూర్తిచేశాడు. కానీ రూ. 40 లక్షల అప్పుతో రోడ్డుపై నిలబడ్డాడు. దాంతో ఇప్పుడు కనీసం ఏడాదికి రూ. 3లక్షల వేతనమిచ్చే జాబ్లో అయినా చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. చూశారా..! దురాశ ఎంతటి పరిస్థితికి తీసుకొచ్చేస్తుందో తెలుసుకోండి..ఇది బంగారంలాంటి ఆఫర్లను, నిర్ణయాలను నాశనం చేసేస్తుంది తస్మాత్ జాగ్రత్త." అంటూ తన పోస్ట్ని ముగించాడు. ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..చాలామంది నెటిజన్లు తమ స్నేహితులు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ఇబ్బందులు పడ్డారని, అమెరికాలో చదువుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.One of my friends rejected a 7LPA campus job thinking it was not enough for him. He decided to go to the US for MS instead. Now he has a Masters, 40 LPA in debt and is ready to settle for even a 3 LPA job. Greed is the death of all good things my friends.— enji vi (@original_ngv) February 16, 2026 (చదవండి: బేబీ కేర్పై పరిణితి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..! జీవితంలోనే..) -
బేబీ కేర్పై పరిణీతి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..! జీవితంలోనే..
బాలీవుడ్ నటుడు పరిణీతి చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా అక్టోబర్ 19, 2025లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తతల్లి పరిణీతి తన బిడ్డపై కేరింగ్ విషయంలో ఎలా టెన్షన్ పడుతోందో షేర్ చేసుకుంది. అంతేగాదు తన కుమారుడి కోసం ఇంటిని తీర్చిదిద్దిన విధం గురించి కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంది. పాతకాలం నాటి వైబ్స్తో మన సంప్రదాయ బేబీ కేరింగ్ విధానం గురించి హైలెట్ చేసింది.ప్రస్తుతం తాను తల్లిగా చాలా బిజీ అని, అతడి సంరక్షణతోనే తలమునకలవుతున్నట్లు పేర్కొంది. ఇది చాలా అలసట, బాధ్యతతో కూడినది, పైగా జీవితంలో అత్యంత సంతోషభరితమైన దశ కూడా అని అభిర్ణించింది. మనిషి ఉపయోగించే కలర్లను బట్టి అతడి మనస్తత్వం ఎలా చెప్పేయొచ్చో..అలాగే ఇక్కడ నటి పరిణీతి తన కొడుకు కోసం రూమ్ అలకరణకు ఏ రంగులకు ప్రాధాన్యత ఇచ్చిందో చూస్తే..ఆమె ఏంటనేది ఇట్టే అర్థమైపోతుంది. తన కొడుకు నీర్ కోసం అన్ని లైట్ కలర్స్, తెలుపు, గోధమ రంగులకే ప్రాధాన్యత ఇచ్చారామె. "బ్రిటిష్-శైలి" ప్యానెలింగ్తో తీర్చిదిద్దారు. తనది, రాఘవా టేస్ట్ దగ్గర దగ్గరగా ఒకటేనని, అందువల్ల అందుకనుగుణంగా ఆ గదిని ఈ విధంగా డిజైన్ చేశానని చెబుతోంది. అక్కడ గోడలన్నీ వింటేజ్ కార్ ఆర్ట్వర్క్తో ఆకర్షించగా, అక్కడ రాఘవ్ తండ్రి గిఫ్ట్గా చెక్క ఫ్లోరింగ్ వింటేజ్ కార్పెట్తో అనుబంధంగా ఉంది. ఇవేగాక క్లాసిక్ రంగుల తెల్లటి తొట్టి, బొమ్లలు, కస్టమ్ మేడ్ లేత గోధమ రంగు వార్డ్రోబ్లు తదితరాలు ఉన్నాయి. నిజానికి ఇది తన రీడిండ్ రూమ్ అని చెప్పుకొచ్చాడు. ఈ గదిలోకి ఎవరు ప్రవేశించిన తమ ఇట్టే తమ సమస్యలన్నింటిని మరిచపోయేలా చేసే..అందమైన ప్రదేశం. ఇంత ప్రశాంతమైన ప్రదేశంగా మార్చినందుకు పరిణీతికి క్రెడిట్ ఇస్తూ..దీన్ని స్వర్గమపు అభయారణ్యంగా పిలిచారు రాఘవ చద్దా. కాగా, పరిణీతి, రాఘవ్లు మే 2023లో ఉదయపూర్లోని ది లీలా ప్యాలెస్లో అట్టహాసంగా పెళ్లిచేసుకున్నారు. వివాహం అయిన రెండేళ్లకు అక్టోబర్ 19, 2025న పండంటి మగబిడ్డ నీర్కు స్వాగతం పలికారు.(చదవండి: మసాలా దోస రుచి చూసిన అమెరికా రాయబారి..!) -
మసాలా దోస రుచి చూసిన అమెరికా రాయబారి..!
భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇలీవల బెంగళూరు పర్యటనకు వచ్చారు. ఈ నగరాన్ని చూసి..దాని ఉత్సాహభరితమైన చైతన్యానికి అబ్బురపడుతూ..సాటిలేని శక్తిగా అభివర్ణించారు. ఆ తర్వాత బెంగళూరు దక్షిణ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్యతో కలిసి స్థానిక వంటకాలను ఆస్వాదించారు. అందుకు సంబంధించిన ఫోటోలను గోర్ సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేశారు. ఇక సూర్య కూడా తన ఎక్స్ ఖాతాలో ఆ మధుర క్షణాలను పంచుకుంటూ..భారతదేశంలో బెంగళూరు నగరానికి అమెరికా రాయబారి హెచ్. ఇ సెర్గియో గోర్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఇందిరానగర్లోని హోటల్లో కొన్ని మసాలా దోసెలు, చక్కటి స్ట్రాంగ్ కాఫీ సేవిస్తూ.. తాత్కాలికి వాణిజ్య ఒప్పందంపై సంభాషించినట్లు తెలిపారు.Just arrived in Bengaluru! From startups to street food, Bengaluru’s energy is unmatched! Thank you to my great host @Tejasvi_Surya pic.twitter.com/9PsRfvKeGI— Ambassador Sergio Gor (@USAmbIndia) February 16, 2026 ఆ సమావేశంలో భారత అమెరికా భాగస్వామ్యం, వాణిజ్యం, సాంకేతికత ఆవిష్కరణలపై చర్చించినట్లు కూడా ఎతిపారు. అలాగే గోర్కు నమ్మ ఆటో రైడ్ని పరిచయం చేసినట్లు పేర్కొన్నారు పోస్ట్లో. అలాగే ప్రత్యేక పోస్ట్లో సూర్య భారత అమెరికా సంబంధాలలో బెంగళూరు నగరం కీలక పాత్రను నొక్కి చెప్పారు. ఈ నగరం మసాలా దోసం నుంచి వివిధ యంత్ర సామర్థ్యాలు పలు ఆవిష్కరణలను మిళితం చేయడమేగాక, రెండు ప్రజాస్వామ్య దేశాల ప్రజల మధ్య ఆర్థిక సంబంధాలను బోలపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఎందుకంటే..700కు పైగా అమెరికన్ కంపెనీల్లో భారతదేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 43% బెంగళూరు నుంచి వస్తున్నందున, మన నగరం US-భారత ఆర్థిక సంబంధాలకు కేంద్రంగా ఉంది. భారతదేశంలోని GCC(గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్)లలో 40%కి నిలయంగా ఉన్న బెంగళూరు, మన రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య ఆవిష్కరణ ఆధారిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది, ”అని సూర్యా రాసుకొచ్చారు పోస్ట్లో. Delighted to welcome H.E. Sergio Gor, U.S. Ambassador to India, to Bengaluru today.Over some masala dosa & strong coffee at Filter Coffee, Indiranagar, we had an engaging conversation on the growing India US partnership, especially in trade, technology and innovation following… pic.twitter.com/we2jautGId— Tejasvi Surya (@Tejasvi_Surya) February 16, 2026కాగా, రాయబారి గోర్ వైట్హౌస్ అధ్యక్షుడిగా ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్గా పనిచేశారు. తన వృత్తిపరమైన కెరీర్ జర్నీలో రిపబ్లికన్ నేషనల్ కమిటీ, అమెరికన్స్ ఫర్ లిమిటెడ్ గవర్నమెంట్ అండ్ కాపిట్ హిల్ తదితర విభాగాల్లో పనిచేశారు. ఇక విద్యానేపథ్థ్యం వచ్చేటప్పటికీ..జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన గోర్ 2008లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.(చదవండి: టెన్త్ ఫెయిల్..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..!) -
టెన్త్ ఫెయిల్..కానీ అద్భుతంగా పాఠాలు బోధిస్తున్నాడు..!
పది కూడా పాసవ్వని వ్యక్తి పాఠాలు బోధించడం ఏంటని అనిపిస్తుంది కదూ. కానీ ఈ వ్యక్తి చెబుతున్న తీరు చూస్తే..ఆశ్చర్యంకలగక మానదు. ఆర్థిక పరిస్థితులు తనను ఆపేయొచ్చేమో కానీ..తనలోని ఆసక్తి, ప్రతిభని ఆపలేవని, అవి ఏదో రకంగా బయటకు ఉప్పొంగుతాయని చూపించాడు. చుట్టూ ఉన్నవాళ్లు పది పాస్సవ్వలేదని ఎగతాళి చేసినా..తగ్గలేదు, ఆగిపోలేదు. ఇవాళ ఏకంగా వెయ్యిమందికి పైగా విద్యార్థులకు పాఠాలు చెబుతుండటం విశేషం.అతడే బీహార్కు చెందిన కూరగాయల విక్రేత రోహిత్ కుమార్. పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు. అయితే అతడు కళాకారుడుగా ఉండాలనేది ఆకాంక్ష..అయితే ఆర్థిక ఇబ్బందులు ఆ కలను దూరం చేశాయి. అతడి తల్లి ఆవు పిడకలు అమ్ముతూ..ఇంటిని నడిపించేది. ఇక రోహిత్ ఇంటింటికి తిరుగుతూ కూరగాయలు అమ్మేవాడు. అలా చేస్తున్నప్పుడూ సమాజానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని సంకల్పించి నలుగురు విద్యార్థులతో ఓ చిన్న తరగతి గదిని ప్రారంభించాడు. ఆ గది ఇప్పుడు ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు నడుస్తోంది. ప్రస్తుతం అతడి వద్ద వెయ్యిమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థి నుంచి కేవలం రూ. 125లు వసూలు చేస్తున్నాడు. అతడు పది కూడా పాసవ్వకుండా ఇలా ఉపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకున్నందకు అంతా ఎగతాళి చూస్తున్నా..కుమార్ మాత్రం దృఢ నిశ్చయంతో..సాధారణ సైన్స్ పాఠాలతో ఆ చిన్నారులను ఆకట్టుకున్నాడు, వారి మనసులను గెలుచుకున్నాడు. అయితే దీన్నంతటిని రికార్డు చేసి అతడి విద్యార్థులు ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన జోహో మాజీ సీఈవో శ్రీధర్ వెంబు ఇలా రాశారు పోస్ట్లో. దీన్ని చూస్తుంటే..భారత్ పట్ల గర్వం ఆశావాదం కనిపిస్తోంది. బీహార్లోని సామాన్య నేపథ్యాల నుండి వచ్చిన ఈ పిల్లలందరూ, గణితం, సైన్స్ నేర్చుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మన దేశ భవిష్యత్తును నిర్వచిస్తున్నారు. మా ఫౌండేషన్ ద్వారా అతని ప్రయత్నానికి మద్దతిచ్చే ప్రయత్నం చేస్తాం అని రాశారు. నెటిజన్లు కూడా రోహిత్ కుమార్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..ప్రతిభ ప్రతిచోటా ఉంటుందని, కానీ అవకాశం దాన్ని చేరుకోవడమే అత్యంత కీలకం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు మార్కులు ఎప్పటికీ మన విజయాన్ని నిర్ణయించలేవు అని పోస్టలు పెట్టారు. He once struggled to pass Class 10. Today, 1,000 students climb to his rooftop classroom at 5 a.m. 💛 From charging ₹125 and teaching four children to building a movement that challenges rote learning, Rohit Kumar turned doubt into determination. His mother once sold cow dung… pic.twitter.com/HCHPbzzjOn— Comman Man (@CommanMan777589) February 14, 2026 (చదవండి: కె-పాప్ గాయకుడి నోట 'శివ శివం పాట'..! సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే..) -
డాక్టర్ ఏఐతో తస్మాత్ జాగ్రత్త!
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో తమంతట తామే పనిచేసే (ఆటోమేటెడ్ గైడెన్స్) డిజిటల్ యాప్లతో పెను ప్రమాదాలే వచ్చి పడుతున్నాయంటూ చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతో అవి చేసే సిఫార్సులు ఒక్కోసారి పెద్దపెద్ద ముప్పులు తెచ్చిపెడుతున్నాయంటూ ప్రముఖ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ హెచ్చరిస్తోంది.ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) కాలూనని రంగమంటూ ఏదీ లేదు. చట్టాలూ, సాఫ్ట్వేర్, విద్యా, వినోదంతో పాటు ఆఖరికి లక్షలాది మెడికల్ కేసుల అనుభవంతో వైద్య విద్య, చికిత్సల్లో కూడా అది పాలుపంచుకుంటోంది. ఇక చైనాలాంటి దేశాలైతే ఏఐతో నడిచే క్లినిక్లూ, హాస్పిటళ్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. మిగతా రంగాలెలా ఉన్నప్పటికీ... వైద్యరంగంలో మాత్రం ఏఐతో కొన్ని తప్పులూ, పొరబాట్లు జరుగుతున్నాయనీ, ఇవి ఆందోళన గొలిపేలా ఉన్నాయంటూ డాక్టర్లు, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న నిపుణులు బెంబేలెత్తుతున్నారు. ఒకవేళ పేషెంట్లు తమంతట తామే ఏఐకు తమ సమస్య చెప్పుకుని ఆ మేరకు వైద్య సలహా పొందితే అది ఆందోళనకరంగా పరిణమించేందుకు అవకాశాలు లేకపోలేదంటూ హెచ్చరిస్తున్నారు. టర్కీ (తుర్కియా) రాజధాని అంకారాలోని ఒక హాస్పిటల్కు వచ్చిన ఒక పేషెంట్ తాలూకు కేస్స్టడీతో ఒక సంఘటన వెలుగుచూసింది. అదేమిటంటే... ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ సెమ్ అక్సోయ్ అనే డాక్టర్ దగ్గరికి కౌమార వయస్సులో ఉన్న ఓ పద్ధెనిమిదేళ్ల పిల్లాడు వచ్చాడు. అతడికి కాలిలో క్యాన్సర్ గడ్డ ఉందని నిర్ధారణ అయ్యాక తన కేసు వివరాలను ‘ఏఐ’కి సంబంధించిన చాట్ జీపీటీకి తెలిపి తనకు సలహా ఇవ్వాలంటూ కోరాడు. అంతే... ‘‘నువ్వు ఐదేళ్లకు మించి బతకవు’’ అంటూ ఏఐ సమాధానమిచ్చింది. ఈ సమాచారం ఆ కుర్రాడిని ఎంతగా ఆందోళనపరిచి ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. కానీ ఓ సర్జికల్ ఆంకాలజిస్టూ, ఓ ΄్లాస్టిక్ సర్జన్ నిర్వహించిన సర్జరీల తర్వాత అతడు పూర్తిగా కోలుకున్నాడు. అంతేకాదు... ‘‘ఇప్పుడు నీలోంచి క్యాన్సర్ తొలగిపోయినట్టే’’ అంటూ భరోసా కూడా ఇచ్చారు. అయితే మళ్లీ అదే అబ్బాయి కొన్ని వారాల తర్వాత డాక్టర్ అక్సోయ్కు మరోసారి ఫోన్ చేశాడు. ఈసారి వచ్చిన ఫోన్ సందేశంలోని సందేహమేమిటంటే... ‘‘నాకు తరచూ దగ్గు వస్తోంది. అంటే మొన్నటి క్యాన్సర్ ఇప్పుడు ఊపిరితిత్తులకు సోకిందంటారా?’’ అని అతడు ప్రశ్నించాడు. అయితే డాక్టర్లు అతడి ఊపిరితిత్తులను పూర్తిగా పరీక్షించాక తేలిందేమిటంటే అతడికి క్యాన్సర్ ఏమాత్రం లేదు. అయితే... ఆ పిల్లాడు ఈమధ్య సిగరెట్లు తాగడం మొదలుపెట్టడమే అతడి దగ్గుకు కారణమని తేలింది. ‘‘ఏదైనా వ్యాధి నిర్ధారణ చేయాలంటూ కేవలం లక్షణాలను మాత్రమే చూడకూడదు. అతడికి ఆ లక్షణాలు కనిపిస్తున్న సందర్భాలనూ పరిశీలించాలి. ఆ యువకుడు ఇటీవల పొగతాగడం మొదలుపెట్టినందువల్ల దగ్గు వచ్చిందని తేలింది. వైద్యవిజ్ఞాన సమారమంతా ఓ దట్టమైన అడవి అయితే... ఇలా అరకొర పరిజ్ఞానంతో అందులో తిరగడమన్నది దారీతెన్నూ తెలియకుండా అందులో తప్పిపోవడం లాంటిదం’’టూ డాక్టర్ అక్సోయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘ఏఐ’ సంస్థలకు సంబంధించిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ... ‘‘ఇలాంటి అనుభవాల తర్వాత... ఏఐ అడగాల్సిన ప్రశ్నలను నమోదు చేస్తూ కృత్రిమ మేధ మరింత సమర్థంగా, పరిపుష్టంగా పనిచేసేలా మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. అయితే కృత్రిమ మేధ ఎప్పటికీ ఓ డాక్టర్ / మెడికల్ ప్రొఫెషనల్కు మంచి ప్రత్యామ్నాయం కాబోదంటూ ఆయన తెలిపారు. ఇక్కడ ఈ టర్కిష్ అబ్బాయి ఉదంతం రెండు అంశాలను సూచిస్తోంది. మొదటిది... ప్రపంచంలోని చాలామంది వ్యక్తులు... తాము హాస్పిటళ్ల వరకూ వెళ్లాల్సిన శ్రమ తప్పడం కోసం అలాగే తమ ప్రైవసీని కాపాడుకోవడం కోసం టెక్నాలజీ ఆధారిత సలహాల మీద ఎలా ఆధారపడుతున్నారనే అంశం. ఇక రెండోది... ఏఐ ఆధారిత చాట్బాట్లు తమకున్న పరిజ్ఞానంతో సమాజాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో తెలపడం కోసం ఈ టర్కీ అబ్బాయి ఉదంతమే ఒక తార్కాణం.మేర దాటుతున్న మేధ... ఈ నేపథ్యంలో చూసినప్పుడు కొన్ని మెడికల్ యాప్స్ తమ నైతిక పరిధులను దాటుతున్నాయి. ఉదాహరణకు ‘యురేకా హెల్త్’ అనే ఓ యాప్ తనను తాను ‘‘ఆల్ ఇన్ వన్ హెల్త్ కంపేనియన్’గా ప్రకటించుకుంది. అంటే... ఆరోగ్యం విషయంలో అన్ని వ్యాధుల నిపుణుడూ తానే అయిపోయి ఆరోగ్య సమాచారాన్ని తెలుపుతానంటూ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ఆపిల్ యాప్ స్టోర్ మాత్రం కొంత సంయమనం పాటిస్తూ... ‘‘ఇది కేవలం తగిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే. తాను వ్యాధి నిర్ధారణగానీ లేదా చికిత్సగానీ చేయడానికి తగనం’’టూ’’ స్పష్టం చేస్తోంది. కానీ దాన్ని అభివృద్ధి చేసిన సంస్థవాళ్లు మాత్రం ‘మీకు మీరే మీ డాక్టర్’ అంటూ ప్రచారాలు చేసేస్తున్నారు. అలాగే ‘‘ఆస్క్, డయాగ్నోజ్, ట్రీట్’’ అనే మరో సైట్ వాళ్లు మరికాస్త ముందుకెళ్లి ‘‘మా ఐఏ వ్యాధి నిర్ధారణా చేసేస్తుంది. వాడాల్సిన మందుల్ని సూచిస్తూ ప్రిస్క్రిప్షన్ కూడా రాసేస్తుంది. ఈ ప్రపంచంలోని హాస్పి టల్స్లో వాస్తవంగా మీకు ఎలాంటి చికిత్స దొరుకుతుందో దాన్ని ఇక్కడే మీకు సూచిస్తుంది’’ అంటూ గొప్పలకు పోతున్నారు. అయితే... రాయిటర్స్ సంస్థలో వచ్చిన వార్తల వల్ల... ‘‘యురేకా హెల్త్’’ యాప్ కారణంగా జరిగిన అనర్థాలను తెలుసుకున్న తర్వాత ‘ఆపిల్’ సంస్థ సదరు యాప్ను తమ స్టోర్నుంచి తొలగించింది. అంతే కాదు... ఏ సమాచారం ఆధారంగా; ఏ పద్ధతుల ద్వారా; ఏయే అంశాల సహాయంతో వ్యాధి నిర్ధారణ విషయంలో ఆ నిర్ధారణకు వస్తున్నారో స్పష్టంగా తెలపాలంటూ యాప్ను అభివృద్ధి చేసే నిపుణులకు స్పష్టమైన సూచనలు చేసింది.మెడికల్ యాప్స్!ఇటీవల కృత్రిమమేధ (ఏఐ) సహాయంతో గూగుల్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే మెడికల్ యాప్ల సంఖ్య బాగా పెరిగింది. నిజానికి అవి ఎలాంటి వ్యాధి నిర్ధారణా చేయకూడదు. అయినప్పటికీ వాటిని ఆశ్రయించి... తమ సమస్య ఏమిటో తెలుసుకోవడమన్నది చాలా ఎక్కువైంది. అయితే ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది. నిజానికి ఏఐ ఎలాంటి వ్యాధినిర్ధారణా (డయాగ్నోజ్) చేయకూడదు. కానీ యూఎస్ ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) సంస్థ నియమాల ప్రకారం... ప్రజల ప్రాథమిక అవగాహన కోసమే సమాచారం తెలిపే సందర్భాల్లో ఆ చాట్బాట్లు ఎవరి అనుమతులూ తీసుకోనక్కర్లేదు. అందుకోసమే ‘‘తాము డాక్టర్కు ప్రత్యామ్నాయం కానేకాదనీ,వ్యాధిని నిర్ణయించడంలో విషయంలో తాము చేసేది ‘తుది నిర్ధారణ’ కాదం’’టూ స్పష్టంగా సూచన (డిస్కె›్లయిమర్) చేస్తుంటాయి. – యాసీన్ -
వెడ్డింగ్ డెస్టినేషన్స్ : సరస్సు నుంచి సముద్ర ద్వీపం వరకు
జీవితంలో వివాహం ఒక కీలక మలుపు. ఈ మలుపును ప్రత్యేకంగా నిలిపే ప్రయత్నమే ప్రత్యేక ప్రదేశాల్లో వివాహం లేదా డెస్టినేషన్ వెడ్డింగ్. ఇటలీలోని లేక్ కోమో తీరం అందమైన వేదికగా నిలుస్తుంది. నీటిలో ప్రతిబింబించే దీపాల కాంతులు, వెనుక నిలిచే పర్వతాలు ఇవన్నీ వెడ్డింగ్ డ్రీమ్కు ప్రతిబింబంలా కనిపిస్తావిదేశీ వివాహ వేదికలు శాంటోరిని, గ్రీస్: శాంటోరిని ద్వీపం తెల్లని గృహాలు, నీలి ఆకాశానికి ప్రసిద్ధి. సూర్యాస్తమ సమయంలో జరిగే వివాహం జీవితాంతం గుర్తుండే అనుభూతిగా మిగులుతుంది.సువాసనల మధ్య వివాహం : ఫ్రాన్స్ దేశంలోని లావెండర్ పూల తోటల మధ్య జరిగే వివాహం ఒక స్వప్నంలా అనిపిస్తుంది. బీచ్లో కళ్యాణం: ఇండోనేషియా దేశంలోని బాలి ద్వీపం సముద్రతీరప్రాంతం ప్రకృతి వైభవానికి ప్రసిద్ధి. అలల శబ్దం, పచ్చని చెట్లు, సంప్రదాయ అలంకరణలు అన్నీ కలిసి ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇలా ప్రతి ప్రదేశం తన ప్రకృతి, చరిత్ర, సంస్కతితో వివాహాన్ని ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చేస్తుంది. కొత్త ప్రదేశంలో కొత్త జీవితాన్నిప్రారంభించడం ఒక అందమైన అనుభూతిగా మిగిలిపోతుంది. దక్షిణ భారత వివాహ వేడుకలుఈ మధ్య ట్రెండ్గా మారిన డెస్టినేషన్ వెడ్డింగ్ లేదా ప్లాన్డ్ వెడ్డింగ్ ఇలా ప్రత్యేక ప్రదేశాల్లో పెళ్లి చేసుకోవడం కొత్త విషయం కాదు. దక్షిణ భారతంలో ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది.గోపురం మధ్యలో మంగళ ధ్వనితమిళనాడులోని మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో జరిగే వివాహం ఒక దివ్యానుభూతి. ఈ ఆలయం దక్షిణ భారత సంస్కృతికి ప్రతీక. సుప్రభాత వేళలో మంగళ వాయిద్యాలు వినిపిస్తుంటే ఆ వాతావరణం దివ్యానుభూతికి లోను చేస్తుంది. ఇక్కడ ఆలయ నిబంధనల ప్రకారం మాత్రమే వివాహాలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఆలయ అధికారులను సంప్రదించాలి.దేవుని సొంత నేలలో: కేరళలోని కుమారాకోమ్లోని జలసరి నడుమ ప్రకృతి సాక్షిగా వివాహం జరుగుతుంది. ఈ ప్రాంతం కొబ్బరి చెట్లు, నీటి ప్రతిబింబాలు, ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందింది.దక్షిణ భారత వివాహ వేదికలుజీవితంలో వివాహం ఒక కీలక మలుపు. ఈ మలుపును ప్రత్యేకంగా నిలిపే ప్రయత్నమే ప్రత్యేక ప్రదేశాల్లో వివాహం లేదా డెస్టినేషన్ వెడ్డింగ్. ఇటలీలోని లేక్ కోమో తీరం అందమైన వేదికగా నిలుస్తుంది. నీటిలో ప్రతిబింబించే దీపాల కాంతులు, వెనుక నిలిచే పర్వతాలు ఇవన్నీ వెడ్డింగ్ డ్రీమ్కు ప్రతిబింబంలా కనిపిస్తాయి.కోట వైభవం సాక్షిగా: హైదరాబాద్లోని చౌమహల్లా ప్యాలెస్లో రాజసంగా వివాహం నిర్వహించవచ్చు. హైదరాబాద్లోని ఈ రాజమహల్ నిజాం కాలపు వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడి వేడుకలకు ముందస్తు అనుమతులు అవసరం. ఇదీ చదవండి: వెడ్డింగ్ సీజన్ : కోటలో రాజసంగా వివాహంఊటి అసలు పేరు తెలుసా?! మనమందరం సాదాసీదాగా ఊటి అని పిలిచే ఈ హిల్ స్టేషన్ అసలు పేరు ఉదగమండలం. ఈ పేరు ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్లాలి. ఉదగమండలం అనే పేరు తోడా అనే తెగల భాష నుంచి వచ్చిందని స్థానికులు చెబుతారు. ఒతకల్ మండు లేదా ఉదగై మండలం అనే పదానికి అర్థం పర్వతాల మధ్యలో ఉన్న గ్రామం. నీలగిరి పర్వత ప్రాంతంలో నివసించే తోడా తెగల వారికి ఇది పవిత్ర స్థలం. విదేశీ పాలనకు ముందు ఈ ప్రాంతంలో తోడా తెగలే నివసించేవారు. తర్వాత వారి ఉచ్చారణకు అనుగుణంగా పేరును మార్చుతూ చివరకు ఊటి అని ప్రాచుర్యం పొందింది. అయినప్పటికీ స్థానికులు ఇప్పటికీ ఉదగమండలం అనే పేరును గౌరవంగా ఉపయోగిస్తారు. తెలిమంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని తేయాకు తోటలు, ప్రశాంత వాతావరణం ఈ ప్రాంతానికి ఉదగమండలం అనే పేరు ఎంతో తగినదిగా అనిపిస్తుంది. -
వెడ్డింగ్ సీజన్ : కోటలో రాజసంగా వివాహం
ఆరావళి నీడలో వివాహ వైభవంసరస్సుల నగరంలో కళ్యాణ వైభోగంవసంత కాలాన రాజస్థాన్లో వివాహాల సందడి నెలకొంటుంది. అక్కడి అందమైన సరస్సుల నడుమ ఉన్న రాజమందిరాలు కమణీయమైన కళ్యాణ మహోత్సవాలకు ప్రత్యేక వేదికలుగా మారుతాయి.రాజస్థాన్లో వెడ్డింగ్ సీజన్ అంటే ఒక రాజస అనుభూతిని సొంతం చేసుకునే అవకాశం కూడా. ఇక్కడి ఆరావలి పర్వత సిరుల మధ్య, సూర్యకాంతిని ప్రతిబింబించే జలసిరి సాక్షిగా జరిగే వివాహ వేడుక ఒక కళాత్మక సన్నివేశంలా అనిపిస్తుంది. ఈ భూమిలో పెళ్లి అంటే కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, అంతకు మించి జీవితాంతం నిలిచే మధురస్మృతి.సరస్సుల మధ్య వివాహ వైభవంవెడ్డింగ్ సీజన్లో ఉదయ్పూర్ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. సరస్సుల అందంతో ‘సిటీ ఆఫ్ లేక్స్’ గా పేరు పొందిన ఈ నగరం సూర్యాస్తమయం వేళ వర్ణరంజిత దృశ్యంగా మారిపోతుంది. ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ ప్రాంగణంలో జరిగే అలంకరణ, బాల్కనీ నుంచి సరస్సును చూస్తూ గడిపే క్షణాలు వధూవరులకే కాదు అతిథులకు కూడా చిరస్మరణీయంగా నిలుస్తాయి. అందుకే పలువురు ప్రముఖులు ఇక్కడే డెస్టినేషన్ వెడ్డింగ్కు ఆసక్తి చూపుతున్నారు.లేక్ పిచోలా మీద వెలిగే దీపాలు నీటిపై ప్రతిబింబించి కొత్త కాంతిని విరజిమ్ముతాయి. ద్వీపం మధ్యలో ఉన్న జగ్ మందిర్ సాయంత్రం వేళ స్వర్ణకాంతితో ప్రకాశిస్తుంది. ఫతే సాగర్ సరస్సు తీరంలో ప్రభాత వేళ హల్దీ, మెహందీ వేడుకలు మరింత అందంగా కనిపిస్తాయి. పుష్పాల మధ్య నిలిచిన సహేలియోకి బరి ఉద్యానవనం ప్రీ–వెడ్డింగ్ వేడుకలకు సజావుగా సరిపోతుంది.రాజస వేదికల ప్రారంభం: రాజస్థాన్లో శరదృతువులో ప్రారంభమయ్యే వివాహాల సందడివసంతకాలానికి చేరుకునే సరికి మరింత ఉత్సాహంగా మారుతుంది. పగలు సూర్యకాంతి, రాత్రి దీపాల వెలుగులతో కోటలు మరింత మాయాజాలంలా కనిపిస్తాయి. ఇక్కడి కోటల్లో వైభవంగా కళ్యాణం చేసుకోవాలని చాలా మంది కలలు కంటారు. పాలరాతి ప్రాంగణాల్లో రంగోలీలు చిత్రకథల్లా విరాజిల్లుతాయి. బ్యాండ్, బాజా, బారాత్ సందడితో సాయంత్రపు గాలి కూడా ఉత్సవ వాతావరణాన్ని అలుముకుంటుంది. ఈ రాజస భూమిలో వివాహ వేడుక ప్రకృతి మధ్యలో సాగే ఒక అనుభూతి. పర్వతాల నీడలో, సరస్సుల ప్రతిబింబంలో, ఎత్తైన కోటల మధ్య జరిగే కళ్యాణం ప్రతి క్షణం ఒక గీతంలా నిలుస్తుంది.సాంస్కృతిక వేదికరాజస్థానీ పెళ్లి అంటే రంగుల పండుగ. బంధనీ వస్త్రాలు, పగిడీ అలంకారం, జానపద నృత్యాలు ఇవన్నీ కలిసి వివాహాన్ని మరింత ఉత్సవంగా మార్చేస్తాయి. మండపం మధ్య అగ్ని సాక్షిగా జరిగే వివాహానికి పర్వతాలు, సరస్సులు, కోట శిఖరాలు నిశ్శబ్ద సాక్షులుగా నిలుస్తాయి. స్థానిక కళాకారుల సంగీతం, ఢోలు శబ్దం, షెహ్నాయి స్వరాలు వేడుకకు భావోద్వేగాన్ని జోడిస్తాయి. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు రెండు మనసుల కలయిక అని చాటుతాయి.ఉదయ్పూర్ రుచులురాజస్థాన్ భోజనం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. దాల్ బాటీ చూర్మా, గట్టే కి సబ్జీ, వివిధ రకాల మిఠాయిలు, కచోరీలు, జిలేబీలు ఇవన్నీ వివాహ విందును మరింత రుచికరంగా మారుస్తాయి. పర్యాటనకు సరైన సమయం శరదృతువు నుంచి వసంతకాలం వరకు ఉదయ్పూర్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో రాజస్థాన్ మరింత సుందరంగా కనిపిస్తుంది. ఈ సమయంలో వివాహాల ఉత్సాహం కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. రాజస్థాన్లో వివాహ సీజన్ అంటే రాజస శోభ, ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక సంగీతం కలిసిన ఒక సుగంధ అనుభూతి. ఫోటోల్లో కనిపించే దృశ్యాల కంటే గుండెల్లో నిలిచే జ్ఞాపకాలే ఎక్కువ. అందుకే అనేక మంది ఇక్కడ వివాహం చేసుకోవాలని కలలు కంటారు.ఎలా వెళ్లాలి? : తెలుగు రాష్ట్రాల నుంచి రాజస్థాన్కు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాయుమార్గం ద్వారా మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ఉదయ్పూర్కు ప్రయాణించవచ్చు. నగరంలోకి ప్రవేశించే సమయంలో పర్వతాల నీడలు, సరస్సుల అందాలు స్వాగతం పలుకుతాయి.ఏం చూడాలి?ఉదయ్పూర్లో సిటీ ప్యాలెస్, లేక్ పిచోలా, జగ్ మందిర్, ఫతే సాగర్ సరస్సు, సహేలియోకి బరి వంటి ప్రదేశాలు వివాహ సందర్బంలో మరింత అందంగా కనిపిస్తాయి. సరస్సుల తీరాలు, కోటల శిల్పకళ నగర వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. – ఎం.జి. కిశోర్,ప్రయాణికుడు -
జీవన చిత్రం
భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఆఫీస్లో అలసిపోయిన వారిద్దరూ ఓ సాయంత్రం ఇంటికి వచ్చారు. అప్పటికే వారి ఆరేళ్ళ కొడుకు బడినుంచి ఇంటికి వచ్చి ఉన్నాడు.తమ పుత్రరత్నం, చుట్టుప్రక్కల ఉన్న స్నేహితులనంతా ఇంటికి పిలిచి ఉన్నాడు. వారందరూ చేరి ఇల్లంతా పీకి పందిరి వేసి ఉన్నారు. భార్యాభార్తలిద్దరికీ కోపమొచ్చింది. ఇరుగు΄÷రుగు పిల్లల్ని గట్టిగా అరిచారు. తమ పుత్రరత్నాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.అమ్మనాన్నల తిట్లకు వాడు బుంగ మూతి పెట్టి సోఫాలో కూర్చుండిపోయాడు. వారిలో కోపం తగ్గలేదు. అలా బయటికి వెళ్ళి వస్తే మామూలు స్థితికి వస్తామనిపించింది. ఇద్దరూ ఇంటి బయటికి వచ్చారు. దగ్గరలోనే ఓ కళ్యాణ మంటపం ఉంది. ఆ రోజు ఆ కళ్యాణ మంటపంలో ఓ ఉత్తర భారత దేశ చిత్రకారుడు తన చిత్రాల్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. వాటిని చూద్దామని అక్కడికి వెళ్ళారు.మొత్తం చిత్రాలన్నీ పిల్లల చిత్రాలే. అందంగా అమాయకంగా ఉన్నాయి. మరికొన్ని కొంటె చూపుల్తో, పెద్దపెద్ద కళ్ళతో, కవ్వింపు ముఖంతో చూడముచ్చటగా ఉన్నాయి. మూడు వందలకి పైగా ఉన్న ఆ పిల్లల చిత్రాలన్నీ ఆ చిత్రకారుడు గీసినవే. కన్నార్పకుండా చూశారు. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించసాగాయి ఆ చిత్రాలు. చిత్రకారుడిని అభినందించాలని అతడి దగ్గరకు వెళ్ళారు.‘మీకు మీ పిల్లలంటే చాలా ఇష్టం కాబోలు, వారు చిన్నప్పుడు ఇంత అందంగా ఉండేవారేమో. అందుకే జీవం ఉట్టిపడేట్లు గీయగలిగారు’ అన్నారు. అతడు ఏమీ మాట్లాడలేదు. తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.చిత్రపటాలను సర్దుతున్న చిత్రకారుడి సహాయకుడు వీరిని పక్కకి పిలిచాడు. చిన్న గొంతుతో ‘ఆయనకు పెళ్లై పాతికేళ్ళయ్యింది కానీ, పిల్లలు లేరు. పుట్టే అవకాశం కూడా లేదు. పుట్టి ఉంటే ఇలా ఉంటారన్న ఊహే అతడిలోని చిత్రకారుడిని నిద్ర లేపింది. పెళ్లి అయ్యేంతవరకు అతడు చిత్రకారుడు కాదు. పిచ్చి గీతలు గీసే మనిషి మాత్రమే. పిల్లలు పుట్టరన్న విషయం తెలిసాకే అతడిలోని చిత్రకారుడు మేల్కొన్నాడు’ అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.నీరు లేని నాడే కదా నీటి విలువ తెలుస్తుందన్న విషయం గుర్తుకొచ్చింది భార్యాభర్తలకి. ‘పిల్లలన్నాక గొడవ చేయడం సహజం, మనకి పిల్లలున్నారు కాబట్టి మనకి వారి విలువ తెలియడం లేదు. పిల్లలు లేని వారి బాధ వర్ణనాతీతం కదా’ అని ఆలోచించారు. పరుగుపరుగున ఇంటికి వెళ్ళారు. కొడుకుతో పాటు వాడి మిత్రులకంతా తీపి మిఠాయిలు పంచారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
వృద్ధాప్యం ఆధ్యాత్మిక సాధనకు వరం
వృద్ధాప్యం అనేది జీవితమనే పుస్తకంలో చివరి అధ్యాయం కావచ్చు, కానీ అది అత్యంత విలువైన గౌరవప్రదమైన దశ. దీనిని కేవలం శారీరక క్షీణతగా కాకుండా, ‘అనుభవాల పండగ’గా చూడాలి. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గొచ్చు కానీ, జీవితాన్ని చూసే దృష్టి పెరుగుతుంది. ఏది ముఖ్యం, ఏది అనవసరం అనే విచక్షణ వారికి ఉన్నంతగా మరెవరికీ ఉండదు. అందుకే వారిని జ్ఞాన నిధులు అంటారు.వృద్ధాప్యంలో ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలు, పునస్కారాలకే పరిమితం కాదు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి., జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన పెంచుకోవడానికి చేసే ప్రయాణం. వృద్ధాప్యంలో శారీరక శక్తి తగ్గడం వల్ల కలిగే అసహనాన్ని ఆధ్యాత్మికత తగ్గిస్తుంది. రోజుకు కొద్దిసేపు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసు నియంత్రణలోకి వస్తుంది. జీవితంలో జరిగిన మంచి చెడులను సమానంగా స్వీకరించే గుణం అలవడుతుంది. వృద్ధాప్యం అనేది కేవలం శారీరక శక్తిని కోల్పోయే దశ కాదు, అది ఆధ్యాత్మిక పురోగతికి అత్యంత అనుకూలమైన సమయం. జీవితంలో బాధ్యతలన్నీ తీరిన తర్వాత, మనసును బయటి ప్రపంచం నుండి మళ్లించి లోపలికి (అంతర్ముఖం) పంపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. యవ్వనంలో ఉన్నప్పుడు ధనం, పదవి, పిల్లల భవిష్యత్తుపై ఉండే విపరీతమైన వ్యామోహం వృద్ధాప్యంలో క్రమంగా తగ్గుతుంది. కుటుంబంలో జరిగే విషయాలను ఒక సాక్షిలా గమనించడం అలవడుతుందిఅంతా ‘దైవేచ్ఛ’ అని భావించడం ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు.వృద్ధాప్యంలో శారీరక కదలికలు తగ్గినప్పుడు, మనసు లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ జీవిత పరమార్థం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం వెతకడం మొదలవుతుంది. అనవసరమైన మాటలు తగ్గించి, మౌనంగా ఉండటం వల్ల ప్రాణశక్తి వృధా కాకుండా ఆత్మజ్ఞానానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో అహంకారం సహజంగానే తగ్గుతుంది. నా వల్ల ఏమీ కాదు అని తెలిసినప్పుడు, భగవంతుడిపై నమ్మకం పెరుగుతుంది. ‘‘నేను నీ వాడిని, నీవే నన్ను నడిపించు’’ అని భగవంతుడికి పూర్తిగాఅప్పగించుకోవడం (శరణాగతి ) వల్ల కలిగే ప్రశాంతత అద్భుతమైనది. ఇది మరణం పట్ల భయాన్ని పోగొట్టి, ప్రశాంతమైన చిరనిద్రకు (మరణానికి) సిద్ధం చేస్తుంది. తమకున్న అనుభవాన్ని యువతరానికి పంచడం, నిస్వార్థంగా సలహాలు ఇవ్వడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే.అందరికీ వృద్ధాప్య దశ వరకు చేరుకునే అదృష్టం కలగదు. ఉన్న పెద్దలను గౌరవించడం అంటే మన భవిష్యత్తును మనం గౌరవించుకోవడమే. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అనుభవాలను గడించి, ఒక తరాన్ని తీర్చిదిద్దిన వ్యక్తులు వృద్ధులు. దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో లేదా కొన్ని కుటుంబాలలో వారిని ఒక భారంలా చూడటం కనిపిస్తుంది, కానీ అది సరైన దృక్పథం కాదు. ఈరోజు మనం వృద్ధులను ఎలా చూస్తామో, రేపు మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారు.వృద్ధాప్యం అనేది ప్రతి ఒక్కరికీ వచ్చే ఒక సహజ ప్రక్రియ. వారిని అనాథ శరణాలయాలకు పంపడం లేదా ఇంట్లో ఒక మూలకు పరిమితం చేయడం వంటివి కాకుండా, వారిని గౌరవప్రదంగా చూసుకోవడం మన సంస్కృతి.వృద్ధాప్యం అనేది ఒక పండు పక్వానికి వచ్చినట్లు. పండు పండితే తీపి పెరుగుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ మనిషిలో శాంతి, క్షమ, ప్రేమ అనే ఆధ్యాత్మిక గుణాలు పెరగాలి. అదే నిజమైన పురోగతి. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే మనలోని అశాంతిని వదిలి, శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కోవడం. వృద్ధాప్యంలో ఈ సాధన మరింత సులభం, ఎందుకంటే లోకజ్ఞానం మనకు అప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది.వృద్ధులను వేధించే ప్రధాన సమస్య ఒంటరితనం. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే భజనలు, ప్రవచనాలు లేదా ఆధ్యాత్మిక చర్చల (సత్సంగం ) ద్వారా సమాజంతో సంబంధం ఏర్పడుతుంది. పరమాత్మ ఎప్పుడూ నాతోనే ఉన్నాడు (భగవంతునితో అనుసంధానం) అనే నమ్మకం వారిలో ధైర్యాన్ని నింపుతుంది. జీవితం ఒక నిరంతర ప్రక్రియ అని, మరణం కేవలం ఒక మార్పు మాత్రమే అనే సత్యాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు బోధిస్తాయి. భగవద్గీత వంటి గ్రంథాల పఠనం ద్వారా మరణం పట్ల ఉండే భయం పోయి, చిత్తశుద్ధి కలుగుతుంది. గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఉన్నదానితో తృప్తి చెందడం (సంతోషం) అనేది గొప్ప ఆధ్యాత్మిక లక్షణం. బాధ్యతలు తీరిపోయాయి, ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాననే భావన వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.– రామలక్ష్మీ సదానందమ్ -
91 ఏళ్ల వయసులో ఇంత ఫిట్గానా..!
ఏడుపదుల వయసుకు చేరుకోగానే ఎంతటి ఫిట్నెస్ కోచ్లు అయినా లేదా క్రమం తప్రకుండా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహ ఉన్నా కూడా..యువకుల మాదిరిగా చురుకుగా ఫిట్గా ఉండటం కష్టమే. కానీ ఈ బామ్మ తొమ్మిది పదుల వయసులో యువతే విస్తుపోయాలే యాక్టివ్గా ఉండటమే కాదు..ఫోర్స్తో కూడిన వ్యాయామాలు చేస్తూ భళా అనిపించుకుంటోంది. ఎవరా ఆ సూపర్ బామ్మ అంటే..ఆ బామ్మే ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల జిల్. ఆమె కఠినమైన క్రమశిక్షణ కలిగిన జీవనశైలికి పేరుగాంచింది. ఆమె రోజుకు సగటున 12 వేల అడుగులు నడుస్తుందట. అంతేగాదు తరుచుగా సిడ్నీ హార్బర్ వంతెన మీదుగా ఒపెరా హౌస్కు వెళ్లే ఐకానిక్ ట్రెక్కు వెళ్తుందట. ఇది నిటారుగా ఉన్న కొండలు, అంతులేని మెట్లకు ప్రసిద్ధి చెందిన మార్గం. అలాగే వారానికి రెండుసార్లు ఈత కొట్టడం, బలాన్ని కాపాడుకునేలా యోగ, పైలేట్స్ వంటి సెషన్లు తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది. అలాగే అందరితోనూ సన్నిహితంగా ఉండేలా టచ్లో ఉంటానని, అది శారీరక వ్యాయామం వలే మనసుకోక ఆహ్లాదకరమైన వ్యాయామం అని అంటోంది. అంతేగాదు ఈ జిల్ బామ్మ దీర్ఘాయువు కోసం చురుగ్గా ఉండటమే మంచిదనేది తన అభిప్రాయామని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోని ఫిట్నెస్ కోచ్ థెరిసా మోలోనీ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. కాగా, శారీరక వ్యాయామం వలే దీర్ఘాయవు కోసం సామాజిక అనుసంధానం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నాయి అధ్యయనాలు. పైగా చురుకైన జీవనశైలి మంచి మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమను స్థిరంగా ఉంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది కూడా. నిజంగా ఈ బామ్మ సూపరో సూపర్ కదూ..!. View this post on Instagram A post shared by Certified Nutritionist and Fitness Coach (@theresa_moloney) (చదవండి: ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!) -
ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!
ఏడేళ్ల చిన్నారి..తన వయసుకు అనితరసాధ్యమైన దాన్ని అవలీలగా చేధించింది. పెద్దపెద్ద ఈతగాళ్ల డ్రీమ్ ఎలిఫెంటా ద్వీపం నుంచి ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఈదడం. కానీ ఈ చిన్నారి చాలా అవలీలగా చేసి శెభాష్ అనిపించుకుంది. అంతేగాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అత్యంత సవాలుతో కూడిన సముద్ర మార్గంలో ఈదడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..?..అస్సాంకి చెందిన ఏడేళ్ల కియుచెంఘన్ ఫుకాన్ ఈ ఘనత సాధించింది. ఆ చిన్నారి ఎలిఫెంటా ద్వీపం నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకు 3 గంటల 29 నిమిషాల్లో ఈదింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆ ఘనతను పూర్తి చేసింది. కియుచెంఘన్ ఎలిఫెంటా ద్వీపం నుంచి మధ్యాహ్నం 2:36 గంటలకు తన ఈత ప్రారంభించి సాయంత్రం 6:05 గంటలకు గేట్వే ఆఫ్ ఇండియాకు చేరుకుంది. ఈ ప్రదేశం బలమైన ప్రవాహాలు, మారుతున్న సముద్ర పరిస్థితులకు ప్రసిద్ధిచెందింది. ఇది అరేబియా సముద్రంలో అత్యంత కష్టతరమైన సముద్ర మార్గాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి కఠినతరమైన సముద్ర మార్గాన్ని ఏడేళ్ల ప్రాయంలో అవలీలగా జయించి.. ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కాగా, కియుచెన్ఘాన్ ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. హేమంగా ఫుకాన్ రిమ్లి, హజారికా ఫుకాన్ దంపతుల కుమార్తె. ఆ చిన్నారి కుటుంబం గౌహతిలోని సిక్స్ మైల్లో నివసిస్తుంది. ఈ చిన్నారి గౌహతిలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ అక్వాటిక్ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇక అస్సాం స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ దాస్ ఈ విజయాన్ని అస్సాంకే గర్వకారణంగా పేర్కొన్నారు. అస్సాం క్రీడా మంత్రి నందితా గార్లోసా ఈ చిన్నారి స్విమ్మర్ని అభినందించారు. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయి కూడా ఈ చిన్నారినే. View this post on Instagram A post shared by OPEN WATER SWIMMING ACADEMY, INDIA (@owsaindia) (చదవండి: డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..) -
‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
కంటతడిపై ‘కన్నే’యండి!కొందరిలో కళ్లనిండా నీళ్లు ఉండటం... కళ్లు చెమ్మగిల్లినట్టుగా ఉండటం కనిపిస్తుండేదే. ఇందుకు చాలా అంశాలు కారణమవుతాయి. ఇలా కళ్లలో నీరు ఉన్నట్లు కనిపిస్తుండటం, చెమ్మగిల్లుతూ ఉండటానికికారణాలేమిటో తెలుసుకుందాం.కారణాలు...కళ్లలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్తో కళ్లుమండుతూ ఉన్నప్పుడు దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి అంశాలతో అలర్జీ వల్ల కళ్లకలక (కంజంక్టివైటిస్) వంటి ఇన్ఫెక్షన్లతో కళ్లలో నీళ్లూరేందుకు ఉండే డక్ట్స్ మూసుకుపోవడంతో కన్నీళ్లు బలవంతంగా రావడానికి ప్రయత్నించడం ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ ఉన్నవాళ్లలో. ఇక్కడ ఒక సందేహం కలగడం సాధారణం. అంటే డ్రై ఐస్ సిండ్రోమ్లో కళ్లు పొడిబారాలి కదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి ఈ సిండ్రోమ్లో కళ్లుకు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీన్నే ‘డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కళ్లలో నీరు ఎక్కువగా ఊరుతుంది.నివారణ, చికిత్స...∙చిన్నపిల్లల కళ్లల్లో ఇలా నీరూరుతున్నప్పుడు లేదా కళ్లలోకి దుమ్మువెళ్లినప్పుడు పాతకాలపు పెద్దవాళ్లు ఓ మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను ఉండగా చేసి, దానిపై నోటితో గాలి ఊది దాన్ని కొద్దిగా వెచ్చబడేలా చేసి కంటిపై అద్దడం అన్నది కాస్తంత మధ్యవయస్కులకూ, పెద్దవాళ్లకు తెలిసిందే. అలా కాస్తంత గోరువెచ్చని ఆవిరితో గుడ్డను ఉండగా చేసి కళ్లపై అద్దడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది అలర్జీ వల్ల ఇలా జరిగినప్పుడు డాక్టర్ల సూచన మేరకు యాంటిహిస్టమైన్చుక్కల మందు వాడాలి. అలాగే ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరిగితే డాక్టర్లు యాంటీబయాటిక్ చుక్కల మందును సూచిస్తారు మాటిమాటికీ కళ్లను తాకకుండా ఉండాలి ∙ఇంతకు మించి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కళ్ల డాక్టర్ను సంప్రదించాలి.ఉబ్బు కళ్లు...కొందరిలో ఉబ్బుకళ్లు కనిపిస్తుంటాయి. పొద్దున్నే నిద్రలేవగానే కొద్దిసేపటి వరకు ఉబ్బుకళ్లు కనిపించడం మామూలే. కానీ కొందరిలో ఇవి చాలాసేపు అలాగే ఉండి΄ోతాయి. ఈ సమస్యను ఇంగ్లిష్లో ‘పఫ్ఫీ ఐస్’ అంటుంటారు. సాధారణంగా చాలామందిలో ఇది తాత్కాలిక సమస్యే. కళ్లు బాగా అలసి΄ోవడం (ఫెటీగ్) వల్ల కూడా ఇలా జరగవచ్చు.కారణాలు...∙రాత్రి ఎక్కువసేపు నిద్ర΄ోకుండా ఉండటం లేదా నిద్రలేమి కారణంగా ∙క్రితం రాత్రి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కొందరిలో ఉప్పుకారాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత ∙ఇక చాలామందిలో ఇలా కళ్లు ఉబ్బినట్టుగా ఉండటం లేదా కళ్ల కింద చర్మం జారినట్టుగా ఉండటమన్నది వయసు పెరుగుతుండటం (ఏజింగ్) వల్ల జరగవచ్చు ∙మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలోనూ, రక్తంలో ్ర΄ోటీన్ తక్కువగా ఉండటం వల్ల, అలాగే రక్తహీనత (అనిమియా) సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లలోనూ ఇలా ఉబ్బుకళ్లు కనిపిస్తాయి.నివారణ / చికిత్స...మెత్తటి టవల్ లేదా మెత్తటి గుడ్డను చల్లటి నీటిలో ముంచి కళ్లపై అద్దడం (కోల్డ్ కంప్రెస్)ఆహారంలో ఉప్పుకారాల మోతాదును తగ్గించడం కంటినిండా గాఢంగా నిద్ర΄ోవడం.డాక్టర్ రవికుమార్ రెడ్డి సీనియర్ కంటి వైద్య నిపుణులు ఈ సూచనలు పాటించండికళ్ల జాగ్రత్తల్లో 20 – 20 – 20 అనేది ఓ మంచి సూచన. అంటే... ప్రతి 20 నిమిషాలకోసారి మనం దృష్టిని కేంద్రీకరించి ఉన్న అంశంపైనుంచి (కంప్యూటర్ / ఫోన్) దృష్టి మరల్చి 20 ఫీట్ల దూరంలో ఉన్న మరో వస్తువును 20 సెకన్ల పాటు చూస్తుండటం. ఏకాగ్రతతో ఏదైనా పనిచేస్తున్నా లేదా వృత్తిరీత్యా కంప్యూటర్ స్క్రీన్ గానీ, టీవీ స్క్రీన్నుగానీ తదేకంగా చూస్తున్నప్పుడు ఇలా చేయడం మంచిది. టీవీ, కంప్యూటర్ లేదా మొబైల్ ఇలా ఏదైనప్పటికీ ఆ స్క్రీన్ టైమ్ను గణనీయంగా తగ్గించడం ∙తరచూ కన్రెప్పలను కదిలిస్తూ / మూస్తూ ఉండాలి. (అంటే బ్లింకింగ్ చేస్తూ ఉండాలి). ఫలితంగా కన్నీరు కంటిపైన సమంగా అలముకుని కంటిని పొడిబారకుండా కాపాడుతుంది ఇంట్లో లేదా ఆఫీసులో ఏసీ చాలాసేపు నడుస్తుంటే అక్కడి వాతావరణంలోని గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇలా చాలాసేపు ఏసీలో ఉన్నవారు కాసేపు మామూలు వాతావరణంలోనూ కిసేపు గడపాలి కళ్లజోడు తాలూకు గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్సులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. పవర్ మారిందని తెలుసుకోగానే తగిన పవర్ ఉన్న అద్దాలను మార్చుకోవాలి. ఈ కొద్ది΄ాటి జాగ్రత్తల తర్వాత కూడా కంటికి సంబంధించిన అసౌకర్యం తగ్గక΄ోతే వెంటనే కంటి డాక్టర్ను తప్పక సంప్రదించాలి. నిర్వహణ యాసీన్ (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..) -
మహాశివరాత్రికి సాత్విక వంటకాలు..! హెల్దీగా ఉపవాసం చేద్దాం ఇలా
మహాశివరాత్రికి సాత్వికంగా ఉండే వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి రహిత ఆహారాలు తీసుకుంటుంటారు. ఎలాగో మహాశివరాత్రి అంటేనే ఉపవాసం. అయితే చాలామంది భక్తులు నిర్జల ఉపవాసం ఉంటారు. అయితే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు అంతలా కఠిన ఉపవాసాలు ఉండటం కష్టమే. ఒక పక్క అత్యంత పవిత్రమైన రోజు, మరోవైపు శరీరం సహకరించక అవస్థలు పడే వాళ్లు..ఇలాంటి సాత్విక వంటకాలను తీసుకుంటూ..హెల్దీగా ఉపవాసం చేయొచ్చని పెద్దలు చెబుతున్నారు. అంతేగాదు పురాణాలు సైతం శరీరాన్ని కష్టించేలా భక్తి అవసరం లేదని, చక్కగా తింటూనే పూజలు చేయండనే చెబుతున్నారు. పైగా ముందు భుక్తి తర్వాతే భక్తి అన్నారు. అయినా పొట్టలో కాసింత ఆహారం ఉంటేనే ఆధ్యాత్మికతవైపు, భక్తివైపుకి మనసు మళ్లేది. కాబట్టి ఈ పుణ్యప్రదమైన శివరాత్రి రోజున హాయిగా చేసుకుని తిసే సాత్విక వంటకాలేంటంటే..మిల్లెట్లు, దగ్గరన నుంచి సుబుదాను, కుట్టు అట్ట, సింఘార పిండి, పాలు, పండ్లు, నట్స్ తదితరాలను హాయిగా తీసుకోవచ్చట. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి ఎక్కువసేపు ఉపవాసం ఉండేలా, పూజలు చేసుకునేందుకు సౌకర్యవంతగాను ఉంటుంది కూడా. ఆరోగ్యకరమైన సాత్విక వంటకాలు..సబుదాన ఖిచ్డి కాస్త ఓదార్పునిచ్చి..ఆకలిని నియంత్రణలో ఉంచుకునే శక్తిని అందిస్తుంది. పైగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది కూడా. ఎలా చేస్తారంటే..కావలసినవి..సబుదాన – 1 కప్పుఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 మీడియంవేయించిన వేరుశనగలు (తురిమినవి) – ¼ కప్పుజీలకర్ర – ½ స్పూన్పచ్చిమిర్చి (తరిగినవి) – 1సెంధా నమక్ – రుచికి సరిపడానెయ్యి – 1 టేబుల్ స్పూన్తయారీ..ముందుగా సబుదానా(సగ్గుబియ్యం) కడిగి 4–5 గంటలు నానబెట్టండి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర పచ్చిమిర్చి,బంగాళాదుంపలు బాగా వేయించాలి. అవి ఉడికాక నానబెట్టిన సబుదాన, వేరుశెనగ పొడి, ఉప్పు జల్లి, ఓ రెండు నిమిషాలు ఉడికించండి. అంతే సబుదాన ఖిచ్డి రెడీ..!.సామా కే చావల్ ఖిచ్డిసామా కే చావల్ అని పిలువబడే బార్న్యార్డ్ మిల్లెట్ ఉపవాస భోజనాన్ని తేలికగా, పోషకంగా చేస్తుంది. ఈ సాత్విక్ ఖిచ్డి సరళంగా అనిపిస్తుంది కానీ ఓదార్పునిస్తుంది, మహాశివరాత్రి సమయంలో ఎక్కువసేపు ఉపవాసం ఉండటానికి సరైనది.కావలసినవి సమా కే చావల్ – 1 కప్పుఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 చిన్నవిజీలకర్ర – ½ స్పూన్అల్లం (తురిమినది) – 1 స్పూన్ఉప్పు: తగినంతనెయ్యి – 1 టేబుల్ స్పూన్నీళ్ళు – 2 కప్పులుతయారీ: ముందుగా మిల్లెట్లు బాగా కడగాలి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయించాలి, ఆ తర్వాత అల్లం, బంగాళ దుంప, మిల్లెట్, నీరు కలపాలి. మిల్లెట్ మెత్తగా ఉడికిపోతే..రెడీ అయిపోయినట్లే.కుట్టు అట్ట చీలాకుట్టు అట్ట చీలా వ్రత భోజనాలకు వెచ్చదనం తోపాటు తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఎలా చేస్తారంటే..కావల్సినవి..కుట్టు అట్ట – 1 కప్పుఉడికించిన బంగాళాదుంప (గుజ్జు) – 1 చిన్నవిపచ్చిమిర్చి (ఐచ్ఛికం) – ½ స్పూన్ఉప్పు: తగినంతనీరు – ¾ కప్పునెయ్యి – 1 స్పూన్తయారీ విధానం..కుట్టు అట్ట, బంగాళాదుంప, కారం, ఉప్పు, నీరు కలపండి.నునుపైన పిండిలా కలపాలి. వాటి చిన్నసైజు బజ్జీల్లా పాన్లో వేయించాలి. రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయిస్తే చాలు. పెరుగుతో వడ్డించి తింటే రుచి అదుర్స్.వ్రత్ వాలే ఆలూసంక్లిష్టమైన మసాలా దినుసులు లేకుండా సింపుల్గా చేసే వ్రత్ వాలే ఆలూ శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.కావలసినవి :ఉడికించిన బంగాళాదుంపలు – 2 మీడియంజీలకర్ర – ½ స్పూన్పచ్చిమిర్చి – 1ఉప్పు: తగినంతనల్ల మిరియాలు – ¼ స్పూన్నెయ్యి – 1 టేబుల్ స్పూన్తయారీ: నెయ్యి వేడిచేసి జీలకర్ర, తరిగిన బంగాళ దుంపలు బాగా వేయించి. దించేముందు కారం, ఉప్పు, నల్లమిరియాలు, చల్లుకోవాలి. ఇవి కరకరలాడుతూ ఉంటాయి.లౌకి ఖీర్లౌకి ఖీర్ మహాశివరాత్రి ఉపవాసానికి తీపి వంటకం ఇచ్చే శక్తి అమోఘమైంది. మరి ఇదేలా చేస్తారంటే..ఇక్కడ లౌకి అంటే అనపకాయ అని అర్థం.కావలసినవి:తురిమిన లౌకి(అనపకాయ ముక్కలు)- 1 కప్పుపాలు - 2 కప్పులుబెల్లం - 3 టేబుల్ స్పూన్లుఏలకుల పొడి - ¼ స్పూన్తరిగిన గింజలు - 1 టేబుల్ స్పూన్తయారీ..తురిమిన లౌకిని పాలలో తక్కువ మంట మీద ఉడికించాలి.మెత్తగా, కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మరిగించండి.బెల్లం వేసి బాగా కలపండి. ఏలకులు పొడి వేసి సర్వ్ చేయండి. ఇది మహాశివరాత్రి ఉపవాసానికి బెస్ట్ డెజర్జ్.(చదవండి: పరమ దయాళువు ఆదిభిక్షువుని అర్చించుకుందాం ఇలా..!) -
పరమ దయాళువు ఆదిభిక్షువుని అర్చించుకుందాం ఇలా..!
దేవతలందరిలోకీ పరమ బోళా వాడు పరమేశ్వరుడొక్కడే. అవతలి వాడు అసురుడని, వాడు కోరుతున్న వరం లోకాలకే కాదు, తనకు కూడా ముప్పు కలిగిస్తుందని తెలిసి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదెప్పుడూ. ‘అదిన్నీ నీ పతిప్రాణంబు దక్క..’ అని సతీ సావిత్రికి యముడు పెట్టినట్టు మెలిక పెట్టలేదు. కోరిన వరాన్ని కోరిన విధంగానే అనుగ్రహించేశాడు ఆనక తానెన్ని తిప్పలైనా పడనీ... అందుకు ఉదాహరణే గజాసురుడు, భస్మాసురుడు, బాణాసురుడు. వారు కోరిన వరాలను ముందు వెనకలు ఆలోచించకుండా నెరవేర్చేశాడు. గజాసురుడు తన గర్భంలో వసించమని కోరితే ‘వస్తున్నాను పో΄ అనుకుంటూ అమాంతం అతడి పొట్టలోకి దూరిపోయాడు. ఇక భస్మాసురుడు తాను ఎవరి నెత్తిన చేయి పెడితే వారు భస్మం అయి΄ోయేలా వరం అడిగితే ‘ఇచ్చితిని పో’ అన్నాడు. ఆనక అతడి నుంచి తప్పించుకోలేక పరుగులు తీయాల్సి వచ్చింది. ఆ తర్వాత బాణాసురుడు తన నగరానికి కాపలా కాయమంటే ‘చిత్తం మహాప్రభో’ అనేశాడు. రావణాసురుడు తన ఆత్మలింగాన్ని అడిగితే అరక్షణంలో అనుగ్రహించేశాడు. అది అతడికి దక్కితే ఆపై వాడి ఆగడాలకు ఇక పట్టపగ్గాలుండవని తెలిసి తక్కిన దేవతలందరూ కలిసి ఆత్మలింగాన్ని దక్కనీయకుండా చేయడం ఆ తర్వాత సంగతనుకోండి... అంతేనా! అనుగ్రహించడంలోనే కాదు... ఆయనకు ఆగ్రహం వచ్చినా కూడా పట్టలేరెవరూ... భయంతో తనను కాపాడమంటూ శరణుజొచ్చిన మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి పాశం విసిరినందుకు యముడి మీద కోపంతో ఎడం కాలితో ఒక్క తన్ను తన్ని అంతకుణ్ణే అంతం చేసిన కాలాంతకుడాయన! తపోదీక్షలో ఉన్న తన మనసును మథించిన మన్మథుణ్ణి ఒక్క కంటి చూపుతో కాల్చి బూడిద చేశాడు. ఒక్క హుంకారంతో అసురుణ్ణి, అతడి సైన్యాలనూ అంతం చేసిన మహాకాలే శ్వరుడాయన. ఆ పరమ శివుడు... ఆ ఆదిభిక్షువు.. ఆ పరమ దయాళువు... ఆ ఉమా మహేశ్వరుడు పట్టరాని సంతోషంతో ఆనంద తాండవం చేసే మహా పర్వదినమే మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఇలా అర్పించాలిపరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన మహాశివరాత్రి పర్వదినాన చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ అర్చనలు, అభిషేకాలు, ఆరాధనలు, పంచాక్షరీ పారాయణలతో పరవశించిపోతుంటాయి. జన్మానికో శివరాత్రి అన్నట్టు... ఈ పర్వదినాన ఆ ముక్కంటిని ఏ విధంగా మొక్కాలో పెద్దలు చెప్పిన విధం తెలుసుకుందాం... శివరాత్రి వేళ సూర్యోదయం కంటె ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి శివపూజలు, అభిషేకాలు చేయాలి. పగలంతా ఉపవాస వ్రతాన్ని పాటించడంతోపాటు రాత్రంతా జాగరణ చేయాలి. మొదటిజాములో పరమేశ్వరుణ్ణి పాలతో అభిషేకించి, పుష్పాలతో పూజించి, పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండోజాములో పెరుగుతో అభిషేకించి, తులసీదళాలతో పూజించి, పాయసాన్ని నివేదించాలి. మూడవ జాములో నేతితో అభిషేకించి, మారేడు దళాలతో పూజించి, నువ్వులతో వండినపదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. నాలుగవ జాములో తేనెతో అభిషేకించి పుష్పాలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీటితోపాటు లింగోద్భవ సమయంలో పూజలు చేయడంతోపాటు శివనామస్మరణంతో రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటిరోజు తిరిగి శివపూజలు చేసి నైవేద్యం సమర్పించి, భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. ఈ మహాపర్వదినాన పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరిపించడం ఆచారం. ఏకబిల్వం శివార్పణం... శివరాత్రినాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని, కనుక శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైనా శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది.శివరాత్రిదానం మహాపుణ్యఫలంసంపద కలిగిన వారు ఈరోజు శక్తిని అనుసరించి బంగారం లేదా వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందని, లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా... అంతులేనన్ని సంపదలు కలుగుతాయని శాస్త్రోక్తి.– డి.వి.ఆర్. (చదవండి: ఆయన జగం ..ఆమె సగం) -
14 కిలోల బరువు తగ్గిన డాక్టర్..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..
వెయిట్లాస్ జర్నీలో అనేది శారీరక, భావోద్వేగ ఇబ్బందులతో ముడిపడి ఉన్న అంశం అని అంటోంది ఓ డాక్టర్. తాను ప్రెగ్నెన్సీ అనతరం ఎంతలా బరువు పెరిగిందో సవివరంగా తెలిపింది. ఆ తర్వాత బరువు తగ్గే క్రమంలో ఎంతలా శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కుందో తెలిపింది. ఆఖరికి వెయిట్లాస్ మందులు సైతం పెద్దగా ఫలితం ఇవ్వకపోగా..చివరికి దుష్ప్రభావాల బారినపడి ఎంతలా ఇబ్బందిపడిందో పేర్కొంది. అయితే బరువు తగ్గాలంటే అచంచలమైన ఓపిక, స్థిరత్వం అత్యంత ముఖ్యమని అంటున్నారామె. అలా అన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ..ఒకటిన్న ఏడాదిలోపు చాలా బరువు తగ్గగలిగానని అంటోంది. ఎవరా డాక్టర్..? ఆమె వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందంటే..చెన్నైకి చెందిన వైద్యురాలు ప్రీతి మృణాళిని తన వెయిట్లాస్ జర్నీ గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన లాపరోస్కోపిక్ బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళినికి వైద్యురాలిగా 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆమె ప్రసవం తర్వాత తన బాడీ ఎలా మారిపోయిందో వివరించారు. 2021లో గర్భందాల్చినప్పుడు తన బరువు 78 కిలోలని పేర్కొంది. అయితే 2022లో ప్రసవం అనంతరం 79 కిలోలకు చేరుకున్నట్లు వెల్లడించారు. అందులోనూ సీ సెక్షన్ కారణంగా ఒక నెలపాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బిడ్డకు ఫీడింగ్ ఇవ్వడంతో విపరీతమైన ఆకలి విపరీతంగే వేసేదని, దాంతో 92 కిలోలు దాక పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ప్రతి ఉయం మేల్కొని వ్యాయామాలు చేస్తూ ఉండేదాన్ని..అయితే బరువులో మార్పు లేకపోగా..మరింత అధికమైంది. ఈ అధిక బరువు తన రూపంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని అంటోంది. అప్పుడే జీఎల్పీ 1 అనే బరువు తగ్గించే మందులను వాడినట్లు తెలిపారు. దాంతో మార్పు కనబడటం మొదలైది కానీ ఒక కిలోనే తగ్గానని అన్నారు. అయితే ఈ డ్రగ్ కారణంగా జుట్టు రాలిపోవడం, నోరు పొడిబారడం, వ్యాయమం సమయలో కండరాల అలసట తదితర సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. అయితే చాలా ఓపికతో తన జీవనశైలిని మార్చుకుని..బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టి సుమారు 14 కిలోలు తగ్గినట్టు తెలిపారు. సమారు ఏడాదిన్నరకి మంచి ఫలితాన్ని అందుకోగలిగానని అన్నారు. డాక్టర్ మృణాలిని చెబుతోంది ఒకటే..బరువు తగ్గడంలో కావాల్సింది, ఓపిక, భావోద్వేగాన్ని నియంత్రించేలా స్థిరతత్వం అత్యంత ప్రధానమని అంటోంది. కాగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..జీఎల్పీ 1 మందులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, కడుపు నిండిపోయిన అనుభూతిని, జీర్ణక్రియను నెమ్మదింపచేసేలా సహజ హర్మోన్లా అనుకరించే మందు. కానీ ఈ మందులు వైద్యుల పర్యవేక్షణలో సలహాలు సూచనలతో వాడాల్సి ఉందనేది గ్రహించాలి. View this post on Instagram A post shared by Dr.Preethi Mrinalini | Laparoscopic & Bariatric Surgeon (@dr.preethimrinalini)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..) -
మీరు అలసిపోయారా? విసిగిపోయారా?
"ఉదయం నిద్ర లేవగానే ఒళ్లంతా భారంగా ఉంటుంది.. ఆఫీసుకి వెళ్లాలనే ఉత్సాహం అస్సలు ఉండదు.. చేసే పని మీద ఏకాగ్రత కుదరదు.." ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా? అయితే మీరు కేవలం 'అలసిపోలేదు', మీరు 'బర్న్ అవుట్' (Burnout) కి గురవుతున్నారు. సాధారణ అలసట ఒక రాత్రి నిద్రతో పోతుంది, కానీ బర్న్ అవుట్ అనేది నిద్రపోయినా తగ్గని ఒక దీర్ఘకాలిక మానసిక నిస్సత్తువ.బర్న్ అవుట్ అంటే ఏమిటి?యంత్రం అతిగా వాడితే ఎలా వేడెక్కి ఆగిపోతుందో, మనిషి కూడా తన శక్తికి మించిన మానసిక ఒత్తిడిని నిరంతరం భరిస్తే 'బర్న్ అవుట్' అవుతాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని ఒక 'వృత్తిపరమైన రుగ్మత'గా గుర్తించింది. ఇది పని పట్ల విరక్తిని, అపనమ్మకాన్ని కలిగిస్తుంది.4 ముఖ్య సంకేతాలు...1. Emotional Exhaustion ( నిరంతర అలసట): రాత్రి 8 గంటలు పడుకున్నా, ఉదయం లేవగానే ఇంకా నిద్ర చాలలేదన్నట్టు, శక్తి లేనట్టు అనిపించడం. ఇది శారీరక అలసట కాదు, మానసిక శ్రమ వల్ల కలిగే నీరసం.2. Cynicism (నిరాశావాదం): ఒకప్పుడు ఇష్టంగా చేసిన పని ఇప్పుడు భారంగా అనిపించడం. సహోద్యోగుల మీద, క్లయింట్స్ మీద కారణం లేకుండా కోపం రావడం. "నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల ఉపయోగం ఏంటి?" అనే నైరాశ్యం.3. Reduced Productivity (తగ్గిన పనితీరు): ఎంత ప్రయత్నించినా పాత వేగంతో పని చేయలేకపోవడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా గంటల తరబడి సమయం పట్టడం.4. శారీరక సమస్యలు: కారణం లేని తలనొప్పి, కడుపులో అసౌకర్యం, తరచూ అనారోగ్యానికి గురవ్వడం. మనసు పడే ఒత్తిడిని శరీరం ఇలా బయటపెడుతుంది.నా వద్దకు వచ్చిన ఒక సీనియర్ బ్యాంక్ మేనేజర్ రాధ (పేరు మార్చాను) కథ ఇక్కడ చెప్పుకోవాలి. ఆమె 15 ఏళ్లుగా అద్భుతంగా పని చేస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా ఆమె ఆఫీసులో అందరితో గొడవ పడుతోంది. "నాకు ఈ జాబ్ వద్దు, నేను రాజీనామా చేస్తాను" అని ఏడుస్తూ చెప్పింది. వాస్తవానికి ఆమెకు పని చేతకాక కాదు, గత మూడేళ్లుగా సెలవు తీసుకోకుండా పని చేయడం వల్ల ఆమె మెదడు 'బర్న్ అవుట్' స్టేజ్ కి చేరుకుంది. ఆమెకు కావాల్సింది రాజీనామా కాదు, ఒక సుదీర్ఘమైన 'మెంటల్ బ్రేక్'.బయటపడటం ఇలా...* మీ శక్తికి మించిన బాధ్యతలను స్వీకరించడం ఆపండి. ప్రయారిటీలను సెట్ చేసుకోండి. 'నో' చెప్పడం నేర్చుకోండి.* ఆఫీస్ సమయం తర్వాత ల్యాప్టాప్, ఆఫీస్ వాట్సాప్ గ్రూపులకు దూరంగా ఉండండి. డిజిటల్ కనెక్షన్ కట్ చేయండి. మీ మెదడుకు 'ఆఫ్ టైమ్' ఇవ్వండి. * మీకు ఇష్టమైన పని (సంగీతం, పెయింటింగ్, లేదా నడక) కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించండి. హాబీలను పునరుద్ధరించండి. ఇది మీ మెదడుకు రీఛార్జ్ లా పనిచేస్తుంది.* విశ్రాంతిని ప్లాన్ చేయండి. సెలవు తీసుకోవడం అంటే సోమరితనం కాదు. అది మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి తీసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్.ఈ వారం మీ కోసం పరీక్ష...* మీకు ఇష్టమైన పనులు చేయడానికి కూడా ఇప్పుడు ఉత్సాహం ఉండటం లేదా?* ఆఫీసులో చిన్న పొరపాటు జరిగినా అతిగా స్పందిస్తున్నారా (Overreacting)?* ఒంటరిగా ఉండాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని అనిపిస్తోందా?పై మూడింటికి 'అవును' అని సమాధానం వస్తే, మీరు బర్న్ అవుట్ వైపు వెళ్తున్నారని అర్థం చేసుకోండి.గుర్తుంచుకోండి.. కాలిపోయిన కొవ్వొత్తి వెలుగునివ్వలేదు. మీరు ఇతరులకు, మీ కంపెనీకి ఉపయోగపడాలి అంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీలోని ఉత్సాహం ఆవిరి కాకముందే మేల్కొనండి. బర్న్ అవుట్ లేదా కెరీర్ ఒత్తిడి నుండి బయటపడటానికి కౌన్సెలింగ్ లేదా కోచింగ్ తీసుకోండి.- సైకాలజిస్ట్ విశేష్ కెరీర్ & మైండ్సెట్ కోచ్8019 000066www.psyvisesh.com -
రోడ్డు ఎలా వేస్తారు? పెద్ద తతంగమే!
పిల్లలూ! మీరు రోజూ స్కూల్కి వెళ్లడానికి, తిరిగి ఇంటికి రావడానికి రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారు కదా! మనుషులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు ఉన్న రకరకాల రవాణా మార్గాల్లో రోడ్లు అత్యంత కీలకమైనవి. మన దేశంలో ఇంకా రోడ్డు లేని అనేక ప్రాంతాలున్నాయి. అక్కడి మనుషులు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇంత కీలకమైన రోడ్డు ఎలా వేస్తారో మీకు తెలుసా?రోడ్డు నిర్మాణానికి ముందుగా కావాల్సింది ప్రణాళిక (ప్లానింగ్). ఆ రోడ్డు ఏయే ప్రాంతాలను కలుపుతుంది, ఆ రోడ్డు విస్తీర్ణం ఎంత, రోడ్డు వేసే నేల స్వభావం ఎలాంటిది వంటి అంశాలను ఇంజినీర్లు పరిశీలించి ఓ ప్రణాళిక రూపొందిస్తారు. అనంతరం సర్వే చేపడతారు. ఆపైన మట్టి పని మొదలవుతుంది.ఎగుడుదిగుడుగా ఉండే దారిని చదునుగా చేస్తారు. లోతట్టుగా ఉండే ప్రాంతంలో బయట నుంచి మట్టి తెప్పించి పోస్తారు. అప్పుడే రోడ్డు వేయడం వీలవుతుంది. అనంతరం రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా సైడు కాల్వలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు లేకపోతే వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అనంతరం రాళ్లు, కంకరను పొరలు పొరలుగా ఆ భూమిపై వేసి రోడ్ రోలర్లతో బాగా నొక్కుతారు. దీంతో ఆ ప్రాంతం రోడ్డు వేసేందుకు సిద్ధమవుతుంది. చివరిగా తారు లేదా కాంక్రీట్ మిశ్రమాన్ని వేసి రోడ్డుకు చివరి రూపు ఇస్తారు. అలా రోడ్డు సిద్ధమవుతుంది. ఇదీ చదవండి: టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా? -
ప్రేమంటే అంతేగా! అంతేగా!
‘అంతేగా... అంతేగా’ ఈ సినిమా డైలాగ్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయింది. ‘ముద్దమందారం’ ప్రదీప్ కాస్తా ‘అంతేగా.. అంతేగా’ ప్రదీప్ను చేసింది. నేటికాలం ప్రేమలకు అసలు సిసలు శత్రువు ఇగో. చిన్న చిన్న ఇగోలతోనే లవ్ బ్రేకప్లు పెరుగుతున్నాయి. ‘నా మాటే నెగ్గాలనే’ పంతానికి పోకుండా ‘అంతేగా! నువ్వు చెప్పింది రైటే కదా!’ అనే ఒక్కమాట ప్రేమను పదికాలాల పాటు నిలుపుతుంది.వంద అబద్ధాలు ఆడయినా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ఒక్క అంతేగా, అంతేగా! డైలాగ్ వాడితే ఎన్ని ప్రేమలైనా నిలబెట్టుకోవచ్చు.. సరదాగా నవ్వుకుని.. కాస్త సీరియస్గా ఆలోచించండి.‘సెల్ఫ్ సెంట్రిక్గా ఉండే ప్రేమలు దీర్ఘకాలం మనలేవు. రిలేషన్ ఒక పుష్పగుచ్చంలా ఉండేలా చూసుకోవాలి’ అంటున్నారు సీనియర్ నటుడు ప్రదీప్ కొండపర్తి, సరస్వతి దంపతులు. 37 ఏళ్ల కుటుంబ జీవనంలోని ప్రేమను ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా పంచుకున్న విశేషాలు..ఆరేంజ్డ్ నుంచి లవ్ప్రదీప్: మాది మ్యారేజ్ తర్వాత ప్రేమ. అరేంజ్డ్ మ్యారేజ్. చెట్టుకు నీళ్లు పోస్తేనే అది పువ్వులు ఇస్తుంది. మనిషి కూడా అంతే, గుప్పెడు ప్రేమను పంచితే తిరిగి ప్రేమను అందిస్తాడు. ఈ మార్గాన్ని ఎంచుకున్నాం కాబట్టి ప్రేమ అనే పుష్పగుచ్చంలో ఇలా సాగిపోతున్నాం. సరస్వతి: నా ఎం.ఎ. తర్వాత పెళ్లి అయ్యింది. చిన్న కుటుంబం నుంచి ఉమ్మడి కుటుంబంలోకి వచ్చాను. ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాల్సినవి, మలుచుకోవాల్సినవి తప్పక ఉంటాయి. నేను కొంచెం సైలెంట్. ప్రదీప్ గారితో జర్నీ స్టార్ట్ అయ్యాక ఆయన అందించిన ప్రేమ, కంఫర్ట్ వల్ల సులువుగా అందరిలో కలిసిపోయాను. పెళ్లి తర్వాత పీహెచ్డి చేశాను, యాంకరింగ్ ఫీల్డ్లోకి వచ్చాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాను.. ఇదంతా ప్రదీప్గారి సపోర్ట్ వల్లే.భేదాభిప్రాయాలుసరస్వతి: సాధారణంగా ఎదుటివారిని మార్చాలనుకున్నప్పుడే విభేదాలు తలెత్తుతాయి. అయితే, మన ప్రవర్తన ద్వారా అవతలి వాళ్లలో మార్పు తీసుకురావచ్చు. ఇద్దరూ ఓపెన్గా ఉంటేనే పాజిటివ్ ఛేంజ్ తీసుకు రాగలుగుతాం. నా వరకు నేను డిసిప్లిన్గా ఉంటాను. టైమ్, నీట్నెస్.. ఖచ్చితత్త్వం పాటిస్తాను. ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే కొంత పాజ్ ఇచ్చి చూడాలి. అప్పుడు వారికే అర్థమైపోతుంది.ప్రదీప్: ఇద్దరమూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రెయినర్స్గా ఉన్నాం. కాబట్టి, ముందు మేం పాటించి, అవి మిగతావారికి చెబుతాం. అందుకే, మాట తీరు, ప్రవర్తన సరిగ్గా ఉండటానికి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏది చేసినా మనవాళ్లతో బాగుండటానికే అనుకుంటే ఎన్ని విభేదాలు ఉన్నా అవి పెద్దవిగా అనిపించవు.త్యాగాలుప్రదీప్: ఎంత బిజీ అనుకున్నా సరే కొన్నింటికి తప్పక టైమ్ కేటాయించుకోవాల్సిందే! కలిసి చేసే ప్రయాణంలో బిజీ అంటే కుదరదు. ‘నా నుంచి మన’ అనుకుంటే అద్భుతమే కదా! సరస్వతి: ఇద్దరి మధ్య స్నేహం ఉండాలి. ఎదుటివారి కోణంలో నుంచి ఆలోచించాలి. చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ఏదైనా సందర్భం ఎదురైనప్పుడు ‘ఇబ్బంది పడకు, నేను చూసుకుంటాలే’ అని చెప్పాలి. ఎక్కడైనా పొరపాటు జరిగితే, దానిగురించి అవతలి వారికి చెప్పే సంస్కారం ఇద్దరిలోనూ ఉండాలి. బలహీనతలను పట్టుకొని నస పెట్టకూడదు. కొన్ని విషయాల్లో సర్దుకుపోయే తత్త్వం ఉండాలి.అలవాట్లుప్రదీప్: రిలేషన్ షిప్ను ఒక బొకేలా తీసుకుంటే అందులో అలవాట్లు కూడా వస్తాయి. అయితే, అలవాట్లు వ్యసనాలు కాకూడదు. పాటలు పాడటం, రచనలు చేయడం, టీవీ.. ఇలా చాలా విషయాల్లో భార్యాభర్తల అలవాట్లలలో తేడాలు ఉంటాయి. వాటి గురించి కామెంట్స్ చేయడం, జోకులేయడం చేస్తే.. బాధపడే సందర్భాలూ ఉంటాయి. రోజులో అరగంటసేపైనా మాట్లాడుకుంటే ఇద్దరి మధ్యా అవగాహన పెరుగుతుంది. సరస్వతి: ఇద్దరికీ నష్టం కలుగుతున్నాయనుకున్న అలవాట్లు ఏవైనా ఉంటే వాటిని పక్కన పెట్టేయడమే మేలు. మా వరకు విసుగు అనిపించే అలవాట్లు లేవు. చాలా మందికి వ్యసనాల వల్ల సమస్య ఉంటుంది. ముందుగా గుర్తించి, వాటికి ఒక హద్దు గీసుకుంటే సరి!ఊహించని కానుకప్రదీప్ : చివరి వరకు మిగిలేది భార్యభర్తలే. ఒకరి ఎక్స్పెక్టేషన్స్ని మరొకరు అర్ధం చేసుకొని, వాటిని అందించగలగాలి. ఎప్పుడైతే ఎదుటివారి భావాలకు, టైమ్కు ప్రాధాన్యత ఇస్తామో, అదే తిరిగి మనకు వస్తుంది. ప్రతి చర్యలో, మాటలో నీకు నేనున్నాను అనే ఎక్స్ప్రెషన్ను ఇవ్వగలిగితే చాలు. సమస్యలు రావు.సరస్వతి: ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. పార్టనర్కి ఊహించని కానుక ఇవ్వాలని ఉంటుంది. అది, డైమండ్ నెక్లెస్లు కానక్కర్లేదు. సందర్భాన్ని బట్టి ఒక పేపర్పైన లవ్ సింబల్ గీసి, ఇచ్చినా ఆ సమయానికి అది పెద్ద కానుకే. ఆ ప్రేమలో స్వచ్ఛతనే చూడాలి. ఒకసారి నా బర్త్డే రోజున రిలేటివ్స్ పెళ్లికి వెళ్లాం. తిరిగి వస్తూ చార్మినార్ దగ్గర అర్ధరాత్రి కేక్ కట్ చేయించారు. నాటి సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా ఊహించనివి ఎంతో ఆనందాన్నిస్తాయి. మా ఇద్దరి అభిరుచులు వేరు, ఆలోచనలు వేరు, నచ్చే కలర్స్ వేరు.. చాలా వైరుధ్యం ఉంది. కానీ, మేం ఇద్దరం ఒకటే.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వెయిట్లాస్ మందులతో స్లిమ్గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
కంటెంట్ క్రియేటర్, కమెడియన్, బాలీవుడ్ నటి ఐశ్వర్య మోహన్ రాజ్ స్లిమ్గా మారిన సంగతి తెలిసిందే. అంతేగాదు తన వెయిట్లాస్ సీక్రెట్ని కూడా చాలా నిజాయితీగా బయటపెట్టారామె. తాను వెయిట్లాస్ డ్రగ్ మౌంజారోని వాడనని దానివల్ల 22 కిలోలు వరకు బరువు తగ్గానని నర్మగర్భంగా చెప్పారామె. అయితే అలా చెప్పినందుకు పలువురు విమర్శించారు కూడా. కానీ బాలీవుడ్ నటి సోహ అలీఖాన్ వంటి పలువురు ప్రముఖులు ఆమె నిజాయితీని ప్రశంసించారు. మరి ఇంతకీ ఇలాంటి బరువు తగ్గించే మందులు ఆరోగ్యానికి సురక్షితమేనా..? దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే..అయితే కమెడియన్ ఐశ్వర్య మోహన్ రాజ్ బరువు తగ్గేందుకు మౌంజారోలాంటివి హెల్ప్ అవుతాయి గానీ వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలిపినప్పటికీ..చాలామంది ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మందులు ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తాయనేది వారందరి వాదన. ఈ నేపథ్యంలో సోహా అలీ ఖాన్ తన తాజా పాడ్కాస్ట్లో ఎండోక్రినాలజీ అండ్ డయాబెటాలజీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అంబ్రిష్ మిథల్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జూహి అగర్వాల్తో చర్చించి మరి ఎలాంటి వాళ్లు బరువు తగ్గించే మందులు తీసుకోవచ్చు?ఎవరికి మంచిది కాదు తదితరాలను అడిగి అందరి అనుమానాలను పటాపంచలు చేశారామె. వాళ్లంతా ఏచెబుతున్నారంటే..ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్, డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిక్ , ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులు బరువు తగ్గించే మందులను సిఫారసు చేస్తారని చెప్పారు. వాటి సాయంతో బరువు తగ్గితే సదరు రోగి పరిస్థితి మెరుగుపడుతుంది..తదనుగుణంగా అప్పటి నుంచి జీవనశైలిలో మార్పులు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని చెప్పారు. View this post on Instagram A post shared by Soha (@sakpataudi) బాడీమాస్ ఇండెక్స్(బీఎంఐ) 27 లేదా 30 ఉంటే వాళ్లు వైద్యుల సూచన మేరకు నిరభ్యంతరంగా ఈ బరువు తగ్గించే మందులు వాడొచ్చని అన్నారు. ఇంతకుమునుపు వెయిట్లాస్ డ్రగ్స్ అత్యంత ఖరీదుగా ఉండేవి. ఇప్పుడు నెలకు తక్కువ మోతాదు అయితే రూ. 12000లని, అదే ఎక్కువ మోతాదు అయితే నెలకు రూ. 22,000 దాక ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఎవరికి మంచిది కాదంటే..థైరాయిడ్ కేన్సర్ చరితర ఉన్న వ్యక్తులుప్యాంక్రియాటైటిస్ చరిత్రజీర్ణశయాంతర సమస్యలుమధుమేహం కారణంగా కంటివ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తదితరులకు ఈ మందులు సరిపడవని చెప్పారు. ఏమందులైనా..నిపుణలు పర్యవేక్షణలో సలహాలు సూచనలతో ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. ప్రస్తుతం కాలంలో అధిక బరువు సమస్యతోనే అనారోగ్యం బారిన పడుతున్న వారెందరికో ఈ మందులు వరంగా మారాయని అంటున్నారు వైద్యనిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!) -
స్మృతి బ్రాండింగ్ హవా..! ఏకంగా విరాట్ కోహ్లి రేంజ్లో..
అమ్మాయిల క్రికెట్లో ఇప్పుడు ఆమె అతి పెద్ద అద్భుతం...వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానం...ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా అగ్రస్థానం... అంతర్జాతీయ టి20ల్లో రెండో స్థానం...అన్నింటికి మించి తొలిసారి భారత జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర...రెండేళ్ల వ్యవధిలో కెప్టెన్గా సాధించిన రెండు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్స్ దీనికి అదనం. ఈ అన్ని ఘనతలూ సాధించిన ఒకే ఒక స్టార్ ప్లేయర్ ఎవరంటే నిస్సందేహంగా స్మృతి మంధాన పేరు చెప్పవచ్చు. ఒకప్పుడు మహిళల క్రికెట్ మాత్రమే కాదు...మహిళా ప్లేయర్లు సౌందర్య సాధనాలకు తప్ప మరో ఉత్పత్తికి ప్రచారం చేస్తే చూసేవారెవరు, కొనేవారెవరు అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు స్మృతి మంధాన క్రెడిట్ కార్డులు కొనమని చెప్పినా.... ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమన్నా...ఇంజిన్ ఆయిల్ అమ్మినా, ఎనర్జీ డ్రింక్లు తాగమని చెప్పినా జనం వింటున్నారు. ఆట ప్లస్ అందం కలగలిసిన ప్రచారకర్తగా అమాంతం స్థాయిని పెంచుకున్న స్మృతి బ్రాండింగ్ హవా ఇప్పుడు నడుస్తోంది....స్మృతి మంధాన బ్రాండింగ్ విలువ ఇప్పుడు భారీగా పెరిగినా... ఇది రాత్రికి రాత్రే జరిగేది కాదు. దశాబ్ద కాలానికి పైగా నిలకడైన ఆటతీరుతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కృషి దీని వెనక ఉంది. వరుసగా పలు రికార్డులు సృష్టిస్తూ అంచెలంచెలుగా ఆమె పెద్ద స్థాయిని అందుకుంది. 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఆమె కెరీర్ ఆరంభం నుంచే జోరుగా సాగింది.జట్టులో జూనియర్గానే ఉన్నా... ప్రదర్శనపరంగా అందరికంటే అగ్రభాగాన నిలుస్తూ తనదైన ముద్ర వేసింది. మిథాలీ రాజ్ తర్వాత భారత నంబర్వన్ బ్యాటర్గా ఆమె అన్ని ఘనతలు సాధిస్తూ వచ్చింది. ఈ పాపులారిటీ కారణంగానే మహారాష్ట్రలో తన సొంత పట్టణం సాంగ్లీలో ఎస్ఎం 18 పేరుతో స్మృతి ఒక రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం ఆమెలోని వ్యాపార కోణాన్ని చూపించింది.అన్ని వర్గాలు మెచ్చేలా...ఒక ప్లేయర్లో ప్రతిభను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో వారు ఎంత పెద్ద స్థాయికి చేరవచ్చో అంచనా వేయడంలోనే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీల విజయం దాగి ఉంటుంది. స్మృతి మంధాన విషయంలో బేస్లైన్ వెంచర్స్ అనే మేనేజ్మెంట్ కంపెనీ చూసిన భవిష్యత్తు ఆమె బ్రాండింగ్ స్థాయిని అమాంతం ఆకాశానికి తీసుకెళ్లింది. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఆమెకు బ్రాండింగ్ అవకాశాలు తెచ్చి పెట్టాయి. ‘హెల్త్, ఇన్సూరెన్స్, క్రీడా సామగ్రి, మొబైల్స్, ఫైనాన్స్... ఇలా ఒకటేమిటి... ఎన్నో భిన్న రంగాల్లో దాదాపు 15 రకాల ఉత్పత్తులకు స్మృతి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. క్రికెట్లోనే కాకుండా మైదానం బయట కూడా ఆమె వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అన్ని వర్గాలకు చేరువైనట్లుగా, అందరి మనిషి అనేలా అనిపించడమే స్మృతి బ్రాండింగ్ రహస్యం’ అని బేస్ లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహీన్ మిశ్రా తమ క్లయింట్ గురించి గర్వంగా చెబుతున్నాడు.‘సరిగ్గా చెప్పిలంటే పురుషుల జట్టులో విరాట్ కోహ్లి స్థాయిని ఇప్పుడు ఆమె మహిళల క్రికెట్లో అనుభవిస్తోంది. అందుకే ప్రీమియం, లైఫ్ స్టయిల్ బ్రాండ్లు, ఎనర్జీ డ్రింక్ ప్రకటనలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి’ అని మరో మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధి రూపేశ్ కశ్యప్ వివరించాడు. సరిగ్గా చెప్పాలంటే ప్రచారకర్తగా ప్రస్తుత పురుషుల క్రికెటర్లు ఎంతో మందికంటే స్మృతి చాలా ముందుంది.మెగా టోర్నీల్లో విజయంతో...మూడు నెలల వ్యవధిలో స్మృతి వన్డే వరల్డ్ కప్ విజయం, ఉమెన్ ప్రీమియర్ లీగ్ విజయాల్లో భాగంగా ఉంది. ఇందులో డబ్ల్యూపీఎల్ టీమ్కు ఆమె కెప్టెన్ కూడా. పైగా ఫ్యాన్స్పరంగా చూస్తే అత్యంత ప్రజాదరణ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇవన్నీ కలిసి సహజంగానే స్మృతి బ్రాండింగ్ విలువను అమాంతం పెంచేశాయి. బ్రాండింగ్ వ్యవహారాలను చూస్తే సంస్థ క్రోల్ అంచనా ప్రకారం... గత ఏడాది కాలంలో ఆమె విలువ దాదాపు 50 శాతం పెరగడం విశేషం. 2023లో తొలి డబ్ల్యూపీఎల్ సమయంలో స్మృతి బ్రాండింగ్ విలువ సుమారు 12 మిలియన్ డాలర్లు కాగా, 2024లో అది 17 మిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు అది ఏకంగా 25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 226 కోట్లు) వరకు వెళ్లడం విశేషం. ఇప్పుడు ఒక్కో ప్రకటనకు ఆమె రూ. 2 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ఆర్జనపరంగా భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (సుమారు రూ. 26 కోట్లు)తో పోలిస్తే స్మృతి (సుమారు రూ. 34 కోట్లు) చాలా ముందుంది. ఇన్స్టాగ్రామ్లో ఆమె ఫాలోయర్స్ సంఖ్య ఏకంగా 15 మిలియన్లకు చేరడం విశేషం. ఒక్క ఏడాదిలోనే ఇది రెట్టింపైంది. ఆటపరంగా స్మృతి తన కెరీర్లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉంది. ఇంకా 30 ఏళ్లు కూడా నిండని ఆమె త్వరలో హర్మన్ తప్పుకుంటే భారత కెప్టెన్గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి బ్రాండింగ్ విషయంలో మరికొంత కాలం స్మృతి హవా కొనసాగడం ఖాయం. ప్రస్తుతం స్మృతి బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పటి వరకు పని చేసిన కొన్ని సంస్థలు చూస్తే... నైకీ, ఎస్బీఐ, హ్యుందాయ్ మోటార్స్, హావెల్స్, పీఎన్బీ మెట్లైఫ్, రెడ్బుల్, గల్ఫ్ ఆయిల్, హెర్బలైఫ్, రాంగ్లర్ జీన్స్, మాస్టర్ కార్డ్, నీమ్ ఆయు షాంపూ, నేచురల్స్, గవి ఎడ్టెక్, మ్యాడ్ ర్యాబిట్ ఆడియో ప్రొడక్ట్స్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ప్లేయర్స్ పాట్ ఆన్లైన్ గేమ్, రెక్సోనా.మొహమ్మద్ అబ్దుల్ హాది (చదవండి: అద్భుతమైన హోమ్ టూర్..! జీవితాన్ని ఆస్వాదించటం అంటే ఇదే..!) -
విడదీయలేని బంధం మాది..! హ హ్హ హసిని..
ప్రేమించుకోవడం కంటే దాన్ని కడదాక నిలబెట్టుకోవడం గొప్ప. ప్రేమికులు అవ్వగలిగినంత ఈజీగా..మంచి ఆలుమగలు అనిపించుకోలేరు చాలామంది. వివాహ బంధంలో మనస్పర్థలనేవి కామన్..వాటిని అధిగమించి అన్నివేళలా ఒకరికొకరుగా సాగడం కొందరికే సాధ్యం. అలాంటి వాళ్లు ప్రేమికులుగానూ..దపంతులుగానూ గెలిచి..అందరికీ ఆదర్శంగాన నిలుస్తుంటారు. ఈ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే నేపథ్యంలో ప్రేమను కడదాక ఉంచుకుని..విజయవంత చేసుకుని..అందరిచేత గొప్ప సెలబ్రిటీ జంటగా పిలిపించుకుంటున్న రితేష్ జెనీలియా క్యూట్ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!.రితేష్-జెనీలియాలు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు. పెళ్లై 14 ఏళ్లు అయినా..ఏ ఈవెంట్లో అయినా..జంటగా కనిపించి సందడి చేస్తుంటారు. దపంతులంటే వీళ్లలా ఉండాలి అనేలా ఎంతో అన్యోన్యంగా అందంగా కనిపించే ఈ జంట లివ్ఇన్రిలేషన్షిప్కి దూరం అంటే ఒప్పుకుంటారా..!?. ఔను..! ఇది నిజం. సినిమా షూటింగ్లు నిమిత్తమైన ఇరువురు వేరుగా.. స్నేహితులతోనే ఉండేవారట. అంతేగాదు అందరిలా డేటింగ్ చేయకుండా హద్దుల్లో ఉంటూనే ఒకరినొకరు అర్థం చేసుకుని మరి వివాహం చేసుకున్న ఈ జంట అన్యోన్య దాంపత్యం గురించి పలు విషయాలు సానియా మీర్జా పాడ్కాస్ట్లో షేర్ చేసుకున్నారు కూడా. తాము ఎప్పుడు పెళ్లికి ముందు ఒకే గదిలో కలిసి ఉండటం వంటివి చేయలేదని అన్నారు. కానీ చాలా క్లోజ్గా ఉండేవాళ్లం. ఎంత దూరంలో ఉన్నా..ఒకరి జీవితంలో ఒకరు ఉండేవాళ్లం. పెళ్లి అయ్యాకే..తాము కలిసి ఉన్నామని, అంతకుమునుపు షుటింగ్ సమయంలో కూడా స్నేహితులతోనే ఉండేవాళ్లమని అన్నారు. అయినా ఇంతలా అన్యోన్యంగా ఎలా ఉండగలరు మీరు అని అందరు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. అయితే ఇద్దరి మధ్య చక్కటి అవగాహన..ప్రతీది అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే..బంధం స్ట్రాంగ్గా ఉంటుందంటున్నారు ఇద్దరు. మధ్యలో జెనీలియా కల్పించుకుంటూ..తనకంతా రితేషేనని. తన ప్రేమ, ఇష్టం, కన్నీళ్లు ఏదైనా రితేష్ అని చెబుతుంది. తనకు కంటనీరు రాక మునుపే రితేష్కి అర్థమైపోతుంది. తనతో ఉన్నవాళ్లకు ఎవ్వరైనా..రితేష్ ఎంతలా కనెక్ట్ అవ్వుతాడో ఇట్టే అర్థమైపోతుంది. అతని కేరింగ్ కూడా అద్భుతమని అంటోంది జెనీలియా. తనెప్పుడు నాతోనే ఉన్న అనుభూతే కలుగుతుంది, ఇంకా చెప్పాలంటే 24/7 అనోచ్చు అని నవ్వుతూ చెప్పింది జెనీలియా. అంతేగాదు ఆ పాడ్కాస్ట్ చివరలో మా ఆయన బంగారం అంటూ నవ్వేసింది ఈ అందాల హాసిని..(చదవండి: నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!) -
నటి ఆలియా భట్ చెప్పే జీవిత పాఠాలు..!
బాలీవుడ్ నటి, రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ తన విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని వేలాదిగా అభిమానులను సంపాదించుకుంది. ఫ్యాషన్ పరంగానూ ఆమెకు సాటిలేరవ్వరూ. రెట్రో స్టైల్తో అందర్నీ మెప్పించి..అందరూ ఆ బాటలో పయనించేలా స్ఫూర్తిగా నిలిచిందామె. అలాంటి ఆలియా ఓ మీడియా ఇంటర్వ్యూలో తనకెంతో ఇష్టమైన పిల్లుల నుంచి గొప్ప జీవిత పాఠాలు నేర్చుకున్నానంటూ పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఆలియాకు తన పెంపుడు జంతువులు ఎడ్వర్డ్, జునిపర్లంటే ఎంతో ఇష్టమో తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తరుచుగా షేర్ చేస్తుంటుంది ఆలియా. అవి తనకు అద్భుతమైన జీవిత పాఠాలు నేర్పించాయంటూ వాటి గురించి చెప్పుకొచ్చింది ఆ ఇంటర్వ్యూలో. అవేంటంటే..మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకోకండి, అలాగే ఎవరి నుంచి ఎలాంటి అంచనాలు పెట్టుకోకండి. ఎంత తక్కువగా ఆశ పెట్టుకుంటే అంత తక్కువగానే నిరాశే చెందుతామని అంటోందామె. హాయిగా నిద్రపోండి. జీవితం చాలా అందమైనది అంటూ ఆమె తన పెంపుడు పిల్లుల నుంచి నేర్చుకున్న వాటి గురించి వివరించింది. అలాగే తన చిన్నతనాన్ని ఉద్దేశించి ఒక హృదయపూర్వక లేఖను పంచుకుంది. బాల్య స్వభావం ప్రకారం..చిన్నారులు ఎక్కువ కలలు కంటుంటారు. ఆ లేఖలో దాన్నే ప్రోత్సహిస్తూ..చిన్నా నువ్వు ఎప్పుడు కలలు కంటూనే ఉంటావని తెలుసు. దయచేసి అలా చేయడం ఆపకండి. మీలోని కలలు కనేవాడే మీ సూపర్ పవర్ అంటూ చెప్పిన మాట కూడా తనకు అద్భుతంగా పనిచేసిందని అంటోంది ఆలియా. ఇక, ఆలియా తన కుమార్తె రాహా గురించి మాట్లాడుతూ..మనకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన కూమార్తె పుడుతుంది. మన జీవితం ఊహించలేని విధంగా మారుతుంది. పైగా ఆమె న్యాయవాది ఆకావాలని అనుకుంటుంది కూడా అని నవ్వుతూ అన్నారామె. కాగా, ఏప్రిల్ 14, 2022న పెళ్లి బంధంతో ఆలియా, రణబీర్ కపూర్లు ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) (చదవండి: శెభాష్ బామ్మ..! ఆ ధైర్యమే అందరికీ కావాల్సింది..) -
పాఠం నుంచి పాకం దాకా
ఆమె ఎంబీఏ చేసింది. ముంబాయిలో ఓ పేరున్న కార్పొరేట్ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా పెద్ద జీతం మీద పాఠాలు చెబుతూ మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి ఆమె పాఠాలు చెప్పే ఉద్యోగాన్ని మానేసి ఇంటి దగ్గరే హెల్దీ శ్నాక్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. రుచిగా, శుచిగా ఉండే చిరుతిళ్లను చాలా తక్కువ ధరకే అమ్మడం మొదలు పెట్టింది. ఇప్పుడామె తయారు చేసే శ్నాక్స్ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలతో సహా దాదాపు పదిహేను దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆమే జైపూర్కు చెందిన రిచాశర్మ. ఇంతకీ ఆమె ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో... ఎంటర్ప్రెన్యూర్గా ఎలా ఎదిగిందో చూద్దాం...రిచాశర్మది జైపూర్. ఫైనాన్స్లో ఎంబీఏ చేసింది. అక్కడే ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేసింది. అయితే అది ఆమెకు చాలా దూరం కావడంతో ప్రయాణాలు చేయలేక వడోదరలోని పరుల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరింది. అక్కడ నాలుగైదేళ్ల పాటు పని చేసింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ముంబాయి మహానగరంలో కాలు పెట్టింది. అప్పుడే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టడం, వారి ఆలనా పాలనా చూసుకోవడం తో ఇక ఉద్యోగం ఊసులేకుండా వారితోటే పూర్తికాలం గడిచి పోయింది. మెల్లగా ఆ పిల్లలు రెండు, ఆరు తరగతులకొచ్చారు. వాళ్లకోసం రకరకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారు చేసి పెట్టేది. ఈ క్రమంలో ఆమె చేసే తినుబండారాలను పిల్లల ద్వారా వారి స్నేహితులు, వాళ్ల వాళ్ల ఇళ్లలోనిÐ éళ్లూ రుచి చూశారు. అవి వారికి బాగా నచ్చడంతో వారిలో కొందరు ‘మీ పిల్లలకోసం తయారు చేసేటప్పుడే... మరికొద్ది మొత్తంలో మా పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు కదండీ’ అని అడగడంతో రిచాశర్మ గ్లుటెన్, మైదా, డాల్డా లాంటివి లేకుండా రుచికరమైన కమ్మటి శ్నాక్స్ తయారు చేయడం మొదలు పెట్టింది. చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో లడ్డూలు, ధోక్లా, కచోరీలు, సబ్జీలు తయారు చేసేది. అవి అక్కడివాళ్లకు అమితంగా నచ్చేవి. మాకు కావాలంటే మాకు కావాలని అందరూ పోటీపడేవాళ్లు. దాంతో ఆమె ‘రిచా ప్లేటర్’ పేరుతో శ్నాక్స్ సప్లై చేసేది. కోవిడ్ మార్చేసిన జీవితంఅలా సాగుతున్న ఆమె జీవితంలో కోవిడ్ పెను మార్పు తెచ్చింది. ఇక్కడ మార్పు అనగానే ఆమె చేసే శ్నాక్స్ బిజినెస్ కాస్తా దెబ్బ తిందేమో అని జాలిపడితే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే కోవిడ్ సమయం లో రిచాశర్మ రుచిగా శుచిగా శుభ్రంగా చేసే హోమ్ మేడ్ ఫుడ్ కోసం జ నాలు ఎగబడ్డారు. దాంతో ఆమె బిజినెస్ ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయింది. అప్పుడే ఆమె తన బిజినెస్ స్కిల్స్ను మరింత అభివృద్ధి చేసుకుంది. ఆర్డర్లకు తగ్గట్టే ప్రిపేర్ చేయడం వల్ల మిగిలి పోవడం కానీ, తక్కువ కావడం కానీ ఎప్పుడూ జరగలేదామెకి. దాంతో అప్పటివరకు మామూలు చిన్న చిన్న తినుబండారాల తయారీ నుంచి రకరకాల స్వీట్స్ తయారీకీ శ్రీకారం చుట్టింది రిచా. మొదట్లో నెలకు 20 ఆర్డర్లతో సరిపెట్టుకున్న రిచా శర్మ చూస్తుండగానే నెలకు 500 ఆర్డర్లకు సప్లై చేసేంతగా అభివృద్ధి చెందిందామె వ్యా పారం. ఖర్, బోరివలి, అంధేరిలకే పరిమితమైన ఆమె కష్టమర్లు కోయంబత్తూరు, బెంగళూరు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ల వరకు విస్తరించారు. తన బిజినెస్కు ‘హంబుల్ ఫ్లేవర్స్’ అనే పేరు పెట్టి దానిని ఇంకా ఇంకా పెంచింది రిచా. వచ్చిన లాభాలలో ఐదుశాతం వాటాను ఎన్జీవోలకు డొనేట్ చేస్తుంది రిచా. మరో ఐదుశాతం లాభాలను తనతో పని చేసే వారికి ఇస్తుంది రిచా. వ్యా పారం ద్వారా లాభాలను గడించడం తన లక్ష్యం కాదని, అందరికీ హెల్దీ, టేస్టీ శ్నాక్స్ అందించడంలోనే తనకు సంతృప్తి లభిస్తుందని చెప్పే రిచాను ఇండియన్ ఇన్స్పైరింగ్ హోమ్ బిజినెస్ ఉమన్ అవార్డు వరించింది. -
ఎవరీ పప్పుదేవి..? ఆమె అద్భుతమైన పులి కళ్లతో..
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూసలమ్మే అమ్మాయి గుర్తుందా..!. అందమైన మోముతో అందర్నీ ఆకర్షించి..రాత్రికిరాత్రికే సంచలనంగా మారింది. పైగా నటిగా అవకాశం వరించింది కూడా. అలా ఏదోక విశిష్ట లక్షణంతో సెన్సెషన్ అయిన వాళ్లెందర్నో చూశాం. కానీ ఇలాంటి కళ్లున్న అమ్మాయిని మాత్రం చూసుండరు. ఈ అమ్మాయి 20 ఏళ్ల క్రితం పలు పోస్ట్కార్డ్లపై కనిపించి సంచలనంగా మారింది. అయితే అప్పుడు సోషల్ మీడియాలు లేవు కాబట్టి..మ్యాగ్జైన్ కవర్పేజీలో, పర్యావరణ సావనీర్లలోనూ ఆమె ముఖ చిత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏముంది ఆమె ముఖంలో అంతగా ఆకర్షించేది అంటే..ఆమె అందమైన కళ్లు. కవులు చెప్పే కలువరేకుల్లాంటి కనులు గురించి విని ఉంటారు. కానీ ఈమె కళ్లు ఎలా ఉంటాయో తెలిస్తే..విస్తుపోతారు. ఇంతకీ ఎవరీమె అంటే..దాదాపు రెండు దశాబ్దాల క్రితం రాజస్థాన్లోని పుష్కర్ ఫెయిర్లో ఆ యువతి ఫోటోలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఎడారి పట్టణ నేపథ్యం నుంచి వచ్చి ఆమె చిత్రాలు చాలా దూరం ప్రయాణించాయి. ఆ అమ్మాయే రాజస్థాన్కి చెందిన పప్పుదేవి. మళ్లీ ఇన్నేళ్లకు ఆన్లైన్లో ఆమె ఫోటో వైరల్గా మారి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. ఇంతకీ ఆమె మోములోని స్పెషల్టీ మొత్తం కళ్లదే. ఆ కళ్లు అలాంటి ఇలాంటివి కాదు..అచ్చం పులి లాంటి అందమైన కళ్లు. వాటిని చూస్తే కళ్లుతిప్పుకోలేం. మరోసారి చూడాలనిపించేంతగా కట్టిపడేస్తాయి. 20 ఏళ్ల క్రితం ఒక విజిటింగ్ ఫోటోగ్రాఫర్ ఆమె అద్భుతమైన పులికళ్లను క్లిక్మనిపించడంతో ఆమె ముఖ చిత్రం పలు వార్తపేపర్లలోనూ, పోస్టకార్డులపైకి వెళ్లిపోయింది. అలా ఆమె రాత్రికి రాత్రికే సెలబ్రిటీ అయిపోయింది. మళ్లీ సరిగ్గా ఇప్పుడుమరోసారి ఆ పప్పుదేవి ఫోటోలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. దాంతో ప్రస్తుతం ఆమె ఎలా ఉందని ఆరాలు మొదలయ్యాయి. ఇక పప్పు దేవి ఒక సఫారి డ్రైవర్ని పెళ్లి చేసుకుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఆమె ఇద్దరు కుమార్తెలకు వారసత్వంగా పులికళ్లు వచ్చాయి. ఆ అమ్మాయిలు ఇద్దరు పప్పు దేవికి స్టాల్లో చేదోడు వాదోడుగా ఉంటారట. పర్యాటకులను పిలుస్తూ..మిర్రర్ వర్క్ బ్యాగులను విక్రయించడంలో సాయం అందిస్తారట. అయితే సందర్శకులు చాలామంది తనను, ఆ ఇద్దరు కుమార్తెలను చూసి అవిశ్వాసం వ్యక్తం చేస్తూ..ప్లీజ్ కళ్లజోడు పెట్టుకోరా అని అడగుతారని అంటోంది పప్పుదేవి. కాగా, పప్పుదేవి తాను బంజారా కమ్యూనిటీకి చెందినదాన్ని కాదని స్పష్టం చేసింది. ఎవరో ఒక వ్యక్తి తన కళ్లను చూసి అందుకు సరిపోయే దుస్తులు ధరించమని సూచించడంతో ఈ వేషధారణలో ఉన్నానని వివరణ ఇచ్చిందామె. View this post on Instagram A post shared by LOG KYA SOCHENGE (@log.kya.sochenge) (చదవండి: ఆ పెంగ్విన్ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్..! ఆలుమగలకు అసలైన అర్థం..) -
'నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను'
నా వయసు 34 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ. చిన్న విషయాలకే ఒళ్లు తెలియని కోపంతో చేతిలో ఏది ఉంటే దానితో కొట్టడం, ఖరీదైన ఫోన్లు, టీవీలు పగలగొట్టడం జరుగుతోంది. కోపావేశంలో నా ముందున్న వ్యక్తి ఎవరు అనే ఆలోచన లేకుండా దాడి చేసే పరిస్థితి వస్తోంది. దీనివల్ల నా భార్య, పిల్లలు చాలా భయపడుతున్నారు. కోపం తగ్గిన తరువాత చాలా బాధ, పశ్చాత్తాపం ఉంటాయి. కానీ ఆ సమయంలో మాత్రం నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నాకు ఇతర మానసిక, శారీరక సమస్యలు ఏవీ లేవు. ఒకసారి మానసిక వైద్యుడిని కలవాలని అనుకుంటున్నాను. నాకు ఉన్న ఈ సమస్యకు సరైన చికిత్స లేదా పరిష్కారం ఉందా?– రవికుమార్, హిందూపూర్మీ సమస్యను ఇతరుల మీద నెట్టకుండా, మీరే బాధ్యత తీసుకుని మారాలనుకోవడం నిజంగా అభినందనీయం. మీరు వివరించిన లక్షణాలను వైద్య పరిభాషలో ఇగో డిస్కంట్రోల్ సిండ్రోమ్ (ego dyscontrol syndrome) లేదా ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోసివ్ డిసార్డర్ అని అంటారు. ఈ సమస్య ఉన్నవారు చాలా చిన్న విషయాలకే అసాధారణమైన కోపం, ఆవేశానికి గురవుతారు. ఆ సమయంలో తనపై పూర్తిగా నియంత్రణ కోల్పోయి విలువైన వస్తువులను పగలగొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, మాటలతో లేదా చర్యలతో ఇతరులపై దాడి చేయడం వంటి ప్రవర్తనలు చేస్తాడు. కోపం తగ్గిన తరువాత మాత్రం పశ్చాత్తాపం, తప్పు చేశాననే భావన ఎక్కువగా ఉంటుంది. పరిశోధనల ప్రకారం, ఇలాంటి వ్యక్తుల మెదడులో సెరటోనిన్ (Serotonin) అనే రసాయనం తక్కువ స్థాయిలో ఉండటం గమనించవచ్చు. ఇది చాలా సందర్భాల్లో జన్యుపరంగా వచ్చే సమస్యగా కూడా ఉండవచ్చు. అంటే, సెరటోనిన్ తయారు చేసే వ్యవస్థలోనే లోపం ఉండే అవకాశం ఉంది.అలాగే వారు పెరిగిన వాతావరణం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, కొన్ని అలవాట్లు కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే అమీగ్డాలా, ఫ్రాంటల్ కార్టెక్స్ వంటి భాగాలు సరిగా పనిచేయకపోయినా కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమస్యకు పూర్తిగా చికిత్స ఉంది. సైకోథెరపీ, కోప నియంత్రణ చికిత్స లతోపాటు, మెదడులో సెరటోనిన్ స్థాయిని పెంచేందుకు తగిన మందులను, మనసుని స్థిమితపరిచే మూడ్ స్టెబిలైజర్స్ వంటి మందుల్ని వైద్యుల పర్యవేక్షణలో వాడడం వలన మంచి మెరుగుదల కనిపిస్తుంది.చదవండి: కొలీగ్పై ఫీలింగ్స్ వస్తున్నాయి.. ఏం చేయాలి?సమయానికి చికిత్స తీసుకుంటే, కోపాన్ని నియంత్రించుకోవడం సాధ్యం అవుతుంది. దీనిద్వారా కుటుంబ జీవితం, వ్యక్తిగత సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావచ్చు. ఈ సందర్భంగా మనసుకవి ఆత్రేయ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా’. విరిగిన వస్తువుల్ని అతికించవచ్చు, లేదా మళ్ళీ సంపాదించొచ్చు. కానీ విరిగిన మనసులని, దూరం అయిన బంధాలని మళ్ళీ దగ్గరగా చేసుకోవాలంటే దానికి చాలా శ్రమ అవసరం. కోపాన్ని జయించినవాడే తన జీవితాన్ని జయిస్తాడు అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసినమెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్..! సురక్షితమేనా..?
కొన్నికేన్సర్లు.. సులభంగా టెస్ట్లు చేయించుకోలేం. అలాంటి వాటిల్లో ఒకటి ఈ గర్భాశయ కేన్సర్. ఇది కాస్త గోపత్యకు సంబంధించినవి కావడంతో మహిళలు క్లినిక్లను సందర్శించడంలో జాప్యం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో వైద్యశాస్త్రం సాంకేతిక సాయంతో మరింత పురోగతిని అందించేలా మహిళలే స్వీయంగా చేసుకునే వెసులబాటు అందించింది. అంటే ఇంట్లోనే సులభంగా గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్(HPV స్వీయ-నమూనా అని కూడా పిలుస్తారు) చేసుకోవచ్చు అన్నమాట. ఇది భవిష్యత్తు కాలంలో మంచి గేమ్ ఛేంజర్గా ఉద్భవించనుంది. అచ్చం ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ మాదిరిగానే ఇంట్లోనే గర్భాశయం ఆరోగ్యం కోసం మనమే స్వయంగా చేసుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. అసలేంటి టెస్ట్? ఎలా చేయాలి?, సురక్షితమేనా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే..గర్భాశయం నుంచి కణాలను సేకరించడానికి వైద్యుడు స్పెక్యులమ్ను ఉపయోగించే సాంప్రదాయ పాప్ స్మియర్ మాదిరిగా కాకుండా, ఇంట్లోనే నిర్వహించే స్వీయ-నమూనా కిట్ ఇది. ఇందులో 95% కచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు నిపుణులుఎలా చేయాలంటే..కిట్: స్టెరైల్ స్వాబ్ (పొడవైన Q-టిప్ లాగా) లేదా ప్రత్యేకమైన బ్రష్ను కలిగి ఉన్న చిన్న ప్యాకేజీని అందుకుంటారు.బాత్రూమ్ లేదా గదిలో ఆ స్వాబ్ను యోనిలోకి చొప్పించి కొన్ని సెకన్ల పాటు తిప్పాలి. అది గర్భాశయాన్ని చేరుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ స్వాబ్ HPV DNA కలిగి ఉన్న యోని గోడల నుంచి కణాలు, ద్రవాలను తీసుకుంటుంది. ఆ స్వాబ్ను ప్రిజర్వేటివ్ ట్యూబ్లో ఉంచి, దానిని సమీపంలోని ల్యాబ్కు పంపించాలి. ఫలితం: పరీక్షలో నెగిటివ్ వస్తే..గర్భాశయ కేన్సర్వచ్చే ప్రమాదం చాలా తక్కువని, ఒకవేళ పాజిటివ్ అయితే ..ప్రమాదకర హెచ్పీవి శరీరంలో ఉందని అర్థం. అలాంటప్పుడు తదుపరి పాప్ స్మియర్ లేదా కోల్పోస్కోపీ కోసం గైనకాలజిస్ట్ను సందర్శించాలి.ఇక్కడ మహిళలకు ఓ వైద్యుడి మాదిరిగా చేసుకోగలమా అనే సందేహం రావడం సహజం. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), జేసీఓ గ్లోబల్ ఆంకాలజీ ఈ స్వీయ నమునా చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. ముందుగా ఈ గర్భాశయ కేన్సర్ని గుర్తించడంలో సాంప్రదాయ పాప్ స్మియర్ల కంటే HPV DNA పరీక్షలు చాలా సులభంగా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించగలిగేవని పేర్కొంది. ఈ హెచ్పీవీ కిట్ల సాయంతో మహిళలు స్వయంగా సేకరించిన నమునాలు, వైద్యులు సేకరించిన వాటివలే ఉంటాయని హామి ఇచ్చింది కూడా. ఇది ప్రారంభ స్కీనింగ్ వైద్య పరీక్షగా ఉపయోగపడుతుంది. అయితే ఇది కేన్సర్ని మందస్తు దశలోనే గుర్తించడానికి హెల్ప్ అయ్యే సాధనమే తప్ప కేన్సర్ని నిర్థారించేది మాత్రం కాదు.ఎందుకు అత్యంత ముఖ్యమైనదంటే..భారతదేశంలో, గర్భాశయ కేన్సర్ మహిళల్లో రెండవ అత్యంత సాధారణ కేన్సర్గా మారింది. ప్రతి ఏడాది దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది దాక మహిళలు ఈ వ్యాధి కారణాంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిని నివారించేందుకు ఇంట్లేనే నిర్వహించుకునే ఈ సులభమైన స్క్రీనింగ్ పరీక్ష అత్యంత ప్రధానమైనదిగా మారింది.ఏవిధంగా అంటే..?ఈ టెస్ట్ నిమిత్తం చాలామంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతారు. ఆ అసౌకర్యాన్ని ఈ పరీక్ష తొలగిస్తుంది. అదీగాక గ్రామీణ మహిళలకు, అత్యంత బిజీగా ఉండే పట్టణ మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా వైద్య ఖర్చులను తగ్గిస్తుంది. పైగా ఈ పరీక్షలో ఎలాంటి నొప్పి ఉండదు, ఐదు నిమిషాల కంటే తక్కువ సమయమే పడుతుంది.నిజానికి ఈ కిట్లు ఆరోగ్యకరమైన భవిష్యత్తుగా వారధిగా పనిచేస్తాయి. పైగా 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు వాళ్లు కనీసం మూడేళ్ల కొకసారైనా ఈ పరీక్షను చేసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్ కపూర్) -
అప్పుడు లెజండరీ యాక్టర్...ఇవాళ లైఫ్కోచ్గా..!
అప్పట్లో భారతీయ టెలివిజన్ రంగంలో తన అందం, గొంతుతో సంచలనం సృష్టించిన రూబీ భాటియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారారు. అయితే, ఈసారి ఆమె వార్తల్లో నిలవడానికి కారణం ఆమె గ్లామర్ కాదు.. రూ. 1,000 కే అందిస్తున్న లైఫ్ కోచింగ్ సర్వీసెస్. ఈ ప్రకటనలు చూసిన నెటిజన్లు, ముఖ్యంగా 90ల కాలం నాటి అభిమానులు ఒక్కసారిగా మూగబోయారు. ఒకప్పుడు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న ఒక లెజెండరీ యాంకర్.. 90వ దశకంలో భారతీయ టెలివిజన్ రంగంలో ఛానల్వి హవా నడిచిన కాలం. ఆ తరం యువతకు ఫ్యాషన్ ఐకాన్ రూబీ భాటియా. తన విలక్షణమైన ఇంగ్లీష్ యాక్సెంట్, చిరునవ్వు, మెరిసే కళ్ళతో ఆమె బుల్లితెరను శాసించేది. మాజీ మిస్ ఇండియా కెనడా అయిన రూబీ భారత్ మొట్టమొదటి వీడియో జాకీగానూ గుర్తింపు పొందారు. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆమె ఒక స్మార్ట్ఫోన్ కెమెరా ముందు కనిపిస్తూ నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, బరువు తగ్గడం, ఆందోళన, డిప్రెషన్ వంటి విషయాలపై లైఫ్ కోచింగ్ ఇస్తానంటూ ఆమె ఇటీవల వీడియోలు విడుదల చేశారు. వీటిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఆమెను ఇలా చూడటం మనుసుకి భారంగా ఉందంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తే, మరికొందరు మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ఏ పనీ చిన్నది కాదని భావించి, స్వయంగా తన సేవలను ప్రమోట్ చేసుకోవడం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. For 90s kids, Ruby Bhatia was everywhere, a familiar, confident face on TV, VJing, anchoring, interviewing.Seeing her reels today, offering life coaching, makeup tips, and even asking people to WhatsApp her for work for ₹1000, just feels heavy.Not mocking her at all. It’s… pic.twitter.com/JAP2YPkZXp— Sapna Madan (@sapnamadan) January 29, 2026 (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!) -
వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్కపూర్ త్వరలో తల్లి కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడి అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్ ..కెరీర్ మంచి పీక్స్లో ఉండగానే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజను 2018లో పెళ్లి చేసుకుంది. ఈ జంట 2022లో మొదటి బిడ్డ వాయును స్వాగతించారు. ఇక గతేడాది నవంబర్లోనే సోనమ్ రెండోసారి అమ్మను కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ నెల ఫిబ్రవరి 8నబాలీవుడ్ అతిరథుల నడుమ సోనమ్ సీమంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుక తాలుకా వీడియోని షేర్ సుకుంటూ..సీమంతం తంతు గురించి చాలా భావోద్వేగంగా పోస్ట్లో రాసుకొచ్చింది. అంతేగాదు ఆ ఈవెంట్ ఎంతలా భారతీయ సంప్రదాయపద్ధతిలో జరిగిందో కూడా వివరించింది.కాబోయే తల్లి సోనమ్ తన సీమంతం వేడుక వీడియోని షేర్ చేస్తూ..పురాతన వేద సాంప్రదాయంలో పాతుకుపోయిన ఈ ఆచారం గురించి చాలా గొప్పగా రాసుకొచ్చింది పోస్ట్లో. ఆ రోజు తనకెంతో ముఖ్యమైనదే గాక స్రీ జీవితంలోనే అత్యంత ప్రాముఖ్యమైనదిగా పేర్కొంది. 40 ఏళ్ల సోనమ్ సీమంతం అనేది సనాతన ధర్మంలోని పదహారు పవిత్ర సంస్కారాలలో మూడవదిగా వెల్లడించింది. దీన్ని 'జుట్టు విప్పే ఆచారం'గా పిలుస్తారని, నవమాసాలు బిడ్డను మోసే తల్లి గౌరవార్థం జరిపే వేడుకగా పేర్కొంది. దీన్ని మన భారతదేశంలో పలు ప్రాంతాల్లో పలు పేర్లతో పిలుస్తారంటూ సవివరంగా వెల్లడించింది. ఈ సీమంతం వేడుకను ఉత్తరాన గోధ్ భారాయ్ అని, దక్షిణాన వాలైకప్పు, మహారాష్ట్రలో దోహలే జెవాన్ వంటి పేర్లతో పిలుస్తారని చెప్పుకొచ్చింది. ఎన్ని విభిన్న పేర్లతో పిలిచినా..ఈ అందమైన భావం స్త్రీ జీవితలోని అత్యంత అపురూపమైన క్షణంగా పేర్కొంది. ఇది ప్రేమ, రక్షణ, కొత్త జీవితంల వేడుకగా అభివర్ణించింది. సోనమ్ షేర్ చేసిన వీడియోలో వేదమంత్రాల నడుమ స్వీట్లను తినిపించడం, కుటుంబం, స్నేహితులతో గడిపే మధురమైన క్షణం అని చెబుతోంది. కాగా, ఈ సీమంతం వేడుక అనిల్ కపూర్ విలాసవంతమైన బంగ్లాలో జరిగింది. అక్కడ ఈ వేడుక కోసం బంగ్లాని అధునాత డిజైన్తో పవిత్ర భారతీయ చిహ్నలను మిళితం చేస్తూ..పూల అభయారణ్యంగా, ఆధ్యాత్మికతకు నెలవుగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆ వేడుకలో ముఖ్యంగా నాటి కాలాన్ని గుర్తుచేసేలా దీప స్థంభం అత్యంత హైలెట్గా నిలిచింది. ఇంతలా అంగరంగ వైభవంగా ఈ సీమంతం వేడుకను జరిపినందుకు తన తల్లి, అత్తగారు, సోదరి రియా కపూర్లకు పోస్ట్లో కృతజ్ఞతలు తెలిపింది. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) (చదవండి: అంతర్జాతీయ మోడల్గా సివిల్ ఇంజనీర్..! ఒక్క రోజుకే..) -
అంతర్జాతీయ మోడల్గా సివిల్ ఇంజనీర్..! ఒక్క రోజుకే..
ఇంజనీరింగ్ చదువుకుంటూనే ఫ్యాషన్ ప్రపంచం వైపుకి అడుగులు వేశాడు ఈయువకుడు. ఒక పక్క చదువుని, అభిరుచిని..రెండిటిని సమతుల్యం చేస్తూ..మోడలింగ్లో మంచి సక్సెస్ని అందుకున్నాడు. అంతేగాదు ఇంజనీర్గా ఒక్క ఏడాదిలో సంపాదించే మొత్తం మోడల్గా ఒక్కరోజులోనే ఆర్జిస్తూ..గ్లామర్కున్న క్రేజ్ని చాటి చెప్పాడు. అంతేగాదు రెండు విభిన్న రంగాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ని విజయవంతంగా నిర్మించుకోవచ్చని నిరూపించి, స్ఫూర్తిగా నిలిచాడు. అతడే శుభమ్ వైద్కర్. 24 ఏళ్ల ఈ యుకువడు సివిల్ ఇంజనీర్ గ్రాడ్యేయేట్. కానీ ఇవాళ అంతర్జాతీయ మోడల్గా లక్షలు ఆర్జిస్తున్నాడు. అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ కోసం చాలాసార్లు ర్యాంప్పై నడిచాడు. ముంబైలో పుట్టి పెరిగిన శుభమ్ అక్కడే సివిల ఇంజనీరింగ్ని పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే మోడలింగ్ ప్రారంభించాడు. ఇన్స్టాగ్రామ్లోని ఒక రీల్ చూసి దీనిపై ఆసక్తి పెరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే అప్పడు తన బరువు 83 నుంచి 84 కిలోలు వరకు ఉండేవాడినని అన్నాడు. మోడల్ వైపుకి వచ్చానే కానీ..ఎలా అనేది అంతగా తెలియదు. అందుకోసం అని గూగుల్లో వెతకగా..మనకు ప్రాతీనిధ్యం వహించడానికి ఏజెన్సీలు అవసరమని తెలుసకున్నానని అంటున్నాడు శుభమ్. దాతో తన ఫోటోలు ఏజెన్సీలకు పంపాను..వాటిలో ఒక ఏజెన్సీ తనను మీటింగ్కి పిలిచి..నేరుగా బరువు తగ్గాలని సూచించారని తెలిపాడు. అందుకు ఒక నెల సమయం ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అయితే వెంటనే శుభమ్ టైం వేస్ట్ చేయకుండా వెయిట్లాస్ అయ్యే పనిలో పడ్డాడట. అప్పటి నుంచే చక్కెర, జంక్ పదార్థాలు, నూనె పదార్థాలకు చాలా దూరంగా ఉండేవాడట. అలా మోడల్గా మారేందుకు కష్టబడుతున్న తరుణంలో 2024 జనవరిలో అర్మానీ షో కోసం ఇటలీలోని మిలన్కు వెళ్లే అవకాశం తనకు మొదటిసారి లభించిందని చెప్పుకొచ్చాడు. అంతకుమందు భారత్లో మోడలింగ్గా చేశానని, కానీ విదేశాలకు వెళ్లే ఛాన్స్ మాత్రం రాలేదని అంటున్నాడు. ఆ ఏడాదే జూన్లో రెండోసారి మిలన్ నుంచి పారిస్కి ప్రయాణించినట్లు తెలిపాడు. జూన్లో తన గ్రాడ్యుయేషన్ పరీక్షలు పూర్తిచేసుకుని మరి వెళ్లినట్లు పేర్కొన్నాడు. మిలన్లో రెండు నెలలు ఉన్నట్లు తెలిపాడు. అయితే మోడలింగ్ అనేది స్థిరంగా పనిదొరికే రంగం కాదు. ఈవెంట్లను బట్టి వర్క్ అనేది ఉంటుంది. దాంతో శుభమ్ వెంటనే భారత్కి వచ్చేసి..తన డిగ్రీకి తగిన ఉద్యోగం వెతుక్కుని మరి జాయిన్ అయ్యిపోయాడు. నెలకు రూ. 30 వేల వేతనం చెల్లించేది. అయితే మోడలింగ్ని పూర్తి సమయం కొనసాగించే నిమిత్తం జాబ్లో జాయిన్ అయ్యిన ఆరునెలలకే రాజీనామా చేసేశాడు. మోడల్గా సంపాదన..సివిల్ ఇంజనీర్గా నెలకు రూ. 30 వేలు సంపాదిస్తే..మోడల్గా ఒక్కరోజు షూట్ కోసం లక్షల్లో డబ్బు సంపాదించడం విశేషం. మిలన్లో జరిగే రన్వే షో కోసం దాదాపు లక్ష నుంచి రెండు లక్షలకు వరకు సంపాదించొచ్చని చెబుతున్నాడు. అడ్వర్టైస్మెంట్లకే బాగా వేతనం లభిస్తుందని అంటున్నాడు శుభమ్. ఒక్కోసారి ప్రాజెక్ట్ని బట్టి..రూ. 5 లక్షలు పైనే ఆర్జించొచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. అయితే ఇక్కడ మొత్తం మోడళ్ల చేతికి వెళ్లదని, ఏజెన్సీ 30% కోత విధిస్తుందని చెప్పుకొచ్చాడు. కేవలం 70% తాము ఉంచుకుంటామని అన్నాడు. ఇక మోడలింగ్ పైకి ఆకర్షణీయంగా కనిపిస్తున్నా..తెరవెనుక చాలా కష్టం ఉంటుందని చెబుతున్నాడు శుభమ్. తన గ్లామర్ లుక్ కోసం చాలా ఖర్చు చేయాల్సి కూడా ఉంటుందని అంటున్నాడు. అలాగే ఈవెంట్ల గురించి ఒకరోజు ముందు మాత్రమే తెలుస్తుందట. అక్కడ వసతికి సంబంధించి..ఏజెన్సీనే చూసుకుంటుంది. గానీ ఇతర ఖర్చులు మనమే భరించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ రంగంలో ఒక్కోసారి ప్రదర్శన సమయంలో చివరి క్షణంలో మనల్ని తొలగించే అవకాశం కూడా ఉంటుందట. ఆ టైంలో మానసికంగా స్థైర్యంగా ఉండటం అంత ఈజీ కాదని అంటున్నాడు శుభమ్. అంతేగాదు మోడల్గా రాణించాలంటే బరువుని కూడా అదుపులో ఉంచుకోవడమే గాక, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి కూడా. చివరగా శుభమ్ ఈ గ్లామర్ ఫీల్డ్లో నిలదొక్కుకోవాలంటే..తిరస్కరణలను తట్టుకోవాలి, ఓపికతో ఉండాలని అంటున్నాడు. ఎందుకంటే ఒక్కోసారి అసలు పనే ఉండదు..అయినప్పటికీ..అవకాశం కోసం చాలా నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. View this post on Instagram A post shared by Shubham Vaidkar (@shubham_vaidkar) (చదవండి: 'రెండు రకాల తల్లులు'..! థైరోకేర్ వ్యవస్థాపకుడి పేరెంటింగ్ పాఠాలు..) -
'రెండు రకాల తల్లులు'..! థైరోకేర్ వ్యవస్థాపకుడి పేరెంటింగ్ పాఠాలు..
తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చాలామంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. పైగా ప్రయోజకులుగా తీర్చిదిద్దడంపై సూచనలు కూడా ఇచ్చారు. అయితే థైరోకేర్ వ్యవస్థాపకుడు వేలుమణి చెప్పే పేరెంటింగ్ పాఠాలు చాలా ఆలోచనాత్మకంగానూ, అద్భుతంగానూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలను అభ్యున్నతి మార్గంలో నడిపించే దిక్సూచిలా ఉంటాయి అవి. గతంలో దీని గురించి తన అనుభవాలను జోడిస్తూ చెప్పారు. ఈసారి పిల్లల పెంపకంపై పేరెంట్స్ని ఉద్దేశిస్తూ చేసిన ఆసక్తికర పోస్ట్ చర్చనీయాంశమై హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఆయన పోస్ట్లో ఏ చెప్పారంటే..తన పోస్ట్లో వేలుమణి పిల్లలను పెంచడాన్ని రెండు విధాలుగా పోల్చారు. టైప్ ఏ అని రాస్తూ..చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేషన్స్ జరుపుకుంటూ..పిల్లలను బహిరంగంగా అభినందించడం, పోరుగువారితో తమ పిల్లల సక్సెస్ని షేర్ చేసుకుంటుంటారు. అంతేగాదు అక్కడితో ఆగారు..అందుకుగానూ విదేశీ పర్యటనలు అంటూ వారికి సర్ప్రైజ్ గిప్ట్లు కూడా ఇస్తుంటారు. ఈ పేరెంటింగ్ విధానంలో ఇరువురు సంతోషంగా ఉంటారు. కానీ పిల్లల్లోని అసలైన ప్రతిభాపాటవాలు వెలులోకి రావని అంటున్నారు. మరోవైపు టైప్ బి అనేది తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక చిన్న సమస్యను పరిష్కరించేలా ప్రేరేపిస్తారు. దాని తర్వాత మరింత పెద్ద సమస్యను ముందుంచుతారు. అలా క్రమంగా సవాళ్లను స్వీకరించే సామార్థ్యం..అధిగమించి శక్తిని పుంజుకునేలా బలోపేతం చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే వారిలోని పూర్తి సామర్థ్యాలను వెలికితీసే యత్నం చేస్తుంటారు. ఇది పిల్లలకు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ ఉండటాన్ని నేర్పిస్తుంది. ఫలితంగా పిల్లలు ప్రయోజకులు అవ్వడమే కాదు..బలోపేతమైన పెద్దలుగా మారేందుకు దోహదపడుతుంది. చాలామటుకు పిల్లల సామర్థ్యాలను వెలికితీసేలా పెంచెలాని కోరుతూ..పిల్లలను గారబం మాత్రం చెయ్యొద్దని హితవు పలికారు పోస్ట్లో. అయితే వేలుమణి చెప్పిన ఈ అంశం నెటిజన్లుల్లో ఒక విధమైన ఉత్సుకతను రేపి..చర్చలకు తెరలేపింది. ప్రోత్సహిస్తేనే కాదా..పిల్లలు ముందుకు పోగాలరు. దాన్నే వద్దంటున్నారు అని కొందరు, కఠినమైన ప్రేమ అనేది పిల్లవాడిలోని నిజమైన సామర్థ్యాన్ని అన్లైక్ చేస్తుందని మరొకొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఇక్కడ వేలుమణి చెబుతోంది అది కాదు. ఆయన ఎల్లప్పుడూ పిల్లలను ప్రేమించండనే అంటున్నారు. అయితే కాస్త తెలివిగా ప్రశంసిస్తూ..పిల్లలు బలాన్ని పుంజుకునేలా చేయాలి. కంఫర్ట్జోన్కి పరిమితం కానివ్వకుండా సవాళ్లును చలాకీగా స్వీకరించే బలోపేతమైన వ్యక్తులుగా కూడా తీర్చిదిద్దాలనే విషయం మరువకూడదని చెబుతున్నారు మానసిక నిపుణులు. అలాగే పెద్దలు గారబం జోలికి పోకూడదు..అప్పుడే వాళ్లలో అపారమైన ప్రతిభపాటవాలు వెలికి తీయగలగడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.Two kinds in Mothers. A. A child solves a small problem. Appreciates. Celebrates. Tells all neighbors. Puts in Social media too. Takes for a foreign trip. Both happy. B. A child solves a small problem. Gives a bigger problem. Keeps it incremental for years. In the long run…— Dr. A. Velumani.PhD. (@velumania) February 10, 2026 (చదవండి: అమెరికా కోడలు..పల్లెటూరి అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..) -
విన్స్మోర్
‘నీ దగ్గర సైన్యం లేదు... మరచిపో... నీ దగ్గర ఆయుధం లేదు... మరచిపో... అయితే ఆశ... అనే అద్భుతాన్ని మాత్రం ఎప్పుడూ మరచిపోవద్దు. ఆ ఆశే నీ ఆయుధం అవుతుంది... సైన్యం అవుతుంది’... అనేది జపాన్ ప్రఖ్యాత నాయకుడు షింజో అబే మాట. ఆ మాటే సనై తకాయిచికి ధైర్యాన్నిచ్చింది. ‘జపాన్ ఐరన్ లేడీ’ని చేసింది. గత సంవత్సరం జపాన్ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన తకాయిచి... తాజాగా జపాన్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో (ముందస్తు) ఘన విజయం సాధించారు...మూడు నెలల్లోనే పార్లమెంట్ను రద్దుచేసి, ఎన్నికల బరిలోకి దిగడం ఆషామాషీ విషయం కాదు. తమ మీద తమకు గట్టి నమ్మకం ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఆ నమ్మకం ఎప్పుడూ తకాయిచితోనే ఉంది. అందుకే ఆమె సనై తకాయిచి అయ్యారు! తాజా ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోసారి తానేమిటో నిరూపించుకున్నారు.టకాయిచి టాక్ చాతుర్యం... అమోఘం!తకైచి గురువు షింజో అబే. ఆయన వాక్చాతుర్యం అంటే తకైచికి బాగా ఇష్టం. షింజో జపాన్లోని ప్రముఖ ప్రజానాయకుడు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) అధ్యక్షుడు అయిన షింజో అబే జసాన్ చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. ‘ప్రజలతో కలిసి పనిచేస్తున్నంత కాలం నాకు వేరే శక్తి అవసరం లేదు. ప్రజలే నా శక్తి. ఆ శక్తితో ఎన్ని రకాల సవాళ్లనైనా ఎదుర్కోగలను’ ‘మనిషికి ఆశ ఎప్పుడూ ఉండాలి. ఆ ఆశే అయుధం. కలను సాకారం చేసుకునే సాధనం’... గురువు నోట వినిపించే ఇలాంటి మాటలు అంటే తకాయిచికి చాలా ఇష్టం. ‘ప్రజలను ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తుంటే ఎవరో పరాయి వ్యక్తి వచ్చి మాట్లాడినట్లు ఉండకూడదు. మన ఊరి వ్యక్తో, కుటుంబ సభ్యులో మాట్లాడుతున్నట్లు సహజంగా ఉండాలి.’.. అని చెప్పకనే చెప్పినట్లుగా ఉంటుంది షింజో అబే వాక్చాతుర్యం. అలాంటి సహజ వాక్చాతుర్యాన్ని సొంతం చేసుకున్నారు తకాయిచి.ధైర్యమే దారి చూపిందిఅమెరికాలో యూనివర్శిటీ విద్య పూర్తయిన తరువాత స్వదేశానికి తిరిగి వచ్చిన తకాయిచి కొంత కాలం టీవీ యాంకర్గా పనిచేశారు. 1996లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అగ్రనేత షింజో అబేకు ప్రియ శిష్యురాలు అయ్యారు. అంతర్గత వ్యవహారాలు, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) 2024లో ఉభయ సభలలో మెజారిటీ కోల్పోయింది. కొమైటో పార్టీతో దశాబ్దాల పొత్తు కూలిపోయింది. ఎటు చూసినా నిరాశే అన్నట్లుగా ఉంది పరిస్థితి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యం, ఆశ కోల్పోలేదు తకాయిచి. ఆమెకు ప్రజలలో ఉన్న ఆదరణే పార్టీని నిలబెట్టింది. గత ఏడాది ఆమె ప్రధానిగా ఎన్నికైనప్పుడు... ‘ప్రధానిగా తకాయిచి ఎన్నిక పార్టీకి అదృష్టాన్ని తెస్తుందా? పార్టీని పునర్జీవింపజేస్తుందా?’ అనే ప్రశ్న వేశారు రాజకీయ విశ్లేకులు. ఆ ప్రశ్నకు తాజా విజయం జవాబు చెప్పింది. తకాయిచి పాలనకు జనం ఆమోదముద్ర వేశారు. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. తకాయిచి దారి... రహదారి!వర్క్ వర్క్ వర్క్ అండ్ వర్క్!⇒ ‘వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి’ అనే మాట ఎప్పుడూ వినబడుతూ ఉంటుంది. అయితే ఈ సమన్వయ ధోరణికి తకాయిచి వ్యతిరేకం.⇒ ‘దేశం కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి. వర్క్ వర్క్ వర్క్ అండ్ వర్క్. అందరూ గుర్రంలా పనిచేయాలి’ అంటారు తకాయిచి.⇒ ‘వర్క్ వర్క్ వర్క్ అండ్ వర్క్’ అనే మాట జపాన్లో బాగా పాపులర్ అయింది. ప్రతి సంవత్సరం జపాన్లో విడుదల చేసే పాపులర్ మాటల పుస్తకంలో ఈ మాట చేరింది!ఆ దూకుడు... ఇప్పటికీ!చిన్నప్పుడు సనై తకాయిచికి ‘బైకర్ అమ్మాయి’ అని పేరు. జపాన్ రోడ్లపై స్పీడ్గా దూసుకెళ్లేది. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత బైక్ డ్రైవింగ్కు దూరమైనా ఆ దూకుడు, స్పీడ్ మాత్రం తగ్గలేదు. అదే ఆమె ఎనర్జీ! కరుడు కట్టిన సంప్రదాయవాది, జాతీయవాదిగా ముద్ర పడినప్పటికీ ఆమె గిరి గీసుకొని కూర్చోలేదు. కొరియన్ సంగీతం, నాటకాలను బాగా ఇష్టపడతారు.యస్... ఇప్పటికీ డ్రమ్స్ మోగాల్సిందే!యూనివర్శిటీ రోజుల్లో సరదాగా డ్రమ్స్ వాయించడమే కాదు ఒక మ్యూజిక్ బ్యాండ్లో కూడా చేరారు సనై తకాయిచి. పాకెట్మనీకి సరిపడ డబ్బులు వచ్చేవి! మరి ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆ డ్రమ్స్ మూలన పడ్డాయా? గత జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయా?అదేమీ కాదు. ఆమె ఇప్పటికీ డ్రమ్స్ వాయిస్తారు. వేదికలపై కాదు... ఇంట్లోనే! రాజకీయ రణరంగంలో బోలెడు ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయట పడడానికి, తనను తాను రీఛార్జ్ చేసుకోవడానికి ఇప్పటికీ డ్రమ్స్ వాయిస్తుంటారు.గత నెల జపాన్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్తో చర్చలు జరిపారు తకాయిచి. చర్చలు పూర్తయిన తరువాత ఇద్దరూ సరదాగా కె–పాప్ పాటలు పాడుకున్నారు. డ్రమ్స్ ప్లే చేశారు. -
సైకిల్ నేర్పించి రూ. 35 లక్షలు సంపాదించాడు!
చిన్నతనంలో సైకిల్ తొక్కడం నేర్చుకున్నారా? పెద్దయ్యాక కూడా సైకిల్ తొక్కే అలవాటును కొనసాగిస్తున్నారా? అబ్బే.. అసలు అలవాటు చేసుకోలేదండీ అంటారా? మరేం ఫర్వాలేదు. వయసుతో సంబంధం లేకుండా సైకిల్ తొక్కడం ఎంచక్కా నేర్చేసుకోవచ్చు. ఏంటీ.. సైకిల్ తొక్కడం కూడా నేర్పుతారా? కారు, బైక్ డ్రైవింగ్ నేర్పడం గురించి విన్నాం కానీ.. దీని గురించి ఎప్పుడూ వినలేదే అనుకుంటున్నారా? మీకో ఆసక్తికర సంగతి తెలుసా? సైకిల్ తొక్కడం నేర్పించి ఓ కుర్రాడు రెండేళ్లలో లక్షలకు లక్షలు సంపాదించాడు. ఆశ్చర్యపోతున్నారా? ఇంతకీ ఎవరా కుర్రాడు, ఏమా కథ.. తెలుసుకుందాం రండి.డబ్బు సంపాదించడం కోసం మనుషులు రకరకాల పనులు చేస్తుంటారు. చైనాలోని షాంఘై యూనివర్శిటీ ఆఫ్ స్పోర్ట్లో మూడవ సంవత్సరం మాస్టర్ డిగ్రీ చదువుతున్న లీ అనే విద్యార్థి కూడా ఖాళీ సమయంలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్కు పెరుగుతున్న ఆదరణను గమనించి ఆ దిశగా అడుగులు వేశాడు. తన స్నేహితుడితో కలిసి షాంఘైలో ప్రొఫెషనల్ సైక్లింగ్ శిక్షణ మొదలు పెట్టాలని భావించాడు. అయితే తన మిత్రుడికి ఉద్యోగం దొరకడంతో అతడు మధ్యలోనే వెళ్లిపోయాడు. లీ మాత్రం ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు.చదువు కొనసాగిస్తూనే..ముందుగా సైకిల్ తొక్కడం ఎలా నేర్చుకోవాలో బోధిస్తూ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. రెండు నెలల తర్వాత అతడికి తొలి అవకాశం దక్కింది. అక్కడి నుంచి లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఒక్క చదువు కొనసాగిస్తూనే, మరో పక్క ఉపాధి వెతుక్కున్నాడు. పిల్లలు, పెద్దలకు ఎంతో ఓపిగ్గా సైకిల్ తొక్కడం (bicycle ride) నేర్పిస్తూ మన్ననలు పొందాడు. దీంతో అతడికి దగ్గర సైకిల్ నేర్చుకునేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. తన వద్ద నేర్చుకుంటే కచ్చితంగా సైకిల్ వస్తుందన్న భరోసా ఇవ్వడంతో ఔత్సాహికులకు నమ్మకం పెరిగింది. ఒక్కొక్కరి నుంచి 800 యువాన్లు (సుమారు రూ. 10 వేలు) తీసుకునేవాడు. రెండు క్లాసులతోనే శిక్షణ పూర్తి చేసేవాడు. ఒక్కొ క్లాస్కు గంటన్నర నుంచి 2 గంటల సమయం తీసుకుంటాడు. పిల్లలు త్వరగా నేర్చుకోలేరు కాబట్టి వారికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. సైక్లింగ్ శిక్షణ ద్వారా రెండేళ్లలో అతడు దాదాపు 35 లక్షల రూపాయలకు పైగా సంపాదించినట్టు 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' వెల్లడించింది.అలా నేర్పిస్తాడు..ఓర్పుగా నేర్పించడమే తన విజయ రహస్యం అంటాడు లీ. శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చే వారితో ముందుగా 10 నిమిషాలు మాట్లాడతానని, దీని ద్వారా వారు ఎంత సమయంలో నేర్చుకోగలుగుతారో అంచనా వస్తానని చెప్పాడు. చిన్నతనం సైకిల్ నేర్చకుంటూ పడిపోవడంతో కలిగిన భయం వల్ల చాలా మంది వెనుకంజ వేస్తుంటారు. వారిలో ఆ భయాన్ని పొగొట్టడానికే వారితో మాట కలుపుతానని వివరించారు.చదవండి: ఫిట్స్తో ఎవరైనా పడిపోతే ఇలా చేయకండిషాంఘై దాటి..సైక్లింగ్కు ఇంత ఆదరణ ఉందని తాను ఊహించలేదని లీ చెప్పాడు. జూన్లో తన చదువు పూర్తవగానే తన సేవలను విస్తరిస్తానని తెలిపాడు. తన బోధనా పద్ధతులను మరింత మెరుగుపరుచుకుని షాంఘై వెలుపల కూడా శిక్షణ ఇస్తానని వెల్లడించాడు. జెజియాంగ్, జియాంగ్సు ప్రాంతాల్లోనూ సైక్లింగ్ కోచింగ్కు ప్లాన్ చేస్తున్నానని పేర్కొన్నాడు. -
పక్షవాతంతో మంచానికే పరిమితం..కానీ ఆయుర్వేదం నడిచేలా చేసింది..!
అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండే తమిళ నటుడు అరవింద్ స్వామి నటన పరంగానే కాదు గ్లామరస్ పరంగా ఆయనకు సాటిలేరెవ్వరూ. బాంబే, రోజా మూవీలో వేలాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు అరవింద్స్వామి. అలాంటి ఆయన కెరీర్పీక్లో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇటీవలే ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు చేరవవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇన్నాళ్లు తాను ఎందుకు సినీ ఫీల్డ్కి ఎందుకు దూరంగా ఉన్నారో వెల్లడించారు. అనారోగ్యం బారిన పడటం ఒక కారణమైతే, అధిక బరువు మరో కారణమంటూ..తాను ఎదుర్కొన్య ఆరోగ్య సమస్య గురించి కూడా వివరించారు. ఇంతకీ ఆయన ఏ అనారోగ్య సమస్యతో బాధపడ్డారంటే..అరవింద్ స్వామికి 2005లో పాక్షికంగా పక్షవాతం వచ్చింది. 18 నెలలు ఎంతగానో నొప్పితో విలవిలలాడాడు. చివరికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన అది వద్దనుకుని కేరళకు చెందని ఆయుర్వేద వైద్యుడిని ఆశ్రయించినట్లు తెలిపారు. ఒకటిన్నర ఏడాదిగా అనుభవించిన బాధ అంత ఇంత కాదని, ఆఖరికి స్పర్శను కూడా కోల్పోయానని అన్నారు. కానీ ఆయుర్వేదం తనను మూడు రోజుల్లో తిరిగి నడిచేలా చేసిందన్నారు. అది నాకు చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తనకు పనిచేసింది కాబట్టి ప్రజలను ఫాలో అవ్వమని సూచించడం లేదు. అలాగే గుడ్డిగా కూడా ఫాలో కావొద్దన్నారు. వైద్యుల సూచనల మేరకు, ఆరోగ్య పరిస్థితి రీత్యా సరైన నిర్ణయం తీసుకోండని అన్నారు. ఇక్క నొప్పి, కదలలేని పరిస్థితి కంటే..మానసికంగా స్థైర్యంగా ఉండటం అత్యంత ప్రధానమని అన్నారు. ఆ పరిస్థితిలో నాకే ఇలా అనే ఆలోచన దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదన్నారు. ఆ సమస్య నుంచి బయటపడ్డ వెంటనే..ఫజిల్స్, చదరంగం వంటి ఆటలతో బిజీ అయిపోయినట్లు తెలిపారు. అయితే ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాక మళ్లీ సినీ రంగంవైపుకి రావాలని అస్సలు అనుకోలేదు, సినిమా చేయాలని కూడా అనుకోలేదట. ఎందుకంటే ఆ టైంలో చాలా మందులు వాడటంతో విపరీతం బరువు పెరిగిపోయి, జుట్టు ఊడిపోయి అదోలా తయారయ్యానని, దాంతో సినిమాల ఆలోచన రాలేదని చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి. ఎంత టెక్నాలజీ అభివృద్ది చెంది..ఆధునాత వైద్యం చెంతకు చేరినా..ఏళ్లనాటి పురాతన ఆయుర్వేదమే అత్యుతమమని పలు ఉదంతాల్లో నిరూపితమైంది కూడా.(చదవండి: అమెరికా కోడలు..ఇండియా అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..) -
Weight Loss: తూచా తప్పకుండా ఈ ఏడు సూత్రాలు..!
బరువు తగ్గడం అన్నది చాలామందికి అతిపెద్ద సమస్య. కానీ కొందరికి చాలా సింపుల్. అదికూడా నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండానే వెయిట్లాస్ అవుతారు. అలాగని, అధిక వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేయరు. సాధారణంగా రోజువారీగా చేసే సింపుల్ వ్యాయామాలు..కాస్త తెలిగా మంచి ఆహారం తీసుకుంటూ తగ్గుతారు. ఇక్కడ ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా..తగిన ప్రోటీన్లు, విటమిన్లు అందేలా జాగ్రత్త వహిస్తే..ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా బరువు తగ్గేలా మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక్కడొక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అదే నిరూపించాడు. రోజువారీ ఆహారాన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకుని..అవలీలగా 35 కిలోలు తగ్గి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు బరువు తగ్గాలంటే ఈ ఏడు చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వాలని అంటున్నాడు. అవేంటో చూద్దామా..!ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అన్ష్ త్రిపాఠి కొలెస్ట్రాల్ తగ్గించే వాస్తవిక ఆహార నియమాలను షేర్ చేసుకున్నాడు. తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. బరువు తగ్గడంలో కన్ఫ్యూజన్కి గురికావొద్దని అంటున్నాడు. మన స్వచ్ఛమైన భారతీయ ఆహారంతోనే కొవ్వుని కరిగించేలా తీసుకుంటే చాలని చెబుతున్నాడు. ప్రధాన నియమం..కొలెస్ట్రాల్ని తగ్గించే ఆహారాలే మన భోజనపు ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్ వేటిలో ఉంది..? తగినన్ని కూరగాయలు తింటున్నామా?.. నూనె దగ్గర నుంచి కార్బోహైడ్రేట్స్ వరకు అన్ని నియంత్రణలో ఉన్నాయా..? అని గమనించాలి. ఇక్కడ ఏది మిస్ అవ్వకూడదు. ఆహారంలో ఉండాల్సినవి..తప్పనిసరిగా సగం కూరగాయల్లో 1/4 వంతు ప్రోటీన్, 1/4 కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడాలి.ప్రోటీన్ తప్పనిసరి..ఆహారంలో కొవ్వు నష్టాన్ని ప్రోటీన్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రోటీన్ తక్కువగా ఉంటే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో కండరాలను కోల్పోవడం ప్రారంభమవుతుంది. .కూరగాయలు తప్పనిసరి..ఆరోగ్యకరమైన ఆహారంలో అతి ముఖ్యమైన భాగం. ప్లేట్లో వండిన లేదా పచ్చిగా ఉన్న భోజనానికి కనీసం రెండు వేర్వేరు కూరగాయలు ఉండాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, తక్కువ కేలరీలను కలిగి ఉంటాయికార్బోహైడ్రేట్ నియంత్రణ నియమంమన ఆహారంలో కార్బోహైడ్రేట్లను జోడించాలి కానీ మితంగా ఉండాలి. భోజనంలో 1 రోటీ లేదా 1 కప్పు బియ్యం ఉండేలా కేర్ తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాటి స్థానంలో పోహా లేదా ఉప్మాతో కూడా మార్చుకోవచ్చు. కొవ్వు/నూనె నియమండైట్ విషయంలో చాలామంది ఫెయిలైదే ఇక్కడే అని అంటున్నాడు. మన భోజనంలో రెండు నుంచి మూడు స్పూన్లకు మించి నూనె ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది. కేలరీలు కూడా సమృద్ధిగా ఉంటాయి.గుర్తించుకోవాల్సిన విషయాలుశాఖాహారుల కోసం, కొవ్వు తగ్గింపు ప్లేట్లో సగం ప్లేట్ సబ్జీ, 1 కటోరి పప్పు/పనీర్/టోఫు, 1 రోటీ లేదా చిన్న మొత్తం రైస్ ఉండాలి. శాఖాహారులకు కొవ్వు నష్టం కష్టంగా అనిపించిందంటే..ప్రోటీన్ తీసుకోవడం చాలా తక్కువగా ఉందని అర్థం.అలాగే నాన్-వెజ్ ప్లేట్లో చికెన్/చేప/గుడ్లు ప్రధానంగా ఉంటాయి. ప్లేట్లో సగానికిపైగా కూరగాయలు ఉండాలి. సమతుల్యతను కాపాడుకోవడానికి కార్బ్ భాగం చిన్నగా ఉండాలి. భాగాలను నియంత్రించినప్పుడు మాత్రమే మాంసాహార ప్లేట్ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.అల్పాహారం ప్లేట్లలో తక్కువ కార్బోహైడ్రేట్లతో ప్రోటీన్ ఉండాలి, ద్రవ కేలరీలు ఉండకూడదు. అయితే డిన్నర్ లేదా లంచ్ ప్లేట్లో ప్రోటీన్ క్వాండిటీ తక్కువగా ఉంటే..ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉండవచ్చు.చక్కెర పానీయాలు నివారించండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలను ఇతరులతో షేర్ చేసుకోండి. ఇలా గనుక ఆహారంలో మార్పులు చేసుకుని తూచా తప్పకుండా ఫాలో అయితే..ఇట్టే బరువు తగ్గుతారంటూ తన పోస్ట్ని ముగించాడు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ త్రిపాఠి.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్లో కోడింగ్..!) -
ఆన్లైన్లో అనకొండలున్నాయి
తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే... అంతర్జాలం కాస్తా మాయాజాలం అవుతుంది. డబ్బులు పోగొట్టుకోవడం నుంచి ప్రైవసీకి ముప్పు రావడం వరకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పుడు మన నిత్యావసరాల జాబితాలో ‘ఇంటర్నెట్’ భాగం అయింది. ఆ నెట్టింట ప్రయోజనాలూ, ఉపయోగాలతో పాటు మింగేసే అనకొండలు కూడా ఉన్నాయి. వాటి బారిన పడకుండా ఉండడం ఈరోజుల్లో సవాలుగా మారింది. ‘ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అన్ని విధాలుగా ఆలోచించాలి. తొందరపాటు కూడదు’ అనేది సేఫ్టీ ఇంటర్నెట్ తారకమంత్రం...గిబ్లీ స్టైల్ ఏఐ ఆర్ట్గిబ్లీ–స్టైల్ ఏఐ ఆర్ట్ మన ఫొటోలను చిత్రవిచిత్రమైన, యానిమీ–స్టైల్ చిత్రాలుగా మారుస్తుంది. సరదా సంగతి ఎలా ఉన్నా, ఈ గిబ్లీ–స్టైల్ ఆర్ట్ ట్రెండ్ అనేది ప్రైవసీ, డాటా సెక్యూరిటీకి సంబంధించి ముప్పు తెచ్చిపెడు తుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. మరికొన్ని...ప్రైవసీ నైట్మేర్: గిబ్లీ–స్టైల్ ఆర్ట్లాంటి ఫీచర్లను అందించే కొన్ని యాప్లు, ప్లాట్ఫామ్లు యూజర్ల ముఖ కవళికలు, రకరకాల ఎక్స్ప్రెషన్స్కు సంబంధించిన చిత్రాలను సేకరించి స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తున్నాయి. దీన్నే ప్రైవసీ నైట్మేర్ అంటున్నారు.డీప్ఫేక్: మహిళలు, పిల్లలు అప్లోడ్ చేసిన పర్సనల్ ఫొటోలు, సెల్ఫీలతో డీప్ఫేక్స్ సృష్టించే ప్రమాదం ఉంది. తెలియకుండానే ఓకే అనేస్తున్నారు: ఫ్యూచర్ మోడల్ ట్రైనింగ్కు సంబంధించి స్టోర్ చేయడానికి, విక్రయించడానికి ఏఐ డెవలపర్లు పర్సనల్ ఫొటోలను ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన నిబంధనలను చాలామంది యూజర్లు తెలియకుండానే అంగీకరిస్తున్నారు!లైక్నెస్ ఎక్స్ప్లాయిటేషన్నిజమైన వ్యక్తి, ముఖ్యంగా మహిళల పోలికలను, ఏఐ జనరేటెడ్ క్యారెక్టర్స్లో మెర్జ్ చేస్తున్నారు. వీటిని హానికరమైన పనుల కోసం ఉపయోగించే ప్రమాదం ఉంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు→ ప్రైవసీ పాలసీకి సంబంధించి స్పష్టత లేని, అనుమానించే రీతిలో ఉన్న ఏఐ టూల్స్ను ఉపయోగించవద్దు.→ ప్రైవసీ పాలసీలను జాగ్రత్తగా చదవాలి. అప్లోడ్ చేసిన ఇమేజ్లను ఏఐ ప్లాట్ఫామ్లు ఎలా స్టోర్ చేస్తున్నాయి, ఎలా ఉపయోగిస్తున్నాయనేది లోతుగా అర్థం చేసుకోవాలి.→ దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉండే సెన్సిటివ్, పర్సనల్ ఫొటోలను అప్లోడ్ చేయవద్దు.→ ఫొటోలను అప్లోడింగ్ చేసే ముందు లొకేషన్ డాటా, వ్యక్తిగత వివరాలు లేకుండా చూసుకోవాలి.→ ఏఐ అకౌంట్స్ ఆథెంటికేషన్ కోసం స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ఉపయోగించాలి.→ ఉచిత ఏఐ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అనుమతులు కోరితే వాటిని ఉపయోగించే విషయంలో పునరాలోచన చేయాలి.వాయిస్ క్లోనింగ్ స్కామ్ఒక తండ్రికి విదేశాల నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కుమారుడు వికాస్ వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు.‘ఒక కేసులో వికాస్ను అరెస్ట్ చేశాం. ఒకసారి మాట్లాడండి’ అన్నది అవతలి గొంతు.‘నాన్న... నేను చెప్పిన ఎకౌంట్కు అర్జంటుగా డబ్బు పంపించు. అలా చేయకపోతే జైల్లో ఉండాల్సి వస్తుంది’ భయం ఉట్టిపడే గొంతుకతో అన్నాడు వికాస్. అది తన కుమారుడి వాయిసే కాబట్టి ఆ పెద్దాయన వారు అడిగినన్ని డబ్బులు పంపాడు.ఆ తరువాత ఎప్పటికో వికాన్ నుంచి ఫోన్ రాగానే ఆత్రంగా ఫోన్ ఎత్తాడు...‘రిలీజ్ చేశారా? క్షేమంగా ఉన్నావా?’ అని ఆత్రంగా అడిగాడు.‘రిలీజ్ చేయడం ఏమిటి?’ అని షాకై పోయాడు వికాస్. జరిగినందంతా చెప్పాడు తండ్రి. తన వాయిస్ ఎవరో క్లోనింగ్ చేశారు అనే విషయం వికాస్కు అర్థమైంది. బ్లాక్మెయిల్ చేయడం నుంచి డబ్బులు డిమాండ్ చేయడం వరకు స్కామర్స్ వాయిస్ క్లోనింగ్ చేస్తున్నారు. దీన్ని ‘వాయిస్ క్లోనింగ్ స్కామ్’ అంటారు.జాగ్రత్తలు→ అనుమానించడానికి ఏమాత్రం టైమ్ ఇవ్వకుండా ‘మీ అమ్మాయి చాలా సీరియస్గా ఉంది’లాంటి మాటలు స్కామర్లు ఉపయోగిస్తారు. వెంటనే ఎమోషనల్ కాకుండా కాస్త ఆలోచించడం మంచిది.→ అపరిచిత ఫోన్లకు సంబంధించి ‘నిజమా? కాదా?’ అని నిర్ధారించుకోవడానికి కుటుంబ సభ్యులతో సీక్రెట్ పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి. లేదా వారికి మాత్రమే జవాబు తెలిసిన కొన్ని ప్రశ్నలు అడగాలి.→ స్కామర్లు మీ వాయిస్ కాప్చర్ చేయకుండా ఉండడానికి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలను మీ సన్నిహితులు మాత్రమే చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమితులు విధించాలి.స్మిషింగ్ స్కామ్ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల పేర్లతో వ్యక్తిగత, ఆర్థిక, లాగిన్ సమాచారాన్ని దొంగిలించడానికి రూ పొందించిన మోసపూరిత టెక్ట్స్ మెసేజ్ను స్మిషింగ్ స్కామ్ అంటారు. ‘మీ ఎకౌంట్ను సస్పెండ్ చేస్తున్నాం’ అంటూ మెసేజ్ రావచ్చు. ‘డియర్ కస్టమర్’ పేరుతో వచ్చే మెసేజ్లో పెద్దగా వివరాలేమీ లేకపోవడం, అనుమానాస్పద మేసేజ్లు, ఊహించని రిక్వెస్ట్లు నోటిఫికేషన్ల రూపంలో రావడం.. మొదలైనవి స్మిషింగ్ స్కామ్లో భాగం.కొన్ని జాగ్రత్తలు→ తెలియని, అన్ఎక్స్పెక్టెడ్ మెసేజెస్ల నుంచి వచ్చిన లింక్లను క్లిక్ చేయకూడదు. అటాచ్మెంట్స్ను డౌన్లోడ్ చేయవద్దు → చట్టబద్ధమైన కంపెనీ లేదా బ్యాంకు నుండి వచ్చినట్లు ఏదైనా మెసేజ్ క్లెయిమ్ చేసుకుంటే, టెక్ట్స్లో ఉన్నవి కాకుండా వారి అధికారిక వెబ్సైట్ లేదా ఫోన్ నంబర్ ద్వారా వారిని నేరుగా సంప్రదించాలి.→ అనుమానంగా అనిపించిన మెసేజ్లను మీ సెల్యూలార్ ప్రొవైడర్కు, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్సీసీ)కు రిపోర్ట్ చేయాలి.→ సెన్సిటివ్ ఎకౌంట్స్కు సంబంధించి మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (ఎంఎఫ్ఏ)ను ఎనేబుల్ చేయాలి.... ఇవి మాత్రమే కాదు, మ్యాట్రిమోనియల్ స్కామ్స్, విషింగ్ ఎటాక్స్, గేమింగ్ స్కామ్స్, ఆన్లైన్ డేటింగ్ ఫ్రాడ్స్... ఇలా ఎన్నో స్కామ్లు ఆన్లైన్లో పొంచి ఉన్నాయి. ‘నాకు అన్నీ తెలుసు. నన్ను ఎవరూ మోసం చేయలేరు’ అనే అతి ఆత్మవిశ్వాసంతో ఉంటే బాధితుల్లో మొదటి వరసలో మీరే ఉంటారు!అందుకే ఆన్లైన్కు సంబంధించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆపదలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ కోసమై నెట్ (వల)లో పడెనే... పాపం...మన దేశంలో రొమాన్స్ స్కామ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. డేటింగ్ యాప్స్లో నకిలీ ప్రొఫైల్ను ఉపయోగిస్తున్నారు. డాక్టర్, మిలిటరీ ఆఫీసర్, సాఫ్ట్వేర్ కంపెనీ సీయీవో... ఇలా రకరకాల ప్రొఫైల్లను సృష్టిస్తున్నారు. ఈ ప్రొఫైల్ నిజమే అనుకొని ప్రేమ ప్రపంచంలోకి వచ్చిన వారిని, ప్రేమబంధం బలపడిన తరువాత ‘అర్జంటుగా అవసరం ఉంది డియర్’ అని (ఫేక్) ఎమర్జెన్సీల పేరుతో డబ్బు లాగుతున్నారు. ఇదొక రకం అయి™ó, సన్నిహితంగా ఉన్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం అనేది మరో రకం. డేటింగ్ యాప్లలో 39 శాతం మంది యూజర్లు వివిధ రూపాల్లో రొమాన్స్ స్కామ్స్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్కామ్ల బారిన పడిన బాధితులు డబ్బులు పోగొట్టుకోవడం మాత్రమే కాదు డిప్రెషన్ బారిన కూడా పడుతున్నారు. ఆత్మçహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు... → పేరు నమోదు చేసుకునే ముందు డేటింగ్ యాప్ లేదా మ్యాట్రిమోనియల్ అథెంటిసిటీని ధ్రువీకరించుకోవాలి → నివాస చిరునామా, వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచకపోవడం మంచిది → డేటింగ్ యాప్లో పరిచయం అయిన వారిని ప్రత్యక్షంగా కలుసుకొని తగిన ప్రశ్నలు అడగాలి → మ్యాట్రిమోనియల్ సైట్లలో ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి → బ్యాంకింగ్ సమాచారం, గుర్తింపు లేదా పాస్పోర్ట్ కాపీలు, ముఖ్యమైన సమాచారం తెలియని సైట్లకు అందించవద్దు. -
'భారతీయ పేరెంటింగ్'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్..!
భారతీయ పేరెంటింగ్పై గురుగ్రామ్ సీఈవో, నాట్ డేటింగ్ సహ వ్యవస్థాపకుడు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. చాలామంది భారతీయ తల్లిదండ్రుల పిల్లల పెంపకం సరైనది కాదన్నారు. తల్లిదండ్రులు మంచివాళ్లేనని, కానీ పెంపకంలో ఆలోచన తీరు సరిగా లేదన్నారు. పేరెంటింగ్పై ఎన్నో పుస్తకాలు వచ్చినా ఎందుకనో భారతీయ తల్లిదండ్రుల తీరు మారట్లేదని, వాళ్లు పిల్లలను పెంచడం లేదు, ఫలితాలను పెంచుతున్నారంటూ సోషల్మీడియా వేదికగా విమర్శించారు. ఇంతకీ ఆయన ఎందుకిలా అన్నారు. అసలు ఆ సీఈవో ఆంతర్యం ఏంటీ అంటే..భారతీయ కుటుంబ వ్యవస్థను యావత్తు ప్రపంచం మెచ్చుకుంటే..మన భారతీయుడు, గురుగ్రామ్కి చెందిన మ్యాట్రిమోని యాప్ సీఈవో జస్వీర్ సింగ్ భారత పేరెంటింగ్ని తప్పుపడుతున్నారు. భారత తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానం అత్యంత అధ్వాన్నమైనది అని తిట్టిపోశారు. వాళ్లు పిల్లలను తమ సొంత ఆస్తులుగా చూస్తారని అన్నారు. ప్రపంచంలో మిగిలిన ప్రాంతాల్లో చూసిన దానికంటే అత్యంత భిన్నంగా ఉంటుందన్నారు. సాంస్కృతికంగా భారతీయ పేరెంటింగ్ విధానంలో పెద్దలు ఎల్లప్పుడూ గొప్పవారు అని గుండెల్లో నాటుకుపోతుందన్నారు. అంతేగాదు జస్వీర్ సింగ్ సోషల్మీడియా ఎక్స్పోస్ట్లో భారత తల్లిదండ్రుల పిల్లలను పెంచే విధానం గురించి ఇలా రాసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల పెంపక విధానాలలో కెల్లా అత్యంత చెత్త విధానంగా పేర్కొన్నారు. దీన్ని ప్రెషర్ కుక్కర్ పేరెంటింగా అభివర్ణించారు. ఇక్కడ భారత తల్లిదండ్రులు చెడ్డవారు కాదు గానీ ఆలోచన తీరు సరైనది కాదంటున్నారు. ముఖ్యంగా పిల్లలను ప్రశ్నించే విధంగా పెంచరన్నారు. తల్లిదండ్రులదే తుది నిర్ణయం..చాలామటుకు తల్లిదండ్రులు పిల్లలను పెంచరని, వాళ్ల ఫలితాలను పెంచుతారని రాసుకొచ్చారు. వాళ్లు వ్యక్తలుగా స్వతంత్రంగా ఉండాలని కోరుకోరు. ఎందుకంటే భారత్లో ఒక పిల్లవాడు ఏం చదువుకోవాలి, భవిష్యత్తులో ఏ వృత్తిలో కొనసాగించాలి, ఎలాంటి జీవితాన్ని గడపాలి...అన్ని తల్లిదండ్రులే ఆలోచిస్తారు, నిర్ణయిస్తారు. ఆఖరికి ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది కూడా తల్లిదండ్రలదే ఫైనల్ నిర్ణయం అన్నారు. ఇక్కడ భారత పేరెంట్స్ దృష్టిలో మానసిక ఆరోగ్యం, ఆసక్తి, ఉత్సుకత, ఆప్టిట్యూడ్, తదితరాలన్ని ఎందుకు పనికిరానివి, విలువలేనివి అన్నారు. కేవలం వాళ్ల మైండ్లో తల్లిదండ్రులుగా తమకే అన్ని తెలుసని, మేము చెప్పినట్లుగా చేయాలనే ధోరణే ఎక్కువగా ఉంటుందన్నారు. చెప్పాలంటే ఇదొక వస్తుమార్పిడిలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తామే ఈ ప్రపంచంలోకి పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి వాళ్లపై తమకే సర్వహక్కులు ఉంటాయన్నట్లుగా ఉంటుంది వారి తీరు. ప్రశ్నించడమే అతిపెద్ద నేరం..దాంతో పిల్లలు భావోద్వేగపరంగా చిక్కుకుపోతుంటారు. పైగా వైఫల్యాన్ని నేరంగా చూస్తారు. అదొక సిగ్గుచేటు, ఆందోళనగా పిల్లల మైండ్లోకి చొప్పిస్తారు. అంతేగాదు బంధువుల్లోనూ, సమాజంలోనూ తక్కువ అయినట్లుగా ప్రతిక్షణం పిల్లలకు నూరుపోస్తుంటారు. దీన్ని ఇక్కడ తల్లిదండ్రులుగా తాము పిల్లల భవిష్యత్తును కాపాడుతున్నట్లుగా ఫీలవుతుంటారు కానీ, సవాలుని స్వీకరించేలా కాకుండా వైఫల్యం నుంచి కాపాడుకుంటున్నట్లుగా పెంచుతున్నాం అని గ్రహించరని మండిపడ్డారు. అంతేగాదు ఇక్కడ పిల్లలు ప్రశ్నించడం అనేది అగౌరమైనది, ఒకవేళ ఏ పిల్లవాడైన ధైర్యంగా ప్రశ్నించడం మొదలుపెడితే..అతడని దూరంగా ఉంచాల్సిన వ్యక్తిగా నిలబెడతారు. కేవలం నిశబ్దాన్ని ప్రోత్సహిస్తారు. ముందు తల్లిదండ్రులుగా వాళ్లు ఇలానే పెరిగారు, నియంత్రించబడ్డారు, ప్రశ్నించలేదు, భావోద్వేగపరంగా అణిచివేయబడ్డారు..కాబట్టి అదే తర్వాతి తరాలకు పునరావృతం అవుతుందని అన్నారు. అలాగే కొంతమంది పిల్లలకు చిన్న వయసులోనే పెద్దలకు మించిన పరిణితి, అపారమైన మేధస్సు ఉంటుంది, అయినప్పటకీ అక్కడ కూడా ప్రశ్నించడం ద్రోహం, విబేధించడం, అపరాధం అనే భావన కిందకు రావడం దురదృష్టకరం అని అన్నారు. కొందరు తల్లిదండ్రలు ఇలా ప్రశ్నిస్తున్నందుకు పనిష్మెంట్తో నొరు నొక్కే ప్రయత్నం చేస్తుంటారు లేదా గర్విష్టులు, మొండోడు కింద ముద్రవేస్తారని అన్నారు. నో చెప్పడానికి జంకేలా..ఇక్కడ తల్లిదండ్రులు సమాజా అభిప్రాయానికి భయపడతారని అంటున్నారు. పిల్లలను తమను అనుసరించి, తమపై ఆధారపడేలా పెంచుతారని అన్నారు. అదీగాక తల్లిదండ్రలు మరో విషపూరి సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు. అదేంటంటే పక్కంటి పిల్లవాడితో ప్రతిదానితో పోలుస్తూ..పెంచే ప్రయత్నం చేస్తుంటారు.. ఇది అన్నిట్లంకంటే దారుణైమనది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ భారతీయ తల్లిదండ్రులు సమాజంపై పోరాడలేక తమ భయాలను పిల్లలపై వేస్తారు, ఆధిపత్యం చెలాయిస్తారని అన్నారు. సింపుల్గా చెప్పాలంటే పిరికితనంతో పెంచుతారని, అది పితృస్వామ్యం విధేయత నుంచి వచ్చిందని అన్నారు. తల్లిదండ్రులు 'నో' అని స్వతహాగా చెప్పడం నేర్చుకోలేదు..పిల్లలకు అది నేర్పించరు. చెప్పాలంటే భారత పేరెంటింగ్స్ తమ పిల్లలను బాగా పెంచామనే ముసుగులో వారికి తెలియని నష్టం చేకురుస్తున్నారు. పైగా వ్యక్తిగత వైఫల్యాన్ని తరతరాలు మోసేలా చేస్తున్నారని తిట్టిపోశారు జస్వీర్ సింగ్. ఆయన ఉద్దేశ్యం ప్రకారం భారత పేరెంటింగ్ టాలీవుడ్ మూవీ బొమ్మరిల్లు లాంటిదని తేల్చేశారు. అయితే గత దశాబ్ద కాలంలో పెంపకం గురించి మనస్తత్వవేత్తలు, అధ్యయనాలు, కౌన్సలర్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే నకుల్ మెహతా, జాన్కీ మెహతా వంటి మిలీనియల్ తల్లిదండ్రులు ఆధునిక అవగాహనతో పిల్లలను స్వతంత్రంగా ఆరోగ్యకరంగా ఎలా పెంచచ్చో అనుభవాలను షేర్ చేసుకున్నారు కూడా.Indian parenting is pressure cooker parenting. One of the worst models globally. Not because parents are evil. But because the system is broken and no one questions it.Most Indian parents didn’t raise children. They raised outcomes.Children are treated like owned assets -…— Jasveer Singh (@jasveer10) February 8, 2026 చదవండి: నీతా అంబానీ ధరించిన చానెల్ బ్లేజర్ ..అంత ఖరీదా!? -
మొబైల్ చాయ్.. ఉపాధికి హాయ్..
ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది.. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం కాదు.. నిజ జీవితంలో విజయాలకు పునాది వేసిన ఆనవాళ్లు అనేకం.. ఒక వినూత్న ఆలోచనతో, తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు చేస్తున్నవారు అనేకమంది ఉన్నారు.. అలాంటి వారిలో ఒకరు సనత్నగర్కు చెందిన లక్ష్మణ్. 30 ఏళ్ల క్రితమే మొబైల్ వ్యాపార కాన్సెప్్టకు అంకురార్పణ చేశారు. ప్రస్తుతం అనేక మంది ఈ రంగంలో ఉపాధి పొందుతోన్న విషయం తెలిసిందే.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేటకు చెందిన బచ్చల లక్ష్మణ్ బతుకుదెరువు కోసం 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. మొదట రిక్షా తొక్కుకుంటూ జీవనం ప్రారంభించాడు. గిట్టుబాటు లేకపోవడంతో సాయంత్రానికి నిరాశా నిస్పృహలే మిగిలేవి. అప్పుడే.. టీ కోసం అనేకమంది దూరం వెళ్లడాన్ని గమనించాడు. రిక్షానే మొబైల్ టీ స్టాల్గా మారిస్తే.. అన్న ఆలోచన తట్టింది. అకున్నదే తడవు ఆచరణలో పెట్టాడు. 1996లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట ప్రాంతంలో రిక్షాలో మొబైల్ టీ స్టాల్ ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎక్కడ పది మంది గుమికూడితే అక్కడ టీ అందిస్తూ జీవన ప్రయాణాన్ని సాగించారు. సంవత్సరం తిరక్కముందే రిక్షా నుంచి మూడు చక్రాల బైక్కు అప్గ్రేడ్ అయ్యాడు. ఒకటిగా ప్రారంభమై.. అలా ఒక్క మొబైల్ టీ స్టాల్ కాస్తా.. ప్రస్తుతం 22 మొబైల్ టీ స్టాల్స్ను స్వయంగా తీర్చిదిద్ది ఉపాధి కోసం వెతుక్కునే వారికి అండగా నిలుస్తున్నాడు. లక్ష్మణ్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న మొబైల్ టీ పరిమళం ఎస్ఆర్నగర్, అమీర్పేట దాటుకుని నగరం అంతటా వ్యాపించింది. తెల్లవారుజామున 4 గంటలకే అమీర్పేట మైత్రీవనం చౌరస్తా వద్ద దిగే ప్రయాణికులకు అల్లం, గ్రీన్, లెమన్, బూస్ట్, హార్లిక్స్, కాఫీ, టీ కాషన్.. ఇలా అనేక రకాల తేనీటిని అందిస్తుంటాడు.రూపాయి నుంచి.. ‘అప్పట్లో అమీర్పేట కేంద్రంగా సాఫ్ట్వేర్ సంస్థల కార్యకలాపాలు కొనసాగేవి. ఇద్దరు సహాయకులతో నడిపేవాడిని.. వారికి రోజుకు రూ.50లు ఇచ్చేవాణ్ణి. ప్రారంభంలో రూపాయికే టీ.. అలా రోజుకు 700–800 టీలు విక్రయించేవాణ్ణి. దీనిమీదే ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేశా. సొంతిల్లు కొనుక్కున్నా. నాకులా వ్యాపారం చేసుకునేందుకు వీలుగా 22 మందికి మొబైల్ టీ స్టాల్స్ ఇస్తున్నా. ఇంతగా విస్తృతమవుతుందని అప్పుడు అనుకోలేదు’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.


