Lifestyle
-
చిన్నారుల మెదడుకు మేత..సామేత!
ఫ్రెండ్స్, మీరెప్పుడైనా మన తెలుగు సామెతలు విన్నారా? ‘చాలా విన్నాను’... ‘కొన్ని విన్నాను’ అనేవారితోపాటు... ‘సామెత అంటే ఏమిటి?’ అని అడిగేవారు కూడా మీలో ఉన్నారు.వినడానికి సామెతలు సరదాగా ఉంటాయి గానీ... అవి మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వాటిలో మంచి ఉంది. మనల్ని నవ్వించే కామెడీ ఉంది. జీవిత సత్యాలు ఉన్నాయి.లాంగ్వేజ్ స్కిల్స్లో సామెతలు ఉపయోగించడం కూడా ఒకటని మీరు గుర్తు పెట్టుకోవాలి.‘మన సామెతలను మనం తెలుసుకోవడం అంటే... మన ముత్తాతలతో మూడువేల సార్లు మాట్లాడినట్లు’ అనే సామెత కాని సామెత ఉంది. సామెతలు అనేవి సముద్రంలాంటివి. అందులో మనకు ఎన్ని తెలిస్తే అంతమంచిది. ఈరోజు మనం కొన్ని సామెతలు తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాదు వాటిని ఎక్కడో ఒకచోట ఉపయోగించాలి కూడా!కొయ్యర కొయ్యర పోలిగా అంటే... టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట!వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి. అలా కాకుండా లేని విషయాన్ని బాగా పెద్దగా చేసి చెప్పడం మంచిది కాదు. దానివల్ల రకరకాల సమస్యలు వస్తాయి. మిరియాలు చిన్న సైజ్లో ఉంటాయి. ‘మా ఊళ్లో అలా కాదు... తాటికాయలంత ఉంటాయి’ అనడం అబద్ధం చెప్పడమే కదా! ఒక విషయాన్ని పదింతలు చేసి చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది.తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని అడిగితే... దూడకు గడ్డి కోయడానికి అన్నాడట!కొందరు వ్యక్తులు, మనం ఒకటి అడిగితే వారొకటి చెబుతారు. వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ΄పొంతన లేని సమాధానాలు ఇచ్చి నవ్వులపాలవుతుంటారు. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించి వాడే సామెత...‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అని అడిగితే... దూడకు గడ్డి కోయడానికి అన్నట్లు!’దీనికి సంబంధించి ఒక జోక్...రాత్రి బ్యాంకు దొంగతనానికి వచ్చిన దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు. ‘దొంగతనానికి వచ్చాను. తప్పయిపోయింది’ అనలేదు. ఏదోరకంగా తప్పించుకోవాలని... ‘సార్... మీరు పొరబడుతున్నారు. రాత్రిపూట కూడా బ్యాంక్ పనిచేస్తుందా లేదా? అనేది తెలుసుకోవడానికి వచ్చాను’ అన్నాడట!కుక్కను పెంచి...తానేమొరిగినట్లు!‘అనవసరంగా కష్టపడుతున్నారు’ అని చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత... కుక్కను పెంచి తానే మొరిగినట్లు!ఉదాహరణకు....ఒక వ్యక్తి తన ఇంటికాపలాకు వాచ్మెన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ‘నువ్వు రెస్ట్ తీసుకో...నేను చూస్తాను’ అని వాచ్మెన్తో యజమాని అంటే ఎలా ఉంటుంది చెప్పండి!...ఇవే కాదు ఇంకా ఎన్నో సామెతలు ఉన్నాయి. పెద్దలను అడిగి వాటిని తెలుసుకోండి. నోట్బుక్లో రాసుకోండి. అన్ని ్ర΄ాంతాలకు తెలిసిన సామెతలతో పాటు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పాపులర్ అయిన సామెతలు కూడా ఉంటాయి. మీ ప్రాంతంలో పాపులర్ అయిన సామెతలు ఏమిటో తెలుసుకోండి.ఘడియ పురుసత్తు లేదు... దమ్మిడీ ఆదాయం లేదు!మనం కష్టపడ్డామంటే దానికి ఫలితం ఉండాలి. మనం ఒక పని మీద టైమ్ పెట్టామంటే ప్రయోజనం ఉండాలి. అలా కాకపోతే... టైమ్ వేస్ట్ చేసినట్లే కదా! ఇలాంటి సందర్భంలో ఉపయోగించే సామెత ఇది.సామెతల సముద్రంలో నుంచి కొన్ని సామెతలు...ఆశ దోషమెరుగదు అంగట్లో అరువు తల మీద బరువుఅంగడి అమ్మి గొంగళి కొన్నట్లు అండ ఉంటే కొండలు దాటొచ్చుప్రీతితో పెట్టింది పిడికెడు చాలు ఎంత చెట్టుకు అంతగాలిచేటు కాలానికి చెడు బుద్దులు మన దీపమని ముద్దాడితే మూతి మీది మీసాలు కాలకుండా ఉంటాయా!కాలికి చుట్టుకున్న పాము కరవక మానదుకడివెడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువపంచాంగం ΄పోయిందని తిథివారాలు పోతాయా? గుర్రాన్ని గుగ్గిళ్లకు అమ్మినట్లుకుక్క సింహం కాదు, కుందేలు తోడేలు కాదు నలుగురు నడిచేది దారి... పదుగురు చెప్పేది నీతి. -
చెమట ఇబ్బంది పెట్టకూడదంటే..
వేసవిలో శరీరానికి చెమట ఎక్కువగా పట్టడం సహజమే. అయితే కొందరికి మాత్రం ఈ చెమట వల్ల చర్మంపై బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది దుర్వాసనకు దారితీస్తుంది. ముఖ్యంగా హైపర్ హైడ్రోసిస్ సమస్య ఉన్నవారికి ఇది మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు...స్నానానికి యాంటీ బ్యాక్టీరియల్ సబ్బును వాడటం వల్ల చర్మంపై ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత బాహుమూలలు, పాదాలు, చర్మం మడతలు ఉండే ప్రాంతాల్ని తడి లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి.గాలి ఆడేలా ఉండే కాటన్ బట్టల్ని ధరించాలి. ఇవిగాక యాంటీ–పెర్స్పిరెంట్స్, డియోడరెంట్స్ వాడటం వల్ల దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను చంపి, మంచి సువాసనను ఇస్తాయి.వీటికన్నా ముఖ్యం ఏమిటంటే.. కారం ఎక్కువగా ఉండే పదార్థాలు, కెఫీన్, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన వచ్చే ఆహార పదార్థాల్ని తగ్గించాలి.తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం సహజమైన సమతుల్యతను కలిగి ఉంటుంది. అలాగే తగినంత నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే చెమట గాఢత తగ్గి, దుర్వాసన తక్కువగా వస్తుంది. -
మదర్ అదర్సైడ్ మాస్టర్ షెఫ్
ఒకప్పుడు సాధారణ గృహిణిగా, పిల్లల తల్లిగా ఇంటిపట్టునే ఉన్న కనక కతూరియా ఇప్పుడు మాస్టర్ షెఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేంతగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ‘కనక్స్ కిచెన్’ పేరుతో సోషల్ మీడియాలో మిలియన్ల మంది అభిమానం సొంతం చేసుకున్నారు. బార్బిక్యూ నేషన్స్లో మెక్సికన్ రుచులను పరిచయం చేయడానికి ముంబై నుంచి ఇటీవల హైదరాబాద్ వచ్చిన కనకను ‘సాక్షి ఫ్యామిలీ’ పలకరించింది. ఈ సందర్భంగా ఆమె తన ‘వంట’రి పోరాటాన్ని గురించి పంచుకున్న ఎన్నో విశేషాలు ఆమె మాటల్లోనే...‘‘పాతికేళ్లుగా వంటల్లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. ఇండియన్, ఇటలీ, చైనీస్, జపనీస్, మెక్సికన్, ఫ్రెంచ్, అమెరికన్.. అన్నిదేశాల రుచులూ మా ఇంటి కిచెన్లో నేటికీ ఘుమఘుమలాడుతూనే ఉన్నాయి. నేను పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పనిచేసే షెఫ్ని కాదు. సాధారణ గృహిణిని. కానీ, ఈ రోజు ఇండియన్ షెఫ్గా పేరొందాను.బిజీగా మార్చుకున్నాను...నేను ఎం.కామ్. చదివినా, పెళ్లయ్యాక ఇంటికే పరిమితం అయ్యాను. ఇద్దరు కూతుళ్ల పెంపకంలో రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియనంత బిజీ అయిపోయింది జీవితం. వంటలపై నాకున్న అభిరుచిని మెరుగుపరుచుకోవడానికి రోజూ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. పిల్లలు ఏడుస్తుంటే వారిని ఎత్తుకొని తిప్పుతూ, నిద్రపుచ్చుతూ, రకరకాల వెస్ట్రన్ వంటకాలు తయారు చేసేదాన్ని. ఆ సమయంలోనే వాటిని వీడియో తీసేదాన్ని. యూ ట్యూబ్ ల్యాంచ్ అయిన తొలినాళ్ల నుంచీ సోషల్మీడియాలో యాక్టివ్గా ఉన్నాను.హోస్ట్గా.. గెస్ట్గా...ఒక్క రోజులో ఏదీ సాధ్యం కాదు. ఇంటి పనులు, పిల్లల చదువులు, నా వంటకాలు బ్లాగ్లు, వీడియోలు... ఇవన్నీ కొనసాగిస్తూ వచ్చాను. మా ఇద్దరు అమ్మాయిలు కాలేజీ స్థాయి చదువుల్లో రాణిస్తున్నారు. నా వంటలకు మొదట వారే టేస్టర్స్. ‘మా అమ్మ చేతి వంట ది బెస్ట్’ అని మార్కులు ఇస్తుంటారు. వాళ్ల పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటూనే దేశంలో జరిగే అన్నిరకాల ఫుడ్ ఫీస్ట్లకు జడ్జిగా హాజరయ్యాను. ఫుడ్ ఈవెంట్స్ను హోస్ట్ చేశాను. ప్రముఖ రెస్టారెంట్స్తో కలిసి వర్క్ చేశాను. వెస్ట్రన్ ఫుడ్స్ అందించే విషయంలో నన్ను ఆహ్వానిస్తుంటారు. నా వంటకాల రుచులనూ ఈ సందర్భంగా పరిచయం చేస్తుంటాను. టీవీ రియాలిటీ షో మాస్టర్ షెఫ్ ఇండియా ఫస్ట్సీజన్లో పాల్గొన్నాను. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషలలో కనక్స్ కిచెన్ పేరుతో ఫుడ్ ఛానెల్స్ తీసుకు వచ్చాను. ఏ విభాగంలోనైనా సవాళ్లు ఎదుర్కోవడానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ, వంటల తయారీలో ప్రతీ రోజూ, ప్రతి డిష్ ఛాలెంజింగ్గానే ఉంటుంది. రుచిలో అందరినీ మెప్పించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఏ చిన్న పొరపాటు జరిగినా అంతా వృథా అయిపోతుంది. మనసు పెట్టి చేసే వంట మన అనుకున్నవారందరినీ చేరువ చేస్తుంది. అదే నా సక్సెస్ మంత్ర’ అని వివరించారు ఈ ఇండియన్ షెఫ్.ఫిట్గా హెల్తీగా...టేస్టీ, హెల్తీ, వెజ్, నాన్వెజ్... ఇలా ఇన్నిరకాల వంటకాలు చేస్తూ, రుచి చూస్తూ, తింటూ ఉంటారు కదా! ‘బరువు పెరుగుతారు’ అని చాలా మంది అనేవారు. కానీ, ఈ విషయంలోనూ హెల్తీగా ఫిట్గా ఉండటానికి కృషి చేస్తుంటాను. యాక్టివ్గా ఉండటానికి జిమ్, వాకింగ్ నా లైఫ్స్టైల్లో భాగం చేసుకున్నాను. – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
సహజీవనంలో కూడా ఆ చట్టం వర్తిస్తుందా?
గత నాలుగు సంవత్సరాలుగా ఒకవ్యక్తితో సహజీవనం చేస్తున్నాను. ఒకే ఇంట్లో ఉంటున్నాము. అంతా బాగానే ఉంది కదా పెళ్లి చేసుకుందాము అనుకున్నాను. పోయిన ఏడాది అతన్ని వాళ్ళ ఇంట్లో చెప్పమని అన్నాను. కానీ మా కులాలు వేరు కావడంతో వాళ్ళ ఇంట్లో మాత్రం వద్దు అన్నారు. అప్పటినుంచి తన వ్యవహార శైలి మారిపోయింది. ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నాడు. తన బలవంతంపై ఒకసారి అబార్షన్ కూడా చేయించుకున్నాను. ప్రతి వారం నాకు చెప్పకుండా ఎటో వెళ్తున్నాడు. తన వాటా అద్దెకానీ, ఇంటి సరుకులకు కానీ డబ్బు కూడా ఇవ్వడం లేదు. అడిగితే అప్పులు ఉన్నాయని అంటున్నాడు. అప్పుడప్పుడు చెయ్యి చేసుకుంటూ... ఇష్టం లేకుంటే వెళ్ళిపో అంటున్నాడు. పెళ్ళి చేసుకుంటా అని మోసం చేశాడు అని కేసు పెట్టమని ఒకరు సలహా ఇచ్చారు. నాకు మాత్రం గృహహింస చట్టం కింద కేసు వేయాలి అని ఉంది. ఏం చేయమంటారు?– ఒక సోదరి, విశాఖపట్నంపెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వారికి కూడా గృహహింస నిరోధక చట్టం వర్తిస్తుంది. కానీ ప్రతి సహజీవనం కేసులో గృహహింస నిరోధక చట్టం వర్తింప చేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం ‘వివాహ స్వరూపంలో ఉన్న సంబంధం’ ఏ పరిస్థితుల్లో ఉంటుందో నిర్ధారించడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఇవి సంపూర్ణమైనవి కాక΄ోయినా, అలాంటి సంబంధాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయి అని కోర్టు చెప్పింది. అందులో ముఖ్యమైనవి...సంబంధం కొనసాగిన కాలవ్యవధిడీవీ చట్టంలోని సెక్షన్ 2(జ) మేరకు వారి సంబంధం ఒక సముచిత కాలం పాటు కొనసాగి ఉండాలి. ఆ కాలవ్యవధి ప్రతి కేసులోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు.సహవాస గృహం (షేర్డ్ హౌస్ హోల్డ్) ఏదో ఒక సమయంలో కలిసి ఒకే ఇంట్లో నివసించారు అనే ఆధారం.ఆర్థిక వనరుల భాగస్వామ్యం ఒకరికి ఒకరు ఆర్థికంగా సహకరించడం, జాయింట్ బ్యాంకు ఖాతాలు నిర్వహించడం, స్థిరాస్తులను ఇద్దరిపేర్లపై లేదా మహిళ పేరుపై కొనుగోలు చేయడం, వ్యాపారాల్లో లేదా షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలు.గృహ వ్యవహారాల నిర్వహణ ముఖ్యంగా మహిళకు ఇంటి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, ఉదాహరణకు వంట చేయడం, శుభ్రపరచడం, ఇంటిని నిర్వహించడం వంటి పనులు చేయడం.లైంగిక సంబంధం వివాహ స్వరూపంలోని సంబంధం అనేది కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే ఉండే లైంగిక సంబంధం కాదు. అది భావోద్వేగ, ఆత్మీయ బంధం, సంతానం పొందాలనే ఉద్దేశం, స్నేహభావం, పరస్పర ప్రేమాభిమానాలు, శ్రద్ధ వంటి లక్షణాలను కలిగి ఉండాలి.పిల్లలు/సంతానం పిల్లలు ఉండటం అనేది వివాహ స్వరూపంలోని సంబంధానికి బలమైన సూచన. ఎందుకంటే అది దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశాన్ని చూపిస్తుంది. పిల్లలను పెంచడం, వారి బాధ్యతలను పంచుకోవడం కూడా అలాంటి సంబంధానికి బలమైన సూచన.సామాజికంగా భార్యాభర్తలుగా ప్రవర్తించడంస్నేహితులు, బంధువులు, సమాజంలోని ఇతరుల ముందర భార్యాభర్తలుగా ప్రవర్తించడం, అలాగే తమను అదేవిధంగా పరిచయం చేసుకోవడం, ఆ సంబంధం వివాహ స్వరూపంలో ఉందని నిర్ధారించడానికి బలమైన ఆధారంగా పరిగణించబడుతుంది.ఇరుపక్షాల ఉద్దేశం, ప్రవర్తనతమ సంబంధం ఎలా ఉండాలి, దాని స్వభావం ఏమిటి, ఇద్దరి పాత్రలు, బాధ్యతలు ఏమిటి అనే విషయాలపై ఇరుపక్షాల ఉద్దేశం ఆ సంబంధ స్వభావాన్ని ప్రధానంగా నిర్ణయిస్తుంది. ఆ ఉద్దేశం స్పష్టంగా వ్యక్తపరచబడవచ్చు లేదా ప్రవర్తన ద్వారా పరోక్షంగా అర్థమవవచ్చు. వివాహానికి సాధారణంగా ఉండే లక్షణాల విషయంలో వారి ఉద్దేశమే ముఖ్యమైనది.పైన సూచించిన విధంగా మీ బంధం/సహజీవనం కొనసాగి ఉంటే మీకు గృహహింస చట్టం వర్తిస్తుంది. సహజీవనం చేస్తున్న వారు చాలామంది ఎటువంటి ఆధారాలను ఉంచుకోవడం లేదు. ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటే అందులో కేవలం ఒకరి పేరు మాత్రమే ఉంటుంది. ఇద్దరి పేర్లు ఉంటే మంచిది. వారి బంధాన్ని ఎవరికీ చెప్పుకోకుండా గోప్యంగా ఉంచుకోవడం కూడా మంచిది కాదు. పైన సూచించిన అంశాలను గుర్తుపెట్టుకుని సహజీవనం చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటే మంచిది.అదలా ఉంటే మీకు మీ సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకు పెళ్లి చేసుకుంటాను అని మోసపూరితంగా శారీరకంగా కలిశారు అంటూ బీ.ఎన్.ఎస్. లోని సెక్షన్ 69 ప్రకారం కూడా క్రిమినల్ కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. కానీ అది నిజమైతే మాత్రమే క్రిమినల్ కేసు పెట్టండి. సెక్షన్ 69 ప్రకారం పురుషునికి మొదటి నుండి మోసపూరిత ఉద్దేశం ఉంది అని రుజువు చేయాల్సి ఉంటుంది. మీ హక్కులు మీకు ఉన్నప్పటికీ, మీ వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యమైనది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవనం భంగపడకుండా చూసుకోండి. ప్రస్తుత బంధాన్ని ముగించవలసి వస్తే, ఆ పని చేసి కేసులను నడిపించవచ్చు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది( మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. )(చదవండి: కేన్సర్పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్పాండే హెల్త్ టిప్స్) -
కేన్సర్పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్పాండే హెల్త్ టిప్స్
కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక వచ్చిందంటే ఆ క్షణమే సగం ప్రాణాలు పోతాయ్. కానీ ఇలా భయపడొద్దని చెబుతోంది బాలీవుడ్ నటి రాజశ్రీ దేశ్పాండే. తాను కేన్సర్తో పోరాడినప్పుడు అలానే చేశానంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. మరి అదెలాగో చూద్దామా..!.'సేక్రేడ్ గేమ్స్' (2018), 'ట్రయల్ బై ఫైర్' (2023) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి రాజవ్రీ దేశ్పాండ్కు మార్చిలో గ్రేడ్1 రొమ్ము కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. తనకు ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా (NOS) నిర్ధారణ అయినట్లు తెలిపింది. అప్పటి నుంచి ఆమె తను తీసుకుంటున్న చికిత్స, వ్యాధి నిర్ధారణ, శారీరక మానసిక ఆరోగ్యంపై ఆ వ్యాధి ఎలా ప్రభావం చూపిస్తుంది తదితరాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటున్నారామె.పోరాడాలి..పోరాడుతూనే ఉండాలి..ఈ కేన్సర్ మహమ్మారి సోకిన తర్వాత మనం కంటకి కనిపించని భూతాలతో పోరాడుతూ ఉండాల్సి ఉంటుందన్నారామె. ఎందుకంటే నిలకడ లేని మనసులను మనల్ని ప్రలోభ పెట్టే ఇబ్బందుల్ని భూతలుగా అభివర్ణిస్తు ఇలా అన్నారామె. జీవితం అంటే అదేనని, పోరాడాలి..పోరాడుతూనే ఉండాలన్నారు. అస్సలు దీన్ని కష్టమైనదిగా భావించొద్దు. మనల్ని మనం సరిదిద్దుకునే జీవితంగా భావించండి. అప్పుడు ప్రతీది తేలికగా మారుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, మెరుగ్గా ఉండేలా జీవించే ప్రయత్నం చేయండి. రోజువారీ పనుల్లో ఆనందాన్ని వెత్తుక్కోవాలి. అలాగే కేన్సర్కి వాడే మందులు ఎంత కఠినండో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. 35 ఏళ్ల తర్వాత పెరిమెనోపాజ్ లేదా మెనోపాజ్ దశలో ఉన్న ప్రతి మహిళకు ఇవి ఎంత కష్టమో తనకు తెలుసని అన్నారు. ఆ చిన్ననాటి సంఘటనే నా ధైర్యం..ఈ కేన్సర్ని ఎదుర్కొనడానికి ధైర్యాన్ని ఇచ్చిన ఆ చిన్ననాటి సంఘటనను పంచుకున్నారు. చిన్నతనంలో తనకు దెయ్యాలంటే చాలా భయంగా ఉండేదని, అప్పుడు నాన్నగారు దెయ్యాలంటే చెడ్డవాళ్లని చెప్పారు. అంతే ఆ క్షణం నుంచి అవి అంటే భయం పోయింది. అలానే ఈ కేన్సర్ని కూడా చెడ్డదిగా బావించి, పారద్రోలే ప్రయత్నం చేశానంటోంది. అంతేగాదు అందుకోసం మనసు, హృదయం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ చెడ్డవాళ్ల తలంపు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తే చాలు అంటోంది. తన ఫ్యామిలీ డాక్టర్ కూడా అదే చెప్పారని చెప్పుకొచ్చింది. ఆయన మీలో సంతోషకరమైన హార్మోన్ల తోపాటు చుట్టూ సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులు ఉండాలన్నారు. దాంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలన్నారు. ఇలా చేస్తే ఏ మహమ్మారి మిమ్మల్ని ఏం చేయలేదన్నారు. కాగా నటి రాజశ్రీ దేశ్పాండే తన తదుపరి మరాఠీ చిత్రం 'బాప్యా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఈ నెల మే 15న విడుదల కానుంది. ఇందులో ఆమె ట్రాన్స్ మ్యాన్ పాత్ర పోషించినట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: ఇక నుంచి 'పీసీఓఎస్' కాదు 'పీఎంఓఎస్') -
ఇక నుంచి 'పీసీఓఎస్' కాదు 'పీఎంఓఎస్'
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరును అధికారికంగా పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్ (PMOS)గా మార్చారు. అందరు ఈ వ్యాధిని దీర్ఘకాలిక వ్యాధిగా కాకుండా సంతానలేమి సమస్యగా పరిగణిస్తూ అపార్థం చేసుకోవడంతో ప్రపంచ వైద్య ఏకాభిప్రాయం తర్వాత ఇలా అధికారికంగా ఆ వ్యాధి పేరు మార్చారు. ప్రపంచంలోని చాలామంది మహిళల్లో కనపించే అత్యంత సాధారనమైన రుగ్మతలలో ఒకటి ఇది. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండేందుకు ఇలా చారిత్రాత్మకంగా కొత్తపేరు నామకరణం చేశారు. అంతర్జాతీయ ఎండోక్రైన్ అండ్ పునరుత్పత్తి ఆరోగ్య నిపుణుల నేతృత్వంలో ప్రపంచ వైద్యుల చర్చల ఫలితమే ఈ పీఎంఓస్గా పేరు మార్పు. దేని గురించి ఈ పేరు మార్పు..ఇన్నాళ్లు ఈ పీసీ ఓఎస్ అనేది అండాశయ తిత్తుల గురించే నొక్కి చెప్పలా ఉంది. నిజానికి చాలామంది మహిళలకు అండాశయ తిత్తులనేవి ఉండవు. అందువల్ల ఈ పందం "PCOS" వైద్యపరంగా తప్పుదోవ పట్టించేలా ఉందని నిపుణులు వాదించారు. పైగా జీవక్రియ, హార్మోన్లు, మానసిక ఆరోగ్యం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పాత పేరు సరిగా వివరించలేకపోయిందని అన్నారు.ఈ కొత్తపేరు ఏం వివరిస్తోందంటే..పాలీఎండోక్రైన్: అనేక హార్మోన్ల వ్యవస్థలు ప్రభావితమవుతాయిమెటబాలిక్: ఈ పరిస్థితి ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదంతో దగ్గరి సంబంధం ఉందిఓవేరియన్: ఇది ఇప్పటికీ అండోత్పత్తి, రుతుస్రావం, సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందిసిండ్రోమ్: ఇది ఒకదానికొకటి సంబంధించిన లక్షణాలు,ఆరోగ్య ప్రమాదాల సమూహాన్ని సూచిస్తుందిఈ పేరు మార్పు లక్ష్యం రోగ నిర్ధారణను మెరుగుపరచడం, అపవాదును తగ్గించడం, మరింత సంపూర్ణమైన చికిత్సా విధానాలను ప్రోత్సహించడం అని ఎండోక్రైన్ సొసైటీ తెలిపింది. స్కాన్లలో అండాశయ తిత్తులు కనపడితే తప్ప తమకు PCOS ఉండదని చాలా మంది మహిళలు నమ్మడం వల్ల, పాత పేరు తరచుగా రోగ నిర్ధారణను ఆలస్యం చేసిందని నిపుణులు నొక్కి చెబుతున్నారు.PMOS అంటే..?PMOS అనేది గతంలో PCOS అని పిలువబడిన అదే వైద్య పరిస్థితి. దీని నిర్ధారణ ప్రమాణాలు మారలేదు. ఇది ఒక హార్మోనల, జీవక్రియ రుగ్మత,లక్షణాలు:క్రమరహిత లేదా ఋతుస్రావం లేకపోవడంఅధిక ఆండ్రోజెన్ హార్మోన్లుమొటిమలు,ముఖంపై రోమాలు పెరగడంబరువు పెరగడం లేదా బరువు తగ్గడంలో ఇబ్బందిఇన్సులిన్ నిరోధకతసంతానోత్పత్తి సవాళ్లుకొంతమంది రోగులలో అనేక అపరిపక్వ అండాశయ ఫోలికల్స్ ఉండటంఈ పరిస్థితి వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలు..టైప్ 2 మధుమేహంఅధిక రక్తపోటుగుండె జబ్బులుఫ్యాటీ లివర్ వ్యాధినిద్రలేమిడిప్రెషన్, ఆందోళనప్రపంచవ్యాప్తంగా, దాదాపు ఎనిమిది మంది మహిళల్లో ఒకరు PMOSతో బాధపడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ సమస్యకు గల కారణాలు:నిశ్చల జీవనశైలిప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంపెరుగుతున్న ఊబకాయంసరిగా నిద్రపోకపోవడంఒత్తిడివంశపారంపర్య కారణాలురోగ నిర్ధారణను మెరుగుపరుస్తుందిఇక ఈ కొత్త పేరు PMOS అనే పదం సంతానలేమి సమస్యల నుంచి దృష్టిని మళ్లించి, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యల కోసం ముందుగానే స్క్రీనింగ్ చేయించుకోనేలా ప్రోత్సహిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు చాలామంది మహిళలు ఈ వ్యాధిని తేలికగా తీసుకుని వైద్య పరీక్షలు చేయించుకునేవారు కాదు. ఈ పేరు మార్పుతో మహిళలంతా ఆరోగ్య స్పృహతో ఆలోచించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్గా మార్చింది..) -
ఎవరీ లారెన్ వాసర్..? ఆ వ్యాధే ఆమెను సన్సేషన్గా మార్చింది..
మెట్గాలా 2026లో ఎందరో ట్రెండ్ సెట్టింగ్, రికార్డ్ మేకింగ్ లుక్స్ని అందించారు. చాలామంది వివిధ రకాల ఫ్యాషన్ వేర్లతో సందడి చేశారు. ఎందరో సెలబ్రిటీలు, ప్రముఖులు ధరించిన యాక్సెసరీలు, కళాత్మక డిజైనర్ వేర్లు చర్చనీయాంశంగా మారాయి. వారిలో ఒక మహిళ మాత్రం అందర్నీ ఆకర్షించేలా సన్సేషన్గా మారింది. ఈ అమ్మాయి లుక్ని చూడగానే టాలీవుడ్ మూవీ మురారీలోని "బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో" అనే పాట ఠక్కున గుర్తుస్తోంది. అయితే ఆమె కథ తెలిస్తే మాత్ర కన్నీళ్లు జలజల వచ్చేస్తాయ్. ఆ బాధను దిగమింగి అజేయంగా నిలబడి ఎదగాలన్న ఆమె తపన చూస్తే స్థైర్యం అంటే ఇది కదా అనిపిస్తుంది. చిన్నచిన్న సమస్యలకే సతమతమై ప్రాణాలకు తీసుకునే యవతకు ఆమె కథ ఓ స్ఫూర్తి.ఆ ధీర మహిళే అమెరికన్ మోడల్ లారెన్ వాసర్. ఆమె మే4న న్యూయార్క్ నగరంలోని మెట్ గాలా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో బంగారు రంగు ప్రబల్ గురుంగ్ సూట్ ధరించి వచ్చింది. ఇందులో పెద్ద సన్సేషన్ ఏముంది అనుకోకండి. ఆమె ఈ వేడుకలో నిజమైన బంగారు కృత్రిమ కాళ్లతో వచ్చింది. అందరు ఈ వేడుకలో ఆర్టిఫిషయల్ యాక్సెసరీలతో రెడ్కార్పెట్పైకి రాగా ఆమె మాత్రం నిజమైన "బంగారు కాళ్ల"తో వచ్చి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పైగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి కూడా. అంతేగాదు దీని కారణంగానే లారెన్కు "బంగారు కాళ్ల అమ్మాయి" ముద్దు పేరు కూడా వచ్చింది.లారెన్ వాసర్ ఎవరు?లారెన్ వాసర్ అమెరికాలో ప్రసిద్ధిగాంచిన మోడల్. 38 ఏళ్ల లారెన్ వోగ్, గ్లామర్ అండ్ హార్పర్ బజార్ వంటి ఫ్యాషన్ పత్రికల ముఖచిత్రంగా ఫోజులిచ్చింది కూడా. అంతేగాదు 2017లో ఫోర్బ్స్ అండర్ 30 పురస్కార గ్రహీతగా కూడా ఎంపికైంది అలాగే 2023లో గ్లామర్ జర్మనీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా కూడా నిలిచారామె. 2023లో 'ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ' పాడ్కాస్ట్లో మాట్లాడుతూ..లారెన్ తన కథను పంచుకోవడంతో ఆమె గురించి ప్రపంచానికి తెలిసింది. సడెన్గా ఒక రోజు నిద్రలోనే కోమాలోకి వెళ్లి మృత్యువు అంచులదాక వెళ్లింది. సకాలంలో ఆమె కుటుంబ సభ్యులు చూడకపోతే లారెన్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయుండేవి. ఏం జరిగిందో తెలియదు. లారెన్ గదిలోకి వచ్చేప్పటికీ అపస్మారక స్థితలో బెడ్పై పడి ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా...అక్కడ ఆమె బతికే అవకాశాలు చాల తక్కువని తేల్చేశారు వైద్యులు. పాదాలు నల్లగా మారిపోవడం వంటి ఆకస్మిక మార్పులన్నీ లారెన్స్ శరీరంలో చూస్తుండగానే చోటుచేసుకోవడం మొదలైంది. ఆమె పాదాలు నల్లగా అయిపోవడం ప్రారంభించింది. కానీ ఆమె తల్లిదండ్రుల తమ కూతర్ని ఏదోలా బతికించమని వైద్యులని వేడుకోవడంతో డాక్టర్లు తమ సాయశక్తులా కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రాణం కాపాడేందుకే మొదట నీలం రంగులోకి మారిపోతున్న కుడికాలుని తొలగించారు. ఆమెకు టాక్సిక్ షాక్ సిండ్రోమ్(టీఎస్ఎస్)గా పిలిచే వ్యాధి బారిన పడ్డట్లు వెల్లడించారు వైద్యులు. ఇది ఒక నిర్ధిష్టమైన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే విషపదార్థాల వల్ల కలిగే అరుదైన ప్రాణాంతక వ్యాధి. ఆ తర్వాత ఆమె శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి కొన్ని రకాల ద్రవాలను పంపించారు వైద్యులు. దాంతో జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎడమ కాలుని కూడా తొలగించారు వైద్యులు. దాంతో సుదీర్ఘంగా ఎనిమిది నెలల పాలు వీల్చైర్కి పరిమితమైపోయిందది. జీవితం ముగిసిపోయింది ఇంకేమి లేదనుకున్న నైరాశ్యంలో ఉన్న లారెన్కు 14 ఏళ్ల తమ్ముడిని చూడగానే కొత్త ఆశ రేకెత్తింది. కనీసం వాడి బాగోగులు చూసుకోవడం కోసమైన బతకాలని నిర్ణయించుకుని తన సమస్యను అంగీకరించడం మొదలుపెట్టింది. అలా మోడల్లో నెమ్మది నెమ్మదిగా రాణిస్తూ..దివ్యాంగుల్లో స్ఫూర్తిని రగులుస్తోందామె. ఇంతకీ లారెన్కి సోకిన టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే..టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే?టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (టీఎస్ఎస్) అంటే టాంపోన్ వాడకంతో సంబంధం కలిగి వ్యాధి. ఇక్కడ టాంపోన్ అంటే టాంపోన్ (Tampon) అనేది ఋతుస్రావం సమయంలో (Periods) వెలువడే రక్తాన్ని పీల్చుకోవడానికి యోనిలోకి చొప్పించే ఒక చిన్న, పత్తి లేదా ఇతర శోషక పదార్థాలతో చేసిన స్త్రీ పరిశుభ్రత ఉత్పత్తి. ఇది ప్యాడ్లకు భిన్నంగా, ఇది శరీరం లోపల ఉంటుంది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది గంటలకు మించి ఉంచకూడదు. లేదంటే దీనిలో ఉండే స్టెఫిలోకాకస్ ఆరియస్ బాక్టీరియా రక్తప్రవాహంలో విషపదార్థాలను విడుదల చేసి టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికారణంగా తీవ్రమైన అవయవ నష్టం లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.🇬🇧🩸🦿 Beaucoup l’ont vue au Met Gala sans savoir qu’elle a PERDU ses 2 jambes à cause d’un TAMPON HYGIÉNIQUE.Lauren Wasser était une mannequin de 24 ans en pleine ascension lorsqu’un simple tampon a failli lui coûter la vie. En octobre 2012, elle s’est couchée fiévreuse et a… pic.twitter.com/bJcysI84Ah— Cultination (@Cultination1) May 11, 2026 ఈ సిండ్రోమ్ లక్షణాలు:తక్కువ రక్తపోటుతల తిరగడం, మగతగా ఉండటం లేదా స్పృహ కోల్పోవడంనీళ్ల విరేచనాలుఅకస్మాత్తుగా అధిక జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు మరియు ఇతర ఫ్లూ వంటి లక్షణాలువికారం లేదా వాంతులుపాదాల అరికాళ్ళు లేదా చేతుల అరచేతులపై చర్మం పొట్టులా ఊడిపోవడంకళ్ళు, గొంతు ఎర్రబడటంతీవ్రమైన ఎండదెబ్బలాంటి దద్దుర్లు లేదా చర్మంపై ఎర్రటి చుక్కలుఆ ఘటనతో రాబిన్ డేనియల్సన్ చట్టంఆ వ్యాధి తన జీవితాన్ని మార్చేయడంతో లారెన్ రాబిన్ డేనియల్సన్ అనే ఋతుస్రావ సంరక్షణ ఉత్పత్తుల భద్రతా చట్టాన్ని తీసుకొచ్చేలా పాటుపడింది. పైగా దానికి మద్దతుదారిగా మారింది. ఇది ఋతుస్రావ ఉత్పత్తులలో తరచుగా కనిపించే రసాయనాలు, సింథటిక్ ఫైబర్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై పరిశోధన చేయమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH)ను ఆదేశించే లక్ష్యంతో ప్రతిపాదించబడిన ఒక US బిల్లు.(చదవండి: అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?) -
చిలుకల తల్లికి గ్రీన్ ఆస్కార్
చంబల్... ఒకప్పుడు బందిపోట్లకు నెలవు. ఇప్పుడు అదే చంబల్ అంతరించిపోతున్న అందమైన పక్షి జాతికి అభయారణ్యం. ఆ మార్పుకు కారణం – పర్వీన్ షేక్. నిప్పుకణిక లాంటి ముక్కుతో చిలుకల్లా ఉండే ‘ఇండియన్ స్కిమ్మర్’ పక్షులు ఒరిజినల్గా ఏ దేశానివి. అవి మన దేశానికి వలస పక్షులా? లేక మన దేశంలో ఉంటాయా? ఆ పక్షులు అంతరిస్తుంటే ఆమె వాటి సంఖ్యను పెంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అందుకే ‘గ్రీన్ ఆస్కార్స్’గా పిలిచే ‘విట్లీ అవార్డు’ ఆమెను వరించింది.లండన్ లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ హాల్... వేదిక మీద బ్రిటన్ రాకుమారి ప్రిన్సెస్ ఆన్... ఆమె చేతిలో 50,000 పౌండ్ల చెక్... ప్రిన్సెస్ ఆన్ నుంచి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక ‘విట్లీ అవార్డు’ అందుకునేందుకు పర్వీన్ షేక్ వేదిక ఎక్కగానే చప్పట్లు మార్మోగాయి. అంతరించిపోతున్న ‘ఇండియన్ స్కిమ్మర్’ అనే చంబల్ చిలుకలను కాపాడినందుకు ఆమెకు గౌరవం. ‘ఈ అవార్డు నాకు కాదు, చంబల్ ఇసుకలో గూళ్లకు కాపలా కాసిన నా గ్రామీణ సోదరులకు’ అని వేదిక మీద ఆమె చెప్పిన మాటలకు హాల్ అంతా చప్పట్లతో మార్మోగింది. ‘గ్రీన్ ఆస్కార్’గా భావించే విట్లీ అవార్డును అందుకున్న పర్వీన్ తాను చేసిన సుదీర్ఘ పోరాటాన్ని తలుచుకుని ఉద్వేగం పొందింది.పక్షి ప్రేమికురాలు...పర్వీన్ షేక్ ముంబై అమ్మాయి. రామ్నరైన్ రూయా కాలేజీలో జువాలజీ చదివిన రోజుల్లోనే పక్షుల మీద పిచ్చి పట్టుకుంది. ‘‘నా కాలేజ్ చదువే నన్ను బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వైపు నడిపించింది’’ అంటారామె. 2012లో బాంబే నేచురల్ హిస్టరీలో సైంటిస్ట్గా చేరిన పర్వీన్ కి ఒక క్లారిటీ ఉండేది– ‘అంతరించిపోతున్న పక్షి జాతుల కోసం పని చేయాలి’ అని. ఆ అన్వేషణలోనే ఒకరోజు ఆమె దృష్టి ఒక మేగజీన్లోని ఒక పక్షి ఫొటో మీద పడింది. నల్లటి రెక్కలు, తెల్లటి పొట్ట, నిప్పు అంటుకున్నట్టు ఎర్రగా మెరిసే ముక్కు. కింది దవడ పైదవడ కంటే పొడుగు. పేరు ‘ఇండియన్ స్కిమ్మర్’. ఒకప్పుడు దక్షిణ ఆసియా అంతటా కనిపించే ఈ పక్షి, ఇప్పుడు ఇండియా, బంగ్లాదేశ్లలో మాత్రమే మిగిలింది. మన దేశంలో 1990లో 10,000 ఉండే ఈ పక్షులు 2017కి 400కి పడిపోయాయని తెలిశాక ఆమె గుండె విలవిలలాడింది. వీటిని కాపాడలేనా అనుకుందామె.చంబల్ లోయకు ప్రయాణం...మన దేశంలో ఇండియన్ స్కిమ్మర్ పక్షులు ఎక్కువగా చంబల్ లోయలో ఉంటాయి. అందుకే డిసెంబర్ 2016లో పర్వీన్ బృందం చంబల్ నది మీద బోట్లో సర్వే మొదలుపెట్టింది. ఇది ఇండియాలో ఇండియన్ స్కిమ్మర్ మీద జరిగిన మొదటి శాస్త్రీయ సర్వే. అక్కడ కనపడిన దృశ్యాలు ఆమె మనసును ఇంకా వికలం చేశాయి. ఇండియన్ స్కిమ్మర్ పక్షి నది ఒడ్డున ఇసుక లోడి గుడ్లు పెడుతుంది. అదే దాని గూడు. అలాంటి గూళ్ల మీద ఆవుల మందలు నడుస్తూ నాశనం చేస్తున్నాయి. ఇసుక మాఫియా ట్రాక్టర్లకు మిగిలినవి బలి అవుతున్నాయి. మిగతావి కుక్కలు, నక్కలు, మనుషుల ఆటలకు. ‘పక్షులను చంపుతోంది ప్రకృతి కాదు. మన నిర్లక్ష్యం’’ అని ఆ రోజు డైరీలో రాసుకుంది.నెస్ట్ గార్డియన్స్...‘గూళ్లకు కాపలా పెడితే?’– పగిలిన గుడ్డు చేతిలో పట్టుకుని పర్వీన్ వేసుకున్న శపథం అది. కానీ చెప్పడం తేలిక. చేయడం? బందిపోట్ల లోయ అనే పేరున్న చంబల్లో, ఇసుక మాఫియా రాజ్యమేలే చోట, ముంబై నుంచి వచ్చిన ఒక మహిళా సైంటిస్టు మాట ఎవరు వింటారు? పర్వీన్ గ్రామాల్లో తిరిగింది. ‘ఈ పక్షులు నది ఆరోగ్యానికి గుర్తు. ఇవి పోతే నది చచ్చిపోయినట్టే. నది చస్తే మనమూ బతకలేం’ అని అర్థమయ్యే భాషలో చెప్పింది. మొదట్లో నవ్వారు. తర్వాత విన్నారు. అర్థం చేసుకున్నారు. అలా 30 మందికి పైగా స్థానిక యువకులు, మత్స్యకారులు ‘నెస్ట్ గార్డియన్స్’గా మారారు.వాళ్లు చేసే పని మామూలుది కాదు. ఆ పక్షుల బ్రీడింగ్ సీజన్ మార్చి నుంచి జూన్ దాకా ఎండనకా వాననకా, ఇసుక తిన్నెల దగ్గర కాపలా కాస్తారు. గూళ్ల చుట్టూ వెదురు కంచె వేసి ‘పక్షులు గుడ్లు పెడుతున్నాయి, దయచేసి దూరంగా వెళ్లండి’ అని బోర్డులు పెడతారు. ఫలితం? 2025లో పక్షుల సంఖ్య 400 నుంచి 1000 దాటింది. అంతకంటే గొప్ప విషయం ఏంటే, ‘ఇవి మన పక్షులు’ అని గ్రామస్తులు ఓన్ చేసుకున్నారు. ఇదే పర్వీన్ కి అతిపెద్ద విజయం. పర్వీన్ చేతిలో తుపాకీ లేదు. ఇసుక తిన్నెల మీద వెలిసిన పక్షుల గూళ్ల మీద అవ్యాజమైన ప్రేమ ఒక్కటే ఉంది. అందుకే ఇవాళ చంబల్ చిలుకలు తిరిగి ఆకాశంలో ఎగురుతున్నాయి. ‘గ్రీన్ ఆస్కార్’ పర్వీన్ కి దక్కిన గౌరవం కాదు, చంబల్ నది ఆమె పాదాలు కడిగి చెప్పిన కృతజ్ఞత. -
నీట్గా ఉందాం..ఆ మొక్కల చిక్కులొద్దు!
మొక్కలు నేల మీదే పెరుగుతూ ఉంటాయన్నది అపోహ. కానీ అవి నేల మీదే కాదు... మానవుల చర్మం సహా అన్ని రకాల జంతువుల దేహాల మీదా, మొక్కల మీద కూడా పెరుగుతుంటాయి. మనుషుల చర్మం మీదే కాదు... వెంట్రుకల మీదా, గోళ్ల మీద కూడా పెరుగుతాయి. దీనికి తార్కాణాలను మనం చాలాసార్లు అనుభవించే ఉంటాం. కానీ అవి మన దేహం మీద పెరిగే ‘ఫంగస్’ కారణంగా అని తెలియదు. ఉదాహరణకు తప్పని పరిస్థితుల్లో తడి అండర్వేర్ తొడుక్కున్న సమయాల్లో గజ్జల్లో ఒరుసుకుపోయినట్లు కావడం, తొడలు, పిరుదులు, ప్రైవేట్ పార్ట్స్ వద్ద చర్మం నల్లబారి దురదగా అనిపించడం, గోరు మీద గోరుచుట్టు... ఇవన్నీ ఫంగస్ పెరుగుదల వల్ల కనిపించేవే. వీటినే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఫంగల్ డిసీజెస్గా పేర్కొంటారు. సాధారణంగా మన దేహంలోని అనేక చోట్ల పెరిగే ఫంగల్ డిసీజెస్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం...నిజానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి దేహంలో అక్కడా ఇక్కడా అని కాకుండా ఎక్కడైనా రావచ్చు. అందుకే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లను అబిక్విటస్ అంటారు. నిజానికి నేల (సాయిల్) మీద లేదా పండ్ల మీద కూడా కుళ్లుతున్నచోట ఇవి మొలుస్తుంటాయి. పండ్లు కుళ్లడానికి కారణం ఈ ఫంగసే. వృథా పదార్థాలన్నీ మళ్లీ ఖనిజలవణాల్లా రూపంలోకి మారిపోయి తమ మౌలికమైన అణువులుగా తనలో కలిసిపోడానికి ప్రకృతి తన కోసమే ఈ ఫంగల్ రూపాలనుసృష్టించుకుందని చెప్పవచ్చు. అలా చూసినప్పుడు ఫంగస్ జీవులు ప్రకృతికి మేలే చేస్తాయి.పూర్తిగా మొక్కలూ కావు... సూక్ష్మజీవులూ కావు... జీవశాస్త్రపరం (బయలాజికల్)గా చూసినప్పుడు మొదట్లో వాటిని మొక్కల్లోని ఒక విభాగంగా చూసేవారు. అందుకే వృక్షశాస్త్రం (బాటనీ)లోని ఒక విభాగంగానే వాటి అధ్యయనం కొనసాగేది. కానీ వాటిలోనే పలు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అవి పూర్తిగా మొక్కలూ కావనీ, అలాగని పూర్తిగా సూక్ష్మజీవుల కింద కూడా వాటిని పరిగణించలేమని తేలింది. దాంతో ఫంగస్లను ఇప్పటికీ వృక్షశాస్త్రవిభాగంలోనే చదువుతున్నప్పటికీ... వాటి గురించి చాలా లోతుగా, సూక్ష్మంగా అధ్యయనం చేసేవారు మాత్రం ఫంగస్లను ‘మైకాలజీ’ అనే ఓ ప్రత్యేక శాస్త్రవిభాగంగా పరిణమిస్తుంటారు.ఫంగస్ రకాలు... ఫంగస్లోని రకాలను వర్గీకరించేటప్పుడు వాటిలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు...ఆకృతిని బట్టి : వాటి ఆకారాన్నీ / ఆకృతిని బట్టి వర్గీకరణ చేస్తే... ఈస్ట్ అనీ, మౌల్డ్స్ అనీ వర్గీకరించవచ్చు, ఇందులో ఈస్ట్ అనేవి ఆహారాన్ని పులిసేలా చేస్తూ మనకు ఉపయోగపడుతుంటాయి. కానీ మౌల్డ్స్ మాత్రం ఆహారానికి బూజులా పట్టి మన ఆహారాలను తినడానికి యోగ్యం కాకుండా చేస్తాయి. (ఉదాహరణకు బ్రెడ్ను అలాగే వదిలేస్తే ఆకుపచ్చరంగులో బూజు రావడం మనకు తెలిసిందే).స్పీషీస్ (ప్రజాతులను) ఆధారంగా: ఫంగస్ ప్రజాతులను అంటే వాటి స్పీషీస్ను బట్టి చూసినప్పుడు... డెర్మటోఫైట్ స్పీషీస్, క్యాండిడా స్పీషీస్, మలేసేజియా స్పీషీస్ అనే రకాలు ఉంటాయి. మన దేహంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో చర్మంపై వచ్చేవి డర్మటోఫైట్స్ స్పీషీస్కు చెందినవనీ, ఇక గజ్జలు లేదా చర్మం ముడతల్లో వచ్చే ఎర్రటి ఇన్ఫెక్షన్ను క్యాండిడా స్పీషీస్వని చెప్పవచ్చు.ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి : చర్మంపై వాటి తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే వాటిని ఉపరితలానికే పరిమితమయ్యేవి (సూపర్ఫీషియల్), చర్మంలోపల చాలా లోతుగా ఇన్ఫెక్ట్ చేసేవి (డీప్ స్కిన్) అని వర్గీకరించవచ్చు. సాధారణంగా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ పైపైనే వస్తాయి. కానీ ఎయిడ్స్ వ్యాధి సోకినవారిలో వచ్చేవి చాలా డీప్ స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉంటాయి.ఎన్విరాన్మెంట్ను బట్టి చూస్తే : మన పర్యావరణంలో అవి పెరిగే చోటను బట్టి కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను వర్గీకరించవచ్చు. ఉదాహరణకు నేల మీద పెరిగేవాటిని జియోఫిలిక్ అనీ, జంతువులపై నివసించేవాటిని జూఫిలిక్ అనీ, కేవలం మానవుల దేహంపైనే పెరిగేవాటిని ‘యాంథ్రపోఫిలిక్’ అని అంటారు.సాధారణంగా అడల్ట్స్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లుటీనియా కార్పోరిస్ : ఇది టైకోఫైటాన్ రబ్రబ్ అనే పంగ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది పాదాలూ, చేతులు, మర్మావయవాలు (ప్రైవేట్ ΄పార్ట్స్) మినహా దేహంలో ఎక్కడైనా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది అన్ని వయసుల వారిలోనూ రావచ్చు. ముఖ్యంగా పాడిపశువుల, పందుల పెంపకంలో నిమగ్నమయ్యేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొందరిలో వారాలూ, నెలలూ, కొన్ని సందర్భాల్లో కొన్నేళ్ల పాటు కూడా ఏమాత్రం మానకుండా అదేపనిగా కనిపిస్తూ ఉంటుంది. చాలాసందర్భాల్లో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో మాత్రం దురద రావచ్చు. కొందరిలో మాత్రం చిన్నవి మొదలుకొని పెద్దగా ఉండే ఎర్రటి, గుండ్రటి, అంచులు ఉబ్బినట్టుగా కనిపించే ప్యాచ్లు రావచ్చు. ఈ గుండ్రటి అంచులు అన్ని పక్కలకూ వ్యాప్తిస్తూ... మధ్యలోని చర్మం మామూలుగా ఉండవచ్చు. ఇలా వచ్చే రింగులు ఒకదారితో మరొకటి కలిపిపోయేంతగా విస్తరిస్తూ పెద్దగా పెరగవచ్చు. కొన్నిసార్లు పగుళ్లూ, పొక్కల వంటివి (బ్లిస్టర్స్ అండ్ గ్రాన్యులోమా) వంటివీ కనిపించవచ్చు. వీటినే మాజోకాస్ గ్రాన్యులోమా అని పిలుస్తారు. కొన్నిసార్లు కొందరిలో అంతగా ప్రకాశవంతంగా లేని వెండిరంగులో ఉండే సోరియాఫార్మ్ మచ్చల వంటివీ కనిపించవచ్చు. ఇది జంతువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది.టీనియా క్రూరిస్ (ధోబీస్ ఇచ్) : ఇది ప్రైవేట్ పార్ట్స్ వద్ద కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్నే సాధారణంగా అందరూ ‘ధోబీస్ ఇచ్’ లేదా ‘జాక్ ఇచ్’ అని పిలుస్తారు. ఒక్కోసారి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గడ్డ›రూపంలో వచ్చి బాధిస్తుంటుంది. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చెమట పట్టి తడిగా, చెమ్మతో ఉండే చోట్ల ఇది ఎక్కువగా వస్తుంటుంది. సాధారణంగా బిగుతైన దుస్తులు ధరించడం వల్లా... అలాగే స్థూలకాయం కారణంగా బట్టలు బిగుతుగా ఉన్నప్పుడూ... ఇక చాలాకాలంగా కార్టికోస్టెరాయిడ్స్ వాడుతున్నవారిలోనూ ఈ సమస్య కనిపించడానికి అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్య తరచూ వస్తూ ఉంటుంది. నెలల నుంచి ఏళ్ల తరబడి బాధిస్తూ ఉండే అవకాశాలు ఎక్కువ. గతంలో పాదాలకు ‘టీనియా పెడిస్’ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు మరీ మరీ ఎక్కువ. ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఎర్రటి / నల్లటి మచ్చలతో... అలాగే తరచూ దురదతో చాలా అసౌకర్యానికి గురిచేస్తుంటుంది. అయితే ఇది వృషణాల సంచి చర్మంపైనా లేదా పురుషాంగం పైనా పాకడం మాత్రం చాలా చాలా అరుదు.టీనియా మ్యాన్యువమ్ : ఇది చేతులకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఒక్కోసారి కాళ్లలో కూడా రావచ్చు. చేతులపై దురద వస్తుంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన చోట... మధ్యనుండే చర్మం బాగానే కనిపిస్తున్నా అంచులు స్పష్టంగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంటుంది. అరచేతుల వెనకవైపున కనిపిస్తూ... ఒక్కోసారి అరచేతుల్లో పగుళ్లు కనిపిస్తుంటాయి. దీనికి పూత మందులు పనిచేయవు. నోటి ద్వారా (ఓరల్గా) ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్ వంటి మందులు వాడాలి.టీనియా పెడిస్ (అథ్లెట్స్ ఫూట్) : ఆటలాడే వయసున్న పిల్లల్లోనూ, యుక్తవయసువారిలోనూ ఇది కనిపించడం వల్ల దీన్ని ‘అథ్లెట్స్ ఫూట్’ అంటారుగానీ... ఆటలకూ దీనికి సంబంధం ఉండదు. అయితే అరుదుగా కొందరిలో 50 ఏళ్ల వయసు వారిలోనూ కనిపించవచ్చు. అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. బిగుతుగా ఉండే ΄పాదరక్షలు (ఫుట్వేర్) వాడేవారిలోనూ, పాదాలకు చెమట ఎక్కువగా పట్టేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి. పాదానికి వచ్చినప్పుడు చర్మం పొట్టులా రాలవచ్చు. అలాగే కొందరిలో కాలి బొటనవేలి కింద పగులులా రావచ్చు. సాధారణంగా కాలివేళ్లలో నాలుగు, ఐదో వేలి మధ్యన కనిపిస్తుండవచ్చు. ఎక్కువగా నీళ్లలో ఉండేవారిలో కనిపిస్తుంటుంది. ఇందులో రెండు రకాలుంటాయి. మడమకూ, మడమ అంచులకు మాత్రమే పరిమితైన దాన్ని ‘మోకాసిన్ టైప్’ అంటారు. ఒకవేళ పాదం / మడమ అంతటా నీటిబుడగలు, తిత్తుల రూపంలో కనిపిస్తే దాన్ని ‘బ్లూలస్ టైప్’ అంటారు. కాస్తంత వదులుగా, సౌకర్యంగా ఉండే పాదరక్షలు ధరించడం, స్నానం తర్వాత పాదాలను బెంజోల్ పెరాక్సైడ్తో శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలతో దీన్ని నివారించవచ్చు. అలాగే క్లాకిమాజోల్, మైకోనజోల్, కీటోకెనజోల్, ఎకోనజోల్ వంటి పూతమందులతోనూ దీనికి చికిత్స అందించవచ్చు.క్యాండిడియాసిస్ : ఇది ఈస్ట్ తరహా ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. సాధారణంగా నోటిలోనూ లేదా ప్రైవేట్ పార్ట్స్ (మర్మావయవాల) వద్ద వస్తుంటుంది. అక్కడ నిత్యం చెమట పడుతూ తడిగా, చెమ్మగా ఉండటం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది. క్యాండిడే అబ్బిలెన్స్ అనే ఒక రకం ఫంగస్... మానవుల నోటి నుంచి మలద్వారం వరకు ఉండే జీర్ణవ్యవస్థకు చెందిన మార్గం (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్)లో కాలనీలుగా ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉంటుంది. దీని లక్షణాలను బ్యాక్టిరియల్ లక్షణాలుగా పొరబడి యాంటీబయాటిక్స్ వాడేవారిలో దీని తీవ్రత మరింత పెరిగి బాధిస్తుంది. స్థూలకాయం, డయాబెటిస్, ఎయిడ్స్, చర్మం ఎక్కువగా పట్టే గుణం, ఎండోక్రైన్ సమస్యలూ, స్టెరాయిడ్స్ వాడటం, దీర్ఘకాలిక జబ్బులున్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మం ఎర్రబారడం, దోక్కుపోయినట్టుగా ఉండటం వంటి లక్షణాలతో వ్యక్తమవుతుంది. కొందరు మహిళల్లో ఇది రొమ్ముల కింది భాగంలో ఎర్రబారినట్టుగా వ్యక్తమవుతుంది.ప్రైవేట్ పార్ట్స్ వద్ద వచ్చే క్యాండిడియాసిస్ : ఇది పురుషుల్లో మర్మావవం వద్ద... అలాగే మహిళల్లో యోని వద్ద కనిపిస్తుండే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇందులో వుల్వైటిస్, వుల్వోవెజినైటిస్, బెలనైటిస్, బెలనో΄ోస్థైటిస్ వంటి రకాలు ఉంటాయి. పూతమందులతో, నోటి ద్వారా వాడే మందులతో ఈ ఇన్ఫెక్షన్ను తగ్గించవచ్చు.శోభి మచ్చలు (పిటిరియాసిస్ వెర్సికలర్) : తెలుగులో శోభిమచ్చలు అని పిలిచే ఈ తెల్లమచ్చలు / తెల్లపొడ కూడా ఒక రకం ఫంగస్ వల్లనే వస్తుంది. ఈ సమస్యలో ఎలాంటి నొప్పీ, బాధా లేకపోయినప్పటికీ కాస్తంత అసహ్యంగా కనిపిస్తూ కాస్మటిక్గా ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక్కోసారి ఒక మచ్చపైకి మరో మచ్చ పెరుగుతూ ‘మలసేజియా ఫర్ఫర్’ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. ఎక్కువగా బాగా వేడి వాతావరణంలో ఉండేవారిలోనూ, బాగా చమటలు పడుతూ అవి త్వరగా ఆరి΄ోని పరిస్థితుల్లోనూ, జిడ్డు చర్మం ఉన్నవారిలోనూ ఈ సమస్య ఎక్కువ. అలాగే ఎయిడ్స్ వంటి జబ్బు ఉన్నవారిలో ఈ ఫంగస్ వచ్చే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో బాగా పెరుగుతుంది. కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా కనిపిస్తుంటుంది. కొందరిలో కాస్త దురదలూ కనిపించవచ్చు.కొందరిలో ఈ సమస్యతో ఒక్కోసారి చర్మం పొట్టులా, పొలుసుల్లా రాలిపోతూ ఉండవచ్చు. ఛాతీ, భుజాలూ, మెడ, వీపు, పొట్ట, అరుదుగా కొందరిలో ప్రైవేట్ పార్ట్స్, తొడల వద్ద ఈ సమస్య కనిపించవచ్చు. కర్రదీపంలో చూసినప్పుడు ఈ సమస్య ఉన్నచోట చర్మం నీలి, ఆకుపచ్చ మెరుపుతో కనిపిస్తుంది. ఈ సమస్యకు కీటకెనజోల్ షాంపూలు వాడుతూ, కీటకెనజోల్ క్రీమ్, క్లాట్రిమాజోల్ క్రీమ్ వంటి పూత మందులు వాడుతూ... నోటి ద్వారా (ఓరల్గా) ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్ వంటి మందులు తీసుకోవడం ద్వారా చికిత్స చేయవచ్చు.వెంట్రుకల్లో వచ్చే టీనియా రకాలు టీనియా క్యాపిటిస్ : ఇది రోమం అంకురంలో వచ్చే ఇన్ఫెక్షన్. టీనియా క్యాపిటిస్ మాడు మీద వస్తే పేనుకొరుకుడులా కనిపిస్తుంది. పిల్లల్లో యుక్తవయసుకంటే ముందుగా అంటే... 6 – 10 ఏళ్లవారిలో ఎక్కువగా వస్తుంటంది. తలలో పొలుసుల మాదిరిగా కనిపిస్తాయి. వెంట్రుకలు విరిగిపెతుంటాయి. తలలో మొటిమల్లా వస్తూ కొన్నిసార్లు అక్కడ చీము వంటి స్రావం కనిపిస్తుండవచ్చు. చివరగా... అక్కడి వెంట్రుకలన్నీ గుండ్రని ఆకృతిలో రాలిపోయి మచ్చలా (స్కారింగ్ అలొపేషియాగా) కనిపిస్తుంటుంది. ఇది స్కూలు పిల్లల్లో వచ్చినప్పుడు ఒక చిన్నారి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో ఉండే స్కూళ్లలో పిల్లలను దగ్గర దగ్గరగా కూర్చోబెట్టినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. ఒక్కోసారి ఒకరు వాడిన దువ్వెనను మరొకరు వాడినప్పుడూ ఇది వ్యాప్తి చెందుతుంటుంది. ఇందులోని ఒక రకాన్ని ‘బ్లాక్ డాట్’ అంటారు. ఇందులో మాడుపైన రోమమూలంలో వెంట్రుక విరిగిపోతుంది. వెంట్రుక మూలం దగ్గర క చుక్కలాగా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి ఉబ్బిన చుక్కల గుంపు అంతా ఒక ప్యాచ్లా కనిపిస్తుంటుంది.ఇక ‘గ్రే ప్యాచ్’ అనే మరోరకం మచ్చ వచ్చిన చోట కూడా వెంట్రుకలన్నీ విరిగిపోయి... అక్కడ ఓ గోధుమ రంగు ప్యాచ్లా అది కనిపిస్తుంటుంది. ఈ ప్యాచ్లో పొలుసులన్నీ కాస్తంత ఎరుపురంగుకు తిరిగి మచ్చలా కనిపిస్తాయి. ఈ సమస్యలోనూ వెంట్రుకలన్నీ విరిగి రాలిపోయి పేనుకొరుకుడు మచ్చలా కనిపిస్తాయి. కర్రమంట వెలుగులో చూస్తే ఈ మచ్చ... ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది.టీనియా బార్బే : ఇది మాత్రం గడ్డంలో వచ్చి... అక్కడ పేనుకొరుకుడులా కనిపిస్తుంది. కొన్నిసార్లు మీసంలోనూ కనిపిస్తుంది. గడ్డం లేదా మీసంలోని వెంట్రులన్నీ రాలిపోవడంతో అక్కడ పేనుకొరుకుడు మచ్చ కనిపిస్తుంది.ఆగ్మినేట్ ఫ్యాలుక్యులైటిస్ : ఇది కూడా కీకన్ లాగే ఎర్రటి మచ్చలతో కనిపించేదే అయినా... దీనిలో నొప్పి తీవ్రత తక్కువ.ఫేవస్ : ఇందులో రోమమూలంలో ఎర్రగా కనిపిస్తుంటుంది. వెంట్రుకలు ఒకదానితో మరొకటి కలిసి పోయినట్లుగా చిక్కుబడినట్టుగా అల్లుకుపోయి కనిపిస్తుంటాయి. వెంట్రుకల మొదళ్లలో మొదటి ఎరుపురంగులో కనిపించేవి కాస్తా తర్వాత ఉబ్బినట్టుగా పసుపు పొక్కుల్లా కనిపిస్తుంటాయి. రోమంతో పాటుగా అక్కడి చర్మం కూడా శిథిలమై వెంట్రుక కుప్పగా పడిపోవడం వల్ల అది పసుపు పొక్కులా కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అక్కడి నుంచి దుర్వాసన కూడా రావచ్చు. ఒక్కోసారి వెంట్రుకలన్నీ రాలిపోయి పేనుకొరుకుడుగా కనిపించవచ్చు.పిల్లల్లో సమస్య నివారణ / చికిత్స...స్కూలు పిల్లల తల ఆరోగ్యంగా ఉందా లేదా అని తల్లిదండ్రులు తరచూ వాళ్ల తలలను / మాడును పరిశీలిస్తూ ఉండాలి.కీటోకొనజాల్తో పాటు సెలేనియమ్ సల్ఫైడ్ ఉన్న షాంపూలతో తల స్నానం చేయిస్తూ ఉండటం వల్ల ఫంగస్ల వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చు.పైపూత (టాపికల్ మెడిసిన్)గా రాయాల్సిన యాంటీ ఫంగల్ పూత మందులను వాడటం ద్వారా కొన్ని రకాల ఫంగస్లకు చికిత్స చేయవచ్చు.నోటి ద్వారా యాంటీ ఫంగల్ మందులు ఇవ్వడం ద్వారా చేసే చికిత్స : గ్రీసియోఫల్విన్ మందులుగా చెప్పే యాంటీ ఫంగల్ మందులతో ఈ ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించవచ్చు. ఇక వాటితో పాటు టెర్బినాఫిన్స్, ఇట్రాకెనజోల్, ఫ్లూకోనజోల్, కీటాకెనజోల్ వంటి మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ల విచక్షణ మేరకు చర్మంపైన వచ్చే ఎర్రటి మచ్చలను తగ్గించడానికి అవసరమైతే కొన్నిసార్లు కార్టికోస్టెరాయిడ్స్ కూడా ఇవ్వాల్సిరావచ్చు. పరిస్థితి కాస్త తీవ్రమై... ఇన్ఫెక్షన్ గనక మొదటి దశ దాటిపోతే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా సోకే (సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్) దశకు చేరితే అప్పుడు యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు.గోళ్లకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్...టీనియా అన్గ్యువమ్ : ఇది గోరు (నెయిల్ ప్లేట్)కు వచ్చే ఫంగస్. ట్రైకోఫైటాన్, రబ్రమ్, ట్రైకోఫైటాన్ మెంటారోఫైట్స్, ఎపిడర్మోఫైటాన్ ఫ్లోకసమ్ వంటి ఫంగల్ రకాల వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇందులో గోటికి ఇరువైపులా ఉండే గోరుభాగం పైకి వచ్చిన చర్మం ముడతల నుంచి వ్యాపిస్తుంది. గోరు తన పారదర్శకతను క్రమంగా కోల్పోతుంది. శిథిలం అవుతుంది. కట్ చేసినప్పుడు స్పష్టంగా తెగకుండా... పొట్టుగా రాలిపోతుంది. యుక్తవయసుదాటిన వారిలో, బలహీనమైన గోళ్లు ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలెక్కువ. ఇందులో డిస్టల్ అండ్ ల్యాటరల్ సబ్ అన్గ్యువల్ ఒనైకోమైకోసిస్, సూపర్ఫీషియల్ వైట్ ఒనైకోమైకోసిస్, ప్రాక్సిమల్ సబ్ అన్గ్యువల్ ఒనైకోమైకోసిస్ వంటి రకాలూ ఉంటాయి. త్వరగా చికిత్స తీసుకుంటే త్వరగా తగ్గే అవకాశం. పూతమందులు పనిచేయవు. ఇట్రకెనజోల్, టర్బినాఫిన్ వంటి మందులు వాడాలి. చివరగా... ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, ఎప్పుడూ తగిన హైజీన్ పాటిస్తూ శుభ్రంగా ఉండేవారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు చాలా తక్కువ. అందుకే ఆరోగ్యకరమైన లైఫ్స్టైలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణలో కీలక భూమిక పోషిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.డాక్టర్ విజయ గౌరి బండారు, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ -
గర్భం దాల్చిన ఐదో నెలకు బ్లడ్ కేన్సర్..!చివరికి..
గర్భం దాల్చక ముందు ఏదైన అనారోగ్యం సమస్య బారినపడితే రిస్క తక్కువగా ఉంటుంది. పైగా ఏదోరకంగా చికిత్స పొంది ఆ రోగం బారి నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యొచ్చు. అదే గర్భం దాల్చక అది కూడా క్రిటకల్ స్టేజ్లో అంటే ఏ ఐదు లేదా ఆరో నెలలో ప్రాణాంతక అనారోగ్య సమస్య బయటపడితే..ఇక ఆ బాధ మాటలకందనిది. అను క్షణం ఓ నరకం ఏ జరుగుతోందన్న టెన్షన్ వెంటాడుతూ ఉంటాయి. అలాంటి బాధనే చవిచూసింది ఈ గర్భిణి.ఈ బాధకర ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన మహిళకు గర్భం దాల్చిన ఐదోనెలలో బ్లడ్ కేన్సర్ బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె అక్యూట్ లింఫోబ్లాస్లిక్ లుకేమియాదో బాధపడుతోంది. గర్భధారణ సమయంలో కేన్సర్కి చికిత్స చేయడం అంటే అత్యంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే కీమోథెరపీ వంటి ఇతర చికిత్సలు పుట్టుబోయే బిడ్డకు ప్రమాదకరంగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. దాంతో ఢిల్లీ వైద్యులు సురక్షితంగా గర్భాన్ని పొడిగిస్తూనే వ్యాధిని నియంత్రించడానికి చికిత్స అందించింది. గర్భధారణ సమయంలో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అనేది అత్యంత అరుదైన ప్రమాదకరమైన పరిస్థితి. దీనికి తక్షణమే చికిత్స అవసరం. పిండం సంరక్షణ చూస్తూనే తీవ్రమైన ఈ కేన్సర్ని నియంత్రించడం అన్నది భయానక సవాలు అని చెబుతున్నారు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వైద్యులు. ఎట్టకేలకు వైద్యుల ప్రయత్నం ఫలించి 32 వారాల నాలుగు రోజుల సమయంలో అత్యవసర సిజేరియన్ చేశారు. శిశువు బరువు 1.28 కిలోలు అని, ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఇక నవజాత శిశువుకు ప్రత్యేక నియోనాటల్ సంరక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే తల్లికి ల్యుకేమియా కోసం తదుపరి చికిత్స అందిచనున్నట్లు తెలిపారు.అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అంటే..ఎముక మజ్జ (bone marrow) ను ప్రభావితం చేసే వేగవంతమైన కేన్సర్. ఇది తెల్ల రక్త కణాల (lymphocytes) అపరిపక్వ రూపాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లలలో సర్వసాధారణం (ముఖ్యంగా 2-5 ఏళ్లు). అలాగే పెద్దలలో కూడా రావచ్చు.లక్షణాలు: తీవ్రమైన అలసట, జ్వరం, తరచుగా ఇన్ఫెక్షన్లు, సులభంగా గాయాలు కావడం లేదా రక్తస్రావం, ఎముకల నొప్పులు.చికిత్స: కీమోథెరపీతో చికిత్స చేస్తారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే చాలా మంది పిల్లలలో, కొంతమంది పెద్దలలో కూడా ఈ కేన్సర్ పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఎక్కువే. (చదవండి: మెరుగైన ఆరోగ్యం కోసం వంట నూనెలో చిన్న మార్పు) -
కాఫీ వృద్ధాప్యాన్ని తగ్గించగలదా?
కాఫీ మితంగా తాగటం వల్ల ఆయుష్షు పెరుగుతుందనేది శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతూ వస్తున్నదే. అయితే తాజాగా ఆ విధంగా ఆయుష్షు పెరగడానికి మూల కారణాన్ని పరిశోధకులు కనిపెట్టారు. మన శరీర కణాల్లోనే ఆ మర్మం దాగి ఉందని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలోని వెటర్నరీ మెడిసిన్ అండ్ బయోమెడికల్ సైన్సెస్ అధ్యయనంలో తేలింది.ఇంతవరకు తెలిసింది కాఫీలోని కొన్ని పదార్థాలు మన శరీరంలోని కణాలలో ఉండే ఒక నిర్దిష్ట ఎంజైమ్ను ప్రేరేపిస్తాయి. ఆ ఎంజైమ్ కణాల వయసు త్వరగా పెరగనివ్వకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు శరీరంలో ఇన్ఫ్లమేషన్ (మంట, వాపులు) నయం అవుతాయి. దాంతో హృద్రోగాలు వచ్చే ముప్పు తగ్గుతుంది. రోజుకు ఇన్ని కప్పులు అని మితంగా కాఫీ తీసుకోవడం వల్ల జీవక్రియలు మెరుగుపడి, వృద్ధాప్య లక్షణాలు నెమ్మదిస్తాయి.ఇప్పుడు తెలుసుకున్నది మన శరీర ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని నిర్ణయించే కణ స్థాయిలోని ‘నియంత్రణ వ్యవస్థే’కాఫీ సేవించే అలవాటు ఉన్నవారిని ఆరోగ్యంగా ఉంచుతోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనినే ‘టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ’ పరిశోధకులు ‘బయోలాజికల్ స్విచ్’అంటున్నారు. మనం సేవించే కాఫీ కణాల్లోని అటువంటి ఒక స్విచ్ను ఆన్ చేయడం ద్వారా మనం వృద్ధులుగా మారటాన్నినెమ్మదింపజేస్తోందన్న మాట. ఏమిటీ ‘బయొలాజికల్ స్విచ్’? మన శరీరంలోని కణాలలో కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు లేదా అణువులు ఉంటాయి. ఇవి బయట నుండి వచ్చే సంకేతాల (ఉదా: మనం కాఫీ తాగినప్పుడు, ఆహారం తీసుకున్నప్పుడు వచ్చే సంకేతాలు) ద్వారా శరీరంలో కొన్ని రసాయన ప్రక్రియలను ‘ఆన్’లేదా ‘ఆఫ్’అయ్యేలా చేస్తాయి. వీటినే బయోలాజికల్ స్విచ్లు అంటారు. కాఫీ తాగినప్పుడు అది శరీరంలోని ఒక నిర్దిష్ట స్విచ్ను ‘ఆన్’చేస్తుంది. ఈ స్విచ్ ఆన్ అయినప్పుడు మన కణాలు తమను తాము శుభ్రం చేసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. మేలు చేసే కొన్ని ఎంజైమ్లు కూడా విడుదల అవుతాయి. దీనివల్ల వృద్ధాప్యం లక్షణాలు ఆలస్యమవుతాయి. అలాగే మన శరీరంలోకి ఏదైనా వైరస్ చొరబడినప్పుడు,ఒక బయోలాజికల్ స్విచ్ ‘ఆన్’అయ్యి తెల్ల రక్తకణాలను యుద్ధానికి పంపిస్తుంది. వైరస్ చనిపోయాక, ఆ స్విచ్ మళ్లీ ‘ఆఫ్’అవుతుంది. సాక్షి స్పెషల్ డెస్క్ -
అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?
వాషింగ్టన్, డి.సి.లోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, ప్రసిద్ధ విమానాలు , అంతరిక్షయానానికి సంబంధించి పరికరాల ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచింది. అయితే తాజాగా ఆ ప్రదర్శనలో ఒక సాధారణ భారతీయ మహిళా శాస్త్రవేత్త చీర దర్శనమిస్తోంది. ఆ చీర భూ వాతారణాన్ని దాటి వెళ్లకపోయినా..ఆ శారీని ధరించిన మహిళ భారతదేశం మరో గ్రహాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించింది. ఈ చీర ఇస్రోకి చెందిన ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ది. ఎవరామె అంటే..భారతదేశపు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళ్యాన్)లో నందిని నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఆమె తండ్రి గణిత ఇంజనీర్ కాగా, తల్లి గణిత ఉపాధ్యాయురాలు. ఇస్రోలో చేరడానికి ముందు ఇంజనీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. భారత అంతరిక్ష సంస్థలో 20 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో ఆమె 14కు పైగా మిషన్లకు మద్దతునిచ్చారు. ఒక ఇంటర్వ్యూలో నందిని తన మిషన్ల గురించి మాట్లాడుతూ.. "తాము పనిచేసే ప్రతి మిషన్ అత్యంత ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. అయితే వాటిలో మంగళ్యాన్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఒక్కసారిగా మావైపు చూశారు. అది మా నైపుణ్యానికి, లభించిన గుర్తింపుగా, గర్వంగా అనిపిస్తుందని అన్నారు. అంతేగాదు ఆ మిషన్ విజయవంతం అవ్వడంతో సాక్షాత్తు ప్రధాని మంత్రి కరచాలనం చేసి అభినందించారు. అలాగే నాసా కూడా మమ్మల్ని అభినందించింది. అంతేగాదు ఈ గెలుపు కారణంగా నాసాతో మాతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చింది. పైగా సోషల్ మీడియాలో కూడా చాలామంది మమ్మల్ని ఫాలో అవుతున్నారంటూ". సంతోషంగా చెప్పుకొచ్చారామె.ఆ సీరియల్ కారణంగానే..అంతరిక్ష పరిశోధనలంటే ఎందుకు నందిని ఇష్టమో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వివరించారు. ఒక ప్రముఖ టీవీ సీరియల్ చూడటం ద్వారా తనకు అంతరిక్షంపై ఆసక్తి మొదలైందన్నారు. అప్పట్లో టీవీలో 'స్టార్ ట్రెక్' అనే చాలా ప్రజాదరణ పొందిన సీరియల్ ఒకటి ఉండేది, దాని కారణంగానే అంతరిక్ష ఫరిశోధనాలంటే ఇష్టం ఏర్పడిందని ఈటీ ఎంటర్ప్రైజ్ ఏఐ 'మేకింగ్ ఏఐ వర్క్ సమ్మిట్ 2025'లో చెప్పారామె. తమ కుటుంబం మొత్తం ఆ సీరియల్కి వీరాభిమానులమని, ఒక్క ఎపిసోడ్ని మిస్ అయ్యేవాళ్లం కాదంటు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారామె. అలాగే తాను పదేపదే ఇష్టంగా చూసే సినిమా అపోలో 13 అని, అందులో టీమ్గా పనిచేసి విజయం సాధించడం తదితరాలు తన మదిలో శాశ్వతంగా నిలిచిపోయానని అన్నారామె.ఆ చీర ఎందుకు?భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చెందిన మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి సహాయపడ్డారు. ఇస్రో మంగళయాన్ మిషన్ని నవంబర్ 5, 2013న ప్రారంభించింది. సెప్టెంబర్ 24, 2014న విజయవంతంగా భూమికక్ష్యను విడిచిపెట్టి విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అంటే సుమారు 300 రోజుల ప్రయాణాన్ని విజయంవతం చేసేందుకు ఆమె ఈ చీరను ధరించి పనికి వచ్చారని స్మిత్సోనియన్ మ్యూజియం ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది అంతేగాదు ఆ పోస్ట్లో.."ఒక రాకెట్ శాస్త్రవేత్తగా, మార్స్ ఆర్బిటర్ మిషన్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా నందిని హరినాథ్ మిషన్ ప్రణాళిక, కార్యకలాపల్లో కీలక పాత్ర షోషించారు. దాదాపు ఆరు నుంచి పది నెలల కాలపరిమిత గల తన మిషన్ను ఏకంగా ఎనిమిదేళ్లు అంగారక కక్ష్యలో గడిపి అక్కడి ఉపరితల వాతావరణ పరిస్థితుల్ని నమోదు చేయడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ మిషన్లోని మహిళా నాయకులు ధరించిన చీరలు వారి జాతీయ గుర్తింపు, అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచాయి" అని సదరు మ్యూజియం పేర్కొంది. అంతేగాదు ఆ చీరకు సంబంధించిన వీడియో, ఫోటోలను కూడా మ్యూజియం పంచుకుంది. ఈ చీరలో నీలం రంగు జాకెట్, ఎరుపు-నీలంతో కలగలసిన డ్రేప్డ్ ఫాబ్రిక్ ఉన్నాయి. View this post on Instagram A post shared by Smithsonian (@smithsonian) (చదవండి: జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..) -
మంచులోకపు చివరి చిరునామా
మంచు పరుపుపైన ఆకాశం వాలిపోతుంటే ప్రకృతి తన మౌనరాగాన్ని వినిపిస్తుంది. అక్కడ సూర్యుడు ఉదయించడు.. ఉదయిస్తే అస్తమించడు.మనుషుల కన్నా పోలార్బేర్ ఎక్కువ ఉండే మంచు రాజ్యం స్వాల్బార్డ్. ఆర్కిటిక్ వెలుగు మధ్య నిశ్శబ్దంగా నిలిచిన ‘స్వాల్బార్డ్’ అనే ఈ ప్రాంతం నార్వే దేశంలో భాగం. యూరప్ నుంచి దూరంగా ఉండే మంచుతో నిండిన ద్వీప సమూహం ఇది. మంచులోకపు చివరి చిరునామాను తెలుసుకోవాలంటే ‘స్వాల్బార్డ్’ వెళ్లాల్సిందే!ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి స్వాల్బార్డ్కు నేరుగా విమాన సర్వీసులు లేవు. ముందునార్వే రాజధాని అయిన ఓస్లో వరకు చేరుకుని అక్కడి నుంచి స్వాల్బార్డ్లోని లాంగ్ఇయర్బైయెన్ ప్రాంతానికి వెళ్లవచ్చు. విజయవాడ నుంచి స్వాల్బార్డ్ వెళ్లాలి అనుకుంటే ముందుగా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది.ఎక్కడ ఉండాలి?స్వాల్బార్డ్లో స్టే అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లాంగ్ఇయర్బైయెన్లో ఉన్న చిన్న బుటిక్ హోటల్స్, గెస్ట్ హౌసెస్ చాలా బాగుంటాయి. వుడ్తో చేసిన గోడల మధ్య బయట చలి ఉన్నా.. లోపల ఉండే ఆ వెచ్చదనం మనసుకి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. అక్కడ ఉన్న లగ్జరీ అమెనిటీస్ కన్నా అక్కడి సింప్లిసిటీ, హాస్పిటాలిటీ మనసుని గెలుచుకుంటాయి. లాడ్జిలోని వెచ్చని మంట దగ్గర కూర్చుని పుస్తకం చదవడం కానీ, లేదా బయట ఉన్న మంచును చూడటం ఒక మెమొరీగా మిగిలిపోతాయి.ఏం చూడాలి?స్వాల్బార్డ్లో చూడాల్సిన ప్రదేశాలు, చేయడానికి ఆక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఆర్కిటిక్ వైల్డర్నెస్లో డాగ్ స్లెడింగ్ చేస్తూ మంచులో వెళ్లడం చాలా మందికి నచ్చుతుంది. స్నో మొబైలింగ్ చేయడం, నార్తర్న్ లైట్స్ చూడటం ఇవన్నీ చాలా మంది చేసేవే. కానీ మీరు వెళ్తే మాత్రం అక్కడ ఉన్న డూమ్స్డే వాల్ట్ అనే ప్రపంచ విత్తనాల బ్యాంకును చూడటం మరవకండి. గ్లేషియర్స్, వాటి మధ్యలో ఉన్న మంచు గుహలను చూసేందుకు మంచి ట్రావెల్ ఏజెన్సీలు సాయం చేస్తాయి. దీంతో పాటు సోవియట్ కాలంలో తవ్వి వదిలేసిన పిరామిడెన్, బారెంట్స్బర్గ్ అనే మైనింగ్ టౌన్ ఒక సినిమాటిక్ ఫీలింగ్ అందిస్తాయి. ఇక్కడి మ్యూజియంలో పోలార్ బేర్స్, అంటే ధ్రువపు ఎలుగుబంట్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.ఏం తినాలి?ఆర్కిటిక్ వాతావరణంలో ఫుడ్ ఒక సూపర్ ఎక్స్పీరియెన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ లోకల్గా లభించే సీ ఫుడ్, ముఖ్యంగా ఫ్రెష్ ఆర్కిటిక్ చార్ అనే కోల్డ్ వాటర్ ఫిష్ డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. దీంతో పాటు లోకల్ కాఫీ, రీన్డీర్ మీట్, లోకల్ సూప్స్ ఫుడ్ లవర్స్కు మంచి ఆప్షన్స్గా ఉంటాయి.నిజానికి ఇక్కడ ఫుడ్ అనేది ఆకలి తీర్చుకునే సాధనం మాత్రమే కాదు.. ఆ వాతావరణంలో మనసుని తృప్తిపరచుకునే మార్గం కూడా.సందర్శనీయ స్థలాలుస్వాల్బార్డ్లో లాంగ్ఇయర్బైయెన్ అనే చిన్న టౌన్ నుంచి మంచు కొండల మధ్యలోకి వెళ్లే కొద్దీ మనకు వినపడే ఒకే ఒక శబ్దం.. నిశ్శబ్దం. ఇక్కడి పిరామిడెన్ అనే ఘోస్ట్ టౌన్ చూస్తుంటే గత కాలంలో మనుషుల జీవితం ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. అక్కడున్న ప్రతీ కట్టడం, కోల్ మైన్స్ ఇప్పుడు మంచులో కలిసిపోయి ఒక వింత కథను చెబుతాయి. నై–ఆలేసుండ్ అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు హఠాత్తుగా ఆకాశంలో నక్షత్రాలు మనకు దగ్గరయ్యాయేమో అని అనిపిస్తుంది.ఆసక్తికరమైన విషయాలుస్వాల్బార్డ్లో మనుషుల కన్నా పోలార్ బేర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మిడ్నైట్ సన్ వల్ల సమ్మర్లో 24 గంటలూ సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఇక్కడే ఉంది. దీనిని డూమ్స్డే వాల్ట్ అని కూడా అంటారు. ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ చాలా తక్కువ. ప్రయాణానికి స్నో మొబైల్స్ ఎక్కువగా వాడతారు. స్వాల్బార్డ్లో చనిపోయిన వారిని ఖననం చేయరు. దీనికి కారణం ఇక్కడ నేల మొత్తం శాశ్వత మంచుతో ఉండటమే. దీనిని పెర్మాఫ్రోస్ట్ అంటారు. దీని వల్ల మృతదేహాలు పూర్తిగా డీ కంపోజ్ కావు.పోలార్ బేర్స్ అడ్డాస్వాల్బార్డ్ ప్రయాణం ఎంత అందమైనదో అంతే ప్రమాదకరం కూడా. ఇక్కడ మనుషుల కన్నా పోలార్ బేర్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే పట్టణం పరిధి దాటి బయటికి వెళ్లినప్పుడు చేతిలో రైఫిల్ తీసుకెళ్లడం అక్కడ తప్పనిసరి. ధ్రువపు ఎలుగుబంట్లు ఎంత అందంగా ఉంటాయో అంతే శక్తివంతమైనవి కూడా. ఇవి 8 నుంచి 10 అడుగుల ఎత్తు, సుమారు 700 కిలోల బరువుతో కూడా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే మ్యాగ్జిమం ఉస్సెయిన్ బోల్ట్ స్పీడ్ గంటకు 37 కిమీ మాత్రమే. మంచు కొండల మధ్య హఠాత్తుగా ఒక పోలార్ బేర్ కనిపిస్తే గుండె క్షణం పాటు ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకే అక్కడ చాలా మంది గైడ్ లేకుండా ఎక్కడికీ వెళ్లరు.స్వాల్బార్డ్లో చేయాల్సిన 5 పనులుఫ్రోజెన్ బబుల్ ఫోటోగ్రఫీలాంగ్ఇయర్బైయెన్ లో అత్యంత చల్లని వాతావరణంలో వేడి నీటి బుడగలు నేల నుంచి బయటికి వచ్చి పేలుతుంటాయి. ఈ ప్రత్యేక దృశ్యాలను ఫోటోగ్రఫీ చేయడం చాలా మందికి ఇష్టం.ఆర్కిటిక్ బోట్ సఫారిఇస్ఫ్యోర్డెన్ ప్రాంతంలో ఐస్బర్గ్లు, గ్లేషియర్స్ చూడొచ్చు. అలాగే మంచు ప్రపంచంలో మాత్రమే కనిపించే పోలార్ బేర్స్ను కూడా చూడవచ్చు.బారెంట్స్బర్గ్ ట్రిప్స్థానిక కల్చర్, వారి జీవనశైలి గురించి తెలుసుకోవాలి అంటే రష్యన్ సెటిల్మెంట్ ఉన్న బారెంట్స్బర్గ్ వెళ్లవచ్చు.గుడ్ నైట్ చెప్పని సూరీడుస్వాల్బార్డ్లో ఏప్రిల్ చివరి నుంచి ఆగస్టు చివరి వరకు సూర్యుడు అస్తమించడు.పోలార్ నైట్ అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి మధ్య వరకు సూర్యుడు ఉదయించడు. దీనినే పోలార్ నైట్ అంటారు. ఇదే స్వాల్బార్డ్ ప్రత్యేకత.యాత్ర – బడ్జెట్ వివరాలుస్వాల్బార్డ్ ప్రయాణం కొంచెం ఖర్చుతో కూడినదే. అయితే అక్కడ లభించే అనుభవం మాత్రం పక్కా పైసా వసూల్ అనిపిస్తుంది.ఈ సుదీర్ఘ ధ్రువ ప్రయాణానికి 5 రోజులు కేటాయిస్తే సుమారు రూ.4.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు బడ్జెట్ అవుతుంది.హైదరాబాద్ నుంచి ఓస్లోకు ఫ్లైట్ టికెట్ను బట్టి 12 నుంచి 22 గంటల వరకు సమయం పడుతుంది. అప్ అండ్ డౌన్ టికెట్ ధరలు రూ.99 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉండొచ్చు.ఓస్లో నుంచి లాంగ్ఇయర్బైయెన్ కు ఫ్లైట్లో వెళ్తే వన్ వే జర్నీకి సుమారు రూ.45 వేల వరకు ఖర్చవుతుంది. టికెట్ ధరలు సీజన్ ను బట్టి మారొచ్చు.స్టే ఆప్షన్స్ విషయానికి వస్తే మీ బడ్జెట్ను బట్టి రూ.8 వేల నుంచి రూ.62 వేల వరకు కూడా హోటల్స్ లేదా లాడ్జ్లలో రూమ్స్ దొరికే అవకాశం ఉంది.ఫుడ్ అండ్ లోకల్ సఫారీ విషయానికి వస్తే డైలీ రూ.12 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ట్రిప్ కొనసాగించవచ్చు. అదే మీరు ఆర్కిటిక్ క్రూజ్లో ప్రయాణించాలి అనుకుంటే రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది.కరెన్సీ తక్కువ..స్వాల్ బార్డ్ అధికారిక కరెన్సీ నార్వేజియన్ క్రోన్. కె.ఆర్ నగదు మొత్తానికి ముందు రాస్తారు. నగదు వాడకం చాలా తక్కువ. ఎక్కువ శాతం కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తారు. వీసా అవసరమా?భారతీయులకు స్వాల్బార్డ్ వెళ్లేందుకు సాధారణ నార్వే షెంజెన్ వీసా అవసరం అవుతుంది. నిజానికి స్వాల్బార్డ్ వెళ్లేందుకు ప్రత్యేక వీసా అవసరం లేదు. టెక్నికల్గా అది వీసా–ఫ్రీ జోన్.అయితే అక్కడికి వెళ్లాలంటే నార్వే మెయిన్ లాండ్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే భారతీయులకు మల్టిపుల్ ఎంట్రీ షెంజెన్ వీసా అవసరం అవుతుంది. అలాగే పాస్పోర్ట్ వ్యాలిడిటీ, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోటల్ బుకింగ్స్, రిటర్న్ టికెట్స్ వంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం అవుతాయి.ఇక్కడ ఇచ్చిన ట్రావెల్ అండ్ బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు వివరాలు స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.ఇక్కడ రాత్రి లేకుండా సాగిపోయే సమయం, మనసులో వెలుగును మిగిల్చే ఒక అనుభవంగా మారుతుంది. స్వాల్బార్డ్ ఇది కేవలం ఒక ప్రదేశం కాదు ఒక అనుభూతి. ఆర్కిటిక్ సముద్రం మధ్యలో మంచు కొండల నడుమ మనుషుల హడావిడి లేని ఒక ప్రశాంతమైన ప్రపంచం. ప్రకృతి తన విశ్వరూపాన్ని ఎంత అందంగా చూపిస్తుందో ఇక్కడ మనం వీక్షించవచ్చు. ఇక్కడ సమయం అనేది ఒక నెంబర్ కాదు.. ఒక ఎమోషన్. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు (చదవండి: వరుణుడు కోసం అగ్నిబాణాలు) -
అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే?
వెనిస్ బినాలే (Venice Biennale) ప్రారంభోత్సవ వేడుకల్లో అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ స్టైలిష్ లుక్ విశేష ఆకర్షణగా నిలిస్తోంది. ఆడ్రీ హెప్బర్న్ - జాక్వెలిన్ కెన్నెడీల శైలిని అనుకరిస్తూ, గివెన్చీ రూపొందించిన టాగో చీర గౌనులో మెరిసారు రాధికా మర్చంట్వెనిస్ బినాలే ప్రారంభోత్సవ గాలాలో రిలయన్స్ అధినేత అంబానీ కోడలు, రిలయన్స్ వారసుడు వ్యాపారవేత్త అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ పాత-హాలీవుడ్ గ్లామర్ మేళవింపుతో ప్రత్యేకమైన గివెన్చీ కౌచర్ దుస్తుల్లో స్పెషల్ లుక్లో ఆకట్టుకున్నారు. ఒపెరా గ్లోవ్స్, వజ్రాలు, సున్నితమైన రెట్రో బ్యూటీ స్టైలింగ్తో కూడిన ఈ లేత నీలి రంగు దుస్తులు, ఐకానిక్ ఆడ్రీ హెప్బర్న్ సిల్హౌట్లను గుర్తుచేస్తూ, అతిపెద్ద ఫ్యాషన్ హైలైట్లలో ఒకటిగా నిలిచాయి. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor)stify"> ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను రాధికా మర్చంట్ 'ఆడ్రీ హెప్బర్న్' ఇన్స్పైర్డ్ లుక్ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గివెంచి (Givenchy) రూపొందించిన ప్రత్యేకమైన గౌన్లో ఆమె మెరిశారు. ఇది పౌడర్ బ్లూ (Powder blue) రంగులో భారతీయ చీర కట్టును (Saree drape) పోలి ఉండేలా ఆధునిక హొయలతో రూపొందించారు. ఒకప్పుడు దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ హ్యూబర్ట్ డి గివెన్చీ, లెజెండరీ నటి ఆడ్రీ హెప్బర్న్ కోసం రూపొందించిన ఐకానిక్ చీర తరహా గౌన్ల నుండి స్పూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ గౌన్కు మ్యాచింగ్గా 'ఒపెరా గ్లోవ్స్' ధరించారు. ఇది పాతకాలపు హాలీవుడ్ గ్లామర్ను గుర్తుకు తెచ్చింది. ఇక ఆభరణాల విషయానికి వస్తే డైమండ్ రింగ్, మెరిసే ఆర్మ్ యాక్సెసరీతో తన లుక్ను మరింత రిచ్గా మార్చుకున్నారు.ఇదీ చదవండి: బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానేమేకప్ , హెయిర్ స్టైల్వింగ్డ్ ఐలైనర్, గ్లోసీ న్యూడ్ లిప్స్,సున్నితమైన గ్లోయింగ్ స్కిన్తో 'సాఫ్ట్ గ్లామ్' మేకప్ను ఎంచుకున్నారు. రెట్రో స్టైల్లో ఉండే సాఫ్ట్ వేవ్స్ (Polished waves) ఆమె వింటేజ్ మూడ్కు సంపూర్ణంగా సరిపోయింది. పారిసియన్ ఎలిగెన్స్ మరియు భారతీయ సంప్రదాయ కట్టు కలబోతగా ఉన్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాతకాలపు హాలీవుడ్ స్టైల్ను ఆధునిక పద్ధతిలో ప్రదర్శించి రాధికా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా? -
సమ్మర్ ట్రిప్స్లో ఈ కిట్ తప్పనిసరి!
సమ్మర్ వెకేషన్స్ అంటే మన తెలుగు వాళ్లకు వెంటనే గుర్తుకు వచ్చేవి హిల్ స్టేషన్స్, జలపాతాలు, బీచ్ ట్రిప్స్, ఆలయాలు. కానీ ఎండలు ఎక్కువగా ఉన్న సీజన్ కాబట్టి చిన్ననాటి ఏమరపాటు అయినా మొత్తం ట్రిప్ను స్పాయిల్ చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్, ట్రెక్కింగ్, ఫ్యామిలీ టూర్స్, పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ కిట్ అనేది తప్పనిసరి!చాలా మంది బట్టలు, చార్జర్స్, కెమెరా ప్యాక్ చేస్తారు కానీ ఎమర్జెన్సీకి పనికొచ్చే వస్తువులు మర్చిపోతారు. కానీ మన జర్నీలో ఈ కిట్ ఒక సూపర్ హీరోలా అవసర సమయంలో ఆదుకుంటుంది అని చాలా మందికి తెలియదు. ప్రయాణంలో అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగపడేందుకు మీ వద్ద ఈ కిట్ మెయింటేన్ చేయడం మరవకండి.ఎమర్జెన్సీ కిట్లో ఏముండాలి?ఈ ఎమర్జెన్సీ కిట్లో తప్పకుండా స్పేర్గా ఒక వాటర్ బాటిల్, కొన్ని ఓఆర్ఎస్ ΄్యాకెట్స్ ఉండాలి. ఎందుకంటే ఎండాకాలంలో డీహైడ్రేషన్ అనేది చాలా పెద్ద సమస్య. అందుకే రీయూజబుల్ బాటిల్తో ΄ాటు ఓఆర్ఎస్ ΄్యాకెట్స్ క్యారీ చేయండి.బేసిక్ మెడిసిన్స్.. తలనొప్పి ట్యాబ్లెట్స్, ఫీవర్ మెడిసిన్, మోషన్ సిక్నెస్ ట్యాబ్లెట్స్, ఆసిడిటీ రెగ్యులేటర్ ట్యాబ్లెట్స్, బ్యాండ్ ఎయిడ్స్, యాంటిసెప్టిక్ క్రీమ్ తప్పకుండా ఉండాలి. పిల్లలతో వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త అవసరం. ఇవన్నీ తీసుకున్నాక అవసరమైతే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించడం మరవకండి!సన్స్క్రీన్, క్యాప్... మన తెలుగు రాష్ట్రాల్లో మే నెలలో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పీఎఫ్ సన్స్క్రీన్, సన్గ్లాసెస్, క్యాప్ లేకపోతే వేడికి చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పవర్ బ్యాంక్ అండ్ టార్చ్ ... కొండప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలకు వెళ్తే చార్జింగ్ పేయింట్స్ లభించకపోవచ్చు. పవర్ బ్యాంక్, చిన్న టార్చ్ లైట్ చాలా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఈ సమస్యలు సాధారణమే.వెట్ వైప్స్, శానిటైజర్... రోడ్ ట్రిప్స్లో హైజీన్ మెయింటేన్ చేయడానికి వెట్ వైప్స్ చాలా ఉపయోగపడతాయి. శానిటైజర్ మీ బ్యాగ్లో తప్పకుండా ఉండేలా చూసుకోండి.చిరుతిళ్లు ... బిస్కిట్స్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ బార్స్ లాంటి స్నాక్స్ క్యారీ చేయడం మరవకండి. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎండాకాలం రోడ్ ట్రిప్ అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమం. ఉదయం త్వరగా బయల్దేరి ఎండ పెరిగేలోపు ప్రయాణించండి. తరువాత సాయంత్రం సమయంలో ప్రయాణాన్ని కొనసాగించండి. ఇలా చేస్తే మీ ప్రయాణం మరింత కంఫర్టబుల్గా సాగుతుంది. (చదవండి: చిన్న నది.. పేద్ద కథ!) -
చిన్న నది.. పేద్ద కథ!
భారతదేశంలో నదులు అంటే ముందు గంగా, గోదావరి, కృష్ణా, బ్రహ్మపుత్ర లాంటి మహానదుల పేర్లే గుర్తొస్తాయి. కానీ మన దేశంలో ఉన్న అత్యంత చిన్న నది ఏంటో తెలుసా? ఈ ప్రశ్నకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. భౌగోళిక నిపుణులు, ట్రావెల్ గైడ్స్, కొన్ని జియోగ్రఫీ రిఫరెన్సుల ప్రకారం ఈ అత్యంత చిన్న నదుల్లో ఒకటిగా ఎక్కువగా వినిపించే పేరు ఆర్వారీ నది.ఆర్వారీ నది ఎక్కడుంది?రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో ప్రవహించే ఈ నది సుమారు 45 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని చెబుతారు. చివరకు ఇది సాహిబీ నదీ వ్యవస్థలో కలుస్తుంది. చిన్నదైనా ఈ నది పేరు మాత్రం జియోగ్రఫీ డిస్కషన్స్లో చాలాసార్లు వినిపిస్తుంది.అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇండియాలో ‘అఫీషియల్ షార్టెస్ట్ రివర్’ అంటూ ఫిక్స్డ్ నేషనల్ రికార్డు ఏమీ లేదు. కొందరు ఇంకొన్ని చిన్న నదుల పేర్లు కూడా ప్రస్తావిస్తారు. కానీ ఆర్వారీ నదిని ఈ జాబితాలో ముందుగా చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నదికి స్పష్టమైన సోర్స్ టు ఎండ్ అంటే నది చివర అంతం.మాయం అయిన నది.. మళ్లీ ప్రవహించిన కథఒకప్పుడు ఈ నది పూర్తిగా ఎండిపోయి దాదాపు మాయం అయిందట. నేల చిట్లిపోయి, నీటి జాడ కూడా కనిపించని పరిస్థితి వచ్చిందని చెబుతారు. కానీ అక్కడి స్థానిక గ్రామస్థులు, నదీ సంరక్షణ సంఘాలు, ప్రకృతి ప్రేమికులు కలిసి నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. చెక్డ్యామ్లు, సంప్రదాయ వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులతో ఈ నదికి మళ్లీ ప్రాణం పోశారు. అందుకే పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడినప్పుడు ఆర్వారీ నది పునరుజ్జీవన కథను చాలా మంది ఉదాహరణగా చెబుతుంటారు.నిజానికి మన దేశంలో కేవలం వర్షాకాలంలోనే ప్రవహించే చిన్న వాగులు చాలా ఉంటాయి. కానీ వాటిని అధికారికంగా నదులుగా పరిగణించరు. ఆర్వారీ మాత్రం చిన్న నది అయినా, దాని వెనక ఉన్న మానవ ప్రయత్నం మాత్రం చాలా పెద్దది. ఈ చిన్న నది మనకు చెప్పే విషయం ఒక్కటే ప్రకృతిని మనం కంటికి రెప్పలా కాపాడుకుంటే ప్రకృతి కూడా మనల్ని అంతే ప్రేమగా కాపాడుకుంటుంది. (చదవండి: ఎలక్ట్రిక్ యూనిసైకిల్ రైడ్కి ట్రాఫిక్ పోలీసులే ఫిదా! చివరికి..) -
జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..
జీవితమంతా వైఫల్యాలు అడగడుగున పలికరిస్తూనే ఉన్నా వదలిపెట్టని ధీరుడి కథ. అదేంటి అన్ని పెయిల్యూర్స్ ఎదుర్కొటే ధీరుడు, శూరుడు అంటారేంటి అనుకోకండి. ఎందుకంటే గెలిస్తే వాట్ నెక్స్ట్ అంటూ సాగిపోతావు..అదే ఆపకుండా ఓటమి హగ్ ఇస్తూ ఉంటే..పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాలంటే అజేయమైన ఓర్పు, ఆత్మ విశ్వాసం కావాలి. ముఖ్యంగా చుట్టూ ఉన్నవాళ్లలో కొందరు జాలిచూపులతో సానుభూతి చూపితే, మరికొందరు నీ వల్ల కాదు అన్న విమర్శల బాణాలు.. అయినా సరే డోంట్ కేర్ అంటూ ముందుకు సాగాలంటే ఆకాశమంత ధైర్యం కావలి. అందుకు ఉదాహరణ ఈ టెకీ. అతడి కథ వింటే..ఫెయిల్యూర్లు, రిజెక్ట్లు చూసినోళ్లే గొప్పోళ్లు అని కచ్చితంగా అంటారు. మరి అతడి కథేంటో చకచక చదివేద్దామా..!.చాలామంది విద్యార్థులకు పోటీ పరీక్షలు ప్రారంభ విద్యా మైలురాళ్లలా విజయానికి అంతిమ కొలమానంగా ఉంటే..హర్యానాలోని రోహ్తక్కు చెందిన రిజుల్ సింగ్ మాలిక్ విషయంలో మాత్రం అలా కాదు. ఎడతెగని ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో అందుకున్న గొప్ప గెలుపు రికార్డు అతడిది. అతడు పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. రిజుల్ తన పాఠశాల విద్యను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వసంత్ కుంజ్లో పూర్తి చేశాడు.ఆ తర్వాత అందరిలానే ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఐఐటీ జేఈఈకి ప్రిపేరయ్యాడు. మొదటిసారి ఓటమి ఎదుర్కొనడంతో మరోసారి ప్రయత్నించాడు. ఈ సారి హోమ్ ట్యూటర్, ఒక ఏడాది వృధా చేసుకుని లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుని మరి ప్రిపేరయ్యాడు. అయినప్పటికీ ఓటమిని ఎదుర్కొనక తప్పలేదు. కానీ ఇంతలా ప్రిపేరైనా..కనీసం కటాఫ్ మార్కులు కూడా సాధించలేకపోయాడు రిజుల్. పైగా ఒక ఏడాది వృధా చేసుకోవడం బంధువులు, మిత్రులు అంతా ఒకటే విమర్శించడం ప్రారంభించారు. పాపం రిజుల్ ఆ అవమానం తట్టుకోవడం సాధ్యం కాక డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు కూడా. అయితే 18 ఏళ్ల వయసులో రాసే ప్రవేశ పరీక్ష కెరీర్లో రాబోయే 40 ఏళ్లను నిర్దేశించదని గ్రహించి బీటెక్ ఐటీ చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. అయినప్పటికీ ఆ జేఈఈ ఫెయిల్యూర్ తలుచుకున్నప్పుడల్లా అతడిని బాగా మెలిపెడుతుండేది. ప్రతీదాంట్లో.. రెండు మూడు సార్లు వైఫల్యమేఅయితే 2019లో జరిగిన బర్కిలీ సమ్మర్ స్కూల్ అతని జీవితంలో ఒక ప్రధాన మలుపు. అక్కడ అతనికి డేటా సైన్స్తో మొదటిసారిగా గట్టి పరిచయం ఏర్పడింది. అలా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ (UC Irvine లేదా UCI)అమెరికాలో అకడమిక్ ప్రొబేషన్) ప్రవేశం పొందడం అతడి లక్ష్యంగా మారింది. అందుకోసం జీఆర్ఈఈకి సన్నద్ధమయ్యాడు. అయితే అది కూడా రిజుల్కు చుక్కలు చూపించింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఆ పరీక్షనురాశాడు. మొదటి ప్రయత్నంలో 303, రెండవ ప్రయత్నంలో 305, మూడవ ప్రయత్నంలో 307 దాటి, చివరకు నాల్గవ ప్రయత్నంలో 308 స్కోర్ చేశాడు. అన్నిసార్లు రాయడంతో మరోసారి జీఆర్ఈకి రెడీ అవుతున్నా అని చెప్పాలంటే భయపడేవాడు. అయితే అనుకోకుండా యూసీ ఇర్విన్ నుండి అంగీకారం రావడంతో ఇది నిజమేనా అని నమ్మలేకపోయాడు. అయితే అక్కడి అధికారి స్కోరు నిజమైన విజయం కాదని, నువ్వు పట్టువదలకుండా రాయడమే అసలైన గెలుపు అని బదులిచ్చాడు. పాపం యూసీ ఇర్విన్లోని ఎంఎస్ ప్రోగ్రామ్ నుంచి కూడా మళ్లీ సవాళ్లు మొదలయ్యాయి. సరిగ్గా అమ్మ పుట్టిన రోజు అని భారత్కు వస్తే..తన GPA (Grade Point Average) అకడమిక్ ప్రతిభ 2.8కి పడిపోవడంతో, ఆ అకడమిక్ ప్రొబేషన్లో ఉంచేశామని, మెరుగుపడకపోతే తదుపరి చర్యలు ఎదుర్కొనక తప్పదని మెయిల్ వచ్చింది. దాంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఉత్సాహం కాస్తా ఉసురుమంది గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చా అటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. పైగా అందరు ఉత్తీర్ణులయ్యారు, తానొక్కడినే పరాజితుడిగా ఉండిపోయానంటూ నాటి సంఘటనను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అదీగాక అమెరికాలో జాతివివక్ష వంటి పలు సవాళ్లు కూడా తోడవ్వడంతో తనపై ఒత్తిడి ఎక్కువగా ఉండేదని చెప్పుకొచ్చారు. చివరికి తన జీపీఏను మెరుగుపరుచుకుని విజయవంతంగా తన అకడమిక్ని పూర్తి చేశాడు. ఇక తక్షణమే ఉద్యోగ వేట అందరి కంటే ముందు మొదలు పెట్టాను గానీ, ప్రతిది రిజెక్ట్ అయ్యేదని చెప్పుకొచ్చారు. ఎంతో కష్టపడగా చివరికి ఓ ఇంటర్న్షిప్కి అర్హత లబించినట్లు తెలిపాడు. అలా ఈవై, వాల్మార్కట్ కంపెనీల్లో పనిచేశాడు. అక్కడ పనిసంస్కృతి గొప్ప పాఠాలే నేర్పాయి. తన సహోద్యోగులు, మేనేజర్ నుంచి చాలా తక్కవుమద్దతే లభించేదని పేర్కొన్నాడు. ఒక సందర్భంలో, తాను సహాయం కోసం ఒక సీనియర్ను సంప్రదించగా, ఆ విషయాన్ని తన మేనేజర్ వరకు తీసుకెళ్లి చివాట్లు, నిందలు పడేలా చేశాడంటూ నాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. గూగుల్లో జాబ్ కొట్టడం కోసం..ఆ అనుభవం భవిష్యత్ కార్యాలయాల పట్ల ఎలా ఉంటే బెస్ట్ అనేది తెలుసుకోగలిగానని న్నారు. దాంతో మంచి పనిసంస్కృతి ఉండే ఉద్యోగ కోసం అన్వేషించే పనిలో పడ్డట్లు తెలిపాడు. ఆ క్రమంలోనే గూగుల్లో జాబ్ కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడట అందుకోసం ఏ పదో, 20 కాదు ఏకంగా 520 సార్లకు పైగా తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ సమయంలో తనని ప్రోత్సహించింది మాత్రం తన కాబోయే ప్రియురాలు, తల్లిదండ్రులేని అంటున్నాడు. వాళ్లిచ్చిన అండదండలతో వెనక్కి తగ్గకుండా గుగుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లు వివరించాడు. అలా ఓ రోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో, తన వాల్మార్ట్ ఆఫీస్ నుంచి బయటకు వస్తుండగా ఆఫర్ లెటర్ పంపబడుతోందని ఫోన్ కాల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయిందని చెప్పుకొచ్చాడు. గూగుల్లో జాబ్ రాగానే తన కాబోయే భార్య ఖుషీకే ఫోన్ చేశానని, ఆ తర్వాత అమ్మనాన్నలకు చేసినట్లు తెలిపాడు. ఎందుకంటే అన్ని రిజెక్షన్లు రావడంతో నాకే ఎందుకు జరుగుతోందంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే రిజుల్ ప్రియురాలు ఏంకాదు, కచ్చితంగా గెలుస్తావ్, ఆఫర్ లెటర్ అందుకుంటావ్ అంటూ ధైర్యం చెబుతూనే ఉండేది, ఒక్కసారి కూడా పోనీలే వదిలేయ్ అన్న మాట తన నోటినుంచి రాలేదంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. ఇతడి కథ చూస్తుంటే హాలీవుడ్ మూవీలోని ఒక కొటేషన్ గుర్తొస్తోంది. జీవితం అంటే "ఎంత బలంగా కొట్టావన్నది కాదు, ఎన్ని ఎదురదెబ్బలు తగలినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగడమే" అన్న వాక్యానికి నిలువెత్తు నిదర్శనం కదూ. ఎన్ని వైఫల్యాలు రానీ పట్టుదలతో సాగేవాడి ఎదురేలేదు, పైగా ఏదో ఒకనాటికి విజయం తథ్యం అనేది జగమెరిగిన సత్యం. View this post on Instagram A post shared by Rijul (@rijulsinghmalik_) (చదవండి: కోటి రూపాయలు శాలరీ నుంచి ఫ్లాట్లు శుభ్రం చేసే స్థాయికి..!) -
బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానే
బిగ్ బాస్ ఫేమ్ మనీషా రాణి ముంబైలోని లగ్జరీ హౌస్ నెట్టింట సందడిగా మారింది. భారీ వార్డ్రోబ్తో కూడిన గ్లామ్ రూం , విశాలమైన బాల్కనీతో ఉండే మనీషా రాణి "డ్రీమ్ హౌస్" విశేషాలపై ఫ్యాన్స్ అబ్బురపడుతున్నారు. మే 1వ తేదీన మనీషా రాణి తన కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సహా తన ప్రియమైన వారి సమక్షంలో, సాంప్రదాయ దుస్తుల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను ఇనష్టాలో షేర్ చేశారు. పదండి ఆ వివరాలేంటో తెలుసు కుందాం.బిగ్ బాస్ OTT 2లో సెకండ్ రన్నరప్గా నిలిచిన మనీషా రాణి తన చలాకీతనం, మాట్లాడే శైలితో బాగా పాపులర్ అయింది. ఆమెకు ఇన్స్టా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లున్నారు. ఝలక్ దిఖ్లా జా 11 విజేతగా గుర్తింపు పొందిన మనీషా రాణి, ముంబైలో తన కలల ఇల్లును కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ. 5 కోట్లు.ఇంటీరియర్, డిజైన్ఈ ఇల్లు ఆధునిక శైలిలో, విశాలమైన గదులతో ఉంటుంది. గోడలకు పాస్టెల్ రంగులు (Muted tones) ఉపయోగించారు, అక్కడక్కడా వైబ్రెంట్ రంగులతో ఇంటికి కొత్త లుక్తో ఆకర్షణీయంగా ఉంటుంది.లివింగ్ రూమ్ చాలా విశాలంగా, వెలుతురు వచ్చేలా ఉంటుంది. స్టైలిష్గా కనిపించడమే కాకుండా సౌకర్య వంతంగా కూడా ఉంటుంది. ఈ గది ఆధునిక ఇంటీరియర్ డిజైన్లు,ట్రెండీ లైటింగ్ , గాలి ధారాళంగా వచ్చేలా క్రాస్-వెంటిలేషన్ సౌకర్యం ఉంది.వార్డ్ రోబ్ అది పెద్ద కిచెన్ దీని మరో ప్రత్యేకత. ప్యారలల్ లేఅవుట్తో మార్బుల్ ఫినిషింగ్ కౌంటర్లు , స్టైలిష్ క్యాబినెట్లతో వంటగదిని చాలా అందంగా తీర్చిదిద్దారు. అంతేకాదు తన దుస్తుల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద వార్డ్రోబ్తో కూడిన గ్లామ్ రూమ్ను సిద్ధం చేసుకోవడం విశేషం. అందంగా, స్టైల్గా డిజైన్ చేయబడిన ఈ విశాలమైన వార్డ్రోబ్లో, బట్టలు, బూట్లు, యాక్సెసరీల కోసం చక్కగా అమర్చిన అరలు, చక్కటి స్టోరేజ్ ప్లేస్, విలాసవంతమైన ఏర్పాటు ఉన్నాయి. ఇది ఫ్యాషన్పై ఆమెకున్న ప్రేమను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. ముంబై నగరాన్ని వీక్షించేలా పెద్ద బాల్కనీ, దానికి ఫ్లోర్-టు-సీలింగ్ కిటికీలు ఉండటంతో ఇల్లు మరింత లగ్జరీగా కనిపిస్తుంది ఫైనల్లీ తన కలనెరవేరింది అంటూ తన ఇంటిగృహప్రవేశ ఫోటోలను, వీడియోలను ఇన్స్టాలో తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసిందీ ఈ బీహారీ చిన్నది. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను View this post on Instagram A post shared by Manisha Rani (@manisharani002) -
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. -
నిరంత అలసట, జుట్టురాలడం ఆ వ్యాధికి సంకేతం కావొచ్చు..!
చాలామంది అలిసిపోడం, జుట్టు రాలడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. కొందరిలో కీళ్ల నొప్పులు, నోటి పూతలు తరుచుగా వస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిని అస్సలు తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పైకి సాధారణంగా కనిపించే ఈ లక్షణాలు ఆ వ్యాధికి సంకేతం కావొచ్చని హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటి సమస్యలు ఎక్కుగా 20 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళల్లోనే అధికం అని అంటున్నారు. ఇంతకీ ఆ వ్యాధి ఏంటంటే..బాగా అలసిపోవడం, జుట్టురాలిపోవడం, తరుచుగా నోటిపూతలు, కీళ్ల నొప్పులు..ఒక వారానికి పైగా ఉండటం, లేదా మళ్లీ మళ్లీ అదేపనిగా ఈ సమస్యలు రావడం వంటివి జరిగితే అది లూపస్ వ్యాధికి సంకేతం కావొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే యువతులలో తరుచుగా ఈ వ్యాధి నిర్ధారణ కాకుండానే ఉండిపోతోందని అంటున్నారు. ఈ సమస్య తీవ్రమైన లక్షణాలతో మొదలవుతుందని అనుకుంటారు. కానీ ఇది నిరంతర అలసట, కీళ్ల నొప్పులు, కారణం తెలియని జుట్టు రాలడం, నోటి పూతలు, స్వల్ప జ్వరం, ఎండ తగిలిన దద్దుర్లు వంటి వాటితో ప్రారంభమవుతుందని అన్నారు. ఇది రోజువారి చిన్నపాటి సమస్యలతో పోలి ఉండటంతో చాలామంది యువతులు ఈ సమస్యలను తేలిగ్గా కొట్టిపారేస్తుంటారని అంటున్నారు. ఎందుకు వస్తుందంటే..మహిళలు కెరీర్ని నిర్మించుకునే క్రమంలో గర్భధారణ ప్లాన్స్ వేసుకోవడం, లేదా గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి చేస్తుంటారు. అదీగాక కొందరు హర్మోన్ల మార్పులతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్లలో ఈ లూపస్ వ్యాధి మరింత సమస్యాత్మకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎక్స్ క్రోమోజోమ్లతో ముడిపడి ఉన్న రోగ నిరోధక సంబంధింత జన్యువుల కారణంగా పురుషుల కంటే మహిళలకు సహజంగానే బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు. ఈ బలమైన రోగనిరోధక వ్యవస్థ తరచుగా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడినప్పటికీ, కొన్నిసార్లు అది అతి చురుకుగా మారి పొరపాటున శరీరం సొంత కణజాలాలపై దాడి చేస్తుందట. దీన్నే లూపాస్ వ్యాధి అంటారట. ఇదొక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది చాలామటుకు ఒకే కారకం వల్ల అరుదుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. కానీ ఒక్కోసారి ఈ క్రింది వాటి కలయిక వల్ల మరింత వేగవంతమవుతుందంటుననారు.జన్యుపరమైన సున్నితత్వంహార్మోన్ల మార్పులుసూర్యరశ్మికి గురవ్వడం(ఎండకు బహర్గతమవ్వడం)ఇన్ఫెక్షన్లుమానసిక లేదా శారీరక ఒత్తిడిలక్షణాలు:నిరంతర అలసటకీళ్ల నొప్పి లేదా వాపుజుట్టు రాలడంనోటి పూతలుస్వల్ప జ్వరంఎండ తగిలిన తర్వాత చర్మంపై దద్దుర్లుకండరాల నొప్పిమెదడు మసకబారడంకారణం తెలియని బలహీనతఈ లక్షణాలు ఒత్తిడి, రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత లేదా సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం వంటి వచ్చే సమస్యల్లా కనిపించడంతో చాలామంది మహిళలు తేలికగా తీసుకుంటారట. దాంతో తక్షణ వైద్య సహాయం ఆలస్యమవుతోందని చెబుతున్నారు.లూపస్ కేవలం హార్మోన్ల వల్ల వచ్చే వ్యాధి కాదు, కానీ ఈస్ట్రోజెన్ రోగనిరోధక ప్రతిస్పందనలను పెంచుతుంది. జన్యుపరంగా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నవారిలో, ఆ అదనపు రోగనిరోధక ప్రేరణ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులులూపస్ని ప్రభావితం చేసేవి..ఋతుచక్రాలు, గర్భధారణ, ప్రసవానంతర కోలుకోవడం, గర్భనిరోధకం సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు కొంతమంది రోగులలో లూపస్ తీవ్రతను ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో లూపస్పై కేర్ తీసుకుంటారట వైద్యులు. లేకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. సరైన పర్యవేక్షణ మరియు చికిత్సతో, లూపస్ ఉన్న చాలా మంది మహిళలు ఆరోగ్యకరమైన గర్భధారణను కలిగి ఉండగలరని నిపుణులు నొక్కి చెబుతున్నారు.సకాలంలో చికిత్స తీసుకోకపోతే..కీళ్ళుచర్మంమూత్రపిండాలుఊపిరితిత్తులుగుండెనాడీ వ్యవస్థ తదితరాలను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలసట, జుట్టురాలడం, కీళ్లనొప్పులు, జ్వరం వంటివి తరుచుగా వస్తే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముందుగానే ఈ సమస్యను గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి అదుపులో ఉంటుంది లేదా నివారించొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.మరిన్ని వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!) -
67 కిలోల నుంచి 53 కిలోలకు..! కానీ జంక్ఫుడ్కు నో చెప్పక్కర్లేదట..
బరువు తగ్గడం అనేది ఆరోగ్య స్పృహతో కూడిన ట్రెండ్గా మారింది. యువత కాదు పెద్దలు సైతం స్మార్ట్, హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చేతనైనంతలో కొద్దిపాటి వ్యాయామాలు, మితంగా భోజనం, చక్కటి జీవనశైలిని పాటించేందుకు మక్కువ చూపిస్తున్నారు. అంతేగాదు బరువు తగ్గడం భారం కాదు అనారోగ్యం బారిన నుంచే కాపాడుకునే రక్షణచర్యగా భావిస్తున్నారు. ఆ క్రమంలో చాలామంది మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ చేరిపోయారు. ఆమె కేవలం 12 కిలోలను బరువుని చాలా తేలికపాటి అలవాట్లతో తగ్గించుకుని శెభాష్ అనిపించుకున్నారు. కష్టంగా కాకుండా చిన్నచిన్నగా సాధ్యమై వాటినే ఎంచుకుని, పాటిస్తే బరువు తగ్గడం చాలా ఈజీ అని అంటున్నారామె. మరి అవేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా.!.తక్షణ పరిష్కారాలపై ఆధారపడకుండా, సమతుల్య దినచర్యలు, ఆలోచనాత్మకమైన ఆహారం, శక్తి శిక్షణ, తగినంత నీరు తాగడం, నాణ్యమైన నిద్రపై దృష్టి పెట్టడమే బరువు తగ్గడానికి ఆదర్శవంతమైన మార్గం. అంతేగాదు కొలెస్ట్రాల్ని రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే సాధారణ అలవాట్లతోనే తగ్గించుకోవచ్చని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సృష్టి కృష్ణన్. దీర్ఘకాలం హాయిగా చేయగలిగే చిన్నపాటి జీవనశైలి మార్పులతో 14 కిలోలకు పైగా తగ్గారామె.జంక్ ఫుడ్కు నో చెప్పకండి..వాట్ ఇదేంటి అనకండి. మనకు తినాలనిపించే వాటిని వద్దని కంట్రోల్ చేయడం వల్ల తెలియకుండానే అతిగా లాగించేస్తాం అంటోంది. అదే దాన్నే అణిచివేసే బదులు..జంక్ ఫుడ్ తినాలనిపించిన వెంటనే ఫటాఫట్ తినేయండి. ఆ తర్వాత అందుకు తగ్గట్టు వర్కౌట్లు, లేదా కేలరీ తగ్గించుకునే ప్రయత్నం చేయండని అంటోందామె.ప్రతిరోజు నడక..ప్రతిరోజూ నడవడం వల్ల కొవ్వు కరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పదివేల అడుగులు నడవాలని పెద్ద లక్ష్యాలు ఏమి అవసరం లేదు. కొన్ని రోజులు రెండు వేల అడుగులకుపైగా నడచేందుకు ప్రయత్నించండి చాలు. అది కూడా ఇష్టపూర్వకంగా చేయండని అంటోంది.రాత్రిపూట కార్బోహైడ్రేట్లు వద్దు..రాత్రి భోజనంలో అన్నం, రోటీకి బదులుగా గుడ్లు, పనీర్, పప్పు, చికెన్ తినమని ఈ ఇన్ఫ్లుయెన్సర్ సిఫార్సు చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఉదయం చాలా హాయిగా మేల్కోగలుగుతారు.నెమ్మదిగా తినండినెమ్మదిగా తినడం వల్ల మీ ప్రేగులు కడుపు నిండిన సంకేతాలను మెదడుకి అందిస్తాయి. తినడానికి 20-30 నిమిషాలు తీసుకోవడం ద్వారా జీవక్రియను సహజంగా మెరుగుపరుచుకోవచ్చు, ఆకలిని తగ్గించుకోవచ్చు. భోజనానికి ముందు నీళ్లు తాగండి..భోజనానికి సుమారు 30 నిమిషాల ముందు నీళ్ళు తాగడం వల్ల, కడుపు నిండిన భావన పెరిగి, కేలరీల వినియోగం తగ్గి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ అలవాటు కడుపు నిండిన అనుభూతిని కలిగించి అతిగా తినడాన్ని నివారిస్తుంది.తరుచుగా బరువు చెక్చేయొద్దు..ప్రతిరోజూ బరువు చూసుకోవడం అనేది మిమ్మల్ని మరింత నిరాశపరుస్తుంటుంది. వారానికి ఒకసార లేదా అప్పుడప్పుడు చేస్తే మనసు ఉల్లాసంగా, హెల్దీగా ఉంటుంది.వేళకు నిద్రపోవడం..సరిగ్గా నిద్రపోకపోతే తినాలనే కోరికలు ఎక్కువ అవుతాయి. ఏడు గంటల నిద్ర అన్నింటిని మార్చేస్తుందని అంటోంది.చీట్ మీల్ గురించి భయపడొద్దు..కొందరు తినాలనిపించినవి తొనేసి మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం అనే మైండ్సెట్తో ఉంటుంటారు. ముందు ఆ ధోరణిని తీసేయండి. తప్పులేదు. ఒక్కోసారి జిహ్వచాపల్యం నియంత్రించడం కష్టమవ్వచ్చు. అందుకని నచ్చినవి హాయిగా తినండి. కానీ తినే ముదు కాస్త మితం అనుకోండి, ఒక వేళ్ల ఫుల్గా లాగించినా..అందుకు తగ్గట్టుగా ఆరోజు కేలరీలు తగ్గించే పనిపట్టండని అంటోందామె. ఈ చక్కటి జీవనశైలి మార్పులు ఆరోగ్య లక్ష్యాలను అంచలంచెలుగా అందుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతాయని అంటోంది. View this post on Instagram A post shared by Srishti Krishnan (@srishhhsaidwhat) గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!
చాలామంది కొన్ని రకాల ఆహారాలు తిన్న వెంటనే కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో, దేనికి సంకేతమో ఆలోచించారా అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే సులభంగా ఈ సమస్యను అధిగమించొచ్చని చెబుతున్నారు. మరి అదెలాగో ఆయన మాటల్లోనే చూద్దామా..!.ఆహారం సరిగ్గా విచ్ఛిన్నం కాకుండా ప్రేగులలోని బ్యాక్టీరియా దానిని పులియబెట్టినప్పుడు కడుపు ఉబ్బరం వస్తుంది. ఈ బ్యాక్టీరియా చర్య వలనే గ్యాస్ ఏర్పడుతుంది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు. మనం ఏం తీసుకున్నాం, అది ఎంత భాగా జీర్ణమైంది అన్న దానిపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని కూడా నొక్కి చెప్పారు. ఉదాహరణకు బీన్స్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటే, పప్పుధాన్యాలలో ఉండే సంక్లిష్ట చక్కెరలను విచ్ఛిన్నం చేయడానికి మీ శరీరంలో తగినంత ఆల్ఫా-గాలక్టోసిడేస్ ఎంజైమ్ లేదని అర్థం. అదే పాల ఉత్పత్తులు తిన్న తర్వాత ఇలా ఉంటే..లాక్టేస్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉందని అర్థం. అలా కాకుండా గోధుమలు తిన్న తర్వాత ఐతే గ్లూటెన్ జీర్ణక్రియకు ఆటంకం కలిగించేంతగా చిన్నప్రేగుల్లో వాపు ఉందని అర్థం. ఇలా ఆయా ఆహారాలు తిన్న వెంటనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందంటే..శరీరంలో ప్రోటీన్ను సరిగ్గా విచ్ఛిన్నం చేయడానికి కడుపులోని ఆమ్లం చాలా తక్కువగా ఉందని అర్థం. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు అల్లం తీసుకుంటే అది జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహించి, కడుపు త్వరగా ఖాళీ అవ్వడానికి సహాయపడుతుందన్నారు. భోజనానికి ముందు తీసుకునే ఆపిల్ సైడర్ వెనిగర్, కడుపులో తగినంత ఆమ్ల ఉత్పత్తి లేని వారిలో ఆమ్ల స్థాయిలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. పప్పుధాన్యాలను బాగా నానబెట్టి, ఉడికించడం వల్ల, శరీరంలోకి ప్రవేశించక ముందే పులియబెట్టడానికి కారణమయ్యే సంక్లిష్ట చక్కెరలు తగ్గుతాయని అంటున్నారుఅంతేగాదు కడుపు ఉబ్బరం అనేది ఒక సందేశం, ఒక అనారోగ్య పరిస్థితి కాదు. దానిని సరిగ్గా గ్రహిస్తే, జీర్ణక్రియలో సరిగ్గా ఏమి లోపిస్తుందో అది మీకు తెలియజేస్తుంది.డా. ఆదర్శ గౌడప్రధాన కార్యనిర్వహణాధికారి (సీఈఓ)అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)ఐసిఎఆర్–జాతీయ పాడి పరిశోధనా సంస్థ, బెంగళూరు -
అమ్మ హెల్త్ అందరికీ హెల్త్!
అమ్మదనం గురించీ, అమ్మదనపు మంచితనం గురించి కవులూ, రచయితలూ ఎంతో చెప్పారు. అంతకంటే అపురూపంగా అద్భుతంగా చెప్పడమిక దాదాపు అసాధ్యం. కానీ వైద్యపరంగా మాత్రం ఎంతోకొంత చెప్పవచ్చు. అందుకే మాతృ దినోత్సవపు ఈ అమృత సమయాన వివిధ వయసుల్లోని మాతృమూర్తుల కోసం వాళ్ల పిల్లలూ, తల్లిగా మారిన, మారబోతున్న తమ భార్యల కోసం భర్తలూ... కాబోయే మాతృమూర్తుల తల్లిదండ్రులూ... ఇలా ఎవరి పరిధుల్లో వారు నెరవేర్చగలిగే కొన్ని బాధ్యతలూ, సూచనలు, చేయించాల్సిన వైద్యపరీక్షలూ... చికిత్సలూ... ఇవిగో... ఇవి మీకోసం.ఇక్కడ పేర్కొన్నవి మాత్రమే కాకుండా... మరికొన్ని స్పెషలైజ్డ్ పరీక్షలూ ఆయా మహిళల అవసరాల కోసం చేయించాల్సి రావచ్చు. కొన్ని ప్రామాణికమైన బేసిక్ పరీక్షలు...సీబీపీ రక్త పరీక్ష : మనదేశపు మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. దాదాపు 65 శాతం నుంచి 70 శాతం మహిళల్లో అనీమియా సమస్య ఉంటుందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఓ ఆడపిల్ల యువతిగా మారే క్రమంలో మొదలైన రుతుస్రావంలో నెలనెలా రక్తస్రావం జరుగుతుంటుంది. అందుకే మహిళల్లో ఇది సాధారణమైన సమస్య. యువతి ఆరోగ్యం బాగుండాలన్నా, భవిష్యత్తులో తల్లికాబోయే ముందరైనా రక్తహీనత లేకుండా తగినంత హీమోగ్లోబిన్ ఉండటం అవసరం. అందుకే తల్లిదండ్రులు యుక్తవయసులోని తమ పిల్లల్లోని హీమోగ్లోబిన్తో పాటు రక్తంలోని మిగతా అంశాలైన తెల్లరక్తకణాలూ... అందులోని బేసోఫిల్స్, ఈసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ వంటి వాటితో పాటు రక్తం గడ్డకట్టించే ప్లేట్లెట్స్ వంటి వివరాలు తెలుసుకుని అవి నార్మల్గా ఉన్నాయా లేదంటే అందుకు తగినట్లుగా సిరప్, టాబ్లెట్లు వాడటానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) అనే రక్తపరీక్ష మేలు చేస్తుంది. మూత్ర పరీక్ష : పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్లను తెలుసుకునేందుకు మూత్ర పరీక్ష ఉపయోగపడుతుంది. కిడ్నీ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, కాలేయ సమస్యలు, డయాబెటిస్ తీవ్రత వంటివి తెలుసుకునేందుకు కూడా మూత్ర పరీక్ష ఉపయోగపడుతుంది. బోన్డెన్సిటీ పరీక్ష : యాభై ఏళ్లు వయసు పైబడ్డ మహిళ ఎముకల్లో క్రమంగా క్యాల్షియమ్ తగ్గుతూపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనే ఆరోగ్య సమస్య వస్తుంది. ముఖ్యంగా మెనో΄ాజ్ దాటాక ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుతూపోతుండటంతో ఇంచుమించు మహిళలందరిలోనూ కనిపించే సమస్య ఇది. 60 ఏళ్లు దాటిన 50% మంది మహిళల్లో 80 ఏళ్లు దాటినవారిలో 90 శాతం మందిలో కనిపిస్తుంది. బోన్డెన్సిటో మీటర్ (డెక్సా స్కాన్) ద్వారా బోన్డెన్సిటీనీ తద్వారా ఆస్టియోపోరోసిస్ను కనుక్కోవడం చాలా సులభం. దీని నివారణకు వ్యాయామం, ఆహారంలో క్యాల్షియం చాలా ముఖ్యం. పాప్ స్మియర్... మధ్యవయసుకు వస్తున్న వయసులోని మహిళలకు అంటే 30 నుంచి 35 ఏళ్ల వయసున్న వారిలో సర్వికల్ క్యాన్సర్ను తెలుసుకోడానికి ఉపకరించే పరీక్ష. ఈ సర్వైకల్ క్యాన్సర్కు ప్రీ–క్యాన్సర్ దశ సుదీర్ఘకాలం ఉంటుంది. పదేళ్ల ముందుగా కూడా దీన్ని కనుగొనేందుకు అవకాశం ఉంది. ఏ మాత్రం నొప్పి లేకుండా చేసే పరీక్ష ఇది. మామోగ్రామ్ : మహిళల్లో అత్యధికంగా కనిపించే బ్రెస్ట్క్యాన్సర్ను తెలుసుకునేందుకు చేయించే పరీక్ష ఇది. తొలిదశలోనే కనుగొంటే రొమ్మును తొలగించనవసరం లేకుండానే (మాసెక్టమీ చేయకుండానే) చికిత్స అందించవచ్చు. నలభై ఏళ్ల తర్వాత చేయించాల్సిన ఈ పరీక్షను రొమ్ములో నొప్పి, సలపరం ఉంటే తప్పక చేయించాలి. టీ3, టీ4, టీఎస్హెచ్ పరీక్ష: థైరాయిడ్ సమస్యను కనుగొనడం కోసం చేసే ఒక రకం రక్తపరీక్ష ఇది. థైరాయిడ్ గ్రంథి పనితీరు అంతగా లేని హైపోథైరాయిడిజమ్నూ, ఆ గ్రంథి అత్యంత చురుగ్గా పనిచేస్తున్న హైపర్థైరాయిడిమ్ అనే సమస్యలను తెలుసుకోడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సంబంధిత సమస్యలను తెలుసుకోవడం కోసం టీ3, టీ4, టీఎస్హెచ్ పరీక్ష చాలా ముఖ్యం.క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్: సర్విక్స్ క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే పాప్ స్మియర్, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే మామోగ్రామ్ పరీక్షలు కాకుండా... ఇతర రకాల క్యాన్సర్ల కోసం మరికొన్ని రక్తపరీక్షలూ అవసరం. ఉదాహరణకు సెర్విక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తెలుసుకునే పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) పరీక్షలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును తెలుసుకునే లో–డోస్ హెలికల్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ పరీక్షలు; పెద్దపేగు, మలద్వారం వద్ద క్యాన్సర్ రిస్క్ తెలుసుకోడానికి సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ (ఎఫ్ఓబీటీ) వంటివి చేయించవచ్చు. షుగర్ పరీక్ష : చక్కెర వ్యాధిని గుర్తించడానికి పరగడుపున ఫాస్టింగ్ షుగర్ టెస్ట్, ఏదైనా తిన్న గంటన్నర తర్వాత పోస్ట్ ఫుడ్ షుగర్ టెస్ట్ వంటివి మాత్రమే కాకుండా... డాక్టర్ సూచనల మేరకు గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (జీటీటీ), మూడు నెలల సగటు షుగర్ తెలుసుకోడానికి హెచ్బీఏ1సీ వంటి పరీక్షలు అవసరం. మధ్య వయసు దాటాక ఈ చక్కెర పరీక్షలు చేయించడం చాలా అవసరం. ఇవే కాకుండా బీపీ రీడింగ్ మొదలుకొని... ఆయా మహిళల ఆరోగ్య అవసరాల మేరకు కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయించడం మంచిది. ఇందుకోసం ఆ తల్లుల బిడ్డలూ, భర్తలూ, పేరెంట్స్ ఇలా అందరూ పూనుకోవడం వల్ల మహిళ ఆరోగ్యం బాగుంటుంది. దాంతో సమాజంలో అందరి ఆరోగ్యమూ బాగుంటుంది.డాక్టర్ లక్ష్మీదేవి అప్పసాని,సీనియర్ కన్సల్టెంట్ అబ్స్ట్రెటీషియన్ – గైనకాలజిస్ట్డాక్టర్ చల్మేడ నివేదిత, సీనియర్ ఫిజీషియన్ నిర్వహణ: యాసీన్(చదవండి: పీఛే చల్! ఇలా నడిచి చూశారా?) -
పీఛే చల్! ఇలా నడిచి చూశారా?
వాకింగ్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. కానీ అదే వాకింగ్ను వెనక్కి చేస్తే డబుల్ ఆరోగ్యం లభిస్తుందంటే నమ్మగలరా? నిజమే! ఫిట్నెస్ ప్రపంచంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ – ‘రెట్రో వాకింగ్’ బాగా పాపులర్ అవుతోంది. నిపుణుల ప్రకారం, ఇది సాధారణ వాకింగ్ కంటే మరింత ప్రయోజనాలు ఇచ్చే వ్యాయామం. ఇలా వెనక్కి నడిస్తే మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ముందుకు నడిచేటప్పుడు ఎక్కువగా పని చేయని కాళ్ల కండరాలు కూడా వెనక్కి నడిచేటప్పుడు యాక్షన్లోకి దిగుతాయి. సాధారణ వేగంతో నడిచినా దాదాపు ‘నలభై శాతం ఎక్కువ క్యాలరీలు’ కరిగిపోతాయి. అంటే తక్కువ టైమ్లో ఎక్కువ పని చేసినట్టే! ఇంకా మెదడు సంగతి చెప్పాలంటే, వెనక్కి నడవడం కొత్త పని కాబట్టి అది ఫుల్ అలర్ట్లోకి వెళ్లి బ్యాలెన్స్, ఫోకస్, జ్ఞాపకశక్తి అన్నింటినీ మరింత పదును పెడుతుంది. కొందరికి వెన్నునొప్పి, కాళ్లు బిగపట్టడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఒక విషయం మాత్రం తప్పక గుర్తుంచుకోండి. మొదట రెండు నుంచి మూడు నిమిషాలు నెమ్మదిగా, ఖాళీ ప్రదేశంలో మాత్రమే ప్రయత్నించండి. లేదంటే వ్యాయామం కంటే ముందు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది! ∙ -
సివిల్స్లో ఆరు సార్లు ఫెయిల్.. ఏడోసారి విజయం!
‘నాన్న హెడ్ కానిస్టేబుల్, అమ్మ గృహిణి. మేము ఇద్దరం కూతుళ్లం. నాన్న ఉద్యోగానికి వెళితే.. మాకు అమ్మే అన్నీ చూసుకునేది. అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. నన్ను ఉన్నతాధికారిగా చూడాలనే అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఐఎఫ్ఎస్ సాధించగలిగాను’ అని సూర్యాపేటకు చెందిన చల్లా యామిని చెప్పారు. యూపీఎస్సీ వెల్లడించిన ఐఎఫ్ఎస్ పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో 119వ ర్యాంకు సాధించిన యామిని శనివారం ‘సాక్షి’ తో మాట్లాడారు.సూర్యాపేటటౌన్ : కూతుళ్లు అనే భావన లేకుండా మమ్మల్ని అమ్మానాన్న బాగా పెంచారు. తనను ఉన్నతాధికారిగా ఉండాలని అమ్మానాన్న ప్రోత్సాహించారు. మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సివిల్స్లో రాణించాలనే లక్ష్యంతో ఆరు సార్లు పరీక్ష రాసి విఫలమయ్యాను. పట్టువదలకుండా సివిల్స్తో పాటు యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ పరీక్ష రాసి 119వ ర్యాంకు సాధించాను. నేను పెద్ద కూతురిని. నాకు ఒక చెల్లె నందిని ఉంది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తోంది. నాన్న తన పైస్థాయి అధికారులను చూపిస్తూ ఇలా ఉన్నతాధికారి కావాలని చెబుతుండేవారు. ఉన్నతాధికారిగా ఉన్నప్పుడే ప్రజలకు సేవ చేయగలమని, అలాంటి ఉద్యోగం సాధించాలని చెబుతుండటంతో.. ఉన్నతాధికారిగా ఉద్యోగం సాధించాలనే తపన, కృషితో చదివాను. ఉద్యోగం చేస్తూనే..సూర్యాపేటలో పదో తరగతి వరకు, హైదరాబాద్లో ఇంటర్, జేఎన్టీయూలో బీటెక్ చదివాను. బీటెక్ తర్వాత ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉద్యోగాల వేటలో పడి 2022లో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న డిఫెన్స్ అకౌంట్స్ ఆడిటర్గా ఉద్యోగం వచ్చింది. సివిల్స్లో విఫలమై...2020 నుంచి సివిల్స్ పరీక్ష రాస్తున్నా. ఇప్పటి వరకు మొత్తం ఆరు సార్లు సివిల్స్ రాసి విఫలమయ్యాను. 2021లో ఇంటర్వ్యూ అయిపోయాక ఫైనల్ లిస్టులో 40 మార్కుల తేడాతో ఉద్యోగం రాలేదు. అలాగే 2023లో 20 మార్కుల తేడాతో ఉద్యోగం రాలేదు. అయితే సివిల్స్తో పాటు ‘ఆల్ ఇండియా ఫారెస్ట్ సర్వీస్’ పరీక్ష రాయాలని స్నేహితుల ద్వారా తెలుసుకొని 2025 సంవత్సరంలో సివిల్స్తో పాటు యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ పరీక్ష రాశాను. అయితే సివిల్స్లో ర్యాంకు రాలేదు. ఐఎఫ్ఎస్లో ఆలిండియాలో 119వ ర్యాంకు సాధించగలిగా. కేవలం రెండు నెలలే ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యాను. ఉద్యోగం చేసూ్తనే ఎలాంటి కోచింగ్ లేకుండా పరీక్షకు సన్నద్ధమయ్యాను. చాలా ఆనందంగా ఉంది యామిని చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్ ఉండేది. ఉన్నత స్థాయిలో పెద్ద అధికారి కావాలని నేను చెబుతుండేవాడిని. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నతాధికారిగా ఉద్యోగం సాధించగలిగింది. ఈ ఉద్యోగం రావడం పట్ల చాలా ఆనందంగా ఉంది. నా ఆశయాన్ని నెరవేర్చింది. –చల్లా యాదగిరి, యామిని తండ్రికష్టపడితేనే ఫలితం జీవితంలో ఫెయిల్యూర్ వస్తేనే.. సక్సెస్కు దారిపడుతుంది. కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుంది. ప్రస్తుత యువత కూడా ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితం అయిపోయిందనే అపోహతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రయత్నిస్తే కచ్చితంగా మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. -
నేటి అమ్మ మేటి యోధ
వయసు ముప్పై వచ్చేసరికి ఆమె భార్య, తల్లి, కోడలు, ఉద్యోగి. యువతిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! కుటుంబం.. సమాజం... విసిరే సవాళ్లు ఎన్ని! కాని గెలవడం ఆమెకు తెలుసు. ఆమె నేటి అమ్మ. ఈ అమ్మకు పద్మవ్యూహాలు ఛేదించడం తెలుసు.నాకు నేను మిగలాలిపెళ్లి అయ్యింది. పిల్లాడు పుట్టాడు. ఉద్యోగం ఉంది. సంతోషమే. కానీ ‘నేను’ ఏమయ్యాను అనే ప్రశ్న ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అద్దంలో చూసుకుంటే కనిపించేది ఒకరి భార్య, ఒకరి తల్లి, ఒక కంపెనీ ఉద్యోగి. కానీ వీళ్ల వెనుక ఉత్సాహం ఉరకలెత్తే ‘అమ్మాయి’ కూడా ఉండాలే. నాటి అమ్మాయిని కాపాడుకోవడం నేటి అమ్మకు తెలుసు. అందుకు తను ఏం చేస్తోంది? తనకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకుంటోంది. తనకు ఆసక్తి ఉన్న రాజకీయ, సామాజిక అంశాలు తెలుసుకుంటోంది. వాలెంటరీ గ్రూప్తో పని చేస్తోంది. నెలకి ఒక్కసారైనా ఫ్రెండ్స్ను కలుస్తుంది. పూర్వపు బృందానికి లంకెలా పని చేస్తోంది. నేటి అమ్మ ఏకకాలంలో అమ్మ, వ్యక్తి కూడా.80శాతం తృప్తి చాలుఆఫీసులో ప్రమోషన్ కోసం మీటింగ్ నడుస్తోంది. ఇంట్లో పిల్లాడికి జ్వరం వచ్చింది. అటు వైపు చూడాలా.. ఇటు వైపు చూడాలా? 30 ఏళ్ల అమ్మ రెండుగా చీలిపోతుంది. ఉద్యోగం వదిలేస్తే ఆర్థిక స్వాతంత్య్రం పోతుంది. పిల్లాడిని వదిలేస్తే మనసు ముల్లు గుచ్చుకుంటుంది. అందుకే రెండూ బేలెన్స్ చేసుకుంటోంది. ‘గిల్ట్’ని పక్కన పెట్టడం నేర్చుకుంటోంది. ఆఫీసులో 100 శాతం, ఇంట్లో 100 శాతం ఇవ్వలేనని ఒప్పుకుని, రెండు చోట్లా 80 శాతం నిజాయితీగా ఇస్తోంది. ‘సూపర్ ఉమన్’ కాకపోయినా ‘తృప్తి ఉన్న అమ్మ’ అవుతోంది.నా శరీరం నా కవచండెలివరీ తర్వాత పొట్ట మీద గీతలు, జుట్టు రాలడం, నడుం నొప్పి, నిద్రలేమి. 20 ఏళ్ల వయసులోని చురుకుదనం 30కి వచ్చేసరికి మాయం. సోషల్ మీడియాలో ‘ఫిట్ మామ్’లను చూసి తనను తాను తిట్టుకోవాలా? నో. నేటి అమ్మ అలా చేయదు. అద్దంలో కనిపించే గీతల్ని ‘యుద్ధ గాయాలు’గా చూస్తోంది. వాటిని అలా ఉండనిచ్చి పిల్లాడిని స్కూల్లో దింపి వచ్చేటప్పుడు 30 నిమిషాలు నడుస్తోంది. యూట్యూబ్ చూసి 10 నిమిషాల యోగా చేస్తోంది. ‘సైజ్ జీరో’ కాదు, ‘జీరో టెన్షన్ హెల్త్’ తన టార్గెట్ చేసుకుంది. శరీరాన్ని ద్వేషించడం మానేసి, అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టింది. నేటి అమ్మ... జీవన ప్రయాణాన్ని గౌరవిస్తోంది.నేను ముద్దాయిని కానుపిల్లాడు మార్కులు తక్కువ తెచ్చుకున్నాడా... ‘అమ్మ సరిగా చూడట్లేదు’. పిల్లాడు అల్లరి చేశాడా... ‘తల్లి ఉద్యోగం చేస్తే పిల్లలు ఇలాగే ఉంటారు’. బయటి వాళ్ల మాటలు సరే... సొంత వాళ్లే ‘మా అమ్మలా నువ్వు లేవు’ అని పోలుస్తారు. 30 ఏళ్ల అమ్మ ప్రతి రోజూ బోనులో నిలబడుతుంది. అయితే ముద్దాయిలా కాదు. నిర్దోషిగా. పరాయి మాటలకు చెవులు మూసుకోవడం నేర్చుకుంటోంది. ‘నా పిల్లాడికి ఏం కావాలో నాకు తెలుసు’ అనే నమ్మకాన్ని గట్టిగా పట్టుకుంటోంది. ఫోన్ పక్కన పెట్టి పిల్లాడితో రోజూ 30 నిమిషాలు మాట్లాడుతోంది. మార్కులతో పాటు వాడితో అనుబంధం ముఖ్యమని చెబుతోంది. జడ్జిమెంట్ ఇచ్చేవాళ్లకు తన పిల్లాడి నవ్వే సమాధానం అని ప్రూవ్ చేస్తోంది.నా రేపటి చూపుపిల్లాడి స్కూల్ ఫీజు, ఇంటి ఇ.ఎం.ఐ, అత్తమామల మందులు... సంపాదనలో సగం కళ్ల ముందే కరిగిపోతుంది. ఫ్రెండ్ మంచి చీర కొనుక్కుంటే ‘నేను ఎప్పుడు కొనుక్కోవాలి’ అని 30 ఏళ్ల అమ్మ మనసు చిన్నబోతుంది. తన కలల్ని ‘తర్వాత’ అనే అరలో దాచేస్తుంది. అయితే ఎన్నాళ్లు? అందుకే అమ్మ మారింది. ‘తర్వాత’ని ‘ఇప్పుడే’గా మార్చుకుంటోంది. నెలకి కొన్ని డబ్బులైనా తన పేరు మీద సేవ్ చేస్తోంది. ఫ్రీలాన్స్ పని చేస్తోంది. ఆన్లైన్లో చీరలు అమ్ముతోంది. భర్తతో బడ్జెట్ డిస్కస్ చేస్తోంది. ‘కుటుంబం కోసం’ అనే మాటతో పాటు ‘నా కోసం’ అనే ‘అర’ను జత చేసుకుంటోంది.నా టాలెంట్ నా కల పెళ్లికి ముందు ఆమెకు ఒక కల ఉండేది. డ్యాన్సర్ అవ్వాలి, లేదా బిజినెస్ పెట్టాలి, లేదా ఒక్కతే లడాఖ్ వెళ్లాలి. పిల్లాడు పుట్టాక ఆ కలల ఫైల్ మూసేసింది. ‘ఇప్పుడు కుదరదులే’ అని తనకు తానే సర్ది చెప్పుకుంది. మరి ఇప్పుడు? తన కలలను తవ్వి బయటకు తీస్తోంది. ఉద్యోగం, పిల్లాడితో సమయం... పోగా మిగిలిన కాసేపు తన కల కోసం కేటాయిస్తోంది. ఆన్ లైన్ క్లాస్లో డ్యాన్స్ నేర్చుకుంటోంది. కథలు రాస్తోంది. ఇంటి నుంచే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. భర్తతో ‘నాకూ ఒక లడాఖ్ కావాలి’ అని ధైర్యంగా అడుగగలుగుతోంది. ‘అమ్మ’ అయిన తర్వాత కలలు చావవు, విరామంతో మేల్కొంటాయి అంతే అని ప్రపంచానికి చెబుతోంది. మరి నేటి అమ్మ కదా. అమ్మా... మము కన్నందుకు పాదాభివందనందేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడట. తప్పు. అమ్మతో సాటి రాగల దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు కూడా అంగీకరించడు. అందుకే కవి అంటాడు... ‘అమ్మ లేకుంటే జననం లేదు, అమ్మ లేకుండా గమనం లేదు’. అవును. అమ్మ లేకుండా చేసేది ఏమి గమనం’ అమ్మ లేకుండా సాగేది ఏమి గమ్యం? అమ్మా... ఎలా సాకావు మమ్మల్ని. ‘అకలి’ అని నువ్వు ఏనాడూ అనలేదు. మా కడుపు నిండితే నీ కడుపు నిండిందనుకున్నావు. ‘స్వార్థం’ అనే భావన ఏనాడూ చూపలేదు. నీకున్నదంతా మాకే పంచి పెట్టావు. అలసిన సంగతి తెలియనిచ్చావా? తెచ్చిపెట్టుకున్న హుషారుతో మమ్మల్ని విజయాల వైపు పరుగులెత్తించావు.మేము పాసైతే నువ్వు పాసయ్యావనుకుని, మేము ఇంటర్వ్యూకెళితే నువ్వు ఉపవాసం ఉండి, మేము గెలిస్తే నీకు ప్రైజ్ వచ్చిందనుకుని మురిసిపోయే అమాయకురాలివి. ఎంత క్షమ నీకు. ఎంత ఆర్తి. ఎంత ఆర్ద్రత నీ పిల్లల కోసం. నీ ప్రతి ప్రార్థన మా కోసమే కదా. ‘మదర్స్ డే’ అని చెప్పి స్టేటస్ పెట్టి, నీతో సెల్ఫీ దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేస్తే బాధ్యత తీరిపోతుందనుకుంటున్నాం. నువ్వనే ఒక మహాకావ్యంలో మేమొక అధ్యాయమని తెలుసుకోవాలి. తెలుసుకుంటాం. కృతజ్ఞతాశ్రువులతో నీ చేతులను ముద్దాడతాం. ‘అమ్మా.. మము కన్నందుకు పాదాభివందనం’ అని నీ పాదాలు అంటి ఆశీర్వాదం తీసుకుంటాం.అమ్మా.. నీకు శతకోటి ప్రణామాలు. -
అమ్మ ప్రేమకో నూలుపోగు
చిన్నప్పుడు అమ్మ మన చేయి పట్టుకుని బజారుకు తీసుకెళ్లి ఎన్నో కొని పెట్టి ఉంటుంది. మనం అమ్మకు ఏదైనా కొని పెట్టి ఎంతకాలం అయ్యింది? అమ్మ ఏమీ అడగదు... పిల్లలకు ఇబ్బంది అని. కాని చిన్నప్పుడు మన ప్రతి ఇబ్బందిని వెయ్యి కళ్లతో చూసి దూరం చేసి ఉంటుంది. మే 10 మదర్స్ డే. ఇక్కడున్న బహుమతులన్నీ మీరు అమ్మకు ఇవ్వొచ్చు. అన్నీ కలిపినా పదీ పదిహేను వేలు మించవు. అమ్మ ప్రేమ ముందు ఆ విలువ దిగదుడుపు కదూ.1. ఎలక్ట్రికల్ హాట్ వాటర్ బ్యాగ్మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పితో అమ్మ రాత్రిళ్లు నిద్రపోదు. కాపడం పెట్టుకోవడానికి గ్యాస్ మీద నీళ్లు కాచి పొయ్యి దగ్గర నిలబడే ఓపిక ఉండదు. మనందరం ఆమె ఇంటి సభ్యులమే. కాని ఎవరు ఏ పనిలో ఉన్నారో అని అమ్మ డిస్ట్రబ్ చేయదు. మౌనంగా నొప్పులు భరిస్తుంది. ఆమెకు ఈ హాట్ వాటర్ బ్యాగ్ కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది. ఈ బ్యాగ్ను అయిదు నిమిషాలు ఛార్జ్ చేస్తే ఆరు గంటలు వేడిగా ఉంటుంది. రాత్రి పక్కలో పెట్టుకుంటే వెన్ను నొప్పి మాయం, హాయిగా నిద్ర. ‘వీడు నా నొప్పిని గుర్తుపెట్టుకున్నాడు’ అమ్మ తృప్తి పడితే ఎంత సంతోషం! వెల: రూ.300 నుంచి.2. నాన్–స్లిప్ స్లిప్పర్స్ + బాత్రూమ్ హ్యాండిల్ బార్‘అమ్మా జాగ్రత్త‘ అని ఫోన్ లో చెప్తాం కానీ బాత్రూమ్లో జారి పడితే లేపడానికి ఉండం. ఈ స్లిప్పర్స్ వేసుకుంటే తడి నేల మీద కూడా జారదు. గోడకి ఒక హ్యాండిల్ బార్ బిగిస్తే పట్టుకుని లేవొచ్చు, అమ్మ కోసం అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అమ్మ నిద్ర పోయే ముందు ఆమె పాదాలు నొక్కుతూ కూర్చునే టైమ్ ఉండటం లేదు. కనీసం ఈ స్లిప్పర్స్తో అయినా కొంత పరిహారం చేసుకోవచ్చు. వెల: రూ.800 నుంచి3. బిగ్ బటన్ ఫోన్ విత్ ఎస్.ఓ.ఎస్స్మార్ట్ఫోన్ ఇస్తే అమ్మకి కన్ ఫ్యూజన్. లాక్ తియ్యడం, వాట్సాప్ చేయడం... ఒక్కోసారి రాంగ్ నంబర్కి కాల్ వెళ్తుంది. అదే ఈ ఫోన్ లో అయితే నంబర్లు పెద్దగా కనిపిస్తాయి. పైగా మూడు ఫోటో బటన్లు ఉంటాయి. మన ఫోటో నొక్కితే డైరెక్ట్గా మనకే కాల్ వస్తుంది. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే అయిదు నంబర్లకి కాల్, మెసేజ్ వెళ్తుంది. అమ్మకు మనం గుర్తు పెట్టుకుని ఫోన్ చేయకపోయినా అమ్మ మనల్ని గుర్తు పెట్టుకొని ఫోన్ చేయడానికి ఇదే మంచి కానుక. వెల: 1200 నుంచి.4. రీడింగ్ గ్లాసెస్అమ్మకు కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఆమెకు కొత్త అద్దాలు మార్చి ఎంత కాలం అయ్యింది? మంచి రీడింగ్ గ్లాసులు కొని పెడితే ఆమె చదువుకునే గీత, రామాయణం స్పష్టంగా కనపడతాయి. న్యూస్పేపర్ హాయిగా చదువుకోవచ్చు. టీవీ సీరియల్ కంటే ఈ పుస్తకం మనశ్శాంతి ఇస్తుంది, టైమ్పాస్ అవుతుంది. చిన్నప్పుడు ఒళ్లో కూర్చోబెట్టుకుని నీతి కథలు, రాముడి కథ చెప్పి నిద్రపుచ్చింది. ఇవాళ మనం ఇచ్చిన కళ్లజోడు ఆవిడకి కథల పుస్తకాలు చదివేందుకు ఉపయోగపడి నిద్ర పుచ్చుతాయి. రూ. 500 నుంచి.5. వాకింగ్ స్టిక్ విత్ ఎల్.ఇ.డి. లైట్ ప్లస్ సీట్ఒక వయసుకు వచ్చాక గుడికి వెళ్లాలన్నా, మార్కెట్కి వెళ్లాలన్నా ‘తోడు ఎవరున్నారు‘ అనే భయం అమ్మకు. ఈ స్టిక్ పట్టుకుంటే ఆసరాగా ఉంటుంది. అలిసిపోతే మడత విప్పి సీట్ మీద కూర్చోవచ్చు. రాత్రి కరెంట్ పోయినా ఎల్ఇడి లైట్ వెలిగిస్తే దారి కనపడుతుంది, కాలు జారదు. ‘అమ్మా, నువ్వు నడవలేవులే‘ అని ఇంట్లో కూర్చోబెట్టే బదులు ‘ఈ స్టిక్ పట్టుకో, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు‘ అని ధైర్యం ఇస్తే అదే అసలైన గిఫ్ట్. రూ. 1000 నుంచి.6. మెడిసిన్ ఆర్గనైజర్ బాక్స్ విత్ అలారంషుగర్, బీపీ, కీళ్ల నొప్పులు... రోజుకి నాలుగు రకాల మాత్రలు. ‘వేసుకున్నానో లేదో‘ అని అమ్మ కన్ ఫ్యూజ్ అవుతుంది. ఒకోసారి రెండుసార్లు వేసుకుంటుంది. ఈ బాక్స్లో ఏడు రోజుల మందులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి లెక్కన విడివిడిగా సర్దొచ్చు. టైమ్కి అలారం మోగితే తిప్పలు లేకుండా వేసుకుంటుంది. మనకు జ్వరం వస్తే అర్ధరాత్రి లేచి మరీ మాత్ర వేసిన అమ్మకు ‘అమ్మా, నీ ఆరోగ్యం నాకు గుర్తుంది‘ అని చెప్పే కానుక ఇది. రూ.700 నుంచి.7. ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్‘తలనొప్పిగా ఉంది... కళ్లు తిరుగుతున్నాయి’... అని అమ్మ అంటే వెంటనే హాస్పిటల్కి పరుగెత్తక్కర్లేదు. చేతికి కట్టి బటన్ నొక్కితే 30 సెకన్లలో బి.పి, పల్స్ రీడింగ్ ఇస్తుంది. డాక్టర్కి ఫోన్ లో చెప్పొచ్చు, వైద్య సలహా తీసుకోవచ్చు. చిన్నప్పుడు మనం జారి పడితే అమ్మ గుండె వేగం పెరిగేది, ఇవాళ ఆవిడ గుండె లయ తప్పకుండా చూసే బాధ్యత మనది. ‘అమ్మా, నీ గుండె చప్పుడు నాకు వినపడుతుంది, ఇదిగో మిషన్ పెట్టి చూస్తున్నా’ అని భరోసా ఇవ్వొచ్చు. వెల: రూ.15008. మెత్తటి కాటన్ నైటీలు – 2 జతలుఅమ్మ ఇంట్లో వేసుకునే బట్టల మీద ఎప్పుడైనా దృష్టి పెట్టామా? చిరిగిపోయిన, వెలిసిపోయిన, బిగుతుగా ఉండే నైటీతోనే రాత్రిళ్లు నిద్రపోతుంది. ‘నాకు కొత్త బట్టలేందుకురా, ఉన్నవి చాల్లే‘ అంటుంది. కానీ మెత్తటి, లూజ్గా, చెమట పీల్చే కాటన్ నైటీ వేసుకుంటే ఆవిడకి హాయిగా నిద్రపడుతుంది. ముఖ్యంగా వేసవిలో. లేత రంగు, పెద్ద సైజు, ముందు జిప్ లేదా బటన్స్ ఉన్న రెండు జతల నైటీలు కొనివ్వండి. చిన్నప్పుడు స్కూల్ యూనిఫాం మాసిపోకుండా, మడత నలగకుండా అమ్మే ఇస్త్రీ చేసి వేయించేది. ఇవాళ ఆవిడ సౌకర్యంగా ఉండటానికే అమ్మ ప్రేమకో నూలుపోగు. వెల: రూ.1200 నుంచి 2 జతలకి.కె. -
జ్ఞాన శంఖం 'పూరి'ద్దాం!
‘‘కంగారూ అంటూ దానికా పేరెందుకు పెట్టారం’టే ‘‘సింపుల్.. అది కంగారుపడుతూ ఉండే జంతువు కాబట్టి’’ అనగలడు మా రాంబాబు గాడు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే...సరిగ్గా మా రాంబాబుగాడు పూరీ తింటున్న టైమ్కు వెళ్లి బుక్కయియాన్నేను. ‘లోకాస్సమస్త పూరీ తినంతు... నువ్వు కూడా పూరీ తిందువుగానీ రారా... ’ అంటూ ఆనంమాయంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచాడు మా రాంబాబుగాడు. ‘‘ఆ కొటేషన్కు అర్థమేంట్రా?’’ అడిగా. ‘‘లోకాలన్నింటికీ పూరీ తినే అదృష్టం దక్కుగాక! ఎందుకంటే పూరీ అనేది ఓ అద్భుతమైన తినుబండారం. దాని బండారం బట్టబయలైతే... బోల్డన్ని లైఫ్ లెసన్స్ చెబుతుందది’’ గ్యాపులేకుండా మరో కొటేషన్ విసరనే విసిరాడు. ‘‘పూరీ లైఫ్ లెసన్స్ చెప్పడమేంట్రా?’’ ‘‘సరిగ్గా చూడు. పెనం మీదికి చపాతి ఠపీమంటూ మళ్లీ లేవకుండా పడిపోతుంది. కానీ మన పూరీ...?! సిమ్మింగ్పూల్లోకి డైవ్ కొట్టినంత చలాగ్గా చులాగ్గా ఏటవాలుగా నూనెలోకి ఇలా మునుగుతుందా... అంతలోనే ఆ తైలం తాలూకు నునుపైన అలల మీద అలా అలా తేలియాడుతూ మూకుడులో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ పాడుతూ ‘పూరీ విహారం’ చేస్తుంది. అంటే ఏమిటర్థం? చపాతీలా చతికిలపడిపోకూడదూ... చుట్టూ కష్టాల నూనెసాగరం ఉన్నా సరే... పూరీలా తేలి పైకిరావాలీ! పిండి గోధుమరంగులో ఉన్నా... నూనెలో తనను కాల్చేస్తున్నా, మాడ్చేస్తున్నా తనను తాను మెరుగుపెట్టుకుని మెరుగుబంగారు రంగు సంతరించుకుని మెరుస్తుండాలీ... అనే సందేశమిస్తుందిరా పూరీ. ఇంతకంటే లైఫ్ లెసన్ ఏముంటుంద్రా’’ ఆవేశపడ్డాడు రాంబాబుగాడు. ‘‘నేనెప్పుడూ అంత ఆలోచించలేదురా’’ అన్నా. అంతే... ‘‘ఒరేయ్... ప్లేటులోకి పూరి పడిపోగానే ఎప్పుడెప్పుడు తిందామా అంటూ ఆబగా నువ్వెదురు చూస్తావు. కానీ బాగా లోతైన అంతర్గత అవలోకిత మహా మహిమాన్విత తత్వలోకైక తాత్విక దృష్టితో విషయాల్ని పరిశీలించినప్పుడపు ఇంకెంతో జ్ఞానాన్ని ప్రసాదించేదేరా పూరీ. అందుకే ‘సర్వ టిఫినానాం పూరీ ప్రధానం’ అన్నది శాస్త్రోక్తి’’ అంటూ మళ్లీ చెలరేగిపోయాడు. ‘‘నిజమేరా... ఎంత జ్ఞానం రా బాబూ నీకూ’’ అంటూ కాస్త వ్యంగ్యం మిక్స్ చేసి కొట్టా గానీ... లాభం లేదు. దీన్నీ వాడు సీరియస్ పొగడ్తగానే తీసుకున్నాడు. ‘‘అన్నట్టు... ఇక్కడ జ్ఞానానికీ పూరీకి కూడా ఓ పోలిక ఉంది చూశావా? పూరీలో పొరలున్నాయనీ... వాటి మధ్య ఖాళీ స్థలమనేది ఉందనే విషయం కూడా తెలియనట్టే అమాయకంగా ఉంటుందది. టైమొచ్చినప్పుడు తన పొరలలోకి గాలిని జ్ఞానంలా నింపుకుంటుంది. అంటే ఏమిటీ... మనిషనేవాడు ఏ హడావుడీ లేకుండా, నిరాడంబరంగా, నిశ్శబ్దంగా మెదడులోకి జ్ఞానం ఊరేలా చేసుకోవాలి. ఎట్టకేలకు... పూరీలా ఊరేంత జ్ఞానసముపార్జన చేసుకోవడం కంటే మనిషి బతుక్కు ఇంతకు మించి సార్థకత లేదూ– అనే సందేశమిస్తుందిరా మన పూరీ!’’ఇంతవరకు విన్నాక అలా బయటకెళ్తూ ‘‘కంగారుపడుతూ ఉండటం వల్ల ఆ జంతువుకు ‘కంగారు’ అనే పేరొచ్చిందనేది ఎంత నిజమో... వేలెట్టి పొడిచి బొక్కెట్టాక పూరీలోని గాలి విశ్వవ్యాపితం కావడం ఎంత వాస్తవమో... నీ జ్ఞానం కూడా ఒకనాటికి విశ్వమంతటా విస్తరించడం కూడా అంతే ఖాయం రా’’ అంటూ గొణుక్కుంటూ బయల్దేరా. కానీ వాడు మాత్రం ‘‘కరెక్ట్... పూరీ రక్షతి రక్షితః’’ అంటూ మరో ముక్క తుంచి... బొంబాయి చట్నీలో ముంచి... నోరంతా తెరచి... హాయిహాయిగా... రుచిరుచిగా తినడానికి రెడీ అయ్యాడు. – యాసీన్ -
క్రికెటర్ సూర్యకుమార్ లగ్జరీ ఇల్లు, కార్లు, విలువ ఎంతో తెలుసా?
క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (SKY),అతని భార్య, దేవిషా సూర్యకుమార్ యాదవ్ తమకు ఆడబిడ్డ పుట్టిందన్న శుభవార్తను (మే 7, 2026న ) ఫ్యాన్స్తో ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఆ పోస్ట్ క్యాప్షన్లో, "కిలకిల నవ్వులు, శుభాకాంక్షలు,నెరవేరబోయే కలలతో - మా ఆడబిడ్డకు స్వాగతం పలుకుతున్నాము" అంటూ తమ క్తిగత జీవితంలో సంతోషాన్ని ప్రకటించారు. పాపాయి లేలేత చేయిని పట్టుకున్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ముంబైలోని తన విలాసవంతమైన ఇంటి విశేషాలువైరల్గా మారాయి.సూర్యకుమార్ పోస్ట్కు స్పందించిన పలువురు సెలబ్రిటీలు,తోటి క్రీడాకారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా సారా టెండూల్కర్ నుండి రణవీర్ సింగ్ వరకు, సెలబ్రిటీలు అభినందన సందేశాలతో కామెంట్స్ సెక్షన్ను నింపేశారు. ఈజంటకు పెంపుడు జంతువులంటే చాలా ప్రేమ, ఇపుడిక చిన్నారి బోసినవ్వులతో కళ కళలాడనున్న లగ్జరీ అపార్ట్మెంట్ విశేషాలను పరిశీలిద్దాం.విశాలమైన లివింగ్ రూమ్ సూర్య ఇల్లు ఆధునికతకు, మినిమలిజంకు (సరళతకు) అద్దం పడుతుంది. ఇల్లంతా వైట్ థీమతో గోడలుప్రశాంతమైన లుక్లో ఆకర్షణీయంగా అలరిస్తోంది. లివింగ్రూమ్ (Living Room)లో బ్లూ టోన్ సోఫా సెట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అక్కడక్కడ పసుపు రంగు టచ్తో ఇంటికి ఒక కొత్త కళ వచ్చిందనడంలో సందేహం లేదు. వీటికి హ్యాండ్ మేడ్ కళాఖండాలు, అందమైన లైటింగ్ ,చక్కటి ఉడ్వర్క్ (Woodwork) ఇంటికి రాయల్ లుక్ని తీసుకొచ్చాయి. బాల్కనీలోనే జిమ్ ముంబై వంటి నగరంలో విశాలమైన బాల్కనీ ఉండటమే ఒక అదృష్టం. సూర్య తన బాల్కనీని చాలా తెలివిగా ఉపయోగించుకుని బాల్కనీ లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవడం విశేషం. బాల్కనీలో కృత్రిమ గడ్డి పర్చిన ఈ బాల్కనీలోనే సూర్య వ్యాయామం చేయడానికి అవసరమైన డంబెల్స్, ఇతర పరికరాలు ఉన్నాయి. అంతేకాదు వ్యాయామం చేస్తూనే ముంబై తాజా గాలిని ఆస్వాదించేలా ఈ బాల్కనీ జిమ్ను రూపొందించారు.క్రికెటర్ అంటే ఆ మాత్రం ఉండాలిగాఒక క్రికెటర్ ఇల్లు అంటే ట్రోపీలకు, అవార్డులకు ప్లేస్ లేకపోతే ఎలా? అందుకే సూర్య ఇంట్లో ఒక ప్రత్యేకమైన గోడపై ఆయన గెలుచుకున్న ట్రోఫీలు, క్రికెట్ జ్ఞాపకాలను ఎంతో అందంగా ప్రదర్శించారు. టెక్స్చర్డ్ వాల్స్ నేపథ్యం ఈ అవార్డులకు మరింత మెరుగులు దిద్దింది.దీంతోపాటు, రియల్ ఎస్టేట్లో కూడా జంట భారీ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. 2025 మార్చిలో, సూర్య , దేవిషా జంట ముంబైలో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. వీటి విలువ సుమారు రూ. 21.1 కోట్లు అని సమాచారం సూర్య భార్య. మొత్తానికి, సూర్య ఇల్లు ఆధునిక హంగులతో, వెచ్చని వాతావరణంతో ఇప్పుడు తమ చిన్నారి రాకతో మరింత సందడిగా మారనుంది.నెట్వర్త్ కాగా 2025 నాటికి సూర్యకుమార్ యాదవ్ అంచనా వేసిన నికర ఆస్తి విలువ దాదాపు రూ. 55- 65 కోట్లుగా అంచనా. 2026 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సూర్యకుమార్ ఆస్తులు మరింత పెరగనున్నాయి. అతని ప్రస్తుత వార్షిక ఫ్రాంచైజీ జీతం సుమారు రూ. 16.35. మొత్తం ఐపీఎల్ సంపాదన దాదాపు రూ.72.60 కోట్లుగా అంచనా.గ్యారేజీలో లగ్జరీ కార్లు, బైక్స్విలాసవంతమైన సెడాన్లతో పాటు ఇతర పవర్ఫుల్ కార్లు కూడా ఉన్నాయిమెర్సిడెస్-బెంజ్, ల్యాండ్ రోవర్ (రేంజ్ రోవర్ వెలార్తో సహా), ఆడి, BMW, పోర్షే,యు నిస్సాన్ వంటి కంపెనీల వాహనాలు. అలాగే సుజుకి, హార్లీ-డేవిడ్సన్ మరియు BMW సూపర్బైక్ విభాగం నుండి వచ్చిన బైక్లు న్నాయి. అతని బ్యాటింగ్ లాగే, ఈ గ్యారేజీ కూడా వైవిధ్యంగా ఉంటుందంటారు నిపుణులు.20.5 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించుకున్న సూర్య ఒక్కో డీల్కు రూ. 60–70 లక్షల మధ్య ఎండార్స్మెంట్ ఫీజును వసూలు చేస్తున్నట్లు సమాచారం. అతని పోర్ట్ఫోలియోలో రీబాక్, డ్రీమ్11, లెన్స్కార్ట్, జియోసినిమా, రాయల్ స్టాగ్, పింటోలా , బౌల్ట్ ఆడియో ఉన్నాయి. -
‘బేబీ రిస్ట్’ అంటే ఏంటో తెలుసా..!
నెలల పిల్లలనూ, క్యూట్గా ఉండే టాడ్లర్స్నూ గాల్లోకి ఎగరేసినట్టుగా అమాంతం ఎత్తుతుంటారు తల్లులు. చిన్నపిల్లలను ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బొటన వేలూ, చూపుడువేలు మధ్యన ఎత్తుకుని గిరగిర తిప్పుతూ ఎగరేసినట్లుగా చేసే సమయంలో చూపుడువేలూ, బొటనవేలి మధ్యనా, అలాగే మణికట్టు దగ్గర ఒత్తిడి కారణంగా టెండన్లు దెబ్బతినడం వచ్చే నొప్పిని ‘బేబీ రిస్ట్’ అంటారు. ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘డి క్వెర్వెయిన్స్ టెనోసినోవైటిస్’ లేదా ‘డి క్వెర్వెయిన్స్ టెండనైటిస్’ అంటారు. ఈ నొప్పి లేదా ఇన్ఫ్లమేషన్ మరీ ఎక్కువగా ఉంటే పెయిన్కిల్లర్స్తో చికిత్స అందించవచ్చు. (చదవండి: పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..) -
ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే..
సాధారణ చెవుడు, బ్రహ్మ చెవుడు వంటివి వాటి గురించి విన్నాం. కానీ కేవలం పురుషుల మాటలు మాత్రం చెవికి వినపడని అరుదైన వైద్య పరిస్థితి గురించి విన్నారా..!?. ఔను అలాంటి వింత అనారోగ్య పరిస్థితితో బాధపడుతోంది ఈ మహిళ. పాపం తన ప్రియుడి మాటలు తనకు వినిపించడం లేదని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె. ఇదేం చెవుడు రా బాబు అనిపిస్తోంది కదూ. మరి ఆ కథా కమామీషు ఏంటో చూసేద్దామా..!.చైనాలోని జియామెన్లో ఒక మహిళ అక్షరాలా పురుషుల మాటలు వినలేదట. ఆమెకు మగవాళ్లంటే నచ్చక ఇలానేమో అనుకోకండి. చైనాలోని జియమోమెన్లో నివశించే మహిళ తన ప్రియుడు మాటలు వినపించడం లేదని తెలుసుకుంటుంది. అన్ని పెద్ద పెద్ద శబ్దాలు వినగలిగినా..తన లవర్ మాటలే తనకు ఎందుకు వినిపించడం లేదని వైద్యులను ఆశ్రయిస్తే అసలు విషయం బయటపడింది. ఆమె రివర్స్ స్లోప్ హియరింగ్ లాస్తో బాధపడుత్నుట్లు గుర్తించారు. ఈ అరుదైన వ్యాధి కారణంగానే ఆమె మగవాళ్ల గొంతుని వినలేదట. అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోవడంగా చెప్పొచ్చు. ధ్వని వర్ణపలంలో చాలా వరకు పురుషుల గొంతులు కచ్చితంగా తక్కువ ఫ్రీక్వెన్సీలోనే ఉంటాయట. కానీ ఈ బాధిత మహిళ అధిక స్థాయి శబ్దాలను, గొంతులను స్పష్టంగా వినగలుగుతుంది కానీ తక్కువ శ్రేణి లేదా ఓ మోస్తారు మీడియం శబ్దంలో వచ్చే మాటలు అస్సలు వినలేదని తేల్చి చెప్పారు వైద్యులు. ఆ హియరింగ్ లాస్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే..రోగి వినికిడిని మ్యాప్ చేయడానికి వైద్యులు ఉపయోగించే ఆడియోగ్రామ్ అనే చార్ట్పై ఈ వ్యాధి ఏర్పరిచే ఆకారం నుంచే దానికి ఆ పేరొచ్చిందంట. చాలా వరకు వినికిడి లోపం చార్ట్పై క్రిందకి వాలి ఉంటుందని, ఇది అధిక ఫ్రీక్వెన్సీల నష్టాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ ఆ మహిళ విషయంలో మాత్రం..అందుకు విరుద్ధంగా ఉంటుందని వివరించారు వైద్యులు. ఇలా కేవలం పురుషుల గొంతులకే పరిమితం కాదు, తక్కువ స్థాయిలో మాట్లాడే మహిళల స్వరాలను సైతం వినలేకపోవచ్చని కూడా అన్నారు. అదే సమయంలో అధిక స్థాయిలో మాట్లాడే పురుషుల మాటలు వినపడే అవకాశం ఉందని కూడా చెప్పారు. అంతేగాదు తక్కువ పౌనఃపున్య శబ్దాలు మానవ మాటలకు మించి విస్తరించి ఉంటాయని కూడా చెప్పారు. ఈ వ్యాధిని అంత తేలిగ్గా గుర్తించలేం..ఈ పరిస్థితిని అంత సులభంగా ఎవ్వరూ గుర్తించలేరని అంటున్నారు వైద్యులు. ఎందుకంటే చెవులు చిల్లులుపడే శబ్దాలను వినపడకపోవడాన్ని సులభంగా గుర్తించగలిగినంత ఈజీ కాదని చెప్పుకొచ్చారు. పాపం కొందరు ఈ అరుదైన వైద్య పరిస్థితి గురించి తెలియక ఏళ్లతరబడి గడిపేస్తుంటారని కూడా అన్నారు. మెనియర్స్ వ్యాధి, వైరల్ ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ సంబంధిత సమస్యల వల్ల ఈ పరిస్థితి కారణం కావొచ్చని అన్నారు. అలాంటి బాధితులకు కొంత వరకు వినికిడి పరికరాలు కాస్త ఉపశమనం అందిస్తాయని అన్నారు. అలాగే ఆ మహిళ ప్రియుడికి దీన్ని వ్యక్తిగతంగా తీసుకుని ఇబ్బంది పెట్టడం వంటివి చేయకూడదని వైద్యులు సూచించారు కూడా. (చదవండి: బెల్స్ పాల్సీ వ్యాధి బారిన టెకీ..! కట్చేస్తే..) -
బెల్స్ పాల్సీ వ్యాధి బారిన టెకీ..! కట్చేస్తే..
ఒక్కోసారి ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడుతుంటాం. అయితే ఆ సయమంలో మనం సానుకూల దృక్పథంతో స్పందిస్తే అద్భుతాలు చేయొచ్చని ఈ టెకీ నిరూపించాడు. కొందరు ఏ వ్యాధి అయినా వచ్చింది అనగానే దబాలున కుంగిపోతుంటారు. అలా కాకుండా నాకే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అనే నైరాశ్యం కంటే..తనలాంటి వాళ్లుకు ఉపశమనం ఏంటి అనే ఆలోచన తళుక్కుమంటే..కచ్చితంగా హీరోగా, ప్రత్యేకమైన వ్యక్తిగా నిలుస్తాం అనేందుకు ఈ యువ టెకీనే ఉదాహరణ. అసలేం జరిగిందంటే..పీసెస్ AIలో సీనియర్ డెవలపర్ అడ్వకేట్గా పనిచేస్తున్న అలీ ముస్తఫా సింగపూర్ ఎంతో ఆనందంగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఆ క్రమంలో అనుకోకుండా ముఖ పక్షవాతానికి కారణమయ్యే బెల్స్ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డారు. దాంతో అతడు ముఖం కుడివైపు మొత్తం కదపలేని పరిస్థితి ఎదురైంది. బొంబాయికి తిరిగి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి ఎదుర్కొంది. దాంతో హుటాహుటినా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ముఖంలోని ఒక వైపు కండరాలలో అకస్మాత్తుగా బలహీనతను కలిగించే బెల్స్ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డట్లు వైద్యులు గుర్తించారు. ఈ పరిస్థితి కొన్ని నెలల్లోనే మెరుగుపడుతుందని చెప్పారు వైద్యులు. అందుకోసం కండరాల బలం కోసం ముఖ వ్యాయామాలు, ఫిజికల్ థెరపీ అవసరం అని సూచించారు కూడా. అయితే అక్కడితో ఆగిపోలేదు అలీ. ఈ సమస్యకు తన సాంకేతిక సామర్థ్యాన్ని జోడించి ఏఐ ఫేస్ ట్రాకింగ్ మిర్రర్ యాప్ను రూపొందించారు. ఇది ముఖ వ్యాయామాల మార్గనిర్దేశం తోపాటు పరిస్థితి ఎంతవరకు మెరుగ్గా ఉందనేది ట్రాక్ చేస్తుంది. తాను ఈ యాప్ను OpenAI ఏజెంట్ కోడెక్స్ తోపాటు ఆంత్రోపిక్ క్లాడ్ని ఉపయోగించినట్లు తెలిపారు. యాప్ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ..ఒక వీడియోని కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో అతని ముఖ వ్యాయామాలను విశ్లేషించి ఫిజియోథెరపిస్ట్కు పంపుతుంది. అంతేగాదు ప్రతి వ్యాయామాన్ని రికార్డ్ చేయడానికి, అలాగే ఫిజియో వ్యాయామాలను సమీక్షించి ఫీడ్బ్యాక్ అందించడానికి వీలుగా ఒక సమగ్ర నివేదికను కూడా అందిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే..వ్యాయామం చేసిన ప్రతిసారీ, యాప్ సెషన్ వ్యవధిని రికార్డ్ చేస్తుంది, అలాగే ముఖ కదలికలు ఎంత వరకు మెరుగ్గా మారిందో అంచనా వేస్తుంది. నెటిజన్లు అతని చొరవును ప్రశంసించడమే గాక, కొన్ని ఆఫర్లు కూడా అందించారు. ఇక ఓపెన్ఏఐ ఎగ్జిక్యూటివ్ వైభవ్ శ్రీవాస్తవ్ ఆలీని మరిన్ని ప్రయోగాలు చేయడానికి వీలుగా ChatGPT సబ్స్క్రిప్షన్ను అందిస్తానని ఆఫర్ చేశారు. అలాగే ఇలాంటి మరెన్నో వినూత్న ఆవిష్కరణలు చేయాలంటూ ప్రోత్సహించారు కూడా. Last week, I hit rock bottom. I was diagnosed with Bell’s Palsy, and my right face got paralysed;I honestly wondered how I was going to get through it!I vibe-coded my way out and built an AI face tracking app that guides my facial exercises, measures facial symmetry in real… pic.twitter.com/oFN8wJ8vTR— Ali Mustufa (@ialimustufa) May 6, 2026 (చదవండి: పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..) -
పెళ్లికి ముందు ఆ వైద్య పరీక్ష తప్పనిసరి..! లేదంటే..
కొన్ని వ్యాధులు పెళ్లికి ముందు యవ జంటలు ఈ వైద్య పరీక్షలు చేయించుకుంటే పిల్లలకు ప్రాణాంత వ్యాధులు బారినపడరు. అలాంటి వ్యాధుల్లో ఒకటే ఈ ప్రాణాంతక తలసేమియా వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఎందరో బాధితులు అను నిత్యం నరకం చూస్తుంటారు. ఎందుకంటే రేపు రోజు ఎలా ఉంటుందో తెలియని స్థితి. పైగా ప్రతి నెల రక్తం ఎక్కించుకోవాల్సిన దుస్థితి. ఇవాళ అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం ఈ సందర్భంగా ఈ వ్యాధి ఎందువల్ల వస్తుంది? నివారణ ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.తలసేమియా అంటే..తలసేమియా (Thalassemia) అనేది జన్యుపరమైన రక్తహీనత వ్యాధి, ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. దీనివల్ల ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఏర్పడక, బాధితులు ప్రతి 2-4 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది. వేసవి సెలవుల్లో రక్త సేకరణ శిబిరాలు తగ్గడంతో రక్త నిల్వల కొరత ఏర్పడుతోంది. తలసేమియా మహమ్మారి చిన్నారులకు నరకం చూపిస్తోంది. ప్రభుత్వం ఈ వ్యాధికి ఉచిత చికిత్స అందుతున్నా, నిరంతర రక్త అవసరం, నిల్వల కొరతతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.నివారణ ఎలాగంటే..పెళ్లికి ముందు జంటలు 'హీమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరేసిస్' పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.సమస్య ఉన్నవారు రక్తమార్పిడితో పాటు, ఐరన్ ఓవర్లోడ్ (Iron overload) తగ్గించడానికి అవసరమైన మందులు వాడాలి.తలసేమియా మేజర్ ఉన్నప్పటికీ, సరైన చికిత్స, పట్టుదలతో తిరుచ్చికి చెందిన పరమేశ్వరి వంటి వారు ఉన్నత చదువులు చదువుతూ ఇతరులకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఈ వ్యాధి గురించి మరింత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ కింది లింక్పై క్లిక్ చేయండి. (చదవండి: 'ఉప్పు' ఇంత ప్రాణాంతకమా..? పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
'ఉప్పు' ఇంత ప్రాణాంతకమా..?
2023లో ప్రపంచవ్యాప్తంగా 59 లక్షల మంది కేవలం ఆహారపు అలవాట్లతో ముడిపడిన గుండె జబ్బుల వల్ల మరణించారట. 204 దేశాలకు సంబంధించి సమాచారం ఆధారంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలు ది ఇన్నోవేషన్ న్యూట్రీషన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ మరణాల్లో అత్యధిక శాతం చైనా(13.6 లక్షలు), భారత్(11 లక్షలు)లో సంభవించాయి. తర్వాతి స్థానాల్లో రష్యా, అమెరికా, ఇండోనేసియా ఉన్నాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పళ్లు, తృణ ధాన్యాలు తక్కువ తీసుకోవడం వంటివాటిని వీటికి ప్రధాన కారణాలుగా పరిశోధకులు గుర్తించారు.మనమేం చేయాలి దేశపు ఆహారపు విధానాల్లో మార్పులు అత్యవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందింపజేయాలి. ముఖ్యంగా సోడియం(ఉప్పు) వినియోగాన్ని తగ్గించే విధానాలు తేవాలి. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై పోషకాల వివరాలను తప్పనిసరిగా ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలి. సాక్షి, నేషనల్ డెస్క్(చదవండి: ఫైబర్ ఎందుకు అధికంగా తీసుకోవాలి? కలిగే లాభాలు..) -
వెనిస్లో స్పెషల్ అట్రాక్షన్గా నీతా అంబానీ కుటుంబం
ఇటలీలోని వెనిస్లో జరుగుతున్న లా బియెన్నాలే డి వెనిజియా 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో అంబానీ కుటుంటం భారత జాతీయ పెవిలియన్ను ప్రారంభించింది. ఇది ఫ్యాషన్తో కూడిన భారతీయ వారసత్వ సమ్మేళనానికి అద్భుతమైన సాక్ష్యంగా నిలిచింది. ఈ మేరకు మే 7న సాయంత్రం అంబానీ కుటుంబం వెనిస్లో ఒక ఆత్మీయ వేడుకని నిర్వహించింది. ఆ వేడుకలో అంబానీ కుటుంబం ఆధునిక శైలులు, సాంప్రదాయ భారతీయ వైభవాన్ని సంపూర్ణంగా సమతుల్యం చేసేలా పలు రకాల లుక్స్లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకలో నీతా అంబానీ కుటుంబం భారతీయ కళ, ఫ్యాషన్ వైభవాన్ని ఎలా మిళితం చేసిందంటే..గోల్డ్ శారీలో నీతా అంబానీ..సాంస్కృతిక కార్యక్రమాల వెనుక దార్శనికురాలిగా, నీతా అంబానీ ఒక క్లాసిక్ గోల్డ్ టిష్యూ చీరలో అందానికి కేరాఫ్గా కనిపించారు. ఈ కార్యక్రమంలో నీతా తన కుటుంబంతో కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తున్నప్పుడు, ఆమె ధరించిన చీర మిరిమిట్లుగొల్పేలా కాంతిని వెదజల్లింది. సాంప్రదాయ భారతీయ వస్త్రధారణ విలాసానికి అంతిమ చిహ్నంగా నిలుస్తుందని ఆమె ఆహార్యం నిరూపించింది. నీతా తన లుక్ని ఒక భారీ వజ్రాలు-పచ్చల నెక్లెస్ సెట్, ఒక చిన్నబన్తో జత చేశారు.పుదీనా రంగులో రాధికా మర్చంట్ రాధికా మర్చంట్, సున్నితమైన పుదీనా నీలం రంగులో ఉన్న ఒక అందమైన వన్-షోల్డర్ గౌనులో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిసింది. ఈ గౌను నడుము వద్ద ముడుచుకుని, గ్రీకు శైలిలో క్లిష్టమైన డ్రేపింగ్ను కలిగి ఉంది. మెడ భాగంలో మెరుస్తున్న, స్ఫటికాకార అంచు, దానికి సరిపోయే ఆర్మ్ కఫ్, ఈ గౌనుకు ఆధునిక మెరుపును జోడించి మరింత శోభను చేకూర్చింది. రాధిక తన జుట్టును నునుపైన, ఒత్తుగా ఉన్న పోనీటెయిల్తో స్టైల్ చేశారు. దీంతో ఆమె ప్రకాశవంతమైన మేకప్, ప్రత్యేకమైన వజ్రాల చెవిపోగులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.వైన్ గౌనులో మెరిసిపోతున్న ఇషా అంబానీఇషా అంబానీ అధునాతన ముదురు వైన్ రంగులో ఉన్న ఫ్లోర్-లెంగ్త్ గౌనును ధరించారు. ఈ గౌను పాశ్చాత్య ఫ్యాషన్ శైలిలో కనిపిస్తూ..సాంప్రదాయ చీర కట్టుతో మేళవించింది. గౌను పైభాగంలో ఉన్న అద్భుతమైన బంగారు ఎంబ్రాయిడరీ, పూల డిజైన్లు భుజాల మీదుగా జాలువారుతూ, ముదురు రంగు వస్త్రానికి గొప్ప కాంట్రాస్ట్ను అందించాయి. ఇషా తన జుట్టును మృదువైన, రొమాంటిక్ అలల రూపంలో వేసుకుని, ముదురు ఎరుపు రంగు లిప్స్టిక్, పచ్చలు పొదిగిన ఆభరణాలతో తన రూపాన్ని పూర్తిచేశారు.ఆకర్ణణీయమైన లుక్లో ఆనంద్ పిరమాల్, అనంత్ అంబానీలు..వెనిస్లో, అంబానీ కుటుంబం వారసత్వ సంప్రదాయాన్ని, ప్రపంచ ఫ్యాషన్తో మేళవించి, పవర్ డ్రెస్సింగ్ను పునర్నిర్వచించారు. ఆ సాయంత్రం కేవలం భారతీయ కళల వేడుకగా మాత్రమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతీయ వస్త్రధారణ నైపుణ్యానికి ఒక ప్రదర్శనగా నిలిచింది. ఇకఇషా అంబానీ భర్త, వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్, రాజసం ఉట్టిపడేలా అలంకరించిన వెండి బ్రోచ్తో కూడిన నల్లటి వెల్వెట్ జాకెట్లో ఆకర్షణీయంగా కనిపించగా, అనంత్ అంబానీ, తమ కుటుంబం మెచ్చే సూక్ష్మమైన హస్తకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే అలంకారమైన లాపెల్ పిన్తో కూడిన నల్లటి సూట్లో అద్భుతంగా కనిపించారు. View this post on Instagram A post shared by Vogue Arabia (@voguearabia)(చదవండి: Met Gala 2026: రూ. 142 కోట్ల నెక్లెస్తో మెరిసిన సుధా రెడ్డి..!) -
ఫైబర్ ఎందుకు అధికంగా తీసుకోవాలంటే..?
చాలా మంది తమ రోజువారీ ఆహారంలో తగినంత ఫైబర్ పొందడం లేదని, దాని కారణంగా చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పోషకాహార నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ప్రతి మనిషికి రోజుకు సుమారుగా 25 నుంచి 30 గ్రాముల వరకు ఫైబర్ అవసరం అయితే నివేదికలు కేవలం 15 నుంచి 20 గ్రాములే వినియోగిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇది వ్యాధులకు దారితీసే ప్రమాదానికి సంకేతమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. గ్రామీణ ఆహారాల్లో పప్పుధాన్యాలు, ముతక ధాన్యాలలో కనీసం ఏదో రకంగా ఫైబర్ ఉంటుంది. కానీ పట్టణ ఆహారాల్లో ఆ లోటు అధికం అని చెబుతున్నారు నిపుణులు. అసలు ఫైబర్ ఎందుకు అవసరం అంటే..మన ఆహారంలో అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతామని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..మెరుగైన జీర్ణక్రియ, మలబద్ధకం నుంచి ఉపశమనంపేగుల ఆరోగ్యానికి మద్దతు, ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు పోషణరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచి, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కొలెస్ట్రాల్ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందికడుపు నిండిన భావనను పెంచి, బరువు నిర్వహణలో సహాయపడుతుంది.ఫైబర్ అందించే ఆహారాలుచియా గింజలు, కాయధాన్యాలు, బీన్స్, పండ్లు, తృణధాన్యాలు వంటి సాధారణ ఆహారాలు ఈ లోటును పూరించగలవు. తెల్ల బియ్యం బదులు బ్రౌన్ రైస్ తినడం లేదా హోల్-గ్రెయిన్ బ్రెడ్ ఎంచుకోవడం వంటి చిన్న, స్థిరమైన మార్పులు పెద్ద తేడాను కలిగిస్తాయని పోషకాహార నిపుణులు నొక్కి చెబుతున్నారు. భారతీయ ఆహారంలో అధిక ఫైబర్ ఉన్న ఆహారాలుచిరుధాన్యాలు (రాగి, జొన్న, బజ్రా) – వీటిలో కరిగే, కరగని ఫైబర్తో సమృద్ధిగా ఉంటాయి.పప్పుధాన్యాలు (కందిపప్పు, పెసరపప్పు, మసూర్ పప్పు).చిక్కుడు జాతి గింజలు (రాజ్మా, శనగలు, చిక్పీస్).పండ్లు (జామకాయ, బొప్పాయి, అరటిపండు, ఆపిల్).కూరగాయలు (పాలకూర, బెండకాయ, క్యారెట్లు).తృణధాన్యాలు (బ్రౌన్ రైస్, గోధుమ చపాతీ).కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యాన్ని నివారించడానికి ఫైబర్ను క్రమంగా పెంచుకుంటూ..పుష్కలంగా నీరు త్రాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. డాక్టర్ ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్,అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)ICAR–నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు(చదవండి: జస్ట్ రెండు నెలల్లో 20 కిలోలు తగ్గాలంటే..! ఆ 12 అలవాట్లు..) -
జస్ట్ రెండు నెలల్లో 20 కిలోలు తగ్గాలంటే..!
ఎలాంటి షార్ట్కట్లు లేకుండా త్వరిగతిన కిలోల కొద్ది బరువు తగ్గాలనుకునే వారికి ఈ కంటెంట్ క్రియేటర్ చెప్పే సలహాలు, సూచనలు ఎంతగానో హెల్ప్ అవుతాయి. ఆమె తనకు ఇష్టమైన ఫుడ్ తీసుకుంటూనే..సరైన జీవనశైలిని నిలకడగా పాటిస్తూ తగ్గానని చెబుతున్నారామె. అదెలాగో సోషల్ మీడియా వేదికగా ఆమెనే స్వయంగా వివరించారు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా..!.ఇటీవలకాలంలో అందరూ సంక్లిష్టమైన డిటాక్స్ ప్లాన్లు లేదా ఫ్యాన్సీ హెల్త్ ఫుడ్స్కు బదులుగా, చాలా మంది ఎక్కువ ప్రోటీన్ తినడం, ఎక్కువగా నడవడం, చక్కెర తగ్గించడం, నిలకడగా ఉండటం వంటి సాధారణ మార్పులపై దృష్టిసారిస్తున్నారు. బహుశా అందుకే ఈ కంటెంట్ క్రియేటర్ అంజలి సచిన్ తన వెయిట్ జర్నీ అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. ఆమె చెప్పే ఆహారపు అలవాట్లు సైతం అందరు సులభంగా పాటించగలిగేవే కావడం విశేషం. ఆమె కేవలం రెండు నెలల్లోనే 20 కిలోలు బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. అందుకోసం ఏం చేశారో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆమె కేలరీ డెఫిసిట్ ప్రాధాన్యంగా తీసుకుని డైట్ని పాటించినట్లు పేర్కొన్నారు. అంటే శరీరం ఒక రోజులో ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువగా తీసుకోవడం. ఇక ఆమె తన దినచర్యలో అధిక ప్రోటీన, అధిక ఫైబర్ ఉన్న భోజనం, కార్బోహైడ్రేట్లు, చక్కెరను పూర్తిగా మానుకోవడం తోపాటు స్వీట్లు, శీతల పానీయాలు, చిరుతిళ్లను రాత్రిపూట తీసుకోకుండా దూరంగా ఉండటం వంటివి చేసినట్లు తెలిపారు. ఆ క్రియేటర్ క్రమం తప్పకుండా పాటించిన 12 కఠినమైన అలవాట్లు..అధిక ప్రోటీన్ + అధిక ఫైబర్ ఉన్న భోజనంతక్కువ కార్బోహైడ్రేట్ల విధానంచక్కెర వద్దు (స్వీట్లు, శీతల పానీయాలు వద్దు)తక్కువ నూనె + తక్కువ ఉప్పురోజుకు 15,000 అడుగులుఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్)వెయిట్ ట్రైనింగ్/వెయిట్లిఫ్టింగ్సమయానికి నిద్రపోవడంకొన్నిసార్లు రోజుకు ఒక పూట భోజనం (అవసరమైనప్పుడు)సాయంత్రం 6 గంటల తర్వాత డిన్నర్ వద్దుచిరుతిళ్లు తినవద్దు / అనవసరమైన చిరుతిళ్లు వద్దునెలకు 8-10 కిలోలు తగ్గాలనుకుంటే, ఈ నియమాలను క్రమశిక్షణతో పాటించండి. నిలకడ = పరివర్తన, అన్నింటకంటే ముఖ్యం అని అని అంజలి సచన్ పోస్ట్లో రాశారు. ఈ అలవాట్లతో పాటు, ఆమె శాకాహార, మాంసాహార భోజన ప్రణాళికలతో కూడిన 7-రోజుల తక్కువ కార్బోహైడ్రేట్, అధిక ప్రోటీన్ డైట్ చార్ట్ను కూడా పంచుకున్నారు.శాకాహార ప్రణాళికలో పనీర్ భుర్జీ, టోఫు, సోయా చంక్స్, మొలకలు సలాడ్, గ్రీక్ పెరుగు, మూంగ్ దాల్ చిల్లా, బెసన్ చిల్లా, రాజ్మా, వెజిటబుల్ సూప్, సలాడ్లు వంటి ఆహారాలు ఉన్నాయి. మాంసాహార వెర్షన్లో గుడ్లు, చికెన్, చేపలు, వే ప్రోటీన్తో కూడిన ఓట్స్, చికెన్ సలాడ్, ఎగ్ బుర్జీలకు ప్రాధాన్యత ఇచ్చారు.ఈ ప్లాన్లో చాలా మందికి నచ్చిన అంశం ఏమిటంటే, ఇది ఖరీదైన “డైట్” ఉత్పత్తులకు బదులుగా సాధారణ ఇంటి వంటకాలను ఉపయోగించడం. ఈ భోజనాలు సరళంగా, ప్రోటీన్కు ప్రాధాన్యతనిస్తూ, తయారుచేయడానికి సులభంగా ఉంటాయి.అదే సమయంలో, వేగంగా బరువు తగ్గడం అనేది అందరిపై ఒకే విధంగా పనిచేయకపోవచ్చని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. ఒక వ్యక్తి శరీరాకృతి, జీవనశైలి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఆహారం, వ్యాయామ దినచర్యలను ఎల్లప్పుడూ వేరుగా ఉంటాయనేది గ్రహించాలి. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 35 ఏళ్లకే 11 ఏళ్ల కార్పొరేట్ కెరీర్కు ముగింపు..! ఆ కారణంతోనే..) -
ఎవరీ ర్యాన్ కోహెన్..? కాలేజీ డ్రాపౌట్ ఏకంగా రూ. 5 లక్షల కోట్లు..
కాలేజ్ డ్రాపౌట్ కాలిఫోర్నియాలో శాన్హౌస్ కేంద్రంగా పనిచేసే ఒక అమెరికన్ బహుళజాతి ఇ-కామర్స్ సంస్థ కొనడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా అతడిపేరు హాట్టాపిక్గా మారింది. ఎవ్వరూ కొనమని కోరకపోయినా..నేరుగా బిడ్ వేయడంతో ఒక్కసారిగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అతనెవరంటే..గేమ్స్టాప్ సీఈఓ ర్యాన్ కోహెన్ ఏకంగా 56 బిలియన్ డాలర్లు(రూ. 5 లక్షల కోట్లుపైనే) విలువ చేసే ఈబేను కొనడానికి బిట్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నగదు, స్టాక్ల 50-50 నిష్పత్తిలతో కలిపి ఒక్కో షేరుకు రూ. 11 వేలు చెల్లించేలా బంపర్ ఆఫర్ ఇస్తానంటూ ఈబే బోర్డుకు లేఖ రాశారు. దాంతో ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కాలేజ్ డ్రాపౌట్ బిలియనీర్ ఎవరా అంటూ అంత చర్చించుకోవడం మొదలుపెట్టారు. ర్యాన్ కోహెన్ ఎవరంటే..ఆయన స్వస్థలం కెనడాలోని మాంట్రియల్. ప్రస్తుతం సుమారు 4.2 బిలియన్ డాలర్లు(రూ. 39 వేల కోట్లు) సంపద కలిగిన 40 ఏళ్ల పారిశ్రామికవేత్త. కాలేజీ చదువును పూర్తిగా వదిలేసి, ఒక అసాధారణ మార్గంలో బోర్డు స్థాయికి చేరుకున్నారు. ఆయన రోవన్ యూనివర్సిటీలో ఒక సెమిస్టర్ తర్వాత చదువు మానేశారు. డిగ్రీకి బదులుగా, అతను చ్యూయీని నిర్మించి, 2017లో దానిని పెట్స్మార్ట్కు 3.35 బిలియన్ డాలర్లు(రూ. 31 వేల కోట్లు)కు విక్రయించాడు. ఆ తర్వాత అతను గేమ్స్టాప్ మీమ్-స్టాక్ పునరుద్ధరణలో కీలకంగా మారారు. ఆయన నాయకత్వంలోనే గేమ్స్టాఫ్ రూ. 3 వేల కోట్ల నష్టం నుంచి రూ 4 వేల కోట్లకు పుంజుకుందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ కంపెనీ 2026 ప్రారంభంలో మొత్తం 470 యూఎస్ స్టోర్లను కలిగి ఉంది. దాంతో ఇప్పుడు అతను గేమ్స్టాప్ కంటే నాలుగు రెట్లు పెద్దదైన ఈబే కంపెనీని నడపాలని, దానిని అమెజాన్కు సరైన పోటీదారుగా మార్చాలని కోరుకుంటున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.అంతేగాదు కోహెన్ తాను రాబోయే కొన్నేళ్లపాటు, గేమ్స్టాప్ పునరుద్ధరణలో ఎంతగా దృష్టి పెట్టానో, అలాగే ఈబేపై కూడా దృష్టి పెడతానుని అన్నారు. తాను ఈబేను వందల బిలియన్ల డాలర్ల విలువైన సంస్థగా మార్చాలని చూస్తున్నా అని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈబే బోర్డు సోమవారం ఈ ఆఫర్ను సమీక్షిస్తానని తెలిపింది. ఇక కోహెన్ మాత్రం ఈబేను తాను ఇంటి నుంచి కూడా నడపగలనని ధీమా వ్యక్తం చేయడం విశేషం. అది 1995లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే కనిపిస్తుందని విమర్శించారు. తాను మార్కెటింగ్, ఉత్పత్తి అభివృద్ధి, ఇతర నిర్వహణ ఖర్చులను తగ్గించి లాభాల బాట పట్టించగలనని చెబుతుండటం విశేషం. (చదవండి: 35 ఏళ్లకే 11 ఏళ్ల కార్పొరేట్ కెరీర్కు ముగింపు..! ఆ కారణంతోనే..) -
ఉపవాసంతో కేన్సర్ నయం అవుతుందా?
ఫ్రెంచ్ రేడియాలజిస్ట్ పాస్కల్ ట్రోటా చాలా విస్తుపోయే విషయాన్ని వెల్లడించారు. ఆయన తనకు కేన్సర్ నిర్థారణ అయ్యి..ఆస్పత్రిలో చేరాక అక్కడ కీమోథెరపీ చేయించుకున్న చాలా మంది చనిపోవడం చూసి తీవ్ర ఆందోళన చెందినిట్లు తెలిపారు. కానీ చాలామందికి తెలియని నిజం ఏంటంటే..50% కేన్సర్ రోగులు తీవ్రమైన చికిత్సల వల్లే చనిపోతారని అన్నారు. అందువల్ల తాను కేన్సర్ అని నిర్ధారణ అయిన వెంటనే వృత్తికి పూర్తిగా దూరంగా ఉంటూ..ఉపవాసం ఉండటం ప్రారంభించానని చెప్పారు. అలా ఏకంగా 30 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపవాసం చేస్తూ..కేన్సర్ని నయం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా ఇలా కేన్సర్ బారినపడి ఇబ్బందిపడుతుంటే వారికి ఈ విషయం చెప్పండి అంటూ అవగాహన కల్పించే యత్నం చేస్తున్నారు. అంతేగాదు ఉపవాసం ప్రయోజనాలను గుర్తించే పలు దేశాలు ఫాస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో ఏఏ దేశాల్లో ఉపవాస కేంద్రాలు ఉన్నాయి, నిజంగా ఉపవాసం కేన్సర్ని కట్టడి చేయగలదా? తదితరాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఉపవాసం (Fasting) కేన్సర్ చికిత్సలో సహాయపడుతుందని, కణాల పునరుద్ధరణకు (Cellular repair) దోహదపడుతుందని పలు పరిశోధనలు సూచించాయి. కానీ ఉపవాసం మాత్రమే కేన్సర్ని పూర్తిగా తగ్గిస్తుందని తేల్చి చెప్పడానికి మరిన్ని పరిశోధనులు జరగాల్సి ఉంది. అయితే, కేన్సర్ రోగులకు ఉపవాసం వల్ల కొన్ని లాభాలు మాత్రం కచ్చితంగా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక్కడ ఉపవాసం కీమోథెరపీ మందుల ప్రభావాన్ని పెంచి, ఆరోగ్యకరమైన కణాలను రక్షిస్తూ కేన్సర్ కణాలను బలహీనపరుస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేగాదు ఉపవాసం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి, కేన్సర్ కణాలకు కావాల్సిన పోషకాలు అందక అవి పెరగడం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.ఇక్కడ ఉపవాసం రోగనిరోధక వ్యవస్థను (Immune system) పునరుద్ధరించి, కేన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే శరీరం పాడైపోయిన కణాలను శుభ్రం చేసి, కొత్త కణాలను పునరుత్పత్తి చేస్తుందని పలువురు నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ ఉపవాసానికి అత్యంత ప్రజాదరణ పెరిగి, పలు దేశాల్లో ఉపవాస కేంద్రాలు పుట్టుకొచ్చాయి ఇలా. ఏ దేశాల్లో ఉన్నాయంటే..ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో, కోస్టారికా, స్పెయిన్, పోర్చుగల్, థాయ్లాండ్, బాలి తదితర దేశాల్లో ఉపవాస రీట్రీట్స్ నిర్వహిస్తున్నారు. వీటిని ఆరోగ్యపరమైన డిటాక్స్, బరువు తగ్గింపు, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సాధన కోసం ఏర్పాటు చేశారు.నార్త్ కరోలినా – ఐదు రోజుల జ్యూస్ క్లెన్స్, యోగా రీట్రెట్ ఉపవాసం ఈ విధానంలో యోగా, ధ్యానం తోపాటు ప్రత్యేకమైన జ్యూస్లు తీసుకుంటూ చేసే ఉపవాసం చేస్తారు. అలాగే కొద్ది మోతాదులోమొక్కల ఆధారిత ఆహారాన్ని ఇస్తారు.ఫ్లోరిడా – ఇది కూడా జ్యూస్ ఫాస్టింగ్ రీట్రీట్ కానీ 14 రాత్రలు చేస్తారు.మెక్సికో: ప్లయా డెల్ కార్మెన్ (Playa del Carmen) లో కాంబో డీప్ డెటాక్స్ థెరపీ ఇది అమెజాన్ అడవులకు చెందిన ఒక సాంప్రదాయ చికిత్స. 24 గంటలు ఉపవాసం ఉండి..అమెజాన్ జంగిల్ మెడిసిన్ని శరీరంపై అప్లై చేస్తారు. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి నిర్వీకర్షణ చేస్తుంది. కోస్టారికా: 5-రోజుల తీవ్రమైన శారీరక, భావోద్వేగ నిర్విషీకరణ (Detoxification) ప్రక్రియ. ఈ కార్యక్రమం జ్యూస్ ఫాస్టింగ్, కోలోన్ క్లెన్సింగ్, లివర్ ఫ్లష్లను సమ్మేళనం చేసి, శరీరాన్ని లోతుగా శుద్ధి చేస్తుందిస్పెయిన్: ఆల్కెమీ ఆఫ్ బ్రెత్ సంస్థ నిర్వహించే 'టస్కనీలో 7 రోజుల ఆశా బ్రెత్క్యాంప్. ఇక్కడ సుమారు 40 ఎకరాల ప్రకృతి అభయారణ్యంలో ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు, ధ్వని వైద్యం, శాకాహార భోజనాలు ఉంటాయి.పోర్చుగల్: పోర్చుగల్లోని ఆల్గార్వే (Algarve)లో 5-రాత్రుల ఫాస్టింగ్ మిమికింగ్ మెటబాలిక్ రీసెట్ రిట్రీట్ (Fasting Mimicking Metabolic Reset Retreat). ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, బరువు తగ్గడానికి, జీవక్రియను (metabolism) మెరుగుపరచడానికి రూపొందించిన ఒక సైన్స్-ఆధారిత వెల్నెస్ ప్రోగ్రామ్.థాయ్లాండ్: 5 రోజుల అనయాత లగ్జరీ జ్యూస్ డిటాక్స్ రిట్రీట్. ఈ విధానంలో ప్రత్యేకమైన జ్యూస్లతో శరీరాన్ని శుద్ధి చేస్తారు. యోగా, ధ్యానం వంటి వెల్నెస్ ప్రోగ్రాములు కూడా ఉంటాయి. ఈ శిబిరాల్లో పాల్గొనేవారికి భావోద్వేగ, శారీరక మరియు మానసిక అలసట నుంచి విముక్తి పొందేలా పోషకమైన భోజనాన్ని తీసుకునే నిపుణులు మార్గదర్శకం అందిస్తారు.ఇండోనేషియా (బాలి): ఏడు రోజుల శారీరక, భావోద్వేగ హీలింగ్. ఈ విధానంలో సోమాటిక్ థెరపీ, యోగా వంటివి ఉంటాయినేపాల్: శ్రీ యోగా డిటాక్స్ రిట్రీట్(కాఠ్మాండు). ప్రకృతి మధ్యలో నివాసం, యోగా, డిటాక్స్ వంటివి ఉంటాయి. కంబోడియా CPC వెల్నెస్ డిటాక్స్ రీట్రీట్. హోలిస్టిక్ డిటాక్స్, రీబ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్.ఫిలిప్పీన్స్ : 'ది ఫార్మ్ ఎట్ శాన్ బెనిటో'. ఇందులో మెడికల్ + హోలిస్టిక్ థెరపీ, జ్యూస్ డిటాక్స్ వంటివి ఉంటాయి. అయితే వ్యక్తిగత ప్రోగ్రామ్ ఆధారంగా, ఆయా వ్యక్తుల ఆరోగ్య సమస్యల అనుగుణంగా థెరపీలు ఇస్తారు.భారత్లో ఉపవాస కేంద్రాలు..భారత్: సెహత్వాన్ (Sehatvan) ఫారెస్ట్ థెరపీ రిట్రీట్. 'సెహత్వాన్' అంటే అక్షరాలా "హీలింగ్ ఫారెస్ట్" (ఆరోగ్యాన్నిచ్చే అడవి) అని అర్థం. ప్రకృతి ఒడిలో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక అద్భుతమైన ప్రదేశంభారత్లో ఉపవాస (Fasting) రిట్రీట్స్ ప్రధానంగా ఋషికేశ్, కేరళ, మధ్యప్రదేశ్, జోధ్పూర్, ధర్మశాల వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి యోగా, ఆయుర్వేదం, ధ్యానం, డిటాక్స్ ప్రోగ్రామ్లతో కలిపి శరీరానికి, మనసుకు శాంతి కలిగించేలా రూపొందించారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఏ ఉపవాస రీట్రీట్స్ ఎంచుకున్న వైద్య పర్యవేక్షణ అవసరం. అలాగే నిపుణుల సమక్షంలో అందించే ఉపవాస కేంద్రాలనే ఎంచుకోవాలి. అలాగే డయాబెటిస్, హృదయ సంబంధ దీర్ఘకాలిక సమస్యలున్నవారు ఉపవాసం ప్రారంభించే ముందు వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవాలి.طبيب الأشعة الفرنسي باسكال تروتا يفجر مفاجأة من العيار الثقيل ويقول:بالنسبة لي شخصياً أنا أخصائي أشعة إذا أُصبتُ بالسرطان، فلن أعتب باب المستشفى. لقد رأيت الكثير من المرضى يموتون بسبب الآثار الجانبية للعلاج الكيميائي. وأعتقد أنكم تعرفون ذلك، لكن الجمهور لا يعرفه: 50% من مرضى… pic.twitter.com/wxHk2FUfzi— موسكو | 🇷🇺 MOSCOW NEWS (@M0SC0W0) May 6, 2026 (చదవండి: కాలేయ సమస్య? విశ్రాంతి మాత్రమే మార్గమా?) -
భోరున విలపిస్తున్న మాజీ మిస్ ఇండియా : కారణం?
బాలీవుడ్ ప్రముఖ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ (Celina Jaitly) ఒకపుడు అందాల ప్రపంచాన్ని ఏలిన తార. ఇపుడు అటు తీరని కడుపుశోకం, ఇటు తల్లిగా బిడ్డల్ని కలిసే పరిస్థితి లేక అల్లాడిపోతోంది. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న అత్యంత బాధాకరమైన పరిస్థితుల గురించి సోషల్ మీడియాలో భావోద్వేగపూరితమైన పోస్ట్ను షేర్ చేయడం అభిమానులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. భర్త పీటర్ హాగ్ నుండి విడాకులు తీసుకుంటున్న సమయంలో, తన పిల్లలను కలుసు కోనివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, తన పిల్లలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని, కనీసం వారితో మాట్లాడేందుకు కూడా అనుమతి లభించడం లేదని ఆమె ఆరోపించారు. సమాధిలో నిద్రిస్తున్న తన బిడ్డను కలుసుకోవడం తప్ప తనకు మరో గత్యంతరం లేదంటూ వాపోతున్నారు. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial)కుమారుడి సమాధి వద్ద కన్నీటి పర్యంతంసెలీనా ఆస్ట్రియాలో ఉన్న తన దివంగత కుమారుడు శంషేర్ సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడుస్తూ, దాన్ని శుభ్రం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. విడాకుల విచారణ కోసం ఆస్ట్రియా వెళ్లిన తనకు, జీవించి ఉన్న తన ముగ్గురుపిల్లలను కలిసే అవకాశం ఇవ్వలేదని, కేవలం మరణించిన కుమారుడిని మాత్రమే కలుసు కోగలిగానని ఆమె అత్యంత వేదనతో పేర్కొన్నారు. భర్త కెరీర్ కోసం తాను భారతదేశాన్ని, తన తల్లిదండ్రులను, సినిమా వృత్తిని వదులుకుని దుబాయ్, సింగపూర్, ఆస్ట్రియా వంటి దేశాలకు తిరిగానని గుర్తు చేసుకున్నారు. చివరికి తన ఆస్తులను కూడా పోగొట్టుకున్నానని, వేధింపులకు గురయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తన పిల్లలకు తనపై తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా 'బ్రెయిన్ వాషింగ్' చేస్తున్నారని, మీడియాలో తనపై తప్పుడు కథనాలు వచ్చేలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సామరస్య పూర్వకంగా విడిపోవాలని తాను ప్రయత్నించినప్పటికీ, తన వద్ద ఉన్న మిగిలిన ఆస్తుల కోసం అవతలి పక్షం అహేతుకమైన డిమాండ్లు చేస్తోందని సెలీనా పేర్కొన్నారు.ఒక తల్లిగా తన బాధను ప్రపంచానికి తెలియజేయడానికే ఈ వీడియోను షేర్ చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.కాగా సెలీనా జైట్లీ ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్(Peter Haag)ను 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు (ట్విన్స్ విన్స్టన్-విరాజ్ మరియు చిన్న కుమారుడు ఆర్థర్) ఉన్నారు. ఆర్థర్ జంటగా పుట్టిన శంషేర్ అనారోగ్య కారణాలతో మరణించాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత 2025 నవంబర్లో ముంబై కోర్టులో గృహ హింస కేసును దాఖలు చేస్తూ, తన భర్త పీటర్ హాగ్పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నెలకు రూ.10 లక్షల భరణంతోపాటు రూ.50 కోట్ల పరిహారాన్ని పీటర్ నుంచి ఇప్పించాలన్నారు. ప్రస్తుతం తన పిల్లల కస్టడీ, న్యాయం కోసం ఆమె పోరాడుతున్నారు. పలు హిందీ చిత్రాల్లో నటించిన సెలీనా జైట్లీ 2004లో విడుదలైన తెలుగు సినిమా ‘సూర్యం’లో నటుడు మంచు విష్ణు సరసన నటించారు. -
బిజినెస్ ఉమెన్ @ మెట్ మెరుపులు
ఒకప్పుడు మోడల్స్కు, సినీతారలకు మాత్రమే పరిమితమైన గ్లామర్ వేదికలపై ఇప్పుడు మహిళా వ్యాపారవేత్తలు కూడా మెరుస్తున్నారు. వ్యాపార రంగంలో మాత్రమే కాదు ఫ్యాషన్ మెరుపుల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా న్యూయార్క్లో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ రెడ్ కార్పెట్పై నిర్వహించిన మెట్గాలా ఫ్యాషన్ ఈవెంట్ మరోసారి గ్లామరస్ బిజినెస్ టైకూన్స్ మెరుపులకు పట్టం కట్టింది. ఒక్కొక్కరు ఒక్కోరకమైన విశేషాల వస్త్రధారణతో ర్యాంప్పై తళుక్కుమన్నారు.కోట్ల విలువైన వజ్రాభరణాలతో...ప్రముఖ వ్యాపార సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్– ఇన్ఫ్రాస్ట్రక్చర్స్’ సంస్థకు చెందిన వ్యాపారవేత్త సుధారెడ్డి, న్యూయార్క్ నగరంలో జరిగిన మెట్ గాలా ఈవెంట్లో సెన్సేషన్గా నిలిచారు. భారతీయ వస్త్ర సంప్రదాయాలను ముఖ్యంగా తెలంగాణ వస్త్రశైలుల విశిష్టతను చాటిచెబుతూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులలో ఆమె ర్యాంప్ వాక్ చేశారు. ఈ సంవత్సరపు ‘కాస్ట్యూమ్ ఆర్ట్’ థీమ్కు అనుగుణం గా, ‘ది ట్రీ ఆఫ్ లైఫ్’ పేరుతో ఆమె వస్త్రధారణను బాలీవుడ్ టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ప్రఖ్యాత సెలబ్రిటీ స్టైలిస్ట్ మారియల్ హేన్ సంయుక్తంగా రూపొందించారు. దీనికితోడు దాదాపు 126 కోట్ల విలువైన ఆభరణాలు సైతం ధరించి ఆమె అందరి దృష్టిని మరింతగా ఆకర్షించారు. ‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’ అని పేర్కొనే 550 క్యారెట్ల భారీ ముదురు ఊదా–నీలం రంగు టాంజనైట్, విక్టోరియన్ శైలి వజ్రాల నెక్లెస్ వీటిలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదరహో ... అంబానీ...ఇదే మెట్ గాలాకు ప్రముఖ వ్యాపార కుటుంబం అంబానీ ఫ్యామిలీ నుంచి ఇషా అంబానీ హాజరయ్యారు. ఆమె స్వదేశ్ కళాకారుల సహకారంతో డిజైనర్ గౌరవ్ గు΄్తా రూపొందించిన కస్టమ్ కౌచర్ చీరను ధరించారు. స్వచ్ఛమైన బంగారు దారాలతో నేసిన ఈ చీరపై, లేత బంగారం మట్టి రంగులలో చేతితో చిత్రించిన పిచ్వాయి–ప్రేరిత మోటిఫ్లు ఉన్నాయి. ఈ డిజైన్, చీరను ఒక శిల్పంలాంటి డ్రేప్తో, ఒక కళాత్మక రూపంగా ఆవిష్కరించింది. భారతీయ కళాకారుల చేతుల మీదుగా బంగారంతో నేసిన ఈ చీర పైభాగానికి, వస్త్రంపై 200కు పైగా పాతకాలపు వజ్రాలను చేతితో కుట్టారు. ఇవన్నీ ఆమె తల్లి నీతా అంబానీ వ్యక్తిగత ఆభరణాల సేకరణ కావడం విశేషం.స్టైల్స్లో ‘రాణింపు...జైపూర్ రాజ కుటుంబం కూడా మెట్ గాలా లో తనదైన శైలి రాజసం ఒలికించింది. రాజ వంశపు వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకువస్తూ, యువరాణి గౌరవి కుమారి తన అమ్మమ్మ నుంచి ప్రేరణ పొందిన దుస్తులతో మెట్గాలాలో అరంగేట్రం చేశారు. ప్రబల్ గురుంగ్ రూపొందించిన ఈ గౌనులో, మహారాణి గాయత్రీ దేవి అందించిన గులాబీ రంగు షిఫాన్ చీరను పొందుపరిచి, దానిని జైపూర్ నుంచి తెచ్చిన ముత్యాలు, కట్ చేయని వజ్రాలతో అలంకరించారు. ఈ లుక్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.అనన్య సామాన్యం...బిర్లాల కుటుంబానికి చెందిన భారతీయ మహిళా వ్యాపారవేత్త అనన్య బిర్లా కూడా తనదైన శైలిలో పూర్తి వైవిధ్యాన్ని ప్రదర్శించారు. డిజైనర్ రాబర్ట్ వన్ రూపొందించిన కస్టమైజ్డ్ దుస్తులను ధరించిన ఆమె, మెరిసే నల్లటి లోహంతో చేసిన స్కర్ట్పై బిగుతైన పెప్లమ్ జాకెట్ను ధరించారు. ప్రముఖ భారతీయ కళాకారుడు సుబోధ్ గు΄్తా రూపొందించిన వెండి ఫేస్ మాస్క్తో ఆమె సరికొత్త లుక్ను ప్రదర్శించారు. అతిరథ మహారథులైన హాలీవుడ్ నటీ నటులు, బాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ పాల్గొనే మెట్గాలాలో మన భారతీయ మహిళా వ్యాపారులు సైతం తమ సత్తా ప్రదర్శించడం... మహిళల్లోని మల్టీ టాస్కింగ్ స్కిల్స్కు చిరు ఉదాహరణ మాత్రమే... మొత్తం మీద మెట్గాలా వేడుకలో బిజినెస్ ఉమెన్ మెరుపులు అందరినీ అబ్బుర పరచాయి. – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
ఆట.. టైమ్ పాస్ కాదు!
అమ్మ ఎలాగో ఆటలు అలాగే! అమ్మ మన దగ్గర ఉంటే వంద పండుగల సంతోషం. వెయ్యి ఏనుగుల బలం. అమ్మలాగే ఆటలను ప్రేమిస్తే...గుండెల్లో పెట్టుకుంటే...ఎంతో ఆరోగ్యంగా ఉంటాం... ఎంతో యాక్టివ్గా ఉంటాం...ఎన్నో లైఫ్స్కిల్స్ తెలుస్తాయి. ఫ్రెండ్స్, మీకు వీడియో గేమ్స్... ‘రెసిడెంట్ ఈవిల్’ ‘డ్రాగన్ క్వెస్ట్’ ‘మౌస్ ఫర్ హైర్’ ‘మారియో టెన్నిస్ ఫీవర్’ ... తెలుసా? మీలో చాలామంది చెప్పే జవాబు... ‘యస్!’మరి ఇప్పుడు చెప్పండి....చిర్రె గోనె/ బిళ్లంగోడు, చెండాట/ గిల్లాయిలు, నేల బండ, గుడు గుడు గుంజం, నాలుగు స్తంభాల ఆట, కప్ప గంతులు.... ఈ ఆటల గురించి మీకు తెలుసా? మీలో చాలామంది చెప్పే జవాబు... ‘సారీ....తెలియదు’‘తెలియదు’ అనే మాట మీ నోటి నుంచి వచ్చిందంటే మీరు చా...లా మిస్ అవుతున్నారన్నమాట. వీడియో గేమ్స్ మాత్రమే కాదు బయట గ్రౌండ్లో ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ ఆటలు ‘వోన్లీ టైమ్పాస్’ కోసం కాదు. మీకు శారీరకంగా (ఫిజికల్గా), మానసికంగా (మెంటల్గా) చాలా ఉపయోగపడతాయి.మీ క్లోజ్ఫ్రెండ్స్ ఎవరంటే...‘మా అబ్బాయి ఎవరితో కలవడు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు’ బాధతో వచ్చే ఈ మాట పెద్దల నోటి నుంచి వినే ఉంటారు. వారు ఎందుకు బాధపడుతుంటారో తెలుసా? పిల్లలు అంటేనే యాక్టివ్... యాక్టివ్. చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్. వారికి ఫ్రెండ్సే లోకం. మరి అలాంటి పిల్లలు ఒంటరిగా ఉండడం ఏ తల్లిదండ్రులకైనా బాధే కదా! గ్రౌండ్లో ఆడే ఆటలు ఉన్నాయి కదా...అవి ఏం చేస్తాయంటే మీలో ఒంటరితనాన్ని పోగొట్టి ఎప్పుడూ యాక్టివ్గా ఉండేలా, స్నేహితుల మధ్య సందడిగా ఉండేలా చేస్తాయి. చెప్పకుండానే ఆటలు మనకు ఎన్నో మంచి విషయాలు చెబుతాయి.‘గెలుపు ఓటములు సహజం’‘ఓడిపోయినప్పుడు బాధ పడుతూ కూర్చుంటే బాధే మిగులుతుంది. చివరికి అది నీకు క్లోజ్ఫ్రెండ్ అవుతుంది. గెలుపు దూరం అవుతుంది’‘ఓడిపోయినా సరే... వచ్చేసారి నేను కచ్చితంగా గెలవగలను అనే పట్టుదల మీలో ఉంటే పట్టుదల, ఆశ, కష్టం అనేవి మీకు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతాయి. ఈ ఫ్రెండ్స్ మీకు తోడుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ గెలుపు మీదే! మీ కలలకు పేదరికం అడ్డుకాదుఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాజస్థాన్కు చెందిన పూజా బిష్ణోయి గురించి తెలుసుకుందాం. ఈ పాప గురించి వింటే మీకు చా...లా ఇన్స్పైరింగ్గా ఉంటుందన్నమాట. ‘పూజాలా నేను కూడా సాధిస్తాను. ప్రపంచాన్ని చూస్తాను’ అనే కల మీలో తప్పకుండా మొలకెత్తుతుంది. ఆ మొలక చాలు కదా... రేపు చెట్టు కావడానికి.... ఆ నీడలో మీరు పెద్ద పేరు తెచ్చుకోవడానికి!పదమూడు సంవత్సరాల పూజ వరుస విజయాలతో అథ్లెటిక్స్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. వేగం, ఓర్పుకు పేరుగాంచిన పూజ 800 మీ, 1500 మీ, 300 మీ, 4 కిలోమీటర్ల ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ గెలిచింది. అండర్–19 ఐపీఎస్సీ అథ్లెటిక్స్ టోర్నమెంట్లో రికార్డ్ క్రియేట్ చేసి ‘బెస్ట్ అథ్లెట్’గా నిలిచింది. అయిదేళ్ల వయసులోనే అథ్లెటిక్స్ ప్రపంచంలోకి అడుగపెట్టిన పూజ, ఎనిమిదేళ్ల వయసులో 3 కిలోమీటర్ల పరుగును 10 నిమిషాల 50 సెకన్లలో పూర్తిచేసి రికార్డ్ సృష్టించింది.శిక్షణ ప్లస్ క్రమశిక్షణ‘స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలంటే చాలా డబ్బులు కావాలి. అందుకే వాటి గురించి సీరియస్గా తీసుకోవడం లేదు’ అనే మాట కొందరు తల్లిదండ్రుల నుంచి వినబడుతుంటుంది. ‘డబ్బు లేకపోతే ఆటలు లేవు’ అనే మాట నిజమైతే రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన పూజ నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకునేది కాదు. ఆమె తండ్రి చిన్న రైతు. పెద్దగా డబ్బులు లేవు. అంతమాత్రాన పూజ తల్లిదండ్రులు ఊరుకోలేదు.‘ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా అమ్మాయిని ఆటల్లో తీర్చిదిద్దాలి’ అనుకున్నారు. వారు అనుకున్నట్లుగానే జరిగింది. అథ్లెటిక్స్లో పూజ పెద్ద పేరు తెచ్చుకుంది. పూజ మరిన్ని విజయాలు సాధించడానికి ‘నీకు మేమున్నాం’ అంటూ ముందుకు వచ్చింది విరాట్ కోహ్లి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ పూజకు ట్రైనింగ్ ఇప్పించడం, ప్రయాణ ఖర్చులు, పోషకాహారం...మొదలైనవి సమకూరుస్తోంది.‘శిక్షణ’కు ‘క్రమశిక్షణ’ తోడైతే ఎన్ని విజయాలు సాధించవచ్చో పూజా బిష్ణోయి నిరూపించింది. యూత్ ఒలింపిక్స్లో మెడల్ గెల్చుకోవాలని కలలు కంటోంది.పారిపోయిన వారు...పరుగెత్తుకుంటూ వచ్చారు!ఫ్రెండ్స్, మీరు రోజూ స్కూల్కు వెళతారు కదా, కొందరు పిల్లలు మాత్రం స్కూల్ అంటేనే ‘అయ్య బాబోయ్’ అని దూరంగా పారిపోతారు. అలాంటి పిల్లలు కూడా ఇష్టంగా స్కూల్కు వెళ్లేలా చేసే శక్తి ఆటలకు ఉంది. ముంబైలోని ఒక స్లమ్ ఏరియాలో తరచుగా బడికి బంక్ కొట్టే పిల్లలని చూశారు అశోక్ రాథోడ్. ఈయన ఫుట్బాల్ కోచ్. ఫుట్బాల్ మ్యాచ్లతో పిల్లలకు చాలా క్లోజ్ అయ్యారు. మెల్లగా పిల్లలను బడికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. స్కూల్కు వెళ్లడమే కాదు....ఇప్పుడు ఆ పిల్లలలో క్రమశిక్షణ పెరిగింది. ఫుట్బాల్ గేమ్లో ‘వావ్’ అనిపిస్తున్నారు.– యాకుబ్ -
అమ్మకు రెండు తరాల బరువు
కూతురి కాలేజ్ ఫీజు ఒకవైపు... మామగారికి పక్షవాతం మరోవైపు... 50 దాటిన మహిళలు ఇలా ఒకేసారి రెండు తరాల మధ్య స్ట్రెస్ అనుభవిస్తున్నారు. దీనినే ‘శాండ్విచ్ జనరేషన్ స్ట్రెస్’ అంటారు. భర్తతో అడ్జస్ట్ అవడం, మెనోపాజ్ సమస్యలు ఇందుకు అదనం. ఒక సర్వే ప్రకారం అర్బన్ ఇండియాలో 35 శాతం మహిళలు ఇలా పిల్లలూ పెద్దల మధ్య నలుగుతున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న ఒక అమ్మ ఏం చేసింది?ఆమెలాంటి అమ్మను మనం చాలామందిని చూసి ఉంటాం. వయసు 49 ఏళ్లు. హైదరాబాద్లో స్కూల్ అడ్మిన్గా ఉద్యోగం. మధ్యతరగతి జీవితం. ఈమె చన్నీళ్లకు భర్త సంపాదన వేణ్ణీళ్లు. ఇద్దరూ సంపాదించకపోతే బండి నడవదు. ఆమె పని ఉదయం ఏడుకే మొదలైపోతుంది. గిన్నెలు, టిఫిన్ వండటాలు... చేయదగ్గవే. కాని అత్తగారిని చూసుకోవాలి. డెబ్బై అయిదేళ్ల అత్తగారికి డైపర్ మార్చడం, మందులు వేయడం, టిఫిన్ తినేలా చూసి ఆ తర్వాత లంచ్ బాక్స్ రెడీ చేసుకొని ఆఫీసుకు పరుగు పెట్టడం... ఒకరోజు కాదు రెండు రోజులు కాదు... నిత్యం.ఆఫీసులో ఉండగా కూతురి ఫోన్ వస్తుంది. కాలేజీ ఫీజు గురించి. కొడుకు ఫోన్ వస్తుంది... దొరకని ఉద్యోగం గురించి... చేరాల్సిన కోర్సు గురించి. ఆఫీసులో బాసు పని మీద పని చెప్తుంటాడు. అలిసి సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ డ్యూటీ. అత్తగారికి డిన్నర్, కూతురికి కౌన్సెలింగ్, కొడుకుకి మోటివేషన్. రాత్రి పదకొండుకు మంచం మీద వాలితే ఆమెకు కలిగే భావన ఏమిటి?ఆమెలో మార్పులురోజులు గడిచే కొద్దీ ఆమెలో మార్పులు వచ్చాయి. అవి ఆమె అదుపులో లేవు. ఏమిటవి? ఎవరిని చూసినా కోపం రావడం. అత్తగారు మంచం తడిపితే అరిచేసి తర్వాత గిల్టీ ఫీల్ అయ్యి ఏడవడం. రోజురోజుకూ ఖర్చులు పెరిగి ఇప్పుడే రూపాయి మిగలకపోతే నాకు అరవై వచ్చేసరికి ఏం మిగులుతుంది అనే ఆందోళన. అద్దంలో చూసుకుంటే తనకు తానే గుర్తు పట్టని రూపం. మెనోపాజ్ చికాకు, నడుము నొప్పి, బి.పి... ఒకరోజు ఆఫీస్లో కళ్లు తిరిగి పడిపోయింది. డాక్టర్ ఆమె సంగతి అంతా గ్రహించి ‘మీరు ఇప్పుడు మారకపోతే, మీ అత్తగారి పక్క బెడ్ మీదే మీరుంటారు’ అన్నాడు. ‘మీకూ జీవితం ఉండాలి. మీరు అమ్మగా మాత్రమే బతుకుతున్నారు’ అన్నాడు.మొదలైన మార్పుడాక్టర్ మాటతో ఆమెలో ఆలోచన రేగింది. ఒక స్నేహితురాలి సహాయంతో ఒక సైకాలజీ కౌన్సిలర్తో మాట్లాడింది. ‘శాండ్విచ్ జనరేషన్ స్ట్రెస్’ గురించి కొంత క్లారిటీ తెచ్చుకుంది. కొన్ని మార్పులు చేసుకుంది. జీవితం అంటే తనకు తాను మిగిలేలా బతకడం అనే ఎరుక తెచ్చుకుంది. ఈ అమ్మ మరి ఏం చేసింది?‘సూపర్ ఉమన్’ టైటిల్ వదిలేసిందికుటుంబ సభ్యులతో మీటింగ్ పెట్టి భర్త, కొడుకుతో ఖచ్చితంగా చెప్పింది– ‘నేను ఒక్కదాన్నే చేయలేను. మీరు కూడా చేయాలి’. ఇప్పుడు ఉదయం అత్తగారి మందులు భర్త బాధ్యత. సాయంత్రం భోజనం కొడుకు పెడతాడు. డైపర్ మార్చే పనిలో కూతురు సాయం పడుతుంది. సాయం అడగడం బలహీనత కాదు, తెలివి అని ఆమెకు అర్థమైంది.తనకంటూ రెండు రోజులునెలకు రెండు రోజులు... అంటే ఆదివారాలు తను పూర్తి విశ్రాంతి తీసుకోదలిచింది. ఆ రెండురోజుల కోసం ఒక హోమ్ నర్స్ను అత్తగారి కోసం ఏర్పాటు చేస్తుంది. అలాగే వంట పూర్తిగా బంద్ చేసి పిల్లలు చేసేదో బయటి నుంచి తెచ్చేదో ఉండాలంటోంది. ఆ రెండు రోజులు సినిమా, నిద్ర, ఫ్రెండ్స్తో కబుర్లు. ఆ రెండు రోజుల బలంతో మిగిలిన 28 రోజులు లాగించగలుగుతోంది.ఆర్థిక బరువు తగ్గించికూతురితో స్పష్టంగా చెప్పింది– ‘ఈ సెమిస్టర్ ఫీజు కడతాను. నెక్స్ట్ సెమిస్టర్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకో. నా రిటైర్మెంట్ ఫండ్ ఖాళీ అయితే, రేపు నేను మీ మీద భారం అవుతాను’. కొడుక్కి కూడా కోర్సులు చేరాలంటే పార్ట్టైమ్ చేసి సంపాదించు అని.తన సమయం– ‘మీ’ టైమ్రోజులో తన సమయం కొంత ఉండాలనుకుంది. ప్రతిరోజూ ఉదయం కాసేపు టెర్రస్ మీద నిలబడి కాఫీ తాగుతుంది. ఆ టైమ్లో చేతిలో ఫోన్ ఉండకూడదు, వేరే ఆలోచనలు ఉండకూడదు. అలాగే సాయంత్రం డిన్నర్ తర్వాత కాసేపు పచార్లకు సమయం. 6 నెలల తర్వాత ఆమె బి.పి. కంట్రోల్లోకి వచ్చింది. అందరూ దారికి వచ్చారు. నేను నా జీవితాన్ని కాపాడుకున్నాను అనుకుంది ఆ అమ్మ. కాదు మహిళ. కాదు కాదు ఒక జీవని. -
పౌరసత్వ చట్టంలో ఆ ప్రక్రియ మీకు వర్తించదు!
నా భర్త ఇటీవలే ఫ్రాన్స్ దేశ పౌరసత్వం పొందారు. కుటుంబ కారణాల వల్ల నేను ఇక్కడే నా కూతురిని చదివించుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. సమస్య ఏంటంటే ఇప్పుడు మా ఆయన భారత పాస్పోర్టు తిరిగి ఇచ్చేసి ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవగా ముందు సెక్షన్ 8 కింద పౌరసత్వాన్ని రినన్సియేట్ (తిరిగి వదిలేయటం) చేయాలని చెప్తున్నారు. మరోదేశం పౌరసత్వం తీసుకున్నాక భారత పౌరసత్వం రద్దవదా? భారత ప్రభుత్వ వెబ్సైట్లో సెక్షన్ 8 ప్రక్రియ చేస్తే గనక ఆ పౌరుని సంతానానికి కూడా భారతీయ పౌరసత్వం పోతుందని చదివాను. నా కూతురికి పౌరసత్వం పోతే ఇబ్బంది అవ్వచ్చు. మా ఆయన ఓసీఐ పొందాలంటే వారు చెప్పినట్టు సెక్షన్ 8 ప్రకారం పౌరసత్వం వదిలేస్తున్నట్టు ప్రకటించాల్సిందేనా?– మనోజ్ఞ, చిత్తూరుభారత పౌరసత్వం చట్టం 1955లోని సెక్షన్ 9(1) ప్రకారం, మీరు ఫ్రాన్స్ దేశ పౌరసత్వం పొందిన రోజునుంచే మీ భారత పౌరసత్వం దానంతట అదే రద్దవుతుంది. దీనికి ఎటువంటి ప్రత్యేక ప్రకటన లేదా అనుమతి అవసరం లేదు. అందువల్ల ఆ చట్టంలోని సెక్షన్ 8 (రినన్సియేషన్) ప్రక్రియ మీకు వర్తించదు, అవసరం లేదు. ఇప్పటికీ భారత పౌరుడిగా ఉన్న వ్యక్తి స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని వదులుకునే సందర్భంలో మాత్రమే సెక్షన్ 8 ఉపయోగించబడుతుంది. మీలాగా వేరే దేశం పౌరసత్వం తీసుకుంటే అసలు ఆ ప్రక్రియ – సందర్భం రెండూ అప్రస్తుతం. పౌరసత్వ చట్టం లేదా పాస్పోర్టు నిబంధనల ప్రకారం, సెక్షన్ 9 కింద పౌరసత్వం రదై్దన సందర్భంలో సెక్షన్ 8 తప్పనిసరి అని ఎక్కడా లేదు.సరైన విధానం ఏమిటంటే...(జీ) భారత పాస్పోర్ట్ను సరెండర్ చేయడం,(జీజీ) సరండర్ ధ్రువీకరణ పత్రం ΄పొందడం,(జీజీజీ) ఓసీఐ కోసం దరఖాస్తు చేయడం. ఇకపోతే, మీరు భయపడుతున్నట్లు సెక్షన్ 8 ప్రక్రియ చేస్తే మీ కూతురి భారతీయ పౌరసత్వం పోయే ప్రమాదం లేకపోలేదు. అలా చేయాల్సిందే అని ఎవరైనా అంటే, ఫ్రాసెస్లోని భారతీయ ఎంబసీ ను సంప్రదించండి. వారు కూడా అలాగే అంటే, మీ భర్తను భారతదేశానికి వచ్చి ఇక్కడ ఓసీఐ కోసం దరఖాస్తు చేయమని చెప్పండి. ఇతర దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు ఎవరూ ఇప్పటివరకూ సెక్షన్ 8 ప్రక్రియ చేయమని అడిగిన దాఖలాలు లేవు. పైగా అలా చెయ్యొద్దు అన్న సూచనలు ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్నాయి. పైన సూచించిన విధంగా పాస్పోర్ట్ సరెండర్ ప్రక్రియను కొనసాగించమని ఫ్రాన్స్లోని రాయబారి కార్యాలయానికి అధికారికంగా తెలియజేయండి. ఏదైనా సమస్య వస్తే, విదేశాంగ శాఖకు ఫిర్యాదు/దరఖాస్తు చేయండి. ఖచ్చితంగా మీ సమస్య తీరుతుంది. లేకుంటే హై కోర్టులో వ్యాజ్యం వేసే అవకాశం మీకు ఉంది.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: సంగీతానికి వయసుతో పనిలేదు..! వాహ్వా అనిపించుకున్న రిటైర్డ్ టీచర్) -
ఈ సమ్మర్లో... లెక్క తేల్చాల్సిందే!
ఫ్రెండ్స్, చాలామంది పిల్లలలాగే మీకూ మ్యాథ్స్ అంటే భయమా? అయితే ఈ వేసవి సెలవులు మీకు గుర్తుండిపోతాయి. మీరు ‘ఊ’ అనాలేగానీ ఆ భయాన్ని పోగొట్టడం వెరీ వీజీ. మీలోని ఆ భయం పారిపోతే మ్యాథ్స్ అంటే మీకు ఎంతో ఇష్టం ఏర్పడుతుంది. ప్రామిస్...మీకు టింకు గురించి ఒక విషయం చెప్పాలి. మనం హారర్ సినిమాలు చూసినప్పుడు కాస్తో కూస్తో భయపడతాము కదా...అయితే మన ఫ్రెండ్ టింకు మాత్రం కొం...చెం కూడా భయపడడు. ‘ఆ హారర్ సినిమా చూసి పెద్దవాళ్లే భయపడ్డారు. నువ్వేమిటీ కొంచెం కూడా భయపడలేదు!’ అని అడిగితే...‘నేను మ్యాథ్స్కు తప్ప దేనికీ భయపడను’ అన్నాడట. టింకు జవాబుకు మనం నవ్వుకున్నా... మ్యాథ్స్ అనేది చాలామంది పిల్లలకు సీరియస్ ప్రాబ్లం. మీకు కథలు వినడం, చదవడం చాలా ఇష్టం కదా! మరి కథలు అనేవి టైమ్పాస్ కోసమే కాదు కదా....మన జీవితంలో ఎన్నో సమస్యలు, వాటి పరిష్కారాలు కథలలో ఉంటాయి. అందుకే మ్యాథ్స్ను కథలతో పోలుస్తారు.గణిత కథలుమ్యాథ్స్ అంటే బోలెడు భయం ఉన్న పిల్లల్లో ఆ భయాన్ని పోగొట్టడానికి బెంగళూరులోని దిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ గణిత విభాగం ‘మ్యాథ్స్ స్టోరీస్ రైటింగ్’ పేరుతో కొత్త ప్రయోగం మొదలుపెట్టింది. ఈ ప్రయోగం సూపర్గా సక్సెస్ అయింది. ఎప్పుడూ చురుగ్గా, హుషారుగా ఉండే అమిత్ మ్యాథ్స్ క్లాస్లో మాత్రం సైలెంటై΄ోతాడు. రాక్షసుడు ఉన్న గుహలో కూర్చున్నట్లు భయం భయంగా కనిపిస్తాడు. అయితే ‘కథలతో గణితం’ ప్రయోగం అమిత్లో ఎంతో మార్పు తెచ్చింది.‘సంకలనాలు అంటే ఏమిటి?’‘సంఖ్యలకు ఎందుకు అంతం లేదు?’‘ఆకారాలకు(షేప్స్) నిర్దిష్టమైన పేర్లు ఎందుకు పెట్టారు?’... ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు అడుగుతున్నాడు అమిత్. అంతేకాదు చిన్న చిన్న బొమ్మలు గీయడం, పదవినోదాలను సరైన వాక్యాలతో పూర్తి చేయడం ద్వారా మెల్లగా మ్యాథ్స్ నేర్చుకోవడం మొదలుపెట్డాడు.కాన్సెప్ట్లే కథలుగా....దిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ స్కూల్ ఇన్–హౌజ్ పబ్లికేషన్ ‘అసైన్మెంట్ బుక్లెట్’లో స్టూడెంట్స్ కోసం మ్యాథ్స్ స్టోరీస్ ఉంటాయి. మ్యాథ్స్ కాన్సెప్ట్ను ఉపయోగించి కథ రాయాల్సిందిగా పిల్లలకు చెబుతుంటారు. గణిత కథల ద్వారా చాలామంది విద్యార్థులలో మార్పు వచ్చింది. ఏదైనా ప్రాబ్లం ఇవ్వగానే భయపడ కుండా నింపాదిగా ఆలోచిస్తున్నారు. మ్యాథ్స్ ప్రాబ్లమ్ను జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారు. ఉదాహరణకు...వైశాల్యం ఆధారిత సమస్యలను (ఏరియా–బేస్డ్ ప్రాబ్లమ్స్) పరిష్కరించాల్సి వస్తే చిన్న చిన్న బొమ్మలు గీస్తారు. వాటిని కథలలోని క్యారెక్టర్లుగా ఊహించుకుంటారు. నిజజీవిత పరిస్థితులకు అన్వయించుకుంటూ వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. టి.వి. పద్మ ‘మ్యాథెమా‘ట్విస్ట్’: నంబర్ టేల్స్ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్’, అర్చన శరత్ ‘టేల్స్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ మ్యాథమేటిక్స్’... కథలతో మ్యాథ్స్ను ఆసక్తికరంగా పరిచయం చేసే పుస్తకాలు.భాంజు... ట్రబుల్ షూటర్మ్యాథ్స్ యాంగ్జయిటీ అనేది ఎంతోమంది పిల్లలు ఎదుర్కొంటున్న సమస్య. ఆ ఆందోళనను పిల్లల నుంచి దూరం చేయడానికి తన ఎడ్టెక్ స్టార్టప్ ‘భాంజు’తో శ్రీకారం చుట్టారు నీలకంఠ భానుప్రకాష్. పాత రికార్డ్లు బద్దలు కొట్టి కొత్త రికార్డ్లు సృష్టించడం ఆయన ఘనత. ‘గణితం కొందరి కోసం కాదు అందరి కోసం’ అనే లక్ష్యంతో నీలకంఠ ప్రారంభించిన ‘భాంజు’ గణిత అభ్యాస వేదిక. ఇంటరాక్టివ్ టీచింగ్, పజిల్స్, మెంటల్ కాలిక్యులేషన్ టెక్నిక్స్... మొదలైన వాటి ద్వారా సరదా సరదాగా మ్యాథ్స్ నేర్చుకోవడానికి, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ‘భాంజు’ ఉపయోగపడుతుంది. ‘భాంజు’కు సంబంధించి...లైవ్ ఆన్లైన్ క్లాసులు: కథలు, రియల్లైఫ్ ఎగ్జాంపుల్స్, చాలెంజెస్, ఆటల ద్వారా పిల్లలకు అర్థమయ్యేలా గణిత పాఠాలు చెబుతారు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు. భాంజు బడ్డీ: ఇన్స్టంట్ ఎక్స్ప్లనేషన్స్, రియల్–టైమ్ ఫీడ్బ్యాక్ కోసం ఏర్పాటైన 24/7 ఏఐ–పవర్డ్ అసిస్టెంట్. భాంజు ప్లే యాప్: గేమిఫైడ్ డైలీ ప్రాక్టిస్, పోటీలు, లీడర్ బోర్డులు, కాయిన్స్ అండ్ రివార్స్ కోసం. పేరెంట్ యాప్: షెడ్యూల్స్, టీచర్ ఫీడ్బ్యాక్, కాంగ్రెస్ను మానిటరింగ్ చేస్తుంది.సరదా సరదాగా...బెంగళూరుకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక రీమ అయిదు సంవత్సరాల వయసులో తండ్రి ద్వారా ఒకటి నుంచి ఇరవై వరకు లెక్కించడం నేర్చుకుంది. ఇక అప్పటినుంచి ఆ అమ్మాయికి అంకెలే లోకం అయ్యాయి. తమ పెరటితోటలో వికసించే పువ్వుల సంఖ్య, ఆ పువ్వుల దగ్గరకు వచ్చే సీతాకోక చిలుకల సంఖ్య, కిందపడిన రొట్టెముక్కల చుట్టూ పాకే చీమల సంఖ్య... మొదలైనవి రోజూ లెక్కించేది. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ‘ఇప్పటి వరకు 50 కిలోమీటర్ల దూరం వచ్చాం. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం చేరాల్సిన ఊరుకు చేరుతాం’ లాంటి ప్రశ్నలకు సరిగ్గా జవాబు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేది. మీకు చెప్పేదేమిటంటే... మ్యాథ్స్ను సీరియస్గా కాదు, సరదా సరదాగా నేర్చుకోవాలి. మ్యాథ్స్ కాన్సెప్ట్లు బాగా గుర్తుండి పోవాలంటే... రీమలాగే మీరు కూడా ఎక్కడో ఒకచోట కూడికలు, తీసివేతలు, గుణకారాలు... మొదలైన వాటిని ఉపయోగిస్తుండాలి. – యాకూబ్(చదవండి: వేసవి సెలవులను ఇలా వినియోగించుకుందామా..!) -
వేసవి సెలవులను ఇలా వినియోగించుకుందామా..!
వేసవి సెలవులు అంటే పిల్లలు సరదాగా గడుపుతూ, సేదతీరుతూ కొత్త విషయాలను అన్వేషించడానికి ఉద్దేశించిన సమయం. వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కాలం ఇదే, ఎందుకంటే ఇది వారికి వారి దైనందిన జీవితం నుండి ఒక విరామాన్ని అందిస్తుంది.ఉత్సాహంగా మొదలైనది త్వరలోనే అంతులేని స్క్రీన్ సమయంగా, చంచలమైన శక్తిగా, మరియు పిల్లలను అర్థవంతంగా నిమగ్నంగా ఉంచడానికి చేసే రోజువారీ పోరాటంగా మారిపోతుంది. కానీ వేసవిని నిర్వహించాల్సిన విషయంగా కాకుండా, గరిష్టంగా సద్వినియోగం చేసుకునే విషయంగా మారితే ఎలా ఉంటుంది?ప్రేమియా అకాడమీలో, 'రైజ్' (RAISE) అనే విధానమే మా మార్గదర్శక సూత్రం. ఇది పిల్లలు సృజనాత్మకతను పునఃసృష్టించుకోవడం, కొత్త నైపుణ్యాలను సంపాదించడం, అర్థవంతంగా ఇతరులతో మమేకమవడం, సామాజిక-భావోద్వేగ ఎదుగుదలను బలోపేతం చేసుకోవడం, మరియు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడం వంటి అంశాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. ఈ దృక్పథంతో, వేసవి సెలవులు కేవలం విరామ సమయంగా కాకుండా, ఎదుగుదలకు ఒక అవకాశంగా మారతాయి.సృజనాత్మకతను పునఃసృష్టించండి (భావవ్యక్తీకరణను వెలికితీయండి)చాలా సందర్భాలలో, పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణంతో మమేకమవ్వడంలో సృజనాత్మకత అనేది వారు వేసే మొదటి అడుగు. వేసవి సెలవుల్లో వారిని పరిసరాలతో స్వేచ్ఛగా మమేకమవ్వనివ్వడం వల్ల, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి అవసరమైన సృజనాత్మక సామర్థ్యాలను కనుగొనే అవకాశం లభిస్తుంది.సృజనాత్మకత వెల్లివిరిసే వాతావరణాన్ని సృష్టించండి:పెయింటింగ్, స్కెచింగ్, లేదా DIY క్రాఫ్ట్స్కథలు చెప్పే సెషన్లు లేదా కామిక్ సృష్టిరీసైకిల్ మెటీరియల్స్ ఉపయోగించి బిల్డింగ్ మోడల్స్చిన్న వయసులోనే సృజనాత్మకతను పెంపొందించుకుంటే అది ఎంత శక్తివంతంగా ఉంటుందో గుర్తుచేసే అవకాశాన్ని 'తారే జమీన్ పర్' వంటి సినిమాలు సైతం వదులుకోవు. లక్ష్యం పరిపూర్ణత కాదు, భావవ్యక్తీకరణ.నూతన యుగ నైపుణ్యాలను పొందండి (భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే అభ్యాసం)సమకాలీన ప్రపంచంలో వేగంగా జరుగుతున్న పురోగతితో, విద్య తరగతి గది నాలుగు గోడలు మరియు పాఠ్యపుస్తకాల పరిధిని దాటి చాలా ముందుకు సాగింది. వేసవి సెలవులు పిల్లలకు ఒత్తిడి లేని వాతావరణంలో అత్యాధునిక నైపుణ్యాలను సంపాదించడానికి అనువైన వేదికను అందిస్తాయి, ఇక్కడ నేర్చుకోవడం విసుగు పుట్టించేలా కాకుండా సరదాగా ఉంటుంది.వారికి ఇవి పరిచయం చేయండి:ప్రాథమిక కోడింగ్ (స్క్రాచ్, ప్రారంభకులకు అనుకూలమైన ప్లాట్ఫారమ్లు)రోబోటిక్స్ కిట్లు మరియు సాధారణ ఎలక్ట్రానిక్స్డిజిటల్ ఆర్ట్, యానిమేషన్ లేదా వీడియో క్రియేషన్పిల్లల కోసం రూపొందించిన AI-ఆధారిత సృజనాత్మక సాధనాలుఈ కార్యకలాపాలు సమస్య పరిష్కారం, తార్కిక ఆలోచన మరియు అనుకూలత వంటి నైపుణ్యాలను పెంపొందిస్తాయి, ఎందుకంటే నేటి ప్రపంచంలో నిజంగా ముఖ్యమైన నైపుణ్యాలు ఇవే.పరస్పర చర్య, ఆట ద్వారా నేర్చుకోవడం (సామాజిక జ్ఞానాత్మక ఎదుగుదల)నేర్చుకోవడం అనేది కేవలం బోధన ద్వారానే కాకుండా, భాగస్వామ్యం, పరస్పర చర్య మరియు ప్రతిస్పందన ద్వారా కూడా జరుగుతుంది. ఆట అనే భావన ఆలోచన, సంభాషణ మరియు సహకారానికి ఒక పరిపూర్ణమైన వాతావరణాన్ని అందిస్తుంది; నిజానికి, పిల్లలు నేర్చుకోవడానికి ఆట అనేది ఉత్తమమైన మార్గాలలో ఒకటి.వినోదాన్ని, ఆలోచనను మిళితం చేసే కార్యకలాపాలను ప్రోత్సహించండివ్యూహం ఆధారిత బోర్డు ఆటలుపజిల్ పరిష్కరించే సవాళ్లురోల్ ప్లే లేదా గ్రూప్ స్టోరీ టెల్లింగ్మోనోపోలీ, చదరంగం ఆటలు ప్రణాళిక, సహనం, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను ప్రోత్సహించి, మెరుగుపరుస్తాయి.రోజువారీ కార్యకలాపాల ద్వారా జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోండిపిల్లలు చేసే ప్రతీదీ నియమబద్ధంగా, పద్ధతిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు అత్యంత ముఖ్యమైన విషయాలు రోజూ చేసే సాధారణ పనుల ద్వారానే నేర్పబడతాయి. అటువంటి పనులు వారి ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు నిత్యకృత్యాల నుండే అత్యంత విలువైన పాఠాలు లభిస్తాయి.పిల్లలను ఇందులో చేర్చండి:సాధారణ భోజనం వండటం (ఓర్పును, స్వాతంత్ర్యాన్ని నేర్పుతుంది)తోటపని (బాధ్యతను మరియు ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందిస్తుంది)వారి స్థలాన్ని నిర్వహించడం లేదా చిన్న కార్యకలాపాలను ప్లాన్ చేయడంఈ క్షణాలు నిశ్శబ్దంగా ఆత్మవిశ్వాసాన్ని, స్వాతంత్ర్యాన్ని పెంపొందిస్తాయి.మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించండి (జిజ్ఞాస + ఆవిష్కరణ)జిజ్ఞాస అనేది అన్ని రకాల అభ్యాసాలకు నాంది. స్వేచ్ఛగా తిరగడానికి, కొత్త విషయాలను కనుగొనడానికి అనుమతించబడిన పిల్లలు తమ పరిసరాలను గమనించడం, ప్రశ్నించడం మరియు వాటితో సంబంధాలను ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. పిల్లలు పుట్టుకతోనే అన్వేషకులు, కాబట్టి కొత్త విషయాలను కనుగొనడానికి వారికి స్వేచ్ఛ ఇవ్వండి ప్రయత్నించండి:పెరటిలో విహారయాత్రలు లేదా ప్రకృతి నడకలుస్కావెంజర్ వేటనక్షత్రాలను చూడటం. నక్షత్రరాశుల గురించి తెలుసుకోవడంఫైండింగ్ నెమో వంటి సినిమాలు సైతం ప్రకృతి ప్రపంచం గురించి, దానికి ఆవల ఉన్న విషయాల గురించి ఉత్సుకతను రేకెత్తించగలవు.ప్యూర్ ఫన్తో బ్యాలెన్స్ చేయండిక్రమశిక్షణకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, బాల్యంలో ఆనందం, నవ్వులు కూడా ఉండాలి. ఎల్లప్పుడూ ఒక అభ్యసన లక్ష్యం ఉండవలసిన అవసరం లేదు, కొన్నిసార్లు సంతోషంగా ఉన్నా చాలు.సరళమైన, సంతోషకరమైన క్షణాలను సృష్టించండి:హోమ్ అలోన్, స్టువర్ట్ లిటిల్ & స్పై కిడ్స్ వంటి క్లాసిక్ చిత్రాలతో సినిమా రాత్రులు.ఇండోర్ క్యాంపింగ్ సెటప్లువేడి మధ్యాహ్నాలలో నీటి ఆటలుపిల్లలు తమతో పాటు ముందుకు తీసుకువెళ్లే జ్ఞాపకాలు ఇవే.వేసవి సెలవులు ఒక స్వేచ్ఛా క్షేత్రం వంటివి. ఇక్కడ సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి, అన్వేషణ మరియు ఆట వంటి వాటిని ప్రదర్శించడం పిల్లలను నిమగ్నం చేయడమే కాకుండా, వారిని ఆత్మవిశ్వాసం గల వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. వివిధ కార్యకలాపాల మధ్య సరైన సమతుల్యతను సాధించడం ద్వారా, వేసవి సెలవులు జీవితాంతం నేర్చుకోవడానికి ఒక వేదికగా మారగలవు.(చదవండి: కుమారుడి ఊహించని సర్ప్రైజ్..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు) -
కాలేయ సమస్య? విశ్రాంతి మాత్రమే మార్గమా?
కాలేయ వ్యాధి నివారణకు విశ్రాంతి మాత్రమే ఏకైక మార్గం అనేది ఒక సాధారణ అపోహ. కానీ అధ్యయనాలు,ఆధారాలు అందుకు విరుద్ధంగా చెబుతున్నాయి. సిర్రోసిస్ ఉన్నవారిలో, ఏరోబిక్,స్ట్రెంగ్త్ ట్రైనింగ్లను కలిపి చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు తగ్గుతాయి జీవన నాణ్యత అవకాశాలు మెరుగుపడతాయి. ఇది వ్యాధి పురోగతికి ఒక ప్రధాన కారణమైన కండరాల క్షీణత నుంచి కూడా రక్షిస్తుంది.కాలేయ పనితీరుకు తీవ్రమైన వర్కవుట్స్ అవసరం లేదు. నడవడం, బరువులు ఎత్తడం, శరీరాన్ని సాగదీయడం చిన్నపాటి శ్రమ వంటివి అన్నీ అది కోలుకోవడానికి సహాయపడే సంకేతాలను పంపుతాయి. అయితే తీవ్రత కంటే నిలకడ ముఖ్యం. ఒక వారం పాటు మాత్రమే సాగే పరిపూర్ణ ప్రణాళిక కంటే, నెలల తరబడి పాటించగలిగే దినచర్య ఎల్లప్పుడూ ఉత్తమమైనది.ఆహారాన్ని జీర్ణం చేయడం, రక్తం వడపోతతో పాటు కాలేయం మరెన్నో పనులు చేస్తుంది. అది శరీరంలోని ఇతర భాగాల నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా నిరంతరం సర్దుబాటు చేసుకుంటుంది. దానికి అత్యంత సన్నిహిత భాగస్వాములలో ఒకటైన కండరాలు క్రమం తప్పకుండా సంకోచించినప్పుడు, అవి కొన్ని సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఇవి కాలేయం కొవ్వును సరైన విధంగా నిర్వహించడానికి వాపును నియంత్రించడానికి సహాయపడతాయి. కండరాల కదలిక తగ్గినప్పుడు, ఆ మద్దతు కూడా తగ్గిపోతుంది, కాలేయంపై పనిభారం పెరిగి దాని విధుల నిర్వహణ కష్టమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ హెపటాలజిస్ట్, ‘ది లివర్ డాక్టర్గా పేరొందిన సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఒక వివరణాత్మక పోస్ట్లో తెలియజేశారు. వివిధ రకాల వ్యాయామాలు కాలేయానికి నిర్దిష్ట సంకేతాలను ఎలా పంపుతాయో, ప్రతి వ్యాయామానికి క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిరూపితమైన ప్రయోజనాలు ఏవేం ఉంటాయో ఆయన వివరించారు. ఆయన చెప్పిన ప్రకారం... మనం ప్రతిరోజూ కండరాలను ఉపయోగించే విధానమే, కాలక్రమేణా కాలేయం పనితీరును తీర్చిదిద్దుతుంది. కండరాలు కేవలం బలం లేదా అందం కోసం మాత్రమే కాదు. అవి జీవక్రియకు యంత్రంలా పనిచేస్తాయి. అవి సంకోచించినప్పుడు, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచే కాలేయంలో కొవ్వు నిల్వను తగ్గించే అణువులను విడుదల చేస్తాయి. ఒకే బరువు ఉన్న ఇద్దరు వ్యక్తులకు కాలేయ ఆరోగ్యం చాలా భిన్నంగా ఉంటుంది. ఇద్దరిలో బలమైన, చురుకైన కండరాలు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యకరమైన కాలేయం ఉంటుంది. రోజువారీ కదలిక పెరగడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం బాగా తగ్గుతుందని యూకేలో జరిగిన ఒక పెద్ద అధ్యయనం దృవీకరిస్తోంది.నడక: అత్యంత సులభమైన ఔషధం. వేగంగా నడవడం ఒక మంచి అలవాటు. వారానికి సుమారు 150 నిమిషాలు అలా నడిస్తే, కాలేయంలోని కొవ్వును దాదాపు మూడింట ఒక వంతు తగ్గించవచ్చుననేది ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. చిన్న మార్పులు కూడా ముఖ్యమైనవే. రోజుకు 1,000 అదనపు అడుగులు వేయడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం సుమారు 12 శాతం తగ్గుతుంది. దీనికి జిమ్ అవసరం లేదు, పరికరాలు అవసరం లేదు. కేవలం నిలకడ ఉంటే చాలు.కార్డియో...కూడా...స్థిరమైన వేగంతో జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత కొట్టడం వంటివి కార్డియోలో ఉంటాయి. మనం సరైన వేగంతో చేస్తున్నామా లేదా అనేది తెలుసుకునేందుకు ఓ సులభమైన పరీక్ష ఏమిటంటే... చేసే సయమంలో మాట్లాడటం సులభంగా అనిపించాలి, పాడటం మాత్రం కష్టంగా అనిపించాలి.వారానికి కొన్ని రోజులు, 30–45 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల కాలేయంలోని కొవ్వును తగ్గించి, కాలేయ ఎంజైమ్ల స్థాయిలను మెరుగుపరచవచ్చు. బరువు తగ్గకపోయినా ఈ ఆరోగ్య ప్రయోజనాలు కనిపించడం గమనార్హం. ఇది మన ఆలోచనల్ని కేవలం బరువు తగ్గడం నుంచి అత్యంత కీలకమైన జీవక్రియ ఆరోగ్యం వైపు మళ్లిస్తుంది.స్ప్రింట్ ఇంటర్వెల్స్స్ప్రింట్ ఇంటర్వెల్ శిక్షణ సెష¯Œ లు 15 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టవచ్చు. కేవలం ఆరు వారాల పాటు దీనిని చేయడం వల్ల, ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నవారిలో, కాలేయ కొవ్వు అంతర్గత అవయవాల కొవ్వును గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. సమయం దొరక్క ఇబ్బందిపడేవారికి, అలాగే కఠిన శ్రమను తట్టుకోగలవారికి ఇది సరిపోతుంది.హై–ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, (హెచ్ఐఐటి) అంటే చిన్న విరామాలలో తీవ్రమైన శ్రమ చేసి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడం. సుమారు 12 వారాలలో ఈ పద్ధతి కాలేయంలోని కొవ్వును 37 శాతం వరకు తగ్గించగలదు. ఇది గుండెను కూడా బలపరుస్తుంది కార్డియోతో సమానమైన ప్రయోజనాలు, దానికి పట్టే సమయంతో పోలిస్తే దాదాపు సగం సమయంలోనే లభిస్తాయి.స్ట్రెంగ్త్ ట్రైనింగ్బరువులు ఎత్తడం లేదా బాడీవెయిట్ వ్యాయామాలు చేయడం కండరాలను పెంచుతాయి, అది నేరుగా కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.శరీర బరువు మారకపోయినా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కాలేయంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇది కాలేయ ఎంజైమ్ల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ముఖ్యమైనది. ఇది కండరాల క్షీణతను నివారించడంలో సహాయపడుతుంది,రెండింటినీ కలపడం ఓ చక్కని విజయ సూత్రంకార్డియో స్ట్రెంగ్త్ ట్రైనింగ్లను కలపడం ఉత్తమమైన మార్గం. ఈ కలయిక, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది కాలేయం కోలుకోవడానికి మరింత బాగా తోడ్పడుతుంది. ఇది గుండె, కండరాలు కాలేయం అన్నీ కలిసి మెరుగుపడే సంపూర్ణ పరిస్థితిని శరీరంలో కల్పిస్తుంది.యోగా...సూర్య నమస్కారం మరికొన్ని యోగా పద్ధతులు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వీటిని క్రమం తప్పకుండా సాధన చేస్తే, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో యోగా ద్వారా కాలేయ కొవ్వును తగ్గించవచ్చు. అయితే, కేవలం తేలికపాటి స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు ఏరోబిక్ వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాదు. హార్ట్ బీట్ను పెంచే కదలికలు ఎప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తాయి -
శాకాహార బాడీబిల్డర్గా విదేశీయుడు..! ఏకంగా డబ్ల్యూహెచ్ఓ..
మన హిందూ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఈ విదేశీయుడిని చూస్తే నిజంగా నోటమాట రాదు. అతడి విధానం, ఆహార్యం అన్ని మనల్ని మంత్రముగ్ధల్ని చేస్తాయి. వామ్మో శారీర దృఢత్వాన్ని, ఆధ్యాత్మిక భక్తితో మిళితం చేసిన ఆ వ్యక్తిని చూస్తే.. సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం ఖాయం. ఎందుకంటే..ఇజ్రాయెలీలో జన్మించిన తమల్ కృష్ణ కృపా దాస్ 2009లో భారతదేశానికి వలస వచ్చినట్లు తెలిపారు. ఆయన ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని మాయాపూర్లో నివశిస్తున్నట్లు తెలిపారు. తాను భారత్కి వచ్చి ఇక్కడి హిందూ మతాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు తన వేషధారణ, ఆహారం తదితరాల గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోని కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో తమల్ తనకు పోషకాహారం అంటే కేవలం స్థూల పోషకాలే కాదని స్వచ్ఛత, 'భగవంతునికి సమర్పణ' అని చెప్పారు. తాను స్వచ్ఛమైన శాకాహార బాడీబిల్డర్నని చెప్పారు. తాను సనాతన ధర్మ అనుచరుడిగా అల్పాహారంగా ఏం తీసుకుంటాడో వివరించాడు. తమల్ తన రోజులో మొదటి భోజనాన్ని శుభ్రంగా ఉంచడంతో ప్రారంభిస్తాడు. ప్రతీదీ చాలా శుభ్రంగా కడుగుతూ తయారు చేసే విధానం అత్యంత ఆకట్టుకుంటుంది. ఎందుకంటే దుకాణంలో లేదా బయటి నుంచి వచ్చే ప్రతీదానిపై ఎలా దుమ్ము, బ్యాక్టీరియాలతో నిండి ఉంటుందో సవివరంగా చెప్పాడు. పరిశుభ్రతకు మించి.. భోజనం కంటికి అందంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా కనిపించడమే ముఖ్యమని చెబుతుండటం విశేషం. మామిడి, నారింజ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్షలను చాలా అందంగా అమర్చిన విధానం గురించి వివరిస్తూ..దీనిని దేవునికి సమర్పిస్తున్నాం కాబట్టి చాలా అందంగా పరిశుభ్రంగా తయారు చేయాలని అంటున్నాడు. పెరుగుని చక్కగా తయారు చేయాలి. కప్పులలో గడ్డకట్టిన పెరుగు, పిస్తా అంటే చాలా ఇష్టమని అంటున్నాడు. అతడు ఒక్క ముద్ద కూడా తినకముందే పూజ చేసి ఆహారానని భగవంతుడికి నివేదిస్తాడు. తాను ఏం తయారు చేసినా.. భగవంతుడు దానిని స్వీకరించాలని ప్రార్థిస్తాను. అన్నింటికన్నా..ముఖ్యమైన విషయం ఆహారాన్ని తినేముందు భగవంతునికి సమర్పిస్తే ప్రసాదమవుతుంది. అది మనల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేయండంలో సహాయపడుతుందని చెబుతున్నాడు. వేషధారణ..తమల్ తన మెడలో పవిత్రమైన తులసి పూసలను, ధోవతిని (నడుముకు కట్టుకునే వస్త్రం), భుజంపై చాదర్ తదితరాలను ధరిస్తాడు. ఆ వస్త్రాలపై తరచుగా సంస్కృత మంత్రాలు లేదా 'హరే కృష్ణ' ముద్రలు ఉంటాయి. అతను ఎక్కువగా గుండు చేయించుకుని చిన్న శిఖతో కనిపిస్తాడు. ఆరోగ్యకరమైన ఆహారం వెనుకున్న శాస్త్రం..డబ్ల్యూహెచ్ఓ కూడా..తమల్ తీసుకునే పండ్లతో నిండిన అల్పాహారం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సమతుల్య అల్పాహారం ఒక వ్యక్తి రోజువారీ పోషకాహార అవసరాలలో దాదాపు 30 శాతాన్ని తీర్చుతుందట.WHO మార్గదర్శకాల ప్రకారం: "అల్పాహారం రోజులో మొదటి భోజనం; అందువల్ల, సమతుల్యంగా ఉండేలా కేర్ తీసుకోవలి. కనీసం రెండు రకాల పదార్థాలు అందించాలి: ఒకటి ప్రధాన ఆహార పదార్థాలు, మరొకటి ప్రోటీన్. అందువల్ల అల్పాహారంలో కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా చేర్చాలి." ఇక్కడ తమల్కు, అతని ఆధ్యాత్మిక సాధనతో బలపడిన ఈ పోషకాహార పునాది, అతని ప్రొఫెషనల్ బాడీబిల్డింగ్ కెరీర్కు చోదక శక్తిగా పనిచేస్తోంది. View this post on Instagram A post shared by Sankalpa Mantra Sadhana (@mantra_saadhana) (చదవండి: కుమారుడి ఊహించని సర్ప్రైజ్..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు) -
‘చెప్పు’కోదగ్గ వ్యక్తి
కర్నూలు జిల్లా: చెప్పుల్లేకుండా ఎండలో నడుస్తున్న ఈయన పేరు బోయ బెనకప్ప. హొళగుంద మండలం సమ్మతగేరి గ్రామానికి చెందిన ఈయనకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు ఉంది. పొలానికి వెళ్లినా, వివిధ పనులకు వేరే ప్రాంతానికి వెళ్లాలన్నా 65 ఏళ్ల వయస్సులోనూ ఇలాగే చేస్తున్నారు. సోమవారం చెప్పులు లేకుండా కాలినడకన తన గ్రామం నుంచి 6 కి.మీ. దూరంలో ఉండే హొళగుంద వచ్చారు. గతంలో ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీశైల మల్లన్న దర్శనానికి హొళగుంద నుంచి 200 కి.మీ. వరకు ఇలాగే కాలినడకన వెళ్లారు. కాళ్లకు బొబ్బలు అయినా బెదర లేదు. ఎండాకాలంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో చెప్పుల్లేకుండా నడుస్తున్న ఇతనని చూసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. -
హంటావైరస్ అంటే..? ఈ వ్యాధి ఎందువల్ల వస్తుందంటే..
అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున ఓ విలాసవంతమైన క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆ నౌక అర్జెంటీనా నుంచి పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ద్వీపాల సమూహమైన కేప్ వెర్డేకు ప్రయాణిస్తోంది. దీంతో ఆ నౌకలోని ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో బందీలుగా చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దాంతో ఒక్కసారిగా సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలేంటి హంటా వైరస్, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.హంటావైరస్ అంటే..హంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వైరస్. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసి పల్మనరీ సిండ్రోమ్ వంటి పలు అనారోగ్యాలకు కారణమవుతుంది. ఎలా వ్యాపిస్తుందంటే..వ్యాధి సోకిన ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే గాలి చొరవని ప్రదేశాల్లో నివశించే ప్రజలుకు ఈ వ్యాధి సోకే అవకాశం అని చెబుతున్నారు.మానువుల ద్వారా సంక్రమణ అనేది..అనేక వైరల్ ఇన్ఫెక్షన్ల వలె ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. చాలామటుకు ఎలుకల కారణంగా నమోదవ్వుతాయని చెబుతున్నారు. లక్షణాలు..ఫ్లూ లక్షణాలను పోలి ఉంటాయని అన్నారు. జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి వంటివి ఉంటాయని చెప్పారు. అందువల్లే ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం కష్టతరం అని పేర్కొన్నారు వైద్యులు.తక్కువ సమయంలోనే తీవ్రతరం అవ్వొచ్చు..వ్యాధి ముదిరే కొద్దీ, దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తులలో ద్రవం చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ ముఖ్య లక్షణం.మరణాల రేటు కూడా ఎక్కువే..ఇది అత్యంత అరుదైనదే అయినా..ఈ హంటావైరస్ ఇన్ఫెక్షన్లు ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల వెంటనే వైద్య సంరక్షణ పొందడం అత్యంత కీలకం.నిర్దిష్ట నివారణ లేదుహంటావైరస్కు నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స లేదు. తీవ్రమైన సందర్భాలలో, ఆక్సిజన్ చికిత్స, ఆస్పత్రిలో చేరడం వంటి సహాయక చికిత్సలు తరచుగా అవసరమవుతాయ్. -
హౌస్ మెయిడ్ నుంచి అసెంబ్లీకి...
సమాజంలో పెద్దగా పలుకుబడి లేదు... హోరెత్తించే ప్రచారాలూ లేవు.. ఆర్భాటాలూ లేవు.. ప్రతిపక్షాన్ని ఆరోపణలతో ఎండగట్టిందీ లేదు.. ఆర్థికంగానూ అంతంత మాత్రమే... నాలుగిండ్లల్లో పనిచేసుకుంటేనే నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి.. అయినా నేడు తాను ఎమ్మెల్యేగా గెలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమే బెంగాల్కు చెందిన ఓ సాధారణ మహిళ కలితా మాఝీ తాను ప్రతి రోజూ ఎదుర్కొంటున్న సమస్యల్నే ప్రజల ముందుంచి.. వాటి వాటి పరిష్కారం కోసం పనిచేయడమే తన ముందున్న కర్తవ్యమంటూ తన విజయానికి బాటలు పరచుకొంది.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అద్భుతమైన గెలుపు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇళ్లలో పనిమనిషిగా పనిచేసే కలితా మాఝీ, ఇప్పుడు ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యింది. ఆస్గ్రామ్ స్థానంలో కలితా మాఝీకి 1,07,692 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి శ్యామ ప్రసన్న లోహర్పై 12,535 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు.జీవితమంతా కష్టాలే...తూర్పు బర్దామన్ జిల్లాలోని గుస్కరా మున్సిపాలిటీ నివాసి అయిన కలితా మాఝీ ప్రయాణం కటిక పేదరికం నుంచి మొదలైంది. ఏడుగురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్న పెద్ద కుటుంబం ఆమెది. తండ్రి దినసరి కూలీ కావడంతో చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. వివాహం తరువాత కూడా ఆమె ఆర్థిక పరిస్థితిలో మార్పు రాలేదు. కలితా భర్త ప్లంబర్. అందువల్ల ఆమె గత రెండు దశాబ్దాలుగా పలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ.. నెలకు రూ. 4,500 సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు ఒక కుమారుడు.2021లో ఓటమికలితా మాఝీ రాజకీయ ప్రయాణం రాత్రికి రాత్రి మొదలైంది కాదు. దాదాపు పదేళ్ల పాటు ఆమె ఓ సాధారణ కార్యకర్తగా కష్టపడింది. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు. అప్పుడు టీఎంసీ అభ్యర్థి అభేదానంద థండర్ చేతిలో 11,815 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ 41 శాతం ఓట్లు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే ఇపుడు మరోసారి ఆమె పార్టీ టికెట్ను పొందేలా చేస్తే.. ప్రజలతో ఆమెకున్న అనుబంధం భారీ విజయాన్ని సాధించిపెట్టింది.సమస్యలే ప్రచార అస్త్రాలుభారీ బహిరంగ సభలు, ఆర్భాటాలు లేకుండా కలితా మాఝీ ప్రచారం సాగింది. తాను అనుభవించిన కష్టాలనే ఓటర్ల ముందుంచింది. వైద్యంకోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, తాగునీటి ఎద్దడి, మహిళల భద్రత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేవలం ప్రభుత్వ పథకాలపై ఆధారపడటం కాకుండా, ప్రజలకు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె గళం విప్పింది. అవినీతిపై ఆమె చేసిన సూటి విమర్శలు ఓటర్లను ఆకట్టుకున్నాయి.అదే ఉత్సాహంతో...నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, నేను రెండు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ నెలకు రూ. 4,500 సంపాదిస్తున్నాను. నేను పని చేసుకోవడానికి వీలుగా నా అత్తగారు ఇంట్లో వంట పనుల్లో సహాయం చేసేవారు. నేను ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు ప్రజల కోసం కూడా పనిచేయడానికి అదే ఉత్సాహంతో సిద్ధంగా ఉన్నాను.ప్రాథమిక సౌకర్యాల మెరుగుదలే నా లక్ష్యం. – కలితా మాఝీ -
పాలిచ్చే తల్లులూ.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలో ఎన్నో మార్పులుచోటు చేసుకుంటాయి. అవి శారీరకమైనవీ, మానసికమైనవికూడా. అయితే... ప్రసవం తర్వాత అవన్నీ వెంటనే ఒకేరోజులో సాధారణస్థితికి రావు. ప్రసవం తర్వాత ఓ మహిళమళ్లీ మామూలు స్థితికి రావాలంటే కొంత ప్రత్యేక శ్రద్ధ, మరికొన్ని బాధ్యతలు తప్పనిసరి. ఇక కాన్పు తర్వాత చాలా మంది మహిళలు తమకు పుట్టిన బిడ్డ గురించి శ్రద్ధ తీసుకుంటారు తప్ప తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కాన్పు తర్వాత మహిళలు...తమ బిడ్డ విషయంలోనే కాకుండా తన కోసం కూడా కొంత వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. ఆ టైమ్లో బాలింతకు వచ్చే కొన్ని సమస్యలూ... వాటికి తీసుకోవాల్సిన పరిష్కారాలను తెలుసుకుని ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులూ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం...గర్భం దాల్చినప్పుడు మామూలుగా మూడు అంగుళాల పొడవు ఉండే గర్భాశయం... దాదాపు 20 అంగుళాల పొడవుండే శిశువును తనలో ఇముడ్చుకునేంత పెద్దదిగా సాగుతుంది. కాన్పు తర్వాత అదే గర్భాశయం మెల్లమెల్లగా సైజు తగ్గుతూపోతూ ఆరువారాలకు తన మొదటి స్థితిని చేరుతుంది. కాన్పు తర్వాత వారం రోజుల వరకు బొడ్డు కింది భాగంలో గర్భాశయం గట్టిగా స్పర్శకు తెలుస్తుంటుంది. గర్భిణిగా ఉన్న సమయంలో లోపల గర్భాశయంతో పాటు బయట పొట్ట కండరాలూ బాగా సాగుతాయి. ఫలితంగా కాన్పు తర్వాత కూడా పొట్ట వదులుగా కిందికి జారినట్లుగా కనిపిస్తుండవచ్చు. నడుము కండరాలు, ప్రసవమార్గంలోని కండరాలు, ఎముకలు సాగి బలహీనంగా మారతాయి. బరువు పెరగడం వల్ల, పొట్ట మీది చర్మం సాగడం వల్ల కొందరిలో చర్మంపై తెల్లటి లేదా ఎర్రటి లేదా నల్లటి చారికలు (స్ట్రెచ్మార్క్స్) ఏర్పడవచ్చు. ఇవన్నీ కాస్మటిక్గా మహిళలకు కొంత ఇబ్బందికరంగా కనిపించవచ్చు. ఈ స్ట్రెచ్మార్క్స్ నివారణ కోసం: పొట్ట మీద, తొడల మీద ఉండే చర్మం సాగి, చిట్లడం వల్ల వచ్చే స్ట్రెచ్మార్క్స్ పూర్తిగా పోవడానికి గాని, అస్సలే రాకుండా ఉండటానికి ఎలాంటి మందులూ, క్రీములు ఉండవు. ఆలివ్ ఆయిల్, విటమిన్–ఈ, కొన్ని మాయిశ్చరైజర్స్ వంటి వాటిని గర్భవతిగా ఉన్నప్పటినుంచే పొట్ట, తొడల మీద రాసుకోవడం వల్ల చర్మం మెత్తబడి సాగడానికి వీలుగా ఉంటుంది. దురదలు రావు. కాబట్టి దీనివల్ల స్ట్రెచ్మార్క్స్ నివారణ కొంతవరకు సాధ్యమవుతుంది. ప్రసవం అయిన తర్వాత మహిళ (బాలింత)లో కొన్ని రకాల సమస్యలు / ఆరోగ్య సమస్యలు కనిపించవచ్చు. అవి... బాలింత జ్వరం : కాన్పు తర్వాత కొందరు మహిళల్లో ఒళ్లు కొంచెం వేడిగా ఉంటూ, తర్వాత మామూలుగా అవుతుంటుంది. కొంతమందిలో మాత్రం కాన్పు తర్వాత 24 గంటల నుంచి 10 రోజుల్లోపు 100 డిగ్రీల కంటే ఎక్కువగా వచ్చే జ్వరాన్ని బాలింత జ్వరం అంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. పరిష్కారం : కోల్డ్ స్పాంజింగ్తోనే చాలావరకు జ్వరం తగ్గిపోతుంది. అయితే ఏదైనా నిర్దిష్ట కారణం వల్ల జ్వరం వచ్చినట్లు డాక్టర్లు గుర్తిస్తే... ఆ కారణాన్ని బట్టి డాక్టర్లు మందులు సూచిస్తారు.బాలింత జ్వరాలకు కొన్ని కారణాలు... జననాంగాల్లో ఇన్ఫెక్షన్ : రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, కాన్పు సమయంలో తగినంత శుభ్రత పాటించకపోవడం, రోగకారకక్రిములు జననాంగంలో ప్రవేశించడం, గర్భాశయంలో ఏమైనా మాయ ముక్కలు ఉండిపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల జననాంగాల్లో ఇన్ఫెక్షన్ వచ్చి బాలింత జ్వరం రావచ్చు. పరిష్కారం : డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ వాడాలి. రొమ్ముల్లో ఇన్ఫెక్షన్స్ : కొత్తగా తల్లి అయిన మహిళ తన బిడ్డకు పాలు సక్రమంగా పట్టకపోవడం, నిపుల్స్ సరిగా లేకపోవడం, రొమ్ముల్ని సరిగా ఖాళీ చేయకపోవడంతో పాలు లోపలే గడ్డకట్టి రొమ్ముల్లో ఇన్పెక్షన్ రావచ్చు. రొమ్ముపై ఏవైనా పగుళ్లు ఏర్పడితే, వాటి ద్వారా తల్లి దేహంలోకి రోగక్రిములు చేరవచ్చు. అలాగే బిడ్డ నోటిలో పూత ఉన్నా రోగక్రిములు రొమ్ముల్లోకి పాకి అది తల్లిలో ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే రొమ్ముల్లో చీముగడ్డలు ఏర్పడవచ్చు. పరిష్కారం: డాక్టర్ సలహా మేరకు తగిన మందులు తీసుకుంటూ, వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటించాలి.జ్వరాలకు మరికొన్ని కారణాలు : సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు వేసే కుట్లలో చీము పట్టడం మలేరియా, టైఫాయిడ్, నిమోనియా వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకే ముప్పు ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేస్తే అవి రక్తం ద్వారా దేహమంతటా పాకి కొంత ప్రమాదాలకు తావిచ్చే అవకాశం. పరిష్కారం : కారణాలను బట్టి తగిన మందులు ఇవ్వడం, ఆ మేరకు బాలింత తగిన జాగ్రత్తలు పాటించేలా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. నొప్పులు : కాన్పు తర్వాత కొందరిలో వెన్ను, తొడలు, పిరుదుల దగ్గర నొప్పులు రావచ్చు. కొందరిలో అవి మరీ ఎక్కువగానూ ఉండవచ్చు. గర్భాశయం బరువు మొత్తం వెన్నుపూసపై పడటం వల్లా, అలాగే కండరాలు సాగి మునపటి బలం కొద్దిగా తగ్గడం వల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు. కొన్నిసార్లు కాన్పుకి ఎక్కువ సమయం పట్టినా, లేదా కాన్పు కష్టంకావడంతో ఫోర్సెప్ సహాయంతో కాన్పు జరిపినప్పుడు, వెన్పుపూస కింది భాగంలోని నరాలపై ఒత్తిడి పడి కొంతమందిలో కాన్పు తర్వాత కాళ్లు కదల్చలేకపోవడం, స్పర్శ తగ్గడం వంటివీ కనిపించవచ్చు. పరిష్కారం : వీటిని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీటిలో చాలావరకు డాక్టర్ల సలహాలూ, మందులతోనూ లేదా ఇవన్నీ కొద్దిపాటి ఫిజియోథెరపీతో తగ్గిపోయే సమస్యలే. మూత్రసమస్యలు : కాన్పు తర్వాత మూత్రాశయానికి చేరే నరాలు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల మూత్రం పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం వంటి సమస్య కనిపించవచ్చు.అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్) వచ్చే అవకాశాలు ఉంటాయి. కాన్పు తర్వాత ఉండే నొప్పి వల్ల కూడా మూత్ర విసర్జన పూర్తిగా సాధ్యపడకపోవచ్చు. తగినంత నీరు తాగకపోవడం వల్ల, జననాంగాల నుంచి మూత్రవ్యవస్థకూ ఇన్ఫెక్షన్ పాకవచ్చు. కొంతమందిలో కొన్ని రోజులపాటు మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోయే ముప్పు కూడా ఉంది. పరిష్కారం : ఈ సమస్యలు తగ్గడానికి పెల్విక్ఫ్లోర్ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. మలబద్దకం : కాన్పు తర్వాత మహిళలకు పెద్దగా నీరు తాగకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతమందిలో మలబద్దకం ఏర్పడవచ్చు. పరిష్కారం : తగినన్ని నీళ్లు తాగడం, ద్రవాహారం తీసుకోవడంతో పాటు ఆకుకూరలూ, కాయగూరలతో ఉన్న పోషకాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది. సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు చాలా కొద్దికాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం : గర్భవతిలో కాన్పు తర్వాత జరిగే రక్తస్రావాన్ని ఆపడం కోసం రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన పదార్థాలు (ఫ్యాక్టర్లు) ఎక్కువగా తయారయ్యేలా ప్రకృతి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కొంతమందిలో (బరువు ఎక్కువగా ఉన్నవారు, హైబీపీతో బాధపడేవారు, ఎక్కువ వయసున్న వారిలో) కాన్పు తర్వాత వారం నుంచి పది రోజుల వరకు ఈ పదార్థాల వల్ల రక్తం గడ్డకట్టి, ఆ గడ్డలు రక్తరాళాల ద్వారా వేరే చోట్లకు పాకి సాధారణ రక్తప్రసరణకు అడ్డుగా మారే (ఎంబాలిజమ్) ముప్పు ఉంటుంది. ఉదాహరణకు... కొందరిలో ఇలాంటి రక్తం గడ్డలు ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లోకి వెళ్లి రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తే... అకస్మాత్తుగా ఊపిరి అందక ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశమూ లేకపోలేదు. ఈ కండిషన్ను ‘పల్మునరీ ఎంబాలిజమ్’ అంటారు. పరిష్కారం : కాన్పు తర్వాత ఎక్కువగా కదలకుండా పడుకుని ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువ. డాక్టర్ సలహా మేరకు చురుగ్గా ఉండటం అవసరం. తీవ్రమైన రక్తస్రావం : కాన్పు తర్వాత కొంతసేపు సాధారణంగా 200 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ వరకు రక్తస్రావం అవుతుండటం మామూలే. అంతకంటే ఎక్కువగా రక్తస్రావం అయితే ఆ కండిషన్ను పోస్ట్పార్టమ్ హేమరేజ్ (పీపీహెచ్) అంటారు. పీపీహెచ్ను మొదటే నియంత్రించకపోతే, దాదాపు 25 శాతం మందిలో ప్రాణాలకు ముప్పు ఉండే ప్రమాదముంటుంది. దాదాపు 90 శాతం పీపీహెచ్ కేసుల్లో గర్భాశయం ముడుచుకుపోవడం (యుటరైన్ ఎటోనీ) వల్ల బ్లీడింగ్ జరుగుతుంది. కొంతమందిలో గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) చీరుకుపోవడం వల్ల, మరికొందరిలో గర్భాశయం లోపల మాయముక్కలు ఉండిపోవడం, రక్తం గూడుకట్టుకునే స్వభావంలో లోపాలు కూడా పీపీహెచ్కు కారణం కావచ్చు.పరిష్కారం : ఇలాంటి సందర్భాల్లో కారణాన్ని బట్టి చికిత్సతో పాటు... అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాల్సిన రావచ్చు. రక్తస్రావం ఎంతకీ నియంత్రణలోకి రాకపోతే కొందరిలో గర్భసంచి తొలగించాల్సిరావచ్చు. రక్తహీనత : అధిక రక్తస్రావం కావడం లేదా ముందు నుంచే రక్తహీనత ఉన్నవారిలో ఉండాల్సిన మోతాదులో రక్తం లేక΄ోవడం వల్ల నీరసం, నిస్సత్తువ, బలహీనంగా ఉండటం వంటివి కనిపించవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్ సోకడం, అవి ఒకపట్టాన తగ్గకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు.పరిష్కారం : తల్లికి పాలకూర వంటి ఆకుకూరలూ, నువ్వుల వంటి వాటితో చేసిన రుచికరమైన పదార్థాలు... అంటే ఐరన్ మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలు పెడుతుండాలి. రక్తహీనత మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు ఐరన్ సిరప్, టాబ్లెట్లు వంటివి వాడాల్సిరావచ్చు. ఫిట్స్ (హైబీపీ వల్ల) : కాన్పుకి ముందు కొంతమందిలో బీపీ పెరిగి కాన్పు తర్వాత తగ్గుతుంది. కానీ కొంతమందిలో కాన్పు తర్వాత కూడా వారం నుంచి పదిరోజుల పాటు బీపీ పెరిగి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పరిష్కారం : నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. మానసిక సమస్యలు : కొంతమంది బాలింతల్లో కాన్పు తర్వాత 3–5 రోజుల తర్వాత డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ కండిషన్నే పోస్ట్పార్టమ్ బ్లూస్ లేదా బేబీ బ్లూస్ అంటారు. రక్తహీనత, బిడ్డ పెంపకం బాధ్యతల తాలూకు ఆందోళనా, భయం, నిద్రలేమి, కొన్ని హార్మోన్లలో మార్పులతో కనిపించే మానసిక సమస్యలూ, కుటుంబంలో ఉండే సమస్యలూ, కలహాల వంటి ఎన్నో కారణాల ఈ డిప్రెషన్ రావచ్చు. కుటుంబసభ్యుల సహకారం వల్ల కొందరిలో ఇది 2–3 రోజుల్లోనే చక్కబడుతుంది. కానీ... మరికొందరిలో పరిస్థితి మరింత తీవ్రమై సైకోసిస్ స్థితిలోకి వెళ్లే ముప్పు కూడా ఉంటుంది. పరిష్కారం : ఈ సమస్యకు మానసిక వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అవసరం. బాలింత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుకాన్పు తర్వాత అటు తల్లి విషయంలోనూ, ఇటు బిడ్డ విషయంలోనూ తగిన జాగ్రతలు పాటించి, ఎలాంటి సమస్యలూ రాకుండా చూసుకోవాలి. కాన్పు జరిగిన 24 నుంచి 48 గంటల వరకు బాలింత ఆరోగ్యంతో పాటు ఆమెలో జ్వరం, బీపీ, రక్తస్రావం వంటివి ఏవైనా కనిపిస్తున్నాయా అనే విషయాన్ని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.ఆహారం : కాన్పు తర్వాత బాలింతకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. మామూలుగా కంటే రోజుకు 600 కేలరీలు అధికంగా శక్తినిచ్చే ఆహారంతోపాటు బాగా పాలుపడేలా ఉండే ఆహారం తల్లికి ఇవ్వాలి. ఇందులో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు, మాంసాహారం ఇవ్వాలి. పాలు, పెరుగు, పండ్లు తీసుకోవచ్చు. ఆహారంలో ఎలాంటి పథ్యం అవసరం లేదు. అయితే కారాలు, పచ్చళ్లు, మసాలాలు తినకూడదు. పప్పులు తినడం వల్ల చీము పడుతుందన్నది అపోహ మాత్రమే. రోజుకు కనీసం 10 గ్లాసులు (రెండు లీటర్ల) నీళ్లు తప్పనిసరిగా తాగించాలి. నీరు తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్స్, మలబద్దకాన్ని నివారించడానికి వీలవుతుంది. నీరు తాగడం వల్ల పొట్టపెరుగుతుందని, జలుబు చేస్తుందన్నది అపోహ మాత్రమే. మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కాన్పు తర్వాత కలిగే అలసట త్వరగా తగ్గుతుంది. కుట్లు త్వరగా/తేలిగ్గా మానుతాయి. పాలు బాగా పడతాయి. (బిడ్డ... తన తల్లిపాల నుంచి ఐరన్, క్యాల్షియమ్ గ్రహిస్తుంది. కాబట్టి మొదటి మూడు నెలలు తల్లి తప్పనిసరిగా ఐరన్, క్యాల్షియమ్ మాత్రలు వాడాలి. బిడ్డకు జలుబు చేస్తుందని పండ్లు, పెరుగు, మజ్జిగ తల్లికి ఇవ్వరు. ఇది కేవలం అపోహ మాత్రమే.విశ్రాంతి : కాన్పు తర్వాత తల్లి బాగా అలసిపోతుంది. ఆ అలసటను తగ్గించడానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. శారీరక, మానసిక విశ్రాంతి ఇవ్వడం వల్ల తల్లికి పాలు బాగా పడతాయి. బిడ్డను ఉయ్యాలలో కాకుండా తల్లిపక్కనే పడుకోబెట్టడం వల్ల ఆ స్పర్శతో తల్లీబిడ్డల మధ్య బంధం పటిష్టమవుతుంది. పాలు బాగా పడతాయి.అటు ఇటు తిరగడం : సాధారణ కాన్పు తర్వాత తల్లిని కొద్ది గంటలలోపే లేచి అటు ఇటు తిరిగేలా ప్రోత్సహించడం మంచిది. ఆపరేషన్ చేసిన వాళ్ల విషయంలో... ఆమె బెడ్ మీదే ఉన్నప్పటికీ 4–6 గంటల తర్వాత నుంచి మంచంలోనే కాళ్లు అటూ–ఇటూ కదపడం, ముడుచుకోవడం–స్ట్రెచ్ చేయడం వంటివి చేయవచ్చు. ఆరోగ్యపరిస్థితిని బట్టి 12–24 గంటల తర్వాత మెల్లగా ఏదైనా ఆసరాతో లేచి తిరిగేలా చేయవచ్చు. ఇలా త్వరగా కదలడం వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ముప్పునూ... ఆ రక్తం గడ్డలు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోకి ప్రవేశించే (ఎంబాలిజమ్) రిస్క్ను నివారించవచ్చు.వ్యక్తిగత పరిశుభ్రత : కాన్పు తర్వాత జననాంగాలు శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మల,మూత్ర విసర్జన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సాధారణ కాన్పు తర్వాత కుట్లు వేయాల్సివస్తే వాటిపై యాంటీసెప్టిక్ పౌడర్ వేసుకోవచ్చు. బట్టలు కాకుండా డయాపర్లు వాడుకోవడం మంచిది. తడిసినవాటిని తరచూ మార్చుకుంటూ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. యోనిస్రావాల పరిమాణం, రంగు, వాసన అసాధారణంగా అనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించుకోవాలి.రొమ్ములపై శ్రద్ధ : తొమ్మిదో నెల నుంచే తల్లి తన రొమ్ములను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రొమ్ము మొనలను సాగదీస్తూ ఉండటం వల్ల కాన్పు తర్వాత బిడ్డ పాలు తాగడానికి అనువుగా మారతాయి. బిడ్డ పుట్టగానే గంటలోపే బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే పాలు మరింత త్వరగా ఊరతాయి. బిడ్డకు అత్యుత్తమ ఆహారం తల్లిపాలే. మొదటి రెండు మూడు రోజులు నీరు లాంటి ద్రవం (కొలెస్ట్రమ్) ఉత్పత్తి అవుతుంది. అయితే ఇందులో బిడ్డకు వ్యాధినిరోధకశక్తిని పెంచడానికి అవసరమైన యాంటీబాడీస్, విటమిన్స్ ఉంటాయి. బిడ్డకు మొదటి ఆర్నెల్లూ తల్లిపాలే పట్టాలి. అవి మినహా మరేవీ ఇవ్వడం సరికాదు.వ్యాయామాలు : కొన్ని వ్యాయామాలతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అవి నడుము నొప్పిని నివారిస్తాయి. ప్రారంభంలో కాళ్లు కదపడం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. డాక్టర్ సలహా మేరకు ఆరు వారాల తర్వాత క్రమేపీ పొత్తికడుపు కండరాలు, పెల్విక్ఫ్లోర్ కండరాలు, నడుము కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయవచ్చు. వీటివల్ల వదులైన పొట్ట కండరాలు గట్టిపడతాయి. పొట్ట మీద బట్ట చుట్టడం వల్లనో, అబ్డామినల్ బెల్ట్ వల్లనో పొట్ట తగ్గదు. అవి కేవలం సపోర్ట్గా మాత్రమే పనికివస్తాయి. కాన్పు తర్వాత అలసట తగ్గాక మెల్లగా వాకింగ్వంటి తేలికపాటి వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు.కుటుంబ నియంత్రణ : ప్రసవం తర్వాత వెంటనే గర్భం అందకుండా డాక్టర్ సలహా మేరకు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం మంచిది. కాన్పు తర్వాత 2–3 నెలల నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్లో పాల్గొనడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ (పీరియడ్స్ రాకుండానే కూడా). అందువల్ల కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల అనుకోకుండా వచ్చే, అవాంఛిత గర్భాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి, కని అలసిపోయిన శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది. ఉన్న సమయాన్ని బిడ్డకి కేటాయించడం వల్ల బిడ్డలోనూ మంచి ఎదుగుదల, వికాసం కనిపిస్తాయి. ఇక పిల్లలు వద్దు అనుకున్న వారు శాశ్వత సంతాన నియంత్రణ పద్ధతుల కోసం డాక్టర్ను సంప్రదించవచ్చు. దాంపత్య జీవితం : బాలింతలో జరిగే మార్పులు యథాతథ స్థితికి వచ్చేందుకు, జననాంగాలు సాధారణ స్థితికి రావడానికి ఆరు వారాల సమయం పడుతుంది. ఇతరత్రా ఏ సమస్యలూ లేకుండా ఉంటే, ప్రసవం అయ్యా ఆరు వారాల తర్వాతి నుంచి దాంపత్య జీవితం గడపవచ్చు. ఒకవేళ సిజేరియన్ అయిన వారు కుట్లలో ఎలాంటి నొప్పులు లేకపోతే 8–10 వారాల తర్వాత దాంపత్యంలో పాల్గొనవచ్చు.కుటుంబ సభ్యుల పాత్ర : కాన్పు తర్వాత బాలింతకు ఇంట్లో వాళ్ల చేయూత, మద్దతు ఎంతో అవసరం. ముఖ్యంగా భర్త పోషించాల్సిన భూమిక చాలా ప్రధానం.డాక్టర్ చెకప్ : కాన్పు తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక వారం తర్వాత ఒకసారి, ఆరు వారాల తర్వాత మరోసారి డాక్టర్ను సంప్రదించాలి. లేదా డాక్టర్ సూచించిన విధంగా చెక్అప్కు వెళ్లాలి. తనకు వచ్చే సందేహాలన్నింటినీ మొహమాటపడకుండా డాక్టర్ను అడిగి తీర్చుకోవాలి. కాన్పుకు ముందు ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని డాక్టర్కు వివరించి, వాటి విషయంలో కాన్పు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం అవసరం.డాక్టర్ సరోజ బానోతు,కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ – గైనకాలజిస్ట్ (చదవండి: మామిడి పండ్లను తినేముందు ఇలా చేయడం తప్పనిసరి..! హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు) -
ఐదు పదుల వయసులో నీట్ పరీక్ష..! ఐతే..
జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష నీట్NEET)కు హాజరైన అభ్యర్థులలో ఒక అభ్యర్థి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే ఐదుపదుల వయసులో ఈ పరీక్షకు పోటీపడటమే. లక్నోలోని చందర్నగర్ నివాసి అయిన అశోక్ బహార్ మాంటిస్సోరి పాఠశాలలో గత ఆదివారం ఈ పరీక్షక రాశారు. నీట్ యూజీ 2026 పరీక్ష మే 3, 2026న దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో దిగ్విజయంగా నిర్వహించన సంగతి తెలిసిందే. ఇక బహార్ గతంలో ఒక ఎరువుల తయారీ సంస్థలో మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన వైద్య రంగంపై ఉన్న మక్కువతో ఎంతో కాలంగా ఈ పరీక్ష రాయలని అనుకున్నారట. అయితే ఇన్నేళ్లకు ఆ కల నెరవేరిందని ఆనందంగా చెబుతున్నారు. ఆయన 2000వ సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్(స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)) తీసుకున్నప్పటి నుంచి నీట్ పరీక్ష రాయాలనే ఆలోచన ఉందట. తాను సమాజానికి అర్థవంతమైన రీతీలో సేవ చేయాలంటే ఇదే సరైన రంగం అని అనిపించదట. అందుకు తనకు సరైన గుర్తింపు, అర్హత ఉండాలని భావించే నీట్ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఇందుకు ఒకరకంగా తన కుటుంబ ప్రభావం కూడా ఒక కారణమని చెప్పడం విశేషం. బహార్ భార్య డాక్టర్ మంజుల్ బహార్ ప్రస్తుతం అమెరికాలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఈ వృత్తితో దశాబ్దాల పాటు అనుబంధం ఉండటం వల్ల ఔషధాల గురించి కొంత అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. కానీ వైద్యవృత్తిని చేపట్టేలా అధికారికంగా అర్హతలు లేవని చెప్పారు. నిజానికి నీట్ ప్రవేశ పరీక్ష అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష. దీనికి ఎక్కువగా 17 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నవారే హాజరవుతారు. కానీ దాన్ని సవాలు చేసే 57 ఏళ్ల వ్యక్తి ఈ పరీక్ష రాయడం విశేషం. ఆయన ఇతర అభ్యర్థులు మాదిరిగానే ఈ పరీక్ష రాశారు. చాలాకాలం తర్వాత చదవడం వల్ల.. కాస్త కష్టమైందని, అయితే ఏకాగ్రతతో దాన్ని సాధించగలిగానని అన్నారు. గతకొంతకాలంగా కొందరు పెద్దలు లేటు వయసులో తిరిగి ఉన్నత చదువుపై అడుగుల వేస్తున్న కేసులు పెరుగుతుండటం విశేషం. ఇక బహార్ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు, కష్టపడగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు..ఏ దశలోనైనా ముందుకు సాగొచ్చని అన్నారు. ఏదీఏమైనా కఠినతరమైన ఆ నీట్ పరీక్షను రెస్ట్ తీసుకునే వయసులో పోటీపడటం అనేది అత్యంత ప్రశంసనీయమైన విషయం. కాగా, అతనికి వైద్య కళాశాలలో ప్రవేశం లభిస్తుందో లేదా అనేది నీట్ ఫలితాలే నిర్ణయిస్తాయి. మరి ఆ తాతగారికి ఆల్ ది బెస్ట్ చెబుదామా..!. -
మెట్ గాలాలో గోల్డ్ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్లో మొత్తం అమ్మ..
మెట్ గాలా 2026లో భారతీయ ఫ్యాషన్, కళలకు మద్దతు ఇవ్వాలనే తన వాదనను బలంగా వినిపించారు ఇషా అంబానీ. ఈ వేడుకలో ఆమె డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరలో తళుక్కుమన్నారు. ఈ చీరలో చేతితో చిత్రించిన పిచ్వాయి ప్రేరేపిత నమునాలు ఉన్నాయి. కేవలం కళాకారుల కోసం మాత్రమే పనిచేసే రిలయన్స్ రిటైల్ బ్రాండ్ స్వదేశ్కు చెందని కళాకారులు ఈ చీరను స్వచ్ఛమైన బంగారు దారాలతో డిజైన్ చేశారు. ఆఖరికి బ్లౌజ్ కూడా స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే ఈ బ్లౌజ్ మొత్తం తన అమ్మ నీతా అంబానీ ఆభరణాలతో నిండి ఉందని వోగ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది ఇషా. దాదాపు 1800 క్యారెట్ల వజ్రాల తోపాటు పచ్చలు, పోల్కీ, కుందన్లను ఈ వస్రం(బ్లౌజ్)లో పొదిగి దాని వారసత్వ రూపాన్ని సజీవంగా మార్చామని డిజైనర్ గౌరవ్ గుప్తా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇషా అద్భుతమైన చీర, ఆభరణాల తోపాటు క్రోచెట్ బ్యాగ్లో సుబోధ్ గుప్తా రూపొందించిన మామిడి శిల్పాన్ని కూడా రెడ్కార్పెట్పైకి తీసుకువచ్చారామె. ఇది భారతదేశ వారసత్వానికి నిదర్శనంగా ఉండటమే కాకుండా చేతి కళకు నిదర్శనంగా నిలిచింది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఏడాది మెట్గాలా 2026 థీమ్ 'ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్'కు అనుగుణంగా ఉంది. అలాగే ఆమె తన జుట్టుని గజ్రా స్ఫూర్తితో రూపొందించిన కాగితం, రాగి ఇత్తడి కలయికతో రూపొందించిన ఆభరణంతో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిశారామె. దీన్ని బ్రూక్లిన్కు చెందిన సౌరబ్ గుప్తా అనే కళాకారుడు రూపొందించారు. ఈ వేడుకకు ముందు మే1 న్యూయార్క్ నగరంలో జరిగిన వేడుకలో భారతదేశాన్ని అక్షరాలా చిత్రించిన ఒక అద్భుతమైన బ్యాండేజ్ డ్రెస్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ డ్రెస్ని 26 రకాల అంచులతో రూపొందించడం విశేషం. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) (చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
మామిడిపండ్లను నేరుగా తినేస్తున్నారా..? హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
పండ్లలో రారాజుగా కీర్తించే మామిడపండ్లు వచ్చే కాలమే ఈ వేసవి. ఈ సమయంలో ఎటుచూసినా..ఈ పండ్ల సందడే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఈ పండ్లను తినేమందు నీటిలో నానబెట్టడం అనేది మన పూర్వీకుల కాలం నుంచి పాటిస్తున్న సాంప్రదాయ పద్ధతి. ఇది కేవలం మామిడి పండ్లను శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదని..అంతకుమించిన ఆరోగ్య ప్రయోజనాలందించే విధానంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా నీటిలో నానబెట్టడం వల్ల పోషకాల శోషణ మెరుగుపడటమే గాక శరీర ఉష్ణోగ్రతన నియంత్రించి, జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుందని అంటున్నారు. ఈ మామిడిలో విటమిన్లు ఏ,సీల తోపాటు, పీచుపదార్థం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి శక్తి కేంద్రం అయినప్పటికీ..పచ్చి రూపంలో కొన్ని జీవరసాయన సమ్మేళనాలు ఉంటాయి. అయితే ఈ పండు మన జీర్ణక్రియకు సురక్షితమైనదిగా ఉండాలంటే..ఈ సమ్మేళనాల ప్రభావాన్ని తగ్గించేలా నీటిలో అరగంటపాటు నానబెట్టక తప్పదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అలా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా చూద్దామా..!.ఫైటిక్ ఆమ్లాన్ని తటస్థీకరించడం: మామిడి పండ్లను నానబెట్టమని సిఫార్సు చేయడానికి ప్రాథమిక శాస్త్రీయ కారణం ఫైటిక్ ఆమ్లం ఉండటమే. ఫైటిక్ ఆమ్లం అనేది వివిధ మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపించే ఒక సహజ పదార్ధం. ఇది ఫాస్ఫరస్ను నిల్వ చేసే రూపంగా పనిచేస్తుంది. పోషకాహార శాస్త్ర ప్రకారం..ఖనిజాల జీవ లభ్యతపై దాని ప్రభావం కారణంగా దీనిని తరచుగా "పోషక విరోధి"గా వర్గీకరిస్తారు.జీర్ణవ్యవస్థలో కాల్షియం, ఇనుము, జింక్ వంటి అవసరమైన ఖనిజాలతో బంధం ఏర్పరచుకోవడానికి ఫైటిక్ ఆమ్లానికి అధిక అనుబంధం ఉంటుంది. ఈ ఖనిజాలు ఫైటిక్ ఆమ్లంతో బంధం ఏర్పరచుకున్నప్పుడు, అవి కరగని అవక్షేపాలను ఏర్పరుస్తాయి. అయితే వీటిని మానవ శరీరంలోని చిన్న ప్రేగు గ్రహించలేదు. అందువల్ల ఈ మామిడి పండ్లను 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టడం వల్ల, వాటిలోని అదనపు ఫైటిక్ ఆమ్లం కరిగిపోవడం లేదా విచ్ఛిన్నం కావడం జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ "యాక్టివేషన్" ప్రక్రియ కారణంగా పండులోని సూక్ష్మపోషకాల పూర్తి పోషక విలువను సులభంగా పొందగలమని చెబుతున్నారు.మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం..జీర్ణవ్యవస్థ సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ పద్ధతి చాలా అవసరమని వైద్యులు నొక్కి చెబుతున్నారు. మామిడి పండ్లలో ఉండే అధికంగా ఉండే ఫైటిక్ యాసిడ్ ఇనుము, జింక్, కాల్షియం వంటి ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఎప్పుడైతే సుమారు 30 నిమిసాలు నానబెడతామో అప్పుడు ఈ పోషక వ్యతిరేక పదార్థ ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా పండు మంచి పోషకవంతమైనదిగా, అలాగే జీర్ణవ్యవస్థకు సులభంగా జీర్ణమయ్యేదిగా మారుతుంది.ఉష్ణోత్పత్తిని తగ్గించి శరీరానికి చలువ చేసేలా..మామిడిలో కేలరీలు అధికం, సహజ చక్కెరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల ఇది నానబెట్టకుండా నేరుగా తీసుకుంటే జీవక్రియ వేడిని పెంచడానికి దారితీస్తుంది. శరీరంలో అంతర్గత వేడి చర్మంపై ప్రభావం చూపి దద్దుర్లు, మొటిమలు లేదా వేడి కురుపులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి పండ్ల సీజన్లో ఇవి సాధారణంగా కనిపించే సమస్యలు. ఈ వేడి కారణంగా కొందరికి జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్ఫన్నమవుతాయని అంటున్నారు. మనం ఎప్పుడైతే మామిడి పండుని నీటిలో నానబెడతామో అప్పుడు దానిలోని సహజ వేడి ఆవిరైపోతుంది. మానవ శరీర అంతర్గత వాతావరణానికి అనుగుణంగా మారిపోతుంది. అలాగే పేగులు సులభంగా జీర్ణం చేసుకోగలుగుతాయి కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.రసాయన అవశేషాల నిర్మూలనఈ మామిడి పండ్లు పండించేందుకు కృత్రిమ పురుగుల మందులు, శిలీంధ్రనాశకాలు వంటివి అధికంగా వినియోగిస్తారు రైతులు. అంతేగాక పండు ఉపరితలంపై కాల్షియం కార్బైడ్, ఆర్సెనిక్ వంటి రసాయనాలను చల్లుతారు. ఫలితంగా రవాణ సమయంలో పండు డ్రై అయిపోకుండా తేమతో ఉండేలా చేయడమేగాక, నిల్వ కాలాన్ని పొడిగిస్తాయి. అలాగే వాణిజ్య మామిడి పండ్డు అందంగా కనిపించేలా పలుచటి మైనపు పొరను పూస్తారు కూడా. అందువల్ల ఇలాంటి మామిడిపండ్లను పారే నీటి కింద త్వరగా కడగడం, 30 నిమిషాలపాటు నానబెట్టడం వంటి వాటి వల్ల ఆయా రసాయనాల అవశేషాలు సమర్థవంతంగా తొలిగిపోవడమే గాక సురక్షితమైన ఆహారంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇలా నానబెట్టడం వల్ల మామిడి కాండం వద్ద ఉండే జిగురు లేదా లేటెక్స్ అనే రసం ఘాటు తొలిగిపోతుందట. ఈ రసం గనుక నోటిలోకి వెళ్తే నోటి చుట్టూ వాపు, దురద, బొబ్బలు వంటి చర్య సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు!) -
సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..
తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి మొత్తం 107 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ఈ నేపథ్యంలో విజయ్ ఫిట్నెస్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఉండాలంటే..ఆరోగ్యపట్ల ఎలాంటి స్ప్రుహతో వ్యవహరించాలి వంటి వాటి గురించి విజయ్ ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ వెల్లడించారు. ఆయనతో ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవంతోపాటు..ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయంటూ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. అంతటి స్టార్డమ్ ఉన్నా..ఆరోగ్యం పట్ల విజయ్ వ్యవహరించే తీరు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దామా..!.సెట్లో విజయ్తో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ..ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్..విజయ్ కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే కాకుండా..తెర వెనుక కూడా చాలా నిబద్దతతో వ్యవహరించే ప్రత్యేకమైన వ్యక్తిగా కొనియాడారు. ఆయన ఫిట్నెస్ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉండటమేగాక, అత్యంత నిలకడగా చేస్తుంటారని అన్నారు. ఆయనతో పనిచేయడం ఒక మరుపురాని అనుభవంగా పేర్కొన్నారు. ఆయన ఎంతటి బిజీ షెడ్యూల్లో గడుపుతున్నప్పటికీ..తన ఆరోగ్యాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఎంతటి విరామంలేని స్థితిని కూడా ఆయన చాలా చాకచక్యంగా సమతుల్యం చేసుకుంటారని, అదే ఆయన ప్రత్యేకత అని చెబుతున్నారు. సమయ నిర్వహణ నుంచి శారీరక దృఢత్వం కాపాడుకోవడం, శక్తిమంతమైన ప్రదర్శనలు ఇవ్వడం వరకు ప్రతిదీ నిశబ్దమైన ఏకాగ్రతతో చేస్తారని కుమార్ తెలిపారు. ఎంతటి హడావిడి రాజకీయ ర్యాలీలలోనైనా, ఆయన తన భోజనాన్ని తానే తీసుకువెళ్లేవారని అన్నారు. బయటి ఆహారానికి చాలా దూరంగా ఉంటారని చెప్పారు. ఆయనలో సాధారణ స్థాయిని మించిన క్రమశిక్షణను స్పష్టంగా చూడొచ్చని చెబుతున్నాడు. 51 ఏళ్ల వయసులోనూ యువ హీరోలను తలదన్నేలా ఉండే ఆయన ఫిజిక్కి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే అంటూ పొగడ్తలజల్లు కురిపించారు. అంతేగాదు విజయ్ క్షణం తీరక లేని ఒత్తిడితో కూడిన పరిస్థితిని సైక్లింగ్, జిమ్ సెషన్లు, రన్నింగ్ వంటి మార్గాలతో చిల్ అవుతారని చెప్పుకొచ్చారు. పైగా విజయ్కి ఇప్పటి వరకు మోకాలి లేదా నడుము నొప్పి వంటి సమస్యలు కూడా లేవన్నారు. ముఖ్యంగా విజయ్ వినయం ఎవ్వరినైన కట్టిపడేస్తుందని, అదే ఆయనకు ఇంతలా ప్రజాదరణ తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని సమాన గౌరవంతో చూస్తారు, అదే అయన మార్క్ని స్పెషల్గా చూపించడమే గాక..విక్టరీకి కేరాఫ్గా నిలిచేలా చేసిందని అంటున్నారు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల పరంగా అంచనాలకు అందని విజయ్ ఘన విజయం యాదృచ్ఛికంగా వచ్చిందికాదని, ఆయన అంకితభావం, ఏకాగ్రత, అభిరుచి ఫలితంగా వచ్చిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు. అంతేగాదు క్రమశిక్షణ అనే పునాదిపై నిర్మించబడిన విజయంగా పేర్కొన్నారు. అలాగే ఏ రంగంలోనైనా తూచా తప్పకుండా నిలకడతో వ్యవహరిస్తే..విజయం తథ్యమని అందుకు దళపతి, తమినాడు సీఎం విజయ్నే నిదర్శనమని అన్నారు. (చదవండి: హాట్టాపిక్గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..) -
నోబెల్ రేసులో 'రియల్లైఫ్ ప్యాడ్మ్యాన్' అరుణాచలం
'ప్యాడ్మ్యాన్'గా ప్రసిద్ధి చెందిన సామాజిక పారిశ్రామికవేత్త అరుణాచలం మురుగనంతం, 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినీగా ఎంపికయ్యారు. ఆ విషయాన్ని అరుణాచలం స్వయంగా తెలిపారు. అసలు మొదట తాను దీన్ని నమ్మలేకపోయానని అన్నారు. నిజానికి నోబెల్ బహుమతికి, మనమే మన పేరును లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను గానీ పంపడం సాధ్యం కాదన్నారు. అది తప్పనిసరిగా థర్డ్ సోర్స్ ద్వారానే జరుగుతుందని చెప్పారు. పుదుచ్చేరిలోని అరవింద్ కంటి ఆసుపత్రి డీన్, అక్కడ పనిచేస్తున్న అమెరికన్ బృందాలు నోబెల్ కోసం నా పేరును ప్రతిపాదించారు... 24 గంటల్లోపే అది ఆమోదించబడినట్లు తెలిపారు. అంతేగాదు ప్రతిష్టాత్మకమైన ఈ నోబెల్ శాంతి బహుమతికి నామినీగా తాను ఎంపిక అయ్యినందుకు ఎంతగానో గర్వపడుతున్నాను అని అరుణాచలం మురుగనంతం పేర్కొన్నారు.అరుణాచలం మురుగనంతం స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూరు. ఆయన ఒక సామాజిక కార్యకర్త. దేశంలోని గ్రామీణ మహిళలకు తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్లను పరిచయం చేశారు. రుతుస్రావం సమయంలో వాడే శానిటరీ న్యాప్కిన్లపై మహిళలకు అవగాహన పెంచేందుకు కృషి చేయడమే గాక దానిపై ఉన్న అపోహలను మహిళల్లో తొలగించేందుకు తన జీవితాన్ని దారబోశారు. అందుకే అరుణాచలం 'ప్యాడ్మ్యాన్'గా పాపులర్ అయ్యారు. కాగా, అరుణాచలం మురుగనంతం చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయన్ను 2016లో పద్మశ్రీతో సత్కరించింది. అంతేగాదు ఆయన జీవితం ఆధారంగా 'ప్యాడ్మ్యాన్' పేరిట బాలీవుడ్ మూవీ కూడా తెరకెక్కింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్ బల్కీ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.కాగా, 2026 నోబెల్ శాంతి బహుమతికి 287 మంది అభ్యర్థులు నామినేట్ అయ్యారు. వీరిలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి. కాగా 2026 నోబెల్ శాంతి బహుమతిని ఈ ఏడాది అక్టోబరు 9న ప్రకటించనున్నారు. డిసెంబరు 10న ఓస్లాలో ఈ పీజ్ ప్రైజ్ను ప్రదానం చేస్తారు. ఈ నోబెల్ పీజ్ ప్రైజ్ నామినేషన్ల సమర్పణ గడువు ఈ ఏడాది జనవరి 31నే ముగిసింది.#WATCH | Coimbatore, Tamil Nadu | Social entrepreneur Arunachalam Muruganantham, who is famously known as the 'Padman,' has been listed as a nominee for the 2026 Nobel Peace Prize.He says, "I couldn't believe it at first... For the Nobel Prize, you can not submit your name, nor… pic.twitter.com/unHNj0tSrF— ANI (@ANI) May 3, 2026 (చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..
MEIL గ్రూప్ డైరెక్టర్లో ఒకరైన భారతీయ వ్యాపారవేత్త, హైదరాబాదీ సుధా రెడ్డి, న్యూయార్క్లో జరిగే మెట్ గాలా2026లో మెరవనున్నారు. ఆమె మెట్ గాలాలో ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఏడాది మెట్ గాలా సుమారు 400 ప్రత్యేకమైన కళాత్మక వస్తువులతో.. ఏకంగా ఐదువేల ఏళ్ల నాటి శైలిని చాటిచెప్పే 'కాస్ట్యూమ్ ఆర్ట్' ప్రదర్శనను ఇతివృత్తంగా "ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్" అనే డ్రెస్ కోడ్ను ఎంచుకుంది. ఈ మెట్గాలా కార్యక్రమంలో పాల్గొనే అతిరథమహులంతా తమ దుస్తులను సజీవ కళాఖండాలుగా కనిపించేలా మానవ శరీరం, కళాత్మక వ్యక్తీకరణ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని ప్రతిబింబించాలని ఆశిస్తోంది. గతంలో సుధా ప్రఖ్యాత భారతీయ డిజైనర్లు ఫల్గుణి షేన్ పీకాక్, తరుణ్ తాహిలియాని రూపొందించిన అద్భుతమైన దుస్తులను ధరించారు. ఈ ఏడాది ఫ్యాషన్ను ఒక కళారూపంగా పరిగణించే ఇతివృత్తం నేపథ్యంలో ఆమె సబ్యసాచి ముఖర్జీ లేదా మనీష్ మల్హోత్రా వంటి ప్రముఖ భారతీయులతో కలిసి పనిచేయనున్నట్లు అంతరంగిక వర్గాల సమాచారం. పారిస్ ఒలింపిక్స్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వంటి అనేక ఉన్నత స్థాయి అంతర్జాతీయ కార్యక్రమాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బిజీగా ఉండే ఆమె ఈ ఏడాది న్యూయార్క్లో జరగనున్న గాలా ఈవెంట్ల్ భారత్కి ప్రాతినిథ్యం వహించనున్నారు.ఇక సుధా అందం, దాతృత్వ పరంగా ఆమెకు సాటిరారెవ్వరూ. ఆమె మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)లో డైరెక్టర్గా ఉన్నారు. అలాగే సుధా రెడ్డి ఫౌండేషన్కు కూడా నాయకత్వం వహిస్తున్నారు, దీని ద్వారా ఆమె స్వచ్ఛంద ప్రాజెక్టులు, సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం వంటివి చేస్తుంటారు.ఆమె ఎవరంటే..సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆమె 2024 మెట్ గాలాలో 200 క్యారెట్లకు పైగా వజ్రాలు ధరించి వార్తల్లో నిలవడమే కాదు రెడ్ కార్పెట్పై తన ఉనికిని చాటిచెప్పేలా ప్రపంచ దృష్టిని మరింతగా ఆకర్షించారు.ఆమె పుట్టి పెరిగింది విజయవాడలోనే. 19 ఏళ్లకే కృష్ణారెడ్డిని వివాహం చేసుకున్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం తమ బంధానికి సహాయపడిందని, తామిద్దరూ కలిసే పెరిగామని రెడ్డి గతంలో చెప్పారు.2026, మే 4, సోమవారం నాడు జరగనున్న మెట్ గాలా, ఈ ఈవెంట్లో అత్యధిక తారలు పాల్గొనే కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది సహ-అధ్యక్షులుగా బియాన్స్, నికోల్ కిడ్మన్, వీనస్ విలియమ్స్ ఉండగా, జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ బెజోస్ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా, న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక వేడుక,. ఇది కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం నిధుల సేకరణ కార్యక్రమం. దీనిని ప్రతి ఏడాది మే మొదటి సోమవారం నిర్వహిస్తారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official) (చదవండి: హాట్టాపిక్గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..) -
హాట్టాపిక్గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..!
త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అదీగాక ఇవాళ త్రిష పుట్టిన రోజు కూడా కావడం ఈ సందర్శన మరింత హాట్టాపిక్గా మారింది. ఇక్కడ నటి త్రిష కలియుగ దైవమైన ఆ తిరుపతి వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన విధానం అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. త్రిష అజా ఫ్యాషన్స్కు చెందిన వైట్సూట్తో అలరించింది. దీని ధర రూ. 12000 పైనే పలుకుతుందట. వినెక్తో కూడిన ఐవరీ కలర్ చేనేత వస్త్రం. ముఖ్యంగా ఈ వేసవి వేడికి ఆహ్లాదకరమైన హాయినిచ్చే కాటన్ కూడా ఇది. దీనికి తేలికపాటి ఫ్లోరల్ దుపట్టా ఈ డిజైనర్వేర్ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆలయాన్ని సందర్శించిన అనంతరం, త్రిష కృష్ణన్ చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడు,పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల రోజు త్రిష ఆమె ఆలయ సందర్శన రెండూ ఏకకాలంలో జరగడం కూడా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అదీగాక పోల్ ట్రెండ్స్ ప్రకారం, విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలన విజయాన్ని నమోదు చేయడం విశేషం.తిరుమల ఆలయం విశిష్టత..ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఉన్న వెంకటేశ్వర ఆలయం, వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. పైగా శేషాచలం కొండలపై ఉన్న అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన ప్రముఖ క్షేత్రం. ఏడు కొండలపైన కొలువైన శ్రీనివాసుడు, కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటూ, ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. ఇక్కడ మూలవిరాట్టు స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం.#WATCH | Andhra Pradesh: Actor Trisha Krishnan had the darshan of Lord Sri Venkateswara Swamy at Tirumala Tirupathi Devasthanam earlier this morning. pic.twitter.com/mhiaHMOu5l— ANI (@ANI) May 4, 2026 (చదవండి: 46 దేశాలు పర్యటించా..కానీ భారత్ పర్యటన..!) -
హాయిగా తింటూనే బరువు తగ్గొచ్చు!
బరువు తగ్గడం ప్రస్తుత రోజుల్లో ఒక ట్రెండ్గా మారింది. అంతా శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించుకుని స్మార్ట్గా మారడంపైనే ఫోకస్ పెడుతున్నారు. అంతేగాదు ఆరోగ్యస్ప్రుహతో ఆ దిశగా పోషకాహార నిపుణులు, ఫిట్నెస్ నిపుణుల సలహాలు సూచనలు పాటిస్తున్నారు. బరువు తగ్గడం అంటే తక్కువగా తీసుకోవడం, కేలరీలు మితంగా ఉండేలా కేర్ తీసుకోవడంపై ఆధారపడి ఉంటుందనేది అందరి నమ్మకం కానీ, ఇది అందరికీ వర్తించదని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ఫిట్నెస్ కోచ్ హన్నా బటన్. కొందరిలో ఈ విధానం దీర్ఘకాలిక కొవ్వు నష్టానికి దారితీస్తుందని అంటున్నారు. అలాంటివాళ్లు, జీవక్రియ , హర్మోన్ల సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా డైట్ తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. అదెలాగో సోషల్ మీడియా ఎక్స్ వేదిక వివరించారామె. ఆస్ట్రేలియాకు చెందిన ఫిట్నెస్ కోచ్ హన్నా బటన్ తాను సాధారణంగా తినే విధానం కంటే ఎక్కువగా తింటూ కోరుకున్న విధంగా బరువు ఎలా తగ్గొచ్చో ఎక్స్ పోస్ట్లో తెలిపారు. ఆ పోస్ట్లో మనకు స్థిరమైన కొవ్వు నష్టం జరగకుండా మంచి డైట్ని అనుసరించాలని అన్నారామె. అయితే చాలామంది నిపుణులు తక్కువ తినండి, కార్బోహైడ్రేట్లు తగ్గించండి, అలాగే ప్రతి కేలరీని లెక్కించడని సూచిస్తుంటారు. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్గా ఈ విధానం వల్ల కండరాలు కోల్పోయాను, హార్మోన్లు దెబ్బతిన్నాయ్, పైగా మరింత అధ్వాన్నంగా కనిపించానని చెప్పుకొచ్చింది. ఈ సలహా ముమ్మాటికీ తప్పు మాత్రమే కాదు హానికరం అని అంటున్నారామె.తక్కువగా తినడం వల్ల శక్తిని ఆదా చేసేందుకు జీవక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా కొవ్వు నిల్వలు, కండరాలు తగ్గిపోతాయ్, అలసిపోతారు కూడా. అలాగే మీ బరువులో ఎలాంటి మార్పు కనిపించదు కూడా. అందువల్ల ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు డైటింగ్ పద్ధతిని మార్చాలంటున్నారామె.ప్రోటీన్ ఆటను మార్చేస్తుందిఫిట్నెస్ కోచ్ హన్నా ప్రతిరోజూ శరీర బరువులో ప్రతి పౌండ్కు 0.7–1 గ్రాముల ప్రోటీన్ను లక్ష్యంగా పెట్టుకోమని సూచిస్తున్నారు. శరీరం ప్రోటీన్ను జీర్ణం చేసుకోవడం ద్వారానే దాని నుంచి వచ్చే కేలరీలలో 30% ఖర్చు చేస్తుంది. కొవ్వును తగ్గించుకుంటున్నప్పుడు ఇది లీన్ కండరాలను కాపాడుతుంది. చాలా మంది తమకు వాస్తవంగా అవసరమైన దానిలో సగం మాత్రమే తింటారు.ఎక్కువగా తింటే.. చురుకుగా జీవక్రియ..తీవ్రమైన ఆహార నియంత్రణ ఆకలికి సంకేతం, దీని ఫలితంగా కార్టిసాల్ స్థాయిలు పెరిగి, శరీరం కొవ్వును తీవ్రంగా నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. తీవ్రమైన ఆహార నియంత్రణ కంటే 300-400 కేలరీల లోటు ఎల్లప్పుడూ ఉత్తమమైనది. హన్నా ప్రకారం, తీవ్రమైన ఆహార నియంత్రణ కంటే నిలకడగా పాటించగలిగే డైట్ను ఎంచుకోవాలి.కండరాలే కొవ్వును కరిగించే చోదక శక్తిఎంత ఎక్కువ కండరాలను పెంచుకుంటే, విశ్రాంతి జీవక్రియ అంత ఎక్కువగా ఉంటుంది. అంటే విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కొవ్వును కరిగించడం ప్రారంభిస్తారు. ఇక్కడ కండరాలను పెంచుకోవాలంటే, తగినంత ఆహారం తీసుకుంటూ..బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. అలాకాకుండా నియంత్రణ పేరుతో ఆకలితో ఉండటం అనేది కండరాలను నాశనం చేస్తుంది, పైగా జీవక్రియ మందగించి, అదనంగా కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.40 ఏళ్లు పైబడిన వారిలో హార్మోన్లు చాలా ముఖ్యందీర్ఘకాలంగా తక్కువగా తిన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరిగి, శరీరం ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకునేలా చేస్తాయి. అదే సమయంలో, నిరంతరం తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల, కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే లెప్టిన్ అనే హార్మోన్ను అణచివేస్తుంది. ఇది మీకు అంతులేని ఆకలిని కలిగించి, మిమ్మల్ని అతిగా తినేలా చేస్తుంది.తినవలసిన ఆహారంహన్నా చికెన్, చేపలు, గుడ్లు మరియు గ్రీక్ యోగర్ట్ వంటి లీన్ ప్రోటీన్ను ఎక్కువగా తినమని సిఫార్సు చేస్తుంది. కూరగాయలను ఎక్కువ పరిమాణంలో, తక్కువ కేలరీలతో తీసుకోవాలి. డైట్కు అనుగుణంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను నియంత్రిత మోతాదులో తీసుకోవాలి.ఫలితాలుతాను స్ట్రిక్ట్ డైట్ నుంచి సరైన ఆహారానికి మారిన తర్వాత, వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపించాయని అంటోంది హన్నా. ముఖ్యంగా శరీర కొలెస్ట్రాల్ పూర్తిగా కరిగిపోయింది, పైగా తన శక్తి, పనితీరు పుంజుకున్నాయని చెప్పుకొచ్చింది. ఆమె అత్యంత సన్నగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువగా తింటున్నప్పటి నుంచే, మునుపెన్నడూ లేనంత ఆరోగ్యంగా కనిపిస్తోందని చెబుతోంది."1960లలో శారీరక శ్రమ లేని వారి కోసం 1,200-కేలరీల నమూనా రూపొందించారు, కానీ ఇది అందరికీ వర్తించదని అంటోంది. సాధ్యమైనంతవరకు పనితీరును పెంచే పోషకాహార ప్రణాళిక అవసరం. ఇది సరళమైనది. ప్రభావవంతమైనది. ఎవ్వరైనా దీన్ని సరిగా అనుసరిస్తే..వాటంతటే అవే మంచి మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్మకంగా పేర్కొంటూ తన పోస్ట్ని ముగించింది హన్నా.I lost body fat by eating MORE.Not less. Not 1,200 calories. More.Here's the science to sustainable fat loss:= Thread = pic.twitter.com/GtiTLcwYJI— Hannah - Apex Fitness Advisory (@hannahapexfit) May 1, 2026 గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు) -
బట్టలు ఆరేసాక, సడెన్గా వర్షం వస్తే : అమ్మడి ఐడియా అదుర్స్!
బట్టలు ఆరేయడం, మడతపెట్టడం, వాటిని జాగ్రత్తగా అల్మరాలలో సర్దడం ఒక పెద్ద పని. దీనికి చాలా ఓపిక శ్రద్ధ ఉండాలి. అందుకే చాలామంది ఇళ్లల్లో ఏ సోఫాలోనో, కుర్చీల్లోనో లేదంటే దీవాన్ బెడ్స్మీదో ఉతికిన బట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఇ పోతే బట్టలను ఆరబెట్టడం ఎండాకాలంలో అయితే పెద్దగా సమస్య ఉండదు కానీ, మిగతా సీజన్లలో కొంచెం కష్టమే... ఎంతో కష్టపడి ఉతికి (వాషింగ్ మెషీన్లోనే అనుకోండి) ఆరేసినపుడు, ఉన్నట్టుండి వర్షం వస్తే... గోవిందా.. గోవిందా. ఆ కష్టం పగోడికి రావద్దు అనిపిస్తుంది. అయితే దీనికోసం ఒక అమ్మడు మంచి ఆలోచన చేసింది.చిన్న బాల్కనీలున్న ఇళ్లలో, సరైన ప్లేస్ దొరకనపుడు బట్టల రాక్లను ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. బాత్రూంలో గోడకు, బాల్కనీలో,బాత్రూంలో, పడకగదుల్లోనూ బట్టల రాక్లు అమర్చుకుంటాం. ఇంకా వాష్స్టాండ్, సీలింగ్ డ్రాయర్ ర్యాక్ ట్రైపాడ్ డ్రైయింగ్ ర్యాక్స్ లాంటివి వాడతాం. అయితే ఆరు బయట తీగల మీద ఆరేసిన బట్టల్ని వర్షం వచ్చినపుడు పరుగెట్టాల్సిన అవసరం లేకుండానే ఒక వినూత్న టెక్నిక్ను వాడింది. దీనికి జస్ట్ అలా వీల్ అమర్చిన స్టాండ్ను లోపలికి జరిపింది. అంతే ఆకస్మిక వర్షాల నుండి రక్షణగా, బట్టలు ఆరబెట్టే సొంత అమరికను ఏర్పాటు చేసుకుందో మహిళ.Aniden basan yağmurlara karşı kendi imkanlarıyla raylı çamaşır asma düzeneği kuran bir kadın; pic.twitter.com/APFfTHUbFk— Gezegen ve İnsan (@gezegenveinsan) May 1, 2026నెటిజన్ల స్పందన గుడ్ ఐడియా అంటూ కొంతమంది నెటిజన్లు అభినందించారు. మరి కొంతమంది మాత్రం టేం వేస్ట్, స్పేస్ వేస్ట్ అంటూ పెదవి విరిచారు. మంచి ఆలోచనే! కాకపోతే, ఎంత స్థలం వృధా అవుతుందో! ఆ మొత్తంలో బట్టలను, దీని పరిమాణంలో సగం ఉండే ప్లేస్లోనే నేను ఆరేయగలను. పైగా వర్షం గురించి కూడా చింతించాల్సిన పనే లేకుండా ఆ షెడ్డు కిందనే, సూర్యరశ్మి వేడి , గాలి వల్ల బట్టలు చక్కగా ఆరిపోతాయి. ఇది పూర్తిగా వృధా! అని ఒకరు కామెంట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్! -
ది బార్కరీ బుక్ : పెట్స్ కోసం ఒక బేకరీ, ఒక పుస్తకం!
ఇంట్లో పెంచుకునే కుక్కలను చాలా మంది పెంపుడు జంతువుల్లాగ కాకుండా కుటుంబ సభ్యులతో సమానంగా ట్రీట్ చేస్తుంటారు. అయితే, వాటికి ఆహారం అందించే విషయంలో ఇప్పటికీ చాలా మంది యజమానులు గందరగోళానికి గురవుతుంటారు. మార్కెట్లో దొరికే ప్యాక్ చేసిన తినుబండారాలు మంచివో కాదో తెలియక ఆందోళన చెందుతుంటారు. అందుకే ఈ సమస్యకు ఓ అద్భుతమైన పరిష్కారాన్ని కనిపెట్టారు వ్యాపారవేత్త గార్గి ప్రేహర్. వాటికోసం ఒక బార్కరీ (బేకరీ)ని స్థాపించారు. అంతేకాదు వంటగదిలో లభించే పదార్థాలతో వాటికి సురక్షిత ఆహారం ఎలా అందించాలి అనే అంశాలపై ‘ది బార్కరీ’ (The BARKERY BOOK) అనే పేరుతో బుక్ను కూడా రాశారు. గార్గి ప్రేహర్ ( Gaargi Prehar) ముంబైకి చెందిన మహిళా వ్యాపారవేత్తపారిస్లో ఎంబీఏ పూర్తిచేసింది. భారతదేశానికి తిరిగి రావడానికి ముందు ఆమె పలు దేశాల్లో ఉన్నతస్థాయిలో పనిచేసింది. అంతలోనే ఆమెకు వచ్చిన ఆలోచన ఆమె జీవితాన్నే మలుపు తిరిగేలా చేసింది. పెంపుడు జంతువుల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే ఆమెకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా పర్సనలైజ్డ్, గ్లూటెన్–ఫ్రీ కేకులు, తీపి పదార్థాలను తయారు చేయడం ప్రారంభించింది. ఇదీ చదవండి: పెరుగన్నం, మామిడి పండు కలిపి తింటే ఇన్ని కష్టాలా?పప్–లార్డ్స్ బార్కరీ2019లో ముంబైలో పప్–లార్డ్స్ బార్కరీ అనే తన పాటిస్సేరీని ఆమె స్థాపించారు. ప్రతి వేడుకలోనూ మూగజీవాలను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఆమె దీన్ని ప్రారంభించారు. ఇక్కడ పెంపుడు జంతువులకు సురక్షితమైనవి మాత్రమే కాకుండా, వాటి ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తయారు చేస్తారు. వాటిల్లో కేకులు, స్నాక్స్, బేక్ చేసిన కుక్కీలు, సేవరి జెర్కీలు అన్నీ లభిస్తాయి. కుక్కల కోసం ప్రత్యేకంగా తయారు చేయగల బీర్, వైన్, గ్లూటెన్–ఫ్రీ జైలిటోల్–ఫ్రీ వంటి ప్రత్యేకమైన వంటకాలు కూడా ఈ బేకరీలో తయారు చేస్తారు. ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు ఈ బేకరీ నుంచి కేకులను తీసుకువెళ్తుంటారు. ది బార్కరీ బుక్పెంపుడు జంతువులకు అందించే ఆహారం తయారీపై ఆమె ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అదే ‘ది బార్కరీ బుక్’. వంటగదిలో ప్రతిరోజూ లభించే పదార్థాలతో పెంపుడు జంతువుల కోసం పోషకమైన ఆహారాన్ని ఎలా తయారు చేయాలో ఈ పుస్తకం నేర్పిస్తుంది. మనుషులు తినే ఏ ఆహార పదార్థాలు కుక్కలకు హాని చేస్తాయి? వాటికి ప్రత్యామ్నాయంగా ఏవి వాడాలి? అనే విషయాలను గార్గి ఇందులో స్పష్టంగా వివరించింది. భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారం కోసం రూ΄÷ందించిన మొదటి పుస్తకం ఈ ది బార్కరీ బుక్.ఇదీ చదవండి: రూ. 2 వేల నుంచి కోటి టర్నోవర్ దాకా : హోంమేకర్ సక్సెస్ స్టోరీభారతదేశపు మొదటి డాగ్ కుక్బుక్ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాగ్ లవర్స్కు పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరుగుతున్న ఈ తరుణంలో, ఈ పుస్తకం ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుంది. అలాగే విజయం అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు, సమాజంలో మనం తీసుకువచ్చే ఒక మార్పు. ఎవరినీ కించపరచకుండా, నొప్పించకుండా సున్నితంగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. అదే నేను చేశాను. సాధించాను. అదే నా గెలుపు. – గార్గి ప్రేహర్ ఇదీ చదవండి : షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్! -
మీ పిల్లల్లో మొబైల్ వాడకం ఎక్కువా? ఈ రిస్కూ ఎక్కువే?
న్యూఢిల్లీ, సాక్షి : ‘‘పుస్తకం హస్తభూషణం’’ అనేమాట దాదాపు మర్చిపోతున్నాం. చిన్నా పెద్దా అందరికీ మొబైలే సర్వస్వంగా మారిపోయింది. రెండేళ్లలోపు పిల్లలు అతిగా మొబైల్ ఫోన్లు వాడటం వల్ల వారిలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) వచ్చే ముప్పు పెరుగుతుందని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తాజా అధ్యయనం వెల్లడించింది.ఎయిమ్స్ పీడియాట్రిక్ న్యూరాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ షెఫాలీ గులాటి మాట్లాడుతూ, పిల్లల పెంపకంలో మానవీయ కోణం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. "ప్రతి బిడ్డకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉంది. పిల్లల్లో ఆటిజం లక్షణాలు కనిపిస్తే, తల్లిదండ్రులు వెంటనే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ లేదా డెవలప్మెంటల్ పీడియాట్రీషియన్ను సంప్రదించాలి" అని ఆమె సూచించారు.పుట్టినప్పటి నుండి 18 నెలల మధ్య కాలంలో తల్లిదండ్రులు స్క్రీన్ ఎక్స్పోజర్కు అనుమతించిన పిల్లలలో ఆటిజం మరియు ఇతర తీవ్రమైన రుగ్మతలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని ఈ పరిశోధన పేర్కొంది. చిన్న వయస్సులోనే ఎక్కువసేపు స్క్రీన్ టైమ్ గడపడం వల్ల ఆటిజం వచ్చే ప్రమాదం పెరుగుతుందని గత అధ్యయనాలు, మెటా-విశ్లేషణలు నిరూపించాయని, అంతేకాకుండా, ఆటిజం ఉన్న పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి తాము చేసిన అధ్యయనంలో, ఆటిజం ఉన్న పిల్లలు ముందుగానే, ఎక్కువ సేపు స్క్రీన్ టైమ్ వాడారని వెల్లడైందని గులాటి వివరించారు. అలాగే పిల్లలతో వ్యక్తిగత సంభాషణ ప్రాముఖ్యతను గులాటి నొక్కిచెప్పారు, “మనం పిల్లలతో వ్యక్తిగతంగా ఎంత ఎక్కువగా సంభాషిస్తే, అది అంత ముఖ్యం” అని ఆమె పేర్కొన్నారు.ఆటిజం లక్షణాలుఆటిజం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్ సమస్యలు, ప్రవర్తనా తీరుమార్పులు ఎదుగుదలలో లోపాలతో తదితర మార్పులొచ్చే అవకాశం ఉంది:మాటలు రావడం ఆలస్యం కావడం, తమ అవసరాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది పడటం.కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోవడం (Limited eye contact), ఇతరులతో కలవలేకపోవడం.ఒకే పనిని పదేపదే చేయడం, శబ్దాలు లేదా కాంతి పట్ల అతిగా స్పందించడం. నేర్చుకోవడంలో ఇబ్బందులు: మేధోపరమైన నైపుణ్యాల అభివృద్ధిలో అసమానతలు ఉండటం. ఇండియా గణాంకాలుఐసిఎంఆర్ (ICMR) సర్వే ప్రకారం, నగరాల్లోని 65% మంది చిన్నారులు రోజుకు 2 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ చూస్తున్నారు.ఆటిజం వ్యాప్తి డబ్ల్యూహెచ్ఓ (WHO) అంచనాల ప్రకారం, భారతదేశంలో ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరు ఆటిజం బారిన పడుతున్నారు.అవగాహన లోపం టైర్-2 నగరాల్లో దాదాపు 70% మంది తల్లిదండ్రులు మొబైల్ను 'డిజిటల్ బేబీసిట్టర్'గా (పిల్లలను బుజ్జగించడానికి) వాడుతున్నారు.వైద్యుల ఏమంటున్నారంటేబాల్యం అనేది మానవ సంబంధాలు, ఆటపాటలు మరియు ఇంద్రియాల ద్వారా నేర్చుకునే ప్రక్రియలతో నిండి ఉండాలి, కానీ స్క్రీన్లతో కాదు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేయాలని మరియు పిల్లల ఎదుగుదలలో ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలని ఎయిమ్స్ అధ్యయనం తల్లిదండ్రులను హెచ్చరిస్తోంది. -
మహిళలు ఒకవైపే అలా ఎందుకు కూర్చుంటారు?
చాలా మంది మహిళలు సాధారణంగా బైక్ వెనుక కూర్చున్నప్పుడు రెండు కాళ్లు ఒకే వైపునకు పెట్టి కూర్చుంటారు. దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందనో, లేదంటే కేవలం చీరలు కట్టుకోవడం వల్ల ఇలా కూర్చుంటారని మనం భావిస్తుంటాం. కానీ, దీని వెనుక శతాబ్దాల నాటి యూరోపియన్ చరిత్ర, వలస రాజ్యాల ప్రభావం ఉందని చెబుతున్నారు ప్రముఖ బైకర్, ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ జెనిత్ ఇర్ఫాన్. ఆమె ఇటీవల షేర్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలో ఉన్న అంశాల ప్రకారం.. మహిళలు ఇలా ఒక పక్కకు తిరిగి కూర్చోవడం అనే సంస్కృతి.. మధ్యయుగ ఐరోపాలోని ఉన్నత వర్గాల నుంచి వచ్చిన అలవాటు. 14వ శతాబ్దంలో ప్రిన్సెస్ అన్నే ఆఫ్ బోహేమియా దాదాపు 1,600 కిలోమీటర్ల ప్రయాణాన్ని గుర్రంపై ఒక పక్కకు కూర్చునే పూర్తి చేశారు. ఆ కాలంలో మహిళలు పురుషుల వలె గుర్రంపై రెండు కాళ్లు ఇరువైపులా వేసి కూర్చోవడం అమర్యాదగా భావించేవారు. స్త్రీల మర్యాదను కాపాడటానికి ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పాలన సమయంలో ఈ సంస్కృతి భారతదేశానికి దిగుమతి అయ్యింది. అప్పట్లో బ్రిటిష్ మహిళలు గుర్రపు స్వారీ చేసేటప్పుడు ఇదే పద్ధతిని పాటించేవారు. కాలక్రమేణా ఇది మన దేశంలోని సామాజిక నిబంధనల్లో కలిసిపోయింది. -
సైనస్తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్
Yoga కపాలభాతి అంటే తలను, మెదడును శుభ్రంగా చేసి ప్రకాశవంతంగా చేసే శ్వాస సాధన. దీన్ని శుద్ధిక్రియ అని కూడా అంటారు. విధానం ముందుగా సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చోవాలి.వెన్నెముక నిటారుగా ఉంచాలి.కళ్లు మూసుకొని రెండు చేతులను మోకాళ్లపైన జ్ఞానముద్రలో ఉంచాలి.శ్వాస ప్రక్రియ: లోతుగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను వేగంగా, బలంగా బయటకు వదలండి. శ్వాసను బయటకు వదిలినప్పుడు, పొట్ట కండరాలను వెన్నెముక వైపు లోపలికి నొక్కాలి.శ్వాసను బయటకు వదలడం యాక్టివ్గా ఉండాలి, లోపలికి తీసుకోవడం పాసివ్గా – అంటే శ్వాసను లోపలికి తీసుకునే ప్రయత్నం చేయనక్కర్లేదు, అదిఆటోమేటిక్గా జరుగుతుంది) ఉండాలి.బయటకు వదిలే శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టాలి.ఇలా 15–20 సార్లు వేగంగా శ్వాస తీసుకున్న తర్వాత, ఒక్క రౌండ్ పూర్తవుతుంది.కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, 2–3 రౌండ్లు చేయాలి. జాగ్రత్తలుఉదయం ఖాళీ కడుపుతో చేస్తే ఎక్కువ ప్రయోజనం.వేగంగా చేయకూడదు. తల తిరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే ఆపాలి.హై బీపీ, గర్భిణీలు, హెర్నియా, గుండె సమస్యలు ఉన్నవారు చేయకూడదు. ఉపయోగాలుముక్కులో ఉన్న మ్యూకస్ (కఫం) బయటకు వస్తుంది. ముక్కు బ్లాకేజ్ తగ్గుతుంది. సైనస్ ప్రెషర్, తలనొప్పి తగ్గుతుంది.శ్వాస సులభంగా జరుగుతుంది.ఊపిరితిత్తులు బలంగా అవుతాయి. జీర్ణశక్తి మెరుగవుతుంది. పొట్ట కొవ్వు తగ్గడానికి సహాయం చేస్తుంది. మనసు ప్రశాంతంగా, చురుకుగా ఉంటుంది.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
సైన్ లాంగ్వేజ్ ఇకపై సులభం!
చెవిటి, మూగ వారి భాష సంజ్ఞలు మాత్రమే. వీటిని కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల వారు సమాజంలో అన్ని చోట్లా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికోసమే సంజ్ఞల భాషను.. మాటల్లోకి మార్చే ఏఐ మోడల్ను రూపొందించింది 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రియాంజలి గుప్తా (Priyanjali Gupta). టెన్సర్ఫ్లో పైథాన్ ను ఉపయోగించి, అమెరికన్ సైన్ లాంగ్వేజ్ని తక్షణమే ఇంగ్లీష్ పదాలుగా మార్చే సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేసింది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి వాయిస్ సాంకేతికతలను దివ్యాంగులకు మరింత దగ్గర చేయడంలో ఇది ఒక కీలక అడుగుగా మారనుంది...తమిళనాడుకు చెందిన ప్రియాంజాలి గుప్తా వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె వెబ్క్యామ్, ఏఐ ఆధారిత సాంకేతికతను ఉపయోగించి, సంజ్ఞలను గుర్తించి.. వాటిని తక్షణమే పదాలుగా మార్చే సాఫ్ట్వేర్ను రూపొందించింది. సంజ్ఞల భాషను అందరూ అర్థం చేసుకోవడం అనేది చాలా పెద్ద, కష్టమైన సమస్య అని ప్రియాంజలికి ఉన్న బలమైన నమ్మకం. ఒక చిన్న స్థాయి సాఫ్ట్వేర్ దీనిని పరిష్కరించలేదని ఆమె ఆలోచన. సైన్ లాంగ్వేజ్లో ముఖ కవళికలు, భుజాల కదలికలతోపాటు మరిన్ని అంశాలు ఉంటాయని.. వాటన్నింటినీ అర్థం చేసుకోవడానికి చాలా బాగా శిక్షణపొందిన ఒక నెట్వర్క్ అవసరమని ఆమె భావించింది. అందుకే ఏఐ సాయంతో ఆమె ఈ మోడల్ని రూపొందించింది. సుమారు 300 చిత్రాల డేటా సెట్ను మాన్యువల్గా సిద్ధం చేసి, పైథాన్ భాషలో దీని కోడింగ్ను పూర్తి చేశారు. ప్రస్తుతానికి, ఈ వినూత్న సాఫ్ట్వేర్ కేవలం అమెరికన్ సైన్ లాంగ్వేజ్ను మాత్రమే అనువదిస్తుంది. ప్రతి భాషలో సంజ్ఞలు వేర్వేరుగా ఉంటాయి. కేవలం చేతి కదలికలే కాకుండా, ముఖ కవళికలను కూడా అర్థం చేసుకునేలా దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని ప్రియాంజలి చెబుతోంది. ఆమె రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ప్రస్తుతానికి అవును, కాదు, దయచేసి, ధన్యవాదాలు, ఐ లవ్ యు, హలో వంటి ఆరు సంజ్ఞలను విజయవంతంగా అనువదిస్తోంది. మరిన్ని డేటా సెట్లతో దీనిని పూర్తిస్థాయి మోడల్గా మార్చేందుకు ఆమె కృషి చేస్తోంది. ఈ సాఫ్ట్వేర్ చేతులు, వేళ్ల వంటి శరీర భాగాల కదలికలను విశ్లేషించడం ద్వారా సంజ్ఞలను విజయవంతంగా టెక్ట్స్గా మారుస్తుంది. ఈ ఏఐ సాఫ్ట్వేర్ వినికిడి లోపం ఉన్నవారితో అప్పటికప్పుడే కమ్యూనికేట్ చేయడానికి ఒక డైనమిక్ మార్గంగా తోడ్పడుతుంది.ప్రియాంజలి తన ఆవిష్కరణను లింక్డ్ ఇన్ వేదికగా పంచుకోగా, అది విపరీతంగా వైరలయ్యింది. దాంతో ఎన్నోవేల మందికి ఈ కొత్త సాఫ్ట్వేర్పై ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ కోడ్ అందరికీ అందుబాటులో ఉంది. అందువల్ల శాస్త్రవేత్తలు దీనిని ఇతర భాషలకు అనుగుణంగా, మరింత మెరుగ్గా మార్చవచ్చు. ఈ చిన్న ప్రయత్నం భవిష్యత్తులో దివ్యాంగుల కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నా భవిష్యత్ లక్ష్యంసాంకేతిక రంగంలో దివ్యాంగుల కోసం తగినంత సదుపాయాలు లేవని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మూగ, చెవుడు ఉన్నవారు గూగుల్, ఎకో లేదా అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్లను ఉపయోగించాలనుకుంటే పరిస్థితి ఏంటి? మన దగ్గర దానికి సరైన పరిష్కారాలు లేవు. మా అమ్మ దగ్గరికి చదువుకునేందుకు ఒక వినికిడి లోపం ఉన్న విద్యార్థిని వస్తుండేది. ఆమె తన ఆలోచనలను వ్యక్తీకరించడంలో పడుతునన ఇబ్బందిని స్వయంగా చూశాను. అందువల్ల అటువంటి వారి గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను. అందుకే ఈ చిన్న స్థాయి మోడల్ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాను. అలా ఆ ప్రయత్నం నుంచి వచ్చిందే ఈ సైన్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్. ప్రపంచ సమస్యలను పరిష్కరించే సాంకేతికతను నిర్మించడమే నా భవిష్యత్ లక్ష్యం. – ప్రియాంజలి గుప్తా -
ఐడెంటిటీకి మరింత బ్యూటీ
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూవాగం ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన అందాల పోటీలో కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి విజేతగా నిలిచారు. తమిళనాడులోని విళ్లుపురంలో అట్టహాసంగా జరిగిన ఈ ట్రాన్స్ వేడుకలో ఆమె ‘మిస్ కూవాగం 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లను ఏకం చేసే ఈ సాంస్కృతిక వేదికపై సూర్యకుట్టి సాధించిన విజయం, ఆ కమ్యూనిటీ ఐడెంటిటీకి, ఆత్మవిశ్వాసానికి, కళాత్మక ప్రతిభకు అద్దం పడుతోంది.ట్రాన్స్ జెండర్ల ఆరాధ్య దైవమైన కూతాండవర్ వెలసిన కూవాగం గ్రామంలో ప్రతి ఏటా కూవాగం ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహాభారతంలోని అరవాన్ (కూతాండవర్) బలి ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 14న ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలను సౌత్ ఇండియన్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్, తమిళనాడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ, తమిళనాడు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. అందులో భాగంగా కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి మిస్ కూవాగం 2026 టైటిల్ను గెలుచుకుని అందరినీ ఆనందంలో ముంచెత్తారు.ప్రథమ స్థానంలో సూర్యతమిళనాడు విళ్లుపురం మున్సిపాలిటీ మైదానంలో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 25 మంది పోటీదారులు మూడు దశల్లో తమ ఆత్మవిశ్వాసం, ప్రతిభను ప్రదర్శించారు. ర్యాంప్ వాక్లో, జడ్జిల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో సూర్య కనబరచిన చాకచక్యం ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టింది. రెండో స్థానాన్ని మలేసియాకు చెందిన నిషా నిలబెట్టుకుంటే, పుదుచ్చేరికి చెందిన అనన్య మూడోస్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మరో ఏడుగురు ట్రాన్స్ జెండర్లకు ‘యంగ్ అచీవర్స్’ పురస్కారాలను కూడా అందజేశారు. అంతకుముందు జరిగిన ‘మిస్ తిరునంగై 2026’ పోటీలో చెన్నైకి చెందిన ఓమన మొదటి బహుమతి గెలుచుకోగా, సాయి శ్రీ, సుఖి తర్వాతి స్థానాల్లో నిలిచారు.దేశ విదేశాల నుంచి తమిళనాడులోని కూవాగం గ్రామంలో ఉన్న కూతాండవర్ దేవాలయంలో జరిగే ఈ ఉత్సవం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా, ట్రాన్స్ జెండర్ల సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా సింగపూర్, హాంగ్ కాంగ్ వంటి దేశాల నుంచి వేల సంఖ్యలో ట్రాన్స్జెండర్లు ఇక్కడికి చేరుకుని తమ ఆరాధ్య దైవాన్ని పూజిస్తారు.ఉనికిని చాటే వేదిక కూతాండవర్ ఆలయ ఉత్సవాల్లో భాగమైన ఈ మిస్ కూవాగం పోటీ కేవలం అందానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ట్రాన్స్ జెండర్ల ఉనికిని చాటే ఒక గొప్ప వేదిక. ఈ వేదిక సూర్య కుట్టి సాధించిన విజయానికి, పట్టుదలకు కోయంబత్తూరు కీర్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రముఖ సినీ నటులు, గాయకుల సమక్షంలో ఆమెకు ఈ గౌరవం లభించడం విశేషం. కుటుంబ మద్దతే మా బలంట్రాన్స్ జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలంటే ముందుగా కుటుంబం నుంచి మద్దతు లభించాలి. నా ఈ విజయం మరికొంత మంది ట్రాన్స్జెండర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని అనుకుంటున్నాను. ప్రభుత్వం ప్రతిపాదించే చట్టాలు మా హక్కులను కాపాడేలా ఉండాలి. ట్రాన్స్ జెండర్ సమాజం పట్ల ఉన్న వివక్షను తొలగించి, హక్కుల కోసం పోరాడుతూ.. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలవడమే లక్ష్యం. -
వంట కాదు బాబోయ్... భగ భగ మంట... ఇవిగో టిప్స్
ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు... వంటింట్లో అడుగుపెడితే నరకం. స్టవ్ సెగ ఒకవైపు, బయట ఎండ ఒకవైపు. చూస్తే 45 డిగ్రీలు... చేయాల్సింది మూడు పూటలా వంట! ఆడవాళ్లకి చికాకు రాకుండా ఎలా? చల్లగా, కూల్గా వంట చేసుకోవడం ఎలా? ఇంటి మగాళ్లూ... మీరూ చేయాల్సింది ఉంది. వంట... నూరేళ్ల తంట. అది ఒక రోజుతో అయ్యేది కాదు... ఒక పూటతో ముగిసేది కాదు. స్త్రీలను కట్టెల పొయ్యి నుంచి కిరోసిన్ స్టవ్కు ఆ తర్వాత గ్యాస్ స్టవ్కు మార్చారుగానీ వంట నుంచి మార్చలేదు. సీజన్ ఏదైనా తుఫాన్లు వచ్చినా వడగాడ్పులు వీచినా వంట చేయాల్సిందే. అయితే వారూ మనుషులే. వారికీ ఓపిక ఉండాలి. ఇప్పుడు సీజన్ ఎలా ఉంది? ఎండకు ఉడుకెత్తి పోతోంది. ఇలాంటి వేళ స్టవ్ దగ్గర నిలబడి వంట చేయడం ఎంత కష్టం? అయినా ఇది ఎవరితో చెప్పుకున్నా ఆర్చేది కాదు... తీర్చేది కాదు... అందుకే మనమే కొన్ని చిట్కాలు పాటించాలి.టైమింగ్ మార్చండివంట చేసే సమయాన్ని మార్చాలి. పొద్దున 6 నుంచి 8 లోపు, సాయంత్రం 7 తర్వాత వంట కానివ్వండి. మిట్ట మధ్యాహ్నం స్టవ్ వెలిగిస్తే చికాకు పెరగడం ఖాయం. ‘నేను కూరలు ఉదయాన్నే తరిగి పెట్టుకుంటా. మధ్యాహ్నానికి ముందే వేడి తగలకుండా 10 నిమిషాల్లో వండేస్తా’ అని అంటున్న గృహిణులు కొంత నయంగా ఈ వేడిని ఎదుర్కొంటున్నారు.ఒక గిన్నె వంటఈ ఎండల్లో రెండు బర్నర్లు, నాలుగు గిన్నెలు అనే హైరానా అక్కర్లేదు. అన్నం, పప్పు, కూర వేర్వేరుగా చేసే వంటలు తగ్గించాలి. ఒక గిన్నెలో వండ గలిగే ఖిచిడీ, బిసిబేళబాత్, వెజ్ పులావ్, సాంబార్ రైస్ వీటి మీద దృష్టి పెట్టాలి. ఇరవై నిమిషాల్లో వంట ముగుస్తుంది. అంతే కాదు ఈ వంటలన్నీ కడుపుకి చలువ, వంట గ్యాస్ ఆదా.కిచెన్ని చల్లబరచండివంట సెగ కంటే ఎండ వల్ల కిచెన్ వేడిగా ఉంటే చాలా ఇబ్బంది. అందుకే ముందు కిచెన్ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పనిసరిగా అమర్చుకోవాలి. కిచెన్ డోర్ దగ్గర తడి టవల్ వేలాడదీయడం వల్ల ఫలితం ఉంటుంది. ఒక బకెట్ చల్లటి నీళ్లు మూలన పెడితే వేడి తగ్గుతుంది. మరో సంగతి... ఇంట్లో స్టాండ్ ఫ్యాన్ ఉంటే వెనక్కి తిప్పి కిచెన్ డోర్ దగ్గర పెడితే వేడి సెగ బయటికి పోతుంది.ఫ్రైలకు సెలవుఎండలు కాచే వేళ ఎక్కువ సేపు చేయాల్సిన డీప్ ఫ్రైలు, తాలింపులు బంద్ చేయాలి. ఆవిరి కూరలు, మజ్జిగ పులుసు, పెరుగు చట్నీ, సలాడ్లు చేస్తే కడుపుకి హాయి. అదీగాక డాక్టర్లు ‘వేయించినవి తింటే డీహైడ్రేషన్ వస్తుంది’ అని హెచ్చరిస్తున్నారు.నో కుకింగ్ డేవారంలో ఒకరోజు ఉద్యోగానికి సెలవు ఉన్నట్టే వంటకు కూడా సెలవు ఉండాలి. ఈ ఎండల్లో అది ఇంకా ముఖ్యం. వారంలో ఒక రోజు స్త్రీలు నో కుకింగ్ డే పాటించాలి. అంటే? పులిహోర, దద్దోజనం ముందురోజే చేసి ఫ్రిజ్లో పెట్టుకోండి. లేదా ఆ రోజుకి ఏదైనా ఆహారం ఆన్లైన్లో తెప్పించుకోండి. మొహమాటం వద్దు. మీరు కూల్గా ఉంటేనే ఇల్లు కూల్గా ఉంటుంది.మగమహారాజులూ... కిచెన్లోకి రండివంట చేస్తూ శ్రీమతి విసుక్కుంటుంటే మీరు టీవీ రిమోట్ నొక్కుతూ కూర్చోవద్దు. చిన్న సాయం చేస్తే ఆమె చికాకు తగ్గుతుంది.మీరు చేయగలిగే పనులుకూరగాయల కట్టింగ్ మాస్టర్ అవ్వండి. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం విరామం తీసుకుని మర్నాటి వంట కోసం ఉల్లి, టమాటా, క్యారెట్ తరిగి ఫ్రిజ్లో పెట్టండి. దీనివల్ల పొద్దున్న ఆమెకి 20 నిమిషాల సెగ తప్పుతుంది. ‘నో కుకింగ్ డే’ నాడు ఆమె వంట విరామం తీసుకుంటే మీరు పులావో, కిచిడీయో కాకపోయినా మ్యాగీ, ఆమ్లెట్ పెట్టినా ఆమెకి పండగే. ఎండలో కూరగాయలకి, పాలకి ఆమెను వెళ్లనివ్వకండి. లిస్ట్ తీసుకుని ఉదయం 7 లోపు తెచ్చేయండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ చెడిపోయిందా? ఫ్రిజ్లో వాటర్ బాటిల్స్ నింపారా? మజ్జిగ చేయడానికి పెరుగు ఉందా? ఈ పనులు మీవి. అలాగే ‘ఈ ఎండలో కూడా టేస్టీగా చేశావే’ అని ఒక్క మాట చెప్పండి. ఖరీదైన ఏ.సి. కన్నా ఆ మాటే ఎక్కువ చల్లదనం ఇస్తుంది. వంకలు పెడితే వంటింటి హీట్ డబుల్ అవుతుంది. ఇల్లాలు చల్లగా ఉంటే, ఇంట్లో అందరూ చల్లగా ఉంటారు. గృహిణి కడుపు చల్లగాఎండల్లో వంట చేస్తూ కష్టపడే సమయంలో బాడీ కూల్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోద్దు. సబ్జా నిమ్మకాయ రసం, బార్లీ నీళ్లు, పుదీనా మజ్జిగ, రాగి అంబలి... ఇవన్నీ కిచెన్లోనే సులువుగా తయార వుతాయి. గంటకోసారి తాగండి. చికాకు మాయం. -
'అప్గ్రేడ్' చేసుకుంటూనే పోవాలి..!
నిజమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక కోర్సు పూర్తి చేయడం కాదు, అది ప్రతిరోజూ మిమ్మల్ని మీరు 'అప్గ్రేడ్' చేసుకునే ఒక జీవనశైలి. "నేను అన్నీ నేర్చుకున్నాను, ఇక నేను పర్ఫెక్ట్" అని నువ్వు అనుకున్న మరుక్షణమే నీ ఎదుగుదల ఆగిపోతుంది. వ్యక్తిత్వం అనేది ఒక శిల్పం లాంటిది; దాన్ని ప్రతిరోజూ చెక్కుతూనే ఉండాలి.పర్ఫెక్షన్ కాదు.. ప్రోగ్రెస్ ముఖ్యం (Progress over Perfection)మనం ఎప్పటికీ 'పర్ఫెక్ట్' అవ్వలేము బ్రో, ఎందుకంటే మనిషి అన్నవాడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాడు. నిన్నటి కంటే ఈరోజు మీరు 1% మెరుగ్గా ఉన్నారా? లేదా? అన్నదే ముఖ్యం. తప్పులు చేయడం సహజం, కానీ చేసిన తప్పే మళ్ళీ చేయకపోవడం 'వికాసం'. మీ లోపాలను అంగీకరిస్తూనే, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం నిరంతరం సాగాలి.సెల్ఫ్-రిఫ్లెక్షన్: మీతో మీరు మాట్లాడుకోండిఈ ప్రయాణం కొనసాగాలంటే, మీకు మీరు ఒక అద్దంలా ఉండాలి.ప్రతి వారం లేదా ప్రతి నెల ఒకసారి కూర్చుని ఆలోచించండి: "ఈ నెలలో నేను ఏయే విషయాల్లో స్ట్రాంగ్ గా ఉన్నాను? ఎక్కడ బలహీనపడ్డాను?"మీ పునాది (Foundation) గట్టిగా ఉందా? మీ విలువలు (Integrity) మారుతున్నాయా?మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం ఆపిన రోజున, మీరు సమాజం చెప్పే మాటలకు బానిసలైపోతారు.కంఫర్ట్ జోన్ - మీ ఎదుగుదలకు శత్రువుమీరు ఒక స్థితికి చేరుకున్నాక "ఇక చాలు, నేను సెటిల్ అయ్యాను" అని అనిపిస్తుంది. అదే మీ పతనానికి ఆరంభం.The Stretching Principle: ఎప్పుడూ కొత్త సవాళ్లను (Challenges) స్వీకరించండి. మీకు భయం కలిగించే పనిని కనీసం నెలకు ఒకటైనా చేయండి.కొత్త మనుషులను కలవండి, కొత్త దేశాలను చూడండి, కొత్త పుస్తకాలు చదవండి. మీ ప్రపంచం ఎంత పెద్దదైతే, మీ వ్యక్తిత్వం అంత విశాలం అవుతుంది.హ్యూమిలిటీ: గెలిచినా ఒదిగి ఉండటం మీరు ఎంత ఎదిగినా, మీ కాళ్లు నేల మీదే ఉండాలి.అహంకారం (Ego) అనేది వ్యక్తిత్వ వికాసానికి పట్టిన చెద పురుగు. అది మిమ్మల్ని లోపలి నుండి తినేస్తుంది.గొప్ప వ్యక్తులు ఎప్పుడూ వినయంగా ఉంటారు, ఎందుకంటే వారికి తెలుసు—ఈ అనంతమైన విశ్వంలో తాము నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని. మీ సక్సెస్ ని తలకెక్కించుకోకండి, దాన్ని ఇతరులకు సాయం చేసే 'మెట్టు'గా వాడుకోండి.ఫైనల్ బ్లూప్రింట్: మీ జీవితమే ఒక పుస్తకంBe the Message:నువ్వు ఏయే విలువలు అయితే నేర్చుకున్నావో, అవి నీ ప్రవర్తనలో కనిపించాలి. నువ్వు చెప్పే మాటల కంటే నీ 'చేతలు' గట్టిగా వినిపించాలి.Legacy:నువ్వు లేకపోయినా నీ వ్యక్తిత్వం ఈ లోకంలో ఒక వెలుగును నింపాలి (Chapter 49).The Final Wordమనం ఈ ప్రయాణాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం, కానీ నీ వ్యక్తిగత వికాస ప్రయాణం ఇక్కడి నుండే కొత్త వేగాన్ని అందుకోవాలి. నువ్వు ఒకప్పుడు ఎవరో నీకు అనవసరం.. ఇప్పుడు నువ్వు ఎవరు, రేపు నువ్వు ఏమవ్వాలి అనుకుంటున్నావు అనేదే ముఖ్యం. నువ్వు ఒక'నిరంతర విద్యార్థివి'. నువ్వు ఒక'యోధుడివి'. నువ్వు ఒక'మార్పువి'.గుర్తుంచుకో.."నువ్వు ఆగిపోతే అది మరణం, నువ్వు సాగిపోతే అది వికాసం. నీ ప్రయాణాన్ని ఆపకు. ఆకాశమే నీ హద్దు.. కాదు, ఆకాశం కూడా ఒక ఆరంభం మాత్రమే!"Final Mind-Work: (జీవితకాల ప్రతిజ్ఞ)1. ఈ 50 వ్యాసాలలో మీకు అత్యంత నచ్చిన, మీ జీవితాన్ని మార్చిన 5 సూత్రాలను ఒక చోట రాసుకోండి. వాటిని మీ జీవిత కాలం పాటించాలని మీకు మీరు 'ప్రమాణం' చేసుకోండి.2. ఈ సిరీస్ ద్వారా మీరు పొందిన అతిపెద్ద మార్పు ఏంటో ఒక్క ముక్కలో రాసుకోండి.3. ఈరోజు నుండి, ప్రతిరోజూ పడుకునే ముందు "నేను ఈరోజు నా ఉత్తమ వెర్షన్ (Best Version) లా బ్రతికానా?" అని ప్రశ్నించుకోండి. (చదవండి: 'లెగసీ' అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..) -
పని ప్రదేశం..ఆరోగ్యానికి భారం కాకూడదంటే..!
ఇవాళ పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్యంకి సంబంధించిన దినోత్సవం. ప్రతి ఏటా ఏప్రిల్ 28న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని ముఖ్యోద్దేశం పని ప్రదేశాలలో ప్రమాదాలు, వ్యాధులను నివారించి సురక్షితమైన ఆరోగ్య పని సంస్కృతిని ప్రోత్సహించడమే. దీన్ని ఉద్యోగుల శ్రేయస్సు కోసం 2003లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పనిప్రదేశాన్ని హెల్దీగా ఎలా మార్చుకోవాలో ఆరోగ్య నిపుణుల మాటల్లో తెలుసుకుందామా.పనిప్రదేశంలో చాలామంది ఉద్యోగులు బ్యాక్పెయిన్, మెడనొప్పి, ఛాతీ నొప్పి వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్లు కూర్చోనే భంగిమపై అవగాహన ఏర్పరుచుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మానిటర్లను కంటి స్థాయిలో ఉంచడం, ప్రతి 30 నిమిషాలకు విరామం తీసుకోవడం, సాగదీయడం (స్ట్రెచింగ్) వంటివి చేయాలి.మోచేతులు డెస్క్ స్థాయిలో ఉండేలా కుర్చీ ఎత్తును సర్దుబాటు చేయాలి. ఇది మెడ/భుజాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. "తల ముందుకు వంగిన" భంగిమను నివారించడానికి, పాదాలు నేలపై చదునుగా ఉండేలా.. స్క్రీన్లు కంటి స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.వెన్నెముకను నిటారుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండకూడదు. దాంతోపాటు ప్రతి 30–60 నిమిషాలకు ఒకసారి కదలడం వంటివి చేయాలి. కండరాలపై స్థిరమైన భారాన్ని తగ్గించడానికి, నిలబడి పనిచేసే డెస్క్లను లేదా కన్వర్టర్లను ఉపయోగించడం, తరచుగా భంగిమలను మార్చుకోవడం వంటివి చేయాలి.వీటన్నింటి తోపాటు చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిని వ్యాయామం లేదా వాకింగ్ వంటి కదలికలు అవసరమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?) -
వేసవిలో పానీపూరీ తినడం ప్రాణాంతకమా..?
జార్ఖండ్లో జరిగిన విషాద ఘటన అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.దాంతో సమ్మర్లో ఎలాంటి చిరుతిండ్లు మంచివనే చర్చలు లేవనెత్తాయి. అందులోనూ స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా అందరు మెచ్చే పానీపూరి విషయంలో మరింత కేర్ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.జార్ఖండ్ గిరిడిహ్ జిల్లాలోని లేడా బజ్తో గ్రామంలో, శనివారం సాయంత్రం ఒక వీధి వ్యాపారి అమ్మిన పానీపూరీలు తిని చాలామంది వాంతులు, నీరసం వంటి అనారోగ్యం బారిన పడ్డారు. సుమారుగా 18 మందికి పైగా ఆసుపత్రిలో చేరగా, ఏడేళ్ల చిన్నారి మరణించింది. ఒక సాధారణ వీధి ఆహారం ఇంత మందికి ప్రాణాంతకంగా ఎలా మారిందన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. అందుకు ప్రధాన కారణంగా దానిలో ఉపయోగించే నీరేనని వైద్యులు చెబుతున్నారు. పానీపూరీ అనగానే నీరు ప్రధానం. ఈ నీరు కలుషితం కాకుండా మంచి పరిశుభ్రమైనది వాడితే ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు. అదే నీరు కలుషితమైతే దానిలో కోలి లేదా సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందన్నారు. వేడి వాతావరణంలో ఈ బ్యాక్టీరియా చాలా వేగంగా వృద్ధి చెందుతుంది కాబట్టి కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురవ్వుతామని అన్నారు. అలాగే అందులో ఉపయోగించే కూరలోని బంగాళదుంపలు, శనగులు తాజాగా ఉంటే పర్లేదు గానీ, అవి కూడా అసురక్షితమైనవి అయితే ఈ బ్యాక్టీరియా మరింత వేగంగా పెరుతుందన్నారు. అలాగే దుకాణం వద్ద కూడా పరిశుభ్రత అనేది అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యంగా అమ్మకందారులు వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, పాత పాత్రలనే వాడటం, ఈగలు, దుమ్ముకు గురికావడం, తదితరాల వల్లే ఫుడ్పాయిజనింగ్ అయ్యి అనారోగ్యం బారిన పడతారని హెచ్చిరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు, హాని కలిగించేవి కేవలం బ్యాక్టీరియా మాత్రమే కాదు, అవి వదిలిపెట్టే విషపదార్థాలు కూడా అనారోగ్య సమస్యలు వస్తయాన్నారు. ఆ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే విషపదార్థాల కారణంగా డీహైడ్రేషన్, అవయవాలపై ఒత్తిడి, చివరికి ప్రాణాంతకంగా కూడా మారుతుందని అంటున్నారు. వేసవిలో వేడి కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల మరింత వేగవంతంగా ఉంటుందట. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగ ఫుడ్పాయిజన్ కేసులు నమోదవుతాయని అంటున్నారు నిపుణులు. దకాణాదారుడు పరిశుభ్రతను పాటిస్తూ..నాణ్యమైన పదార్థాలనే ఉపయోగిస్తే ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా తినొచ్చని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..?) -
భోజనం తర్వాత పుచ్చకాయ తినకూడదా..?
ముంబైలో బిర్యానీ, పుచ్చకాయ తిని ఓ కుటుంబం మరణించిదన్న ఘటన తీవ్ర ఆందోళన, అనుమానాలను రేకెత్తించింది. భోజనం తర్వాత సర్వసాధారణంగా పండ్లు తీసుకుంటాం. అలా.. సమ్మర్ ఫ్రూట్గా చెప్పే పుచ్చకాయను మాత్రం అలా తీసుకోకూడదా అంటే..పోషకాహార నిపుణులు ఔననే చెబుతున్నారు. అసలు దీన్ని ఎలా తినాలి?, ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిది? వంటి విషయాలు గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.!.పుచ్చకాయ పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. అయితే చాలామంది ఈ పుచ్చకాయ తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉందంటూ ఫిర్యాదులు చేస్తుంటారు. ఎందుకిలా అంటే..రీజన్ ఏంటంటే..సర్వసాధారణంగా ఇలా ఎందుకు జరుగుతుందంటే భారీ భోజనం తర్వాత ఎప్పుడైతే పుచ్చకాయ తింటారో ఆ క్షణమే ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ వేసవి ఉష్ణోగ్రతలు కారణంగా పుచ్చకాయ వినయోగం ఆటోమేటిగ్గా పెరుగుతుంది. అందువల్ల ఇలా వేసవిలోనే ఈ సమస్య తీవ్రమవుతుందా? లేక ప్రతిసారి ఇలానే జరుగుతుందా అంటే..నిజనానికి వేసవిలో కడుపు ఉబ్బరం సర్వసాధారణమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అధిక వేడి కారణంగా శరీరం తన అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఇబ్బంది పడుతుండటంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుందని చెబుతున్నారు. తత్ఫలితంగా ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ కాలంలో అధిక నీటి శాతం ఉన్న పండ్లు, తినే భోజనం రెండూ సమతుల్యంగా ఉంటే ఈ సమస్య రాదని అంటున్నారు. అంతేగాదు మనం పుచ్చకాయలను తీసుకునే విధానం కారణంగానే ఈ కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ సమస్య వస్తుందని చెబుతున్నారు. అంతేగాదు అలాంటి సమయంలోనే జీర్ణవ్యస్థపై పుచ్చకాయ ప్రభావం చూపిస్తుంది. అదీగాక ఈ పుచ్చకాయలో అధికంగా ప్రక్టోజ్ ఉండటం వల్ల పెద్దప్రేగుల్లో ఇది పులిసి, గ్యాస్ ఉత్పత్తి అవ్వడానికి దారితీసి కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటివి కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదీగాక మనం తినే భోజనంతో పోలిస్తే పుచ్చకాయ వంటి పండ్లు జీర్ణాశయం గుండా వేగంగా ప్రయాణిస్తాయట. ఎప్పుడైతే ఈ రెండిటిని కలిపి తీసుకుంటామో దాని ఫలితం ఈ పుచ్చకాయ ముక్కలు జీర్ణం కావడాన్ని ఆలస్యం చేస్తుంది, దాంతో పులియబెట్టడం, గ్యాస్ ఏర్పడటం వంటివి జరుగుతాయని అన్నారు. అందువల్ల జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు సాధారణంగా భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం మానుకోవడమే మేలని చెబుతున్నారు. అలాగే ఎసిడిటీ సమస్యతో ఉన్నవారు కూడా భోజనం తిన్న వెంటనే లేదా పుచ్చకాయ తిన్న వెంటనే భోజనం వంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు.ఎప్పుడు తింటే మంచిదంటే..వైద్యులు మెరుగైన ఫలితాలు పొందాలంటే.. పుచ్చకాయను తీసుకునే సమయం కీలకమైనదని అంటున్నారు. అది తీసుకునే ఆధారంగానే మంచి ప్రయోజనాలను పొందగలమని అన్నారు. అంటే పూర్తి స్నాక్ ఐటెంగా లేక భోజనానికి చాలా సమయం ఉందనగా తీసుకోవడం మంచిదని అన్నారు. సరైన సమయంలో సరైన పద్ధతిలో తీసకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా వద్దనే చెబుతున్నారు వైద్యులు. సరైన సమయం ఉదయం 11 నుంచి 3 గంటల లోపు భారీ బోజనం తీసుకోక మునుపు అయితే మంచిదని చెబుతున్నారు. రాత్రి ఏడు తర్వాత తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది, పైగా రాత్రి సమయంలో తేలకపాటి ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏదైనా సరే తగిన మోతాదులో తీసుకోవడం మంచిదనేది గుర్తురెగాలి. ఎందుకంటే 'అతి సర్వత్ర వర్జయేత్' అన్న నానుడి గుర్తించుకుని ఏదైన మితంగా సమతుల్యంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉత్ఫన్నం కావని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పుచ్చకాయ.. నిజంగానే ప్రాణాలు తీస్తుందా?) -
మండే ఎండల్లో ఏసీలు పేలే ప్రమాదం : ఈ జాగ్రత్తలు మస్ట్
ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ వేడిమిని తట్టుకోవాలంటే అందరూ తప్పనిసరిగా ఏసీలను వాడుతున్న పరిస్థితి. ఏసీలను వాడటం మాత్రమే కాదు వాటిపని తీరుపై ప్రాథమిక అవగాహన చాలా అవసరం. లేదంటే వేసవిలో పేలే అవకాశం ఉంది. అందుకే ఎండాకాలంలో ఏసీల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్త లేంటి? ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించాలో తెలుసుకుందాం ఈ కథనంలో...వేసవిలో ఏసీ పేలడం కారణంగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న ఉదంతాలను అక్కడక్కడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలో తెలుసుకోవడం అవసరం. ఏసీ పేలుళ్లకు అత్యంత సాధారణ కారణం కంప్రెసర్లో అధిక పీడనం అని నిపుణులు చెబుతున్నారు. ఇది తరచుగా ఏసీ వేడెక్కడం, గాలి ప్రవాహానికి ఆటంకం కలగడం లేదా అంతర్గత లోపాల వల్ల సంభవిస్తుంది. మూసుకుపోయిన ఫిల్టర్లు లేదా అడ్డంకులున్న అవుట్డోర్ యూనిట్ల నుండి సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల వేడి మరింతగా లోపలే చిక్కుకుపోయి, సిస్టమ్పై ఒత్తిడిని పెంచుతుంది. R32 , R290 వంటి మండే స్వభావం గల రిఫ్రిజెరెంట్ల వాడకం వల్ల, ఇరుకైన ప్రదేశాలలో గ్యాస్ లీకేజీలు మండించబడితే అవి చాలా ప్రమాదకరంగా మారతాయి.ఏసీలు పేలడానికి ముందు ACలు కూలింగ్ తగ్గడం, అసాధారణ శబ్దాలు, తరచుగా పవర్ ట్రిప్లు, కాలితున్న వాసన, ఆకస్మికంగా విద్యుత్ హెచ్చుతగ్గులు వంటి హెచ్చరిక సంకేతాలను చూపవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారి తీయ వచ్చు. ఈ లక్షణాలేవి కనిపించినా వెంటనే అప్రమత్తం కావాలని టెక్నీషియన్లు సిఫార్సు చేస్తున్నారు.మెయింటినెన్స్కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి యూనిట్లకు సర్వీసింగ్ చేయించడం, ఫిల్టర్లు, కాయిల్స్ను శుభ్రపరచడం, సరైన వెంటిలేషన్ను ఉండేలా జాగ్రత్తపడాలి. వేసవికాలంలో ఏసీలను వాడే ముందు శుభ్రంచేయడం. ఏసీ సరిగ్గా పనిచేస్తుందో? లేదో నిపుణులైన టెక్నీషియన్ ద్వారా తనిఖీ చేయించడం ముఖ్యం. లేదా సంబంధిత బ్రాండ్ సర్వీస్ సెంటర్ వారిని సంప్రదించాలి. దీని వల్ల లోపాలను ముందుగానే గుర్తించవచ్చు. అన్నిఎలక్ట్రికల్ భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవచ్చు. వైరింగ్ తనిఖీఏసీకి అనుబంధంగా ఉన్న వైరింగ్ను తనిఖీ చేయాలి. ఏవైనా లోపాలు కనిపిస్తే బాగు చేయించుకోవాలి, లేదా వెంటనే మార్చుకోవాలి. వైరింగ్ సరిగ్గా లేకపోతే షాక్ వచ్చే అవకాశాలుంటాయి.రిమోట్లో కూల్ మోడ్, డ్రై మోడ్, ఫ్యాన్ మోడ్ లేదా ఎనర్జీ-సేవింగ్ మోడ్ వంటి మోడ్లు పనిచేయక పోవడం, AC లోని సెన్సార్ పనిచేయక పోవడాన్ని సూచిస్తుంది. మోడ్లు ఏవీ సరిగ్గా పనిచేయకపోతే, వెంటనే టెక్నీషియన్ను సంప్రదించడం చాలా ముఖ్యం.వెంటిలేషన్ ఏసీని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టడం మంచిది. ఖాళీగా ఉన్న ప్రదేశంలో, మంచి వెంటిలేషన్ ఉంచితే ఏసీ వేడెక్కకుండా ఉంటుంది. గాలి ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చూసుకోవాలి. లేదంటే గాలి సరిగ్గా రాదు. గాలి ప్రవాహం సరిగ్గా ఉటే ఏసీ యూనిట్ పై ఎలాంటి ఒత్తిడి పడదు. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కంప్రెసర్ వేడెక్కి అగ్ని ప్రమాద అవకాశాలను పెంచుతుంది.ఒక వేళ ఏసీ ఎలక్ట్రికల్ భాగాలు పాడైతే, వాటిని రీప్లేస్ చేసినప్పుడు నాణ్యమైన, కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ భాగాలతోనే రీప్లేస్ చేయాలి. అలాగే పవర్ సాకెట్లు, ప్లగ్గులు, షెడ్యూల్ బ్రేకర్లు నాణ్యతను ఒకటిరెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఏసీ టెంపరేచర్ని రూమ్ టెంపరేచర్ కంటే తక్కువగా సెట్ చేసుకోవడం చాలా కీలకం.ఏసీ నుంచి అసాధారణ శబ్దాలు వస్తున్నా, వాసన వస్తున్నా, లీకేజీ ఉన్నా కూడా వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి. ఏసీ నుంచి పొగలు వస్తున్నట్టు గమనిస్తే పొరపాటున కూడా నీటిని చల్లకూడదు. నిపుణులు వచ్చి తనిఖీ చేసేదాకా ఏసీని ఆఫ్ చేయడం ఉత్తమం.ఏసీ నిరంతరం వాడుతున్నవారు ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే.. రోజులో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఏసీ ని ఆఫ్ చేసి ఉంచాలి. దీని చాలాప్రమాదాలను నివారించవచ్చు. అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. స్మోక్ డిటెక్టర్లు లాంటి పరికరాలు ఇంట్లో ఉంటే మంచిది. ఎలాంటి ప్రాణాపాయాలు కలగకుండా ఉంటాయి.ఎలాంటి ఏసీలను తీసుకోవాలి? నాణ్యమైన ఎలక్ట్రికల్ భాగాలను వినియోగించే, నాణ్యమైన బ్రాండుకు సంబంధించిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలి. నోట్ : ఏసీలు వాడుతున్నవారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మైంటెయిన్ చేయాలి. దీని వల్ల చల్లదనాన్ని ఆస్వాదించడంలోపాటు, కరెంట్ ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు.ఇదీ చదవండి: అమెరికా నుంచి వచ్చి ఆరేళ్లు : గార్డ్స్పై కత్తితో దాడి, షాకింగ్ రీజన్? -
స్కిన్కు సన్స్ట్రోక్..!
నడివేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అలా ఎండలోకి వెళ్లామో లేదో ఒళ్లంతా మండుతున్న ఫీలింగ్. టూ వీలర్ నడుపుతూ ఉంటే... దుస్తులతో కప్పిలేనిచోట చర్మం చిమచిలాడిపోతోంది.వేడిమి తీవ్రతా, స్పర్శజ్ఞానం... వీటిని తెలిసేదీ, తెలిపేదీ చర్మమే. ఆ కారణంగా ఎండవేడిమితో మొట్టమొదట ప్రభావితమయ్యేది కూడా చర్మమే. అందుకే వేసవిలో తమ వృత్తుల కారణంగానో లేదా ఇతరత్రానో తప్పనిసరిగా ఎండలోకి వెళ్లేవారిపై ఆ వేడిమీ, ఆ వడగాడ్పుల తీవ్రత ప్రభావాలేమిటో, వాటిని అధిగమిస్తూ చర్మాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలిపే కథనమిది.తీక్షణమైన ఎండవల్ల కలిగే హాని ఏమిటంటే...ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు సూర్యుడి రేడియేషన్ ప్రభావాలేమిటి, వాటి వల్ల చర్మంపై పడే రకరకాల ప్రభావాలూ, వాటి కారణంగా వాటిల్లే నష్టాలూ, వాటిని అధిగమించే మార్గాలేమిటో తెలుసుకుందాం...సూర్యుడి నుంచి భూమికి చేరే రేడియేషన్లో మనం చూడగలిగేదీ... చూపు అనే విజువల్ సెన్స్ కలిగించడానికి ఉపయోగపడేది చాలా తక్కువ. ఇందులో రేడియో తరంగాలూ, ఎక్స్–కిరణాలూ, మైక్రోవేవ్ తరంగాలూ ఇలా రకరకాల రేడియేషన్స్ అనేక వేవ్లెంత్స్లో ఉంటుంది. దీన్నింతా కలిపి ‘ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్’ అంటారు. అయితే ఇందులో మనకు దృష్టిజ్ఞానాన్ని ఇచ్చేందుకు అవసరమయ్యే ‘కాంతి’ చాలా తక్కువ. అయితే మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లోని వివిధ రకాల కిరణాలు వేవ్లెంత్స్ కలిగి ఉంటాయి. ఒక కిరణం లేదా తరంగంలోన పక్కపక్కనే ఉండే అలలోని... ఒక పీక్కూ, మరో పీక్కూ మధ్యనున్న దూరాన్ని వేవ్లెంత్గా చెప్పుకుంటే మన కళ్లకు కనిపించే కాంతి తాలూకు వేవ్లెంత్ చాలా పరిమితంగా మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 400 – 700 నానో మీటర్ల రేంజ్లో ఉండే దాన్ని మాత్రమే మనం కాంతిగా పేర్కొంటాం. అంతకంటే తక్కువ వేవ్లెంత్తో ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్లెంత్తో ఉండేవాటిని ఇన్ఫ్రా రెడ్ కిరణాలుగా చెబుతారు.అల్ట్రా వయొలెట్ ఇన్ఫ్రా రెడ్ కిరణాలతోనే హాని...మనకు చేరే కాంతితోపాటు మన వాతావరణంలోకి వచ్చే ఈ అల్ట్రా వయొలెట్ (యూవీ), ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో మన చర్మానికీ, కంటికి కూడా హాని కలిగే ప్రమాదం ఉంది. పైగా వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల అమితమైన శక్తితో ఉండే ఈ కిరణాలు కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ.అల్ట్రా వయొలెట్ కారణాలు..చర్మంపై ప్రభావం..సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్లోని హానికారకమైన చాలా రకాల రేడియేషన్ను మన భూమిపైన ఉండే ఓజోన్ పొర వడపోస్తుంది. మొత్తం రేడియేషన్లో కేవలం 3 శాతం అల్ట్రా వయొలెట్ కిరణాలు మాత్రమే భూమి ఉపరితలం వరకు చేరతాయి. ఇలా భూమిని చేరిన ఈ మూడు శాతం అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల చర్మంపై అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. వీటిల్లోనూ యూవీ–సీ అని పిలిచే ఒక రకం అల్ట్రా వయొలెట్ కిరణాలు చాలా చాలా ప్రమాదకరమైనవి. కొన్నిసార్లు వాటి ప్రభావంతో స్కిన్–క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉంటుంది. అదృష్టవశాత్తు యూవీ–సీ కిరణాలను ఓజోన్ పొర అడ్డుకొని మనతోపాటు సకల జీవరాశినీ కాపాడుతుంటుంది. నిజానికి 400 – 700 న్యానోమీటర్ల మేరకు కాంతిపటలం తప్ప... అంతకు మించిన వేవ్లెంత్ వల్ల... అలాగే అంతకంటే తక్కువ వేవ్లెంత్ వల్ల... ఇంకా చెప్పాలంటే... అల్ట్రావయొలెట్, ఇన్ఫ్రారెడ్ కిరణాలతో మన చర్మానికి ఎంతో ప్రమాదం. అంతటి ప్రమాదకరమైన వేవ్లెంట్ ఉన్న తీక్షణమైన రేడియేషన్ను మానవ చర్మం తట్టుకోలేదు.మన చర్మం రంగును బట్టి... మనం తట్టుకునే శక్తి...సాధారణంగా 308 న్యానోమీటర్ల వేవ్లెంట్ వరకు మనం తట్టుకోగలమని ఓ రఫ్ అంచనా. ఒకవేళ రేడియేషన్ తాలూకు వేవ్లెంత్ ఫ్రీక్వెన్సీ 308 న్యానోమీటర్లు ఉన్నప్పుడు మనుషుల చర్మం ప్రభావితమవుతుంది. అయితే ఈ రేడియేషన్ను తట్టుకునే శక్తి కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నల్లటి చర్మం (డార్క్ స్కిన్) ఉన్నవారు ఎండ తీవ్రత తీక్షణంగా ఉన్నా తట్టుకోగలరు. కానీ చర్మం తాలూకు రంగులో డార్క్నెస్ తగ్గుతున్నకొద్దీ అంటే చర్మం ఫెయిర్గా అవుతున్న కొద్దీ ఎండ తీవ్రతను తట్టుకునే శక్తి కూడా తగ్గుతూ పోతుంది. అందుకే తెల్లటి చర్మం (ఫెయిర్ స్కిన్) ఉన్నవారు ఎండ తీవ్రతకు చాలా త్వరగా ప్రభావితమవుతారు. ఎండ తీవ్రత ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. మొదట తీవ్రమైన ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు చర్మం నల్లబారుతుంది. మొదటి దశల్లో ఇది కేవలం తాత్కాలికం. ఎండకు వెళ్లడం తగ్గిస్తే ఇలా నల్లబారడమూ తగ్గుతుంది. ఇలా చర్మం నల్లబారడాన్ని పిగ్మెంటేషన్ అంటారు.తొలి దుష్ప్రభావాలు/తాత్కాలిక దుష్ప్రభావాలుచర్మంపై అల్ట్రావయొలెట్ కిరణాల దుష్ప్రభావాలు ఈ కింద పేర్కొన్న రీతిలో ఉంటాయి.ఎరిథిమా (సన్బర్న్స్)... సాధారణంగా సూర్యుడి తీక్షణత ప్రభావం వల్ల ఎండలోకి వెళ్లగానే మొదట చర్మం ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత మాడినట్లుగా నల్లబడుతుంది. ఇలా జరగడాన్ని సన్బర్న్స్గా చెప్పవచ్చు. దీన్నే వైద్యపరిభాషలో ఎరిథిమా అని చెబుతారు.కొన్ని సందర్భాల్లో ఈ సమస్య చర్మంపైన ఎర్రగా పొక్కుల (బ్లిస్టర్స్) రూపంలోనూ కనిపించవచ్చు. ఎండ తీవ్రతను తట్టుకోగలిగే శక్తిలాగే... చర్మం రంగును బట్టి సన్బర్న్స్ తాలూకు తీవ్రత తగ్గడమూ, పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే... ఫెయిర్ చర్మం వారిలో సన్బర్న్ తీవ్రత ఎక్కువగానూ, నల్లటి చర్మం వారిలో తక్కువగానూ ఉంటుంది. బ్లిస్టర్స్ ఏర్పడితే ఎండ తీవ్రత అన్నది ఆ వ్యక్తి చర్మంపై చాలా ఎక్కువగా ఉందనడానికి ఈ సన్బర్న్స్ ఒక సూచన. కొందరిలో జ్వరం, వికారం, వాంతుల వంటివి కనిపించవచ్చు. అలాగే బాగా నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తూ బాగా బలహీనంగా ఫీల్ అవ్వడం కూడా జరగవచ్చు. కొందరిలో రక్త΄ోటు తగ్గడం, స్పృహతప్పడం వంటి పరిణామాలూ చోటుచేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తే బాధితులను తక్షణం హాస్పిటల్కు తరలించాలి.పరిష్కారం / చికిత్స : సన్బర్న్కు గురై చర్మం ఎర్రబారిన వారిని తక్షణం నీడపట్టునకు తీసుకెళ్లాలి. దాదాపు 12 – 24 గంటల పాటు బాగా చల్లటి ప్రదేశంలో ఉన్నా లేదా ఎయిర్కండిషన్ గదిలో బాధితుడిని ఉంచినా... ఆ లక్షణాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి. చర్మంపై చల్లటి నీటిలో తడిపిన టవల్తో తుడవటం లాంటి ఉపశమన ప్రక్రియలను చేయవచ్చు. అయితే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డర్మటాలజిస్టుల సూచన మేరకు నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీస్), చర్మపు మంట తగ్గడానికి హైడ్రోకార్టికోసోన్ క్రీములు వాడాల్సిరావచ్చు. పొక్కులను పగలగొట్టకూడదు. మాయిష్చరైజింగ్ క్రీములతో ఈ సమస్య తగ్గుతుంది.పిగ్మెంటేషన్ఎండకు ఎక్స్పోజ్ అయ్యేవారి చర్మం రంగు నల్లబారడాన్ని ‘పిగ్మెంటేషన్’గా చెప్పవచ్చు. ఎండ తీవ్రత కారణంగా చర్మంలోని మెలనిన్ కణాల్లో ఫొటోపిగ్మెంటేషన్ చర్య జరగడం వల్ల చర్మం రంగు నల్లగా మారుతుంది. అయితే దీని తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు అంటే... ‘ఇమ్మిడియట్ పిగ్మెంటేషన్ డార్క్నెస్’ (ఐపీడీ)లో నీడలోకి వచ్చి చల్లటి ప్రదేశంలో ఉంటే... కేవలం రెండు గంటల్లోనే పిగ్మెంటేషన్ తాలూకు ప్రభావం తగ్గుతుంది. కానీ... వారి వృత్తి రీత్యాగానీ లేదా ఇతరత్రా ఎండకు తప్పనిసరిగా తిరిగే వ్యక్తుల్లో... ‘తాత్కాలిక ఐపీడీ’కి బదులుగా ‘పెర్సిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్’ (పీపీడీ) అనే కండిషన్ వృద్ధిచెందుతుంది. దీని ప్రభావం కొద్ది రోజులు మొదలుకొని, కొన్ని వారాల వరకు ఉండవచ్చు. కంటిన్యువస్గా నీడపట్టున ఉండటమే దీనికి నివారణ. ‘పెర్సిస్టెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్’ (పీపీడీ) కండిషన్ మొదలయ్యాక... ఇక ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా అదేపనిగా ఎండలో తిరగడం చర్మం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పరిష్కారం / చికిత్స : వీలైనంత మేరకు తీక్షణమైన ఎండకు అదేపనిగా ఎక్స్పోజ్ కాకుండా ఉండటం వల్ల ఈ సమస్యను చాలావరకు నివారించవచ్చు. అయితే చర్మం నల్లబారాక (డార్క్గా అయ్యాక) డర్మటాలజిస్ట్ను కలిసి తగిన చికిత్స తీసుకుంటే చాలావరకు చర్మం మునపటి రంగు సంతరించుకునే అవకాశముంటుంది.చెమట కాయలు (మిలీరియా)చెమటకాయలు అని మనమంతా చెప్పుకునే ఈ సాధారణ సమస్యలను వైద్యపరిభాషలో మిలీరియా అంటారు. చర్మంపై ఉండే చెమట గ్రంథుల్లో (స్వేదగ్రంధుల్లో) ఏదైనా అడ్డంకి ఏర్పడినప్పుడు అవి ఉబ్బినట్లుగా అవుతాయి. బాగా చెమట పట్టి... అది ఆవిరైపోయే పరిస్థితి లేనప్పుడు స్వేదగ్రంధుల చివర్లో చెక్కరతో కూడిన పదార్థం (పాలీశాకరైడ్ సబ్స్టాన్స్) రూపొందింది, అది చర్మగ్రంధి చివరన అడ్డుగా ఉండిపోతుంది. ఫలితంగా లోపల ఉన్న చెమట (స్వేదం) బయటికి రాలేక లోపలే ఉండిపోయి, స్వేదగ్రంథిలో ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా స్వేదం పక్క కణజాలాల్లోకి స్రవించి చెమటకాయలు రూపంలో కనిపిస్తూ అవి విస్తరించినట్లుగా అవుతాయి. ఇక ఏవైనా ఆరోగ్య సమస్యలతో పడకకే పరిమితమైన (బెడ్ రిడెన్) పేషెంట్స్లో చెమట ఎక్కువగా పట్టడం, వారు తమ దేహాన్ని అటు ఇటు కదిలించలేకపోవడంతో ఇవి ఎక్కువగా వస్తుంటాయి.ఈ చెమటకాయల్లోనూ మిలీరియా క్రిస్టలైన్ (సుడామినా), మిలీరియా రుబ్రా (ప్రిక్లి హీట్) ఉంటాయి. అవి మెడ, ఛాతీ, వీపు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మిలీరియా క్రిస్టలైన్ (సుడామినా) కండిషన్లో చెమటకాయల తీవ్రత అంతగా ఉండకపోవడంతో చర్మంపై మంట ఉండదు. కానీ మిలీరియా రుబ్రా (ప్రీక్లీ హీట్)లో చెమటకాయలు ఎర్రగా కనిపిస్తుంటాయి. చేతికి తగులుతూ ముళ్లతో గుచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఇవి మంటనూ, తిమ్మిర్ల వంటి భావనను కలిగిస్తాయి. ఇక ‘మిలీరియా పుస్టులోజా’ అనే కండిషన్ మరింత తీవ్రమైనది. ఇందులో స్వేదగ్రంధిలోని స్వేదనాళానికి అడ్డంకి ఏర్పడటంతో పాటు అది దెబ్బతినడం కూడా జరగవచ్చు. ఇవి చర్మంలోని ఛాతీ, వీపు ప్రాంతాలలో తోపాటు ప్రైవేట్ పార్ట్స్లో కూడా విస్తరించవచ్చు. ఇది కొన్ని వారాల పాటు ఉంటుంది.పరిష్కారం / చికిత్స : చల్లటి ప్రదేశాల్లో ఉండటం, రోజూ క్రమం తప్పకుండా స్నానం చేయడం, ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యలతో దీన్ని నివారించవచ్చు. అయితే చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గుతాయి. పిల్లలకు లేదా పెద్దలకు వాడే సాధారణ పౌడర్, తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్నవారికి ప్రీక్లీ హీట్ ΄పౌడర్లతో ఉపశమనం ఉంటుంది. అయితే ‘మిలీరియా పుస్టులోజా’ అనే రకపు చమటకాయల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నవారూ, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా చెమటకాయలు కనిపిస్తున్నవారు తప్పనిసరిగా డర్మటాలజిస్టును సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. ఫొటో ఏజింగ్ : అదేపనిగా చాలాకాలం పాటు ఎండలో తిరగడం వల్ల కొన్ని అవాంఛనీయ దీర్ఘకాలిక పరిణామాలు ఏర్పడతాయి. అందులో ముఖ్యమైనది ఫొటోఏజింగ్. ఈ కండిషన్లో (ఫొటోఏజింగ్లో) చర్మంపై అవాంఛితమైన ముడతలు, వెడల్పుగా ప్యాచ్ వచ్చిన రీతిలో మచ్చలు (సోలార్ లెంటిజిన్స్) రావచ్చు. ఇక చర్మం తన సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోవడం; చర్మంపైన రక్తనాళాలు దారపు పోచల్లా కనిపించడం (టెలాంజిక్టాసియాస్ – అవే తర్వాత సాలెగూళ్లలా అల్లుకుని కనిపిస్తాయి. వాటినే స్పైడర్ వెయిన్స్ అని అంటారు); చర్మం ఎండిపోయినట్టుగా కనిపించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. అటు తర్వాత చర్మం చాలా ముదురుగా (రఫ్గా) నిపిస్తుంటుంది. ఎవరిలోనైనా ఇలాంటి దశ వస్తే... ఇకపై ఈ దశ తర్వాతైనా చాలాసేపు ఎండకు వెళ్లకుండా చర్మాన్ని కాపాడుకోవాలి. తద్వారా ఫొటో ఏజింగ్ను నివారించవచ్చు.చివరగా... ఇక్కడ తెలిపిన సూచనలు పాటిస్తూ ఉండటం వల్ల వీలైనంత మేరకు చర్మానికి వచ్చే సమస్యలను నివారించుకోవడం, ఎండ తీక్షణత నుంచి తమను తాము కాపాడుకోవడం అన్నది చాలావరకు సాధ్యమవుతుంది.ఎండ నుంచి చర్మానికి రక్షణ ఇలా...వేసవిలో ప్రతి రోజు రెండుపూటలా స్నానం చేయడం. (చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది). ఎండలోకి వెళ్లేవారు తప్పనిసరిగా గొడుగు తీసుకెళ్లడం. లైట్ కలర్ దుస్తులు వాడటం, (బాగా గాలి ఆడే కాటన్ దుస్తులు, ఎండ తగలనివ్వని లాంగ్స్లీవ్స్ దుస్తులు వాడటం మంచిది. అలాగే బాగా బిగుతుగా ఉన్న వస్తువులు ధరించడం వల్ల చెమట వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా మెటల్స్ వల్ల కలిగే అలర్జిక్ రియాక్షన్స్ వచ్చి... ఆ కారణంగా దురద వచ్చే అవకాశం ఉంటుంది. మరికొందరిలో వేలికి ఉంగరం ఉన్న చోట రెగ్యులర్గా సబ్బు నురగ ఇరుక్కుపోయి... ఆ డిటర్జెంట్ కారణంగా అలర్జీ రావచ్చు. ఇలాంటివారు తమ ఆభరణాలు మరీ బిగుతుగా లేకుండా చూసుకోవడం లేదా ఈ సీజన్లోవాటిని ధరించకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం మేలు). యాంటీ ట్యానింగ్ సన్స్క్రీన్స్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రావాయొలెట్ నుంచి రక్షణ దొరికేలా మంచి సన్స్క్రీన్స్ వాడటం. (వేసవిలో డాక్టర్లు / డర్మటాలజిస్టులు సూచించిన... ఎస్పీఎఫ్ ఎక్కువగా ఉన్న సన్స్క్రీన్ లోషన్లను వాడాలి). అవసరమైనవారు డాక్టర్ సలహా మేరకు రాత్రి వేళల్లో డీ–పిగ్మెంటేషన్ క్రీమ్స్ వాడటం. ఈత వంటి ఆటల్లో పాల్గొనే క్రీడాకారులు వాటర్ప్రూట్ సన్స్క్రీన్స్ వాడటం. చర్మం తన సాగేగుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోకుండా ఉండటం కోసం నీళ్లు ఎక్కువగా తాగడం, ద్రవహారాలు ఎక్కువగా తీసుకోవడం. (ప్రతిరోజూ కనీసం 12 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. ఈ సీజన్లో నీళ్లతో పాటు మజ్జిగ (బటర్మిల్క్), కొబ్బరినీళ్లు, పండ్ల రసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం మేలు. కోలా డ్రింక్స్ వంటివి చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండటం అవసరం). ఈ సీజన్లో తలకు రంగు వేసుకునే వారు చల్లటి వేళల్లో వేసుకోవడం మేలు.డియోడరెంట్స్ వాడేవారి కోసం కొన్ని సూచనలు... డియోడరెంట్స్ వాడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా డియోడరెంట్స్లో బర్గ్యాప్టెన్ అనే సోరోలెన్స్ పదార్థం ఉంటుంది. దాంతోపాటు దీనికి మంచి సువాసన (ఫ్రాగ్రెన్స్) రావడానికి కొన్ని రసాయనాలు వాడతారు. ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల ఇవన్నీ చర్మంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. కాబట్టి నేరుగా డియోడరెంట్స్ చర్మంపై రాసుకోవడం కంటే ఫ్రాగ్రెన్స్ను కోరుకునేవారు వాటిని బట్టలపై వేసుకునేలా (స్ప్రే చేసుకునేలా) వేసుకుంటే మంచిది. అందునా బట్టలు ధరించకముందే వాటిపై స్ప్రే చేసి... ఒక అరగంట తర్వాత దుస్తులు ధరించాలి. అలా ఉపయోగిస్తే చర్మానికి కలిగే హానిని తగ్గించినట్లు అవుతుంది. డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ నిర్వహణ: యాసీన్(చదవండి: Dementia: వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..? దెబ్బకు మతిమరుపు..) -
గ్యాస్ కష్టాలకు చెక్.. 52 ఏళ్ల మహిళ అద్భుత ఆవిష్కరణ
పశ్చిమాసియా(ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా)యుద్ధం, ఆర్థిక ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇటివల కాలంలో గ్యాస్ సిలిండర్లు కొరతగా మారటం, ధరల పెరుగుదలతో వంటగదుల్లో కష్టాలను సృష్టిస్తోంది. చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్లు కొరత అనేక రంగాలను దెబ్బతీస్తోంది. వంటగ్యాస్ లేకపోవడంతో సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో కొందరు ఈ ఎల్పీజీ గ్యాస్ కష్టాల రాకమునుపే సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని చేసిన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ 52 ఏళ్ల మహిళ రూపొందించిన పొయ్యి. ఎవరామె..?, ఆమెకు ఇదెలా సాధ్యమైందంటే..ఒడిశాకు చెందిన 52 ఏళ్ల సుభ్రా రాణి మొహంతి ఆవిష్కరణ ఎల్పీజీ గ్యాస్ కష్టాలకు ఊరటగానూ సామాన్యుడి పాలిటి వరంగానూ మారింది. ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని తారదాపడ గ్రామానికి చెందిన సుభ్రా రాణి మొహంతి 2018లో వంట ఖర్చులు తగ్గేలా, గ్రామీణ మహిళలు, అట్టడగు వర్గాల కుటుంబాలకు మద్దతిచ్చేలా తక్కువ ఖర్చుతో బయోమాస్ వంటపొయ్యిని రూపొందించారామె. పొగరహితమైన, సులభంగా తీసుకెళ్లగలిగే ఈ పొయ్యికి ఆమె 'రాకెట్ చుల్హా' అని పేరు పెట్టారు. కొబ్బరి పీచు, కట్టెలు, రంపపు పొట్టు వంటి స్థానికంగా లభించే పదార్థాలతో రూపొందించారు. తక్కువ ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాకుండా ఇంధన వినియోగాన్ని దాదాపు 50 శాతం తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా, సాంప్రదాయ కట్టెల ఆధారిత పొయ్యిలతో పోలిస్తే దీని నుండి వెలువడే పొగ చాలా తక్కువగా ఉంటుంది. సుమారు దశాబ్దం క్రితం గుజరాత్లోని బరోడాకు చెందిన ఒక శాస్త్రవేత్త నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందిన తర్వాత, మొహంతి తన సంస్థ ఎస్ఎస్ అసోసియేట్స్ ద్వారా తన నివాసంలోనే బయోమాస్ పొయ్యిల తయారీని ప్రారంభించారు. ఈ యూనిట్ సహజ డ్రాఫ్ట్ (రాకెట్-రకం), ఫోర్స్డ్ డ్రాఫ్ట్ వంటి వంట పొయ్యిలు రెండింటినీ ఉత్పత్తి చేస్తున్నారామె.సహజ డ్రాఫ్ట్ పొయ్యి కింద నుండి గాలిని తీసుకుంటుంది, ఇది బయోమాస్కు ఆక్సిజన్ను అందించి, దాదాపు పూర్తి దహనాన్ని నిర్ధారిస్తుంది. దీని ఫలితంగా సాంప్రదాయ పొయ్యిలతో పోలిస్తే వంటచెరుకులో 50 శాతం ఆదా, వంట సమయం 50 శాతం తగ్గడమేగాక మారు 70 శాతం మాత్రమే తక్కువ పొగ వస్తుంది. ఇది ఉపయోగించడానికి సులభమైనది, కంటి చికాకు, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందని అని మొహంతి చెబుతున్నారు.ఫోర్స్డ్ డ్రాఫ్ట్ పొయ్యి, దహన గదిలోకి గాలిని సరఫరా చేయడానికి బ్లోయర్ను ఉపయోగిస్తుంది, ఇది సమర్థవంతమైన దహనాన్ని నిర్ధారిస్తుంది. ఇది ఎల్పిజితో పోలిస్తే సుమారు 90 శాతం తక్కువ పొగను ఉత్పత్తి చేస్తుంది, 60 శాతం వరకు ఇంధనాన్ని, వంట సమయాన్ని ఆదా చేస్తుంది.ఆమె భర్త సత్యబ్రత్ మొహంతి ఈ పొయ్యిల మార్కెటింగ్లో ఆమెకు సహకరిస్తారు. కలహండి జిల్లాలోని సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) పాఠశాలలు, వసతి గృహాల వినియోగం కోసం ఈ పొయ్యిలను సేకరించింది. అంతేగాదు ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు మరో 18 రాష్ట్రాల్లో, అలాగే నైజీరియా, దక్షిణాఫ్రికా, కెనడా వంటి విదేశాల్లో కూడా ఈ స్టవ్లను విక్రయిస్తున్నామని ఆ దంపతులు తెలిపారు. ఈ కృషికి గాను, సుభ్రారాణి మొహంతికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శిక్షా సమ్మాన్తో సత్కారం, అనేక ప్రశంసలు, అవార్డులు, గౌరవాలను అందుకున్నారు కూడా. ప్రస్తుతం సుభ్రా రాణి ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ పొయ్యిల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో (SHGs) కలిసి పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by MY Bhubaneswar (@mybhubaneswar) (చదవండి: Dementia: వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..? దెబ్బకు మతిమరుపు..) -
వంట చేయడంలో ఇంత మహత్తు ఉందా..?
ఇంట్లో స్వయంగా వండుకునే వృద్ధుల్లో మతిమరుపు సమస్యలు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. వంట చేసేటప్పుడు కూరగాయలు తరగడం, సరైన మోతాదులో ఉప్పు, కారం, మసాలాలు వేయడం, వంటకాలకు తగ్గట్టుగా కావాల్సిన పదార్థాలను సరైన సమయానికి జోడించడం వంటి మల్టీ టాస్కింగ్ ఉంటుందని.. ఇది మెదడుకు వ్యాయామంలా పనిచేసి దాన్ని చురుగ్గా ఉంచుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.మెరుగైన మెదడు పనితీరు..: జపాన్ జెరోంటాలాజికల్ ఎవాల్యుయేషన్ స్టడీలో పాలుపంచుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 11,000 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఎంత తరచూ వారు ఇంట్లో వంట చేస్తారు? వంట సామర్థ్యంపై వారికున్న అంచనాలు, ఎంత మందికి మతిమరుపు వచ్చింది వంటి సమాచారాన్ని సేకరించారు. ఆ వివరాలను విశ్లేషించగా ఏమాత్రం వంట చేయని వృద్ధులతో పోలిస్తే రోజూ గరిట తిప్పే వృద్ధుల్లో డిమెన్షియా వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని గుర్తించారు. వంట నైపుణ్యం మెరుగైన మెదడు పనితీరుకు సంకేతమని ఈ అధ్యయనం తేల్చింది.జీవనశైలి మార్పుల ద్వారా..: వారానికి కనీసం ఒక్కసారైనా ఇంట్లో వంట చేసే వారిలో డిమెన్షియా రిస్క్ తగ్గినట్లు అధ్యయనాలు వెల్లడించాయి. క్రమం తప్పకుండా వంట చేసే పురుషుల్లో 23%, స్త్రీలలో 27% తక్కువ ప్రమాదం ఉండగా.. కొత్తగా వంట చేయడం ప్రారంభించిన వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు 67% తక్కువగా ఉన్నాయి. ‘2020 లాన్సెట్ నివేదిక ప్రకారం ఆహారం, శారీరక శ్రమ వంటి జీవనశైలి మార్పుల ద్వారా సుమారు 40% డిమెన్షియా కేసులను నివారించవచ్చని తేలింది. అందుకే ఇంటి వంటపై దృష్టి సారించాం’ అని అధ్యయన సహ రచయిత, టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ యుకాకో తాని చెప్పారు. అయితే వంట చేయడం ద్వారానే మతిమరుపు ముప్పు తగ్గుతుందని ఈ అధ్యయనం కచ్చితంగా నిరూపించలేదు. ఇది కేవలం ఇంటి వంటకు, మతిమరుపు ముప్పు తగ్గడానికి మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే వెలుగులోకి తెచ్చింది. అంటే వంట చేసే అలవాటు ఉన్న వారిలో ఈ రిస్క్ తక్కువగా ఉందని మాత్రమే గుర్తించింది. పైగా ఈ పరిశోధన కేవలం జపాన్కు చెందిన వృద్ధులపైనే నిర్వహించారు. ‘మతిమరుపు వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ఖరీదైన చికిత్సల కంటే వంట చేయడం వంటి చిన్నచిన్న మార్పులు అందరికీ అందుబాటులో ఉండే పరిష్కారాలు, మెదడు పనితీరును కాపాడుకోవడం ఈ అలవాట్ల ముఖ్య ఉద్దేశం’ అని యుకాకో తాని వివరించారు.మెదడుకు వ్యాయామం..ప్రణాళిక: ఏం వండాలి, ఎలా వండాలి అని ప్రణాళిక రచించడం.ఎంపిక: సరైన పదార్థాలను ఎంచుకోవడం.పద్ధతి: వంటకాల తయారీ పద్ధతిని పాటించడం.ప్రయోజనాలు..పోషకాహారం: మంచి డైట్ లభిస్తుంది.శారీరక శ్రమ: వంట చేసేటప్పుడు కదలడం వల్ల వ్యాయామం అవుతుంది.మానసిక శక్తి: ఆలోచించి వండటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.నేషనల్ డెస్క్(చదవండి: విమానం గాల్లో ఉండగానే ప్రసవం..! అయితే..) -
'లెగసీ' అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..
'లెగసీ' (Legacy) అంటే మీరు చనిపోయిన తర్వాత మీ పేరు మీద కట్టే విగ్రహాలు లేదా భవనాలు కాదు.. మీరు ఈ లోకంలో లేనప్పుడు కూడా మీ ఆలోచనలు, మీ విలువలు ఎంతమంది జీవితాలను వెలిగిస్తున్నాయి అనేదే అసలైన వారసత్వం.బ్రో, ప్రతి మనిషి ఈ భూమి మీద ఒక ముద్ర వేయడానికే పుడతాడు. కొందరు ఆ ముద్రను ఇసుక మీద వేస్తారు—అది కొద్దిసేపటికే చెరిగిపోతుంది. మరికొందరు ఆ ముద్రను రాతి మీద వేస్తారు—అది తరతరాలు నిలిచిపోతుంది. లెగసీ అనేది ఒక రోజులో నిర్మించేది కాదు, అది మీరు ప్రతిరోజూ బ్రతికే విధానం."నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచం నన్ను ఎలా గుర్తుంచుకోవాలి?" అనే ప్రశ్నకు సమాధానమే మీ లెగసీ.ప్రభావం vs విజయం (Impact vs Success)విజయం (Success) అనేది మీ గురించి; ప్రభావం (Impact) అనేది ఇతరుల గురించి.మీరు కోట్లు సంపాదించవచ్చు, పెద్ద హోదాలో ఉండవచ్చు.. అది మీ సక్సెస్. కానీ మీ వల్ల ఒక్క వ్యక్తి అయినా తన జీవితాన్ని మార్చుకున్నాడా? మీ మాట ఒక్కరికైనా ధైర్యాన్ని ఇచ్చిందా? అది ఇంపాక్ట్. నిజమైన లెగసీ ఎప్పుడూ 'ఇతరులకు సేవ చేయడం' (Service to Others) అనే పునాది మీద నిర్మించబడుతుంది.విలువలే మీ ఆస్తి (Values as Your Asset)డబ్బు, ఆస్తులు కరిగిపోవచ్చు, కానీ మీ'Integrity' (నిజాయితీ) తరతరాలు మాట్లాడుకుంటుంది.మీరు కష్టకాలంలో కూడా విలువలు వదులుకోకుండా ఉన్నారా? మీ మాట మీద మీరు నిలబడ్డారా? మీ పిల్లలకు లేదా మీ శిష్యులకు మీరు ఇచ్చే గొప్ప ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మీరు నేర్పించిన క్రమశిక్షణ, సంస్కారం. మీ విలువలే మీ అడ్రస్ కావాలి.మెంటర్ షిప్: వెలుగును పంచడంటమీకు తెలిసిన జ్ఞానాన్ని మీతోనే ఉంచుకుంటే, అది మీతోనే అంతమైపోతుంది.మీ అనుభవాలను, మీ పాఠాలను ఇతరులకు నేర్పించండి. ఒక మెంటర్గా మారండి. మీరు లేకపోయినా మీ ఆలోచనలతో పని చేసే ఒక టీమ్ని లేదా ఒక వ్యవస్థను (System) తయారు చేయండి. మీరు నాటిన చెట్టు నీడలో మీరు కూర్చోలేకపోవచ్చు, కానీ ఆ నీడను అనుభవించే తర్వాతి తరం మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది.సృజనాత్మక ముద్ర (Creative Contribution)మీరు రాసిన పుస్తకం, మీరు చేసిన ప్రసంగం, మీరు నిర్మించిన సంస్థ లేదా మీరు చేసిన ఒక మంచి పని—ఇవి మీ డిజిటల్, ఫిజికల్ లెగసీలు. మీ వృత్తిలో ఒక కొత్త ఒరవడిని సృష్టించండి. మీ ప్రతి పనిలో ఒక 'ఎక్సలెన్స్' (Excellence) ఉండాలి. "ఇది ఫలానా వ్యక్తి చేశాడు" అని జనం చెప్పుకునేలా మీ పనితీరు ఉండాలి.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? (The Urgency of Legacy)లెగసీ అనేది ముసలితనం వచ్చినప్పుడు ఆలోచించేది కాదు బ్రో. అది ఈ క్షణమే మొదలవ్వాలి. మీరు ఈరోజు ఒకరితో ఎలా మాట్లాడారు? ఒక గొడవను ఎలా పరిష్కరించారు? మీ సమయాన్ని దేనికి ఖర్చు చేశారు? ఇవన్నీ కలిసి మీ లెగసీని నిర్మిస్తాయి. ప్రతిరోజూ ఒక 'లెజెండ్' లా బ్రతకండి.The Takeawayబ్రో,ఇది నీ జీవితానికి ఒక బ్లూప్రింట్. నువ్వు ఈ భూమి మీద ఒక సాధారణ మనిషిగా మిగిలిపోవడానికి పుట్టలేదు. నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్న వాడివి మాత్రమే కాదు, నువ్వు ఒక 'ఆదర్శం'.నీ ప్రయాణం'Beyond'దశకు చేరుకుంది. ఇకపై నువ్వు కేవలం ఒక వ్యక్తివి కాదు.. నువ్వు ఒక సందేశానివి. నీ జీవితమే నీ లెగసీ కావాలి.గుర్తుంచుకో.."నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏడ్చావు, లోకం నవ్వింది. నువ్వు మరణించినప్పుడు లోకం ఏడవాలి, నువ్వు చిరునవ్వుతో వెళ్ళిపోవాలి. అప్పుడే నువ్వు అసలైన లెగసీని నిర్మించినట్టు!"వారసత్వ నిర్ణయంమీ అంతిమ యాత్రలో (Funeral) జనాలు మీ గురించి ఏ మూడు మంచి మాటలు చెప్పుకోవాలని మీరు కోరుకుంటున్నారు? (వాటిని ఇప్పుడే డైరీలో రాసుకోండి).ఆ మూడు మాటలకు తగ్గట్టుగా మీ ప్రవర్తన ఈరోజు ఉందా? లేకపోతే ఏం మార్చుకోవాలో ఆలోచించండి.ఈ రోజే కనీసం ఒక్క వ్యక్తికి ఏదైనా ఒక మంచి విషయాన్ని నేర్పించండి. మీ లెగసీని ఇక్కడే మొదలుపెట్టండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com(చదవండి: గ్లోబల్ మైండ్సెట్ అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..) -
ఊరు మెచ్చిన దీదీ
పెద్ద చదువు చదువుకోలేకపోయినా, ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. ఇల్లు దాటి బయటికి వస్తే సమాజం అనే విశ్వ విద్యాలయంలో ఎన్నో చదువుకోవచ్చు...ఈ ఎరుకతో ఇల్లు దాటి బయటికి వచ్చిన సామాన్య గృహిణి, పెద్దగా చదువుకోని చందా బాబర్(మధ్యప్రదేశ్) ఇప్పుడు ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది. మధ్యప్రదేశ్ ఝుబువా జిల్లాలోని గుణవాడ్ గ్రామంలో మధ్యాహ్నం వేళ కొద్దిమంది మహిళలు వేపచెట్టు కింద కూర్చొని తమ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చల్లో కీలక మహిళ... చందా బాబర్. తమకు ఏ సమస్యలు వచ్చినా గ్రామస్థులు మొదట చెప్పుకునేది ఆమెకే. ‘ప్రజలు ఎలాంటి సమస్యలతో వచ్చినా నేను వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది చందా. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివిన చందాకు చిన్న వయసులోనే వివాహం జరిగింది. చాలా సంవత్సరాలు ఇల్లే ప్రపంచంగా మారింది. ఇల్లు దాటి ఏదైనా చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది.ఆ ప్రశ్నతో తొలి అడుగుఇప్పుడు చందా బాబర్ ట్రాన్స్ఫామ్ రూరల్ ఇండియా (టీఆర్ఐ) ద్వారా శిక్షణ పొందిన ‘పంచాయత్ బద్లాన్ దీదీ’గా పిలిచే క్షేత్రస్థాయి గ్రామీణ కార్యకర్త. గ్రామీణ మహిళలు స్థానిక పరిపాలన వ్యవస్థలతో మమేకమవడానికి, వారిలో తగిన అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఉపయోగపడే టీఆర్ఐ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చందా... ‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎందుకు చేరడం లేదు?’ అని ప్రశ్నించింది. ఆమెకు ఏ సమాధానం అందిందో తెలియదుగానీ, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలనే సంకల్పంతో ఆనాటి నుంచి ఎన్నో వర్క్షాపులకు హాజరైంది. ఎన్నో విషయాలపై ఎంతో అవగాహన పెంచుకుంది. ‘పంచాయత్ బద్లావ్ దీదీ’ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించింది. ‘పంచాయత్ బద్లావ్ దీదీ’ హోదాలో ఎవరికైనా వైద్య అవసరాలు ఉంటే వారికి అన్ని రకాలుగా సహాయంగా నిలుస్తోంది. ‘ఈ ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి’ అని ప్రచారం చేస్తోంది.‘మా గ్రామంలో చందా మార్పు తీసుకురావాలనుకుంటోంది. మా దగ్గర గతంలో లేనిది మాకు ఇచ్చింది.. అది ప్రశ్నలు అడిగే ధైర్యం’ అని చందాను ప్రశంసిస్తున్నారు గ్రామస్థులు.ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల వరకు... ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయడం నుంచి ప్రజాచైతన్యం వరకు ‘పంచాయత్ బద్లావ్ దీదీ’ హోదాలో ఎన్నో మంచి పనులు చేస్తోంది. -
భారతదేశాన్ని ఫొటో తీశాడు
రఘురాయ్. ఈ పేరు చెప్పగానే ఢిల్లీ వీధుల్లో తిరిగే అంధ భిక్షువు గుర్తుకొస్తాడు. భోపాల్ విషవాయువులకు మరణించిన పసికందు తెరచిన రెప్పలను మూస్తున్న తల్లి చేయి గుర్తుకు వస్తుంది. బంగ్లాదేశ్ యుద్ధంలో ఒక తల్లి చెంప వెంట కారుతున్న అశ్రు బిందువు....మదర్ థెరిసా కైమోడ్పు చేతులు...మనవళ్లతో ఆడుతున్న ఇందిరా గాంధీ ఉల్లాసం... వై.ఎస్.రాజశేఖర రెడ్డి పాదయాత్ర... అతను దేశాన్ని తన కెమెరాలో నిక్షిప్తం చేశాడు. ఛాయా చిత్రంగా శాశ్వతం చేశాడు. అతనిపై నివాళి వ్యాసం.‘నా ఎదుట గొప్ప ఘటన జరిగినప్పుడు నా చేతిలో కెమెరా లేకపోతే పాపం చేసినట్టు భావిస్తాను’ అన్నాడు రఘురాయ్. ‘నువ్వు మంచి మనిషి కాకపోతే మంచి ఫొటోగ్రాఫర్వి కూడా కాలేవు’ అనీ అన్నాడు. ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫొటో జర్నలిజమ్’ గా ఖ్యాతి గడించిన 83 ఏళ్ల రఘురాయ్ కన్నుమూయడం భారతదేశాన్ని నిజ ఆత్మతో దర్శించే వాహిక కన్నుమూయడంతో సమానం. ఫొటో తీయడం అంటే కేవలం క్లిక్ చేయడం కాదనీ అది చె΄్పాల్సిన, చూపాల్సిన దృశ్యం సంపూర్ణంగా అవగతం చేయాలని అంటాడాయన. ఎందరెందరో ఫొటోగ్రాఫర్లకు గురువుగా ఉండి, ప్రపంచ దేశాల్లో భారత ఫొటోగ్రఫీ ఉనికి చాటిన రఘురాయ్ కెమెరా చేతబట్టిన చరిత్రకారుడు. కెమెరానే కలంగా మార్చి 1965 నుంచి 2025 దాకా 60 ఏళ్ల ఇండియాని ఫొటోలుగా భావితరాలకు ఇచ్చి వెళ్లాడాయన. → బుజ్జి గాడిద ఫొటోరఘురాయ్ది పంజాబీ కుటుంబం. దేశ విభజన సమయంలో ఢిల్లీ వచ్చి స్థిరపడింది. రఘురాయ్కు చిన్నప్పటి నుంచి ప్రకృతి, పరిసరాలు ఇష్టం. సంగీతకారుడు కావాలనుకున్నాడు. అయితే తండ్రి ‘నువ్వు ఇంజనీరువి కావాలి’ అనంటే సివిల్ ఇంజనీరింగ్ చదివి ఒక సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు. ‘అయితే అదేమీ నాకు మజా ఇవ్వలేదు’ అంటాడు రఘురాయ్. ఉద్యోగం మానేసి 1965లో 23 ఏళ్ల వయసులో ఢిల్లీకి తన పెద్దన్నయ్య ఎస్.పాల్ దగ్గరకు వచ్చాడు. పాల్ అప్పటికే ‘ది స్టేట్స్మేన్’లో ఫొటోగ్రాఫర్. పాల్ స్నేహితులు ఒకరోజు ఫొటోలు తీయడానికి పల్లెటూరుకు వెళుతుంటే సరదా కొద్ది అన్న కెమెరా మెడలో వేసుకుని వారితో వెళ్లాడు. వాళ్లంతా రకరకాల ఫొటోలు తీస్తుంటే తను మాత్రం అక్కడ ఉన్న బుజ్జి గాడిద పిల్లను ఫొటో తీశాడు. అది రఘురాయ్ మొదటి ఫొటో. ఇంటికి వచ్చాక అన్నయ్య అది చూసి ‘ఈ ఫొటో చాలా బాగుంది’ అని లండన్లోని టైమ్స్ డైలీకి పంపితే వాళ్లు అరపేజీ ఫొటోగా వేశారు. అలా రఘురాయ్ ఫొటో యాత్ర ఘనంగా మొదలైంది. ఆ మరుసటి సంవత్సరానికే ‘స్టేట్స్మేన్’లో రఘురాయ్ చీఫ్ ఫొటోగ్రాఫర్ అయ్యాడు. → బ్లాక్ – వైట్ ఇండియా1980–90ల దాకా రఘురాయ్ ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్లోనే ఫొటోలు తీశాడు. ‘ఇండియా రంగుల దేశం కాదు, భావాల దేశం. మనుషుల శరీర ముడతల్లోని బాధ, కళ్లలోని ఆశ, చేతుల్లోని కష్టం... ఇవి బ్లాక్ అండ్ వైట్లోనే తెలుస్తాయి’ అంటాడాయన. ఆయన ఫొటోల్లో కాంతి ఒక పాత్ర. నీడ ఒక పాత్ర. రఘురాయ్ గొప్పతనం సామాన్యుడిని సెలబ్రిటీని చేయడంలో ఉంది. ఢిల్లీ వీధుల్లో చాయ్ అమ్మే కుర్రాడు, కాశీలో దీపం వెలిగించే పూజారి, రైల్లో సామాను మోసే కూలీ – వీళ్లందరినీ మదర్ థెరిసాతో, సత్యజిత్ రేతో సమానంగా ఫ్రేమ్ చేశాడు.→ చారిత్రక ఘట్టాలు1982–1991 మధ్య పత్రికల్లో రఘురాయ్ పని చేసిన కాలం కీలకమైనది. ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ దాకా, పంజాబ్ ఉగ్రవాదం నుంచి మండల్ ఉద్యమం దాకా దేశాన్ని కదిలించిన ప్రతి ఘట్టాన్ని ఆయన కెమెరా సాక్ష్యమిచ్చింది. 1984 డిసెంబర్ 3న భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన ఉదయం ఎనిమిదిన్నరకే అక్కడ వాలిపోయి ’Burial of an Unknown Child’ ఫోటోతో ప్రపంచాన్ని కదిలించాడు. ఆ ఒక్క ఫొటోకే ‘వరల్డ్ ప్రెస్ ఫొటో అవార్డు’ వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత ఇండియా, పంజాబ్ ఉగ్రవాదం, అస్సాం ఆందోళన, మండల్ కమిషన్ గొడవలు... అన్నింటికీ రఘురాయ్ కెమెరా సాక్షి. ఎలైట్ ఇండియా, రియల్ ఇండియా రెండింటినీ సమానంగా చూపించాడు. → ఇందిరాగాంధీ ఫొటోలు1966లో రఘురాయ్ ఫొటో జర్నలిస్టుగా మారితే ఇందిరాగాంధీ అదే సంవత్సరం జనవరిలో ప్రధాని అయ్యారు. అంటే ఆమె పాలిటిక్స్లోకి, ఆయన ఫొటోగ్రఫీలోకి దాదాపు ఒకేసారి వచ్చారు. దాంతో ఆమెతో బాగా చనువు ఏర్పడింది. ఇందిరాగాంధీ ప్రైవేట్, పబ్లిక్ జీవితంలో ఎవరి అనుమతీ అక్కర్లేని ప్రవేశం రఘురాయ్కి ఉండేది. అందుకే ఇవాళ మనం చూస్తున్న ఇందిరాగాంధీ ఫొటోలెన్నో రఘురాయ్ తీయగలిగాడు. ప్రతి విమెన్స్ డేకు కనపడే ఇందిరాగాంధీ ఫొటో (చాలామంది మంత్రులు నిలబడి ఉండగా తను సీట్లో కూచుని ఉన్న ఇందిరాగాంధీ) రఘురాయ్ తీసిందే. ఇందిరాగాంధీ హత్య జరిగే ముందురోజు వరకూ రఘురాయ్ ఆమెను ఫొటోలు తీస్తూనే ఉన్నాడు.→ సత్యజిత్ రే భక్తుడురఘురాయ్ సినిమా రంగంలో పెద్దగా పని చేయలేదు కానీ సత్యజిత్ రేకు విపరీతమైన భక్తుడు. ఆయన సెట్స్లో తిరుగుతూ ఫొటోలు తీసేవాడు. రే కూడా రఘురాయ్ని ’He sees what others don't’ అని మెచ్చుకున్నాడు. ‘సలాం బాంబే’ సినిమాకు స్టిల్ ఫొటోగ్రాఫర్ రఘురాయే. ఆ తర్వాత సినిమా రంగంలో ఓంపురి, నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, స్మితా పాటిల్ వీళ్లందరి ఫొటోలను వారి వ్యక్తిత్వ ధోరణులకు తగినట్టుగా తీయగలిగాడు. ఇక గొప్ప సంగీతస్రష్టలు రఘురాయ్ తమను ఫొటో తీస్తే బాగుండు అనుకున్నారు. ప్రఖ్యాత తబలా విద్వాంసులు– తండ్రీ కొడుకులు అయిన ఉస్తాద్ అల్లారఖా, ఉస్తాద్ జకీర్ హుసేన్ల జుగల్బందీని రఘురాయ్ అద్భుతంగా కెమెరాలో ఒడిసిపట్టాడు.→ కెమెరా పట్టుకున్న రుషిరఘురాయ్ కెమెరా ‘కాలానికి సాక్షి’. రఘురాయ్ కెమెరా పట్టుకున్న ఒక ఋషి. రఘురాయ్ గొప్ప మానవతావాది, సంస్కర్త. అందుకే ఆయన దృష్టిలో ఇండియా అంటే పార్లమెంట్ కాదు. పార్లమెంట్ బయట టీ అమ్ముకునే కుర్రాడు. రాష్ట్రపతి భవన్ కాదు. దాని గేటు ముందు నిద్రపోయే యాచకుడు. ఈ హెచ్చుతగ్గుల వ్యవస్థలో ఎవరి పక్షం వహించాలో తెలిసిన ఛాయాచిత్ర తిరుగుబాటుదారుడు రఘురాయ్. ఆయన వెళ్లిపోయినా ఆయన వదిలిన ఛాయలు ఇక్కడే ఉన్నాయి. సరైన వెలుతురు రానంత కాలం ఆ ఛాయలు నిలదీస్తూనే ఉంటాయి.– ఖదీర్ -
డయాబెటిస్ ఉంటే చేయాల్సిన వ్యాయామాలు..!
డయాబెటిస్ ఉన్నవారి చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా మరింత శక్తిని పొందేలా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్లు సరైన పద్ధతిలో వ్యాయామాలు చేయడం అత్యంత ముఖ్యం.ఎందుకంటే..ఇన్సులిన్ సమస్యను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందితక్షణ కండర శక్తిని పెంచుతుందిబరువు నియంత్రణకు సహాయపడుతుందిచేయాల్సినవి..1. ఏరోబిక్ వ్యాయామంవేగంగా నడవడంసైక్లింగ్ఈతవ్యవధి: 30–45 నిమిషాలువారానికి కనీసం 5 రోజులు2. శక్తి శిక్షణతేలికపాటి బరువులు / రెసిస్టెన్స్ బ్యాండ్లుశరీర బరువు వ్యాయామాలు (స్క్వాట్లు, వాల్ పుష్-అప్లు)వారానికి 2–3 సార్లుకండరాలను పెంచుతుందిm గ్లూకోజ్ వినియోగం మెరుగుపడుతుంది. పైగా చక్కెర స్థాయిలు తగ్గుతాయి3. ఫ్లెక్సిబిలిటీ, చలనశీలతస్ట్రెచింగ్యోగాప్రతిరోజూ (10–15 నిమిషాలు)బిగుతును తగ్గిస్తుంది, కదలికను మెరుగుపరుస్తుంది. అలాగే గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఎప్పుడు చేయాలంటే..భోజనం తర్వాత (ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత)భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని తగ్గించడంలో సహాయపడుతుందిఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా తీవ్రమైన వ్యాయామం చేయవద్దువ్యాయామానికి ముందు ..ముందుగా ఒక చిన్న స్నాక్ తీసుకోండితీవ్రమైన వ్యాయామం చేయవద్దు, జాగ్రత్తగా ఉండండివ్యాయామానికి ముందు తినదగిన స్నాక్స్ (అవసరమైతే)కొన్ని నట్స్సగం పండుపెరుగుఇది వ్యాయామం చేసేటప్పుడు చక్కెర స్థాయిలు తగ్గకుండా నివారిస్తుందితీసుకోవాల్సిన జాగ్రత్తలు..తల తిరగడంఅధికంగా చెమట పట్టడంనీరసంగుండె దడతక్షణమే వ్యాయమాలు ఆపేసి విశ్రాంతి తీసుకోవడం, అవసరమైతే చక్కెర స్థాయిలను తనిఖీ చేయడం తదితరాలు చేయాలి.వ్యాయామం తర్వాత పాటించాల్సిన చిట్కాలు:అప్పుడప్పుడు షుగర్ స్థాయిలను తనిఖీ చేసుకోవడంనీళ్ళను బాగా తాగండివ్యాయామం తర్వాత అతిగా తినడం మానుకోండిచేసే తప్పిదాలు..క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంకేవలం నడవడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయకపోవడంవార్మ్-అప్ మానేయడంఅకస్మాత్తుగా వ్యాయామాన్ని అతిగా చేయడంషుగర్ తక్కువగా/ఎక్కువగా ఉన్న లక్షణాలను పట్టించుకోకపోవడంవారంలో వర్కౌట్ల ప్లాన్..సోమవారం–శుక్రవారం:30 నిమిషాల వేగవంతమైన నడక10 నిమిషాల స్ట్రెచింగ్మంగళవారం నుంచి శనివారం:15–20 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జోడించండిఆదివారం:తేలికపాటి కార్యకలాపాలు (నడక/యోగా)అప్పుడప్పుడు చేసే కఠినమైన వ్యాయామాల కంటే, క్రమం తప్పకుండా చేసే మితమైన వ్యాయామం మరింత ఉత్తమంగా పనిచేస్తుంది.చివరగా డయాబెటిస్కు వ్యాయామం అత్యంత శక్తిమంతమైన "మందులలో" ఒకటి. అయితే దానిని సరిగ్గా, క్రమం తప్పకుండా చేసినప్పుడు మాత్రమే ఫలితం అందుకోగలం అని చెబుతున్నారు నిపుణులు.డా. ఆదర్శ గౌడ, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్) సీఈవో, బెంగళూరు(చదవండి: క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు) -
ఎరుపు రంగు డ్రెస్లో ఇషా అంబానీ స్టన్నింగ్ లుక్..!
అంబానీ కుటుంబం ముంబైలోని తమ నివాసం ఆంటిలియాలో రిహానాకు ఆతిథ్యం ఇచ్చింది. తన బ్యూటీ బ్రాండ్ ఫెంటీ బ్యూటీ ప్రారంభోత్సవం కోసం ఈ గాయని భారతదేశంలో ఉన్నారు. రిహానా ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీలతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆషా అంబానీ ఆకర్షణీయమైన ఎరుపు రంగు చానెల్ డ్రెస్లో తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఆకర్షణీయమైన ముదురు ఎరుపు రంగు దుస్తులలో సున్నితమైన పూసల పనితో కూడిన పారదర్శకమైన పైపొర, నేల వరకు జారే ప్లీటెడ్ స్కర్ట్ ఉన్నాయి. ఈ డిజైనర్వేర్ని మాథ్యూ బ్లేజీ రూపొందించారు. చానెల్ స్ప్రింగ్ సమ్మర్ 2026 కౌచర్ షో నుంచి తీసుకున్న ఒక సరికొత్త డిజైనర్వేర్. ఈ దుస్తులలో నడుము వరకు పొడవున్న అంచు, పూర్తి పొడవు చేతులు, ఓపెన్ ఫ్రంట్, గుండ్రని మెడ, అంచులపై సున్నితమైన పూసల ఎంబ్రాయిడరీ, చేతులపై రఫుల్స్తో కూడిన ప్రకాశవంతమైన ఎరుపు రంగు షీర్ ష్రగ్ ఉంది. అలాగే ఆమె రాశిచక్రం వృశ్చికం కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉండటం విశేషం. ఇషా ఈ జాకెట్ను దానికి సరిపోయే ఎరుపు రంగు డ్రెస్ పైన ధరించి సరొకొత్త స్టైలిష్ లుక్ని పరిచయం చేశారామె. అందుకు తగ్గట్టుగా ఇషా తన డ్రెస్ మెటీరియల్తోనే తయారు చేసిన బంగారు గొలుసు బ్యాగ్, బ్లాక అండ్ వైట్ మేరీ జేన్స్ స్లిప్పర్స్, సున్నితమైన వజ్రాలు పొదిగిన చెవిపోగులతో సహా, తల నుంచి కాలి వరకు షానెల్ యాక్సెసరీలతో స్టైల్ చేసింది. ఆ డ్రెస్కి తగ్గట్టుగా పాపిడి తీసిన వదులైన జుట్టు, ముదురు రంగు కనుబొమ్మలు, మస్కారా పూసిన కనురెప్పలు, మౌవ్ రంగు లిప్ షేడ్, బ్లష్ పూసిన బుగ్గలతో హీరోయిన్ రేంజ్లో తళుక్కుమన్నారామె. మరీ ఈ డ్రెస్ ఖరీదు వచ్చేసి రూ. 70 లక్షలు పైనే పలుకుతుందట.(చదవండి: జస్ట్ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!) -
జస్ట్ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!
చిన్న ఆటో అయినా..దాన్ని కస్టమర్లకు విభిన్నంగా పరిచయం చేసేలా సెట్ చేసే తీరు ఎవ్వరినైనా..ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంతకు మునుపు వరకు చల్లదనం కోసం మొక్కలతో, పర్యావరణ అనుకూలంగా మార్చిన అందమైన ఆటోలను చూశాం. కానీ ఈ ఆటో డ్రైవర్ అంతకు మించి అన్నట్లుగా.. ఆటో జర్నీని అందిస్తున్నాడు ప్రయాణికులకు. అందుకోసం ఏం చేస్తున్నాడంటే..అందుకు సంబంధించిన వీడియోని వర్ష అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ఆ వీడియోలో ఒక సాధారణ ఆటో ప్రయాణంలా కనిపించేదాన్ని చిత్రీకరించినట్లు ఉంటుందే తప్ప, అందులో విభిన్నంగా ఏమీ కనిపించదు. కానీ కెమెరా లోపలికి మారినప్పుడు, మొత్తం ఆటోజర్నీనే మంచి అనుభూతిగా మార్చేస్తోంది. ఆ వీడియోలో సాధారణ ఆటో ప్రయాణంలా మొదట్లో కనిపించినా..ఆ తర్వాత డ్రైవర్ సీటు వెనుక, పుస్తకాలతో నిండిన ఒక చిన్న అర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దొరికిన ఆ కొద్ది సమయం ఫోన్కి అంకితమవ్వకుండా కాసేపయినా పుస్తకాలు తెరిచేలా చేసే ప్రయత్నం ముచ్చటగొలుపుతుంది. వాటి తోపాటు ఆ ఆటోలో ప్రయాణికుల కోసం ఒక చిన్న క్యాండీల డబ్బా కూడా ఉంది. చిన్నపాటి ఆలోచన అయినా..ప్రయాణికులకు తమ జర్నీ సమయాన్ని విలువైనదిగా మార్చుకునేలా చేస్తోంది. పైగా ఫోన్ని స్క్రోల్ చేసే బదులు కొన్ని నిమిషాల పాటు చదువుకునేలా చేస్తుంది. మాములు ప్రయాణం అనుకున్నాం కానీ ఒక చిన్న లైబ్రరీగా మారింది అంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ షేర్ చేశారు. నెటిజన్లు సైతం ఈ వీడియోని సైతం “ఈ ఆటో సీఎన్జీతో గానీ, పెట్రోల్తో గానీ నడవడం లేదు, ఇది కేవలం కరుణతో నడుస్తోంది. అతడు అందిస్తున్న ప్రతిదానికి అంతకుమించిన ఆశీస్సులు అందాలి అని దీవిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by _np_ (@by.nanthithaparkavi) (చదవండి: సమానత్వానికి కేరాఫ్గా ఆ వివాహం..!) -
బిడ్డ పుట్టాక ఇప్పుడు అత్యాచారమంటే ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో కూడిన సహజీవన సంబంధంలో నేరం అనే ప్రశ్నకు తావులేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సహజీవన సంబంధం నుంచి బయటకు రావడం ఎంతమాత్రం నేరం కాదని కూడా స్పష్టం చేసింది. ఇద్దరి సమ్మతితో ఏర్పడిన సంబంధాలకు, లైంగిక నేరాలకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని జస్టిస్ బి.వి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు పెళ్లి పేరుతో పిటిషనర్తో సహజీవనం చేశాడు. వారికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఆ చిన్నారికి ఏడేళ్లు. నిందితుడిని కలిసే సమయానికి పిటిషనర్ వయస్సు 18 ఏళ్లు. అప్పటికే ఆమె వితంతువు. అయితే, నిందితుడు తనకు అప్పటికే వివాహమైన విషయాన్ని బాధితురాలి వద్ద ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టాడు‘అని పిటిషనర్ న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘వారిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆమె అత్యాచారం ఆరోపణలు చేస్తోందా? ఇద్దరు మేజర్లు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధంతో తలెత్తే పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమ్మతంతో ఏర్పడిన సంబంధం విఫలమైనప్పుడు, దానిని నేరంగా ఎలా పరిగణిస్తారు?‘అని ప్రశ్నించింది. ఇలా అడగడం బాధితురాలిని నిందించినట్లుగా అనిపించినప్పటికీ, సంబంధంలో ఉన్న ’సమ్మతి’(కన్సెంట్) స్వభావాన్ని అర్థం చేసుకోవడం న్యాయపరంగా ముఖ్యమని స్పష్టం చేసింది. పెళ్లి కాకుండానే అతనితో కలిసి ఉండాలని, బిడ్డను కనాలని ఆమె ఎందుకు నిర్ణయించుకుందని ఈ సందర్భంగా ధర్మాసనం నిలదీసింది. అయితే, బాధితురాలి పరిస్థితి పట్ల కోర్టు సానుభూతి వ్యక్తం చేసింది. బిడ్డ పోషణ కోసం ఆమె న్యాయబద్ధంగా భరణం కోసం పిటిషన్ వేయవచ్చని సూచించింది. -
క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్లాస్ సీక్రెట్..! నో స్ట్రిక్ట్ డైట్, నో వర్కౌట్లు
బరువు తగ్గడం అనేది తరుచుగా కఠినమైన డైట్లు, డిటాక్స్ పద్ధతులు, తీవ్రమైన వ్యాయామాలతో ముడిపడి ఉంటుంది. కొందరు తక్కువ వ్యవధిలో బరువు తగ్గించే షార్ట్కట్లు వెతుక్కుంటారు. కానీ ఇలాంటివి ఏవి అవసరం లేకుండానే స్థిరమైన మార్పులతో బరువు తగ్గగలరని చెబుతున్నారు పుణెకు చెందిన క్లినికల్ ఫార్మసిస్ట్ అండ్ ఆరోగ్య విద్యావేత్త డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా. అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..!.డాక్టర్ ఇద్రిస్ దవాయివాలా తన రోగులలో ఒకరు ఎలాంటి తీవ్రమైన డైట్ లేదా డిటాక్స్ కార్యక్రమాన్ని పాటించకుండా 8 కిలోలు ఎలా తగ్గగలిగారో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఆ పేషెంట్ రక్త పరీక్షల్లో కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కంటే అధికంగా ఉంది. అతడు చాలా తక్కువగా ఫుడ్ తీసుకుంటున్నా ఇలా ఈ స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం అతనిలో భయాన్ని రేకెత్తించి తన వద్దకు వచ్చినట్లు తెలిపారు. అయితే డాక్టర్ దవాయివాలా సమస్య అతను ఎంత తిన్నాడు అనే దానివల్ల కొలెస్ట్రాల్ పెరగదని అంటున్నారు. శరీరమే దీనికి కారణం అన్నారు.అదెలా అంటే..మన శరీరమే కొంత కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే ఇది మన జీవనానికి ముఖ్యమైన పదార్థం. ఇది కణ త్వచాలు, హార్మోన్లు, విటమిన్ డి కొవ్వును జీర్ణం చేసే పైత్యరస ఆమ్లాలకు ఒక కీలకమైన నిర్మాణ మూలకం. శరీరం సహజ ప్రక్రియలకు అంతరాయం కలిగినప్పుడు సాధారణంగా అదనపు కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అందుకు గల కారణాలు ఏవంటే..సరిగా నిద్రపోకపోవడంవిటమిన్ డి లోపంఇన్సులిన్ నిరోధకతక్రమరహిత భోజనంకనీస శారీరక శ్రమఅందువల్ల సమస్య కొలెస్ట్రాల్ కాదు. ఇది దెబ్బతిన్న జీవనశైలి చక్రానికి సంబంధించిన ఒక లక్షణంకొలెస్ట్రాల్, బరువు తగ్గేలా ఏం చేయాలంటే..అదనపు ఫైబర్ (అవిసె, చియా, నానబెట్టిన ఓట్స్)ఒమేగా-3లుసమతుల్యమైన ఆహారం, ఏదీ మానకూడదుప్రతిరోజూ ఉదయం సూర్యరశ్మి, మెగ్నీషియంవిటమిన్ డి సప్లిమెంట్లుఈ మార్గదర్శక జీవనశైలి మార్పుల ద్వారా, రోగి మొత్తం కొలెస్ట్రాల్ 248 mg/dL నుంయి 187 mg/dLకి తగ్గింది. అతను 8 కిలోల బరువు తగ్గాడు, అతని విటమిన్ డి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాయి. పైగా అతని నిద్ర మెరుగుపడింది, అతిగా తినడం కూడా ఆపగలిగాడు.ఇందులో ఎలాంటి తీవ్రమైన డైట్లు లేదా జిమ్మిక్కులు లేవు. కేవలం స్థిరమైన, మార్గదర్శక ప్రయత్నం మాత్రమే. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని లేదా బరువును అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నట్లయితే, పోషకాహార నిపుణులు లేదా ఫిట్స్ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు డాక్టర్ దవాయివాలా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr Idris Dawaiwala | AHealthyBeat (@ahealthybeat) (చదవండి: గ్లోబల్ మైండ్సెట్ అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..) -
గ్లోబల్ మైండ్సెట్ అంటే..? ఎలా పెంపొందించుకోవాలి..
మనం ఒక గ్రామంలో పుట్టి ఉండవచ్చు, ఒక నగరంలో పెరిగి ఉండవచ్చు.. కానీ నేటి ఇంటర్నెట్ యుగంలో మనం కేవలం ఒక ప్రాంతానికి చెందినవారం కాదు, మనం 'ప్రపంచ పౌరులం' (Global Citizens). మీ ఆలోచనా విధానం మీ గీతలను దాటి విశ్వవ్యాప్తం అయినప్పుడే మీ పర్సనాలిటీకి ఒక అంతర్జాతీయ గౌరవం దక్కుతుంది.ప్రపంచ పౌరుడిలా ఆలోచించడం అంటే మీ మూలాలను మర్చిపోవడం కాదు బ్రో. మీ సంస్కృతిని ప్రేమిస్తూనే, ప్రపంచంలోని ఇతర సంస్కృతులను, ఆలోచనలను గౌరవించడం. ఒక గ్లోబల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఎప్పుడూ సంకుచితంగా ఆలోచించడు. అతను తనను తాను ఒక దేశానికో, ఒక కులానికో పరిమితం చేసుకోకుండా, మొత్తం మానవజాతిలో తానూ ఒక భాగం అని నమ్ముతాడు.సాంస్కృతిక మేధస్సు (Cultural Intelligence - CQ)గ్లోబల్ పర్సనాలిటీకి ఉండాల్సిన మొదటి లక్షణం CQ.ఇది కేవలం భాషలు నేర్చుకోవడం కాదు, వివిధ దేశాల మనుషుల ప్రవర్తనలను, వారి విలువలను అర్థం చేసుకోవడం.మీరు ఒక విదేశీయుడితో మాట్లాడేటప్పుడు వారి సంప్రదాయాలను గౌరవిస్తే, వారు మిమ్మల్ని ఒక 'పరిణతి చెందిన వ్యక్తి'గా చూస్తారు. వైవిధ్యం (Diversity) అనేది ఒక సమస్య కాదు, అది ఒక అందం అని గుర్తించడమే గ్లోబల్ మైండ్సెట్.గ్లోబల్ అవేర్నెస్: ప్రపంచం ఎటు వెళ్తోంది?ఒక ప్రపంచ పౌరుడికి తన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచం కంటే, గ్లోబల్ గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ ఎకానమీ, AI విప్లవం వంటి అంశాల మీద అవగాహన కలిగి ఉండటం."ఈ సమస్య కేవలం నా దేశానిది కాదు, ఇది మన అందరిది" అనే బాధ్యతాయుతమైన ఆలోచన (Shared Responsibility). ఇలా ఆలోచించినప్పుడే మీరు ప్రపంచ స్థాయి నాయకుడిగా (Global Leader) ఎదగగలరు.ఓపెన్ మైండెడ్నెస్: విభిన్న కోణాలను ఆహ్వానించడంగ్లోబల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఎప్పుడూ "నాదే కరెక్ట్" అని వాదించడు.mప్రపంచంలో రకరకాల జీవనశైలులు ఉంటాయని, ప్రతి దాని వెనుక ఒక తర్కం ఉంటుందని అతను గ్రహిస్తాడు.కొత్త ఆలోచనలను, విభిన్న దృక్పథాలను (Perspectives) అతను స్వాగతిస్తాడు. ఈ విశాల దృక్పథమే మిమ్మల్ని ప్రొఫెషనల్ లైఫ్ లోఅత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది.గ్లోబల్ కమ్యూనికేషన్ స్కిల్స్మీ మాటలు ప్రపంచానికి అర్థం కావాలి అంటే, మీ కమ్యూనికేషన్ లో ఒక 'యూనివర్సల్ అప్పీల్' ఉండాలి.స్పష్టమైన ఇంగ్లీష్ లేదా ఏదైనా గ్లోబల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఎమోషన్స్ ని భాషతో సంబంధం లేకుండా పండించడం ఇంకొక ఎత్తు.డిజిటల్ ఎチケット (Chapter 36) పాటిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో నెట్వర్కింగ్ (Networking) చేయడం నేర్చుకోవాలి.హ్యూమనిజం: మానవత్వమే పరమావధిఅన్నిటికంటే మిన్నగా, గ్లోబల్ పర్సనాలిటీ అంటే మానవత్వాన్ని ప్రేమించడం. సరిహద్దులు లేని ప్రేమ, కరుణ (Compassion) కలిగి ఉండటం. మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా.. ఒక మంచి మనిషిగా పేరు తెచ్చుకోవడం."వసుధైక కుటుంబకం" (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే భారతీయ తత్వాన్ని మీ వ్యక్తిత్వంలో ప్రతిబింబించడం.The Takeawayబ్రో, బావిలో కప్పలా ఉండకండి. సముద్రంలో చేపలా ఈదండి. ప్రపంచం చాలా పెద్దది, అందులో మీకు అనంతమైన అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనలు ఎంత విశాలంగా ఉంటే, మీ ఎదుగుదల అంత గొప్పగా ఉంటుంది. ఒక ప్రపంచ పౌరుడిలా జీవించడం అంటే, ఎక్కడికి వెళ్లినా మీరు 'పరాయి వ్యక్తి'లా కాకుండా 'సొంత వ్యక్తి'లా ఫీలవ్వడం.నీ నిరంతర వికాసంలో (Phase 5) ఈ 'గ్లోబల్ విజన్' నీకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెడుతుంది.గుర్తుంచుకో.."నీ కాళ్లు నీ సొంత గడ్డ మీద ఉండవచ్చు, కానీ నీ ఆలోచనలు ఆకాశమంత విశాలంగా ప్రపంచాన్ని చుట్టి రావాలి. ప్రపంచం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నీ వ్యక్తిత్వాన్ని మలచుకో!"Mind-Workఈరోజు ఏదైనా ఒక అంతర్జాతీయ వార్తను చదివి, దాని ప్రభావం మీ మీద లేదా మీ వృత్తి మీద ఎలా ఉంటుందో విశ్లేషించండి.మీకు అస్సలు తెలియని ఒక విదేశీ సంస్కృతి లేదా వంటకం గురించి ఈరోజు తెలుసుకోండి.మీరు గ్లోబల్ గా కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాను (లింక్డిన్ వంటివి) ఎలా వాడుకుంటున్నారో ఒకసారి ఆడిట్ చేసుకోండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com(చదవండి: హిమాలయంలాంటి అచంచలమైన పర్సనాలిటీ) -
శల్య సారథ్యం అంటే..?
మహాభారత సంగ్రామంలో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేక శైలి. వారిలో శల్యుడు ఒకరు. ఒకరిపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సాయం చేసే నెపంతో చేతులారా చెడగొట్టడంతోపాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడాన్ని శల్య సారధ్యం అంటారు.శల్యుడు మద్ర దేశానికి అధిపతి, పాండురాజుకు రెండవ భార్య అయిన మాద్రికి సోదరుడు. మాద్రి సంతానమైన నకుల, సహదేవులకు మేనమామ. శల్యుడు అస్త్రవిద్య, గదా యుద్ధం, ముఖ్యంగా రథసారథిగా గొప్ప నేర్పరి. అలాంటి శల్యుడు పాండవుల పక్షాన ఉంటే వారిని గెలవడం కష్టమని గ్రహించిన దుర్యోధనుడు ఒక పథకం పన్నాడు. పాండవులను కలవడానికి వెళుతున్న శల్యుడికి మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అక్కడక్కడా పెద్దపెద్ద గుడారాలు వేయిస్తాడు. ఆ గుడారాలు పాండవులవేనని అనుకొన్న శల్యుడు వాటిలోకి ప్రవేశిస్తాడు. అక్కడి సేవకులు శల్యునికి ఎంతో సాదరంగా ఆహ్వానం పలికి, గౌరవ మర్యాదలు చేసి అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. ఇదంతా పాండవులు తన కోసమే చేశారనుకున్న శల్యుడు విందు ఆరగించి, వెంటనే సేవకునితో తక్షణమే వెళ్లి మీ యజమాని పిలుచుకొని రా... రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో నా మద్దతును తెలుపుతానని చెప్పాడు.సేవకులతో పాటు దుర్యోధనుడు రావడంతో ఆశ్చర్యపడ్డ శల్యుడు జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోలేక మహా భారత సంగ్రామంలో కౌరవుల పక్షాన ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. అనంతరం శిబిరం నుండి బయలుదేరిన శల్యుడు పాండవులను కలుసుకొని జరిగిన సంఘటన వివరించాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడితో మాట్లాడుతూ, కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నప్పటికీ తమకు అభ్యంతరం లేదని, కానీ ఒక సహాయం చేస్తాననే మాట ఇమ్మని శల్యుణ్ణి అడిగాడు. అలాగే, అదేమిటో చెప్పమన్న శల్యుడితో ‘‘రథం తోలడంతో నీకు అద్భుతమైన ప్రతిభ ఉంది కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని రథాన్ని తోలే అవకాశం వస్తే ఆ సమయంలో కర్ణుని అడుగడుగునా అవహేళన చేస్తూ, మానసికంగా, అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాలి’’ అని ధర్మరాజు కోరాడు. అందుకు అంగీకరించాడు శల్యుడు.ఊహించిన విధంగానే మహాభారత సంగ్రామంలో 17వ రోజున కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను శల్యునికి అప్పగించారు. కర్ణుని పరాక్రమాన్ని గమనించిన శల్యుడు అడుగడుగునా కర్ణుని అవహేళన చేస్తూ సూటిపోటి మాటలతో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఒక సమయంలో కర్ణుడు వదిలిన అస్త్రాన్ని అర్జునుని తలపైకి కాకుండా గుండెల వైపు గురి పెట్టమని శల్యుడు సూచిస్తాడు. అప్పటికే శల్యుని పట్ల అపనమ్మకం ఏర్పడ్డ కర్ణుడు అస్త్రాన్ని తలవైపునకే గురిపెట్టడం, అర్జునిని రథ సార థ, జగన్నాటక సూత్ర ధారి అయిన శ్రీ కృష్ణుడు రథాన్ని కిందకు తొక్కడంతో ఎంతో శక్తిమంతమైన అస్త్రం అర్జునుని తలపై నుండి వెళ్ళిపోయి వ్యర్థ మైపోయింది. ఈ లోగా కర్ణుని శాపాలు అన్నీ కలిసి రావటంతో అర్జునుడు విడిచిన అస్త్రంతో కర్ణుడు మరణిస్తాడు. అప్పటి నుండి శల్య సారథ్యం అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది.– సి. ఎన్. మూర్తి,సీనియర్ పాత్రికేయులు -
ఆధ్యాత్మికతతో సార్థక జీవనం
జీవిత లక్ష్యం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి విడదీయలేనివి. సాధారణంగా మనం జీవిత లక్ష్యం అంటే లౌకిక విజయాలైన ఉద్యోగం, డబ్బు, హోదా తదితరాలే అనుకుంటాము, కానీ; ఆధ్యాత్మిక లక్ష్యం పరమార్థాన్ని వెతుకుతుంది. లౌకిక లక్ష్యాలు, సౌకర్యాలను ఇస్తాయి, కానీ ఆధ్యాత్మిక లక్ష్యం సంతృప్తిని ఇస్తుంది.బాహ్యంగా ఎంత ఎదిగినా, అంతరంగంలో ఆధ్యాత్మికత లేకపోతే జీవితం అసంపూర్ణంగానే అనిపిస్తుంది. అందుకే, బాహ్య వృద్ధిని అంతర్గత ప్రశాంతతతో ముడిపెట్టడమే నిజమైన జీవిత లక్ష్యం కావాలి. లౌకిక లక్ష్యం నేను ఏమి సాధించాలి?అనే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. ఇది బయటి ప్రపంచంలో గుర్తింపును ఇస్తుంది. ఆధ్యాత్మిక లక్ష్యం నేను ఎవరు? అనే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. ఇది అంతరంగంలో శాంతిని, సత్యాన్ని వెతుకుతుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని మరింత అర్థవంతంగా జీవించడం’.మానవ జన్మ అనేది సృష్టిలో అత్యంత శ్రేష్ఠమైనది. సాధారణంగా మనిషి తన జీవితాన్ని ఆహార, నిద్ర, భయ, మైథునాలతోనే గడిపేస్తుంటాడు. కానీ, వీటికి అతీతంగా నేను ఎవరు? నా పుట్టుకకు పరమార్థం ఏమిటి?– అని ఆలోచించడమే ఆధ్యాత్మికతకు తొలి అడుగు. జీవిత లక్ష్యం కేవలం భౌతిక విజయాలకు పరిమితం కాకుండా, ఆధ్యాత్మికతతో మేళవించినప్పుడు మాత్రమే పరిపూర్ణత సిద్ధిస్తుంది. మానవ జీవితంలో రెండు రకాల ప్రయాణాలు ఉంటాయి. ఒకటి బాహ్య ప్రపంచంలో సాగే ప్రయాణం, రెండోది అంతరంగంలో సాగే అన్వేషణ. చదువు, ఉద్యోగం, సంపాదన, కుటుంబం సామాజిక హోదా. ఇవి శరీరానికి, మనస్సుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తాయి. ఆధ్యాత్మిక లక్ష్యం– మనశ్శాంతి, ఆత్మజ్ఞానం, సార్వత్రిక ప్రేమ. ఆత్మకు ఇచ్చే తృప్తి అందిస్తుంది.భారతీయ సంప్రదాయంలో మోక్షం అనేది అత్యున్నత జీవిత లక్ష్యంగా పరిగణించబడుతుంది. మోక్షం అంటే మరణం తర్వాత వచ్చేది మాత్రమే కాదు., జీవించి ఉండగానే రాగద్వేషాల నుండి, అజ్ఞానం నుండి విముక్తి పొందడం. తనలోని పరమాత్మను గుర్తించి, ప్రకృతితో మమేకమవ్వడమే ఆధ్యాత్మిక ప్రయాణ గమ్యం.. జీవిత లక్ష్యం ఒక అందమైన భవనం అయితే, ఆధ్యాత్మికత అనేది దానికి బలమైన పునాది. పునాది లేని భవనం ఎలా కూలిపోతుందో, ఆధ్యాత్మికత లేని లౌకిక విజయం కూడా అంతే అస్థిరమైనది.బాహ్యవృద్ధిని అంతర్గత ప్రశాంతతతో ముడిపెట్టడమే పరిపూర్ణమైన జీవన విధానం. చేతులు పనిలో ఉండాలి, మనసు భగవంతునిపై (అంతర్గత శాంతిపై) ఉండాలి. ఇదే నిజమైన యోగం. భౌతిక ప్రపంచంలో బాధ్యతలను నెరవేరుస్తూనే, అంతరంగంలో ఆధ్యాత్మిక దీపాన్ని వెలిగించుకున్నప్పుడే మనిషి జీవన యానం ధన్యమవుతుంది.సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించే శక్తిని ఆధ్యాత్మికత ఇస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, ఫలితం మీద ఆశ లేకుండా కర్మను ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి తన లక్ష్య సాధనలో అధర్మానికి తావివ్వడు. సత్యం, అహింస, ధర్మం అనే పునాదుల మీద తన విజయాన్ని నిర్మించుకుంటాడు. తన ఎదుగుదల కేవలం తన కోసమే కాకుండా, సమాజ శ్రేయస్సు కోసం కూడా అని గుర్తించడం ఆధ్యాత్మికత నేర్పే గొప్ప పాఠం.ఆధ్యాత్మికత అంటే సంసారాన్ని వదిలి అడవులకు వెళ్లడం కాదు. మనం చేసే ప్రతి పనిలోనూ దైవత్వాన్ని చూడటం, నిస్వార్థంగా వ్యవహరించడం. అంతటా ఆ పరమాత్మనే ఉన్నాడు అనే భావనను అలవరుచుకోవడమే ఆధ్యాత్మికత సారాంశం. ఇది మనిషిని అహంకారం నుండి విముక్తుడిని చేసి, వినయాన్ని ప్రసాదిస్తుంది. జీవిత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మనిషి అనేక ఒత్తిళ్లకు, ఓటములకు లోనవుతాడు. అటువంటి సమయంలో ఆధ్యాత్మికతఒక దిక్సూచిలా పనిచేస్తుంది:– ఆనంద ‘మైత్రేయ’మ్ -
అందం కోసం ఫేస్ప్యాక్గా రొట్టెల పిండి..!
వయసుతో పాటు వచ్చే ముడతలను తగ్గించడానికి బ్యూటీ క్లినక్స్లో సాధారణంగా గాఢమైన యాసిడ్లను వాడుతుంటారు. కానీ, ‘బీక్మన్ 1802’ సంస్థ ‘బెటర్–ఏజింగ్’ అనే కొత్త విధానంతో ముందుకు వచ్చింది. ఈ సంస్థ తాజా ఆవిష్కరణ మిల్క్ ఆర్ఎక్స్ కంప్రెస్. ఇది మాస్క్లా మాత్రమే కాకుండా, మెడికల్ గ్రేడ్ ట్రీట్మెంట్లా పనిచేస్తుంది. చాలా షీట్ మాస్క్లు నీళ్లలా ఉండే పల్చని సీరమ్లతో తయారవుతాయి. ఇవి త్వరగా ఆరిపోతాయి. కానీ మిల్క్ ఆర్ఎక్స్ కంప్రెస్, క్రీమ్తో నిండిన సాంకేతికతతో రూపొందించినది. రెనెక్సోసోమ్ కాంప్లెక్స్, మేకపాలు, మొండో గ్రాస్ పదార్థాలు ఈ మాస్క్కి ప్రత్యేకం. రెనెక్సోసోమ్ కాంప్లెక్స్ రెటినాల్ కంటే నాలుగు రెట్లు వేగంగా కొలాజెన్ను ఉత్పత్తి చేసి, చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. మేకపాలలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రీబయోటిక్స్చర్మం పీహెచ్ స్థాయిని సమతుల్యం చేసి, దెబ్బతిన్న చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లోనే రిపేర్ చేస్తాయి. మొండో గ్రాస్ చర్మానికి అవసరమైన తేమను అందించి, రక్షణ కవచంలా పనిచేస్తుంది.ఈ మాస్క్ ముఖానికి వేసుకున్నప్పుడు చల్లటి అనుభూతిని ఇస్తుంది. మంచు నీటిలో ముఖాన్ని ఉంచినట్లుగా చల్ల బరుస్తూ, రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల చర్మంపై ఉండే ఎరుపుదనం తగ్గి ఉపశమనం కలుగుతుంది. చర్మంపై దీర్ఘకాలిక వాపును కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటుంది. ఈ మిల్క్ ఆర్ఎక్స్ కంప్రెస్ డిజైన్ కూడా భిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన చిన్ స్ట్రాప్ ఉంటుంది. ఇది గడ్డం కింద చర్మాన్ని పట్టి ఉంచి, ముఖానికి తీరైన ఆకారాన్ని ఇస్తుంది. ఈ మాస్క్ను వారానికి ఒకసారి వాడటం వల్ల కొలాజెన్ స్థాయి గణనీయంగా పెరిగి, చర్మం యవ్వనంగా, కాంతి మంతంగా మారుతుంది.రొట్టెల పిండి ఫేస్ప్యాక్ప్రాచీన రోమన్ ప్రజలు రొట్టెల పిండిని ఫేస్ప్యాక్గా ఉపయోగించేవారు. రొట్టెల పిండిని ముఖానికి పట్టించుకోవడం వల్ల ముఖం ముడతలు పడకుండా ఉంటుందని నమ్మేవారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్దికి చెందిన రోమన్ చక్రవర్తి ఓథో ప్రతిరోజూ స్నానానికి ముందు గడ్డం మీసం నున్నగా గీసేసుకుని, ముఖానికి రొట్టెల పిండి పట్టించుకునేవాడట!తాజా మెంతి ఆకులను మెత్తగా రుబ్బి రాత్రి పడుకునే ముందు ముఖానికి పట్టించి ఉదయం కడగాలి. మెంతి ఆకులను వాడేటప్పుడు వాటిని ముందుగా శుభ్రం చేయాలి. వాటి మీద చల్లిన క్రిమిసంహారక మందుల అవశేషాలు లేకుండా శుభ్రం చేసిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేయాలి. ఈ ప్యాక్ క్రమం తప్పకుండా మూడు వారాల పాటు వేస్తే మొటిమలు, బ్లాక్హెడ్స్, వైట్హెడ్స్ తొలగి చర్మం నునుపుగా మారుతుంది. -
నవతరానికి తెలియని... నిజామ్ కాలపు కళాకారిణి!
ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి, వయోలా వాద్యం నేర్చుకొన్న ఓ అమ్మాయి... ఓ అమెరికన్ సినిమాలో నేపథ్యంలో వినిపించిన ప్రసిద్ధ గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాట విని, దక్షిణాసియా ప్రాంతపు ప్రత్యేక సంగీత రీతులపై ప్రేమ పెంచుకుందంటే నమ్మగలరా? బ్రిటన్ చేరిన ఆ అమ్మాయి ఆ సంగీతాభిరుచిని కొనసాగించింది. ఏకంగా సంగీతంలోనే పరిశోధన చేసి, ఇవాళ నిజామ్ కాలపు సంగీతం, సంగీతజ్ఞుల కథలపై సాధికారిక రచయిత్రిగా మారింది. 18వ శతాబ్దంలో మొఘలాయీల యుగం నుంచి బ్రిటీషు పాలనా శకంలోకి భారతదేశం జారిపోతున్న వేళ... మన సంగీతం, సంగీతజ్ఞులు, తవాయిఫ్ల జీవితాలలో సాగిన ప్రయాణం, వచ్చిన మార్పులకు అక్షర రూపం ఇచ్చింది. స్లయిడ్ల రూపంలో అలనాటి చిత్రపటాలు, ఛాయాచిత్రాలు చూపిస్తూ, ఆ కథలన్నీ ఆమె చెబుతుంటే, ఎవరైనా కళ్ళు, చెవులు అప్పగించక తప్పదు.మరీ ముఖ్యంగా చాలామందికి తెలియని మన హైదరాబాదీ చరిత్ర చెబుతుంటే, నేటికీ నాంపల్లిలో ఆనవాళ్ళున్న నిజామ్ కాలపు అపురూప కళాకారిణి – కవయిత్రి – పలుకుబడి గల వేశ్యామణి మాహ్ లఖా బాయ్ (1768-1824) జీవితం వివరిస్తుంటే అబ్బురంగా అనిపిస్తుంది. లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన క్యాథరిన్ బట్లర్ స్కోఫీల్డ్తో మన భాగ్యనగరం నడిబొడ్డున విద్యారణ్య స్కూల్ విశాల ప్రాంగణంలో ‘మంథన్’ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రసంగం చరిత్ర, సంగీత, సంస్కృతీ ప్రియులకు అక్షరాలా అలాంటి అనుభవాన్నే అందించింది.మనకు తెలీని మన చరిత్ర... ఓ పాశ్చాత్య మహిళ పరిశోధన...క్యాథరిన్ ప్రాథమికంగా దక్షిణాసియా ప్రాంత సంగీతం, చరిత్రను అధ్యయనం చేసి, అక్షరబద్ధం చేస్తున్న చరిత్రకారిణి. ఇప్పటి వరకు లోచూపుకు నోచుకోని విస్తారమైన భారతీయ రచనలు, అలాగే అలనాటి చిత్రకారులు గీసిన బొమ్మల లాంటి విజువల్ సోర్స్లపై ఆమె ప్రధానంగా దృష్టి పెట్టారు. మౌలికమైన పరిశోధన సాగిస్తున్నారు. అందులో భాగంగా ఆమె మన హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. సంగీతంతో ముడిపడిన పలువురు పాతకాలపు కళాకారుల కథలను జనం ముందుకు తెస్తున్నారు. ఆ క్రమంలోనే ఆనాటి పరిస్థితులు, ఆ కాలపు వ్యక్తుల స్వతంత్రత, అనుబంధాలు, అనురాగాలు, అధికార వ్యవస్థ అన్నింటినీ అక్షరబద్ధం చేసి, చర్చకు పెట్టడం రచయిత్రిగా, పరిశోధకురాలిగా క్యాథరిన్ ప్రత్యేకత.ప్రస్తుతం క్యాథరిన్ లండన్లోని సుప్రసిద్ధ కింగ్స్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్కు హెడ్. దాదాపు 25 మంది దాకా పీహెచ్డీ విద్యార్థులు చరిత్ర, మానవశాస్త్రం, దక్షిణాసియాలోని పలు సంగీత సంస్కృతుల ప్రదర్శన లాంటి వివిధ అంశాలపై ఆమె సారథ్యంలోనే పరిశోధన చేయడం విశేషం. మొఘల్, దక్కనీ, దక్షిణాసియాలో వలస పాలకుల కాలపు కళలు, సంస్కృతి తదితర అంశాలపై క్యాథరిన్ ప్రసంగాలకు బోలెడంత డిమాండ్. బ్రిటీష్ లైబ్రరీ నుంచి మన జైపూర్ లిటరరీ ఫెస్టివల్ దాకా ఆమె ప్రసంగించని వేదిక లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం సంగీతం, సంగీత కళాకారులపై ఆంక్షలు విధించినప్పుడు దాన్ని నిరసిస్తూ, అంతర్జాతీయ వేదికపై అందరినీ కూడగట్టడంలోనూ ఆమె కీలకపాత్ర పోషించడం విశేషం. క్యాథరిన్ పరిశోధించి రాసిన ‘మ్యూజిక్ అండ్ మ్యుజీషియన్స్ ఇన్ లేట్ మొఘల్ ఇండియా: హిస్టరీస్ ఆఫ్ ది ఎఫిమెరల్ (1748 – 1858)’ అనేక ఇతర అంశాలతో పాటు మన నిజామ్ పాలనా కాలపు హైదరాబాద్ సంగతులనూ పాఠకుల ముందుకు తెచ్చింది. అందులో - మొఘల్ చక్రవర్తుల ఏలుబడిలో, ఆ పైన బ్రిటీషు వారి ఆరంభ కాలంలో... ఢిల్లీ నుంచి లక్నో, హైదరాబాద్, జైపూర్ దాకా వివిధ ప్రాంతాల్లో, పర్షియన్, వ్రజ భాష, ఉర్దూ, ఇంగ్లీషుల్లో సాగిన సంగీత రచనల ఆధారంగా తొమ్మిదిమంది సంగీత కళాకారుల జీవితాలను పాఠకుల ముందు పెట్టారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మొఘలాయీల యుగం నుంచి బ్రిటీషు వారి శకంలోకి మారుతున్న ఆ కాలంలో మన సాంస్కృతిక, కళా రంగం ఎలా దానికి ప్రతిస్పందించిందన్నది ఆ రచన ప్రధానమైన దృష్టి కోణం.అపురూపమైన ఆ పరిశోధనాత్మక కృషిని ప్రపంచ ప్రసిద్ధ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ 2022లో పుస్తకంగా ప్రచురించింది. ఆశ్చర్యపరిచే ఆ కృషికి అనుబంధంగానే, హైదరాబాద్లోని ‘మంథన్’ సంస్థ ఆధ్వర్యంలో ‘స్టోరీస్ ఆఫ్ మ్యూజికల్ లైఫ్ ఇన్ నిజామీ హైదరాబాద్ (క్రీ.శ. 1780-1830)’ అన్న అంశంపై ఏప్రిల్ 24న క్యాథరిన్ తన తాజా ప్రసంగం చేశారు. ఎంతో లోతైన వివరాలు, విశ్లేషణ, అందుకు ఆధారభూతమైన చరిత్ర గ్రంథాలు, పరిశోధనలో తనకు కలిగిన స్వీయాభిప్రాయాలను సభికులతో ఆమె పంచుకున్నారు.ప్రాణం పోసుకున్న నిజామ్ గజల్ గాథలు!సరిగ్గా గంటసేపు సాగిన ప్రసంగంతో అప్పటి నిజామ్ కాలానికి తీసుకువెళ్ళారు క్యాథరిన్. పరిశోధనలో భాగంగా హైదరాబాద్లోని సుప్రసిద్ధ సాలార్ జంగ్ మ్యూజియమ్, ఉస్మానియా యూనివర్సిటీ మొదలు లండన్ లోని బ్రిటీష్ లైబ్రరీ, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ దాకా అనేక చోట్ల నుంచి ఆమె ఎంతో అరుదైన సమాచారం సేకరించారు. అలా తాను సేకరించిన అనేక ప్రాచీన ఉర్దూ, పర్షియన్ రచనా ప్రతులలోని బొమ్మలు, సంగతులను ఆమె తన ప్రసంగంలో పంచుకున్నారు. మాటల్లో సందర్భానుసారంగా... నిజామ్ కాలపు చిత్రకారులు వెంకటచలం సహా పలువురు గీసిన చిత్రాలను ప్రదర్శించడంతో ఆనాటి సంగతులు కళ్ళకు కట్టినట్టయింది. జగత్ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ రాజా దీన్ దయాళ్ తీసిన అలనాటి హైదరాబాద్ ఛాయాచిత్రాలనూ ఉపయోగించారు.ప్రసిద్ధ నర్తకి మాహ్ లఖా బాయ్, ఆమెకు సంగీతం నేర్పిన గురువు - తాన్సేన్ వంశీకుడైన ఖుషాల్ ఖాన్ ‘అనూప్’, వారి గురు – శిష్య సంబంధం, అలాగే ఆమెతో సాన్నిహిత్యం సాగించిన మరాఠా యోధుడు రాజా రావ్ రన్భా తదితరులను వెరసి, ఆమె తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించించారు. వెరసి, అలనాటి నిజజీవిత పాత్రలు అనేకం ఆ అనర్గళ ప్రసంగంలో ప్రేక్షకుల ముందు ప్రాణం పోసుకున్నాయి. నిజామ్ చరిత్రలో ప్రసిద్ధుడైన మీర్ ఆలమ్ మరణానంతరం మహారాజా చందూలాల్ ప్రధానమంత్రి అయ్యారు. “బ్రిటీషు, రాజకీయ అతిథులను ఆకట్టుకొనేందుకు ఆయన మాహ్ లఖా బృందంతో భారీ నృత్య, గాన ప్రదర్శనలు ఏర్పాటు చేయించేవారు. . ఆయనకూ, మాహ్ లఖా బాయ్కీ అత్యంత సన్నిహిత సంబంధం ఉండేది” అని క్యాథరిన్ పాత కథలు తవ్వి పోశారు.1798లో నిజామ్కూ, ఈస్టిండియా కంపెనీ వారికీ మధ్య ఒప్పందం కుదిరింది. నిజామ్ సంస్థాన రక్షణ బాధ్యతలు చేపట్టిన బ్రిటీషు సేనలు ఆ నిమిత్తం అన్నట్టుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో దండు విడిచాయి. ఇక, హైదరాబాద్లో ప్రత్యేక బ్రిటీషు రాజప్రతినిధికి బ్రిటీష్ రెసిడెన్సీ ఏర్పాటైంది. ఆ సంగతులతో పాటు భారతీయ సంగీతం, సంగీత కళాకారులపై బ్రిటీషు వారి ప్రభావాన్ని క్యాథరిన్ ప్రస్తావించారు. మన సుదీర్ఘమైన రాగప్రదర్శన బ్రిటీషర్లకు అర్థం కావడం కష్టం. అందుకని, అప్పట్లో తవాయిఫ్లు గజల్స్ లాంటివి గానం చేసేవారు. నృత్యగీతాలతో అలరించేందుకు ప్రయత్నించేవారు అని తెలిపారు. ఆనాటి పాపులర్ నృత్యగీతాల బాణీని బ్రిటీషర్లు ఇట్టే పట్టుకొని, దాన్ని ఎలా తమదైన పద్ధతిలో పాడేదీ క్యాథరిన్ స్వయంగా ఆలపించి వినిపించి, సభికుల కరతాళధ్వనులు అందుకున్నారు.నాంపల్లి, మౌలాలీ సాక్షిగా... నేటికీ ఆ ఆనవాళ్ళు“1738 నాటికే... గోల్కొండ ప్రాంతం ఎంతో ప్రముఖమైనది. హైదరాబాద్ చాలా కీలకమైన కేంద్రం. పంజాబీ ఖత్రీల మొదలు ఇరానియన్ల వరకు ఎన్నెన్నో ప్రాంతాలు, వర్గాలకు చెందిన పలువురు మేధావులు, అధ్యయనశీలురు, సైనిక యోధులు, అద్భుతమైన వృత్తినిపుణులు హైదరాబాద్కు వలస వస్తుండేవారు. అదీ హైదరాబాద్ ఘన చరిత్ర” అని క్యాథరిన్ విశ్లేషించారు. 1768లో జన్మించిన మాహ్ లఖా బాయ్ జీవితంలోని ముఖ్యాంశాలను ఆమె వివరించారు. “1824లో చనిపోయే వరకు నాంపల్లి ప్రాంతంలోనే మాహ్ లఖా నివసించారు. ఆమె నమ్మి, ప్రార్థించిన మౌలాలీకి భక్తిసమర్పణంగా మరణానంతం సికింద్రాబాద్లోని మౌలాలీ గుట్ట పాదాల చెంత తన తల్లి సమాధి పక్కనే ఆమె భౌతికకాయాన్ని కూడా సమాధి చేశారు. ఇవాళ్టికీ వాటిని చూడవచ్చు.”స్వీయ ఉర్దూ గజల్స్ను సమగ్రమైన సంపుటిగా పుస్తక రూపంలో తెచ్చిన తొలి భారతీయ వేశ్యామణి (తవాయిఫ్) మాహ్ లఖా బాయ్. నిజామ్ సంస్థానంలో సాక్షాత్తూ పాలకులకే ప్రభుత్వ విధానాలు, దౌత్యానికి సంబంధించి సలహాలు, సూచనలు అందించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. నాటి హైదరాబాద్ నిజామ్ సంస్థానంలోని ఓ ప్రియమైన వేశ్యకు దత్త పుత్రికగా పెరిగిన మాహ్ లఖా అత్యుత్తమ గురువుల వద్ద సమగ్ర శిక్షణ పొందారు. ఆ రోజుల్లోనే కళాకారిణిగా, చింతనాశీలిగా, గుర్రపుస్వారీ, ఈటె విసరడం, ధనుర్విద్య, వేటాడడంలో దిట్టగా, చివరకు యుద్ధం సైతం చేయగల వీరవనితగా ఎదిగిన తీరు ఇవాళ తలుచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ రోజుల్లోనే ఆమెను రాజాస్థానంలో కులీనుల వర్గంలోని పెద్దల్లో ఒకరి (సీనియర్ ఉమ్రాహ్)గా నిజామ్ రాజు చేర్చుకోవడం విశేషం.ఆ రోజుల్లో నిజామ్ రాజు ఆమెకు ఇచ్చిన జాగీర్లలో... నేటి హైదర్ గూడా, చందానగర్, సయ్యద్ పల్లి, అడికిమెట్ తదితర ప్రాంతాలున్నాయి. మొత్తానికి, కవయిత్రిగా, కథక్ నర్తకిగా, హిందుస్తానీ శాస్త్రీయ గాయనిగా, ఆ లలిత కళలన్నీ ఆడపిల్లలకు నేర్పేందుకు పాఠశాలలు స్థాపించిన వ్యక్తిగా మాహ్ లాఖాది విలక్షణమైన కథ. ప్రస్తుతం నాంపల్లిలో బజార్ ఘాట్ దగ్గర, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ కార్యాలయానికి సమీపంలో నెలకొన్న ఎం.ఎ.ఎం. గవర్నమెంట్ మోడల్ జూనియర్ కాలేజ్ ప్రాంగణం ఒకప్పుడు మాహ్ లాఖా కార్యక్షేత్రం. అక్కడే ఆమె ఎంతోమంది వనితలకు ఆట, పాటల్లో శిక్షణ నిచ్చినట్టు చరిత్ర.రెండొందల ఏళ్ళ నాటి మన రాతప్రతి... బ్రిటన్లో భద్రంగా!“నిజానికి, ఆమె అసలు పేరు చందా బీబీ. చంద్రబింబం లాంటి చెక్కిళ్ళు గలది అనే అర్థంలో నిజామ్ ఆమెకు పెట్టిన పేరు - మాహ్ లఖా బాయ్. ఆమె తల్లి రాజ్ కున్వర్. ఆ రోజుల్లో రాజ్పుతానా నుంచి వలస వచ్చిన రాజ్ కున్వర్ సంతానం లేని తన చెల్లెలికి మాహ్ లఖాను దత్తత ఇచ్చింది. ఆ చెల్లెలు నాటి నిజామ్కు ప్రధాని అయిన నవాబ్ రుక్న్ ఉద్దౌలాకు ప్రీతిపాత్రమైన వేశ్యామణి. అలా మాహ్ లఖా బాయ్ నిపుణులైన గురువుల వద్ద అత్యుత్తమ శిక్షణ పొందేందుకు వీలు కలిగింది. ఆ రోజుల్లో నిజామ్ మొదలు సంస్థాన ప్రధానమంత్రులు, ఉన్నత సైనికాధికారులు, చివరకు బ్రిటీష్ రెసిడెంట్ వరకు పలువురితో మాహ్ లఖాకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఫలితంగా, ఆమె ఎంతో పేరు, పలుకుబడి గల తవాయిఫ్గా రాణించింది.టిప్పు సుల్తాన్పై తమ సంయుక్త సేనల విజయాన్ని ఆస్వాదిస్తూ బ్రిటీషు వారికి నిజామ్ సంస్థానం భారీ విందు, వినోద కార్యక్రమం ఏర్పాటు చేసింది. 1799 అక్టోబర్ 18 రాత్రి నిజామ్ సంస్థాన ప్రధాన మంత్రి మీర్ ఆలమ్ నివాసంలో ఆ అపూర్వ గానాబజానా సాగింది. ఆ నృత్య ప్రదర్శన సమయంలో అందమైన క్యాలిగ్రఫీ చేతిరాతతో రూపొందిన తన గజల్స్ రాతప్రతిని ఆనాటి అసిస్టెంట్ బ్రిటీష్ రెసిడెంట్... సర్ జాన్ మాల్కోమ్కు ఆత్మీయంగా బహూకరించారు మాహ్ లాఖా బాయ్. అలా ఆ రోజు ఆమె స్వయంగా సంతకం చేసి, కానుకగా ఇచ్చిన ఆ గజల్స్ సంపుటి రాతప్రతి ఇప్పటికీ బ్రిటీష్ లైబ్రరీలో భద్రంగా ఉంది” అని క్యాథరిన్ చెబుతుంటే ‘మంథన్’ నిర్వహించిన ఈ ప్రసంగానికి హాజరైన సభికులు అబ్బురంగా చెవులప్పగించి విన్నారు. అలాగే, “మాహ్ లఖా బాయ్ ప్రోద్బలంతో ఆమె గురువు ఖుశాల్ ఖాన్ అనూప్ ‘రాగ్ దర్శన్’ అనే సంగీత శాస్త్ర గ్రంథం రచించారు. ఆ రచన రాతప్రతి పెన్సిల్వేనియా యూనివర్సిటీ లైబ్రరీలో నేటికీ పదిలపరచబడింది” అని ఆమె వివరించారు.ఆసక్తికరమైన ఆలోచనల ‘మంథన్’ప్రపంచ ప్రసిద్ధులైన ఆలోచనాపరులు మనసు విప్పి మాట్లాడే వేదికగా ‘మంథన్’ చిరకాలంగా భాగ్యనగర వాసులకు సుపరిచితం. సాహిత్యం, సంగీతం, సంస్కృతి, సమాజం... ఇలా పౌర జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని రకాల అంశాలపైనా ఎప్పటికప్పుడు ప్రముఖులను ఆహ్వానించి, వారితో ప్రసంగాలు, ప్రశ్నోత్తరాలు, చర్చలు నిర్వహించడం కొన్నేళ్ళుగా ‘మంథన్’ చేస్తున్న మంచి పని. క్రియాశీలమైన ఈ సంభాషణల ద్వారా ప్రజాస్వామ్య, లౌకిక విలువలను బలోపేతం చేయాలన్నది ఈ పౌర సంస్థ ఆశయం. అందులో భాగంగానే, ఎప్పటికప్పుడు తాజా ప్రచురణలతో ముందుకొచ్చిన ప్రసిద్ధ పుస్తక రచయితలతో, అధ్యయనశీలుర ప్రసంగాలు, సంభాషణలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏప్రిల్లో ఇటీవలే ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణతో ఆలోచనాత్మక సంవాదం సాగించిన ‘మంథన్’, వారం తిరిగేసరికి సంగీత చరిత్రకారిణి క్యాథరిన్ బట్లర్ స్కోఫీల్డ్తో ఈ ఆసక్తికరమైన సంభాషణ జరపడం విశేషం. అయితే, ఇలాంటి అపురూప కార్యక్రమాలపై మీడియాలో ఎక్కడా మచ్చుకైనా మొక్కుబడిగా మూడు ముక్కలు కనిపించకపోవడమే విషాదం.రెంటాల జయదేవ(చదవండి: సమానత్వానికి కేరాఫ్గా ఆ వివాహం..!) -
ఈ మధ్య బరువు పెరుగుతున్నారా!
చాలామంది మహిళలు అటుఇటుగా మధ్యవయసుకు చేరుతుండగానే కాస్త లావెక్కుతుంటారు. ఈ దశలో వాళ్లకు ఒక సందేహం కూడా వేధిస్తుంటుందీ... ‘మేమేమీ ఎక్కువగా తినడంలేదు. మా ఆహార అలవాట్లలో మార్పులూ లేవు. అయినా ఇలా ఎందుకు బరువు పెరుగుతున్నామం’టూ బాధపడుతుంటారు. ఇలా జరగడానికి కారణాలేమిటో చూద్దాం. నిజానికి మధ్యవయసుకు చేరుతూ... రుతుక్రమం ఆగిపోయేందుకు తొలి దశ అయిన పెరీ–మెనోపాజ్, రుతుస్రావం పూర్తిగా ఆగిపోయే మెనోజ్కూ దగ్గరపడుతున్న సమయంలో అప్పటివరకూ వాళ్లలో స్రవిస్తున్న ఈస్ట్రోజెన్ మోతాదుల్లో తగ్గుదల మొదలవుతుంది. ఈ ఈస్ట్రోజెన్ మోతాదుల్లో తగ్గుదల జీవక్రియలూ (మెటబాలిజమ్), కొవ్వు నిల్వలూ, ఎనర్జీ వెలువడటాలనే పలు అంశాలలో మరికొన్ని మార్పులకు కారణమవుతుంది. మెనోపాజ్ దశలో స్థూలకాయం రావడానికి కారణాలేమిటి?నిజానికి ఈస్ట్రోజెన్ అనే హార్మోన్.... ఇన్సులిన్ చేసే పనిలోనూ, అది వివిధ కణాలకు చేరే తీరుతెన్నులు, జీవక్రియల వేగం రేటు... ఈ అన్ని విషయాల్లోనూ కీలక భూమిక ΄ోషిస్తుంది. ఈస్ట్రోజెన్ క్రమబద్ధంగా వెలువడుతున్న రోజుల్లో అది దేహంలోని గ్లూకోజ్ సమంగా నిర్వహితమవుతూ, కండరాలన్నీ (మజిల్ మాస్) సమానంగా ఉండేలా చూస్తుంది. దాంతో దేహం దాదాపుగా సన్నగానే కనిపిస్తుంటుంది. కానీ ఈస్ట్రోజెన్ స్రావాలు మోతాదులు తగ్గుతున్న కొద్దీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాంతో అది దేహంలో కొవ్వు పేరుకునే ప్రక్రియకు దారితీస్తుంది. ఈ క్రమంలో మొదట మహిళల పొట్టలో కొవ్వుపెరగడం దగ్గర్నుంచి మొదలై క్రమంగా ఒళ్లు లావెక్కడం కొనసాగుతుంది. తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం అంతే ఉన్నప్పటికీ... ఈ మధ్యవయసు దశలో మహిళలు తాము తీసుకునే ఆహారమూ, చేస్తుండే వ్యాయామంలో మార్పులు లేనప్పటికీ... జీవక్రియల్లో వచ్చిన పై మార్పు కారణంగా వాళ్ల దేహం బరువు పెరగడం మొదలువుతుంది. పెరీ–మెనోపాజ్ దశల్లో ఈస్ట్రోజెన్ హార్మోనల్ మార్పులు క్రమంగా మజిల్ మాస్ తగ్గిస్తూ పోవడంతో పాటు దేహంలో ఇన్ఫ్లమేషన్ పెంచుతూ పోతాయి. కండరాల్లో ఏదైనా గాయమైనప్పుడు దాని నుంచి కోలుకునే వేగాన్ని కూడా తగ్గిస్తాయి. మనం చేసే రోజువారీ పనులతో కండరాల్లో అయ్యే చిన్నపాటి గాయాలు తగ్గే వేగం కూడా మందగిస్తుంది. ఇలా ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం అనే అంశం... మహిళలు తీసుకునే ఆహారాలు ఒంటికి పట్టడమూ (అబ్జార్బింగ్ ద న్యూట్రియెంట్స్), కండరాల నిర్మాణమూ, ఒత్తిడిని మేనేజ్ చేయడం (స్ట్రెస్ మేనేజ్మెంట్), నిద్ర... వీటన్నింటినీ ప్రభావితం చేస్తూ... బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒత్తిడి పెరగడంతో దేహంలో కార్టిసోల్ అనే హార్మోన్లు స్రవించడానికి కారణం కావడమూ... దాంతో నిద్ర బాగా తగ్గడం... ఇలా కంటినిండా నిద్రలేనప్పుడు రెస్టింగ్ మెటబాలిజమ్ కూడా తగ్గడం వల్ల ఒళ్లు పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. అంటే... ఆహార అలవాట్లలో మార్పులు లేక΄ోయినప్పటికీ, ఇక్కడ పేర్కొన్న ఈ మార్పుల కారణంగా మధ్యవయసు రాగానే మహిళల్లో స్థూలకాయం పెరుగుతుంది. మెనోపాజ్ అనేది నివారించలేని దశ. అయితే ఈ ప్రక్రియల ద్వారా ఈస్ట్రోజెన్ తగ్గుదల వేగాన్ని నియంత్రించి, తద్వారా బరువు పెరగడాన్ని కూడా నియంత్రిస్తూ ఆరోగ్యంగా ఉండటం సాధ్యపడుతుంది. ఇక ఈస్ట్రోజెన్ తగ్గుదలతో వచ్చే పరిణామాల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే... డాక్టర్ను సంప్రదించి అందుకోసం హార్మోన్ రీ–ప్లేస్మెంట్ చికిత్స (హెచ్ఆర్టీ) వంటి చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది.ఈ సమస్యను అధిగమించడం ఎలా... ఏజింగ్ లేదా వయసు పెరుగుతుండటం వల్ల వచ్చే మార్పుల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ, అలా జరిగే తీరు మెల్లగా జరిగేలా చేయడం ద్వారా ఈ ప్రక్రియలను సాధ్యమైనంత ఆలస్యంగా జరిగేలా చేయడంతో పాటు దీనివల్ల కలిగే దుష్పరిణామాలను వీలైనంతగా నివారించవచ్చు. అందుకు ఆరోగ్యకరమైన మంచి జీవనశైలి (లైఫ్స్టైల్) బాగా ఉపయోగపడుతుంది.మంచి పోషకాహారాలు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే మితిమీరిన వ్యాయామాలూ చేయకూడదు. దేహానికి మరీ శ్రమకలిగించని విధంగా కేవలం ఒళ్లు అలిసిపోయేలా మాత్రమే ఈ వ్యాయామాలు ఉండాలి. ఇందుకు వాకింగ్, ఈత వంటి వ్యాయామాలు మంచివి. ఒత్తిడిని (స్ట్రెస్ను) వీలైనంతగా తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం, రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి ప్రక్రియలను అనుసరించవచ్చు. మందకొడిగా కాకుండా ఎప్పుడూ చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కనీసం 7, 8 గంటలకు తగ్గకుండా కంటినిండా నిద్రపోవాలి. రూమా సిన్హా, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టిట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్. (చదవండి: బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!) -
బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!
శరీరం సంక్రమంగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో ముఖ్యం. నిజానికి శరీరం వివిధ భాగాలతో కూడిన ఒక జట్టులా పనిచేస్తుంది. ప్రతి అవయవానికి దానికంటూ ఒక పాత్ర, సొంత అవసరాలు, ఇష్టమైన పోషకాలు ఉండాయి. జీర్ణవ్యవస్థకు సహాయపడేది ఊపిరితిత్తులకు లేదా కళ్లకు సరిపడకపోవచ్చు. అందుకే తెలివిగా తినడం అంటే కేవలం స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు అది బలవర్ధకమైనదై ఉండాలి కూడా అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు లాన్విత్ బాత్ర. అవయవాలు సక్రమంగా పనిచేసేలా, ఏకాగ్రత, శ్వాస బాగుండేలా ఎలాంటి పోషకాహారం తినాలో, జీవనశైలిలో అందుకు తగ్గట్టుగా చిన్న చిన్న మార్పుల చోటు చేసుకోవాలో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు.శరీరంలోని ప్రతి భాగానికి సరైన ఆహారాలు1. ఊపిరితిత్తులు: వాపు నివారణపై (Anti-Inflammation) దృష్టి సారించండిమెరుగైన శ్వాస, ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసంఅల్లం, పసుపు, సిట్రస్ పండ్లను (పుల్లని పండ్లు) ప్రత్యేకంగా సూచించారు. వీటిలో జింజెరోల్, కర్కుమిన్, విటమిన్ సీ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి, ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షించడానికి సహాయపడతాయి. అందుకోసం ఉదయపు టీ లేదా జ్యూస్లో తాజా అల్లం, పసుపును చేర్చుకోండి.2 కాలేయం (Liver): విషతుల్యాల నిర్మూలనకు (Detox), కొలెస్ట్రాల్ జీవక్రియకు మద్దతునివ్వండి. శరీరం నుంచి విషతుల్యాలను తొలగించడానికి (detox) కాలేయం ఎంతో కష్టపడి పనిచేస్తుంది. బ్రకోలి (సల్ఫోరాఫేన్ పుష్కలంగా ఉండేది), గ్రీన్ టీ, ఆలివ్ నూనె వంటి ఆహారాలు ఈ ప్రక్రియకు మద్దతునివ్వడానికి, కొవ్వు పేరుకుపోకుండా రక్షించడానికి సహాయపడతాయి. అంతేగాదు కొన్ని సులభమైన మార్పులతో, రోజువారీ ఆహారం ద్వారా వాటికి మద్దతు ఇవ్వవచ్చు.3. పేగు ఆరోగ్యం: మంచి బ్యాక్టీరియా కోసం.. ఆరోగ్యకరమైన పేగుకు ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ రెండూ అవసరం. పెరుగు మీకు సజీవ మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. అయితే అరటిపండ్లు, చియా గింజలు వాటికి ఆహారం అందించే ఫైబర్ను అందిస్తాయి.సులభమైన, జీర్ణవ్యవస్థకు మేలు చేసే చిరుతిండి కోసం పెరుగు, చియా గింజలను కలిపి ప్రయత్నించండి.4. కళ్ళు: ఒత్తిడి నుంచి రక్షణస్క్రీన్ సమయం పెరగడంతో, కంటి ఆరోగ్యం మునుపెన్నడూ లేనంతగా ముఖ్యమైంది. క్యారెట్లు, చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ) పుష్కలంగా ఉంటుంది, అదే సమయంలో ఉసిరి రెటీనాను రక్షించడానికి విటమిన్ సీ ని అందిస్తుంది. రోజువారీ భోజనంలో కనీసం ఒక నారింజ రంగు కూరగాయను చేర్చుకోండి.చిన్న చిన్న ఆహార ఎంపికలు శరీరంలోని వివిధ భాగాలకు వివిధ రకాలుగా సహాయపడతాయి. అందువల్ల ఏమి తింటున్నారు, ఎందుకు తింటున్నారు అనే దానిపై కాస్త శ్రద్ధ పెట్టి తీసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు పోషకాహారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే కాదు. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించాలి. (చదవండి: పాద' సేవలను గుర్తించండి!) -
'పాద' సేవలను గుర్తించండి!
పాదం ఓ సంక్లిష్టమైన అవయవం. నడక సరిగా సాగుతున్నంత సేపూ దాని గొప్పదనం తెలియదు. నిర్మాణపరంగా (అనటామికల్గా) చూస్తే అదొక అబ్బురపరచే అవయవం. పాదం ప్రాధాన్యమేమిటో తెలుసుకుందాం.పాదం గురించి తెలుసుకునే ముందు అసలు పాదం నిర్మాణాన్నీ, దాని పనితీరేమిటన్నది చూద్దాం.26 ఎముకలు / 107 లిగమెంట్లు / 19 కండరాలు మొత్తం కాలిలో 30 ఎముకలు ఉంటే... సైలెంట్గా తనపని తాను చేసుకుపోయే పాదంలో 26 ఎముకలు ఉంటాయి. అంటే కాలితో పోల్చి చూసినప్పుడు 90 శాతం ఎముకలు పాదంలోనే ఉంటాయి. ఇందులో నడవడానికి ఉపయోగపడేలా 107 లిగమెంట్లు, 19 కండరాలు కూడా ఉంటాయి. ఓ వ్యక్తి బరువు 70కిలోలు అనుకుంటే... అతడి బరువును బ్యాలెన్స్ చేసేందుకు దేహంలోని పొడవైన ఎముక ‘ఫీమర్’ తొడలో ఉంటుంది. దీన్నే తెలుగులో తొడ ఎముక అని పేరు.నడక... 70 కిలోల షాక్ తీసుకునే... సంక్లిష్ట ప్రక్రియ మనం మనకు తెలియకుండా యాంత్రికంగా నడుస్తుంటాంగానీ... నిజానికి నడక చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. పాదం నేల మీద మోపగానే 70 కిలోల బరువుతో మొదటి షాక్ పాదం పైనే పడుతుంది. కానీ ఆ షాక్ను పాదానికి అంతటా సమంగా విస్తరింపజేస్తూ... ఆ షాక్ను తట్టుకునే షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది పాదం. ఇక ఆ పాదాన్ని వెనక్కుతోస్తూ తన గరిమనాభి (సెంటర్ ఆఫ్ గ్రావిటీ) ముందుకు పడేలా చేస్తూ నడక సాగిస్తున్న వ్యక్తి కదులుతాడు. ఇలా గ్రావిటీవల్ల ముందుకుపడిపోయే లోపే... మరో కాలు ముందుకు పడి ఆ 70 కిలోల షాక్ను ఆ కాలు తీసుకుని మనిషి పడిపోవడం నుంచి ఆపుతుంది. ముందుకు పడిపోయేలా కదులుతూ... అలా పడిపోయే లోపు మరో కాలిని ఆనిస్తూ నడక సాగుతుంది. ఇలా నడక సాగించడాన్ని ‘బైపెడల్’ మూవ్మెంట్ అంటారు. రోజులో 7,500 సగటు అడుగుల నడకలో జరిగేదేమిటంటే... ఓ వ్యక్తి నడవడం మొదలుపెట్టాక ప్రతి నిమిషానికి ఉజ్జాయింపుగా 100 అడుగులు వేస్తుంటాడని అంచనా. అంటే అతడి రెండు కాళ్ల మీద ప్రతి నిమిషానికీ 70 కిలోల బరువు పడుతూ... ఒక్కో ΄ాదం మీదా ఇలా 50 సార్లు పడుతుంది. మొదట పాదం మోపగానే బరువంతా మడమలోని బంతిలాంటి ఎముకపై పడుతుంది. ఆ తర్వాత కాలివేళ్లలోని ఎముకలైన ఐదు మెటాటార్సల్స్పై పడుతుంది. వాటి సాయంతో పాదం నేలను వెనక్కుతోస్తుంది. కానీ నేల కదలదు కాబట్టి... అలా వెనక్కు నెట్టడం వల్ల ఆ వ్యక్తే ముందుకెళ్తుంటాడు. ఇలా ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తి రోజుకు 7,500 అడుగులు వేస్తాడని ఉజ్జాయింపుగా ఓ అంచనా.ఏడాదికి 27,37,500 అడుగులూ... జీవితకాలంలో 22 కోట్ల అడుగులుఈ లెక్కన అతడు ఏడాదికి 27,37,500 అడుగులూ... ఒకవేళ అతడు ఆరోగ్యకరంగా 80 ఏళ్లు బతకగలిగితే... అతడి జీవితకాలంలో మొత్తం 21,90,00,000 అడుగులు (అంటే దాదాపుగా 22 కోట్ల అడుగులు) వేస్తాడు. అలా ఓ వ్యక్తి తన జీవిత కాలంలో లక్షా అరవై వేల కిలోమీటర్ల (లక్ష మైళ్ల) దూరాన్ని నడుస్తాడని ఒక అంచనా. (పుట్టిన ఐదేళ్ల వరకు పెద్దగా నడవడు కదా అనుకుని 75 ఏళ్లకే లెక్కవేస్తే... 20,53,12,500 అడుగులు వేస్తాడు. అంటే కనీసం 20 కోట్ల అడుగులైనా వేస్తాడు. ఆ నడిచే దూరాన్ని భూమ్మీద భూమధ్య రేఖ వెంట ఇలా నడుస్తూపోతే భూమిని నాలుగుసార్లు చుట్టి వస్తాడు. ఒకవేళ భూమి నుంచి చంద్రుడివరకూ నడవగలిగేట్లయితే... భూమికీ చంద్రుడికీ మధ్యనున్న దూరం 3,84,400 కిలోమీటర్ల దూరంలో అటుఇటుగా దాదాపు నాలుగో వంతు నడుస్తాడు. ఈ లెక్కలను బట్టి చూస్తే ఓ జీవితకాలంలో పాదాలపై పడే బరువూ, భారమూ ఎంత అన్నది ఆలోచిస్తే... మన పాదాలు చేసే కష్టమెంతో అర్థమవుతుంది. గచ్చు గట్టిదనంతో మరిన్ని గాయాలు... ఒకప్పుడు మనమందరం దాదాపు పాదరక్షలేమీ లేకుండానే మట్టిపై నడిచేవాళ్లం కానీ... ఇప్పుడు సిమెంట్తో రూపొందిన కఠినమైన పేవ్మెంట్లు లేదా అలాంటి ఉపరితలాల మీద నడవాల్సి వస్తుంది. నిజానికి ఇలాంటి కఠినమైన ఉపరితలాల మీద నడిస్తే పాదాలకు నష్టం. దీనికి బదులు నడిచే సమయాల్లో మెత్తటి నేల, లేదా కాస్తంత బౌన్స్ ఇచ్చేలాంటి గడ్డి మీద నడవటం వల్ల పాదాలకు రక్షణ దొరుకుతుంది. అందుకే కఠినమైన ఉపరితలాల మీద వాకింగ్ అంతగా సిఫార్సు చేయదగినది కాదు. అయితే ఇప్పుడు చాలావరకు ప్రతిచోటా రోడ్లతో హార్డ్ సర్ఫేస్లు ఉంటున్నందున మెత్తగా ఉండే షూస్ ఎంపిక చేసుకోడం వల్ల పాదానికి తగిన రక్షణ దొరుకుతుంది. పాదాలకు వచ్చే కొన్ని సమస్యలూ... పరిష్కారాలు...ఇటీవల అందరూ షూస్ / బూట్లు తొడుగుతున్నారు. అందునా స్కూల్ పిల్లల వయసు నుంచే ఇది జరుగుతోంది. అయితే ఇలా షూస్, బూట్లతో చాలాసేపు పాదాల్ని బంధించి ఉంచడం సరికాదు. ఇది పూర్తిగా ఎదగని చిన్నారుల పాదాల ఎదుగుదలను దెబ్బతీయవచ్చు. అందుకే పాద సంరక్షణ కోసం కాస్తంత వదులుగానూ, తొడిగాక పాదం ముందర కాస్త ఖాళీ ఎక్కువగానూ ఉండేలా షూ ఎంచుకోవాలి. షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమస్యను ‘బ్యూనియన్’ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్కు చూపించాలి.. చిన్నారులు స్కూల్ నుంచి రాగానే పిల్లలు షూస్ వదిలేసి... ఫ్రీగా ఉండే చెప్పులు, స్లిప్పర్స్ వంటి వాటిని తొడగాలి. ఇక మహిళల్లో విషయానికి వస్తే... వారు ధరించే హైహీల్స్ వల్ల పాదాలకు జరిగే ప్రమాదవకాశాలు పురుషులతో పొలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. కొందరిలో బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంటుంది. ఇలా జరగకూడదంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లోంచి మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకోవాలి. ఇక డయాబెటిస్ వంటి సమస్య ఉన్నవారు పాదాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలతో పాదాలను చాలావరకు సంరక్షించుకోవచ్చు. షూ తొడిగినప్పుడు ఒకేచోట అదేపనిగా ఒత్తిడి పడుతుండటం వల్ల ఆనెకాయలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని కొందరు బ్లేడ్తో కోస్తుండటం, మరికొందరు యాసిడ్ చుక్కలతో మాడ్చటానికి ప్రయత్నిస్తుంటారు. అది సరికాదు. డాక్టర్కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి. ∙కొందరిలో పాదాలకు కాయకాచి అందులో పగుళ్లు ఏర్పడతుంటాయి. ఇలా జరిగినప్పుడు పాదాల డాక్టర్కు చూపించుకుని తగిన చికిత్స చేయించుకోవాలి.కొందరిలో ఫంగస్ కారణంగా అథ్లెట్స్ ఫుట్ అనే సమస్య వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ పాదాలపై ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే పాదం ఎప్పుడూ తేమ, తడిలో ఉండటంతో అక్కడ ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథులు స్రావాలతో పాదం తడిసినప్పుడూ ఈ సమస్య మరింత త్వరగా రావచ్చు. ఇలాంటప్పుడు పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ బేస్డ్ వాష్లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ల సూచన మేరకు యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి రావచ్చు.డా. సుధీర్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్.నిర్వహణ: యాసీన్ -
బెస్టే ఫస్ట్
‘చేసే ప్రతి పనిలోనూ బెస్ట్ ఇస్తే అదే మనల్ని ఒకరోజు అందరిముందు గొప్పగా నిలుపుతుంది’ అంటున్నారు. హైదరాబాద్ వాసి చిలకలపూడి ఇందు ఫల్గుణి. ఈ నెల ఫెమినా మిస్ ఇండియా సౌత్ కిరీటం గెలుచుకొని దక్షిణాది అందాల భామగా నిలిచారు. ఈ సందర్భంగా ఇందు ఫల్గుణి పంచుకున్న విశేషాలు...బ్యూటీ రంగంలో రాణించాలనుకుంటున్నాను. ప్రస్తుతం హైదరాబాద్లోని ఆంధ్ర మహిళాసభలో ఎల్ఎల్బి థర్డ్ ఇయర్ చదువుతున్నాను. వృత్తిరీత్యా జడ్జిగా ఎదగాలనుకుంటున్నాను. తెలుగు భాషపైన పట్టు సాధించాలనే ఆలోచనతో సాహిత్యాన్నీ చదువుతుంటాను. – ఇందు ఫల్గుణి‘‘కలలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తుంటారు. నేనూ చిన్నప్పటి నుంచి మోడలింగ్లోకి వెళ్లాలి, అందాలపోటీలలో పాల్గొనాలి, సినిమాలలో నటించాలి, జాతీయస్థాయి బ్యూటీ కాంటెస్ట్ వేదికపైన నించోవాలి.. అనుకునేదానిని. ఈ కల చిన్నప్పటి నుంచి ఉన్నా ‘నేను చేయగలనా?’ అనే సందేహం ఎప్పుడూ ఉండేది. ఆ సందేహాన్ని తీసేసి, ‘చేయగలను..’ అని ఎప్పుడైతే అనుకున్నానో ఆ రోజు నుంచి కృషి చేయడం మొదలుపెట్టాను. నా చూపు బ్యూటీ కాంటెస్ట్ల వైపు ఉండేది కాబట్టి నన్ను నేను మెరుగ్గా చేసుకోవడానికి వరల్డ్ బ్యూటీస్గా పేరొందిన ఐశ్వర్యా రాయ్, లారాదత్తా, సుస్మితాసేన్ ల గురించి సమగ్రంగా తెలుసుకునేదానిని. ప్రోత్సాహంతో ముందడుగు...మా తమ్ముడు యాడ్ ఫిల్మ్లో పాల్గొనేవాడు. నేను ఆ యాడ్ ఫిల్మ్మేకింగ్కి వెళ్లి, దూరంగా కూర్చొని చూస్తుండేదాన్ని. కొన్ని రోజులకు ఆసక్తిగా అనిపించి, నేనూ ఆ యాడ్స్లో పాల్గొన్నాను. అలా తొమ్మిదేళ్ల వయసు నుంచి మోడలింగ్ చేస్తున్నాను. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. కాలేజీకి వచ్చాక అమ్మ నాగలక్ష్మి, నాన్న మహేష్ ప్రోత్సాహంతో మళ్లీ మోడలింగ్ మొదలుపెట్టాను. కూచిపూడి డ్యాన్సర్గానూ సాధన చేస్తున్నాను. మధ్యతరగతి కుటుంబం నేపథ్యం నాకున్న కలను నెరవేర్చుకోవడానికి అమ్మానాన్నలకు భారం కాకూడదు అనుకున్నాను. అందుకు, యూ ట్యూబ్లో మేకప్, మేకోవర్ గురించి రెండేళ్లపాటు ప్రాక్టీస్ చేశాను. అది సరిపోదని, ముంబైకి వెళ్లి అక్కడి అకాడమీలో చేరి శిక్షణ తీసుకున్నాను.గ్లామర్ మాత్రమే కాదుఅందాలపోటీలు అంటే గ్లామర్ మాత్రమే అనుకుంటారు చాలామంది. క్యాన్సర్, ఆటిజం సమస్య ఉన్న చిల్డ్రన్ కోసం ఫండ్ రైజ్ చేస్తుంటాను. అంటే.. సేవాగుణం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ, వ్యక్తిత్వం, ఆలోచన, కమ్యూనికేషన్ స్కిల్స్, సాధన.. అన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. స్టేజ్పైన వాక్ కోసం ఆరు ఇంచుల హీల్ మీద గంటలు గంటలు నిల్చోవాలి. తర్వాత నేల మీద కాలు పెట్టి, నిలబడటానికిæఎంత నొప్పి ఉంటుందో చెప్పలేం. ఎంతో సహనం కూడా ఉండాలి. ఇంత తపన పడుతున్నా చుట్టుపక్కలవారి నుంచి, బంధువుల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. అవన్నీ పట్టించుకోకుండా ఏం సాధించాలనుకున్నామో ఆ లక్ష్యంవైపే దృష్టి పెట్టాలనుకున్నాను.ప్రతి రాష్ట్రంలో ఓ ఇల్లు..భువనేశ్వర్లోని క్విట్ యూనివర్శిటీలో ఈ బ్యూటీ కాంటెస్ట్ జరిగింది. నలబైవేల మందికి పైగా విద్యార్థులు, లెక్చరర్లు పువ్వులతో మాకు స్వాగతం పలికారు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనంత గొప్పది. ఈ అందాలపోటీకి దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు చొప్పున ముప్పైమందిమి ఎంపికయ్యాం. ఇరవై ఐదు రోజుల పాటు ముప్పైమందిమి తోబుట్టువుల్లా కలిసిపోయాం. అన్ని రాష్ట్రాల విభిన్న రుచులు, సంస్కృతులు.. మాకు పరిచయం అయ్యాయి. మేం ఉన్న రోజుల్లోనే ఒడిస్సా, కేరళ, తమిళనాడు నూతన సంవత్సరాది వేడుకలు కూడా జరిగాయి.పండగలు జరుపుకోవడం, ఒకరికొకరం సాయం చేసుకోవడం, అక్కచెల్లెళ్లలా సరదాగా గడపడం.. ప్రతిరోజూ ఒక వేడుకే. మేం ఇప్పుడు ఏ రాష్ట్రానికి వెళ్లినా, అక్కడ మాకో ఇల్లు ఉంది. అంతగా కలిసిపోయాం. లక్షలాది మంది ఈ బ్యూటీ కాంటెస్ట్కుపోటీ పడుతుంటారు. అంతమందితోపోటీపడి వేదికపై వరకు వెళ్లడమే గొప్ప అనుకున్నాను. అలాంటిది తెలుగు అమ్మాయిగా ఈ గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ పట్టువదలకుండా చేసిన కృషిని వివరించింది ఈ బ్యూటీ.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కుటుంబ జీవితం, కెరీర్ ప్లాన్పై సింగపూర్ మాజీ ప్రధాని సలహా!
వివాహం, పిల్లలు కనడం గురించి ఇటీవల కొందరు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు యువత కెరీర్, మంచిగా సెటిల్ అవ్వడమే ప్రధానం అనుకునేవాళ్లను ప్లీజ్ అలా ఆలోచించద్దు అని బతిమాలుతున్నారు. ఫ్యామిలీ లైఫ్కే ప్రాధాన్యత ఇవ్వండని వేడుకుంటున్నారు. ఆ దిశగా ఆలోచించేలా ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సాక్షాత్తు సింగపూర్ మాజీ ప్రధాని సైతం సలహలిస్తుండటం విశేషం. అందుకు సంబధించిన వీడియోని షేర్ చేస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కూడా ఆయన మాటలకే మద్దతిస్తూ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు.శ్రీధర్ వెంబు షేర్ చేసిన ఎక్స్ పోస్ట్లో సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ యువతకు సలహాలిస్తున్నారు. ప్లీజ్ వివాహాన్ని, కుటుంబాన్ని ప్రారంభించడాన్ని ఆలస్యం చెయ్యొద్దు అని ఒక పీహెచ్డీ విద్యార్థికి సలహా ఇస్తున్నారు. ఆ వీడియోలో లీ ఆమె విద్యా ప్రణాళికలను ప్రశ్నిస్తూ, కుటుంబ నిర్ణయాలను వాయిదా వేయకూడదని సూచిస్తున్నారు. మాజీ ప్రధాని లీ ఆ విద్యార్థిని వ్యక్తిగత విద్యా జీవితం గురించి వరుసగా ప్రశ్నలు అడగడం కనిపిస్తుంది. ఆమెకు పెళ్లయిందా, బాయ్ఫ్రెండ్ ఉన్నాడా, పీహెచ్డీ ఎప్పుడు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోందా అంటే ప్రశ్నిస్తారు. ఆమె సుమారు రెండేళ్లలో పీహెచ్డీ పూర్తి చేస్తుందని తెలుసుకున్న తర్వాత ఆయన ఆ విద్యార్తి నేరుగా సలహా ఇచ్చారు. “దయచేసి సమయాన్ని వృధా చేయకండి. కుటుంబ జీవితం మీ పీహెచ్డీ కంటే ముఖ్యమైనది. సంతృప్తినిచ్చే జీవితం కూడా. మీకు ఇదే నా శుభాకాంక్షలు నీకు పీహెచ్డీ, మంచి బాయ్ఫ్రెండ్ దొరకాలని ఆశిస్తున్నా అంటూ లీ ముగించారు. ఆ వీడియో గురించి ప్రస్తావిస్తూ..శ్రీధర్ వెంబు తన ప్రారంభ సంవత్సరాల నుంచి లీ జీవితాన్ని సునిశితంగా పరిశీలించానని అన్నారు. ఆయనపై తనకు ప్రగాఢమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. తాను ఇటీవల సంభాషణలలో ఇలాంటి సలహానే ఇచ్చానని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయన, ఎలాన్ మస్క్ తరచుగా పంచుకునే అభిప్రాయాలను ప్రతిధ్వనించారు. ఉన్నత ఆశయాలున్న మహిళలు తమ కెరీర్ను కొనసాగిస్తూనే, పిల్లలను కనేలా ప్లాన్ చేసుకోవలని చెబుతున్నారు శ్రీధర్వెంబు. మన సమాజ సాంస్కృతిక, ఆర్థిక నిర్మాణాలు సర్దుబాటు కావాలంటే కుటుంబ వ్యవస్థ ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. కాగా, కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మారుతున్న సామాజిక ప్రాధాన్యతల కారణంగా చాలామంది వ్యక్తులు వివాహాన్ని, సంతాన సాఫల్యాన్ని ఆలస్యం చేస్తున్నారు. తీరా కెరీర్లో సెటిల్ అయ్యాక..సంతానం కలుగక నరకం చూస్తున్నారు. అదే సమయంలో గతకాలంటే గణనీయంగా జననరేటు తగ్గిపోతోంది. దాంతో పలువురు వ్యాపార నాయకులు, విధాన రూపకర్తలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తరాలను ఆ దిశగా ఆలోచించేలా సలహాలు సూచనలతో మేల్కొలుపుతున్నారు. I studied the life and work of Lee Kuan Yew, the Founder-Prime Minister of Singapore intensely during my early 20s. Immense respect for him.In this video clip, he advises a young woman pursuing a PhD not to neglect marriage and kids. I recently gave very similar advice. Elon… https://t.co/BVlUSDsBnP— Sridhar Vembu (@svembu) April 24, 2026 (చదవండి: ఆ బేకరీకి వెళ్తే..ఎవ్వరైనా సైలెంట్ అవ్వాల్సిందే!) -
ఏడాదికి 4000 గంటలు ఎండలే....ఎక్కడుందో తెలుసా?
పిల్లలూ... మనం మూడు నెలలు ఉండే వేసవికే అష్షో బుష్షో అంటున్నాం కదా. అసలు ఎప్పుడూ వేసవే ఉండే ఊరు ఉందంటే నమ్ముతారా? అలాంటి ఊరు ఉంది. లక్కీగా ఇండియాలో కాదు. అమెరికాలో. అరిజోనా రాష్ట్రంలో. ఆ ఊరి పేరు యుమాయుమాకి చుట్టూ ఎడారి, ఇసుక, కొండలు. మ్యాప్లో చూస్తే మెక్సికో దేశానికి దగ్గరగా కనిపిస్తుంది. దీనిని ‘ఎండల రాజధాని’ అంటారు. ఎందుకంటే ఏడాదికి 4000 గంటలు ఇక్కడ ఎండ కాస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏడాదిలో 330 రోజులు ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క కూడా ఉండదు. నీలం రంగు అద్దంలా మెరిసి పోతుంటుంది. చుట్టూ సోనోరాన్ ఎడారి. ఇసుక తొందరగా వేడెక్కిపోతుంది పర్వతాలు అడ్డు: పెద్ద పర్వతాలు వాన మబ్బులను రానివ్వవు. దగ్గరలో సముద్రం లేదు. అందుకే తేమ, చల్లని గాలి రాదు. పంటల ఏడాదికి కేవలం 8 సెం.మీ. వాన పడుతుంది. మన హైదరాబాద్లో ఒక పెద్ద వానకు 5 సెం.మీ. పడుతుంది. యుమాకు అది ఏడాది వాన! గిన్నిస్ రికార్డ్: ‘ప్రపంచంలో అత్యంత ఎండ కాసే నగరం’ అని గిన్నిస్ బుక్లో ఈ ఊరుకి పేరుంది. యుమాలో గొడుగులు అమ్మే షాపులు చాలా తక్కువ. ఎందుకంటే అవసరమే ఉండదు. పిల్లలు ‘వాన పాట పాడాలంటే యూట్యూబ్ పెట్టుకోవాలి. బయటికి వెళ్లాలంటే మొహం, చేతులకు సన్క్రీమ్ రాయడం మర్చిపోరు. లేదంటే 10 నిమిషాల్లో టమాటో అయిపోతారు. ప్రతి ఇంట్లో, స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మనకు వాన సెలవు ఇస్తారు కదా? యుమాలో ‘చాలా ఎక్కువ వేడి’ అని ఎండకు బడికి సెలవు ఇస్తారు. 48 సెంటిగ్రెడ్లు దాటితే బయట ఆడుకోవడం బ్యాన్! ఇంత ఎండలో కూడా యుమాలో పాలకూర’ పండిస్తారు. అమెరికాకి కావాల్సిన పాలకూరలో 90% ఇక్కడి నుంచే వెళ్తుంది. చలికాలంలో పండిస్తారులే! -
గుండెపోటుకు కారణాలివే...
విజయవాడ గొల్లపూడికి చెందిన 35 సంవత్సరాల చందు ఉదయాన్నే నిద్రలేవగానే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని తొలుత సమీపంలోని ఆస్పత్రికి, అనంతరం విజయవాడలోని గుండె ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విజయవాడ లబ్బీపేటకు చెందిన రమేష్ వయసు 40 సంవత్సరాలు. ఇటీవల వేకువ జామున 4 గంటలకు ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. గ్యాస్ నొప్పిగా భావించి ఒక మాత్ర వేసుకుని పడుకున్నాడు. మళ్లీ 6 గంటలకు ఛాతీలో పెయిన్ ప్రారంభమైంది. దీంతో తమ ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ గుండె వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఇలా వీరిద్దరే కాదు.. గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. వాకింగ్ చేస్తూ... క్లాస్రూమ్ లో పాఠాలు వింటూ... కుప్పకూలి మరణిస్తున్న వారిని నిత్యం చూస్తున్నాం. ప్రస్తుతం అతిపెద్ద కిల్లర్గా గుండెపోటు మారిందని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ పేర్కొంది. గుండెపోటు మరణాలను నివారించాలంటే ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. జీవనశైలిని మార్పు చేసుకోవడంతో పాటు, ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా గుండెపోటు మరణాలను నివారించవచ్చునని వైద్యులు అంటున్నారు. ఉరుకుల పరుగుల జీవనంలో వత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం అంటున్నారు. గుండెపోటుకు కారణాలివే... ∙ వయస్సు రీత్యా వచ్చే గుండెపోటు, ఇవి 45 ఏళ్లు నిండిన వారికి వస్తుంటాయి. ∙ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వారు 40 ఏళ్ల లోపు గుండె పోటుకు గురవుతున్నారు. అందుకు కారణాలిలా ఉన్నాయి. ∙ ఫ్యామిలీ(తల్లి, తండ్రి) గుండెపోటుకు గురైన వారు ఉండటం∙ స్మోకింగ్ చేయడం ∙ కోవిడ్ ప్రభావం ∙ పుట్టుకతోనే కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు ఉండటం ∙ ప్రొటీన్ డెఫిషియన్సీ ∙ జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక కొలస్ట్రాల్, ఒబెసిటీ రావడం ముందస్తుగా ఏమి చేయాలి... ∙ ప్రతి ఒక్కరూ 40 ఏళ్లు దాటిన తర్వాత సీటీ యాంజియో చేయించుకోవడం ద్వారా గుండె రక్తనాళాల్లోని బ్లాక్లను గుర్తించవచ్చు. ∙ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వారు వయస్సుతో సంబంధం లేకుండా వైద్యుల సూచన మేరకు సీటీ యాంజియో చేయించుకోవాలి ∙ రక్తపోటు, మధుమేహం ఉన్న వారు వాటిని అదుపులో ఉంచుకుంటూ, కొల్రస్టాల్ మందులు రెగ్యులర్గా వాడాలి. వ్యక్తిగత జాగ్రత్తలు ∙ వత్తిడిని తగ్గించుకోవాలి. మంచి నిద్రపోవాలి ∙ స్మోకింగ్ అలవాటు ఉంటే మానుకోవాలి ∙ ఆహారపు అలవాట్లను మార్పుకోవాలి ∙ నాన్ వెజ్ వంటకాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది ∙ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి మధుమేహమూ కారణమే... మధుమేహం అదుపులో లేని వారు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మెదడు, పాదాలకు రక్త ప్రసరణ సరిగా లేని శరీర తత్వం ఉన్న వారిలో గుండె రక్తప్రసరణలోనూ లోపాలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి వారు గుండె, మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం, క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు, అధిక రక్తపోటు, కొలస్ట్రాల్లను మెరుగ్గా నియంత్రించుకోవాలి. వాకింగ్తో బ్లాక్స్కు చెక్ ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం ద్వారా రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా చూడవచ్చునని వైద్యులు చెపుతున్నారు. వాకింగ్ చేసే వారిలో రక్తనాళాల్లోని కొల్రస్టాల్ బ్లాక్స్ పెరిగే అవకాశం ఉండదంటున్నారు. ముఖ్యంగా మధుమేహుల్లో రక్తనాళాలు సన్నబడి రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుందని, వాకింగ్ చేస్తే అలాంటి సమస్యలు రావంటున్నారు. మొత్తంగా రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో 5 రోజులు వాకింగ్ చేస్తే రక్తనాళాల్లో బ్లాక్స్ రాకుండా చూడటంతో పాటు, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చునంటున్నారు. ముందస్తు పరీక్షలతో మేలు 40 ఏళ్లు నిండిన వారు గుండె రక్తనాళాల్లోని బ్లాక్స్ను నిర్ధారించేందుకు సీటీ యాంజియో చేయించుకుంటే మంచిది. ఆరోగ్యకర జీవన విధానం, వత్తిళ్లను తగ్గించుకోవడం, ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్గా వాకింగ్ చేయడం ద్వారా గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. స్మోకింగ్ చేసే వారిలో, కోవిడ్ ప్రభావం ఉన్న వారిలో చిన్న వయస్సులోనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ కృష్ణచంద్ కాగిత, కార్డియాలజిస్ట్,సెంటినీ, విజయవాడ -
పెరుగు అన్నం vs లెమన్ రైస్: ఈ సమ్మర్లో ఏది మంచిదంటే..
డయబెటిస్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా మితంగా అన్నం తినడమే మేలు అని వైద్యులు సూచిస్తుంటారు. అందులోనూ మన భారతీయ ఆహారంలో ప్రధానంగా ఉండే రైస్ని తక్కువగా, కూర ఎక్కువగా కలుపుకుని తినమని చెబుతుంటారు. పైగా ఇలాంటి హాట్ సమ్మర్లో ప్రజలంతా తేలికపాటి వంటకాల వైపే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా పెరుగన్నం, నిమ్మకాయ పులిహార వంటి తేలికపాటి వంటకాలనే తరుచుగా చేసుకుంటారు. మరి రైస్ కంటెంట్ తక్కువగా తీసుకోవాల్సిన మధుమేహ రోగులకు మరి ఇవి మంచివేనా అంటే..మరి ఈ రెండు వంటకాలలోని పోషక విలువలు వేరువేరుగా పరిశీలించి ఏది తీసుకోవడం మంచిదో పోషకాహార నిపుణులు మాటల్లో తెలుసుకుందామా..!.అన్నం తింటే చక్కెర స్థాయిలు పెరగడానికి రీజన్..రైస్ రక్తంలో చక్కెరను ఎందుకు పెంచుతుందంటే..శుద్ధి చేసిన తెల్ల బియ్యం రకాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 58గా ఉంటుందని తెలుస్తోంది. ఒకేసారి ఎక్కువగా అన్నం తింటే రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది, కాబట్టి వైద్యులు డయాబెటిస్ పేషెంట్లను అన్నం తీసుకునే పరిమాణాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తుంటారు.పెరుగు అన్నం..పెరుగు, అన్నంతో పాటు రకరకాల మసాలాలు, కరివేపాకు కలిపి తయారు చేస్తారు. ఇది రుచిని జోడించడమే కాకుండా, రక్తంలో చక్కెరను పెంచే ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. వేడి తీవ్రంగా ఉన్నందున మధ్యాహ్న భోజనానికి ఇది చాలా అనువైనది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తూ..రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండేలా చూసుకునే పోషకమైన ఆహారం.దీని తయారీలో సాదా అన్నాన్ని పెరుగుతో కలుపుతారు. దీనిలో ప్రయోజనకరమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్ల శోషణ రేటును నెమ్మదింపజేస్తుంది. అన్నంలో పెరుగు కలపడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వంపై దాని ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. ఇది మెదడుని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. దీనిలో ప్రోటీన్, మెరుగైన కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. వేసవి వేడికి చక్కటి ఉపశమనం కూడా. అలాగే గ్లూకోజ్ ప్రతిస్పందనను స్థిరీకరిస్తుంది కూడా. రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఇది బెస్ట్ ఆహారం.నిమ్మకాయ పులిహోర(లెమన్ రైస్)ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను కూడా నెమ్మదింపజేస్తుంది, అందువల్ల ఇది ఇతర వేసవి ఆహారాల కంటే మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీని తయారీకి ఉపయోగించే నూనె, వేరుశెనగలు మరియు ఆవాలు కలపడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మరింత మెరుగుపడుతుంది.ఏది మంచిదంటే..పెరుగు అన్నం సాధారణంగా భోజనం తర్వాత గ్లూకోజ్ పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, కాబట్టి దానిని ఎలా తీసుకుంటే మంచిదనే దానిపై అవగాహన అవసరం. నియంత్రించుకోవడం అవసరం.నిమ్మకాయ అన్నం ఇందులో ఉపయోగించే నూనె పరిమాణంపై ఆధారపడి ఉంటుంది , అలాగే తినే పరిమాణం కూడా అత్యంత ముఖ్యం.రోజులోని సమయం, శారీరక శ్రమ స్థాయి, వ్యక్తిగతంగా గ్లూకోజ్ తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలు రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఆ రెండింటిని తీసుకునే పరిమాణం అనేది అత్యంత ప్రధానం అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. తీపిలేని పెరుగు, మిగతా కూరగాయలు జోడించి తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. ఇక నిమ్మకాయ పులిహోరలో వేరుశెనగలు తక్కువగా వేసుకుంటూ..మిగతా కూరగాయలు జోడిస్తే ఇది కూడా మధుమేహ రోగులకు మంచి బలవర్ధకమైన ఆహరమే అవుతుంది. ఇవి రెండూ కూడా డయాబెటిస్ రోగులకు మంచివే గానీ చేసే విధానం, పరిమాణం వంటి ఆధారంగానే మంచి ప్రయోజనాలను పొందగలరని వైద్యులు చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అతిగా వ్యాయామాలు చేయడం ఇంత ప్రమాదమా..! ? పాపం ఆ తల్లి..) -
2040లో చంద్రుడిపై మన జెండా
పిల్లలూ, రాత్రి పూట ఆకాశంలో నవ్వుతూ కనిపించే చందమామ మీదకు మనం వెళ్లొచ్చా? వెళ్లడమే కాదు, అక్కడ మన మువ్వన్నెల జెండా కూడా పాతేయొచ్చా? పాతేయొచ్చు’ అని గట్టిగా చెప్పారు నారాయణన్. హైదరాబాద్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ‘2040 సంవత్సరానికి ఒక భారతీయుడు చందమామ మీద కాలు పెడతాడు. చేతిలో త్రివర్ణ పతాకం ఉంటుంది’ అని మాట ఇచ్చారు. నారాయణన్ చెప్పిన విశేషాలు ఇలా అర్థం చేసుకోవాలి.మొదట గగనయాన్చందమామ చాలా దూరం. వెళ్లడం చాలా కష్టం. అందుకే మన సైంటిస్ట్లు ఇప్పటి నుంచే ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. మొదట 2027లో ‘గగనయాన్’ మిషన్ నిర్వహిస్తారు. అంటే ముగ్గురు వ్యోమగాములను భూమి చుట్టూ తిప్పి తీసుకువస్తారు. ఇందుకోసం నలుగురు వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ సింగ్, కమాండర్ శుభాంశు శుక్లా లను సెలెక్ట్ చేశారు. వీరిలో ముగ్గురు వెళ్లి వస్తారు.చంద్రయాన్– 4,5:చంద్రయాన్లో భాగంగా 2027లో ఎ20 ఉపగ్రహం పంపుతారు. అది ఆకాశంలోంచి భూమిని చూస్తూ, ‘అమ్మో, ఇక్కడ కాలుష్యం ఎక్కువైంది, అక్కడ వర్షాలు తక్కువైయ్యాయి’ లాంటి వార్తలు చేరవేస్తుంది. 2028కి వచ్చేసరికి అంతరిక్షంలో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాం. దాని పేరు ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’. మన శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి అక్కడే ఉండి పరిశోధనలు చేస్తారు. ఇక చంద్రయాన్–4లో మన రాకెట్ని పంపి, చందమామ మీద వాలేలా చేస్తారు. అది అక్కడి మట్టిని, రాళ్లను ఒక డబ్బాలో పెట్టుకుని మళ్లీ భూమి మీదకు తీసుకొస్తుంది. ఆ మట్టిలో ఏముందో ల్యాబ్లో చూస్తాం. 2030లో నిర్వహించే చంద్రయాన్–5 ఇంకా పెద్దది. అది ఒక పెద్ద ల్యాండర్ని, చిన్న కారు లాంటి రోవర్ని చందమామ మీద దింపుతుంది. ఆ రోవర్ వంద రోజులు చందమామ వీధులన్నీ తిరిగి ఫోటోలు, వీడియోలు పంపుతుంది. ఇవన్నీ అయ్యాక, అన్నీ సక్సెస్ అయ్యాక... 2040లో ‘మానవ సహిత చంద్రయాన్’ నిర్వహిస్తారు. ఆ రోజున మన భారతీయుడు రాకెట్ ఎక్కి, చందమామ మీద దిగి, ‘భారత్ మాతా కీ జై’ అని అక్కడ మన జెండా పాతుతాడు. ఇదీ చదవండి: సెలబ్రిటీ చెఫ్కు నీతా అంబానీ అద్భుత గిఫ్ట్, వీడియో వైరల్మీరూ వెళ్లొచ్చుపిల్లలూ... ఇప్పుడు నీకు 12 ఏళ్లా? 2040కి మీకు 28 ఏళ్లు. అంటే ఆ రాకెట్ ఎక్కేది మీరే కావచ్చు! అందుకే ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలి. లెక్కలు, సైన్స్ అంటే భయపడకూడదు. ఆటలు ఆడాలి. అన్నం బాగా తిని బలంగా తయారవ్వాలి. చందమామ మన కోసం చూస్తున్నాడు. వెళ్లి ‘జైహింద్’ చెప్పొద్దూ? -
అతిగా వ్యాయామాలు చేయడం ఇంత ప్రమాదమా..! ? పాపం ఆ తల్లి..
వ్యాయామాలు కూడా ఎలా పడితే అలా చేసేయకూడదు అనే చెప్పే ఘటన ఇది. బరువు తగ్గడం కోసం లేదా ఫిట్నెస్ గురించి అయినా..నిపుణులు సలహాలు సూచనలతో చేయడమే మేలు. ఎందుకంటే అతి వేగవంతంగా చేసే వ్యాయామాలు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయి కూడా. అందుకు ఈ అనూహ్య ఘటనే ఉదాహరణ.ఇది నాగ్పూర్లోని ఒక జిమ్లో చోటు చేసుకుంది. 23 ఏళ్ల ఓం భోయార్ జిమ్లో నాలుగు గంటల పాటు వ్యాయామం చేశాడు. అక్కడ డెడ్లిఫ్ట్ చేయడానికి తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఒక రీల్ను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి రాగానే క్షణాల్లో కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. వృత్తిరీత్యా నర్సు అయిన అతడి తల్లి ఆర్తి భోయార్ గోల్డెన్ అవర్గా చెప్పే తొలి 3-4 గంటల సమయం అవసరమయ్యే వైద్య పరిస్థితిని వృధా కానివ్వకుండా హుటాహుటినా ఆస్ప్రతికి తీసుకువెళ్లింది. అక్కడ వైద్యులు రోగ నిర్థారణ పరీక్షలలో అతని మెదడులో రక్తం గడ్డకట్టినట్లు కనుగొన్నారు. దానిని మెకానికల్ థ్రాంబెక్టమీ విధానం ద్వారా తొలగించారు. తత్ఫలితంగా దీనివల్ల అతని మెదడుకు రక్త ప్రసరణ సజావుగా జరిగి, త్వరితగతిన కోలుకోవడానికి సహాయపడింది. ఈ ఘటనలో అతని తల్లి సకాలంలో స్పందించడం వల్లే ఓం భోయార్ ఆరోగ్యం వేగంగా మెరుగుపడింది. అంతేగాదు ఆరోగ్య నిపుణులు శారీరక సామర్థ్యానికి మించి మితిమీరి వ్యాయామాలు చేసేవాళ్లందరకీ ఇదొక హెచ్చరికని అని చెబుతున్నారు. ఇక్కడ హెమరేజిక్ స్ట్రోక్లో, మెదడులోని రక్తనాళం చిట్లి, రక్తం చుట్టుపక్కల కణజాలంలోకి లీక్ అవుతుంది. ఇది మెదడులోని సంబంధిత భాగాలకు, వాటికి అనుసంధానించబడిన శరీర భాగాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచుఉంది. దాంతో శరీర భాగాలు పక్షవాతానికి గురవుతాయని చెబుతున్నారు వైద్యులు. సకాలంలో శస్త్ర చికిత్స అందించి మెదడులో పేరుకుపోయిన రక్తాన్ని తొలగించి, పక్షవాతం ప్రభావాలను తగ్గించి, కోలుకునే అవకాశాలను పెంచవచ్చు.(చదవండి: సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..టెన్త్లో టాపర్గా!) -
సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..టెన్త్లో టాపర్గా!
కొందరు ఎలాంటి శారీరక లోపం లేకుండా, సమస్త సౌకర్యాలు ఉండి విద్యలో పెద్దగా రాణించలేక చతికిలపడుతుంటారు. ట్యూషన్లని, స్పెషల్ క్లాస్లని చెప్పించినా.. కొందరికి వచ్చే మార్కులు అంతంత మాత్రమే. కానీ ఈ కుర్రాడు. సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ..మొత్తం శరీరం తనకు సహకరించే పరిస్థితి లేకున్నా కూడా పదోతరగతి పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి అందర్నీ విస్తుపోయేలా చేశాడు. పైగా తనకు ఈ పరిస్థితి లేకుంటే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాడిని అని చెబుతుండటం విశేషం. ఆ విద్యార్థే జార్ఖండ్లోని గొడ్డాకు చెందిన ఫైజాన్. తీవ్రమైన సెరిబ్రల్ పాల్సీ ఉన్నప్పటికీ, 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 93.8 శాతం మార్కులు సాధించి, దివ్యాంగుల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. శరీర కదలికల సవాళ్లను అధిగమించి, నోటితో పెన్ను పట్టుకుని రాసి ఇన్ని మార్కులు తెచ్చుకోవడం విశేషం. తన అనారోగ్య పరిస్థితి వల్లే ఇంతకు మించి సాధించలేకపోయానని, లేదంటే ఇంకా ఎక్కువ మార్కులే వచ్చేవని అంటున్నాడు. అంతేగాదు ఫైజాన్ చేతితో రాసే విధానానికి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఫైజాన్ గురించి వివరించారు. ఇక ఫైజాన్ తాను కొన్ని పరీక్షల్లో బొమ్మలు గీయలేకపోయానని, ముఖ్యంగా రేఖచిత్రాలు నోటితో స్పష్టంగా గీయడంలో కాస్త తడబడ్డట్లు వెల్లడించాడు. కాగా, జార్ఖండ్ అకాడమిక్ కౌన్సిల్ (JAC) గురువారం 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పరీక్ష ఫలితాలను ప్రకటించింది, మొత్తం ఉత్తీర్ణత శాతం 95.27గా నమోదైంది.సెరిబ్రల్ పాల్సీ అంటే..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్స్ ప్రకారం, సెరిబ్రల్ పాల్సీ అనేది శిశువుగా ఉన్నప్పుడు లేదా చిన్నతనంలోనే కనిపించే ఒక మెదడు రుగ్మత. ఇది శరీర కదలికలు, కండరాల సమన్వయంపై శాశ్వతంగా ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి కదలికలను నియంత్రించే, శరీర భంగిమ సమతుల్యతను కాపాడే మెదడు సామర్థ్యానికి అంతరాయం కలిగిస్తుంది.VIDEO | Jharkhand boy overcomes cerebral palsy to top Jharkhand Class 10 boards. Holding a pen in his mouth, Faizan has overcome challenges that many regular physically able students would find difficult.He has topped the Class 10 board examinations in Jharkhand under the… pic.twitter.com/WXrfElGdCL— Press Trust of India (@PTI_News) April 24, 2026 (చదవండి: చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!) -
రేస్ స్టార్
వైట్ అండ్ వైట్ సూట్, కళ్ళకి నల్ల కళ్ళజోడు... గంభీరమైన చూపు... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బూత్ దగ్గర కనిపించిన అజిత్.. ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నా, ఉదయం అందరికంటే ముందు వచ్చి ఓటు వేసిన అజిత్ గురించే తమిళనాడు మొత్తం ఈరోజు మాట్లాడింది. అజిత్ ను చూస్తే ఎంజిఆర్ను చూసినట్లే ఉందంటూ సామాన్య ప్రజలు మాట్లాడుకున్నారు.సినిమాల్లోనే కాదు సినీ ప్రపంచానికి ఆవల కూడా అజిత్ జీవితం ఆసక్తికరం. ఒకసారి ఫోటోగ్రఫీ, మరోసారి డ్రోన్ టెక్నాలజీ, ఇప్పుడు కార్ రేసింగ్... సినిమాకు అవతల ఎన్నో....కార్ రేసింగ్... ఒక హీరోని తలచుకోగానే అతను నటించిన సినిమా సన్నివేశాలో, డైలాగులో డ్యాన్సులో...గుర్తుకొస్తాయి. కానీ తమిళ స్టార్ హీరో అజిత్ గుర్తొస్తే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ నుంచి ఆయన కార్ రేసింగ్ హాబీ దాకా మరెన్నో గుర్తొస్తాయి. తెరపై టాప్ హీరోల్లో ఆయన ఒకరు కానీ తెరవెనుక మాత్రం ఆయన ఒక్కరే. ఆయన గత సెప్టెంబర్లో ‘54 ఏళ్ల అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో తన జట్టును కూడా ప్రారంభించారు. ఇటీవల బెల్జియంలో జరిగిన ఒక ప్రధాన కార్ రేసింగ్ ఈవెంట్లో అజిత్ జట్టు రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలా యూరప్లో విజయవంతమైన కార్ రేసింగ్ ప్రదర్శన తర్వాత తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడం కోసం చెన్నైకి తిరిగి వచ్చారు.సాల్ట్ అండ్ పెప్పర్... సాదా సీదాగా కనిపించే హీరోల్లో అజిత్ ముందున్నా ఆయన స్టైల్స్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతూనే ఉంటాయి. చెన్నై విమానాశ్రయంలో అజిత్ తన ట్రేడ్మార్క్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో సాధారణ దుస్తులలో రిలాక్స్డ్గా, నిరాడంబరంగా కనిపించినప్పటికీ.. ఆయన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అనేక మంది ఆయన లుక్ను ‘క్లాసీ లుక్’ అని ‘అప్రయత్నంగా స్టైలిష్’ అని అభివర్ణించారు. నిజానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలకు అనుసరణీయంగా మారిన ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ పరిచయం చేసింది ఆయనే. ఆ మాట కొస్తే... ఆయన లుక్లో మాత్రమే కాదు ఆయన జీవితంలో కూడా వెలుగు నీడలు చాలానే ఉన్నాయి. ఆ విషయాలు ఆయనే పలు మార్లు పంచుకున్నారు కూడా.కొన్ని పరిణామాల నేపథ్యంలో ఇటీవలే అజిత్ దుబాయ్లో నివసించాలని నిర్ణయించుకున్నారు. ‘‘ప్రధానంగా మోటార్ స్పోర్ట్స్ కోసమే ఈ నిర్ణయం. ఎందుకంటే ప్రధాన సర్క్యూట్లు అన్నీ ఇక్కడే జరుగుతాయి’’ అని ఆయన చెప్పారు. గత 2025లో ‘విడాముయార్చి’ ’గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు విడుదలైన తర్వాత, అజిత్ తన దృష్టిని మరింత ఎక్కువగా రేసింగ్ వైపు మళ్లించారు.స్వంతంగా వంట... తన పనులన్నీ తానే స్వయంగా చూసుకోవాలనే తన నిర్ణయం గురించి మాట్లాడుతూ ‘నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నాకు అడ్వాన్స్ డ్గా ఆలోచించే అద్భుతమైన తల్లిదండ్రులు ఉన్నారు, మా పనులు స్వయంగా చేసుకునేలా మమ్మల్ని పెంచారు. మాకు చిన్న వయసులోనే వంట నేర్పించారు’ అని అజిత్ అంటారు.– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
రూ. 130 కోట్ల మాజీ క్రికెటర్ లగ్జరీ బంగ్లా : అదుర్స్
సాక్షి, న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, 'నజఫ్గఢ్ నవాబ్' నివాసముండే బంగ్లా 'కృష్ణ నివాస్' విశేషాలు నెట్టింట సందడిగా మారాయి. న్యూఢిల్లీలోని విలాసవంత మైన ప్రాంతమైన హౌజ్ ఖాస్(Hauz Khas) లో 'కృష్ణ నివాస్' అనే విశాలమైన బంగ్లాలో నివసిస్తోంది సెహ్వాగ్ కుటుంబం. ఢిల్లీ లాంటి నగరంలో ఇంత పెద్ద పచ్చని తోట ఉండటం చాలా అరుదు. అద్భుతమైన ఇంటీరియర్తో అందంగా తీర్చిదిద్దిన ఆయన నివాసానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.సెహ్వాగ్ తన తల్లి పేరు మీద ఈ బంగళాకు 'కృష్ణ నివాస్' అని పేరు పెట్టారు. బంగ్లా విలువ సుమారు రూ. 130 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో 12 విలాసవంతమైన గదులు, ఒక పెద్ద తోట, అలాగే ఆయన తన కుటుంబంతో సమయం గడిపే ఒక పార్క్ ఉన్నాయి. ఉండే ఈ ఇంటిలో జంతువుల కోసం ప్రత్యేకంగా లాన్ నిర్మించడం విశేషం.ఇంటి ప్రత్యేకతలు:లివింగ్ రూమ్ : అతిథులు లోపలికి రాగానే పెద్దదైన, అద్భుతంగా అలంకరించబడిన లివింగ్ రూమ్ కనిపిస్తుంది. సెహ్వాగ్ తరచుగా తన ఇన్స్టాగ్రామ్లో ఇక్కడి ఫోటోలను షేర్ చేస్తుంటారు.విజిటర్స్ రూమ్: ఈ భవనంలో ప్రత్యేకంగా విజిటర్స్ బుక్ ఉంటుంది. సెహ్వాగ్ ఇంట్లో ఉన్నప్పుడు వంటవారు, ఫిట్నెస్ ట్రైనర్లు, అర్చకులు మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు, జర్నలిస్టులు కూడా వస్తుంటారు.8 మాస్టర్ బెడ్రూమ్లు: ఈ ఇంట్లో 8 విశాలమైన మాస్టర్ బెడ్రూమ్లు ఉన్నాయి, వీటిలో ప్రతి గదికి ప్రత్యేకమైన జాకూజీ (Jacuzzi విశ్రాంతికోసం, హైడ్రోథెరపీ కోసం మసాజ్, బబుల్ బాత్, నీటిలో మునిగి ఉండే పవర్డ్ జెట్ల వ్యవస్థతో కూడిన పెద్ద స్నానపు తొట్టి లేదా పూల్) సదుపాయం ఉంది. సెహ్వాగ్ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తారు. దీపావళి వంటి పండుగలను జరుపుకోవడానికి ఇంట్లో అందమైన పూజ గది ఉంది.స్పెషల్ ఎట్రాక్షన్స్ ఏంటంటే..సెహ్వాగ్ సాధించిన విజయాలకు గుర్తుగా ఒక ప్రత్యేకమైన ట్రోఫీ గది ఉంది. ఇందులో ఆయన ఉపయోగించిన బ్యాట్లు, మెడల్స్, జ్ఞాపికలు మరియు బంగారు పూత పూసిన షీల్డ్లు ఉన్నాయి. ఇక్కడ సెహ్వాగ్ తన కుమారులతో క్రికెట్ ఆడటం, యోగా, బ్యాడ్మింటన్ ఆడటం వంటివి చేస్తారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఏంతో ప్రేమగా నిర్మించుకున్న భవనం కేవలం విలాసానికి చిహ్నం మాత్రమే కాదు, సెహ్వాగ్ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనం. తల్లి పేరు మీద ఇంటికి పేరు పెట్టడం నుండి, మదర్స్ డే వంటి వేడుకలను ఇక్కడే జరుపుకోవడం వరకు ఈ ఇల్లు సెహ్వాగ్ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ప్రశాంతంగా సమయం గడపడానికి ఈ విశాలమైన ప్రాంగణం చక్కటి వేదిక అనడంలో సందేహం లేదుకాగా 2004లో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ సెహ్వాగ్ ఉన్నారు. 2007లో ఆర్యవీర్ సెహ్వాగ్, 2010లో వేదాంత్ సెహ్వాగ్ పుట్టాడు. అయితే దాదాపు 20 ఏళ్ల తరువాత ఇటీవల భార్యతో అభిప్రాయ భేదాల వల్ల సెహ్వాగ్ విడాకులు తీసుకున్నాడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం అతడు వ్యాఖ్యాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
3 అపార్ట్మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్
సాక్షి, ముంబై: బాలీవుడ్ టాప్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్తులు, విలావంతమైన కార్లు ఇళ్లు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. కానీ ఆయన దగ్గర దీర్ఘకాలం మేనేజర్గా ఉన్న పూజా దద్లానీ-గుర్నానీ (Pooja Dadlani) మాత్రం వార్తల్లో నిలుస్తారు. ముంబైలో ఒక భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టి నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. విషయం ఏమిటంటే.టాప్ సెలబ్రిటీ మేనేజర్స్లో ఒకరు, షారుఖ్ ఖాన్ మేనేజర్ అ పూజా దద్లానీ, తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో మూడు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.38.21 కోట్లు. CRE మ్యాట్రిక్స్కు లభించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ లావాదేవీలొ ఆమె ఒక ఫ్లాట్ను కొనుగోలు చేయగా, ఆమె భర్త హితేష్ గుర్నానీ మ, ఆమె తండ్రి మోహన్ దద్లానీ ఒక్కొక్కటి కొనుగోలు చేశారు. ఈ అపార్ట్మెంట్లు కార్టర్ రోడ్లోని 'వరుణ్' అనే భవనంలో ఉన్నాయి. ఈ భవనాన్ని లోటస్ డెవలపర్స్ సంస్థలో భాగమైన ట్రైక్షా రియల్ ఎస్టేట్ పునరాభివృద్ధి చేస్తోంది. ఇది 2028 డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని అంచనా.ప్రతి అపార్ట్మెంట్కు 1,511 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో పాటు అదనంగా ఒక బాల్కనీ కూడా ఉందని తెలుస్తోంది. దీంతో ఈ మూడు యూనిట్ల మొత్తం వైశాల్యం సుమారు 4,776 చదరపు అడుగులు ఉంటుందని సమాచారం. ఈ ఒప్పందంలో ఆరు పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీలు ఏప్రిల్ 21, 2026న, రూ.2.16 కోట్ల స్టాంప్ డ్యూటీ రూ.90,000 రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించడం విశేషం. పూజా దద్లానీ నికర ఆదాయం2024 నాటి లెక్కల ప్రకారం పూజా దద్లానీ నికర విలువ సుమారు రూ. 45 నుండి 50 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఆమె వార్షిక ఆదాయం రూ. 7 నుండి 9 కోట్లు.పూజా దద్లానీ, 'లిస్టా జ్యువెల్స్' (Lista Jewels) డైరెక్టర్ అయిన హితేష్ గుర్నానీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 'రేనా' అనే కుమార్తె ఉంది. ఈ జంట ముంబైలోని అత్యంత సంపన్న ప్రాంతమైన బాంద్రాలో, కోట్లాది రూపాయల విలువైన ఒక అద్భుతమైన నివాసంలో నివసిస్తున్నారు. ఫిబ్రవరి 2023లో, తన కొత్త ఇంటిని గౌరీ ఖాన్ రూపొందించారని పూజా దద్లానీ వెల్లడించారు. -
ఆరోగ్యకరంగా భావించేవే కేన్సర్కి కారణమా..!
ఇన్నాళ్లు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఆరోగ్యానికి మంచివని చెబుతుండేవారు పోషకాహార నిపుణులు. కానీ ఇప్పుడు అవే ప్రమాదకరమైనవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఊపితిత్తుల కేన్సర్ స్మోకింగ్ చేసేవాళ్లకే వస్తుందనేది జగమెరిగిన సత్యం. కానీ చాలా కేసుల్లో ధూమపానం చేయకుండానే ఈ వ్యాధి బారినపడ్డట్లు తేలింది. అందుకు గల కారణాలు తెలిస్తే విస్తుపోవాల్సిందే.యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం..పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉండే ఆహారాన్నే అధికంగా తీసుకున్న యువకులలోనే ఊపిరితిత్తుల కేన్సర్ అధికమని తేలింది. దీనికి ప్రధాన కారణం సాంప్రదాయ పద్దతలిలో పండించకపోవడమేనని చెబుతున్నారు పరిశోధకులు. ఫెర్టిలైజర్లు ఉపయోగించి పండించిన పండ్లు, కూరగాలు, తృణధాన్యాలు తీసుకువడంతో..వాటిపై పురుగుల మందులు అవశేషాలు ఉండటంతో చిన్న వయసులోనే యువత ఈ కేన్సర్బారిన పడుతున్నట్లు వెలడైంది. ఈ మేరకు అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ 2026 వార్షిక సమావేశంలో 187 మంది రోగుల ఆహార విశ్లేషణ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో సుమారు 50 ఏళ్లలోపు వయసున్న రోగులకు ఊపిరితిత్తుల కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. 'హెల్తీ ఈటింగ్ ఇండెక్స్'ను ఉపయోగించి ఆయా రోగుల్లో పరీక్షించగా, వారందరి సగటు స్కోర్ 65గా ఉందని అన్నారు. సాధారణ అమెరికన్లతో పోలిస్తే ఈ యువ రోగులు ముదురు ఆకుపచ్చ కూరగాయలు, చిక్కుళ్ళు,తృణధాన్యాలను ఎక్కువగా తీసుకున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మహిళల్లో ఈ స్కోర్ మరింత అధికంగా ఉంది. పాల ఉత్పత్తులు, మాంసం, అనేక ప్రాసెస్ చేసిన ఆహారాలతో పోలిస్తే..ఆరోగ్యకరమైనవిగా పిలిచే ఈ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలలోని పురుగుల మందుల అవశేషాల వల్లే ఈ కేన్సర్ వచ్చే ప్రమాదం అధికం అని తేలింది. అంతేగాదు ఈ పురుగలమందుల ప్రభావానికి గురైన రైతుల్లో సైతం ఊపిరితిత్తల కేన్సర్ వచ్చే అవకాశం అత్యంత అధికంగా ఉందని డాక్టర్ జార్జ్ నీవా పేర్కొన్నారు. అలాగే చాలామటుకు ఊపిరితిత్తుల కేన్సర్ కేసుల్లో స్మోకింగ్ కారణం కాదని చెప్పారు. పైగా 50 ఏళ్లలోపు ధూమపానం చేయని వారిలో, ముఖ్యంగా మహిళల్లో ఈ కేన్సర్ సర్వసాధరంగా మారిందని అన్నారు. అంతేగాదు ఆయా రోగులు ఈ వ్యాధి నిర్థారణకు మందు వరకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నవారేనని చెప్పుకొచ్చారు. ఇదెంత వరకు నిజం అన్న దిశగా దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు శాస్త్రవేత్తలు. కానీ ఈ పరిశోధన ఫెస్టిసైడ్స్ వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని హైలెట్ చేసింది కదూ..!.(చదవండి: వ్యాయామం లేకుండానే 12 కిలోలు..! డాక్టర్ వెల్నెస్ మంత్ర) -
జంతువుల నుంచి మనుషులకు ఏటా 5 కొత్త వ్యాధులు..!
సృష్టిలో ప్రతి జీవరాశి తన మనుగడను కొనసాగించడానికి శక్తి అత్యవసరం. ఈ శక్తి ప్రధానంగా ఆహారం ద్వారానే లభిస్తుంది. ముఖ్యంగా మానవాళికి అవసరమైన పోషకాలు పంటలు, పశుసంపద ద్వారా లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. పశువైద్యులు కేవలం జంతువులకు చికిత్స చేసే వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. ‘పశు వైద్యులు– ఆహార ఆరోగ్య సంరక్షకులు’ అనే థీమ్తో ఈ సంవత్సరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకోవటం అత్యంత సముచితం.పశు సంపద ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పోషక అవసరాల నేపథ్యంలో పశు వైద్య రంగం ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. మన పూర్వీకులు పశువులను, ప్రకృతిని సమానంగా గౌరవించి, పర్యావరణహితమైన విధానాలతో వ్యవసాయం, జీవన విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ సమతుల్య జీవన విధానాన్ని మళ్లీ ఆచరిస్తే, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన జీవితం అందించవచ్చు.ఆరోగ్యంపై సమగ్ర దృక్పథంపశువైద్యం కేవలం జంతువుల వైద్యంతో పరిమితం కాకుండా.. మనుషుల ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం వేర్వేరు కాదు అంతా ఒక్కటే (వన్ హెల్త్) అనే సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది. ఈ మూడూ పరస్పరం అనుసంధానమైనవి. పశువైద్యులు పశువుల ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడటమే కాకుండా పరోక్షంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంగా ఉపయోగించే పశువులకు చికిత్స ఇచ్చేటప్పుడు మందుల అవశేషాలు పాలు, మాంసం, గుడ్లు వంటి ఆహార పదార్థాలలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకం.సంక్రమిత వ్యాధుల నియంత్రణపశువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఉదాహరణకు: రేబీస్, బ్రూసెల్లోసిస్, టీవీ వంటివి. ప్రస్తుతం గుర్తించిన సంక్రమిత వ్యాధులలో సుమారు 60% జంతువుల ద్వారా వ్యాపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కనీసం 5 కొత్త వ్యాధులు జంతువుల నుండి మనుషులకు వస్తున్నాయని అంచనా. అరణ్య ప్రాంతాలలో మానవ జోక్యం పెరగటం ఈ వ్యాధుల వ్యాప్తికి ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో పశువైద్యులు ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ప్రపంచ ఆరోగ్యానికి అత్యంత పెద్ద సవాళ్లలో ఒకటి. అనవసరంగా, అధికంగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. ఆహారంలో అవశేషాలు చేరి ప్రజారోగ్యానికి హాని కలుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి పశువైద్యులు బాధ్యతాయుతమైన ఔషధ వినియోగాన్ని ప్రోత్సహించాలి. పశుసంపద సుస్థిర ఆహార భద్రతలో కీలకపాత్ర పోషిస్తోంది. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అంచనాలప్రకారం, ప్రపంచానికి అవసరమైన ప్రోటీన్లో సుమారు 30–40% జంతువుల నుంచి లభిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం సుమారు 20% ఆహారం పశువ్యాధుల వల్ల కోల్పోతున్నాం. పశువుల విసర్జితాల పునర్వినియోగం ద్వారా సేంద్రియ వ్యవసాయం, గోఆధారిత వ్యవసాయం వర్థిల్లుతుంది. తద్వారా పర్యావరణం, పశువులు, మనుషుల మధ్య సమన్వయంతో ఆహార గొలుసును కాపాడుకోవచ్చు.14.5% వరకు పశువుల ఉద్గారాలుప్రస్తుతం పశువైద్య రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు వాతావరణ మార్పు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 14.5% హరిత గృహ ఉద్గార వాయువులు పశుసంపద నుంచి వెలువడుతున్నాయని అంచనా. దీర్ఘకాలిక సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1 డిగ్రీల సెల్షియస్ పెరిగితే 10–15% వరకు పశువుల పెరుగుదల, వ్యవసాయోత్పత్తి తగ్గుతుంది. అయితే, పశుసంపద మనకు ముఖ్యమైన ప్రోటీన్ వనరుగా కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో పశువైద్యులు మీథేన్ ఉద్గారాలను తగ్గించే పద్ధతులు, సుస్థిర పశుసంవర్ధన విధానాలు, కార్బన్ క్రెడిట్ అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు అదనపు ఆదాయం కల్పించే విధంగా కార్బన్ మార్కెట్లో భాగస్వామ్యం కల్పించడం కూడా ఒక ముఖ్య లక్ష్యం.మీథేన్ ఉద్గారాలుప్రపంచంలో అత్యధిక పశుసంపద కలిగిన దేశం మనదే. ఎఫ్ఏఓ, ఐసీఏఆర్ అంచనాల ప్రకారం భారతదేశంలో మొత్తం హరిత గృహ వాయువు ఉద్గారాల్లో సుమారు 14–16% వ్యవసాయం నుంచి వెలువడుతుంటే, అందులో పశుసంపద ఉద్గారాల వాటా 55–60%. పాల ఉత్పత్తిలో దేశంలోనే ముఖ్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో వ్యవసాయ ఉద్గారాల్లో పశుసంపద వాటా 30–35%గా ఉంది. ముఖ్యంగా డెయిరీ రంగంలో గేదెల ద్వారా ఎక్కువ మీథేన్ వెలువడుతోందని అంచనా. నెమరు వేసేటప్పుడు జీర్ణప్రక్రియ వల్ల వెలువడే మీథేన్ పశు ఉద్గారాల్లో 85%ను ఆక్రమిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే వ్యవసాయ ఉద్గారాలలో పశుసంపద ఉద్గారాల వాటా 25–30%. తెలంగాణలో గొర్రెలు, మేకల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఉద్గారాల తీరు భిన్నంగాఉంటుంది. తెలంగాణ ఎస్ఏపీసీసీ చెబుతున్న దాని ప్రకారం మీథేన్ ఉద్గారాలు పశువుల నుండే ఎక్కువ వెలువడుతున్నాయి.ముఖ్యమైన విశేషాలుప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన దేశంలో పశుసంపద ఎక్కువ. కానీ తక్కువ. కానీ, ముఖ్యంగా ఒక్కో పశువు తలసరి ఉత్పాదకత తక్కువ. ప్రపంచంలోని గేదెల సంఖ్యలో 50% మన దేశంలోనే ఉంది. ఈ కారణంగా మొత్తం ఉద్గారాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి క్రమంలో వెలువడే ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది. పశువైద్యులు కేవలం జంతువుల వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు. పర్యావరణ సమతుల్యతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వన్ హెల్త్ దృక్పథంతో పశువైద్యులు సమగ్ర సుస్థిర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పశు వైద్యులు– ఆహార, ఆరోగ్య సంరక్షకులు’ అనటంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు. – డా. మల్లంపల్లి సాయిబుచ్చారావు (99122 92229), అసిస్టెంట్ డైరెక్టర్(ఏహెచ్), ఏరియా వెటర్నరీ ఆసుపత్రి, జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా. saii@doctor.com(చదవండి: World Banana Day: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!) -
వ్యాయామం లేకుండానే 12 కిలోలు..! డాక్టర్ వెల్నెస్ మంత్ర
బరువు తగ్గడంలో పలువురు పలు విధానాలతో తగ్గించుకునే యత్నం చేస్తూ..ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఎన్నో వెల్నెస్ మంత్రాలు పుట్టుకొస్తున్నాయి. అలా కాంకుండా వైద్యం అందించే ఓ డాక్టరే వ్యాయామం లేకుండా 12 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. సర్వసాధారణంగా డాక్టర్లు ఎంతకాదన్న చిన్నపాటి వర్కౌట్లు లేదా వాకింగ్ అన్న చేస్తుంటారు. కానీ ఈ డాక్టర్ కేలరీల బేరీజు, వ్యాయమాలతో పనిలేకుండా ఆరోగ్యకరమైన రీతీలో ఎలా తగ్గారో తెలిపారు. అంతేగాదు అందుకోసం ఎలాంటి ఫిట్నెస్ రూల్ పాటిస్తే మంచిదో కూడా సవివరంగా వివరించారు. బరువు తగ్గడానికి సంబంధించి..డైటింగ్ నుంచి వర్కౌట్ల వరకు పలు టిప్స్ ట్రెండ్ అవుతున్న తరుణంలో పూణెకు చెందిన డాక్టర్ మల్హర్ గన్లా అద్భుతమైన వెల్నెస్ మంత్ర గురించి తెలిపారు. తాను ఆ రూల్ని పాటించి ఎలా 12 కిలోలు తగ్గారో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఆయన తన వెయిట్లాస్ జర్నీని రక్తపరీక్షతో ప్రారంభించినట్లు తెలిపారు. తనకు ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే తనకు B12, డీ3 చాలా తక్కువగా ఉన్నాయనేది గుర్తించారు. తనకు అధికంగా ఆకలిగా ఎందుకో అనిపిస్తోంది అర్థం చేసుకోవడానికి ఈ బ్లెడ్ టెస్ట్ ఉపయోగింపడిందని చెప్పారు. ఆ వైద్యుడి మార్గదర్శకత్వంలో పోషకాహార లోపాలను సరిదిద్దుకోవడానికి సప్లిమెంట్లు, స్మూతీలు, సలాడ్లతో డైట్ని ప్రారంభించినట్లు తెలిపారు. వెయిట్లాస్ ప్లాన్..జంక్ ఫుడ్ నియంత్రణ)ఆయన పోషకాలు మెరుగుపడటం మొదలయ్యాక, ఆయన క్రమంగా ఉప్పు, చక్కెర,నూనెను మానేసినట్లు తెలిపారు. అయితే వీటన్నింటిని రాత్రికి రాత్రే మానేయలేదని, నెమ్మది నెమ్మదిగా దూరం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాదు బయటి భోజనంపై ఇష్టం పోవడానికి తనకు సుమారు ఒక నెల సమయం పట్టిందని కూడా అన్నారు.కార్బోహైడ్రేట్లను తగ్గించడంతర్వాత కార్బోహైడ్రేట్లను తగ్గించడం మొదలుపెట్టారు. ఆయన కార్బోహైడ్రేట్లను రోజుకు ఒక పూటకు (రాత్రి భోజనానికి) మాత్రమే పరిమితం చేశారు.అల్పాహారం: ప్రోటీన్ ఆధారితం (గుడ్ల వంటివి)మధ్యాహ్న భోజనం: పప్పు, కూర, సలాడ్ (రోటీ లేదా అన్నం వద్దు)తాను పాటించిన డైటింగ్ విధానాన్ని "23-1" రూల్గా పిలిచారు. ఈ విధానంలో శరీరం కొలెస్ట్రాల్పై ఆధారపడి పనిచేస్తుందట, అలాగే ఒక గంటపాటు కార్బోహైడ్రేట్లను తీసుకుంటుందని అన్నారు. ఆ తర్వాత తాను తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లు తెలిపారు. అది కూడా స్వేచ్ఛయుతం, ఆరోగ్యప్రదంగా చేసినట్లు తెలిపారు. శరీరాన్ని కష్టపెట్టలా కాకుండా పండ్లు, ద్రవపదార్థాలపై ఆధారపడుతూ చేసినట్లు పేర్కొన్నారు. ఇది ఆయనకు మరింత బరువు తగ్గడానికి ఉపయోగపడిందన్నారు. కాలక్రమేణ తన ఆకలిలో పెద్ద మార్పును గమనించారు. దెబ్బకు తన నడుము చుట్టుకొలత సుమారు 29 అంగుళాలకు తగ్గిందని అన్నారు. ఇది సామాన్యులు సైతం సులభంగా అనుసరించగలిగేదని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వేడివేడిగా వడ్డించాలని ఎంత పనిచేశావ్ అమ్మ..!) -
హిమాలయంలాంటి అచంచలమైన పర్సనాలిటీ
మనం ఇప్పటివరకు నేర్చుకున్నవన్నీ ఒక ఎత్తు, వాటన్నిటినీ కష్టకాలంలో నిలబెట్టే 'Mental Toughness' (మానసిక దృఢత్వం) ఇంకొక ఎత్తు. బయట ఎన్ని తుఫానులు వచ్చినా, లోపల హిమాలయంలా నిశ్చలంగా ఉండే అచంచలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడమే ఈ చాప్టర్ ఉద్దేశ్యం.చాలామంది జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు చాలా గొప్పగా కనిపిస్తారు. కానీ ఒక్క చిన్న దెబ్బ తగిలినా లేదా అనుకోని అపజయం ఎదురైనా కుప్పకూలిపోతారు. బ్రో, నిజమైన పర్సనాలిటీ అంటే సంతోషంలో నవ్వడం కాదు, సంక్షోభంలో (Crisis) నిలబడటం. మెంటల్ టఫ్ నెస్ అంటే భావాలు లేకపోవడం కాదు, భావాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా గట్టున నిలబడే ధైర్యం ఉండటం.మీ చేతుల్లో ఏముంది? (Locus of Control)మానసిక దృఢత్వం ఉన్న వ్యక్తికి ఒక స్పష్టత ఉంటుంది.Circle of Influence:నా ప్రయత్నం, నా ఆలోచనలు, నా ప్రతిస్పందన—ఇవి నా చేతుల్లో ఉన్నాయి. వీటి మీద నేను 100% దృష్టి పెడతాను.Circle of Concern: ఇతరుల విమర్శలు, గతం, ఆర్థిక మాంద్యం, వాతావరణం—ఇవి నా చేతుల్లో లేవు. వీటి గురించి నేను చింతించను. మీరు ఎప్పుడైతే మీ కంట్రోల్లో లేని వాటిని వదిలేస్తారో, అప్పుడే మీ మెంటల్ పవర్ రెట్టింపు అవుతుంది.4C మోడల్: దృఢత్వానికి నాలుగు స్తంభాలుసైకాలజీలో మెంటల్ టఫ్ నెస్ ని నాలుగు భాగాలుగా వివరిస్తారు:1. Control (నియంత్రణ): కష్టాల్లో కూడా నా జీవితం నా చేతుల్లోనే ఉందనే నమ్మకం.2. Commitment (అంకితభావం):ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యాన్ని వదిలిపెట్టకపోవడం.3. Challenge (సవాలు):మార్పును భయంలా కాకుండా, ఒక అవకాశంగా (Opportunity) చూడటం.4. Confidence (నమ్మకం):నా సామర్థ్యం మీద నాకు తిరుగులేని నమ్మకం ఉండటం.అసౌకర్యాన్ని ప్రేమించండి (Embrace Discomfort)మనం ఎప్పుడూ 'కంఫర్ట్ జోన్' లో ఉండాలని కోరుకుంటాం. కానీ కండరాలు పెరగాలంటే జిమ్ లో బరువులు ఎత్తాలి, మనసు దృఢపడాలంటే కష్టాలను ఎదుర్కోవాలి.మెంటల్ టఫ్ నెస్ ఉన్నవాడు కష్టాన్ని చూసి పారిపోడు. "ఇది నన్ను ఇంకా బలవంతుడిని చేస్తుంది" అని నమ్ముతాడు.ప్రతిరోజూ మీకు నచ్చని, కానీ అవసరమైన ఒక పనిని చేయడం వల్ల మీ'Will Power'పెరుగుతుంది.నెగటివ్ సెల్ఫ్-టాక్ ని జయించడంమనలో మనమే మాట్లాడుకునే మాటలు మనల్ని బలహీనపరుస్తాయి. "నేను ఇది చేయలేను", "నాకు అదృష్టం లేదు" వంటి మాటలు మీ మనసుకి మీరు ఇచ్చుకునే విషం. ఒక యోధుడిలా ఆలోచించండి. విమర్శలను ఫీడ్బ్యాక్గా (Chapter 34), ఓటమిని ఒక పాఠంగా మార్చుకోండి.మీ మనసు మిమ్మల్ని ఆపేయాలని చూసినప్పుడు, "ఇంకొక్క అడుగు ముందుకు వేయి" అని దానికి ఆర్డర్ వేయండి.భావోద్వేగాల క్రమబద్ధీకరణ (Emotional Regulation)మానసిక దృఢత్వం అంటే ఏడవకపోవడం కాదు. బాధ కలిగినప్పుడు బాధపడండి, కానీ ఆ బాధలోనే ఉండిపోకండి. గొడవలు జరిగినప్పుడు లేదా ఒత్తిడి పెరిగినప్పుడువెంటనే రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉండటం నేర్చుకోండి. మీ ప్రశాంతతను ఎవరికీ ఇచ్చేయకండి. మీరు ఎంత నిశ్చలంగా ఉంటే, అంత బలంగా కనిపిస్తారు.The Takeawayబ్రో, హిమాలయం ఎందుకు అంత గొప్పది అంటే—ఎండ వచ్చినా, వాన వచ్చినా, మంచు కురిసినా అది అక్కడే నిశ్చలంగా ఉంటుంది. నీ వ్యక్తిత్వం కూడా అలానే ఉండాలి. పరిస్థితులు నిన్ను మార్చకూడదు, నీ వ్యక్తిత్వమే పరిస్థితులను మార్చాలి. ఈ మెంటల్ టఫ్ నెస్ నీకు కేవలం విజయాన్ని మాత్రమే కాదు, నీ మీద నీకు తిరుగులేని గౌరవాన్ని (Self-Respect) ఇస్తుంది.నీ నిరంతర వికాసంలో (Phase 5) ఈ 'దృఢత్వం' నీకు రక్షణ కవచంలా నిలుస్తుంది.గుర్తుంచుకో.."నువ్వు ఎంత వేగంగా పరిగెడుతున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎన్ని దెబ్బలు తగిలినా నువ్వు ఇంకా నిలబడే ఉన్నావా లేదా అన్నదే ముఖ్యం. నిలబడు.. ఒక హిమాలయంలా!"Mind-Work ఈరోజు మీకు అస్సలు ఇష్టం లేని, కానీ మీరు చేయాల్సిన ఒక పనిని (ఉదా: వ్యాయామం లేదా క్లిష్టమైన ప్రాజెక్ట్) ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయండి.ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే బాధపడకుండా, "ఈ సిట్యువేషన్ లో నా కంట్రోల్ లో ఉన్న విషయాలు ఏంటి?" అని ఒక లిస్ట్ రాయండి.రాత్రి పడుకునే ముందు, ఈరోజు మీరు ఎంత దృఢంగా ఉన్నారో 1 నుండి 10 వరకు రేటింగ్ ఇచ్చుకోండి. రేపు ఆ రేటింగ్ ని పెంచడానికి ప్రయత్నించండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com (చదవండి: నిరంతరం నేర్చుకునే తత్వం..!) -
అక్షరాలా ఆమె కోసం...
పుస్తకాల రూపంలోని మహిళల క్రియేటివిటీని సెలబ్రేట్ చేసే పండగ, ప్రతిష్ఠాత్మకమైన... విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. సాహిత్య ప్రపంచంలో లింగ వివక్షకు అడ్డుకట్ట వేసి, రచయిత్రులకు తగిన ప్రాతినిధ్యం కల్పించి, ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏర్పాటైన అపురూపమైన బహుమతి... విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్. ఈ సంవత్సరం విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ లాంగ్లిస్ట్కు ఎంపికైన పదహారు పుస్తకాలలో కొన్ని పుస్తకాల పరిచయం...గోడలు కూలుతున్నాయి...జీవితాలు మారుతున్నాయిషీనా కలయిల్ రాసిన హృదయాన్ని కదిలించే నవల... ది అదర్స్. అది 1989 సంవత్సరం. తూర్పు జర్మనీలోని డాయిష్ డెమోక్రటిక్ రిపబ్లిక్లో విభిన్న నేపథ్యాలు ఉన్న ముగ్గురు యువతీ యువకులు స్నేహితులవుతారు. మొజాంబిక్కు చెందిన ఆర్మాండో ఫ్యాక్టరీ కార్మికుడు. లోలిత భారతదేశానికి చెందిన వైద్యవిద్యార్థిని. థియో తూర్పు బెర్లిన్కు చెందిన యువకుడు. రచయిత కావాలని కలలు కంటుంటాడు. తూర్పు ఐరోపా అంతటా నిశ్శబ్ద విప్లవం వ్యాపిస్తుండగా ఈ ముగ్గురి జీవితాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలే... ది అదర్స్.కాసింత ప్రేమ కోసం...పందొమ్మిదేళ్ల గ్లోరియా కాలేజీకి వెళ్లదు. మరి ఏం చేస్తుంది? పార్కుల చుట్టూ తిరుగుతుంది. స్నేహితుల కోసం వెదుకుతుంది. రోజూ జాక్ ఇంటికి వెళుతుంటుంది. ఈ జాక్ ఉన్నట్టుండి అనూహ్యంగా ప్రవర్తిస్తాడు. లోకం మీద కోపంతో రగిలిపోతుంటాడు. ఒక హింసాత్మక సంఘటన తరువాత గ్లోరియా, జాక్ల స్నేహం ముగిసిపోతుంది. గ్లోరియా ఒంటరిదైపోతుంది. ఈ హింసాత్మక ప్రపంచంలో అనుబంధాలు, కాసింత ప్రేమ కోసం ఆరాటపడే ఒక మహిళ అంతరంగాన్ని లోతుగా చిత్రించే నవల... గ్లోరియా డోంట్స్పీక్. ‘లూసీ యాప్స్ రాసిన గ్లోరియా డోంట్ స్పీక్ ఒక అద్భుతమైన పుస్తకం. హింస, దోపిడి, స్వీయనిర్ణయాధికారం... మొదలైన అంశాలతో రాసిన శక్తిమంతమైన పుస్తకం’ అన్నారు విమర్శకులు.చరిత్రపై ఫ్లాష్లైట్యుద్దం తరువాత జపాన్ పరిస్థితి, అమెరికాలోని శివారు ప్రాంతాలు, ఉత్తర కొరియా పాలన... ఇలా 20వ శతాబ్దపు పరిణామాలకు సాక్షిగా నిలిచిన ఒక కుటుంబంపై రాసిన పుస్తకం... ఫ్లాష్లైట్. కొరియా నుండి అమెరికాకు వలస వచ్చి అమెరికన్ విశ్వవిద్యాలయంలో పనిచేసే సెర్క్, అతడి పదేళ్ల కూతురు లూయిసా, సెర్క్ భార్య ఈ పుస్తకంలోని ప్రధాన పాత్రలు. లూయిసా తండ్రి అదృశ్యం కావడం ఆ చిన్న కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. సుసాన్ చోయ్ రాసిన ‘ఫ్లాష్లైట్’ ఒక కుటుంబం చుట్టూ తిరిగే చారిత్రక పుస్తకం. అడుగడుగునా ఆశ్చర్యపరుస్తూ ఆసక్తిని రేకెత్తించే పుస్తకం.ఉత్తరాలమ్మ‘ఉత్తరాలు రాయడానికే జన్మించిందా!’ అన్నట్లుగా ఉంటుంది సిబిల్ వాన్. ప్రతి ఉదయం ఉత్తరాలు రాయడానికి కూర్చుంటుంది. తన సోదరుడికి, ప్రాణస్నేహితురాలికి, విశ్వవిద్యాలయ అ«ధ్యక్షుడికి, తన అభిమాన రచయితల తాజా పుస్తకాలపై అభి్రపాయాన్ని తెలియజేయడానికి ఉత్తరాలు రాస్తుంటుంది. డెబ్బై మూడు సంవత్సరాల సిబిల్ చమత్కారమైన, వివేకవంతమైన ఉత్తర ప్రత్యుత్తరాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వర్జీనియా ఇవాన్స్ రాసిన ‘ది కరస్పాండెంట్’ ఒక వృద్ధ మహిళ దృష్టి కోణం నుంచి ఉత్తరాల రూపంలో వినూత్నంగా, భావోద్వేగ తీవ్రతతో రాసిన నవల. ‘సిబిల్ ఉత్తరాలు అసాధారణమైనవి కాకపోవచ్చు. అయితే మీకు బాగా గుర్తుండిపోయే పాత్రలలో ఆమె ఒకరు కావచ్చు’ అన్నారు విమర్శకులు.దొంగా... సంరక్షకులు!ఒక వారం వ్యవధిలో సాగే పరిణామాలతో ‘ఎ గార్డియన్ అండ్ ఎ థీఫ్’ రెండు కథలను చెబుతుంది. మా, బూంబా అనే రెండు పాత్రల కేంద్రంగా నడిచే పుస్తకం ఇది. ఈ రెండు పాత్రలు తమ కుటుంబం కోసం ఒకే సమయంలో సంరక్షకుడిగా, దొంగగా ప్రవర్తిస్తాయి. తన కుటుంబాన్ని పోషించాలనే ఆరాటం బూంబాను దొంగగా మారుస్తుంది. వరుస నేరాలకు పాల్పడేలా చేస్తుంది. ప్రగాఢమైన తల్లిదండ్రుల ప్రేమ, మెరుగైన జీవితం కోసం ఆరాటం, లోపిస్తున్న నైతిక విలువల చుట్టూ తిరిగే నవల ఇది. తమ ప్రియమైన వారిని రక్షించుకునే నేపథ్యంలో నిస్సహాయ పరిస్థితులు ప్రజలను విలన్ లేదా హీరోగా ఎలా మారుస్తాయో ఈ నవల కళ్లకు కడుతుంది. ‘మేఘా మజుందార్ రాసిన ఎ గార్డియన్ అండ్ ఎ థీఫ్ మానవజాతి నైతిక సందిగ్ధతల గురించి పాఠకులను నిరంతరం సవాలు చేసేలా రాసిన అద్భుతం పుస్తకం’ అన్నారు విమర్శకులు.లింగ వివక్ష ను నివారించడానికి...మహిళల రచనలను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలి, కొత్త గొంతులను ప్రపంచానికి పరిచయం చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులను ఒకే వేదిక మీదికి తీసుకురావాలనే లక్ష్యంతో ‘విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్’ ప్రారంభమైంది. సాహిత్య ప్రపంచంలో లింగ వివక్షను నివారించడానికి, రచయిత్రులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి యూకేలో 1996లో ఈ పురస్కారానికి శ్రీకారం చుట్టారు. విజేతకు నగదు బహుమతితోపాటు కళాకారిణి గ్రిజెల్ నివెన్ తయారు చేసిన ‘బెస్సీ’ అనే కాంస్య విగ్రహాన్ని ప్రదానం చేస్తారు. బాగా పుస్తకాలు చదివే, వివిధ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న అయిదుగురు మహిళలతో కూడిన ప్యానెల్ ‘విమెన్స్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్’ విజేతను ఎంపిక చేస్తుంది. లాంగ్లిస్ట్కు ఎంపికైన పుస్తకాలలో కొన్ని షార్ట్ లిస్ట్కు ఎంపిక అవుతాయి. షార్ట్ లిస్ట్ నుంచి విజేతను ఎంపిక చేస్తారు. -
కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుని స్నానం చేస్తున్నారా..? పాపం ఆ మహిళ..
చాలామంది కళ్లద్దాల కంటే కాంటాక్ట్ లెన్స్లే ధరిస్తుంటారు. ఎందుకంటే కళ్లజోడు అయితే ముఖంపై ఆనవాలు పడిపోవడం, లేది ఇబ్బందిగా ఉంటుంది. అదే కాంటక్ట్ లెన్స్లు కంఫర్ట్ తోపాటు చూపు మెరుగ్గా ఉంటుంది. అదే టైంలో ముఖానికి సరికొత్త లుక్ని అందిస్తుంది కూడా. అందుకే చాలామంది కాంటాక్ట్ లెన్స్ ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ఇక్కడ ఈ యువత కూడా కాంటాక్స్ లెన్సులు ఉపయోగించేది. అయితే వాటిని ఉపయోగించే విషయంలో చూపిన చిన్న అజాగ్రత్త ఆమె కంటి చూపునే కోల్పోయే పరిస్థితికి దారితీసింది. అసలేం జరిగిందంటే.. అమెరికాకు చెందిన 20 ఏళ్ల గ్రేస్ జేమిసన్ కాంటాక్ట్ లెన్స్ ధరించే ప్రతి ఒక్కరికి ఇదొక పాఠంగా, హెచ్చరికగా ఉంటుందంటూ తన కథను షేర్ చేసుకుంది. సరదాగా సాగిన టూర్ ప్రయాణం నెలల తరబడి చీకటి, రోగ నిర్థారణతో ముగిసింది. ఆమె సరదాగా రిపబ్లిక్ పర్యటనకు వెళ్లడమే కష్టాలు తెచ్చిపెట్టింది. అమెరికాలో తన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఆ కష్టాలు పడింది. అక్కడ సరదాగా స్నాన చేస్తున్నప్పుడు కూడా కాంటాక్ట్ లెన్స్ ధరించే ఉంది. లెన్స్లు ఉపయోగించే వాళ్లు తరుచుగా చేసే పెద్ద తప్పిదమే ఇది. అలా స్నానం చేయడంతో జేమిసన్ కళ్లు అకాంతమీబా అనే సూక్ష్మజీవికి గురయ్యాయి. ఈ సూక్ష్మజీవి నీటిలో నివశిస్తుంది. అయితే నేత్ర వేద్యుడు ఆమె పరిస్థితిని తప్పుగా నిర్థారించి స్టెరాయిడ్ చుక్కల మందును సూచించాడు. ఆ మందులు తనకు సహాయపడకపోగా, ఇన్ఫెక్షన్ను మరింత తీవ్రతరం చేశాయి. కేవలం ఒక వారంలోనే అకాంతమీబా కెరటైటిస్ కారణంగా తన దృష్టిని పూర్తిగా కోల్పోయింది. ఒక్కసారిగా జేమిసన్కి జీవితం తలకిందులైనట్లుగా అనిపించింది. సరైన రోగనిర్ధారణ ఆలస్యం కారణంగా ఆ కంటి ఇన్ఫెక్షన్ తనను రెండు నెలలపాటు అంధురాలిగా గడిపేలా చేసిందని వాపోయింది. తాను ఇప్పుడు పక్కల నుంచి చూడగలను తప్ప ముందు నుంచి చూడలేనని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ముందువైపు కనుపాపపై ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన మచ్చ పూర్తిగా కప్పివేయడం వల్ల చూడలేనని పేర్కొంది. అది మడ్డులాంటి తెల్లదనాన్ని మాత్రమే చూపిస్తుందని తెలిపింది. అందువల్ల దయచేసి తనలా నీటిలో ఉన్నప్పుడు కాంటాక్స్ లెన్స్లను ధరించొద్దని హెచ్చరిస్తోందామె. ప్రస్తుతం తాను కొనసాగుతున్న చికిత్సల వల్ల కొంత దృష్టిని పొందగలిగినప్పటికీ..మన కళ్లు మునపటిలా పనిచేయవని అంటోంది. తాను తన చూపుని మరింత మెరుగుపరుచుకునేలా భవిష్యత్తులో మరిన్ని శస్త్ర చికత్సలు చేయించుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. సో ఫ్రెండ్స్ స్నానం చేసేటప్పుడూ, ఈత కొట్టేటప్పుడూ, షవర్బాత్ సమయంలో కాంటాక్ట్ లెన్స్లను ధరించొద్దని అన్నారామె. ఎందుకంటే నీటిలో గనుక హానికరమైన సూక్ష్మజీవులు ఉంటే లెన్స్లకు అంటిపెట్టుకుని ఇలాంటిఇన్ఫెక్షన్ను కలిగించే అవకాశం ఉటుందని హెచ్చరిస్తోంది జేమిసన్.(చదవండి: ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్) -
ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్
బరువు తగ్గడం ఇటీవల కాలంలో ఓ క్రేజీ ట్రెండ్గా మారింది. అందులోనూ క్రాష్ డైట్లు, బరువు తగ్గే మందులు జోలి పోకుండా ఆరోగ్యకరంగా తగ్గడం అనేది అందర్నీ ఆకర్షిస్తున్న ఫిట్నెస్ మంత్రలా మారింది. పైగా అందరు ఆరోగ్య స్పృహతో బరువు తగ్గే ప్రయత్నమే చేస్తుండటం విశేషం. ఈసారి అలానే 40 ఏళ్ల తల్లి చాలా సింపుల్ డైట్ప్లాన్తో కేవలంలో ఏడు రోజుల్లో 5 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వారంలోనే ఇంతలా బరువు తగ్గేందుకు సమతుల్య ఆహారంపైనే ఆధారపడ్డానని చెబుతోందామె. మరి ఆమె ఎలాంటి డైట్ప్లాన్తో తగ్గిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.40 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లి కంటెంట్ క్రియేటర్ రత్న చందు కేవలం ఏడు రోజుల్లోనే ఐదు కిలోలు బరువు తగ్గేందుకు ఆ డైట్ ప్లాన్ సహాయపడిందని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. తాను సమతుల్య ఆహారంపైనే ఫోకస్ పెట్టి బరువు తగ్గినట్లు వెల్లడించింది. మీ ఉదయాన్ని గోరువెచ్చని నిమ్మరసం, చిటికెడు సైంధవ లవణంతో ప్రారంభించాలని సిఫార్సు చేశారు. ఆ తర్వాత జీలకర్ర, వాము, సోంపు గింజలతో ఇంట్లో తయారుచేసిన డిటాక్స్ డ్రింక్ను తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల అల్పాహారానికి ముందు జీర్ణక్రియను నెమ్మదిగా యాక్టివ్ అయ్యేలా చేస్తుంది. ఇక బ్రేక్ఫాస్ట్గా గిన్నెడు పండ్ల మిశ్రమం, నానబెట్టిన గింజలు, ఒక మిల్లెట్ దోస, బుల్లెట్ కాఫీ ఉంటాయి. ఉదయంపూట మిమ్మలని చురుకుగా ఉంచే శక్తివంతమైన ఆహారాల మిశ్రమం ఇది.ఉదయంపూట శక్తి కోసం..పాలకూర, దోసకాయ, అల్లంతో చేసిన గ్రీన్ జ్యూస్ తాగమని సూచించారు. కానీ వర్షాకాలంలో కడుపు సమస్యలను నివారించడానికి పచ్చి పదార్థాలను తినవద్దని కూడా ఆ కంటెంట్ క్రియేటర్ పేర్కొన్నారు.సమతుల్యమైన మధ్యాహ్న భోజనం ముఖ్యంమధ్యాహ్న భోజనం చాలా తేలిగ్గా ఉండాలని చెప్పారు. రోటీలు, వండిన కూరగాయలు, పప్పు, పనీర్, చోలే, గ్రీక్ యోగర్ట్, వంటి ప్రోటీన్ మూలం తీసుకునేలా చూసుకున్నట్లు తెలిపారామె. ఇందులో తగినన్ని కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్తో కూడిన శక్తిమంతమైన భోజనం.స్నాక్స్..ప్రాసెస్ చేసిన స్నాక్స్కు బదులుగా, వేయించిన శనగలు, మఖానా, వేరుశెనగలు, గ్రీన్ టీ తినమని తెలిపారు.తేలికపాటి రాత్రి భోజనం, త్వరగారాత్రి భోజనానికి కూరగాయల సూప్, కిచిడీ, లేదా పనీర్తో వేయించిన కూరగాయల వంటి వాటిని ఎంచుకున్నట్లు తెలిపింది. అయితే ఈ భోజనం తప్పకుండా సాయంత్రం ఏడు గంటలకల్లా తీసుకోవాలని అన్నారు.నిద్రపోయే ముందు అది తప్పనిసరి..పంచదార, పాలు కాకుండా ఒక కప్పు మునగ టీతో రోజును ముగించమని చెబుతోంది. ప్రతిరోజూ ఒక గంట పాటు నడవడం, యోగా వంటి వర్కౌట్లు చేయాలని నొక్కి చెప్పింది. కచ్చితంగా జంక్ఫుడ్కి మాత్రం తప్పనిసరిగా దూరంగా ఉండాలని సూచించింది. చివరగా ఇన్ఫ్లుయెన్సర్ ఒక వారంలో 5 కిలోలు తగ్గడం అనేది వ్యక్తిని బట్టి మారుతుందని చెబుతుండటం గమనార్హం. ఈ డైట్ప్లాన్ని చిన్నగా మొదలుపెడితేనే మొత్తం ఆరోగ్యంపై ప్రభావంతమైన మెరుగుదలను తప్పక చూస్తారని అంటోంది ఇద్దరు పిల్లల తల్లి రత్న చందు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ చిట్కాలను పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ratna Chandu (@glow_fit_mom)(చదవండి: ఇప్పటికీ ఆ దృశ్యం నీలినీడలా వెంటాడుతోంది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ) -
పీసీఓఎస్ ఉన్నా..బరువు తగ్గొచ్చు ఇలా..!
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను ప్రభావితం చేస్తోంది. దీనికారణంగా మహిళలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటుంటారు. సంతానోత్పత్తి వయసు ఉన్న ప్రతి ఐదుగురి అమ్మాయిల్లోఓ ఒకరు ఈ సమస్య బారినపడతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి ప్రధాన కారణం జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు అని చెబుతున్నారు నిపుణులు. ఈ సమస్యను చక్కటి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో చక్కదిద్దొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నమహిళలు తీసుకోవాల్సిన ఆహారాలు గురించి వెల్లడించారు. అవేంటంటే..వాటిలో గుడ్లు మంచి ఆహారమని చెబుతున్నారు. ఎందుకంటే ఇది ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువసేపు కడుపునిండుగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. అవకాడోలు హార్మోన్ల నియంత్రణకు సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయట. అలాగే బెర్రీలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా, తీపి తినాలనే కోరికను నివారించేలా తక్కువ చక్కెర, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.చియా గింజలు మెరుగైన జీర్ణక్రియకు, మంచి ఫైబర్కు ఉపయోగపడతాయని అన్నారు. అలాగే పెరుగు పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక జీవక్రియకు మద్దతిస్తుందని అన్నారు. దీంతోపాటు ఈ సమస్యను తీవ్రతరం చేసే ఆహారాలకు దూరంగా ఉండేలా కేర్ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ తరచుగా శక్తిని కోల్పోయేలా చేస్తాయి. అలాగే హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని చెప్పారు. కాబట్టి సాధ్యమైనంతవరకు వాటిని పరిమితం చేయాలని అన్నారు. ఆహారం తోపాటు చక్కటి జీవనశైలిని పాటించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ..సమతుల్య భోజనం చేసేలా స్థిరత్వాన్ని పాటించాలన్నారు. చిన్నచిన్నగా పాటిస్తే..మెత్తం ఆరోగ్యంలో పెద్ద మార్పులోను, మెరుగుదలను చూడగలమని అన్నారు. డాక్టర్ ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)ICAR-నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్ -
ఫీటల్ మెడిసెన్: పిండ దశలో బ్రహ్మాండ వైద్యం..
కడుపులో ఉన్న బిడ్డకు వచ్చే సమస్యలను పిండదశలోనే సరిచేయగలిగేంత పరిజ్ఞానం ఇప్పుడుంది. జన్యుసమస్యల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ... ఒకప్పటితో పోలిస్తే ‘ఫీటల్ మెడిసిన్’ అనే వైద్యవిభాగంలోని పురోగతితో బిడ్డ పిండదశలో ఉన్నప్పుడు కనిపించే సమస్యలకు పరిష్కారాలు అందించగలగడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు కాబోయే తల్లిదండ్రులకు ఉండే భయాలూ, ఆందోళనలకు ఎలాంటి పరిష్కారాలు దొరుకుతున్నాయో తెలుసుకోవడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం.ఒక కొత్త జీవి ఆవిర్భవించే ప్రక్రియ ఎంత సంక్లిష్టమో, ఎంతగా అబ్బురం కలిగించే అంశమో తెలుసుకోవడం ప్రతినిత్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ బిడ్డ ఉద్భవించేప్పుడు మొట్టమొదట జరిగేదే ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. పురుషుడి శుక్రకణం, అలా మహిళ అండంతో కలిసిన ఆ క్షణంలో అక్కడ ఓ అద్భుతమైన వెలుగు ఓ ఫ్లాష్లైట్లా తటాల్న వెలుగుతుందంటారు వైద్య నిపుణులు. అలా ఫ్లాష్లా వెలిగే ఆ లైట్ను ‘జింక్ స్పార్క్’ అని పిలుస్తారు. అలా మొదటి అద్భుతం నుంచి ఇక పిండం పెరుగుతుండే అనుక్షణం కడుపులోపల అబ్బురాల వరస అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.46 క్రోమోజోముల సంఖ్య కొనసాగేందుకు... స్త్రీ, పురుషులిద్దరి అండ, శుక్రకణాల్లో చెరిసగాలే...ఓ జీవి ఫలానా జీవిగానే కొనసాగేందుకు జీవిలోని క్రోమోజోముల సంఖ్య కీలకమవుతుంది. ఆ జీవిలోని క్రోమోజోముల సంఖ్యను బట్టే అది ఏ జీవి అన్నది తెలుస్తుంది. ఇలా మనిషి కణంలోని క్రోమోజోముల సంఖ్య 46. ఈ సంఖ్య అన్నది ఎన్ని తరాలు గడుస్తున్నా క్రమబద్ధంగా కొనసాగుతూ ఉండటం కోసం మహిళలోని అండం 23 క్రోమోజోములుగా, పురుషుడిలోని శుక్రకణం 23 క్రోమోజోములుగా విడిపోతాయి. మళ్లీ శుక్రకణాలూ, అండమూ మహిళలో సంయోగం చెంది, 46 క్రోమోజోములున్న ఒకే ఒక్క కణమున్న పిండం నుంచి అనేకానేక కణాలు (సెల్స్)గా విడిపోయి, ఆ కణాలు మళ్లీ అనేక రకాల కణజాలాలు(టిష్యూస్)గా, ఆ కణజాలాలన్నీ ప్రత్యేక అవయవాలుగా, ఆ అవయవాలు ఒకదానితో మరొకటి అనుసంధానితమవుతూ ప్రత్యేక వ్యవస్థలు (సిస్టమ్స్)గా రూపుదిద్దుకుంటూ ఉంటాయి. పిండం పెరుగుదల అన్నది ఇంతటి సంక్లిష్టమైనది. ఉదాహరణకు గుండె కణాలూ, కణజాలాలూ కలిసి గుండెగా రూపొంది, రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడతాయి. అదే జీర్ణకోశం, కాలేయం, పేగులూ లాంటి కణాలు, కణజాలాలూ కలిసి జీర్ణవ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇలా మనదేహంలోని రకరకాల వ్యవస్థలన్నీ రూపుదిద్దుకుంటాయి.లోపరహితంగా జరిగే ప్రక్రియ ఇది... అయితే ఒకవేళ లోపమే జరిగితే... ఇంతటి సంక్లిష్టమైన పిండం పెరుగుదల ప్రక్రియ దాదాపు పూర్తి లోపరహితంగా జరుగుతుంటుంది. అలా లోపరహితంగా జరిగినప్పుడే ఒక ఆరోగ్యకరమైన బిడ్డ ఆవిర్భవిస్తుంది. అయితే ఈ సమయంలో ఎక్కడైనా చిన్నపాటి లోపం జరిగినప్పుడు అది పుట్టబోయే బిడ్డకు వైకల్యాన్నో, ఆరోగ్య సమస్యనో తెచ్చిపెడుతుంది. ఆ సమస్యలను పిండ దశలో తెలుసుకోవడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే. ఇందుకు ఉపయోగపడే వైద్య శాస్త్ర విభాగమే ‘ఫీటల్ మెడిసిన్’. గర్భవతికి సంబంధించిన అధ్యయనాలతో కూడిన ‘ఆబ్స్టెట్రిక్స్’కు కొనసాగింపుగా ఇటీవల ఈ ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రం కొత్తపుంతలు తొక్కుతూ చాలా చాలా వినూత్న విషయాలను తెలుసుకుంటోంది. పిండదశలో వచ్చే ఎన్నో ఎన్నో సమస్యలకు పరిష్కారాలూ కనుగొంటోంది. పుట్టుకతో రాబోయే కొన్ని సమస్యలు... ఉదాహరణకు కొన్ని గుండె సమస్యలు వస్తే... దాన్ని కడుపులోని పిండానికే శస్త్రచికిత్స చేసి మరీ చక్కదిద్దేంత పరిజ్ఞానం, నైపుణ్యం ఇప్పుడు అభివృద్ధి అయ్యాయి.కొన్ని లోపాలేమిటి... ఆ లోపాలతో వచ్చే సమస్యలేమిటి...?సాధారణంగా 90 శాతం ప్రెగ్నెన్సీలలో అంతా సజావుగా జరిగిపోయినా, కొందరిలో మాత్రం మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే ఆ బిడ్డకు పిండదశలోనే కొన్ని సమస్యలు కనిపించవచ్చు. పుట్టుకతోనే వచ్చే ఆ సమస్యలను కంజెనిటల్ సమస్యలుగా పేర్కొంటారు. అందులో కొన్నింటికి చికిత్స అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు గ్రహణం మొర్రి (క్లెఫ్ట్ పాలెట్) వంటి చిన్న సమస్యలను చిన్నపాటి శస్త్రచికిత్సతో సరిదిద్దవచ్చు. మరికొన్ని పెద్ద సమస్యలను ఇలా బిడ్డ పుట్టిన వెంటనే చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు అప్పుడే పుట్టిన బిడ్డకు హెర్నియా సమస్య (కంజెనిటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా) ఉంటే పుట్టిన వెంటనే వెంటిలేటర్పై ఉంచి మరీ శస్త్రచికిత్స చేయాలి. కాకపోతే కాస్తంత కష్టసాధ్యమైన ఈ విషయానికి మంచి నైపుణ్యంతో కూడిన చికిత్స అవసరం. పరిష్కారం లేని సమస్యలూ ఉండవచ్చు... ఈ క్రమంలో పిండానికి ఉన్న మరికొన్ని సమస్యలు సరిదిద్దలేనంత సంక్లిష్టంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు అనెన్సెఫాలీ అనే కండిషన్లో బిడ్డలో తల సరిగా రూపొందదు. తలలోని ఎముకలు సరిగా ఏర్పడవు. ఇలాంటి సందర్భాల్లో ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే సమస్య తీవ్రతను బట్టి తీసుకోవాల్సిన నిర్ణయమేమిటి అన్నది జన్యుపరీక్షల నిపుణుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ తర్వాత తెలిసే అవకాశాలున్నాయి. అయితే ఇది త్వరగా జరగాలి. ఎందుకంటే... ఒకవేళ బాగా ఆలస్యమైతే... పిండం బాగా పెరిగాక ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే... ఇది పెద్దప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టే అవకాశముంటుంది. ఇలాంటి సమస్యలన్నీ ఫీటల్ మెడిసిన్ విభాగంలోని డయాగ్నసిస్ (సమస్య నిర్ధారణ)పై ఆధారపడి ఉంటాయి. ఆయా సమస్యలను అనుసరించి, పిండదశలోనే చికిత్స చేయాలా లేక పుట్టిన వెన్వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం ఉందా అన్నది నిర్ణయం తీసుకుని, ఆ ప్రకారం ప్రసవాన్నీ, అటు తర్వాత బిడ్డకు అవసరమైన చికిత్సలనూ డాక్టర్లు ప్లాన్ చేస్తుంటారు.పిండం పెరుగుదల – నిరంతర పర్యవేక్షణ...ఓ మహిళ గర్భందాల్చాక డాక్టర్లు (సాధారణంగా ఆబ్స్టెట్రీషియన్లు / గైనకాలజిస్టులు) నిర్ణీత వ్యవధుల్లో మహిళను చెకప్కు రమ్మని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిండం క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న కొద్దీ... ఏయే వారానికి లేదా ఏయే త్రైమాసికానికి (ట్రైమిస్టర్కు) ఎంత పెరగాలో, ఏయే వారాల్లో ఏయే అవయవాలు రూపుదిద్దుకోవాలన్న అంశాలను బట్టి... పిండం పెరుగుదల అన్నది ఆయా వారాల్లో అలాగే జరుగుతోందా లేదా అని డాక్టర్లు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. బిడ్డలో ఆ ఎదుగుదల అన్నది నార్మల్గానే ఉంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిందేమీ ఉండదు. అంతా సజావుగా జరిగి, నెలలు నిండాక ప్రసవం తర్వాత నార్మల్ బిడ్డ పుడతాడు.‘కలర్ డాప్లర్’ సాంకేతికతతో... కడుపులోనే బిడ్డ సమస్యలు తెలుసుకునే అవకాశం...ఒకవేళ కడుపులోని బిడ్డలో నార్మల్ పెరుగుదల కనిపించకపోయినా లేదా ఏవైనా అవంతరాలూ అవకరాలూ (అనామలీస్) కనిపిస్తుంటే... దానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరముంటుంది. దాని ప్రకారం తగిన నిర్ణయాలు తీసుకునేందుకు ‘ఫీటల్ మెడిసిన్’ సహాయపడుతుంది. ఇప్పుడున్న అత్యాధునిక పరిజ్ఞానంతో కడుపులోని బిడ్డ బరువునూ తెలుసుకునేంత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందుకు సహాయపడే అత్యాధునిక వైద్య విజ్ఞానమే ‘కలర్ డాప్లర్’ సాంకేతికత! దీని సహాయంతో బిడ్డలోని ఎదుగుదల ఏయే సమయాల్లో ఎంత ఉండాలో, ఆయా టైములో అలా కొనసాగుతోందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని ద్వారా బిడ్డ పుట్టబోయే సమయాన్ని కూడా దాదాపుగా సరిగానే అంచనా వేయడమూ జరుగుతుంది.డాక్టర్లు తెలుసుకునే మరికొన్ని సమస్యలూ... పరిష్కారాలు...ఓ మహిళ గర్భవతి అని తెలియగానే ప్రతి డాక్టరూ ఆమెకు తొలుత సూచించే టాబ్లెట్లు... ‘ఫోలిక్ యాసిడ్’ మాత్రలు. పాలకూరలాంటి మామూలు ఆకుకూరల్లో ఉండే ఒక రకం పోషకమే ఈ ‘ఫోలిక్ యాసిడ్’. ఈ పోషకం వల్ల పుట్టబోయే బిడ్డలో... మున్ముందు వెన్నుపాముగా రూపొందబోయే ‘న్యూరల్ ట్యూబ్’ సరిగ్గా ఏ లోపమూ లేకుండా రూపుదిద్దుకుంటుంది. ఇలా న్యూరల్ ట్యూబ్ ఏర్పడటాఇకి అవసరమైన ఆ సంకేతాన్ని తీసుకెళ్లాల్సిన ఒక ‘డీఎన్ఏ’ సరైన రీతిలో ఆ సంకేతాన్ని తీసుకెళ్లేలా ఈ పోషకం సహాయపడుతుంది. మామూలు ఆకుకూరలతోనే అందే ఈ పోషకం ఒకవేళ తగినంతగా అందకపోతే బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ (లోపం) ఏర్పడేందుకు అవకాశం ఉంది. అందుకే డాక్టర్లు తల్లికాబోతోందన్న విషయం తెలియగానే ఈ లోపాన్ని ముందే నివారించేందుకు ఈ ‘ఫోలిక్ యాసిడ్’ మాత్రలను సూచిస్తుంటారు. ఒకవేళ ఆ పోషకం లోపం ఉండి... సదరు డీఎన్ఏ ఆ నిర్దిష్టమైన సంకేతాలను సరిగా అందించకపోతే... పుట్టబోయే బిడ్డలో వెన్నుపాముకు సంబంధించిన లోపాలు ఏర్పడతాయి. వీటినే వైద్య పరిభాషలో ‘స్పైనా బైఫిడా’ అంటారు. ఈ సమస్య వల్ల బిడ్డ పురిటిలోనే చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ బతికితే శారీరకంగానూ, మానసికంగానూ వైకల్యం వచ్చే అవకాశం ఉంది.క్రోమోజోమల్ సమస్యలు...ముందుగా చెప్పినట్టుగా ప్రతి జీవిలోని ప్రతి కణంలోనూ నిర్దిష్టంగా నిర్ణీత క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. వాటిని బట్టే అది ఏ జీవి అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మానవుల్లోని క్రోమోజోముల సంఖ్య 46 అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే... పుట్టబోయే బిడ్డలో జన్యులోపాలు ఏర్పడటాయి. దాంతో అలా జన్యులోపంతో పుట్టే బిడ్డలకు బుద్ధిమాంద్యమూ, అవయవలోపాలూ వచ్చే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ‘డౌన్స్ సిండ్రోమ్’. ఇలా డౌన్స్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలను తెలుసుకోడానికి ‘ద కంబైన్డ్ టెస్ట్’ అనే పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో తల్లి రక్తాన్ని, పిండం విడుదల చేసే ప్రోటీన్లను కలిపి పరీక్షిస్తారు. అందుకే దీన్ని కంబైన్డ్ టెస్ట్ అని పిలుస్తారు. ఈ పరీక్షను గర్భధారణ జరిగిన 11వ వారం, 13వ వారంలో నిర్వహిస్తారు. ఈ లోపాలను తెలుసుకునేందుకు పరీక్షలు... స్పైనా బైఫిడా లాంటి లోపాలు వచ్చే మరికొన్ని అవకాశాలను తెలుసుకునేందుకు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలను తప్పనసరిగా చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ ‘ఫీటల్ మెడిసిన్’లో భాగమే. ఉదాహరణకు ఈ వెన్నుపాము సమస్య అయిన ‘స్పైనా బైఫిడా’ను నిర్ధారణ చేసేందుకు ట్రిపుల్ లేదా క్వాడ్రపుల్ పరీక్ష చేస్తారు. ఇందులో ఆల్ఫా ఫీటో అనే ప్రోటీన్ను పరిశీలిస్తారు. దాంతో పాటు బీటా హెచ్సీజీ పాళ్లు, ఎస్ట్రాడోయిల్, ఇన్హిబిన్ మోతాదులను తెలుసుకుంటారు. ఈ పరీక్షను గర్భం ధరించిన 15వ వారం నుంచి 20 వ వారం మధ్యన చేస్తారు. అయితే ఈ పరీక్షలో పాజిటివ్ వచ్చినంతనే బిడ్డకు తప్పనిసరిగా అంగవైకల్యం కలుగుతుందని చెప్పడానికి ఉండదు. కాకపోతే ఇలా ΄పాజిటివ్ ఫలితం వచ్చినప్పుడు ఆ తర్వాత గర్భం దాల్చిన 16వ వారంలో తప్పనిసరిగా సీవీఎస్ అనే పరీక్ష„ý నూ, యామ్నియోసెంటైసిస్ అనే పరీక్షలను నిర్వహించి, తొలుత కనిపించిన పాజిటివ్ ఫలితం నిజంగా వాస్తవమైనదేనా లేక తప్పుడు పాజిటివా (ఫాల్స్ పాజిటివ్నా) అన్నది నిర్ధారణ చేస్తారు.జెనెటిక్ సోనోగ్రామ్ పరీక్షలతో...పుట్టబోయే బిడ్డ అవయవ నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్న సంగతి ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఇందులో క్రోమోజోమల్ సమస్యలతో పాటు... బిడ్డలోని అంతర్గత అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్లూ–చేతులు, ముఖం, కళ్లు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ఆబ్డామినల్ అవయవాల (కడుపులోపలి భాగాల) గురించి తెలుసుకోవచ్చు.జెనెటిక్ కౌన్సెలింగ్ అంటే...ఇలా అవసరమైనప్పుడుగానీ లేదా డాక్టర్లు ఫలానా పరీక్ష చేయాలని భావించినప్పుడుగానీ... నిర్వహించే పరీక్షల్లో పుట్టబోయే బిడ్డలో జన్యుపరమైన సమస్యలున్నాయని తెలిస్తే... అప్పుడవి మున్ముందు జరగబోయే గర్బధారణల్లో (అంటే తొలిచూలు బిడ్డ తర్వాతి ప్రెగ్నెన్సీలలో) తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. దాన్ని బట్టి తల్లిదండ్రులు తమ గర్భం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. ఒకవేళ అలాంటి జన్యుపరమైన సమస్యలేమీ లేవని తేలితే అప్పుడు తల్లిదండ్రులు నిర్భయంగా తమ ప్రెగ్నెన్సీని కొనసాగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఫీటల్ మెడిసిన్ విభాగపు నిపుణులు... తల్లిదండ్రులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఒకవేళ తొలిచూలు బిడ్డకు ఏవైనా క్రోమోజోమల్ సమస్యలు ఉన్నప్పుడు... ఆ తల్లిదండ్రులిద్దరూ దగ్గరి రక్తసంబంధీకులా అన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా రెండో గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. తొలిచూలు బిడ్డకు కొన్ని రక్త పరీక్షలు చేయించి వాటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా మలిచూలు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మొదటి నాలుగు నెలల్లోనే కొన్ని పరీక్షలు చేయించాలని సూచిస్తారు. ఆ బిడ్డకు ఏవైనా సమస్యలు రాబోతున్నాయా అని పరీక్ష చేసి, ఆ పరీక్షల ఫలితాలను బట్టి కొన్ని వైకల్యాలు వచ్చే అవకాశం ముందే తెలుసుకుంటే, దానికి అనుగుణంగా తల్లిదండ్రులకు సలహాలు ఇస్తారు.ఒకవేళ దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారైతే... సాధారణంగా వారిద్దరి జన్యువులూ ఒకేలా ఉండే అవకాశాలు ఎక్కువ. అంటే ఇద్దరిలోనూ రిసెసివ్ జీన్సే ఉంటాయి. దాంతో ఆటోజోమల్ రెసెసివ్ జెనెటిక్ డిసీజెస్ అని పిలిచే జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ ఒకే తరహా లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్ జన్యువు లేక΄ోవడంతో బిడ్డలో జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలెక్కువ. అందుకే రక్తసంబంధీకుల్లోనే పెళ్లిళ్లు జరిగితే జన్యుపరమైన లోపాలు వచ్చే ముప్పు (రిస్క్) ఎక్కువనీ, అందుకే వీలైనంత వరకు రక్తసంబంధీకుల్లో వివాహాలు వద్దంటూ ఆధునిక ‘ఫీటల్ మెడిసిన్’ నిపుణులు సూచిస్తుంటారు. రక్తసంబంధీకుల బిడ్డల్లోనే జన్యుసమస్యలు ఎందుకు ఎక్కువ? చాలా సందర్భాల్ల రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (కన్సాంజియస్ మ్యారేజెస్) జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని చాలా మంది చెబుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఓ కొత్త జీవి ఆవిర్భవించడానికి తల్లికి సంబంధించిన 23 క్రోమోజోములు, తండ్రికి చెందిన 23 క్రోమోజోములు కలిసి ఒక పిండం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రోమోజోములు ‘జన్యువుల’తో రూపొందుతాయి. జన్యువులు అంటే తల్లిదండ్రుల నుంచి వివిధ అంశాలను బిడ్డలకు చేరవేసే కణంలోని లోపలి భాగాలు అని అర్థం. దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాకుండా, ఒకరికొకరు సంబంధం లేని వేర్వేరు కుటుంబాల వారైతే... అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఫలానా ఓ జన్యువు దంపతులిద్దరిలోనూ ఒకరిలో లోపంతో ఉందని అనుకుంటే ఆ జన్యువును ‘రిసెసివ్ జీన్’ అంటారు. ఉదాహరణకు తండ్రిలోని ఓ జన్యులో లోపం ఉందనుకుందాం. అప్పుడు ఆ జన్యులోపాన్ని నివారించడానికి తల్లిలో ఉండే అదే జన్యువు... లోపంతో కూడిన తండ్రి తాలూకు జన్యువును డామినేట్ చేస్తుంది. ఇలా డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్ జీన్’ అంటారు. దాంతో ఈ డామినెంట్ జీన్ కారణంగా బిడ్డకు రాబోయే ఆ లోపాన్ని అధిగమించడానికి వీలవుతుంది.ఫీటల్ థెరపీస్ అంటే...?పుట్టబోయే బిడ్డకు పిండ దశలోనే ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయా అన్న విషయాన్ని ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు మొదటే నిర్ధారణ చేస్తే... అప్పుడు ఆ బిడ్డకు పుట్టీపుట్టగానే అవసరమైన చికిత్స అందించేందకు వీలుంటుంది. (అందుకే ఇలాంటివేవైనా సమస్యలు ఉన్నట్టు పిండ దశలో ఉన్నప్పుడు చేసే వైద్య పరీక్షల్లో తెలిస్తే... అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో (టెరిషియరీ సెంటర్)లో ప్రసవం జరిగేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది). ఇక కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కడుపులో ఉండగానే, ఆ పిండ దశలోనే చికిత్స చేయాల్సి రావచ్చు. ఇలా చేసే చికిత్సను ‘ఫీటల్ థెరపీ’గా పేర్కొంటున్నారు. డాక్టర్ ఎ మిత్రవింద, సీనియర్ కన్సల్టెంట్, ఫీటల్ మెడిసిన్(చదవండి: కండలు తిరిగిన దేహంతో నిర్మాణ కార్మికుడు..! కేవలం ఆ ఆహారంతోనే..) -
శూన్యమే మిగిలింది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ
సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలను పలకరించగా..ఇంకా ఆ దృశ్యం కళ్లముందు మెదులుతూనే ఉందంటున్నారు. ఆ ఘటన మిగిల్చిన కన్నీళ్లని అంతతేలిగ్గా మర్చిపోలేమంటున్నారు భర్తలను పోగోట్టుకున్న మహిళలు. అంతేగాదు తమ కళ్లలోని కన్నీటి చెమ్మ తడి ఆరదు అని గద్గద హృదయంతో చెబుతోంది ఆ పహల్గామ్ బాధితుల్లో ఒకరైన డాక్టర్ సుజాత. గుండెల్ని పిండేసే ఆమె మనో వ్యథ వింటే ప్రతి ఒక్కరి మనసు ద్రవించిపోవడమే కాదు ఈ ఉగ్రవాదం సమూలంగా పోయేదెప్పుడూ అన్న ఆక్రోశం కట్టలుతెచ్చుకుంటుంది.నాటి పహల్గామ్ దాడిలో డాక్టర్ సుజాత ఎంబీఏ పట్టభద్రుడైన భర్త భరత్ భూషణ్ని పోగొట్టుకుంది. అతడికి ప్రపంచం గురించి తెలిస్తే..ఆమెకు రోగుల గురించి తెలుసు. అలా ఒకరికొకరం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవాళ్లం అని భోరున విలపిస్తున్నారు సుజాత. ఆ దాడిని తన నాలుగేళ్ల కుమారుడు ప్రత్యక్ష్యంగా చూశాడంటూ నాటి భయంకర ఘటనను గుర్తుచేసుకున్నారు. నాన్నకు దెబ్బ తగిలింది, చాలా రక్త కారింది అన్నమాటలు ఇంకా తన చెవిలో వినిపిస్తూనే ఉన్నాయంటున్నారు. ఆ దాడి నీలి నీడలా వెంటాడుతూనే ఉందంటున్నారామె. ఆ బాధను తట్టుకోవడం అంత ఈజీకాదు. ఆ ఘటన తన భావోద్వేగాల నుంచి చిరునవ్వు వరకు అన్నింటి దూరం చేసిందని, కేవలం శూన్యమే మిగిలిందని చాలా నిర్వేదంగా చెప్పుకొచ్చారామె. అంత తేలిగ్గా మర్చిపోలేను ఆ విషాదకరమైన రోజుని, తాను, తన కుమారుడు రక్తంతో తడిచిపోయిన ఆ భయంకపితమైన క్షణాలు బతుకున్నంత వరకు మర్చిపోలేనంటున్నారామె. ఆ కన్నీటి దృశ్యం ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉందన్నారామె. అందుకే తాను ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యేలా చూసుకుంటూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారామె. కాస్త ఖాళీ దొరికినా..ఆ బాధ వెన్నాడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఎంత భయానకమైనవంటే..మనం అనుభవించిన సంతోషకరమైన క్షణాల కంటే ..ఆ బాధే అత్యంత భారంగా అధికంగా ఉంటుందని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నేసి గంటలు ఆస్పత్రిలో పనిచేసినా..ఒక్క ఆదివారం మాత్రం కొడుకు కోసం కేటాయించుకుంటానని చెప్పారు. భతవంతుడి దయవల్ల తన కొడుడు చాలా మంచివాడని అంటున్నారు. ఎందుకుంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారి కూడా తండ్రి గురించి అడగలేదు. ప్రశాంతంగా ఉన్నాడని అన్నారు. పైగా తాను లేనప్పుడూ అస్సలు అల్లరి చేయడు, తాను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నాతో అల్లరి చేస్తుంటాడని నవ్వుతూ చెప్పారు. ఈ విషయంలో భగవంతుడికి సదా కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. అంతేగాదు తన కొడుకుకి తండ్రిన కోల్పోయినట్లు తెలుసు, కానీ ఆ లోటు వాడికి కనపడకుండా అన్నీతానై పెంచుకుంటున్నానని చెప్పారామె. నిజానికి ఏప్రిల్ నెల ఎప్పుడూ పండుగ మాసం, కానీ అది మాకు సర్వం కోల్పోయేలా చేసిన విషాదకరమైన మాసంగా మిగిలిందన్నారు. "ఈ పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ముందు తన భర్త పుట్టినరోజు వేడుకులు చేసుకున్నాం అని అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 14న విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాం. నిజానికి తాము ఎప్పుడు గుడికి వెళ్లి..ఆ తర్వాత బయటకు వెళ్లేవాళ్లం. ఆరోజు తన తల్లిదండ్రలు కూడా కాశ్మీర్లో గట్టి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పినప్పుడూ కూడా అంతగా ఆందోళన చెందలేదు. పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటే టపాసులు అనుకున్నా..భద్రతా సిబ్బంది అంతా చూసుకుంటారిని అనుకున్నా. కానీ ఆ ప్రాంతంలో భద్రత లేదు, ఒక్క మనిషి గానీ, సాయుధగార్డు గానీ ఉంటే ఆ ఘటనను నివారించి ఉండేవారంటూ". ఆ విపత్కర పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. బహుశా తీవ్రవాద భావజాలం ఈ దాడులు చేసేవాళ్ల మెదడులను పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశారన్నారు. తాము చేస్తుంది తప్పు కాదు సరైనదే అన్నంత క్రూరంగా మార్చేశారన్నారు. అయితే ఈ ఉగ్రవాదాన్ని ఎలా మట్టుపెట్టాలో తనకు తెలియదు గానీ..ఇక్కడితో ఈ మారణకాండ ఆగిపోవాలి అని ఉద్విగ్నంగా అన్నారామె. ఆ దాడి జరిగిన రోజు తమ పెళ్లిరోజు అని, ఆయనతో తనకు అదే చివరి భయానక జ్ఞాపకమని కన్నీళ్లుపెట్టుకున్నారామె. కాగా, పహల్గామ్ సంఘటన జరిగినప్పుడు ఆ దంపతులకు పెళ్లై ఆరేళ్లయింది. ప్రస్తుతం ఆమె తనను ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నా..కానీ ఈ నష్టం ఏ స్త్రీకైనా పూడ్చలేనది అని గద్గద స్వరంతో అన్నారు డాక్టర్ సుజాత.#PahalgamTerroristAttackDr. Sujatha, a pediatrician from Bengaluru, witnessed the tragic killing of her husband, Bharath Bhushan, during a terrorist attack in Pahalgam, Jammu and Kashmir, on April 22, 2025. #DrSujatha, her husband, and their three-year-old son were vacationing… pic.twitter.com/Wn5D9ZnMuL— Dr Parveen Yograj (@ParveenYograj) April 24, 2025 (చదవండి: ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ) -
60లోనూ 40లా.. వృద్ధురాలి యంగ్లుక్!
వయసు పైబడిన..చిన్నవాళ్లలా యంగ్లుక్లో కనిపించాలని పరితపిస్తుంటారు చాలామంది. అయితే అందుకు తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు చేసుకోరు. అలాగే శరీరానికి కావాల్సినంత వ్యాయామాలు వంటి వాటిపై దృష్టిసారించరు. యంగ్ లుక్ అటుంచి..ఆరోగ్యంగా ఉండటం కోసం అయినా చేయరు..ఇక యవ్వనంగా ఎలా కనిపిస్తారు అని అంటోంది ఈ చెన్నైకి చెందిన వృద్దురాలు. 67 ఏళ్ల వయసున్న ఆమెని చూస్తే జస్ట్ 40 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆ వృద్ధురాలి ఆహార్యం. మరి ఆమె చెప్పే పిట్నెస్ రహస్యలేంటో సవివరంగా చూద్దామా..!.కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఆ వృద్ధరాలి గురించి ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఆమెను ఫిట్నెస్ రొటీన్ గురించి అడగడం చూడొచ్చు.మంచి ఆరోగ్యానికి వ్యాయామమే కీలకంవయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడుతుంది; ఇది సాధారణ జీవశాస్త్రం. అయితే, క్రమం తప్పని వ్యాయామంతో మన శరీరానికి శిక్షణ ఇస్తే..న క్రియాత్మక బలం, సామర్థ్యాలను నిలుపుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని అంటోందామె. ఆమె ఉదయం 5:30 నుంచి 5:45 గంటల మధ్య నిద్రలేచి, ఇంటి పనులు ముగించుకుని, యోగాతో రోజుని ప్రారంభిస్తానని అంటోంది. ఇక ఉదయం 7:30 గంటలకు పార్కులో వాకింగ్ చేస్తానని చెప్పారు. ఆరోగ్యంగా ఉండటానికి కేవలం వాకింగ్ సరిపోదని అన్నారు. శక్తినిచ్చే వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. అలాగే తానేమి సప్లిమెంట్లని ఉపయోగించనని అన్నారు. అల్పాహారంగా కేవలం మజ్జిగ మాత్రమే తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో మాత్రం అవసరమైన పోషకాలు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్నం ప్రోటీన్ కోసం చికెన్, మటన్ లేదా గుడ్లతో కూడిన చాలా మంచి భోజనం చేస్తాను. ప్రత్యేకంగా పాటించే డైట్ అంటూ ఏమి లేదని అన్నారామె. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతానని అన్నారు. భోజనం మధ్యలో ఆకలి వేస్తే నచ్చిన పండ్లను తీసుకుంటానని చెప్పారు. కానీ వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటానని అన్నారు. మంగళవారం, శనివారాలు తప్పనిసరిగా ఉపవాసం ఉంటానని చెప్పారు. గృహిణిగా ఉంటూనే ఆరోగ్యం పట్ల ఇంత కేర్ తీసుకుంటున్నా ఆమె అందరికీ స్ఫూర్తి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే సరైన ఆహారం తీసుకోవడం, శరీరానికి తగిన వ్యాయామం చేయడం తదితరాలే అత్యంత ముఖ్యమని అని చెబుతున్నారామె. ఎక్కువగా మానసిక ఆరోగ్యంపై దృష్టిపెడితేనే ఏదైన సాధ్యమని అన్నారు. ఆడవాళ్లు, ఇంట్లో శాంతి, సంతోషంగా ఉండేలా చూసుకోవడం ప్రధానమని అన్నారు. అలాగే ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే విషయాలను పట్టుకుని వేలాడకుండా..జీవితంలో ఏది వచ్చినా..యథాతథంగా స్వీకరించడం అత్యంత ముఖ్యం అని అన్నారు. అప్పుడే మనం శారీరకంగా ఫిట్గా ఉండగలుగుతామని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Jhaal Muri: మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..) -
మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..
బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మోదీ రుచి చూశారు. దీన్ని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారు చేస్తారు. ఝార్గ్రామ్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ఓ దుకాణం ముందు హఠాత్తుగా ఆగింది. మోదీ వాహనం దిగి దుకాణదారును పలకరించారు. ‘‘సోదరా! ఝాల్మురీ ఎంత? నాకు రుచి చూపించు. రుచికరంగా త యారు చెయ్’’ అని కోరా రు. తను వెంటనే ఝాల్ మురీ చేసి ప్రధానికి అందించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా మోదీ బలవంతంగా అతడి చేతిలో పెట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ చిరుతిండి హాట్టాపిక్గా మారింది. ఈ వంటకానికి యావత్తు భారతదేశంలో ప్రజలంతా చేసుకుంటారు. కాకపోతే ఆయా ప్రాంతాల వారీగా పలుల పేర్లు ఉన్నాయంతే. కానీ దీని రుచికి అందరు ఫిదా అనే చెప్పాలి. విదేశీయలు సైతం అబ్బా అని లొట్టలేసుకుంటూ తినేలా చేసే స్నాక్ ఐటెం ఇది. మరి నోరూరించే ఈ ఝల్మురి వంటకాల కహానీ గురించి సవివరంగా చూద్దామా..!.ఝల్మురి అంటే..కోల్కతా స్ట్రీట్ చిరుతిండి ఇది. మరమరాలు, ఆవనూనె, మసాలాలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేరుశెనగుళ్లు, సెనగపప్పులు వేసి కమ్మగా, కారంగా చేసే వంటకం. ఇది ఏమి స్టవ్ వెలిగించే చేసే వంటకం కాదు. ఇది మొత్తం పదార్థాలు కలపడం పైనే రుచి ఆధాపడి ఉంటుంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే..బెంగాలీలో “ఝల్” అంటే కారం, “మురి” అంటే మరమరాలు. ఈ రెండింటినీ కలిపితే,కారం కారం మరమరాలు అని అర్థం. అమ్మకందారులు స్టీల్ పాత్రలలో దీన్ని కలుపుతూ..పదార్థాలను గాల్లోకి ఎగరువేస్తూ..కోన్ల వార్తాపత్రికలను చుట్టి సర్వ్ చేస్తుంటారు. చవకైనది..మనసుకు ఆహ్లాదాన్ని, కాలక్షేపాన్ని ఇచ్చే చిరుతిండి ఇది. వలసవాద కాలంలో బెంగాల్లో ఉద్భవించిందని చెబుతుంటారు. మాములు చిరుతిండిగా మొదలైన రైళ్లలో, బీచ్లలో, కళాశాల ప్రాంగణాలలో విరివిగా అమ్ముతుంటారు. ఇంకా పెద్ద పెద్ద కేఫ్లు సైతం లభిస్తోంది. ఈ స్ట్రీట్ భారతదేశమంతటా ఫేమస్. పైగా ఆయా ప్రాంతాల వారీగా పలు రకాలుగా పిలుస్తారు. చేసే విధానం ఒక్కటే. మరి ఆ పేర్లేంటో చూసేద్దామా..! ఇన్ని పేర్లా..?!ముంబైలో దీన్ని భేల్పురిగా తీపి కారంల కలయికతో తయారు చేస్తారు. ఇక బెంగళూరు చురుమురిలో తురిమిన కొబ్బరితో దక్షిణ భారత రుచితో మిళితం చస్తారు. ఒడిశాలో మసాల మురిగా..అందులో అన్ని ఎక్కువ పదార్థాలు జోడించనప్పటికీ ఘాటుగా ఉంటుంది. ఇక దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ వంటి ప్రాంతాలో ముంతమసాల, పిడతకింద పప్పు, ఉగ్గాణి వంటి పేర్లోతో పిలుస్తారు.ముంతమసాల: రమరాలు, మసాలా దినుసులు, వేరుశెనగ గుళ్లు, ఉల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు తదితరాలను కలిపి గిన్నెలో ఇస్తారు కాబట్టి ముంత మసాల. అంటే ఇక్కడ ఒక చిన్న అల్యూమినియం ముంతలో (గిన్నె)లో సర్వ్ చేస్తారు. ఇది కోస్తాంధ్ర, రాయలసీమలో సాయంత్రం వేళల్లో దొరికే ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్.పిడతకింద పప్పు: ఇది కూడా ముంతమసాల లాంటిదే, కానీ ఇందులో మిరపకాయ బజ్జీలను చిన్న ముక్కలుగా చేసి కలుపుతారు. అలాగే మరమరాలు మెత్త బడకుండా చిన్న మట్టి కుండలో నిప్పులు వేసి మరమరాలపై ఉంచుతారు అందువల్ల ఆ పేరుతో పిలుస్తారు. ఇది ముఖ్యంగా కోస్తాంధ్ర (గుంటూరు, కృష్ణా జిల్లాలు) లో ఎక్కువగా కనిపిస్తుంది.ఉగ్గాణిమరమరాలను నీటిలో నానబెట్టి, తాలింపు పెట్టి చేసే ఒక రకమైన తడి మిశ్రమం. దీనికి పసుపు, వేరుశెనగ గుళ్లు, పుట్నాల పొడి (పుట్నాల పప్పు పొడి) ప్రధానంగా ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా మిరపకాయ బజ్జీలతో కలిపి తింటారు, అందుకే దీనిని 'ఉగ్గాణి బజ్జీ' అని పిలుస్తారు. రాయలసీమ ప్రాంతంలో (కర్నూలు, అనంతపురం) ఇది చాలా ఫేమస్. అక్కడ దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తింటారట. ఆరోగ్యదాయకం కూడా..ఈ మరమరాలతో తయారు చేసే ఈ వంటకం ఆరోగ్యప్రదం కూడా. ఎందుకంటే ఇందులో ఆయిల్ కంటెంట్ తక్కువ. పైగా అన్ని నేచురల్గా కలిపేస్తారు. ఇక్కడ డీప్ఫ్రైకి ఛాన్స్లేదు. టమటా, ఉల్లిపాయలు నుంచి అన్ని కూడా పచ్చిగానే కలుపుతారు. ఒకరకంగా సలాడ్ మాదిరి ఐటెం. కాకపోతే కాస్త మరమరాలతో రుచికరంగా మారుతుంది. పైగా వెయిట్లాస్ స్నాక్ ఐటెం అని అంటున్నారు. ఇది కడుపు నిండిన అనుభూతితోపాటు మనసుకు హాయినిచ్చే స్నాక్ ఐటెం అట. ఇక మరమరాల్లో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగానే ఉంటాయని అంటున్నారు. పైగా తేలిగ్గా అరిగిపోతుంది కూడా అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మంచి ఫైబర్ తోపాటు, సులువుగా జీర్ణమయ్యే బలవర్ధకమైన చిరుతిండి అట. -
గెలిచా అనుకునేలోపే ఓటమి హగ్ ఇచ్చిందిగా..!
ఎప్పుడైన గెలవాలని అనుకున్నప్పుడు చివరవరకు ఓపికతో పోరాడాలి. గెలిచాక సంబరాలు చేసుకోవాలి. అప్పటి వరకు సంయమనంతో ఉండాలి లేదంటే ఘోరంగా అవమానపాలు కావాల్సిందే. అందుకు నిదర్శనం ఈ ఘటన. డెలావేర్ మారథాన్ రన్నింగ్ కాంపిటీషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫినిష్ చేయాల్సిన గీతకు కొన్ని అంగుళాల ముందే యాహు గెలిచేశా అంటూ సంబరాలు చేసుకుటూ చేతులు పైకెత్తాడు. కొద్ది దూరంలోనే వేగాన్ని తగ్గించి ఆనందంగా గెంతులేస్తూ వస్తున్నాడు. ఇంతలో అతడి ప్రత్యర్థి 24 ఏళ్ల జాషువా జాక్సన్ అనూహ్యంగా వెనుక నుంచి దూసుకొచ్చి..అతడిని ఓడించేటప్పటికీ..అతన ఒక్కసారిగి కంగుతింటాడు. గెలిచానన్న ఆనందం క్షణాల్లో చూస్తుండగానే ఆవిరైపోయిందా అని షాక్లో ఉండిపోయాడు. అందుకే అంటారు పెద్దలు గెలుపుని పాదాక్రాంతం చేసుకునేంత వరకు చప్పుడు చేయకూడదు అనేది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారంది. జాక్సన్ అనే వ్యక్తి మారథాన్ రేసు గెలిచి..అద్భుతమైన 2:43:11 సమయాన్ని నమోదు చేశాడు. ఈ ఘటన అందరికి అద్భుతమైన గుణపాఠం కదూ..!.(చదవండి: అరుదైన ఘటన: కూతురిని చితకబాదిన అమ్మ..!) -
నిరంతరం నేర్చుకునే తత్వం..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రయాణం అని మనం చెప్పుకున్నాం. ఆ ప్రయాణానికి కావలసిన ఇంధనమే 'Intellectual Curiosity' (మేధోపరమైన జిజ్ఞాస). అంటే, ప్రపంచాన్ని ఒక చిన్న పిల్లాడిలా కుతూహలంతో చూడటం, ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటంచాలామంది డిగ్రీ రాగానే లేదా ఉద్యోగం రాగానే చదవడం, నేర్చుకోవడం ఆపేస్తారు. కానీ బ్రో, ఎప్పుడైతే మీరు నేర్చుకోవడం ఆపేస్తారో, అప్పుడే మీ ఎదుగుదల ఆగిపోతుంది. మేధోపరమైన జిజ్ఞాస ఉన్న వ్యక్తికి ఈ ప్రపంచం ఒక పెద్ద లైబ్రరీలా కనిపిస్తుంది. అతను కేవలం తన సబ్జెక్టులోనే కాదు, సైన్స్, ఆర్ట్, హిస్టరీ, టెక్నాలజీ.. ఇలా ప్రతి దాని గురించి తెలుసుకోవాలని తపిస్తాడు. ఈ కుతూహలమే మిమ్మల్ని పదిమందిలో ఒక'ఆసక్తికరమైన వ్యక్తి'గా (Interesting Person)నిలబెడుతుంది.ఎమర్జింగ్ మైండ్సెట్: "నాకు ఇంకా తెలియదు""నాకు అన్నీ తెలుసు" అనుకోవడం అహంకారం, "నాకు ఇంకా తెలియాల్సింది చాలా ఉంది" అనుకోవడం మేధస్సు.Shoshin: జపనీస్ సంస్కృతిలో దీన్ని 'బిగినర్స్ మైండ్' అంటారు. అంటే ఎంతటి అనుభవం ఉన్నా, ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఏమీ తెలియని విద్యార్థిలా వినడం. ఈ లక్షణం మీలో వినయాన్ని (Humility) పెంచుతుంది. మీరు అందరి దగ్గర నుండి ఏదో ఒకటి నేర్చుకోగలరు—ఒక చిన్న పిల్లాడి నుండి లేదా ఒక కూలీ నుండి కూడా.ఎందుకు? ఎలా? జిజ్ఞాస ఉన్న వ్యక్తి ప్రశ్నలు అడగడానికి భయపడడు.లోకం "ఇది ఇంతే" అని సరిపెట్టుకుంటే, అతను "ఎందుకు ఇలా ఉంది? దీన్ని ఇంకా మెరుగ్గా ఎలా చేయొచ్చు?" అని ఆలోచిస్తాడు.ఈ ప్రశ్నలే కొత్త ఆవిష్కరణలకు (Innovations) దారి తీస్తాయి. మీ ఆఫీసులో గానీ, ఇంట్లో గానీ మీరు ప్రశ్నలు వేయడం మొదలుపెడితే, మీరు సమస్యలను మూలాల నుండి అర్థం చేసుకోగలుగుతారు.క్రాస్-లెర్నింగ్: విభిన్న రంగాల కలయికమీరు కేవలం ఒకే రంగానికి పరిమితం అవ్వకండి.మీరు ఒక ఇంజనీర్ అయితే, సైకాలజీ చదవండి. మీరు ఒక డాక్టర్ అయితే, ఫైనాన్స్ గురించి తెలుసుకోండి.విభిన్న రంగాల జ్ఞానాన్ని కలిపినప్పుడు మీకు 'క్రియేటివ్ ఐడియాస్' వస్తాయి. స్టీవ్ జాబ్స్ కాలిగ్రఫీ (అక్షరాల కళ) నేర్చుకోవడం వల్లే ఆపిల్ కంప్యూటర్లలో అందమైన ఫాంట్లు వచ్చాయి.మీ వ్యక్తిత్వానికి ఇది ఒక'మల్టీ-డైమెన్షనల్'లుక్ ఇస్తుంది.డిజిటల్ యుగంలో జిజ్ఞాస (Learning in AI Era)ఇప్పుడు సమాచారం మన వేళ్ల చివర ఉంది. సోషల్ మీడియాలో టైమ్ వేస్ట్ చేసే బదులు, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంటర్నెట్ ని వాడుకోండి. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి కొత్త టెక్నాలజీలను అర్థం చేసుకోండి. మారుతున్న కాలంతో పాటు మారని వాడు వెనకబడిపోతాడు. నేర్చుకునే తత్వం ఉన్నవాడు ఎప్పుడూ'అవుట్ డేటెడ్'అవ్వడు.మెదడు ఆరోగ్యం, యవ్వనంసైంటిఫిక్గా చూస్తే, మీరు కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మీ మెదడులో కొత్త న్యూరాన్లు పుడతాయి (Neurogenesis).ఇది మిమ్మల్ని మానసిక ఉల్లాసంతో ఉంచుతుంది. వయస్సు పెరిగినా (Chapter 44), మీ ఆలోచనలు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి.The Takeawayబ్రో, నేర్చుకోవడం అనేది ఒక బరువు కాదు, అది ఒక సాహసం. నీ వ్యక్తిత్వం ఎప్పుడూ వికసించాలి అంటే, నీలోని ఆ చిన్న పిల్లాడిని చనిపోనివ్వకు. ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకోకుండా నిద్రపోకు. జ్ఞానం అనేది పంచుకుంటే పెరుగుతుంది, నేర్చుకుంటే వెలుగుతుంది. నీ సామాజిక వికాసం, నిరంతర వికాసం ఈ 'జిజ్ఞాస' మీదే ఆధారపడి ఉన్నాయి.గుర్తుంచుకో.."నువ్వు నేర్చుకోవడం ఆపేసిన రోజున నువ్వు ముసలివాడివి అయిపోతావు. నువ్వు నేర్చుకుంటూ ఉన్నంత కాలం నువ్వు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటావు. జ్ఞానమే నీ అసలైన ఆస్తి."Mind-Work మీకు ఏమాత్రం సంబంధం లేని ఒక కొత్త విషయం (ఉదా: ఖగోళ శాస్త్రం లేదా వంట చేయడం) గురించి ఈరోజు 10 నిమిషాలు చదవండి లేదా వీడియో చూడండి.ఈరోజు మీరు కలిసిన ఒక వ్యక్తిని, వారికి తెలిసిన ఒక స్కిల్ గురించి అడిగి తెలుసుకోండి."నాకు అన్నీ తెలుసు" అని మీరు అనుకున్న సందర్భాలను గుర్తు తెచ్చుకుని, అక్కడ మీరు నేర్చుకోగలిగే అవకాశం ఏముందో ఆలోచించండి.(చదవండి: క్షమించడంతోనే విముక్తి) -
లైఫంతా టెస్ట్ ఇంటర్లో బెస్ట్
అప్పుల బాధతో....తండ్రి ఆత్మహత్య. పద్దెనిమిదేళ్లకే కుటుంబ బాధ్యత. పెళ్లయిన రెండేళ్లకే కన్నుమూసిన భర్త విషాదం తట్టుకోలేక... పక్షవాతానికి గురైన తల్లి. జీవితమే పరీక్షగా మారింది. చేతిలో పసిబిడ్డతో ఆ పరీక్షలో నెగ్గడానికి మళ్లీ చదువు బాట పట్టింది హిమబిందు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న పేదింటి బిడ్డ హిమబిందు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 985 మార్కులు సాధించింది. కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సహాయం కోసం అర్థిస్తోంది.డాక్టర్ కావాలనేది తన చిన్నప్పటి కల. దర్జీ పనులు చేసుకునే తండ్రి బట్టలు కొలిచే టేప్ మెడలో వేసుకుంటే, ఆదే టేప్ తాను వేసుకొని ‘ఇది నా స్టెతస్కోప్’ అని సంబరపడేది హిమబిందు. ‘కచ్చితంగా నువ్వు డాక్టరవుతావు బిడ్డా’ అని ఎప్పుడూ ఆశీర్వదించే తండ్రి అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ బాధ్యతలను తల్లి భుజాన వేసుకుంది. పద్దెనిమిది సంవత్సరాల వయసులో హిమబిందుకు పెళ్లి చేసింది. పెళ్లి అయిన రెండేళ్లకు అప్పుల పాలైన బిందు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం తట్టుకోలేని తల్లికి పక్షవాతం వచ్చింది.→ దుఃఖసముద్రంలో...ఒకవైపు అనారోగ్యంతో తల్లి, మరోవైపు పసిబిడ్డ... దుఃఖసముద్రంలో మునిగిపోతున్నట్లుగా అనిపించింది హిమబిందుకు. అయినా ఆ విషాదాన్ని తట్టుకొని నిలబడింది.‘ఎన్ని కష్టాలు వచ్చినా చదువుకోవాల్సిందే’ అని గట్టిగా అనుకుంది హిమబిందు. మళ్లీ చదువు కొనసాగించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 985 మార్కులు సాధించి డాక్టర్ కావాలనే తపనతో పుస్తకాలతో కుస్తీ పడుతోంది తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా నడివాడకు చెందిన దుస్సా హిమబిందు.→ ఎంత కష్టమైనా..‘ఇంటర్లో తెచ్చుకున్న మార్కులు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ప్రస్తుతం నా ముందు ఉన్న లక్ష్యం... నీట్. కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంటి దగ్గరే సొంతంగా ప్రిపేరవుతున్నాను. దాతలు సహకరిస్తే నా లక్ష్యానికి త్వరగా చేరగలననుకుంటున్నాను’ అంటోంది హిమబిందు.కన్నీళ్లు దిగమింగుతూ.. కాలేజీకి..చిన్నతనంలోనే తండ్రి, పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే 11 నెలల పసిపాపను చేతిలో పెట్టి భర్త ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు తల్లి ఆనారోగ్యానికి గురైనా తన లక్ష్యం మాత్రం మరచిపోలేదు హిమబిందు. అటు తల్లిని, ఇటు బిడ్డనూ చూసుకుంటూ పెళ్లితో ఆగిపోయిన ఇంటర్ చదువును మళ్లీ మొదలు పెట్టింది. లెక్చరర్లు, తోటి విద్యార్థుల సహకారంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసి వెయ్యి మార్కులకు 985 మార్కులు సాధించింది. ఇప్పుడు నీట్ పరీక్షకు సిద్ధం అవుతోంది. – ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్ఫొటో: మురళీ మోహన్ -
బహుభాషావేత్త... సోలో ట్రావెలర్ అందం బహుముఖం
ముప్పై రాష్ట్రాల అందాల ప్రతినిధులతో భువనేశ్వర్లో జరిగిన ‘మిస్ ఇండియా వరల్డ్ 2026’ పోటీలో విజేతగా నిలిచిన గోవా అమ్మాయి సాధ్వీ సతీష్ విశేషాలు తెలుసుకునేకొద్దీ ఆశ్చర్యపోతున్నారు అంతా. ఆమె రెండు చేతులతోనూ రాస్తుంది. చాలా స్పీడ్గా కారు నడుపుతుంది. ఏడు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. కెనెడాలో ఎకనామిక్స్ చదివి సోలో ట్రావెలర్గా దేశాలు తిరుగుతుంది. ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలిచి, గోవా ఘనతను చాటింది. ఈ కాలపు అమ్మాయంటే సాధ్వీ సతీషే.‘చిన్నప్పటి నుంచి నేను కొంచెం తేడా. నలుగురితో పెద్దగా కలిసే దాన్ని కాదు. చిన్నప్పుడు ఖాళీ టైమ్ దొరికితే రెండు చేతులతో ఒకేసారి రాయడం ప్రాక్టీసు చేసేదాన్ని’ అంటోంది గోవా అందాల బరిణె సాధ్వీ సతీష్. గోవా ఇసుక తీరాల్లో ఆడుకున్న ఈ అమ్మాయి ‘మిస్ ఇండియా 2026 వరల్డ్’ టైటిల్ గెలుచుకొని 2027లో జరగనున్న ‘మిస్ వరల్డ్’ పోటీలలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.→ మొదటి గోవా అమ్మాయిభువనేశ్వర్లోని ‘కె.ఐ.ఐ.టి. విశ్వవిద్యాలయం’లో ఏప్రిల్ 18న వైభవంగా జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026’ ఫైనల్స్లో 25 ఏళ్ల సాధ్వీ సతీష్ విజేతగా గెలిస్తే, మొదటి రన్నరప్గా మహారాష్ట్రకు చెందిన రజ్నందిని పవార్, రెండో రన్నరప్గా జమ్మూ కశ్మీర్కు చెందిన శ్రీఅద్వైత నిలిచారు. న్యాయనిర్ణేతలుగా జీనత్ అమన్, నేహా ధూపియా, మధుర్ భండార్కర్, ఒలింపిక్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. సాధ్వీ సతీష్ ఈ టైటిల్ను గెలవడం వల్ల ‘మిస్ వరల్డ్’కు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న తోలి గోవా అమ్మాయి అయ్యింది. స్వాధ్వీ సతీష్ కర్ణాటకలోని కార్వార్లో పుట్టినా తను పెరిగిన గోవానే∙ఊపిరిగా భావిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి గోవా సంస్కృతి, సముద్రం ఇష్టం. బెంగళూరులోని అమృత విద్యాలయంలో చదివి, ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డబుల్ మేజర్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్లో ప్రవేశించి అందాల పోటీ వరకూ ఎదిగింది.→ నాన్న ప్రోత్సాహంఅమ్మా నాన్నల ప్రోత్సాహం లేకుండా పిల్లలకు ఏ విజయమూ సిద్ధించదు. సాధ్వీ సతీష్ విజయం వెనుక తండ్రి సతీష్ కృష్ణ సెయిల్, తల్లి ప్రియాంక సెయిల్ ఉన్నారు. ముఖ్యంగా తండ్రి సతీష్ కూతురి కలలకు రెక్కలు తొడిగిన వ్యక్తి. ‘ఆడపిల్ల అయినా ప్రపంచం చుట్టి రావాలి’ అని కెనడా చదువుకు, సోలో ట్రావెలింగ్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లి ప్రియాంక గోవా సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను సాధ్వీలో నింపింది. ‘నాన్న నన్ను ఆకాశానికి ఎగిరేలా చేశారు. అమ్మ నా కాళ్లు నేల మీద ఉంచింది. మిస్ ఇండియా కిరీటం నాది కాదు, మా అమ్మా నాన్నలది’ అంది సాధ్వీ.→ సోలో ట్రావెలర్‘కెనెడాలో చదువు పూర్తయ్యాక మెక్సికోకు మొదటి సోలో ట్రావెల్ చేశాను’ అని తెలిపింది సా«ధ్వీ. లోకం చూడటానికి ఇష్టపడే సాధ్వీ మూడేళ్లలో పది దేశాలు ఒంటరిగా తిరిగింది. కొత్త సంస్కృతులు, కొత్త మనుషులు, కొత్త సవాళ్లు అన్నింటినీ ఆహ్వానించింది. ఈ ప్రయాణాలే తనకు స్వతంత్రంగా ఆలోచించడం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పాయి అంటుందామె. మరో విశేషం ఏమిటంటే సాధ్వీకి తేనెటీగలంటే విపరీతమైన భయం. ఫోబియా. ఆ ఫోబియాను జయించడానికి సర్టిఫైడ్ బీకీపర్గా శిక్షణ తీసుకుంది. భయాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే.→ బ్యూటీ విత్ ఏ పర్పస్మిస్ ఇండియా పోటీకి కేవలం మూడు నెలల ముందే సిద్ధమైన సాధ్వీ క్రమశిక్షణతో పది కిలోలకు పైగా బరువు తగ్గి ‘టాప్ 5 బెస్ట్ బాడీ’లో నిలిచింది. తర్వాత కిరీటం గెలుచుకుంది. కానీ ఆమె లక్ష్యం కిరీటం కంటే పెద్దది. వినికిడి, మాటల లోపం ఉన్న పిల్లలకు మెరుగైన పోషకాహారం, సమాన అవకాశాలు కల్పించడం ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్. టాంజానియా వేదిక కానున్న ‘మిస్ వరల్డ్ 2027’ పోటీలో భారత్ తరపున ఇలాగే విజయం సాధించాలని కోరుకుందాం. -
కూరగాయలు అమ్మడం నుంచి సైనికుడిగా! కట్చేస్తే..
చదివే అవకాశంలోని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా..వెనకడుగు వేయలేదు. ఫీజు చెల్లించే పరిస్థితి లేకపోయినా..కూరగాయలు అమ్ముతూ చదువు సాగించాడు. అలా దేశ సేవ చేయాలని ఆర్మీలో చేరాడు. రిటైర్ అయ్యాక కూడా చదవాలనే కోరికను కొనసాగించాడు. ఆ ఆసక్తితో ఎన్ని డిగ్రీలు పూర్తి చేశాడో తెలిస్తే విస్తుపోతారు. పైగా అన్ని డిగ్రీలు పూర్తి చేసి ఎన్ని రికార్డులు నెలకొల్పాడో తెలిస్తే 'జయహో సైనికుడా' అని ప్రశంసించకుండా ఉండలేరు.అతడే రాజస్థాన్లోని ఝున్ఝును జిల్లాలోని ఖిరోడ్ గ్రామానికి చెందిన దశరథ్ సింగ్. తన కుటుంబంలో అంతగా విద్యకు ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఎందుకంటే పూటగడవడమే కష్టం కావడంతో ఆ ఆలోచనే వచ్చేది కాదు. అయినా సరే ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ చదువు సాగించాడు. కానీ కాలేజీ చదువులకు ఫీజులు చెల్లించలేక స్వస్తి పలకాల్సి వచ్చింది. అయినా కూడా ఆశను వదులకోలేదు. పొలంలో పండిన కూరగాయలు అమ్మేందుకు ఏకంగా 13 కిలోమీటర్లు నడిచి మరి చదువుకి నిధులు సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరి పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో పోస్టింగ్తో సహా 16 ఏళ్లు పనిచేశాడు. సర్వీస్లో ఉన్నప్పుడు కూడా తన వార్షిక సెలవులను చదువు కోసం ఉపయోగించేవాడు. సైనిక విధులతో పాటు నిశ్శబ్దంగా బలమైన విద్యా పునాదిని నిర్మిచుకున్నాడు దశరథ్ సింగ్. ఇక 2004లో పదవీ విరమణతో సింగ్ తన చిరకాల ఆశయం నిజం చేసుకునే దిశగా అడుగులు వేసి..ఎవ్వరూ ఊహించన విధంగా వందలకొద్దీ డిగ్రీలు పూర్తి చేశాడు. మొత్తం తన జీవితాన్ని చదువుకే అంకితం చేశాడు. సుమారు 138 డిగ్రీలు పూర్తి చేశాడు. తన విద్యా విజయాలు కారణంగా మొత్తం 11 ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి సంస్థల నుంచి గుర్తింపు పొందాడు. వీటిలో చాలామటుకు డిగ్రీలు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వంటి గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేశారు. చదవడానికి వయసుతో సంబంధం లేదని నిరంతర కృషి, అచంచలమైన పట్టుదల ఉంటే..నిరంతరాయంగా కొనసాగించవచ్చు అనడానికి ఈ మాజీ సైనికుడే ఉదాహరణ. (చదవండి: ఆలయాన్ని తలపించే కేఫ్..! ఏకంగా ప్రపంచంలోనే..) -
కండలు తిరిగిన దేహంతో నిర్మాణ కార్మికుడు..! కేవలం ఆ ఆహారంతోనే..
సల్మాన్లాంటి శరీరాకృతి, కండలు తిరిగిన దేహం కోసం యువత ఎంతలా పరితపిస్తూ జిమ్లో కష్టపడుతుంటారో చూస్తుంటాం. కొందరు స్టెరాయిడ్ల వంటి షార్టకట్లను ఆశ్రయిస్తుంటారు. అలా ఉంటేనే తమకు క్రేజ్, స్టార్డమ్ అన్నట్లుగా ఫీలయ్యేవాళ్లు ఉన్నారు. కానీ ఓ సాధారణ భవన నిర్మాణ కూలీ కండలతిరిగి దేహంతో ఉండటం అనేది అత్యంత అరుదు. పైగా అంత పోషకాహారంతో కూడిన భోజనం తినే అవకాశం, వ్యాయామాలు చేసే అవకాశం ఉండదు. కానీ ఆ కార్మికుడిని చూస్తే మన ఆలోచన తీరు మారుతుంది. తనకున్న వనరుల రీత్యా..తన బాడీని ఎలా ఫిట్గా ఉంచాలో కేర్ తీసుకుంటూ కండలు తిరిగిన దేహంతో అబ్బురపరుస్తున్నాడు. అతడి అనుసరిస్తున్న డైటింగ్ విధానం, వర్కౌట్లు గురించి తెలిస్తే విస్తుపోతారు. అన్నింట్లకంటే ఆశ్చర్యకరమైనది అతడు జిమ్కే వెళ్లడట. అలాంటప్పడు అతడికి ఇంతలా కండలు పెంచడం ఎలా సాధ్యమైంది అంటే ..కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఇటీవల ఓ చెన్నై కార్మికుడి శరీర సౌష్టవాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తమ మధ్య జరిగిన సంభాషణ మొత్తం వీడియో రూపంలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో భవన నిర్మాణ పనులు చేసే అతడికి ఇలాంటి దేహం ఎలా సాధ్యమైందని కుతూహలంతో అడుగడం సష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన శరీరాకృతికి సహాయపడిని వ్యాయామ దినచర్య, ఆహారపు అలవాట్లు గురించి కూడా ప్రశ్నిస్తాడు కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్. తాను నిర్మాణ కార్మికుడుగా మండుటెండలో తీవ్రమైన శ్రమతో కూడిన పనలు చేస్తుంటానని తెలిపాడు. తనకు రోజు కఠినమైన దినచర్య, ఎక్కువ పనిగంటలు ఉన్నప్పటికీ..వారానికి కనీసం ఐదుసార్లు వ్యాయామం చేసేలా చూసుకుంటానని చెప్పాడు. సోమవారం ఛాతీ వ్యాయామం, మంగళవారం భుజాల వ్యాయామం, బుధవారం వీపు వ్యాయామం, గురువారం బైసెప్స్, ట్రైసెప్స్ కోసం కేటాయిస్తుంటానని అన్నారు. శుక్రవారం కాళ్ల వ్యాయామం చేస్తుంటానని చెప్పారు. అతడు చేసేది శ్రమతో కూడిన పని కాబట్టి తీవ్రమైన కాళ్ల వ్యాయమాలు చేయనని అన్నారు. తన పనిలో కష్టపడ్డాక తన బాడీ కోసం ఎలా కేర్ తీసుకువాలో అలాగే దాన్ని ఎలా అమలు చేయాలో అనే దానిపై అతనికి ఉన్న స్పష్టత స్ఫూర్తిని కలిగిస్తోంది. డైటింగ్..కండలు తిరిగిన దేహం కోసం ప్రయత్నిస్తున్న వారికి అధిక కార్బోహైడ్రేట్ల ఆహారం సాధారణంగా ప్రతికూల ఫలితాలనిస్తుందని భావిస్తారు. అందుకే వాళ్లంతా తరుచుగా ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ చెన్నైకి చెందిన ఈ నిర్మాణ కార్మికుడు అందుకు భిన్నంగా ఎంచుకోవడం విశేషం. అతడికి వృత్తిపరంగా అధిక కార్బోహైడ్రేట్లు అవసరం. అందుకే రోజుకు మూడుసార్లు అధిక కార్బోహైడ్రేట్లు ఉండే భోజనాన్ని ఎంచుకుంటాడు. అందులో అన్నం, అరటిపండ్లు, గంజి ఉంటాయి. పండ్లు తినడం కూడా అరుదని చెప్పాడు. అయితే వారానికి ఒకసారి మాంసాహారం తింటానని చెప్పాడు. తాను చికెన్ లేదా చేపలు మాత్రం తీసుకోనని చెప్పుకొచ్చాడు. అలాగే తాను కండలు కోసం ఎలాంటి స్టెరాయిడ్లు తీసుకోలేదని వెల్లడించాడు. అలాగే ఎలాంటి వాణిజ్య డైట్ప్లాన్లు లేదా వే ప్రోటీన్లు గానీ తీసుకోనని, కేవలం శుభ్రమైన ఆహారమే తీసుకుంటానని అన్నారు. ప్రతిరాత్రి కనీసం ఏడు గంటలు నిద్రపోయేలా చూసుకుంటానని చెప్పారు. తాను ఇంట్లో వండిన ఆహారమే తింటానని అన్నాడు. చివరగా అందర్నీ జండ్ ఫుడ్ తినొద్దని, మధ్యం, ధూమపానానికి దూరంగా ఉండమని సూచించాడు. ఆ కార్మికుడు నిబద్ధత ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది, పైగా అతడిని చూస్తే..ఏ పనైనా నూటికి నూరు శాతం కష్టపడితే సాధ్యం కానిది అంటూ ఉండదు అని చెబుతోంది కదూ అంటూ వీడియోని ముగిస్తాడు కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ ..!. View this post on Instagram A post shared by Jayachandran Tamilarasan (@fit.blog.by.jc) (చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం) -
మానవీయత మనిషికి అసలైన మకుటం
మానవ జన్మ ఒక అద్భుత కావ్యం అయితే, దానికి మాననీయత ఒక మకుటం వంటిది. మనిషి రూపం కేవలం ప్రకృతి ప్రసాదం, కానీ మనిషి వ్యక్తిత్వం అతను స్వయంగా మలచుకున్న శిల్పం. సమాజమనే అడవిలో అందరూ మనుషులుగా తిరుగుతుంటారు, కానీ సంస్కారమనే చందన గంధాన్ని పూసుకున్నవారే ‘మాననీయులు’ గా గుర్తింపు పొందుతారు. బాహ్యమైన అలంకారాలు కంటికి కనిపిస్తాయి, కానీ మాననీయత అనే అలంకారం గుండెలను తాకుతుంది.నిజమైన మాననీయత అంటే ఎవరూ చూడనప్పుడు కూడా ధర్మాన్ని అనుసరించడం. అధికారమున్నప్పుడు అణకువగా ఉండటం, శక్తి ఉన్నప్పుడు క్షమించడం మాననీయుల లక్షణం. మనిషిని కేవలం ఒక జీవిగా కాకుండా, ఒక మానవీయ శక్తిగా మార్చేది మాననీయత. గౌరవప్రదమైన ప్రవర్తన, ఉన్నతమైన నైతిక విలువలు., ఇతరుల పట్ల చూపే ఆదరాభిమానాల కలయికే మాననీయత. సృష్టిలో అత్యున్నతమైనది మానవ జన్మ. అయితే, కేవలం పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కాలేరు. మనిషిని మహనీయుడిగా, గౌరవప్రదమైన వ్యక్తిగా మార్చేది మాననీయత. సమాజ గమనానికి, మానవ సంబంధాల మనుగడకు మాననీయతే మూలాధారం.మాననీయత– అనే పదం గౌరవానికి చిహ్నం. ఒక వ్యక్తి తన మాట తీరు, ప్రవర్తన, పనుల ద్వారా ఇతరుల మనస్సులో సంపాదించుకునే స్థానమే ఇది. ఇది కేవలం బాహ్య రూపానికి సంబంధించినది కాదు, అంతర్గత సంస్కారానికి సంబంధించినది.ఏ పరిస్థితిలోనైనా సత్యాన్ని పలకడం, నమ్మకద్రోహం చేయకపోవడం. వ్యక్తిగత సామాజిక జీవితంలో నియమ నిబంధనలను పాటించడం. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించి సహాయం చేయడం. ఎంతటి ఉన్నత స్థితికి వెళ్లినా గర్వం లేకుండా సామాన్యులతో కలసిపోవడం. ఇలా మన ప్రవర్తనల వల్ల ఏ రంగంలోనైనా నైతికత పాటిస్తూ పనిచేసేవారికే శాశ్వతమైన గుర్తింపు లభిస్తుంది.నేటి పోటీ ప్రపంచంలో విలువలు కనుమరుగవుతున్నాయి. స్వార్థం, అసూయ వంటి గుణాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. ఇటువంటి సమయంలో మాననీయత ఒక వెలుగు దివిటీలా పనిచేస్తుంది. పెద్దలను గౌరవించడం, పిల్లలకు సంస్కారాన్ని నేర్పడం ద్వారా కుటుంబాలు బలపడతాయి. లంచగొండితనం, అక్రమాలకు తావు లేకుండా పనిచేయడం వల్ల వృత్తికి గౌరవం పెరుగుతుంది. సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా ధర్మం వైపు నిలబడటం కూడా మాననీయతలో భాగమే. మంచిని ఆలోచించడం, మంచిని పలకడం, మంచిని చేయడం అనే త్రివిధ శుద్ధిని పాటిస్తూ మనమందరం మాననీయులుగా ఎదగడానికి ప్రయత్నిద్దాం. మనుషుల మధ్య గౌరవం ఉన్నప్పుడే శాంతియుత సమాజం ఏర్పడుతుంది.మాననీయత అనేది అంగడిలో కొంటే దొరికేది కాదు, అది మన ఆలోచనల నుండి, మన పెంపకం నుండి పుడుతుంది. వ్యక్తిగత గౌరవమే సమాజ గౌరవంగా మారుతుందని గుర్తించి, ఉన్నతమైన విలువలతో జీవించడం మనందరి బాధ్యత. మాననీయత అనేది వ్యక్తిత్వాన్ని పరిమళించేలా చేస్తుంది. మనం ఇతరులకు ఇచ్చే గౌరవమే తిరిగి మనకు మాననీయతగా లభిస్తుంది. సాంకేతికత పెరుగుతున్నా, మానవీయ విలువలు తగ్గకుండా చూసుకోవడమే నేటి అవసరం. రూపం కన్నా శీలం మిన్న, ఆస్తి కన్నా వ్యక్తిత్వం మిన్న. ఆ వ్యక్తిత్వమే మనిషిని మాననీయుడిగా నిలబెడుతుంది.పువ్వు వాడిపోయినా దాని సువాసన గాలిలో నిలిచి ఉన్నట్లు, మనిషి భౌతికంగా మరుగైనా అతని మాననీయత తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. రాసే ప్రతి అక్షరం, మనం వేసే ప్రతి అడుగు మాననీయతకు దర్పణం పట్టాలి. ‘శీలం లేని విద్య, సువాసన లేని కాగితపు పువ్వు’ వంటిది. మాననీయతకు పునాది శీలమే. ఎదురుగాలి వీస్తున్నా, ధర్మమనే దీపాన్ని ఆరిపోకుండా కాపాడుకోవడమే మాననీయుడి పంథా.– ఆనంద ‘మైత్రేయ’మ్ -
లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..
లండన్కు చెందిన ఫుడ్ వ్లాగర్ బెంగళూరులో ఉండగా మన వంటకాలు నేర్చుకోవడమే గాక తయారు చేసి చూపించి ఔరా..! అనిపించుకున్నాడు. పైగా మన వంటకాల రుచులను మెచ్చకుంటూ వాటి గుణగణాల గురించి చెప్పేస్తున్నాడు కడా. మరి ఎవరా వ్లాగర్?, అతడి మనసుని దోచిన వంటకం ఏంటి?..అంటే..యూకేకు చెందని వ్లాగర్ జూలియస్ ఫ్లీడర్ బెంగళూరులో వంటకం నేర్చుకున్న తర్వాత ఇంట్లో వంటకాన్ని తయారు చేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆవికి మీద వండే ఆ వంటకం వివిధ పప్పుల మిశ్రమాలను కలపడం, నానబెట్టడం దగ్గర నుంచి రుబ్బి పులిబయెట్టడం వరకు వివిద ప్రక్రియలను పంచుకున్నారు. కొన్ని ఆహారాలు మన మనసుని తాకుతాయి. వాటి రుచి నాలుకపై అలా నిలిచిపోతుంది. మెత్తగా దూదిలా ఉండే ఆ బ్రేక్ఫాస్ట్ ఎప్పటికీ విసుగు చెందని ఆహారం. వేడి వేడి సాంబార్ లేదా చట్నీతో తింటే అబ్బా ప్రాణం లేచవచ్చినట్లుగా అనిపిస్తుంది, సంతృప్తిగా అనిపిస్తుంది.జూలియస్ ఫీడ్లర్ బియ్యం, మిన పప్పుల పిండిని పులియబెట్టడంతో తన వంట ప్రక్రియను ప్రారంభించారు. సరైన మెత్తదనం కోసం ఈ రెండు పదార్థాలను విడివిడిగా కొన్ని గంటల పాటు నానబెట్టాలని ఆయన సూచించారు. ఆ తర్వాత, నానబెట్టిన నీటిలో కొంత భాగాన్ని బియ్యంతో కలిపి గరుకైన పిండిలా రుబ్బుకోవాలి, అదే సమయంలో మినప పప్పును నీటిలో తేలేంత మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం, అతను ఆ పిండిని కలిపి చేతితో కలపడం ద్వారా పులియబెట్టే ప్రక్రియను ప్రారంభించారు.ఆ వంట నిపుణుడు పిండి పరిమాణం పెరిగి, బుడగలు వచ్చినట్లు పులిసేంత వరకు ఉంచి, చివరగా చిటికెడు ఉప్పు చల్లారు. ఇడ్లీలకు సరైన అండాకారపు ఆకారం రావడానికి, సాంప్రదాయక ఇడ్లీ మేకర్లో వేసి, మరుగుతున్న నీటిపై ఆవిరి మీద ఉడికించి, అవి చక్కగా ఉబ్బేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేశారు. ఇడ్లీ వద్దనుకుంటే మీడియం మంటపై పెనం పెట్టుకుని ఊతప్పంలా కూడా వేసుకోవచ్చని చెప్పారు. .పులియబెట్టడం వల్ల కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై, ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలు పెరుగుతాయి. ఆ వీడియో చివరలో, ఆ ఇన్ఫ్లుయెన్సర్ వేడి వేడి ఇడ్లీలను సాంప్రదాయ అరటి ఆకులో అమర్చి, వాటితో పాటు చల్లని కొబ్బరి చట్నీతో జతచేశారు. వాటిని చూస్తే కచ్చితంగా నోరూరుతుంది. మన లండన్ వ్లాగర జూలియస్ మాత్రం ఆ అల్పాహారానికి అద్భుతం అని కితాబిచ్చాడు. View this post on Instagram A post shared by Julius Fiedler (@hermann) (చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం) -
ఎండాకాలం.. జర భద్రం..!
ఎండా కాలంలో వడదెబ్బ (సన్స్ట్రోక్), డీ హైడ్రేషన్ వంటి వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. వీటికి సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ సీజన్లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు తెలుసుకుందాం. తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఎండలు ఉండే సమయంలో ఎక్కువగా తిరగరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో బయట పనులు ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకోవాలి. రోడ్లమీద అమ్మే రంగు రంగుల డ్రింక్స్ సేవించకూడదు. వీటిలో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. జంక్ఫుడ్ తీసుకోకూడదు. మాంసాహారం తగ్గించి, ఆకుకూరలు, తాజా కూరగాయలు తీసుకోవడం మంచిది ఎండల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంటుంది. కనుక ఎప్పటికప్పుడు నీరు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగడం ఈ సీజన్లో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తేలికైన కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఎండాకాలం రాత్రివేళల్లో చాలా మంది ఆరుబయట పడుకుంటుంటారు. ఇటువంటి సందర్భాల్లో దోమతెరల వంటివి ఉపయోగించాలి ఎండలు అధికంగా ఉండే సమయంలో ఇంటి దగ్గరే ఉండాలి. మరీ అత్యవసరమైతే గొడుగు, టోపీ వంటివి తీసుకెళ్లాలి.వడదెబ్బతో జాగ్రత్త ఎండ వేడిమికి ఎక్కువగా ఎదుర్కొనే సమస్య వడదెబ్బ (సన్స్ట్రోక్). ఎండలో బయటికి వెళ్లడం వలన శరీరంలో నీరు తరిగిపోవడం వల్ల వెంటనే శరీరం నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో మళ్లీ శరీరం మామూలు స్థితికి వచ్చే వరకు కొన్ని ప్రాథమిక విషయాలు పాటించాలి. వడదెబ్బ తగిలినట్లయితే అటువంటి వ్యక్తిని వెంటనే నీడ గల ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటిలో తడిపిన గుడ్డతో శరీరం తుడవాలని, శరీర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చే వరకు అలా చేస్తుండాలని వైద్యులు సూచిస్తున్నారు. గాలి తగిలే చోట వారిని పడుకోబెట్టాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తాగించాలి వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.వేసవిలో పానీయాలే రక్షిస్తాయి వృద్ధులు, చిన్నపిల్లలు సాధ్యమైనంత వరకు ఎండలో బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. మరీ అవసరమైతే ఉదయం 7లోపు పనులు ముగించుకోవాలి. ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా మన ఇంట్లోనే దొరికే సహజమైన మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలి. పుచ్చకాయ, కీరదోసకాయ, తాటిముంజలు, సబ్జాగింజలు, రాగి అంబలి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన నీరు అందుతుంది. వేసవిలో మనం తీసుకునే పానీయాలే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దాహం వేసినా వేయకపోయినా ప్రతి గంటకు మంచినీరు తాగాలి. – డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వర్రావు, లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్త్వరగా నిద్ర పోవాలివేసవిలో సమయానికి పడుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యంగా పడుకోవడం వల్ల ఆలస్యంగా లేచి ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తుంది. త్వరగా బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి. ఈ సీజన్లో వాకింగ్, జాగింగ్కు వెళ్లే వారు ముందుగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొంచెం నీరు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తాగుతుండాలి. ఏమీ తాగకుండా నడవడం, పరిగెత్తడం వల్ల త్వరగా నీరసం వస్తుంది. ఎండలో ప్రయాణించేవారు, ఉద్యోగాల నిమిత్తం బయట పనులు చేసుకునే వారు తమతో పాటు మంచినీరు తీసుకువెళ్లడం మంచిది. గంటకు కనీసం ఒకసారి నీరు తాగడం వల్ల అలసట తగ్గుతుంది. – డాక్టర్ శైలేష్ మోడి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్, సీతమ్మధారపిల్లలు, వృద్ధులు జాగ్రత్తవేసవిలో పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వీరు త్వరగా రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లలను ఎక్కువ సేపు ఎండలో తిరగనీయకూడదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పిల్లలను బయట ఆటలకు అనుమతించాలి. సాధ్యమైనంత వరకు ఈ సీజన్లో ఇంట్లోనే ఉండి ఆడుకునే చెస్, క్యారమ్స్, లూడో వంటి ఇండోర్ గేమ్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వంటివి అలవాటు చేస్తే మంచిది. వీటి ద్వారా పిల్లల్లో సృజనాత్మకత కూడా మెరుగవుతుంది. ఎక్కువగా మొబైల్, టీవీలకు అతుక్కుపోకుండా పిల్లలను వేరే సమ్మర్కోచింగ్ వంటి వాటిలో చేరి్పంచినా మంచిది. – శంకర్ నీలు భాగవతుల, రచయిత, పరిశోధకుడు -
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా సాధ్వి సతీష్ సైల్
గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 టైటిల్ను గెలుచుకున్నారు. 61వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీలు ఒడిశాలోని భువనేశ్వర్లో ఏప్రిల్ 18, 2026న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ ఘనత సాధించారామె. ఈ పోటీలు మరపురాని ప్రదర్శనలను అందించడమే కాకుండా, భారతదేశపు కొత్త అందాల రాణికి కిరీటాన్ని కట్టబెట్టాయి. రజనీగంధ పెర్ల్స్ సహకారంతో KIIT భువనేశ్వర్ సమర్పించిన 61వ ఫెమినా మిస్ ఇండియా వేడుకలో, ఫెమినా మిస్ ఇండియా గోవా, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇక సాధ్వి సతీష్ సైల్ ఒక మోడల్, సామాజిక కార్యకర్త. ఆమె పిల్లలు, ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు సేకరణతో సహా అర్థవంతమైన కార్యక్రమాలకు నిరంతరం మద్దతు ఇస్తున్నారు. అంతేగాదు ట్రెండ్రీల్స్ నుంచి ఫిట్నెస్ అప్డేట్ల వరకు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించి ప్రతిదీ తన అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. ఆమె పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు, ముఖ్యంగా వినికిడి, మాటల లోపాలు ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి తీవ్రంగా కట్టుబడి ఉన్నారు. ఇక ఫైనల్ పోటీల్లో సాధ్వి డిజైనర్ లేబుల్ వాజనే రూపొందించిన, వెండి రంగు మెటాలిక్ పూసల పనితో కూడిన హాల్టర్-నెక్, శరీరానికి అతుక్కుపోయే గౌనును ధరించారు. కిరీటం దగ్గర సగం ముడివేసిన సాధారణ కేశాలంకరణతో జత చేసిన చెవిపోగులు ఆమె రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ఆమె అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈ మేరకు సాధ్వి మాట్లాడుతూ..సామాన్య పట్టణం నుండి వచ్చి, విదేశాల్లోని ప్రపంచ వేదికపైకి అడుగుపెట్టినప్పుడు,తనసొంత ఆలోచన విధానమే ప్రధాన అడ్డంకిగా నిలిచింది. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) ఇతరుల అద్భుత విజయాలు తనలో సందేహాలు కలిగించి తన కలల సాహసాన్ని చేరుకోలేనోమో అనే భయాన్ని పెంచేసేవి అని చెబుతోంది. అయితే ఈ భయాల నుంచి బయటపడి, ఇతరులతో తనను పోల్చుకోవడం మానేసి, మనస్ఫూర్తిగా అభినందించడం వంటివి తనను స్ట్రాంగ్గా మార్చాయని అంటోంది. ఇక భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే దాని స్థితిస్థాపకత, పట్టుదల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమేగాక, సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడి, దృఢ సంకల్పంతో ముందుకు సాగడం అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. కాగా, ఫెమినా మిస్ ఇండియా మహారాష్ట్ర 2026 రజనందిని పవార్ మొదటి రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకోగా, జమ్మూ కాశ్మీర్కు చెందిన ఫెమినా మిస్ ఇండియా యూనియన్ టెరిటరీ 2026 డాక్టర్ శ్రీ అద్వైత రెండవ రన్నరప్గా నిలిచారు. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం) -
'లివర్' అనే నేను..! జస్ట్ ఏడంగుళాల్లో..
లివర్ చాలా కీలకం. ఇది పనిచేయకపోతే మాత్రం ఏ పరికరాలూ, ఉపకరణాలూ రక్షించలేవు. అయితే లివర్ (కాలేయం) గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. లివర్ దెబ్బతిన్నప్పుడల్లా ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్ చేసుకుంటూ ఉండడంతో పాటు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేడు వరల్డ్ లివర్ డే. ఈ సందర్భంగా కాలేయం ఎంత కీలకమైనదో, ఎంతటి వైవిధ్యమైన పనులు చేస్తుందో చెప్పడంతోపాటు ఈ ఏడాది థీమ్... సాలిడ్ హ్యాబిట్స్ – స్ట్రాంగ్ లివర్ అంటే ‘దృఢమైన అలవాట్లతో – బలమైన కాలేయ రక్షణ’ పొందడం ఎలాగో తెలుసుకుందాం.లివర్ పని సైలెంట్. కానీ దాని యాక్టివిటీస్ వైబ్రెంట్. ఎందుకంటే ఓ వ్యక్తి గోల్ఫ్ ఆడాలన్నా, బాల్ కొట్టాలన్నా, కాలు కదపాలన్నా, చెయ్యి కదిలించాలన్నా, తిన్నది అరగాలన్నా, పరుగులు తీయాలన్నా అది కాలేయం చేసే జీవక్రియల వల్లనే సాధ్యమవుతుంది. వాటిలో కొన్నింటిని చూద్దాం.ఉన్నది ఏడంగుళాల స్థలంలోనే... కానీ ఎకరాల కొద్దీ కెమికల్ ఫ్యాక్టరీలంత పని... లివర్.. జస్ట్... ఏడంగుళాల విస్తీర్ణంలోనే... ఎకరాల కొద్దీ విస్తరించి ఉండే కెమికల్ ఫ్యాక్టరీలంత సంక్లిష్టమైన పనులు చేస్తుంటుంది. చాలామంది అపోహ ఏమిటంటే... లివర్ జీర్ణక్రియలకు పనికివచ్చే ఎంజైములు విడుదల చేసి... అన్నం అరుగుదలకే పరిమితమవుతుందని. కానీ పొరబాటున ఓ వ్యక్తి వేలు తెగిందనుకోండి. అతడి రక్తస్రావం ఆగడానికి అవసరమైన రక్తం గడ్డకట్టించే ‘బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్’ వరకు అదే ఉత్పత్తి చేస్తుంది. వ్యాధులను ఎదుర్కోవడానికి కావాల్సిన యాంటీబాడీస్ పుట్టేందుకు తోడ్పడుతుంది. టాబ్లెట్ వేసుకుంటే వచ్చే సైడ్ఎఫెక్ట్లు ఇచ్చే చిరు విషాలను విరిచేయడం దగ్గర్నుంచి... మద్యం తాగేప్పుడు పుట్టే పెను విషాలను నిర్వీర్యం చేస్తుంది. గుండెకు ఓ సేఫ్టీ వాల్వ్లా పనిచేస్తూ... హెపాటిక్ వెయిన్ ద్వారా గుండెకు వెళ్లే రక్తం వెళ్లేటప్పుడు ఆరు నుంచి పది సెకండ్ల పాటు ఆ రక్తపు వేగాన్ని తగ్గించి, ఎక్సెస్ రక్తంతో గుండె ఉక్కిరిబిక్కిరి కాకుండా కానాడుతుంది.దేహంలో తగినన్ని లవణాలు ఉంచేందుకు కిడ్నీపైనుండే అడ్రినల్ గ్రంథులు ప్రయత్నిస్తున్నప్పుడు... అవి పరిమితికి మించి ఉండకుండా చూసేది లివరే. ప్రతి ఒక్కరి ఒంట్లో ప్రతి సెకండ్కూ లక్షలాది ఎర్ర రక్తకణాలు పుడతాయీ, చనిపోతుంటాయి. వాటిని పుట్టించడం, గిట్టించడం కాలేయం పనే! ఎవరూ ఊహించడానికి కూడా వీల్లేని ఇలాంటి పనులెన్నో లివర్ చేస్తుంటుంది.ఆ శక్తే వరమూ... శాపం కూడా! కాలేయంలోని 75 శాతం పనిచేయక పోయినా అది మళ్లీ రిపేర్ చేసుకుని మామూలుగా కాగలదు. ఇంకా అంతకంటే మించితే అది ప్రమాదకరం. అంటే కాలేయం సామర్థ్యం 25 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు ప్రమాదం ఎక్కువ. లివర్లో క్యాన్సర్గడ్డ ఏదైనా వస్తే చుట్టూ చాలావరకు తొలగించాక మనిషి మళ్లీ మామూలైనొతాడు. తీసేసిన లివర్ భాగం మళ్లీ పెరుగుతుంది. కానీ అంత ఎక్కువ సామర్థ్యం ఉన్నందున ఏదైనా ప్రమాదవశాత్తూ లివర్కు సిర్రోసిస్ అనే సమస్య వచ్చి పనిచేయడం మందగిస్తుంటే, లక్షణాలేవీ కనిపించవు కాబట్టి అది ఎక్కువగా పాడయ్యేవరకూ ఆ విషయమే తెలియదు. ఇది ఒకరకంగా శాపం. లివర్లో కొవ్వుకణాలు పేరుకుపోవడం వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్, బాగా మద్యం తీసుకోవడం వల్ల వచ్చే ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్, సిర్రోసిస్ వంటి సమస్యలు లివర్కు వస్తుంటాయి. బాగా బరువు పెరుగుతుంటే, దాన్ని అదుపు చేసుకోవాలి. దేహంపైన రక్తనాళాలు సాలీడు ఆకృతిలో కనిపిస్తున్నా, ఆకలి లేకపోయినా, బాగా నిస్సత్తువగా అనిపిస్తున్నా, పొట్టలో విపరీతంగా నీరు పేరుకుంటున్నా, కళ్లు పసుపురంగులో కనిపిస్తున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.డాక్టర్ ఆర్.వి. రాఘవేంద్రరావు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ –లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ (చదవండి: Summer Health tips: సమ్మర్లో హైడ్రేషన్ కోసం..! కానీ ఈ పొరపాట్లు చెయ్యొద్దు..) -
‘వార్’ఇంటీ వాకిట్లో... కష్టాల చెట్లు!
అదేంటోగానీ రేలంగి మావయ్యకు అంతా మంచిగానే అనిపిస్తుంటుంది. అంతటా మంచే కనిపిస్తుంటుంది. చివరకు నిన్నమొన్నటి యుద్ధం టైమ్లో కూడా. ఆ వార్ తాలూకు కష్టాల్లోనూ మంచిని వెతుక్కుంటుంటాడు మన రేలంగి మామయ్య. ‘‘సార్... రేలంగి అంకుల్ సార్. యుద్ధమంటేనే చెడ్డది. ఆ చెడ్డదాంట్లో కూడా... ఆ యుద్ధాల వాకిట్లో... కష్టాల చెట్లనీ... చెట్లలో కూడా నీడను చూస్తున్నారంటే మీరు మామూలు వ్యక్తులు కారు సార్’’ అన్నాడు రేలంగి మామయ్యగారి వూరి వ్యక్తి ఒకాయన. ‘‘కష్టాలను చెట్టుతో పోల్చారంటే... అసలు మీకంటే గొ΄్పోడెవరుంటార్సార్. ఈ మండు వేసవికాలంలో ఆ చెట్టు నీడకు క్రమంగా అలవాటయ్యామంటే అంతకంటే చల్ల గాలి ఏముంటుందీ. అంతకంటే నేచురాలిటీ ఏముంటుందండీ’’ అంటూ వాక్రుచ్చాడు రేలంగి మామయ్య. ఈ సంభాషణకు నేపథ్యం ఏమిటంటే... ‘‘ఈ ట్రంప్ ఉన్నాడే. వాడు మా చెడ్డవాడు సార్. అనవసరంగా కెలికి లోకమంతటికీ యుద్ధం కష్టాలు తెచ్చిపెట్టాడు. వార్ చేసుకుంటున్నవారు సరే... అసలా వార్తో ఏ సమ్మంధమూ లేనివారిక్కూడా ఎందుకండీ ఈ పాట్లూ... ఈ తిప్పలూ’’ అన్నాడు అక్కడి పల్లెవాసుల్లో ఒకడు. తండ్రికి ఇరువైపులా కూర్చున్న ఆయన కొడుకులు కూడా అదేమాటన్నారు. అంతే... ఒక్కపెట్టున వాళ్లకో క్లాసు తీసుకుంటూ చెలరేగి΄ోయాడు రేలంగి మామయ్య. ఇలా తన స్పీచందుకున్నాడు. ‘‘ఈ యుద్ధం కష్టాలు చూశావా? ఇందులో సీఎన్జీ గ్యాసు దొరకని ఆటోవాడున్నాడూ. టైమ్కు ఇంటికి గ్యాసు సిలెండర్ రానివాడున్నాడూ. రెండ్రోజులపాటు పెట్రోలు బంకుల్లో వరసగా బండ్లను పెద్ద... పే...ద్ద... క్యూల్లో నిలబెట్టినవారున్నారూ. మార్కెట్కెళ్లి పచారీసామాన్ల రేట్లు చూసి గుండెలు బాదుకున్నవారున్నారూ. వీళ్లందరిదీ ఒకటే మాట. ‘దేవుడా నేను మంచోణ్ణి. నాకు గ్యాసు దొరికేలా చూడూ... దేవుడా మేము మంచోళ్లం... మా స్టవ్వుకు గ్యాస్సిలెండరు లోటు రానివ్వకుండా చూడు. మాకు యుద్ధంతో సమ్మంధం లేదు. మాకెలాంటి సరుకుల కొరతా రానివ్వకు’ అని. కానీ ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. అందరికీ సరిసమానంగా కష్టాలు తెచ్చిపెట్టాడు. ఎప్పుడో మా చిన్నతనాన కట్టెల పొయ్యి మీద వండిన టేస్టీ వంటకాల రుచి చూశామా. మళ్లీ ఇన్నాళ్లకి మనందరికీ కట్టెల పొయ్యి మీద వండిన వంటకాల కమ్మటి రుచిని పరిచయం చేశాడు. మన నాస్టాల్జియా రోజుల తాలూకు వంటల రుచి మనకు మళ్లీ చూపించాడు. అందుకు మనమంతా ట్రంపుకి రుణపడి ఉండాల్రా. బజ్జీల బండ్లకూ, టిఫెన్ హోటళ్లకు బ్లాకులో తప్ప కమర్షియల్ సిలెండర్లు దొరక్కుండా చేశాడా... దాంతో కర్రీ΄ాయింట్ల నుంచి కూరలు తెచ్చుకోకుండా, బజార్నుంచి ఏ జంకుఫుడ్డో ఇంటికి తెచ్చుకోకుండా... అందరూ హెల్దీగా హాయిగా హోమ్ఫుడ్డు మాత్రమే వండుకునేలా చేస్తున్నాడు. ఇలా మనందరి ఆరోగ్యాలూ కాపాడుతున్నాడు. అందుకే ట్రంపు మంచోడ్రా. ట్రంపంటేనే మంచోడు. ఒరేయ్... భలే తెచ్చార్రా. భలేగా కట్టెలు కొట్టుకొచ్చారు గొడ్డలితో. ఏదేమైనా... టైముకు తగ్గట్లు – సిచ్యువేషన్ కు సింకయ్యేట్లుగా అలా అందుకోవాల్రా. అన్నట్టొరేయ్... ఈ వార్ వరకే రా – ఈ కష్టాలన్నీ! తర్వాత మరో సంక్షోభమేదో వెతుక్కుంటూ వస్తుంది కదా. మళ్లీ అప్పుడీ కష్టాలు ఉండవు రా. అప్పుడొచ్చేవన్నీ మళ్లీ ఫ్రెష్షు కష్టాలూ... చాలా పెద్ద పెద్ద కష్టాలున్నూ! అష్టకష్టాల్రా అవి. ఓ రకంగా చెప్పాలంటే ముందుముందొచ్చే పెద్ద పెద్ద కష్టాలకు ప్రీవ్యూల్లాంటివి రా... ఈ ట్రైలర్ కష్టాలన్నీ. రాబోయే పాట్లు పెద్దవిగా అనిపించకూడదని... ఇప్పుడే మనకీ శిక్ష–ణ దొరికేలా చూస్తున్నాడురా ట్రంపు. అందుకే ట్రంపు మంచోడ్రా. అసలు ట్రంపంటేనే మంచోడు’’ అంటూ తన మంచితనపు ఉపదేశాన్ని మంచిమంచి మాటల్తో... మంచిగా ముగించాడు మన రేలంగి మావయ్య. ఆ స్పీచ్ విని దారిన పోతున్న ఒక దానయ్య గారికి అకస్మాత్తుగా రావు రమేశ్ పూనాడు. అప్పుడా రావు రమేశ్ పూనిన వ్యక్తి అన్న మాటేవిటో తెలుసా... ‘‘ఈలోకంలో అన్నింటికీ సూత్రాలు కనిపెట్టారుగానీ... ఈ రేలంగి మాయ్యేవిటో... ఈడి విదానాలేవిటో మనకర్దంగావడం లేదు. మావయ్యగారిని ఎవరికన్నా సూపించండ్రా. వదిలేయకండ్రా బాబు అలాగ. సూపించండ్రా’’ అంటూ సవిలెంటుగా డవిలాగు అంటూ మాయమయ్యాడు తెగ మండిపోతూ ఉన్న అపరిచితుడొకడు!– యాసీన్ -
వెండితెర తార... నేల పైకి
మాధవన్ విలక్షణ పాత్రలకు పేరొందిన ఆర్.మాధవన్ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా సాగించిన వైవిధ్యభరిత ప్రయాణం మనందరికీ తెలిసిందే. అయితే మనలో చాలా మందికి తెలియనిది రైతుగా ఆయన సాధించిన అపురూపమైన విజయం....తమిళనాడులోని పళనిలో ఉన్న ఒక బీడు భూమి మాధవన్ విజయానికి కేంద్రబిందువుగా మారింది. ఆ బీడు భూమిని కొనుగోలు చేసిన మాధవన్ ... కేవలం మూడేళ్లలోనే ఫలవంతమైన కొబ్బరితోటగా మార్చారు. నిరంతర కృషి, ప్రయోగాల ద్వారా సాధించిన ఈ మార్పు, తీయని నీరు, విలక్షణమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన నాన్ –హైబ్రీడ్ కొబ్బరి తోటగా రూపుదిద్దుకుంది.నేలతల్లి నుంచి నేర్చుకున్నా...‘వ్యవసాయంలో ప్రతి అడుగు ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేలా చేసింది. ఇది ఎంతో సంతృప్తికరమైన అనుభవం. నా జీవితంలో అత్యంత ప్రతి ఫలదాయకమైన అనుభవాలలో ఒకటి. భూమి పునర్జీవం ΄పొంది, అది ఫలాలను ఇవ్వడాన్ని చూడటం అద్భుతంగా అనిపించింది. సరైన మల్చ్తో భూమిని సిద్ధం చేయడం నుంచి బావిలో సరైన చేపలను వదలడం వరకు నేను నేర్చుకున్న ప్రతి విషయం అమూల్యమైనది. ఎంతో విలువైనది’ అంటారు మాధవన్ ఎంతో సంతోషంగా...కొబ్బరిచెట్ల ప్రాజెక్ట్!తన కొబ్బరి చెట్ల పెంపకాన్ని ఒక ప్రాజెక్ట్‘ గా పేర్కొంటారు మాధవన్ . ‘ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. దీనిలో దాదాపు బీడుగా ఉన్న భూమిలో అత్యంత తీయని, సువాసనగల నాన్ –హైబ్రిడ్, స్వచ్ఛమైన ΄పొట్టి రకం కొబ్బరికాయలను పండించాము. త్వరలో నేను స్థానిక రైతుల కోసం ఒక వ్యాసం రాస్తున్నాను’ అంటున్నారు మాధవన్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నాన్ హైబ్రిడ్ కొబ్బరి తోటల గురించి కల కంటున్నారు మాధవన్.కొత్త ఫలంకోవిడ్ లాక్డౌన్ సమయంలో, మాధవన్ తన అందమైన టెర్రస్ గార్డెన్ను వీడియోల ద్వారా చూపించారు. ఒక వీడియోలో చిన్న చెర్రీ పండ్లను చూపిస్తూ, ‘ముంబై టెర్రస్కు ఒక కొత్త ఫలం వచ్చింది’ అంటూ సంబరంగా చెప్పారు. నటిస్తే ఆదాయం, అవార్డులు రావచ్చు. రైతుగా అడుగులు వేస్తే... ఆ అడుగులు ముందుతరాలకు కొత్త దారులు చూపిస్తాయి. ఈ విషయంలో మార్గదర్శిగా నిలుస్తున్నారు మాధవన్.సామాజిక గళంసామాజిక సందేశాల కోసం గళాన్ని వినిపించడంలో ముందుంటారు మాధవన్. పశుపోషణకు సంబంధించిన విషయాలను, దాని పర్యావరణ ప్రభావాన్ని తెలియజేసేలా పెటా ఇండియా విడుదల చేసిన ‘గ్లాస్ వాల్స్’ అనే వీడియోకు మాధవన్ వ్యాఖ్యానం అందించారు. ‘వధశాలలకు గాజు గోడలు ఉంటే, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారిపోయేవారు’ అన్న ఒక ప్రసిద్ధ ఆంగ్లోక్తిని ఆయన ఈ వీడియోలో మనకు వినిపిస్తారు. మాంసం, పాల పరిశ్రమలలోని రకరకాల దశలను ఈ వీడియో చిత్రీకరిస్తుంది. జంతువుల పట్ల వ్యవహరించే తీరును చూపిస్తూ, నైతికతకు సంబంధించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. తెర వెనుకసినిమా తారలు తెర వెనుక తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఒకవైపు నటనను కొనసాగిస్తూనే మరోవైపు తమవైన అభిరుచులను ఆస్వాదిస్తున్నారు. బైక్, కార్ రేసింగ్లకు పేరొందిన అజిత్ లాంటి తమిళ టాప్ హీరోల నుంచి వెయిట్ లిఫ్టింగ్లో సత్తా చాటుతున్న ప్రగతి లాంటి టాలీవుడ్ నటీమణుల దాకా...విభిన్న రంగాల్లోనూ తమను తాము నిరూపించుకుంటున్నారు. వృత్తిజీవితాన్ని, ప్రవృత్తిని సమన్వయం చేసుకుంటున్నారు.– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
నో షార్ట్కర్ట్స్ : సింపుల్ రూల్తో 16 కిలోలు తగ్గిన బాడ్మింటన్ కోచ్
బరువు తగ్గాలంటే కచ్చితత్వంతో, నిబద్దతతో వ్యాయామం, ఆహార నియమాలు పాటించాలి. అయితే చిన్న అవమానంతో ఒక బ్యాడ్మింటన్ కోచ్ తన జీవన శైలినిమార్చుకుంది. ఆహారనియమాలను సరిచేసింది.కట్ చేస్తే.. 16 కిలోలు తగ్గింది. అయితే ఈ మార్పు అకస్మాత్తుగా జరగలేదు. ఎంతో పట్టుదలతో కష్టపడి సాధించింది. అని చాటి చెప్పింది. విమర్శలనే సవాల్తీసుకుని విజయ తీరాలకు బాడ్మింటన్ కోచ్ సాక్షి శ్రీవాస్తవ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.36 ఏళ్ల బాడ్మింటన్ కోచ్ సాక్షి శ్రీవాస్తవ, తల్లి అయిన తర్వాత సుమారు 20 కిలోల బరువు పెరిగారు. ఒకానొక దశలో ఆమె బరువు 79 కిలోలకు చేరుకుంది. అయితే ఒక రోజు తన క్లయింట్లలో ఒకరు, "మీరే మంచి శారీరక స్థితిలో లేకపోతే, మీ విద్యార్థులకు శిక్షణ ఎలా ఇవ్వగలరని ఆశిస్తున్నారు?" అని అనడంతో అవమానంగా భావించింది. ఎంత మాట అనిపించుకున్నానే అని చిన్నబుచ్చుకుంది.కానీ అక్కడితే ఆగిపోలేదు.అప్పుడే ఆమె బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. చక్కటి ఆహార నియమాలతో దాదాపు 16 కిలోలు బరువు తగ్గింది. XXL నుండి M సైజుకు మారిపోయింది. మొదట్లో ఆమె 'క్రాష్ డైట్స్' (అతిగా పస్తులు ఉండటం) ప్రయత్నించింది, కానీ ఫలితం తాత్కాలికంగానే ఉండేది. ఆ తర్వాత శాస్త్రీయ పద్ధతిలో బరువు తగ్గడం ప్రారంభించారు. కాలిలో రాడ్ ఉన్నప్పటికీ, పట్టుదలతో క్రమబద్ధమైన వ్యాయామాలు చేయడంతోపాటు, పోషకాహారంపై దృష్టి పెట్టింది. ఇదీ చదవండి: మోమోస్ తింటున్నారా? మెమరీ లాస్, లివర్ నాశనం, చివరికి!? డైట్ ప్లాన్ఆపిల్, ఓట్స్ (40 గ్రా), పోహా (40 గ్రా).అన్నం (50 గ్రా), గోధుమలు (40 గ్రా).ఎగ్ వైట్ (గుడ్డులోని తెల్లసొన), ఒక స్కూప్ వే ప్రోటీన్.ఇలా రోజూ కేలరీలను లెక్క వేసుకుంటూ నియంత్రించుకుంటూ క్రమశిక్షణతో కూడిన ఆహారం తీసుకునేది. ఫలితంగా తన బరువును 79 కిలోల నుండి 63 కిలోలకు తగ్గించుకుంది."అప్పట్లో నేను XXL సైజ్ బట్టలు వేసుకునేదాన్ని, ఇప్పుడు M సైజ్కు మారాను. వార్డ్రోబ్ మొత్తం మార్చడం వల్ల జేబుకు చిల్లు పడినా, నా ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశాన్ని తాకింది!" అని ఆమె గర్వంగా చెబుతుంది.ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది!ఆమె సలహా..షార్ట్కట్స్ వద్దు, త్వరగా బరువు తగ్గాలని క్రాష్ డైట్స్ చేయకండి, స్థిరంగా బరువు తగ్గాలంటే స్థిరత్వం, పౌష్టికాహారం, వ్యాయామం అవసరం, ఫలితం నెమ్మదిగా వచ్చినా, క్రమం తప్పని అలవాట్లను పాటించండి అంటారామె.నోట్ : బరువు తగ్గడం అనేది కేవలం తక్కువ తినడం కాదు, సరైన పోషకాహారం వ్యాయామం కలయిక. అందరికీ ఒకే సూత్రం వర్తించకపోవచ్చు. క్రాష్డైట్స్ ఎప్పటికీ మంచిది కాదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. -
అరటిపండు షేప్ అలా ఎందుకు ఉంటుంది?
అరటిపండు (banana) అలా వంగి ఎందుకు ఉంటుంది?ఈ డౌన్ మీకు వచ్చిందా? అరటి గెలలో ప్రతి పండూ వంగే ఉంటుంది. దీనికి కారణం ఉంది. అదేంటో తెలుసుకుందామా?అరటి చెట్టుకి కాసిన గెల కిందకు వేలాడుతున్నా దాని పండ్లు మాత్రం ఆకాశం వైపుకు చూస్తుంటాయి. దీన్ని ‘నెగటివ్ జియోట్రోపిజం’ అంటారు. అంటే సూర్యుడి వైపు పెరగడం. చిన్నప్పుడు అన్ని పండ్లు కిందకే ఉంటాయి. పెరిగే కొద్దీ ఎండ కోసం పైకి వంగుతాయి. అందుకే అరటిపండు షేప్ వంకరగా వస్తుంది. అరటిపండులో పొటాషియం ఎక్కువ. అది గుండెకు, కండరాలకు మంచిది. పండిన అరటిపండు మీద నల్ల మచ్చలు వస్తాయి. వాటిని షుగర్ స్పాట్స్ అంటారు. ప్రపంచంలో 1000 రకాల అరటిపండ్లు ఉన్నాయి.ఇదీ చదవండి: మీటింగ్లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు వింత పండు ’రంబుటాన్’ ’రంబుటాన్’ పేరే వింతగా ఉందే? అవును. ’రంబుటాన్’ అంటే మలేషియా భాషలో ’వెంట్రుకలు’ అని అర్థం. ఎందుకంటే ఈ పండు బయటంతా పచ్చ, ఎరుపు రంగులో వెంట్రుకల్లాంటి మెత్తటి ముళ్లు ఉంటాయి. చూడ్డానికి చిన్న సముద్రపు జీవిలా ఉంటుంది. మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో రోడ్డు పక్కన బళ్ల మీద గుట్టలు గుట్టలుగా అమ్ముతారు. అక్కడి పిల్లలు స్కూల్ అయిపోగానే రంబుటాన్ కొనుక్కుని తింటూ ఇంటికెళ్తారు. మన దగ్గర మామిడిపండు లాగా అన్నమాట. పై తొక్క తీస్తే లోపల తెల్లగా, జెల్లీలా, మెరుస్తూ ఉంటుంది. సరిగ్గా మన లిచీ పండు లాగానే. మధ్యలో ఒక చిన్న గింజ ఉంటుంది. దానిని తినకూడదు.ఈ పండు రుచి కొంచెం పుల్లగా, జ్యూసీగా ఉంటుంది. లిచీ + ద్రాక్ష కలిపినట్టు. అక్కడి పిల్లలు ‘ఒకసారి మొదలుపెడితే ఆపలేం‘ అంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కొందరు జ్యూస్ చేసుకుంటారు, ఐస్ క్రీంలో వేసుకుంటారు.హెల్త్కి చాలా మంచిది! విటమిన్ ఇ ఉంటుంది – జలుబు దగ్గరికి రాదు. ఐరన్ ఉంటుంది – రక్తం బాగా పడుతుంది. ఫైబర్ ఉంటుంది – కడుపు హ్యాపీ. మొదటిసారి చూసిన వాళ్లు ‘అయ్యో ఇది పండా? బొమికా?‘ అని భయపడతారు. కానీ టేస్ట్ చూశాక ‘ఇంకోటి ఇంకోటి’ అని అడుగుతారు. ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
సమ్మర్లో హైడ్రేషన్ కోసం..!
వైశాఖం రాకమునుపే సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. భానుడి సెగ మాములుగా లేదు. ముఖ్యంగా పెద్దలు, చిన్నపిల్లలు, గర్భిణిలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా డీ హైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందరూ సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండటం కోసం.. నీళ్లు దగ్గర నుంచి పండ్లు, తీసుకునే ఆహారం వరకు ఈ పొరపాట్లు చేస్తుంటారని హెచ్చరిస్తున్నారు. దాంతో తీవ్ర డీహైడ్రేషన్ బారినపడి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటారుని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండకాలం హైడ్రేషన్గా ఉండటం కోసం చేయకూడని పొరపాట్లు ఏంటో ఆరోగ్య నిపుణుల మాటల్లోనే చూద్దామా..!.ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడందాహం వేసిందనో మరే కారణంగానో ఒకేసారి ఎక్కువ నీరు తీసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల ఎక్కువ పరిమాణాంలోని నీరు కణాలకు సమర్ధవంతంగా అందుకుండానే బయటకు వెళ్లిపోతుందట. అరలీటరు నీరు తాగితే నాడీ వ్యవస్థ కార్యచరణ మెరుగ్గా ఉంటుందట. అంతకుమించి తాగితే శరీరంలోని కణాలకు తేమ అందకుండా పోతుందని అధ్యయనాల్లో వెల్లడైందని చెబుతున్నారు.నీరు శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఎంచుకోకపోవడం..శరీరానికి తేమను అందించడానికి కేవలం నీరు మాత్రమే కాకుండా ఆహారం కూడా తోడ్పడుతుంది. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మజాతి పండ్ల వంటివి ద్రవాల శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఇవి వేడి వాతావరణంలో తేమను నిలుపుకోవడానికి, శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సహాయపడతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులుడీహైడ్రేషన్ను తీవ్రతరం చేసే పానీయాలు ..చాలామంది ఎంత ఎండకాలం అయినా.. కాఫీ, టీలు పడాల్సిందే లేదంటే కష్టం. వేసవిలో ఇవి శరీరానికి తగినంత నీరు సమర్థవంతంగా అందకుండా చేస్తుందట. అలాగే కూల్డ్రింక్లు, ఇతర పానీయాలు శరీరానికి నీరు అందుతుందన్న భావనను కలిగిస్తాయి గానీ ఇవన్నీ డీహైడ్రేషన్ను మరింత తీవ్రతరం చేస్తాయని అంటున్నారు.హైడ్రేషన్ స్థిరంగా ఉండదట..హైడ్రేషన్ అవసరాలు స్థిరంగా ఉండవని అంటున్నారు. శారీరక శ్రమ, వయస్సు, మొత్తం ఆరోగ్యం ఆధారంగా మారుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో శరీరం ద్రవాలను కోల్పోతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మన యూరిన్ రంగు ఆధారంగా మన శరీరం హైడ్రేటెడ్గా ఉందా లేదా అని తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలా అంటే..మూత్రం రంగు మరి చిక్కగా పసుపు రంగులో ఉంటే వేడి అధికంగా ఉందని, తక్కువ పసుపు రంగులో ఉంటే..తగినంతగా నీరు తీసుకోవాలని..అలా కాకుండా నీళ్లలా ప్యూర్గా ఉంటే..శరీర హైడ్రేటెడ్గా ఉందని అర్థమట.వేళకు తగిన నీరు అత్యంత ముఖ్యం..నీరు తాడం మాత్రమే చూస్తాం. ఎంత వ్యవధిలో తాగుతున్నాం అనేది ముఖ్యం. చాలా సమయం అయ్యాక తగితే..అంత ప్రభావవంతగా ఉండదు. పైగా దీని కారణంగా బయటకు వెళ్లిన వెంటనే వడదెబ్బ బారిన పడతామని అంటున్నారు. అలాగే భోజనంలో బాగా ఆయిల్తో చేసే పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు. తేలికపాటి కాలనుగుణ భోజనమే మేలని చెబుతున్నారు.ఎండకు గురైన వెంటనే నీళ్లు తాగటం..తీవ్రమైన ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటినీళ్లు అస్సలు తాగకూడదల. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి, శరీర ద్రవాలు సమర్థవంతంగా శోషించబడటాన్ని నెమ్మదింపచేస్తుందట. అందుకుని నీళ్లు లేదా కొబ్బరి నీళ్లను తాగే ముందు ఎండకు గురైన శరీరం తగిన ఉష్ణోగ్రతకు స్థిరపడే వరకు ఆగి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.ఇళ్లలో, జర్నీ సమయాల్లో చేసే తప్పిదాలు..ఇంటి వద్ద, కార్యాలయాల్లో ఉన్నప్పుడూ అంతగా నీరు తీసుకోవడం మర్చిపోతుంటారట. రిలాక్స్ అయిపోయి నీడ పట్టునే ఉన్నాం కదా అని తగినంత నీరు తీసుకోరని అంటున్నారు. అందువల్ల ఇలా అస్సలు చెయ్యొదని హెచ్చరిస్తున్నారు.ఉప్పుని మరింత దూరంగా ఉంచడం..ఈ కాలంలో చెమటలు పట్టి..శరీరంలో ఎలక్ట్రోలైట్లు నష్టం ఎక్కువగా ఎదుర్కొనాల్సి ఉంటుందట. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పును పూర్తిగా మానుకోవడం వల్ల, ఖనిజాలు కోల్పోయి కొన్నిసార్లు నీరసం, తలతిరగడం వంటి సమస్యలు ఎదురవ్వుతాయని అంటున్నారు.డీహైడ్రేషన్ పెద్ద సమస్య కాదనే అభిప్రాయం..నిజానికి డీ హైడ్రేషన్ మన మానసిక స్థితి, ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. అధిక వేడి పరిస్థితులు దేనిపై స్థిమ్మితంగా ఆలోచించేలా చేయనివ్వదట. అందుకే తగినంత నీరు తాగితేనే మన శరీరం యాక్టివ్గా ఉండి..ఏ పనైనా సులభంగా చేయగలుగులతామని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight loss: వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..) -
వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్నెస్ మంత్ర..
ఇటీవల బరువు తగ్గడం ఆధునిక ట్రెండ్గా మారింది. అందరూ చక్కటి శరీరాకృతిలో యంగలుక్లో కనిపించడం కోసం రకరకాల డైటింగ్లు, వర్కౌట్లతో పాట్లుపడుతున్నారు. కానీ కొందరు సింపుల్ చిట్కాలతో అద్భుతంగా బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తున్నారు. బరువు తగ్గిన చాలామంది ఎంతో కొంత వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేశామని చెప్పగా ఈ పిల్లల తల్లి మాత్రం అవేమి చేయకుండానే బరువు తగ్గానంటోంది. పైగా ఆరోగ్యకరమైన రీతీలోనే తగ్గానని చెబుతుండటం విశేషం. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.ముంబైకి చెందిన పిల్లల తల్లి, కంటెంట్ క్రియేటర్ సురభి పిసల్ తన వెయిట్లాస్ జర్నీని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ప్రసవానంతరం గుర్తుపట్టలేనంతగా మారిపోయానని చెప్పుకొచ్చింది. మళ్లీ తనలా మార్పు కోసం నెమ్మదిగా బరువతగ్గే యత్నం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తాను వ్యాయామాలు చేయలేదని చెబుతోంది. తన జీవనశైలికి సరిపోయే విధంగా చిన్న, చిన్న స్థిరమైన మార్పులు మాత్రమే చేశానని అంటోంది. అయితే డెలివరీ తర్వాత పరిస్థితులు కాస్త కష్టంగా ఉన్నాయని, ఏ డైట్చేసినా కడుపు ఉబ్బరం, బరువు పెరడం వంటి సమస్యలతో ఇబ్బందిపడ్డట్లు వివరించారామె. అప్పుడే తాను ఆపిల్ సైడ్ వెనిగర్ని ఉపయోగించటం ప్రారంభించానని అన్నారు. ఇది తన జీవక్రియను మెరుగుపరిచి, ఆకలి కోరికలను నియంత్రించడానికి సహాయపడిందని అంటోంది. అది క్రమంగా తన బరువులో మార్పులకు దారితీసింది. ఇంతకుమునుపు సరిపోని బట్టలు సరిపోవడంతో మానసికంగా కాస్తం స్థైర్యం రావడం మొదలైందని తెలిపింది. కేవలం బరువు తగ్గడం పైనే కాకుండా మొత్తం ఆరోగ్యంపై కూడా ఫోకస్ పెట్టానన్నారు. అందుకోసం ఏ చాశారో కూడా చెప్పారు.నల్ల జీలకర్ర నూనె (ఖాళీ కడుపుతో): జీవక్రియను పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానిక హెల్ప్ అవుతుందట.బుల్లెట్ప్రూఫ్ కాఫీ (బ్లాక్ కాఫీ + కొబ్బరి నూనె): ఇది తక్షణ శక్తిని అందిస్తుందట. పైగా కొబ్బరినూనెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొలెస్ట్రాల్ని కరిగిస్తుందట.ఎల్డర్బెర్రీ పొడి: దీన్ని పెరుగుతో కలిపి తీసుకుంటే దీనిలోని యాంటీఆక్సిడెంట్లను మెరుగైన రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు మద్దతిస్తుందని చెప్పుకొచ్చారామె.తాను తన ఆరోగ్యంపై దృష్టిపెట్టడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గిపోయానని అంటోంది. నిజం చెప్పాలంటే వెయిట్లాస్ దానంతట అది జరిపోయిందని చెబుతోంది ఈ న్యూ మామ్. View this post on Instagram A post shared by Surabhi Pisal (@surabhi_littlereviews) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..) -
అమ్మ ట్రైనింగ్కు టైమ్స్‘వంద’నం
రోజులు ఎంత మారినా వంట చేసే మగవారిపైజోకులు ఉండనే ఉంటున్నాయి. కాని వంట కూడా ఒక గొప్ప విజయపథం కాగలదు అని నిరూపించాడు వికాస్ ఖన్నా.వంట గదిలో తల్లి వెనుక తిరుగుతూ ఆమె ద్వారా వంట నేర్చుకున్న వికాస్ ఖన్నా మాస్టర్ షెఫ్గా ఎదిగి నేడు ‘టైమ్ 100– 2026’లో ఒకడిగా ఎంపికయ్యాడు. ఇది వికాస్ తల్లికి లభించిన గౌరవం కూడా. ‘టైమ్ 100’లో కేవలం ముగ్గురు భారతీయులు ఉంటే వారిలో సుందర్ పిచాయ్, రణ్బీర్ కపూర్తోపాటు వికాస్ ఖన్నా ఉన్నాడు. వికాస్ ఖన్నాకు చోటు భారతీయ వంటగది విజయం.ప్రతి ఏటా టైమ్ పత్రిక విడుదల చేసే అత్యంత ప్రభావపూరిత వ్యక్తుల పట్టిక్ట ‘టైమ్ 100’ 2026 సంవత్సరానికి బుధవారం విడుదలైంది. ఈసారి ఎంపికైన నూరుగురిలో భారతీయ స్త్రీలు ఒక్కరూ లేకపోయినా ముగ్గురు పురుషులకు చోటు దక్కింది. వారిలో గూగుల్ సి.ఇ.ఓ. సుందర్ పిచాయ్, ‘యానిమల్’ హీరో రణ్బీర్ కపూర్తో పాటు అమెరికాలో స్థిరపడ్డ ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నాకు చోటు దొరికింది. షెఫ్గా, రెస్టరెంట్ల యజమానిగా ఉన్న గుర్తింపుకే కాదు... అతను చేస్తున్న సామాజిక సేవకు కూడా ‘టైమ్’ ఈ గుర్తింపు ఇచ్చింది. అమృత్సర్ వంట గది నుంచి మొదలైన అతని ప్రయాణం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం కచ్చితంగా విశేషం. ఇందుకు అతడి తల్లి కారణం.అమృత్సర్లో...వికాస్ ఖన్నా పుట్టింది అమృత్సర్లో. చిన్నప్పుడు ‘క్లబ్ఫుట్ సమస్య’ వల్ల కాళ్లలో సత్తువ లేక సరిగా నడవలేకపోయేవాడు. స్కూల్లో పిల్లలు ‘పోలియో వాలా లడ్కా’ అని ఏడిపించేవారు. దాంతో స్కూలుకు వెళ్లడానికి నిరాకరించి ఇంట్లో అమ్మ బిందూ ఖన్నా వెంట వంటగదిలో ఎక్కువ ఉండేవాడు. అక్కడి బంగాళదుంపల వాసన, వేగే జీలకర్ర చిటపటలు, రొట్టె కాల్చే వేడి – ఇవే అతనికి ఊరటనిచ్చేవి. ఆ వంటగదికి పసుపు రంగు తలుపు ఉంటే రాను రాను వికాస్కి అది ‘హల్దీ’లా కనిపించేదట. ‘నేను నడవ లేకపోతే ఏంటి... నా చేతులు వంట చేయగలవు కదా’ అనిపించిందట!అమ్మ వంట స్టైల్అమ్మ వంట స్టైల్ను వికాస్ నిశితంగా గమనించేవాడు. ఆమె పంజాబీ వంట చేసేది. మిక్సీలు, అవెన్లు లేకపోయినా వంటలో ఓపిక, శుభ్రత తప్పేది కాదు. ఉదయం మార్కెట్లో తాజా కూరగాయలు బేరమాడటం, మోపెడ్ మీద గ్యాస్ సిలిండర్ తేవడం ఆమే చేసేది. ‘వంటవాడికి ఏ పనీ చిన్నది కాదు. గుర్తు పెట్టుకో’ అని కొడుక్కి చెప్పింది. ఆటా గూంద్నా... ఫుల్కే బనానా...‘పిండిని ప్రేమతో కలిపి మెత్తగా, పొంగుతూ వచ్చేలా కాల్చడం నేర్చుకుంటే నీకు వంట వచ్చినట్టే’ అని చెప్పిందామె. అలా కొడుకు చేత తొలిపాఠం మొదలు పెట్టించింది. ఆ తర్వాత బెండకాయ, ఆలూ గోబీ, దాల్ లాంటి పది రకాల వంటల్ని రొటేషన్ లో చేయించేది. ఇక ఆమె శీతాకాలంలో చేసే స్పెషల్– గాజర్ కా హల్వా. ఇదంటే వికాస్కు ప్రాణం. తల్లి నుంచి వంట నేర్చుకున్న వికాస్ 16 ఏళ్ల వయసులో సొంతగా ‘లారెన్స్ గార్డెన్’ అనే క్యాటరింగ్ నడిపేవాడు. బుకింగ్ తీసుకోవడం నుంచి డెలివరీ వరకూ అన్నీ తనే. ‘కస్టమర్ల నమ్మకమే నిజమైన ధనం’ అని తల్లి వ్యాపార పాఠం వికాస్కు నేర్పింది. ‘వంటతో పాటు ఆప్యాయతను వడ్డించడం మరువకు’ అని చెప్పిందామె. వికాస్ కేవలం చెఫ్ మాత్రమే కాదు. రచయిత, ఫిల్మ్ మేకర్, మానవతావాది. 40కి పైగా వంటల పుస్తకాలు రాశాడు. ‘ది లాస్ట్ కలర్’ అనే సినిమా తీశాడు. ఎక్కడికి వెళ్లినా ‘నేను ముందు వంటవాడిని‘ అని గర్వంగా చెప్పుకుంటాడు. ‘వంట నాకు భాష నేర్పింది. అమెరికాలో నాకు ఇంగ్లీష్ సరిగా రానప్పుడు నా వంట మాట్లాడింది. నా బాధను, నా ప్రేమను, నా దేశాన్ని ప్లేట్లో పెట్టి ప్రపంచానికి అందించాను’ అంటాడు వికాస్ ఖన్నా.తల్లి ఆశీస్సు.... చేసే పని పట్ల ఇంత నిబద్ధత, ఆర్తి, శ్రద్ధ, హృదయం ఉన్నవాడు ‘టైమ్ 100’లో చేరక ఎలా ఉంటాడు?వంట నా ప్రార్థన‘వంట నాకు వృత్తి కాదు, అది నా ప్రార్థన’ అంటాడు వికాస్ తల్లి నుంచి నేర్చుకున్న వంట గురించి. చిన్న వయసులోనే అమృత్సర్లో షెఫ్గా పేరు పొందిన వికాస్ ఆ తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్లో∙రెస్టరెంట్లు తెరిచాడు. అమెరికా సంస్థలు ఇండియన్ రెస్టరెంట్లకు ఇవ్వని ‘మిచెలిన్ స్టార్’ హోదాను పొందాడు. ఆ తర్వాత సామాజిక సేవ మొదలుపెట్టాడు. కోవిడ్ టైంలో భారత్లో లక్షల మందికి ‘ఫీడ్ ఇండియా’ పేరుతో అన్నం పెట్టాడు. ‘ఒకరి ఆకలి తీర్చడం కంటే గొప్ప సంతృప్తి ఇంకోటి లేదు’ అంటాడు. -
చూయింగ్ గమ్ నమలడం నుంచి 3-2-1 రూల్..! ఏకంగా 80 కిలోలు..
ఆధునిక కాలంలో బరువు తగ్గడం అనేది చాలా సమస్యాత్మకంగా మారింది. చాలామంది వెయిట్లాస్ అయ్యేలా సర్జరీలు, మందుల వెంట పరిగెడుతున్నారు. మరికొందరు ఆరోగ్యకరంగా తగ్గేందుకు పాట్లు పడుతున్నారు. ఆ క్రమంలో కొందరు ఇతరులకు ప్రేరణ కలిగించేలా అద్భుతంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు కూడా. కానీ వాళ్లందరూ చెప్పేది కొద్దికిద్దిగా తింటూ ఎక్కువసార్లు తినమని, మంచి ఆహారపు అలవాట్లు తదితర టిప్స్ ఇస్తే. ఈ వ్యక్తి మాత్రం అత్యంత వింత వెయిట్లాస్ చిట్కాలు ఇచ్చాడు. అవి చూస్తే ఇవేం చిట్కాలు అనిపించినా..అంతకుమునుపు, తదుపరి పరివర్తన చూస్తే నిజంగా అవే సరైనవా? అనే ఆశ్చర్యం కలుగకమానదు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామాకువార్ కపూర్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన వెయిట్లాస్ జర్నీని షేర్ చేశారు. తాను ఒకప్పుడు 142 కిలోల బరువు ఉండేవాడినని తెలిపాడు. పైగా కొన్ని రకాల వింత ఫిట్నెస్ టిప్స్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తదితరాలు తన వెయిట్లాస్ సీక్రెట్ అని చెబుతున్నాడు. వర్కౌట్లు, మంచి ఆహారపు అలవాట్లు వరకు ఓకే. కానీ ఈ వింత ఫిట్నెస్ టిప్స్ ఏంటి..?. బరువు తగ్గడానికి అవెలా ఉపయోగపడ్డాయ్?డైట్ సోడా తాగడంబరువు తగ్గే ప్రయాణంలో డైట్ కోక్, సోడా, శీతల పానీయాలు, ఇతర చక్కెర పానీయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కానీ భోజనంతో పాటు డైట్ సోడా తాగడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుందని కువార్ నొక్కి చెప్పారు. కేలరీలు లేని, సాధారణ ఫిజీ డ్రింక్ లాగే రుచిగా ఉండే సోడాను ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు.చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడంభోజనం తర్వాత చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం వల్ల అతిగా తినాలనే కోరికలను నివారిస్తుందట. కొలెస్ట్రాల్ తగ్గేలా ఎక్కువ కేలరీలు తీసుకోకుండా చేస్తుందట. ముందుగా ప్రోటీన్ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వడం వింతైన చిట్కా కాదు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లకు ఇది చాలా అవసరం. ప్లేట్లో ఎల్లప్పుడూ ముందుగాప్రోటీన్, తర్వాత కార్బోహైడ్రేట్లు చేర్చుకోవాలని కువార్ పేర్కొన్నారు.టీ మాక్సింగ్రోజంతా ఎక్కువగా కదలడం, ఉదాహరణకు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కాలు ఊపడం లేదా అటూ ఇటూ తిరగడం వంటివి, మనకు తెలియకుండానే అదనపు కేలరీలను ఖర్చు చేస్తాయంట. పైగా అనుకున్నదానికంటే వేగంగా కేలరీలు ఖర్చు అవుతాయట.ఎక్కువగా నిలబడటంకువార్ ప్రకారం, మీరు స్క్రీన్ చూసే సమయంలో సగం సేపు కేవలం నిలబడటం వల్ల ఎక్కువ శక్తిని ఖర్చు అవుతుందట. జువారీ కేలరీల ఖర్చులో ఇది కూడా చిన్నగా బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట3-2-1 రూల్..3-2-1 రూల్ కువార్కు మరింత స్థిరంగా కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడింది. దీని ప్రకారం నిద్రపోయే మూడు గంటల ముందు చివరి భోజనం ముగించడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడటానికి సమయం లభిస్తుంది. త్వరిత గతిన బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందట. ఇక రెండు గంటలు హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవడం,ఇక ఒక గంట స్క్రీన్టైమ్ కోసం. ఇలా ప్లాన్చేస్తే అమాంతం చాలా బరువు తగ్గుతామని చెబుతున్నాడు.మంచి అరుగుదల కోసం నడకభోజనం చేసిన వెంటనే ఐదు నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడానికి బదులుగా కండరాలకు చేరవేయడానికి సహాయపడుతుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంటాయి. View this post on Instagram A post shared by Kuwar Kapur (@fitnessbykuwar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అందరికీ ఈ టిప్స్ వర్తించవు. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్లో టాపర్గా..!) -
వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్లో టాపర్గా..!
మురికివాడల్లో పెరిగే నిరుపేద బాలబాలికల్లో అపారమైనే తెలివితేటలు ఉంటాయనేందుకు మరో నిదర్శనం ఇది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుర్భర పరిస్థితుల్లో బతుకుతూ..ఊహకే అందని విధంగా బోర్డు ఎగ్జామ్లో టాపర్గా నిలవడం మామాలు విషయం కాదు కదా. బహుశా ఈ అమ్మాయి భవిష్యత్తులో మరో స్లమ్డాగ్ మిలియనీర్గా అవతరిస్తుందేమో..!. ఇంతకీ ఎవరా ఆ అమ్మాయ్ అంటే..బోఫాల్లోని భీమ్ నగర్ అనే ఒక మురికవాడకు చెందిన అమ్మాయి 18 ఏళ్ల చాందిని విశ్వకర్మ. మధ్యప్రదేశ్ బోర్డు ఎగ్జామ్2026లో కామర్స్ విభాగంలో ఆమెకు వచ్చిన మార్కులు తెలిస్తే విస్తుపోతారు. ఆ అమ్మాయి మురికివాడలకు చెందిందేనా అనే అనుమానం వస్తుంది. కటిక దారిద్య్రం మధ్య కష్టపడి చదివి విజయం సాధించిన ఆమె కథ ప్రతిఒక్కరికి స్ఫూర్తి. చాందిని తండ్రి రోజువారీ కూలీ. వడ్రంగి పనిచేస్తూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన సంపాదన అరకొరగానే సరిపోతుంది ఇంటికి. చెప్పాలంటే కొద్దిపాటి అవసరాలకు కూడా అక్కరకు రాదు అతడి సంపాదన. ఇంట్లో ఇంతటి ఆర్థిక బాధలు ఉన్నా.. చదువుపైనే అచంచలంగా దృష్టి సారించింది. ఇంటర్లో విద్యార్థులంతా వివిధ కోచింగ్ సెంటర్లు, ఇతర వనరులపై ఆధారపడగా, ఆమె మాత్రం నిరుపేద పిల్లల కోసం ఉద్దేశించిన ఉచిత పాఠశాల అయిన గురుదేవగుప్త శిక్షా కేంద్రం చదువుకుంది. ఆమె అధ్వాన్నమైన జీవన పరిస్థితులు కారణంగా మిణుకుమిణుకుమనే వీధి దీపాలు, దోమల బెడద మధ్య అహర్నిశలు కష్టపడి చదివింది. ఆ కష్టమే ఆమెను మధ్యప్రదేశ్ ఇంటర్ బోర్డు ఎగ్జామ్లో 98.8% మార్కులతో టాపర్గా నిలిచేలా చేసింది. ఆమె కామర్స్ విభాగంలో 500 మార్కులకు 494 మార్కులతో (98.8%) అసాధారణమైన స్కోరు సాధించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె గెలుపు అసాధారణమైనది. పెద్దపెద్ద కాలేజీల్లో చదువుకునే విద్యార్థులందర్ని వెనక్కి నెట్టి మూరిక వాడల నేపథ్యం నుంచి వచ్చిన నిరుపేద అమ్మాయి అగ్రస్థానంలో నిలవడం మాటలకందని విజయం కదూ..!.(చదవండి: ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్ కమిషనర్గా..!) -
చిన్నారులకు ఆ చిరుతిండ్లు వద్దు..!
ఇటీవల చిన్నపిల్లల వైద్యుల వద్ద కేసులు పెరుగుతున్నాయి. కడుపు నొప్పి, వాంతులు ఇతర అనారోగ్య కారణాలతో చిన్నారులను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్తున్నారు. దీనికి చిన్నారులకు ఇస్తున్న ఆహారంలో మార్పులే కారణంగా చెప్పవచ్చు. ఒకప్పుడు చిన్న పిల్లలు మారాం చేస్తే.. ఇంట్లో ఉండే బెల్లం లేదా తయారు చేసుకునే సాంప్రదాయ చిరుతిళ్లను ఇచ్చేవారు. వీటి వలన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేది. అయితే కాల క్రమేణ ప్రస్తుతం మార్కెట్లోకి జంక్ ఫుడ్ విస్తరించింది. చిన్నారులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల ప్యాకింగ్లతో పాటు వారి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలతో ఈ జంక్ ఫుడ్ ప్రభావం మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు పాకింది. వీటి వలన చిన్నారుల ఆరోగ్య, మానసిక వికాసం పూర్తిగా నాశనమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్కలి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదుగుదలకు హానికరం చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్ ఫుడ్స్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి చిన్నారులకు జంక్ ఫుడ్ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి.అవగాహన కల్పిస్తున్నాం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్ ఫుడ్ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. – విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి జంక్ఫుడ్తో అనారోగ్య సమస్యలు జంక్ ఫుడ్ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్ఫుడ్ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – బీఆర్కే మహారాజ్, చిన్న పిల్లల వైద్యు నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రిసంప్రదాయ ఆహారంతో మేలుచిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి. (చదవండి: మామ్ వెయిట్లాస్ జర్నీ..! నో క్రాష్ డైట్, నో స్ట్రిక్ట్ రూల్స్..ఏకంగా 22 కేజీలు..) -
మామ్ వెయిట్లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
బరువు పెరడం ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న తీవ్ర సమస్య. ముఖ్యంగా ముఖం, కాళ్లు చేతులలో ఫ్యాట్ పేరుకుపోయి..ఊబకాయంతో కనపించేలా చేస్తుంది ఈ అధిక బరువు. తగ్గాలన్నా ఆలోచన రావడం, దానిపై నిలకడతో సాగడంతోనే ఈ సమస్యకు చెక్పెట్టగలరు. లేదంటే తగ్గినట్లే తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంటారు. అందులోనూ మహిళలు పెళ్లి ముందు వరకు సన్నజాజిలా అందంగా కనిపించనవాళ్లు..పిల్లలు పుట్టడంతోనే ఈ సమస్య బారినపడుతుంటారు. అందుకు మాతృత్వం, ఇంటి బాధ్యతలు నడుమ తన శరీరంపై కేర్ ఉండక ఈ అధిక బరువు బారిన సునాయాసంగా పడిపోతుంటారు. అలాంటి వాళ్లు కూడా కాస్త పిల్లలు తమ పనులు చేసుకునే స్థాయికి చేరుకున్నాక..తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని వెయిట్లాస్ అయ్యి..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ మామ్ కూడా.ఆ తల్లే నూపుర్ కల్రా. చెన్నైకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆమె. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ వేదిక తన వెయిట్లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నారు. తాను 22 కేజీల వరకు అధిక బరువుని ఎలా తగ్గించుకుందో వెల్లడించారు. తాను ఎలాంటి క్రాష్ డైట్ పాటించలేదని అన్నారు.ప్రోటీన్ తప్పనిసరిగా..ఆహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు తన లైఫ్లో పెద్ద గేమ్ ఛేంజర్ అని అంటోంది. ప్రోటీన్ తృప్తికి, శక్తికి, క్రమబద్ధతకు సహాయపడుతుందట. అయితే ఏ ప్రోటీన్ మీకు సరిపోతుందనేది పోషకహార నిపుణులను సంప్రదించే పాటించమని నొక్కి చెబుతోంది.ఇంటి భోజనంఆ ఇన్ఫ్లుయెన్సర్ స్విగ్గీ, జొమాటో, డెలివరీ ఫ్లాట్ఫాంల నుంచి ఆర్డర్ చేసిన భోజనాల కంటే ఇంట్లో వండిన ఆహారాన్నే ఎంచుకన్నట్లు తెలిపింది. ఎప్పుడైనా..బరువు తగ్గాలనుకునేవారు ఇంట్లో వండిన భోజనాన్నే ప్రిఫర్ చేయడం ముఖ్యం.ఎక్కువగా నీరు తాగడం..డీహైడ్రేషన్ బారినపడటం వల్లే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. అందుకే తగినంత నీరు తాగితే తీపి పదార్థాలు, వేయించిన ఆహారాల జోలికి పోరు అని అంటోంది.అలాగని స్వీట్లకు దూరం కాలేదట..ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..నచ్చిన స్వీట్లు తినేదట. అయితే ఎంత మోతాదులో తినాలనేది నిర్ణయించుకుని మరి ప్లాన్ ప్రకారం తినేదాన్ని అంటోంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ సూచనుల పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Noopur Kalra (@noopurkalra) (చదవండి: చలువ చేసే మారేడు పానకం..!) -
అక్షరాలా... మహిళా సాధికారతకే ఓటు
‘మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు?’ అనే ప్రశ్నకు 360 డిగ్రీల కోణంలో సమగ్రంగా చెప్పే జవాబులు ఎన్నో ఉన్నాయి. అలాంటి జవాబులకు ఉపయోగపడే పుస్తకం... ఉమెన్ అండ్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. తరుణ్ బెహూరియా రాసిన ఈ పుస్తకంలో రిజర్వేషన్ల ప్రాముఖ్యత, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంపై దాని ప్రభావాన్ని గురించి వివరంగా చర్చించారు. ‘సరిౖయెనప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం అవసరం’ అనే అంశంతో ‘ఉమెన్ అండ్ రిజర్వేషన్ ఇన్ ఇండియా’ పుస్తకం రాశారు. పంచాయతీరాజ్లో రిజర్వేషన్ల ప్రభావం, భారతదేశంలో మహిళా సాధికారత: రాజకీయ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు: ఒక సామాజిక అవసరం, జాతీయ బాధ్యత, భారతదేశంలో మహిళలకు కోటాల అమలు, మహిళా రిజర్వేషన్ బిల్లు: మహిళా సాధికారతకు ఒక మైలురాయి. స్థానిక స్వపరి పాలన, మహిళలు, రాజకీయ భాగస్వామ్యం: శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్... ఇలా ఆసక్తికరమైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా భారత రాజకీయ చరిత్ర, ΄÷రుగుదేశాలలో మహిళల రాజకీయ భాగస్వామాన్ని గురించి వివరించే పుస్తకం... ఉమెన్స్ రిజర్వేషన్ అండ్ పాలిటిక్స్– పోస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. భారతదేశంలో మహిళలకు ఉన్న రిజర్వేషన్లను విశ్లేషించే ప్రయత్నమే ఈ పుస్తకం. నాలుగు విభాలుగా విభజించిన ఈ పుస్తకం మహిళా రిజర్వేషన్ చట్టంలోని వివిధ కోణాలను వివరిస్తుంది. -
'పర్సు'నాలిటీ డెవలప్మెంట్
పిల్లలకు అక్షర జ్ఞానాన్నే కాదు. ఈ రోజుల్లో ఆర్థిక అక్షరాస్యతను అందించడమూ అవసరమే! చాలా మంది డబ్బు సంపాదించడంపైన దృష్టి పెడతారు. కొందరు మాత్రం ఆ డబ్బును సరిగ్గా వినియోగించి, ఆర్థిక సమస్యలు లేకుండా కూల్గా ఉంటారు. ‘డబ్బు ప్రాముఖ్యత, ఖర్చుల నిర్వహణ, పొదుపు.. అలవాట్లు పెంపొందితే పెద్దయ్యాక ఆర్థిక భారాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది’ అంటున్నారు నిపుణులు. వేసవి సెలవుల్లో పిల్లలకు తీరికగా, అర్థమయ్యేలా చెప్పే మనీమేనేజ్మెంట్ గురించి మరింత వివరంగా!పిల్లలకు పెద్దలు ఇచ్చే కానుకలలో జీవితకాలం గుర్తుండి΄ోయేది డబ్బును ఎలా నిర్వహించాలో తెలిసే జ్ఞానం కూడా. ఆ ఆలోచన అమలు భవిష్యత్తులో పిల్లలు ఆర్థిక విషయాల్లో బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుంది. అవసరాలకు.. కోరికల మధ్య తేడా! పిల్లలకు స్టేషనరీ అవసరం ఉండి షాపింగ్కు తీసుకెళుతుంటారు పెద్దవాళ్లు. అక్కడ పిల్లలను ఆకట్టుకునే చాక్లెట్లు, బొమ్మలు ముందుంటాయి. ఇలాంటప్పుడు పిల్లల మనసు బొమ్మలు, చాక్లెట్ల మీదకు మళ్లుతుంది. ముందుగా అవే ఎంచుకుంటారు. అవసరమైనవి కొనడానికి వాయిదా వేయడం లేదా పెద్దలను మరికొంత డబ్బు ఇవ్వమని అడగడం సహజంగా జరుగుతుంటుంది. ‘ఏది అవసరం, ఏది కోరుకోవడం..’ అనే ఎంపిక ముందు ఇంటి వద్దే ఇవ్వడం మొదలుపెట్టాలి.తప్పిదాల నుంచి పాఠాలుఈ రోజుల్లో చాలావరకు తల్లీతండ్రీ ఇద్దరూ సంపాదనపరులై ఉంటున్నారు. కోరింది ఇవ్వడానికి చేసే ప్రయత్నాల్లో ఖర్చు శాతమూ పెరిగింది. తాము చేస్తున్న ఆర్థిక తప్పిదాలు ముందు పెద్దలు అర్థం చేసుకోవాలి. విద్య, వైద్యం, కుటుంబంలో వచ్చే అత్యవసర ఖర్చుల గురించి పిల్లలతో చర్చించడం వల్ల వారిలో ‘ఖర్చు’ పట్ల అవగాహన పెరుగుతుంది.సొంత డబ్బు...స్కూల్ లేదా ఏదైనా ΄ోటీల్లో పాల్గొనప్పుడు సంపాదించుకున్న ప్రైజ్ మనీని, అమ్మమ్మ, తాతయ్య, బంధువులు.. ఇచ్చిన మొత్తాన్ని, కిడ్డీ బ్యాంక్లో డబ్బు దాచుకోవడానికి ప్రోత్సహించాలి. పొదుపు మొత్తాలకు వడ్డీ రూపేణా వచ్చే వీలున్న పోస్టాఫీసు, బ్యాంకులు పిల్లల కోసం ఇస్తున్న అవకాశాల గురించీ తెలియజేయాలి. వారు ఆదా చేసిన డబ్బు మొత్తాల నుంచి కొనుగోళ్లు కూడా చేయించాలి. దీనివల్ల ఏది అవసరం, ఏది అనవసరం అనే విషయాలపట్ల అవగాహన పెంచుకుంటారు. పంచుకోవడమూ అవసరమే! ఖర్చు, పొదుపు, డొనేషన్ .. ఇలా మూడు బాక్స్లను చేయించి, వాటిని నిర్వహించమని చెప్పాలి. ఏ బాక్స్లోని డబ్బు ఎలా ఖర్చు అవుతోందో గమనించమనాలి. డబ్బు కేవలం మనకోసం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియజేయాలి. ఆటగా... అభ్యాసం...పిల్లలకు రకరకాల నోట్లు, నాణేలు, కార్డులను చూపించాలి. వాటిని వరుసక్రమంలో అమర్చుతూ, వాటి పేర్లు, ఆకారాలు, పరిమాణాలు, రంగులు, విలువ, చిహ్నాల గురించి మాట్లాడాలి. షాపింగ్కు తీసుకెళ్లినప్పుడు బిల్లు కౌంటర్ వద్ద పిల్లలకే డబ్బు ఇచ్చి, చెల్లింపులు చేయించాలి. ఈ రోజుల్లో తప్పనిసరిగా మారిన డిజిటల్ పేమెంట్స్ నిర్వహణ గురించి తెలియజేయాలి.కార్డు ద్వారా బిల్ చెల్లించాల్సి వస్తే, కౌంటర్ వద్ద కార్డును ట్యాప్ చేయించడం, తిరిగి తీసుకోవడం గురించి చెప్పాలి. ఆన్లైన్లో అప్లికేషన్ వాలెట్ బ్యాలెన్స్ను పిల్లలకు చూపించి, కొనుగోలు పూర్తయ్యాక, బ్యాలెన్స్ ఎలా మారుతుందో చెప్పవచ్చు.కొనుగోలు రసీదులను చూపించి, వస్తువులు, వాటి విలువ, మొత్తం లెక్కించమని చెప్పవచ్చు. ఎఐ అప్లికేషన్ను ఉపయోగించి ఫ్యామిలీ, ట్రావెల్ బడ్జెట్ను రూపొందించమని సూచించవచ్చు. పిల్లలకు మనీ మేనేజ్మెంట్ నేర్పడం అనేది ఒక్కరోజులో పూర్తి కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. తల్లిదండ్రులు ఎగ్జాంపుల్గా ఉండి, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఇస్తే, వారు భవిష్యత్తులో ఆర్థికంగా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. నేరుగా తెలుసుకునేలా చేస్తాను...మా ఇద్దరి పిల్లలు ఐదు, ఏడు తరగతుల్లో ఉన్నారు. ఇద్దరూ పోటీల్లో పాల్గొన్నప్పుడు వచ్చిన క్యాష్ ప్రైజ్ మనీని ఎలా పొదుపు చేసుకోవాలో చెబుతుంటాం. విడిగా బ్యాంక్ అకౌంట్ తీశాం. కిడ్డీ బ్యాంక్ నిండిపోయినప్పుడు ఆ అకౌంట్లో వేస్తుంటారు. వారికి అవసరమైనవి, కావాలనుకున్నవి ఆ మొత్తం నుంచి కొనుగోలు చేయమని కూడా చెబుతుంటాం. తమ దగ్గర పొదుపు మొత్తం పెరుగుతున్నప్పడు వాటిని ఎందులో పెట్టుబడిగా పెడితే బాగుంటుంది అనే విషయాల గురించి అడుగుతుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్, ప్రీమియమ్ గురించి కూడా చెబుతుంటాం. బయట కొనుగోలు చేసే వస్తువులు ఇంట్లో సొంతంగా తయారు చేయవచ్చా అనేది ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల డబ్బు ఆదా అవుతుందనే విషయాలు వారికి అర్థమవుతుంటాయి. – శకుంతల కస్తూరి, గృహిణి, బీహెæచ్ఇఎల్, హైదరాబాద్ నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే..? ప్రాణాలకే ప్రమాదమా?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు నగరానికి చెందిన ఓ గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వెంటనే అడ్మిట్ చేయించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీగా గుర్తించి ఆఫరేషన్ చేశారు. ఈ క్రమంలో ఆ తల్లి మృత్యువాత పడింది. ట్యూబ్ పగిలిపోవడంతోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో తరచూ నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. తల్లి గర్భాణికి గండం తప్పనంటోంది. గర్భసంచిలో గర్భం దారి తప్పుతోంది. ఇందుకు ఇన్ఫెక్షన్లు, వరుస అబార్షన్లే ప్రధాన కారణమని తెలుస్తోంది. అండాశయం, గర్భాశయ నాళాల్లో గర్భం(ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) ఏర్పడుతోంది. మాతృమరణానికి దారి తీస్తోంది. ఈ విషయంలో తల్లులు అప్రమత్తంగా వ్యవహరించకుంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాణిపాకం జిల్లాలో ఎక్టోఫిక్ ప్రెగ్నెన్సీ కేసులు పెరుగుతున్నాయి. గర్భం సరైన స్థానమైన కాకుండా గర్భాశయ నాళాలు (ఫాలోపియన్ ట్యూబ్స్), అండాశయం లేదా పొత్తికడుపులో ఏర్పడుతోంది. దీన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. జిల్లాలో ఒక జిల్లా ప్రభు త్వ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు 4, సీహెచ్సీలు 8, పీహెచ్సీలు 50, ప్రైవేటు ఆస్పత్రులు వెయ్యి వరకు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7వేలకు పైగా గర్భణులు గుర్తిస్తుండగా.. 5వేల ప్రసవ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రతి 100 గర్భధారణల్లో కనీసం 1–2 కేసులు ఎక్టోఫిక్గా నమోదవుతున్నాయని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం మరింత తీవ్రమవుతోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రారంభంలో ఇది సాధారణ గర్భంలా కనిపిస్తుంది. కడుపులో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. అసాధారణ రక్తస్రావం, తల తిరగడం, బలహీనత, భుజం లేదా వెన్ను నొప్పి, చికిత్స ఆలస్యం అయితే ట్యూబ్ పగిలిపోవడం, అంతర్గత రక్తస్రావం, అత్యవసర శస్త్రచికిత్స అవసరం, తల్లి ప్రాణానికి ప్రమాదం తప్పదు. పెరుగుదలకు ప్రధాన కారణాలు గర్భాశయ నాళాల్లో ఇన్ఫెక్షన్లు ఏర్పడడం.. వరుసగా అబార్షన్లు, సేఫ్టీ లేకుండా లైంగిక సంబంధాలు, గతంలో ట్యూబ్ సర్జరీలు, ఆలస్యంగా పెళ్లిళ్లు, గర్భధారణలో ఆలస్యం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ల పెరుగుదల తదితర కారణాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకూడదు. సేఫ్ సెక్స్ పాటించాలి. వరుస అబార్షన్లను నివారించాలి. గర్భం అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్ చెకప్లు తప్పనిసరి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే! గర్భం దాల్చాల్సిన చోట కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని ఎక్టోíపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్ గర్భం అంటారు. వందలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుందో..అంతు చిక్కదు. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా స్కాన్ చేసినప్పుడే తెలుస్తుంది. అజాగ్రత్త వద్దు అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాని ఎక్టోఫిక్ గర్భం అంటాం. వందలో ఒకరికి జరుగుతుంది. అండవాహికకు ఇన్ఫెక్షన్, ఆఫరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ విషయంలో అజాగ్రత్త వద్దు. వైద్యులను తక్షణమే సంప్రదించాలి. – షాలిని, గైనిక్ వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో), చిత్తూరు వైద్యులను సంప్రదించాలి నెలసరి రక్తస్రావం ఆగినా, తిరిగి అడపాదడపా రక్త స్రావం కనిపిస్తూ ఉన్నా.. పొత్తి కడుపులో ఒక పక్క భరించలేనంత నొప్పి బలహీనత, కళ్లు తిరగడం, గర్భధారణ అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ చూస్తున్నాం. ఈ కేసుల్లో చాలా వరకు మాతృమరణాలకు దారితీస్తున్నాయి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, చిత్తూరు (చదవండి: తొలి అంధ-బధిర న్యాయవాది: చిమ్మచీకటి నుంచే సక్సెస్ అందుకుంది..!) -
చలువ చేసే మారేడు పానకం..!
మే నెల ఇంకా రాకమునుపే ఎండలు మండిపోతున్నాయి. చైత్రంలోనే చెమటలు పట్టేలా భానుడు భగభగలాడిస్తున్నాడు. ముఖ్యంగా ఈ వేడి గాల్పులకు పెద్దలు, చిన్నారులే అల్లాడిపోతుంటారు. ఉదయం ఏడింటి కల్లా చుర్రుమంటున్న సూర్యుడి తాపానికి చిన్నారులు తాళ్లలేక వాడిపోగా, పెద్దలు నిసత్తువతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ వేసవి తాపం నుంచి బయటపడేందుకు మన పూర్వీకులు ఎన్నో గొప్ప సహజసిద్ధమైన ఔషధ పానకాలను అందించారు. ఇప్పుడు చెప్పబోయే పానకంలో అలాంటి గుణాలే ఉన్నాయి. దీని ముందు ఏ షెర్బత్లు, జ్యూస్లు నిలువలేవు. దీని ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే విస్తుపోతారు. వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే చలవ చేసే పానియమే ఈ మారేడు పానం. దీన్ని ఒడియా ప్రజలు తమ సంవత్సరాది రోజున చేసుకుని తింటారు. అచ్చం మన ఉగాది పచ్చడిలా వాళ్లు ఈ మారేడు పానకాన్ని తయారు చేసుకుంటారు. వాళ్ల సంవత్సరాది వైశాఖ మాసంలో వస్తుంది. వాళ్లకి అప్పుడు వసంతకాలం అన్నమాట. వాళ్లు కూడా మనలా ఈ రోజు నంచే చలివేంద్రాలు ఏర్పాటు చేసి లాంఛనంగా ఈ మారేడు పానం వితరణను ఆనవాయితీగా చేస్తుంటారు. వేసవి ప్రారంభానికి గుర్తుగా ఈ పానకం తయారు చేస్తారు ఒడియా ప్రజలు. ఇదెలా తయారు చేస్తారంటే..పండిన మారేడు పండును పగలగొట్టి, లోపలి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గుజ్జులో తగినన్ని నీళ్లు పోసి, చేతితో బాగా పిసికి (లేదా మిక్సీ పట్టి) 15-20 నిమిషాలు నానబెట్టాలి. పిసికిన మిశ్రమాన్ని జల్లెడ (strainer) ద్వారా వడపోసి, పీచు, గింజలను వేరు చేసి స్వచ్ఛమైన రసాన్ని తీసుకోవాలి.ఈ రసంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసి కరిగే వరకు కలపాలి. చివరగా చిటికెడు యాలకుల పొడి, కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి, చల్లటి నీరు లేదా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చ. ఈ చల్లని పానీయం వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా ఆరోగ్యప్రదం కూడా. ఆరోగ్య ప్రయోజనాలు..ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. మలబద్ధకాన్ని, ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. మొటిమలను నివారిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కేన్సర్ బారినపడకుండా రక్షిస్తుంది. బాడీని హైడ్రేటెడ్ ఉంచుతుందిబరువుని అదుపులో ఉంచుతుంది. అలాగే కంటి సమస్యలు, గుండె సమస్యలకు చెక్ పెడుతుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Chef Kirti Bhoutika (@kirtibhoutika) (చదవండి: weight loss Tips: ఏడు వారాలకే జూనియర్ ఎన్టీఆర్ 9 కిలోలు..!) -
ఏడు వారాలకే జూనియర్ ఎన్టీఆర్ 9 కిలోలు..!
టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన రాబోయే చిత్రం డ్రాగన్ కోసం తన ఫిజిక్ని ఎలా మార్చుకున్నారో అభిమానులతో షేర్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపర్చారు. ఆయన శరీర ఆకృతిని చూసి..వావ్! ఎంత స్మార్ట్గా ఫిట్గా ఉన్నారు అని సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. అది కూడా తక్కవ వ్యవధిలోనే ఏకంగా 9.5 కిలోలు తగ్గారు. ఈ మొత్తం ప్రక్రియకు ఆయనకు జస్ట్ ఏడు వారాలే పట్టిందట. మరి అదెలా సాధ్యమైందో, బరువు తగ్గాలనుకునేవారికి ఆయన అనుసరించి టిప్స్ హెల్ప్ అవుతాయేమో చూద్దామా..!.జూనియర్ ఎన్టీఆర్ జిమ్ సెటప్ ముందు క్లాసిక్ డబుల్ బైసెప్స్ భంగిమలో ఉన్న ఫోటోని షేర్ చేశారు. మంచి ఫిట్గా స్మార్ట్గా మారిన తన రూపాన్ని షేర్ చేశారు. అంతేగాదు ఆ ఫోటోలకు ఇది కొని తెచ్చుకున్న కండలు కాదు, స్వయం నిర్మితం అని క్యాప్షన్ జోడించారు జూనియర్ ఎన్టీఆర్. అదెలా సాధ్యమైందో ఆయన ఫిట్నెస్ ట్రైనర్ కుమార్ మన్నవ సవివరంగా వెల్లడించారు. తాను కేవలం ఎన్టీఆర్ వెయిట్లాస్ జర్నీని బరువు తగ్గడమే లక్ష్యంగా ప్రారంభించలేదని, సన్నని చురుకైన శరీరాకృతిని సాధించడంపై ఫోకస్ పెడుతూ మొదలు పెట్టామన్నారు. దీని కోసం జూనియర్ ఎన్టీఆర్ తన ఫిట్నెస్ దినచర్యను గణనీయంగా మార్చారట. భారీ కండరాల నిర్మాణ వ్యాయమాలకే పరిమితం కాకుండా, తన శిక్షణను ఫంక్షనల్ కదలికలు, కార్డియో కేంద్రీకృత వ్యాయామాల తోపాటుగా, మోస్తారు రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటివి కూడా చేశారని చెప్పారు. రోజు కార్డియో లేదా స్ట్రెంగ్త్ వ్యాయామాలను మాత్రం సుమారు 45 నుంచి 90 నిమిషాలు చేసేవారట. ఆఖరికి ఫుడ్ కూడా చాలా ప్రణాళికగా తీసుకునేవారట. సాధారణంగా కండరాల పెరుగుదలతో ముడిపడి ఉన్న ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారానికి బదులుగా తక్కువ ప్రోటీన్ తీసుకునే పద్ధతిని ఎంచుకున్నారని ట్రైనర్ కుమార్ మన్నవ వెల్లడించారు. ఈ వ్యూహమే ఆయన పెంచుకున్న కండర ద్రవ్యరాశిని కోల్పోవడానికి, అలాగే తన మూవీ డ్రాగన్లోని పాత్రకు అనుగుణంగా సన్నటి రూపాన్ని సాధించడానికి హెల్ప్ అయ్యిందని అన్నారు. ఇలా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. చాలామటుకు సెలబ్రిటీల మాదిరిగా వెయిట్లాస్ జర్నీని ప్రారంభించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) (చదవండి: జస్ట్ రూ.11 వేల లాటరీ టికెట్కి ఏకంగా రూ. 9.3 కోట్లు..!) -
98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..!
కష్టపడటానికి, తమ కాళ్లపై తాము నిలబడి స్వతంత్రంగా నిలబడటానికి వయసు ఎన్నటికి అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు చాలామంది వృద్ధులు. సంకల్పం, ఆత్మశ్వాసం ఉంటే అందంగా లైఫ్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఈ బామ్మ అదే నిరూపించింది. ఆమె అప్పటి వరకు భార్యగా, అమ్మగా, అమ్మమ్మగా సాగిన జీవితంలోకి అకస్మాత్తుగా చీకట్లు ఆవరించాయి. అయితేనేం బామ్మ వెంటనే తేరుకుని ఆ దుఃఖాన్ని కూడా అందంగా మధురంగా మార్చుకుంది. అదెలాగంటే..ఆ బామ్మే అహ్మదాబాద్కు చెందిన 98 ఏళ్ల ప్రభావతి భగవతి. విశ్రాంతి తీసుకునే వయసులో ఆమె వ్యాపారవేత్తగా ఫుడ్ వ్యాపారంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. అది తెలుకోవాలంటే..ముందుగా ఆమె కథేంటో తెలుసుకోవాల్సిందే. 1927లో జన్మించిన ప్రభావతి తన భర్త ప్రఫుల్ భగవతితో సుదీర్ఘకాలం సంతోషంగా జీవించారు. ఆ దంపతులు దాదాపు 68 ఏళ్ల పాట్లు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవించారు. కానీ 2017లో భర్త భగవతి మరణంతో అంతా మారిపోయింది. ఆమె ఇల్లు నిశబ్దంగా మారి, వంటగది వెలవెలబోయినట్లు అనిపించింది. ఆమె పిల్లలు వేరేచోటే స్థిరపడటంతో మనవళ్లు, మనవరాళ్లు పెద్దవాళ్లైపోవడంతో తాను వండిపెట్టడానికి ఎవరు లేకుండా పోయారు. ఆమె చక్కటి వంటకాలు వండి పెడుతూ తన ప్రేమను వ్యక్తపరిచే ఆమెకు అది మరింత లోటుగా అనిపించింది. అప్పుడే ఊహించని ఓ సంఘటన జరిగింది. ఒక సాధారణ టీ విందులో ఎవరో ప్రభావతి బామ్మ చేసిన ఖాండ్వీ రుచిని చూసి ముగ్ధలయ్యారు. దాంతో వాళ్లు తమ ఇంట్లో జరిగే ఫంక్షన్ కోసం చేయమని పట్టుబట్టడమే కాకుండా డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. మొదట్లో ప్రభావతి అందుకు అంగీకరించలేదు. కానీ వాళ్ల బలవంతంపై అంగీకరించక తప్పలేదు. అలా ఆమె తొమ్మిది పదుల వయసులో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఒక ఆర్డర్తో మొదలైంది కాస్తా.. త్వరలోనే అనేక ఆర్డర్లుగా మారింది. ప్రజలు ఆమె వంటను ఇష్టపడటమే కాదు దానితో మమేకమయ్యారు. అలా 2019లో “నానిస్ నాష్టా” అనే ఫుడ్ స్టాల్ మొదలైంది. అందుకు పెద్ద ఏర్పాటు, మార్కెటింగ్ బృందం వంటివి గానీ ఏమిలేవు. అలాగే ఆ ఫుడ్ స్టాల్కి కనీసం ప్రమోషన్స్కూడా లేవు. కేవలం ప్రభావతి బామ్మ తన ఇంటి వంటగదిలో ప్రేమతో వంటకాలు చేసేవారు. ఆమె గుజారాతీ రుచుల తోపాటు ముంబై స్ట్రీట్ ఫుడ్ క్లాసిక్స్, వడాపావ్, సేవ్పూరీ, ధోక్లా, తేప్లా, భాక్రీ, పావ్ భాజీ తదితర రుచికరమైన వంటకాలెన్నో అందిస్తుంది. వీటన్నింటిలోనూ ప్రసిద్ధి ఆకర్షణ ఖాండ్వీ ఉంటుంది. ఈ వంటకం కారణంగానే ఆ బామ్మ ఫుడ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఇవాళ ఈ బామ్మ సుమారు 200కు పైగా కుటుంబాలకు వంట చేస్తున్నారు. అంతేగాదు 'నానిస్ నాష్టా' వ్యవస్థాపకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంది. అప్పటిదాక దూకుడుగా ఉన్నమనం తొమ్మిది పదులకు చేరుకునేలోపు నెమ్మదిగా, విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ బామ్మ అలాంటి మూసధోరణికి స్వస్తి చెప్పి..వ్యక్తిగతంగా ఎదుగుతున్న తీరు అందరికీ ఆదర్శం. (చదవండి: ఏసీ లేకుండానే ఇల్లు కూల్గా..! ఎలాగో తెలుసా..?) -
ఏసీ లేకుండానే ఇల్లు కూల్గా..! ఎలాగో తెలుసా..?
ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీతో అత్యంత విలాసవంతమైన ఫ్లోరింగ్ పద్ధతులు, ఇరానీ మార్బుల్స్ వంటి వాటితో ఏసితో పనిలేకుండానే కూల్గా ఉంచుకుంటున్నారు. అయితే ఇవన్నీ అత్యంత ఖర్చుతో కూడుకున్నవి, ధనవంతులకే పరిమితమైనది. కానీ నాటి రోజుల్లోనే తక్కువ ఖర్చుతోనే ఏసీలతో పనిలేకుండానే చక్కగా ఇంటిని కూల్గా ఉంచే ఫ్లోరింగ్ పద్ధతిని వినియోగించేవారిని తెలుసా. ఏకంగా 300 ఏళ్ల నాటి క్రితం ఈ పద్ధతిని వినియోగించారు మన పూర్వీకులు. పైగా చాలా సహజ పద్ధతితలో తక్కువ ఖర్చుతో చేయడం విశేషం. ప్రస్తుతం ఈ టెక్నిక్ అంతరించిపోయే దశలో ఉంది. మరి అద్భుతమైన కళాత్మక టెక్నిక్ గురించి తెలుసుకుందామా.ఇది పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా పేర్కొనవచ్చు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా సహజ పద్ధతిలో ఇంటిని కూల్గా ఉంచుకునే గొప్ప టెక్నిక్ ఇది. భారత్లో ముఖ్యంగా కొన్ని ప్రముఖ నగరాల్లో ఎండలు ఏ రేంజ్లో దంచికొడుతుంటాయో చెప్పాల్సిన పనిలేదు. అలా అని ఏసీలు, కూలర్లు వినియోగిస్తే..ఆ తర్వాత కరెంట్ బిల్లులు జేబు చిల్లుపెట్టే రేంజ్లో వచ్చి హడలెత్తిస్తాయి. పైగా ఎక్కువ గంటలు ఏసీలో ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలాంటప్పుడు దాదాపు 300 ఏళ్ల క్రితం కూలర్లు, ఏసీల మాట ఎత్తని ఆ రోజుల్లోనే మన పూర్వీకులు సహజంగా ఇంటిని చల్లగా ఉంచుకునే సాంప్రదాయ ఫ్లోరింగ్ పద్ధతిని కనుగొన్నారు. ఇదెలా ఉంటుందంటే..మార్బుల్స్, టైల్స్పై ఆధారపడని కాలంలో దీనిని ప్రవేశ పెట్టారు. దీని కోసం సిమెంట్గానీ, రసాయనాలు గానీ వినియోగించరు. ఇందులో ఉపయోగించే పదార్థాలు కేవలం నీరు, ఐరన్ ఆక్సైడ్, సున్నం మాత్రమే. నాటి మేస్త్రీలు వీటిని తమ చేతులతో కలిపి ఫ్లోరింగ్ చేసేవారు. ఆ మిశ్రమం గట్టిపడ్డాక..అద్దంలాంటి తళతళలాడే మెరుపు కోసం.. కొబ్బరి నూనెతో గంటల తరబడి పాలిష్ చేసేవారు. కొబ్బరినూనె రంగులేని మెరుపును సృష్టించడంలో సహాయపడటం తోపాటు చల్లదనాన్ని కూడా పెంచుతుంది. ఈ ప్రభావాన్ని సింథటిక్ పాలిష్లతో సాధించలేము. వేసవికాలంలో మధ్యాహ్నం సూర్యుడి భగభగలు ఎంత గరిష్టంగా ఉన్నా..ఈ ఫ్లోరిగ్ పాదాల కింద మంచు మాదిరి చల్లదనాన్ని అందించడం విశేషం. దీని అద్భుతమైన మన్నికే అత్యంత విలక్షణంగా ప్రత్యేకంగా నిలబెడుతుంది. అంతేగాదు ఈ ఫ్లోర్ ఉపరితలం ఎంత అందంగా మెరుస్తూ ఉంటుందటే..పాదాల అడుగులు దాన్ని అరిగిపోయేలా చేయకుండా మరింత నునుపుగా ఉంచడం విశేషం. ఈ ఫ్లోరింగ్ పద్ధతిని కేరళలో ఎక్కువగా వినియోగించేవారట.అంతేకాదండోయ్ ఈ ఫ్లోరింగ్ పది దశాబ్దాల వరకు ఎలాంటి గీతలు లేకుండా మన్నికగా ఉంటుందట. సాధారణంగా ఈ ఫ్లోరింగ్ ఎరుపు, గోధుమ ఛాయతో సహజమైన మెరుపుతో ఉంటుందట. అయితే ప్రస్తుతం ఈ విధమైన ఫ్లోరింగ్ చేసే కార్మికులు కొద్దిమందే ఉన్నారట. ఈ అద్భుతమైన నైపుణ్యం రాను రాను కనుమరుగవుతుండటం బాధకరం. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: ఫిట్నెస్పై ఇంత క్రేజా?!) -
పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే
ఒకప్పుడు ఒక ఇంటికి పిల్లను పంపించాలంటే అత్తగారు ఎలా ఉంటారో.. ఎలాంటి వారో అని తల్లిదండ్రులు అనుకునేవారు. అనేక మందిని విచారించి గాని పెళ్లి చేసేవారు కాదు. అత్త గయ్యాలి అయితే ఆ ఇంటిలోని మగ పిల్లలకు అస్సలు పెళ్లిళ్లు అయ్యేవి కావు. కొత్త కోడలు ఇంటికి రాగానే అత్తల పెత్తనం ఎక్కువగా ఉండేది. ఎక్కువగా మాట్లాడినా, మాట్లాడకున్నా తప్పు పట్టేవారు. దీన్ని ఆధారంగా తీసుకునే సినిమాలు కూడా వచ్చాయి. ఆ సమయంలో అత్త అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సూర్యకాంతం. కాలం మారింది. కోడళ్లపై అత్తల పెత్తనం తగ్గింది. అత్తలు కోడళ్ల మాట విని మూలన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అత్తామామలతో కలిసి ఉండలేమని, పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలని యువతులు పెళ్లి చూపుల్లోనే తెగేసి చెబుతున్నారు. పలమనేరు : గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అత్తామామలు, అన్నదమ్ములు, కోడళ్లు, తోడి కోడళ్లు, ఆడ పడుచులు వారి మధ్య జరిగే గొడవ లు, ప్రేమాభిమానాలు సాధారణంగా అన్ని కుటుంబాల్లో కనిపించేవి. ఈ నేపథ్యంలో అత్త ఆధిపత్యం ప్రదర్శించడం ఎప్పటి నుంచో ఉంది. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో సైతం ఉమ్మడి కుటుంబాలు వెతికినా కనిపించడం లేదు. పదేళ్ల క్రితం వరకు గ్రామంలో నాలుగైదు కుటుంబాలు ఉమ్మడిగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడోగాని ఒకటి రెండు కూడా లేవు. వేరు కాపురాలు సర్వసాధరణంగా మారాయి. వారి వారి కుటుంబమే ముఖ్యమనే స్వార్థం పెరిగింది.పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాల్సిందే పెళ్లి కాగానే కొత్త కాపురం పెట్టడం నేడు ట్రెండ్గా మారింది. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తుడడం, లేదా భర్త ఉద్యోగం చేసే చోటుకు భార్య వెళ్లి వస్తుండడంతో వేరు కాపురాలు తప్పడంలేదు. కొందరు అమ్మాయిలు పెళ్లి అయినా అత్తామామలతో కలిసి ఉండబోమని, పెళ్లి అయ్యాక తమ ఇంటికి అత్తమామలు పెద్దగా రాకూడదంటూ ముందే చెబుతున్నారు. కాదు కూడదంటే పెళ్లి వయసు దాటుతుందనే భయంతో అబ్బాయిల తల్లిదండ్రులు అన్ని షరతులకు ఓకే చెప్పాల్సి వస్తోంది. ముఖ్యంగా నేడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే యువతులు తమ పెళ్లికి సంబంధించిన ప్రొఫైల్లోనే అనేక షరతులు పెడుతున్నారు. పెళ్లి అయిన తర్వాత అత్తామామలు ఉండకూడదని, తప్పనిసరిగా వేరుకాపురం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వేరు కాపురాలు పెట్టాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం, గొడవలు పడిన సందర్భాల్లో కనీసం వీరికి నచ్చజెప్పే పెద్దలు లేక కొందరి జీవితాలు తెగతెంపులకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా మనల్ని సక్రమ మార్గంలో నడిపించే పెద్దలు, నాటి బంధాలు, బాంధవ్యాలకు నేటి తరం యూత్ దూరం చేసుకుంటోందనే మాట పెద్దతరం వారిలో వినిపిస్తోంది. -
ఫిట్నెస్పై ఇంత క్రేజా?!
పట్టణాల్లో, నగరాల్లో మారథాన్, అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు వంటి ఫిట్నెస్ ఈవెంట్ల పట్ల ప్రజల ఆదరణ ఏ రేంజ్లో ఉందో తెలిస్తే షాకవ్వుతారు. వాటిపై పెడుతున్న ఖర్చులకు మాటలు రావ్. అందుకు ఉదాహరణ బెంగుళూరు ఫిట్నెస్ సెంటర్ ఈవెంటే. ఏం జరిగిందంటే..బెంగళూరులో హైరాక్స్ ఫిట్నెస్ ఈవెంట్ ధరలు చూస్తూ కళ్లు బైర్లుకమ్ముతాయ్. అందుకు సంబంధించిన పోస్ట్ని అంకిత్ కేడియా అనే యూజర్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ ప్రకారం..అక్కడ జరిగిన ఫిట్నెస్ ఈవెంట్లో దాదాపు తొమ్మిది వేల మంది దాక పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రూ. 9 వేలు చొప్పున ప్రవేశ రుసుము చెల్లించారు. అంటే ఒక్క రోజుల్లోనే సుమారుగా రూ. 8.1 కోట్లు వచ్చాయ్. మారథాన్లో కూడా ఇదో ధోరణి కనిపిస్తోంది. కేవలం ఒక రోజు పరుగుతీయడానికే రూ. 3 వేలు నుంచి రూ. 5 వేలు ఛార్జ్ చేస్తున్నారంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు కేడియా. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు ఇదంతా ఫిట్నెస్ కోసం కాదని, కేవలం గుర్తింపు కోసం జరుగుతున్న ఆరాటం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఫిట్నెస్ అనేది ఒకరోజు ప్రదర్శన కాదు, అది జీవితాంతం కొనసాగే ప్రయాణం అని అబివర్ణిస్తున్నారు కొందరు ఫిట్నెస్ ప్రియులు. HYROX fitness event in Bengaluru saw around 9,000 participants.They charged ₹9,000 per person to participate, which comes to roughly ₹8.1 crore made in a single day.Same trend is showing up in marathons. People are paying ₹3,000–₹5,000 just to run for a day.Being fit is…— Ankit Kedia (@Ankittskedia) April 13, 2026 (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!) -
వేసవిలో పిల్లలు హెల్దీగా ఉండాలంటే..!
అనాదిగా వేసవికీ బాల్యానికీ ఎనలేని సంబంధం ఉంది. పైగా పులి మీద పుట్రలా వేసవి సెలవులొకటి. తామూ ఒకప్పటి పిల్లలే అయినా తమ బాల్యాన్ని మరచిపోయి ఎండలో ఆడవద్దంటూ పిల్లలను గదమాయిస్తుంటారు పెద్దలు. కానీ... సూర్యుణ్ణి కంపాస్ బాక్స్లో ఉంచేసి, అది సరిపోనట్టు మళ్లీ దాన్ని స్కూల్ బ్యాగ్లో పెట్టిజిప్పు లాగేసినట్టుగా ఎండను లెక్కచేయకుండా పిల్లలంతా ఆడేస్తుంటారు. తరాలు గడుస్తున్నా ఇదో ఎప్పటికీ ఎడతెగని చైన్ రియాక్షన్. ఈ నేపథ్యంలో పిల్లలను వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహారపదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.అప్పటివరకూ ఆరుబయట హాయిగా ఒళ్లెరగకుండా ఆడుతున్న చిన్నారి ఒళ్లు వెచ్చబడుతుంది. అకస్మాత్తుగా అమ్మాయి మేను నిప్పులు చెరుగుతోందేమో అనిపిస్తుంది. తల్లీదండ్రీ నుదురు తాకి చూసి, తటాలుమని చేయి వెనక్కు లాగేసుకుంటారు ఆ ఒంటి వేడి తట్టుకోలేక. ఇది దాదాపు ప్రతి చిన్నారి బాల్యంలో ఒక్కసారైనా ఎదుర్కొనే సంఘటన. ఇది ప్రతి తల్లిదండ్రుల జీవితంలో ఒక్కసారైనా చవిచూసే కాళరాత్రి. ఇలాంటి వేసవి తీవ్రత బారి నుంచి చిన్నపిల్లలను కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.పిల్లలపై ఎండ దుష్ప్రభావం ఎందుకు ఎక్కువ? ఎండవేడిమి తీవ్రతకు పెద్దలూ, పిల్లలూ, వృద్ధులనే తేడా లేక΄ోయినప్పటికీ పెద్దలతో పోలిస్తే పిల్లల మీదే వేసవి ప్రతాపం ఎక్కువగా చూపిస్తుంటుంది. దీనికి కారణం ఉంది. పిల్లలంతా ఎండల్లో విపరీతంగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి పెద్దల కంటే వాళ్లకు చెమటలు పట్టడమూ, దాంతో వాళ్లు లవణాలు ఎక్కువగా కోల్పోతుండటం వల్ల ఎండతీవ్రతకు గురవుతుంటారనేది కొందరి అపోహ. కానీ అది వాస్తవం కాదు. విషయం ఏమిటంటే... పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట గ్రంథులు తక్కువ. అందుకే చెమటలు పట్టడం పెద్దవారిలోనే ఎక్కువ. అయితే పిల్లల చర్మంపైన వేసవి తీవ్రతను చల్లబరిచేందుకు అవసరమైన ప్రక్రియ... చెమట పట్టడమనేది తక్కువ. దాంతో ఎండ వేడిమి పిల్లలపై ఎక్కువ దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలెప్పుడూ చల్లగా ఉండే నీడపట్టునే ఉండేలా చూడాలి. ఎండా, వడగాడ్పులు తగ్గాకే వాళ్లను ఆరుబయటకు వెళ్లనివ్వాలి.ఎండ తీవ్రతతో ఎదుర్కొనే ఇబ్బందులివే...మజిల్ క్రాంప్స్ : పిల్లలెప్పుడూ ఎండను లెక్క చేయక ఆడుతూ ఉంటారు. ఇక సెలవుల్లో అయితే ఆటలే ఆటలు. దాంతో వారి దేహంలోని నీరు డీ–హైడ్రేషన్ కారణంగా బయటకు వెళ్లడమూ, ఆ నీటితో పాటు లవణాలూ తగ్గడం వల్ల... ఆ లవణాల అయాన్ల రూపంలో మెదడునుంచి కండరాలకు వచ్చే ఆదేశాలకు బ్రేక్ పడుతుంది. అందుకే ఒళ్లు డీ–హైడ్రేషన్కు గురి కాగానే... కండరాలు బిగుసుకు΄ోతుంటాయి. వీటినే మజిల్క్రాంప్స్ అంటారు. ఈ మజిల్క్రాంప్స్ పిల్లలతో పాటు పెద్దలకూ వస్తుంటాయి. ఇలా జరిగిన వెంటనే... వారికి చిటికెడు ఉప్పు, కాస్తంత చక్కెర వేసిన నీటిని వెంటనే తాగించాలి. కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేయడం వల్ల ఈ సమస్యను తేలిగ్గానే ఎదుర్కోవచ్చు.వడదెబ్బ : మనలో జీవక్రియలన్నీ సరిగా జరగడానికి దేహ ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారెన్హీట్గా ఉంటుంది. అయితే వడదెబ్బకు గురైనవారి దేహ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. దాంతో దేహంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బ కారణంగా దేహ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ప్రమాదకరస్థాయి అయిన 104 డిగ్రీ ఫారెన్హీట్కు చేరినప్పుడు ఆ వేడి దగ్గర మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలెక్కువ. అందుకే శరీర ఉష్ణోగ్రతను మళ్లీ నార్మల్కు తీసుకురావడం అవసరం.ఒంటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారెన్హీట్ దాటుతోందని తెలియగానే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. (ఒకవేళ ఫ్యాన్ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా లాభం ఉండదు. చిన్నారుల దుస్తులు వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల వద్ద ఐస్ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.వేసవిలో కొన్ని ఆహారాల పట్ల అపోహలుగుడ్డు : గుడ్లు తినడం వల్ల అవి వేడి చేస్తాయనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. అందుకే వేసవిలో గుడ్లను తినడానికీ, పిల్లలకు ఎక్కువగా ఇవ్వడానికి వెనకాడుతుంటారు. నిజానికి ఇది పూర్తిగా అ΄ోహ మాత్రమే. గుడ్లలో దాదాపు 75% నీళ్లే ఉంటాయి. పైగా ఇందులో ఖనిజలవణాలూ అన్నీ ఎక్కువే. అందుకే ఇవి చలవ చేయడంతో ΄ాటు ఒంటి నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటినీ భర్తీ చేస్తాయి. అంతేకాదు... ఇందులోని లవణాల కారణంగా మజిల్క్రాంప్స్ వంటి సమస్యలూ నివారితమవుతాయి.పాలు : వేసవిలో పాలకు బదులుగా... పెరుగునూ... ఇక పెరుగుకు బదులుగా దాన్ని చిలికి మజ్జిగ రూపంలో తీసుకోవడమే మేలని చాలామంది అనుకుంటారు. నిజానికి వేసవిలో మజ్జిగ వాడటం చాలా మంచిదే అనడంలో సందేహం లేదు. అంతమాత్రాన వేసవిలో పాలు అంత మంచివి కావని అనుకోవడం ఓ దురభి్ర΄ాయం మాత్రమే. నిజానికి పాలలోనూ 90 శాతానికి పైగా ఉండేది నీళ్లే. ఈ నీటి మోతాదులతోసాటు దేహానికి శ్రమ కలగడం వల్ల కోల్పోయే ఖనిజలవణాలూ ఉంటాయి. అంటే పాలు తాగడం అంటే ఏకకాలంలో నీటినీ, ఖనిజలవణాలనూ భర్తీ చేయడం లాంటిది. అందుకే మధ్యమధ్యలో మజ్జిగ తాగిస్తున్నప్పటికీ... వేసవిలో చిన్నారులకు ప్రతి ఉదయం, రాత్రి వేళల్లో పాలు తాగిస్తుండటమూ మంచిదే.సూప్లు : వేసవిలో పిల్లలు ఆరుబయట ఎండల్లో చాలా ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. దాంతో వారు చాలా వేగంగా నీళ్లనూ, లవణాలను కోల్పోతుంటారు. పైగా ఈ సీజన్లో ఘనాహారం తీసుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. అందుకే పిల్లలు కోల్పోయే లవణాలను సూప్లూ, జావ రూపంలో తీసుకోవడం వల్ల అవి చాలా వేగంగా వారి దేహానికి అందుతుంటాయి.వెజిటబుల్ సూప్స్ : అన్ని రకాల సూప్లలోనూ దాదాపు 98 శాతం నీళ్లే ఉంటాయి. ఇక మిగతావి సూప్లలో ఉపయోగించే ఆకుకూరలు, కాయగూర (వెజిటబుల్స్)ల్లోంచి సూప్లోకి లవణాలు బాగా ఊరి, తేలిగ్గా ఒంటపడతాయి. అందుకే వేసవిలో అన్ని రకాల సూప్లు తీసుకోవడం మేలు చేసే అంశమే. టోమాటో, మొక్కజొన్న, దోసకాయ, ఆలూ (బంగాళదుంప), చిలగడదుంప (మోరంగడ్డ / గెణుసుగడ్డ), గ్రీన్పీస్, జ్యూషీనీ, అవకాడో, బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, బ్రాకలీ, పుట్టగొడుగులు (మష్రూమ్స్)... ఇలా దాదాపు అన్ని రకాల ఆకుకూరలు/కాయగూరలతో సూప్లు తయారుచేసుకోవచ్చు. వేసవిలో ఈ సూపులన్నీ చిన్నారులకు ఖనిజలవణాలను చాలా వేగంగా ఒంటికి సమకూరేలా చేస్తాయి.పిల్లలకు జావ రూపంలో ఇచ్చేవి...జావ రూపంలోనూ లేదా పలచటి ఉప్మా (పారిజ్) రూపంలో రెసిపీలను తీసుకోవడం వల్ల ఒంటికి నీళ్లూ, లవణాలూ తక్షణం సమకూరతాయి. జావరూపంలో తీసుకునేందుకు రాగులు మేలైన ఆహారం. అందుకే వీటిల్లో రాగిజావ చాలా ఫేమస్. జావ/పారిజ్ రూపంలో తీసుకునేందుకు నూకలూ మంచివే. ఆర్గానిక్గా పండించిన పట్టుతీయని వరినూక, గోధమనూక చాలా మేలు చేస్తాయి. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. దాంతో వేసవిలో ఒళ్లు చాలా తేలిగ్గా ఉంటుంది. అన్నట్టు పెద్దలకూ, వృద్ధులకూ మంచివే.రకరకాల పానీయాలు...అన్నిటికంటే ముఖ్యమైనది నీరు దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించిన పానియం మరొకటి లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్కు దూరంగా ఉండవచ్చు. ఇక నీటి తర్వాత ఇవ్వదగ్గ పానియాలివి...నిమ్మ : పిల్లలు వేసవిలో పానియాలను తాగేందుకు బాగా ఇష్టపడతారు. సాధారణంగా వేసవిలో నిమ్మకాయరసాన్ని తీసుకొని అందులో కొద్దిగా పంచదార వేసి చేసుకునే పానియం చాలా త్వరగా తయారవుతుంది. చాలా చవగ్గా కూడా. బత్తాయి : బత్తాయిరసం, ఆరెంజ్ జ్యూస్ వంటివి పిల్లలు ఇష్టంగా తాగుతారు. సర్సపారిల్లా : ఇది భూమి కింద పెరిగే ఒక రకం వేరు. దీన్నే చాలా చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొందరు సుగంధ అనీ, మరికొందరు మారేడు అనీ, నన్నారి అని దీన్ని పిలుస్తారు. దీని వేర్లతో ఎసెన్స్లో లేదా ఆ వేర్ల పౌడర్లో నీళ్లు లేదా సోడా కలపాలి. ఒక టీస్పూన్ నిమ్మరసం, కాస్తంత చక్కెరతో చాలా పరిమళభరితమైన వేసవి పానీయం తయారవుతుంది. ఇది చలవచేస్తుందీ, ఆరోగ్యానికీ మేలూ చేస్తుంది. ఇవీ కాకుండా ఈ వేసవిలో మామిడిపండ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. దాంతో ఆమ్పన్నా అనే సీజనల్ డ్రింక్ను తయారు చేసుకోవచ్చు. ఇవేకాకుండా... ఖస్ షర్బత్, ద్రాక్షాజ్యూస్, వెలగపండు షర్బత్, రోజ్ షర్బత్లూ మంచివి. ఇక వేసవిలో చెరుకురసాన్ని తాగడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఇందులో కల్తీనీళ్లనుంచి తయారు చేసే ఐస్ కలవడమనే అంశం ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశమున్నందున... ఐస్ కలపకుండా తాగడమే మేలు.తీసుకోదగ్గ ఇతర పండ్లు, సలాడ్స్...పుచ్చకాయ...లో 80 శాతం కంటే ఎక్కువ నీరే ఉండటంతో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. వెజిటబుల్ చీజ్ సలాడ్స్... తక్కువ క్యాలరీలున్న చీజ్ను తరిగిన అనేక రకాల కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.కొవ్వులు తక్కువగా ఉండే పానీయాలు... పిల్లలు చల్లగా, తియ్యగా ఉండే కూల్డ్రింక్స్, సోడా, ఐస్క్రీమ్లను ఇష్టపడుతుంటారు. వీటికి బదులుగా మజ్జిగ, లస్సీ వంటివి ఇవ్వడం మంచిది. పండ్లతో తయారయిన డెజర్ట్స్... వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్ని తీసుకోవడమే మంచిది. ఇవి ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి. బెర్రీలు (స్ట్రాబెర్రీలు)... వేసవిలో ఈ బెర్రీ పళ్లను తినటం మంచిది. వీటిని పెరుగులోనూ, ఐస్క్రీంలాంటి వాటిలోనూ వాడవచ్చు. కుకుంబర్... పిల్లలు పెద్దగా ఇష్టంగా తిననప్పటికీ దోస వంటివి సహజంగానే చల్లగా ఉండి చలువ చేస్తాయి. అందుకే చల్లని తాజా దోసకాయ ముక్కలను సలాడ్స్లోనూ, కూరలలోనూ వాడుతూ పిల్లలకు ఇవ్వడం మంచిది. మామిడి... ఇవి వేసవిలోనే దొరుకుతాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి. వాల్నట్స్... ఆక్రోట్ల (వాల్నట్)లో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.చేపలు... వేసవిలో వేటమాంసం కంటే చేపలు మంచి ఆహారం. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు ఇవ్వడం మేలు. ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరగాయలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్పెప్పర్... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాల ఉత్పత్తులు... లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రోటీన్లను, క్యాల్షియమ్ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. పనీర్... ఇందులో ప్రోటీన్లు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. గ్రిల్డ్ వెజిటబుల్స్ను పనీర్తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, ఎముకల పటిష్టతకు బాగా తోడ్పడతాయి.ఇంట్లో తయారుచేసిన ఐస్క్రీమ్లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు. ఎండ తాలూకు దుష్ప్రభావాల నివారణ ఇలా... ఎండవేళలల్లో పిల్లలు ఎండకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి జాగాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి.ఎండవేళల్లో ఇన్డోర్ గేమ్స్కు మాత్రమే వారిని పరిమితం చేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండేలా చూడాలి. పిల్లలు నీడలో ఉన్నా... ఒకవేళ ఆ నీడ ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్న పిల్లలకూ వడదెబ్బ తగలవచ్చు. అందుకే పిల్లలను ఒకింత చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ఆటల్లో పూర్తిగా నిమగ్నమైనొయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారిని పిలుస్తూ కాస్త కాస్త మంచినీళ్లు పట్టిస్తూ ఉండాలి. ఓఆర్ఎస్ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు.కొన్ని జాగ్రత్తలు ఇవి... పిల్లలకు పల్చటి దుస్తులు వేయాలి. మందపాటి దుస్తులు తొడగకూడదు. ∙గొడుగు వాడటం మేలే అయినప్పటికీ పిల్లలు గొడుగువాడటాన్ని పెద్దగా ఇష్టపడరు. అందుకే పిల్లలకు నేరుగా ఎండ తగలకుండా క్యాప్ తొడిగిస్తుండాలి. పిల్లలకు వాడే క్యాప్ల కలర్ లేత రంగుల్లో ఉండటం మేలు. పిల్లలు ఆటల్లో పడి నీళ్లు తాగడం విస్మరిస్తుంటారు. అలా ఆడుతున్నప్పుడు వాళ్లకు గంటా, గంటన్నర వ్యవధిలో మాటిమాటికీ నీళ్లు తాగిస్తూ ఉండాలి.బయటకు వెళ్లే ముందే కనీసం రెండు మూడు గ్లాసుల మంచినీటిని తాగించాలి. ఎప్పుడూ వాటర్ బాటిల్ వెంట ఉంచుకునేలా ప్రోత్సహించాలి. నీళ్లను ప్లాస్టిక్ సీసాల్లో ఉంచడం అంత సరికాదు. బాటిల్ వేడెక్కి అందులోని నీళ్లు వేడెక్కడం వల్ల ప్లాస్టిక్ పదార్థాల నుంచి కొద్దికొద్ది మోతాదుల్లో ప్లాస్టిక్ వెలువడి నీటితోపాటు శరీరంలోకి వెళ్లే అవకాశాలెక్కువ. ఇలా ప్లాస్టిక్ అవశేషాలు శరీరంలోకి ఇంకిపోవడాన్ని ‘లీచింగ్’ అంటారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో విధాల నష్టం చేకూరుతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిల్కు బదులు మంచి గాజు బాటిల్ లేదా అంత త్వరగా వేడెక్కనివ్వని ఫ్లాస్క్లు, వాటర్బాటిల్స్నే మొదటినుంచీ పిల్లలకు అలవాటు చేయాలి. ∙ఆరుబయట తిరుగుతున్నప్పటికీ వారు చెట్టు నీడలాంటి దట్టమైన నీడ ఉండే ప్రదేశాలలోనే ఆడుకునేలా చూడటం మంచిది. ∙బయటకు అనుమతించడం అనేది ఉదయం 10 గంటలకు ముందూ... సాయంత్రం 5 తర్వాతనే జరిగేలా చూడాలి. ఎందుకంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎండ వల్ల ఆరుబయట రేడియేషన్ ప్రమాదం ఎక్కువగా ఉండి పిల్లల లేత శరీరాలకు నష్టం చేస్తుంది. పిల్లలు తప్పనిసరిగా ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోడానికి కనీస సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 20 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ‘సన్ స్క్రీన్ లోషన్స్ / క్రీమ్స్’ను ఎండలోకి వెళ్లే కనీసం 20 నిమిషాల ముందర పిల్లల చర్మంపై రాయాలి. ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంటే ప్రతి మూడు గంటలకోమారు మళ్లీ ఒకసారి ఈ క్రీమ్ రాస్తుండాలి. పిల్లలను కారులో ఉంచి షాపింగ్ చేయడం ప్రమాదకరం. అలా ఎప్పుడూ ఆగి ఉన్న కారులో పిల్లలను ఉంచి లాక్ చేయకూడదని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు ఇవ్వకూడనివి... దాహాన్ని పెంచడం, డీ–హైడ్రేషన్ కలిగించే గుణం ఉన్నందున వేసవిలో ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తగ్గించాలి. అయితే నిమ్మ వంటి షర్బత్లలో చిటికెడు వేసుకోవచ్చు. పరిమితంగా తీసుకునే ఉప్పు మజిల్క్రాంప్స్ను తగ్గిస్తుంది. ఈ సీజన్లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. అలాగే ఆయిల్స్ కూడా వీలైనంతగా తగ్గించాలి. కాఫీ, టీ, కూల్డ్రింక్స్లో కెఫిన్ మోతాదులు ఎక్కువ. వాటిని పిల్లలకు ఇవ్వడం సరికాదు. ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉంచాలి. వాటికి బదులు తాజా పండ్లముక్కలూ, ఫ్రూట్సలాడ్స్ వంటివి ఇవ్వవచ్చు. డాక్టర్ కంచన్ ఎస్ చన్నావర్కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్నిర్వహణ: యాసీన్ (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!) -
చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!
భారతీయ కళలు గురించి ఈ తరానికి ఎన్ని తెలుసు అని అడిగితే కచ్చితంగా నీళ్లు నములుతారు. మహా అయితే ఒకటో, రెండో చెబుతారు అంతే. కానీ ఈ చిన్నారి అంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించి..చేస్తున్న మహత్తర కార్యం గురించి తెలిస్తే..శెభాష్ అని అభినందించకుండా ఉండరు. ఎందుకంటే జస్ట్ నాల్గో తరగతికే ఆ చిన్ని మనసు ఎంతో బాధ్యతగా ఆలోచించ విధానం..అందుకోసం పడుతున్న తపన ప్రతి ఒక్కర్ని కదలిస్తుంది. రేపు ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా ఆ చిన్నారి కళా వారసత్వం కోసం చేస్తున్న కృషి గురించి సవివరంగా చూద్దామా.ఆ అమ్మాయే మన భాగ్యనగరం బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న శ్రేష్ట అక్షయ్. పిల్లలందరికి నచ్చినట్లుగానే అక్షయ్కు కూడా రంగురంగుల పెన్సిళ్లు అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొత్త కార్టూన్ డిజైన్ల పెన్సిళ్ల కోసం తెగ వెతికేది. ఒక రోజు అమ్మని అడిగింది ఇతర దేశాల్లో తయారైన పెన్సిళ్లు, ఇతర దేశాల కార్టూన్లతో ఉండే పెన్సిళ్లను ఎందుకు వాడుతున్నాం అని అమాయకంగా ప్రశ్నించింది. ఆ సందేహమే తనను విలక్షణమైన చిన్నారిగా అందరిచేత ప్రశంసలందుకునేలా చేస్తుందని అక్షయ్గానీ, ఆమె తల్లిగానీ ఆరోజు ఊహించలేదు. ఆ ప్రశ్నతో మొదలైన ఆ చిన్నారి అక్షయ్ ఆలోచన..మన కళా రూపాలపై ఆసక్తిని పెంచుకునేందుకు దారితీసింది. మనదేశంలో ఉన్న ప్రముఖమైన కళా రూపాలతో పెన్సిళ్లు ఎందుకు ఉండకూడదు అనుకుంది. అంతేగాదు తానే ఎందుకు అలాంటి పెన్సిళ్లను తీసుకురాకూడదు అనుకుంది. దీనివల్ల తనలాంటి పిల్లలందరికి మన భారతదేశ కళలు, వాటి గొప్పదనం గురించి తెలుస్తుంది కదా అని అనుకుంది. అంతేగాదు మన అందమైన కళారూపాలైన..మధుబని కళ, గోండ్ కళ, పైట్కర్ కళ, పిథోరా కళ, వార్లీ కళ వంటి కళల పేర్లను పెన్సిళ్లపై రాస్తే, అవి ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా, మన గొప్ప వారసత్వం గురించి తెలుసుకోగలుగుతారని భావించింది అక్షయ్. ఆ నేపథ్యంలోనే తల్లిదండ్రుల సహాయం తీసుకుని మరి బీహార్కు చెందిన మధుబని కళ, మహారాష్ట్రకు చెందిన వార్లీ కళ, రాజస్థాన్కు చెందిన పిచ్వాయి కళ, కర్ణాటకకు చెందిన కావి కళ, రాజస్థాన్కు చెందిన బ్లూ పాటరీ కళ, మధ్యప్రదేశ్కు చెందిన గోండ్ కళ, గుజరాత్కు చెందిన పిథోరా కళ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కలంకారి కళ, తెలంగాణకు చెందిన చెరియల్ కళ, తదితర భారతీయ కళారూపాలను పెన్సిళ్లపైకి తీసుకువచ్చే పనిలో పడింది. ఆ క్రమంలో డిజైనింగ్, క్రాపింగ్, ప్రింటింగ్ ఎలా చేస్తారు, వాటిని ఇంట్లో, ప్రింటింగ్ షాపుల్లో ఎలా చేస్తారు వంటి చాలా విషయాలు నేర్చుకుంది. అలా తన పేరెంట్స్ సాయంతో సొంతంగా కళారూపాలతో కూడిన పెన్సిల్ బ్రాండ్ “ఆరా పెన్సిల్స్” ఏర్పాటు చేసి, దానికో www.aurapencils.com. అనే వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసింది. అక్కడ ఆన్లైన్లో కళారూపల పెన్సిళ్లు ఆర్డర్ పెట్టుకుని కొనుగోలు చెయ్యొచ్చట. తన ఆలోచన గురించి తన స్నేహితులకు కూడా చెప్పాను వాళ్లంతా కూడా మెచ్చుకున్నారని సంతోషంగా చెబుతోంది. అంతేకాదండోయ్ మన భారతీయ కళారూపాల గురించి తెలుసుకునేలా చేయడమే కాకుండా భారతదేశంలో తయారై పెన్సిళ్లనే కొనుగోలు చేసేలా ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటోంది ఈ చిన్నారి అక్షయ్.(చదవండి: ఆ గాయం ఆమె లైఫ్నే టర్న్ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా..) -
ఆ గాయం ఆమె లైఫ్నే టర్న్ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా..
ఏదైనా అనారోగ్యం లేదా గాయల పాలైతే భయపడిపోకుండా ధైర్యం కూడగట్టుకుని చికిత్స తీసుకోవాలి. అవసరమైతే స్నేహితులు, సన్నిహితుల మద్దతు తీసుకోవాలి. కానీ కొన్ని గాయాలు మనల్ని ఎంతగా కుంగదీస్తాయంటే..ఇక అయిపోయింది లైఫ్ అన్నట్లుగా ఉంటాయి. డాక్టర్లు కూడా చేతులెత్తేస్తారు. అలాంటి సమయంలో కూడా తెగువతో బతికిచూపడమే గాక..విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుంటోంది ఈ ధీర వనిత.ఆ ధైర్యవంతురాలే పల్లవి కుమార్ అగర్వాల్గా పిలిచే మీరా. ఆమె జీవితం ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు చవిచూసింది. మీరా పాట్నాకి చెందిన మహిళ. ఆమె ఎక్కువగా విదేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ సమయంలో పూర్తి స్థాయి మాంసాహారి. ఫిట్నెస్, వ్యాయామాలపై విపరీతమై ఆసక్తి కూడా. ఆమె పెద్ద కార్పొరేషన్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా డిజైన్ అండ్ ప్రొడక్ట్ హెడ్గా అత్యంత ఒత్తిడితో కూడిన షెడ్యూల్ని నిర్వహిస్తూనే మారథాన్లలో పరిగెత్తేవారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించేవారు. కానీ ఆ రోజు ఆమె మోకాలికి అయిన గాయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ఓ మలుపు తిప్పింది. ఆ మోకాలి గాయం ఆమెను మళ్లీ జీవితంలో నడవనివ్వకుండా చేసింది. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. కొన్ని రకాల వ్యాయామాలు, మందులతో రెండు అడుగులు వేయొచ్చు అంతే తప్ప సరిగ్గా నడవడం గానీ పరిగెత్తడం వంటివి చేయలేవని తేల్చేశారు. దాంతో మీరా ఆ గాయం క్యూర్ అయ్యేలా పలు రకాల చికిత్సల కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టింది, లెక్కలేనన్ని మందుల మింగింది. అప్పడు మీరా తీవ్ర నిరాశ నిస్ప్రుహలకు గురయ్యింది. జీవితమంతా వ్యాయామాలు చేసి ఎంతో హెల్దీగా ఉండే మీరాకి నడవలేవని చెబుతున్న మాటలను జీర్ణించుకోలేకపోయింది. అప్పుడే ఆమె తనలా తీవ్రమైన గాయాల బారినపడి తిరిగి అథ్లెట్లుగా దూసుకొచ్చిన మహిళల ఉదంతాలు చదవడం ప్రారంభించింది. అంతేగాదు ఆ మహిళల జీవితాలు, వారి లైఫ్స్టైల్ గురించి క్షణ్ణంగా చదివేది. 'ది గేమ్ ఛేంజర్స్' అనే నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ మీరాని ఎంతగానో ప్రభావితం చేసింది. దాంతో మీరా ఇదివరికటిలా యాక్టివ్గా మారింది. అంతేగాదు పాలు, మాంస ఉత్పత్తులను పూర్తిగా మానేసి..పూర్తిగా సాంప్రదాయ భారతీయ ఆహారానికి మారింది. తన భోజనంలో రాగి, కొబ్బరి, చిరుధాన్యాలు, పప్పులను చేర్చుకోవడం ప్రారంభించిది. చెప్పాలంటే పూర్తి శాకాహారిగా మారిపోయింది. అలాగే రకరకాల వంటకాలప ప్రయోగాలు ప్రారంభించి సొంతంగా రాగిపాలు, కొబ్బరి మజ్జిగను తయారు చేయడం ప్రారంభించింది. ఈ కొబ్బరి పానీయాన్ని తన కుటుంబసభ్యులు కూడా ఇష్టపడతారని అంటోంది. అంతేగాదు ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త పరీక్ష ఫలితాల్లో అద్భుతాన్నే చూడొచ్చని అంటోంది. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని అంటోంది. వీటితోపాటు ఆహారంలో హలీమ్ లడ్డూలు, నట్స్, వివిధ సీడ్స్ వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకుంది. అయితే బేకరీ స్వీట్లు, కేక్లు, కుకీలకు దూరమైపోయింది. ఆమెకు కాఫీ తోపాటు వాటిని తినే అలవాటు ఉండటంతో..మళ్లీ బేకరీ ఉత్పత్తులను హెల్దీగా చేయడంపై దృష్టి సారించి పలు రకాల వంటకాలు చేసింది. అవన్నీ పాలు, వెన్నకు బదులు, నట్ బటర్లు, కోల్డ్ప్రెస్ నూనెలు, శాకాహార పాలతోనే చేసేది. పైగా ఆమె వంటకాల రుచికి ఫిదా అవ్వతూ స్నేహితులు, బంధువులు బేకరీని ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా 'ఇడున్' అనే బేకరీని ప్రారంభించింది. అయితే ఆమె ఏమి చెఫ్ స్పెషలిస్ట్ కాదు. అయినప్పటికీ కుకీలను ఎంతో రుచికరంగా, పోషకమైనవిగా తయారు చేయడం ఆమె స్పెషాల్టీ. అలాగే ఆయుర్వేదం చక్కెరను చెడ్డదిగా చెప్పదని, తీసుకోవాల్సిన విధంగా మితంగా తీసుకుంటే మంచిదేనని అంటోంది మీరా. ఆమె ఆయుర్వేద సూత్రాలు పాటిస్తూ..తిరిగి హెల్దీగా ఉండేలా కేర్ తీసుంటోంది కూడా. అంతేగాదు అక్కడితో మీరా ప్రస్థానం ఆగిపోలేదు. తిరిగి నడవలేవు అన్న డాక్టర్లే ఆశ్చర్యపోయేలా లడఖ్ మారథాన్లో పాల్గొని నిర్దేశించిన సమయాని కంటే ముందుగానే పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంది. తన అవరోధాన్ని, పరిమితులను ధిక్కరించేలా ఎవరెస్టు బేస్ క్యాంప్లకు ట్రెక్కింగ్ చేయడం, ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉన్న యూనం పర్వతాన్ని అధిరోహించడం, ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్రెండ్షిప్ పీక్ను జయించడం వంటివి చేసింది. కష్టాలు, గాయాలు మనల్ని కోలుకోనీయకుండా చేయొచ్చేమో గానీ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు, తిరిగి విధికే ఛాలెంజ్ విసిరేలా నిలదొక్కుకోవాలనే సారాంశం మీరా స్టోరీ చెబుతోంది కదూ..!.(చదవండి: అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్..! ఆ శారీ ప్రత్యేకతలివే..) -
అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్..! ఆ శారీ ప్రత్యేకతలివే..
సెలబ్రిటీల కారణంగా అంతరించిపోతున్న కొన్ని అరుదైన వస్త్రాలు, నేతలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా వారివల్ల రానున్న తరాలు మన హస్తకళాకారుల వైభవం, నాటి రాజుల వస్త్రాలంకరణ గురించి తెలుసుకునే అవకాశం దక్కుతోంది. అలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న అరుదైన చీర గురించి నటి కంగనా రనౌత్ పుణ్యమా అని అందరూ తెలుసుకునే అవకాశం దొరికింది. ఇంతకీ ఆమె ఎలాంటి చీర ధరించారు, దాని ప్రత్యేకలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఒకప్పుడు తంజావురు రాజకుటుంబీకులు కోసం మాత్రమే ప్రత్యేకించి హస్తకళకారులు నేసేవారట. అవే కొడాలి కరుప్పూర్ చీరలు. చిత్రలేఖనం , రెసిస్ట్ డైయింగ్ల కలయికలతో ఉంటుంది ఈ శారీ. ఇది 800 ఏళ్లనాటి చరిత్ర కలిగిన అరుదైన వస్త్రం అట. ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని పునరుద్ధరిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని చీరల నమునాలను మ్యూజియంలో భద్రపరిచారు కూడా. దీని గురించి భారతదేశ చేనేత, హస్తకళలపై కంటెంట్ సృష్టించే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రాయ్ చౌధురి ఈ అరుదైన చీరను గురించి నెట్టింట షేర్ చేయడంతో మరోసారి ఈ శారీ వెలుగులోకి వచ్చింది. ఆమె నటి ఎంపీ కంగనా రనౌత్ తమిళనాడుకు చెందిన కొడాల కరుప్పూర్ చీరను ధరించడం గురించి మాట్లాడారు. ఈ చీరలు 1787 నుంచి 1832 మధ్య మరాఠా పాలకుడు సర్ఫోజీ రాజా భోంస్లే చత్రపతిII పోషణలో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. 19వ శతాబ్దం వరకు తంజావురు రాణుల కోసం నేసేవారట ఈ చీరలను. "వీటిని తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలో ఉన్న కోడాలి కరుప్పూర్ గ్రామంలో ఉత్పత్తి చేసేవారు. ఆ నేత కార్మికుల పూర్వీకులు సౌరరాష్ట్ర, మధురై, సేలం, కాంచీపురానికి వలస వచ్చిన సుమారు 400 నుంచి, 500 కుటుంబాలకు చెందినవారు. దీనిని 'ఖిల్లాత్' లేదా "గౌరవ వస్త్రాలు"గా కూడా ఉపయోగించేవారు. ఇది ఆలయ ఆచారాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేదట. ఒకే వస్త్రాన్ని నేయడంలో బహుళ పద్ధతులను ఉపయోగించడమే ఈ వస్త్రాన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. "కరుప్పూర్ వస్త్రాల నమూనా ప్రక్రియలో మొదటి దశ బంగారం లేదా వెండి జరీతో జందానీ నేత. దానిపై కలంకారి మాదిరిగా మైనపు నిరోధక రంగు, మోర్డెంట్రంగు చిత్రలేఖనాన్ని ఉపయోగించి నమునాను సృష్టిస్తారని పోస్ట్లో వెల్లడించారు రాయ్.స్పెషాల్టీ..కేవలం నేతపై ఆధారపడే కాంచీపురం పట్టుకు లేదా ప్రధానంగా చిత్రలేఖనంతో కూడిన కలంకారికి భిన్నంగా, ఈ కొడాలి కరుప్పూర్ చీర ఒకే వస్త్రంలో నేత, నిరోధక రంగు అద్దకం, చేతి చిత్రలేఖనాన్ని ప్రత్యేకంగా మిళితం చేస్తుంది. వాస్తవానికి వీటిని స్వచ్ఛమైన పత్తితో నేసేవారు. అయితే మ్యూజియంలో భద్రపరిచినవి మాత్రం 'దొరుఖా' రకానికి చెందినవట, అంటే రెండు వైపులా ఒకేలా కనిపించే కళ ఇది. కొన్ని చీరల్లో రంగు చిత్రలేఖనానికి బదులుగా ముద్రణ కోసం బ్లాకులను కూడా ఉపయోగిస్తారట. బ్రిటిష్ వారు తంజావూరును స్వాధీనం చేసుకున్న తర్వాతే ఈ చీర ఉత్పత్తి క్షీణించడం మొదలైందని చెబుతున్నారు చరిత్రకారులు. సంక్లిష్టమైన రెసిస్ట్ డైయింగ్ పద్ధతి, కష్టతరమే నేత ప్రక్రియ దీనికి తోడు ఆయా హస్తకళాకారుల లేకపోవడం వంటి కారణంగా ఈ చీరలు అంతరించిపోయాయని అంటున్నారు. అసలైన కొడాలి కరుప్పూర్ చీర కేవలం మ్యూజియంలోనే చూడగలమట. ఇప్పుడు వస్తున్న కరుప్పూర్ చీరలు దాని మాదిరి నేత చీరలే తప్ప అసలైనవి కావట. ఈ అరుదైన వస్త్రం మరింతగా రావాలంటే..హస్తకళాకారులు దీనిపై దృష్టిసారించి నాటి చీరల్లా రూపొందించాలి, అలాగే ఉత్పత్తికి తగ్గట్టుగా మంచి ఆదాయం వారికి లభిస్తే ఈ అరుదైన చీరలకు మళ్లీ నాటి వైభవం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు సాంస్కృతిక నిపుణులు. ఇక కంగనా చీర తమిళనాడులోని చెన్నైలో ఉన్న అక్ష్ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్కు చెందినది. కళాక్షేత్ర ఫౌండేషన్లోని క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ చీరను పరిరక్షించడానికి కృషి చేస్తోంది. అయితే అవి నాటి తంజావురు రాజవంశికులు ధరించిన చీరల మాదిరిగా ఉండవనేది చాలామంది అభిప్రాయం. View this post on Instagram A post shared by Diya Roychowdhury (@vastrakathaxdiya) (చదవండి: 40 వేల మంది విద్యార్థులు అలా..! భావోద్వేగంలో నికితా పోర్వాల్)


