లోక్ సభ రేపటికి వాయిదా | Parliament Budget Session 2026 On March 9th Live Updates | Sakshi
Sakshi News home page

లోక్ సభ రేపటికి వాయిదా

Mar 9 2026 10:37 AM | Updated on Mar 9 2026 3:19 PM

Parliament Budget Session 2026 On March 9th Live Updates

  • లోక్ సభ రేపటికి వాయిదా 

  • పశ్చిమాసియా యుద్ధం పై చర్చించాలని విపక్షాల పట్టు

  • అధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను అడ్డుకున్న విపక్షాలు

  • లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముందుకు రావాలని కోరిన ప్యానెల్ స్పీకర్

  • స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి,  ఇరాన్ యుద్ధం పై  చర్చించాలనడం ఏమిటని ప్రశ్నిస్తున్న అధికారపక్షం

  • విపక్ష పార్టీలు అయోమయంలో ఉన్నాయన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు

లోక్‌సభ మరోసారి వాయిదా..

  • మధ్యాహ్నం మూడు గంటల వరకు లోక్‌సభ వాయిదా.

  • స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లి విపక్ష ఎంపీల ఆందోళన.

  • గల్ఫ్‌ యుద్ధంపై చర్చించాలని విపక్షాల పట్టు.

  • విపక్షాల ఆందోళన మధ్య లోక్‌సభ వాయిదా. 

పెట్రోల్‌, గ్యాస్‌ ధరలపై జైశంకర్‌ ప్రకటన

  • పశ్చిమాసియాలో యుద్ధంపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన.

  • రాజ్యసభలో ప్రకటన చేస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌.

  • రాజ్యసభలో జైశంకర్‌ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు.

  • ముందుగా విపక్షాలకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేతల డిమాండ్‌.  

  • విపక్షాల ఆందోళనల మధ్యే ప్రకటన చేస్తున్నా మంత్రి జైశంకర్‌.

మంత్రి జైశంకర్‌ కామెంట్స్‌..

  • మార్చి ఒకటో తేదీ సీసీఎస్‌ సమావేశం నిర్వహించాం.

  • ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాం.

  • యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం.

  • సంబంధిత శాఖలన్నింటికీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం.

  • కోటి మంది భారతీయులు గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్నారు.

  • పెట్రోల్‌, గ్యాస్‌ ధరలపై దృష్టి సారించాం.

  • ఇరాన్‌కు వెళ్లవద్దని జనవరిలోనే భారతీయులకు సూచించాం.

  • ఇరాన్‌లోని భారతీయుల భద్రతకు ఎంబసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.

  • పరిస్థితులు చక్కబడగానే టెహ్రాన్‌లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం.  

  • గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని భారత్‌ రప్పించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నాం.

  • ఈరోజు 50 విమానాలు నడుస్తున్నాయి.

  • పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధంపై భారత్‌ తీవ్ర ఆందోళన చెందుతోంది.

  • ఫిబ్రవరి 28 నాటి పరిణామాల తర్వాత యుద్ధం తీవ్రరూపం దాల్చింది.

  • యుద్ధ ప్రాంతాల నుంచి 67వేల మందిని సురక్షితంగా తరలించాం.

  • ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదు.

  • యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది.

  • హింస దేనికీ పరిష్కారం కాదు.

  • తక్షణమే చర్యల బాట పట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చాం.

  • శాంతి స్థాపన కోసం భారత్‌ తన వంతు దౌత్య ప్రయత్నాలు చేస్తోంది.

  • అంతర్జాతీయ మానవతా చట్టాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలి.  

  • శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు జరగాలి

  • ఇంధన భద్రతకు, కంపెనీలకు  ప్రాధాన్యత ఇస్తున్నాం

  • ఇరాన్ నౌకను డాకింగ్ చేసేందుకు సహకరించాం

  • లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.

  • కాసేపట్లో పశ్చిమాసియా యుద్ధంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ ప్రకటన.

  • పార్లమెంట్‌ ఆవరణలో సస్పెండ​ అయిన ఎంపీల ఆందోళనలు.

  • పార్లమెంట్‌లో ఇండియా బ్లాక్‌ ఎంపీల సమావేశం. 

 👉పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

అందుకే స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాం: చామల కిరణ్‌

  • కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌ కామెంట్స్‌..

  • ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారు

  • బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ప్రాధాన్యత ఇస్తున్నారు

  • స్పీకర్ అనే వ్యక్తి లోక్‌సభలో ఉన్న అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి

  • 18వ లోక్ సభలో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు

  • రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతీసారి అసౌకర్యం కల్పిస్తున్నారు.

  • నిషికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ లాంటి వాళ్లకు అవసరం లేకపోయినా మైక్ ఇస్తున్నారు

  • దేశంలో ఉన్న ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా లోక్ సభను నడుపుతున్నారు

  • మహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడి చేయాలని చూశారని తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారు

  • అందుకే లోక్‌సభ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాము

  • ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై లోక్ సభలో చర్చ చేయాలి

  • నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నారు

  • అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలను వైట్ హౌస్ నుంచి ట్రంప్ డిసైడ్ చేశారు

  • పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అంశాలను ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారు

  • మోదీ ఎందుకు ట్రంప్‌తో కాంప్రమైజ్ అయ్యారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి

  • లోక్ సభలో ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరగాలి

  • లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం సందర్భంగా ఎనిమిది మంది ఎంపీలకు ఓటు వేసే అవకాశం ఇవ్వాలి

  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ధర్నా చేస్తాము

  • ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలి

  • లోక్ సభలో ఉన్న 543 మంది ఎంపీలకు అవిశ్వాసంపై ఓటు వేసే అవకాశం ఉంటుంది

  • గ్యాస్, క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెంచారు.

  • దీనిపై లోక్‌సభలో చర్చ చేపట్టాలి. 

 

పార్లమెంట్‌కు చేరుకున్న ప్రియాంక, రాహుల్‌

  • పశ్చిమ ఆసియాలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు.

  • విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఏం చేబుతారో వినాలని ఉందన్న ప్రియాంక. 

బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్‌ అవిశ్వాస తీర్మానంపై చర్చ

  • నేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు

  • ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న సమావేశాలు

  • నేడు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్న లోక్‌సభ

  • తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కే సురేష్, మల్లు రవి

  • అవిశ్వాసం తీర్మానంపై చర్చలో స్పీకర్ స్థానంలో కాకుండా సభ్యుల మధ్యలో కూర్చొనున్న ఓం బిర్లా    

  • తొలి విడత సమావేశాల్లో లోక్‌సభ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ సహా విపక్షాలు

  • స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ  

  • నోటీసుపై సంతకం పెట్టిన కాంగ్రెస్, సమాజ్‌వాద్‌ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన  118 మంది ఎంపీలు

  • తమ ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు

  • తప్పనిసరిగా లోక్‌సభకు హాజరుకావాలని ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement